breaking news
Karimnagar
-
చైనామాంజా సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
మెట్పల్లి: నిషేధిత చైనామాంజాను మెట్పల్లికి సరఫరా చేస్తున్న నిర్మల్కు చెందిన ఎండీ.ఫిరోజ్ఖాన్ను ఎస్సై కిరణ్కుమార్ అరెస్ట్ చేశారు. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన బాలుడు శ్రీహన్ ఈనెల 8న తన ఇంటి ముందు ఆడుకుంటుండగా.. గాలిలో చైనామాంజా వచ్చి అతని మెడకు చుట్టుకుని గాయపడిన విషయం తెల్సిందే. ఆ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరుసటి రోజు ఈ మాంజాను స్థానికంగా విక్రయిస్తున్న షేక్ సిద్దిక్ హుస్సేన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు నిర్మల్కు చెందిన ఫిరోజ్ఖాన్ ఇక్కడకు సరఫరా చేస్తున్నాడని తెలపడంతో ఎస్సై అక్కడకు వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని దుకాణంలో భారీగా నిల్వ చేసిన చైనామాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
ముగిసిన సవరణ
కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ కార్పొరేషన్ ఎ న్నికలకు సంబంధించిన డివిజన్లు, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను సోమవారం ప్రచురించనున్నారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా రూపొందించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్కు అనుగుణంగా అధికారులు ఓటర్ల జాబితాకు తుదిరూపు ఇచ్చారు. ఇదిలాఉంటే డివిజన్లలో రిజ ర్వేషన్లు మార్చేందుకు అవసరమైన ఓట్లను తారుమారు చేయడానికి ఒకరిద్దరు టౌన్ప్లానింగ్ అధికా రులు ప్రయత్నించినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. సెలవు రోజుల్లోనూ కొనసాగిన ప్రక్రియ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల జాబితాను రూపొందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. గత నెల 30 నుంచి మూడురోజుల పాటు కసరత్తు అనంతరం ఈ నె ల 1న నగరంలోని 66 డివిజన్ల వారీగా 3,40,775 ఓట్లతో ముసాయిదా జాబితా ప్రకటించారు. సద రు జాబితాపై 2 నుంచి 6వ తేదీ వరకు అభ్యంతరా లను నగరపాలకసంస్థ అధికారులు స్వీకరించారు. మొత్తం 249 అభ్యంతరాలు రాగా, డివిజన్ల వా రీగా సవరణకు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అ భ్యంతరాల సవరణ ప్రక్రియ సెలవు రోజులైన శని, ఆదివారాలు కూడా కొనసాగించారు. ముందుగా ని ర్ణయించిన ప్రకారం ఈ నెల 10న ఓటర్ల తుది జాబి తా ప్రకటించాల్సి ఉండగా, ఎన్నికల సంఘం 12వ తేదీకి పొడగించింది. దీంతో నగరంలోని 66 డివి జన్లకు సంబంధించిన ఓటర్ల జాబితాతో పాటు, జిల్లాలోని చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను సోమవారం వెల్ల్లడించనున్నారు. అభ్యంతరాల సవరణ ఓటర్ల ముసాయిదాపై వచ్చిన అభ్యంతరాలను అ ధికారులు ఆదివారం రాత్రి వరకు కొనసాగించారు. ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని, డి విజన్కు సంబంధం లేని ఓట్లు కలిశాయని, డివిజన్లో ఉండాల్సిన ఓట్లు ఇతర డివిజన్లోకి వెళ్లాయంటూ ఆశావహులు, నాయకులు, అన్ని పార్టీలు అధికారులకు ఫిర్యాదు చేశాయి. వచ్చిన అభ్యంతరాలను డివిజన్ల వారీగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల కూర్పు సమస్యగా మారడంతో, పోలింగ్ బూత్లను కూడా సరిచేసేందుకు చర్యలు చేపట్టారు. ముసాయిదా జాబితాపై వచ్చిన అభ్యంతరాలను సరిచేయడంతో పాటు, ఏ డివిజన్ ఓటర్లు ఆ డివిజన్లోనే ఉండేలా ఇంటినంబర్ల వారీగా సవరించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంటినంబర్లు, కాలనీ పేర్లు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఓట్లు మాత్రం అవే డివిజన్లో ఉండే అవకాశం ఉంది. ఓట్ల తారుమారుకు ప్రయత్నం..? ఓట్ల సవరణను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించిన ఒకరిద్దరు పట్టణ ప్రణాళిక అధికారుల చేతివాటానికి చెక్ పడినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నగరంలోని డివిజన్ల డీలిమిటేషన్లో పట్టణ ప్రణాళిక అధికారులు కొంతమంది, మాజీ కార్పొరేటర్లకు డివిజన్లను అనుకూలంగా మార్చినట్లు అప్పట్లో ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం ఓటర్ల సవరణలోనూ ఒకరిద్దరు పట్టణ ప్రణాళిక అధికారులు అదే తరహాలో తమ చేతివాటాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. డివిజన్ల రిజర్వేషన్లు మార్చేందుకు ‘అవసరమైన’ ఓట్లను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ డివిజన్లలో ఈ ప్రయత్నం జరుగుతున్నట్లు సంబంధిత డివిజన్ల నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వరుసగా ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు కూడా సంబంధిత టౌన్ప్లానింగ్ అధికారులపై సీరియస్ అయినట్లు, తప్పులు జరిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. -
త్యాగమూర్తి గురుతేజ్ బహదూర్
కరీంనగర్కల్చరల్: దేశ, ధర్మ రక్షణ, స్వేచ్ఛకు అక్షరరూపమైన త్యాగమూర్తి గురు తేజ్ బహదూర్ జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. గురు తేజ్ బహదూర్ షహీదీ దివస్ సందర్భంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. అలాగే అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ స్టేడియం నుంచి కలెక్టరేట్ రోడ్డు, ప్రతిమా మల్టీప్లెక్స్, బస్టాండ్ మీదుగా గురుద్వారాకు ర్యాలీ చేరుకుంది. సిక్కు యువకులు కత్తులతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. -
గ్రామానికో గోదాం
కరీంనగర్ అర్బన్: నూతనంగా ఎన్నికై న సర్పంచ్ల కు ఇదో సువర్ణావకాశం. కేంద్రం గోదాంల నిర్మాణా నికి నిధులు కేటాయించనుంది. తద్వారా ప్రతి గ్రా మంలో ఏర్పా టు చేసుకోవచ్చు. కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్ (వీబీ జీ రామ్జీ) పథకంలో అవకాశం కల్పించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ గ్రామాల్లో రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకునేలా గోదాంలు నిర్మించుకునే వీలుంది. వీటిని అద్దెకు ఇవ్వడంతో పంచాయతీలకు ఆదాయం పెరిగే వీలుంది. ఒక్కో గోదాంకు రూ.30లక్షలు జిల్లాలో 316 గ్రామ పంచాయతీలుండగా స్థలముంటే చాలు గోదాం నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తారు. ఒక్కో గోదాం నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించారు. గోదాం నిర్మించాలంటే గ్రామంలో 444 చదరపు గజాల స్థలంలో వంద టన్నుల నిల్వ సామర్థ్యంతో నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం నిధుల్లో 60శాతం కూలీల వేతనం, 40 శాతం నిర్మాణ సామగ్రి కింద పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. జిల్లాకు రూ.94.80కోట్లు జిల్లాకు రూ.94.80కోట్లు కేటాయించారు. స్థల పరిశీలన, పంచాయతీ తీర్మానం తదితర ప్రక్రియలో పనులను ప్రారంభించాలి. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగే సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్లో ధర ఎక్కువగా ఉంటే గోదాంల వద్దనే పంటను కొనుగోలు చేసుకునే వీలుంది. పైగా ఎక్కువ మొత్తం పంట ఉత్పత్తులు ఉన్న రైతులు గోదాంలను అద్దెకు తీసుకొని పంటను నిల్వ చేసుకునే వీలుంది. పంట ఉత్పత్తులు కొనుగోలు చేసే సమయంలో నిర్వాహకులు సైతం అద్దెకు తీసుకొని కొనుగోలు చేసిన సరకును నిల్వ చేసుకోవచ్చు. సీజన్ లేని సమయంలో ఇతరులకు అద్దెకు ఇవ్వడంతో పంచాయతీలకు ఆదాయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తాం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డ్రైనేజీ వ్యవస్థను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలిపారు. ఆదివారం నగరంలోని 26వ డివిజన్ ఆదర్శనగర్లో రూ.20 లక్షలతో చేపట్టనున్న అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నదని, ఒక్కొక్కటిగా అన్ని రోడ్లు, డ్రైనేజీలను మెరుగుపరుస్తున్నామని వివరించారు. రోడ్లు ఇరుకుగా ఉన్న చోటనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, మాజీ కార్పొరేటర్ ఆర్ష మల్లేశం, గుండాటి శ్రీనివాస్రెడ్డి, దండి రవీందర్, గీసా శ్రీనివాస్, మన్నె పద్మారావు, కొందటి లక్ష్మీనారాయణ, మన్నె పద్మావతి, గీసా కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో కూలీ మృతి
సుల్తానాబాద్రూరల్/జూలపల్లి: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ శివారులోని కొమండ్లపల్లికి వెళ్లే రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ ఆటోను ఢీకొన్న సంఘటనలో వ్యవసాయ కూలీ గీకూరు కవిత(35) మృతి చెందింది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. జూలపల్లి మండలం వడ్కాపూర్ గ్రామానికి చెందిన గీకూరు కవిత, మరికొంత మందితో కలిసి మానకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్తున్నారు. ఈక్రమంలో కొమండ్లపల్లి నుండి కంకర లోడ్తో ట్రాక్టర్ ఎదురుగా రావడంతో అటోలో కూడి సైడ్ కూర్చున్న గీకూరు కవితను ఢీకొనడంతో కింద పడగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త కనకరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై వివరించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి
గోదావరిఖని: ‘ఇంటిపోరును చక్కదిద్దుకోని మీరు ప్రజలకేం న్యాయం చేస్తార’ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 67శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించిన ప్రజలు రాష్ట్రప్రభుత్వానికి మద్దతు పలికారని అన్నారు. ట్రాన్స్జెండర్లకు తొలిసారి రామగుండంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ 76 జీవో జారీచేయగా.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ జీవో ప్రకారం సింగరేణి ప్రాంతంలో పేదల ఇళ్లకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, పాత్రికేయుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొండి గోడలుగా మిగిలిన 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లనుపూర్తిచేస్తున్నామని, అసంపూర్తిగా మిగిలిన మరో 300 ఇళ్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. నిర్వాసితులను ఆదుకుంటాం నగరంలో చేపట్టిన రోడ్డు విస్తరణలో ఆస్తి నష్టపోయిన వారిని ఆదుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ శ్రమిస్తున్నారని ప్రసంశించారు. నియోజకవర్గంలో రూ.600 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు నాంది పలికామని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరవుతాయని అన్నారు. ఆలయాల అభివృద్ధికి రూ.3కోట్లు రామగుండంలోని ఆలయాల అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయించామని, మరో రూ.3కోట్లు ప్రతిపాదించామని, సీఎం ఎస్డీఎఫ్ నుంచి మంజూరు చేసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సు రేఖ అన్నారు. వైఎస్సార్ హయాం నుంచి సింగరేణి ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులకు ప్రజాప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుందని అభయం ఇచ్చారు. గురుకులాలకు నిధులు ఎస్సీ రెసిడెన్సియల్ పాఠశాలల కోసం ప్రతిపాదనలు పంపిస్తే నిధులు మంజూరు చేస్తానని సంక్షేమ మంత్రి అడ్లూరు లక్ష్మణ్కుమార్ హామీ ఇచ్చారు. సింగరేణి మెడికల్ బోర్డు నుంచి కార్మికులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యానికి గురైన రామగుండం రామగుండం నగరం పదేళ్లపాటు గత పాలకుల ని ర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ విమర్శించారు. దివంగత సీఎం వైఎస్సార్ ఈ ప్రాంతంలోని 18 వేల పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని, మరో 7వేల వరకు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. 50 మంది ట్రాన్స్జెండర్లకు ఇళ్లపట్టాలు అందించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నా రు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు వేణు, అరుణశ్రీ, డీసీపీ రాంరెడ్డి, ఆర్డీవో గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
తబలా వాయించలె.. సరిగమ పాడలె
కరీంనగర్టౌన్: రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లు ఉంది ప్రభుత్వ అధికారుల వైఖరి. రూ.వేల కోట్లు వెచ్చించి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల, అధికారుల మాటలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. విద్యరంగానికి ఏటా వివిధ రకాల పేర్లతో కేటాయిస్తున్న నిధులు ఖర్చు చేసే విషయంలో చూపిస్తున్న చొరవ ఫలితాలను రాబట్టే విషయంలో ఆసక్తి చూపడం లేదు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) కింద ఎంపికై న పాఠశాలల్లో సంగీత పాఠాలు నేర్పించేందుకు జిల్లాకు మంజూరైన సంగీత వాయిద్య పరికరాలు మూలనపడ్డాయి. సంగీత పాఠాలు చెప్పే టీచర్లు లేక జిల్లాకు మంజూరైన రూ.10.50 లక్షల పరికరాలు వృథాగా ఉన్నాయి.టీచర్ల నియామకం ఊసే లేదు ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేస్తున్నాయి. చదువుతో పాటూ సంగీత పాఠాలు నేర్పాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) కింద ఎంపికై న కొన్ని పాఠశాలలకు అవకాశం కల్పించింది.ఎంపిక చేసిన పాఠశాలలకు జూలైలో వాయిద్య పరికరాలు పంపిణీ చేశారు. పాఠాలు నేర్పే సంగీత ఉపాధ్యాయులను నియమించుకోవాలని ఆదేశాలు సైతం జారీ చేయగా ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు. తరగతులు ప్రారంభించలేదు. పాఠశాలలకు పంపిణీ చేసిన తబలా, మృదంగం, హార్మోనియం, వయోలిన్, బ్యాండ్సెట్టు, డ్రమ్స్ వంటి వాయిద్య పరికరాలు నిరుపయోగంగా మారాయి. 7 పాఠశాలలకు రూ.10.50 లక్షలు జిల్లాలోని గంగాధర, శంకరపట్నం, చొప్పదండి, కొత్తపల్లి, వీణవంక, సైదాపూర్, రామడుగు ఆదర్శ పాఠశాలలకు మొదటి విడతగా సంగీత వాయిద్య పరికరాలకు రూ.10.50 లక్షలు కేటాయించి కిట్లు అందించారు. ఒక్కో పాఠశాలకు రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి. ప్రభుత్వం పాఠాలు నేర్పించడానికి ఒక టీచర్ నియమించాలి. వీరికి నెలకు రూ.10 వేల చొప్పున ఉపయోగించుకోవాలని ఆరునెలల వేతనాన్ని కేటాయించారు. పాఠశాలల్లో ఒక ప్రత్యేక గదిని కేటాయించి శిక్షణ అందించాలని సూచించారు. ప్రత్యేక టీచర్ వేతనం నిధుల నుంచి చెల్లించాలని పేర్కొన్నారు. మిగిలిన నిధులను నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. కానీ, క్షేత్రస్థాయిలో ఆ దిశగా ఆరునెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియ కొనసాగడం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథక లక్ష్యం అమలుకు నోచుకోవడం లేదు. మూలనపడిన పరికరాలు సమగ్ర సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలిగించేలా, విద్యేతర కార్యక్రమాల్లోనూ వారు ముందుండేలా తీర్చిదిద్దాలని తీసుకొచ్చిన ఈ పథకంలో ఒక్కో బడికి ఐదేళ్లలో రూ.కోటి వరకు ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా క్రీడా సామగ్రి, ల్యాప్టాప్, ల్యాబ్ సౌకర్యాలు కల్పించారు. ఆరునెలల క్రితం ఎంపిక చేసిన పాఠశాలల్లో సంగీత పాఠాల నిమిత్తం వాయిద్య పరికరాలు అందజేశారు. కానీ, ఇప్పుటివరకు పాఠాలు ప్రారంభం కాలేదు. -
జాతీయ పురస్కారానికి ఎంపిక
కోనరావుపేట(వేములవాడ): జాతీయ ఉత్తమ రక్తదాత పురస్కారానికి కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మోతె రాజిరెడ్డి ఎంపికయ్యారు. కామారెడ్డి రక్తదాతల గ్రూప్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో(ఐవీఎఫ్) స్వామి వివేకానంద జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రక్తదాన కార్యక్రమాల్లో కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, వ్యక్తులకు జాతీయ పురస్కారాలను అందిస్తున్నారు. 2025లో మూడుసార్లు రక్తదానం చేసిన దాతలకు ఉత్తమ పురస్కారాలను సోమవారం కామారెడ్డిలో ప్రదానం చేస్తున్నారు. 79 మందికి పురస్కారాలను అందిస్తున్నారు. -
ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం ప్రమాణ స్వీకారం
కరీంనగర్కల్చరల్: మహిళలకు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్రావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐఎంఏ రాష్ట్ర మహిళ విభాగం కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఇప్పటికే మహిళ వైద్యులు శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్ రావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల మహిళలు, బాలికలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం మహిళ విభాగం రాష్ట్ర చైర్పర్సన్గా డాక్టర్ వై.స్వీతిఅనూప్, కో చైర్పర్సన్గా డాక్టర్ పి.శోభారాణి, కన్వీనర్గా డాక్టర్ ఝాన్సీ, అడ్వైజర్ డాక్టర్ పి.శ్రీలతరెడ్డి, మెంబర్గా డాక్టర్ ఎన్.కీర్తన ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎడవల్లి విజయేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఆకుల శైలజ, నాగసముద్రం మహేశ్, కోశాధికారి నీలిమ, సీనియర్ వైద్యులు హరికిషన్, విజయమోహన్రెడ్డి, ఎంఎల్ఎన్ రెడ్డి, ఆలీం, సూర్యనారాయణరెడ్డి, శ్రీనివాస్, సాయిని నరేందర్, ఆది శ్రీదేవి తదితరులున్నారు. -
ఆర్మేనియాలో బోయినపల్లి యువకుడి మృతి
బోయినపల్లి(చొప్పదండి): బతుకుదెరువుకు యూరప్ లోని ఆర్మేనియా దేశానికి వెళ్లిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రానికి చెందిన మేకల ప్రవీణ్(33) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. బోయినపల్లికి చెందిన మేకల సత్తవ్వ–గంగారాం దంపతుల కుమారుడు ప్రవీణ్ 9 నెలల క్రితం రూ.10 లక్షల వరకు అప్పు చేసి ఆర్మేనియా వెళ్లాడు. అక్కడ కారు నడుపుతూ ఉపాధి పొందేవాడు. గత శుక్రవారం రోడ్డు పక్కన ఉండగా ఓ వాహనం వచ్చి ఢీకొట్టడంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అక్కడి స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్చేసి తెలపడంతో వారు బోరున విలపిస్తున్నారు. ప్రవీణ్కు భార్య కవిత, కూతురు శ్రావణి(14), కుమారులు సంజయ్(10), అభినయ్(5)ఉన్నారు. -
పండుగ వేళ జాగ్రత్తలు తప్పనిసరి
కరీంనగర్క్రైం: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ గౌస్ ఆలం పేర్కొన్నారు. ఊర్లకు వెళ్లే ముందు సమీప పోలీస్స్టేషన్లో సమాచారం ఇవాలని, పెట్రోలింగ్ బృందాలు ఇంటిపై ప్రత్యేక నిఘా ఉంచుతాయని తెలిపారు. ఇంట్లో ఎక్కువ డబ్బు, బంగారం ఉంచకుండా బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలని సూచించారు. ఇంట్లో లేమని సోషల్ మీడియా, వాట్సాప్ స్టేటస్లు పెట్టొద్దన్నారు. ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలను నివారించవచ్చని వివరించారు. ఉదయం పేపర్లు, పూల మొక్కలు అమ్మేవారిగా, రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోరాట యోధుడు ఓబన్నకరీంనగర్టౌన్: రేనాటి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబన్న జయంతిని ఆదివారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచిన యోధుల్లో ఓబన్న ప్రముఖ వ్యక్తి అని పేర్కొన్నారు. బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఎం.అనిల్ప్రకాష్, జిల్లా వడ్డెర సంఘం ప్రతినిధులు బి.సమ్మయ్య, సీహెచ్.రాజ్కుమార్, సీహెచ్.పద్మ, ఓ.రమేశ్, ఎస్.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు. స్టీమర్ సేవలకు ట్రయల్ రన్గన్నేరువరం(మానకొండూర్): కరీంనగర్ నుంచి మైలారం శ్రీమల్లిఖార్జునస్వామి ఆలయం వరకు లోయర్ యానేరు డ్యాంలో స్టీమర్ (వాటర్ ట్రాన్స్ఫోర్ట్) సర్వీసును ప్రారంభించేందుకు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించినట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్రెడ్డి తెలిపారు. అలాగే ఖాసీంపేటలోని శ్రీమానసాదేవి, పారువెల్ల శ్రీలక్ష్మీగణపతి ఆలయాలకు రాకపోకలు పెరిగేందుకు దోహదపడుతోందని తెలిపారు. స్టీమర్ సేవలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవచూపడం హర్షణీయమన్నారు. మల్లిఖార్జునస్వామి ఆలయ చైర్మన్ వరాల పర్శరాములు, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయిశర్మ తదితరులు పాల్గొన్నారు. అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి కరీంనగర్టౌన్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్, న్యూఢిల్లీ వారి సహకారంతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల ప్రత్యేక అధికారులు, హాస్టల్ వార్డెన్లకు కలెక్టరేట్లో నిర్వహించిన ఐదురోజుల శిక్షణ ఆదివారం ముగిసింది. శిక్షణ అంశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని విద్యార్థులను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని శిక్షణ నోడల్ అధికారి కృపారాణి అన్నారు. బాలికలను కేవలం విద్యావంతులుగానే కాకుండా, స్వయం ఉపాధి, ఆత్మవిశ్వాసంతో తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దాలని కోరారు. శిక్షణ అధికారి డా.దేబోర కృపారాణి, యాదాద్రి భువనగిరి జి ల్లా మాస్టర్ ట్రైనర్ నిర్మల జ్యోతి, డిస్ట్రిక్ట్ యూ త్ ఆఫీసర్ రాంబాబు, ట్రైనర్–రిసోర్స్ పర్సన్ సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుప్రమాదంలో దెబ్బతిన్న ఆటో
రామడుగు: మండలంలోని వెదిర గ్రామశివారులో కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆటో ధ్వంసమైంది. కరీంనగర్ నుంచి వస్తున్న ఆటోను జగిత్యాల నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రధాన రహదారిపై ప్రమాదం జరగడంతో ఇరువైపులా వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై పడిపోయిన ఆటోను గ్రామస్తులు, పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కాలువలో ఇసుక లారీ బోల్తావీణవంక: మండలంలోని రెడ్డిపల్లి శివారు అచ్చంపల్లి వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో ప్రమాదవశాత్తు ఇసుక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ త్రుటిలో బయటపడ్డాడు. కొండపాక ఇసుక క్వారీ నుంచి లారీలో ఇసక లోడ్ చేసుకున్న డ్రైవర్ చల్లూరు మీదుగా కరీంనగర్కు వెళ్తున్నాడు. అచ్చంపల్లి కెనాల్ వద్దకు రాగానే ఫోన్ రావడంతో రివర్స్ తీశాడు. అదుపు తప్పిన లారీ కెనాల్లో పడిపోయింది. అప్రమత్తుమైన డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. డ్రైవర్ మద్యం మత్తులోనే సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కంటైనర్ బోల్తా: ఒకరి దుర్మరణంశంకరపట్నం: మండలంలోని తాడికల్ శివారులో ఆదివారం కంటైనర్ బోల్తాపడి సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన రాణవేని హన్మయ్య (64) ఆదివారం సాయంత్రం పొలం వద్దకు సైకిల్పై వెళ్లాడు. పొలం పనులు ముగించుకుని సైకిల్పై తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని అండర్పాస్ నుంచి వస్తున్న కంటైనర్ అదుపు తప్పి హన్మయ్యపై బోల్తాపడింది. సమీపంలోని రైతులు, వాహనదారులు జాకీలతో కంటైనర్ను కొంతమేర పైకి లేపి ఇరుక్కుపోయిన హన్మయ్యను బయటకు తీసి కారులో కరీంనగర్కు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
వృద్ధుడి ఆత్మహత్మ
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం అనంతరాం గ్రామానికి చెందిన జీకూరి నర్సయ్య(69) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నర్సయ్య కొద్దికాలంగా ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. శనివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. నర్సయ్య కోడలు శ్యామల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమా సాగర్ తెలిపారు. దొంగల ముఠా అరెస్ట్గంభీరావుపేట(సిరిసిల్ల): దొంగతనాలు చేస్తున్న ముఠాను గంభీరావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆదివారం అరెస్టు చేసి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, మేడ్చల్కు చెందిన జంపయ్య, శంకర, జయప్రకాశ్, గోలు శంకర్ దొంగతనాలకు పాల్పడ్డారు. గంభీరావుపేట మండలం కోళ్లమద్ది, మల్లారెడ్డిపేట, జగదాంబతాండ, గజసింగవరం గ్రామాల్లో మోటార్లను దొంగిలించినట్లు ఎస్సై తెలిపారు. సముద్రలింగాపూర్లో దొంగతనం చేస్తుండగా పట్టుకుని, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్కుమార్ వివరించారు. రోడ్డుప్రమాదంలో పలువురికి గాయాలుశంకరపట్నం(మానకొండూర్): మండలంలోని కొత్తగట్టులో ఆదివారం కారు–లారీ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు.. హనుమకొండ పట్టణం నయీంనగర్కు చెందిన మాధవి కుటుంబసభ్యులు కారులో వేములవాడ దైవదర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా, వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న లారీ కొత్తగట్టులో ఢీకొన్నాయి. ఈప్రమాదంలో మాధవి, ఆమె కుమారుడికి గాయాలు కాగా, మరో ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. గాయపడినవారిని హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వ్యానుమల్యాల: మండల కేంద్రంలో విద్యుత్ స్తంభాన్ని ఆదివారం వ్యాన్ ఢీకొనడంతో స్తంభం విరిగి పడింది. వారసంత సమీపాన మందులతో వెళ్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో స్తంభం రహదారిపైన విరిగి పడింది. ఎవ్వరూ లేకపోవడంతోఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా అధికారులు స్తంభాన్ని పక్కకు తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. -
అక్షరయోధుడు ‘అలిశెట్టి’
● నేడు ప్రభాకర్ జయంతి, వర్ధంతి కరీంనగర్కల్చరల్: పేదరికంలో పుట్టి, పేదల పక్షాన తన కవిత్వాన్ని రాసిన కవి అలిశెట్టి ప్రభాకర్. జగిత్యాల పట్టణంలో లక్ష్మి, చిన్నరాజం దంపతులకు 12 జనవరి 1956లో జన్మించారు. 1993 జనవరి 12న అనారోగ్యంతో మరణించారు. కవిగా ప్రయాణం ప్రభాకర్ మొదట ఆర్టిస్ట్గా ఎదిగారు. ప్రారంభంలో పత్రికలకు పండుగలు, ప్రకృతి, సినీనటుల బొమ్మలు వేశారు. తర్వాత సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వరంగంలోకి ప్రవేశించారు. 1974లో ఆంధ్రసచిత్ర వార పత్రికలో వచ్చిన శ్రీపరిష్కారంశ్రీ అచ్చయిన మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో నడిపారు. అక్కడ నిర్బంధం ఎదురుకాగా మకాంను కరీంనగర్కు మార్చారు. ఇక్కడ 1978లో ఫొటో స్టూడియో ప్రారంభించారు. కొన్నిరోజులకు ఇక్కడా నిర్బంధం ఎదురుకావడంతో హైదరాబాద్కు వెళ్లి అక్కడ స్టూడియో చిత్రలేఖ ప్రారంభించారు. ఫొటోగ్రాఫర్గా, జీవిత పోరాటంలో కవిగా ఎదిగినా ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. 1976లో చురకలు, 1978లో ఎర్రపావురాలు, 1983లో మంటల జెండాలు, రక్తరేఖ, 1990లో సంక్షోభ గీతాలు, 1992లో సిటీ లైఫ్ కవిత సంకలనాలను రాశారు. కాగా సోమవారం కరీంనగర్ ఫిలింభవన్లో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అలిశెట్టి ప్రభాకర్ పేరు మీద పురస్కారం అందజేయనున్నారు. నిబద్ధతతో కవిత్వాన్ని సృష్టించిన అభ్యుదయ కవి అలిశెటి ప్రభాకర్ పేరు మీద పురస్కారం తీసుకోవడం సంతోషంగా ఉంది. అవార్డు ప్రకటించిన తెరవే కార్యవర్గానికి ధన్యవాదాలు. – చమెన్, కవి -
యువతా.. మేలుకో
బోయినపల్లి (చొప్పదండి): కాలంతో పోటీ పడాల్సిన యువకులు.. వ్యసనాలకు బానిసలై జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) యుగంలో కొత్త ఆలోచనలు.. సరికొత్త ఆవిష్కరణలతో యువత ఎప్పుడూ ముందుండాలి. ఉడుకు రక్తంతో చైతన్యజ్యోతుల్లా వెలిగే యువకులు సేవేమార్గంగా మంచి ఆలోచనలతో సమాజానికి మార్గనిర్ధేశకులుగా నిలవాలి. యువజన చైతన్యమే లక్ష్యంగా.. యువత భాగసామ్యాన్ని దేశాభివృద్ధికి బాటలు వేసేలా ప్రతీ సంవత్సరం జనవరి 12న యువజన స్ఫూర్తిదాత స్వామి వివేకానందుని జయంతి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆయన జయంతిని ప్రభుత్వం నేషనల్ యూత్ డేగా ప్రకటించింది. తగ్గాలి నేరాల్లో పాత్ర సమాజంలో జరిగే నేరాల్లో యువత పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. చైన్స్నాచింగ్లు.. ర్యాష్డ్రైవింగ్.. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, పేకాట వ్యసనాలతో యువత పెడదారిన పడుతున్నారు. వివేకానంద జయంతి సందర్భంగా పెడదారిలో ఉన్న యువత నేరాల వైపు నుంచి మంచి మార్గం వైపు నడవాలి. డ్రగ్స్, మద్యం మత్తులో.. డ్రగ్స్, మద్యానికి బానిసై యువత తమ విలువైన భవిష్యత్తును వదిలి మత్తులో జోగుతున్నారు. నలుగురు యువకులు కలిస్తే మందు.. చిందే ఫ్యాషన్గా మారింది. ర్యాష్ డ్రైవింగ్కు నో.. రోడ్డు ప్రమాదాల్లో యువకులు మృత్యువాత పడుతుండడం విషాదం. యువకుల మితిమీరిన వేగం.. అజాగ్రత్తలతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. డ్రైవింగ్ మోజులో వాహనాలు అతివేగంగా నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎదిగిన కొడుకుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. విగత జీవులను చూసి రోఽధిస్తున్నారు. బైక్ నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్.. హెల్మెట్ ధరించాలి. సమాజసేవతో ఉత్తములుగా.. సిటీ కల్చర్లో అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక ఎవరికి వారే అన్న ధోరణి పెరిగింది. ఏళ్ల తరబడి పక్కకే ఉన్న పరిచయాలు, పేర్లు తెలియని పరిస్థితి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి. బాధలో ఉన్న వారికి బాసటగా నిలిచి సాయం చేయలి. ఆధ్యాత్మికతతో క్రమశిక్షణ యువత ఆధ్యాత్మికత వైపు చూస్తే క్రమశిక్షణ కలుగుతుంది. మంచి ఆలోచనలు వస్తాయి. ఆధ్యాత్మికత మనిషిలో దాగి ఉన్న నిగూఢమైన శక్తిని బయటకు తెస్తుంది. మహిళలకు గౌరవం ప్రేమ పేరుతో అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేయడం.. అల్లరి పనులు చేయడంతో కొంతమంది యువతకు చెడు పేరు వస్తోంది. కార్యేశుదాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేశు మాత.. శయనేషు రంభ ఈ నానుడి మహిళల వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. లక్ష్యసాధనకు గురిపెట్టాలి నీలో ఉన్న ప్రత్యేకతను పది మందికి తెలియజేయాలనే తపన లక్ష్యం వైపు పయనింపజేస్తుంది. లక్ష్యం లేని జీవనం కొనసాగించడం అర్థరహితం. యువకులు సమాజంలో గుర్తింపు పొందాలంటే ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి. లక్ష్యసాధనకు కఠోర శ్రమ చేయాల్సిందే. ఉదయాన్నే లేవడం, వ్యాయామం చేయడం వంటివి దినచర్యలో భాగం కావాలి. నవ సమాజ నిర్ధేశకులు మీరే.. డ్రగ్స్ మత్తులో చిక్కుకోవద్దు మంచి ఆలోచనలతో సమాజసేవ నేడు స్వామి వివేకానంద జయంతి వివేకానంద స్ఫూర్తితో.. సిరిసిల్లటౌన్: ‘పడిపోవడం కాదు...లేచి నిలబడలేకపోవడమే ఓటమి’ అన్న స్వామీజీ సూక్తులకు ఆకర్షితుడైన సిరిసిల్లకు చెందిన యువకుడు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొత్వాల సాయిరాం వృత్తి రీత్యా క్షురకుడు. చిన్నప్పటి నుంచి స్వామిజీ కథలను ప్రభావితుడయ్యాడు. కులవృత్తితో జీవనోపాధి పొందుతున్న సాయిరాం సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటిన వివేకానందుడి పుస్తకాలు సేకరిస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. హైదరాబాద్లోని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ అకాడమీ నుంచి ప్రచురితమయ్యే పుస్తకాలను జీవిత చందాదారుడిగా చేరాడు. ఇప్పటి వరకు 400 పుస్తకాలను సేకరించాడు. -
కాంగ్రెస్తోనే దళితులకు ఆత్మగౌరవం
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీతోనే దళితులకు పదవులు, ఆత్మగౌరవం సాధ్యమని పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్గా నియామకమైన అనంతరం శనివారం తొలిసారిగా జిల్లాకు వచ్చిన కవ్వంపల్లికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కోర్టు చౌరస్తాలో ఏర్పాటుచేసిన సభలో కవ్వంపల్లి మాట్లాడారు. దళితులకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పదవులు ఇచ్చింది, ఆత్మగౌరవం ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుడైన రాజయ్యకు డిప్యూటీ సీఎం ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారని విమర్శించారు. కొప్పుల ఈశ్వర్ను తన పక్కన కూడా కూర్చోనివ్వకుండా కేసీఆర్ అవమానించాడన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక నలుగురు దళితులకు మంత్రి పదవులు ఇచ్చిందన్నారు. దళితులకు సేవ చేసేందుకు తనకు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ అనే బాధ్యతను అప్పగించారన్నారు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి దళితులు వెన్నెముక అన్నారు. కవ్వంపల్లికి మంత్రి పదవి వెంట్రుక వాసిలో తప్పిపోయిందని, ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ పదవి వచ్చిందన్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలైతే సత్యనారాయణ సతీమణి కవ్వంపల్లి అనురాధ ఎమ్మెల్యే అవుతారన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ కమిటీ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణగౌడ్, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వుట్కూరి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రత్యేక రైలు 12వరకు పొడిగింపు
రామగుండం: హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ మధ్య నడిచే ఫెస్టివల్ స్పెషల్ ట్రెయిన్ను మరోరెండు రోజులు పొడిగిస్తున్నట్లు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఈనెల 9, 10వ తేదీల్లో ప్రత్యేక రైలు నడిపిస్తుండగా.. కోల్బెల్ట్ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈనెల 11, 12వ తేదీల్లో కూడా ప్రత్యేక రైలును నడిపిస్తున్నట్లు వివరించింది. హైదరాబాద్ – సిర్పూర్కాగజ్నగర్(07473) మధ్య 11, 12వ తేదీల్లో ఉదయం 7.55 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకుంటుంది. సిర్పూర్ కాగజ్నగర్ – హైదరాబాద్(07474) మధ్య ఈనెల 10, 11వ తేదీల్లో మధ్యాహ్నం 3.15గంటలకు బయలుదేరి రాత్రి 10.20 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది. -
అంతర్రాష్ట్ర సైబర్ నిందితుడి రిమాండ్
వేములవాడరూరల్: అంతర్రాష్ట్ర సైబర్ ప్రధాన నిందితుడు లక్కీకుమార్ అలియాస్ సదానంద్కుమార్ను శనివారం అరెస్టు చేసినట్లు ఏఎస్పీ రుత్విక్సాయి పేర్కొన్నారు. వేములవాడరూరల్ సర్కిల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బిహార్లోని బహుదూర్పూర్ గ్రామానికి చెందిన లక్కీకుమార్ హైదరాబాద్లో ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహించాడు. సరిగా నడవకపోవడంతో బిహార్ వెళ్లిపోయాడు. అనంతరం ఆన్లైన్ ద్వారా లోన్ల పేరుతో ప్రజలను మోసం చేయాలని పథకం రూపొందించాడు. అనిల్నాయక్, బోడ రజిత, భరత్రాజ్తో కలిసి ఫేస్బుక్లో ఇండియాబుల్స్ ధని ఫైనాన్స్ పేరుతో నకిలీ పేజీ సృష్టించి, తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు ఇప్పిస్తామని ప్రచారం చేశాడు. ఆ పేజీని సందర్శించిన వారి ఫోన్ నంబర్లకు ఫోన్చేసి నమ్మించి పత్రాలు, చార్జీల పేరుతో డబ్బు వసూలు చేసి లోన్ మంజూరు చేయకుండా మోసం చేశాడు. ఇందులో బాధితుడైన వేములవాడరూరల్ మండలం ఫాజుల్నగర్కు చెందిన పోగుల మల్లేశంకు ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ వస్తుందని తెలిపి, ప్రాసెసింగ్ ఫీజు రూ.1,18,400 వసూలు చేశాడు. బాధితుడు మోసపోయినట్లు గుర్తించి సైబర్క్రైంలో ఫిర్యాదు చేయగా, లక్కీకుమార్, అనిల్నాయక్, బోడ రజిత, భరత్రాజ్పై కేసు నమోదు చేశారు. వేములవాడరూరల్ సీఐ ఆధ్వర్యంలో సైబర్ ఆర్ఎస్సై జునైద్, ఎస్సై వెంకట్రాజం, కానిస్టేబుల్ కిట్టు, చందు టీమ్ హరియాణాలో లక్కీకుమార్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా ఎన్సీఆర్పీ పోర్టల్లో 30 ఫిర్యాదులు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు. -
కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జీగా ‘వెలిచాల’
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీగా వెలిచాల రాజేందర్రావు నియామకం అయ్యారు. నగరపాలకసంస్థ ఎన్నికలకు ముందు రాజేందర్రావుకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలను అప్పగించింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆదేశంతో శనివారం పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చాలా రోజుల తరువాత కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి పోస్టు భర్తీ అయింది. 2023లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పురుమల్ల శ్రీనివాస్ ఓటమి అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్చార్జీగా కొనసాగారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పురుమల్లను దాదాపు ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ ఇన్చార్జి పోస్టు ఖాళీగా ఉంది. 2024లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వెలిచాల రాజేందర్రావు, అనంతరం కరీంనగర్లో క్రియాశీలకంగా మారారు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్ష, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ పదవుల్లో ఏదో ఒకటి వస్తుందని ప్రచారం జరగగా, మేడిపల్లి సత్యంకు డీసీసీ అధ్యక్ష పదవి దక్కింది. తాజాగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కీలకమైన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ పదవి రాజేందర్రావును వరించింది. కార్పొరేషన్ కై వసం చేసుకుంటాం నగరపాలకసంస్థ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని కై వసం చేసుకొంటామని రాజేందర్రావు అన్నారు. పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తానని తెలిపారు. -
మానేరు బ్రిడ్జిపై కారు దగ్ధం
కరీంనగర్క్రైం: అల్గునూర్ నుంచి కరీంనగర్ వెళ్లే మానేరు బ్రిడ్జిపై కారు దగ్ధమైంది. ఫైర్ అధికారులు తెలిపిన వివరాలు.. శనివారం సాయంత్రం మంచిర్యాలకు చెందిన మాడ శ్రీరాంరెడ్డి కారులో తన కుటుంబసభ్యులతో హైదరాబాద్ నుంచి మంచిర్యాల వెళ్లే క్రమంలో అల్గునూర్ బ్రిడ్జి వద్దకు రాగానే రేడియేటర్ వేడెక్కి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శ్రీరాంరెడ్డి అప్రమత్తమై వెంటనే భార్య, ఇద్దరు పిల్లలను కారు నుంచి కిందికి దించారు. మంటలు పెద్దఎత్తున చెలరేగి కారు కాలిపోతుండగా స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో వారు మంటలు ఆర్పారు. ఇందులో ఎవరికి ప్రమాదం జరగలేదని డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ ఘటనతో బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ పోలీసులు వచ్చి క్లియర్ చేశారు. -
రీఫిల్లింగ్కు అడ్డేది?
