breaking news
Karimnagar
-
కేంద్ర పథకాల నిధులు మళ్లించొద్దు
కరీంనగర్: పార్టీలకతీతంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలో అత్యధికంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి కేంద్ర నిధులు తీసుకువచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, జిల్లా అభివృద్ధి, కోఆర్డినేషన్– మానిటరింగ్ కమిటీ (దిశ) చైర్మన్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అభివృద్ధి, కోఆర్డినేషన్– మానిటరింగ్ కమిటీ (దిశ)సమావేశం జరిగింది. సంజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణం అన్నారు. రూ.851 కోట్ల ఎంపీ నిధులను కరీంనగర్ అభివృద్ధికి కేటాయించామని అన్నారు. హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట, సిరిసిల్ల ఆసుపత్రులకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయిస్తున్నామని, వైద్యులను నియమించాలని ఆదేశించారు. పాఠశాల విద్యార్థులకు 15వేల సైకిళ్లు ఉచితంగా అందజేశామని, మరో 5 వేల సైకిల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పీఎం శ్రీ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. గన్నేరువరం బ్రిడ్జి, కేంద్రం సేతు బంధన్ పథకం ద్వారా మంజూరు చేసిన కరీంనగర్ ఆర్వోబీ పనులు వేగవంతం చేయాలన్నారు. కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు రోజువారీ నివేదికలు సమర్పించేందుకు ఉచితంగా ట్యాబ్ అందజేస్తామని తెలిపారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించా లని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్ప డిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ప్రధాన నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిందితుడిని అరెస్ట్ చూపారు. ధరూర్లో ఈనెల 13న తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి ఇటీవలే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఘటనలో ప్రధాన నిందితుడైన మహారాష్ట్రలోని ఇంగోలి జిల్లా బాస్మతి తాలూకా కార్ఖాన్ గ్రామానికి చెందిన మారుకూలి అనిల్ను చల్గల్ శివారులో అరెస్ట్ చేశారు. అతడి నుంచి 24.5 గ్రాముల బంగారం, రూ.19 వేలు, షిఫ్ట్ కారు, రెండు మొబైల్ ఫోన్లు, మూడు ఫేస్మాస్క్లు, గ్లౌస్లు, స్క్రూడ్రైవర్లు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సదాకర్, మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ను డీఎస్పీ అభినందించారు. 24.5 గ్రాముల బంగారం రూ.19 వేల నగదు, డిజైర్ కారు స్వాదీనం డీఎస్పీ రఘుచందర్ -
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి
హుజూరాబాద్రూరల్/జమ్మికుంట: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న మండలంలోని రాంపూర్కు చెందిన శ్రీ వర్షిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. శ్రీ వర్షిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ మండలా ధ్యక్షుడు రాముల కొమురయ్య, పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు, మోడెపు వినయ్, కొండాల్రెడ్డి, రవీందర్, శ్రీనివాస్రెడ్డి, చైతన్యరెడ్డి పాల్గొన్నారు. వైద్యులను నియమించాలి జమ్మికుంట ఆస్పత్రిలో వైద్యలను నియమించాలని గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ సీఎస్అర్ నిధులతో ఆసుపత్రికి రూ.1.50 కోట్లతో 15 రకాల వైద్య పరికరాలు అందించారన్నారు. డాక్టర్ శ్రీకాంత్రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు పాల్గొన్నారు. -
దంచికొట్టిన వాన
గురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025మోంథా పోత!ఇతని పేరు శ్రీనివాస్. ఆరెపల్లి విలీన గ్రామం. మూడున్నర ఎకరాల్లో వరి వేయగా కోసిన పంటను కరీంనగర్ వ్యవసాయ మార్కెట్కు తరలించాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభం కాకపోవడంతో రోజూ ధాన్యం ఆరబెట్టడం.. కొనుగోళ్ల కోసం నిరీక్షించడం నిత్యకృత్యమైంది. రెండ్రోజులుగా వర్షం కురుస్తుండటంతో పంటను కాపాడుకునేందుకు శ్రీనివాస్, అతని భార్య పడరాని పాట్లు పడుతున్నారు.కరీంనగర్ అర్బన్/ కరీంనగర్ కార్పొరేషన్/ హుజూరాబాద్: ‘మోంథా’ తుపాన్ జిల్లాను వణికిస్తోంది. బుధవారం ఉదయం నుంచి కుండపోత వర్షం కురుస్తుండగా రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. హుజూ రాబాద్, కరీంనగర్ జిల్లాకేంద్రంలోని పలు కాలనీలు నీటిలో చిక్కుకోగా.. దంచికొట్టిన వాన రైతులకు తీరని నష్టాన్ని మిగి ల్చింది. ధాన్యాన్ని కుప్పపోసుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వర్షంతో పాటు ఈదురుగాలులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో సుమారు 5వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోగా కోతకొచ్చిన వరి నేలవాలింది. జిల్లావ్యాప్తంగా కోతలు మొదలవగా 20 శాతం పంట కోశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరగా ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. గురువారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. హుజూరాబాద్ జలమయం జిల్లావ్యాప్తంగా బుధవారం రాత్రి వరకు రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. హుజూరాబాద్ మండలంలో అత్యధికంగా 24.02 సెంటీమీటర్ల వర్షం కురియగా.. పట్టణంలో ఎటు చూసినా వరద నీరే పారింది. మామిళ్లవాడ, కాకతీయకాలనీ, బుడిగజంగాల కాలనీ, విద్యానగర్ జలమయం అయ్యాయి. దీంతో పాఠశాలలకు మధ్యాహ్నమే సెలవు ప్రకటించారు. ఇళ్లకు చేరేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరంగల్రోడ్డు నుంచి హెచ్పీ పెట్రోల్ పంపు వరకు పెద్దఎత్తున నీరు చేరడంతో చెరువును తలపించింది. చిలుక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వడ్డెరకాలనీతో పాటు కనుకులగిద్ద– హుజూరాబాద్కు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్లో 19.02, చిగురుమామిడిలో 23.08, కరీంనగర్లో 16.01, గన్నేరవరంలో 9.07, ఇల్లందకుంటలో 9.03, వీణవంకలో 9.08, మానకొండూర్లో 12.08, కొత్తపల్లిలో 8.05, జమ్మికుంటలో 8.09, రామడుగులో 12.01, కరీంనగర్ రూరల్లో 7.06, చొప్పదండి 5.01, తిమ్మాపూర్లో 12.03, గంగాధరలో 7.06 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలో భారీ వర్షం భారీ వర్షానికి కరీంనగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హౌసింగ్ బోర్డుకాలనీ, మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, భగత్నగర్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు కాల్వ లను తలపించాయి. చాలా ఇండ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరంలోని వీపార్క్, రాంనగర్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పర్యటించారు. తుపాన్ ప్రభావంతో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డిజాస్టర్ సిబ్బంది షిఫ్టుల వారిగా విధులు నిర్వహించాలన్నారు. రాంనగర్లోని సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపేలా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి పాల్గొన్నారు.సైదాపూర్లో వరదలో చిక్కిన ఆర్టీసీబస్సు హుజూరాబాద్లో ఇళ్లమధ్య వరదనీరుసిటీలో పరిస్థితిని పరిశీలిస్తున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హౌసింగ్ బోర్డుకాలనీలో ఇళ్లలోకి చేరిన నీరు, జలమయమైన నగరంలోని మంచిర్యాల చౌరస్తాఎల్ఎండీ 10 గేట్లు ఎత్తివేతతిమ్మాపూర్: ఎల్ఎండీ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బుధవారం ఉదయం 12 గంటల తర్వాత 2 గేట్లు ఎత్తారు. రాత్రి వరకు ఇన్ఫ్లో పెరగడంతో 30వేల క్యూసెక్కుల నీటిని 10గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు సూచించారు.అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ పమేలా సత్పతి మోంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. అత్యవసమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ఎలాంటి సమస్యలున్నా కంట్రోల్ రూం నంబర్ 0878–2997247కు ఫోన్ చేయాలని తెలిపారు.నేడు విద్యాసంస్థలకు సెలవు కరీంనగర్రూరల్/సప్తగిరికాలనీ: భారీ వర్షాలతో కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్ధలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జరిగే అన్ని తరగతుల ఎస్ఏ–1 పరీక్షలను వచ్చేనెల 1న నిర్వహించాలని, 31న జరిగే పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని సూచించారు. -
రమ్మీ ఆడి.. దొంగగా మారి
కరీంనగర్రూరల్: ఆన్లైన్ రమ్మీ ఆడి అప్పుల పాలైన ఓ వ్యక్తి దొంగగా మారాడు. ఒకే ఇంట్లో రెండుపర్యాయాలు దొంగతనానికి పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేసిన కరీంనగర్రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, రూ.12 లక్షల విలువైన బంగారం రికవరీ చేశారు. కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్లో ఏసీపీ విజయ్కుమార్ బుధవారం వివరాలు వెల్లడించారు. తీగలగుట్టపల్లిలోని రెవెన్యూకాలనీకి చెందిన మహ్మద్ ముస్తాక్ కోదాడ సమీపంలోని మేళ్లచెరువు వద్ద బాయిలర్ ఆపరేటర్గా పనిచేసేవాడు. రెండేళ్ల నుంచి అన్లైన్ రమ్మీ ఆడుతూ రూ.లక్షల్లో నష్టపోయి అప్పులపాలయ్యాడు. అప్పు తిరిగి చెల్లించలేక దొంగగా మారాడు. ఫిబ్రవరి, జూన్లో తీగలగుట్టపల్లిలోని ఒకేఇంట్లోకి చొరబడి బంగారం, నగదు దొంగతనం చేశాడు. జూబ్లీనగర్లోని ఓ ఇంట్లో టీవీ ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేసిన బంగారాన్ని వరంగల్, మంచిర్యాల, కరీంనగర్లో విక్రయించాలనే ఉద్దేశంతో కరీంనగర్ రైల్వేస్టేషన్కు వచ్చాడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి పట్టుకున్నారు. 91గ్రాముల బంగారం, రూ.5వేలనగదు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ముస్తాక్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ నిరంజన్రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాశ్గౌడ్, ఎస్సై లక్ష్మారెడ్డిని సీపీ గౌష్ అలం, ఏసీపీ విజయ్కుమార్ అభినందించారు. ఒకే ఇంట్లో పలుమార్లు చోరీ పట్టుకున్న పోలీసులు రూ.12లక్షల విలువైన బంగారం స్వాధీనం -
జగిత్యాల వాసిపై సౌదీలో ‘మత్లూబ్’ కేసు
జగిత్యాలక్రైం: బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన గాజుల శ్రీనివాస్ ‘ఫైనల్ ఎగ్జిట్’ (దేశం వదిలివెళ్లడానికి అనుమతి) లభించక సౌదీ అరేబియా రాజధాని రియాద్లో చిక్కుకుపోయాడు. 12వేల సౌదీ రియాళ్లు (రూ.2.80లక్షలు) దొంగతనం జరిగిందని శ్రీనివాస్పై కంపెనీ యజమాని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ‘మత్లూబ్’ (వాంటెడ్ బై పోలీస్) కేసు నమోదు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ను స్వదేశానికి తెప్పించాలని ఆయన కుమారుడు సాయికిరణ్ హైదరాబాద్లోని సీఏం ప్రవాసీ ప్రజావాణిలో బుధవారం ఫిర్యాదు చేశాడు. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం ప్రతినిధి మహ్మద్ బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. 2017లో ఆజాద్ వీసాపై సౌదీ వెళ్లిన శ్రీనివాస్ 8 ఏళ్లుగా అక్కడే పనిచేస్తున్నాడు. స్వదేశం వచ్చేందుకు అడ్డంకిగా ఉన్న ‘మత్లూబ్’ కేసు తొలగించేందుకు సహకరించాలని అతను రియాద్లోని ఇండియన్ ఎంబసీకి ఇదివరకే రెండుసార్లు విజ్ఞప్తి చేశాడు. స్వదేశం రప్పించాలని సీఎం ప్రవాసీలో ఫిర్యాదు -
అంకితభావమే ఆయుధం
కరీంనగర్ అర్బన్: ఉద్యోగులు, అధికారులు అంకితభావంతో పనిచేయాలని, అదే ప్రభుత్వానికి ఆయుధమని రాష్ట్ర ఆడిట్ సంచాలకుడు మార్తినేని వెంకటేశ్వర్రావు అన్నారు. వెంకటేశ్వరరావు బుధవారం జిల్లాకు రాగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికా రు. డిప్యూటీ డైరెక్టర్ (వరంగల్) జనరల్ పోరిక రాము, జిల్లా స్టేట్ ఆడిట్ డిప్యూటీ డైరెక్టర్ రాజ్కుమార్, మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జామినర్ ఆఫ్ అ కౌంట్స్ రంజిత చికిలే, డిప్యూటీ డైరెక్టర్ వేణు, మాఽ దవరెడ్డి, సుచేత, జోయల్, త్రినాథ్ పాల్గొన్నారు. -
రైస్మిల్లులో పేలిన బాయిలర్
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని కనుకదుర్గా రైస్మిల్లులో బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బాయిలర్ పేలి ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. మిల్లు షెడ్ ధ్వంసమైంది. మిల్లు యాజమాని, కూలీలు కథనం ప్రకారం.. ధాన్యాన్ని పోస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు బాయిలర్ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి యంత్రపరికరాలు ధ్వంసమయ్యాయి. షెడ్డు కుప్పకూలింది. అక్కడ పనిచేస్తున్న కూలీలు సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని మార్కెండేయకాలనికి చెందిన గంగరాపు కుమార్, శాసీ్త్రనగర్కు చెందిన రామస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే కరీనంగర్లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనలో దాదాపు రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాని వాపోయారు. ఎస్సై అశోక్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఘటనపై ఆరా తీశారు. ఏసీపీ కృష్ణకు ఫోన్చేసి ప్రమాదానికి గల కారాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కూలీలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్ సెక్రటరీ కడారి సునీల్, మండల కన్వీనగర్ తాండ్ర అంజయ్య డిమాండ్ చేశారు. ఇద్దరు కూలీలకు గాయాలు -
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం పోరుబాట
కరీంనగర్టౌన్: పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల చేయాలని బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. తెలంగాణ చౌక్ నుంచి భారీ ర్యాలీతో కలెక్టరేట్కు చేరుకున్నారు. కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అట్టుకున్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖను సీఎం దగ్గరే పెట్టుకుని, నియంత పాలన సాగిస్తున్నారన్నారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అనంతరం పోలీసులు బీఆర్ఎస్వీ నాయకులను పీటీసీకి తరలించారు. జిల్లా కోఆర్డినేటర్ ధ్యావ మధుసూదన్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, బండారపు అజయ్ కుమార్గౌడ్, శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి చుక్కా శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, ఆరె రవిగౌడ్, గంగాధర చందు, నారదాసు వసంత్ పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: రూ.8500 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలోని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. అధికారంలోకి వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చి, గ్యారంటీల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ డిగ్రీ, వృత్తి విద్య కళాశాలలు రెండుసార్లు మూసివేసిన దుస్థితికి ఏర్పడిందన్నారు. అనంతరం కార్యాలయం వద్ద పోలీసులు, ఏబీవీపీ నాయకుల మధ్య తోపులాట జరుగగా, అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేశ్, నందు, విగ్నేశ్, వంశీ, విష్ణు, ప్రదీప్, అజయ్, సాయి, నిఖిల్, విగ్నేష్, ప్రశాంత్, ఆకాష్, మురళి, రాజేష్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నష్ట నివారణ చర్యల్లో విఫలం
కరీంనగర్: భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నా, ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ నష్ట నివారణ చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ధా న్యం కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, గత కొన్నేళ్లుగా పంట నష్టాలకు సరైన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికలపై మాత్రమే ప్రభుత్వం, రాజకీ య పార్టీలు శ్రద్ధ చూపుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆ ఎన్నికలకు ఖర్చు చేస్తున్న నిధులతో రైతులను ఆదుకోవచ్చన్నారు. కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడిన సంజయ్, వర్షం నష్టంపై ఆరా తీసి బాధిత ప్రాంతాల్లో పర్యటించి రైతులు, ప్రజలకు భరోసా కల్పించాలని ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలికొత్తపల్లి(కరీంనగర్): మోంథా తుపాన్ ప్రభా వంతో కురుస్తున్న అతి భారీ వర్షాలతో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో తడిగా ఉన్న చేతులతో స్విచ్లు, మీటర్లు, ప్లగ్లు, వైర్లు తాకరాదన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు సమీప లైన్మెన్కి, 1912 టోల్ ఫ్రీ నంబర్కి సమాచారం ఇవ్వాలన్నారు. తక్కువ ఎత్తులో వెళ్లే విద్యుత్ తీగల కింద వాహనాలు నడపొద్దన్నారు. పిల్లలను విద్యుత్ పరికరాల దగ్గర ఆడనీయకుండా దూరంగా ఉంచాలన్నారు. పొలా ల్లో లేదా బోర్వెల్ వద్ద పనిచేసే సమయంలో తడి నేలపై నిలబడి విద్యుత్ మోటార్ స్విచ్లను ఆన్/ఆఫ్ చేయొద్దన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన విద్యుత్ పరికరాలను తాకొద్దని సూచించారు.ప్రభుత్వ కళాశాల తనిఖీకరీంనగర్టౌన్: కరీంనగర్లోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను బుధవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అధ్యాపకులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు భరోసా కల్పించాలన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మెయిన్ గేటు వద్ద ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు సుడా చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం 4 నుంచి 5గంటల వరకు మెయిన్ గేటు వద్ద పోలీసులు ఉండాలని సూచించారు. డీఐఈవో గంగాధర్, ప్రిన్సిపాల్ నిర్మల, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ ఎంఈవో పోస్టునుంచి తొలగింపుకరీంనగర్రూరల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని కరీంనగర్రూరల్ మండల విద్యాధికారి కె.రవీందర్ను కలెక్టర్ పమేలా సత్పతి తొలగించారు. ఈ నెల 22న కలెక్టర్ దుర్శేడ్ జెడ్పీ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై ఎంఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల నిర్వహణ గాడి తప్పడం, ప్రధానోపాధ్యాయుడు పదోన్నతి రద్దు చేసుకుని ఉపాధ్యాయుడిగా తిరిగి వెళ్లిపోతే ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడిని నియమించడంలో ఎంఈవో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న దుర్శేడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు నాగ వెంకట రత్నాకర్రావును మొగ్ధుంపూర్ జెడ్పీ పాఠశాలకు సర్ధుబాటు ప్రాతిపదికన బదిలీ చేశారు. కొత్త ఎంఈవోగా చామనపల్లి జెడ్పీ పాఠశాల గెజిటెట్ హెచ్ఎం వాసవిని నియమించారు. రవీందర్ను తిరిగి నగునూరు జెడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమించారు. క్వింటాల్ పత్తి రూ.7,000జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,000 పలికింది. బుధవారం మార్కెట్కు 579 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. సీసీఐ ద్వారా 65క్వింటాళ్ల పత్తిని గరిష్ట ధర రూ.8,003, కనిష్ట ధర రూ.7,735కు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను కార్యదర్శి మల్లేశం పర్యవేక్షించారు. -
బల్హార్షా – విజయవాడ మధ్య రైళ్లు రద్దు
రామగుండం: మొంథా తుపాన్ ప్రభుత్వంతో బల్హార్షా – విజయవాడ మధ్య నడిచే కొన్ని రైళ్లను బుధవారం రద్దు చేశారు. భారీవర్షాలతో వరంగల్ జిల్లాలోని డోర్నకల్, గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్లలోని ట్రాక్ వరదలో మునిగింది. పలుచోట్ల ట్రాక్ల కింద మట్టి కొట్టుకుపోయింది. దీంతో గ్రాండ్ట్రంక్ మార్గంలోని రైళ్లను ఆయా స్టేషన్లలోనే నిలిపివేశారు. కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. రామగుండం నుంచి రాకపోకలు సాగించే సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్ (17233/34 – భాగ్యనగర్ ఎక్స్ప్రెస్)ను బు ధ, గురువారాల్లో రద్దు చేశారు. విశాఖపట్నం – న్యూఢిల్లీ(20834 – ఏపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ ప్రెస్): రీషెడ్యూల్ చేశారు. ఐదు గంటల ఆలస్యంగా నడుస్తుంది. 24 గంటల్లో దొంగల అరెస్ట్తంగళ్లపల్లి(సిరిసిల్ల): చోరీ జరిగిన 24 గంటల్లో నే దొంగలను పట్టుకొని.. రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని రామచంద్రపురంలో ఇట్టిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఇంట్లో ఈనెల 27న చొరబడ్డ దొంగలు నాలుగు తులాల బంగారం, 28 తు లాల వెండిని ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. 24 గంటల్లోనే దొంగలను పట్టుకున్నారు. అంకుసాపూర్కు చెందిన చిన్నవేణి వంశీ, కంది రాహుల్, జిల్లెల్ల కు చెందిన మహమ్మద్ జల్సాలకు అలవాటుప డి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్ప డుతున్నారు. జిల్లెల్ల చెక్పోస్టు వద్ద మరో ఇంట్లో ఈనెల 1న బంగారు ఆభరణాలు, రూ. 10వేలు నగదు దొంగలించారు. ఎస్సై ఉపేంద్రచారి, క్లూస్టీం ఎస్సై క్రాంతి, కానిస్టేబుళ్లు న రేందర్, శ్రీకాంత్, అబ్బాస్, శ్రీనివాస్లను అభినందించారు. విలేకరుల సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ కె.మొగిలి, సిబ్బంది పాల్గొన్నారు. స్పందిస్తున్న మానవతావాదులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలసకూలి ఎల్లారెడ్డిపేటకు చెందిన బాలమహేందర్ అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిపాలయ్యాడు. బాధితుడి చికిత్సకు దాతలు ముందుకొస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ‘పతి భిక్ష పెట్టండి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మానవతావాదులు స్పందిస్తున్నారు. మూడు నెలలుగా కోమాలోనే ఉండగా.. కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. తన భర్తను కాపాడాలని బాలమహేందర్ భార్య సంధ్య కోరడంతో దాతలు ఆర్థికసాయం అందిస్తున్నారు. దాతలు 96400 48582, 95731 18869 నంబర్లలో సాయం చేయాలని బాలమహేందర్ భార్య వేడుకుంటుంది. -
కరీంనగర్లో అగ్నిప్రమాదం
కరీంనగర్క్రైం: నగరంలోని ప్రధాన మార్కెట్లో ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. వేకువజామున ఒక క్లాత్స్టోర్, రెండు ఫొటో స్టూడియోలకు మంటలు అంటుకుని, పెద్దఎత్తున చెలరేగాయి. స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. కరీంనగర్, మానకొండూర్కు చెందిన సిబ్బంది రెండు ఫైరింజిన్లతో సుమారు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో రూ.50లక్షల వరకు నష్టం జరిగిందని ఫైర్ అధికారులు అంచనా వేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కేసును వన్టౌన్పోలీసులకు అప్పగిస్తామని డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. కాగా.. ప్రమాదం జరిగిన సమాచారాన్ని ఫైర్స్టేషన్కు ఆలస్యంగా తెలియజేశారని విచారం వ్యక్తం చేశారు. రూ.50 లక్షల వరకు నష్టం -
గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులు అడ్డుకున్న అన్నదాతలు
ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం పోతారంలో చేపట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు పనులను నిర్వాసిత రైతులు బుధవారం అడ్డుకున్నారు. వారంరోజులుగా తొమ్మిది మంది రైతులకు చెందిన వ్యవసాయ భూములకు పరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ మధూసూదన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు జీవనాధారమైన భూములకు పరిహారం లెక్క తేల్చాకే పనులు చేయాలని నిర్వాసితులు తేల్చిచెప్పారు. సమస్యపై మంథని ఆర్డీవో సెల్ఫోన్లో బాధితులతో తహసీల్దార్ వివరించారు. పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు నిరసన విరమించారు. ఎస్సై రవికుమార్, పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. బూడిద పైపులైన్ పనుల అడ్డగింత రామగుండం: ఎన్టీపీసీ ప్రభావిత మల్యాలపల్లిలో చేపట్టిన బూడిద పైపులైన్ పనులను గ్రామస్తులు బుధవారం అడ్డుకున్నారు. స్పందించిన అధికారులు వారితో సమావేశమయ్యారు. భూగర్భ డ్రైనేజీ, సీసీరోడ్లు, శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్, సాగునీటి అవసరాల కోసం మత్తడి నిర్మాణం, విద్యుత్, సోలార్ కేంద్రాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాల కల్పన తదితర సమస్యలపై అధికారులు హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. అదేవిధంగా శ్మశానవాటిక నిర్మాణం పూర్తయ్యే వరకు ఎన్టీపీసీ రిజర్వాయర్ స్థలంలో అంత్యక్రియలు పూర్తిచేసేందుకు అనుమతించారని, రాజీవ్ రహదారి నుంచి జీరోపాయింట్ వరకు 20 అడుగులతో రోడ్డు విస్తరణ, వీధిదీపాల ఏర్పాటు తదితర పనులు చేపట్టేందుకు ఎన్టీపీసీ అధికారులు అంగీకరించారని గ్రామస్తులు పేర్కొన్నారు. బంగారం దుకాణంలో చోరీజమ్మికుంట: జమ్మికుంటలో దొంగలు హల్చల్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి ఓ బంగారం దుకాణంతో పాటు, డిస్కౌంట్ మొబైల్ షాపుల షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. టౌన్ సీఐ రామకృష్ణ కథనం ప్రకారం.. పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్ వద్దగల ఎస్ఎల్ఎస్ జువెల్లరీ షాపు, డిస్కౌంట్ మొబైల్ దుకాణం షట్టర్లు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు. సెల్ఫోన్ దుకాణంలో ఎలాంటి వస్తువులు అపహరణకు గురికాలేదని, బంగారం దుకాణంలో 5 గ్రాముల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
సర్కారుకే శఠగోపం!
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని కొందరు మిల్లర్లు ప్రభుత్వానికే శఠగోపం పెట్టారు. ప్రభుత్వ సొమ్ముతో దర్జాగా దందా చేస్తున్నారు. పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ధాన్యం పక్కదారి పట్టడం విడ్డూరం. ఏకంగా 34వేల క్వింటాళ్లు మాయం చేయడం హట్టాపిక్గా మారింది. మరి ఇన్నాళ్లు పౌరసరఫరాలశాఖ పర్యవేక్షణ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. కరీంనగర్ జిల్లావ్యాప్తంగా మిల్లులను పరిశీలిస్తే ఇలాంటివెన్నో వెలుగుచూస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులే ఖంగుతినగా వేల క్వింటాళ్ల మాయంలో ఎవరి పాత్ర ఎంతన్నది తేలాల్సి ఉంది. జమ్మికుంటకు చెందిన సప్తగిరి ఇండస్ట్రీస్లో భారీ మోసం వెలుగుచూడగా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే. మరాడించి ఇవ్వమంటే మాయం యాసంగి సీజన్కు ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయగా, మరాడించి ఇవ్వాలని 40వేల క్వింటాళ్లకు పైగా ధాన్యమిచ్చింది. సీఎంఆర్ కింద బియ్యం ఇవ్వాల్సి ఉండగా వివిధ కారణాలను బూచిగా చూపుతూ తప్పించుకున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం తనిఖీలు చేయగా అసలు విషయం వెలుగుచూసింది. మిల్లులో 34,169 క్వింటాళ్ల ధాన్యం మాయం చేశారని తేలింది. బ్యాలెన్స్ ధాన్యం కూడా లేదని స్పష్టమైంది. ధాన్యం క్వింటాల్కు రూ.2000లకు లెక్కకట్టిన రూ.6కోట్లకు పైమాటే. కాగా సదరు ధాన్యంతో మిల్లరు వ్యాపారం చేయడం క్షేత్రస్థాయి అధికారుల డొల్లతనాన్ని చాటుతోంది. ఎ రిజిష్టర్ నిర్వహణలో లోపాలు, మీటర్ రీడింగ్ అంతంతమాత్రమే కావడం సివిల్ సప్లయ్ అధికారుల మామూలు మంత్రమే అన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆ ధా న్యం మరాడించారా.. మరాడించకుండానే మార్కెట్కు తరలించారా..? అన్నది అంతుచిక్కని ప్రశ్న. బియ్యం రాబడుతారా..? సప్తగిరి ఇండస్ట్రీస్ మిల్లులో వెలుగుచూసిన అక్రమంపై జిల్లా పౌరసరఫరాలశాఖ తీవ్రంగా పరిగణించింది. సదరు మిల్లును బ్లాక్లిస్టులో చేర్చినట్లు తెలుస్తోంది. వానాకాలం ధాన్యాన్ని ఇవ్వరాదని నిర్ణయించారు. ఇచ్చిన ధాన్యాన్ని ఎటు తరలించారన్నది తేల్చుతారా అన్నది ప్రశ్నార్థకం. గతంలో ఇలాంటి ఘటనలు వెలుగుచూడగా పూర్తిస్థాయి విచారణ లేకుండానే చేతులు దులుపుకున్నారన్న విమర్శలున్నాయి. అసలా బియ్యం ఎటెల్లాయి.. ఎవరు కోనుగోలు చేశారు, ఎవరి పాత్ర ఎంత, అధికార యంత్రాంగంలోని సహకారం వంటి కోణాల్లో ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయని సమాచారం. సీఎంఆర్.. పెట్టుబడి లేని ఆదాయం ధాన్యం ఉత్పత్తిలో కరీంనగర్ పాత్ర కీలకం. జిల్లాలో 150కి పైగా రైస్మిల్లులుండగా ఐకేపీ, డీసీఎంఎస్, పీఎసీఎస్ల ద్వారా కొనుగోలు చేసిన ధాఽన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లులకు పౌరసరఫరాల శాఖ కేటాయిస్తోంది. బాయిల్డ్ రైస్ అయితే క్వింటాల్కు 67కిలోలు, రారైస్కు 68కిలోలు తిరిగి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇచ్చేందుకు రూ.35ను పౌరసరఫరాలశాఖ చెల్లిస్తోంది. ఏటా ఈ ప్రక్రియ ఉంటుంది. కాగా హెచ్చు మిల్లర్లు సీఎంఆర్తో వ్యాపారం చేస్తున్నట్లు పౌరసరఫరాల విజిలెన్స్, స్పెషల్ టాస్క్ఫోర్స్ దాడుల్లో పలుమార్లు వెల్లడైంది. సదరు సమయాల్లో సంఘం నేతలు పలుకుబడి ఉపయోగించి పైఅధికారులను బుజ్జగించి నామమాత్రపు కేసులతో బయటపడ్డారు. వానాకాలం, యాసంగి ధాన్యమైనా పలువురు మిల్లర్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ఇతర మార్గాల ద్వారా పక్కదారి పట్టిస్తున్నారు. ఉన్నతాధికారులు ఒత్తిడికి గురిచేస్తే తప్పా సకాలంలో ఇచ్చిన దాఖలాలు తక్కువ. కేసులైనా మార్పేది.. ఆర్ఆర్ యాక్ట్ అంతేనా?జిల్లా పరిధిలో 23మిల్లులు సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన వేల క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వలేదు. సదరు మిల్లులపై పౌరసరఫరాల శాఖ గతంలోనే కేసులు నమోదు చేయించింది. వివిధ రకాల కేసులు పెట్టగా రాజకీయ, ధన ప్రవాహంతో నామమాత్రంగా వ్యవహరించారని స్పష్టమవుతోంది. కేసులు నమోదై ఏళ్లు గడుస్తున్నా ఒక్క మిల్లరు బకాయి సీఎంఆర్ ఇవ్వకపోవడం పర్యవేక్షణ తీరుకు తార్కాణం. రెవెన్యూ రికవరీ(ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించినా మిల్లర్లలో మార్పు లేదు. సదరు యాక్ట్ కింద మిల్లుల ఆస్తుల వేలం వేసైనా ఆ మొత్తం వసూలు చేయొచ్చు. ప్రభుత్వమిచ్చిన ధాన్యమే మాయం 34 వేల క్వింటాళ్లు ఎటెల్లినట్లు? సివిల్ సప్లయ్ నోటీసులకు జాన్తానై ఎవరిపాత్ర ఎంత.. సూత్రధారులెవరు? -
దీపారాధన.. భక్తిభావన
వేములవాడ: కార్తీకమాసం.. ఆధ్యాత్మికతకు నెలవు. దీపారాధన ప్రధానం. మహిళలు ఎక్కువగా పాల్గొనే దీపారాధన వేములవాడ రాజన్న అనుబంధ భీమన్న సన్నిధిలో నిత్యం కనులపండువగా సాగుతోంది. శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఈ కార్తీకమాసం మొత్తం వందలాది దీపాలతో ఆలయంలో వివిధ ఆకృతులు పేర్చనున్నారు. దీపాలతో శివలింగం, స్వస్తిక్, ఇతరత్ర ఆకట్టుకునే ముగ్గుల్లో వెలిగించనున్నారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుంటున్న మహిళలు సామూహిక దీపారాధనలో పాల్గొంటున్నారు. దీపాలను వెలిగించడం ద్వారా మనిషిలోని అజ్ఞానమనే చీకటి తొలగి జ్ఞానదీపం వెలుగుతుందని ఆలయ అర్చకులు సురేశ్ వివరిస్తున్నారు. ఎములాడలో నెల రోజులూ వేడుకలు ఆలయాల్లో భక్తుల సందడి ఆకట్టుకునే ఆకృతులలో దీపాలు -
పోలీసుల రక్తదాన శిబిరం
కరీంనగర్క్రైం: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం కమిషనరేట్లో సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానంతో అత్యవసర పరిస్థితుల్లో రోగిప్రాణాలు కాపాడవచ్చన్నారు. తలసేమియా బాధితులకు రక్తం ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 160 యూనిట్లను సేకరించి, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్కు అందించామన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి పాల్గొన్నారు. రన్ ఫర్ యూనిటీ విజయవంతం చేయండి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని ఈనెల 31న కరీంనగర్ పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ పరుగు ఉదయం 6 గంటలకు 5 కిలోమీటర్లు పొడవు సాగుతుందని తెలిపారు. యువత అత్యధికంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
ఏటా వైభవోపేతం
రాజన్న సన్నిధి లో ఏటా కార్తీక దీపోత్సవం వై భవోపేతం జ రుగుతుంది. నె లపాటు భక్తితో జరుపుకోవడం సంతోషంగా ఉంటుంది. మేమంతా పాల్గొని దీపాలు వెలిగిస్తాం. లక్ష దీపోత్సవంలోనూ భాగస్వాములవుతాం. – నామాల ఉమాలక్ష్మిరాజం, సెస్ డైరెక్టర్, వేములవాడ ఆనందంగా ఉంది పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించే అదృష్టం మాకు కలిగింది. రాజన్న సేవలో తరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. – అడ్లగట్ల లక్ష్మి, కోరుట్ల, శ్రీలలితా సేవా సమితి సభ్యురాలు దీపోత్సవంలో పాల్గొనడం అదృష్టం కార్తీక దీపోత్సవంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం క ల్పించిన ఆలయ అధికారులు, శ్రీలలితా సేవా సమితి నిర్వాహకులకు కృతజ్ఞతలు. – అనుముల ప్రసన్న, గజ్వేల్, శ్రీలలితా సేవా సమితి సభ్యురాలుముంబై నుంచి వచ్చాం రాజన్న సన్నిధిలో దీపారాధన చాలా బాగుంది. దీపాల వెలుగుల్లో ఆలయం వెలిగిపోతుంది. మేము రాజన్న దర్శనానికి ముంబై నుంచి వచ్చినం. – సాన్వి, భక్తురాలు, ముంబై -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
ధర్మపురి: బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లిన ఓ వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతిచెందాడు. ఆయ న మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. ధర్మపురికి చెందిన కొమిరెల్లి నర్సాబోయి (50) కొంతకాలంగా సౌదీ వెళ్తున్నాడు. నెలరోజుల క్రితం పనులు ముగించుకుని గదికి వచ్చిన ఆయన చాతి లో నొప్పిగా ఉందంటూ కుప్పకూలాడు. తోటి కార్మి కులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని ఇక్కడి కుటుంబసభ్యులకు తెలియనీయకుండా ఇప్పటివరకు గోప్యంగా ఉంచారు. నర్సాబోయి శవమై ఇంటికొస్తున్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతుడికి భార్య లక్ష్మి, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ఆయుధం వీడిన అన్నల అడుగులు ఎటువైపు?
బడిలో తండ్రి బోధించిన పాఠాల కన్నా కళాశాలలో స్నేహితుడి దగ్గర నేర్చుకున్న విప్లవ మాటలే అతడిని అడవిబాట పట్టించాయి. గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని, పీడీత, బాధిత పక్షాల కోసం పోరాడాలని అనుకున్నాడు. అందుకు తుపాకీనే మార్గమని భావించారు. పోరాట పంథాతోనే సమసమాజం సాధ్యమనుకుని 45 ఏళ్లు అజ్ఞాతంలో గడిపారు. మారిన కాలమాన పరిస్థితులు, అనారోగ్య సమస్యలతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఆయుధం వీడి జనంలో వచ్చారు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న, శంకరన్న, సోమన్న. సాయుధ పోరాటాల ద్వారా లక్ష్యాన్ని చేరుకోలేమని భావించి, ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లాలని నిర్ణయించుకుని చంద్రన్న అస్త్రసన్యాసం చేయడం అటు మావోయిస్టు పార్టీలో, ఇటు ప్రజల్లోనూ చర్చకు దారి తీసింది.సాక్షి, పెద్దపల్లి: సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమనే సిద్ధాంతాన్ని నమ్ముకుని పనిచేసిన మావోయిస్టులు ఆయుధం వీడి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన కేంద్రకమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్రావు మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోగా, తాజాగా తెలంగాణ డీజీపీ వద్ద కేంద్రకమిటీ సభ్యుడు, తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరిస్తున్న పుల్లూరి ప్రసాద్రావు అలియాస్ చంద్రన్న లొంగిపోయాడు. ప్రాణభయంతో లొంగిపోయారా? అనారోగ్య సమస్యలతోనా.. పార్టీకి నమ్మకద్రోహం చేశారా? సాయుధ పోరాట పంథాకు కాలం చెల్లిందన్న అభిప్రాయంతో జనజీవన స్రవంతిలో కలిశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ మావోయిస్టులు తదుపరి జీవితాన్ని ఎలా గడపబోతున్నారు?పునరావాస శిబిరాల్లో కాలం వెళ్లదీస్తారా? సొంత ఊళ్లకు, తమకు నచ్చిన ప్రదేశానికో వెళ్లి సాధారణ జీవనం గడుపుతారా? పాలక పార్టీలో చేరుతారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారా అనేక ప్రశ్నలు ప్రజాసంఘాల్లో వ్యక్తమవుతున్నాయి.రణమా...శరణమా ?జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలు మల్లోజుల వేణుగోపాల్, పుల్లూరి ప్రసాద్రావు లొంగిపోగా అడవిలో ఉన్న మిగితా నేతలు ఆయుధం వీడి లొంగిపోతారా? లేక పోరాట పంథాలోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. జిల్లా నుంచి మల్లా రాజిరెడ్డి, అప్పాసి నారాయణ, గంగిడి సత్యనారాయణరెడ్డి, ఆలేటి రామలచ్చులు, దాతు ఐలయ్య, దీకొండ శంకరయ్య, కంకణాల రాజిరెడ్డి, జూవ్వడి వెంకటేశ్వర్రావు మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 1 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించింది. దీంతో విప్లవ పంథా కొనసాగుతుందా లేక ప్రజాపంథాలోకి మిగిలిన నేతలు వస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.కలిసి చదువుకున్నాంపుల్లూరి ప్రసాదరావు నేను వడ్కాపూర్లోనే 5 వ తరగతి వరకు, 10వ తరగతి వరకు ధూళికట్టలో కలిసి చదువుకున్నం. అప్పట్లోనే గ్రామాల్లో వడ్డీ వ్యాపారుల ఆగడాలు నశించాలని పోరాడేవాడు. చాలా సౌమ్యుడు. ఎక్కువగా మాట్లాడక పోయేది. ఇంటర్ చదివేందుకు పెద్దపల్లికి వెళ్లి ఆప్పటి నుంచి ఇప్పటి వరకు కనబడలేదు. – చెన్నమనేని సాగర్రావు, ప్రసాదరావు మిత్రుడు, వడ్కాపూర్ -
దివ్యాంగులకు సేవలు అభినందనీయం
తిమ్మాపూర్: దివ్యాంగులకు విద్య, వృత్తిశిక్షణ అందిస్తూ ట్రస్ట్ దశాబ్దాలుగా నిర్వహిస్తున్న సామాజిక సేవలు అభినందనీయమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఎల్ఎండీ కాలనీలో మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తివిద్యా శిక్షణ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ రూ.26 లక్షల వ్యయంతో అందించిన బస్సును ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి బస్సులో కొంతదూరం ప్రయాణించారు. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మానసిక వికలాంగుల పాఠశాలలో 130 మంది విద్యార్థులున్నారని, 40 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. అదనంగా, వైద్య శిబిరాల నిర్వహణతో 136 మంది రోగులకు కంటి ఆపరేషన్లు చేయించామన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ డీజీఎం సీహెచ్. వెంకటరెడ్డి, బోర్డు డైరెక్టర్ తిరుమల, ట్రస్ట్ సభ్యులు బి.వెంకటయ్య పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించి వైద్యసిబ్బందితో సమీ క్ష నిర్వహించారు. జిల్లావైద్యాధికారి వెంకటరమణ తదితరులున్నారు. అనంతరం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అలింకో సంస్థ సహకారంతో నిర్వహించిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు.అడ్మిషన్లలో ఎస్ఆర్ఆర్ రాష్ట్రంలోనే టాప్సప్తగిరికాలనీ(కరీంనగర్): అడ్మిషన్స్లో రాష్ట్రంలోనే ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ టాప్లో ఉందని ప్రిన్సిపల్ కల్వకుంట్ల రామకృష్ణ అన్నారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన అకాడెమీ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలి అటానమస్ డిగ్రీ బ్యాచ్ పరీక్షల ఫలితా లు ఉత్సాహకరంగా ఉన్నాయన్నారు. సమావేశ, అటానమస్ సమన్వయకర్త వంగల శ్రీని వాస్ విద్యా సంవత్సరంలో నిర్వహించిన పలు కార్యక్రమాలను వివరించారు. కళాశాల మాజీ ప్రిన్సిపల్ బుర్ర మధుసూదన్ రెడ్డి, శాతవాహ న వర్సిటీ ప్రొఫెసర్ పద్మావతి, వైస్ ప్రిన్సిపల్ పి.నితిన్, టి.రాజయ్య పాల్గొన్నారు. తగ్గిన పత్తిధరజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తిధర తగ్గింది. సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,200 పలుకగా.. మంగళవారం రూ.200 తగ్గి క్వింటాల్ పత్తికి గరిష్ట ధర రూ.7,000 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. అర్బన్ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు అభ్యర్థులు సహకరించాలని ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా సహకార అధికారి సీహెచ్.మనోజ్ కుమార్ కోరారు. మంగళవారం కరీంనగర్ అర్బన్ బ్యాంకు కేంద్ర కార్యాలయంలో అభ్యర్థులకు అవగాహన నిర్వహించారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సమావేశంలో సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు పి.శివనాగేందర్రెడ్డి, కె.వంశీకృష్ణ, ఎ.మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
పురాతన నాణేలు స్వాధీనం
జూలపల్లి: పురాతనకాలం నాటి నాణేలు, వస్తువులు కలిగి ఉండడం చట్టరీత్యా నేరమని, ఎవ్వరికై నా దొరికితే వెంటనే సంబంధిత అధికారులకు, లేదా పోలీసులకు స్వాధీనం చేయాలని పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ సూచించారు. మండలంలోని తెలుకుంట ఆబాది చీమలపేటలో తొంటి రాజుకు చెందిన ఇళ్లస్థలాన్ని చదును చేసే క్రమంలో లభించిన పురాతన వెండి నాణేలు పదింటిని స్వాధీనం చేసుకున్న ఎస్ఐ సనత్కుమార్ ఉన్నతాధికారులకు అప్పగించారు. ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ.. చీమలపేటలో లభించిన నాణేల్లో వెండి రాగి, ఇత్తడి మిశ్రమాలు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని వివరించారు. ఒక్కోనాణేం తులం బరువు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎవరికై న పురాతన వస్తువులు లభిస్తే వెంటనే రెవెన్యూ, పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వాహనాల తనిఖీ
తిమ్మాపూర్: ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదంతో రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖను అప్రమత్తం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ వాహనాలపై అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి ఆధ్వర్యంలో సోమవారం అర్ధరాత్రి బైపాస్రోడ్డు, రాజీవ్ రహదారి మార్గాల్లో తనిఖీ చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్, వాహనపత్రాలు, ప్రయాణికుల జాబితా తదితర ధ్రువపత్రాలను పరిశీలించారు. రెండు ట్రాక్టర్లు, రెండు గూడ్స్ వాహనాలు అవసరమైన పత్రాలు లేకుండా నడిపిస్తున్నారని గుర్తించారు. అధిక లోడుతో ప్రయాణిస్తున్న వాహనాలకుపై జరిమానాలు విధించారు. అదేవిధంగా చత్తీస్గఢ్కు చెందిన ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణికుల వివరాలు సరిగా లేవని చర్యలు తీసుకున్నారు. మొత్తం ఐదు వాహనాలకు సుమారు రూ.70 వేల జరిమానా విధించారని తెలిపారు. ప్రజా రవాణా భద్రతకు ప్రాధాన్యమిస్తూ రాత్రివేళ తనిఖీలు కొనసాగుతాయని డీటీవో స్పష్టం చేశారు. డ్రైవర్లు, యజమానులు తప్పనిసరిగా అన్ని పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలని, అధిక లోడుతో ప్రయాణం చేయొద్దని హెచ్చరించారు. తనిఖీల్లో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ హరితయాదవ్, సిబ్బంది పాల్గొన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంతో అధికారుల అప్రమత్తం నిబంధనలు పాటించనివారిపై రవాణాశాఖ చర్యలు -
దూది రైతు దగా!
మార్కెట్లలో, జిన్నింగ్ మిల్లుల్లో రైతులకు ఉపయోగపడే సమాచారమే ఉండటం లేదు. పత్తిని అమ్మితే తరుగు, హమాలీ, తదితర వివరాలేవీ ప్రదర్శించడం లేదు. డబ్బులు ఇచ్చేటపుడు తక్కువగా ఇస్తున్నారు. – కనకయ్య, వన్నారం, రామడుగు ఎకరంనర భూమిలో పత్తివేసిన. వచ్చిన మూడు బస్తాలను మార్కెట్కు తీసుకొస్తే కొంటలేరు. కనీస మద్దతు ధర ఇస్తున్నరా అంటే అదీ లేదు. క్వింటాల్కు రూ.6 వేలకు మించి పెడ్తలేరు. ఇట్లయితే బతుకుడు ఎట్ల? – లావణ్య,గంగిపల్లి, మానకొండూరుకరీంనగర్ అర్బన్: పత్తికి ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.8,110 కానీ కరీంనగర్ మార్కెట్లో మాత్రం రూ.5100ల నుంచి రూ.6200 మాత్రమే. అంటే మార్కెట్లలో దళారులే ఽఏలుతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పోస్టుల లేమితో కునారిల్లుతుండగా కర్శకునికి భరోసా కరవవుతోంది. తమ శ్రమను కళ్లేదుటే దళారులు పిండేస్తుంటే కర్శకుని కడుపు తరుక్కుపోతోంది. మార్కెట్ అధికారుల పర్యవేక్షణే లేకపోవడంతో బతుకు జీవుడా..అంటూ అన్నదాతలు పంటను విక్రయిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, గంగాధర, గోపాల్రావుపేట, చొప్పదండి మార్కెట్లతో జిన్నింగ్ మిల్లులో ఇదే దుస్థితి. మార్కెట్ కార్యదర్శులతో పాటు కీలక పోస్టులన్నీ ఖాళీలే. ఎండనక, వాననక రైతులు పంటలు పండిస్తే తీరా దిగుబడి వచ్చాక వ్యాపారులు నోటికాడి ముద్దను లాగేస్తున్నారు. వచ్చేదే అరకొర.. కొనుగోళ్లు స్లో.. మార్కెట్లతో పాటు జిన్నింగ్ మిల్లులకు వచ్చే పత్తి తక్కువే. కానీ... వ్యాపారుల ధరల నిర్ణయం తాపీగా జరుగుతోంది. గంటల తరబడి నిరీక్షించడం అన్నదాతవంతవుతోంది. ఉదయమే రైతులు మార్కెట్కు చేరుతుండగా వ్యాపారులు మధ్యాహ్నం దాటితే గానీ ఖరీదు చేయడం లేదు. అన్ని మార్కెట్లలో కలిపి నిత్యం 1500 క్వింటాళ్లకు మించి పత్తి రాకపోగా వచ్చిన అరకొర పత్తికే ఆలస్యం చేయడం వ్యాపారులకే చెల్లు. బస్తాలు కోయడం, చేతి స్పర్శతో నాణ్యత చెప్పడం ఆపై కూటమి కట్టిన వ్యాపారులు ధరలను నిర్ణయిస్తున్నారు. నీకిది నాకది అంటూ లోలోన కుమ్మౖక్కై మద్దతు ధరకు రూ.2500కు పైగా తక్కువగా ఖరీదు చేస్తున్నారు. నిత్యం 1500ల క్వింటాళ్లు వస్తుండగా ఈ లెక్కన రైతులు రూ.37.50 లక్షలు నష్టపోతున్నారు. అంటే మార్కెట్లలో, జిన్నింగ్ మిల్లులు కలిపి గుప్పెడు మంది లేని వ్యాపారులు ఒక్క రోజులోనే లక్షలు వెనకేస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిన్నింగ్ మిల్లుల్లోనూ దోపిడీ వ్యవసాయ మార్కెట్లలో పంట ఉత్పత్తులను విక్రయించే రైతులకు నాలుగేళ్లుగా భిన్న పరిస్థితి నెలకొన్నాయి. ఈ–నామ్ మార్కెట్ వరకే పరిమితమవగా సిండికెట్ దందా సాగుతోంది. ఇక పత్తి పంటను కేవలం జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదేంటని మార్కెట్ అధికారులను ప్రశ్నిస్తే యార్డుకు రైతులు విడిపత్తి తేవడం లేదని, అటే తీసుకెళుతున్నారని మిల్లుల నిర్వాహకులకే వత్తాసు పలుకుతున్నారు. వ్యవసాయ మార్కెట్లలోనే కొనుగోళ్లు జరిగితే రైతులకు కోతలు లేకుండా లాభం చేకూరనుంది. ఒకవేళ ధర ఇష్టం లేకపోతే అక్కడే ధర వచ్చేవరకు ఉంచుకోవచ్చు. జిన్నింగ్ మిల్లులో ఆ పరిస్థితి లేదు. సేటు చెప్పిన రేటుకు అమ్ముకోవడమే లేదంటే తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సిందే. దీన్ని ఆసరాగా చేసుకున్న వ్యాపారులు ఇష్టారీతిగా ధర పలుకుతూ రైతుల శ్రమను పిండేస్తున్నారు. అన్నదాత ఎండనక, వాననక నెలల తరబడి పంట ఉత్పత్తికి అపసోపాలు పడితే ఏసీ గదుల్లో ఉండే వ్యాపారులు సంపన్నులైపోతున్నారు. కనీస మద్దతు ధర: రూ.8110 వ్యాపారులు చెల్లిస్తున్నది: రూ.5200–6500 నిత్యం మిల్లులు, మార్కెట్కు వస్తున్న పత్తి: 1500 క్వింటాళ్లు రైతులకు జరుగుతున్న నష్టం: రూ.37.50 లక్షలుపత్తి కొనుగోళ్లు ప్రారంభం: పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయని జిల్లా మార్కెటింగ్ ఽఅధికారి షాహబోద్దీన్ తెలిపారు. జిల్లాలో ఆరు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు చేస్తోందని, కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకుని అమ్మకానికి తీసుకురావాలన్నారు. శక్తి మురుగన్ ఇండస్ట్రీస్(ఎలబోతారం), వైభవ్ కాటన్ కార్పొరేషన్(జమ్మికుంట), నరసింహ కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ (జమ్మికుంట), సరిత కాటన్ ఇండస్ట్రీస్(జమ్మికుంట), సీతారామ కాటన్ ఇండస్ట్రీస్(జమ్మికుంట), కావేరి జిన్నింగ్ మిల్లు (వెలిచాల)లో సీసీఐ కొనుగోలు చేస్తుందని వివరించారు. 8 శాతం తేమ మించకుండా చూసుకుని పత్తిని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. -
లైంగిక వేధింపుల్లో విచారణ కొనసాగుతోంది
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో యాకుబ్ భాషా అనే అటెండర్ విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐదు రోజుల నుంచే లోతైన విచారణ జరిపి నివేదిక తెప్పించుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ పోక్సో కేసు కావడంతో విషయం బయటకు వస్తే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని బయటకు రానియ్యలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పాఠశాల హెడ్మాస్టర్ నిర్లక్ష్యం ఉన్నట్లు తేలడంతో హెచ్ఎంను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. హెచ్ఎం, ఇతర సిబ్బంది పాత్రపైనా విచారణ కొనసాగుతోందన్నారు. సహాయ చర్యలకు సిద్ధంగా ఉన్నాం మోంథా తుపాను ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలందించేందుకు సిద్దంగా ఉన్నామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ టీంలను అలర్ట్చేశాం, అవసరమైతే అదనపు టీంలను పంపేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. తెలంగాణలోనూ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటెండర్ అనుచిత ప్రవర్తనను ఖండించిన మహిళ కమిషన్ కరీంనగర్ టౌన్: గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులపై అటెండర్ చేసిన అనుచిత ప్రవర్తను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. విద్యాసంస్థల్లో చదువుకునే బాలికల భద్రత, గౌరవంపట్ల నిర్లక్ష్యాన్ని, ఏ రూపంలోనూ సహించబోమని తెలిపారు. కలెక్టర్, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసి, విషయంపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ -
పతి భిక్ష పెట్టండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన వలస కూలీ అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. మూడునెలలుగా కోమాలోనే ఉండగా.. కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స అందించింది. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో స్వగ్రామానికి పంపిస్తున్నారు. కాగా, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతల సాయం కోరుతోంది ఆ ఇల్లాలు. వివరాలు.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బాలమహేందర్ బతుకుదెరువు కోసం దుబాయ్ దేశంలోని మెటాక్ జనరల్ కంపెనీలో లేబర్ వీసాపై వెళ్లాడు. అక్కడే అనారోగ్యానికి గురయ్యాడు. మూడునెలలుగా కోమాలోనే ఉన్న బాలమహేందర్కు కంపెనీ యాజమాన్యం చికిత్స చేయించింది. అతడి ఆరోగ్య పరిస్థితి అలాగే ఉండడంతో బుధవారం స్వగ్రామానికి పంపిస్తున్నారు. బాలమహేందర్ తండ్రి 16 నెలల క్రితం పక్షవాతం బారిన పడి 8 నెలల క్రితం మృతిచెందాడు. ఆర్థికసాయం అందించండి మూడు నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న తన భర్తను కాపాడాలని బాలసంధ్య వేడుకుంటుంది. అసలే కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతే ఉన్నాయని దాతలు స్పందించి ఆర్థికసాయం ఆదుకోవాలని బాలసంధ్య కోరుతుంది. బుధవారం దుబాయ్ నుంచి వస్తున్న భర్తను తీసుకొచ్చేందుకు రూ.40వేలు అప్పు చేసి అంబులెన్స్ ఏర్పాటు చేసుకున్నామని, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తామని తెలిపింది. దాతలు 96400 48582, 95731 18869 ఫోన్పే లేదా గూగుల్ పేలో ఆర్థికసాయం చేయాలని వేడుకుంది. ● దుబాయ్ ఆస్పత్రిలో కోమాలో వలసకూలీ ● నేడు స్వగ్రామానికి తీసుకొస్తున్న వైనం ● చికిత్సకు దాతలు సాయం చేయాలని వేడుకుంటున్న భార్య -
గోల్డెన్ పీరియడ్ కీలకం
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపించిన నాలుగున్నర గంటల్లోపు సమీప న్యూరో ఫిజీషియన్ దగ్గరికి తీసుకెళ్లాలి. థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది వెంటనే నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పల్చన చేసి రక్త సరఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తుంది. నాలుగున్నర గంటలు దాటితే నిమిష నిమి షానికి బ్రెయిన్లో న్యూరాన్స్ తగ్గిపోతాయి. దీనివల్ల మెదడుకు రక్తసరఫరా తగ్గిపోతుంది. – డాక్టర్ కమిన్వర్ సంజయ్కుమార్, సీనియర్ కనల్సెటెంట్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్టు -
నల్లాల లెక్క తేల్చుడే!
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నల్లా కనెక్షన్ల లెక్క తేల్చేందుకు బల్దియా రంగంలోకి దిగింది. నల్లా అక్రమ కనెక్షన్లతో సంవత్సరాలుగా నగరపాలకసంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతుండడంతో సరిదిద్దేందుకు సర్వే చేపట్టింది. నగరవ్యాప్తంగా దాదాపు లక్షా ఐదు వేల ఇండ్లు ఉండగా, నల్లా కనెక్షన్లు మాత్రం కేవలం 51 వేలు మాత్రమే ఉన్నట్లు ఆన్లైన్లో లెక్కలున్నాయి. కనీసం 70 నుంచి 80 వేల నల్లా కనెక్షన్లు నగరంలో ఉండే అవకాశం ఉండడంతో, ఆ లెక్కలను తేల్చే పనిలో ప్రస్తుతం అధికారులు నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి రిజర్వాయర్ల వారీగా ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేపట్టారు. రిజర్వాయర్ల వారీగా... నల్లా కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనే నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి ఆదేశాల మేరకు మంగళవారం నుంచి ఇంజినీరింగ్ అధికారులు సర్వే ప్రారంభించారు. నగరంలోని రిజర్వాయర్ల వారిగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది వివరాలు సేకరించారు. నగరంలో హైలెవెల్ పరిధిలో ఎస్ఆర్ఆర్, కోర్టు, మల్కాపూర్, రాంనగర్, అంబేడ్కర్నగర్ రిజర్వాయర్లు ఉండగా, లో లెవెల్ జోన్ పరిధిలో హౌసింగ్బోర్డుకాలనీ, మార్కెట్, భగత్నగర్, గౌతమినగర్, రాంపూర్ రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం పది రిజర్వాయర్ల పరిధిలో ఈ సర్వేను చేపట్టారు. నల్లా వివరాలు సేకరించేందుకు ఒక ప్రొఫార్మా రూపొందించారు. సంబంధిత లైన్మెన్లు, ఫిట్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఇంటింటికి తిరిగి ఆ ప్రొఫార్మా ప్రకారం వివరాలు సేకరిస్తుండగా, ఏఈ, డీఈ, ఈఈలు పర్యవేక్షిస్తున్నారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ స్వయంగా సర్వేను తనిఖీ చేశారు. డొంక కదులుతోంది... నగరంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో నల్లా కనెక్షన్లపై సర్వే చేపట్టడంతో అక్రమాల డొంక కదులుతోంది. కరీంనగర్ మున్సిపాల్టీగా ఉన్నప్పటి నుంచి ఈ నల్లా అక్రమ కనెక్షన్ల వ్యవహారం సాగుతోంది. కిందిస్థాయి సిబ్బంది, కొంతమంది అధికారుల సహకారంతో నల్లా అక్రమ కనెక్షన్ల వ్యవహారం యథేచ్చగా చోటుచేసుకొన్నాయి. ఇంటి యజమాని నుంచి డబ్బులు తీసుకొని నల్లా కనెక్షన్ ఇచ్చినా రికార్డుల్లో చేర్చకపోవడం, ఆఫ్ ఇంచ్ ఉన్నట్లు కాగితాల్లో చూపించి వన్ఇంచ్ ఇవ్వడం, కమర్షియల్ కనెక్షన్లు ఇచ్చి, డొమాస్టిక్గా రాయడం లాంటి అక్రమాలకు పాల్పడ్డారు. దీనితో నగరపాలకసంస్థకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడింది. ప్రస్తుతం సర్వే చేపట్టడంతో ఈ అక్రమాల డొంక కదులుతోంది. మొదటి రోజే కనీసం 50 వరకు అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇలా గుర్తించిన అక్రమ నల్లా కనెక్షన్లను వారం రోజుల్లోగా రూ.2 వేలు చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే ఆ కనెక్షన్ను తొలగిస్తారు. కాగా వారంరోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలనుకున్నా, కనీసం పదిహేను రోజులు కొనసాగే అవకాశం ఉంది. అలా అయితేనే నల్లాల లెక్కతేల్చాలనే బల్దియా లక్ష్యం నెరవేరుతుంది. -
ఎదురెదురుగా ఢీకొన్న కారు.. ఆటో
చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల–కట్టలింగంపేట గ్రామాల మధ్య ఎదురెదురుగా కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్, వృద్ధురాలికి తీవ్ర, మరో 14 మందికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాలు.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మూడు కుటుంబాల వారు 15 మంది ఆటోను అద్దెకు తీసుకుని సోమవారం తెల్లవారుజామున యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, భువనగిరిలోని స్వర్ణగిరి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారల దర్శనం అనంతరం సోమవారం రాత్రి తిరుగుపయనమయ్యారు. ఈక్రమంలో మంగళవారం వేకువజామున చందుర్తి మండలం మల్యాల, కట్టలింగంపేట గ్రామాల మధ్య వీరు ప్రయాణిస్తున్న ఆటో, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆ టో డ్రైవర్ రాజు, వృద్ధురాలు లక్ష్మీనర్సవ్వకు తీవ్రగాయాలయ్యా యి. ఆటోలో ఉ న్న మిగతావారు స్వల్పగాయాలతో బయట పడ్డా రు. క్షతగాత్రులను 108లో వే ములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడినవారిని ఆసుపత్రిలో ఉంచుకోగా, స్వల్పగాయాలు అయినవారికి ప్రథమ చికిత్స చేసి ఇంటికి పంపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. డ్రైవర్, వృద్ధురాలికి తీవ్ర.. 14 మందికి స్వల్పగాయాలు -
‘బ్రెయిన్’ స్ట్రోక్ భయం!
● అవగాహన ఉంటే స్ట్రోక్కు చెక్ ● గోల్డెన్ పీరియడ్పై అవగాహన అవసరం ● ఆహారపు అలవాట్లు, ఒత్తిడే ప్రధాన కారణం ● నేడు ‘వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డే’కోల్సిటీ(రామగుండం): స్ట్రోక్ అనగానే చాలా మంది హార్ట్ ఎటాక్ అనుకుంటారు. స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు కూడా ఒకటి. దీన్నే పక్షవాతం అంటారు. బ్రెయిన్ స్ట్రోక్పై చాలా మందికి అవగాహన లేదు. కాళ్లు, చేతులు పడిపోతేనో, మూతి వంకరపోయిన తర్వాతే ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. స్ట్రోక్ వచ్చిన వారికి సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రాణభయం ఉండదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీన్నే గోల్డెన్ పీరియడ్ అంటారు. ఆహారపు అలవాట్లు, మానసిక సమస్యల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ పెరుగుతుంది. సకాలంలో చికిత్స అందించకపోతే రోగి కోలుకోవడం కష్టం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బ్రెయిన్ స్ట్రోక్కు గురవుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన కల్పించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది అక్టోబర్ 29న శ్రీప్రపంచ పక్షవాత(బ్రెయిన్ స్ట్రోక్) నివారణ దినోత్సవంశ్రీ నిర్వహిస్తోంది. బ్రెయిన్ స్ట్రోక్ అంటే స్ట్రోక్ అంటే మెదడుకు వచ్చే పోటు. దీన్నే పక్షవాతం అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ రెండు రూపాల్లో అటాక్ అవుతుంది. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తనాళాలు పాక్షికంగా, లేదా పూర్తిగా మూసుకుపోతాయి. దీంతో మెదడుకు రక్తం సరఫరా సక్రమంగా ఉండదు. మెదడుకు సరిపోయినంత రక్తం అందకపోవడంతో కణాలు చచ్చుబడిపోతాయి. చాలా తక్కువ మందికి మాత్రమే బ్రెయిన్ స్ట్రోక్పై అవగాహన ఉందని వైద్యులంటున్నారు. శరీరంలో ఏదైనా భాగం నుంచి మెదడుకు ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేసే నరాలు బ్లాక్ అయినప్పుడు, ఆ భాగం పనిచేయకపోతే స్ట్రోక్ వస్తుంది. మద్యపానం వల్ల 26 శాతం మంది, హైపర్టెన్షన్ వల్ల మరో 26 శాతం, మధుమేహం వల్ల 16 శాతం పక్షవాతం భారిన పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఏర్పడే లక్షణాలు.. మెదడుకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడటం కారణంగా మెదడు పనితీరు క్షీణించి స్ట్రోక్ వస్తుంది. 85శాతం మందికి కాళ్లు, చేతులు, చచ్చుపడిపోవడం, కొందరికి మూతి వంకర పోవడం, మాట నత్తిగా రావడం, మాట్లాడలేకపోవడం, కళ్లు మసకబారడం, చూపు కోల్పోవడం వంటివి జరుగుతాయి. 15శాతం మందిలో మాత్రమే మెదడులో నరాలు చిట్లిపోయి అంతర్గత రక్తస్రావం అవుతుంది. స్ట్రోక్కు శస్త్రచికిత్స... అన్యూరిజం అనేది రక్తనాళాల్లో బలహీనమైన ప్రాంతం. ఇది బయటకు ఉబ్బుతుంది. రక్తనాళాలు పగిలిపోవడం వల్ల రక్తస్రావం వల్ల హేమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. అన్యూరిజం పగిలిపోయినట్లయితే మెదడు దెబ్బతినే ప్రమాదం చాలా ఎక్కువ. దీనికి అత్యవసర శస్త్రచికిత్స అవసరం. లక్షణాలను బట్టి సర్జికల్ క్లిప్పింగ్, ఎండోవాస్కులర్ థెరపి, కాయిలింగ్, ప్రో డైవర్టర్లు, ఆర్టిరియోవెనస్ మాల్ ఫార్మేషన్, డీ కమోప్రెసివి క్రానియోటమి విధానాల ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక జబ్బులైన బీపీ, షుగర్ కంట్రోల్లో లేకపోవడం, మద్యపానం, ధూమపానం అతిగా సేవించడం, స్థూలకాయం కారణంగా ఒంట్లో కొవ్వుస్థాయిలు (కొల్రెస్టాల్) పెరిగిపోవడం, గుండెజబ్బులకు మందులు సరిగ్గా వాడకపోవడం వంటివి స్ట్రోక్కు దారి తీస్తాయి. -
వృద్ధురాలి ఆత్మహత్య
మంథని: మంథనిలోని కూరగాయల మార్కెట్ రోడ్డులో నివాసముండే సిరిపురం వీరలక్ష్మీ(84) అనారోగ్యంతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మంథని ఎస్ఐ– 2 సాగర్ వివరాల ప్రకారం.. మంథనికి చెందిన సిరిపురం వీరశంకర్ నారాయణ తల్లి వీరలక్ష్మి పదేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాలేదు. నడవలేని స్థితిలో ఉండడంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం వేకువజామున ఇంట్లో ఉన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పురుగుల మందుతాగి..ధర్మారం: ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన సొన్నాయిల వెంకటరాజం(67) జీవితంపై విరక్తి చెంది సోమవారం పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ మరణించినట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఆయన కథన ప్రకారం.. గుడుంబాకు బానిసైన వెంకటరాజం ఆరోగ్యం పూర్తి క్షీణించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నప్పటికీ నయం కాకపోవటంతో జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. మనస్తాపంతో వైద్యుడు..కరీంనగర్క్రైం: తన పేరు మీద పలువురు లోన్లు తీసుకొని తిరిగి చెల్లించక ఇబ్బందులు పెడుతున్నారని మనస్తాపంతో ఒక వైద్యుడు ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం మంకమ్మతోటకు చెందిన ఎంపటి శ్రీనివాస్ ప్రతిమ మెడికల్ ఆసుపత్రితో వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తన స్నేహితులు కరుణాకర్, కుమారస్వామి తన వద్ద కొంతమొత్తం అప్పుగా తీసుకోగా.. కిరణ్, నరహరి అతని పేరు మీద లోన్ తీసుకున్నాడు. వీరంతా తిరిగి అప్పు, బ్యాంకులోన్లు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో తీవ్రమనస్తాపం చెందిన శ్రీనివాస్ సోమవారం రాత్రి ఇంజక్షన్ తీసుకున్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయంపై మృతుడి భార్య ప్రభుత్వ వైద్యురాలు విప్లవశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ సృజన్రెడ్డి పేర్కొన్నారు. మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు. కోనరావుపేట(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూర్లోని అంగన్వాడీ కేంద్రంలోకి కొండచిలువ వెళ్లే ప్రయత్నం చేయగా, గ్రామస్తులు పట్టుకుని ఊరుచివర వదిలేశారు. గ్రామంలోని ఒకటో అంగన్వాడీ సెంటర్లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కొండచిలువ కేంద్రంలోకి వెళ్తుండగా, గ్రామస్తులు గమనించి చంద్రంపేటకు చెందిన అల్లె రాజుకు ఫోన్లో సమాచారం అందించారు. అతడు కొండచిలువను గుట్టల వద్ద వదిలిపెట్టారు. -
తెగిపడిన హైటెన్షన్ విద్యుత్ తీగలు
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఒక్కసారిగా ఇంటిపై హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడగా.. తృటిలో పెను ప్రమాదం తప్పింది. బాధితుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కర్రోళ్ల రేణుక, మౌనిక ఇళ్లపై నుంచి 11 కేవీ విద్యుత్ లైన్ ఉంది. మంగళవారం విద్యుత్ వైర్లు తెగి ఇళ్లపై పడ్డాయి. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న రేణుక, మౌనిక బయటకు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. తీగలు తెగి పడగానే కరెంట్ సరఫరా నిలిపివేశారు. ఇంటిపై కరెంట్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని అధికారులకు తెలిపినా పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను ఇంటిపై నుంచి తొలగించాలని యజమానులు కోరారు. తప్పిన పెను ప్రమాదం -
దళితుడైనందునే కేసు నమోదు చేయలేదు
కరీంనగర్ టౌన్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ దళితుడైనందునే అతనిపై దాడి చేసిన వ్యక్తిపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మంగళవారం కరీంనగర్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయమూర్తిపై దాడి చేసిన వ్యక్తిపై 23 రోజులవుతున్నా ఇంతవరుకు కేసు పెట్టలేదని, మానవ హక్కుల కమిషన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దేశంలో దఽళితులపై దాడులు జరిగితే వారికి రాజ్యాంగం, చట్టాలు సమానంగా పని చేయడం లేదని తెలిపారు. సుప్రీం కోర్టులో ఎస్సీ రిజర్వేషన్ అమలు కావడం లేదని, గవాయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే రిజర్వేషన్ అమలు చేశారని దీనిని కూడా అగ్రవర్ణాలు జీర్ణించుకోలేదని ఆరోపించారు. నిజామాబాద్లో రియాజ్ విషయంలో స్పందించిన మానవ హక్కుల కమిషన్ ఈ విషయంలో స్పందించక పోవడం రాజ్యాంగ ఉల్లంఘన చేయడమేనన్నారు. నవంబర్ 1న తలపెట్టిన చలో హైదరాబాద్కు దఽళితులు, రాజ్యాంగాన్ని గౌరవించేవారు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద రాజు, ఎంఆర్పీ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్తో పాటు బోయిని కొమురయ్య, బిక్కి మురళీకృష్ణ, చెంచాల నవీన్, కొత్తూరి రాజన్న, తడగొండ శంకర్, చిలుముల రాజాయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీజీహెచ్లో దొంగల భయం
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో దొంగల భయం వెంటాడుతోంది. మంగళవారం ఇద్దరు నిందితులను ఆస్పత్రి సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో రాజేశ్ అనే పేషెంట్ కేర్ సిబ్బంది తన మొబైల్ పక్కన వెట్టి ఓ పేషెంటుకు సేవలందిస్తున్న క్రమంలో, ఓ నిందితుడు ఆ ఫోన్ను తీసుకుని పారిపోయాడు. నిందితుడిని స్థానిక కల్లు కంపౌండ్లో ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితున్ని పోలీసుకు అప్పగించారు. మరో నిందితుడు ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ల వాహనాలను చోరీ చేస్తున్నట్లు, ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఓ పేషెంట్ బంధువు వాహనాన్ని చోరీ చేసిన నిందితుడు, దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని పెట్రోల్ బంక్లో పార్కింగ్ చేశాడు. మరో వాహనాన్ని కూడా చోరీ చేయడానికి ఆస్పత్రికి వచ్చిన నిందితుడు, ఓ బైక్ తాళం తీయడానికి ప్రయత్నం చేస్తుండగా, అనుమానం వచ్చిన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతన్ని తనిఖీ చేశారు. అతనివద్ద డూప్లికేట్ బైక్ కీలతోపాటు ఏటీఎంలు ఉండడంతో గట్టిగా నిలదీయడంతో వాహనాలను చోరీ చేస్తున్నట్లు చెప్పడంతో అతన్ని కూడా వన్టౌన్ పోలీసులకు అప్పగించారు. నిందితులను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బంది మల్లేశ్, సాయి, రాజేంద్రప్రసాద్, రాజేశ్, సాయిని ఆస్పత్రి అధికారులు అభినందించారు. ఇద్దరిని పోలీసులకు అప్పగింత -
రాచపల్లిలో దొంగల హల్చల్
ఇల్లందకుంట: మండలంలోని రాచపల్లి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. జెడ్పీహెచ్ఎస్లో బీరువా తాళం, రెండు క్లాస్రూం గదుల తాళం పాక్షికంగా ధ్వంసం చేశారు. బార్బర్ షాప్, టిఫిన్సెంటర్, సాయికృష్ణకు చెందిన కిరాణాషాపులో దొంగతనం చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సై క్రాంతికుమార్ సంఘటన తీరును పరిశీలించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు చేసుస్తున్నామని తెలిపారు. నగదు, విలువైన ఆభరణాలు దొంగిలించలేదని, లోకల్ దొంగల పనేనని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. -
ఏసీపీ ఫేస్బుక్ హ్యాక్
గోదావరిఖని: ఏసీపీ ఫేస్బుక్ను సైబర్నేరగాళ్లు హాక్ చేశారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ఫేస్బు క్ను హాక్ చేసి సీఆర్పీఎఫ్ అధికారి రిటైర్డ్ అయ్యాడని అతని ఫర్నిచర్ విక్రయించడానికి సిద్ధంగా ఉందని అందుకోసం రూ.లక్ష చెల్లించాలని కోరుతూ ఫేస్బుక్లో పోస్ట్చేసారు. అప్రమత్తమైన ఏసీపీ రమేశ్ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపేరుతో వచ్చేఫేస్బుక్ రిక్వెస్ట్లు, మెసేజ్లు, కాల్స్కు స్పందించ వద్దని కోరారు. ఆలిండియా ఆర్చరీలో చికితకు స్వర్ణంఎలిగేడు: పంజాబ్ రాష్ట్రంలోని చంఢీఘడ్ భాటిండాల్లో ఈనెల 25,26 తేదీల్లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన ఆర్చరీ క్రీడాకారిని తానిపర్తి చికిత స్వర్ణం, కాంస్య పతకాలు సాధించింది. కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో చికిత– ప్రథమేశ్ టైబ్రేకర్లో విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నారు. ఉమెన్స్ టీం ఈవెంట్లోనూ చికిత కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. 4వరకు పరీక్ష ఫీజు గడువుసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో 1, 2, 3వ సెమిస్టర్, బయో మెడికల్ సైన్స్ కోర్సుల్లో 1, 3వ సెమిస్టర్ పరీక్షల ఫీజును నవంబర్ 4వ తేదీలోపు చెల్లించాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. పరీక్షలు నవంబర్లో జరుగుతాయని రూ.300 అపరాధ రుసుముతో నవంబర్ 10లోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పెంపుకొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని కరీంనగర్ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల గడువును నవంబర్ 27వ తేదీ వరకు పెంచినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పారా మెడికల్ బోర్డు కార్యదర్శి నోటిఫికేషన్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులైన డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (డీఎంఐటీ), డిప్లామా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్ (డీఏఎన్ఎస్)లో చేరడానికి ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నోటిఫికేషన్ వివరాల కోసం కళాశాల వెబ్సైట్, లేదంటే తెలంగాణ పారా మెడికల్ బోర్డు వెబ్సైట్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. -
నిందితులను పట్టుకోవడంలో సీసీఎస్ కీలకం
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: నిందితులను పట్టుకోవడంలో సీసీఎస్ పోలీసుస్టేషన్ సేవలు కీలకమని సీపీ గౌస్ ఆలం అన్నారు. సోమవారం కరీంనగర్ సీసీఎస్ పోలీస్స్టేషన్ను ప్రారంభించారు. గతంలో టూటౌన్ పోలీసు స్టేషన్ భవనంలో పై అంతస్తులో ఉన్న సీసీఎస్ స్టేషన్ను రూరల్ ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలోని నూతన భవనంలోకి తరలించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయ్కుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ పాల్గొన్నారు. అలాగే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా సీపీ కరీంనగర్లోని సీఎస్ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో పీఎస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సర్వీసులో మృతిచెందిన పోలీసు కుటుంబాలను ఆదుకునేందుకు నలుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. సీపీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా వి.అఖిల, ఎం.అరుణ్కుమార్, ఎం.రిషికుమార్, మహమ్మద్ సకీబ్ ఉద్దీన్ నియామకమయ్యారు. కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ అల్గునూర్లోని వెలిచాల జగపతిరావు మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న హెచ్సీఏ ఏ డివిజన్ వన్డే లీగ్లో కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీంపై బుడ్డింగ్ స్టార్ విజయం సాధించింది. సోమవారం ఉదయం తొలుత బ్యాటింగ్ చేసిన బుడ్డింగ్ స్టార్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. జట్టులో జైరామ్ కశ్యప్ 117 బంతుల్లో 121 పరుగులు సెంచరీ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన కంబైన్డ్ డిస్ట్రిక్ట్ టీం 45 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది. బుడ్డింగ్ స్టార్ జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోటీల నిర్వహణలో జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఆగంరావు, మురళీధర్రావు, మహేందర్ గౌడ్, మనోహర్రావు తదితరులు పాల్గొన్నారు. శాతవాహన స్నాతకోత్సవానికి రండిసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవానికి రావా లని సోమవారం వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ఉ మేశ్కుమార్ సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్వర్మను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. నవంబర్ 7న రెండో స్నాతకోత్సవం జరగనుందని, ముఖ్య అతిథిగా హాజరు కావాలని గవర్నర్ను కోరారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్టర్ జాస్తి రవికుమార్, సురేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పచ్చివడ్లు అమ్మిన
ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఆరబోసి కేంద్రాల్లో అమ్మినా మిల్లుల్లో కోతలు పెడుతున్నారని తెలిసింది. పచ్చివడ్లను ఎలాంటి కోతలు, ఖర్చు లేకుండా ఓ మిల్లులో క్వింటాల్కు రూ.1,600 చొప్పున 14 క్వింటాళ్ల పచ్చివడ్లు అమ్ముకున్న. – పైతరి రవి, రైతు, మడిపల్లి, జమ్మికుంట జమ్మికుంటలో చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. ధాన్యం రవాణాపై మార్కెటింగ్ ఫీజులు వసూలు చేస్తాం. నెలవారి రికార్డులు మార్కెట్కు వచ్చిన తర్వాత పరిశీలిస్తాం. అక్రమంగా మిల్లులకు, ఇతర రాష్ట్రాలకు తరలిస్తే చర్యలు తీసుకుంటాం. – మల్లేశం, ఉన్నత శ్రేణి మార్కెట్ కార్యదర్శి, జమ్మికుంట -
నాణ్యమైన మొక్క.. ఆదాయం పక్కా
కరీంనగర్ అర్బన్: రైతులకు నాణ్యమైన మొక్కలు అందించడం ద్వారా మంచి ఆదాయం పొందేలా చర్యలు తీసుకుంటున్నారు ఉద్యానశాఖ అధికారులు. ఆయిల్ పాం తోటల్లో నాణ్యత లేని(వంధ్యత్వ) మొక్కలు సరఫరా అవుతుండడంతో కాత, పూత లేక రైతులు ఆదాయం కోల్పోతున్నారు. ఈనేపథ్యంలో మొక్కల బ్యాగులపై బార్కోడ్ను ముద్రిస్తున్నారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికీ వెళ్లాయి.. మార్గమధ్యలో పక్కదారి పట్టాయా? అనే వివరాలు తెలిసిపోనుంది. బార్కోడ్ ముద్రణతో నాసిరకం బెడద, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నుంచే కొత్త పద్ధతిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్రమం బట్టబయలు ఆయిల్పాం మొక్కల పంపిణీలో అక్రమాలకు చెక్ పడనుంది. ఆయిల్పాం మొక్కలపై బార్కోడ్ ముద్రణతో నర్సరీల నుంచి బయటకు వెళ్లినవి అదే రైతుకు వెళ్లాయా? పక్కదారి పట్టాయా? అనేది తెలియనుంది. ప్రస్తుతం రైతులను పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య వంధ్యత్వ మొక్కలు. గత ఐదారేళ్లలో వీటితో చాలా మంది రైతులు నష్టపోయారు. తమకు న్యాయం చేయాలని ఆయిల్ఫెడ్తో ఎడతెగని పోరాటం చేస్తున్నారు. వంధ్యత్వ మొక్కలతో నష్టపోయిన రైతుల విషయంలో ఆయిల్ఫెడ్ చేపడుతున్న నష్టనివారణ చర్యలకు, రైతులు కోరుతున్న న్యాయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ప్రస్తుతం బార్కోడ్ పద్ధతితో రైతులకు మేలు కలుగనుంది. బార్కోడ్ను స్కాన్చేస్తే మొక్కలు ఏ నర్సరీ నుంచి వచ్చాయి.. దాని బ్యాచ్ నంబర్ తదితర వివరాలు క్షణాల్లో తెలిసిపోతాయి. కొద్ది నెలల క్రితం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయిల్ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మలేషియా పర్యటనలో అక్కడి నర్సరీలో మొక్కల పెంపకం, నాసిరకం నివారణకు వారు ఆచరిస్తున్న పద్ధతులు తెలుసుకున్నారు. పర్యటన అనంతరం నర్సరీల పర్యవేక్షణకు ఇంజినీరింగ్ అధికారుల నుంచి తప్పించి, ప్రత్యేకంగా ఉద్యాన శాస్త్రవేత్తను ఓఎస్డీగా నియమించారు. పలు సూచనలతో నర్సరీల్లో పలు మార్పులు చేపట్టారు. ఈక్రమంలోనే నర్సరీలో ఎత్తుతక్కువగా ఉండే 4.5 లక్షల సిరాడ్ రకం పెంచుతున్నారు. మొలకలను కొత్త సంచుల్లోకి మార్చేముందు గ్యానోడెర్మా నివారణకు ట్రైకోడెర్మా విరిడీ, వేప పిండి కలిపిన మట్టిని నింపనున్నారు. దీంతో చిన్నతనం నుంచే ఆయిల్ పామ్ మొక్కల్లో గ్యానోడెర్మా వ్యాధిని తట్టుకునే శక్తి పెరుగుతుంది. నూతన విధానంతో రైతులకు భద్రత ఉండనుండగా నాణ్యమైన మొక్కలు అందనున్నాయి. -
చేతిలో అంతర్గత పోరు!