కరీంనగర్ అర్బన్: జిల్లాలో మినీ గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ నిబంధనలు పట్టని హోంనీడ్స్ దుకాణదారులు మినీ సిలిండర్లలో గ్యాస్ నింపి సొమ్ము చేసుకుంటున్నారు. రాయితీ, వాణిజ్య సిలిండర్లను బ్లాక్లో కొనుగోలు చేసి ఈ దందా సాగిస్తున్నారు. నిఘా పెట్టి నియంత్రించాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా బహిరంగమే నగరంలోని పలు హోంనీడ్స్ దుకాణాలు అక్రమ గ్యాస్ సిలిండర్ల దందాకు అడ్డాగా మారాయి. హైదరాబాద్ నుంచి చిన్న సిలిండర్లు కొనుగోలు చేసి తెచ్చి వ్యాపారం చేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో మినీ సిలిండర్లు విక్రయిస్తూ రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. రూ.924 ఉన్న రాయితీ గ్యాస్ను ఏజెన్సీ నిర్వాహకులు, డెలివరీ బాయ్స్ నుంచి రూ.1100కి కొనుగోలు చేస్తున్న నిర్వాహకులు 3 లేదా 4 సిలిండర్లలో నింపుతూ దండుకుంటున్నారు. ఫోన్ చేస్తే చాలు.. రాయితీ మీ ఇంటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో కార్లకు గ్యాస్ వినియో గం పెరుగుతోంది. ఫోన్ చేస్తే చాలు రాయితీ గ్యాస్ను వక్రమార్గంలో అందజేస్తున్నారు. వీరికి మధ్య దళారులుగా మినీ సిలిండర్లు విక్రయించేవారు వ్యవహరిస్తున్నారు. కారులోకి గ్యాస్ నింపాలంటే చాలు సదరు వ్యక్తులకు ఫోన్ చేస్తే వాహనంలో ఎక్కిస్తున్నారు. సదరు సేవలకు రూ.100 వసూలు చేస్తున్నారు. రీఫిల్లింగ్ చేయడం చట్ట రీత్యా నేరమని, ఎవరైనా రీఫిల్లింగ్ చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల అధికారి నర్సింగరావు వివరించారు. ఒక్క దుకాణమేనా? వంటగ్యాస్ వ్యాపారుల పంట పండిస్తుంటే పౌరసరఫరాల అధికారుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 8న సాక్షిలో ‘యథేచ్ఛగా గ్యాస్ దందా’ శీర్షికన కథనం ప్రచురించింది. పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం తనిఖీలు చేపట్టగా గాంధీ రోడ్డులోని గ్యాస్ రీపెరింగ్ సెంటర్లో తనిఖీలు చేపట్టి కేవలం 13 సిలిండర్లను పట్టుకుని మమ అనిపించింది. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి పద్మనగర్ వరకు, గీతాభవన్ నుంచి రేకుర్తి వరకు, బస్టాండ్ నుంచి పెద్దపల్లి రోడ్డు వరకు తనిఖీలు చేస్తే అడుగడుగునా కుప్పలుగా వంట గ్యాస్ సిలిండర్లు లభ్యమయ్యే అవకాశాలున్నా తదనుగుణంగా చర్యల్లేకపోవడం సివిల్ సప్లయ్ నిబద్ధతకు తార్కాణం.శనివారం నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆర్కే గ్యాస్ సర్వీసింగ్ సెంటర్లో సివిల్ సప్లయ్ డీటీ సురేందర్ తనిఖీలు చేపట్టారు. కుప్పలు తెప్పలుగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు వెలుగుచూశాయి. 13 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సమీప గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. సదరు సబ్సిడీ గ్యాస్ను మినీ సిలిండర్లలో నింపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. -
మమ్మీ.. డాడీ.. ఒంటరి చేశారు
రామగుండం: ‘మమ్మీ, డాడీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయారు. మమ్మీ.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి మంచిగా చదువుకో అన్నావు.. డాడీ.. ఎంత ఖర్చయినా నీకు ఇష్టమున్న కాలేజీలో చదివిస్తానన్నావు.. పొద్దున్నే స్కూల్ టైం అవుతుంది.. తొందరగా రెడీ అవ్వు అని అల్లారుముద్దుగా బడికి పంపిస్తిరి.. ఇప్పుడు నాకు దిక్కెవ్వరు.. మీ ప్రేమ ఎవరి నుంచి దొరుకుతుంది.. నేను ఎందుకోసం చదవాలి.. నా మంచిచెడు ఎవరితో చెప్పుకోవాలి’ అంటూ ఆ కూతురు రోదన వర్ణనాతీతం. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన కందుల తిరుపతి–స్రవంతి దంపతులు. అన్యోన్యంగా ఆర్థిక పొదుపు పాటిస్తూ ఆదర్శంగా జీవించారు. వీరి కూతురు శివాణి ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మూడేళ్ల క్రితం మేడిపల్లి ఓపెన్కాస్టు మూతపడడంతో క్రమంగా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తిరుపతి ఏదో ఓ పని చేసుకుంటూ, స్రవంతి కుట్టుమిషన్తో ఎంతో కొంత సంపాదిస్తూ ఆనందంగా ఉన్నారు. ఈనెల 7న దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్య బాత్రూమ్లోకి వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకోగా, భర్త మంటలు ఆర్పే ప్రయత్నంలో ఇద్దరూ 70శాతం కాలిపోయారు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఈనెల 8న తిరుపతి, 10న స్రవంతి మృతిచెందారు. చివరిచూపునకు నోచుకోక.. క్షణికావేశానికి తల్లిదండ్రులు బలి కాగా, కూతురు రోదనలు మిన్నంటాయి. ‘మమ్మీ.. డాడీ’ అని ఎవరిని పిలవాలంటూ శివాణి రోదించిన తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చనిపోయిన విషయం తల్లికి తెలియదు.. తండ్రి అంత్యక్రియలు పూర్తవగానే తల్లి మరణం.. మళ్లీ తల్లికి అంత్యక్రియలు చేయడం.. మూడురోజులుగా ఆ కూతురు గుండెలవిసేల రోదించింది. పగోడికై నా ఇంతటి కష్టం రావద్దంటూ గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. తల్లి స్రవంతి శరీరం పూర్తిగా కాలిపోవడంతో మృతదేహాన్ని ప్యాక్ చేసి పంపించగా, కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నానంటూ శివాణి వెక్కివెక్కి ఏడ్వడం గుండెలను పిండేసింది. ఇటీవల పెట్రోల్ పోసుకొని భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం చికిత్స పొందుతూ రెండురోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి అనాథగా మారిన కూతురు శివాణి -
రిజర్వేషన్లు ఎట్లనో!
కరీంనగర్ఆదివారం శ్రీ 11 శ్రీ జనవరి శ్రీ 2026కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. ఓటర్ల తుది జాబితా ఈ నెల 12వ తేదీన ప్రకటించనుండగా, తరువాత రిజర్వేషన్ల ఖరారుపై యంత్రాంగం సమాయత్తం కానుంది. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఇప్పటివరకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో, ఉత్కంఠ పెరిగింది. ఇంతకీ.. ఏ ప్రాతిపదికన? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. అభ్యంతరాల ఆధారంగా జాబితా సవరణ కొనసాగుతోంది. ఈ నెల 12వ తేదీన డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు. 13న పోలింగ్ బూత్ల డ్రాఫ్ట్ జాబితా ప్రకటించి, అభ్యంతరాల అనంతరం 16వ తేదీన పోలింగ్ బూత్లవారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాను డివిజన్ల ప్రకారం ప్రచురించనున్నారు. ఓటర్ల జాబితా దాదాపు కొలిక్కి వచ్చిన సందర్భంలో రిజర్వేషన్లపై చర్చ మొదలైంది. మేయర్, చైర్మన్ పదవులకు రాష్ట్రస్థాయిలో, డివిజన్లు, వార్డులకు మున్సిపాలిటీలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రిజర్వేషన్ నిర్ణయించేందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు రిజర్వేషన్లకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో, ఊహాగానాలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రకారం, బీసీ ఓటర్ల వారిగా, మహిళ డ్రా ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇప్పుడు రొటేషన్ పాటిస్తారా, గ్రామాలు, మున్సిపాలిటీల విలీనంతో డివిజన్ల పునర్విభజన జరిగిన కారణంగా, రొటేషన్ లేకుండా రిజర్వేషన్లు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లకు రొటేషన్ పద్ధతి పాటించారు. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో రొటేషన్ ఉంటుందా, మహిళలకు డ్రా పద్దతా, ఓట్ల సంఖ్య ఆధారంగానా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రిజర్వేషన్ సీట్లు పెరిగేనా? నగరపాలకసంస్థకు రిజర్వేషన్ల మార్గదర్శకాలు ఎలా ఉన్నా, సీట్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలో గతంలో 60 డివిజన్లు ఉండగా, విలీనం, పునర్విభజన అనంతరం ఆ సంఖ్య 66కు పెరగడం తెలిసిందే. 60 డివిజన్లలో 23 బీసీ, 6 ఎస్సీ, 1 ఎస్టీ రిజర్వేషన్కు కేటాయించగా, ఈ సారి 66 డి విజన్లకు గాను 24 బీసీ, 7 ఎస్సీ, 2 ఎస్టీ(ఇందులో సగం మహిళలు) అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. 2020లో మేయర్ స్థానం అన్రిజర్వ్డ్ కాగా, ఈ సారి అయ్యే రిజర్వేషన్పై ఆయా పార్టీల నేతలు ఆసక్తి కనపరుస్తున్నారు. మార్గదర్శకాలు విడుదలైన తరువాత రిజర్వేషన్ల సంఖ్య, ఖరారుపై స్పష్టత రానుంది. ఓటర్ల తుది జాబితా తరువాత రిజర్వేషన్లపై కసరత్తు మొదలయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా రిజర్వేషన్ల ఖరారుపై తమ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉండడంతో, అందరి చూపు రిజర్వేషన్ల ప్రక్రియపైనే ఉంది. 2020లో కరీంనగర్ నగరపాలకసంస్థ రిజర్వేషన్లు ఇలాఎస్టీ 01ఎస్సీ 03ఎస్సీ(మహిళ) 03బీసీ 12బీసీ (మహిళ) 11జనరల్ (అన్రిజర్వ్డ్) 14జనరల్ (మహిళ) 16మొత్తం 60 -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అశోక్నగర్లో నివాసముండే కరబూజ గీతాంజలి (35) శనివారం సాయంత్రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్యాల మండల కేంద్రానికి చెందిన గీతాంజలికి విద్యానగర్కు చెందిన లక్ష్మ ణ్తో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు. రెండేళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో గీతాంజలి కొడుకు, తల్లితో కలిసి అశోక్నగర్లో నివాసం ఉంటోంది. ఏం జరిగిందోగా నీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గీతాంజలి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. తల్లి మందలించిందని..గొల్లపల్లి: తల్లి మందలించిందన్న మనస్తాపంతో కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాపల్లిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మారంపల్లి గంగయ్య, రాధ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన పవన్కల్యాణ్ (22) తాపీపనులకు కూలీగా వెళ్తుంటాడు. అతని సోదరుడు కూడా కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. పదేళ్ల క్రితం గంగయ్య మృతిచెందారు. వీరి భారం తల్లిపై పడింది. అప్పటి నుంచి కొడుకులను సాకుతూ ఉంది. కొంతకాలంగా తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. ఇద్దరు కుమారులు అమ్మ ఆలనపాలన చూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. ఇద్దరికీ పెళ్లికాలేదు. నిరుపేదలు కావడంతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి కల్యాణ్ ఆర్థిక సహాయం చేయడం లేదని తల్లి శుక్రవారం మందలించింది. అప్పటినుంచి కల్యాణ్ మనస్తాపంతో ఉంటున్నాడు. రాత్రి 11.30 గంటలైనా ఇంటికి రాలేదు. రాధ వేకువజామున లేచి చూసే సరికి ఇంటి దర్వాజకు ఉరేసుకుని కనిపించాడు. రాధ ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మానసిక సమస్యలతో మహిళ..సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మారేడుకొండ రాజేశ్వరి(60) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజేశ్వరి కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతోంది. శుక్రవారం పురుగుల మందు తాగగా, ఆమె కొడుకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లగా చికిత్సపొందుతూ శనివారం మృతిచెందింది. మృతురాలి కొడుకు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని ఓబులాపూర్ గ్రామంలో ఉన్న ‘అమ్మా అనాథ వృద్ధాశ్రమం’లో విషాదకర పరిస్థితి నెలకొంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ రావడానికి సరైన దారి లేక వృద్ధులు, సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. ఆశ్రమంలో ఉంటున్న యాంసాని సత్యలక్ష్మి (78) శనివారం కాలుజారి పడడంతో ఆమె నడుము విరిగింది. అలాగే గోగుల లక్ష్మి (65) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆశ్రమ నిర్వాహకులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. కాగా, ఆశ్రమానికి వెళ్లే దారి బురదమయంగా ఉండటంతో వాహనం లోపలికి రాలేకపోయింది. దీంతో అంబులెన్స్ సిబ్బంది సుమారు గంట సేపు శ్రమించి, బాధితులను స్ట్రెచర్పై పడుకోబెట్టి చాలా దూరం మోసుకుంటూ అంబులెన్స్ వరకు తీసుకువచ్చారు. 13 ఏళ్లుగా ఆశ్రమానికి సరైన రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇ బ్బందులు పడుతున్నామని నిర్వాహకులు ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో ఈ స మస్య మరీ దారుణంగా ఉంటుందని, అత్యవసర వైద్యం అందక వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు నిర్మించాలని వేడుకుంటున్నారు. -
సౌకర్యాలపై దృష్టిసారించాలి
కొండగట్టుకు వచ్చే భక్తులు ఏటా పెరుగుతున్నా.. సౌకర్యాలు కల్పించడంలో అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. కాలినడకన వెళ్లే భక్తుల కోసం మెట్లదారిని అభివృద్ధి చేసి, లైట్లు ఏర్పాటు చేయాలి, నడిచివెళ్లలేని వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాహనాలు గుడి సమీపంలోకి వెళ్లేందుకు అనుమతించాలి. వైజంక్షన్ సమీపంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలి. – గడ్డం నాగరాజు, గొల్లపల్లె మంగళ, శనివారాల్లో అంజన్నను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కేవలం 200మందికి మాత్రమే ఉచిత అన్నదానం అందిస్తుండడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అంజన్న అన్న ప్రసాదం అందడం లేదు. 400మంది భక్తులకు ఉచిత అన్నదానం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. – చీకట్ల రవీందర్, మ్యాడంపల్లి -
మొన్న బాధ్యతలు.. నిన్న బదిలీ
● మహిళాస్టేషన్ సీఐ సీసీఆర్బీకి అటాచ్ కరీంనగర్క్రైం: కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ రఫీక్ ఖాన్ను సీసీఆర్బీకి అటాచ్ చేశా రు. మూడు రోజుల కిత్రం జగిత్యాల వీఆర్ నుంచి కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్కు బది లీ అయ్యారు. బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే డీసీఆర్బీ విభాగానికి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఇందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా తిమ్మాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న ఓ అధికారిపై పెద్దఎత్తున ఆరోణలు రావడంతో సీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్టౌన్: స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఈనెల 12న తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వివేకానంద జయంతి ఉత్సవాల పోస్టర్ను క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు. సమితి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉత్తమ యువజన అవార్డ్ గ్రహీత సత్తినేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, వొడ్నాల రాజు, జక్కని సాయిరాం, పటేల్ సుధీర్రెడ్డి, గంగాధర చందు, బొంకూరి మోహన్, అన్వేశ్, మహేందర్, సుస్మిత, కిరణ్మయి పాల్గొన్నారు. కరెంటు వైర్లతో జాగ్రత్త కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు దూరంగా ఖాళీ ప్రదేశాల్లో పతంగులు ఎగరేయాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ రమేశ్బాబు తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పతంగులు ఎగరేస్తే ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. చైనా మాంజా ప్రమాదకరమన్నారు. విద్యుత్ వైర్లు, పరికరా లపై పతంగులు, మాంజాలు తెగిపడితే విద్యు త్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1912కు, సమీప కార్యాలయానికి సమాచారం ఇవ్వాలన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చిగురుమామిడి: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్యోజన అందాలంటే పట్టాదార్ పాసుపుస్తకం కల్గిన ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి కోరారు. శనివారం చిగురుమామిడి, కొండాపూర్, చిన్నముల్కనూర్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఏడీఏ శ్రీధర్, ఏవో మల్లేశం తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలి కరీంనగర్టౌన్: ఖమ్మం జిల్లాలో ఈనెల 18న నిర్వహించే సీపీఐ శత జయంతి ముగింపు ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆ పార్టీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బద్దం ఎల్లారెడ్డిభవన్లో మాట్లాడారు. ఈనెల 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్లో జరుగుతాయన్నారు. జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్కుమార్, బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, నాగేల్లి లక్ష్మారెడ్డి, బత్తుల బాబు, న్యాలపట్ల రాజు, గూడెం లక్ష్మి, బండ రాజిరెడ్డి పాల్గొన్నారు. -
నలుగురు దొంగల అరెస్ట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో వరుస దొంగతనాలకు పాల్పడిన న లుగురు దొంగలను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.30వేల నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఎల్లారెడ్డిపేట పోలీస్స్టేషన్లో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. మండలంలోని వెంకటాపూర్కు చెందిన మరాటి రాజేశ్, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అల్లూరుకు చెందిన కోసిడిగ నగేశ్, హయత్నగర్ పరిధి గౌరవెల్లికి చెందిన బొంతశేఖర్, సిరిసిల్ల పట్టణానికి చెందిన ఆడెపు రవి జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం దొంగతనాలు చేస్తున్నారు. గతంలో వీరందరిపై దొంగతనం, గంజాయి విక్రయించిన కేసులు ఉన్నాయి. శేఖర్ అనే వ్యక్తిపై 34 కేసులు ఉండగా, రాజేశ్పై 22, నగేశ్పై 14 కేసులు ఉన్నాయి. వీరు పగటిపూట తాళాలు వేసి ఉన్న ఇండ్లను చూసి అదే రోజు రాత్రి దొంగతనాలకు పాల్పడడం అలవాటుగా చేసుకున్నారు. ఈక్రమంలోనే రెండు రోజుల వ్యవధిలో గొల్లపల్లి, బొప్పాపూర్ గ్రామాల్లో దొంగతనాలకు పాల్పడి రూ.80వేల నగదుతోపాటు బంగారం, వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని అపహరించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా సీఐ శ్రీనివాస్గౌడ్, ఎస్సై రాహుల్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చేపట్టారు. దొంగలను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించారు. చైనా మాంజా అమ్మితే జైలుకే.. చైనా మాంజా దారం అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ నాగేంద్రచారి హెచ్చరించారు. చైనా మాంజాతో ప్రకృతికి విఘాతం కలగడమే కాకుండా, వాహనదారుల గొంతులకు తగిలితే చనిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఎవరి వద్దనైనా చైనా మాంజా సంబంధించిన సరుకులు దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్లో వచ్చే పోస్టులను ఓపెన్ చేయొద్దనిని సూచించారు. రూ.30వేల నగదు, బైక్ స్వాధీనం -
నకిలీ ఉద్యోగాల ముఠా గుట్టురట్టు
ఆదిలాబాద్టౌన్: ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఆదిలాబాద్ వన్టౌన్లో కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ముఠా వివరాలను శనివారం ఆదిలాబాద్లోని ఏఆర్ హెడ్క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. నిందితుల్లో వరంగల్ జిల్లా గీరమాజిపేటకు చెందిన అనంత ఈ–సొల్యూషన్ సీఈవో జిట్టబోయిన మధుకిరణ్, హన్మకొండలోని జాఫర్గడ్కు చెందిన మాదాసి సుధాకర్, గోదావరిఖనిలోని కళ్యాణ్నగర్కు చెందిన నమ్మని సతీశ్లను అరెస్టు చేయగా, హైదరాబాద్కు చెందిన సుజాత ఠాకూర్, లావణ్య పరారీలో ఉన్నట్లు తెలిపారు. వీరు 2013లో అనంత ఈ–సొల్యూషన్ పేరిట కంపెనీ స్థాపించి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించారని తెలిపారు. విద్యాంజలి 2.0 పథకం ద్వారా డబ్బులు దుర్వినియోగం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే సీఎస్ఆర్ నిధులు కాజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని నకిలీ నియామక ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. ఆయా జిల్లాల్లో ఏజెంట్లను నియమించి పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష నుంచి రూ.2.50లక్షల వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 240 మంది నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. మూడు నెలలపాటు వేతనం అందించిన తర్వాత వేతనం రాకపోవడంతో బాధితులు పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారని తెలిపారు. వారికి సహకరించిన ఏజెంట్లను ఇదివరకే జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన వన్టౌన్ సీఐ సునిల్కుమార్, ఐటీ కోర్ ఆర్ఎస్సై గోపీకృష్ణలను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, ఎస్సైలు గోపికృష్ణ, నాగనాథ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అంజన్న చెంత.. అవస్థల చింత
మల్యాల: మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు అంజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు అనుగుణంగా వసతులు లేకపోవడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. స్వామివారి ఉచిత అన్నదానం కోసం వందలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. భక్తుల నుంచి విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసిన అధికారులు.. భక్తులందరికీ అన్నదానం అందించేలా చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అస్తవ్యస్తంగా మెట్లదారి.. కాలినడకన వెళ్లి స్వామివారికి మొక్కులు అప్పగించాలని వేలాది మంది భక్తులు భావిస్తుంటారు. అయితే మెట్లదారి మీదుగా నడిచివెళ్లాలంటే కష్టతరంగా మారింది. ఆ దారిని పట్టించుకోకపోవడంతో ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగాయి. చెత్తాచెదారంతో నిండిపోయింది. దీనికితోడు దుర్గంధం వెదజల్లుతోంది. ఏటా పెరుగుతున్న భక్తులు కొండగట్టు అంజన్న దర్శనానికి మాల ధరించి వచ్చే దీక్షాపరులు ఏటా పెరుగుతున్నారు. హనుమాన్ చిన్న, పెద్ద జయంతి ఉత్సవాల్లో లక్షలాది మంది స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. ఆ సమయంలో మాత్రమే మెట్లదారి వెంట వెలుగులు ఏర్పాటు చేస్తున్న అధికారులు అనంతరం పట్టించుకోవడం లేదు. పార్కింగ్ తిప్పలు..ట్రాఫిక్ జామ్ దూరప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు పార్కింగ్ స్థలం కొరతతో ఇబ్బంది పడుతున్నారు. పార్కింగ్ స్థలంలో భక్తుల కోసం గతంలో షెడ్డు నిర్మించడంతో స్థలం కుచించుకుపోయింది. ఘాట్రోడ్డు వెంట వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు ఆలయం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో వృద్ధులు, చి న్నారులు ఆలయం వరకు వెళ్లలేకపోతున్నారు. ప్ర తి మంగళవారం, శనివారాల్లో వైజంక్షన్ వద్ద తీవ్ర టాఫిక్ జామ్ ఏర్పడుతోంది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోతున్నాయి. నిలిచిన ఎత్తిపోతల పథకం.. ఆలయంలో నీటి సమస్య పరిష్కారానికి వరదకాలువ నుంచి సంతలొద్దికి నీటిని పంపింగ్ చేసి.. అక్కడి నుంచి కొండపైకి తరలించే పథకం మధ్యలో నిలిచిపోయింది. గత ప్రభుత్వ పాలనలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకం రెండున్నరేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తికావడం లేదు. ఫలితంగా మిషన్ భగీరథ నీటిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వంద మందికే అన్నదానం ఆలయ ఆధ్వర్యంలో కొండగట్టుకు వచ్చే భక్తులకు నిత్యం 100మంది భక్తులకు మాత్రమే అన్నదానం అందుతోంది. మంగళ, శనివారాల్లో మాత్రం 200 మందికి అందిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నా.. అన్నదానాల సంఖ్య పెంచకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెనుదిరుగుతున్నారు. రోజూ 200 మందికి, మంగళ, శనివారాల్లో 400మందికి అన్నదానం అందించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా మెట్లదారి.. వాహనాల పార్కింగ్ మరుగున పడిన మాస్టర్ ప్లాన్ నిలిచిన ఎత్తిపోతల పథకం భక్తులను వేధిస్తున్న గదుల కొరత -
శిశువుల ఆకలి తీరేదెలా
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా, శిశు సంక్షేమ కేంద్రంలో నెలకు 300లకు పైగానే ప్రసవాలు జరుగుతున్నాయి. మిల్క్బ్యాంక్ లేకపోవడంతో పాలు పడని తల్లుల పిల్లలకు ఫార్ములా మిల్క్ అందిస్తున్నారు. దీని ద్వారా సహజసిద్ధమైన పోషకాలు పొందలేకపోతున్నారు. జిల్లాలో మాతా, శిశు కేంద్రంలోనే అత్యధికంగా ప్రసవాలు జరుగుతుంటాయి. ఇక్కడ మిల్క్బ్యాంక్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. శిశుమరణాలు ఆగేదెలా? జిల్లాలో శిశుమరణాలు అత్యధికంగా నమోదవుతున్నాయి. 2025 ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ వరకు దాదాపు 10 మంది వరకు చిన్నపిల్లలు మృతిచెందారు. వీరంతా వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నట్లు వైద్యులు వివరించారు. తల్లిపాలతో ప్రయోజనం తల్లిపాలు అమృతంతో సమానం. ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుతాయి. ఆరు నెలల వరకు తల్లిపాలే ఇవ్వాలి. ప్రతీ రోజు బిడ్డకు కనీసం 10–14 సార్లు తల్లిపాలు ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. -
వినూత్న ఆలోచనలు.. ఆకట్టుకునే ప్రాజెక్టులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నారులే కానీ ఆలోచనల్లో అదరగొట్టారు.. వినూత్న ప్రాజెక్టులు రూపొందించి ఔరా అనిపించారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో తమ ప్రత్యేకత కనబర్చారు. కామారెడ్డిలో జరిగిన 53వ రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్స్పైర్ మనాక్ ప్రదర్శన ఇందుకు వేదికై ంది. ఈనెల 7న ప్రారంభమైన రాష్ట్రస్థాయి పోటీలు శుక్రవారం ముగిశాయి. కరీంనగర్ జిల్లానుంచి సైన్స్ఫేర్కు 14, ఇన్స్పైర్ మనాక్లో 13 ప్రాజెక్టులు ప్రదర్శించగా.. మూడు జాతీయ, రెండు సౌత్ ఇండియా స్థాయి పోటీలకు ఎంపికయ్యాయని జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి తెలిపారు. వీరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బహుమతులు అందించారు. జాతీయస్థాయి ఇన్స్పైర్ మనాక్కు శ్రీనిత్య.. పెద్దపల్లిరూరల్: రాగినేడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి ఇల్లందుల శ్రీనిత్య ఇన్స్పైర్మనాక్ జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. తక్కువ ఖర్చుతో వరి కలుపు తీసే యంత్రం అనే వినూత్న ప్రాజెక్టుతో ఘనత సాధించిన శ్రీనిత్యను విద్యాశాఖ అధికారులు శుక్రవారం అభినందించారు. వరి సాగులో రైతుకు శ్రమను తగ్గించి తక్కువ ఖర్చుతో కలుపు సమస్యకు పరిష్కారం అందించేలా రూపొందించిన పరికరం అందరి ప్రశంసలు అందుకుంది. శ్రీనిత్యను హెచ్ఎం చాట్ల ఆగయ్యతోపాటు జగదీశ్వర్రెడ్డి, సర్పంచ్ సోమ కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు. హైడ్రాలిక్ ఫుల్పంప్ తయారీతో.. చందుర్తి(వేములవాడ): రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ముష్కం జాహ్నవి జాతీయస్థాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు శరత్ చంద్ర, ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు ఝూన్సీ తెలిపారు. జాహ్నవి హైడ్రాలిక్ ఫుల్పంప్ తయారు చేసింది. ఎమ్మెల్సీ అంజిరెడ్డి నుంచి జ్ఞాపిక అందుకుంది. సౌత్ ఇండియా సైన్స్ఫేర్కు అభయ్రాజ్ రాయికల్: రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్రాజ్ సౌత్ ఇండియా సైన్స్ఫేర్కు ఎంపికై నట్లు జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్ తెలిపారు. అభయ్రాజ్ రూపొందించిన సూపర్సైన్స్ కిట్ బోధనోపకరణల విభాగంలో ఆయన ప్రాజెక్టు అబ్బురపరిచంది. ఆయనను ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డీఈవో రాము, ఎంఈవో రాఘవులు, సర్పంచ్ సంతోష్, ఉపసర్పంచ్ శేఖర్ అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు మంథని విద్యార్థులు మంథని: స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి విక్రాంత్ ఇంగ్లిష్ ఒలింపియాడ్, ఎడ్యుక్వెస్ట్ టెడ్ టాక్ పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు. అప్పన్నపేట జిల్లా పరిషత్ పాఠశాలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో విక్రాంత్ మొదటి బహుమతి అందుకున్నాడు. ఈ నెల 20న రాష్ట్రస్థాయి పోటీలకు హాజరు కానున్నాడు. గైడ్ టీచర్లుగా శేషాద్రి, రవీందర్, ఉమామహేశ్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు సుమలత, ఉపాధ్యాయ బృందం అభినందించారు. -
మాతా, శిశు సంరక్షణ కేంద్రం హుళక్కేనా?
సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యం, అత్యవసర పరిస్థితుల్లో చిన్నారులకు వైద్యసేవలు భేషుగ్గా అందుతున్నాయి. స్థలాభావంతో మాతా, శిశు సంరక్షణ కేంద్రం నిర్వహణకు ఇబ్బందిగా ఉంది. నిరుపేద వర్గాలు ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో సర్కారు వైద్యం కోసం నిత్యం 800 మంది వరకు వస్తుంటారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ ఆస్పత్రి కావడంతో 300 పడకల ఆస్పత్రిలో అన్ని వింగ్స్ నిర్వహణకు స్థలాభావం నెలకొంది. సరిపడే సిబ్బంది జిల్లా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యానికి ప్రత్యేకంగా 45 పడకలు, సిక్ న్యూ బర్న్ కేర్ సెంటర్కు 10 పడకలు, పిడియాట్రిక్స్ వింగ్కు 30 పడకలు ఏర్పాటు చేశారు. మెటర్నటీవార్డులో నిత్యం మూడు షిఫ్టుల్లో ప్రొఫెసర్స్ 2, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నలుగురిలో ఇద్దరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. సీనియర్ రెసిడెంట్స్ నలుగురిలో ముగ్గురు విధులు నిర్వర్తిస్తున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్స్ ఒక్కరు ఉండగా వేములవాడ ఆస్పత్రికి డిప్యూటేషన్పై పంపించారు. ఇక వైద్యసహాయక సిబ్బంది మూడు షిఫ్టుల్లో మొత్తం 24 మంది పని చేస్తున్నారు. స్థలాభావంతో.. సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి ప్రసూతి వైద్యం కోసం వస్తున్న గర్భిణీలకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినా స్థలాభావంతో ఏర్పాటు చేయలేదు. పెద్దూరు శివారులో మెడికల్ కాలేజీ సొంత భవనంలో కొనసాగుతుండగా.. ప క్కనే జిల్లా ఆసుపత్రి భవనం నిర్మిస్తున్నారు. అయి తే ఆ భవన పనులు ముందుకు సాగడం లేదు. -
ఎయిర్ గన్.. తల్వార్లు చూపి..
కోరుట్ల: వీడియో కాల్ చేసి.. ఎయిర్ గన్ చూపి ఓ వ్యక్తిని బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపినట్లు కోరుట్ల సీఐ సురేశ్బాబు తెలిపారు. వివరాలు.. ఎయిర్టెల్ నెట్వర్క్లో పనిచేసే ఉద్యోగస్తులను కొంత మంది కోరుట్ల మొబైల్ అసోసియేషన్ పేరిట బెదిరిస్తూ ఇక్కడ బిజినెస్ నడపాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని లేకుంటే వ్యాపారం నడవనివ్వమని బెదిరించారు. వారం క్రితం ఎయిర్టెల్ నెట్వర్క్ ఉద్యోగి దండబొయిన అరుణ్కు వీడియో కాల్ చేసి ఎయిర్గన్ తుపాకీ, బొమ్మ రివాల్వర్తో పాటు తల్వార్ చూపుతూ చంపుతామని బెదిరించారు. ఈ ఘటనపై ఎస్పీ అశోక్కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 6న కేసు నమోదు చేసి బొమ్మ తుపాకులు, ఎయిర్గన్, తల్వార్లు చూపుతూ వీడియో కాల్ చేసి బెదిరింపులకు దిగి రూ.30వేలు వసూలు చేసిన మార శివకుమార్, బోగ శ్రీనివాస్, అడ్డగట్ల సురేశ్పై కేసు నమోదు చేసి, శుక్రవారం రిమాండ్కు పంపామని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై చిరంజీవి ఉన్నారు. బెదిరించిన ముగ్గురిపై కేసు -
సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రహమాన్ మృతి
● సంతాపం తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ టౌన్: సీనియ ర్ జర్నలిస్టు మొహమ్మద్ ఫజుల్ రెహమాన్ శుక్రవారం అనారోగ్యంతో మ రణించారు. మూడున్నర దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూ జే సంఘాలకు సేవలందించారు. శనివారం ఆయన స్వగ్రామమైన హుస్నాబాద్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సీనియర్ జర్నలిస్టు ఫజుల్ రెహమాన్ మృతిపట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతో పనిచేసిన సహచర పాత్రికేయుడు కవి అన్నవరం దేవేందర్, జర్నలిస్టు, కవి పొన్నం రవిచంద్ర , మహాత్మ జ్యోతి బాపూలే విద్యాలయాల సంస్థ కార్యదర్శి జీవీ శ్యాం ప్రసాద్ లాల్ కవులు, రచయితలు, ఇండియన్ జర్నలిస్టుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్, గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, కొండా లక్ష్మణ్, గులా బీల మల్లారెడ్డి, ఒంటెల కృష్ణ, ఎలగందల రవీందర్, నెల్లుట్ల వాసుదేవరావు నలిమెల భాస్కర్, గాజోజి నాగభూషణం, ఆవునూరు సమ్మయ్య, కూకట్ల తిరుపతి, బూర్ల వెంకటేశ్వర్లు, సీవీకుమార్ నివాళి అర్పించారు. రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ ఉద్యోగి.. కరీంనగర్రూరల్: రామగుండం– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై దుర్శేడు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ మున్సిపల్ ఉద్యోగి శశికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. న్యాయం చేయాలంటూ కు టుంబసభ్యులు చేపట్టిన ఆందోళనతో దాదా పు రెండున్నరగంటలపాటు ట్రాఫిక్ స్తంభించింది. కరీంనగర్రూరల్ పోలీసులు, స్థానికు ల వివరాల ప్రకారం.. కరీంనగర్లోని కిసాన్నగర్కు చెందిన బొడ్డు శశికుమార్(28) ము న్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం తన ద్విచక్రవాహనంపై స్నేహితుడిని దుర్శేడ్లో దింపేసి, తిరిగి కరీంనగర్ బయల్దేరాడు. దుర్శేడ్ స్టేజీ సమీపంలో వెనుక నుంచి వస్తున్న ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు అతివేగంగా ముందు వెళ్తున్న శశికుమార్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. రోడ్డుపై పడిపోయిన శశికుమార్ తలపై నుంచి బస్సు వెనుకటైరు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సుడ్రైవర్ పరారు కాగా.. సమాచారం అందుకున్న సీఐ నిరంజన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబసభ్యులు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తగిన చర్యలు తీసుకుంటా మని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శశికుమార్ది ప్రేమ వివాహం కాగా కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు. -
డబ్బా పాలే దిక్కు
మంథని: తల్లి పాలు సరిపోని అప్పుడే పుట్టిన బిడ్డ కడుపు నింపే మిల్క్బ్యాంకు మంథనిలో లేకపోవడంతో డబ్బా పాలు తప్పడం లేదు. దీంతో పిల్లల్లో ఎదుగుదల క్షీణిస్తుంది. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం ద్వారా మాతా శిశు ఆరోగ్య కేంద్రాల్లో తల్లిపాల కేంద్రాలు ఉంటాయనే విషయం కూడా చాలా మందికి తెలియదు. మంథనిలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల కేంద్రం లేకపోవడంతో తల్లిపాలు సరిపోని శిశువులకు ఆస్పత్రిలో పక్కనే ఉండే మరో తల్లి తన బిడ్డకు సరిపడ పాలు ఇచ్చి..మరో బిడ్డకు సైతం పట్టిస్తున్నారు. అలా ఇష్టపడని తల్లుల పిల్లలకు పుట్టగానే డబ్బాపాలను అందిస్తున్నారు. మంథని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సీ్త్ర వైద్య సేవలు అంతంత మాత్రంగానే ఉండడంతో నెలలో 10లోపే డెలివరీలు జరుగుతున్నాయి. -
అమ్మపాలు.. జీవధార!