కరీంనగర్ అర్బన్: అర్బన్ బ్యాంకు ఎన్నికలు కాంగ్రెస్లో అంతర్గత పోరుకు వేదికై ంది. నువ్వా.. నేనా అన్నట్లుగా ప్యానెళ్లను ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలు పార్టీ గుర్తులతో సంబంధం లేకున్నా అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం పరిపాటి. కానీ ఈసారి బీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలపై మౌనం పాటిస్తుండగా.. కాంగ్రెస్లో మాత్రం వర్గపోరు స్పష్టమవుతోంది. ఎన్నికల ఆరంభంలో తనదే కాంగ్రెస్ మద్దతు ప్యానెల్ అని గడ్డం విలాస్రెడ్డి ప్రకటించారు. పార్టీకి ఆది నుంచి సేవలందిస్తున్నానని అనగా.. పార్టీ నుంచి మద్దతు లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్యానెల్నే ప్రకటించలేదని డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. మంత్రుల మద్దతుందని చెప్పుకుంటున్నవారి మాటలు నమ్మొద్దని చెబుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు మాత్రం మార్పు కోసం మన ప్యానెల్ అంటూ ప్రచారాన్ని ప్రారంభించారు. నిర్మల భరోసా ప్యానెల్ పేరున కరపత్రికలు ముద్రించగా.. 12 మంది డైరెక్టర్ అభ్యర్థులతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. వివాదాల ప్యానెళ్లను ఓడించి విశ్వాసంగా పని చేసే తమ ప్యానెల్ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. వెలిచాల వర్సెస్ కవ్వంపల్లి కాంగ్రెస్లో వర్గాలు లేవని నేతలు చెబుతున్నా.. అర్బన్ ఎన్నికల్లో మాత్రం విరుద్ధ పరిస్థితి. వెలిచాల వర్సెస్ కవ్వంపల్లి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాత్రం పార్టీ నుంచి ఎలాంటి ప్యానెల్ను ప్రకటించలేదని చెబుతున్నారు. మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్నారని, అయినా ఆది నుంచి కాంగ్రెస్ అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో పైచేయి సాధిస్తోందని ధీమా వ్యక్తం చేయగా.. ఎవరికి మద్దతిస్తున్నారో వెల్లడించలేదు. పార్టీ నుంచి ప్యానెల్ లేకపోగా.. తమకు మద్దతుందని ప్రకటించడం ఎంతవరకు సబబని కర్ర రాజశేఖర్ ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా డీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్నారు. తనది రాజశేఖర్ ప్యానెల్ అని, అన్ని పార్టీల మద్దతుందని కాంగ్రెస్ నేత, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ విస్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. వెలిచాల రాజేందర్రావు మాత్రం ప్రచారంలో దూసుకుపోతున్నారు. గడ్డం విలాస్ ఒంటరేనా? అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో నిర్మల భరోసా ప్యానెల్, కర్ర రాజశేఖర్ ప్యానెల్ను స్పష్టం చేయగా.. గడ్డం విలాస్రెడ్డి ప్యానెల్ ఇప్పటివరకు ప్రకటించలేదు. తానే కాంగ్రెస్ వాదినని, తనకే పార్టీ అండ ఉంటుందని మొదటి నుంచి ధీమా వ్యక్తం చేశారు. బ్యాంకులో జరిగిన అక్రమాలను వెలుగులోకి తేగా.. మాజీ చైర్మన్పై ఆరోపణలు గుప్పించారు. కానీ పార్టీ ప్రకటనలో గడ్డం విలాస్రెడ్డికి మద్దతు లేకపోగా.. కర్ర రాజశేఖర్ తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే.. కాంగ్రెస్లో అంతర్గత కలహాలు తమకే అనుకూలిస్తాయని స్వతంత్ర అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కోతిని మింగిన కొండచిలువ
పెద్దపల్లి జిల్లా(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం కేశనపల్లి గ్రామంలో ఓ కొండచిలువ కోతిని మింగి మిగతా వాటి దాడిలో హతమైంది. గ్రామానికి చెందిన చొప్పరి రవి నివాసం ఎదుట సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామశివారులోని చెట్లపొదల్లోంచి జనావాసాల్లోకి చేరుకున్న ఓ కొండచిలువకు కోతుల గుంపు కనిపించింది. దీంతో వాటివైపు కదిలిన కొండచిలువ.. తొలుత చిన్నకోతిపిల్లను మిగింది. మరో పెద్దకోతిని మింగేందుకు యత్నించగా.. బిగ్గరగా అరిచింది. దీంతో సమీపంలోని సుమారు కోతులు గల గుంపు ఒక్కసారిగా వచ్చి కొండచిలువపై దాడిచేశాయి. ఆ దాడిలో కొండచిలువ చనిపోగా పెద్దకోతి ప్రాణాలతో బయటపడింది. కొండచిలువ భయానికి స్థానికులెవరూ అటువైపు వెళ్లలేదు. సమాచారం అంతుకున్న బేగంపేట ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య, బీట్ ఆఫీసర్ పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొండచిలువ పొడవు 6 అడుగులు ఉందని అధికారులు తెలిపారు. దానికి పంచనాబా చేసి అటవీప్రాంతంలో పూడ్చిపెట్టినట్లు వివరించారు. హార్వెస్టర్లో పడి కొండచిలువ హతంచందుర్తి(వేములవాడ): వరికోత కోస్తుండగా హార్వెస్టర్లో పడి కొండచిలువ హతమైంది. చందుర్తి మండలం కట్టలింగంపేటకు చెందిన రైతు యెల్ల నరేశ్కు చెందిన వరి పొలం కోస్తుండగా హార్వెస్టర్లో కొండచిలువ చిక్కి మిషన్ ఆగిపోయింది. మిషన్లో చిక్కిన గడ్డిని తొలగిస్తుండగా.. ఆ గడ్డిలోనే కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో అక్కడే ఉన్న రైతులు పెద్ద కొండచిలువ అంటూ పరుగులు పెట్టారు. ఆపరేటర్ మిషన్లో చిక్కిన కొండచిలువను తొలగించారు. -
పచ్చి మోసం!
‘ఇతని పేరు తిప్పారపు సురేశ్. గ్రామం పెద్దంపల్లి, మండలం జమ్మికుంట. రెండెకరాల్లో వరి పంట వేశాడు. వర్షాలు ఎక్కువ కురుస్తుండడంతో ముందుగా వరి కోతలు చేపట్టగా 53 క్వింటాళ్ల ధాన్యం చేతికి వచ్చింది. ఇంకా ఐకేపీ సెంటర్లు ప్రారంభం కాకపోవడం, వడ్లు ఆరబెట్టేందుకు స్థలం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పచ్చివడ్లను క్వింటాల్కు రూ.1,850 చొప్పున మిల్లులో అమ్ముకున్నాడు’.జమ్మికుంట(హుజూరాబాద్): ప్రకృతి వైపరీత్యాలు, రైతుల అవసరాలను ఆసరా చేసుకున్న మిల్లర్లు పచ్చివడ్ల కొనుగోళ్లతో దోపిడీకి తెరలేపారు. వరికోతలు మొదలవగానే దళారులు, మధ్యవర్తులు పెట్టుకొని మాయమాటలతో రైతులకు ఎర వేస్తూ కల్లాల వద్దె కాంటా పెడుతున్నారు. క్వింటాల్కు రూ.1,600 నుంచి రూ.1,850 చొప్పున పచ్చివడ్లు కొంటూ దళారీ దందాకు తెరలేపారు. పచ్చివడ్ల కొనుగోలు పేరుతో రైతుల రెక్కల కష్టాన్ని క్వింటాల్కు రూ.600 వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఎలాంటి రికార్డులు, అనుమతులు లేకుండా అక్రమంగా కొనుగోళ్లు చేస్తూ జీరో దందాకు తెరలేపారు. కొందరు లారీల్లో రాష్ట్రాలు దాటిస్తుండగా, మరికొందరు మిల్లుల్లోనే మరాడిస్తున్నారు. గతంలో పచ్చివడ్లను లారీల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సందర్భాలు జమ్మికుంటలో వెలుగుచూశాయి. పచ్చివడ్ల కొనుగోళ్లపై అధికారుల పర్యవేక్షణ కరువైందని, విచారణ చేపడితే అక్రమాలు బయటపడుతాయని పలువురు చర్చించుకుంటున్నారు. జమ్మికుంట కేంద్రంగా.. సుమారు 20 మండలాల పరిధిలోని రైతులు, గ్రామాల వారికి జమ్మికుంట పట్టణం వ్యాపార కేంద్రంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు, అమ్మకాల్లో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతూ వస్తోంది. తాజాగా ఎలాంటి అనుమతులు లేకుండా పచ్చివడ్ల వ్యాపారం కొనసాగుతోంది. ధాన్యం అమ్మడానికి తంటాలు పడుతున్న రైతులను ఆసరా చేసుకొని, దళారులు, వ్యాపారులు పచ్చి వడ్ల దందా మొదలుపెట్టారు. క్యాన్వాసింగ్ వ్యాపారులే ఏజెంట్లు ప్రభుత్వ సెంటర్లలో కొనుగోళ్ల జాప్యాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారులు కల్లాల వద్ద పచ్చివడ్లను కొంటూ అక్రమంగా రాష్ట్రం దాటవేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.2,369 ఉండగా దళారులు రూ. 1,600 నుంచి రూ.1,850 చెల్లిస్తున్నారు. ఈ తతంగమంతా క్యాన్వాసింగ్ ఏజెంట్లు, మధ్యవర్తుల కనుసన్నల్లో నడుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి అక్రమంగా కొనుగోలు చేసిన వడ్లను చెక్పోస్ట్ కళ్లు గప్పి రాష్ట్రం దాటిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, అడ్డుకున్న అధికారులను మచ్చిక చేసుకొని మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లక్కు.. లిక్కర్ కిక్కు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్క్రైం ●: మద్యం కొత్త దుకాణాలకు లక్కీ డ్రా ముగిసింది. కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా సోమవారం జిల్లాలోని 94 షాపులకు కలెక్టరేట్ ఆడిటోరియం వేదికగా డ్రా తీసి షాపులను కేటాయించారు. జిల్లావ్యాప్తంగా 2,730 దరఖాస్తులు రాగా రూ.81.90 కోట్లు ఆదాయం సమకూరింది. దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలివచ్చారు. వారితో పాటు వారి పార్ట్నర్లు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు భద్రత కల్పించారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైన్స్ల కేటాయింపు పక్రియ ప్రశాంతంగా ముగిసింది. కొత్త దుకాణాలు ఈ డిసెంబర్ ఒకటి నుంచి 2027 నవంబర్ 30 వరకు కొనసాగనున్నాయి. రిజర్వేషన్ల వారీగా.. జిల్లావ్యాప్తంగా 94 దుకాణాలు ఉండగా 23 షాపులను మహిళలు గెలుచుకున్నారు. ఇందులో గౌడ్ రిజర్వేషన్లో 17 ఉండగా 3 దుకాణాలు, ఎస్సీ రిజర్వేషన్లో 9 దుకాణాలుండగా 1 మహిళలు గెలుచుకున్నారు. మొత్తంగా పురుషులు 71 దుకాణాలు గెలుచుకున్నారు. ఇందులో వారి పేరు మీద కలిసివస్తుందని చాలా మంది భర్తలు తమ భార్యలపేరు మీదుగా వేయగా వారికి దుకాణాలు రావడంతో హర్షం వ్యక్తం చేశారు. చాలా మంది ముహూర్తాలు చూసుకొని మరి టెండర్ లక్కీ డ్రాకు వచ్చారు. నగరంలోని ఒక షాపును పల్లె వెంకటేశ్ అనే వ్యక్తి ఒకే టెండర్ వేసి డ్రా ద్వారా గెలుచుకోవడంతో సంబ్రమాశ్చర్యాలలో ఆనందభాష్పాలు రాల్చి హర్షం వ్యక్తం చేశాడు. షాపులు దక్కించున్నవారు సంతోషంగా ఉండగా రానివారు నిరాశతో వెనుదిరగడం కనిపించింది. మద్యం పాత వ్యాపారులు పెద్ద ఎత్తున టెండర్లు వేసినా కొందరికి అనుకున్న స్థాయిలో వైన్స్లు దక్కలేదు. కోరుకున్న చోట రాని వ్యాపారులు ఆయా ప్రదేశాల్లో కొత్తగా వచ్చినవారిని గుర్తించి బేరసారాలు నడిపినట్లు సమాచారం. కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చి డ్రా లో ఎంపికై నవారి వేటలో మద్యం వ్యాపారులు ఉన్నారు. వారికి కొంతమొత్తం ఆఫర్ ఇచ్చి ఎలాగైనా ఆయా షాపులు కై వసం చేసుకోవాలని చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఆదాయం వైన్స్ టెండర్లు, షాపుల కేటాయింపు ప్రక్రియ ద్వారా ఎకై ్సజ్శాఖకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతోంది. గతంలో మద్యం టెండర్ల ద్వారా రూ.80.80 కోట్లు రాగా ప్రస్తుతం కొత్త టెండర్ల ద్వారా ఇప్పటికే రూ.81.90 కోట్లు ఆదాయం దరఖాస్తుల రూపంలో వచ్చింది. ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తంగా షాపులవారీగా ఏటా 43 షాపులు రూ.65 లక్షలు, 40 షాపులు రూ.55 లక్షలు, 11 షాపులు రూ.50 లక్షలు ఇలా మూడు స్లాబులుగా చెల్లిస్తారు. వీరు స్లాబ్ ప్రకారం ఏటా చెల్లించాల్సి ఉండగా రెండేళ్లకు కలుపుకొని రూ.110.9 కోట్ల ఆదాయం ఈసారి వైన్స్ల ద్వారా ఎకై ్సజ్శాఖకు సమకూరనుంది. ఇందులో ఆరోవంతు ఆదాయం అనగా సుమారు రూ.18.5 కోట్లు మంగళవారం సాయంత్రం వరకు వైన్స్లు వచ్చినవారు చెల్లించాల్సి ఉండగా చాలా మంది సోమవారం రాత్రి వరకు చెల్లించారు. ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకు కౌంటర్ సైతం ఆడిటోరియంలో ఏర్పాటు చేయగా, ఆన్లైన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తెలిపారు. టెండర్ల డ్రా పక్రియలో ఎకై ్సజ్ సీఐలు రాము, అశోక్కుమార్, సాయిబాబ, శ్రీనివాసులు, మాధవీలత, ఎన్ఫోర్స్మెంట్ నరేందర్రెడ్డి, వన్టౌన్ సీఐ రాంచందర్రావు పాల్గొన్నారు. వైన్స్ దరఖాస్తులు: 2,730 వచ్చిన ఆదాయం: రూ.81.90 కోట్లు మొత్తం షాపులు: 94 మహిళలకు: 23, పురుషులు: 71 వైన్స్షాపుల కాలపరిమితి: డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు -
ప్రభుత్వ స్కూల్లో కలకలం.. బాలికల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు
సాక్షి, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలో కలకలం రేపింది. బాలికల వాష్రూంలో స్కూల్ అటెండర్ రహస్యంగా కెమెరాలు అమర్చాడు. టాయిలెట్కు వెళ్లిన బాలికలకు టాయిలెట్లో కెమెరా ఉండటాన్ని గుర్తించారు. భయాందోళనకు గురైన బాలలికలు స్కూల్ హెడ్ మాస్టర్కి ఫిర్యాదు చేశారు.కరీంనగర్ పోలీసుల వివరాల మేరకు.. గంగాధర మండలం కురిక్యాల పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న నిందితుడు కెమెరాలు పెట్టినట్లు తెలిపారు. బాలికలు మద్యాహ్న సమయంలో టాయిలెట్కు వెళ్లగా అక్కడ కెమెరాలు అమర్చినట్లు బాలికలు స్కూల్ ప్రధానోపాధ్యుడికి, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికలు సమాచారంతో తల్లిదండ్రులు, స్కూల్ హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో కేసు నమోదు చేశారు. మరోవైపు గంగాధరలోని పాఠశాల ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ స్పందించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీతో మాట్లాడారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిందితుడి వద్దనున్న వీడియోలను స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఆందోళనలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు పూర్తి భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. -
పాముకాటుకు చిన్నారి బలి
చందుర్తి(వేములవాడ): ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి పాముకాటుతో మృత్యువాత పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చేకుట లత, రమేశ్ దంపతుల ఏడాదిన్నర వయసు ఉన్న కూతురు వేదాన్షి శనివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా హఠాత్తుగా ఇంట్లో వారికి ఏడుపు వినిపించింది. కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పరిశీలించగా చిన్నారి కాళ్ల వేలి మధ్యలో నుంచి రక్తం కారుతుండటంతో వెంటనే వేములవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి, పాము కాటు తో పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అక్కడి నుంచి అర్ధరాత్రి ఎల్లారెడ్డిపేటలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి తండ్రి రమేశ్ ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. పాముకాటుకు కూతురు మృతిచెంది న విషయం తెలుసుకున్న తండ్రి రమేశ్ స్వగ్రా మానికి బయలుదేరినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం పాప మృతదేహాన్ని బాడీఫ్రీజర్లో భద్రపరిచారు. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
ప్రాణం తీసిన కిటికీ వివాదం
కరీంనగర్ కార్పొరేషన్: చిన్న కిటికీ వివాదానికి నిండు ప్రాణం బలైన ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టించింది. పక్కింటి వాళ్లతో పాటు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారుల వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మృతుడు సూసైడ్ నోట్లో పేర్కొనడం కలకలం రేపుతోంది. కరీంనగర్ సిటీలోని రాఘవేంద్రనగర్లో వడ్లకొండ లక్ష్మీరాజం శనివారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల పేరిట తమ ఇంటి కిటికీలను నగరపాలక సంస్థ అధికారులు పదేపదే తొలగించడం అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. తన ఇంటి కిటికీ విషయంపై పక్కింటి వాళ్లతో పాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్ వేధించడంతోనే చనిపోతున్నట్లు లక్ష్మిరాజం సూసైడ్ నోట్ రాశాడు. దాదాపు మూడేళ్లుగా పక్కింటివాళ్లతో కిటికీల విషయంపై లక్ష్మిరాజంకు వివాదం నడుస్తోంది. సెట్బ్యాక్ నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ టౌన్ప్లానింగ్ అధికారులు కిటికీని 2023లో మొదటిసారి తొలగించారు. మళ్లీ ఏర్పాటు చేశారంటూ ఈ సంవత్సరం ఆగస్టులో మరోసారి తొలగించారు. తన కిటికీలు తొలగించడం, పక్కింటి వాళ్లపై తాను ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో మానసిక వేదనతో లక్ష్మిరాజం ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన పక్కింటి వాళ్లతోపాటు, నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు వేణు, ఖాదర్పై చర్య తీసుకోవాలని లక్ష్మిరాజం భార్య శారద వన్టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే పక్కింటి వ్యక్తి ఫిర్యాదు, హైకోర్టు ఆదేశాల మేరకే తాము నిబంధనలు ఉల్లంఘించి నిర్మించిన కిటికీలు తొలగించామని డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ తెలిపారు. -
గురుకుల పాఠశాలలో బాలిక బలన్మరణం, ట్రాక్టర్లో మృతదేహం తరలింపు వివాదం
తెలంగాణా హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలంలోని వంగర (పీవీ రంగారావు) బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. దీపావళి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి పాఠశాలకు వెళ్లిన బిడ్డ అనూహ్యంగా కన్నుమూయడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూలు ప్రిన్సిపాల్ , వైస్ ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. తనను ఇంటికి తీసుకెళ్లాలని కన్నీటితో వేడుకున్న కొంతసేపటికే ఆమె వసతి గృహంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. బాధిత బాలికను హుజురాబాద్ మండలం, రంగాపూర్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని వనం శ్రీవర్ష (14)నిగా గుర్తించారు.అక్టోబర్ 23న దీపావళి సెలవుల తర్వాత శ్రీవర్ష పాఠశాలకు తిరిగి వచ్చింది. అయితే ప్రిన్సిపాల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ వేధింపుల కారణంగా తమ కుమార్తె శ్రీవర్ష ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో వస్తువులు దొంగతనంచేసిందని ఆమెపై తప్పుడు ఆరోపణలతో వేధించారని కుటుంబం , మరికొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చదువుల్లో రాణిస్తూ, అత్యుత్తమ విద్యార్థినిగా ఇటీవల జిల్లా కలెక్టర్ నుండి అవార్డు కూడా అందుకుందని ఆమె సహచరులు, ఇతర మిత్రులు గుర్తు చేసుకున్నారు. తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అయితే ఆమెకు ఆరోగ్య సమస్యలున్నాయి పాఠశాల అధికారులు సిబ్బంది ఈ ఆరోపణలను ఖండించారు.FOR SPEAKING THE TRUTH??? Varshita, a 10th class student at Government Gurukul School Vangara died by suicide recently! Varshitha was school topper, school captain and an excellent student. She even recently received an award from the district collector. She came back home… pic.twitter.com/WtC5XjTns2— Revathi (@revathitweets) October 26, 2025మరోవైపు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని అంబులెన్స్కు బదులుగా ట్రాక్టర్లో తరలిలంచడం తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. రెండేళ్లలో గురుకులాలలో 110 విద్యార్థులు చనిపోయారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. -
కూర ఎందుకు వండలేదు? భర్త మందలింపుతో..
రాయికల్(జగిత్యాల): కూర ఎందుకు వండలేదని భర్త మందలించినందుకు రాయికల్ మండలం రామాజీపేట గ్రామానికి చెందిన దొడిమెల్లి మనోజ(27) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన మనోజను తొమ్మిదేళ్ల క్రితం రామాజిపేటకు చెందిన సుధాకర్తో వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. శనివారం రాత్రి సుధాకర్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు తీసుకొచ్చేసరికి మనోజ కూర వండలేదు. ఎందుకు వండలేదని మందలించాడు. పిల్లలు కారంతో అన్నం తింటుండడంతో వంట చేసేందుకని సుధాకర్ వంటింట్లోకి వెళ్లాడు. మనోజ వెంటనే బెడ్రూంలోకి వెళ్లి ఉరేసుకుంది. సుధాకర్ వచ్చి చూసేసరికే మృతిచెందింది. మనోజ తల్లి వెంకటి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నల్లబియ్యం సాగు.. డిమాండ్ అధికం
రామగిరి(మంథని): అందరూ పాలిష్ బియ్యానికి అలవాటుపడ్డారు. బియ్యం అంటే తెల్లగా, నాజూగ్గా ఉంటాయనే తెలుసు. కానీ, బ్లాక్, రెడ్రైస్ కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నాడు కల్వచర్ల గ్రామానికి చెందిన రైతు యాదగిరి శ్రీనివాస్.. అప్పట్లో ఈబియ్యంతో భోజనం చేశామని, అందుకే గట్టిగా ఉన్నామంటున్నారు. తన నానమ్మ బొదమ్మ చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని పాతతరం నాటువరి పంటతో లాభాలు తెలుసుకొని నల్లని వరి సాగుచేసేందుకు నడుం బిగించాడు. తనకున్న మూడు ఎకరాల్లో పాత పద్ధతిలో పంటలు పండిస్తున్నాడు. పశువుల పేడ, మూత్రాన్ని సేకరించి, అందులో శనగపిండి, బెల్లంకలిపి జీవామృతాన్ని తయారు చేసి పొలంలో చల్లుతున్నాడు. కొన్నిసందర్భాల్లో స్ప్రే విధానంతో సేంద్రియ ద్రావణాలను పంటకు పట్టిస్తున్నాడు. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాల నారు ప్లాస్టిక్ ట్రేలలో పెంచి.. 110– 200 రోజులకు(సుమారు 4 నెలల నుంచి 6 నెలల పంట కాలం) శ్రీ పద్ధతిలో పండిస్తున్నాడు. సుమారు 400 రకాల వరి వంగడాలను శ్రీనివాస్ పండిస్తున్నాడని చెబుతున్నాడు. -
ఉద్యోగం వదిలి.. పండ్లతోట వైపు
పెద్దపల్లిరూరల్: ఎంబీఏ చదివి రెండేళ్ల పాటు హైదరాబాద్లో ఉద్యోగం చేసి.. ఆ ఉద్యోగాన్ని వదలుకుని తమకున్న 13 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు యువరైతు. అందులో రెండున్నర ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో డ్రాగన్ఫ్రూట్ పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి మండలం రంగాపూర్కు చెందిన గండు నరేశ్. డ్రాగన్ప్రూట్ పంటకు అనువుగా భూమిని మార్చేందుకు దాదాపు రూ.6లక్షలతో మట్టిని పోయించాడు. రెండున్నర ఎకరాల్లో 4,500 మొక్కలు నాటించాడు. నాటినవాటిలో 500 మొక్కల వరకు పాడై పోగా వాటిస్థానంలో కొత్తవి నాటించాడు. డ్రాగన్ఫ్రూట్ ఏటా జూన్ నుంచి నవంబర్ దాక దిగుబడి వస్తుంది. ఒకసారి నాటిన మొక్క 30 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. ప్రస్తుత సీజన్లో వాతావరణ పరిస్థితుల కారణంగా దిగుబడిపై ప్రభావం చూపిందని రైతు వాపోయాడు. తోటవద్దే అమ్మకాలు పెద్దపల్లి–మంథని ప్రధానరోడ్డు పక్కనే తోట ఉంది. కొనుగోలుదారులకు తోట నుంచి తెంపుకొచ్చిన పండును కిలో రూ.200 చొప్పున అమ్ముతున్న. చాలా మంది కొంటున్నారు. పంట సాగు సమయంలో ప్రభుత్వం రాయితీ ఇస్తుందని హార్టికల్చర్ చెప్పినా ఇప్పటికీ రాలేదు. ప్రభుత్వం పండ్ల తోటలకు రాయితీ ఇచ్చి ప్రోత్సహించాలి. – నరేశ్, రైతు -
పోష‘కాలబట్టి’
మంథనిరూరల్: పాతకాలపు వరి విత్తనాలతో సేంద్రియ పద్ధతిలో పంట సాగు చేస్తున్నాడు రైతు. ఏటా ఓ రకం వరిని పండిస్తూ పోషక విలువలున్న ధాన్యం పరిచయం చేస్తున్నాడు. మంథని మండలం గుంజపడుగు గ్రామానికి చెందిన ఎల్క సదానందం తనకున్న అర ఎకరంలో ఈసారి కాలాబట్టి వరి సాగు చేశాడు. అత్యధిక పోషక విలువలు ఉన్న ఈ ధాన్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నాడు. మూడేళ్ల క్రితం కృష్ణవ్రీహి, రెండేళ్ల క్రితం రక్తశాలి, గతేడాది నవారా, ఈసారి కాలాబట్టి సాగు చేశాడు. నవారా ధాన్యం కేవలం ఒక్కపూట మాత్రమే తినాలని, రక్తశాలి రక్తం పెంచుతుందని, కాలాపట్టి తింటే క్యాన్సర్, బీపీ, షుగర్ లాంటి వ్యాధులు దరి చేరవని రైతు చెబుతున్నాడు. కరోనా తర్వాత ఆలోచన చేశా.. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం అనేక కష్టాలు పడ్డారు. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే ఆహారం బాగుండాలనే ఆలోచన చేశా. నాడు తిరుపతి నుంచి 20గుంటల భూమికి సరిపడేలా 12కిలోల విత్తనాలు తీసుకువచ్చి సాగు చేశా. అప్పటి నుంచి ఏటా ఒక రకం తీసుకువస్తున్నా. వచ్చిన పంటను అవసరమైన వారికి ఇస్తున్నా. – ఎల్క సదానందం, రైతు, గుంజపడుగు -
అర్బన్బ్యాంక్పై జెండా ఎగురవేస్తాం
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ భావాలు కలిగిన వ్యక్తులతో అర్బన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్యానెల్ను రూపొందించినట్లు కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో మాట్లాడుతూ ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన అర్బన్ బ్యాంక్ను కొంతమంది భ్రష్టు పట్టించారని, డిపాజిటర్లు, ఖాతాదారులు అభద్రతకు లోనయ్యేలా అవినీతి అరోపణలతో వివాదాలు సృష్టించారని ఆరోపించారు. రూ.72 కోట్ల డిపాజిట్లు, పదివేల మందికి పైగా సభ్యులు కలిగిన అర్బన్బ్యాంక్పై మంచి విశ్వాసం కలిగేలా చక్కని కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందులో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సహకారంతో ప్యానెల్ను తయారు చేసి పోటీలో నిలిపినట్లు పేర్కొన్నారు. అర్బన్ బ్యాంకు ఖాతాదారులు, సభ్యులు తమ ప్యానల్ను ఆదరించాలని కోరారు. బ్యాంకు ప్యానల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్రెడ్డి, ఈ.లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్కుమార్, మన్నె అనంత రాజు, మునిపల్లి ఫణిత, దామెర శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. -
స్వదేశానికి చేరుకున్న జోర్డన్ బాధితుడు
జగిత్యాలక్రైం: బతుకుదెరువు కోసం జోర్డన్ వెళ్లిన ఓ కూలి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు జోక్యంతో స్వదేశానికి చేరాడు. జగిత్యాల పట్టణంలోని నాగేంద్రనగర్కు చెందిన అబ్బనవేని నర్సింహులు 11 నెలల క్రితం జీవనోపాధి కోసం జోర్డన్ వెళ్లాడు. అక్కడ పనిలేకపోవడం.. చాలీచాలని వేతనాలు ఇవ్వడంతోపాటు కంపెనీ తీవ్ర ఇబ్బంది పెట్టింది. ఇలా 12 మంది పడుతున్న ఇబ్బందులను వీడియోలు తీసి కుటుంబసభ్యులకు పంపించారు. స్పందించిన హరీశ్రావు కంపెనీ పెనాల్టీతోపాటు, రవాణా ఖర్చులు భరించి బాధితులను స్వదేశానికి రప్పించారు. ప్రభుత్వం పట్టించుకోకపోయినా.. హరీశ్రావు స్వగ్రామానికి రప్పించండం ఆనందగా ఉందని బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. మాజీమంత్రి హరీశ్రావు జోక్యంతో.. -
అమ్మకు టిఫిన్ ఇచ్చేందుకు వెళ్తూ అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో కూతురు మృతి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి టిఫిన్(భోజనం) ఇచ్చేందుకు వెళ్తూ మోయా లావణ్య(43) శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని తన అత్తగారి ఇంట్లో ఉంటున్న స్వశక్తి మహిళా సంఘం సీఏ మోయా లావణ్య.. తన తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో రెండ్రోజుల క్రితం తల్లిగారిల్లు ఎలిగేడు మండలం బుర్హాన్మియాపేటకు వచ్చింది. అయితే, కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లికి భోజనం ఇచ్చేందుకు శనివారం రాత్రి ఇంటినుంచి బయలుదేరి సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి స్టేజీ వద్దకు చేరుకుంది. అక్కడ కరీంనగర్ వెళ్లేందుకు రాజీవ్ రహదారి దాటుతుందగా పెద్దపల్లి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో లావణ్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రావణ్కుమార్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 108 వాహనంలో మృతదేహాన్ని సుల్తానాబాద్ ఆస్పత్రికి తరలించారు. బావిలో పడి రైతు దుర్మరణంవేములవాడరూరల్: వేములవాడ మండలంలోని ఫాజుల్నగర్కు చెందిన రైతు కీసరి అనిల్(37) ప్రమాదవశాత్తు కాలుజారి తన వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. అనిల్ శుక్రవారం రాత్రి పొలం వద్దకు వెళ్లాడు. ఒడ్డు పైనుంచి వెళ్తుండగా కాలు జారి బావిలో పడ్డాడు. మరుసటి రోజు ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి పరిశీలించగా బావిలో శవమై తేలాడు. మృతుని భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రాజం తెలిపారు. కొనుగోలు స్థలం కోసం ఘర్షణ● రెండు తండాల మధ్య వివాదం ● వీర్నపల్లి మండలంలో ఉద్రిక్తత వీర్నపల్లి(సిరిసిల్ల): మద్దిమల్లతండా గ్రామపంచాయతీ పరిధిలో శనివారం ధాన్యం కొనుగోలు స్థలం ఎంపికపై మ ద్దిమల్లతండా, మద్దిమల్లలొద్దితండాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానికులు తెలి పిన వివరాలు. ఒక తండాకు చెందిన వారు స్థలాన్ని తామే చదునుచేసుకుంటామని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని పట్టుబట్టగా.. తమకు కూడా హక్కు ఉందని మరోతండా వారు ప్రతిఘటించారు. దీంతో రెండు తండాల ప్రజల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తహసీల్దార్ ముక్తార్ పాషా, ఫారెస్ట్ ఆఫీసర్ రంజిత్కుమార్ అక్కడికి చేరుకొని ఇరువర్గాలతో మాట్లాడారు. అయినా రెండు తండాల ప్రజలు వినకపోవడంతో ఆ స్థలం అటవీశాఖకు చెందినదని.. ఇకపై అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు. ప్లాంటేషన్ ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. -
రౌడీషీటర్ల కదలికపై నిఘా
● నేరసమీక్షలో సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని, వరుసగా నేరాలు చేస్తే కఠినచర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. కమిషనరేట్లో శనివారం నేరసమీక్ష నిర్వహించారు. పోలీస్స్టేషన్కు వస్తున్న పిటిషన్లను తర్వగా పరిష్కరించాలన్నారు. సీఐలు క్షేత్రస్థాయిలో ఠాణాలను సందర్శించాలన్నారు. ఎస్హెచ్వోలు స్టేషన్ పరిసరాలను పరి శుభ్రంగా ఉండేలా చూడాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలన్నారు. మాదక ద్రవ్యాలు, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవా ణా, పేకాటస్థావరాలపై దాడులు చేయాలన్నారు. గంజాయి నిర్మూలనకు పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ (పరిపాలన), భీంరావు (ఏఆర్), ఏసీపీలు వెంకటస్వామి, యాదగిరిస్వామి, మాధవి, శ్రీనివాస్, శ్రీనివాస్జి, వేణుగోపాల్, విజయకుమార్, వాసాల సతీశ్ పాల్గొన్నారు. -
రత్నచూడి విత్తనంతో రోగ నిరోధక శక్తి
మల్యాల(చొప్పదండి): వ్యాధుల బారిన పడకుండా దోహదపడే రోగ నిరోధకశక్తి ప్రాధాన్యత గుర్తించి మల్యాల మండలం మానాల గ్రామంలో రైతు రత్నచూడి విత్తనం సాగు చేస్తున్నాడు. పూర్వం రాజులు తినే ఆహారంగా పేరుపొందిన రత్నచూడి విత్తనంతో రోగ నిరోధకశక్తి పెరుగుతుందని, తన సన్నిహితుల ద్వారా తెలుసుకున్న మానాల గ్రామానికి చెందిన రైతు ఎడిపెల్లి మల్లయ్య ఎకరం పొలం సాగు చేశాడు. ప్రయోగాత్మకంగా తన కుటుంబం కోసం రత్నచూడి సాగు చేస్తున్నానని, పెట్టుబడి కూడా తక్కువ అయొందని తెలిపాడు. ఈ పంట బియ్యం సన్నగా, తియ్యగా ఉంటాయని వివరించాడు. -
నల్లా కనెక్షన్లపై స్పెషల్ డ్రైవ్
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నల్లా కనెక్షన్లపై స్పెషల్డ్రైవ్ నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. నగరపాలకసంస్థ పరిధిలో తాగునీటి నల్లా కనెక్షన్ల వివరాల సేకరణకు సర్వే చేయాలన్నారు. విలీన గ్రామాల డివిజన్లతో సహా, నగరవ్యాప్తంగా నల్లా కనెక్షన్ల వివరాలను ఆన్లైన్ చేయాలన్నారు. రిజర్వాయర్ల పరిధిలో సరఫరా వారీగా కమర్షియల్, రెసిడెన్షియల్, డబుల్ నల్లా కనెక్షన్లు, ట్యాన్ నంబర్ల ప్రకారం వివరాలు సేకరించాలన్నారు. నల్లా కనెక్షన్ పొందిన ప్రకారం, పైప్ ఇంచులవారీగా వివరాలు నిర్ణీత ఫార్మాట్లో అందించాలన్నారు. గృహావసరాలకు నల్లా కనెక్షన్లు తీసుకుని, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న నల్లాలను కమర్షియల్ కేటగిరీకి మార్చాలన్నారు. అక్రమ నల్లాలను నియంత్రించాలన్నారు. ట్యాన్ నంబర్ లేకుండా నల్లా కనెక్షన్ ఉంటే అక్రమ నల్లాగా గుర్తించి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి నోటీసులు ఇవ్వాలన్నారు. నల్లా పన్నుల బకాయిలు వసూలు చేయాలన్నారు. బకాయి చెల్లించని వారికి నోటీసులు జారీ చేసి, చెల్లించకుంటే నల్లా కనెక్షన్లు తొలగించాలన్నారు. అక్రమ నల్లాలను తొలగించాలన్నారు. అదేవిధంగా నగరవ్యాప్తంగా వీధిదీపాల నిర్వహణ సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. ఎస్ఈ రాజ్కుమార్, ఈఈలు యాదగిరి, సంజీవ్ కుమార్, డీఈలు ఓంప్రకాశ్, లచ్చిరెడ్డి, దేవేందర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. -
సైకిల్ ర్యాలీ.. రక్తదానం
కరీంనగర్క్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ వా రోత్సవాల సందర్భంగా శనివారం నగరంలో 20 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని సీపీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. బస్స్టేషన్, ప్రతిమ మల్టీప్లెక్స్, గీతాభవన్ చౌరస్తా, పొన్నం కాంప్లెక్స్, కెమిస్ట్ భవన్ మీదుగా కోర్ట్ చౌర స్తా, మంచిర్యాల చౌరస్తా, గాంధీ చౌరస్తా, బోట్ చౌరస్తా, కమాన్ చౌరస్తా, బస్టాండ్ సర్కిల్ నుంచి పరేడ్ గ్రౌండ్కు చేరింది. సీపీ ర్యాలీలో పాల్గొన్న స భ్యులకు మెడల్స్ అందించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, మాధవి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి, మహేశ్ పాసుల, అజయ్ ఖండాల, కిరణ్ పాల్గొన్నారు. పీటీసీలో రక్తదానం పీటీసీలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సీపీ గౌస్ఆలం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్, అడిషనల్ ఎస్పీ ఎం.పిచ్చయ్య మాట్లాడుతూ.. క్యాంపులో సేకరించిన 80 యూనిట్ల రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని బ్లడ్ సెంటర్కు అందిస్తామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ బి.మోహన్, జి.విజయపాల్రెడ్డి, మల్లికార్జున్, గంగాధర్ పాల్గొన్నారు. -
ట్రాన్స్కో ఉద్యోగి డ్రాగన్ బాట
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన కాటం వానారెడ్డి ట్రాన్స్కోలో ఉద్యోగం చేస్తూ ఎకరం భూమిలో డ్రాగన్ప్రూట్ సాగు చేశాడు. పంటమార్పిడి చేయాలన్న ఆలోచనతో అనుభవం లేకున్నా వరికి బదులు డ్రాగన్ప్రూట్ వేశాడు. నెల క్రితం మొదటి పంట చేతికి రాగా, 5 క్వింటాళ్ల వరకు గ్రామంలో కిలోకు రూ.100 నుంచి రూ.150 విక్రయించినట్లు తెలిపాడు. కాగా వరిసాగు చేసే ప్రాంతంలో వానారెడ్డి డ్రాగన్ఫ్రూట్ వేసినట్లు తెలుసుకున్న ఇతర గ్రామాల యువ రైతులు ఇటీవల డ్రాగన్ పంటను సందర్శించారు. రిటైర్డ్ కార్మికుడు.. వినూత్న ఆలోచనలు రామగిరి(మంథని): బొగ్గు గనిలో కార్మికుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టంలేక సాగుపై దృష్టి సారించాడు కల్వచర్ల గ్రామానికి చెందిన వేముల వెంకటేశ్వర్లు. అయితే, సంప్రదాయ పంటలు కాకుండా వినూత్నంగా ఆలోచన చేశాడు. తనకు లాభాలు, ప్రజలకు ఆరోగ్యం తెచ్చిపెట్టే డ్రాగన్ ప్రూట్ సాగుచేయాలని నిర్ణయించాడు. దీంతో ఈ పంట సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గతంలో అల్లం సాగు చేయగా లాభాలు అంతగారాలేదని, తనకున్న ఎకరన్నరలో డ్రాగన్ప్రూట్ పండిస్తున్నాడు. ఇల్లంతకుంట(మానకొండూర్): పంటల సాగులో వైవిద్యం చూపుతున్నారు ఇల్లంతకుంట మండలం దాచారం, రేపాక గ్రామాల రైతులు. దాచారం గ్రామానికి చెందిన కొండం రాజిరెడ్డి ఐదెకరాల్లో 2021లో డ్రాగన్ఫ్రూట్ సాగు చేశాడు. ఎకరాకు రూ.6లక్షల వరకు ఖర్చయింది. నిర్వహణకు ఏటా రూ.50వేలు ఖర్చు అవుతుందని.. రెండేళ్లకు పంట రావడం ప్రారంభించిందని తెలిపారు. ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. గతేడాది కిలోకు రూ.185, ప్రస్తుతం రూ.100 ధర పలుకుతుందని తెలిపారు. డ్రాగన్ఫ్రూట్ పంటను హైదరాబాద్లోని బాటసింగారం పండ్ల మార్కెట్కు తరలిస్తున్నట్లు వివరించాడు. రాజిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని రేపాకకు చెందిన రోడ్ల రాజేందర్రెడ్డి ఎకరం భూమిలో డ్రాగన్ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. -
పోషక ఫలాల సాగు
రామగుండం: అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి లంబాడితండా సమీపంలో పదెకరాల్లో డ్రాగన్, బొ ప్పాయి, నిమ్మ, జామ, సీతాఫలం, అంజీరా, ఆవకాడో తదితర పండ్ల తోటలు సాగు చేస్తున్నాడు. పందెంకోళ్లు, నాటుకోళ్ల పెంపకం కూడా చేపట్టాడు మంచిర్యాలకు చెందిన రైతు గూడ రాంరెడ్డి. నాలు గెకరాల్లో ఎనిమిదేళ్లుగా డ్రాగన్ఫ్రూట్ సాగు చేస్తున్నాడు. రూ.6లక్షల వ్యయంతో పంట వేశాడు. ఎ రువు, పండ్ల కో తకు ఏటా రూ.1.50 లక్షలు వ్య యం చేస్తుంటాడు. గరిష్టంగా 60 క్వింటాళ్ల దిగుబ డి వస్తుందని, మార్కెట్లో రూ.వంద వరకు ధర పలికితే మూడింతల లాభం వస్తుందని రాంరెడ్డి తె లిపాడు. మూడేళ్ల నుంచి బొప్పాయి సాగు ప్రారంభించాడు. ఎకరా విస్తీర్ణంలో వెయ్యి మొక్కలు నాట గా, ఎరువులు, ఇతరత్రా పనులకు రూ.2లక్షలు వె చ్చించాడు. దాదాపు 500 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని మార్కెట్లో కేజీకి రూ.20 పలికినా లాభాలు పొందవచ్చని వివరించాడు. కూలీలు దొరకడం లేదు మాది వ్యవసాయ కుటుంబం. మంచిర్యాలలో వ్యాపారాలున్నాయి. ఇక్కడ ప దేళ్ల క్రితమే పదెకరాలు కొని తొ లుత మిర్చి, ఇతరత్రా కూరగా యలు సాగు చేశా. కూలీల కొరతతో సాగు రకాలు తగ్గించా. రోజూ తోటలు పర్యవేక్షిస్తున్న. – గూడ రాంరెడ్డి, రైతు, బ్రాహ్మణపల్లి -
నేర ప్రవృత్తి.. దూస్తోంది కత్తి!
నిజామాబాద్లో ఇటీవల బైక్ దొంగతనం కేసులో రియాజ్ అనే రౌడీషీటర్ను పట్టుకుని బైక్పై స్టేషన్కు తీసుకెళ్తున్న క్రమంలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ను కత్తితో పొడవడంతో ప్రాణాలు వదిలాడు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో సౌత్, ఈస్ట్జోన్ డీసీపీ చైతన్యపై దోపిడీ దొంగలు కత్తితో దాడికి యత్నించారు. దీంతో డీసీపీ వారిపై రెండు రౌండ్ల కాల్పలు జరపగా... ఒకరు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రౌడీషీటర్లు, చైన్స్నాచర్లపై ఉక్కుపాదం మోపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్లోని 18 ఠాణాల పరిధిలో 578 రౌడీషీటర్లు ఉండగా.. పాతనేరస్తులు, హిస్టరీషీటర్లు, చోరీలకు పాల్పడేవారు, సంఘ విద్రోహశక్తులపై నిఘా పెంచారు.కరీంనగర్క్రైం: కమిషనరేట్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న రౌడీషీటర్లపై నిఘా పెంచారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ, హిస్టరీ షీట్లు తెరుస్తున్నారు. వీరి కదలికలపై దృష్టి పెడుతూ.. ప్రతినెల తమ పరిధిలోని పోలీసుస్టేషన్లలో కౌన్సెలింగ్కు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, మార్పు కనిపిస్తే రౌడీషీట్లు మూసివేస్తామని సున్నితంగా హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 578 మంది రౌడీషీటర్లు కమిషనరేట్వ్యాప్తంగా వివిధ నేరాలకు పాల్పడిన 578 మందిపై పోలీసులు ఇప్పటికే రౌడీషీట్లు తెరిచారు. వీరిలో తీవ్రమైన నేరప్రవృత్తి కలిగిన 15మందిపై పీడీయాక్టు అమలు చేసి, జైలుకు పంపించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచుతూ, సంఘ విద్రోహచర్యలకు పాల్పడేవారిపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని నిర్ణయించారు. రికార్డులో ఉన్న ప్రతీ రౌడీషీటర్ను వ్యక్తిగతంగా పిలిపించి, వారి ప్రస్తుత జీవన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు బైండోవర్ చేస్తున్నారు. కాగా.. చాలా మంది రౌడీషీటర్లకు రాజకీయ నాయకుల అండదండలు ఉంటున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. నేరాలు పునరావృతం కొంతమంది రౌడీషీటర్లు తీరుమార్చుకుని, ప్రస్తుతం చట్టబద్ధంగా జీవనం కొనసాగిస్తుండగా, మరికొందరు వరుస నేరాలకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులు వారిని వేరుచేసి మళ్లీ నేరాల్లోకి వెళ్లేవారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బందితో రౌడీషీటర్లు నివసించే ప్రాంతాలు, వారి కదలికలపై నిఘా పెడుతూ.. ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు. -
‘కబ్జా’లపై హౌసింగ్ అధికారుల కొరడా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలో కబ్జాలపై హౌసింగ్ విభాగం అధికారు ల చర్యలు కొనసాగుతున్నా యి. ‘నయా భూ దందా’ పేరిట గత నెలలో వచ్చిన ‘సాక్షి’ కథనంతో వరంగల్లోని హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ పృథ్విరాజ్ ఆధ్వర్యంలో ఇప్పటికే కాలనీలోని రెండు చోట్ల కబ్జా చేసిన ప్రహరీలను ఇటీవల కూ ల్చివేసి, స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం కాలనీలోని తీగలవంతెనకు వెళ్లే మెయిన్రోడ్డులో ఆక్రమణలను తొలగించారు. దాదాపు పదిగుంటల స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మించిన ప్రహరీ, షెడ్డును నేలమట్టం చే శారు. అత్యంత విలువైన స్థలం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, నగరపాలకసంస్థ అధికారు ల సహకారం తీసుకున్నారు. నగరపాలకసంస్థ ఏసీపీ వేణు, టీపీఎస్ తేజస్విని పాల్గొన్నారు. చొప్పదండి: చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనితీరును ఏటా మెరుగుపరుస్తుండడంతో 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ. 3.41 కోట్ల నికర లాభం ఆర్జించినట్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు గ్రహీత వెల్మ మల్లారెడ్డి తెలిపారు. పట్టణంలోని సహకార సంఘ భవనంలో శనివారం పాలకవర్గ సమావేశం నిర్వహించగా ఆయన మాట్లాడారు. సంఘం ఆదాయం రూ.కోట్లకు చేరడానికి తన నిర్ణయాలకు మద్దతు తెలుపుతు సహరిస్తున్న రైతులకు, పాలకవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం ద్వారా ప్రస్తుత సీజన్లో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రంలో అమ్మకం ద్వారా ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు. వైస్ చైర్మన్ ముద్దం మహేశ్ గౌడ్, సీఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్క్రైం: ట్రాఫిక్ ఆర్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కమాన్ ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. రాంగ్ రూట్లో వస్తున్న టీఎస్22 7090 ద్విచక్రవాహనాన్ని పట్టుకున్నారు. ఆన్లైన్లో తనిఖీ చేయగా.. వాహనంపై రూ.29,560 విలువ గల 120 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. వాహన యజమాని నగరంలోని గణేశ్ నగర్కు చెందిన కటుకోజ్వల కిరణ్ కుమార్ అని తెలిపారు. వాహనాన్ని సీజ్ చేశారు. -
ఉల్లి, పుదీనా..
బోయినపల్లి(చొప్పదండి): ఉ ల్లి, పుదీనా సాగుచేస్తూ రైతు లాభాలు గడిస్తున్నాడు. నీలోజిపల్లికి చెందిన సింగిరెడ్డి బాలమల్లు 15 గుంటల్లో పుదీనా, మరో 5 గుంటల్లో ఉల్లి సాగు చే స్తున్నాడు. పుదీనా ఒక్కసారి నాటితే రెండేళ్ల వరకు దిగుబడి వస్తుంది. 20 గుంటల్లో వేసిన పుదీనాకు రూ.15వేలు పెట్టుబడి పెడితే రూ.లక్ష వరకు దిగుబడి వ స్తుంది. పుదీనా ఒక కటింగ్కు 5 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని, సుమారు 50 సార్లు కోతకు వస్తుందని, క్వింటాల్కు రూ.600–రూ.800 ధర పలుకుతుందని వివరించాడు. నెలరోజుల్లో చేతికి వచ్చే పంట ఉల్లిని రూ.వెయ్యి పెట్టుబడితో 5 గుంటల్లో సాగుచేస్తే 10 క్వింటాళ్ల మేర దిగుబడి వస్తుందని.. రూ.10వేల వరకు దిగుబడి వస్తుందన్నాడు. -
2న స్కాలర్షిప్ పరీక్ష
విద్యానగర్(కరీంనగర్): పేద విద్యార్ధులకు ఫీజు రాయితీతో కూడిన కార్పొరేట్ విద్య అందించేందుకు నవంబర్ 2న పదోతరగతి విద్యార్థులకు శ్రీచైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు చైర్మన్ ఎం.రమేశ్రెడ్డి తెలిపారు. స్కాలర్షిప్ పరీక్షల పోస్టర్లను శనివారం కరీంనగర్లోని శ్రీచైతన్య కళాశాలలో ఆవిష్కరించారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభ ఆధారంగా వందశాతం ఫీజు రాయితీతో కూడిన విద్యను అందించడానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష, రిజిస్ట్రేషన్ వివరాలకు 9848587584, 9912349038 నంబర్లను సంప్రదించాలని సూచించారు. పరీక్ష రాసే విద్యార్థులకు లక్కీడ్రా నిర్వహిస్తామని, మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ, రెండో బహుమతిగా సైకిల్, మూడో బహుమతిగా సెల్ఫోన్ అందిస్తామని అన్నారు. కళాశాల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, జూనియర్ కళాశాలల డీన్ జగన్ మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పాఠ్యప్రణాళికా సంఘం సభ్యుడిగా మోహన్సిరిసిల్లకల్చరల్: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు పాఠ్య ప్రణాళికా సంఘం సభ్యుడిగా జిల్లాకు చెందిన కవి, కేంద్రసాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ ఎంపికయ్యారు. రెండేళ్లపాటు కొనసాగనున్నారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కన్సల్టేటీవ్ కమిటీ సభ్యుడిగా, అగ్రహారం డిగ్రీ కళాశాల ప్లానింగ్, డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ బుక్ ట్రస్టు దక్షిణ ప్రాంత అధికారిగా, తెలుగు సంపాదకుడిగా కొనసాగుతున్నారు. -
సేద్యం.. ఆరోగ్యం.. ఆదాయం
మూడెకరాలు.. పది పంటలు సిరిసిల్ల: సిరిసిల్ల శివారులోని పెద్దబోనాలకు చెందిన రైతు దొంతుల బాలరాజు మూడెకరాల్లో పది రకాల కూరగాయలు పండిస్తున్నాడు. బాలరాజుది నేతకార్మిక కుటుంబం. వాళ్ల తాతలు మగ్గం నేశారు. వస్త్రపరిశ్రమలో బతుకుదెరువు లేక బాలరాజు తండ్రి చంద్రయ్య వ్యవసాయం చేశాడు. తండ్రి బాటలో పయనిస్తూ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా వ్యవ‘సాయం’ సాగిస్తున్నాడు. ఐదో తరగతి వరకు చదువుకున్న బాలరాజు మూడెకరాల ఎర్రభూమిలో పూదీనా, క్యాబేజీ, టమాటా, వంకాయ, మిర్చి, పచ్చకూర, పాలకూర, తోటకూర, కొత్తిమీర, మెంతి సాగు చేశాడు. మరోవైపు బహువార్షిక పంటలైన కరివేపాకు, జామా, మామిడి, నిమ్మ చెట్లను పెంచాడు. ఒక్కో పంటను రెండు నుంచి ఐదు గుంటల విస్తీరణంలో వేస్తాడు. కాలానుగుణంగా మార్కెట్లో డిమాండ్ను బట్టి ఆయా పంటలు వేసుకుంటున్నాడు. పట్టుదలే పెట్టుబడిగా బాలరాజు నిత్యం వ్యవసాయ క్షేత్రంలోనే తల్లి, భార్యతో కలిసి శ్రమిస్తున్నాడు. భూసారాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ ఎరువులు వేస్తూ మంచి దిగుబడి సాగిస్తున్నాడు. నిత్యం తన పొలంలో ఓ నలుగురు కూలీలకు పని కల్పిస్తున్నాడు. ట్యాలీఆటో కొనుగోలు చేసి హోల్సేల్గా ఫంక్షన్లకు కూరగాయలు సరఫరా చేస్తాడు. తాను పండించిన కూరగాయలను సిరిసిల్ల మార్కెట్లో విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు.కూరగాయల పంటలు తక్కువ రోజుల్లో చేతికి వచ్చి మార్కెట్లో అమ్ముకోవచ్చు. వ్యవసాయంలో నాన్న చంద్రయ్యనే స్ఫూర్తి. ఆయన 25 ఏళ్ల కిందటే అనేక రకాల పంటలను సాగు చేసి మాకు బాటలు వేశారు. ఇప్పుడు అదే భూమిలో కూరగాయలు పండించడం, మార్కెట్లో అమ్ముకోవడంతో వ్యాపారం బాగుంది. – దొంతుల బాలరాజు, రైతు, పెద్దబోనాల -
పకడ్బందీగా ఎస్ఐఆర్ జాబితా
కరీంనగర్ అర్బన్: ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటరు జాబితా పకడ్బందీగా తయారు చేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎస్ఐఆర్పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 2002 ఎస్ఐఆర్తో 2025 స్పెషల్ సమ్మరీ రివిజన్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్స్థాయి అధికారులు వేగవంతంగా నిర్వహిస్తున్నారని వివరించారు. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్లో భాగంగా కేటగిరీ ‘ఏ’ను బీఎల్వో యాప్ ద్వారా ధృవీకరిస్తామని, కేటగిరీ సి,డి లింక్ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు. ఈఆర్వో కార్యాలయంలో ఇద్దరు బూత్ స్థాయి అధికారులను ప్రత్యేకంగా కేటాయించి శనివారం నాటికి మ్యాపింగ్ పూర్తి చేస్తామని అన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని రైతు ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్ గ్రామానికి చెందిన గీట్ల లక్షా మరెడ్డి(64) అనే రైతు ఉరివేసుకొని శనివారం సాయంత్రం మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బా ధపడుతున్న రైతు.. మనస్తా పంతో పొలం సమీపంలోని చెట్టుకు ఉరివేసుకొని మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య విజయ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేశారు. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి.. శంకరపట్నం: ఏరడపల్లి గ్రామంలో శనివారం రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కనకం రాజయ్య(67) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య.. ఫోన్ద్వారా తన కుమారులు, మనుమలతో మాట్లాడారు. తన ఇంటికి రావాలని కోరాడు. ఆ తర్వాత ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బావిలో దూకి వృద్ధురాలు.. సారంగాపూర్: మండలంలోని పెంబట్లకు చెందిన గాజెంగి జమున (60) శనివారం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం..జమున భర్త రాజేశం పదేళ్ల క్రితం మృతిచెందాడు. బీడీలు చుడుతూ వచ్చిన సొమ్ముతో పెద్ద కూతురుకు పెళ్లి జరిపించింది. కూతురుకు విడాకులు కావడంతో మనోవేధనకు గురవుతోంది. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడింది. మనస్తాపంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. జమున కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో.. సిరిసిల్ల అర్బన్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో జీవితంపై విరక్తి చెందిన వ్యక్తి శనివారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్నగర్కు చెందిన షేక్ అహ్మద్(57) పెద్దూరులోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉంటున్నారు. ఇటీవల అహ్మద్ కాలుకు తీవ్ర గాయమైంది. అది నయంకాకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈక్రమంలోనే ఇంట్లోని కిటికికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య కాపురానికి రావడం లేదని.. గోదావరిఖని: భార్య కాపురానికి రావడం లేదనే మనస్తాపంతో నగరంలోని మార్కండేయ కాలనీకి చెందిన గంధం రాంకీ(29) క్రిమిసంహాక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. రెండున్నరేళ్లుగా భార్యతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈక్రమంలో ఈనెల 20న క్రిమిసంహారక మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలిస్తుండగా శుక్రవారం రాత్రి మార్గమధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
శుక్రవారం శ్రీ 24 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
మేం.. గురి పెడితే..పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం కమిషనరేట్ కేంద్రంలోని పరేడ్గ్రౌండ్లో ఓపెన్ హౌస్ నిర్వహించారు. కార్యక్రమాన్ని సీపీ గౌస్ఆలం ప్రారంభించారు. నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు పాల్గొని, వివిధ రకాల తుపాకులు పరిశీలించారు. పోలీసులు పరికరాలపై అవగాహన కల్పించారు. డాగ్స్క్వాడ్, గన్స్, స్మోక్గన్స్, షెల్స్, బాంబు నిర్వీర్య విభాగం పనితీరు, ఫ్రెమ్ మెటల్ డిటెక్టర్లు, కమాండ్ కంట్రోల్ వాహనం, వజ్ర వాహనాన్ని ప్రదర్శనలో ఉంచారు. షీటీం, సైబర్క్రైం, యాంటీ నార్కోటిక్ సెల్, ట్రాఫిక్ విభాగానికి చెందిన స్టాళ్లను గురించి వివరించారు. ఒక్కో విభాగాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. వివిధ విభాగాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. – కరీంనగర్క్రైం -
నేటి నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు
కరీంనగర్ అర్బన్: ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టింది. కపాస్ కిసాన్ యాప్ ద్వారానే విక్రయాలు జరిగేలా పక్కా చర్యలు చేపట్టింది. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమి టీ పరిధిలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. వైభవ్ కాటన్ కార్పొరేషన్, ఆదిత్య కాటన్ ఆయిల్ ఆగ్రో టెక్ ఇండస్ట్రీస్, సరిత కాటన్ ఇండస్ట్రీస్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబో ద్దీన్ ప్రారంభించనున్నారు. రైతులు తప్పనిసరిగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని పత్తి తేవాలని వ్యవసాయ మార్కెటింగ్శాఖ అధికారులు వివరించారు. స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే కొనుగోలు చేయరని, స్లాట్ బుకింగ్ సమయంలో ఇబ్బందులున్నా, స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోయినా దగ్గరలోని ఏఈవో లేదా వ్యవసాయ మార్కెట్ కమిటీని సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేయగా రైతులు కనీస మద్దతు ధర రూ.8110 పొందాలంటే పత్తిలో 8శాతం తేమ మించకుండా చూసుకోవాలని కోరారు. తేమ 12శాతం కన్నా ఎక్కువుంటే సీసీఐ కొనుగోలు చేయదని స్పష్టం చేశారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చేటప్పుడు తప్పకుండా తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కు అనుసంధానం కలిగిన సెల్ఫోన్ వెంట తేవాలని సూచించారు.జమ్మికుంటలో క్వింటాల్ పత్తి రూ.7,100 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,100 పలికింది. గురువారం 124 వాహనాల్లో 1,040 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. మోడల్ ధర రూ.6,700, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. -
ప్రజలకు ఇబ్బంది లేకుండా చెత్త డంప్చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: స్థానిక ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డంప్యార్డులో చెత్తను వేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని డంప్యార్డ్ను సందర్శించారు. నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను డంప్యార్డ్ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ పడవేస్తున్నారనే స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. వాహనాల్లో తీసుకొచ్చిన చెత్తను డంప్యార్డ్కు వెళ్లే రోడ్డుపైనా, గేట్ ముందు పడేయొద్దన్నారు. క్రమపద్ధతిలో డంప్ చేయాలన్నారు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త, ఎత్తుపల్లాలను సరి చేయాలన్నారు. చెత్తను తీసుకువచ్చే వాహనాలు డంప్యార్డ్ లోపలికి సులువుగా వెళ్లేలా రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి రోజు చెత్త వాహనాలు డంప్ యార్డుకు వచ్చే సమయంలో ప్రత్యేకంగా ఒక వ్యక్తిని నియమించి, వాహనాలు లోపలికి వెళ్లి క్రమపద్ధతిలో చెత్తను డంప్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్ కుమార్, డీఈ లచ్చిరెడ్డి, ఎంహెచ్వో సుమన్ పాల్గొన్నారు.చట్టాలపై అవగాహన పెంచుకోవాలివిద్యానగర్(కరీంనగర్): మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవ అధికారి, న్యాయమూర్తి వెంకటేశ్ సూచించా రు. నగరంలోని అశోక్నగర్లో ప్రకృతి పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శక్తిసదన్ను గురువారం సందర్శించారు. శక్తిసదన్లో ఆశ్రయం పొందుతున్న మహిళలకు చట్టా లపై అవగాహన కల్పించారు. శక్తిసదన్ సూపరింటెండెంట్ ఎ.రమదేవి. వసంత, రజిత, భాఽగ్యలక్ష్మి పాల్గొన్నారు. కరీంనగర్టౌన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుండె సమస్యలతో బాధపడుతున్న 0–18 సంవత్సరాల పిల్లలకు జిల్లా మాత శిశు ఆరోగ్య కేంద్రంలో గురువారం హైదరాబాద్ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య నిర్ధారణ శిబిరం నిర్వహించారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆర్బీఎస్కే బృందాల ద్వారా 76మంది పిల్లలు హాజరయ్యారు. ఇందులో 29మందికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ధారించా రు. వీరికి అపోలో హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేయనున్నారు. శిబిరం శుక్రవారం కూడా కొనసాగనుంది. డీఎంహెచ్వో వెంకటరమణ పిల్ల ల తల్లిదండ్రులతో మాట్లాడారు. వైద్య సేవలు అందుతున్న తీరును పరిశీలించారు. డీఐవో డాక్టర్ సాజిద, జిల్లా ఉప వైద్యాధికారి రాజ గోపాల్రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్ఎంవో నవీనా, డీపీవో స్వామి, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్– కార్డియాలజిస్ట్ వైద్యులు అమూల్ గుప్త, సిటి సర్జన్ సునీల్ కుమార్ సేన్ పాల్గొన్నారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీలో జరుగుతున్న ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. వీసీ ఉమేశ్ కుమార్ ఆర్ట్స్ కళాశాల పరీక్షకేంద్రాన్ని సందర్శించి, పరీక్షలు తీరును పరిశీలించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, మూల్యాంకనం కూడా త్వరగా పూర్తిచేసి ఫలితాలను సకాలంలో విడుదల చేస్తామని అన్నారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, హరికాంత్ పాల్గొన్నారు. కాగా మాస్కాపీయింగ్కు పాల్పడిన నలుగురిని డిబార్ చేయాలని వీసీ ఆదేశించారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రామడుగు: ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెదిర గ్రామంలో గురువా రం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ.. రైతులు దళారీలకు ధాన్యం అమ్ముకోవద్దని, ప్రభుత్వ కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర అందిస్తోందన్నారు. అనంతరం కొక్కెరకుంట, రంగసాయిపల్లి, మోతె, దత్తోజీపల్లి, శ్రీరాములపల్లి, షానగర్ గ్రా మాల్లో కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. గోపాల్రావుపేట మార్కెట్ కమి టీ చైర్మన్ బొమ్మరవేని తిరుపతి, కొక్కెరకుంట సింగిల్ విండో చైర్మన్ మురళీకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఈ నీరు తాగితే రోగాలే..
మానకొండూర్: మానకొండూర్ మండలం వన్నారం గ్రామంలో నెలరోజులుగా నల్లానీరు రంగుమారి, దుర్వాసన వస్తోంది. తాగేందుకు బోరు, బావినీరు లేకపోవడంతో నల్లానీరే దిక్కవుతోంది. కొద్దిరోజులుగా వ్యర్థాల వాసన వస్తుండగా.. ఆ నీరు తాగితే రోగాలపాలై ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులకు చెప్పినా నామమాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామం నుంచి గంగిపల్లికి వెళ్లే దారిలో పోచమ్మ వీధి(4వవార్డు)లో 30 నివాస గృహాలున్నాయి. 200మంది వరకు చిన్నా, పెద్దలుంటారు. ఈ వీధిలో తాగేందుకు నల్లానీరు తప్పా వేరే ఆధారం లేదు. నెలరోజులుగా నల్లానీటిలో మలం వాసన, ఆనవాళ్లతో పాటు, వ్యర్థాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. విషయాన్ని గ్రామ కార్యదర్శికి తెలపగా.. ఎక్కడైనా నల్లానీరు లీకేజీలు ఉన్నాయా..? అని పలుచోట్ల తవ్వకాలు చేపట్టారు. అయినా ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. నెలరోజులుగా నీరు తాగడం లేదని, కనీస అవసరాలకు కూడా ఉపయోగించే పరిస్థితి లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. కొందరు వాటర్ ప్లాంట్ నుంచి నీరు తెచ్చుకుంటుండగా.. వృద్ధులు, మరికొందరు నల్లానీరే తాగుతున్నారు. దీంతో పలువురు జ్వరాల బారిన పడుతున్నారని చెబుతున్నారు. అధికారులు స్పందించి నూతన పైప్లైన్ ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళనకు దిగుతాయని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. -
ఆడనా.. అయితే తీసేయ్!