తల్లి ఒడిలో హాయిగా పడుకొని పాలు తాగాల్సి న నవజాత శిశువులు అమ్మ అమృతధార కోసం పోరాడాల్సిన పరిస్థితి. పౌష్టికాహార లేమి.. అనారోగ్య సమస్యతో తల్లికి పాలు పడక అప్పుడే పుట్టిన చిన్నారులకు అమృతధారలు అందడం లేదు. ఫలితంగా నవజాత శిశుమరణాలు పెరుగుతున్నాయి. పాలు పడని తల్లుల పిల్లల ప్రాణాలు నిలిపేందుకు పలువురు తల్లులు తమ పాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇలా ముందుకొచ్చిన మాతృమూర్తుల అమృతధారలను నిల్వ చేసే మిల్క్బ్యాంక్ కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలోనే ఉంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మిల్క్బ్యాంకులు ఎక్కడా లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని నవజాత శిశువులు పాల కోసం తల్లడిల్లుతున్నారు. రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ మిల్క్బ్యాంక్లు ఏర్పాటు చేస్తే చాలా మంది తల్లులు తమ పాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. – కరీంనగర్/ సిరిసిల్లటౌన్/ జగిత్యాల/కోల్సిటీ/మంథని పాలు ఎంతో ఉపయోగపడ్డాయి నాకు పాలు పడకపోవడంతో బిడ్డ ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడ్డా. కానీ మరో తల్లి నుంచి సేకరించిన పాలను నా బిడ్డకు పట్టించారు. ఆ పాలు నా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడాయి. – లావణ్య, పోతారం, హుస్నాబాద్ -
మహిళల ఆరోగ్యంతోనే అభివృద్ధి
కరీంనగర్రూరల్/రామడుగు: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బొమ్మకల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ కార్యక్రమంలో ఉచిత ఆరోగ్య వైద్యపరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ పరీక్షల్లో కేన్సర్ కేసులు గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించి, చదువుతోపాటు పోషణపై దృష్టిపెట్టడం జరుగుతోందన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ శుక్రవారం సభ ప్రారంభించినప్పటి నుంచి మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. అనంతరం జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో చదివి కానిస్టేబుల్గా ఎంపికై న జకినపల్లి హారికను సన్మానించారు. అనంతరం రామడుగు మండలం వెదిరలోని కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థులతో మాట్లాడి సిలబస్, బోధించిన పాఠ్యాంశాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ఇన్చార్జి డీడబ్ల్యూవో సుగుణ, సీడీపీవో సబిత, సూపర్వైజర్ నిర్మల, తహసీల్దార్ రాజేశ్, ఆర్ఐ వాస్తవిక్ పాల్గొన్నారు. -
సిటీలో ఓట్ల సందడి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఓట్ల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటించి న ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాల సవరణ ఓ వైపు సాగుతుండగా, కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ మ్యాపింగ్ మరోవైపు కొనసాగుతోంది. దీంతో తమ ఓట్లు ఎక్కడున్నాయి.. అసలు ఉన్నాయా లేవా అని నగరవాసులు వెతుకుతుండడంతో, డివిజన్లలో ఓట్ల హడావుడి మొదలైంది. కొనసాగుతున్న సవరణ మున్సిపల్ ఎన్నికలకు నగరపాలకసంస్థ అధికారులు ప్రకటిన ముసాయిదాపై గతంలో ఎన్నడూలేని విధంగా అభ్యంతరాలు వచ్చాయి. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో రావడం, ఇంటి నంబర్లు లేని ఓటర్ల పేర్లు కూడా ఉండడంతో నగరవ్యాప్తంగా 249 అభ్యంతరాలు అందాయి. వీటిని సరిచేసేందుకు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగం, వార్డు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించా రు. అభ్యంతరాల ఆధారంగా ఆయా ఓట్లు ఏ ఇంటినంబర్పై ఉన్నాయి, ఆ ఇంటి నంబర్ ఏ డివిజన్లో ఉందో పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీన నగరంలోని 66 డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాల్సి ఉండడంతో, ఆ లోగా అభ్యంతరాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ దేశవ్యాప్తంగా బోగస్ ఓటర్ల ఏరివేత లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రి విజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా నగరంలో మ్యాపింగ్ చేపడుతున్నారు. ఒక్కో డివిజన్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు. దీంతో ఆయా డివిజన్లలో ఓటర్లు తమ వద్ద ఉన్న ఆధారాలతో వచ్చి బీఎల్వోలతో నిర్ధారించుకుంటున్నారు. ఓట్ల నిర్ధారణ అనంతరం యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. -
అమ్మపాలు.. జీవధార
శిశువులకు జీవం పోస్తున్న మదర్ మిల్క్ బ్యాంక్● కరీంనగర్లో పాలు సేకరించి.. శిశువులకు అందించి ● పాలు అందిస్తున్న 300 మంది తల్లులు12 గంటలపాటు నిల్వ తల్లి నుంచి సేకరించిన పాలను 12 గంటల పాటు ప్రత్యేక గదిలో ఏర్పాటు చేసిన ఫ్రిజ్లో నిలువ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రోజు కూడా అంత సమయం నిలువ ఉంచే పరిస్థితి రాలేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మిల్క్ బ్యాంక్లో పాలను సేకరించే తల్లులకు పూర్తి అవగాహన కల్పించడంతోపాటు, వైద్యుల పర్యవేక్షణలోనే పాలసేకరణ, పంపిణీ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం ప్రారంభించినప్పటి నుంచి ప్రతీ నెల 300 మంది తల్లుల నుంచి పాలు సేకరించి ప్రతీ రోజు 5 నుంచి 8 మంది పిల్లలకు అందిస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లిపాలు అందని వారికి ఈ బ్యాంకు ద్వారా అందించి ప్రాణాలు కాపాడుతున్నారు. -
21 నుంచి పీజీ పరీక్షలు
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఎస్యూ పరిధిలో ఎంసీఏ 3వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, ఎంబీఏ 3వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్కుమార్ తెలిపారు. ఎంఎస్సీ, ఎంకాం, ఎంఏ 3వ సెమి స్టర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 31 వరకు జరుగుతాయన్నారు. బీఫార్మసీ కోర్సులో 7,8వ సెమిస్టర్ ఫీజు ఈ నెల 19 లోపు చెల్లించాలని తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో 21 వరకు అవకాశం ఉందన్నారు. ఎల్ఎల్బీ 1వ, 3వ సెమిస్టర్ పరీక్ష రుసుం ఈ నెల 17లోపు చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుంతో ఈనెల 20లోపు చెల్లించవచ్చునని తెలిపారు. దరఖాస్తులు ఆహ్వానంకరీంనగర్ టౌన్: రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కరీంనగర్ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన అర్హత గల నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చని బ్రాంచ్ డిప్యూటీ డైరెక్టర్, సెక్రటరీ ఎం.నాగులేశ్వర్ తెలిపారు. ఏదైనా డిగ్రీ, కుటుంబవార్షిక ఆదాయం రూ.3లక్షలలోపు ఉండాలన్నారు. దరఖాస్తులను వెబ్సైట్ ద్వారా జనవరి 30వ తేదీలోపు సమర్పించాలన్నారు. 8121626423, 9885218053 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. గురుకుల ప్రవేశాలకు..తిమ్మాపూర్: గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ రీజినల్ కోఆర్డినేటర్ అంజలి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనరల్ గురుకులాల్లో ఐదోతరగతి,6,9 తరగతిలో ఖాళీలకు ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెరిగిన పత్తిధరజమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కె ట్లో పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారం క్వింటాల్కు రూ.7,550 పలుకగా.. శుక్రవారం రూ.7,600 పలికింది. మార్కెట్కు 12 వాహనాల్లో 90 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.7,100కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు మార్కెట్కు సెలవు ఉంటుందని, సోమవారం యథా విధిగా క్రయవిక్రయాలు కొనసాగుతాయని ఇన్చార్జి కార్యదర్శి రాజా వివరించారు. వేములవాడఅర్బన్: భీమేశ్వరస్వామి ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు రెండో రోజు శుక్రవారం ఘనంగా కొనసాగాయి. -
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు నేపథ్యంలో శనివా రం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.సంతోష్నగర్, మహాశక్తి ఆలయం ఫీడర్లపరిధిలోని సంతోష్నగర్, సంతోషిమాత, హ నుమాన్, మహాశక్తి ఆలయం, బాలాజీ సూపర్మార్కెట్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనక, కార్పెంటర్ సొసైటీ, కొత్తలేబర్ అడ్డా, సెయింట్జాన్స్ స్కూల్, 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని విద్యానగర్, కొత్తయాస్వాడ, వెంకటేశ్వరస్వామి కమాన్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ.ఇండస్ట్రీయల్, రాంనగర్ ఫీడర్ల పరిధిలోని పద్మనగర్, మానేరు స్కూల్ వెనక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. రూరల్ సబ్ డివిజన్లో 132 కేవీ దుర్శేడ్– కరీంనగర్ లైన్ పనులు, 33/11 కె.వీ.మొగ్ధుంపూర్ సబ్స్టేషన్ పునర్మిర్మాణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చెర్లభూత్కూర్, తాహెర్కొండాపూర్, చామన్పల్లి, దుబ్బపల్లి, ఫకీర్పేట, బహద్దూర్ఖాన్పేట, జూబ్లీనగర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. మధ్యాహ్నం 3 నుంచి సాయత్రం 5.30 గంటల వరకు 33/11 కె.వీ. రేకుర్తి, కొత్తపల్లి సబ్స్టేషన్ల పరిధిలోని రేకుర్తి, కొత్తపల్లి ప్రాంతాలు, ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 33/11 కె.వీ బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధిలోని శ్రీపురంకాలనీ, రజ్వీచమన్, సిటిజన్కాలనీ, ప్రియదర్శినికాలనీ, కృష్ణనగర్, ఆటోనగర్, ధర్మనగర్, బైపాస్ రోడ్, బొమ్మకల్, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూర్, నల్లకుంటపల్లితో పాటు పాటు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చింతకుంట, కమాన్పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎస్యూలో కొత్తపల్లి ఠాణా
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి పోలీస్స్టేషన్ నూతన భవన నిర్మాణానికి తొలి అడుగు పడింది. పదేళ్ల నిరీక్షణకు ఫలితం లభించింది. కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో కొత్తపల్లి పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి 15 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (కార్యనిర్వాహక మండలి) నిర్ణయం తీసుకుంది. పోలీస్స్టేషన్ శాశ్వత భవన నిర్మాణానికి గ్రీన్సిగ్నల్ లభించగా.. అద్దె భవనంలో అరకొర వసతులతో నెట్టుకొస్తున్న పోలీసులకు ఊరట లభించనుంది. ఈ పోలీస్స్టేషన్ ఇటీవలే ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా అప్ గ్రేడ్ అయింది. దీంతో పోలీసు అధికారులు, సిబ్బంది పెరిగి ఇరుకుగా మారింది. నూతన భవనం పూర్తయితే పోలీస్స్టేషన్ సుందరంగా కనిపించనుంది. కొత్తపల్లి మండలంలోని కమాన్పూర్, ఎలగందుల, ఆసిఫ్నగర్, ఖాజీపూర్, నాగులమల్యాల, బ ద్దిపల్లి గ్రామాలతో పాటు కరీంనగర్లో విలీనమైన సీతారాంపూర్, రేకుర్తి, కొత్తపల్లి, మల్కాపూర్, చింతకుంట డివిజన్లతో కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిపాలన కొనసాగుతోంది. గ్రానైట్, ఇసుక, భూ పంచా యతీలతో బిజీగా ఉండే ఈ స్టేషన్కు శాశ్వత భవనం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వర్సిటీలో 15 గుంటల స్థలం కేటాయింపు శాతవాహన విశ్వవిద్యాలయంలో కొత్తపల్లి పోలీస్స్టేషన్కు 15 గుంటల స్థలం కేటాయిస్తూ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. గతంలో చింతకుంట, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో పోలీస్స్టేషన్ భవనం నిర్మించాలని ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఎట్టకేలకు గతేడాది డిసెంబర్ 24న జరిగిన 84వ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేశారు. మల్కాపూర్ జంక్షన్ నుంచి చింతకుంట వెళ్లే రహదారిలో, యూనివర్సిటీ వెస్ట్ గేట్ (పడమర ద్వారం) పక్కన ఉన్న స్థలాన్ని ఈ భవన నిర్మాణం కోసం కేటాయిస్తూ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను గురువారం కరీంనగర్ సీపీ గౌస్ఆలంకు శాతవాహన యూనివర్సిటీ వైస్చాన్స్లర్ యు.ఉమేశ్కుమార్ అందించారు. అనంతరం ఇరువురు వర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. శిక్షణ ఐపీఎస్ సోహం సునీల్, శాతవాహన వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సతీశ్కుమార్, హరికాంత్, కంట్రోలర్ డి.సురేశ్కుమార్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీ విజయకుమార్, సీఐ బి.కోటేశ్వర్, ఎస్సై సాంబమూర్తి పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 9 శ్రీ జనవరి శ్రీ 2026
ఊరేగింపుగా సారె తీసుకొస్తున్న మహిళలుసునోజీ.. ఏఐ గురూజీ!● ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ పాఠాలు ● డిజిటల్ విద్యతో ఆసక్తి చూపుతున్న విద్యార్థులు ● బోధన సులభం.. అభ్యసన మెరుగు ● భాష పరిజ్ఞానంలో మంచి ఫలితాలు ● వెనుకబడిన విద్యార్థులకు ఎంతో మేలుతిమ్మాపూర్: మూడేళ్లుగా మా పాఠశాలలో హిందీ పాఠ్యాంశాల బోధనలో నేను సొంతంగా సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నా. హిందీలో స్పష్టమైన ఉచాచ్ఛారణ నేర్చుకోవడానికి ఈ సాఫ్ట్వేర్ ఎంతో దోహదపడుతోంది. నేను రూపొందించిన ‘బడిబాట’ ప్రచార వీడి యో రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. సాంకేతికతను తరగతి గదికి అనుసంధానించడం ద్వారా కఠినమైన పాఠాలను దృశ్యరూపంలో విద్యార్థులకు అందిస్తున్నా. – షరీఫ్ అహ్మద్, హిందీ ఉపాధ్యాయుడు, మల్లాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలవిద్యాబోధనలో పలకాబలపం పద్ధతి మారింది. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో కంప్యూటర్ ప్రవేశించింది. డిజిటల్ విద్యతో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అభ్య సన(లెర్నింగ్)ను సులభతరమవుతోంది. వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థంకావడంలో దోహదపడుతోంది. ప్రైమరీ స్కూళ్లలో గణితం, ఇంగ్లిష్, తెలుగు సబ్జెక్టులలో రాణించేందుకు ఉపయోగపడుతుంది. హైస్కూళ్లలో డిజిట ల్ బోర్డుల ద్వారా ఫ్లోచార్ట్, త్రీ డైమెన్షన్ మ్యాప్స్ పరిశీలించి పాఠాలు సులభంగా అర్థం చేసుకుంటున్నారు. పాఠ్యాంశాలను డిజిటలైజ్డ్ చేయడంతో విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతోంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు వినూత్న మార్పు తీసుకొచ్చాయి. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. -
ప్రీప్రైమరీని సద్వినియోగం చేసుకోవాలి
తిమ్మాపూర్/కరీంనగర్టౌన్/కరీంనగర్ కల్చరల్/కొత్తపల్లి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూ చించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలను గురువారం సందర్శించారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు యూని ఫామ్, పుస్తకాలు, స్టేషనరీ కిట్ అందజేశారు. జిల్లాలో 33 ప్రభుత్వ పూర్వ ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించామని తెలిపారు. ప్రత్యేక సిలబస్ ద్వారా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పూర్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. చిన్నారులకు ఉచితంగా షూ అందజేస్తామన్నారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. మూడో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. బుధవారం బోధనను అమలు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సూరం స్వప్న, తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం మంజుల పాల్గొన్నారు. ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వండి అంధ విద్యార్థులు ఆసక్తి చూపే రంగాల్లో శిక్షణ ఇవ్వాలని ప్రిన్సిపాల్ను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. రేకుర్తిలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సంగీ తం, గానంలో శిక్షణ ఇవ్వాలని మ్యూజిక్ టీచర్కు సూచించారు. పెయింటింగ్స్, అల్లికల కళల్లో రాణిస్తున్న వారికి వివిధ సదుపాయాలు కల్పించాలని, అవసరమైన మెటీరియల్ సమకూర్చాలన్నారు. 23 నుంచి వెంకన్న బ్రహ్మోత్సవాలు నగరంలోని మార్కెట్ రోడ్డులో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాలపై కలెక్టర్ పమేలా సత్పతి ఆలయ ధర్మకర్తలు, దేవాదాయశాఖ అధికారులు, అర్చకులతో గురువా రం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు త లెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. స్టేజీ, లైటింగ్, సౌండ్పై దృష్టి సారించాలన్నారు. ఈవో సుధాకర్, ధర్మకర్తలు శ్రీనివాస్, గంగాధర్ పాల్గొన్నారు. -
నీళ్ల పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నీటి పంపకాల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లది రాజకీయ డ్రామానేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మండిపడ్డారు. నీటి పంపకాల విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో మొదటి నుంచి తాను పోరాటం చేశానని అన్నారు. కరీంనగర్లో గురువారం మాట్లాడారు. రాయలసీమను రత్నాల సీమ చేస్తానని మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ పోరాటం చేయలేదని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలో ఆరు ప్రాజెక్టులకు ఎవరూ అభ్యంతరం తెలపొద్దని ఉందని అన్నారు. ఆరు ప్రాజెక్టుల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు మరణశాసనం విభజన చట్టంలోని ఈ అంశమేనని అన్నారు. కేసీఆర్ నిర్లక్ష్యంపై కాంగ్రెస్ పదేళ్లు ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. 6 గ్యారంటీలపై చర్చ జరగకుండా కాంగ్రెస్ పార్టీ.. అవినీతిపై విచారణ లేకుండా బీఆర్ఎస్ అసెంబ్లీ సాక్షిగా దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన పాపాలు.. తెలంగాణ ప్రజలకు శాపాలయ్యాయని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలాడుతున్నారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో బీఆర్ఎస్ తీరుపై ఉద్యమంచేసి కేసీఆర్ మెడలు వంచింది బీజేపీయే అన్నారు. తెలంగాణకు అన్యాయం జరగొద్దని కేంద్రం అనేక మీటింగ్లు పెట్టిందన్నారు. ఉమ్మడి ఏపీలో కృష్ణా వాటాలో 811 టీఎంసీలుంటే.. ఏనాడూ తెలంగాణకు 200 టీఎంసీలకు మించి నీటిని వాడుకోకుండా ఇక్కడి ప్రజలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. గోదావరిలో 1,486 టీఎంసీల నీటి వాటా ఉంటే.. తెలంగాణలో ఎన్నడూ 500 టీఎంసీలకు మించి వాడుకోలేదన్నారు. ఏపీ ప్రభుత్వానికి అమ్ముడుపోయి కృష్ణా జలాలను తాకట్టు పెట్టిండని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల వాటా రావాల్సి ఉంటే.. 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం చేసి దక్షిణ తెలంగాణకు తీరని ద్రోహం చేసిన మోసగాడు కేసీఆర్ అని తెలిపారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కేసీఆర్ ‘కాళేశ్వరం’ పేరుతో కూలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దోపిడీకి స్కెచ్ వేశారని అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి, అక్రమాలను బయటపెడుతున్న కల్వకుంట్ల కవితకు హ్యాట్సాఫ్ అన్నా రు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ వై. సునీల్రావు పాల్గొన్నారు. -
ప్రమాద రహిత జిల్లాగా మార్చుదాం: సీపీ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యలతోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సీపీ గౌస్ ఆలం అ న్నారు. తిమ్మాపూర్లోని శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం నిర్వహించిన ‘జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం–2026’లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల, చొప్పదండి వెళ్లే ప్రధాన మార్గాల్లో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్స్పాట్లను’ గుర్తించామని, అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, కళాశాల చైర్మన్ రమేశ్రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయకుమార్, రమేశ్, సీఐ సదన్కుమార్ పాల్గొన్నారు. బ్యాంకు భద్రతపై సమీక్ష బ్యాంకుశాఖలు, ఏటీఎం కేంద్రాల భద్రతపై సీపీ వివిధ బ్యాంకుల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. బ్యాంకుల్లో భద్రతా లోపాలు ఉండకూడదని దిశానిర్దేశం చేశారు. బ్యాంకు ప్రవేశ మార్గాలు, క్యాష్ కౌంటర్లు, స్ట్రాంగ్రూమ్లు, ఏటీఎం కేంద్రాల వద్ద హైక్వాలిటీ సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రికార్డింగ్ను కనీసం 30రోజుల పాటు భద్రపరచాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను అప్రమత్తం చేసేందుకు మేనేజర్ క్యాబిన్, క్యాష్ కౌంటర్లలో పానిక్ బటన్లను ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద మొత్తంలో నగదు తరలించేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్ను ఆశ్రయించేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. స్థానిక పోలీసు అధికారులతో బ్యాంక్ మేనేజర్లు నిరంతరం సమన్వయంతో ఉండాలన్నారు. రాహుల్ గాంధీ గొప్ప ఏమిటి?మానకొండూర్: దేశ రాజకీయాల్లో కాంగ్రెస్లోని నెహ్రు, ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీకి ఒక పేరు ఉందని, రాహుల్ గాంధీ దేశానికి ఏం చేశాడని, ఆయన గొప్పెంటో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్ చేశారు. మానకొండూర్లో గురువారం మాట్లాడుతూ.. వరంగల్ సభలో రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదన్నారు. వ్యంగ్యంగా భాష మొదలు పెట్టిందే సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి మాట్లాడితే ఒక్కలాగా, కేటీఆర్ రాహుల్గాంధీపై మాట్లాడితే మరోలా ఉంటుందా? అని ప్రశ్నించారు. బీజేపీ పార్లమెంటులో కాంగ్రెస్పై దాడులకు దిగుతుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్గౌడ్, నెళ్లి మురళి, నెల్లి శంకర్, శాతరాజు యాదగిరి పాల్గొన్నారు. రామడుగు: మండలంలోని లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, కిష్టంపల్లి, దత్తోజీపేట గ్రామాల రైతుల పంటలకు నీటి కొరత ఏర్పడకుండా గాయత్రి పంపుహౌస్ నుంచి గ్రావిటీ కాలువ కు నీరు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరడంతో గురువారం ఆధికారులు 1వ మోటార్ను ఆన్చేసి పంపింగ్ చేశారు. ఈ సందర్భంగా రామడుగు, చొప్పదండి మండలాల కాంగ్రెస్ నాయకులు జువ్వాజీ హరీశ్, ఇప్ప శ్రీనివాస్రెడ్డి, పిండి సత్యంరెడ్డి, అనంతరెడ్డి పూజలు చేశారు. కొత్తపల్లి: ప్రభుత్వ ఆదేశాలతో టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ పరిధిలోని పట్టణాలు, గ్రామాల్లో విద్యుత్ ప్రజాబాట గురువారం జరిగింది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో నిర్వహించే ఈ ప్రజాబాట కార్యక్రమాన్ని కరీంనగర్ టౌన్ 8 సెక్షన్ పరిధిలోని కోతిరాంపూర్లో నిర్వహించారు. విద్యుత్ వినియోగం, భద్రతపై అవగాహన కల్పించారు. ఏఈ ఫసీ హైమద్, ఎల్ఐ ఫరూక్, ఎల్ఐలు అసిరి ప్రకాష్, రవీందర్, ఏఎల్ఎంలు అనిల్, రమేశ్ పాల్గొన్నారు. -
గెలుపు గుర్రాలకే టికెట్లు!
పాత.. కొత్త.. మనోళ్లు.. పక్కోళ్లు.. ఎవరైనా ఒక్కటే. గెలిచెటట్లుంటే చాలు.. టికెట్ ఇచ్చుడే. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో దాదాపు అన్ని పార్టీలు ఈ దిశగా తమ తీరును మార్చుకుంటున్నాయి. పార్టీలో సీనియర్లు ఉంటే ఇతర పదవులు ఇచ్చినా సరే కాని.. అంతగా విజయావకాశాలు లేకుంటే పార్టీ టికెట్ ఇచ్చి రిస్క్ చేయలేమనే స్థితికి చేరుకున్నాయి. దీంతో డివిజన్లో బలం ఉంటే చాలు.. బల్దియా ఎన్నికల్లో చాన్స్ వెతుక్కుంటూ రానుంది. కరీంనగర్ కార్పొరేషన్: సర్పంచ్ ఎన్నికల అనంతరం పరిషత్ను పక్కనపెట్టి మున్సిపల్ ఎన్నికల వైపు ప్రభుత్వం దృష్టి సారించినట్లు ఇటీవల జరుగుతున్న పరిణామాలతో పార్టీలు అంచనాలకు వచ్చాయి. ఆ దిశగా సిద్ధమవుతున్నాయి. ఈనెల 12న డివిజన్లవారీగా ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు ఇప్పుడు, అప్పుడు అంటూ ఊహాగానాలు పెరిగిపోతున్నా యి. రిజర్వేషన్లకు ముందే ఆశావహులు తమ అభ్యర్థిత్వం కోసం ఆయా పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ప్రచారం మొదలుపెట్టారు. సీనియారిటీ కోటా కష్టమే.. తాము కష్టకాలంలో పార్టీని పట్టుకొని ఉన్నామని, తమ సీనియారిటీని గుర్తించి పార్టీ టికెట్లు ఇవ్వాలంటూ కొంతమంది నాయకులు ఆయా పార్టీల నేతలతో వాదిస్తుంటారు. కాని మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భావిస్తున్న పార్టీలు ఈసారి సీనియారిటీ కోటాపై అంతగా ఆసక్తి చూపడం లేదు. సీనియర్ అయినా.. జూనియర్ అయినా.. పక్క పార్టీల వాళ్లయినా.. గెలిచే అవకాశాలుంటేనే టికెట్ ఇవ్వాలని బలంగా నిర్ణయించుకున్నాయి. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సత్యం ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. గెలిచే అవకాశాలున్న వాళ్లకే టికెట్ ఇస్తామని, ఇతర పార్టీల్లో ఉండి కాంగ్రెస్ నుంచి పోటీకి ఆస క్తి చూపితే వారికి కూడా చాన్స్ ఉంటుందన్నారు. ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వెల్ల డించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సైతం ఇదే తీరున గెలుపు గుర్రాలకే చాన్స్ ఇస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ నేత, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గత ఎన్నికల్లోనే ఈ ఫార్ములా పాటించారు. దీంతో సీనియార్టీ కోటా కాకుండా.. గెలుపు అవకాశాలు మెరుగుపరుచుకుంటేనే మేలని ఆశావహులు ఉసూరుమంటున్నారు. సర్వేలే ప్రామాణికం ఆయా డివిజన్లలో బలం ఉన్న, విజయావకాశాలు మెరుగ్గా ఉన్న నాయకులకే టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సమాయత్తమవుతున్నాయి. నగరపాలక సంస్థ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపగల ఎంఐఎం సైతం గెలుపు అవకాశాలున్న నాయకులకే చాన్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతోంది. ఇందుకోసం ఆయా పార్టీలు డివి జన్లవారీగా సర్వేలపై ఆధారపడనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం తెప్పించుకుంటుండగా.. డివిజన్కు ఆరు పేర్లతో కూడిన ప్రాబబుల్స్ జాబితాను ఇవ్వాలని పీసీసీ ఇప్పటికే కోరింది. బీజేపీ డివిజన్ల వారీగా సర్వేలు చేయనుంది. ఇక బీఆర్ఎస్ నేత గంగుల గత మున్సిపల్ ఎన్నికల్లోనే ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు, ఇతర సంస్థలతో సర్వే చేయించి టికెట్ ఇచ్చారు. ఈసారి కూడా డివిజన్ల వారీగా సర్వే చేసి మెరుగ్గా ఉన్న నాయకులకే చాన్స్ ఇవ్వనున్నారు. బలం పెంచుకుంటేనే మేలు డివిజన్లో బలం ఉంటేనే పార్టీ టికెట్ వచ్చే అవకాశం ఉండడంతో.. ఆశావహులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఆయా డివిజన్లలో ఉన్న పెద్దలు, కాలనీ కమిటీలను కలిసి తమను ఆశీర్వదించాలంటూ కోరుతున్నారు. మాజీ కార్పొరేటర్లయితే తాము గతంలో చేసిన పనులను గుర్తు చేస్తున్నారు. -
సంక్రాంతికి స్పెషల్ బస్సులు
కరీంనగర్టౌన్: సంక్రాంతి పండుగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 22 వరకు కరీంనగర్ రీజియన్ నుంచి 1,895 ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్కు 945 ప్రత్యేక బస్సులు, ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు కరీంనగర్ నుంచి జేబీఎస్కు 950 ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు అదనంగా నడిపేలా నిర్ణయించారు. పండుగ సీజన్కు మహాలక్ష్మి పథకం తోడు కావడంతో ప్రత్యేక బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. జేబీఎస్ నుంచి కరీంనగర్కు జనవరి 7వ తేదీన 30 బస్సులు 8న 30 బస్సులు, 9న 150, 10న 210, 11న 210, 12న 140, 13న 160, 14న 15 అదనపు ట్రిప్పులు నడిపించనున్నారు. కరీంనగర్ నుంచి జేబీఎస్కు ఈనెల 16న 130 ట్రిప్పులు, 17న 90, 18న 210, 19న 210, 20న 130, 21న 90, 22న 90 బస్సులు మొత్తంగా 950 అదనపు ట్రిప్పులు నడిపించనున్నారు.కరీంనగర్ రీజియన్ పరిధి నుంచి జేబీఎస్కు సంక్రాంతి పండుగ సందర్భంగా 18,95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని డిపోల పరిధిలోని రద్దీ ఉండే బస్స్టేషన్లలో డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే సూచించాం. ఎప్పటికప్పుడు ప్రయాణికుల పరిస్థితిని పర్యవేక్షించడానికి ఏర్పాట్లు చేపట్టాం. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం వెసులుబాటు కల్పించాం. ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం సురక్షితం. – బి.రాజు, ఆర్టీసీ ఆర్ఎం, కరీంనగర్ -
సునోజీ..ఏఐ గురూజీ..!