జిల్లాలోని ఓ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.. కొడుకు కావాలని మూడో సంతానం కోసం ప్రయత్నించారు. ఐదో నెల గర్భంలోనే ఎవరనేది చెబుతారని ఓ ఆర్ఎంపీ వారికి సలహా ఇచ్చాడు. దంపతులను తీసుకొని జిల్లాకేంద్రానికి వచ్చాడు. తెలిసిన స్కానింగ్ సెంటర్లో లింగనిర్ధారణ చేయించాడు. ఆడపిల్ల అని తేలడంతో అబార్షన్కు సిద్ధమయ్యారు. ఈ సమయంలో అబార్షన్ చేస్తే తల్లి ప్రాణాలకే ప్రమాదమనే వైద్యుల సూచనలతో ఆలోచనను విరమించుకున్నారు. ‘ఓ చిన్ని పిచ్చుక.. చిన్నారి పిచ్చుక’ అంటూ కలెక్టర్ పమేలా సత్పతి ఇటీవల స్వయంగా ఓ గీతాన్ని ఆలపించారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పాడారు. ఈ సృజనాత్మక ప్రయత్నం లింగహింస, అక్రమ లింగ నిర్ధారణ, ఆడ శిశు హత్య– శిశు హత్యలపై అవగాహన పెంపొందించడానికి రూపొందించబడిందని పేర్కొన్నారు. ఆడపిల్ల గొప్పతనం.. ఆడపిల్లను బతకనిద్దాం.. మంచి జీవితాన్నిద్దాం అంటూ సారాంశంగా వివరించారు. ప్రతీ ఒక్కరు ఆడపిల్లకు మంచి చదువునివ్వాలని సూచించారు.స్కానింగ్ సెంటర్లు: 195 మూసివేసినవి: 53 నిర్వహిస్తున్నవి: 142 ప్రైవేటు ఆస్పత్రులు: 286 మెడికల్ కళాశాలలు: 02 కరీంనగర్: సాంకేతిక పరిజ్ఞానంతో సమానంగా పరిగెడుతున్న కాలంలో ఆడపిల్లపై ఇంకా వివక్ష తగ్గడం లేదు. ఉన్నత చదువులు చదువుకున్నా.. ఆడపిల్ల అంటే అలుసుగానే చూస్తున్నారు. మగవారితో సమానంగా చదువు, ఉద్యోగం ఇలా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నా.. తల్లి గర్భంలోనుంచి భూమిపై అడుగు పెట్టనివ్వడం లేదు. అమ్మ ఎదపై ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ‘ఆడబిడ్డను బతకనిద్దాం.. బతుకునిద్దాం’ అని ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. కొందరిలో మార్పురావడం లేదు. జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ జరుగుతోంది. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. గర్భంలోనే చిదిమేస్తున్నారు. వరుసగా తనిఖీలు జిల్లా వైద్యారోగ్యశాఖ స్కానింగ్ సెంటర్లలో వరుస తనిఖీలు చేస్తోంది. పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో అనుమతులు లేని స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ఇస్తోంది. అయినప్పటికీ అబార్షన్ల దందా ఆగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పవిత్రమైన వైద్యవృత్తిలో ఉంటున్న కొందరు డబ్బు కు దాసోహమై కడుపులోని ఆడబిడ్డలను కడతేరుస్తున్నారు. లింగ నిర్ధారణ నేరమని చెప్పాల్సిన వైద్యులే అక్రమ దందాకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలకు ఒడిగడుతున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. కడుపులోనే చిదిమేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా పల్లెలు, పట్టణాల్లోని ఆర్ఎంపీలు, పీఎంపీల సహకారంతో జిల్లాలో లింగ నిర్ధారణ దందా సాగుతోందని సమాచారం. కొంతమంది ఆర్ఎంపీలు మగపిల్లాడి కోసం ఎదురుచూసే అమాయకులను మభ్యపెట్టి ధనార్జనే ధ్యేయంగా స్కానింగ్ సెంటర్లకు పంపిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిస్తే ముందస్తుగా ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లకు పంపించి గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. తెలంగాణ సామాజిక ఆర్ధిక నివేదిక ప్రకారం ప్రతి 1,000 మంది మగశిశువులకు జిల్లాలో 946 మంది ఆడశిశువుల జననాలు నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. మగవారికి అధిక ప్రాధాన్యమివ్వడం, భ్రూణహత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలతో ఈ అంతరం పెరుగుతోంది.గర్భస్థ శిశు లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలుచేస్తున్నాం. కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసు, ఇతరశాఖల సమన్వయంతో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేస్తున్నాం. నిబంధనలు పాటించని వారికి నోటీసులు జారీ చేస్తున్నాం. సమాధానాలు ఇవ్వకపోతే సీజ్ చేస్తున్నాం. లింగ నిర్ధారణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్వో, కరీంనగర్ -
నషా ముక్త్ రంగోళి
కరీంనగర్టౌన్: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళలు, పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధులశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ క్లబ్ వద్ద రోడ్డుపై కళాశాల విద్యార్థులు, మహిళలకు రంగోళి పోటీలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై 27మంది వేసిన రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ముగ్గులను పరిశీలించిన కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. సీడీపీవో సబిత, నర్సింగరాణి, సుగుణ, శ్రీలత, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ తిరుపతి పాల్గొన్నారు. -
అర్బన్లో త్రిముఖ పోరు
తొలి రోజు: 05, రెండో రోజు: 27 చివరి రోజు: 33కరీంనగర్ అర్బన్: అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. నిన్నటి వరకు రెండు వర్గాల మధ్యే పోటీ ఉండగా తాజాగా మూల వెంకటరవీందర్రెడ్డి వర్గంతెరపైకి రాగా ప్యానెల్తో సహా నామినేషన్ వేశారు. దీంతో కర్ర రాజశేఖర్, గడ్డం విలాస్రెడ్డి, వెంకటరవీందర్రెడ్డి వర్గాల మధ్య పోరు నెలకొంది. ఎవరికి వారుగా ప్యానెల్ను సిద్ధం చేసుకోగా నామినేషన్లు తిరస్కరణకు గురవకుండా రెండు, మూడు సెట్లతో వేశారు. గురువారం 33 నామినేషన్లు దాఖలవగా 12 డైరెక్టర్ పోస్టులకు 73 వచ్చాయని ఎన్నికల అధికారి సీహెచ్.మనోజ్కుమార్ వివరించారు. ఎక్కువగా కరీంనగర్ నుంచి రంగంలో ఉండగా జగిత్యాల నుంచి నలుగురు బరిలో ఉన్నారు. చివరి రోజున 33 నామినేషన్లు గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశా రు. జనరల్ స్థానాలకు 23, ఎస్సీ, ఎస్టీ స్థానానికి 6, మహిళా కేటగిరీకి 4 నామినేషన్లు వేశారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్లలో రెండు మహిళలకు రిజర్వ్ చేయగా ఒకటి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మహిళలకు సంబంధించి ఏడుగురు బరిలో ఉండగా ఎస్సీ, ఎస్టీ స్థానానికి 11మంది పోటీపడుతున్నారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు. ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు ప్రక్రియ సాగనుండగా తదుపరి జాబితాను ప్రకటించనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా 26నుంచి అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమవనున్నారు. ప్యానెళ్లపై గురి రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా ఎన్నికలు జరుగుతుండగా ఎవరికి వారుగా ప్యానెళ్లను సిద్ధం చేసుకుంటున్నారు. బలమైన అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తుండటంతో ప్యానెళ్లను ప్రకటించేందుకు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్రావు మద్దతుతో బరిలో ఉన్నానని ప్రకటించిన వెంకటరవీందర్రెడ్డి మాత్రం తన ప్యానెల్ను ప్రకటించారు. తనతో పాటు ఈ.లక్ష్మణ్రాజు, అనురాస్ కుమార్, వజీర్ అహ్మద్, నార్ల శ్రీనివాస్, ఉయ్యాల ఆనందం, చిదం శ్రీనివాస్, గాదె కార్తీక్, కూసరి అనిల్, సరిళ్ల రతన్రాజు, మునిపల్లి ఫణిత, దామెర శ్రీలత బరిలో ఉంటారని వెల్లడించారు.కేటగిరీ డైరెక్టర్ల సంఖ్య నామినేషన్లు జనరల్ 09 55 మహిళ 02 07 ఎస్సీ,ఎస్టీ 01 11 మొత్తం 12 73నామినేషన్ల పరిశీలన: 24న ఉపసంహరణ: 25న పోలింగ్: నవంబర్ 1 పాలకవర్గం ఎన్నిక: నవంబర్ 4లోపు -
పొలానికి నిప్పు పెట్టిన రైతు
పాలకుర్తి(రామగుండం): ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు దోమపోటు సోకడంతో కాపాడుకునేందుకు ప్రయత్నించి విసుగుచెందిన రైతు.. చివరకు పంటకు నిప్పు పెట్టిన సంఘటన పాలకుర్తి మండలం బసంత్నగర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పర్శవేన శ్రీనివాస్ తన రెండెకరాల్లో ఈసారి సన్నరకం వరి వేశాడు. దాదాపు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాడు. మరికొద్దిరోజుల్లో పంట కోసేందుకు సిద్ధమయ్యాడరు. ఈక్రమంలో వరికి దోమపోటు సోకింది. ఇప్పటికే నాలుగుసార్లు పురుగులమందు పిచికారీ చేశాడు. అయినా.. దోమపోటు అదుపులోకి రాలేదు. విసుగుచెందిన రైతు.. బుధవారం పంటకు నిప్పుపెట్టాడు. ఆరుగాలం కష్టించి పండించిన పంట చివరిదశలో ఉండగా సోకిన తెగులుతో కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతు శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ధర్మపురిలో రెండిళ్లలో చోరీ
ధర్మపురి: తాళం వేసి ఉన్న రెండిళ్లలో చోరీకి పాల్పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన కొరిడె సత్తయ్య జర్మనీలో ఉంటున్న తన కూతురు వద్దకు ఇటీవల వెళ్లాడు. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాందేవి దీపావళి సెలవుల కోసం సొంతూరుకు వెళ్లాడు. ఈ రెండిళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. నాందేవి బుధవారం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. రూ.15వేలు, అర తులం బంగారం, సత్తయ్య ఇంట్లో తులంనర బంగారం, వెండి పత్ర మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
రామడుగు: రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు చేని నర్సవ్వ(106) బుధవారం ఆనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సవ్వకు ముగ్గురు కొడుకులు, కుతురు ఉన్నారు. ప్రస్తుతం వారి మొత్తం కుటుంబ సభ్యులు 68మంది వరకు ఉంటారని గ్రామస్తులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి..జమ్మికుంట: పట్టణంలోని రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై గుర్తు తెలియని 65ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడు. మృతుని వద్ద ఎలాంటి అధారాలు లేవు. లేత ఆకుపచ్చ కలర్ టీషర్ట్, తెలుపు ధోతి ధరించి, చేతి కర్రతో ఉన్నాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఎవరైనా తెలిసినవారుంటే 9949304574, 8712658604 నంబర్ను సంప్రదించాలని సూచించాడు. కోనరావుపేట(వేములవాడ): సెల్టవర్ పైనుంచి దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని మామిడిపల్లిలో విషాదం నింపింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన గుమ్మడి దేవయ్య–సరవ్వ కుమారుడు బాబు(32) కొన్నాళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి దసరా పండుగకు ముందు స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలోనే ఉంటున్న బాబు బుధవారం రాత్రి ఎన్గల్కు వెళ్లే దారిలోని టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న భార్య, గ్రామస్తులు టవర్ ఎక్కి కాపాడే ప్రయత్నం చేస్తుండగానే పై నుంచి దూకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. కాగా గతంలో కూడా పలుమార్లు టవర్పైకి ఎక్కి ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. మృతునికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. జర్మనీలో నర్సింగ్ కోర్సువిద్యానగర్(కరీంనగర్): జర్మనీలో ఆరోగ్య సంరక్షణ కార్మికులకు, నర్సులకు అధిక డిమాండ్ ఉన్నందున అక్కడ నర్సింగ్ మూడేళ్ల ఇంటర్నేషనల్ డిగ్రీ చదవడానికి తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ అవకాశం కల్పిస్తోందని, జిల్లా ఉపాధి కల్పనాధికారి వై.తిరుపతి రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకునే సమయంలో మూడేళ్లపాటు రూ.లక్ష స్టైఫండ్, నర్సుగా నెలకు రూ.3లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉందన్నారు. ఇంటర్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది, 18 నుంచి 28 ఏళ్లోపు వయసువారు అర్హులని, ఎంపికై న అభ్యర్థులను జర్మనీకి పంపించే ముందు హైదరాబాద్లో జర్మన్ భాషలో తొమ్మిది నెలల పాటు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలపారు. ఆసక్తి ఉన్నవారు 63022 92450, 94400 51763 నంబర్లలో సంప్రదించాలని, అభ్యర్ధులు తమ రెజ్యూమ్ను tomcom. recruitment manager@gmail.comకు ఈనెల 30లోగా పంపాలని సూచించారు. వీడియో వైరల్పై సీరియస్వేములవాడ: రాజన్న ప్రసాదాల ప్రధాన గోదాంలో నుంచి ఓ ఉద్యోగి సరుకులు తరలిస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారడాన్ని రాష్ట్ర దేవాదాయశాఖ సీరియస్గా పరిగణించింది. ఆలయ ఈవో రమాదేవి, ఏఈవోలు, ఇతర అధికారులు భీమేశ్వర సదన్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో కనిపించిన ఉద్యోగులను వేర్వేరుగా విచారించగా.. ఆలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఉద్దేశ్యపూర్వకంగానే ఇద్దరు ఔట్సోర్సింగ్ సిబ్బందితో ఈ వీడియో రికార్డింగ్ చేయించినట్లు సీసీ కెమెరా ఫుటేజీల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సదరు ఉద్యోగి తనని తాను రక్షించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్లు ప్రచారంలో ఉంది. గోదాంలోని అధికారి.. సిబ్బందిని విధులు సరిగ్గా నిర్వహించాలని ఆదేశించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. వీడియో రికార్డింగ్ చేయించిన ఉద్యోగిపై త్వరలోనే శాఖాపరమైన చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గోదాంలోని సరుకులు పక్కదారి పట్టకుండా ఇక నుంచి ప్రతీ 15 రోజులకోసారి తూకం వేసి లెక్కలు చూడాలని ఈవో రమాదేవి ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
పోస్టల్ బీమా.. జీవితానికి ధీమా
బోయినపల్లి(చొప్పదండి): పోస్టల్శాఖలోని బీమా పథకాలు.. పేదల్లో ధీమా పెంచుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నేటి రోజుల్లో ఓ బీమా పథకంలో చేరితే కుటుంబానికి ధీమాగా ఉంటుందని పేద, మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. ఈక్రమంలోనే పోస్టల్శాఖపై ఉన్న నమ్మకంతో ఆ శాఖ అమలు చేస్తున్న పథకాలలో చేరుతున్నారు. తక్కువ ప్రీమియంతో అధిక బీమా వర్తిస్తుండడంతో ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా రోడ్డు ప్రమాదాలు.. విద్యుత్షాక్, పాముకాట్లు ఇలా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా ఆసరాగా ఉంటుందని పోస్టల్ శాఖ ప్రమాద బీమాలో చేరుతున్నారు. ఆస్పత్రుల్లో పెద్ద మొత్తంలో బిల్లులు చెల్లించేందుకు పలువురు ఆస్తులు అమ్ముకోవడం చూస్తున్న ప్రజలు ప్రమాదమీమా చేయించుకుంటున్నారు. ఐపీపీబీ పథకంలో ప్రమాద బీమా ఐపీపీబీ(ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్) వారు ప్రమాద బీమా విషయంలో టాటా ఏఐజీ, నివాబుపా, ఆదిత్య బిర్లా క్యాపిటల్, స్టార్, బజాజ్ అలియంజ్, రాయల్ సుందరం, రిలయన్స్ తదితర సంస్థలతో కలిసి ప్రమాదబీమా ప్రవేశపెట్టినట్లు ఐపీపీబీ కరీంనగర్ మేనేజర్ మధుమోహన్ తెలిపారు. డివిజన్లో ఇప్పటి వరకు 34,500 వరకు ఈ పాలసీలు చేసినట్లు వివరించారు. పోస్టల్ శాఖ వారి ఐపీపీబీ ఖాతాదారునికి మాత్రమే సామూహిక ప్రమాదబీమా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరాలంటే మొదట రూ.200 చెల్లించి ఐపీపీబీలో ఖాతా తీయాలి. అనంతరం సామూహిక ప్రమాదబీమాకు వార్షిక ప్రీమియం చెల్లించాలి. కరీంనగర్ డివిజన్ పోస్టల్ సమాచారం హెడ్ పోస్టాఫీసులు : కరీంనగర్, జగిత్యాల సబ్ పోస్టాఫీసులు : 52 బ్రాంచ్ పోస్టాఫీసులు : 389 ఇప్పటి వరకు చేసిన బీమా పాలసీలు : 34,500 తక్కువ ప్రీమియం.. ఎక్కువ ప్రయోజనాలు పోస్టల్ శాఖ కొత్త పథకాలతో పేదలకు లబ్ధి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరు పెద్ద మొత్తంలో ప్రీమియం వెచ్చించి ప్రమాద బీమా చేసుకుంటున్నారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఆధ్వర్యంలో టాటా ఏఐజీ, బజాజ్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, నివాబుపా, రాయల్ సుందరం తదితర సంస్థలతో కలిసి గ్రూప్ యాక్సిడెంట్ పాలసీని ప్రవేశపెట్టింది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకంలో చేరాలనుకునే వారు సమీప పోస్టాఫీసులో సంప్రదించాలి. – మధుమోహన్ కంది, ఐపీపీబీ, సీనియర్ మేనేజర్ కరీంనగర్ -
ఇరాక్లో పెగడపల్లి వాసి మృతి
పెగడపల్లి: స్వదేశానికి వచ్చేందుకు రెండు రోజులు క్రితం విమాన టికెట్టు బుకింగ్ చేసుకున్న వలస జీవి.. అంతలోనే గుండెపోటుతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలకేంద్రానికి చెందిన లింగంపల్లి రమేశ్ (55) ఉపాధి నిమిత్తం రెండేళ్ల క్రితం ఇరాక్ వెళ్లాడు. స్వదేశానికి వచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రమేశ్ గుండెలో నొప్పిగా ఉందంటూ చెప్పగా.. తోటిమిత్రులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారమందింది. క్షేమంగా ఇంటికొస్తాడని అనుకుంటున్న సమయంలో ఇలా గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రమేశ్కు భార్య, కుమారుడు, కూతురున్నారు. ఇంటికొచ్చేందుకు టికెట్ బుకింగ్.. అంతలోనే గుండెపోటు -
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు..
ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: బంధువుల అంత్యక్రియలకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగిన ప్రమాదం కోనరావుపేట మండలం సుద్దాలలో విషాదాన్ని నింపింది. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన దొబ్బల మరియమ్మ(58) అల్మాస్పూర్లో బంధువుల ఇంట్లో ఒకరు చనిపోగా బైక్పై తన చిన్నకుమారుడు ప్రభాకర్తో కలిసి వస్తుంది. ఈక్రమంలో అక్కపల్లి శివారులోని బుగ్గరాజేశ్వరస్వామి ఆలయం వద్ద గల మూలమలుపు వద్ద వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కిందపడింది. తలకు బలమైన గాయాలు కావడంతో ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పనిచేస్తున్న మరియమ్మ అంత్యక్రియలు సుద్దాలలో గురువారం నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి -
వైభవంగా కార్తీక దీపోత్సవం
వేములవాడ: రాజన్న అనుబంధ భీమేశ్వరస్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగాయి. శ్రీలలితసేవా సమితి సభ్యులు వివిధ ఆకృతుల్లో పూలను పేర్చి అందులో దీపాలు వెలిగించారు. రాజన్న ఆలయంలో ఆకాశదీపం కార్తీకమాసం సందర్భంగా రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపాన్ని ఆలయ అర్చకులు వెలిగించారు.అభిషేక ప్రియుడికి కోటి దండాలు వేములవాడ: రాజన్నను బుధవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. రాజన్న, భీమన్న ఆలయాల్లో దర్శనాలు, కోడెమొక్కులు కొనసాగాయి. రాజన్న ఆలయంలో అభిషేకాలు అత్యధికంగా జరిగాయి. ఆలయంలో పనులు జరుగుతుండడంతో గంటసేపు దర్శనాలు నిలిపివేశారు. ఏర్పాట్లను ఈవో రమాదేవి, ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు నునుగొండ రాజేందర్ పరిశీలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సతీమణి అపర్ణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. రాజన్న ఆలయంలోని గండాదీపంలో ఆకాశదీపం వెలిగిస్తున్న అర్చకులు భీమన్న ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న శ్రీలలితసేవా సమితి సభ్యులు -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ఈనెల 13న తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. జగిత్యాల రూరల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. ధరూర్ గ్రామంలో ఈనెల 13న తాళం వేసిన నాలుగిళ్లలో గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను సాంకేతిక పరిజ్ఞానంతో మహారాష్ట్ర అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలను మహారాష్ట్రకు పంపించి గాలింపు చర్యలు చేపట్టారు. ధరూర్ శివారులోని బైపాస్రోడ్లో నిందితులు కారులో వెళ్తుండగా 15ఏళ్ల బాలుడితోపాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూక దేవిగల్లికి చెందిన మ్యాకల్వార్ సాయినాథ్, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం యామయ్కుంటకు చెందిన శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వారి నుంచి 24.05 గ్రాముల బంగారు నగలు, రూ.19 వేలు, కారు, రెండు సెల్ఫోన్లు, మూడు ఫేస్మాస్క్లు, హ్యాండ్ గ్లౌస్లు, ఓ ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. మరో నిందితుడు మహారాష్ట్రలోని హింగోలి జిల్లా బాస్మత్ తాలూకా ఖార్ఖానారోడ్కు చెందిన మార్కులి అనిల్ పరారీలో ఉన్నాడని తెలిపారు. పట్టుబడిన దొంగలంతా గతంలో జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహారాష్ట్రలోని నాందేడ్, హింగోలి జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై సదాకర్, మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్, బీర్పూర్ ఎస్సై రాజు, ఏఎస్సై సత్తయ్య, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, మోహన్, రమేశ్, శ్రీనివాస్, కిరణ్, విశాల్, ప్రణయ్, ఆంజనేయులు, సత్యనారాయణను డీఎస్పీ అభినందించారు. వారికి నగదు రివార్డులు అందించారు. 24.05 గ్రాముల బంగారం.. రూ.19 వేలు, కారు స్వాధీనం -
రెండు ఆలయాల్లో దొంగతనం
కథలాపూర్: మండలంలోని భూషణరావుపేట శివారులోని రెండు ఆలయాల్లో దొంగతనం జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. దుర్గామాత ఆలయంలో దొంగలు పడి అమ్మవారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రేణుక ఎల్లమ్మ ఆలయంలో చొరబడి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హుండీని ధ్వంసం చేసి డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఎస్సై నవీన్కుమార్ పరిశీలించి వివరాలు సేకరించారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని ఆలయ కమిటీ సభ్యులకు ఎస్సై సూచించారు. -
బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
కరీంనగర్రూరల్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్– 14 బాస్కెట్బాల్ పోటీల్లో బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ధులు విక్యాత్, నిత్య ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికై నట్లు కోచ్ అనూప్ తెలిపారు. విద్యార్థులను బుధవారం ప్రిన్సిపాల్ బబిత విశ్వనాథన్, చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి, వ్యాయామ విభాగం అధిపతి మురళీధర్ అభినందించారు. నేడు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం పెద్దపల్లి: సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించనున్నారు. పట్టణ పరిధిలో సుమారు 112 రైస్ మిల్లులు ఉన్నాయి. ఫలితంగా జిల్లాలో కొనుగోలు చేసే ధాన్యాన్ని సుల్తానాబాద్లోని మిల్లులకే అధికంగా తరలిస్తామని, ఇందుకోసం రవాణా, హమాలీలు, కూలీలు తదితర ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. సన్న రకం ధాన్యం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా మద్దతు ధర చెల్లిస్తారు. తప్ప, తాలు, మట్టి లేకుండా, నిర్దేశిత తేమశాతంతోనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని అధికారులు సూచించారు. -
హ్యాండ్బాల్ విజేత రాజన్నసిరిసిల్ల
గంభీరావుపేట(సిరిసిల్ల): ఉమ్మడి జిల్లా హ్యాండ్బాల్ పోటీల్లో విజేతగా రాజన్నసిరిసిల్ల జిల్లా జట్లు నిలిచాయి. గంభీరావుపేట మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి హ్యాండ్బాల్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్లకు చెందిన 8 జట్లు పాల్గొన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. బాలురు, బాలికల విభాగాల్లో రాజన్న సిరిసిల్ల జట్లు ప్రథమ, కరీంనగర్ జట్లు ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు స్థానిక నాయకుడు దమ్మ శ్రీనివాస్రెడ్డి బహుమతులను అందించారు. షాదుల్, మల్లేశం భోజన వసతి కల్పించారు. పీడీ భార భాను, ఎంఈవో గంగారాం, హ్యాండ్బాల్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, అశోక్, సుమన్, కృష్ణహరి పాల్గొన్నారు. ద్వితీయస్థానంలో కరీంనగర్ -
ఐదు నిమిషాలైతే ఇల్లు చేరేదే..
ధర్మపురి: ఐదు నిమిషాలైతే ఆమె క్షేమంగా ఇంటికి చేరుకునేది. అంతలోనే విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా గేదెను ఢీకొని మహిళాకూలి మృతి చెందిన సంఘటన మండలంలోని నేరెల్ల శివారులో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల పుష్పలత (50) రోజులాగానే పత్తి ఏరేందుకు కూలీకి వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకున్న అనంతరం భూమి యజమానితోపాటు పుష్పలత, గౌరమ్మను బైక్పై ఇంటికి బయల్దేరారు. నేరెళ్ల సమీపంలోకి రాగానే ఎదురుగా గేదె అడ్డు వచ్చింది. దానిని ఢీకొట్టడంతో పుష్పలత, గౌరమ్మ కింద పడిపోయారు. పుష్పలతకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. గౌరమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోధించారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరేదానివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పుష్పలతకు భర్త చంద్రయ్య, ముగ్గురు కుమారులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం -
ఐదేళ్లుగా బహ్రెయిన్ మార్చురీలో మృతదేహం
మెట్పల్లి: సుమారు పదిహేడేళ్ల క్రితం.. ఎన్నో ఆశలతో ఆ యువకుడు ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లాడు. అతడికి అప్పటికే వివాహమైంది. భార్య, కుటుంబ సభ్యులను విడిచిపెట్టి ఏడారి దేశానికి వలసవెళ్లాడు. అక్కడకు వెళ్లిన రెండేళ్ల వరకు తరచూ ఫోన్ చేసిన అతడు.. అనంతరం ఆచూకీ లేకుండాపోయాడు. అప్పటినుంచి ప్రతిరోజు అతని ఫోన్ కోసం.. ఇంటికి వస్తాడనే ఆశతో గుమ్మం వైపు చూసీచూసీ కుటుంబ సభ్యులు అలసిపోయారు. ఎక్కడో బతికి ఉంటాడని, ఎప్పుడైనా ఇంటికొస్తాడని అనుకుంటున్న వారికి రెండురోజుల క్రితం అతడు సజీవంగా లేడనే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే ఈ లోకాన్ని విడిచి వెళ్లాడని తెలియడంతో వారంతా ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని రాంనగర్కు చెందిన భారతి, అశోక్ దంపతులకు ఇద్దరు కుమారులు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే వారు మరణించారు. వారి చిన్న కుమారుడు నరేశ్ను అతని చిన్నమ్మ శ్రీపాద లక్ష్మీ దత్తత తీసుకుంది. 2007లో అతడికి కథలాపూర్ మండలానికి చెందిన యువతితో వివాహమైంది. కొంతకాలానికే ఉపాధి నిమిత్తం బహ్రెయిన్ వెళ్లాడు. రెండేళ్ల వరకు కుటుంబసభ్యులు, బంధువులకు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. తర్వాత చాలాకాలం పాటు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. అక్కడ ఉంటున్న ఈ ప్రాంతం వారిని ఆరా తీసినప్పటికీ సమాచారం లభించలేదు. పాస్పోర్ట్ గడువు ముగిస్తే ఇంటికి వస్తాడని భావించారు. అయినా రాకపోవడంతో నరేశ్ (39) ఆచూకీ కోసం అతని భార్య కథలాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏళ్లు గడుస్తున్నా అతని ఆచూకీ దొరకకున్నా.. ఎక్కడో సజీవంగా ఉంటాడని భావిస్తున్న కుటుంబసభ్యులకు రెండు రోజుల క్రితం గుండెలను పిండేసే సమాచారం అందింది. ఐదేళ్ల క్రితమే నరేశ్ మృతి చెందాడని, అతని మృతదేహం బహ్రెయిన్లోని ఓ మార్చురీలో ఉందని తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పాస్పోర్టు గడువు ముగిసినప్పటికీ నరేశ్ అక్కడే ఉండిపోవడం.. మరణించిన తర్వాత అతని వివరాలు తెలియకపోవడంతో ఇంతకాలం మృతదేహాన్ని అక్కడి మార్చురీలోనే భద్రపర్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతని వివరాలు తెలియడంతో భారత ఎంబసీ అధికారులు.. వాటిని బహిర్గతం చేయడం ద్వారా కుటుంబసభ్యులకు చేరింది. నరేశ్ సోదరుడు ఆనంద్ మృతదేహాన్ని తెప్పించి తమకు అప్పగించాలని మంగళవారం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ద్వారా సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల క్రితం ఉపాధి కోసం ఎడారి దేశానికి వలస వెళ్లిన నరేశ్ కొంతకాలానికే ఆచూకీ లేకుండా పోవడం.. చివరకు అక్కడే అసువులు బాయడం స్థానికులను కలచివేసింది. -
సిటిజన్ సర్వేలో భాగస్వాములు కావాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్– 2047’ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని కలెక్టర్ పమేలా సత్పతి చెప్పారు. ఇప్పటి వరకు తెలంగాణ నుంచి వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారని వివరించారు. భారత దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనల కోసమే సిటిజన్ సర్వే చేపట్టిందన్నారు. సర్వే ఈ నెల 25తో ముగుస్తుందని, www.telangana.gov.in, telangana rising అనే వెబ్సైట్ను సందర్శించి ప్రతీ ఒక్కరు తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కోరారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తకరీంనగర్ క్రైం: సైబర్ నేరగాళ్లు, వాట్సప్ గ్రూప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నేరగాళ్లు వాట్సప్ గ్రూప్ల ద్వారా నకిలీ ఏపీకే ఫైళ్లను (ఆర్టీవో చలాన్ , టీఎస్ చలాన్ యాప్లు వంటివి) సర్యూలేట్ చేస్తున్నారని తెలిపారు. తెలియకుండా.. అనుమతిలేకుండానే ఖాతాల్లోంచి డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వాట్సాప్ అకౌంట్నూ హ్యాక్ చేస్తున్నారని చెప్పారు. నకిలీ చలాన్, పీఎం కిసాన్ ఏపీకే, వివిధ ఫేక్ యాప్లు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవద్దన్నారు. అన్ని సందేశ ఫార్వార్డింగ్ ఎంపికలను నిలిపివేయడానికి ఫోన్ నుంచి ుు002ు డయల్ చేయాలని, ఏదైనా సమస్య తలెత్తితే 1930 సైబర్ హెల్ప్లైన్ నంబర్కు డయల్ చేయాలన్నారు. అయోడిన్తో రోగ నిరోధక శక్తి పెరుగుతుందికరీంనగర్: అయోడిన్ మెదడు అభివృద్ధి, శరీర ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తిని పెంచేందుకు సహకరిస్తుందని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. ప్రపంచ అయోడిన్ లోపం రుగ్మతల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రొగ్రాం ఆఫీసర్లు, ఆఫీస్ స్టాఫ్తో ప్రతిజ్ఞ చేయించారు. అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలన్నారు. అయోడిన్ లోపంతో గొయిటర్ (మెడ ఉబ్బరం), మానసిక మందగమనం (బుద్ధి తగ్గిపోవడం), బలహీనత, అలసట, గర్భిణిలు, మృతశిశువు జననం లేదా పిల్లల్లో వైకల్యం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు విప్లవశ్రీ, రవీందర్ రెడ్డి, సాజిద, సనజవేరియా, రాజగోపాల్, స్వామి, పోచయ్య తదితరులు పాల్గొన్నారు.జూబ్లీహిల్స్లో మేము సైతంకరీంనగర్ టౌన్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిటైర్డు ఎంప్లాయీస్ నాయకులు పోటీచేస్తున్నారు. ఈమేరకు సోమవారం నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆ సంఘం నాయకులు మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం రిటైర్డు ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వనందుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు ప్రకటించారు. మరోవైపు ఎస్సీ వర్గీకరణలో జరిగిన అన్యాయానికి నిరసనగా మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నల్లల కనకరాజ్ ఆధ్వర్యంలో 12 మంది నామినేషన్లు దాఖాలు చేశారు. నామినేషన్లు దాఖాలు చేసిన వారిలో కరీంనగర్ జిల్లా మాల సంఘ నాయకులు మద్దెల రాజేందర్, రొడ్డ శ్రీనివాస్, తెగుట్ల రమేశ్ కుమార్ ఉన్నారు. దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్లువిద్యానగర్(కరీంనగర్): ఉన్నత విద్య చదివే దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఎం.సరస్వతి మంగళవారం తెలిపారు. దివ్యాంగులైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ నుంచి పీజీ వరకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, గాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా కోసం టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31 చివరి తేదీ అని తెలిపారు. -
టార్గెట్.. అర్బన్ బ్యాంక్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ అర్బన్ బ్యాంక్పై ఏజెండా ఎగరనుంది. మళ్లీ హస్తగతమేనా? కమల వశమా? పద్మవ్యూహంలో అభిమన్యుడిలా బీఆర్ఎస్ పరమా? అన్నది మరో 13 రోజుల్లో తేలనుంది. రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో సిద్ధమవుతుండగా ఓటర్లను ఆకట్టుకునేందుకు మాటలకు పదును పెడుతున్నాయి. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఎంపిక చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ సదరు వ్యూహంలో ఉండగా బీఆర్ఎస్ వ్యూహాత్మక మౌనం పాటిస్తోందని స్పష్టమవుతోంది. అయిదేళ్ల పదవీ కాలానికి జరిగే ఎన్నికలు కావడంతో డైరెక్టర్లుగా గెలిచేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఏర్పడిన నుంచి కాంగ్రెస్ అధిపత్యమే నడుస్తోంది. ఇతర పార్టీలు పెద్దగా ఆసక్తి చూపకపోగా కాంగ్రెస్ నేతలే పరిపాలిస్తున్నారన్నది సుస్పష్టం. కాంగ్రెస్లో కొత్త, పాత నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరగా కోర్టు వరకు చేరిన విషయం విదితమే. తాజా మాజీ చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ అక్రమాలకు పాల్పడ్డారని, ఇబ్బడిముబ్బడిగా సభ్యత్వాలిచ్చారని విలేకరుల సమావేశాల్లో వెల్లడించారు. సర్వసభ్య సమావేశాలు ఏర్పాటు చేసి రాజశేఖర్తో పాటు పలువురి సభ్యత్వాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. రాజశేఖర్ కాంగ్రెస్లో కొన్ని నెలల క్రితం చేరగా మొదటి నుంచి పార్టీలో క్రీయాశీలపాత్ర పోషిస్తున్న తనకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని విలాస్రెడ్డి అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేస్తుండగా తన ప్యానెలే కాంగ్రెస్ ప్యానలని చెబుతున్నారు. రాజశేఖర్ కూడా తన ప్యానల్ను పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నారు. కావాలని తనపై ఆరోపణలు చేస్తున్నారే తప్పా ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని గతంలోనే ప్రకటించారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్లో అంతర్గత పోరు ఇతర పార్టీలకు లాభించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో భాజపా ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్తో సమావేఽశమైన నేతలు అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టంచేయగా ముఖ్య నేతలంతా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్లో వర్గపోరు పార్టీకి ప్రయోజనం చేకూర్చనుండగా భాజపా గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అర్బన్ బ్యాంకులో 9,287మంది ఓటర్లుండగా కరీంనగర్లో 7,272 సభ్యత్వాలుండగా జగిత్యాలలో 2,015 మంది ఓటర్లున్నారు. ఇందులో గరిష్టం భాజపా వైపే మొగ్గుచూపుతారన్నది భాజపా నేతల వాదన. మాజీ మేయర్ డి.శంకర్, కన్న కృష్ణ తదితర నేతలు బలమైన అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ దూరమా? అయితే అర్బన్ బ్యాంకు ఎన్నికలను బీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించేందుకు ఆసక్తి చూపడం లేదు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు సమాచారం. ఎన్నికలకు దూరమా.. వ్యూహాత్మక మౌనమా అన్న చర్చ మొదలైంది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికలు రాష్ట్రం ఏర్పడకముందు జరగగా రాష్ట్రం ఏర్పడిన నుంచి ఎన్నికలు జరగలేదు. అవే పాలకవర్గాలు కొనసాగుతూ రాగా పాలకవర్గం బీఆర్ఎస్ వైపు చేరడంతో ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటేడ్ విధానంలో పాలకవర్గాలను ప్రకటించారు. తెలంగాణలో తొలిసారి అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరుగుతుండగా రాజకీయ వేడెక్కింది. ఈ నెల 15న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా 21 నుంచి 23 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 1న పోలింగ్, 4లోపు పాలవకర్గ ఎన్నిక జరగనుండగా తదనుగుణ ఏర్పాట్లలో సహకార శాఖ తలమునకలైంది. పాలకవర్గంలో మొత్తం 12మంది డైరెక్టర్లను బ్యాంకు సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రతీ సభ్యుడు బ్యాలెట్ పేపర్ ద్వారా 12మందికి ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మహిళలకు రెండు డైరెక్టర్ పదవులు కాగా మరొక స్థానాన్ని ఎస్సీ, ఎస్టీ కేటగిరికి రిజర్వ్ చేశారు. మిగతా 9 స్థానాలకు ఓపెన్ కేటగిరిలో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఒకే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించగా ఈ సారి మాత్రం మూడు కేటగిరిలకు మూడు బ్యాలెట్ పేపర్లను వినియోగిస్తున్నారు. ఓపెన్ కేటగిరికి తెల్ల బ్యాలెట్ పేపర్, మహిళా కేటగిరికి గులాబి రంగు బ్యాలెట్ పేపర్ను, ఎస్సీ, ఎస్టీ కేటగిరి కోసం నీలి రంగు బ్యాలెట్ పేపర్ను వినియోగించనున్నట్లు అధికారులు ప్రకటించారు. -
ధాన్యం మాయం.. పట్టని యంత్రాంగం
జూన్ 28, 2024: జమ్మికుంట మండలం కోరపల్లిలో శ్రీమహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో శ్రీసీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుల్లో వెలుగుచూసిన రూ.130 కోట్ల ధాన్యం కుంభకోణం వ్యాపార లోకాన్నే నివ్వెరపరిచింది. మిల్లరు బండారు శారద రెండు మిల్లులు నిర్వహిస్తుండగా ఽప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్కు తరలింలించారు. ఇటీవల హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలో రవిచంద్ర ఇండస్ట్రీస్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు చేయగా 32,207 క్వింటాళ్ల ధాన్యం కనిపించలేదు. వీటి విలువ రూ.6.68 కోట్లు. బోర్నపల్లిలోని విజయకృష్ణ మోడర్న్ రైస్మిల్లులో 238.04 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం కనిపించడంతో అధికారులే కంగుతిన్నారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. జిల్లాలో ప్రభుత్వమిచ్చే ధాన్యంతో అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడున్నారు.కరీంనగర్ అర్బన్: రైస్మిల్లు ఉంటే చాలు పెట్టుబడి లేని దందా ఇది. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా మాయం చేస్తున్నారు. లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని అప్పనంగా అమ్ముకుని రూ.వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకోగా ప్రభుత్వానికి మొండిచేయి చూపుతున్నారు. ఏటా ఈ దందా జోరుగా సాగుతుండగా అధికార యంత్రాంగం మొద్దునిద్ర నటిస్తోంది. కేసులు నమోదు చేసినా.. నోటీసులిచ్చినా ఎలాంటి జంకు లేకపోవడం.. కఠినశిక్షలు లేకపోవడమే కారణం. రాజకీయంగా ఏమైనా చేయగలమనే మ్మకంతో పాటు పలువురు నేతల హస్తం దన్నుగా నిలుస్తుంది. గతంలో పౌర సరఫరాల సంస్థ అధికారులు జమ్మికుంట మిల్లర్లపైనా కేసులు పెట్టగా, శంకరపట్నం మండలంలో ఒక మిల్లరును రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జిల్లాలో తనిఖీలు చేస్తుండగా కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు నిగ్గు తేలుతుండగా అధికార యంత్రాంగ డొల్లతనాన్ని చాటుతోంది. కరీంనగర్కు చెందిన బడా వ్యాపారి కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎంఆర్తో మిల్లర్ల వ్యాపారం మిల్లు కట్టుకుంటే చాలు వ్యాపారం ప్రభుత్వమే ఇస్తుండటంతో పక్కదారి పట్టిస్తున్నారు అక్రమార్కులు. ప్రభుత్వమిచ్చే ధాన్యాన్ని మరాడించి అక్రమార్గంలో అమ్ముకుని సదరు లోటును రేషన్ బియ్యాన్ని కొనుగోలుచేసి భర్తీ చేస్తున్నారు. ఆయా సీజన్లలో ఇచ్చిన సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు అందించారు. ఇందులో 40 శాతానికిపైగా మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. గడువుల మీద గడువు పొడిగించడంతో వీరి వ్యాపారానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వృద్ధులం, వ్యాధిగ్రస్తులం.. మాపై పీడీ యాక్ట్ పెట్టలేరు. పెట్టేది 6ఏ కేసు. దాంతో ఒరిగిదేం లేదని మిల్లర్లు బహిరంగంగా పేర్కొనడం వ్యవస్తలోని లోపాలకు తార్కాణం. విల్లాలు.. ఎకరాల కొద్ది భూములు అక్రమాలకు రుచిమరిగిన మిల్లర్లు భారీగా ఆస్తులు కూడబెట్టారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం వంటి పట్టణాల్లో విల్లాలు కొనుగోలు చేయగా ఉమ్మడి జిల్లాలో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేశారు. అంటే ప్రభుత్వ సొమ్ముతో మిల్లర్లు భారీ ఎత్తున స్థిరాస్తులు పెంచుకుంటుండగా పాలకులు.. యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరం. ఓ వ్యాపారి ప్రభుత్వ ధాన్యం అమ్ముకుని రూ.200ల కోట్లకుపైగా ఆస్తులను కూడబెట్టారంటే ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. చప్పుడు చేయని రైస్ మిల్లర్ల సంఘం ధాన్యం కేటాయింపులో రైస్మిల్లర్ల సంఘం మధ్యవర్తిత్వం వహిస్తుండగా సదరు సంఘం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఏటా అక్రమాలు తారాస్థాయికి చేరుతుండగా లక్షల క్వింటాళ్ల ధాన్యం అమ్ముకున్నారని తేలుతుండగా రైస్మిల్లర్ల సంఘం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణం. అక్రమార్కులను సంఘం నుంచి బహిష్కరిస్తామని చెప్పడమే తప్ప ఆచరణలో విఫలమవుతుంది. జమ్మికుంట, హుజూరాబాద్, మానకొండూర్, సదాశివపల్లి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ చుట్టూ రైస్మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతీ వానకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొంటున్న ప్రభుత్వం, పైసా ఖర్చులేకుండా మిల్లులకు కస్టం మిల్లింగ్ రైస్(సీఎంఆర్) పేరిట సరఫరా చేసుంది. మిల్లర్లు బియ్యాన్ని తిరిగి ఇవ్వకుండా నేరుగా ధాన్యాన్నే అమ్ముకొని సొమ్ము చేసుకునే స్థాయికి ఎదిగారు. గతంలో జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతంలోని 7 మిల్లుల్లో తనిఖీ చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడ జరుగుతున్న తతంగాన్ని చూసి అవాక్కయ్యారు. లక్షల క్వింటాళ్ల ధాన్యం మాయమైనట్లు గుర్తించారు. జమ్మికుంటకు చెందిన ఓ మిల్లరు అక్రమాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ ఒక్క మిల్లులోనే దాదాపు నాలుగు లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం లోటును గుర్తించారు. -
తెరపైకి చల్లూరు సహకార సంఘం
వీణవంక: వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ప్రాథమిక సహకార పరపతి సంఘం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వీణవంక సొసైటీలో ఎక్కువ మంది రైతులు చల్లూరు కేంద్రంగా ఉండడంతో సొసైటీ చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ విషయమై రెండు రోజుల్లో వ్యవసాయశాఖ మంత్రిని కలిసేందుకు వివిధ గ్రామాల రైతులు సిద్ధమవుతున్నారు. వాణిజ్య, వ్యాపారకేంద్రంగా ఉన్న చల్లూరులో కొత్త సొసైటీ ఏర్పాటు చేయాలని 2018లోనే పాలకవర్గం తీర్మాణం చేసింది. ఆ ప్రయత్నం ఫలించలేదు. 2023–24లో మళ్లీ తీర్మాణం పంపాలని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో అధికారులు నివేదిక ఇచ్చారు. వీణవంక సొసైటీ పాలకవర్గంలో ఉన్న ఓ వ్యక్తి చల్లూరును సొసైటీ చేయొద్దని ఒత్తిడి తేవడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. మంత్రిని కలవనున్న రైతులు వీణవంక ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలో 26 గ్రామాలు.. 54వేల జనాభా ఉంది. వీణవంక సొసైటీలో సుమారు 4,500 మంది సభ్యులున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు 11మంది డైరెక్టర్లు ఉంటారు. 1,085 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. ఈ సొసైటీలో చల్లూరు, ఎల్బాక, గంగారం, మామిడాలపల్లి, మల్లారెడ్డిపల్లి గ్రామాల నుంచి ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. చల్లూరు సొసైటీ ఏర్పడితే మామిడాలపల్లి, చల్లూరు, గంగారం, ఎల్బాక, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, దేశాయిపల్లి, కిష్టంపేట, బొంతుపల్లి, ఘన్ముక్కుల, కోర్కల్ గ్రామాల రైతులకు అనుకూలంగా ఉంటుంది. వీణవంకకు వెళ్లేందుకు దూరభారం తగ్గుతుంది. ఈ విషయాన్ని కొందరు రైతులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో మంత్రిని కలిసేందుకు సిద్ధం అవుతున్నారు. వీణవంక సొసైటీ సీఈవో ప్రకాశ్రెడ్డిని ఈ విషయమై వివరణ కోరగా చల్లూరులో సొసైటీ కోసం ప్రతిపాదనలు పంపామని తెలిపారు. -
అమరుల త్యాగాలు మరువలేనివి
కరీంనగర్క్రైం: పోలీసులు అమరవీరుల త్యాగాలు మరవలేనివని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మంగళవారం సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో ఫ్లాగ్ డే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. పండుగల సమయంలో కూడా పోలీసులు విధినిర్వహణలో ఉంటారని గుర్తుచేశారు. పోలీసు ఉద్యోగం సవాలుతో కూడుకున్నదన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేవని.. విధి నిర్వహణలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారన్నారు. దేశరక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడే విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమరవీరుల పోలీసుకుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. ఈ నెల 31 వరకు పదిరోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అమరవీరుల విగ్రహానికి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. కలెక్టర్తో పాటు సీపీ ఇతర అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డీసీపీ వెంకటరమణ, భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
టీ20 జట్టుకు శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట: కరీంనగర్కు చెందిన శ్రీవల్లి హైదరాబాద్ మహిళల అండర్–19 టీ20 జట్టుకు ఎంపికై ంది. ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జరిగిన అండర్–20 జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ నెల 26 నుంచి ముంబయి వేదికగా బీసీసీఐ అండర్–19 టీ20 ఉమెన్ ట్రోఫీ జరగనుంది. చిన్న వయస్సులో బెస్ట్ బౌలర్గా పేరు సంపాదించిన శ్రీవల్లి భవిష్యత్లో భారత మహిళల జట్టులో చోటు దక్కాలని పలువురు ఆకాంక్షించారు. కూతురు ఎంపికపై తల్లిదండ్రులు కట్ట ఉమ, లక్ష్మారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. -
వెలుగుల దీప్తి.. ఆలోచనల స్ఫూర్తి
విద్యానగర్(కరీంనగర్): కోటి వెలుగుల కాంతి.. కొత్త ఆలోచనలకు స్ఫూర్తి దీపావళి. నిశీధి నిశ్శబ్దాన్ని బాణసంచాతో బెదరగొట్టి చిమ్మ చీకట్లను చెల్లాచెదురు చేసే ఆ సంబరం దీపావళికే సొంతం. వెలుగుల పండుగ ‘తమసోమా జ్యోతిర్గమయా’ అనే ఉపనిషత్ వ్యాక్యానికి ఆచరణరూపం దీపావళి. దీపావళి పర్వదినానికి యుగాల చరిత్ర ఉంది. ఇల్లంతటినీ దీపాలతో అలంకరించేది ఈ పండుగ రోజు మాత్రమే. ఆధునికత ఎంతో పెరిగినా దీపావళి రోజు ప్రమిదలో వత్తి వేసి నూనె పోసి ఆ దీపాల్నే వెలిగిస్తాం. ఇతర దేశాల్లో దీపావళి జపాన్లో కోరా నాగోషి పేరుతో దీపాల పండుగను పితృదేవతల సంస్మరణార్థం జరుపుతారు. చైనాలో హయివో హోవా పండుగలో పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తారు. నేపాల్లో ఆహారం ఐదురోజుల పండుగ. మొదటిరోజు కాకుల పండుగ, రెండోరోజు కోతుల పండుగ, మూడోరోజు ఆవుల పండుగ, నాల్గోరోజు దీపాలు వెలిగించి బాణసంచా పేలుస్తారు. చివరిరోజు ఆడపడుచుల పండుగ. ఇజ్రాయిల్ వారి స్వాతంత్య్ర వీరుడు మెకాచ్చిన్ స్మృత్యర్థం హనుకా అనే దీపోత్సవం జరుపుతారు. ఈజిప్టులో ఓ సిరీస్ మరణానికి చిహ్నంగా ఇంటింటా దీపాలు వేలాడగడతారు. అమెరికాలో నవంబరు 1న హాల్వీన్ అనే పేర దీపావళి వంటి పండుగ జరుగుతోంది. క్రైస్తవులు జరుపుకునే క్యాండిల్ ఫెస్టివల్ దీపావళి లాంటిదే. ముస్లిం దేశాల్లోనూ దీపావళి పండుగ ఉన్నది. మహ్మద్ పైగంబరు నూతన సంప్రదాయాన్ని స్థాపించి మక్కాకు తిరిగి వెళ్లిన రాత్రికది సూచిక. దీనిని షబ్ ఎ బారత్ అంటారు. ఆ రోజు బాణసంచా పేల్చారట. వివిధ రాష్ట్రాల్లో.. రాష్ట్రాల వారీగా దీపావళి గురించి చెప్పుకుంటే గుజరాత్లో లక్ష్మీపూజ, గణపతిపూజ, కర్నాటకలో బలిపాఢ్య పండుగ, బెంగాల్, ఒడిశాలో కాళీపూజ, శక్తిపూజ, ఇతర రాష్ట్రాల్లో గోవర్ధనపూజ, యమద్వితీయ, భయ్యదూజ్ పండుగలు దీపావళితోనే ముడిపడి ఉన్నాయి. దీపావళి ముందు రోజును నరక చతుర్దశిగా దీన్ని పిలుస్తున్నారు. చిమ్మచీకట్లను పారదోలే పండుగ నేడు దీపావళి -
అప్పు కింద రెండెకరాలు సేల్డీడ్
ఇబ్రహీంపట్నం: అవసరం కోసం అప్పు తీసుకున్నందుకు ఉన్న భూమిని సేల్డీడ్ చేసుకున్నాడో వడ్డీ వ్యాపారి. సదరు వ్యాపారి బాధలు భరించలేక బాధితుడు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్లో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఎలేటి సుజాత భర్త జనార్దన్ నాలుగేళ్ల క్రితం మెట్పల్లికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఏడాది తర్వాత వడ్డీకి వడ్డీ కలిపి మొత్తం చెల్లించాలని వ్యాపారి డిమాండ్ చేశాడు. లేకుంటే భూమి రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించాడు. దీంతో గ్రామశివారులో తనకున్న రూ.60లక్షల విలువైన 82 గుంటల భూమిని సేల్డీడ్ చేసి ఇచ్చారు. ఆ సమయంలో రూ.11 లక్షల అప్పు ఇచ్చినట్లు లెక్క చెప్పగా.. జనార్దన్ మాత్రం నెలనెలా వడ్డీ ఇచ్చినట్లు చెబుతున్నాడు. తన భూమి తనకు రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు చెల్లిస్తానని జనార్దన్ చెప్పగా.. సదరు వ్యాపారి రూ.10 వడ్డీ చొప్పున లెక్క చేసి రూ.25 లక్షలు కట్టాలని డిమాండ్ చేశాడు. దీంతో జనార్దన్ శనివారం రాత్రి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన భార్య, కుటుంబసభ్యులు వెంటనే మెట్పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ఈ విషయమై ఎస్సై అనిల్ను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. మాజీ ఉప సర్పంచ్ భర్త ఆత్మహత్యాయత్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు -
టపాసులతో భద్రం
విద్యానగర్(కరీంనగర్): దీపావళి అంటేనే భిన్నమైన పండుగ. వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ బాణాసంచా కాల్చడానికి ఉత్సాహం చూపుతారు. కాగా అతి ఉత్సాహంలో టపాసులు కాల్చేటప్పుడు అజాగ్రత్తతో ప్రమాదాలను కోరి తెచ్చుకుంటూ ఆస్పత్రుల పాలవుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు జాగ్రత్తలు పాటించాలి. భారీ శబ్దాల బాంబులు ప్రస్తుతం దీపావళి అంటే బాంబులు, టపాసుల పేలుళ్లతో వీధులన్నీ దద్దరిల్లిపోతున్నాయి. హైడ్రోజన్, సుత్తిలీ, లక్ష్మి, శివాజీ, డబుల్ సౌండ్స్, త్రిబుల్ సౌండ్స్ వంటి పేర్లతో భారీ శబ్దాలు పుట్టించే బాంబులు తయారవుతున్నాయి. ఢాం.. ఢాం అంటూ పేలే బాంబుల మోతలతో చెవులు దిమ్మెక్కెతున్నాయి. పరిమితికి మించిన శబ్దాలను విని, కాలిన గాయాలకు చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగినా జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేక జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఈ పరిస్థితులు రాకుండా తగిన జాగ్రత్తలతో పండుగను జరుపుకోవడం ఉత్తమం. టపాసులు కాల్చడంలో జాగ్రత్తలు – నాణ్యమైన బ్రాండ్లకు చెందిన బాణాసంచా కొనుగోలు చేయాలి. రాకెట్లు, ఆకాశంలోకి దూసుకెళ్లే టపాసులను గుడిసెలు, గడ్డివాములు లేని ప్రదేశాల్లో కాల్చాలి. – కాకరకొవ్వొత్తులు, విష్ణు చక్రాలు, భూచక్రాల వంటివి శరీరానికి దూరంగా ఉంచి కాల్చడం మంచిది. రాకెట్లు కాల్చేటప్పుడు వాటిని సీసాలో పెట్టి నిటూరుగా ఉండేలా సరి చూసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. చిన్నారులు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి.అత్యవసర ఫోన్ నంబర్లు ఫైర్ స్టేషన్ 101 అంబులెన్స్ 108 పోలీస్ కంట్రోల్ రూం 100 -
జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి కార్మికుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): గ్రామపంచాయతీ ట్రాక్టర్ అదుపుతప్పి కరెంట్ స్తంభానికి ఢీకొని జీపీ కార్మికుడు మృతిచెందిన ఘటన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. బస్వాపూర్లో శనివారం రాత్రి జీపీ ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనగా, ట్రాక్టర్పైన ఉన్న మల్టీపర్పస్ వర్కర్ దాచారం భూమయ్య (55), గొడిసెల అనితకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను పంచాయతీ కార్యదర్శి వేణు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం భూమయ్యను కరీంనగర్ తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అనితకు సిరిసిల్లలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మృతుడు భూమయ్యకు ఇద్దరు భార్యలు, కూతురు ఉన్నారు. నిరుపేద కుటుంబం కావడంతో గ్రామస్తులు చందాలు పోగుచేసి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఖిలా చూసేందుకు వచ్చి.. ప్రమాదం బారిన పడి
శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ ఖిలా సందర్శనకు వచ్చిన మధ్యప్రదేశ్కు చెందిన పర్యాటకురాలు అదుపుతప్పి పడిపోవడంతో కాలు విరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన దంపతులు ఆరుమాసాలుగా వివిధ పర్యాటన ప్రదేశాలు సందర్శిస్తున్నారు. ఆదివారం మొలంగూర్ ఖిలాకు వచ్చారు. ఖిలా కింద దూద్బావిని పరిశీలించారు. ఖిలా పైకి వెళ్లి అందాలు వీక్షిస్తున్న క్రమంలో అదుపుతప్పి పడిపోయింది. కాలు విరగడంతో గ్రామానికి చెందిన 10మంది యువకులు పైకి వెళ్లి సుమారు మూడు గంటలపాటు కష్టపడి మహిళను కిందకు మోసుకొచ్చారు. 108లో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. మొలంగూర్ ఖిలాపై విరిగిన పర్యాటకురాలి కాలు -
గుండెజబ్బులవారు జాగ్రత్తగా ఉండాలి
దీపావళి పండుగలో ఎంత సరదా ఉందో ప్రమాదం కూడా అంతే ఉంది. గుండె జబ్బులున్న వారు భారీ శబ్దాలకు దూరంగా ఉండాలి. హార్ట్ అటాక్ వచ్చి కోలుకున్నవారు, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శబ్దాల వల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవడం, బీపీ పెరగడం వంటివి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. – డాక్టర్ జి.వెంకట్రెడ్డి, జనరల్ మెడిసిన్, కరీంనగర్ టపాసులు కాల్చే సమయంలో గాయమైతే వెంటనే కాలిన గాయాలపై నీరు పోయాలి. ఎందుకంటే టపాసుల్లో ఉండే రసాయనాలు రక్తంలో కలిసి మరింత ప్రమాదానికి దోహ దం చేస్తాయి. వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. బర్నాల్, సిల్వర్ సల్ఫైడెటేన్, ఫౌండేర్, అయోడిన్ లాంటి క్రిమ్లను దగ్గర ఉంచుకోవడం మంచిది. – డాక్టర్ వి.సుమన్చందర్రావు, చర్మవ్యాధుల నిపుణుడు, కరీంనగర్ మనిషి వినికిడి శక్తి 20 నుంచి 60 డెసిబుల్స్ మాత్రమే. ప్రస్తుతం లభిస్తున్న బాంబులు 100 నుంచి 180 డెసిబుల్స్ శబ్దం చేసేవి. ఒక వేళ చెవి నొప్పి వచ్చినా, చెవి నుంచి రక్తం వచ్చినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చెవిలో నీళ్లు, నూనె, ఇతర చెట్ల ఆకుల రసం పోయడం వంటివి చేయకూడదు. – డాక్టర్ సీహెచ్.రమణాచారి, ఈఎన్టీ నిపుణుడు, కరీంనగర్ -
స్వగ్రామానికి మృతదేహాలు
రామడుగు/మేడిపల్లి: ఉపాధి కోసం ఒకరు.. ఉన్నత చదువుల కోసం మరొకరు విదేశాలకు వెళ్లి.. ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా, వారి మృతదేహాలను ఆదివారం స్వగ్రామాలకు తీసుకొచ్చారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్రావుపేట గ్రామానికి చెందిన ఎలగుందుల ప్రకాశ్ (35) కొద్దిరోజులుగా దుబాయ్లో కంపెనీలో కాకుండా కలివెల్లిగా జీవనం సాగించాడు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ సభ్యులతోపాటు, బీఆర్ఎస్ నాయకులు పూడురి మల్లేశం, దుబాయి ఎల్లాల శ్రీనన్న సేవా సమితి సభ్యులు చిలుముల రమేశ్కు తెలిపారు. ఈక్రమంలో రమేశ్ సేవా సమితి అధ్యక్షుడు రవిడేవిడ్కు తెలియజేయడంతో దుబాయ్లోని ఇండియన్ అసోసియేషన్ వారితో మాట్లాడారు. దీంతో ప్రకాశ్ మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకురాగా, పలువురు శ్రద్ధాంజలి ఘటించారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. లండన్లో ఈనెల 3న గుండెపోటుతో చనిపోయిన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్రెడ్డి (26) మృతదేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మహేందర్రెడ్డి విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతడి తండ్రి రమేశ్రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు కావడంతో పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రముఖులు మహేందర్రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
పేరుకే పల్లె.. అందరికీ ఫారిన్ కొలువులే!
ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్.1961లోనే అమెరికా పయనంఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేట టు అమెరికా వయా ఆర్ఈసీముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు.సంతోషంగా ఉన్నాంనేను 2008లో యూఎస్ ఏ వెళ్లాను. టెక్సాస్ స్టే ట్లోని డల్లాస్లో ఒక కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్రెడ్డి, యూఎస్ఏ భార్యాభర్తలం ఉద్యోగం చేస్తున్నాం2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్ కరోలినా స్టే ట్లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్రెడ్డిఆస్ట్రేలియాలో ఉంటున్నానేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్ఐటీ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాను. మెల్బోర్న్లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం. – కొమ్ముల మహేందర్రెడ్డిలండన్లో ఉద్యోగం చేస్తున్ననేను 2023లో లండన్ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – గుర్రం అజయ్రెడ్డి2006 నుంచి సాఫ్ట్వేర్గా.. 2006లో హైదరాబాద్లోని జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసి అదే సంవత్సరం సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం పొందాను. మేద సర్వో డ్రైవ్్సలో ఇండియన్ రైల్వే సిగ్నలింగ్ సిస్టంలో పనిచేస్తున్నాను. మొదట్లో నా సాలరీ రూ.10వేలు, ప్రస్తుతం సంవత్సరం ప్యాకేజీ రూ.50లక్షలు. ఊరి నుంచి సాఫ్ట్వేర్గా ఉద్యోగం పొందిన మొదటి వ్యక్తిని నేనే. చాలా సంతోషంగా ఉన్నాను. – కొమిరే లింగమూర్తిగౌడ్, హైదరాబాద్బ్యాంకు మేనేజర్గా పనిచేస్తున్నఎమ్మెస్సీ కంప్యూటర్ పూర్తి చేసి 2011లో కర్ణాటక బ్యాంకులో ప్రొహిబిషనరీ ఆఫీసర్గా ఎంపికయ్యాను. 2017లో బ్యాంకు మేనేజర్గా ప్రమోట్ అయ్యాను. 2011 నుంచి 19 వరకు గుజరాత్లో పనిచేశాను. ప్రస్తుతం హైదరాబాద్లోని నారాయణగూడ బ్రాంచ్లో మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నాను. – బద్దం అనిల్జీవితం సంతోషంగా ఉందినా కొడుకు అమెరికాలోని డల్లాస్లో సాఫ్ట్వేర్గా ఉద్యోగం చేస్తున్నాడు. దేశం పోయేటప్పుడు ఆర్థికంగా కష్టంగా ఉండేది. దేశం పోయి 17 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు చేతిలో డబ్బు ఉంది. చాలా సంతోషంగా ఉంది. కష్టపడి చదివినందుకు ఫలితం దక్కింది. – కోమటిరెడ్డి చిన్ననరసింహారెడ్డి, ముస్కానిపేట -
ఉత్సవాలను ఏటా నిర్వహిస్తాం
పూర్వీకులు నుంచి దండారీ ఉత్సవాల నిర్వహణకు కృషి చేస్తున్నాం. ఈ ఉత్సవాలను దీపావళి సందర్భంగా ఏటా ఘనంగా నిర్వహిస్తాం. వారంపాటు ఉపవాస దీక్షలతో పూజలు చేస్తాం. వచ్చినవారికి సదుపాయాలు కల్పిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నాం. – భీంరాావ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, జగన్నాథ్పూర్ దండారి ఉత్సవాల సందర్భంగా గిరిజనుల్లో సమైక్యత పెంపొందుతుంది. మా గ్రామానికి నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి దండారి ఉత్సవాల కోసం వారం రోజుల పాటు రావడంతో ఐక్యత పెరగడంతోపాటు వివాహ బంధాలకు వేదికగా మారుతుంది. – సిడెం భీం, మాజీ సర్పంచ్, జగన్నాథ్పూర్ దీపావళి అంటేనే గిరిజనుల్లో దండారీ గుర్తుకువస్తుంది. వారంపాటు పండగ వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి గిరిజనులు మా గ్రామానికి రావడంతోపాటు మేం కూడా తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లి దండారి ఉత్సవాల్లో పాల్గొంటాం. – ఆత్రం భీర్సాబ్, గ్రామ నాయకుడు -
ఆ దొంగ టార్గెట్ వృద్ధులే!
ధర్మారం(ధర్మపురి): ఒంటరిగా కనిపించిన వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ మాయమాటలు చెప్పి ఆభరణాలు అపహరిస్తున్న అంతర్జిల్లా దొంగను ఎస్సై ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ఓల్లెపు కృష్ణను ధర్మారంలోని గణేశ్నగర్ మెడికల్ ఏజెన్సీ వద్ద అరెస్ట్ అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడిన కృష్ణ ఈనెల 10న కూరగాయల కోసం ధర్మారంలోని అంబేడ్కర్ చౌరస్తా వైపు వస్తున్న బుధారపు శంకరమ్మను కలిశాడు. పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. సమీపంలోని గాయత్రి బ్యాంకు ఎదురుగా ఉన్న గల్లీలోకి తీసుకెళ్లి మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ధర్మారంలో నిదితుడు సంచరిస్తున్నాడనే సమాచారంతో వలపన్ని పట్టుకున్నారు. గతజూలై 31న ధర్మపురిలోని నందిచౌరస్తా వద్ద వృద్ధురాలికి తను పంచాయతీ కార్యదర్శిగా పరిచయం చేసుకుని పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి ఆమె మెడలోని రెండు తులాల చైన్ దొంగలించాడు. ఈమేరకు కృష్ణ నుంచి రెండు తులాల బంగారు గొలుసు, మరోకేసులో 30వేల విలువైన సొ త్తు స్వాధీనం చేసుకున్నారు.కేసును ఛేదించిన ఎ స్సై ప్రవీణ్కుమార్ను ఏసీపీకృష్ణ అభినందించారు. నిందితుడిపై 96 కేసులు.. నిందితుడు ఓల్లెపు కృష్ణపై కరీంనగర్, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల, ముస్తాబాద్, బెజ్జంకి, తంగళ్లపల్లి, ఆర్మూర్, కీసర, హసన్పర్తి, సుబేదారి, పరకాల, కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లో సుమారు 96 కేసులు నమోదైనట్లు సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన కృష్ణ కరీంనగర్లోని మారుతీనగర్లో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన అవసరాల కోసం మళ్లీ దొంగతనాలకు పాల్పడతున్నాడు. ఒంటరిగా కనిపిస్తే చాలు మాయమాటలు ఆ తర్వాత నిలవుదోపిడీ చేస్తూ ఉడాయింపు అంతర్జిల్లా దొంగ అరెస్టు వారం రోజుల్లోనే కేసును ఛేదించిన పోలీసులు -
సంజీవ్ కుటుంబానికి అండగా ఉంటాం
జూలపల్లి(పెద్దపల్లి): హైదరాబాద్లో గుండెపోటుతో హఠాన్మరణం చెందిన జూలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీ) చైర్మన్ గండు సంజీవ్(50) స్వగ్రామం కాచాపూర్లో శనివారం నిర్వహించారు. జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ సొంత పనుల కోసం హైదరాబాద్ వెళ్లారు. అక్కడే గుండెపోటుకు గురవడంతో వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పార్థివదేహాన్ని స్వగ్రామం కాచాపూర్ తీసుకొచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తదితరులు కాచాపూర్ చేరుకని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. అంతిమయాత్ర సందర్భంగా మంత్రి లక్ష్మణ్కుమార్ పాడే మోశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘువీర్సింగ్, ధూళికట్ట పీఏసీఎస్ చైర్మన్ వేణుగోపాలరావు, సుల్తానాబాద్ మాజీ జెడ్పీటీసీ ప్రకాశ్రావు, మాజీ సర్పంచులు నర్సింహయాదవ్, ఆడప లక్ష్మణ్, బంటు ఎల్లయ్య, కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు హాజరయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ కాచాపూర్లో ఏఎంసీ చైర్మన్ అంత్యక్రియలు పాడె మోసిన మంత్రి లక్ష్మణ్కుమార్ హాజరైన ఎమ్మెల్యే విజయరమణారావు -
సంతోషంగా ఉన్నాం
నేను 2008లో యూఎస్ ఏ వెళ్లాను. టెక్సాస్ స్టే ట్లోని డల్లాస్లో ఒక కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేని సమయంలో అతి కష్టం మీద ఇక్కడికి వచ్చాను. ఇద్దరు అమ్మాయిలు. ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడ్డాం. – కె.వంశీధర్రెడ్డి, యూఎస్ఏ 2018లో అమెరికాకు వెళ్లా ను. నా భార్య సరిత, నేను ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం. మాకు ఒక కూ తురు. నార్త్ కరోలినా స్టే ట్లోని కెరీలో ఉంటున్నా ము. ఆర్థికంగా స్థిరపడ్డాం. సంతోషంగా ఉంది. – కాట్నపల్లి గోపాల్రెడ్డి నేను ఆస్ట్రేలియాకు 2017 లో వెళ్లాను. ఎన్ఐటీ పూర్తి చేసి సాఫ్ట్వేర్గా స్థిరపడ్డాను. మెల్బోర్న్లో ఉంటున్నాను. మా ది వ్యవసాయ కుటుంబం. – కొమ్ముల మహేందర్రెడ్డి నేను 2023లో లండన్ వెళ్లాను. ఇక్కడ ఎంబీఏ పూ ర్తి చేశాను. ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. ఇక్కడ ఉద్యోగం చేయడం సంతోషంగా ఉంది. – గుర్రం అజయ్రెడ్డి -
ఉరేసుకుని ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య
హుజూరాబాద్: హుజూరా బాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి ఇందిరానగర్ కాలనీలో నివాసం ఉంటున్న మోరె రిషి(20)శనివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రిషి జమ్మికుంటలోని ఓ ప్రైవేటు ఐటీఐ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు. ఏదో విషయంలో మానస్తాపానికి గురై ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు విచారణ జరుపుతున్నారు. జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మధ్యాహ్నం చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వ్యక్తి వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే జగిత్యాల పోలీసులను సంప్రదించాలని సూచించారు. రామడుగు: తాగునీటి సమస్యను పరిష్కరించాలని రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ పరిధిలోని పదోవార్డు ప్రజలు శనివారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. పంచాయతీ కార్యాలయం గేటుకు తాళం వేసి ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నప్పటికీ, తమ కాలనీకి సరఫరా చేయడం లేదన్నారు. పంచాయతీ కార్యదర్శికి వ్యతిరేకంగా నినా దాలు చేశారు. విషయం తెలుసుకున్న గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీవో శ్రావణ్కుమార్ గ్రామస్తులతో మాట్లాడి, తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. మల్యాల: తన తండ్రిని తిడుతున్నాడని ఓ మైనర్ ఒకరిపై కత్తితో దాడి చేసిన సంఘటన మల్యాల మండలం రాజారాం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నరేష్కుమార్ కథనం ప్రకారం.. గ్రామంలో శుక్రవారం రాత్రి అదే గ్రామానికి చెందిన బక్కశెట్టి రాకేశ్ ఇంటి నుంచి బయటకు వెళ్లి బక్కశెట్టి తిరుపతి ఇంటి ఎదుట కూర్చొని ఇరువురు మాట్లాడుకుంటున్నారు. ఆ చర్చ వాదనగా మారింది. రాకేశ్ తన తండ్రిని తిడుతున్నాడని తిరుపతి కుమారుడు ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి రాకేశ్పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాకేశ్ను 108లో ఆస్పత్రికి తరలించారు. బాధితుడి నానమ్మ బక్కశెట్టి బూదమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముస్కానిపేట డాలర్ల పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం.. వర్షం కొడితేనే పంటలు.. లేకుంటే భూములు బీళ్లు. మదినిండా కష్టాలు.. కంటినిండా కన్నీళ్లు.. ఇవన్నీ దూరం కావాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారు. ఉన్నత చదువులతో కష్టాలను అధిగమించారు. విదేశాలకు వెళ్లి డాలర్ల పంట పండిస్తున్నారు. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్లుగా ఉద్యోగం చేస్తూ ఊరిని కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కుగ్రామం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేట యువత విద్యతోనే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. వివిధ దేశాల్లో 34 మంది సాఫ్ట్వేర్లుగా పనిచేస్తుండగా.. ఊరిలోనే 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఉన్నత విద్యతో ఊరి రాతనే మార్చుకున్న పల్లె యువత విజయగాథ ఈ వారం సండే స్పెషల్.నా కొడుకు రాకేశ్రెడ్డి 2011లో పూర్తిచేశాడు. చదువు పూర్తికాగానే కాలేజీ క్యాంపస్లో ఎంపికై టీసీఎస్లో ఉద్యోగం పొందాడు. 2021లో కంపెనీనే అమెరికాకు పంపింది. చిన్న కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. – సామ సత్యనారాయణరెడ్డి ముస్కానిపేట గ్రామ కమాన్ -
‘సాక్షి’పై కక్ష సాధింపు తగదు
కరీంనగర్: సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు తగదని, దాడులను తిప్పికొట్టే సమయం వచ్చిందని జర్నలిస్టులు స్పష్టం చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతీ పాత్రికేయుడు ధైర్యంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణచౌక్లో టీయూడబ్ల్యూజే(ఐజేయూ), సాక్షి మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న దమనకాండను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఐజేయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, సాక్షి బ్యూరో ఇన్చార్జి బి.అనిల్కుమార్ మాట్లాడుతూ నకిలీ మద్యం, అవినీతి, ప్రజాసమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోందన్నారు. ఇలాంటి ధైర్యవంతమైన జర్నలిజాన్ని అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్రపూర్వకంగా కేసులు నమోదు చేస్తోందని మండిపడ్డారు. ఇది మీడియా స్వేచ్ఛపై దాడి అన్నారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు ఏలేటి శైలేందర్రెడ్డి, రాజశేఖర్, సంపత్, రమణ, సతీశ్, గోపాలకృష్ణ, విజేందర్రెడ్డి, సతీశ్, కవికుమార్, వినయ్, సుధీర్, సుమంత్, నర్సింగ్, రాధాకృష్ణ, కిరణ్, మంద శ్రీనివాస్, ఆది రమణారావు, సిలివేరి మహేందర్, కొత్త సత్యం, పసుపులేటి శ్రీనివాస్, శ్రీనివాస్, మారుతి, బాలయ్య, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయం.. గుస్సాడీ నృత్యం
రాయికల్: గుస్సాడీ.. గోండు ప్రజలకు అదో ఆత్మీయ వేడుక. గుస్సాడీ అలంకరణ చేసుకునే వారు అత్యంత నియమనిష్టలతో ఉంటారు. దండారీ సంబరాలు ముగిసేవరకు గుస్సాడీలు ఒకే దగ్గర ఉంటారు. స్నానాలు కూడా చేయరు. నృత్యం చేసేవారు శరీరం మొత్తం బూడిద పూసుకుంటారు. ముఖానికి మసి రాసుకుంటారు. ప్రత్యేకమైన పేర్లదండలు ధరిస్తారు. కుడి చేతిలో మంత్ర దండం పట్టుకుంటారు. వీరిని దేవతలు ఆవహిస్తారని.. మంత్రదండంతో శరీరాన్ని తాకితే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని వారి నమ్మకం. సంతానం లేనివారు గుస్సాడీలను ఇంటికి ఆహ్వానించి అతిఽథి భోజనాలు వడ్డిస్తే సంతానం కలుగుతుందన్న భరోసా. మెడలో రుద్రాక్షలు, ఇతర గవ్వలతో కూర్చిన దండలు వేసుకుంటారు. తలపై నెమలి ఈకలతో తయారు చేసిన కుంటే (కిరీటం) ధరిస్తారు. ఇది చిన్నచిన్న అద్దాలతో అందంగా అలంకరించి ఉంటుంది. కాళ్లకు గజ్జెలు కడుతారు. డప్పులు, బాజాలు, తుడుం మొదలైన వాయిద్యాల శబ్దాలకు గజ్జెల సవ్వడి చేస్తూ.. అడుగులు వేస్తూ చేతిలో మంత్రదండాన్ని కదలాడిస్తూ నృత్యాలు చేస్తారు. గూడెంవాసులు తిలకిస్తూ ఆనందంలో మునిగితేలుతారు. ఈ ఏడాది నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 500 మంది గిరిజనులు జగన్నాథ్పూర్కు దండారీ బృందంతో వచ్చారు. ఈ ఏడాది అతిథ్యం ఇచ్చిన గ్రామంలోని బృందం మరుసటి సంవత్సరం అతిథ్యం స్వీకరించిన గ్రామానికి తరలివెళ్తుంది. బృందంలోని కొంద రు విజయసూచికగా పుతికట్టు (పోత్తి) ధరిస్తారు. ఈవిధంగా ఒక్కోగోండు గ్రామం కనీసం నా లుగైదు గ్రామాలతో సంబంధాల కొనసాగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం.. దూరంగా ఉండే గిరిజన గూడాల్లో పాడిపంటలు సమృద్ధిగా ఉండాలన్న ఆకాంక్ష, పెళ్లి సంబంధాలు కుదర్చడానికి ఈ వేడుకను వేదికగా చేసుకుంటున్నారు. దీపావళి ఉత్సవాల్లో ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఆసక్తికరంగా ఉంటుంది. సుమారు 50 మంది నుంచి 100 మంది పురుషులు గుస్సాడీ నృత్య వేషధారణ వేస్తారు. వీరిలో ఇద్దరు ఆడవేషంలో ఉంటారు. తమ దేవతైన ఏత్మాను తీసుకుని మరో గూడెంకు వస్తారు. గుస్సాడీ నృత్య ప్రదర్శన చేసే వారితోపాటు వచ్చిన వారు గూడెంలో తమ తెగలకు కుదిరే అమ్మాయిలు, అబ్బాయిల సంబంధాల విషయమై ఆరా తీస్తారు. రెండు గ్రామాల ఏత్మా దేవతలను ఒకచోట చేర్చి పూజలు నిర్వహిస్తారు. వాయిద్యాలే వారి దేవతలు గిరిజన గూడాల వారు డోలు వాయిద్యాలను ఆరాధ్యంగా పూజించే సంప్రదాయం కొనసాగుతోంది. గుస్సాడీ నృత్యాల్లో వాడే డోలు వాయిద్యాలన్నింటినీ ఒకచోట చేర్చి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. మొత్తంగా గిరిజన తెగలు ఇప్పటికీ సంప్రదాయాలు, ఆచారాలు పాటించడం గమనార్హం. గోండులను కలుపుతున్న దీపావళి జగన్నాథ్పూర్లో గుస్సాడి వేషధారణలు తరతరాల సంప్రదాయం మొదటిరోజు గ్రామదేవతలకు మొక్కి పూజలు నిర్వహించి వారం రోజుల పండగను ప్రారంభిస్తారు. రెండోరోజు గిరిజనులు ఒక గ్రామం నుంచి మరో గ్రామాలకు వెళ్తారు. మూడో రోజు గిరిజనులు వెళ్లిన గ్రామాల్లో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించి గుస్సాడీ నృత్యాలు, గిరిజన మహిళలు కోలాటాలతో రోజంతా కోలాహలంగా గడుపుతారు. నాలుగో రోజు గ్రామంలోని ఇంటింటికీ మంగళహారతులతో వెళ్లి పూజలు చేస్తారు. ఐదోరోజు కుల పెద్ద ఇంటి వద్ద పూజలు చేసి విందు భోజనాలు ఆరగిస్తారు. ఆరో రోజు కుల పెద్దకు ఇంటి దేవతను అప్పగిస్తారు. ఏడో రోజు దీక్ష విరమణ. -
అమెరికాకు నౌకలో వెళ్లాను
ముస్కానిపేట నుంచి మొదటిసారిగా 1961లో అమెరికాకు వెళ్లాను. చేతిలో కొంత డబ్బు ఉండడంతో విశాఖపట్నంలో నౌక ఎక్కి అమెరికాకు వెళ్లాను. అమెరికా యూనివర్సిటీలో స్కాలర్షిప్ వచ్చింది. ఉద్యోగంలో స్థిరపడ్డాను. తిరిగి ఐదేళ్లకు గ్రామానికి రాగా డప్పుచప్పుళ్లతో గ్రామస్తులు స్వాగతం పలికారు. ఇద్దరు తమ్ముళ్లు బాపురెడ్డి, మోహన్రెడ్డిలను అమెరికాకు తీసుకెళ్లాను. నాకు ఇద్దరు కూతుళ్లు. అమెరికాలో స్థిరపడ్డారు. మా కుటుంబంలో అందరికీ గ్రీన్కార్డ్స్ ఉన్నాయి. కనెక్టికట్ స్టేట్లో నివాసం ఉంటున్నాం. మా తమ్ముడు బాపురెడ్డిని ఇల్లంతకుంట మండలంలో అమెరికా బాపురెడ్డి అని పిలుచుకుంటారు. – కోమటిరెడ్డి నరసింహారెడ్డి -
అందరి అభిప్రాయం ముఖ్యమే..