ప్రభుత్వ పాఠశాలల్లోని వెనకబడ్డ విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపే లక్ష్యంగా ఏఐ విద్యాబోధన సాగుతోంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టులలో డిజిటల్ పాఠాల ద్వారా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచుతున్నారు. కంప్యూటర్ల ద్వారా వీడియో, ఆడియో పాఠాలు వింటున్న విద్యార్థులలో వినూత్న మార్పులు వస్తున్నాయి. డిజిటల్ పాఠాలు వినేందుకు స్కూల్కు వస్తున్న విద్యార్థుల సంఖ్య సైతం ఇటీవల గణనీయంగా పెరిగింది. సర్కారీ స్కూళ్లలో ఏఐ విద్యాబోధన వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. ● పెద్దపల్లి జిల్లాలో 21 స్కూళ్లలో.. రామగుండం/జూలపల్లి/పెద్దపల్లిరూరల్/ఓదెల/కాల్వశ్రీరాంపూర్/ధర్మారం: పెద్దపల్లి జిల్లాలో 21 పాఠశాలల్లో ఏఐ పాఠాలను 268 కంప్యూటర్ల ద్వారా బోధిస్తున్నారు. చదవడం, రాయడంలో వెనకబడ్డ విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుంది. ఏఐ పాఠాలు వినేందుకు 75 హెడ్సెట్లను అందించారు. ప్రత్యేక పిన్ నంబర్తో లాగిన్ కాగానే పాఠాలు మొదలవుతున్నాయి. గతేడాది మార్చి 15 నుంచి జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఓదెల మండలంలోని కొలనూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. గతేడాది డిజిటల్ బోధన ప్రారంభమైంది. అంతర్గాం ప్రాథమిక పాఠశాలకు మూడు నెలల క్రితం ఏఐ బోధనకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. మొదట్లో ఒకే కంప్యూటర్ మంజూరుకాగా.. ఇటీవల మరో కంప్యూటర్ను అందుబాటులోకి తెచ్చారు. జూలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏఐ ఆధారిత పాఠాలు నేర్పుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఎంపికై న మొదటి పాఠశాల గంగారం ప్రైమరీ స్కూల్. విద్యాశాఖ చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమానికి ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుంది. ధర్మారం మండలంలోని కొత్తూరు, నర్సింహులపల్లి గ్రామాల్లో ఏఎక్స్ఎల్ పాఠాలు ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభమయ్యాయి. కొత్తూరు ప్రాథమిక పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన ప్రభావవంతంగా నడుస్తోంది. -
సిరిసిల్ల ఎఫ్ఆర్వో సస్పెన్షన్
● ఇన్చార్జి ఎఫ్ఆర్వోగా కల్పనాదేవి సిరిసిల్ల: అటవీ క్షేత్రాధికారి(ఎఫ్ఆర్వో) శ్రీహరి ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ.. రాష్ట్ర అటవీశాఖ ముఖ్య అధికారి సువర్ణ ఆదేశాలు జారీ చేశారు. సిరిసిల్ల ఫారెస్ట్ రేంజ్ అధికారిగా ఏడాదిగా పనిచేస్తున్న శ్రీహరి ప్రసాద్ సిరిసిల్ల అటవీశాఖ ఆఫీస్లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధిస్తున్నారు. ఆమె విధుల్లో చేరినప్పటి నుంచి ఎఫ్ఆర్వో వేధింపులు గురి అవుతుంది. సదరు మహిళా ఉద్యోగి ఎఫ్ఆర్వో వేధింపులు భరించలేక ముందుగా అటవీశాఖ ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఎలాంటి స్పందన లేకపోగా.. ఎఫ్ఆర్వో లైంగిక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. భరించలేని సదరు మహిళా ఉద్యోగి కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు సదరు మహిళా ఉద్యోగికి ఎఫ్ఆర్వో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, లైంగికంగా వేధిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేలు అటవీశాఖ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక ఇచ్చారు. దీంతో సిరిసిల్ల ఎఫ్ఆర్వో శ్రీహరి ప్రసాద్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లైంగికంగా వేధించిన ఘటనలో ఎఫ్ఆర్వో సస్పెండ్ కావడం అటవీ శాఖలో చర్చనీయాంశమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీహరిప్రసాద్ సిరిసిల్ల ఎఫ్ఆర్వోగా ఏడాదిగా పనిచేస్తున్నారు. ఇన్చార్జి ఎఫ్ఆర్వోగా కల్పనాదేవి సిరిసిల్ల ఇన్చార్జి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా కల్పనాదేవిని అటవీశాఖ నియమించింది. జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ఆర్వోగా పనిచేస్తున్న కల్పనాదేవికి సిరిసిల్ల అటవీక్షేత్ర అధికారిగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. గతంలో శ్రీహరి ప్రసాద్ కంటే ముందు కల్పనాదేవి ఎఫ్ఆర్వోగా పని చేశారు. కల్పనాదేవి, ఇన్చార్జి ఎఫ్ఆర్వో శ్రీహరి ప్రసాద్ -
ఈజీగా అర్థమవుతుంది
కంప్యూటర్ ద్వారా పాఠాలు చదువుకోవడం, నేర్చుకోవడం చాలా సులువైంది. కంప్యూటర్తో నేర్చుకున్న పాఠాలు ఎన్నో రోజులు గుర్తుంటున్నాయి. అక్షరాలను గుర్తించడం, పదాలను ఉచ్చరించడం ఈజీగా మారింది. – కొమిరె అవంతిక, 4వ తరగతి విద్యార్థులకు సరిపడ కంప్యూటర్లు లేకపోవడంతో ఒక్కొక్కరికి 45 నిమిషాలు కేటాయించడంతో సమయం సరిపోవడం లేదు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఏర్పాటు చేయకపోవడంతో నేనే సొంత ఖర్చులతో వైఫై ఏర్పాటు చేసుకొని ఏఐ పాఠాలు బోధిస్తున్న. పక్కనే ఉన్న విద్యావనరుల కేంద్రంలో నెట్వర్క్ ఉన్నా ఏఐ బోధనకు పాఠశాలకు కంప్యూటర్లు కేటాయించినా ప్రభుత్వం ఇంట ర్నెట్ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. – తాళ్ల రమేశ్, హెచ్ఎం కంప్యూటర్తో పాఠాలు నేర్చుకోవడంతో జవాబులు తప్పులు లేకుండా చదువుకోగలుగుతున్నాం. పాఠాలు సులభంగా అర్థమవుతున్నాయి. తప్పు అని తేలితే కంప్యూటర్లో వెంటనే చెబుతుంది. దీంతో సరిచేసుకునే అవకాశం ఉంటుంది. – జి.అరణ్య, 5వ తరగతి విద్యార్థి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత పెరిగింది. ప్రభుత్వ చొరవతో మా పాఠశాలలోని 30 మంది విద్యార్థులకు ఏఐ విద్యనందిస్తున్నాం. ఏఐతో తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో బోధన చేస్తున్నారు. కంప్యూటర్ బోధనతో పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. – ప్రసన్న కుమారి హెచ్ఎం కొత్తూరు -
పెరిగిన విద్యార్థుల హాజరు
కరీంనగర్రూరల్: పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ రూరల్ మండలంలోని మొగ్ధుంపూర్ ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేశారు. 1 నుంచి ఐదో తరగతి వరకు 28 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు టీచర్లు బోధిస్తున్నారు. డిజిటల్ పాఠ్యాంశాల ప్రకారం ట్యాబ్తోపాటు నాలుగు కంప్యూటర్లపై విద్యార్థులకు డీఆర్పీ, టీచరు సరిత పాఠాలు చెబుతున్నారు. కంప్యూటర్ బోధనతో ఇటీవల విద్యార్థుల హాజరు పెరిగింది. పాఠశాలలో ఏఐ విద్యాబోధనకు ప్రత్యేక టీచర్ను నియమిస్తే బాగుంటుంది. సిలబస్ ప్రకారం విద్యార్థులకు ఏఐ పాఠాలను నేర్పిస్తుండగా ఏఎక్స్ఎల్ మాత్రం నిత్యం నేర్పిస్తున్నాం. కంప్యూటర్లో పాఠాలు నేర్చుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. – సరిత, డీఆర్పీ, మొగ్దుంపూర్ ఉపాధ్యాయురాలు -
నాడీ కూడా చూడలేదు
బహ్రెయిన్లో అనారోగ్యానికి గురైన మా మామను ఇంటికి తీసుకుని రావడానికి ముందు నిమ్స్కు తరలించాం. అక్కడ అంబులెన్స్ నుంచి కిందికి దింపితే నాడి కూడా చూడకుండా ఇంటికి పంపించారు. బహ్రెయిన్లోనే వైద్యం అందిస్తే బాగుకాలేదు. మేము ఏమి చేయలేమని చెప్పారు. చేసేది లేక ఇంటికి తీసుకుని వచ్చాం. – నిరోష్, (నాగయ్య అల్లుడు), బాల్కొండ నక్క శ్రీనివాస్ అనారోగ్యానికి గురైతే బుధవారం సౌది నుంచి నిమ్స్ ఆస్పత్రికి తీసుకుని వచ్చాను. ఎన్నో ఆశలతో వస్తే కనీస బాధ్యతగా బెడ్ కూడా ఇవ్వకుండా బయటకు పంపించేశారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఇది సరైంది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. – ఖాజా ముజుమ్మిలోద్దీన్, కోరుట్ల(సౌదీ అరేబియా) వలసకార్మికులు అంటే లెక్కలేదా. గల్ఫ్ నుంచి ఇంటికి వస్తే హైదరాబాద్లో మెరుగైన వైద్యం అందించడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిమ్స్లోని వైద్యులు బాధ్యతతో వ్యవహరించకపోవడంతో వలస కార్మికులు అసంతృప్తికి గురవుతున్నారు. – మంద భీంరెడ్డి, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ -
గల్ఫ్ రోగులపై శీత కన్ను
మోర్తాడ్(బాల్కొండ): బహ్రెయిన్ దేశంలో ఉపాధి పొందుతున్న నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంకు చెందిన ముచ్చె నాగయ్యకు ఏడాది క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అక్కడి ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. అచేతన స్థితిలో ఉన్న నాగయ్యను మాతృభూమికి పంపిస్తే ఇక్కడ తాము దగ్గరుండి వైద్యం చేయించుకుంటామని కుటుంబ సభ్యులు కోరడంతో ఈనెల 4న హైదరాబాద్కు పంపించారు. నిమ్స్లో మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి ప్రతిగా నాగయ్యను ఆస్పత్రిలో చేర్చుకోడానికి నిమ్స్ ఎన్వోసీని కూడా ఇచ్చింది. నాగయ్యను ఎయిర్పోర్టు నుంచి అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించగా తాము ఏమీ చేయలేమని ఇంటికి తీసుకువెళ్లి చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నాగయ్యను ఎలా అంబులెన్స్లో నిమ్స్కు తరలించారో అలాగే ఇంటికి తీసుకొచ్చి ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. ● జగిత్యాల్ జిల్లా మల్లాపూర్కు చెందిన నక్క శ్రీనివాస్ అలియాస్ బైకాన్ శ్రీనివాస్ సౌదిలో పని చేస్తున్న చోట అనారోగ్యానికి గురైనాడు. అతనికి పక్షవాతం సోకడంతో మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు తరలించాలని భార్య రాధ ప్రవాసీ ప్రజావాణిలో మొరబెట్టుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బుధవారం నాడు శ్రీనివాస్ను సౌది అరేబియా నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా అక్కడ ఇన్ పేషెంట్గా చేర్చుకోవాల్సి ఉన్నా కేవలం టెస్టులు చేసి కొన్ని గంటల వ్యవధిలోనే బయటకు పంపించారు. బెడ్ అలాట్ చేయకపోవడంతో చేసేది లేక శ్రీనివాస్ను ప్రైవేటు ఆస్పత్రికి అతని కుటుంబ సభ్యులు తరలించారు. ● జగిత్యాల్ జిల్లా పొలాసకు చెందిన ఆరెల్లి గంగారాజం దుబాయ్లో అనారోగ్యానికి గురికాగా అతనితోనే ఉన్న కొడుకు జలంధర్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో గడచిన నెలలో హైదరాబాద్కు తన తండ్రిని తీసుకుని వచ్చాడు. నిమ్స్లో ఒక్కరోజు మాత్రమే ఉంచుకుని ఇంటికి పంపించారు. చివరకు జగిత్యాల్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా నాలుగు రోజుల తరువాత(డిసెంబర్ 24, 2025న) మరణించాడు. ● సౌదీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న ఎల్కతుర్తికి చెందిన కృష్ణమూర్తి అనారోగ్యంతో కోమాలోకి వెళ్లగా హైదరాబాద్కు తరలించారు. సౌదిలోని కృష్ణమూర్తి పని చేస్తున్న కంపెనీ చొరవ తీసుకోవడం, ఆరోగ్య బీమా ఉండటంతో నిమ్స్లో కాకుండా కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఇలా నాగయ్య, నక్క శ్రీనివాస్, ఆరెల్లి గంగరాజంలు నిమ్స్లో మంచి వైద్యం లభిస్తుందనే ఆశతో గల్ఫ్ నుంచి ఇక్కడికి వస్తే నిరాశే ఎదురైంది. కృష్ణమూర్తి లాంటివారికి కంపెనీల అండ ఉండటంతో కార్పొరేట్ వైద్యం అందించడానికి వీలు ఏర్పడింది. ● ప్రతీ నెలా ఇద్దరు, ముగ్గురు తెలంగాణ జిల్లాలకు చెందినవారు గల్ఫ్ దేశాల్లో అనారోగ్యానికి గురై ఇంటిబాట పడుతున్నారు. అలాంటి వారికి నిమ్స్లో వైద్యం అందించాలని ప్రభుత్వంలోని జీడీఏ ఎన్నారై శాఖ ఉత్తర్వులను జారీ చేస్తే నిమ్స్లో వాటిని చెత్తబుట్ట దాఖలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్న రోగులను ఇక్కడకు తరలించాలంటే తాము తమ ఆస్పత్రిలో చేర్చుకుంటామని యాజమాన్యం ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంటుంది. గల్ఫ్ పేషంట్లను చేర్చుకోడానికి నిమ్స్ ఆస్పత్రి ఎన్వోసీలను జారీ చేస్తున్నా రోగులను తరలించిన తరువాత నిర్లక్ష్యం జరుగుతోంది. వైద్యం అందించడానికి ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా వైద్యం చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వలస కార్మికులు ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ వారి కుటుంబాలకు డబ్బు పంపిస్తుంటే, ట్యాక్స్ రూపంలో మన దేశానికి ఆదాయం లభిస్తోంది. అయితే వలస కార్మికులు అనారోగ్యానికి గురైతే వైద్యం అందించకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గల్ఫ్ నుంచి వచ్చే రోగుల కోసం నిమ్స్లో సమన్వయం చేయడానికి ప్రత్యేకాధికారిని నియమించాలని వలస కార్మిక సంఘాల నాయకులు సూచిస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని గల్ఫ్ వలస కార్మికులకు నిమ్స్లో లేదా ఇతర ఆస్పత్రులలో మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక చొరవ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నాగయ్యను తమ ఆస్పత్రిలో చేర్చుకుంటామని ఎన్వోసీ జారీ చేసిన నిమ్స్ ఆస్పత్రి అంబులెన్స్లో నిమ్స్కు వచ్చిన నాగయ్య అతని కుటుంబ సభ్యులు(ఫైల్) గల్ఫ్ దేశాల్లో మానసిక ఒత్తిడి, ఇతర కారణాలలో అనారోగ్యం పాలు హైదరాబాద్ నిమ్స్కు తరలిస్తే అందని వైద్యం ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్న ఆస్పత్రి వైద్యాధికారులు -
సర్కార్ బడిలో సాంకేతిక పాఠాలు
సిరిసిల్లకల్చరల్/ఇల్లంతకుంట: జిల్లా కేంద్రంలోని గీతానగర్ హైస్కూల్లో డిజిటల్ బోధనతో విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. టెక్నాలజీ, నిరంతరం ఇంటర్నెట్, పాఠ్య విషయాలన్నీ డిజిటలైజ్ కావడంతో విద్యార్థుల్లో జిజ్ఞాసను రేకెత్తిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కొనసాగుతుండడంతో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది. డిజిటల్ బోధనతో పాఠశాలలో ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్ల ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతీ స్కూల్కు మూడేసి డిజిటల్ బోర్డులను సమకూర్చారు. విద్యార్థులు సైతం పాఠ్యాంశాలను డిజిటల్ చిత్రాలు, ఫ్లోచార్టులు, త్రీడైమెన్షన్ డయాగ్రామ్స్ను పరిశీలిస్తూ అర్థం చేసుకుంటున్నారు. మద్రాస్ ఐఐటీ సహకారంతో.. ఇల్లంతకుంట మండలంలోని గాలిపెల్లి, ఇల్లంతకుంట, రేపాక హైస్కూళ్లు మద్రాస్ ఐఐటీ స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్కు జూలై 2025లో ఎంపికయ్యాయి. అప్పటి నుంచి ఈ మూడు పాఠశాలలలో పదోతరగతి విద్యార్థులు ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు ఆన్లైన్లో చెప్పే పాఠాలు వింటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) డేటా సైన్స్ ఫౌండేషన్ కోర్సులు, కోడింగ్ ప్రాథమిక అంశాలు నేర్చుకుంటున్నారు. డిజిటల్ క్లాసులు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. సమ్ థింగ్ నుంచి ఎవ్రీ థింగ్ వరకు అన్ని సబ్జెక్టుల్లోని విషయాలతోపాటు అదనపు జ్ఞానం సంపాదించేందుకు ఈ క్లాసులు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి తరగతులు మాకు వరం. – గుంటుక లిఖిత, విద్యార్థిని పుస్తకంతో పోల్చినప్పుడు డిజిటల్ క్లాస్ బహుళ ప్రయోజనకారి. ఆడియో, వీడియోతోపాటు కంటెంట్ కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వైజ్ఞానిక అంశాలతోపాటు భాషా బోధనలోనూ అనువుగా ఉన్నాయి. విస్తృత అధ్యయనానికి ప్రేరణ ఇచ్చేలా తీర్చిదిద్దబడ్డాయి. – బడుగు రాంబాబు, సిరిసిల్ల ఉపాధ్యాయుడు ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్ రూపొందించిన స్కూల్ కనెక్టివిటీ ప్రోగ్రాం ఇల్లంతకుంట మండలంలోని రేపాక, గాలి పెల్లి, ఇల్లంతకుంట విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులకు అవసరమైన ఫౌండేషన్ మ్యాథమెటిక్స్తో కూడిన కోడింగ్ నేర్చుకునే అవకాశం కూడా విద్యార్థులకు ఉపయోగపడింది. – ఎం.మహేశ్చంద్ర, గైడ్టీచర్, ఇల్లంతకుంట హైస్కూల్ ఇంట్రడక్షన్ టు డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 8 వారాల కోర్సులో చేరాను. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. చిన్నపాటి ప్రోగ్రామ్స్ చేయడం నేర్చుకున్నాను. 8 వారాలలో ప్రశ్నోత్తరాలు ఇచ్చారు. ఫైనల్ ఎగ్జామ్స్లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాను. పరీక్షలలో బీటెక్లో ఉన్న సిలబస్కు సంబంధించిన అంశాలు ఇచ్చారు. – పండుగ సహస్ర, ఇల్లంతకుంట హైస్కూల్ -
చేనేతకు చేయూత అందిస్తాం
విద్యానగర్(కరీంనగర్): కేంద్ర ప్రభుత్వం ద్వారా చేనేతకు చేయూత అందిస్తామని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్కుమార్ ఆన్నారు. కరీంనగర్లోని ఎస్సారార్ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాభారతి చేనేత హస్తకళ మేళా, చేనేత వస్త్ర ప్రద ర్శన, అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేత, హస్తకళలు శ్రమైక్య జీవనసౌందర్యానికి ప్రతీకలన్నారు, చేనేతను ప్రజలందరూ ఆదరించాలన్నారు. పోచంపల్లి, మంగళగిరి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని చేనేత వస్త్రాలు విదేశాల్లో కూడా ప్రసిద్ధి చెందాయన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు, జంజారా ఉత్పత్తులు, కళాత్మక ఆభరణాలు ఈ ప్రదర్శనలో ప్రజలకు అందబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాభారతి అధ్యక్షులు, నిర్వాహకులు జెల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీకి దేహదానం
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సదాశయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రావణ్కుమార్ బావమరిది, రిటైర్డ్ హెడ్మాస్టర్ ఆర్తి నరసింహస్వామి(75) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన ఆశయం మేరకు కుటుంబ సభ్యులు పార్థివదేహాన్ని మేడ్చల్లోని మెడిసిటీ మెడికల్ కాలేజీకి బుధవారం దానం చేశారు. ఆయన సతీమణి శ్రీలతాదేవి నేత్రదానం చేయగా, తండ్రి నారాయణస్వామి దేహం, తమ్ముడి భార్య నిర్మలాదేవి శరీరదానం చేశారని సంస్థ అధ్యక్షుడు శ్రావణ్కుమార్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతీఒక్కరు నేత్ర,, శరీర, అవయవ దానాలకు ముందుకు రావాలని కోరారు. మెడిసిటీ మెడికల్ కాలేజీ అనాటమీ హెడ్ దేవి తదితరులు పాల్గొన్నారు. -
టైగర్ ఎక్కడ?
కరీంనగర్రూరల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి జాడ కోసం ప్రత్యేక అధికారుల అన్వేషణ కొనసాగుతోంది. బుధవారం కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల్లో పులి పాదముద్రలను పరిశీలించారు. కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్లో పులులను పట్టుకునే మంచిర్యాల జిల్లా చెన్నూర్కు చెందిన యానిమల్ ట్రాకర్స్ డిపార్ట్మెంట్కు చెందిన త్రిసభ్య కమిటీ సభ్యులతోపాటు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు చెందిన ఆరు బృందాల అధికారులతో పులి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బహుదూర్ఖాన్పేటలో వెలుగులోకి.. కరీంనగర్ మండలం బహుదూర్ఖాన్పేట శివారులో గత నెల 29న మొదటిసారిగా పులి పాదాల గుర్తులు కనిపించాయి. మరుసటి రోజున చొప్పదండి మండలం ఆర్నకొండ, జూబ్లీనగర్లో మగ పులి సంచరించినట్లుగా ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. పెద్ద పులిని పట్టుకునేందుకు కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ప్రత్యేకంగా ఆరు బృందాలతోపాటు చెన్నూర్కు చెందిన యానిమల్ ట్రాకర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 3 నుంచి అధికారుల బృందం పులి కోసం చేపట్టిన అన్వేషణ బుధవారం సైతం కొనసాగింది. ముందుగా డిసెంబరు 28న అర్ధరాత్రి కరీంనగర్ మండలం జూబ్లీనగర్ నుంచి చామనపల్లి మీదుగా పులి బహుదూర్ఖాన్పేట, చొప్పదండి మండలం వెదురుగట్ట ప్రాంతానికి వెళ్లినట్లుగా పాదముద్రల ఆధారంగా ట్రాకర్స్ గుర్తించారు. జూబ్లీనగర్ గుట్ట సమీపంలోని చెరువులో పులి నీళ్లు తాగిన అనంతరం గేదైపె దాడి చేసినట్లుగా నిర్ధారణకు వచ్చారు. సరిహద్దుల్లో అన్వేషణ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల సరిహద్దు ప్రాంతాలైన వెదురుగట్ట, బహుదూర్ఖాన్పేట, సుల్తానాపూర్, ఎలిగేడు ప్రాంతాల్లో 2 రోజుల నుంచి పులి కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో లభించిన పులి పాదముద్రలను ట్రాకర్స్ గుర్తించి ఎలిగేడు వరకు పులి వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి పాదముద్రలు కన్పించకపోవడంతో పులి ఎటువైపు వెళ్లిందో తెలియని పరిస్ధితి నెలకొంది. పులిని పట్టుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు కరీంనగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్ తెలిపారు. భయాందోళనలో రైతులు పెద్ద పులి సంచరిస్తోందనే సమాచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధానంగా రైతులు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే సమయం కావడంతో కూలీలు నాట్లు వేసేందుకు రాక పనులకు ఆటంకమేర్పడుతోందని వాపోతున్నారు. -
రెచ్చిపోయిన దొంగలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్లగొల్లపల్లి గ్రామాల్లో మంగళవారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. మూడు ఇళ్లల్లో చోరీకి పాల్పడి నగలు, నగదు, బైక్ ఎత్తుకెళ్లారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు.. రాచర్లబొప్పాపూర్కు చెందిన నరెండ్ల సంతోష్ ఇంటి ఎదుట నిలిపిన బైక్ అపహరణకు గురైంది. అదే గ్రామానికి చెందిన మొడుసు ఎల్లవ్వ ఇంటికి తాళం వేసి తన కూతురు ఇంట్లో పడుకుంది. బుధవారం ఉదయం ఇంటికొచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉంది. లోనికి వెళ్లి పరిశీలించగా రూ.4వేల నగదు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. వంగ వజ్రవ్వ ఇంటికి తాళం వేసి కొడుకు వద్ద వెళ్లగా వెండి ఆభరణాలు, రూ.10వేలు నగదు ఎత్తుకెళ్లారు. దీంతోపాటు రాచర్లగొల్లపల్లిలోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఒకే రోజు రెండు గ్రామాల్లో మూడు ఇళ్లల్లో దొంగలు పడడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్టీమ్తో వెళ్లి పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. రెండు గ్రామాలు.. మూడు ఇళ్లలో చోరీ తాళం వేసిన ఇళ్లే టార్గెట్ బంగారం, నగదు, బైక్ అపహరణ -
శంకర్దాదాలు..
గాల్లో ప్రాణాలు!గత నెల 26న.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యానగర్లోగల లక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. అందులో 35 రకాల ఫిజీషియన్ నమూనా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ నిర్వహిస్తున్న వ్యక్తికి వైద్యుడిగా ఎలాంటి అనుమతి లేకపోయినా అర్హతకు మించి వైద్యం చేయడంపై కేసు నమోదు చేశారు. ఈనెల 6న.. ఎల్కతుర్తి మండలం దామెర గ్రామంలో స్వర్గం సతీశ్బాబు నిర్వహిస్తున్న ఫస్ట్ ఎయిడ్ క్లినిక్లో డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 30 రకాల మెడిసిన్స్ను గుర్తించారు. ఇందులో యాంటీబయోటిక్స్, స్టిరాయిడ్స్, అనాల్జెసిక్స్, యాంటీఅల్సర్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఉండడంతో అధికారులే కంగుతిన్నారు. అతనిపై కేసు నమోదు చేశారు.సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో కొందరు శంకర్దాదా ఆర్ఎంపీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అర్హత ఉండదు.. అనుమతులు ఉండవు. అయినా వైద్య చికిత్సలు చేసేస్తుంటారు. అడిగే వారు లేకపోవడం, తనిఖీలు చేసేవారు ఆ విషయమే మరచిపోవడంతో ఇదే అదునుగా ఇష్టారాజ్యంగా క్లినిక్స్ ఏర్పాటు చేస్తున్నారు. గత్యంతరం లేక స్థానికంగా అందుబాటులో ఉందనే ఉద్దేశంతో తమ వద్దకు వస్తున్న రోగులకు చుక్కలు చూపుతున్నారు. రోగుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్లినిక్ల వద్దనే ల్యాబ్, ఫార్మసీ ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పలు చోట్ల ఆర్ఎంపీలు చేసిన వైద్యం వికటించి కొందరి ప్రాణాల మీదకు వచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయి. చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడిన ఉదంతాలూ వెలుగుచూశాయి. దీనికితోడు సమీప పట్టణాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల వారితో ఆర్ఎంపీలు కుమ్మకై ్క రోగులను అక్కడికి పంపిస్తూ అడ్డగోలుగా ‘కమీషన్’ రూపంలో సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా వైద్య, ఆరోగ్య శాఖాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
తల్లిలేని లోకంలో ఉండలేనని..
గొల్లపల్లి: ‘అమ్మ’.. పిలుపులోనే అమృతం ఉంది. అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఓ ధైర్యం. కానీ ఆ అమ్మ దూరమైతే ఆ ప్రపంచం శూన్యమని భావించాడో.. లేక అమ్మ లేని బతుకు భారమని అనుకున్నాడో తెలియదు గానీ.. తల్లి జ్ఞాపకాలతో తల్లడిల్లిపోతూ ఓ యువకుడు తనువు చాలించాడు. పేగుబంధం పిలుస్తోందంటూ తల్లి చెంతకే పయనమయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లిలో అందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మల్యాల గంగరాజం, అంజ వ్వ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రాంచరణ్ సంతానం. గంగరాజం హైదరాబాద్లోని ఓ ఫామ్హౌస్లో కూలీగా పనిచేస్తున్నాడు. అంజవ్వ కూలీ చేసుకుంటూ కుటుంబా న్ని పోషించుకుంటున్నారు. కూతులిద్దరికీ పెళ్లి చేశారు. అంజవ్వ ఏడాది క్రితం అనారో గ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి రామ్చరణ్ కుంగిపోయాడు. ఎప్పుడూ అమ్మ అమ్మ అంటూనే ఉన్నాడు. ఏం తిన్నా అమ్మ చేతిముద్దే గుర్తొచ్చేది. కాలం గడుస్తున్నా తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తల్లి జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుండటంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. అమ్మ ఒడిలో సేద తీరాలని నిర్ణయించుకున్నాడో ఏమోగానీ రాంచరణ్ (20) బుధవారం ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రయోజకుడు అవుతాడనుకున్న కొడుకు.. ఇలా అర్ధాంతరంగా విగతజీవిగా మార డం ఆ తండ్రికి తీరని శోకాన్ని మిగిల్చింది. భార్యపోయిన బాధను దిగమింగుకుని కొడుకు కోసం బతుకుతున్న గంగరాజం.. ఇప్పుడు కొడుకు కూడా దూరం కావడంతో ‘నాకింకెవరు దిక్కు బిడ్డా’ అంటూ రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు. ఏడాదిగా మాతృమూర్తి జ్ఞాపకాలతోనే.. కన్నతల్లి పిలుస్తోందంటూ తనువు చాలించిన యువకుడు ఒక్కగానొక్క కొడుకు మరణంతో గుండెలవిసేలా రోదించిన తండ్రి గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లిలో విషాదం -
హాజరు నిబంధన ఎత్తేయాలి
కరీంనగర్: శాతవాహన విశ్వవిద్యాలయ లా కళాశాలలో తప్పనిసరి హాజరు నిబంధనను ఎత్తివేసి, అందరు విద్యార్థులకు ఇంటర్నల్ పరీక్షలు రాయడానికి అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ లా విద్యార్థులు బుధవారం రెండోరోజు నిరసన కొనసాగించారు. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన ఎల్ఎల్బీ మొదటి సంవత్సరం 91 మంది విద్యార్థుల్లో సుమారు 40 నుంచి 50 మందికి హాజరు శాతం తక్కువగా ఉందని చెప్పి ఇంటర్నల్స్కు అనుమతి నిరాకరించడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నవంబర్ 2025లో నిర్వహించిన మొదటి ఇంటర్నల్ పరీక్షల సమయంలో యూనివర్సిటీ అధికారులు పోలీస్ బందోబస్తుతో విద్యార్థులను ఆర్ట్స్ కళాశాల వద్ద పరీక్షా కేంద్రం బయటే నిలబెట్టారని ఆరోపించారు. -
యథేచ్ఛగా గ్యాస్ దందా
● హోటళ్లలో కుప్పలు తెప్పలుగా రాయితీ సిలిండర్లు ● తనిఖీల్లేవ్.. అమ్యామ్యాలే ● పట్టించుకోని అధికారులు డీమార్ట్ పక్కన గల శ్రీలక్ష్మి ఫుడ్ కోర్టు ఇది. ఇక్కడ సబ్సిడీ గ్యాస్ యథేచ్చగా వినియోగిస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుంటున్నామని చెప్పడమే తప్ప నామమాత్రమే. అంబేడ్కర్ స్టేడియం సమీపంలోని పరిపూర్ణ టిఫిన్ సెంటర్లో ఇష్టారాజ్యంగా సబ్సిడీ గ్యాస్ వినియోగిస్తున్నారు. నిత్యం ఇదే ప్రక్రియ కాగా అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యల్లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టర్, అదనపు కలెక్టర్లుండే నగరంలో అడుగడుగునా సబ్సిడీ గ్యాస్ దుర్వినియోగమవుతుండటం ఆందోళనకరం. వ్యాపార కేంద్రాల్లో సబ్సిడీ గ్యాస్ వినియోగం విచ్చలవిడిగా సాగుతోంది. మామూళ్ల మత్తులో మునిగిన సివిల్ సప్లై డిపార్ట్మెంట్కు అవేవీ కనిపించకపోవడం విడ్డూరం. కరీంనగర్లో దాదాపు హెచ్చు హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, హాస్టళ్లు, బార్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాలు అన్నింటా ఇవే కనిపించడం అధికారుల డొల్లతనాన్ని చాటుతోంది. పత్రికల్లో కథనాలు వస్తే మొక్కుబడిగా కేసులు నమోదు చేయడం, లోతుగా దర్యాప్తు లేకుండానే హోటళ్ల వరకే చర్యలకు పరిమితమవడం. పలు ఏజెన్సీలు నిబంధనలను విస్మరించి భారీ అక్రమ వ్యాపారానికి తెరదీశారు. పర్యవేక్షించాల్సిన శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. తనిఖీలేవీ.. ప్రభుత్వం రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తుండటంతో క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించాల్సిన పౌరసరఫరాల శాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది. నగరంలో ఇండెన్, హెచ్పీ, భారత్ కంపెనీల వినియోగదారులుండగా 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా చేస్తున్నారు. ఈ క్రమంలో ఏజెన్సీలు, గోడౌన్లలో తనిఖీలు చేపట్టాల్సిన పౌరసరఫరాల శాఖ అధికారులు విధులు మరిచారన్న విమర్శలున్నాయి. అయితే సివిల్ సప్లై ఇన్స్పెక్టర్, డీటీ సివిల్ సప్లయ్, ఏఎస్వోలు ప్రతీనెలా తనిఖీలు నిర్వహించాలన్న టార్గెట్ ఉంటుండగా తనిఖీలు చేస్తే ఇంత బహిరంగంగా ఎలా వినియోగిస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న. రూ.కోట్లలో అక్రమ వ్యాపారం ఆహార నాణ్యత అటుంచితే హెచ్చు ప్రాంతాల్లో కమర్షియల్ సిలిండర్లు పేరుకు మాత్రమే అక్కడ కనిపిస్తాయి. కానీ వినియోగించేది మాత్రం సబ్సిడీ గ్యాస్. కమర్షియల్ సిలిండర్ ధర రూ.1946 ఉండగా సబ్సిడీ గ్యాస్ రూ.924కే దొరుకుతుండటం, అందుకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్ల సంపూర్ణ సహకారముండటంతో కమర్షియల్ సిలిండర్ వాడకాన్ని 80శాతం తగ్గించారు. ఒక్కో హోటల్లో కస్టమర్లను బట్టి కనిష్టంగా నెలకు 10 నుంచి 50సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఈ లెక్కన రాయితీ గ్యాస్ వినియోగించే ఒక్కో హోటల్లోనే రూ.20వేల నుంచి 70వేల వరకు అక్రమంగా లాభపడుతున్నారు. రాయితీ గ్యాస్ వినియోగించే అన్ని ప్రాంతాలను లెక్కిస్తే నెలకు రూ.కోట్లలో ప్రయోజనం పొందుతున్నారు. భారీగా తేడాలు జిల్లాలో రెస్టారెంట్లు, హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, టీస్టాల్స్, నూడిల్స్ పాయింట్స్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, తోపుడు బండ్లు అన్ని కలిపి 2వేల వరకు ఉంటాయని అంచనా. కానీ వారు బుక్ చేసే సిలిండర్ల సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. విపరీతంగా కస్టమర్లు ఉన్న హోటళ్లలోనూ తక్కువ కమర్షియల్ సిలిండర్లు వాడారంటే అక్రమం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లావ్యాప్తంగా ఉన్న సంఖ్యకు వారు వినియోగిస్తున్న కమర్షియల్ సిలిండర్ల మధ్య భారీ వ్యత్యాసాలున్నాయని పక్కా సమాచారం. విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు వసూలు చేసే పలు విద్యాసంస్థల్లో సైతం రాయితీ గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. పెద్ద పెద్ద హోటళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను పరిగణనలోకి తీసుకుంటే నెలకు సుమారు 10వేల సిలిండర్ల వినియోగం జరగాలి. కేవలం వందల్లోనే కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా జిల్లాలో సగటున ఒక నెలకు 20వేల సిలిండర్లు పక్కదారి పడుతున్నాయని సమాచారం. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను కేవలం గృహాల్లో మాత్రమే వినియోగించాలి. కమర్షియల్ సిలిండర్లను మాత్రమే వ్యాపారులు వినియోగించాలి. తనిఖీలు చేసి చర్యలు చేపడతాం. – నర్సింగరావు, కరీంనగర్ జిల్లా పౌరసరఫరాల అధికారిప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల రోడ్డులో టీఎస్02యుబి4971 నంబర్ గల ఆటోలో సిలిండర్లను తరలిస్తుండగా సదరు ఆటో డ్రైవర్ డ్రెస్కోడ్ లేకుండా గ్యాస్ డెలివరీ చేశారు. గ్యాస్ రీపేర్ చేసే దుకాణంలో గ్యాస్ బండ వేయగా అదేంటని ‘సాక్షి’ ప్రశ్నించగా సమాధానం దాటవేశాడు. విజయభారత్ గ్యాస్ ఏజెన్సీ అని, అదొక్కటే బ్లాక్లో వేశానని చెప్పుకొచ్చారు. -
మద్యం తాగొద్దన్నందుకు ఆత్మహత్య
ఓదెల(పెద్దపల్లి): రాత్రివరకూ మద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవారు ఏమనుకుంటారని తండ్రి మందించినందుకు మనస్తాపం చెందిన బైరి నరేశ్(25) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్సై కిషన్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన నరేశ్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. ఇంటికి ఆలస్యంగా చేరుకున్నాడు. రాత్రివరకూ మద్యం తాగి ఇంటికి వస్తే ఊళ్లోవాళ్లు ఏమనుకుంటారని తండ్రి మందలించాడు. మనస్తాపం చెందిన నరేశ్.. ఇంట్లోని గడ్డిమందు తాగి వాంతులు చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తొలుత సుల్తానాబాద్, ఆ తర్వాత కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి పెద్దకుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో వ్యక్తి..గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన మేళ్ల నారాయణ(64) అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ కొంత కాలంగా కిడ్నీ ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది మంగళవారం రాత్రి పొలం వద్ద ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఉరేసుకొని మరొకరు..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్కు చెందిన సుధగోని పరశురాములు (48) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గీత కార్మికుడిగా పనిచేస్తున్న పరశురాములు ఆర్థిక ఇబ్బందులకు తోడు అనారోగ్యం పాలవడంతో మానసికంగా కృంగిపోయి బాత్రూంలో చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య మంగవ్వ, కూతురు, కొడుకు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. అనారోగ్యంతో ఇంకొకరు..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని భవానీనగర్లో నివాసం ఉంటున్న మర్రికంటి మల్లయ్య (45 బుధవారం వేకువజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లపల్లి మండలం ఇస్రాజ్పల్లికి చెందిన మర్రికంటి మల్లయ్య, భార్య గంగవ్వ జగిత్యాలలోని భవానీనగర్లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో పనులు చేసుకుంటూ జీవిస్తారు. మల్లయ్య కొద్దిరోజులుగా మద్యానికి బానిసవడంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. రెండు రోజులుగా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి భోజనం చేసి పడుకోగా.. వేకువజామున ఇంట్లో ఉన్న సీలింగ్ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
భూసర్వేకు తొలి అడుగు
కరీంనగర్ అర్బన్: భూచిక్కుముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. గెట్ల పంచాయితీలు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్ట సంఖ్యలో ఉండగా.. ప్రభుత్వం సమగ్ర భూసర్వేకు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా.. జిల్లాలో తొలిసారిగా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారు. సదరు గ్రామంలో నక్ష సరిగా లేకపోగా.. చాలా సర్వే నంబర్లకు నక్షాలు లేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సదరు గ్రామాన్ని ఎంపిక చేయగా.. సర్వేలో కీలక పాత్ర పోషించే మూడు రోవర్లను జిల్లాకు కేటాయించింది. తెలంగాణ భూభారతి చట్టం అమలులో భాగంగా పలు సంస్కరణలు చేపట్టిన విషయం విదితమే. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్ష(మ్యాప్), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూకమతాలు పెరగడం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవడంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూములకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్లకు బాధ్యతలు జిల్లాలో 300 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో కూడా పాల్గొనగా.. వీరితోనే ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు. వీలైనంత త్వరగా సర్వే చేపట్టనుండగా.. అధునాతనమైన రోవర్ పరికరాలను సర్వేకు ఉపయోగించనున్నారు. పక్షం రోజుల్లో సర్వే పూర్తిచేయనున్నారు. భూవిస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60 వేలను సర్వేయర్లకు చెల్లించనుంది. సర్వేతోనే భూధార్ భూభారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతీ రైతు రికార్డులు పరిశీలించి సరిగా ఉన్నాయని భావిస్తే.. టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనున్నారు. ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ పరిశీలన తర్వాత తహసీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తించబడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూధార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తోంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. కానీ రెండో ప్రక్రియ మాత్రం లైసెన్సుడ్ సర్వేయర్లు, సర్వేయర్లు, తహసీల్దార్ల విధుల్లో భాగం.పైలట్ ప్రాజెక్ట్గా కొత్తపల్లి పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలను తయారు చేయనున్నారు. గురువారం కలెక్టరేట్లో రోవర్ పరికరాలపై శిక్షణనివ్వనున్నారు. తదుపరి వీలైనంత త్వరగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి నక్షను రూపొందించనున్నారు. హద్దుల గొడవలు లేకుండా హద్దులను నిర్ణయించనున్నారు. గ్రామంలో 2వేల ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుంది. సర్వే నంబర్ వారీగా నక్ష రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్ నంబర్లను రైతులకు అందిస్తుంది. -
ప్రమాదవశాత్తు వృద్ధుడు మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని పాపయ్యపల్లె గ్రామంలో పొలంలో ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మండలం పెద్దూరుకు చెందిన సలేంద్రి మల్ల య్య(65) అనే వృద్ధుడు మతిస్థిమితం సరిగా లేక భిక్షాటన చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 5న ఇంటిలో నుంచి వెళ్లిన మల్లయ్య బుధవారం ఉదయం పాపయ్యపల్లెలోని ఓ రైతు పొలంలోని బురదలో పడి మృతిచెంది కనిపించాడు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా సోషల్ మీడియాలో పోలీసులు పోస్టు చేయగా సిరిసిల్లకు చెందిన వాడిగా ఆచూకీ లభించింది. దీంతో మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందజేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి..ఇల్లందకుంట(హుజూరాబాద్): భోగంపాడు గ్రామానికి చెందిన వేమా రాజు(36) అనే వ్యక్తి భార్య పుట్టింటికి వెళ్లి రావడం లేదనే మనస్తాపంతో పురుగుల మందు తాగగా.. బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజుకు రామన్నపల్లికి చెందిన రేణుకతో పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు సంతానం. రేణుక పుట్టింటికి వెళ్లి తిరిగి రావట్లేదనే బాధతో రాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 2న తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యం కోసం 108 వాహనంలో జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి తల్లి విమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. ట్రాక్టర్ పైనుంచి పడి..బోయినపల్లి: మండలంలోని మాన్వాడ గ్రామానికి చెందిన బత్తిని దేవయ్య (48)ట్రాక్టర్పై నుంచి పడి మృతిచెందినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన దేవయ్య ఇసుక రవాణా అనుమతులతో డ్రైవర్ సాయంతో ఇసుక జారవేస్తాడు. వెంకట్రావుపల్లిలో బైక్ పెట్టి ఇల్లంతకుంట మండలం కందికట్కూర్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ వేణుతో కలిసి కొదురుపాకలో ఇసుక ట్రిప్ పోసేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా వెంకట్రావుపల్లి వద్ద ట్రాక్టర్ బ్రేక్ వేయడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం దేవయ్యను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. -
గెలిపిస్తే.. అభివృద్ధి చూపిస్తా..
జమ్మికుంట(హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయా పైసా లేదని, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలటీల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో సింథటిక్ స్టేడియానికి రూ.6.5కోట్ల నిధులు మంజూరైన నేపథ్యంలో బుధవారం కాలేజీ స్థలాన్ని పరిశీలించారు. సింథటిక్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగా మోదీ ప్రభుత్వం కాగితాలకు పరిమితం కాదని, టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. ఇటీవల జమ్మికుంట, హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులకు రూ.3కోట్ల విలువైన మెడికల్ పరికరాలను అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఆర్డీవో రమేశ్బాబు, తహసీల్దార్ వెంకట్రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రమేశ్, నాయకుడు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గల్ఫ్ నుంచి స్వగ్రామానికి మృతదేహం
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన వేముల చొక్కయ్య(55) దుబాయిలో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరింది. చొక్కయ్య దుబా యిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గతనెల 31న డ్యూటీకి వెళ్లి రాత్రి తన గదికి వచ్చాడు. రాత్రి 7 గంటల సమయంలో చాతీలో నొప్పి ఉందంటూ పడిపోయాడు. తోటి మిత్రులు గమనించేసరికే మృతి చెందాడు. చొక్కయ్య పదేళ్లుగా దుబాయి వెళ్లివస్తున్నాడు. రెండు నెలల క్రితం వచ్చి తిరిగి వెళ్లినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. మృతదేహం ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. చొక్కయ్యకు భార్య నర్సవ్వ, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కువైట్ నుంచి.. కోనరావుపేట: కువైట్లో ఈనె ల 4న మృతి చెందిన మారుపాక నర్సయ్య మృతదేహం బుధవారం చింతకుంటకు చేరింది. వివరాలు ఇలా.. కనగర్తికి చెందిన నర్సయ్య ఉపాధి నిమిత్తం కొంతకాలంగా కువైట్ దేశానికి వెళ్తున్నాడు. భార్య పిల్లకు కరీంనగర్ మండలం చింతకుంటలో ఉంటున్నారు. ఏడాది క్రితం కువైట్కు వెళ్లిన నర్సయ్య ఈనెల 4న తన గదిలో గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతదేహం బుధవారం రాగా, భార్య పిల్లలు చింతకుంటలో ఉండటంతో అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. సుధాకర్, శ్రీకాంత్ను కోర్టులో హాజరు పర్చాలిసిరిసిల్లటౌన్: రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుద్ధపల్లి సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీకాంత్లను వెంటనే కోర్టులో హాజరుపర్చాలని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి బానోతు సంతోష్నాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 6న మధ్యాహ్నం 2గంటలకు సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని వారి స్వగృహంలో శ్రీకాంత్ను సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, రాత్రి 8 గంటల ప్రాంతంలో ఉమ్మడి నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో సుధాకర్ స్వస్థలంలో పోలీసులు అదుపులో తీసుకున్నారని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారని రైతు కూలీ సంఘం నిషేధిత సంఘం కాదని, ప్రభుత్వం గుర్తించుకోవాలని తెలిపారు. -
యువకుడిపై కత్తిపోట్లు
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం దేశాయిపల్లి గ్రామశివారులో నర్సింగాపూర్ గ్రామానికి చెందిన శశిప్రీతమ్పై అదే గ్రామానికి చెందిన శ్రీధర్ వివాహేతర సంబంధం అనుమానంతో కత్తితో దాడి చేసినట్లు వేములవాడరూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తాపీమేసీ్త్రగా పనిచేస్తున్న శ్రీధర్ భార్య కరీంనగర్లోని ఓ మార్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. శశిప్రీతమ్ కరీంనగర్లోని కారు షోరూంలో పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శశిప్రీతమ్ భార్య వచ్చి శ్రీధర్ భార్యతో గొడవ పడ్డారు. ఈవిషయం తెలుసుకున్న శ్రీధర్ మాట్లాడుకుందామని శశిప్రీతమ్ను రమ్మన్నాడు. ఇద్దరు కలిసి బోయినపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్దామని కొదురుపాక మీదుగా వస్తుండగా దేశాయిపల్లి గ్రామశివారులో శ్రీధర్ అనే వ్యక్తి శశిప్రీతమ్ను కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శశిప్రీతమ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలాన్ని రూరల్ సీఐ శ్రీనివాస్ సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. -
మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
కరీంనగర్: మహిళలు తమ ఆత్మగౌరవం కాపాడుకుంటూ అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం కరీంనగర్ కళాభారతిలో డెమోక్రటిక్ సంఘ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు మహిళా వార్డు సభ్యులకు సన్మానం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా కలెక్టర్తోపాటు డెమోక్రటిక్ సంఘ కో–ఫౌండర్, సినీ నటి రెజీనా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ సాయంతో మహిళలు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడం అభినందనీయమన్నారు.రెజీనా కసాండ్రా మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత మహిళల్లో అసాధారణ శక్తి ఉంటుందని, సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారన్నారు. -
ఇంత నిర్లక్ష్యమా?
● సోలార్ ప్లాంట్ కాంట్రాక్టర్పై సీఎండీ ఆగ్రహం కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ శివారులోని 132 కేవీ సబ్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న 1.4 మెగావాట్స్ సోలార్ ప్లాంట్ పనుల్లో పురోగతి లేకపోవడంతో కాంట్రక్టర్పై టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోలార్ ప్లాంట్, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను బుధవారం సీఎండీ పరిశీలించారు. 2 నెలల క్రితం సందర్శన సమయంలో ఉన్న పనులే సోలార్ ప్లాంట్ నిర్మాణంలో కనిపించడంతో కాంట్రాక్టర్ను మందలించారు. సోలార్ ప్లాంట్, ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మాణ పనుల వేగం పెంచాలని ఆదేశించారు. టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ప్రాజెక్టు) మోహన్రావు, సీఈ(ప్రాజెక్టు) సురేందర్, కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈ జంపాల రాజం, డీఈ(కన్స్ట్రక్చన్) చంద్రమౌళి, ఈఈ(సివిల్) శ్రీనివాస్, ఏడీఈ(కన్స్ట్రక్చన్) అనిల్, టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్, ఏఈ శ్రీనివాస్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలివిద్యానగర్(కరీంనగర్): మేడారం–2026 సమ్మక్క–సారలమ్మ జాతరను పురస్కరించుకొని బుధవారం మేడరంలో కరీంనగర్ రీజియన్ సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో కరీంనగర్ రీజియన్ రీజనల్ మేనేజర్ బి.రాజు మాట్లాడుతూ.. డిపోల మధ్య ఎలాంటి పోటీ ఉండకుండా జాతరను విజయవంతం చేసేందుకు ప్రతీ ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి భక్తులకు ప్రయాణపరంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. జాతర విధులు నిర్వర్తించే సిబ్బందికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. జాతర విజయవంతానికి తమవంతు కృషి చేస్తామని సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. క్యూ రేలింగ్స్, బుకింగ్ పాయింట్ల ఏర్పాట్లను పరిశీలించారు. డిప్యూటీ రీజనల్ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, రీజియన్ పరిధిలోని అన్ని డిపోలకు చెందిన మేనేజర్లు, అకౌంట్ ఆఫీసర్, సూపర్వైజర్లు, ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్తకరీంనగర్: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ఫ్రాడ్ కా పుల్స్టాప్ రాష్ట్రవ్యాప్త ప్రచారంలో భాగంగా బుధవారం కరీంనగర్లోని మహిళల డిగ్రీ కళాశాలలో పోలీసులు కార్యక్రమం నిర్వహించారు. మహిళల రక్షణ–పిల్లల సంరక్షణపై ఈ కార్యక్రమం జరిగింది. డేటింగ్ యాప్ మోసాలు, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సైబర్ క్రైం డీఎస్పీ కోత్వాల్ రమేశ్, సబ్ ఇన్స్పెక్టర్ అనిల్, జ్యోత్స్న, కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి, ఇన్చార్జి శ్రావణి పాల్గొన్నారు. -
జనశక్తి మాజీ నక్సలైట్ల అరెస్ట్
● 9ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లు స్వాధీనం ● నలుగురి అరెస్ట్ ● ఎస్పీ మహేశ్ బి గితే వెల్లడి సిరిసిల్ల: సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన మాజీ నక్సలైట్లను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వారి వద్ద 9 ఎంఎం పిస్టల్, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఎస్పీ మహేశ్ బీ గితే వివరాలు వెల్లడించారు. తంగళ్లపల్లి మండలం రామన్నపల్లెకు చెందిన తోకల శ్రీకాంత్, జగిత్యాల జిల్లాకు చెందిన వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ అలియాస్ బాదం సూర్యప్రకాశ్రెడ్డి, తంగళ్లపల్లి మండలం సారంపల్లికి చెందిన దాసరి తిరుపతి, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్కు చెందిన పయ్యావుల గోవర్దన్ అనే నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. జనశక్తి కార్యకలాపాల పేరుతో బెదిరింపులకు గురిచేస్తూ డబ్బు వసూలు చేయడం, భూ వివాదాలలో జోక్యం చేసుకోవడం లాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనాలని ప్రయత్నిస్తున్నారు. సమాచారం మేరకు తంగళ్లపల్లి గ్రామ శివారులో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అపి తనిఖీ చేయగా వీరివద్ద 9 ఎంఎం పిస్తోల్, 05 బుల్లెట్లు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఆ నలుగురు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి, టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రవి, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. నలుగురిలో ముగ్గురూ జనశక్తి మాజీలే పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ముగ్గురు సీపీఐ(ఎంఎల్) జనశక్తి పార్టీకి చెందిన ముగ్గురు మాజీ నక్సలైట్లు ఉన్నారు. వంజరి సురేందర్ అలియాస్ విశ్వనాథ్ జనశక్తి పార్టీలో చాలా కాలం పని చేశారు. గతంలో సుద్దాల మాజీ సర్పంచ్ వేణుగోపాల్రావు(ప్రభాకర్రావు) హత్య కేసులో ప్రధాన నిందితుడు. తోకల శ్రీకాంత్ సైతం గతంలో జనశక్తిలో పని చేశారు. గోవర్ధన్కు సైతం జనశక్తి పార్టీతో సంబంధాలు ఉన్నాయి. సారంపల్లికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి తిరుపతి కొత్తగా వారితో చేరడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. -
భీమేశ్వరా శరణు..శరణు
వేములవాడ: సమ్మక్క జాతర సమీపిస్తుండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు నిత్యం రాజన్న సన్నిధికి తరలివస్తున్నారు. ఆదివారం రాత్రంతా దర్శనాలు కొనసాగినా సోమ, మంగళవారాలు సైతం భక్తుల రద్దీ కొనసాగింది. రాజన్న గుడి నుంచి మొదలుకుని బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాల వరకు దారిపొడవునా భక్తుల రద్దీ కనిపించింది. రాజన్న గుడి వద్ద ప్రచారరథంలో రాజన్నను, భీమేశ్వరుని ఆలయంలో కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు తదితర మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఏఈవోలు శ్రవణ్, అశోక్ పరిశీలించారు. -
ఎవరికి చెప్పాలి?.. ఎలా చెప్పాలి?
బోయినపల్లి(చొప్పదండి): కొత్తగా ఎన్నికై న సర్పంచులు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదని పేర్కొంటున్నారు. గతంలో మండల పరిషత్ పాలకవర్గం ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అపుడు మండల సభలలో సర్పంచులు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచులకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్లో కొత్తగా ఎన్నికై న సర్పంచులు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలకోసారి మండల సభలు గతంలో మండల పరిషత్ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వ సభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచులు హాజరు అయ్యేవారు. డివిజన్ స్థాయి అధికారులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరు అయ్యేవారు. అలాగే మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్యా, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్, పీఆర్ ఇంజినీరింగ్, ఆర్డబ్లూఎస్ ఇంజినీరింగ్, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినపుడు ఆయా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో గ్రామ సర్పంచులకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకు పోయిన సమస్యల పరిశ్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి. గ్రామాల సమస్యలు ఎలా తెలపాలి? గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారంది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్ నెలలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచులు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండల సభ ఏర్పాటు చేస్తే అధికారులకు, సర్పంచులకు మధ్య ర్యాపో ఏర్పడుతుందని అంటున్నారు. సమస్యలు ఎవరు పరిష్కరిస్తారని కొత్త సర్పంచుల ఆవేదన గతంలో మూడు నెలలకోసారి మండల సభలు ఇప్పుడు మండల పరిషత్ పాలక వర్గాలు లేవు.. మండల సభలు లేవు -
గ్రామాభివృద్ధికి
ఉపాధి..హామీ!పక్కా భవనాలు లేని పంచాయతీలు: 22కేటాయించిన నిధులు: 571.34 కోట్లుఈ ఏడాది గుర్తించిన పనులు: 586భవనాల్లేని అంగన్వాడీ కేంద్రాలు: 123ఉపాధి కూలీలు: 1.23 లక్షలుఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యాయి.. కొత్తగా పాలకవర్గాలు కొలువుదీరాయి. సర్పంచ్గా ఎన్నికై నందుకు సంబరంగా ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో పంచా యతీలకు నిధుల కొరత వెంటాడుతుండటంతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సవాలే. ఈ పరిస్థితుల్లో ఉపాధిహామీ పథకం అండగా నిలుస్తోంది. పక్కాగా, ప్రణాళికబద్ధంగా పనులు చేయించగలిగితే కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెలను ప్రగతి దిశగా తీసుకుపోవచ్చు. గతంతో పోలిస్తే పథకంలో కొన్ని మార్పులు చేశారు. పథకంపేరు మార్చడంతో పాటు పనిదినాలు 100 నుంచి 1,25కు పెంచారు. 266 పనులు అదనంగా గుర్తించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వాటిపై సర్పంచులు దృష్టిసారిస్తే గ్రామాభివృద్ధి ఇట్టే సాధ్యం.మరుగుదొడ్లు లేని కుటుంబాలు: 9,417జాబ్కార్డులు ఉన్నవారు: 2.72 లక్షలుపంచాయతీలు: 316కరీంనగర్ టౌన్: గ్రామం నుంచి ఇతర గ్రామాలకు, పంట పొలాలకు దారులు లేని ప్రాంతాలకు ఉపాధి పథకం కింద పొలం బాటలు వేసుకోవచ్చు. ఎడ్లబండ్లు, ఇతర వాహనాలు వెళ్లేందుకు వీలవుతుంది. గ్రామంలో పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనం లేకుంటే ఉపాధి హామీ పథకంలో నిర్మించుకునే వీలుంది. మొక్కలు పెంచాలి.. పచ్చదనం పంచాలి.. గ్రామాల్లో మొక్కలునాటి హరితవనం పెంపొందించేందుకు వీలుంది. పంచాయతీల్లో నర్సరీ అందుబాటులో ఉంటుంది. గుంతలు తవ్వడం మొదలు, మొక్కలు నాటడానికి, వాటి పోషణకూ డబ్బులు ఇస్తున్నారు. భూగర్భ జలాలు పెంచాలి.. సాగు భూముల్లో కాంటూరు కందకాలు, ఊటకుంటలు, పాంపాండ్స్, చెక్ డ్యాంలు, రాళ్లకట్టలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవడానికి వీలుంది. ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేసుకొని పక్కాగా పనులు పూర్తిచేస్తే.. భూగర్భ జలమట్టం పెరుగుతుంది. స్వచ్ఛ గ్రామాలుగా ముందుకెళ్లాలి.. గ్రామాలను సంపూర్ణ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధి పథకంలో అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో అవసరమైన గుంతలను కూలీలతో తవ్వించి, ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించవచ్చు. సాగు పెంచాలి.. ఆదాయం పొందాలి.. గ్రామాల్లో చెరువులు, చెక్డ్యాంలు, ఊటకుంటలు, ప్రాజెక్టు కాల్వల నుంచి పూడిక తీసుకునేందుకు అవకాశం ఉంది. కూలీలతో పనులు చేయిస్తే వారికి ఉపాధి చూపడంతో పాటు ఇటు నీటి వనరులు బాగు చేసుకోవచ్చు. సాగునీటి సమస్య లేకుండా చేసుకోవచ్చు. అధికారులను సంప్రదిస్తే మేలు.. ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు మండలస్థాయిలో ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారు. జిల్లాలో పీడీతో పాటు ఏపీడీ, మండలాల్లో ఏపీవో, సాంకేతిక సహాయకులు, గ్రామాల్లో క్షేత్ర సహాయకులు ఉంటారు. మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలో పనుల గుర్తింపు, ఎంపిక, ఆమోదం, మంజూరు ఉంటాయి. -
అభ్యంతరాలను దృష్టికి తీసుకురావాలి
కరీంనగర్: ఓటరు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, మున్సిపాల్టీల్లో చనిపోయినవారి ఓట్లు తొలగించాలని, కుటుంబ సభ్యులందరికీ ఓట్లు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటికే అన్ని మున్సిపాల్టీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వార్డుల వారీగా ముసాయిదా ప్రకటించామన్నారు. మరణించినవారి, రెండు చోట్ల నమోదైన ఓట్లపై సమాచారం అందిస్తే తొలగిస్తామని పేర్కొన్నారు. చొప్పదండి, జమ్మికుంట, హుజురాబాద్ బల్దియాల కమిషనర్లు నాగరాజు, అయాస్, సమ్మయ్య, పార్టీల ప్రతినిధులు వై.సునీల్రావు, నాంపల్లి శ్రీనివాస్(బీజేపీ), చల్లా హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్(బీఆర్ఎస్) మడుపు మోహన్ (కాంగ్రెస్), పైడిపల్లి రాజు (సీపీఐ), మిల్కూరి వాసుదేవరెడ్డి (సీపీఐఎం) తేజదీప్రెడ్డి (ఏఐఎఫ్ఎఫ్బీ), కందుల రాజిరెడ్డి (జనసేన) తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక విక్రయించి.. సొమ్ముచేసుకుంటున్నారు..
మానేరులో బారులు తీరిన ఇసుక ట్రాక్టర్లు గట్టెపల్లి మానేరు తీరంలో ఇసుక నిల్వలు సాండ్ టాక్సీ పాలసీని తొలగించి.. ఇంటి నిర్మాణాలకు ఉచితంగా ఇసుక వాడుకోవాలని పాలకులు, అధికారులు సూచించారు. ఇసుక పాలసీని స్థానికులకు ఉచితం చేస్తే.. దూర ప్రాంతాలకు చేరవేస్తూ ఇసుక విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ట్రాక్టర్ల యజమానులు. సుల్తానాబాద్, పెద్దపల్లి, ధర్మారం, బసంత్నగర్, కమాన్పూర్ వరకు మానేరు నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు ఇసుకాసురులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల, కదంబాపూర్, గట్టెపల్లి.. ఇలా మానేరుతీరంలో వందలాది ట్రాక్టర్లు నిత్యం ఇసుక తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
బావిలోపడి మహిళ మృతి
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామానికి చెందిన లక్ష్మి(57) దావన్నపల్లి గ్రామ ంలోని వ్యవసాయ బావిలో జారిపడి మృతి చెందిందని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. కొంత కాలంగా మానసిక స్థితి సరిగ్గాలేని లక్ష్మి.. ఇంటినుంచి ఉదయం బయల్దేరి, అటుగా వెళ్లి జారి బావిలో పడి మరణించిందన్నారు. మృతురాలి కుమారుడు సతీశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. మానకొండూర్: మానకొండూర్ మండలం సదాశివపల్లి రైస్మిల్లులో హమాలీగా పనిచేస్తున్న అల్లం రాజయ్య(56) మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. మానకొండూర్ గ్రామానికి చెందిన అల్లం రాజయ్య సదాశివపల్లిలోని ఉమా రైస్మిల్లులో హమాలీగా పనిచేస్తున్నాడు. ఉదయం రైస్మిల్లు వద్ద బైక్పై వెళ్తూ రోడ్డు దాటుతుండగా, కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న ట్రాలీ మినీ వ్యాన్ ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో 108లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్తాబాద్(సిరిసిల్ల): మలిదశ తెలంగాణ ఉద్యమ నేత.. తెలంగాణ సాధనకు ముంబయిలో తెలుగువారి ని ఒక్కటి చేసిన ఉద్యమ నాయకుడు బద్ది హేమంత్ సోమవారం మృతి చెందాడు. ముంబయి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, తెలంగాణ లింక్ అనే తెలుగు వారపత్రికను నడిపిన హేమంత్ అక్కడ అనేక బహుజన, కార్మిక సంఘాల ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగిన నాయకుడిగా అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. హేమంత్ కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కోకిలాబెన్ ఆసుపత్రిలో మృతిచెందారు. మంగళవారం అతడి భౌతికకాయానికి బౌద్ధ సంప్రదాయం ప్రకారం ప్రార్థనలు జరిపి, అంత్యక్రియలు నిర్వహించినట్లు బహుజన సాహిత్య అకాడమీ మహారాష్ట్ర అధ్యక్షుడు నాగెల్ల దేవానంద్ తెలి పారు. హేమంత్కు నివాళి అర్పించిన వారిలో ముంబయి బీఆర్ఎస్ నాయకులు బొల్లె శివరా జ్, దొనకొండ సంతోష్, నాగ్సేన్, తెలంగాణ సే వాసంస్థ నవీ ముంబయి అధ్యక్షుడు వెలుగు లింగయ్య, సైదులు, కొమురయ్య, లక్ష్మణ్, కృష్ణ, పున్నం వెంకన్న, పరమేశ్ తదితరులున్నారు. గోదావరిఖని: కుటుంబ కలహాలతో నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన ఆరునెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త మంగళవారం దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. గోదావరిఖని వన్టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. నగరంలోని మేదరిబస్తీకి చెందిన బచ్చల కావేరికి కమలాపూర్ మండలం బీంపల్లి గ్రామానికి చెందిన బచ్చల చంద్రమౌళితో వివాహం జరిగింది. కుటుంబ కలహాలు రావడంతో పదిరోజుల కిందట కావేరి పుట్టింటికి వచ్చింది. ఇదేక్రమంలో అత్తగారింటికి చేరుకున్న చంద్రమౌళి.. మాటామాట పెరిగి తన భార్య కావేరిపై కత్తితో దాడిచేశాడు. తల, ఎడమ చెవి, కుడి చెయ్యి, కుడి చెవి ప్రాంతంలో తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెను గోదావరిఖని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. -
దారిద్య్రానికి చెక్!
రోడ్డు ప్రమాదాలకు ముకుతాడు ప్రమాదాలకు నిలయమైన సదాశివపల్లి వై జంక్షన్ 2023 2024 2025 ప్రాణాంతక రోడ్డు ప్రమాదాలు 203 188 186 రోడ్డు ప్రమాదాలు 470 586 579 మొత్తం ప్రమాదాలు 673 774 765 మరణాలు 215 200 192 గాయపడ్డవారు 651 716 701సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: జిల్లాలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ గౌస్ ఆలం దృష్టి సారించారు. అతివేగం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు, ప్రాణనష్టాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో నగరంలో ప్రమాదాలకు కారణమవుతున్న పలు బ్లాక్స్పాట్లు, జంక్షన్లను గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన పద్మనగర్, సదాశివపల్లి, ఎన్టీఆర్ జంక్షన్లపై దృష్టి సారించారు. ఇప్పటికే పద్మనగర్ జంక్షన్ విస్తరించారు. రోడ్డు సేఫ్టీ, ఆర్అండ్బీ అధికారులతో చర్చించి, సదాశివపల్లి వైజంక్షన్ వద్ద ఐలాండ్ నిర్మించేందుకు సీపీ చొరవ చూపించారు. ఇందుకోసం కొంత భూసేకరణ, ఐలాండ్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయి. త్వరలోనే ఇక్కడ ఐలాండ్ నిర్మించనున్నారు. ప్రమాదాల నేపథ్యంలో అవగాహనకు శ్రీకారం.. కరీంనగర్ కమిషనరేట్ పరిఽధిలో రెండేళ్లుగా రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గుతున్నా.. క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాలకు వేగం ప్రధాన కారణమని గుర్తించిన అధికారులు, కూడళ్లకు సమీపంలో రంబుల్ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. యూటర్న్ల వద్ద యాక్సిడెంట్లు జరగకుండా బారికేడ్ల ఏర్పాటు, బ్లాక్స్పాట్ల వద్ద ప్రమాద హెచ్చరికలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలు జరుగుతున్న ప్రతీ ప్రాంతాన్ని సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా వేగం ఈ ప్రమాదాలకు ప్రథమ కారణం కాగా, అవగాహన లోపం రెండో కారణమని గుర్తించారు. జనవరి మొత్తం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వాహనదారులతోపాటు కాలేజీ యువతకు పలు కార్యక్రమాలు రూపొందించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ పమేలా సత్పతి కూడా హాజరవనున్నారు.కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాం. రోడ్సేఫ్టీ, నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులతో కలిసి సమన్వయంతో ముందుకెళ్తున్నాం. వేగంతోపాటు నిబంధనలు పాటించని వాహనదారుల వల్లే ప్రాణనష్టం సంభవిస్తుంది. మృతుల్లో అధికశాతం ద్విచక్రవాహనదారులే కావడం వల్ల హెల్మెట్ వినియోగం పెరిగేలా, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్పై అవగాహన కలిగేలా చర్యలు రూపొందించాం. ముఖ్యంగా విద్యార్థులు, యువత, వాహనదారులు లక్ష్యంగా పలు విభిన్న కార్యక్రమాలు రూపొందించాం. – సీపీ గౌస్ ఆలం -
విద్యుత్ అధికారుల ‘ప్రజాబాట’
కొత్తపల్లి(కరీంనగర్)/తిమ్మాపూర్: విద్యుత్ విని యోగదారులకు మరింత చేరువయ్యేందుకు ‘ప్రజాబాట’ కార్యక్రమం మొదలైంది. వారంలో మూడు రోజుల పాటు ‘ప్రజాబాట’ కార్యక్రమానికి మంగళవారం టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ అధికారులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళ, గురు, శనివారాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ టౌన్–2 సెక్షన్ పరిధిలో నిర్వహించిన ప్రజాబాటను చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్)బి.అశోక్ ప్రారంభించారు. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, తిమ్మాపూర్, గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ ఆటోస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే ఓ ఇంటి వద్ద ఉన్న ఇనుప కరెంటు పోలును పరిశీలించి స్తంభం మారుస్తామని తెలిపా రు. ఎస్ఈ రమేశ్బాబు, డీఈ రాజం, సర్పంచ్లు అంజనేయులు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
మండల సభ ఏర్పాటు చేయాలి
నూతనంగా ఎన్నికై న సర్పంచులతో ప్రభుత్వ అధికారులు మండలాల్లో మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి. దీంతో అధికారులకు, సర్పంచుల మఽ ద్య సమన్వయం ఏర్పడుతుంది. పరిచయం ఏర్పడి మంచి వాతావరణం కొనసాగుతుంది. ఈ దిశలో అధికారులు ప్రయత్నించాలి. – బొంగాని అశోక్, స్తంబంపల్లి, సర్పంచ్ మండల సమావేశాలు ఏర్పా టు చేస్తే గ్రామాలు అభివృద్ధి ఎలా చేయాలనే అంశంలో నూతన సర్పంచులకు అవగాహన కలుగుతుంది. అధికా రులు ఇచ్చే సలహాలు, సూచనలు సర్పంచులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేయాలి. – ఇల్లెందుల రాజేశం, కొత్తపేట, సర్పంచ్ గ్రామాల్లో రెండేళ్లుగా పాలకర్గాలు లేక సమస్యలు పేరుపోయాయి. మండల సమావేశాలు ఏర్పాటు చేస్తే గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అధి కారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో సమస్యల పరిశ్కారానికి మండల సభలు వేదికలు అవుతాయి. – నిమ్మ భాగ్యలక్ష్మి, దేశాయిపల్లి, సర్పంచ్ -
చెడుకు దూరంగా ఉండాలి
తిమ్మాపూర్(మానకొండూర్): సురక్షిత బాల్య ం కోసం జిల్లాలో స్నేహిత కార్యక్రమం అమలు చేస్తున్నట్లు 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్ తెలిపారు. మండలంలోని నుస్తులాపూర్ ఉన్నత పాఠశాల, రామకృష్ణ కాలనీలోని గన్నేరువారం మహత్మా జ్యోతిరావుఫూలే గురుకుల హాస్టల్లో మంగళవారం ఏర్పాటు చేసిన స్నేహిత అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. సెల్ఫోన్తో మంచి కన్నా చెడు ఎక్కవ ఉందన్నారు. తెలిసి తెలియక చెడుదారిలో వెళ్లొద్దన్నారు. చిన్న వయసులో వాహనాలు నడపటం, ఆల్కహాల్ సిగరెట్ తాగడం ద్వారా శారీరకంగా, మానసికంగా అనేక ఇబ్బందులు వస్తాయని తెలిపారు. సేఫ్ టచ్.. అన్ సేఫ్ టచ్, విద్య ప్రాముఖ్యత, స్వీయ రక్షణ, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 తదితర సేవలపై అవగాహన కల్పించారు. పిల్లల ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జువేరియా అవగాహన కల్పించారు. హెచ్ఎం రవీందర్, వెంకటరమణ పాల్గొన్నారు. అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యంకరీంనగర్రూరల్: నగరంతో పాటు విలీన గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆరెపల్లిలోని సరస్వతినగర్లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, మరో ప్రాంతంలో రూ.11లక్షలతో సీసీరోడ్డు, కోతిరాంపూర్లోని గణేశ్నగర్ లింక్రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అంతర్గత రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చెర్ల పద్మ, ఎట్టెపు వేణు, బత్తిని చంద్రయ్య, బేతి సుధాకర్రెడ్డి, గౌరయ్యగౌడ్, సత్తినేని శ్రీకాంత్, వెంకట్రెడ్డి, శ్రీకాంత్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదుకరీంనగర్ అర్బన్: యాసంగి సాగుకు సరిపడా ఎరువులున్నాయని, కొరత లేదని జిల్లా సహకార అధికారి రామానుజాచార్య అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాల్లో సహకార సంఘాల ఎరువుల గోదాంలను పరిశీలించారు. భౌతిక నిల్వలు, రికార్డుల్లో వివరాలకు సరిచూశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా హెచ్చు మోతాదులో యూరియా సేకరించిందని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లో యూరియాకు కొరత ఉండదని స్పష్టం చేశారు. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, పుష్కలంగా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్, నోడల్ అధికారి మహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, సీనియర్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. 121 జీవో ఎత్తివేయాలికరీంనగర్కల్చరల్: దేవాదాయశాఖలో 2014లోపు గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు ఇస్తామని చెప్పి మధ్యలో 121 జీవో తెచ్చి అర్చకులు, ఉద్యోగులకు అన్యాయం చేశారని, 121 జీవో ఎత్తివేయాలని రాష్ట్ర అర్చక ఉద్యోగ ఐకాస జిల్లా సదస్సు తీర్మానించింది. మంగళవారం కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరఆలయంలో ఉమ్మడిజిల్లా సదస్సు జరిగింది. జిల్లా అధ్యక్షుడు చెన్నోజ్వల నాగరాజాచార్యులు అధ్యక్షతన పలు తీర్మాణాలు అమోదించారు. అర్చక ఉద్యోగులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించాలన్నారు. శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. 2017లో జీవో 577 ప్రకారం అర్చక, ఉద్యోగులందరికీ గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు ఉపేందర్ శర్మ, డీవీఆర్ శర్మ, నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ప్రభాకర్ పాల్గొన్నారు. -
యువతకు స్కూటీ.. జాడ లేదేమి?
కరీంనగర్స్పోర్ట్స్: ప్రభుత్వ పాఠశాలల విద్యావ్యవస్థను కాంగ్రెస్ పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మంగళవారం కరీంనగర్ హౌసింగ్బోర్డు కాలనీలోని సరస్వతి శిశుమందిర్లో ఖేల్ఖూద్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ విద్యార్ధికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామని మోసం చేసిందన్నారు. నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామన్నారని మరిచారన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు టెన్త్ పాసైతే రూ.10 వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ చేస్తే రూ.25 వేలు, పీజీ చేస్తే రూ.లక్ష ఇస్తామని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ టీచర్లు, ఉద్యోగులు దాచుకున్న సొమ్ము ఇవ్వాలని అడిగిన పాపానికి అరెస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. దేశ భవిష్యత్తును నిర్మించే మౌన కర్మాగారం సరస్వతి శిశుమందిర్ అని కేంద్రమంత్రి కొనియాడారు. ఇదే స్కూల్లో తాను చదువుకొని కేంద్ర మంత్రి వరకు ఎదగడం గర్వంగా ఉందన్నారు. సంస్కారం, క్రమశిక్షణ, దేశభక్తి, ధర్మం వంటి అంశాలు ఇక్కడే నేర్చుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆర్మీలో చేరి.. దేశానికి సేవ చేసేలా తయారు కావాలన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలన్నింటికీ పక్కా భవనాలు నిర్మించడంతోపాటు ల్యాప్టాప్ సహా ఇతర సౌకర్యాలన్నీ కల్పించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. శిశుమందిర్ లో చదువుకున్న ఎందరో అధికారులు, సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రాజకీయ నేతలుగా ఎదిగారన్నారు. అనంతరం కేంద్ర మంత్రి విద్యార్థులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. -
వేధిస్తున్న వైద్యుల కొరత
గోదావరిఖని: వైద్యులు, వైద్య నిపుణులు, వైద్యసిబ్బంది కొరత సింగరేణి ఆస్పత్రులను వేధిస్తోంది. ప్రధానంగా కార్మికులకు ఆశించిన స్థాయిలో వైద్యసేవలు అందకుండా చేస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు యాజమాన్యం ఈనెల 8, 9వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇందుకోసం అన్నిఏర్పాట్లు చేస్తోంది. టెక్నీషియన్ల కొరత కూడా.. సింగరేణి ఆస్పత్రుల్లో వైద్యులతోపాటు టెక్నీషియన్ల కొరత వెంటాడుతోంది. రూ.కోట్లు వెచ్చించి యంత్రాలు కొనుగోలు చేసినా.. వినియోగించేందుకు టెక్నీషియన్లు అందుబాటు లేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. సకాలంలో వైద్యపరీక్షలు చేయక ఇటీవల పురిట్లోనే ఓ పాప చనిపోవడం వివాదాస్పదమైంది. వైద్యం కోసం ఏటా రూ.140 కోట్లు సింగరేణి ఉద్యోగుల వైద్యం కోసం ఏటా సుమారు రూ.140కోట్లు వ్యయం చేస్తోంది. సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం రూ.100 కోట్లు కేటాయిస్తోంది. మందుల కోసం రూ.40కోట్ల ఖర్చు చేస్తోంది. 32 మంది వైద్యుల నియామకానికి సన్నద్ధం వివిధ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి ఈనెల 8, 9వ తేదీల్లో యాజమాన్యం ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రధానంగా నలుగురు జనరల్ సర్జన్, ఏడుగురు గైనకాలజిస్ట్లు, నలుగురు పిల్లల వైద్యనిపుణులు, ముగ్గురు చెస్ట్ ఫిజీషియన్లు, ఇద్దరు ఈఎన్టీ సర్జన్, ఏడుగురు అనస్తీయా, ఒక పాథలాజిస్ట్, ఒక ఫిజియాలజిస్ట్, ముగ్గురు హెల్త్ ఆఫీసర్లను భర్తీచేయనుంది. సిబ్బంది పరిస్థితి కూడా అంతే.. సింగరేణి ఆస్పత్రుల్లో దుస్థితి 32 మంది డాక్టర్ల నియామకానికి గ్రీన్సిగ్నల్ 8, 9వ తేదీల్లో ఇంటర్వ్యూలకు ఏర్పాట్లు ఈనెల 8, 9తేదీల్లో భర్తీచేయనున్న పోస్టులు జనరల్ సర్జన్ 4 గైనకాలజిస్ట్ 7 పిల్లలవైద్యనిపుణులు 4 చెస్ట్ ఫిజీషియన్ 3 ఈఎన్టీ సర్జన్ 2 అనస్తీషియా 7 పాథలాజిస్ట్ 1 ఫిజియాలజిస్ట్ 1 హెల్త్ ఆఫీసర్లు 3 ఆస్పత్రులు, అందుబాటులోని వైద్యులు, సిబ్బంది మెయిన్ –కొత్తగూడెం 1 ఏరియా 7 డిస్పెన్సరీలు 21 మొత్తం పడకలు 821 వైద్యులు 180 స్పెషలిస్ట్లు 57 మెడికల్ ఆఫీసర్లు 123 వైద్యసిబ్బంది 1,120వైద్య సేవలు పొందుతున్న ఉద్యోగులు పర్మినెంట్ 40,000కాంట్రాక్ట్ 25,000రిటైర్డ్ 1,60,000రెఫరల్ ఆస్పత్రులు 180సింగరేణి, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులకు అత్యాధునిక వైద్యసేవలు అందిస్తాం. ఇందుకోసం ఈనెల 8, 9వ తేదీల్లో 32 మంది డాక్టర్లను భర్తీచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. త్వరలోనే రామగుండం సింగరేణి ఏరియా ఆస్పత్రిలో గుండె సంబంధిత క్యాత్ల్యాబ్ ప్రారంభిస్తాం. – కిరణ్రాజ్కుమార్, సీఎంవో, సింగరేణి -
లా ఇంటర్నల్స్ బైకాట్
సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ లా విభాగంలో అటెండెన్స్ సాకుతో విద్యార్థులను పరీక్షలకు దూరం చేయడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళన ఉధృతమైంది. నిరసనగా లా ఇంటర్నల్స్ బైకాట్ చేశారు. పలువురు విద్యార్థులు తరగతి గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లా విద్యార్థుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. అటెండెన్స్ నిబంధనల పేరుతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేయడం సరికాదన్నారు. విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చేలా నిబంధనలు ఉండకూడదని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎస్యూ అధికారుల ఏకపక్ష నిర్ణయాలకు నిరసనగా లా విద్యార్థులందరూ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం అటెండెన్స్ ఉన్నవారికే పరీక్షలు నిర్వహిస్తామనే మొండి వైఖరి వీడి, అందరినీ సమానంగా చూడాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. -
మట్టి అక్రమ రవాణాపై పోలీస్ పంజా
చందుర్తి(వేములవాడ): ఇందిరమ్మ ఇళ్ల పేరిట అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం మూడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసుస్టేషన్కు తరలించారు. ‘సాక్షి’లో ఈనెల 5న ‘తగ్గేదెలే.. తవ్వుడే’ శీర్షికన ప్రచురితమైన కథనంపై పోలీసుల ఉన్నతాధికారులు స్పందించారు. చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మట్టి తరలించేందుకు రెవెన్యూ అధికారులు 8 ట్రాక్టర్లకు అనుమతినిచ్చారు. అదనంగా అనుమతి లేని మరో ఏడు మొత్తం 15 ట్రాక్టర్లలో మట్టి తరలిస్తుండగా పోలీసులు వచ్చారన్న సమాచారంతో నాలుగు ట్రాక్టర్ల డ్రైవర్లు పంట చేల నుంచి వాహనాలతో తప్పించుకోగా, మరో మూడు అనుమతి లేని ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. సదరు ట్రాక్టర్లు కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందినవారివని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
గంజాయి విక్రేతల అరెస్టు
కరీంనగర్రూరల్: బొమ్మకల్ బైపాస్రోడ్డులో గంజాయి విక్రయించేందుకు వచ్చిన ముగ్గురు యువకులను మంగళవారం పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా అరెస్టు చేయగా వారిలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులున్నారని కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. బొమ్మకల్ బైపాస్రోడ్డులో ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్రవాహనాలపై వస్తున్న ముగ్గురు యువకులు పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నారు. రామగుండంకు చెందిన సాయి వర్షిత్ వాహనాన్ని తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురిని పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టగా ఏపీలోని అరకు వెళ్లి డిసెంబర్ 31 కోసం గంజాయి కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు సాయివర్షిత్ తెలిపాడు. కరీంనగర్లో ఎక్కువ ధరకు గంజాయి విక్రయించేందుకు తన స్నేహితులైన ఇంజినీరింగ్ చేస్తున్న సాయి కార్తీక్, సాయితేజల సాయంతో బైపాస్ రోడ్డులో లారీ డ్రైవర్ల కోసం వచ్చినట్లు అంగీకరించాడు. ముగ్గురి వద్ద నుంచి రెండు బైకులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గంజాయి విక్రయించిన, తాగిన కఠిన శిక్షలుంటాయని, రౌడీషీట్స్ ఓపెన్ చేస్తామని తెలిపారు. యువకులు, విద్యార్థులు గంజాయికి అలవాటు పడి ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. -
మున్సిపోల్స్లో విజయం ఖాయం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి హుజూరాబాద్: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం జరిగిన బీజేపీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీశక్తి చాటి చెప్పాలన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలను కై వసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మున్సిపాలిటీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. బల్దియాల పరిధి విస్తరిస్తున్నా.. మౌలిక వసతులు కల్పించలేని దుర్భరస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీల అభివృద్ధికి చేసిందేమి లేదని ధ్వజమెత్తారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, నాయకులు రఘు, రాజేందర్, రాజు, రాజు, శ్రీనివాస్, రమణారెడ్డి, దేంచనాల శ్రీనివాస్, మోడపు వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ కమిటీలకు 160 దరఖాస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: జిల్లా కాంగ్రెస్, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీలో చోటుకోసం ఆశావహుల నుంచి పార్టీ దరఖాస్తులు స్వీకరించింది. ఇటీవల డీసీసీ అధ్యక్షుడిగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా వైద్యుల అంజన్ కుమార్ను నియమించిన విషయం తెలిసిందే. దీంతో జిల్లా, కార్పొరేషన్ కార్యవర్గ నియామకంపై దృష్టి సారించిన అధిష్టానం, ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. దీనికోసం పరిశీలకులను నియమించింది. మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో పరిశీలకులు శ్రీనివాస్, గౌస్ వివిధ పదవుల కోసం దరఖాస్తులు తీసుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కమిటీలో పదవులకోసం పెద్ద సంఖ్యలో 120 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ పదవులకోసం 40 మంది దరఖాస్తు చేసుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవుల్లో ప్రాధాన్యం ఉంటుందని ఈ సందర్భంగా సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఎండీ తాజ్, శ్రావణ్ నాయక్, సిరాజుద్దీన్, ఎస్ఏ మోసిన్, అహ్మద్అలీ, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవేదనలు.. నివేదనలు
కరీంనగర్ అర్బన్: నెలల తరబడి ప్రజావాణి చు ట్టూ తిరుగుతున్నాం. పట్టించుకున్న నాథుడే లేడు. మండలంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ఆఫీస్కు వస్తే ఇక్కడా అంతే.. చూస్తాం.. చేస్తామనడమే త ప్ప చర్యలు లేవంటూ బాధితులు గగ్గోలు పెట్టా రు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలకు విముక్తి కల్పించాలని వేడుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి పలు సమస్యలపై ఆరా తీశారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 299 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురితో ‘సాక్షి’ మాట్లాడగా తమ బాధను వెల్ల గక్కారు. వివరాలు వారి మాటల్లోనే..మొత్తం అర్జీలు: 299 కరీంనగర్ కార్పొరేషన్: 68 హౌసింగ్: 43, ఇతర శాఖలకు: 188 -
‘ఇందిరమ్మ’బిల్లుల చెల్లింపులో మార్పు
కరీంనగర్రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం బిల్లుల చెల్లింపు విధానంలో కొన్ని మార్పులు చేసింది. గతంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా దశలవారీగా రూ.5లక్షలను లబ్ధిదారులకు చెల్లించారు. ప్రస్తుతం గోడల నిర్మాణం పూర్తి చేసినట్లయితే రూ.1.40లక్షలు, మరో రూ.60వేలను ఉపాధిహామీ పనులకు భాగస్వామ్యం కల్పించారు. నగరం, పట్టణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన కింద ఈ బిల్లులను చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీఒక్క లబ్ధిదారు పనులు చేసుకునేలా అవకాశం కల్పించింది. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులకు మొత్తం రూ.4.40లక్షలను చెల్లించనుంది. కరీంనగర్ జిల్లాలో మొత్తం 8,239 ఇళ్లు మంజూరు కాగా 871 రద్దు చేసుకున్నారు. మిగతా ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు ప్రారంభించారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఇళంల నిర్మాణాలు ఉఏన్నాయి. ఉపాధిహామీలో రూ.60వేల చెల్లింపు.. గ్రామీణ ప్రాంతాల్లో 90 పని దినాలకు రోజుకు రూ.300 చొప్పున రూ.27వేలు లబ్ధిదారుకు ఉపాధిహామీ ద్వారా చెల్లిస్తారు. స్వచ్ఛభారత్ మిషన్లో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, మిగిలిన రూ.21వేలను పీఎం గ్రామీణ ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తారు. కరీంనగర్ కార్పొరేషన్తోపాటు మిగతా పట్టణ ప్రాంతాల్లో రూ.60వేలను పీఎం ఆవాస్ యోజన ద్వారా చెల్లిస్తారు. బిల్లుల చెల్లింపు విధానంలో లబ్ధిదారులు ఆందోళనకు గురికావద్దని గృహనిర్మాణ సంస్ధ అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధిహామీలో రూ.60వేలు చెల్లించేలా నిర్ణయం -
రోడ్లు, డ్రైనేజీల సమస్యలకు శాశ్వత పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని 21వ డివిజన్ విద్యానగర్లో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, 11వ డివిజన్ రామచంద్రాపూర్లో రూ.25 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పదేళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంతర్గత రోడ్లు, మురుగు కాలువలు నిర్మిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో మిగిలిపోయిన అన్ని పనులు త్వరితగతిన పూర్తిచేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు బోనాల శ్రీనివాస్, వరాల నర్సింగం, చేవెళ్ల మల్లికార్జున్, ఊరడి లత, వెన్నం రజితారెడ్డి, మిర్యాల శ్రీధర్రెడ్డి, గుడిపాటి రమణారెడ్డి, తాళ్లపల్లి మహేశ్గౌడ్, భూపతి జగన్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి, సుతారి శ్రీనివాస్, నాగరాజు, అనిత, స్వప్న, కవిత తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 6 శ్రీ జనవరి శ్రీ 20267శివదీక్షలు ఆరంభం వేములవాడ: ఫిబ్రవరి 15న వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర మహోత్సవాలకు ముందుగా శివదీక్షలు చేపడతారు. సోమవారం దాదాపు 500 మంది శివదీక్ష చేపట్టారు. క్వింటాల్ పత్తి రూ.7,500జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్లో సోమవా రం క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.7,500 పలి కింది. క్రయవిక్రయాలను చైర్ పర్సన్ స్వప్నసదానందం, కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.వాతావరణం వాతావరణం సాధారణంగా ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. చలి గాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది. -
గంజాయి నిందితులే ఎక్కువ!
కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలులో గంజాయి కేసుల నిందితులు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో గంజాయి కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది మొత్తం 270 మంది గంజాయి సంబంధిత కేసుల్లో అరెస్టు అయి జైలుకెళ్లగా.. ప్రస్తుతం 18 మంది నిందితులు కరీంనగర్ జైలులో రిమాండ్ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసు గణాంకాలు పరిశీలిస్తే.. ఈ ఏడాది కేవలం కరీంనగర్ జిల్లాలో 25 మంది గంజాయి కేసులో నిందితులను అరెస్టు చేయగా.. రూ.6.44లక్షలు విలువగల 29.042 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఇతర మత్తు పదార్థాల కేసులతో పోల్చితే గంజాయి కేసులు సంఖ్యాపరంగా ముందున్నాయి. గంజాయి కేసుల్లో దాదాపు వంద శాతం యువతే నిందితులుగా ఉన్నారు. నిరుద్యోగం, ఆసక్తి, స్నేహితుల ప్రలోభాలు తదితర కారణాల వల్ల గంజాయి వాడకంలో యువకులు పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్లో మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కౌన్సెలింగ్లు నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, చట్టపరమైన పరిణామాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. క్రమశిక్షణతో జీవితం గడపడం, ఉద్యోగావకాశాలపై దృష్టి సారించడం వంటి అంశాలను కూడా కౌన్సెలింగ్లో భాగం చేస్తున్నారు. పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నారు. గంజాయి వాడకం కేవలం చట్టవిరుద్ధమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ జీవనంపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఒక అధికారి పేర్కొన్నారు. కొన్నేళ్లుగా తెలంగాణ వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణా, వినియోగం పెరగడంతో రాష్ట్ర పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జైలు గణాంకాలు మత్తు పదార్థాల వ్యసనంపై ఆందోళన కలిగిస్తున్నాయి. యువతే టార్గెట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యువకులు, విద్యార్థుల్లో గంజాయి అలవాటు పెరుగుతోందని, పలు పట్టణాల్లో గంజాయి విక్రయం, వినియోగంపై పోలీసు దాడులు కొనసాగుతున్నాయి. యువతే టార్గెట్గా మారుతున్న మత్తు ముఠాలు జైలు అధికారుల ప్రకారం గంజాయి కేసుల్లో ఇరుక్కునే వారిలో ఎక్కువ మంది 18–30 ఏళ్ల మధ్య వయస్సున్న యువకులే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆశతో ముఠాలు యువతను వ్యసనానికి గురి చేసి.. చిన్నచిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయిని సరఫరా చేస్తున్నాయనే అంశం ఇటీవల పోలీసు దర్యాప్తుల్లో వెలుగు చూసింది. అమ్మకాలకు, కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఒక ఇంగ్లిష్ అక్షరం వై.. దానిచుట్టూ వృత్తాకారం గుర్తు టాటు వేసుకుంటున్నట్లు.. సదరు టాటు ఉన్నవాళ్లకు గంజాయి అమ్మకందారులు విక్రయాలు జరుపుతున్నట్లు జైలు, పోలీసు అధికారులు పరిశీలనలో తేలింది. కౌన్సెలింగ్.. డీ–అడిక్షన్ కరీంనగర్ జిల్లా జైలులో వారానికోకసారి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నుంచి సైకాలజిస్ట్ వస్తూ కౌన్సెలింగ్ ఇస్తున్నారు. గంజాయి కేసుల్లో జైలుకొచ్చిన నిందితులకు జైలు లోపలే ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. మత్తు అలవాటును తగ్గించేందుకు మానసిక నిపుణులు, సామాజిక కార్యకర్తల సహకారంతో సెషన్లు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జైలు శాఖ రాష్ట్రవ్యాప్తంగా సెంట్రల్ జైళ్లలో డీ–అడిక్షన్ సెంటర్లు స్థాపించేందుకు చర్యలు తీసుకుంటుండంగా.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జైళ్లలో కేంద్రాలు స్థాపించనున్నారు. గంజాయి, ఇతర మత్తు కేసుల్లో ఇరుక్కున్న ఖైదీలకు చికిత్స, పునరావాసం కల్పించే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. శిక్షతోపాటు మార్పు కూడా ముఖ్యమని గంజాయి కేసుల్లో శిక్షలు పడిన వారు తిరిగి అదే మార్గంలో నడవకుండా ఉండాలంటే జైల్లోనే కౌన్సిలింగ్, వృత్తి సాధన, పునరావాసం తప్పనిసరని రాష్ట్ర జైలు శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. పెద్దఎత్తున గుప్పుమంటున్న మత్తు ఏడాదిలో 270 మంది కరీంనగర్ జైలుకు.. ప్రస్తుతం జైలులో 18 మంది నిందితుల్లో వంద శాతం యువతే.. గంజాయి దందా చేసేవారికి స్పెషల్ సింబల్ టాటులు -
పరీక్షలు చేస్తరు.. రిపోర్టులు ఇస్తరు
జిల్లాకు 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు కరీంనగర్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ల భర్తీ త్వరలో పూర్తి కానుంది. జిల్లాకు 40 మంది కొత్తవారు రానున్నారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం గతేడాది నవంబర్ 17న తుది జాబితా వెలువరించింది. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఒ ప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయనున్నారు. ఈ క్రమంలో నియామక ప్రక్రియలో 20 మార్కుల వెయిటేజీ కల్పించారు. ఎంపికైన అభ్యర్థులు పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలో ఈ పోస్టులకు జాయినింగ్ రిపోర్టులు అందజేయనున్నట్లు తెలిసింది. పోస్టుల భర్తీ ఇలా.. జిల్లాలో ఖాళీగా ఉన్న 40 గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద వీరిని నియమించింది. కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నలుగురు, అనుబంధ జనరల్ ఆస్పత్రికి 18, వైద్య విధాన పరిషత్కు 9, వైద్యారోగ్యశాఖ పీహెచ్సీలకు 9 మందిని నియమించారు. మరింత మెరుగైన వైద్య సేవలు జిల్లాకు కొత్తగా 40 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయి. నూతన నియామకాలతో ప్రతీ పీహెచ్సీకి ఒక ల్యాబ్ టెక్నీషియన్ను పూర్తిస్థాయిలో కేటాయించనున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చేవారికి రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. రక్త పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందించే అవకాశం ఉంది. ప్రైవేటుకు వెళ్లకుండా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. -
చర్యలుంటాయా.. ఉండవా ?
కరీంనగర్ అర్బన్: టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) దందాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందా.. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోనుందనేది త్వరలోనే తేలనుంది. టీఆర్లను దుర్వినియోగం చేసిన అధికారులతోపాటు జిన్నింగ్ మిల్లులు, సీసీఐ తోడుదొంగల్లా వ్యవహరించింది. కూటమి కట్టి ఇష్టారీతిగా రూ.కోట్లు గడించారని సమాచారం. ఈనేపథ్యంలో కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగాయని కొన్ని నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా పదికి పైగా మార్కెట్ కార్యదర్శులతోపాటు డీఎంవోలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో విజిలెన్స విచారణ నివేదిక ప్రభుత్వానికి సమర్పించగా చర్యలుంటాయా.. ఉండవా.. అనేది హాట్టాపిక్గా మారింది. మీనమేషాలు.. కొనసాగిన విచారణ జిల్లాలో 200–250 టీఆర్ పుస్తకాలను మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులకు ఇచ్చారు. ఒకటి అసలు ధ్రువీకరణపత్రం రైతుకు జారీ చేయగా, మరొకటి నకలు తీసుకుంటారు. వీటిని మార్కెట్ అధికారులకు ఇవ్వాలి. జిల్లాలో 7వేల టీఆర్లు జారీ అయినట్లు తెలుస్తోంది. అసలు అవినీతి అంతా ఇక్కడే జరిగింది. జిల్లాలోని ప్రధాన మార్కెట్లతోపాటు గంగాధర, చొప్పదండి, తదితర మార్కెట్లలో టీఆర్లు జారీ కాగా దుర్వినియోగమయ్యాయన్న కోణంలో దర్యాప్తు చేశారు. 2024–25 పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరగగా టీఆర్ (తాత్కాలిక రిజిస్ట్రేషన్)ల జారీలో అవకతవకల వివరాలు సేకరణలో విజిలెన్స్ సఫలీకృతమైందని తెలుస్తోంది. సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో సంబంధిత వెబ్సైట్ సైతం మూతపడింది. ఒకవేళ అవకతవకలు జరిగితే ఎక్కడో చెప్పాలని స్పష్టం చేశారు. వీరు పంపిన నివేదికతోపాటు ఇది వరకే విజిలెన్స్ అధికారులు విచారణ అంశాలను బేరీజు వేసి, అక్రమాలను తేలిన చోట, తప్పులతడకగా వివరాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని తెలుస్తోంది. 2004 కుంభకోణం అటకెక్కినట్టేనా? ఉమ్మడి జిల్లా పరిధిలో 2004 నుంచి 2007 మధ్య కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోలు చేసింది. రైతులు మార్కెట్కు వెళ్లినప్పుడు ధరలు పెట్టకుండా.. నానా రకాల కొర్రీలతో కొనుగోళ్లు చేయని సీసీఐ ఏటా చివరిలో రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు ప్రకటనలు చేసింది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలు చేశాయి. సీసీఐ కేంద్రాల నిర్వాహకులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు ఒక్కటై దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించాయి. రైతుల ఆందోళనకు దిగివచ్చిన ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వం విజిలెన్స్, సీబీసీఐడీ విచారణకు ఆదేశించింది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల యజమానులకు అనుకూలంగా విజిలెన్స్, సీబీసీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని గ్రహించిన కురుక్షేత్ర అనే స్వచ్ఛంద సంస్థ, రైతు సాధికారక సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించాయి. ఫలితంగా సీబీఐ ఆధికారులు రంగంలోకి దిగారు. అయితే దశాబ్దాలు గడిచినా విచారణ పూర్తికాక పోగా, అక్రమాల్లో భాగస్వాములైనవారు ఉన్నత హోదాల్లో ఉండటం గమనార్హం. పత్తి కొనుగోళ్ల అవకతవకలపై ముగిసిన విచారణ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అక్రమార్కుల్లో గుబులు -
అపెరల్ పార్క్.. నిర్లక్ష్యపు మార్క్ !
సిరిసిల్ల: పాలకులు మారినప్పుడల్లా అభివృద్ధి స్వరూపం మారిపోతుంటుంది. అభివృద్ధి.. సంక్షేమ ప్రాధాన్యతలు మారుతున్నాయి. ఫలితంగా సిరిసిల్ల నేతకార్మికులకు శాశ్వత ఉపాధి కల్పించే ‘వర్కర్ టు ఓనర్’ పథకం మూలనపడింది. కార్మికులను యజమానులుగా మార్చే ఈ స్కీమ్ అప్రధాన్యతగా మారింది. సిరిసిల్ల ఎమ్మెల్యే, అప్పటి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారక రామారావు నేతకార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేందుకు వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూపొందించారు. 2017 అక్టోబరు 11న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్తో శంకుస్థాపన చేయించారు. రూ.374 కోట్ల భారీ బడ్జెట్తో దేశంలోనే తొలిసారిగా వీవర్స్పార్క్కు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో శ్రీవర్కర్ టు ఓనర్శ్రీ పథకం రెండేళ్లుగా మూలనపడింది. ఫలితంగా సిరిసిల్లలోని నేతకార్మికులు ఇప్పటికీ ఓనర్టు కాలేకపోయారు. 25 వేల మంది కార్మికులు.. 48 షెడ్లు సిరిసిల్లలో 25వేల మంది కార్మికులు ఈ రంగంలో పనిచేస్తున్నారు. నేత కార్మికుడే యజమానిగా మారి సొంత సాంచాలపై పనిచేసి మెరుగైన ఉపాధి పొందేందుకు 48 షెడ్లు నిర్మించారు. రాష్ట్ర పరిశ్రమల, మౌళిక వసతుల కల్పన సంస్థ(టీజీఐఐసీ) ఆధ్వర్యంలో వీవర్స్పార్క్ నిర్మాణమైంది. 2023లోనే ఇక్కడ మౌళిక వసతులు రోడ్లు, వీధిదీపాలు, మురికి కాల్వలు, ప్రహరీ పనులు పూర్తయ్యాయి. ప్రయోగాత్మకంగా రెండు సెమీ ఆటోమేటిక్ లూమ్స్ను, మరో స్పన్వైండింగ్ మిషన్ను ఏర్పాటు చేశారు. ఒకేసారి నాలుగు రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వం మారడంతో ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జారీ కాని మార్గదర్శకాలు ‘వర్కర్ టు ఓనర్’ పథకానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కాలేదు. తొలి విడతగా 1,104 మంది పేదకార్మికులను ఎంపిక చేస్తామని 2023లో అధికారులు ప్రకటించారు. ఒక్క కార్మికుడికి రెండు సెమీ ఆటోమేటిక్, మరో రెండు జకార్డ్ లూమ్స్, ఒక్క స్పన్ వైండింగ్ మిషన్ ఇస్తారు. ఒక్కో షెడ్డులో 96 లూమ్స్, 24 స్పన్వైండింగ్ మిషన్స్ను అమర్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ ఆ లూమ్స్ను కొనుగోలు చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక విధానం ప్రకటించకపోవడంతో సిరిసిల్ల నేతన్నల్లో నిరాశ నెలకొంది. తొలుత ఎంపికై న కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం చెల్లిస్తే.. 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందించేలా ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేశారు. ‘వర్కర్ టు ఓనర్’ అమలులోకి వస్తే సిరిసిల్ల నేతన్నల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. పథకం అమలుకు బీఆర్ఎస్ పోరాట మార్గాన్ని ఎంచుకుని మహాధర్నాకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. సిరిసిల్ల పట్టణంలోని నేతన్నలతో ఆందోళనకు సిద్ధమైంది. కార్మికుడు.. ఆసామి అయ్యేనా ‘వర్కర్ టు ఓనర్’ పథకంపై నేతన్నల ఆశలు సంక్రాంతిలోగా లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న కేటీఆర్ మార్గదర్శకాల ఊసే లేదు.. మగ్గాల జాడ లేదు రూ.374 కోట్లతో 88.03 ఎకరాల్లో వీవింగ్ పార్క్ఇదీ పథకం స్వరూపం స్థలం: పెద్దూరు వద్ద 88.03 ఎకరాలు నిధులు: రూ.373 కోట్లు ఖర్చు చేసినవి : రూ.210 కోట్లు మొత్తం వర్క్ షెడ్లు: 48 పూర్తయినవి: 40 వార్పిన్ షెడ్లు: 04 తొలి విడతగా లబ్ధిపొందే కార్మికులు : 1104 ఆధునిక మరమగ్గాలు : 4416 మగ్గాల కొనుగోలుకు కావాల్సిన నిధులు: రూ.300 కోట్లు ఇప్పటికి బిగించిన లూమ్స్: 04 -
పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు
● అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కరీంనగర్టౌన్: బాల కార్మికుల నిర్మూలనకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఈనెల 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని వివిధ శాఖల సమన్వయంతో పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుకబట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు, సహాయం అవసరమైన పిల్లలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. బాలల సంక్షేమ సమితి చైర్పర్సన్ ధనలక్ష్మి, ఇన్చార్జి జిల్లా సంక్షేమ అధికారి సుగుణ, టాస్క్ఫోర్స్ ఏసీపీ సతీశ్, డీసీపీవో పర్వీన్, చైల్డ్ హెల్ప్లైన్ జిల్లా కో ఆర్డినేటర్ సంపత్యాదవ్, లేబర్ కమిషనర్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, క్వాలిటీ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక్క డివిజనూ
సక్కగ లేకపాయె!ముసాయిదాపై అభ్యంతరాల వెల్లువ కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక సోమవారమే 111 అభ్యంతరాలు వచ్చాయి. జాబితా అస్తవ్యస్తంగా ఉండడంతో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆయా డివిజన్ లకు చెందిన ఆశావహులు, నాయకులు, ఓటర్లు తమ అభ్యంతరాలను నగరపాలక సంస్థ ప్రజావాణిలో అందజేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అభ్యంతరాలను డివిజన్ల వారీగా వేరుచేసి పరిశీలిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్లోని 66 డివిజన్ల వారీగా ఓటర్ల ముసాయదా జాబితాను ప్రకటించగా, ఒక్క డివిజన్ కూడా సక్రమంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దాదాపు ప్రతి డివిజన్లో పక్క డివిజన్, గ్రామీణ, ఇతర ప్రాంత ఓటర్ల వివరాలు వందల కొద్దీ కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం ప్రచురించిన అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు, డివిజన్ల డీలిమిటేషన్ జాబితాల ఆధారంగా, ఇంటినంబర్లు, పోలింగ్ బూత్ల ప్రకారం జాబితాను రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాను సవరించడమే సమస్యకు కారణమైనట్లు ప్రచారం జరుగుతోంది. కొంతమంది ఓటర్లు తమ డివిజన్లో పేర్లు కనపడక, అసలు తమ ఓట్లు ఉన్నాయా లేదా, ఉంటే ఏ డివిజన్లో ఉన్నాయో అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. ఆన్లైన్లో ఓటు ఉన్నట్లు కనిపిస్తున్నా.. డివిజన్ జాబితాలో మాత్రం కనిపించడం లేదు. కాగా 4వ డివిజన్ దుర్శేడ్లో చింతం వంశీ పేరిట మూడు ఓట్లు పక్కపక్కనే వచ్చాయి. ఒక్క రోజే 111.. జాబితాపై అభ్యంతరాలు తెలుపుతూ సోమవారం ఒక్కరో111 అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పటికే 66 రాగా, మొత్తం 187 అభ్యంతరాలు ముసాయిదా జాబితాపై వచ్చాయి. మంగళవారం అభ్యంతరాల స్వీకరణకు చివరిరోజు. కాగా ఓటర్ల జాబితాను సరిచేసి, దొంగఓట్లను తొలగించాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, కమిషనర్ ప్రఫుల్ దేశాయికి వినతిపత్రం అందజేశారు. 18 ఏళ్లు నిండినవారికి కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఇవ్వాలన్నారు. ఆయన వెంట మడుపు మోహన్, వీర దేవేందర్పటేల్, మహమ్మద్ అమీర్, శేఖర్, ఇమ్రాన్, ఆసిఫ్ ఉన్నారు. అలాగే 4వ డివిజన్ నుంచి 5వ డివిజన్లోకి వెళ్లాయని, వీటిని సరిచేయాలని సుంకిశాల సంపత్రావు, మంజుల మల్లారెడ్డి, ఆరె శ్రీకాంత్లు కమిషనర్కు అభ్యంతరాలు తెలియజేశారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల ముసాయిదా జాబితాను సవరించాలని ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ ఫిర్యాదు చేశారు. ఇంటినంబర్ల ఆధారంగా సంబంధిత డివిజన్లో ఓటర్లను పొందుపరచాలని సూచించారు. ఒక ఇంట్లో నలుగురైదుగురు ఉంటే, 20 నుంచి 30 ఓట్లు ఎలా చేర్చారని ప్రశ్నించారు. 7,36,51,64 డివిజన్లలో జరిగిన తప్పిదాలను సవరించాలని బీజేపీ నాయకులు తోట సాగర్, అనిల్, కొమ్మెర రవీందర్రెడ్డి, బండారి ఆంజనేయిలు, శ్రీనివాస్లు కలెక్టర్ పమేలా సత్పతి, నగరపాలక కమిషనర్కు ఫిర్యాదు చేశారు. 7వ డివిజన్కు సంబంధం లేని 1,279 ఓట్లు తొలగించాలన్నారు. 51వ డివిజన్లో మాజీ కార్పొరేటర్ ఇంటిపై 42 ఓట్లు అక్రమంగా చేర్చారని న్నారు.ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని, పూర్తిస్థాయిలో సవరించి ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని కమిషనర్ ప్రఫుల్ దేశాయి అన్నారు. సోమవారం తన చాంబర్లో రాజకీయ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఓటరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని, డివిజన్ల వారీగా ఓటర్ల సవరణ చేసి, తుది జాబితా వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ బూత్లవారీగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల సంఘం అక్టోబర్ 1న ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం మాత్రమే ఈ మ్యాపింగ్ చేయడం జరిగిందన్నారు. ఇతర ప్రాంత్రాల, ఇంటి నంబర్లు లేని ఓట్లను గుర్తించి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ముసాయిదాలో చాలా తప్పులుఉన్నాయని, వాటన్నింటిని సరిచేసిన తుది జాబితా ప్రకటించాలని వివిధ రాజకీయపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. -
హామీల అమలు.. పల్లెకు సొబగులు..
కొత్త సర్పంచులు హామీల అమలు ప్రారంభించారు. ప్రభుత్వ నిధులు విషయాన్ని పక్కనబెట్టి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని పట్టుదలతో ముందుకెళ్తున్నారు. కరీంనగర్ మండలం చేగుర్తి సర్పంచ్ బాషవేణి సరోజనమల్లేశం ముళ్లపొదలు, చెట్లను జేసీబీతో తొలగించారు. దుబ్బపల్లి సర్పంచ్ మోతె ప్రశాంత్రెడ్డి తాగునీటి సరఫరా గేట్వాల్వ్కు మరమ్మతు చేయించారు. నగునూరు సర్పంచ్ సాయిల్ల శ్రావణిమహేందర్ ఎస్సారెస్పీ కాలువలో జేసీబీతో పూడిక తీయించారు. జూబ్లీనగర్ సర్పంచ్ సుద్దాల కమలాకర్ పాఠశాల సమీపంలోని కట్టుకాలువలో పూడిక తొలగించారు. బహుదూర్ఖాన్పేట సర్పంచ్ గుర్రం సంధ్య తిరుపతిరెడ్డి మినరల్ వాటర్ప్లాంట్ ఏర్పాటుకు షెడ్ నిర్మిస్తున్నారు. చెర్లభూత్కూర్లో సర్పంచ్ కూర నరేశ్రెడ్డి డ్రైనేజీ శుభ్రం చేయించారు. చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య పంచాయతీ భవనానికి రంగులు వేయించారు. చేతిబోర్లకు మరమ్మతు చేయిస్తున్నారు. ఇరుకుల్ల సర్పంచ్ బుర్ర రమేశ్గౌడ్ ప్రజల వద్దకు పాలన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు ఫోన్ చేస్తే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. –కరీంనగర్రూరల్ -
ఇసుక లోడింగ్ నిబంధనలు పాటించాలి
● కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం మానకొండూర్ రూరల్/వీణవంక: ఇసుక క్వారీ వద్ద లోడింగ్ చేసే సమయంలో నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, నర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం మండలంలోని పచ్చునూర్, వీణవంక మండలంలాల్లోని మామిడాలపల్లి, చల్లూరు ఇసుక క్వారీలను, ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులను సీసీ గౌస్ ఆలంతో కలిసి పరిశీలించారు. రవాణా చేసే లారీ ఎంట్రీ, ఎగ్జిట్ వివరాలు కచ్చితంగా రికార్డు చేయాలన్నారు. లారీ డ్రైవర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని, వాహనదారులు, ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. వీరి వెంట ఏసీపీ మాధవి, తహసీల్దార్లు విజయ్కుమార్, అనుపమ, టీజీఎండీసీ విజయ్ తదితరులు ఉన్నారు. తిమ్మాపూర్(మానకొండూర్): హెల్మెట్ను శిరోభారంగా భావించొద్దని, వాహనదారులు రహదారి నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని రూరల్ ఏసీపీ విజయ్కుమార్, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి అన్నారు. జాతీయరోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా సోమవారం వేర్వేరు కార్యక్రమాల్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. అజా గ్రత్త, మద్యం తాగి అతివేగంగా వాహనం నడపడం కూడా కారణమేనన్నారు. యజమానులు కండీషన్ లేని వాహనాలను ఉపయోగించ డం, అనుభవం లేని డ్రైవర్లకు వాహనం అప్పగించడం, ట్రాఫిక్ సిగ్నల్ పాటించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వా హనం నడిపేటప్పుడు సామాజిక బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించడంతోపాటు ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ వినియోగించరాదని అన్నారు. కార్యక్రమంలో సీఐ సదన్కుమార్, ఎస్సై శ్రీకాంత్గౌడ్, ఎంవీఐ రవికుమార్ పాల్గొన్నారు. రామడుగు(చొప్పదండి): మండలంలోని దేశరాజ్పల్లి గ్రామ శివారులో చెరువుకట్ట కింద పొలాల్లో ఆదివారం రాత్రి పులి సంచరించినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలాల గట్టుపై పులి అడుగులు కనిపించినట్లు రైతులు తెలిపారు. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారులు పరిశీలించి పులి అడుగులుగా నిర్ధారణ చేయాల్సి ఉంది. కొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ విద్యు త్ వినియోగదారులకు మెరుగైన సేవలందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను మరింత విస్త్తృత పరిచినట్లు కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. కార్పొరేట్ కార్యాలయం నుంచి టోల్ ఫ్రీ సేవలు నిర్వహిస్తారని, 16 సర్కిళ్ల వినియోగదారులు సద్విని యోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ల ఫేయిల్యూర్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, కరెంట్ బిల్లులో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీటర్ల మార్పు, అన్నిరకాల కొత్త సర్వీసుల మంజూరుకు సంబంధించి పేరు మార్పు, కేటగిరీ, లోడ్ మార్పు తదితర సమస్యలకు టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించి సేవలు పొందాలని కోరారు. 24/7 అందుబాటులో ఉండే ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
బెల్ట్ షాపులు నిషేధం.. తిరగబడిన నిర్వాహకులు
వెల్గటూర్: బెల్ట్షాపులు వద్దన్నందుకు సర్పంచ్పైకే నిర్వాహకులు ఎదురుతిరిగిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబర్పేటలో సోమవారం చోటుచేసుకుంది. ఇటీవలి ఎన్నికల్లో సర్పంచ్గా విజయం సాధించిన దర్శనాల నరేశ్.. గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై నిర్వాహకుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో ఉదయం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి తీర్మానించారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని నిర్వాహకులకు సూచించారు. నిర్ణయానికి వ్యతిరేకంగా బెల్ట్షాప్ నిర్వహిస్తే మొదటిసారి రూ.20 వేలు, రెండోసారి రూ.30వేలు, మూడోసారి రూ.50 వేల జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఈ తీర్మానంపై గ్రామంలోని బెల్ట్షాప్ నిర్వాహకులు తిరగబడ్డారు. ఎవరినడిగి ఏకపక్షంగా నిర్ణయాలు చేశారంటూ సర్పంచ్పైనే మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి మందు పంపిణీ చేయవచ్చుగానీ.. ఇప్పుడు గ్రామంలో మద్యనిషేధం అంటూ బెల్ట్షాపులను నిషేధిస్తారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్ట్షాప్లు మూసివేస్తే కిరాణ దుకాణాలూ మూసేస్తామని తెలి పా రు. ఈ విషయంలో బెల్ట్షాప్ నిర్వాహకులు, పంచాయతీ పాలకవర్గానికి మ ధ్య వాగ్వాదం జరిగింది. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవవరకూ కిరాణషాపులు తెరిచేది లేదంటూ నిర్వాహకులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
సర్దుబాటు సాధ్యమేనా?
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఓటర్ల ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు వెల్లువెత్తుతుండడంతో సరిచేయడానికి అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాల్సి ఉండగా.. తప్పులు సరిచేసేందుకు కుస్తీ పడుతున్నారు. అభ్యంతరాల స్వీకరణకు రెండు రోజులు గడువు విధించినా, ఇప్పటికే పరిస్థితి అర్థం కావడంతో జాబితా సరిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వేల సంఖ్యలో తప్పులు దొర్లడంతో అందులో ఎన్నింటిని సరిచేస్తారు, అసలు సర్దుబాటు చేయడం సాధ్యమేనా అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డూప్లికేట్ ఓటర్లను తొలగించే అధికారం నేరుగా లేకపోవడంతో నగరపాలకసంస్థ అధికారులు కచ్చితమైన హామీ ఇవ్వలేకపోతున్నారు. వేలల్లో తప్పులు నగరపాలకసంస్థ ఎన్నికలకు డివిజన్లవారీగా రూ పొందించిన ఓటర్ల ముసాయిదా గందరగోళంగా మారింది. ఏ ప్రాతిపదికన జాబితా రూపొందించారో అర్థం కాక, ఓటర్లు, ఆశావహులు, నాయకులు అయోమయానికి గురవుతున్నారు. 66 డివిజన్లలో ఇతర డివిజన్, ప్రాంతాల ఓట్లు లేని డివిజన్ లేదంటే అతిశయోక్తి కాదు. ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్లో ఇంటినంబర్లు, పోలింగ్ బూత్లవారీగా ఉండాల్సినప్పటికీ, ఆ పరిస్థితి ఏ డివిజన్ జాబితా లోనూ కనిపించడం లేదు. ఒక్కో డివిజన్లో 30 నుంచి 60 పోలింగ్ బూత్ల ఓట్లు రావడం, చాలా ఇంటినంబర్లకు సంబంధించి వరుస క్రమంలో ఓట్లు రాకపోవడం, అసలు ఇంటి నంబర్లే లేని ఓట్లు ఉండడం గందరగోళానికి దారి తీస్తోంది. తొలగించేది లేదు ఓటర్ల ముసాయిదాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించి, సంబంధిత డివిజన్ నాయకులు నగరపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. పేర్లు, సీరియల్ నంబర్లతో సహా ఆధారాలతో అధికారుల ముందుంచుతున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రకారం ముసాయిదా రూపొందించారు. అందులోని పేర్లన్నింటిని ఇంటినంబర్లు, పోలింగ్బూత్లవారీగా ఆయా డివిజన్లలో సర్దుబాటు చేశారు. దీంతో డివిజన్లవారీగా జాబితా రూపొందించడంతో, డూప్లికేట్ ఓటర్లను గుర్తించడం సులువుగా మారింది. ఆ డూప్లికేట్ ఓట్లను గుర్తించినప్పటికీ, జాబితా నుంచి తొలగించే అధికారం నగరపాలకసంస్థ అధికారులకు లేదు. దీంతో డూప్లికేట్ ఓట్ల సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారింది. ఇంటినంబర్లు లేకుండా ఉన్న ఓట్లను కూడా తొలగించే అధికారం బల్దియాకు లేదు. దీంతో ఇంటినంబర్లు లేనప్పటికి, ఏదో ఒక డివిజన్లో ఆ ఓట్లను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అసలు డివిజన్కు సంబంధం లేని ఓట్లు కూడా తప్పని పరిస్థితిలో అలానే ఉంచే అవకాశం ఎక్కువగా ఉందంటూ నాయకులు ఆందోళన చెందుతున్నారు. 64వ డివిజన్లో 721 ఓట్లు గుర్తింపు ప్రతి డివిజన్లోనూ సంబంధం లేని ఓట్లు నమోదు కావడం సమస్యకు మరింత కారణమవుతోంది. నగరంలోని 64వ డివిజన్లో సంబంధం లేని ఓట్లు 721 ఉన్నట్లు మాజీ కార్పొరేటర్ వాల రమణారావు ఆదివారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి పేర్లతో కూడిన జాబితా అందజేశారు. 2వ డివిజన్లో సంబంధం లేని 300 ఓట్లు వచ్చాయని, వీటిని తొలగించాలని మాజీ కార్పొరేటర్ కొలగాని శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 7వ డివిజన్లో అదనంగా వచ్చిన ఇతర ప్రాంతాల 1275 ఓట్లను తొలగించాలని బీఆర్ఎస్ నాయకుడు గూడెల్లి రాజ్కుమార్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏదేమైనా ఓటర్ల ముసాయిదా జాబితాను సవరించి, తుది జాబితా ను రూపొందించడం నగరపాలకసంస్థ అధికారులకు పెద్ద సవాల్గా మారింది. -
‘చిరు’సాయం.. నవోదయం
కరీంనగర్టౌన్: జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, కార్మికశాఖ సంయుక్తంగా యేటా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట అనాథల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇటీవల ఆపరేషన్ స్మైల్ ప్రారంభం కాగా.. ఈనెల 2న సర్వేబృందం కరీంనగర్ ప్రాంతంలోని ఓ రైస్ మిల్లో బాలకార్మికుడి గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు శిశు సంక్షేమశాఖ అధికారులు వెల్లడించారు. ఎవరెవరిని సంరక్షిస్తారంటే.. బిక్షాటన చేసేవాళ్లు, తప్పిపోయిన చిన్నారులు, బస్టాండ్ల్లోని బాలలు, వీధి, అనాథ, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెత్త సేకరించే వారు, మతి స్థిమితం లేనివారిని రక్షిస్తారు. బాల్య వివాహా లను అడ్డుకుంటారు. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే విభాగాల్లో చిన్నారులను గుర్తించి సంరక్షిస్తారు. సందర్భానుసారంగా ఆయా యజమానులు, నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తారు. అనాథ బాలల సంరక్షణలో భాగంగా సీడబ్ల్యూసీ (బాలల సంక్షేమ సమితి)ఎదుట హాజరుపర్చుతారు. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతారు. శాఖల సమన్వయంతో ఆర్థిక ఇబ్బందులు, అవగాహన రాహిత్యం, పాఠశాలలు దగ్గరలో లేకపోవడంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపిస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం యేటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. పోలీసు, బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, ఇతరశాఖలు, స్వచ్ఛంద సంస్థలతో తనిఖీలు నిర్వహిస్తూ బాల కార్మికులకు విముక్తి కల్పిస్తున్నారు. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్ల కు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కోబృందంలో ఎస్సై, హెడ్కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ ఉంటారు. జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్యాశాఖల సమన్వయంతో వ్యాపారసంస్థలు, ఇ టుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీ చేస్తున్నారు. వీధి బాలలు, బాల కార్మికులు, డ్రాపౌట్లు, వేధింపులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు. అదృశ్యమైన చిన్నారుల వివరాలను దర్పణ్ యాప్లో నమోదు చేస్తున్నారు. తద్వారా ఆచూకీ లభించే అవకాశముంది. ఐదేళ్లల్లో ఆపరేషన్ ము స్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా జిల్లాలో 587మందిని గుర్తించి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.జిల్లాలో కార్యక్రమం ఇలా..సంవత్సరం ఆపరేషన్ ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ 2021 244 45 2022 58 31 2023 17 07 2024 19 25 2025 39 10231 వరకు కార్యక్రమం ఈనెలాఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కొనసాగుతుంది. ఏటా ప్రత్యేకడ్రైవ్ చేపట్టి బాల కార్మికులను గుర్తిస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పనిలో పెట్టుకునే యాజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఆపదలో ఉన్నవారి సమాచారం కోసం పోలీసు, రెవెన్యూ, శిశుసంక్షేమ, విద్య, కార్మిక విభాగం అధికారులతో పాటు చైల్డ్లైన్(1098)కి ఫోన్ చేస్తే రక్షణ కల్పిస్తాం. – సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి -
మీకేం కాదని..