కరీంనగర్ కార్పొరేషన్: పార్టీ శ్రేణుల అభిప్రాయాల మేరకే డీసీసీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని పీసీసీ పరిశీలకుడు, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం నగరానికి వచ్చిన ఆయన, డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్తో కలిసి అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. కిరణ్కుమార్రెడ్డికి డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సత్తు మల్లేశం, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి స్వాగతం పలికారు. వాకింగ్ ట్రాకా.. హైవే రోడ్డా!కరీంనగర్ కార్పొరేషన్: అధికారులు కళ్లు మూ సుకుంటే, కాంట్రాక్టర్లు చెలరేగిపోతారనడానికి నగరంలోని స్మార్ట్సిటీ పార్క్లే నిదర్శనం. జ్యో తిబాపూలే పార్క్ నిర్వహణను ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీకి నగరపాలకసంస్థ అప్పగించింది. సదరు ఏజెన్సీ నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టారీతిన వ్యవహరిస్తుండడం గతంలోనూ వివాదాస్పదంగా మారింది. తాజాగా వాకింగ్ ట్రాక్పై ఏకంగా కార్లు నడుపుతున్నా, నగరపాలకసంస్థ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. జ్యోతి బా పూలే పార్క్లో టపాసుల దుకాణాలు ఏర్పా టు చేయడంతో, కొనుగోలుదారులు అధికసంఖ్యలో వస్తున్నారు. శనివారం పార్క్లోని వాకింగ్ ట్రాక్పై ఏకంగా కారు నడిపించడం కనిపించింది. ఓ వైపు వాకర్స్ నడుస్తుండగానే, కారు ట్రాక్పై పోనీయడం గమనార్హం. వాకర్స్ కోసమే మల్టీపర్పస్, జ్యోతిబా పూలే పార్క్ల్లో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేశారు. వాకింగ్ ట్రాక్పై వాహనలు నడిపించడంపై వాకర్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.నవోదయ గడువు పొడిగింపుచొప్పదండి: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండో తరగతిలో 2026– 27 విద్యా సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీట్లభర్తీకి అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకొనేందుకు చివరి తేదీని ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు, తొమ్మిదోతరగతి కోసం, పదోతరగతి చదువుతున్న విద్యార్థులు పదకొండో తరగతిలో ప్రవేశానికి అర్హులని తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు, ఏవైనా సవరణలు చేయడానికి ఈ నెల 24 నుంచి 26వరకు కరెక్షన్ విండో తెరవబడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు నవోదయ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. బీసీలపై కాంగ్రెస్ది కపట ప్రేమకరీంనగర్: కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ నేడు బీసీలపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్రావు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత వైఖరికి నిరసనగా చేపట్టిన బీసీ బంద్కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఓబీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇచ్చి చరిత్ర సృష్టించిందన్నారు. కులగణనపై మోడీ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని, 75 ఏళ్ల తర్వాత దేశంలో 2027లో జరగబోయే దేశ జనగణన పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాసీ్త్రయ పద్ధతిలో, డిజిటల్ ఆధారాలతో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. పశువులకు ఆపదా.. టోల్ఫ్రీ నంబర్ 18004252244కరీంనగర్ అర్బన్: అత్యవసర పశువైద్యానికి జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి డా.నల్ల లింగారెడ్డి ప్రత్యేక నంబర్ను ఏర్పాటు చేశారు. పాడి సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పశువులకు అత్యవసర వైద్యం అందేలా టోల్ ఫ్రీ 18004252244 నంబర్ను ఏర్పాటు చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ నంబర్ కేవలం అత్యవసర వైద్యానికేనని, సాధారణ వైద్యానికి వినియోగించవద్దని డాక్టర్ లింగారెడ్డి వివరించారు. -
ముస్కానిపేట డాలర్ల పంట
ఇల్లంతకుంట(మానకొండూర్): అది పేరుకే పల్లెటూరు. ఆ ఊరిలోని యువత దారి అమెరికా, యూరప్ దేశాలు. దాదాపు ప్రతీ ఇంటిలో ఉన్నత విద్యావంతుడు ఉంటారు. ఇప్పటికే 34 మంది విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడగా.. గ్రామంలోనే ఉంటున్న 17 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వీరిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి యువత ఉన్నత చదువులు.. విదేశాల్లో కొలువులే లక్ష్యంగా హైదరాబాద్, బెంగళూర్ నగరాల్లో చదువుకుంటున్నారు. కుగ్రామం ముస్కానిపేట విజయగాథపై సండే స్పెషల్. ముస్కానిపేట గ్రామం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అమెరికాకు వెళ్లిన మొట్టమొదటి వ్యక్తిగా ఇల్లంతకుంట మండలంలోని ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి గుర్తుకొస్తారు. 1954లో గ్రామపంచాయతీగా ఏర్పడ్డ ముస్కానిపేటలో 3,625 మంది జనాభా నివసిస్తున్నారు. మండల కేంద్రం ఇల్లంతకుంటకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గ్రామంలో అతి పురాతనకాలం నాటి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆధ్యాత్మికతను పంచుతుండగా.. గ్రామం మొదట్లో దేవతామూర్తుల చిత్రాలతో ఆర్చి స్వాగతం పలుకుతుంటుంది. గ్రామం నుంచి అమెరికాకు వెళ్లిన వారు 11 మంది, లండన్లో ఇద్దరు, ఆస్ట్రేలియాలో ఒకరు, ఇండియాలో 21 మందితో కలిపి 34 మంది సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. కె.లక్ష్మారెడ్డి అనస్తీషియా డాక్టర్గా యశోద ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. బద్దం అనిల్, సారా నరేశ్గౌడ్, సింగిరెడ్డి రమణారెడ్డి వివిధ బ్యాంకుల్లో మేనేజర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామంలో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా ఇటీవల ఏడుగురు ఉద్యోగ విరమణ పొందారు. ముస్కానిపేటకు చెందిన కోమటిరెడ్డి నరసింహారెడ్డి వరంగల్లోని రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ)లో ఇంజినీరింగ్ చదివారు. గ్రామంలో నిధులు సమకూర్చుకొని అమెరికాకు వెళ్లారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మొట్టమొదటి వ్యక్తిగా 1961లో అమెరికాకు వెళ్లారు. నరసింహారెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామంలోని చాలా మంది యువకులు అమెరికాకు వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. అమెరికా, యూరప్ దేశాల్లో యువత విదేశాల్లో పనిచేస్తున్న 34 మంది 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు ముగ్గురు బ్యాంక్ మేనేజర్లు ఒక డాక్టర్.. ఇదీ ఆ పల్లె విజయగాథ -
లాస్ట్డే పోటెత్తిన లిక్కర్ దరఖాస్తులు
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం 2025– 27 సంవత్సరానికి ప్రవేశపెట్టిన మద్యం టెండర్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. చివరిరోజు దరఖాస్తులు పోటెత్తగా.. జిల్లాలోని ఎకై ్సజ్ కార్యాలయాల్లో అర్ధరాత్రి దాటినా ప్రక్రియ కొనసాగింది. గతనెల 26న ఆబ్కారీశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్ని రోజులు ఆచితూచి వ్యవహరించిన మద్యం వ్యాపారులు చివరిరోజు గ్రూపులుగా మారి టెండర్లు వేశా రు. దీంతో మొత్తం దరఖాస్తుల్లో సగం చివరిరోజే పడ్డాయి. గతేడాది కన్నా తక్కువే టెండర్లు దాఖలు కాగా.. దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచడమే ప్రధాన కారణమని పలువురు చెబుతున్నారు. గతేడాది జిల్లావ్యాప్తంగా మొత్తం 4,040 టెండర్లు దాఖ లు కాగా.. ప్రభుత్వానికి రూ.80.80 కోట్ల ఆదా యం సమకూరింది. ఈసారి శనివారం అర్ధరాత్రి వరకు 2,519 దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. టెండర్ల సంఖ్య తగ్గినా ఆదాయం సమకూరడంతో ఆబ్కారీవర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఈనెల 23న లక్కీ డ్రా తీయనున్నారు. కరీంనగర్లో టెండర్ల ప్రక్రియను స్పెషల్ ఆఫీసర్, ఎకై ్సజ్శాఖ జాయింట్ కమిషనర్ సురేశ్ రాథోడ్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు పరిశీలించారు. చివరిరోజు సిండికేట్? ఈ సారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలుగా నిర్ణయించడంతో, కొత్తవారు టెండర్ వేసేందుకు ధైర్యం చేయలేకపోయారు. టెండర్ ఫీజు పెంచడం లిక్కర్ కింగ్లకు కలిసొచ్చిందని పలువురు అనుకుంటున్నారు. ఇప్పటికే మద్యం వ్యాపారంలో కొనసా గుతున్నవారు ఫీజుకు భయపడకుండా, చివరిరోజు గ్రూపులుగా ఏర్పడి పెద్దఎత్తున దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. టెండర్లో తాము కోరుకున్న వైన్స్లు దక్కితే లిక్కర్కింగ్లు సెలెంట్గా ఉంటారని, లేదంటే ఆయాస్థానాల్లో ఇతరులు దక్కించుకున్న వైన్స్లను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చ జరుగుతోంది.సర్కిల్ వైన్స్లు దరఖాస్తులు కరీంనగర్ అర్బన్ 21 699 కరీంనగర్ రూరల్ 26 743 తిమ్మాపూర్ 14 443 హుజూరాబాద్ 17 337 జమ్మికుంట 16 297 మొత్తం 94 2,519 -
కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా లేదు. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.9అంజన్న సన్నిధిలో సందడి మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నారు.పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: చెట్ల కొమ్మల తొలగింపు నేపథ్యంలో ఆది వారం ఉదయం 9 నుంచి 1.30 గంటల వరకు 33/11 కె.వీ.కొత్తపల్లి సబ్స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి, రాణిపూర్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
వైద్యులు పనితీరు మార్చుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ పనితీరు మెరు గు పరుచుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడేతో కలిసి జిల్లా వైద్యశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీహెచ్సీల వారీగా ప్రసవాలు, ఎన్ఆర్సీ రిపోర్ట్, ఆరోగ్య మహిళ, ఎన్సీడీ రిపోర్ట్, డెంగీ కేసులు, శుక్రవారం సభ, టీబీ కేసులు, వ్యాక్సినేషన్, ఓపీ, ఐపీ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో ఇమ్యునైజేషన్ పూర్తి కాకపోవడం, ప్రసవాల సంఖ్య తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిక్షయ్ పోర్టల్లో టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలను నమోదు చేయిస్తే ప్రభుత్వ సాయం అందుతుందని పేర్కొన్నారు. పీహెచ్సీల్లో జరిగిన ప్రసవాలు, వైద్యం పొందిన రోగుల సంఖ్యతో నోటీసు బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. ఆరేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు రాయవద్దని సూచించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, పీవో సనా పాల్గొన్నారు. -
బీసీ బంద్ సక్సెస్
కరీంనగర్/కరీంనగర్టౌన్: బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. కరీంనగర్లో బీసీ సంఘాలకు మద్దతుగా పలు కుల, సామాజిక సంఘాలు, పార్టీల నేతలు ఉదయం నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఆర్టీసీ ముందస్తుగా బస్సులను నిలిపివేసింది. బస్టాండు ప్రయాణికులు లేక బోసిపోయింది. టవర్ సర్కిల్లో దుకాణాలు మూసివేశారు. నగరంలోని పలుచోట్ల కొన్ని దుకాణాలు, హోటళ్లు తెరువగా వాటిని మూయించారు. బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. పలుచోట్ల ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సురేందర్ రెడ్డి, ఏఐఎఫ్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. ఆల్ ఇండియా యూత్ లీగ్ రాష్ట్ర కన్వీనర్ రావుల ఆదిత్య, అంబటి జోజిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, ఆటో సంఘం అధ్యక్షుడు మద్దెల రాజేందర్, నాయీబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు నీలం మొండయ్య తదితరులు పాల్గొన్నారు.నిర్మానుష్యంగా బస్టాండ్ ప్రాంతంనగరంలో మూసిఉన్న దుకాణాలు -
ఆపదలో గల్ఫ్ వలస జీవి
● స్వగ్రామంలో కుటుంబీకుల ఆందోళన ● కోమాలోకి వెళ్లిన బడుగుజీవిముస్తాబాద్(సిరిసిల్ల): కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను వదిలి ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన బడుగుజీవి కోమాలోకి వెళ్లిన సంఘటన స్వగ్రామంలోని భార్యపిల్లలను ఆవేదనకు గురిచేస్తోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన శివరాత్రి మధు ఏడాది క్రితం దుబాయ్ దేశానికి కూలీ పనులకు వెళ్లాడు. అక్కడ కొద్దిరోజులు పనిచేసిన మధు అనుకోకుండా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెలుగువారు మధును ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతుండగానే మధు కోమాలోకి వెళ్లాడు. దీంతో స్వగ్రామంలో ఉన్న భార్య సువర్ణ భర్తను కాపాడుకునేందుకు అప్పు చేసి చికిత్సకు డబ్బులు పంపింది. మధు ఆరోగ్యం క్షీణించడంతో స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని సంప్రదిస్తే మధుకు మెరుగైన చికిత్స అందించాలంటే రూ.6లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారని భార్య సువర్ణ తెలిపింది. అంత డబ్బు తమ వద్ద లేదని వాపోయింది. మధుకు ముగ్గురు కుమార్తెలు నవ్య, రాణి, ప్రియాంక. తమ కుటుంబానికి పెద్ద దిక్కును కాపాడాలని భార్య, పిల్లలు వేడుకుంటున్నారు. సనాతన ధర్మ రక్షణతోనే మానవాళికి మేలుమల్యాల: సనాతన ధర్మ పరిరక్షణతోనే విశ్వమానవాళికి మేలు చేకూరుతుందని, ఆలయాల రక్షణకు దత్తగిరి మహరాజ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోందని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ పీఠాధిపతులు తెలిపారు. అవదూతగిరి మహరాజ్, మహంత్ సిద్దేశ్వరానందగిరి మహరాజ్ ఆధ్వర్యంలో పీఠాధిపతులు కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయాన్ని శనివారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పురాతన ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించి, పూజించాలన్నారు. ఆలయ అర్చకులు పీఠాధిపతులను సన్మానించారు. ఆలయ ఈవో శ్రీకాంత్రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, స్థానాచార్యులు కపీందర్ స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, ఆలయ పర్యవేక్షకులు సునీల్కుమార్, చంద్రశేఖర్ పాల్గొన్నారు. నృసింహుడి సన్నిధిలో.. ధర్మపురి: అనంతరం పీఠాధిపతులు ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చైర్మన్ రవీందర్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. -
అభిప్రాయం గోప్యం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: సంస్థాగత ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శనివారంతో ముగిసింది. అభిప్రాయ సేకరణ సందర్భంగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో చోటుచేసుకున్న రభసతో పరిశీలకులు రూటు మార్చారు. ఓ హోటల్లో రహస్యంగా అభిప్రాయాలను సేకరించారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల డీసీసీ అధ్యక్ష, కరీంనగర్, రామగుండం సిటీ అధ్యక్ష స్థానాల ఆశావహుల నుంచి చివరిరోజు అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగియడంతో, నివేదికను అధిష్టానానికి అందించనున్నారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక మొదటిసారిగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ‘పార్టీశ్రేణుల అభిప్రాయాల మేరకే ఎంపిక’ విధానాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెట్టింది. ఏఐసీసీ పరిశీలకుడిగా శ్రీనివాస్ మన్నె, పీసీసీ నుంచి ఆత్రం సుగుణ, చామల కిరణ్కుమార్రెడ్డి, ఖాజాఫకృద్దీన్ను నియమించింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఉమ్మడి జిల్లాలో ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెళ్లి అక్కడ నాయకులను కలిసి ఎవరిని అధ్యక్షుడిని చేస్తే బాగుంటుందో తెలుసుకున్నారు. రూటు మార్చి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ అభిప్రాయ సేకరణ సందర్భంగా డీసీసీ కార్యాలయంలో ఆశావహు ల ఆధిపత్యపోరు రసాభాసకు దారితీయడం తెలి సిందే. నాయకుల నడుమ వాగ్వాదాలు, పాత, కొత్త నేతల పంచాయతీ, పోటాపోటీగా జనసమీకరణ, ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభిప్రాయాలు చేపట్టకుండానే పరిశీలకుడు వెనుదిరగాల్సి వచ్చింది. కరీంనగర్ అనుభవంతో, పరిశీలకులు రూటు మార్చారు. శుక్ర, శనివారాల్లో రహస్యంగా అభిప్రాయాలు తీసుకున్నారు. అధ్యక్ష స్థానాలకు పోటీపడుతున్న నాయకులు, పార్టీ పదవులున్న నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులను పిలిచి అభిప్రాయలు సేకరించారు. శనివారం ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి కూడా కరీంనగర్లోని అభిప్రాయ సేకరణలో పాల్గొన్నారు. ఎన్ని రోజులకో.. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ శ్రేణుల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు త్వరలో అధిష్టానానికి నివేదిక అందించనున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు, రెండు నగర అధ్యక్షుల ఎంపికకు అభిప్రాయ సేకరణ జరగగా, పరిశీలకులు ఇచ్చే నివేదికపైనే ఆశావహుల భవితవ్యం ఆధారపడి ఉంది. పార్టీ శ్రేణుల అభిప్రాయాలతో పాటు, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఉండే అవకాశముంది. పార్టీ పదవులు ఉన్న వారి నుంచి ఎక్కువగా అభిప్రాయాలు సేకరించడంతో, ఆ అభిప్రాయాలు పాత నాయకులకు అనుకూలమనే ప్రచారం ఉంది. నివేదికను అధిష్టానానికి ఎప్పుడు ఇస్తారు, డీసీసీలను ఎప్పుడు ప్రకటిస్తారో, ఈ మొత్తం ప్రక్రియ ఇంకెన్ని రోజులు పడుతుందో అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. పార్టీ చేపట్టిన అభిప్రాయ సేకరణను పూర్తిస్థాయిలో పరిగణలోకి తీసుకొంటారా, సామాజిక, ఆర్థిక సమీకరణల కారణంగా నియామకాలు చేపడుతారో వేచి చూడాలి.కరీంనగర్ 38 జగిత్యాల 36 రాజన్న సిరిసిల్ల 16 పెద్దపల్లి 25 కరీంనగర్ సిటీ 24 రామగుండం సిటీ 05 -
అజ్ఞాతంలోనే తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్
సిరిసిల్ల: మావోయిస్టు ఉద్యమ చరిత్రలో తొలిసారి నక్సలైట్లు ఆయుధాలను అప్పగించి సామూహికంగా లొంగుబాటు మొదలైంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్వార్) పార్టీ ఉద్యమం బలంగా ఉండేది. సమసమాజ స్థాపన కోసం ఆయుధాలను పట్టి ఎందరో అడవిబాట పట్టారు. ఏళ్లుగా ఉద్యమదారుల్లో నడిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన మరో ఇద్దరు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా ! అంటూ ఆ అజ్ఞాతవాసుల కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. జనజీవనంలోకి వస్తారా? అజ్ఞాతంలోనే ఉంటారా? అనే చర్చ సాగుతోంది.27 ఏళ్ల కిందట అడవిబాటరాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపలి్లకి చెందిన తుమ్మల శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 27 ఏళ్లుగా శ్రీనివాస్ జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా.. తల్లి భూదమ్మ ఎనిమిదేళ్ల కిందట మరణించింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు శ్రీనివాస్ రాకపోవడం విషాదం.పోలీస్ కౌన్సెలింగ్తోనే వెలుగులోకి...శ్రీనివాస్ డిగ్రీ చదువుతూ కనిపించకపోవడంతో ఏమయ్యాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తున్నాడని గుర్తించి.. బండలింగంపలి్లలోని అతని తల్లిదండ్రులు నారాయణ, భూదమ్మ ఇంటికెళ్లి.. కొడుకును లొంగిపోయేలా చూడండి.. అంటూ కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సంఘటనతోనే కొడుకు అజ్ఞాతంలోకి వెళ్లాడని తెలిసింది. ఒడిషా ప్రాంతంలో పనిచేస్తున్నాడని తరా>్వత వారికి తెలిసింది. కానీ ఆచూకీ లభించలేదు. కన్న కొడుకును చూడకుండానే తల్లిదండ్రులు కన్నుమూశారు.రా అన్నా.. కలిసుందాం అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్)తమ్మీ రారా..నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారంనాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన బండి చంద్రయ్య అలియాస్ మహేశ్ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పనిచేస్తున్నాడు. పదోతరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న చంద్రయ్య 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యలకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక్క కూతురు శాంతమ్మ. చిన్నకొడుకు చంద్రయ్య అడవిబాట పట్టారు. తల్లిదండ్రులు చిన్న కొడుకు తలంపులోనే అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల కిందట మరణించాడు. తల్లిదండ్రులు మరణించినా, సొదరుడు మరణించినా చంద్రయ్య ఇంటి ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినే దేవవ్వ ధర్మారంలో ఉంటున్నారు. -
సీపీఆర్పై అవగాహన అవసరం
కరీంనగర్ కార్పొరేషన్: ప్రాణాపాయం నుంచి కాపాడే సీపీఆర్ విధానంపై ప్రతీ ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సూచించారు. శుక్రవారం కళాభారతిలో నగరపాలకసంస్థ అధికారులు, ఉద్యోగులకు సీపీఆర్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుండెపోటు వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి గట్టెక్కించవచ్చన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని, శారీరక వ్యాయామం, యోగా లాంటివి అలవాటు చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ అధికారులు, ఉద్యోగుల కోసం త్వరలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణు మాధవ్, సహాయ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో పారిశుధ్య కార్మికురాలి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 56వ డివిజన్లో పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్న బడుగు రేణుక శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. విద్యానగర్ రోడ్డులోని శివ థియేటర్ పెట్రోల్ బంక్ సమీపంలో రేణుకను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. వెంటనే స్థానికులు, తోటి పారిశుధ్య కార్మికులు హాస్పిటల్కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మరణించింది. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మృతదేహం వద్దకు చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.20 వేల నగదు అందించారు. మృతురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఎంహెచ్వో సుమన్, శానిటేషన్ సూపర్వైజర్లు శ్యామ్రాజ్, అనిల్కుమార్ ఉన్నారు. -
రా అన్నా.. కలిసుందాం
అన్నను 27 ఏళ్లుగా చూడలేదు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఆందోళనగా ఉండేది. ప్రస్తుతం మావోయిస్టులు లొంగిపోతున్నారు. నువ్వు కూడా రా అన్న కలిసుందాం. 27 ఏళ్లుగా మన ఇల్లు ఎదురు చూస్తోంది. అమ్మానాన్నలు కాలం చేశారు. ఉద్యోగం చేస్తూ తలోదిక్కు వెళ్లాం. ఇప్పుడు మన ఇల్లు ఒంటరైంది. మీరు వస్తే కలిసి ఉందాం. – తుమ్మల మధుసూదన్, విశ్వనాథ్ సోదరుడు(టీచర్) తమ్మీ రారా.. నాకు పానం బాగా లేదు. అమ్మానాయిన్నలు, తమ్ముడు కాలం చేసిండ్రు. అడవిలో అన్నలు అందరూ తుపాకులు పోలీసులకు ఇచ్చి వస్తున్నారని తెలిసింది. నువ్వు కూడా ఎక్కడ ఉన్నా ఇంటికి రా.. తమ్మీ. ప్రజల కోసం నలభై ఏళ్లు అడవుల్లో పనిచేసినవ్ చాలు. ఇగ నువ్వు వస్తే కలోగంజో కలిసి తాగుదాం. నిన్ను చూసి సచ్చిపోవాలని ఉంది. నువ్వు వస్తావని ఆశతో చూస్తున్నా. ఏడున్నా రా తమ్మీ. – బండి నాంపల్లి, చంద్రయ్య సోదరుడు, ధర్మారం -
కలప పట్టివేత
చందుర్తి/రుద్రంగి(వేములవాడ): టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి రుద్రంగి మండల కేంద్రంలోని ఎస్సీకాలనీలో సుమారు రూ.లక్ష విలువైన టేకు కలపను శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. మండల కేంద్రంలోని గసికంటి గంగారెడ్డి ఇంట్లో టేకు కలప అక్రమంగా నిలువ ఉంచారన్న సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి 32 దుండలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని వేములవాడ అటవీశాఖ కార్యాలయం డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావుకు అప్పగించారు. పట్టుకున్న కలపను కొలతలు వేసి వాటి విలువను శనివారం వెల్లడిస్తామని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. టాస్క్పోర్స్ పోలీసుల దాడులతో కలప స్మగ్లర్లు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. -
ఐక్యరాజ్య సమితిలో భారత కీర్తి
రామగుండం: ప్రపంచ శాంతిపరిరక్షణలో భారతదేశం పోషిస్తున్న కీలకపాత్ర గురించి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. సమితిలో భారత్ తమ కీర్తిని చాటుకోవడం, వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, సమర్థత వంటి అంశాలపై సమావేశంలో పలు సూచనలు, సలహాలిచ్చే అవకాశం తనకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించిన పలు అంశాల గురించి ఆయన శ్రీసాక్షిశ్రీతో పంచుకున్నారు. అంతర్జాతీయ ఆర్థిక, పాలనా వ్యవహారాల్లో భారతదేశ స్వరాన్ని మరింత బలంగా వినిపించేందుకు అవకాశం లభించిందన్నారు. తనతో పాటు అడ్వయిజరీ కమిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ (ఏసీఏబీక్యూ) చైర్పర్సన్ జూలియానా గాస్పర్ రుయాస్, యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్(ఫైనాన్స్ అండ్ బడ్జెట్ కంట్రోలర్) చంద్రమౌళి రామనాథన్తో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించానని ఎంపీ వివరించారు. -
రాజీవ్ రహదారిపై కారు దగ్ధం
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి రాజీవ్ రహదారిపై గురువారం అర్ధరాత్రి కారు దగ్ధమైంది. వివరాలు.. మంచిర్యాలకు చెందిన నాగరాజు తన కుటుంబసభ్యులతో కలిసి కరీంనగర్ నుంచి మంచిర్యాలకు వెళ్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఎన్టీపీసీ బీ–గేట్ ఎదుట రాజీవ్ రహదారిపై డివైడర్కు ఢీకొంది. ఈ క్రమంలో కారులో మంటలు లేచాయి. ఇంజిన్లో ఏర్పడిన మంటలు ఒక్కసారిగా ఎగిసి పడ్డాయి. కారులో ఉన్నవారు గమనించి వెంటనే కిందకు దిగి స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితోపాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో కారులో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
వైన్స్ టెండర్లు తగ్గినయ్
కరీంనగర్క్రైం: జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. శనివారంతో దరఖాస్తుల గడువు ముగుస్తుండగా.. శుక్రవారం సాయంత్రం వరకు 1,034 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇందులో శుక్రవారం 615 మంది టెండర్లు వేశారు. 2023లో గడువు కంటే ఒకరోజు ముందు వరకు 2,014 దరఖాస్తులు రాగా.. చివరిరోజు 2,026 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4,040 దరఖాస్తుల ద్వారా రూ.80.80కోట్ల ఆదాయం సమకూరింది. శనివారం ఆఖరి రోజు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెద్దఎత్తున పెరిగే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. మద్యం టెండర్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పెద్దగా దరఖాస్తులు ఎప్పుడూ రాలేదు. చివరి రెండు, మూడు రోజుల్లో పెరుగుతూ వస్తోంది. ఈసారి కూడా గతంలో లాగే గడువు సమీపిస్తున్నా కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈసారి అదేవిధంగా పెరుగుతుందని ఎకై ్సజ్ వర్గాల నుంచి ఆశాభావం వ్యక్తమవుతోంది. ఆఖరి రోజే లిక్కర్ కింగ్ల ఎంట్రీ మద్యం వ్యాపారాన్ని ఏళ్ల తరబడి ఏలుతున్న లిక్కర్ కింగ్లు ఆఖరు రోజు ఎంట్రీ ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు పలువురు గ్రూపులుగా ఏర్పడి ఎక్కడెక్కడ.. ఏ షాపులకు టెండర్లు వేయాలని నిర్ణయించుకొని పార్ట్నర్లను ఎంచుకొని ఆఖరు రోజు కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. గతంలో కూడా పలువురు పాత వ్యాపారులు పెద్దఎత్తున దరఖాస్తులు చివరి రోజు చేసుకున్నారు. చివరి రోజైతేనే కలిసి వస్తుందని సెంటిమెంట్తో ఆఖరి రోజే వేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈసారి టెండర్ ఫీజు రూ.3లక్షలు చేయగా.. కొత్తగా రంగంలోకి దిగుతున్న వారు డబ్బు విషయంలో ఆలోచించి పార్ట్నర్లుగా వేస్తున్నారు. పలువురు సింగిల్గా కాకుండా ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువమంది కొంత మొత్తాన్ని పెట్టుకొని వివిధ షాపులకు అధిక సంఖ్యలో టెండర్లు వేసి చేజిక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా శనివారంతో వైన్స్ టెండర్ల గడువు ముగియనుండడంతో చివరి రోజు పెద్దఎత్తున దరఖాస్తులు రానున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చివరిరోజు రానున్నట్లు తెలుస్తుండగా.. టెండర్ల గడువు పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రభుత్వం నేడు మధ్యాహ్నం వరకు చూసి దరఖాస్తుల సంఖ్యను బట్టి నిర్ణయం తీసుకుంటుందని జిల్లా ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సర్కిల్ వైన్సులు దరఖాస్తులు కరీంనగర్ అర్బన్ 21 321 కరీంనగర్ రూరల్ 26 298 హుజూరాబాద్ 17 119 జమ్మికుంట 16 115 తిమ్మాపూర్ 14 181 -
చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యం
గంగాధర: చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యమని, పిల్లల్లో పోషణలోప నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గంగాధరలోని జిల్లా పరిషత్ పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో పోషణమాసం, శుక్రవారం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీసేవలను పర్యవేక్షించడంతో పాటు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పాఠశాలలు, అంగన్వాడీకేంద్రాల్లో విటమిన్ గార్డెన్ల ద్వారా కూరగాయల సాగు చేసి మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నామన్నారు. గర్భిణులు, బాలింతలు ఐరన్ మాత్రలు తీసుకోవాలని, ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలు, గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన నిర్వహించారు. తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో దమ్మని రాము, సీడీపీవో నర్సింగరాణి, ఎంఈవో ప్రభాకర్రావు పాల్గొన్నారు. -
బాస్కెట్ బాల్లో కరీంనగర్.. టేబుల్ టెన్నిస్లో వరంగల్
● ముగిసిన ట్రాన్స్కో, డిస్కం ఇంటర్ సర్కిల్ పోటీలు కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ విద్యుత్ భవన్లో నిర్వహించిన ట్రాన్స్కో, డిస్కం ఇంటర్సర్కిల్ బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నిస్ పోటీలు శుక్రవారం రాత్రి ముగిశాయి. బాస్కెట్బాల్ ఓవరాల్ చాపియన్గా కరీంనగర్ టీజీఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్, టేబుల్ టెన్నిస్ ట్రోఫీని వరంగల్ జట్లు నిలిచాయి. విజయం సాధించిన జట్లకు ట్రాన్స్కో కరీంనగర్ జోన్ చీఫ్ ఇంజినీర్లు జె.విజయ్కుమార్ పాపారావు ట్రోఫీ అందజేశారు. ట్రాన్స్కో ఎస్ఈ, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్రెడ్డి, ఎస్ఈ మేక రమేశ్బాబు, వేణుబాబు, డీఈ ఉపేందర్, ఏవో అర్వింద్, పీవో చంద్రయ్య, శ్రీధర్రెడ్డి, ఈఎల్పీ రాజు, రాజ్కుమార్ పాల్గొన్నారు. -
కరీంనగర్
వాతావరణం ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం తక్కువగా ఉంది. చలి తీవ్రత పెరుగుతుంది. ఎండగా ఉంటుంది.Iవేములవాడ: రాజన్నను శుక్రవారం 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. క్వింటాల్ పత్తి రూ.6,800జమ్మికుంట: స్థానిక మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 6,800 పలికింది. క్రయ విక్రయాలను మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, కార్యదర్శులు మల్లేశం, రాజా పర్యవేక్షించారు. -
‘ఇందిరమ్మ’ గృహప్రవేశం
● ‘సుడా’ చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేటలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా శుక్రవారం ఇంటి నిర్మాణం పూర్తయిన ఆకుల రమ్య–రవీందర్ దంపతుల మొదటి గృహప్రవేశం కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. లబ్ధిదారు దంపతులకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో మొత్తం 3,500 ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి మహేందర్, నాయకులు కె.రాంరెడ్డి, ఎస్.తిరుపతి, జి.బాపురెడ్డి, బి.తిరుపతిగౌడ్, స్వామిగౌడ్, నారాయణగౌడ్, కె.నరేశ్రెడ్డి, బి.అంజనేయులు పాల్గొన్నారు. -
‘సాక్షి’పై కక్ష సాధింపు విడనాడాలి
కరీంనగర్కల్చరల్/కరీంనగర్: ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిని విడానాడాలని పలువురు కవులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సూర్య రెసిడెన్సీలో తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయుడు షోయబ్ ఉల్లా ఖాన్ జయంతి సభ నిర్వహించి, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. పాత్రికేయ వృత్తి సవాళ్లు, విశిష్టతను గురించి చర్చించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్, పీఎస్.రవీంద్ర, దామరకుంట శంకరయ్య, నసీరుద్దీన్, వాజీద్, మునీర్, నెరువట్ల చైతన్య, విలసాగరం రవీందర్, మెరుగు ప్రవీణ్, ఖాలీద్ పాల్గొన్నారు.సాక్షి కార్యాలయంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి. భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం. సాక్షి ఎడిటర్పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. – కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి ఎడిటర్పై కక్షసాధింపు సరికాదు. విచారణ పేరుతో సాక్షి కార్యాలయంలో హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. ఏపీ ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడిని ఖండిస్తున్నాం. మీడియాను అణచివేయాలనుకోవడం హేయమైన చర్య. – ఎస్.రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు -
అలరించిన ఫేరియా ఫియెస్టా
● ప్రారంభించిన వీసీ ఉమేశ్కుమార్ సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఫేరియా ఫియెస్టా–2 పేరిట పర్యావరణహిత స్వదేశీ దీపావళి ప్రదర్శన క్యాంపస్ ఎకో బజా ర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఉమేశ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పర్యావరణ స్నేహి జీవ న విధానాన్ని ప్రతిబింబించేవిధంగా ఏర్పాటు చేసిన పలు స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచా యి.కార్యక్రమంలో ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ, కళాశాల ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి, ఈవెంట్ సమన్వయకర్త నల్ల మనోజ్కుమార్, విద్య, అకాడమిక్ కోర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి రజనిదేవి పాల్గొన్నారు. పెండింగ్ చలాన్ల వసూళ్లకు ప్రత్యేక బృందాలుకరీంనగర్క్రైం: పెండింగ్ చలాన్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్ ఆలం వెల్లడించారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే 301 మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారని.. వారి వాహనాలపై రూ.64,39,715 పెండింగ్ చలాన్లు ఉన్నాయని వివరించారు. పెండింగ్ చలాన్లు లేకుండా చూడాలని ప్రత్యేక బృందాలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. శాతవాహన పరిధిలో నేటి పరీక్షలు వాయిదాసప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో శనివారం జరగనున్న ఎంఏఎడ్ రెండో సెమిస్టర్, బీఫార్మసీ రెండో సెమిస్టర్, ఎల్ఎల్ఎం నాల్గో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన ఎంఎడ్, బీఫార్మసీ పరీక్షలు 22న, ఎల్ఎల్ఎం పరీక్ష 29న నిర్వహించనున్నట్లు, మిగిలిన పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. చట్టాలపై అవగాహన పెంచుకోవాలితిమ్మాపూర్: చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాదికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె. వెంకటేశ్ అన్నారు. శుక్రవారం నుస్తులాపూర్ ఉన్నత పాఠశాల, ఎల్ఎండీ కాలనీలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి కె.వెంకటేశ్ సైబర్ చట్టాలు, బాల్య వివాహాలు, ఇతర న్యాయ పరమైన అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చిన్న వయసులోనే మంచి నడవడిక అలవర్చుకోవాలని, విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ బాధ్యులు తనకు మహేశ్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు ఎ. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీనగర్కాలనీ, అంజనాద్రి దేవాలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, జెడ్పీ క్వార్టర్స్, భగత్నగర్, మల్లమ్మ మార్కెట్, కొమ్ము రాజు, గోదాం వెనక భాగం, రఘుపతిరెడ్డి హాస్పిటల్, తహారా మజీవ్, సంతోష్మాత దేవాలయం, సప్తగిరికాలనీ, ఆటోస్టాండ్, జానకి వీధి, మల్లికార్జునకాలనీ, సప్తగిరి హిల్స్, జెడ్పీ క్వార్టర్స్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సర్కస్ మైదానం, పద్మనాయక కల్యాణ మండపం, ఐబీ చౌరస్తా, శ్రీలత అపార్ట్మెంట్, రామాలయం, రెనె ఆసుపత్రి, ఇందిరానగర్, ప్రశాంత్నగర్కాలనీ, హనుమాన్ దేవాలయం, కోర్టు వాటర్ ట్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు వ్యోక్స్వాగన్ లేన్, అల్కాపురి, పైపుల కంపెనీ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. కొత్తపల్లి, చింతకుంటలో.. విద్యుత్ తీగలకడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శనివారం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు 33/11 కేవీ కొత్తపల్లి, రేకుర్తి సబ్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలు, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చింతకుంటలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ జి.రఘు తెలిపారు. -
పీజీ మెడికల్ కాలేజీగా సిమ్స్
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ) కాలేజీకి పీజీ మెడికల్ కాలేజీగా గుర్తింపు లభించింది. సిమ్స్ కాలేజీకి నాలుగు విభాగాల్లో కొత్తగా పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ) నుంచి శుక్రవారం జీవో జారీ అయినట్లు ప్రిన్సిపాల్ హిమబింద్సింగ్ తెలిపారు. పీజీ సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రంలో 2022–23 విద్యాసంవత్సంతో ప్రారంభమైన 23 కొత్త మెడికల్ కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయన్నారు. ఇందులో రామగుండం సిమ్స్కు మాత్రమే పీజీ సీట్లకు ఎన్ఎంసీ నుంచి అనుమతి లభించడం గమనార్హం. ఈ ఏడాది నుంచే పీజీ కాలేజీ ప్రారంభానికి ఎన్ఎంసీ పచ్చజెండా ఊపడంపై ప్రిన్సిపాల్తోపాటు వైస్ ప్రిన్సిపాల్ నరేందర్, హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెస ర్లు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు యూజీ వైద్య విద్య ఉన్న సిమ్స్లోనే ఈఏడాది నుంచి పీజీ తరగతుల అమలుకు జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంపీ) వెసులుబాటు కల్పించింది. అన్నింటికీ గ్రీన్సిగ్నల్.. సిమ్స్కు నాలుగు విభాగాల్లో నాలుగు పీజీ సీట్ల చొప్పున కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, నేషనల్ మెడికల్ కౌన్సిల్(ఎన్ఎంసీ)కి ఆరు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న అన్ని సీట్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. కేటాయించిన పీజీ సీట్లు ఇవే.. ఎండీ : ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ప్రసూతి, గైనకాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎంఎస్ : ఆర్థోపెడిక్స్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు ఎండీ : బయో : కెమెస్ట్రీ విభాగంలో కూడా నాలుగు పీజీ సీట్లు కేటాయించారు. -
అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదు
● అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ ఓదెల(పెద్దపల్లి): అర్చకులను అవమానిస్తే ఊరుకునేది లేదని అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హెచ్చరించారు. ఓదెల మల్లికార్జునస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. ఆలయ ఈవో సదయ్యకు వినతిపత్రం అందజేశారు. ఓదెల మల్లికార్జునస్వామి ప్రధాన అర్చకునితోపాటు మరో అర్చకుడిపై పాలకవర్గ చైర్మన్ దురుసుగా మాట్లాడడం, అగౌరవ పర్చడం శోచనీయమన్నారు. వారి తీరును ఎమ్మెల్యే విజయరమణారావు దృష్టికి తీసుకెళ్లగా పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఆలయంలో స్వామివారికి నిర్వహించే నిత్యకై ంకర్యాలపై పాలకవర్గం పెత్తనం మానుకోవాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో ఓదెల ఆలయ అర్చకులు, కరీంనగర్, జగిత్యాల జిల్లాల ధూపదీప, నైవేద్య అర్చక నాయకులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులతో ఇద్దరు యువకులు మద్యం మత్తులో దురుసుగా ప్రవర్తించిన ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు ప్రధాన రహదారిపై డ్రంకెన్డ్రైవ్ టెస్టులు చేస్తుండగా ఇద్దరు యువకులు మద్యం సేవించి బైక్పై వస్తున్నారు. వీరిని గుర్తించిన పోలీసులు డ్రంకెన్డ్రైవ్ టెస్ట్ నిర్వహించి బైక్ను సీజ్ చేశారు. దీంతో కోపోద్రిక్తులైన యువకులు ప్రధాన రహదారిపై బైఠాయించి వాహనాలు ఆపుతూ.. పోలీసులపైకి దూసుకెళ్తూ హంగామా చేశారు. మరింత మంది పోలీసులు అక్కడికి చేరుకొని సదరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. రామగుండం ఎన్టీపీసీలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తిజ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి తగ్గినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 2,600 మెగావాట్లు. ఇందులోని 500 మెగావాట్ల సామర్థ్యం గల 4, 6, 7వ యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచినట్లు తెలుస్తోంది. 200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల మూడో యూనిట్లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుతం 2,600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులో 900 మెగావాట్లే ఉత్పత్తి అవుతున్నటున్ల సమాచారం. థర్మల్ ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ లేక ఉత్పత్తిని తగ్గించినట్లు తెలుస్తొంది. -
పార్కిన్సన్ బాధితులకు ‘డీబీఎస్’ కొత్త ఆశ
● మందులు పనిచేయని దశలోనూ అద్భుత ఫలితాలు ● యశోద హాస్పిటల్స్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలుకరీంనగర్: మందులకు స్పందించని రోగులకు డీబీఎస్ చికిత్స అద్భుత ఫలితాలనిస్తోందని, హైటెక్సిటీ యశోద హాస్పిటల్స్ సీనియర్ న్యూరో సర్జన్ రాజేశ్ అలుగోలు తెలిపారు. శుక్రవారం నగరంలోని యశోద మెడికల్ సెంటర్లో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పార్కిన్సన్ వ్యాధి వేధిస్తోందన్నారు. గతంలో వృద్ధుల్లోనే కనిపించే ఈ సమస్య, ప్రస్తుతం యువతలోనూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. శరీర కదలికలను నియంత్రించే మెదడులోని భాగాలపై ఈ వ్యాధి ప్రభావం చూపుతోందని, ఫలితంగా చేతులు వణకడం, నడకలో ఇబ్బందులు, శరీరం బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించారు. వ్యాధి ప్రారంభదశలో మందులతో నియంత్రించినప్పటికీ, కాలక్రమేణా వాటి ప్రభావం తగ్గుతోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శస్త్రచికిత్స ఆధారిత ‘డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్’ (డీబీఎస్) కొత్త ఆశలు రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ విధానంలో మెదడులోని నిర్దిష్ట భాగాల్లో ఎలక్ట్రోడ్లను అమర్చి, ఛాతీలో అమర్చిన చిన్న పరికరానికి అనుసంధానిస్తామన్నారు. ఈ పరికరం పంపే విద్యుత్ సంకేతాలు మెదడు కార్యకలాపాలను నియంత్రిస్తాయిని వివరించారు. సరైన మందులు, వ్యాయామం, ఆధునిక చికిత్సలను సమన్వయం చేసుకుంటే పార్కిన్సన్ బాధితులు సాధారణ జీవితం గడపవచ్చని సూచించారు. -
అంతటా శివుడే
రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులతో తాత్కాలికంగా భక్తులకు ఇబ్బందులు కలిగినా భవిష్యత్లో మంచి సౌకర్యాలు వస్తాయి. రాజన్న, భీమన్న, నగరన్న ఆలయాల్లో శివలింగాలు దర్శనమిస్తాయి. వేములవాడకు వచ్చిన భక్తులు ఎక్కడ దర్శించుకున్నా శివుడిని దర్శించుకున్నట్లే. – నందిపేట సుదర్శన్యాదవ్, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్తమరింత ప్రాచూర్యం ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం ఇప్పుడు అభివృద్ధికి భీజం పడింది. మొదటిదశగా రూ.150కోట్లతో పనులు చేస్తున్నారు. విస్తరణ పూర్తతే రాజన్న ఆలయ ప్రాశస్థ్యం మరింత పెరుగుతోంది. భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. – సగ్గు పద్మ, రాజన్న ఆలయ మాజీ ధర్మకర్త పీఠాధిపతుల సూచనలతో.. రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులన్నీ శృంగేరి పీఠాధిపతుల సూచనలు, సలహాల మేరకు చేపడుతున్నాం. భక్తుల మనోభావా లకు అనుగుణంగా, స్థానికులు, పురప్రముఖుల సూచనల మేరకు పనులు చేపడుతున్నాం. ఇంకా సలహాలు, సూచనలు ఎవరూ చేసినా స్వీకరిస్తాం. ఆలయ అభివృద్ధే మా ధ్యేయం. వేములవాడను టెంపుల్ సిటీగా మారుస్తాం. – ఆది శ్రీనివాస్, ప్రభుత్వవిప్ -
శృంగారంలో ఉండగా స్పృహ కోల్పోయాడని..