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026మేమున్నామని..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో జరిగిన అక్రమాల విషయంలో మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. గత వీసీల హయాంలో జరిగిన అక్రమాల విషయంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయి ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు ఇటీవల నివేదిక సమర్పించారు. త్వరలోనే కొందరు విచారణ నివేదిక మీద ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుందని అంతా అనుకుంటున్న క్రమంలో కొందరు పైరవీకారుల రంగప్రవేశం చర్చనీయాంశంగా మారింది. తాము విచారణ నివేదికను తొక్కిపెడతామని, బుట్టదాఖలు చేస్తామని, ఎలాంటి చర్యలూ లేకుండా కాపాడతామంటూ బయల్దేరారు. అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వచ్చిన సమయంలో పనిచేసిన వర్సిటీ మాజీ, ప్రస్తుత సిబ్బందికి ఏకంగా అభయమిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాపాడుతామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఏయే అంశాలపై ఫిర్యాదు చేశారంటే.. ప్రభుత్వ జీవోను తుంగలో తొక్కి నాన్ టీచింగ్ సిబ్బందిని ఇష్టానుసారంగా నియామకం చేయడం, యూజీసీ నియమనిబంధనలు పాటించకుండా రిటైర్డ్ అధ్యాపకులను నియమించడం, అర్హత లేకపోయినా నచ్చిన వారిని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లుగా అక్రమ క్యాష్ ప్రమోషన్లు ఇవ్వడం, 12బీ యూజీసీ గుర్తింపు కోసం తప్పుడు నివేదికలతో ఐదుగురు కాంట్రాక్టు అధ్యాపకులను తప్పుడు ఆరోపణలతో తొలగించారు. అంతేకాకుండా రెగ్యులర్ కోర్సులుగా నడుస్తున్న నాలుగు డిపార్ట్మెంట్లను సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చడం, అర్హతలేని వ్యక్తిని ఫైనాన్స్ ఆఫీసర్గా, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేకపోయినా రిటైర్డ్ ప్రొఫెసర్ను నియామకం చేసుకోవడం, ఫోన్ ట్యాపింగ్ పేరిట సిబ్బందిని బెదిరించారంటూ ఆరోపిస్తూ విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలు తెలుసంటూ.. శాతవాహన యూనివర్సిటీలో మాజీ ఉపకులపతి హయాంలో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని పలు ఆధారాలతో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, విజిలెన్స్ డీజీకి 2024 జూన్ 18న ఫిర్యాదు వెళ్లింది. శాతవాహన ప్రొటెక్షన్ డెవలప్మెంట్ ఫోరం తరఫున కోట శ్యాంకుమార్, శ్రవణ్ దాదాపు 15 అంశాలపై పెద్ద నివేదికను ఆధారాలతో సహా సమర్పించారు. దీనిపై 2024 జూలై, ఆగస్ట్లో విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాదాపు 15 నెలల అనంతరం పూర్తి నివేదికను కరీంనగర్ విజిలెన్స్ కార్యాలయం నుంచి 2025 సెప్టెంబర్లో రాష్ట్ర విజిలెన్స్ కార్యాలయానికి పంపారు. ఇప్పుడు హైదరాబాద్లోని విజిలెన్స్ ఉన్నతాధికారుల వద్ద నివేదిక ఉంది. గతంలో వర్సిటీలో పనిచేసిన కొందరికి గత ప్రభుత్వ పెద్దలతో బంధుత్వం ఉందని, వారిలో కొందరు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారు విజిలెన్స్ నివేదికపై చర్యలు లేకుండా అడ్డుకోగలరని చెబుతున్నారు. దీంతో విజిలెన్స్ విచారణను తొక్కిపెట్టేందుకు తాము సహకరిస్తామని, ఇతర ఉద్యోగుల వద్ద పైరవీలకు దిగుతున్నారు. వీరికి చెక్పెట్టేలా వర్సిటీలో జరిగిన అక్రమాలపై వెంటనే చర్యలు చేపట్టాలని విజిలెన్స్ డీజీ, ముఖ్యమంత్రిని విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
ఎంఈవోల ప్రైవేటు దోస్తీ!
కరీంనగర్టౌన్: జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 15 మండలాలకు ఇన్చార్జి ఎంఈవోలే పనిచేస్తున్నారు. ఎంఈవో ప్రమోషన్లలో నెలకొన్న సందిగ్ధతతో సీనియర్ హెచ్ఎంలను ఎంఈవోలుగా కొనసాగిస్తున్న విష యం తెలిసిందే. విద్యాసంవత్సరం ప్రారంభమై ఏడునెలలు గడుస్తున్నా ఏ ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేసిన దాఖలాలు అంతంతమాత్రమే. ఎమ్మార్సీలకే పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాకేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండలకేంద్రాల్లో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నా చర్యలకు వెనకాడుతున్నారు. చాలా మంది ప్రైవేట్ స్కూళ్లకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. నిబంధనలకు విరుద్ధంగా టాలెంట్ టెస్ట్లు విచ్చలవిడిగా నిర్వహించడం చూస్తుంటే వారి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఐటీ, ఒలింపియాడ్ తదితరాల ముద్దు పేర్లను జోడించి యథేచ్ఛగా ప్రచారం నిర్వహిస్తున్న చూసీచూడన ట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాకేంద్రంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో పుస్తకాలు అమ్ముతున్న తీరును పసిగట్టిన విద్యార్థి సంఘాల నాయకులు డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు పాఠశాలల రూంలను సీజ్ చేసినా మళ్లీ తెరవడం గమనార్హం. పుట్ట్టగొడుగుల్లా ప్రైవేట్ స్కూళ్లు జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో గతంలో ఒక్క పాఠశాలకు అనుమతి తీసుకొని అదే పేరున రెండుమూడు పాఠశాలలు నడిపిన సందర్భాలు ఉన్నాయి. అనుమతులు లేకుండానే జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. కార్పొరెట్స్థా యి స్కూళ్ల విషయంలో మండల విద్యాధికారులు మీనవేషాలు లెక్కిస్తున్నారని అంటున్నారు. అనవసర విషయాల్లో జోక్యం ప్రభుత్వ పాఠశాలల పనితీరుతో పాటు అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలలపై ఎంఈవోల ఆజమాయిషీ ఉంటుంది. కొందరు ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణను వదిలి తమకు ఆదాయం వచ్చే విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలున్నా యి. జిల్లాలో 654 ప్రభుత్వ, 800పైగా ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటి పర్యవేక్షణకు పూర్తిస్థాయి ఎంఈవోలు లేక విద్యాశాఖ పరిస్థితి గందరగోళంగా మారిందన్న విమర్శలున్నాయి. ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల వ్యవహారంలో జిల్లాలోని ఎంఈవో కార్యాలయాల్లో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల అసోసియేషన్ నాయకులు, డీఈవో కార్యాలయంలో కొంత మంది కలిసి ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. -
కేసీఆర్ స్వార్థ నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం
● ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం హుజూరాబాద్/హుజూరాబాద్ రూరల్: కేసీఆ ర్ స్వార్థ నిర్ణయాలతోనే రాష్ట్రానికి తీరని నష్టం వాటిల్లిందని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హుజూరాబాద్లో ఆదివారం మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజ లను మోసం చేసిందని మండిపడ్డారు. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత, అవినీతితోనే ప్రాజెక్టు కట్టిన కొద్దిరోజులకే కూలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జూరాలలో కట్టాల్సిన ప్రాజెక్టును శ్రీశైలం దగ్గరకు మార్చడం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు స్థల మార్పిడి వెనుక ఉన్న నిధుల దుర్వినియోగంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల్లో జరిగిన అవినీతిపై ప్రభుత్వం సమగ్ర చర్చ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవా లని ఆయన డిమాండ్ చేశారు. హుజూరాబాద్ పరిసర ప్రాంత ప్రజల ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమించే డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. డీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పలకల ఈశ్వర్రెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని ‘ఉద్యమాల ఉపాధ్యాయుడు పలకల ఈశ్వర్రెడ్డి’ సంచికను ఆవిష్కరించారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవాల న రహరి, చకినాల రాంమోహన్, వీక్షణం సంపాదకుడు వేణుగోపాల్, గంగాధర్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిశీలించి సరిచేయాలికరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. ఆదివారం నగరపాలక సంస్థలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. అభ్యంతరాల పరిశీలన, డివిజన్లవారీగా ఓటర్ల మ్యాపింగ్పై చర్చించారు. ప్రచురించిన ఓటర్ల జాబితాపై వచ్చే అభ్యంతరాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. ఎలాంటి లోటుపాట్లు జరగకుండా డివిజన్, పోలింగ్ బూత్ ప్రకారం మ్యాపింగ్ చేయాలని సూచించారు. జాబితాను డివిజన్ ఓటర్ల ప్రకారం ఎలాంటి పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, సరైన పద్ధతిలో ఓటరు జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణుమాధవ్, ఏసీపీలు వేణు, శ్రీధర్ పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియకరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియ అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నా రు. నగరపాలకసంస్థ పరిధిలోని రేకుర్తిలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి సమ్మక్క సారలమ్మ గద్దె వైపు వెళ్లేందుకు రూ.15 లక్షలతో చేపట్టనున్న 200 మీటర్ల సీసీరోడ్డు పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు. హుస్సేనీపురలోని 33వ డివిజన్, 32వ డివిజన్ కొంత భాగం మెయిన్ రోడ్డు వరకు రూ.15 లక్షలతో 200 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణ పనులకు రూ.5 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. డివిజన్ ప్రజలు, స్థానిక నాయకుల కోరిక మేరకు తాము సుడా నిధులతో ఆ రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. డీఈ రాజేంద్ర ప్రసాద్, ఏఈ సతీశ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, ఎండీ.తాజ్, జక్కుల నాగరాణి ,ఎండీ.చాంద్, అస్తాపురం రమేశ్, అస్తాపురం తిరుమల, షబానా మహమ్మద్, లాయక్, సయ్యద్ ఖలీల్ పాల్గొన్నారు. -
టెన్షన్ వద్దు
కరీంనగర్టౌన్: విద్యార్థి జీవితాన్ని కీలకమలుపు తిప్పేది పదోతరగతి. ఇక్కడవేసే అడుగు భవితకు బాటు వేస్తుంది. మరో 70 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 14,196మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఫిబ్రవరి, మార్చి విద్యార్థులకు పరీక్షల కాలమే. ఏడాది పొడవునా పాఠ్యాంశాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు ఆఖరు పరీక్షలు కావడంతో సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించి, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు చివర్లో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనకబడిన సందర్భాలు అనేకం. ఈ సమయంలో విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మాంసాహారానికి దూరంగా ఉంటూ సాత్విక ఆహారం తీసుకోవాలి. తద్వారా పోషకాలు లభించడంతో పాటు మానసికంగా ఉత్సాహం చేకూరుతుంది. పండ్లు,కూరగాయలు తినడం ద్వారా మెదడు చురుగ్గా పనిచేస్తుంది.పరీక్షలకు చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలి. మొదటి, రెండో పేపర్లకు మాదిరి ప్రశ్నాపత్రాలు తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలు రాయాలి. క్వశ్చన్ బ్యాంక్లోని చిన్న, పెద్ద ప్రశ్నలను చదవాలి. రోజు ఆరు పాఠ్యాంశాలు విధిగా చదవాలి. ఉదయం 4.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయపాలన రూపొందించుకోవాలి. ఏడాదికాలంలో చదివిందంతా రెండున్నర గంటల్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి అక్షర దోషాలు, కొట్టివేతలు లేకుండా అన్ని అక్షరాలు సమానంగా, తలకట్టు, గుడి ఒకేలా, గుడి దీర్ఘాలు పెద్దగా, చిన్నగా కాకుండా సరిపడేలా రాయాలి. జవాబులు అందంగా రాసేలా మెరుగు దిద్దుకోవాలి. ఇష్టంగా చదివితే ఉత్తమ ఫలితాలు ‘పది’ సూత్రాలు పాటిస్తే ప్రయోజనాలు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడి మాయం తల్లిదండ్రులు తోడ్పాటునందించాలిఆహారం ఎంతో కీలకంచక్కటి ప్రణాళిక -
ఎనిమిది నెలలకే నూరేళ్లు
కోనరావుపేట(వేములవాడ): ఇద్దరు కూతుళ్ల తర్వాత కొడుకు పుట్టాడని ఎంతగానో సంతోషపడ్డారు. వారి సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఎనిమిది నెలలకే మృత్యువాత పడడంతో ఆ తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు. రాజన్నసిరిసిల్ల కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన జాగిరి అనిల్–సుస్మిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు శ్రీహర్షిక(6), ఆరాధ్య(4), కొడుకు వేదాంత్(8 నెలలు) ఉన్నారు. కొంతకాలంగా వేదాంత్ న్యూమోనియాతో బాధపడుతున్నాడు. సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో వైద్యం చేయించినా తగ్గకపోవడంతో హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారి వేదాంత్ మృతిచెందాడు. మహిళకు తీవ్రగాయాలు జమ్మికుంట: ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి మహిళ తీవ్రగాయాలపాలైంది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన బండారి స్వరూప జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చింది. తిరిగి వెళ్లేందుకు జమ్మికుంట బస్టాండులో బస్సు ఎక్కింది. ప్రమాదశాత్తు కాలుజారి కింద పడింది. తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయింపుకొడిమ్యాల: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు ముఖంచాటేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియురాలు ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన మండలంలోని నాచుపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన ఓ యువతి, ఓ యువకుడు కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. యువతి పెళ్లి చేసుకుందామని నిలదీయడంతో ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి యువకుడి ఇంటిముందు బైఠాయించి న్యాయం చేయాలని వేడుకుంది. వాహనం ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం ఇల్లంతకుంట: మండలకేంద్రంలోని వివేకానంద చౌరస్తా వద్ద ఆదివారం బ్లేడ్ బండి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగింది.సెస్ విద్యుత్ కాంట్రాక్టర్ వెంటనే స్పందించి సిబ్బందితో విరిగిన స్తంభం స్థానంలో కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసిన విద్యుత్తీగలను సరిచేశారు. సెస్ ఏఈ నగేశ్కుమార్, లైన్మెన్ ఎల్లయ్య, హెల్పర్ తిరుపతి విరిగిన స్తంభాన్ని అక్కడ నుంచి తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు. -
ప్రజెంటేషన్ ముఖ్యం
విద్యార్థులు తెలివి తేటలు జ్ఞాపకశక్తి కన్నా పరీక్షల్లో ప్రజంటేషన్ కీలకం. చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి గురై తెలిసిన ప్రశ్నలకు సైతం జవాబులు రాయలేరు. పిల్లలను స్వేచ్ఛగా చదవనివ్వాలి. ఏ సమయంలోనైనా పరీక్షను సులభంగా రాయగలిగేలా తీర్చిదిద్దాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయు కృషితోనే ఇది సాధ్యం. – అట్ల శ్రీనివాస్రెడ్డి, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ఏడాది శ్రమ వృథా అవుతుంది పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనైతే ఏడాది కష్టం వృథా అవుతుంది. తెలిసిన అంశాలకు స్పష్టమైన సమాధానాలు రాయాలి. మనోవిజ్ఞానికంగా ఉన్న విషయ పరిజ్ఞానాన్ని వ్యక్తం చేస్తే మంచి మార్కులు వస్తాయి. పరీక్షల కోసం చదివేటప్పుడు మాత్రమే లక్ష్యం ఉండాలి. – గాజుల రవీందర్, ఉపాధ్యాయుడు, జెడ్పీ పాఠశాల సప్తగిరికాలనీటీవీలు బంద్ చేయడం ఉత్తమం తల్లిదండ్రులు ఎక్కువ సమయం టీవీల ముందు కాలక్షేపం చేస్తే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుంది. పరీక్షలు ముగిసేంత వరకు తల్లిదండ్రులు ఎంతో కొంత త్యాగం చేయాలి. లేదంటే తమ పిల్లల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. బయట ఆహారానికి పుల్స్టాప్ పెట్టి ఇంటి వంటలే చేసి పెట్టాలి. – శనిగరపు రవీందర్, గణిత ఉపాధ్యాయుల -
ఆలిండియా వాలీబాల్ పోటీలకు ఎంపిక
జూలపల్లి(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన సుల్తాన్ సాగర్ రామగుండం కమిషనరేట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల ఆలిండియా పోలీస్ వాలీబాల్ సెలెక్షన్లో సెలెక్ట్ అయ్యాడు. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జరిగే ఆలిండియా పోలీస్ జట్టుకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నట్లు సీనియర్ క్రీడాకారుడు ఆవుల రాజు తెలిపాడు. సాగర్ ఎంపికపై గ్రామస్తులతో పాటు సీనియర్ క్రీడాకారులు ఆమరగాని గంగాధర్, కమలాకర్రెడ్డి, వెంకటేశ్, ఖాజామియా, సతీశ్, శేఖర్, మహేశ్, రాకేశ్ తదితరులు అభినందించారు. రాష్ట్ర వాలీబాల్ జట్టు కోచ్గా సయ్యద్ ఖాజాబీ పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో జరిగే 69వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయస్థాయి అండర్–14 బాలికల వాలీబాల్ జట్టు కోచ్గా చందనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు సయ్యద్ ఖాజాబీ ఎంపిక అయినట్లు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, జిల్లా సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మన్, జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి సురేశ్ తెలిపారు. ఖాజాబీ ఎంపికపై జిల్లా విద్యాధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీఎం షేక్, చందనాపూర్ పాఠశాల హెచ్ఎం లక్ష్మి, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ తమ్మన్నవేని రాజయ్య, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సురేందర్, దాసరి రమేశ్, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్లు కొమురోజు శ్రీనివాస్, తులా శోభారాణి, శైలజ, మాధవి, మాధురి, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. టిప్పర్ల పట్టివేతసుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఆదివారం పట్టుకున్నట్లు సుల్తానా బాద్ ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. ఎలిగేడు మండలం నుంచి వేబిల్లు లేకుండా మట్టిని టిప్పర్లలో తరలిస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. -
కువైట్లో కనగర్తివాసి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య(55) కువైట్లో గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం కనగర్తికి చెందిన మారుపాక నర్సయ్య గత 15 ఏళ్లుగా ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లి, వస్తున్నాడు. కొంతకాలంగా కరీంనగర్ శివారులోని చింతకుంటలో ఉంటున్నాడు. స్వగ్రామానికి వచ్చేందుకు అన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈక్రమంలోనే ఆదివారం మధ్యాహ్నం తన గదిలో ఉండగా గుండెపోటుతో మృతిచెందాడు. నర్సయ్యకు భార్య పద్మ, కూతురు భవానీ, కుమారుడు దత్తు ఉన్నారు. -
కుట్టుమిషన్తో ఉపాధి
మాది కోనరావుపేట మండలం మామిడిపల్లి. నేను నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ శిక్షణ కేంద్రంలో కుట్లు, అల్లికల్లో శిక్షణ పొందాను. రెండు నెలల శిక్షణ పొందిన తర్వాత మా గ్రామంలోనే స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అన్ని రకాల అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మహిళలకు ఉపయోగకరంగా ఉంది. – ప్రవళిక, మామిడిపల్లి,కోనరావుపేట నాణ్యమైన శిక్షణ అందిస్తున్నాం నాగారంలో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసినప్పటి నుంచి వివిధ వృత్తిపరమైన శిక్షణలు అందిస్తున్నాం. చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా యువకులు వచ్చి వివిధ అంశాలను నేర్చుకుంటున్నారు. వచ్చిన వారందరికీ నాణ్యమైన శిక్షణతోపాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నాం. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న యువకులకు తగిన ఉపాధి కూడా కల్పిస్తున్నాం. – ఎం.మహేశ్, సెంటర్ ఇన్చార్జి -
కొండగట్టు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం
కరీంనగర్టౌన్: కొండగట్టు ఆలయ అభివృద్ధికి బీఆర్ఎస్ హయంలో ఒక్క రూపాయి వెచ్చించలేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆలయ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సత్యం చేసిన ఆరోపణాలు సరికాదన్నారు. కొండగట్టుకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిధులు తీసుకురావడం శుభపరిణామం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొండగట్టుకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చేసిన వ్యాఖ్యకు మేడిపల్లి సత్యం కట్టుబడి ఉండాలన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే 680ఎకరాల భూమిని కొండగట్టు ఆలయానికి కేటాయించిన విషయం గుర్తు చేశారు. గంట్ల వెంకటరెడ్డి, సాగి మహిపాల్ రావు, ఆకుల మధుసూదన్, చీకట్ల రాజశేఖర్, పూడూరు మల్లేశం, విజయేందర్రెడ్డి, ఉప్పల గంగన్న, నాగ శేఖర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సత్యం అసత్యాలు మాట్లాడొద్దు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
వృద్ధుడికి గాయాలు కోనరావుపేట మండలం నిజామాబాద్ ఎల్లమ్మ గుడి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా పొన్నాజిపేటకు చెందిన రామయ్య(65) తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఎల్లారెడ్డిపేట/కోనరావుపేట: రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి శివారులోని సత్తెపీరీలదర్గా వద్ద ఆదివారం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం గోరింట్యాలకు చెందిన అతికం దత్తాద్రిగౌడ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి బైక్పై ఎల్లారెడ్డిపేటకు వస్తున్నాడు. అదే సమయంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన గంగాధరి కిరణ్ వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో దత్తాద్రిగౌడ్తోపాటు ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. దత్తాద్రిగౌడ్ భార్య మీనా ఫిర్యాదుతో కిరణ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భవితకు బంగారు బాట
కోనరావుపేట(వేములవాడ): గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వృత్తి శిక్షణ ఇచ్చి, ఉపాధి చూపుతుంది జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నాగారంలో ఏర్పాటు చేసిన జీఎమ్మార్ వరలక్ష్మి ఫౌండేషన్ నిరుద్యోగ యువతకు వరంగా మారింది. వివిధ వృత్తిపరమైన శిక్షణ పొందుతూ యువకులు పక్కా ఉపాధి పొందుతున్నారు. ఎనిమిదేళ్లుగా సేవలు కోనరావుపేట మండలం నాగారంలో ప్రతిమ ఫౌండేషన్, జీఎమ్మార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సహకారంతో జీఎమ్మార్ వరలక్ష్మి ఉపాధి శిక్షణ కేంద్రాన్ని 2017 సెప్టెంబర్ 2న ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర అప్పటి గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు, మై హోమ్ రామేశ్వర్రావు ప్రారంబించారు. భవిష్యత్పై భరోసా నాగారంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో మహిళలకు నర్సింగ్, బెడ్సైడ్, టైలరింగ్, హోమ్సైడ్ వర్క్, యువకులకు బైక్ రిపేర్, సోలార్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్పై శిక్షణ ఇస్తున్నారు. వీటితోపాటు ఉత్తమ శిక్షణ, యోగా, క్రీడలు, కంప్యూటర్ శిక్షణ, వ్యక్తిత్వ వికాస తరగతులు, స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు కూడా అదనంగా నేర్పిస్తున్నారు. శిక్షణకాలంలో ఉచిత భోజన సదుపాయం, వసతి కల్పిస్తున్నారు. రోజూ వచ్చి వెళ్లే వారికి ట్రావెలింగ్ చార్జీలు సైతం చెల్లిస్తున్నారు. 1350 మందికి ఉపాధి 2017 నుంచి ఇప్పటి వరకు సుమారు 1,520 మందికి శిక్షణ ఇచ్చారు. ఒక్కో బ్యాచ్కు 20 నుంచి 30 మందిని చేర్చుకుంటున్నారు. 1520 మందికి ఇప్పటి వరకు 1,320 మందికి ఉపాధి కల్పించారు. శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎలక్ట్రికల్లో శిక్షణ పొందాను మాది కోనరావుపేట మండలం నాగారం. మా గ్రామంలో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రంలో ఎలక్ట్రికల్లో రెండు నెలలు శిక్షణ పొందాను. అన్ని రకాల అంశాలపై తర్పీదునిచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రీషియన్గా ఉపాధి పొందుతున్నాను. – బాస అజయ్, నాగారం,కోనరావుపేట స్వయం ఉపాధికి మార్గం నేను కుట్టు, అల్లికలపై రెండు నెలలు శిక్షణ తీసుకున్నాను. శిక్షణ అనంతరం సర్టిఫికెట్ అందించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటూ కుట్టు మిషన్ నడుపుతున్నాను. స్వయం ఉపాధి పొందుతున్నాను. నాగారంలో అందిస్తున్న శిక్షణ యువతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. – శ్రావణి, వేములవాడ యువకుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న జీఎమ్మార్ శిక్షణ ఇచ్చి ఉపాధి చూపుతున్న సంస్థ నాగారంలో ఎనిమిదేళ్లుగా సేవలు -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ: ఆరుగురికి గాయాలు
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం మేడిపల్లిలో ఆదివారం వేకువజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. మెట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్పల్లి నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. మేడిపల్లి వద్దకు చేరుకోగానే.. కమ్మర్పల్లి వైపు నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని కోరుట్ల పట్టణానికి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. కొందరిని మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. -
సీపీఐది వందేళ్ల త్యాగాల చరిత్ర
కరీంనగర్టౌన్: సీపీఐ ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం నిర్వహించిన పార్టీ శతవసంతాల ముగింపు ఉత్సవాలకు హాజరయ్యారు. ముందుగా సర్కస్గ్రౌండ్ నుంచి రెవెన్యూగార్డెన్ వరకు భారీ ర్యాలీ తీశారు. రెవెన్యూ గార్డెన్లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ సీపీఐ డిసెంబర్ 26తో వందేళ్లు పూర్తి చేసుకుందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ నాయకులు స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములయ్యారన్నారు. భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి కార్యక్రమాలు సీపీఐ పోరాటాల ఫలితంగానే అమలయ్యాయన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గొప్పదన్నారు. 3,500 గ్రామాల విముక్తి, 4500మంది ప్రాణాలను త్యాగం చేసిన చరిత్ర సీపీఐదన్నారు. రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ సంఖ్యలో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర సహాయకార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణ శంకర్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి సదానందం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, డీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనిల్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు అందెస్వామి, పొన్నగంటి కేదారి, శంకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, కోయడ సృజన్కుమార్, బోయిని అశోక్ పాల్గొన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి -
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు వృత్తిని నమ్మకుంటూనే ప్రజాసేవకోసం నడుంబిగించారు. ఇంకొందరు నచ్చిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మరికొందరు ఆపదలో మేమున్నామంటూ బయలు దేరుతున్నారు. పలువురు అన్నితామై లాస్ట్ జర్నీ పూర్తిచేస్తున్నారు. ఎవరు ఏ రకంగా ముందుకెళ్తున్నా.. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్... పేదలు మృతిచెందితే వారి దహన సంస్కారాలకు బాధిత కుటుంబ సభు్ుయ్ల నానా అవస్థలు పడుతున్నారు. నా తాత, తండ్రి పేరు నిలబెట్టాలన్న ఉద్దేశంతో వారి జ్ఞాపకార్థం వైకుంఠయాత్ర రథాలను ఏర్పాటు చేశా. ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నా వంతు సాయం అందిస్తున్న. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నా సొంతగడ్డను మర్చిపోకుండా మరిన్ని సేవలు అందిస్తా. – డాక్టర్ మంచాల జ్ఞానేందర్ కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతడి తాత మంచాల రాజేశం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవిగా సిరిసిల్ల ప్రాంతంలో సుపరిచుతులు. జ్ఞానేందర్ తాత, తండ్రి శంకరయ్య జ్ఞాపకార్థం 2013లో ‘మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో మరో వాహనం ఏర్పాటు చేసి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా తన సేవలను ప్రారంభించారు. ఎవరైనా పేదలు మృతిచెందినా ఇదే వాహనంపై అంతిమయాత్ర చేస్తారు. వీటితో పాటు బాడీఫ్రీజర్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. పైగా బాధితులు అత్యంత పేదలని తెలిస్తే 50 మందికి సరిపడా భోజనం కూడా పంపిస్తారు. ఇలా ఇప్పటి వరకు సిరిసిల్ల, హైదరాబాద్, నిజామాబాద్లో సుమారు 21,280 పేద కుటుంబాలకు చెందిన మృతదేహాలను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేశారు. అలాగే వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు. కాలనీల్లో వాటర్ట్యాంకర్లతో నీటి సరఫరా, వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ, అనాథలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ తదితర కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా చేపడుతున్నారు. ఇతడి సేవలను గుర్తించి అమెరికాలోని కాలిఫోర్నియా యునైఎడ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు 2016లో డాక్టరేట్ ప్రదానం చేశారు. 2018లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జ్ఞానేందర్కు ఉత్తమ సేవా పురస్కారాన్ని కలెక్టర్ అందించారు. 2017లో మహానటి సావిత్రి సేవా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సామాజిక సేవకుడిగా గిన్నిస్బుక్లోకి ఎక్కారు. జ్యోతినగర్(రామగుండం): ‘మాయమైపోతున్నడమ్మా..మనిషన్న వాడు’ అని తన సెల్ ఫోన్కు కాలర్ ట్యూన్ పెట్టుకుని పేదల ఆఖరి మజిలీకి మడిపల్లి మల్లేశన్న ఆప్తుడిగా నిలిచాడు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మల్లేశ్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి కరోనా సమయంలో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని 20 వేల మంది పేదలకు నిత్యవసర సరుకులు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే నిరుపేదలు మృతి చెందితే వారి ఆఖరి మజిలీకి పాడెకట్టెలు, బాధిత కుటుంబాలకు భోజనం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 600 మందికి పైగా మృతిచెందిన పేదలకు పాడెకట్టెలు అందించి తన నిస్వార్థ సేవలను కొనసాగిస్తున్నాడు. అనాథ శవాల అంత్యక్రియలు చేయడంలోనే ముందు వరుసలో నిలిచి సేవలు అందిస్తున్నాడు. జ్ఞానేందర్ ఏర్పాటు చేసిన స్వర్గలోకయాత్ర రథం కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ సర్పంచ్గా ఎన్నికై న ముదాం రవి చాలా ఏళ్లుగా ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్నారు. సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి ఉదయం వేళ గ్రామంలోని వాడల్లో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలని సర్పంచ్గా బరిలో ఉండి గెలిచానని, ఉపాధిపరంగా ఎలక్ట్రికల్ షాపులో ఉండి విక్రయాలు జరిపితేనే సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. -
నిరంతరాయ విద్యుత్కు ట్రాన్స్ఫార్మర్లు
కొత్తపల్లి: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే శనివారం కరీంనగర్ టౌన్–1 సబ్ డివిజన్లోని టౌన్–3 సెక్షన్లో రెండు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, టౌన్–1లో 160 కే.వీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, టౌన్–8 సెక్షన్లో 160 కే.వీ ట్రాన్స్ఫార్మర్ను, టౌన్–2 సబ్ డివిజన్లోని టౌన్ 2 సెక్షన్లో మూడు 160 కె.వీ., టౌన్–4లో ఐదు 160 కె.వీ. టౌన్–7లో 100 కె.వీ., టౌన్–9 సెక్షన్లో రెండు 160 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు, కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ తీగలగుట్టపల్లి సెక్షన్లో మూడు 160 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు, నాలుగు 100 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు శనివారం డివిజనల్ ఇంజినీర్ జంపాల రాజంతో కలిసి ఆయన చార్జ్ చేశారు. -
ఓటు ఇక్కడ.. బూత్ అక్కడ
ఒక్క డివిజన్లోనే 66 పోలింగ్ బూత్ల ఓట్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ రూపొందించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల పునర్విభజన జాబితా, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటినంబర్లు, పోలింగ్ బూత్ల ప్రకారం 66 డివిజన్ల ఓటర్ల జాబితాను రూపొందించినట్లుఽ అధి కారులు చెబుతున్నారు. ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఆ పద్ధతి కనిపించడం లేదు. 66 డివిజన్ల జాబితాలను చూస్తే, ఎక్కడా ఒక ఇంటినంబర్ ఓట్లు ఒకేచోట కనిపించడం లేదు. ఇంటినంబర్కు సంబంధించిన ఒక ఓటు ఒక పేజీలో, మరో ఓటు మరో పేజీలో, ఇంకో ఓటు ఎక్కడో కనిపిస్తున్నాయి. దీంతో తమ ఓట్లు మొత్తం తమ ఇంట్లో ఉన్నాయో లేవో తెలియని గందరగోళ పరిస్థితిలో ఓటర్లు తలలు పట్టుకొంటున్నారు. పోలింగ్బూత్ల వారీగా ఓటర్ల వివరాలను తీసుకొని, సంబంధిత డివిజన్లో జతపరచారని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సాధారణంగా ఏ డివిజన్లోనైనా నాలుగు నుంచి ఆరు పోలింగ్ బూత్లు ఉంటాయి. కొన్ని డివిజన్లలో తొమ్మిది ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఒక్కో డివిజన్లో 30 నుంచి 66 పోలింగ్ బూత్లు కూడా ఉండడం గమనార్హం. నగరపాలకసంస్థ 47వ డివిజన్లో అసెంబ్లీ ఎన్నికల వారిగా చూస్తే తొమ్మిది పోలింగ్ బూత్లు ఉండాలి. కాని ఈ డివిజన్లో ఏకంగా 66 పోలింగ్ బూత్లకు సం బంధించిన ఓట్లు ఉన్నాయంటే, జాబితా ఎంత గందరగోళంగా ఉందో ఊహించొచ్చు. ఈ డివిజన్లో కొన్ని పోలింగ్ బూత్ల నుంచి ఒక్క ఓటు మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాదాపు అన్ని డివిజన్లలో పోలింగ్ బూత్ల సంఖ్య గతానికి భిన్నంగా అధికసంఖ్యలో ఉన్నాయి. 64వ డివిజన్ ముకరంపురలో పొందుపరిచిన ఓటు పోలింగ్బూత్ మాత్రం కమాన్ సమీపంలోని షాషామహాల్ వద్ద చూపిస్తోంది. దీనితో ఆ ఓటరు ముకరంపురలో ఓటు వేయాలా, షాషామహల్లో ఓటు వేయాలో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు కాకుండా వేలాది ఓట్లు ఈ రకంగానే ఉండడంతో, వీటిని సరిచేస్తారా, అలానే వదిలేస్తారో అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముసాయిదా జాబితాను ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప, జాబితా గాడినపడే అవకాశం లేదు. -
ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్
కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామసర్పంచ్ చిందం సుధాకర్ ఆర్ఎంపీగా ప్రజలకు సేవలందిస్తున్నారు. సర్పంచ్గా సేవలందించాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. ఆర్ఎంపీగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సాయం అందించానని, ఆ సేవలను గుర్తించి ప్రజలు నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. సర్పంచ్గా గెలిచినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తూ.. తన వృత్తి ఆర్ఎంపీగా పనిచేస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. – సుధాకర్, సర్పంచ్, బొమ్మెన -
చిన్నారికి ‘ఊపిరి’పోయండి
ముస్తాబాద్(సిరిసిల్ల): కూతురు పుట్టడంతో మహాలక్ష్మీ వచ్చిందని వారు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం చిన్నారి అనారోగ్య సమస్యతో ఆవిరైంది. ఐదేళ్ల చిన్నారి అంతుచిక్కని ఊపిరితిత్తుల వ్యాధికి గురై ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉంది. ఆర్థికంగా అంతంతే ఉన్న ఆ కుటుంబ ఆర్థిక సాయం చేయాలని దాతలను వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సూర రాజశేఖర్, రమ్య దంపతుల కూతురు వైష్ణిక(5) ఊపిరితిత్తుల వ్యాధికి గురైంది. కూలీ పనులు చేసుకునే వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వైష్ణికను రెండు నెలల క్రితం బడిలో చేర్పించారు. ఆడుతూ పాడుతూ ఉన్న వైష్ణిక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊపిరి ఆడడం లేదంటూ పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందని, కుడివైపు ఊపిరితిత్తులకు బ్రోంకోగ్రామ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతా పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. మానవతావాదులు, ప్రభుత్వమే తమ చిన్నారిని కాపాడాలని వేడుకుంటున్నారు. చిన్నారి బాలికకు అండగా నిలిచేదాతలు 95153 67957లో సంప్రదించాలని కోరుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో అచేతనస్థితి ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు -
అనాథలకు ఆపన్నహస్తం
రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. -
కలెక్టర్ గారు.. ఇలాగేనా జాబితా
కరీంనగర్ కార్పొరేషన్: కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న నగరపాలకసంస్థ ఓటర్ల ముసాయిదా జాబితా ఇంత అస్తవ్యస్తంగా తయారు చేయడమేమిటని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎంత ముసాయిదా జాబితా అయినా ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదని మండిపడ్డారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. అసలు ఏ విధానాన్ని అనుసరించి ఓటర్ల జాబితా రూపొందించారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరంలోనే అత్యధిక ఓట్లున్న 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలో 1200 ఓట్లు వేరే ప్రాంతానివి చేర్చారన్నారు. మొగిలిపాలం, ఇల్లంతకుంట, బెజ్జంకి, బొమ్మకల్ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 64వ డివిజన్ ముకరంపురలో 4,514 ఓట్లకు గాను 722 ఓట్లు డివిజన్కు సంబంధం లేనివన్నారు. ఇంత దారుణంగా ఎప్పుడు ముసాయిదా జాబితా కూడా లేదన్నారు. ఓట్లు తారుమారు వల్ల రిజర్వేషన్లు కూడా మారిపోతాయన్నారు. ఈ జాబితాతోనే ఎన్నికలు వెళ్తారో కలెక్టర్ చెప్పాలన్నారు. మొత్తం తప్పులు సరిచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం
కరీంనగర్క్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు, బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. డీజేలు, డ్రోన్ల వినియోగంపై 31 వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత ఏసీపీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఆదాయం పెంచుకోవాలికరీంనగర్రూరల్: గ్రామ పంచాయతీ ఆదా యం పెంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్ అన్నారు. శనివారం కరీంనగర్ మండలం నగునూరు జీపీ కార్యాలయాన్ని డీపీవో జగదీశ్, తహసీల్దార్ రాజేశ్ సందర్శించారు. గ్రామ పంచాయతీ ఆదాయ వివరాలను డీపీవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీపీవో, తహసీల్దార్ను సర్పంచ్ సాయిల్ల శ్రావణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సన్మానించారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య, ఆర్ఐ కనకరాజు, ఉపసర్పంచ్ బోనగిరి హన్మంతరావు, వార్డు సభ్యులు దామరపల్లి దామోదర్ రెడ్డి, అర్జున్, సుమన్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22న గురుకులం ప్రవేశ పరీక్షవిద్యానగర్(కరీంనగర్): సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికిగాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం వచ్చేనెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని కరీంనగర్ జిల్లా సమన్వయ అధికారి ఎ.లక్ష్మి తెలిపారు. పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థులు కులం, ఆధార్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో ఈనెల 21 వరకు ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. ఎస్యూ రిజిస్ట్రార్గా సతీశ్ కుమార్సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీశ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీసీ ఉమేశ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం రిజిస్ట్రార్గా ఉన్న జాస్తి రవికుమార్ వన్ ఇయర్ లీన్ పీరియడ్పై కొనసాగారు. లీన్ పీరియడ్ పూర్తి కావడంతో తిరిగి ఉస్మానియా వర్సిటికి వెళ్లారు. సతీశ్కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం అధిపతిగా, పరీక్షల విభాగం కాన్ఫిడెన్షియల్ కంట్రోలర్గా కొనసాగారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీఎఫ్వో ఫీడర్ పరిధిలోని డీఎఫ్వో చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్మాల్, న్యూ అపెక్స్ హాస్పిటల్, సవరన్ స్ట్రీట్, హజ్మత్పుర ప్రాంతాలతో పాటు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.అంబేడ్కర్నగర్ ఫీడర్ పరిధిలోని అంబేద్కర్నగర్, శివాజీనగర్, కిసాన్నగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
గ్రామానికి సర్పంచ్ పండ్ల తోటల వ్యాపారం
ఇల్లంతకుంట(మానకొండూర్): తమ ప్రాంతంలో దొరికే పండ్ల తోటలను కాంట్రాక్ట్ పట్టి వాటిని ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంటాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె గ్రామ సర్పంచ్ చింతమడక కళ్యాణ్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతడికి 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మామిడి, బత్తాయి తోటలు కాయలుగా ఉన్నప్పుడు గంపగుత్తగా పట్టుకొని పండ్లుగా మారిన తర్వాత వాటిని బొంబయి, నాగపూర్, ఢిల్లీ, హైదరాబాద్.. ఎక్కడ ఎక్కువ రేటు పలికితే అక్కడికి తీసుకెళ్లి అమ్ముతానని కళ్యాణ్ తెలిపారు. – చింతమడక కళ్యాణ్, సర్పంచ్, చిక్కుడువాని పల్లె -
అనాథ శవాలకు అన్నీ తానై..