కరీంనగర్క్రైం: నిత్యం డబ్బుల కోసం వేధిస్తున్నాడని భర్తను చంపాలనుకున్నదో భార్య. మొదటిసారి విఫలం కావడంతో రెండోసారి మద్యంలో బీపీ, నిద్రమాత్రలు పొడిచేసి కలిపి తాగించింది. అపస్మారస్థితిలోకి వెళ్లాక ఉరేసి చంపేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితురాలితో పాటు ఐగురుగురిని కరీంనగర్ టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్లో గురువారం సీపీ గౌస్ఆలం కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..నగరంలోని సప్తగిరికాలనీలో నివాసముంటున్న కత్తి మౌనిక, సురేశ్ 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మౌనిక ఇటీవల సెక్స్వర్కర్గా మారింది. సురేశ్ నిత్యం డబ్బుల కోసం వేధించడంతో చంపాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం తన బంధువులైన అరిగె శ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి అజయ్, నల్ల సంధ్య ఊరాఫ్ వేముల రాధ, నల్ల దేవదాస్ సాయం కోరింది. వారి సూచనల మేరకు ఒకరోజు వయాగ్రా మాత్రలు కూరలో కలిపి చంపాలని ప్రయత్నించగా, వాసన రావడంతో సురేశ్ తినలేదు. గతనెల 17న సురేశ్ మద్యం సేవిస్తుండగా బీపీ, నిద్ర మాత్రలు పొడిగాచేసి మద్యంలో కలపడంతో అది తాగిన సురేశ్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు.సురేశ్ మెడకు చీరను బిగించి, కిటికి గ్రిల్కు వేలాడదీసి ఉరేసి చంపేసింది. తర్వాత లైంగిక చర్య సమయంలో స్పృహ కోల్పోయాడని తన అత్తమామలకు చెప్పింది. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే సురేశ్ మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మౌనిక ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. ఆమెను విచారించగా తానే అరిగెశ్రీజ, పోతు శివకృష్ణ, దొమ్మాటి ఆజయ్, వేముల రాధ, నల్ల దేవదాస్ సాయంతో హత్య చేసినట్లు ఒప్పుకుంది. నిందితులను టూటౌన్ పోలీసులు అరెస్టు చేసి, గురువారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్రెడ్డి, ఎస్సై చంద్రశేఖర్ను సీపీ అభినందించారు. -
ఈడీ చేతికి మెటా!?
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: మెటా క్రిప్టో కరెన్సీ పేరుతో కరీంనగర్లో వెలుగుచూసిన కుంభకోణం మలుపు తిరగనుంది. త్వరలోనే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం అనివార్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో డబ్బులను అనతికాలంలోనే రెట్టింపు చేస్తామని బాధితుల నుంచి వసూలు చేసి, దేశం దాటడం, అందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలో పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు జరిపి త్వరలోనే డీజీపీకి నివేదిక పంపనున్నారు. అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సమాచారం ఇవ్వనున్నారని సమాచారం. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. కింగ్పిన్ లోకేశ్వర్రావు అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసుపై సాక్షి కథనాలను తొలుత ఖండించిన పోలీసులు తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్తో వాటిని అంగీకరించినట్లయింది. దుబాయ్ హవాలాపై దృష్టి ఈ కేసులోని నిందితులు మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, దుబాయ్ తదితర దేశాలకు పెట్టుబడిదారులను తిప్పారు. దుబాయ్లో బినామీలను నియమించుకున్నారు. ఇక్కడ వసూలు చేసిన మొత్తం డబ్బును యూఎస్డీటీ, హవాలా మార్గాల ద్వారా దుబాయ్కి పంపారు. ఆ డబ్బుతో అక్కడ బంగారం కొన్నారు. అందులో 30 తులాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 450 మంది బాధితుల నుంచి రూ.30 కోట్ల వరకు వసూలు చేశారని పైకి చెబుతున్నా, దాని విలువ దాదాపుగా వీరు రూ.100 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితులు దుబాయ్ తదితర దేశాల్లో హవాలా ద్వారా పంపిన డబ్బులతో బంగారం, ఆస్తులు కూడబెట్టారని సమాచారం. దుబాయ్లో ఈ ముఠా రూ.40 కోట్ల విలువైన ఓ పబ్ను నడుపుతున్నారని పోలీసులకు సమాచారం అందింది. అక్కడ పదేళ్ల గోల్డెన్ వీసా సంపాదించి అరెస్టును జాప్యం చేసేలా ఎత్తుగడలు వేసినట్లు గుర్తించారు. నిందితులు లీగల్ టీం ఏర్పాటు చేసుకుని ఏకంగా కరీంనగర్ సీపీకి నోటీసులు పంపడం, ఫిర్యాదుదారులపై ప్రైవేటు కేసులు ఫైల్ చేయడాన్ని పోలీసుశాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు త్వరలోనే మరిన్ని అరెస్టులు జరపనున్నారు. సరైన సమయం చూసి అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నారు. గతంలో నిందితులు ముందస్తు బెయిల్ పొందిన నేపథ్యంలో ఈ మేరకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరీంనగర్క్రైం: మెటాఫండ్ ప్రధాన నిందితుడు వరాల లోకేశ్వర్రావు(32)ను కరీంనగర్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీపీ గౌస్ ఆలం కమిషనరేట్లో కేసు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్లోని పీవీఎన్కాలనీకి చెందిన వరాల లోకేశ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ల తయారీలో నిపుణుడు. గతంలో ఆన్లైన్ బిట్కాయిన్లో, డిజిటల్ కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. అతని తండ్రి స్నేహితుడైన కరీంనగర్కు చెందిన తులసీ ప్రకాశ్ తమ ప్రాంతంలో యూబిట్ కాయిన్లో చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారని ఒకసారి వస్తే కొంతమందిని పరిచయం చేస్తానని చెప్పి 2024లో నగరానికి చెందిన బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను పరిచయం చేయించాడు. ఒక నకిలీ కాయిన్‘మెటాఫండ్’ రూపొందించి గతేడాది ఏప్రిల్లో హైదరాబాద్లోని శామీర్పేటలో ఓ రిసార్ట్లో ఆవిష్కరించారు. యాప్ ప్రచారం కోసం కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించారు. అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి కరీంనగర్కు చెందిన భాస్కర్ నాయక్ వద్ద రూ.15లక్షలు, మరో 450 మంది ద్వారా రూ.30కోట్ల వరకు పెట్టుబడులు పెట్టించారు. డబ్బులు విత్డ్రా చేయలేని విధంగా యాప్ను డిజైన్ చేశారు. కొద్దిరోజులకు బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్, టూటౌన్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నగరానికి చెందిన తులసీ ప్రకాశ్, బూర శ్రీధర్, దాసరి రాజు, దాసరి రమేశ్, కట్ల సతీశ్ను గతంలోనే అరెస్టు చేశారు. లోకేశ్వర్రావును అలుగునూరులో అదుపులోకి తీసుకుని, గురువారం రిమాండ్ చేశారు. నిందితుల నుంచి ఆస్తి ప్రతాలు, 30తులాల బంగారం, మొబైల్ఫోన్లు, ట్యాబ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేసిన రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీసీఎస్ సీఐ ప్రకాశ్ను సీపీ అభినందించారు. -
ట్రాన్స్కో, డిస్కం ఇంటర్ సర్కిల్ పోటీలు ప్రారంభం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ట్రాన్స్కో, డిస్కం ఇంటర్సర్కిల్ బాస్కెట్ బాల్, టేబుల్ టెన్నీస్ టోర్నమెంట్ను గురువారం ట్రాన్స్కో కరీంనగర్ జోన్ చీఫ్ ఇంజినీర్ జె.విజయ్కుమార్ పాపారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఎంతో ప్రాముఖ్యమైనవి, వీటితో మానసికోల్లాసంతో పాటు స్నేహభావం పెంపొందుతుందన్నారు. వృత్తిరీత్యా ఒత్తిడికి లోనయ్యే ఉద్యోగులకు ఈ ఆటలతో ప్రశాంతత లభిస్తుందన్నారు. ట్రాన్స్కో ఎస్ఈ, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఎన్.జగన్నాథ్, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రఘునందన్, ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్రెడ్డి, కరీంనగర్ ఎస్ఈ మేక రమేశ్బాబు, ఎస్ఈలు టి.వి.రావు, ఎన్.శ్రీనివాసు, ఎం.వేంకటేశ్వర్లు, పి.త్రిపురాంతకం, పివీరావుతో పాటు కరీంనగర్, నల్గొం, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నా రు. టేబుల్ టెన్నీస్లో ఓఎంసీ సర్కిల్ కరీంనగర్, ఆపరేషన్ సర్కిల్ వరంగల్ ఫైనల్కు చేరకోగా టేబుల్ టెన్నీస్లో కరీంనగర్ ఆపరేషన్, నిజామాబాద్, నల్గొండ ఆపరేషన్, ఖమ్మం ఆపరేషన్ జట్లు ముందంజలో ఉన్నాయి.పత్తి మార్కెట్కు నాలుగు రోజుల సెలవుజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్కు నాలుగు రోజుల సెలవులు ఉంటాయని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్నసదానందం, ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం యథావిధిగా కొనుగోళ్లు ఉంటాయని, శని, ఆదివారం సాధారణ సెలవులు, సోమవారం దీపావళి, మంగళవారం అమావాస్య సెలవులు ఉంటాయని వివరించారు. గురువారం క్వింటాల్ పత్తి రూ. 6,700 పలికిందని పేర్కొన్నారు. బహుమతులు ప్రదానంవిద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో నిర్వహించిన లక్కీడ్రా విజేతలకు గురువారం కరీంనగర్ బస్స్టేషన్ ఆవరణలో ఆర్ఎం బి.రాజు బహుమతులు అందించి, సన్మానించారు. కరీంనగర్కు చెందిన ఇ.రమేశ్కు మొదటి బహుమతిగా రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన సదానందంకు రెండో బహుమతిగా రూ.15వేలు చెక్కురూపంలో అందించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, రీజియన్ పరిధిలోని డిపోల మేనేజర్లు ఎం.నాగభూషణం, ఎన్.వెంకన్న, వి.రవీంద్రనాథ్, ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, వి.శ్రవణ్కుమార్, కె.కల్పన, ఎస్.మనోహర్, టి.దేవరాజు, టి.ప్రకాశ్రావు, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్మానగర్(కరీంనగర్): జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్లో నిర్వహించే రాష్ట్రస్ధాయి చెకుముకి సంబరాలు సైన్స్ టాలెంట్ టెస్ట్పై గురువారం కలెక్టర్ పమేలా సత్పతికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ బాధ్యులు వివరించారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడంలో జనవిజ్ఞాన వేదిక గత 35 ఏళ్లుగా చేస్తున్న కృషిని ఆమె అభినందించి సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రాజేశ్వర్. కార్యదర్శి రాజా, ప్రొఫెసర్లు రామచంద్రయ్య, లక్ష్మారెడ్డి, బీఎన్ రెడ్డి, వరప్రసాద్, రామరాజు, సంపతి, రమేశ్తోపాటు జిల్లా అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో రచ్చరచ్చ
కరీంనగర్కార్పొరేషన్: ప్రణాళిక లేని అభిప్రాయ సేకరణ, ఆశావహుల ఆధిపత్యపోరు, కొత్త, పాతల వాగ్వాదాలు, తలుపులు బద్దలు గొట్టడం, పదే పదే ఉద్రిక్తత.. వెరసి డీసీసీ కార్యాలయం కదనరంగాన్ని తలపించింది. కాంగ్రెస్ సంస్థాగత ప్రక్రియలో నూతన ఒరవడి సృష్టించేందుకంటూ చేపట్టిన అభిప్రాయ సేకరణ కరీంనగర్లో రసాభాసగా మారింది. ఎవరి అభిప్రాయాలు సేకరిస్తున్నారో.. ఎవరివి తిరస్కరిస్తున్నారో తెలియని గందరగోళ పరిస్థితుల్లో, మూకుమ్మడిగా చొచ్చుకొచ్చి తలుపులు విరగ్గొట్టడంతో అభిప్రాయ సేకరణను అర్ధాంతరంగా వదిలేసి, ఏఐసీసీ పరిశీలకుడు వెనుదిరిగారు. ఆశావహుల బల ప్రదర్శన డీసీసీ, సిటీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో భాగంగా గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్టీనాయకుల అభిప్రాయాల మేరకే అధ్యక్షుల ఎంపిక ఉంటుందని అధి ష్టానం చెప్పడంతో ఆశావహులు బలప్రదర్శనకు దిగారు. తమకు అనుకూలంగా ఉన్న నాయకులతో పాటు ఆటోలల్లో జనాలను తీసుకొచ్చారు. కాస్త ఆలస్యంగా చేరుకొన్న డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ , జనాలను చూసి, ఇంతమందిని తరలించడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రసాభాస ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ మన్నె, పీసీసీ పరిశీలకులు ఆత్రం సుగుణ, సత్యనారాయణ మండల, బ్లాక్ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్ల నుంచి అభిప్రాయాలు తీసుకొంటామని ప్రకటించారు. కార్యకర్తల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని, పార్టీకి కార్యకర్తలు అవసరం లేదా అని నగరానికి చెందిన శంకర్, శ్యాం తదితరులు ప్రశ్నించారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్ తదితరులు ‘పార్టీలోకి మీరెప్పుడొచ్చారు... నిన్నగాక మొన్నవచ్చి మాట్లాడుతున్నార’నడంతో, పాత, కొత్త నాయకులు నడుమ వాగ్వాదం చోటుచేసుకొంది. ఇరువర్గాలు వాగ్వాదం తీవ్ర రూపం దాల్చే సమయంలో పరిశీలకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గేట్కు తాళం.. బయటే ‘వెలిచాల’ డీసీసీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో పరిశీలకుడు అభిప్రాయాలు సేకరించారు. ఆశావహులంతా కార్యాలయంలో ఉండగా, పక్కనే ఉన్న ఇందిరాగార్డెన్లో వెలిచాల రాజేందర్రావు తన అనుచరులతో ఉన్నారు. ఎవరూ కార్యాలయానికి రాకుండా గేట్కు తాళం వేశారు. రాజేందర్రావు లోనికి వస్తాడని నాయకులు చెప్పినా, పోటీపడుతున్న అభ్యర్థులు రావద్దంటూ తాళం తీయలేదు. వెలిచాల అనుచరులు గేట్ వద్దకు చేరుకొని ‘లోన ఉన్న దొంగలు బయటకు రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, గేట్ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. పీసీసీ పరిశీలకురాలు ఆత్రం సుగుణ అక్కడికి చేరుకొని, వెలిచాలను లోనికి రావాలని అభ్యర్థించారు. ‘వాళ్లంతా ఎందుకు లోపల ఉన్నారు. నన్ను ఎందుకు బయట ఉంచారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రక్రియ జరిపించాలి. మా వాళ్లు పార్టీకి అవసరం లేదా..’ అంటూ వెలిచాల ఆగ్రహం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయ మొదటి అంతస్తులో ఏఐసీసీ పరిశీలకుడు శ్రీనివాస్ ఒక్కో నాయకుడి అభిప్రాయం సేకరిస్తుండగా, తీవ్ర జాప్యం జరిగింది. రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా నాయకులంతా గుంపుగా గదిలోకి చొరబడడంతో గది తలుపులు విరిగిపోయాయి. దీనితో అభిప్రాయ సేకరణను పూర్తి చేయకుండానే పరిశీలకుడు శ్రీనివాస్ వెనుదిరిగారు. ఇంతకీ ఎవరి అభిప్రాయాలు సంస్థాగత ప్రక్రియలో ఎవరి అభిప్రాయాలు తీసుకోవాలనే అంశంపై గందరగోళం నెలకొంది. బ్లాక్,మండల,నగర, డివిజన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి సేకరిస్తామని ముందుగా ప్రకటించారు. నగరంలోని 66 డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులమంటూ రావడంతో, వారిని ఎవరు నియమించారో తెలియని పరిస్థితి నెలకొంది. మాజీ కార్పొరేటర్లకు పిలవడం లేదంటూ వారిని వెనక్కి పంపించారు. కొన్ని గంటల తరువాత, మళ్లీ పిలిపించారు. వచ్చిన వాళ్లందరి అభిప్రాయాలు తీసుకొంటామంటూ తెల్ల కాగితాలు అందించారు. చాలా మంది అభిప్రాయాలు తీసుకోకుండానే వెనుదిరిగారు. తమకు మద్దతివ్వని నాయకుల అభిప్రాయాలు తీసుకోకుండా కొంతమంది ఆశావహులు ఎత్తులు వేసినట్లు ప్రత్యర్థులు ఆరోపించారు. మొత్తానికి పోలీసుల పహారా మధ్యన కాంగ్రెస్ అభిప్రాయ సేకరణ రచ్చరచ్చగా మారింది. -
ఎన్నాళ్లీ అణచివేత
సాక్షి కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు హల్చల్ చేయడం సరికాదని రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, సామాన్యులు ధ్వజమెత్తారు. జర్నలిస్టుల స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హ రిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదన్నారు.కక్షపూరిత చర్య ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులు వ్యవహరించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యే. ప్రతీ అంశంపై ప్రజలను చైతన్యవంతం చేయడమే మీడియా ఉద్దేశం. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతున్నారనే అక్కసుతో కేసులు నమోదు చేయడం సరికాదు. – మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కేంద్రం స్పందించాలి మూడు రోజులుగా ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగడం సరికాదు. సోదాలు నిర్వహించడం, వార్త సోర్స్ను అడగడం రాజ్యాంగ విరుద్ధం. ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. పత్రికాస్వేచ్ఛను కాపాడాలి. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గు చేటు. – యాదగిరి సత్తయ్య, బీఎంఎస్ అధ్యక్షుడు కక్షసాధింపు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే పత్రికలపై కక్షసాధింపు సరికాదు. వైఫల్యాలను ఎత్తిచూపే పత్రికలపై రాజకీయ కక్షలు తగవు. ప్రసార మాధ్యమాల గొంతు వినిపించే హక్కును కాలరాయవద్దు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అప్రజాస్వామికం. – గంగుల కమలాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేపత్రికా స్వేచ్ఛను హరించడమే పత్రికల్లో, ప్రసారమాద్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు, వారి మనోభావాలు దెబ్బతిన్నాయని భా విస్తే న్యాయపోరాటం చేయాలి. ఇలా బెదిరింపు ధోరణితో పత్రికా స్వేచ్ఛను హరించివేయడం సరికాదు. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ -
బస్టాండ్లో వ్యక్తిపై దాడి
కరీంనగర్ క్రైం: కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేసిన వ్యక్తిపై బుధవారం రాత్రి దాడి జరిగింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరీంనగర్కు చెందిన పరశురాం(58) కూలీ పని చేసుకుంటూ రోడ్లపైన జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులో బస్టాండ్ ఆవరణలో మూత్ర విసర్జన చేశాడు. అక్కడే ఉన్న కొందరు అతనిపై దాడి చేయడంతో చేయి విరిగింది. బాధితుడు వన్టౌన్ పోలీసుస్టేషన్కు రావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెయ్యి విరిగిందని, సర్జరీ అవసరమని డాక్టర్లు తెలిపారు. అయితే పోలీసులే తనపై దాడి చేశారని, బాధితుడు తెలపడంతో వన్టౌన్ పోలీసులు బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. -
ఒంటరితనం భరించలేక వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): ఒంటరితనం భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రామగుండం కార్పొరేషన్ ఇందిరమ్మకాలనీలో నివాసముంటున్న కాసుల రాకేశ్(34) తల్లి కర్మ ఈనెల 12న జరిగింది. అంతకముందే తండ్రి చనిపోయాడు. ఇద్దరూ మృతి చెందడంలో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడురోజుల క్రితం చనిపోగా ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి బావ కొమురోజు సుమన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ పోలీసులు తెలిపారు. గుండారంలో ఒకరు.. కమాన్పూర్(మంథని): మండలంలోని గుండారం గ్రామానికి చెందిన గుర్రాల రాజేశం(60) ఒంటరితనం భరించలేక గురువారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటరితనంతో పాటు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మృతుడి సోదరుడు చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని యువకుడు.. వెల్గటూర్: ఉరేసుకుని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని శాఖాపూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తనుగుల శివకుమార్ నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లాడు. అక్కడే అనారోగ్యంతో మతిస్థిమితం కోల్పోయాడు. అక్కడి వారి సహాయంతో సొంత గ్రామానికి చేరుకున్నాడు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నాడు. ఈక్రమంలో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. శివకుమార్కు భార్య, ఆరేళ్ల లోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివకుమార్ తల్లి వీరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. అనారోగ్యం భరించలేక మహిళ.. పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణ శివారు రంగంపల్లి కి చెందిన పూదరి అనసూయ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్ తెలిపిన వివరాలు.. కొద్దిరోజుల క్రితం అనసూయ జారి పడగా కాలువిరిగింది. వైద్యం చేయించినా నొప్పి తగ్గకపోవడంతో బాధ భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు. గడ్డిమందు తాగి వ్యక్తి.. రామగిరి(మంథని): మండలంలోని కల్వచర్ల గ్రామపంచాయతీ పరిధి గోకుల్నగర్కు చెందిన జంగ రాజు(38) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ ముల్కలపల్లి వద్ద గడ్డి మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అప్పుల బాధతో రైతు..రుద్రంగి(వేములవాడ): మండలకేంద్రానికి చెందిన రైతు పిట్టల నర్సయ్య (62) అప్పుల బాధతో పరుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. నర్సయ్య అప్పుల బాధతో మనస్తాపానికి గురై బుధవారం మధ్యాహ్నం తన పంట పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
మద్దికుంట సబ్సెంటర్కు స్టాండర్డ్ సర్టిఫికెట్
ముస్తాబాద్: అత్యుత్తమ వైద్య సేవలు అందించినందుకు మద్దికుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(సబ్సెంటర్) స్టాండర్డ్ సర్టిఫికేట్కు ఎంపికై ందని వైద్యాధికారి హఫీజా తెలిపారు. మద్దికుంట సబ్సెంటర్ను సెప్టెంబర్ 18న రాష్ట్ర బృందం పరిశీలించి ఇక్కడ అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారని అన్నారు. జిల్లాలోనే అత్యుత్తమ ఆరోగ్య ఉపకేంద్రంగా మద్దికుంట ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఎంఎల్హెచ్పీ రమ్య, ఏఎన్ఎంలు మణేమ్మ, విజయనిర్మల, ఆశ వర్కర్లను జిల్లా వైద్యాధికారి రజిత అభినందించారు. -
పంటలకు సోలార్ ‘కంచె’
మంథనిరూరల్: ఆరుగాలం కష్టపడి పండించే పంటల రక్షణకు రైతులు అనేక విధాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అటవీ ప్రాంతాలు, గుట్టల సమీపంలోని పంటలను అడవిజంతువుల బారినుంచి రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. కొందరు చేనుల చుట్టూ కరెంట్ వైర్లు అమర్చి పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా.. వాటిద్వారా జంతువులే కాదు.. మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అయితే మంథని మండలం లక్కేపూర్ గ్రామానికి చెందిన రైతు కొత్త శ్రీనివాస్ వినూత్న ఆలోచనతో పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ సోలార్ పవర్ కంచె ఏర్పాటు చేశాడు. ఎనిమిదేళ్ల క్రితం.. లక్కేపూర్ గ్రామ శివారు గాజులపల్లి ఎస్సారెస్సీ కాలువ సమీపంలో శ్రీనివాస్కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఎనిమిదేళ్లక్రితం మంచిర్యాల జిల్లాలోని తన బంధువుల ఇంటికి వెళ్లిన శ్రీనివాస్.. పంట రక్షణకు సోలార్ కంచె గురించి తెలుసుకున్నాడు. వెంటనే తన చేను చుట్టూ ఏర్పాటు చేశాడు. అడవిజంతువుల బారి నుంచి పంటలు రక్షించుకుంటున్నాడు. మంథని మండలంలో ఇద్దరు, ముగ్గురు రైతులే ఇలా సోలార్ కంచెలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వారికి వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తే ప్రాణనష్టం నివారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. షాక్ మాత్రమే వస్తుంది.. ప్రాణనష్టం ఉండదు.. చేను చుట్టూ ఏర్పాటు చేసే సోలార్ పవర్ కంచెతో షాక్ మాత్రమే వస్తుందని, దీంతో జంతువులు భయపడి దూరంగా వెళ్తాయని రైతులు చెబుతున్నారు. బ్యాటరీ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా అది కేవలం షాక్ తగిలేంత వరకే ఉంటుందంటున్నారు. తద్వారా జంతువులే కాదు.. మనుషులకూ ప్రాణనష్టం ఏమీ ఉండదంటున్నారు. లక్కేపూర్ గ్రామ రైతు వినూత్న ఆలోచన అడవిజంతువుల బారినుంచి పంటల రక్షణ అవగాహన పెంచుకుంటే మంచిఫలితాలు -
కోలిండియా పోటీల్లో సింగరేణికి పతకాలు
గోదావరిఖని(రామగుండం): నాగ్పూర్లో ఈనెల 14 నుంచి 16 వరకు డబ్ల్యూసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన కోలిండియా పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తాచాటారు. ● పవర్లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ పోటీల్లో ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. పవర్లిఫ్టింగ్ 59 కేజీల విభాగంలో భూపాల్పల్లికి చెందిన బానోతు రమేశ్(ట్రామర్), 120 కేజీల విభాగంలో మీర్జా యాసీన్బేగ్ (సీనియర్ అండర్మేనేజర్), 93 కిలోల విభాగంలో ఆర్జీవన్కు చెందిన పి.వంశీకృష్ణ(జనరల్ అసిస్టెంట్) వెండి, 69 కిలోల ఉమెన్స్ విభాగంలో భూపాల్పల్లికి చెందిన డి.అనూష (జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 52కిలోల విభాగంలో ఆర్జీ–2 ఏరియాకు చెందిన ఎస్కే ఆషియాబేగంబ్రాంజ్ మెడల్ సాధించారు. ● వెయిట్ లిఫ్టింగ్ 71కిలోల విభాగంలో మణుగూరుకు చెందిన కె.అనిల్కుమార్(కన్వేయర్ ఆపరేటర్)సిల్వర్, 110 కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్కుమార్(ఫిట్టర్) సిల్వర్ మెడల్ సాధించారు. ● బాడీ బిల్డింగ్ పోటీల్లో వంద కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన పి.పవన్కుమార్(ఫిట్టర్) గోల్డ్, 55 కిలోల విభాగంలో ఎం.అంజయ్(జనరల్ అసిస్టెంట్) సిల్వర్, 70కిలోల విభాగంలో ఆర్జీ–3 ఏరియాకు చెందిన ఆర్.అర్జున్(ఈపీఆపరేటర్) బ్రాంజ్, 75 కిలోల విభాగంలో బెల్లంపల్లికి చెందిన జె.మొగిలి(ఈపీఆపరేటర్) సిల్వర్, 80కిలోల విభాగంలో కొత్తగూడెంకు చెందిన ఎం.రామకృష్ణ(అసిస్టెంట్ చైన్మెన్) గోల్డ్, 85కిలో ల విభాగంలో భూపాల్పల్లికి చెందిన ఎస్.శ్రీనివాస్రెడ్డి(కోల్కట్టర్) గోల్డ్మె, వందకిలోల విభాగంలో మందమర్రికి చెందిన బి.వెంకటస్వామి(ఏఎస్ఎం) సిల్వర్ మెడల్ సాధించారు. వీరిని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం, డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ అభినందించారు. ఐదు గోల్డ్, ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ పతకాలు -
భవనం పై నుంచి పడి యువకుడి మృతి
మెట్పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంపై నుంచి పడి నర్సింహులు(32) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్ర కారం..స్థానిక చైతన్యనగర్కు చెందిన నర్సింహు లు స్డేడియానికి వచ్చి భవనంపైకి వెళ్లాడు. ప్ర మాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రంగా గా యపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): మండలంలోని గర్రెపల్లి–సుల్తానాపూర్ రోడ్డులో గు రువారం రాత్రి సైకిలి స్టును ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న ఘటనలో ఎలిగేడు మండలం సుల్తానాపూర్కు చెందిన అడెపు కుమార్(40) మృతిచెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. సుల్తానాపూర్కు చెందిన కుమార్ హైదరాబాద్లో ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో సుల్తానాపూర్లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం వద్ద సైకిలిస్ట్ను తప్పించబోయి కిందపడగా తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఐతరాజుపల్లికి చెందిన సైకిలిస్టుకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని బైపాస్రోడ్లో ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ వైద్యుడు తీవ్రంగా గాయపడ్డాడు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన వైద్యుడు శ్రీనివాస్ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్డీవోగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం బైపాస్ రోడ్ నుంచి తన స్కూటీపై ఆస్పత్రికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. శ్రీనివాస్ తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జ్యోతినగర్(రామగుండం): రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయింది ఓ అమ్మ. తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో..ఎందుకు వదిలేశారో కూడా చెప్పుకోలేక అనాథగా రోడ్డుపై పడిపోయింది. ఎన్టీపీసీ రామగుండం ఆటోనగర్ ప్రాంతంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు కొద్దిరోజులుగా కాలనీలో సంచరిస్తూ గురువారం రాత్రి సమయంలో రోడ్డుపై పడిపోయింది. ఈ క్రమంలో ఆటోనగర్ ప్రజలు ఆమె పడిపోయిన విషయాన్ని కంది నాగరాజుకు తెలియజేయగా ఆయన ఆమె వివరాలను ఆరా తీశారు. కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామమని, తన పేరు లక్ష్మమ్మ అని తెలియజేసింది. వెంటనే 108లో గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పతికి తీసుకెళ్లారు. కరీంనగర్ క్రైం: మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను ఉద్దేశించి మాజీ ఎమ్మె ల్యే రసమయి బాలకిషన్ ఇటీవల వాట్సాప్లో ఒక వాయిస్ మెసేజ్ పంపినట్లు ఎమ్మెల్యే తిమ్మాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి తాళం వేసి రెండు రోజులక్రితం ఊరికెళ్లాడు. బుధవారం సాయంత్రం ఇంటికొసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంట్లో అద్దెకున్న వారు కూడా లేకపోవడంతో వారి ఇంటి తాళాలు కూడా పగులగొట్టారు. రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో నుంచి 15 తులాల వెండి, రూ.10వేలు, అద్దెకుంటున్న వారి ఇంట్లో బంగారం, రూ.6 వేలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనంమెట్పల్లి: మెట్పల్లిలోని హన్మాన్నగర్కు చెందిన మానస ఇంట్లో దొంగతనం జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. బుధవారం రాత్రి సమయంలో మానస ఇంటికి తాళం వేసి తల్లిగారింటికి వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికి రాగా.. తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో దాచి ఉంచిన 4తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. పోలీసులకు సమాచారం అందిచంగా.. వారు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. 15 తులాల వెండి.. రూ.16 వేలు చోరీ -
విజయవంతంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
కరీంనగర్: అవయవ మార్పిడి శస్త్రచికిత్సల్లో అగ్రగామిగా నిలుస్తున్న గ్లెనిగల్స్ హాస్పిటల్స్ ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంట్) రంగంలోనూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్టు తపస్వికృష్ణ, పల్మనాలజిస్టు వినయ్కుమార్ తెలిపారు. గురువారం కరీంనగర్లోని సూర్య చెస్ట్ హాస్పిటల్లో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఊపిరితిత్తుల సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లంగ్ ట్రాన్స్ప్లాంట్ శస్త్రచికిత్సల ప్రాధాన్యం గురించి వివరించారు. దగ్గు, అలసట, దీర్ఘకాలికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతినొప్పి, రోజువారీ పనుల్లో నిస్సత్తువ వంటి లక్షణాలు గమనించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. గ్లెనిగల్స్ హాస్పిటల్స్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్లు విజయవంతం కావడం వెనుక సర్జన్లు, అనస్థీషియా నిపుణుల సమష్టి కృషి ఉందన్నారు. రామడుగు మండలం గుండిగోపాలరావుపేటకు చెందిన రాజిరెడ్డి దశాబ్ద కాలంగా సీపీవోడీతో బాధపడుతూ నిరంతరం ఆక్సిజన్పై ఆధారపడి జీవించేవారని, గ్లెనిగల్స్ వైద్య బృందం సలహా మేరకు ఆయనకు లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్లపై ఉన్న అపోహలను తొలగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ తపస్వి కృష్ణ