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణా నికి చెందిన రాచమల్ల శేఖర్ ‘సర్వ్ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ పేరిట సమాజ సేవ చేస్తున్నారు. ఈయన అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కోవిడ్ సమయంలో రోగులను అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. ఆ సమయంలో హైదరాబాద్ గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కోవిడ్తో మృతిచెందిన వారిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శేఖర్కు అనాథ శవాలకు అంత్యక్రియలు చేయాలని ఆలోచన వచ్చింది. 2020లో సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు రైల్వే, సివిల్ పోలీసులు సమాచారం అందిస్తే మృతదేహాలను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్, ఆలయాల వద్ద యాచకులకు దుప్పట్ల పంపిణీ, ఉచిత భోజనం అందిస్తున్నారు. ఇతడితో పాటు చందా సంతోష్, రామకృష్ణ సహాయకులుగా వ్యవహరిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు పోలీసులు సమాచారం అందించేవారు. మృతదేహాలను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో పెట్టెవాన్ని. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 90 అనాథ శవాలకు అంత్యక్రియలు చేశాను. – రాచమల్ల శేఖర్, సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్, జమ్మికుంట -
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
రాయికల్: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబంలో విషాదం -
వరి.. రైతన్నకు సిరి
కరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మిల్లులకు చేరింది. వానాకాలం సీజన్కు గానూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఎన్నడూ లేని విధంగా సేకరణ జరిగింది. ప్రాజెక్టులకు నీరు చేరడం, చెరువులు, కుంటలు కళకళలాడటం ఇది ఐదోసారి. ఈ క్రమంలో దిగుబడి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చాటుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడిన ఉమ్మడి కరీంనగర్ తాజాగా వానాకాలం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే టాప్–3లో నిలిచింది. యుద్ధప్రతిపాదికన కొనుగోళ్లు జరిగా యి. ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గత డిసెంబర్ 15వరకు వరకు రైతుల నుంచి సేకరణ చేశామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి వివరించారు. 82187 మంది రైతులు.. 3.32లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో మొత్తం 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మెప్మా, హాకాలు కొనుగోళ్లు నిర్వహించాయి. 82187మంది రైతులు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు 3.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసి, వారి ఖాతాలకు నగదును చేర్చారు. ఇతర జిల్లాల నుంచి ధాన్యం జిల్లాలో ధాన్యం దిగుబడులు ముంచెత్తగా రైస్ మిల్లులు నిండిపోయాయి. మూతబడిన మిల్లులు కూడా తెరచుకోవడం మిల్లుల ప్రాధాన్యతను చాటుతోంది. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో మిల్లులు ధాన్యంతో నిండిపోవడంతో కరీంనగర్ జిల్లాలోని మిల్లులకు కేటాయించారు. దీంతో పాటు ఇతర జిల్లాల ధాన్యం కరీంనగర్ మిల్లులకు తరలిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, మానకొండూర్, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, శంకరపట్నం, హుజూరాబాద్, గన్నేరువరం, చిగురుమామిడి తదితర ప్రాంతాల్లో రైస్మిల్లులున్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. నిర్మల్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ అర్బన్, జగిత్యాల జిల్లాల నుంచి సైతం ఇక్కడికి ధాన్యం తరలించారు.జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు: 322 కొనుగోళ్ల అంచనా: 3,01,880మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది: 3,32,809 మొత్తం రైతులు: 82,187 మొత్తం ధాన్యం విలువ: రూ.788.73కోట్లుగత యాసంగిలో సన్న రకాలకు బోనస్ పడకపోగా 61వేల వేలమంది రైతులు నిరీక్షిస్తున్నారు. సుమారు రూ.50కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ.. నేటికీ స్పష్టత లేదు. కేవలం వానాకాలం సీజన్ బోనస్ మాత్రమే రైతుల ఖాతాకు చేరుతోంది. అదీ కూడా పక్షం, నెల రోజులకు పడుతుండగా కొందరి ఖాతాలో జమకాలేదని సమాచారం. -
బ్రెయిలీ లిపితోనే చదువు
బ్రెయిలీ లిపి లేకుంటే మాలాంటి వారి పరిస్థితి వేరేలా ఉండేది. బ్రెయిలీ లిపితో చదువుకొని జ్ఞానాన్ని పొందుతున్నాం. మా స్కూల్లో బ్రెయిలీ లిపి నేర్చుకున్న టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ భాషలను బ్రెయిలీ లిపిలో సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. – ఎ.నిత్య, 3వ తరగతి చిన్నప్పటి నుంచి నాకు చూపు లేదు. అయినా కళ్లు లేవని బాధ లేదు. బ్రెయిలీ లిపితో చదువుకున్న నుంచి అందరిలాగే పుస్తకాల్లోని పాఠాలను స్పర్శతో చదువుతున్నా. మాది అంధుల పాఠశాలే అయినా.. విద్యతోపాటు సంగీతం, పాటలు, ఆటలు నేర్పిస్తున్నారు. – వి.దుర్గ, 2వ తరగతి బ్రెయిలీ లిపిలోనే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నా. మంచి మార్కులు తెచ్చుకుంటా. మా టీచర్లు అండగా ఉంటున్నారు. బోర్డు ఎగ్జామ్లో స్క్రయిబ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెబుతుంటే 9వతరగతి చదివేవారు నా ఎగ్జామ్ రాస్తారు. – జి.సాయిరాం, 10వ తరగతి -
అజరామరం!
అభీష్టం..అభ్యుదయం..● వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తిలో ప్రతిభ చాటుతూ.. ● కుటుంబ బాధ్యతలు మోస్తూ.. సమాజసేవలో తరిస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఇష్టమైన పనిచేయడం సాధారణం.. ఆ పనినే విభిన్నంగా చేయడం అభీష్టం. అభీష్టాలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభ్యుద యం. అంతటి అభ్యుదయ భావాలతో సమాజంలోని అవసరార్ధులు.. అన్నార్థులు.. అనాథలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా సేవ చేస్తున్నారు. బతుకుదెరువు వెతుకుతూనే.. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కొందరు అన్నార్థుల ఆకలి తీరుస్తుండగా.. మరికొందరు అనాథశవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్. రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.రామగుండం: జీవనశైలిలో మార్పు చేసుకుంటేనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అంటున్నారు. పదిహేనేళ్లుగా పూర్తిగా భోజనం మానేసి ఉదయం వ్యాయామంతో జీవన విధానాన్ని ఆరంభించడం అలవాటుగా మారిందని తెలిపారు. రోజూ ఆహారంగా అంబలి, రాగిజావ, మొక్కజొన్న గటుక, మొలకెత్తిన పెసర్లు, చిరుధాన్యాలు తీసుకుంటానని, తద్వారా చురుగ్గా ఉండి మానసిక ప్రశాంతత పొందగలుగుతాం అని వివరించారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగే క్రమంలో వాహనంలో క్యారెట్, కీరదోస తదితరాలను తీసుకుంటానని, దీంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే తన ఆరోగ్య రహస్యమని వివరించారు. -
చీకటి నుంచి వెలుగులోకి..
● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● నేడు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం కరీంనగర్: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసన ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా.. తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ విద్యలో ప్రతిభ కనబరుస్తున్నారు. చీకట్లో అక్షరాల విత్తనాలను అందిపుచ్చుకునే సమర్థత సాధిస్తున్నారు. నైరాశ్యపు మేఘాలను చీల్చుకొని హృదయాల్లో ఆత్మవిశ్వాసం నింపుకొని అక్షరాలను నేర్చుకుంటూ చీకటి ప్రపంచపు వెలుగు రేఖలుగా నిలుస్తున్నారు. బ్రెయిలీ లిపి అనే మనోనేత్రం ద్వారా ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. బ్రెయిలీ లిపి అంధుల పాలిట ఆశాకిరణంగా మారింది. లూయిస్ బ్రెయిలీ జయంతి పురస్కరించుకొని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం జరుపుకుంటున్నారు. అంచెలంచెలుగా.. సాధారణంగా చదువుకోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేరు కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీనికోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపర్ మీద ఎత్తుగా ప్రింట్ చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత మాత్రం బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కలతో లిపి పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. బ్రెయిలీ చిన్న వయసులోనే చూపు కోల్పోయాడు. అక్షరం, సంఖ్య సూచించడానికి ఆరు చుక్కలను ఉపయోగించి స్పర్శ ద్వారా గుర్తించేలా కోడ్ కనుగొన్నారు. ప్రస్తుతం బ్రెయిలీ కోడ్ ద్వారా గణితం, సంగీతం, కంప్యూటర్ ప్రోగ్రాం చదవడం, రాయడం చేయొచ్చు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలుంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కో అక్షరానికి ఒక్కో నంబర్ ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తుపెట్టుకొని మనో నేత్రంతో చదువుతూ విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణలో 2 పాఠశాలలు కరీంనగర్, మహబూబ్నగర్లో వికలాంగుల శాఖ ద్వారా ప్రభుత్వం అంధుల పాఠశాలలను నెలకొల్పింది. కరీంనగర్ అంధుల పాఠశాలలో వివిధ జిల్లాలకు చెందిన 80 మంది విద్యార్థులుండగా.. ఇందులో 48 మంది బాలురు, 32 మంది బాలికలున్నారు. వీరంతా 1 నుంచి 10వతరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యనందించేందుకు 25 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. నాకు పుట్టుకతోనే అంధత్వం. మాది మహబూబ్నగర్. అక్కడే అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ అనంతరం టీచర్ శిక్షణ పొంది కరీంనగర్లో ఉపాధ్యాయుడిగా 3 నెలల క్రితం జాయిన్ అయ్యాను. ఇదంతా బ్రెయిలీ లిపి చలవే. బ్రెయిలీ లిపి లేకపోతే అంధులకు భవిష్యత్తు లేదు. – డి.భాస్కర్, ఉపాధ్యాయుడు -
ఇయ్యాల సీపీఐ వందేళ్ల సంబరం
కరీంనగర్టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఆదివారం కరీంనగర్లో భారీ ర్యాలీ, బహిరంగ సభను రెవెన్యూ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, అతిథులుగా సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. -
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలరాజ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. బాలరాజ్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరారు. కేటీఆర్ స్పందించి మృతదేహం సగ్రామానికి రావడానికి కృషి చేశారు. బాలరాజ్ మృతదేహం శనివారం ఇంటికి చేరగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సర్పంచ్ ఎలగందుల నర్సింహులు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పందిళ్ల నాగరాణి పరామర్శించారు. జూలపల్లి: కుమ్మరికుంటలో శనివారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దొడ్ల స్వామి(53) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సనత్కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంట గ్రామానికి చెందిన దొడ్ల స్వామి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నా నయం కాక మానసికంగా బాధతుండేవాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వచ్చి ఇంట్లోనే ఉండగా.. భార్య భాగ్య వ్యవసాయ పనులకు వెళ్లింది. కుమార్తె మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోగా.. ఇంటి ముందున్న రేకుల షెడ్డులో స్వామి పైపునకు చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి కుమార్తె చుట్టుపక్కల వారిని పిలిచింది. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ధర్మారం: కొత్తూరు పరిధిలో 4 కరెంట్ మోటార్ల కాపర్ వైరుతోపాటు మోటార్ బాడీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన తాళ్ల రాజేశంగౌడ్, పెనుగొండ అంజయ్య, కొమ్మ బాలయ్య, రేషవేని స్వామికి సంబంధించిన వరి పొలాలు గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్నాయి. ఈ రైతుల పొలాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ పొలాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండడంతో.. రాత్రివేళ దొంగలు మోటార్ సైకిళ్లపై వచ్చి కరెంట్ మోటార్లో ఉన్న కాపర్ వైరుతోపాటు బాడీలను ఎత్తుకుపోయారని భావిస్తున్నారు. శనివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన వారికి మోటార్ కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ● రూ.20వేల చొప్పున వసూలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చేతబడి చేశారని, నయం చేస్తానని ఓ వ్యక్తిటోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంసానిపల్లె, చుట్టుపక్కల గ్రామాల్లో అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తి బిక్షాటన చేస్తూ ఇళ్లలోకి వెళ్లి ‘అమ్మా మీ ఇంటికి అరిష్టం తలిగిందని, చేతబడి చేశారని, తొలగించాలి’ అని మాయమాటలతో నమ్మిస్తూ రూ. 10వేల చొప్పున వసూలు చేసుకున్నట్లు సమాచారం. తనది కాల్వశ్రీరాంపూర్ అని తన ఫోన్ నంబర్కు ఫోన్ పే చేయాలని సదరు వ్యక్తి పలువురికి నంబర్ ఇచ్చాడు. నాంసానిపల్లె గ్రా మానికి చెందిన రాజు అనే బాధితుడి నుంచి నగదు రూ.10వేలు, పోన్ పే ద్వారా రూ.10వేలు తీసుకోగా, శనివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసం చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేశ్ తెలిపారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన తమ్మనవేని సౌజన్య అనే బాలింత శనివారం మృతిచెందింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సౌజన్యను అనారోగ్య సమస్యలతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ఉడాయిస్తున్న మేసీ్త్రలు !
ఇతను ఎకిలిపురం రవి. ఇంటి నిర్మాణం కోసం మేసీ్త్రతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగం పనులు చేసిన మేసీ్త్ర తర్వాత ఉడాయించాడు. అయితే అప్పటికే చేసిన పని కంటే రూ.3లక్షలు అదనంగా వసూలు చేసుకున్నాడు. చేసేదేమి లేక మరో మేసీ్త్రతో మిగతా పనులు చేయించుకున్నాడు. దీంతో అదనంగా రూ.7లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేని పెద్దగంగారం. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు ఓ మేసీ్త్ర వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. మేసీ్త్ర మొదట కొన్ని డబ్బులు తీసుకొని పనులు ప్రారంభించాడు. అంతలోనే మరో రూ.5లక్షలు వరకు మేసీ్త్ర వసూలు చేసుకున్నాడు. డబ్బులు ముట్టిన తర్వాత పనులు చేయకుండా ఉడాయించాడు. మేసీ్త్రకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మోసపోయనాని గ్రహించిన గంగారం మరో మేసీ్త్రకి మిగిలిన పనుల కాంట్రాక్ట్ ఇచ్చాడు. దీంతో అదనంగా రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. -
కేన్సర్ బాధతో మహిళ ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ముప్పు రాజమ్మ(53) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. రాజమ్మ కొన్నేళ్లుగా కేన్సర్తో బాధపడుతోంది. వ్యాధినయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడు..ఇల్లందకుంట: మండలంలోని భోగంపాడు గ్రామానికి చెందిన రత్న నేతాజీ(24) వివాహం కావడంలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నేతాజీ కొద్ది రోజులుగా వివాహం కావడం లేదని బాధ పడుతున్నాడు. గత నెల 30వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు 108లో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. అనారోగ్యం భరించలేక వృద్ధుడు..బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన కూస ఓజయ్య(67) అనారోగ్యం సమస్యలు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. గత మూడేళ్లుగా ఓజయ్య తీవ్రమైన వెన్ను, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తన భవనంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగొద్దని మందలించినందుకు కళాకారుడు.. జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఒగ్గు కళాకారుడు భూమల్ల ఐలయ్య(55)మద్యం మత్తులో ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. ఐలయ్య వ్యవసాయంతోపాటు ఒగ్గు కళలతో మల్లన్న దేవుని పట్నాలు వేసి బతుకుతున్నాడు. రెండురోజుల క్రితం తన ఇంట్లోనే మల్లన్న పట్నాలు వేసుకున్నారు. గురువారం సాయంత్రం మద్యం తాగి గొడవ చేస్తుండగా.. పండుగపూట మద్యం ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపం చెందిన ఐలయ్య రాత్రి పురుగుల మందు తాగిండు. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రధాన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పశు వైద్యసేవలు వినియోగించుకోవాలి
కరీంనగర్రూరల్: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్యసేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి కోరారు. శుక్రవారం కరీంనగర్ మండలం తాహెర్కొండాపూర్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పాడి పశువుల పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం 18ఆవులు, 26 గేదెలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మినరల్ మిక్చర్ ప్యాకెట్లు అందించారు. సర్పంచ్ ఆకుల గిరి, ఉపసర్పంచ్ ఆకుల లావణ్య, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు వినోద్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): రైతులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్శాఖ అధికారులు ‘పొలంబాట’ ద్వారా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సమస్యలు పరిష్కరిస్తున్నారని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. కరీంనగర్ సర్కిల్లో ఇప్పటి వరకు 1,055 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఇందులో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 572 వంగిన స్తంభాలను సరిచేశామని, 2,650 చోట్ల లూజ్ లైన్లను (వేలాడుతున్న వైర్లు) బిగించామన్నారు. అదేవిధంగా 1,343 మధ్య స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ కాకుండా ఉండేందుకు సరైన ఎర్తింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల మోటార్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా నీళ్ల ప్రెషర్ మెరుగ్గా ఉంటుందని రైతులకు సూచించారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.అందుబాటులో యూరియాకరీంనగర్ అర్బన్: జిల్లాలో 3,393 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ సొసైటీల్లో అందుబాటులో ఉంచినట్లు ఇన్చార్జి కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. 2,616 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వివరించారు. సాగు విస్తీర్ణం, రైతుల అవసరాల క్రమంలో సరిపడా యూరియాను తెప్పిస్తామని ప్రకటనలో తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,400జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్కు 110 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: రేకుర్తిలో విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేకుర్తి, సమ్మక్క గద్దెలు, బుడిగ జంగాల కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. సర్వే లాండ్ ఏడీగా కిషన్రావుకరీంనగర్ అర్బన్: భూ కొలతలు, రికార్డులశాఖ ఏడీగా కిషన్రావు బాధ్యతలు చేపట్టారు. ఏడీగా వ్యవహరించిన ప్రభాకర్ను ఆదిలాబా ద్కు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఏడీలను బదిలీ చేయగా కరీంనగర్ ఏడీ ప్రభా కర్కు బదిలీ అనివార్యమైంది. కాగా కిషన్రావు మహబూబ్నగర్ ఏడీగా వ్యవహరించారు. -
టీచర్లలో టెట్ టెన్షన్!
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు. జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్–1, పేపర్–2 పరీక్షకు హాజరయ్యేవారికి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. సెలవు పెట్టి.. కోచింగ్ తీసుకుని.. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం డీఎస్సీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులతోపాటు దేశవ్యాప్తంగా 2012లోపు నియామకమైన టీచర్లంతా టెట్లో అర్హత సాధించాలని గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు రెండేళ్ల వెసులుబాటు ఇచ్చింది. అర్హత సాధించకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపునిచ్చింది. ఈ తీర్పుతో ఇన్సర్వీస్ టీచర్లలో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), తెలుగు, హిందీ భాషా పండిత కోర్సులు చేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడమేంటని సర్వీస్లోఉన్న ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సి ఉండటంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 651 పాఠశాలలున్నాయి. వీటిలో 2,780 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2010 తర్వాత డీఎస్సీ ద్వారా నియామకమైన 393 మంది టెట్ అర్హత సాధించిన వారున్నారు. మిగితా 2,391మందిలో ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంది. ఈ లెక్కన 2334 మంది టెట్ ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. వీరితో పాటు జిల్లాలో నిరుద్యోగులు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 16,393 మంది టెట్ రాయనున్నారు. పరీక్షల కోసం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు మూడు నెలలుగా కుస్తీ పడుతున్నారు. కొందరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. లీజర్, భోజన విరామ సమయాల్లో చదువుకున్నారు. మరికొందరు సెలవుపెట్టి కోచింగ్ తీసుకున్నారు. పిల్లలు, బంధువులతో సందేహాల నివృత్తి ఇన్సర్వీస్ టీచర్లలో చాలామంది 20ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వీరంతా టెట్–2 అర్హత సాధించాల్సి ఉండటంతో సందేహాలను నివత్తి చేసుకునేందుకు కొంతమంది పిల్లలు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్ష వేళ.. బోధన ఎలా? టెట్ రాసేందుకు చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న ప్రాథమిక పాఠశాలల్లో, ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి మైనర్ మీడియం స్కూళ్లలో పని చేసే టీచర్లు పరీక్షకు హాజరైతే పిల్లలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాలనాయకులు వాపోతున్నారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో గల శాంసంగ్ షోరూం సమీపంలో డిసెంబర్ 31 సాయంత్రం జరిగిన కొలగాని అంజయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్య వద్ద చిట్టీ వేసి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న బాసోజి శ్రీనివాస్ను అంజయ్య చిట్టీ డబ్బులు అడిగినందుకు పథకం ప్రకారం శ్రీనివాస్, అతని కుమారుడు వేణుచారిలు కలిసి డిసెంబర్ 31న కరీంనగర్రోడ్లోని శాంసంగ్ షోరూం ప్లాజా వద్దకు అంజయ్యను పిలిపించి దాడి చేసినట్లు తెలిపారు. దీంతో అంజయ్యను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి శుక్రవారం లింగంపేట శివారులో వారిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సర్కారు బడిలో చదువు.. చక్కని కొలువు
జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రైవేట్ బడులు, కళాశాలల్లో చదివితేనే ఉన్నతంగా ఎదుగుతామనే చాలామంది భావనను పటాపంచలు చేశారు.. మంచిభవిష్యత్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు.. పట్టుదలతో చదివారు.. కఠోరంగా శ్రమించారు.. సర్కారు బడిలో చదివి ఉన్నత లక్ష్యం సాధించారు.. ఉద్యోగంలోనూ ప్రత్యేకత చాటుకుని పదోన్నతి పొందారు జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్లు బదావత్ వనజ, పుల్లూరి జగదీశ్వర్రావు.. ఈ సందర్భంగా కథనం.. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బనావత్ దశరథ్ నాయక్ – లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముడో కూతురు వనజ. గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఐటీడీఏ సహకారంతో క రీంనగర్లో డిగ్రీ(కేయూలో ఓపెన్) ఉస్మానియా రెగ్యులర్ గా పీజీ పూర్తిచేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో తర్ఫీదు పొందా రు. 2022 –24 వరకు యూపీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. గ్రూప్–4లో తొలిప్రయత్నంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటులో ఉద్యోగం సాధించించారు. ఆర్నెల్లకే లెక్చరర్గా ఉద్యోగం సాధించారు. లెక్చరర్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2 పరీక్ష రాసి కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించారు వనజ. అంతటితో ఆగకుండా పట్టుదలతో గ్రూప్–1 పరీక్షరాసి 504.5 మార్కులు సాధించారు. రాష్ట్రంలో 38వ ర్యాంక్తో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. సీఎం నుంచి ఇటీవల ఉద్యోగ నియామకపత్రం అందుకున్నారు. వనజను మనజిల్లాకు నియమించారు. -
ఆర్ఎఫ్సీఎల్లో 5.87లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం ప్లాంట్ సామర్ధ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. ఇందులో యూరియా 2,200 మెట్రిక్ టన్నులు. తెలంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ లక్ష్యం విధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. వార్షిక మరమ్మతులు, సాంకేతిక కారణంగా సూమారు 84 రోజులు ప్లాంటును షట్డౌన్ చేశారు. మరమ్మతుల అనంతరం 28 సెప్టెంబర్ 2025 నుంచి 30 డిసెంబర్ 2025 వరకు ప్రతీనెల 92 శాతం యూరియా ఉత్పత్తి చేశారు. 2025–26ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీ నాటికి 5.87లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. ఇక్కడ తయారు చేసిన యూరియాలో 48 శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు. ఊపందుకున్న యాసంగి పనులు తెలంగాణ రాష్ట్రలో యాసంగి(రబీ) పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రికి వినతిపత్రం అందించారు. 100 శాతం యూరియాను తెలంగాణకే కేటాయించాలని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 3,26,574.03 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. యూరియా కేటాయింపులు ఇలా.. తెలంగాణ : 1,35,036.78 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ : 81,066.23 మెట్రిక్ టన్నులు కర్ణాటక : 47,223.74 మెట్రిక్ టన్నులు తమిళనాడు : 31,406.55 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్ : 16,171 మెట్రిక్ టన్నులు -
ఓటర్లు ఎక్కడెక్కడో!
‘డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీ, సదాశివపల్లిలో కలిపి 5,207 ఓట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ముసాయిదాలో 7వ డివిజన్ ఓటర్ల సంఖ్య నగరంలోనే అత్యధికంగా 6,846కు చేరింది. కొత్తగా ఓట్లు నమోదు చేయ డం సాధారణమే అయినా, ఏకంగా 1279 ఓట్లు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. సీతారాంపూర్, కశ్మీర్గడ్డ, షాషామహల్, బొమ్మకల్ ఓట్లు ఈ డివిజన్లో భారీగా నమోదయ్యాయి.’ ‘నగరంలోని 64వ డివిజన్ ముకరంపురలో స్థానిక ఓట్ల కన్నా, ఇతర డివిజన్ ఓటర్లు అధికంగా ఉన్నారు. వరుస క్రమంలో 400 ఓట్లను పరిశీలిస్తే కనీసం 300 ఓట్లలో తమ డివిజన్కు సంబంధం లేనివారు ఉన్నారంటూ స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2,3 డివి జన్లకు సంబంధించిన దాదాపు వేయి ఓట్లు, 28వ డివిజన్లో నమోదయ్యాయని స్థానికులు వాపోతున్నారు’.కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా గందరగోళంగా మారింది. ఇంటినంబర్లతో డివిజన్లవారీగా రూపొందించినట్లు చెబుతున్న ఓటర్ల జాబితాలో వందలాది పేర్లు ఇంటినంబర్లు లేకుండా ఉండడం సందేహాలకు కారణమవుతోంది. డివిజన్ల పునర్విభజన సందర్భంగా ప్రకటించిన ఓట్లసంఖ్యకు తాజా జాబితాకు పొంతనలేకపోవడం, అసాధారణంగా ఓట్లు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాపై అభ్యంతరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఎక్కడెక్కడో నగరంలో ప్రకటించిన 66 డివిజన్లవారి ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళాన్ని సృష్టిస్తోంది. డివిజన్ల పునర్విభజన సందర్భంగా ఇంటినంబర్ల వారిగా ఓటర్ల వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గ వారిగా ఓటర్ల జాబితా వివరాల ఆధారంగా డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించారు. ఇంటినంబర్లను పరిశీలించి, సంబంధిత డివిజన్లో పొందపరిచినట్లు చెబుతున్నప్పటికి, చాలా మంది ఓటర్లకు సంబంధించి ఇంటినంబర్లు లేకపోవడంతో ఎలా డివిజన్కు కేటాయించారనేది తెలియడం లేదు. అసలు ఆ ఓటర్లు తమ డివిజన్కు సంబంధించిన వాళ్లే కాదంటూ ఆయా డివిజన్ల సీనియర్ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఓటరు జాబితాలోని పోలింగ్ బూత్ల వారిగా ఓటర్లను ఆయా డివిజన్లలో చేర్చినట్లు అధికారులు అంటున్నారు. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడంతో, ఓట్లను అన్ని డివిజన్లలో సర్దుబాటు చేయడంతో ఈ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో నమోదు కావడం, జాబితాలో ఇంటినంబర్లు వరుససంఖ్యలో లేకపోవడంతో గందరగోళం మరింతగా పెరిగిపోయింది. సీతారాంపూర్, కాశ్మీర్గడ్డ, చింతకుంట, బొమ్మకల్ తదితర ప్రాంతాల ఓట్లు ఎక్కువగా ఇతర డివిజన్లో కనిపిస్తున్నాయి. పెరిగిన ఐదు వేల ఓట్లు గత ఏడాది జూన్లో డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరపాలకసంస్థలో 3,35,592 ఓట్లు ఉన్నట్లుగా డివిజన్లవారీగా అధికారులు జాబితాను ప్రకటించారు. తాజా జాబితాలో 66 డివిజన్లలో 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఆరు నెలల కాలంలో 5,183 ఓట్లు పెరగగా, అందులో కేవలం 7వ డివిజన్లోనే 1,279 ఓట్లు పెరగడం గమనార్హం 3,5,6 తదితర డివిజన్లలో మాత్రం పునర్విభజన సమయంలో కన్నా ఓట్లు తక్కువయ్యాయి. 6వ తేదీ వరకు అభ్యంతరాలు 66 డివిజన్ల ఓటర్ల జాబితాను శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, నాయకులు, ఓటర్లు వచ్చి జాబితాలను పరిశీలించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 6వ తేదీలోగా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. -
ఆపరేషన్ టైగర్!
కరీంనగర్రూరల్/చొప్పదండి: జిల్లాను పెద్దపులి వణికిస్తోంది. కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల్లో సంచరిస్తోందని గత ఐదు రోజులుగా వస్తున్న వార్తలు.. కనిపిస్తోన్న పాదగుర్తులు గ్రామీణ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బహుదూర్ఖాన్పేట, రుక్మాపూర్, జూబ్లీనగర్, ఆర్నకొండతో పాటు పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ ప్రాంతాల్లో పెద్దపులి పాదగుర్తులను అటవీ అధికారులు గుర్తించారు. పులిదాడిలో బహుదూర్ఖాన్పేటలో ఆవు, జూబ్లీనగర్లో గేదె మృతి చెందినట్లు పశువైద్యులు నిర్ధారించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు ‘ఆపరేషన్ టైగర్’ మొదలు పెట్టారు. ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు... పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు కరీంనగర్ జిల్లాలో మూడు, పెద్దపల్లి జిల్లాలో మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెద్దపులి జాడ, పాదముద్రలను గుర్తిస్తారు. శనివారం ఓ బృందం సిద్దిపేట జిల్లా నుంచి, మరో బృందం కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్ నుంచి వస్తోంది. హడలెత్తిసున్న వాట్సాప్ గ్రూపులు కరీంనగర్రూరల్, చొప్పదండి మండలాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో గురువారం ఎలబోతారం, జూబ్లీనగర్, బహుదూర్ఖాన్పేట, మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, ఆర్నకొండ తదితర గ్రామాల్లో పులి సంచరించిదనే ఫొటోలు, సమాచారంతో భయాందోళన నెలకొంది. శుక్రవారం జూబ్లీనగర్లో బోగొండ రాయుడుకు చెందిన గేదె పులి దాడిలో చనిపోయిందని, మాల గుట్ట ప్రాంతంలో పులి అడుగులున్నాయనే స్ధానికుల సమాచారంతో అటవీ అధికారులు పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి, నాలుగైదు రోజుల క్రితం గుట్టప్రాంతంలో పులి సంచరించినట్లు ధృవీకరించారు. పులిదాడిలోనే గేదే మృతిచెందిందని పశువైద్యులు రామకృష్ణ, జ్యోత్స్యలు నిర్ధారించారు. గతనెల 28న గేదైపె దాడి చేసిన పులి జూబ్లీనగర్ నుంచి ఫకీర్పేట మీదుగా రుక్మాపూర్కు వెళ్లిందని, అక్కడి నుంచి బహుదూర్ఖాన్పేట, సుల్తాన్పూర్వైపు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. ఆర్నకొండ శివారులో పులి అడుగులు? చొప్పదండి మండలం ఆర్నకొండ శివారులో పులి సంచరించినట్లు ఆనవాళ్లు వెలుగు చూశాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు నుంచి జూబ్లీనగర్, రుక్మాపూర్ మీదుగా వెదురుగట్ట శివారుకు, అక్కడి వనం ద్వారా ఆర్నకొండ శివారులోని గుట్టల వద్దకు వెళ్లి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెద్దపులి సంచరించిన రుక్మాపూర్, బహుదూర్ఖాన్పేట, జూబ్లీనగర్, ఆర్నకొండ, సుల్తాన్పూర్ గ్రామాలతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. డీఎఫ్వో బాలమణి ఆదేశాలతో ఆయా గ్రామాల్లో సర్పంచులు దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పులిభయంతో శుక్రవారం రాత్రి నుంచి నగునూరు– మొగ్ధుంపూర్ రహదారి, వెదురుగట్ట– బహుదూర్ఖాన్పేట, సుల్తాన్పూర్ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో పులి గురించిన వదంతులు, ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని చొప్పదండి ఎస్సై నరేశ్ రెడ్డి హెచ్చరించారు. -
ఎన్గల్ శివారులో చిరుత సంచారం
● భయాందోళనలో రైతులు చందుర్తి(వేములవాడ): మండలంలోని ఎన్గల్ శివారులోని లింబాద్రి ఒర్రె, శ్మశానవాటిక సమీపంంలో శుక్రవారం చిరుత పాదముద్రలను స్థానికులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట శివారులోని రైస్మిల్లు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వేములవాడరూరల్, చందుర్తి మండలాల సరిహద్దు ఎన్గల్ గ్రామంలో ప్రవేశించిందని గురువారం నుంచే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం చిరుత పాదముద్రలను గుర్తించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
సకాలంలో రుణాలివ్వండి
కరీంనగర్ అర్బన్: రైతుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆదేశించారు. 2026–27కు గాను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారుపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేడీసీసీబీ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను బ్యాంకర్లు నిర్ణయించాలని సూచించారు. పంటల సాగులో ఖర్చులు పెరిగిన దృష్ట్యా గతేడాది కన్నా సేల్ ఆఫ్ ఫైనాన్స్ను కొంతవరకు పెంచాలని అభిప్రాయపడ్డారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు, కూరగాయలు, తృణధాన్యాలు, జొన్న, రాగులు పంటలకు అధిక రుణ పరిమితిని కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రైతులకు రుణాల మంజూరు, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా పంటలకు సంబంధించి పంటల సాగులో పెట్టుబడులు, ఆదాయంతో పాటు వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో 20 మంది రైతులు పాల్గొని సేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచే అంశంపై అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు కరీంనగర్ ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి, సిరిసిల్ల జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, కేడీసీసీబీ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ -
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
మేడారంలో ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీలు గౌస్ఆలం, సన్ప్రీత్సింగ్, అంబర్ కిశోర్ ఝా, ఎస్పీలుమానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్– జగ్గయ్యపల్లి గ్రామాల మధ్య గోదావరి నీటి పైప్లైన్ లీకై నీరు భారీ ఎత్తులో ఎగిసిపడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రధాన పైప్లైన్ మానేరు వాగు సమీపంలో లీకేజీకి గురైంది. నీటి ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో పైపునుంచి నీరు ఎగిసిపడి, ఫౌంటేన్ను తలపించింది. నీటి ప్రవాహానికి సమీపంలోని వ్యవసాయ భూములు వరదతో నిండిపోయాయి. విద్యుత్ తీగలు ఉండటంతో అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. స్థానికుల సమాచారంతో సంబంధిత అఽధికారులు అక్కడికి చేరుకుని పైప్లైన్కు మరమ్మతు చేశారు. –మానకొండూర్రూరల్ ఎగిసిపడ్డ నీళ్లు -
కల్వర్టుపై ఆధార్కార్డుల కుప్ప
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి శివారులోని కల్వర్టుపై ఆధార్కార్డుల కుప్పలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 20కి పైగా ఆధార్కార్డులు కుప్పలుగా పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా వ్యాపారులు యూరియా ఎరువుల బస్తాల కోసం తీసుకొని.. పని పూర్తికాగానే పడేసి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైన దొంగలు ఎత్తుకొచ్చి పడేసి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన స్థలంలో సుద్దాల దేవరాజు, రామడుగు పోశవ్వ, రామిడి సంజీవ్, తుమ్మల రమ్య, కటకం దేవరాజు తదితర పేర్లు ఉన్న ఆధార్కార్డులు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపడితేనే ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తేలనుంది.


