breaking news
Karimnagar
-
‘బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.నిజామాబాద్లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
బియ్యం ముక్కిపోతున్నాయ్
కరీంనగర్రూరల్: రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. మార్చి వరకు లబ్ధిదారులకు ప్రభుత్వం దొడ్డుబియ్యాన్ని పంపిణీ చేసింది. ఏప్రి ల్ నుంచి సన్నంబియ్యం అందిస్తున్నారు. అంతకుముందుగా రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా నిల్వ ఉంటున్నాయి. పలుచోట్ల లక్క పురుగు పడుతుండగా మరికొన్ని చోట్ల ముక్కిపోతున్నాయి. దొడ్డు బియ్యాన్ని తరలించకుండా ఇలాగే ఉంచితే పనికిరాకుండా పోతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ మండలంలోని మొత్తం 29 రేషన్ దుకాణాల్లో 314 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం, 100 క్వింటాళ్ల సన్నబియ్యం నిల్వ ఉన్నాయి. వర్షాలతో డీలర్ల ఆందోళన కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ దుకాణాలు అద్దె గదుల్లోనే కొనసాగుతున్నాయి. గదులు చిన్నవిగా ఉండటంతో పాటు దొడ్డు బియ్యం నిల్వ ఉండటంతో మరింత ఇరుకుగా మా రింది. మూడు నెలల రేషన్ కోటా ఒకేసారి ఇవ్వడంతో రెండు నెలలుగా డీలర్లు దుకాణాలను తెరవలేదు. వర్షాలకు నిల్వ ఉన్న బియ్యం పరిస్థితి ఎలా ఉందోనని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొడ్డు, సన్న బియ్యం నిల్వతో ఇబ్బందులు రేషన్ దుకాణాల్లో దొడ్డు, సన్న బియ్యం నిల్వలు ఒకేచోట ఉంటున్నాయి. దొడ్డుబియ్యంలో పురుగులు పట్టి సన్నబియ్యంలోకి వస్తున్నాయని డీలర్లు వాపోతున్నారు. ఈ నెల 25నుంచి రేషన్ దుకాణా లకు బియ్యం స్టాక్ను మండలస్థాయి స్టాక్పాయింట్నుంచి సరఫరా చేస్తారు. ఇప్పటికే దుకాణాలో దొడ్డు, సన్నబియ్యం నిల్వలతో ఇబ్బంది పడుతున్నామని కొత్తస్టాక్ బియ్యం ఎక్కడ దించుకోవాలని డీలర్లు ప్రశ్ని స్తున్నారు. సన్నబియ్యం దించుకునేందుకు సరిపడే స్థలం లేకపోవడంతో వీలైనంత త్వరగా దొడ్డు బియ్యాన్ని విక్రయించినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశముంది. అయితే దొడ్డు, సన్నబియ్యం నిల్వల తరలింపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సివిల్ సప్లై అధికారులు వివరించారు. -
సామాజిక చైతన్యంలో కవులు కీలకం
కరీంనగర్ కల్చరల్: సామాజిక చైతన్యంలో కవుల పాత్ర కీలకమని ఎస్సారార్ డిగ్రీ కళాశా ల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ పేర్కొన్నారు. కవయిత్రి చిందం సునీత రచించిన కాలం ఒడిలో పుస్తకాన్ని ఉదయ సాహితీ తెలంగాణ ఆధ్వర్యంలో నగరంలోని వాగేశ్వరి కళాశాలలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రకృతి ఆధారంగానే కవులు కవిత్వాన్ని రాస్తారని పేర్కొన్నా రు. చిందం సునీత కవిత్వంలో ఆమె ఉత్తమ వ్యక్తిత్వం, సామాజిక చింతన, సున్నిత మనస్తత్వం కనిపిస్తాయని కొనియాడారు. పుస్తకాన్ని ప్రముఖ కవి విమర్శకుడు దాస్యం సేనాధిపతి గీతారాణి దంపతులకు అంకితమిచ్చారు. కవులు సంజీవ్, రాజారెడ్డి, లక్ష్మయ్య, గజేంద్రరెడ్డి, విజయలక్ష్మీ, మాధవి, వైరాగ్యం ప్రభాకర్, అన్నవరం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి కరీంనగర్స్పోర్ట్స్: హాకీ ఒలింపిక్ స్వర్ణ పతక విజేత ధ్యాన్చంద్ స్ఫూర్తితో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలని డీపీవో జగదీశ్వర్ సూచించారు. జాతీయ క్రీడాదినోత్సవం ఉత్సవాల్లో భాగంగా జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన త్రీకే రన్ను జెండా ఊపి ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా క్రీడలకు నిలయంగా మారుతుండడం హర్షనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి.శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఈనెల 23 నుంచి 31వ తేదీ వరకు జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, జిల్లా యోగా సంఘం కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్ పాల్గొన్నారు. యోగాలో రాణించాలి కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా యోగా క్రీడాకారులు తమ ప్రతిభతో జాతీయస్థాయికి ఎదగాలని రాష్ట్ర ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి సూచించారు. జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేడ్కర్స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్, జూనియర్ యోగాసన పోటీల్లో ఎంపికై న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. విద్యార్థి దశ నుంచే యోగాను జీవితంలో భాగంగా చేసుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారన్నారు. యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5 నుంచి 7వరకు నిర్మల్లో రాష్ట్రస్థాయి యోగా పోటీలు జరగనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల కన్వీనర్ ఎం.రమేశ్, కో కన్వీనర్ ప్రియాంక, గడ్డం మధు, అర్చన, అంజిబాబు, పరమేశ్వర్, సత్యనారాయణ, శంకర్ పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. జీరో విద్యుత్ ప్రమాదాలే లక్ష్యంగా సర్కిల్లోని డీఈ టెక్నికల్ ఆధికారులను సేఫ్టీ అధికారులుగా నియమించామని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ‘విద్యుత్ అధికారుల పొలంబాట’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 1,181 లూజ్లైన్లను పునరుద్ధరించామని, 791 వంగిన పోల్స్ను సరి చేశామని, 2,090 మధ్య స్తంభాలు నెలకొల్పామని తెలిపారు. 144 లో లెవెల్ లైన్ క్రాసింగ్, 145 డబుల్ ఫీడర్ల పాయింట్లను మార్చామన్నారు. జన సామర్ధ్యం గల ప్రదేశాలలో భద్రత సూచనల బోర్డులు ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన సరి చేస్తున్నామని అన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తితే 1912 టోల్ ఫ్రీనంబర్ను సంప్రదించాలని కోరారు. -
బావిలో పడి బాలుడి గల్లంతు
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని రాయికల్లో ఆదివారం ఓ బాలుడు ప్రమాదవశాత్తు వ్యవసాయబావిలో పడి గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రాయికల్కు చెందిన చేరాల వెంకటయ్య–కావ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు, కుమారుడు కార్తీకనందన్(18 నెలలు) సంతానం. కావ్య తమ పొలంలో బిహార్ కూలీలతో వరి నాటు వేయించింది. నాటు పలుచగా వేశారని, మధ్యమధ్యలో నాటు వేద్దామని బాలున్ని తీసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. అతడిని చెట్టుకింద కూర్చోబెట్టి పొలంలోకి దిగింది. ఈక్రమంలో కార్తీకనందన్ నడుచుకుంటూ బావి వైపు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడ్డాడు. శబ్దం రాగానే తల్లి వచ్చి చూడగా బావిలో పడ్డట్టు నీటి కదలికలు కన్పించాయి. కావ్య అరుపులకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. బావి నిండా నీళ్లు ఉన్నాయి. ఫైరింజన్ వచ్చినా బావి వరకు వెళ్లే పరిస్థితి లేదు. కరెంట్ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. బావి నుంచి నీటిని పూర్తిగా తోడేస్తేనే బాలుడి ఆచూకీ దొరకనుంది. -
ఆధునిక వ్యాన్
ఆధారాల సేకరణకుజగిత్యాలజోన్/గోదావరిఖని: వివిధ నేరాలకు పా ల్పడుతున్న నిందితులు సాక్ష్యాలు దొరకకుండా పో లీసులకు సవాల్ విసురుతున్నారు. దీంతో కేసుల వి చారణలో భాగంగా సాక్ష్యాలు సంపాదించేందుకు పోలీసులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీస్శాఖ మరింత సమర్థవంతమైన సాక్ష్యాల ను సేకరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లను ఏర్పాటు చేసింది. ప్ర తీ జిల్లాకు ఒక వ్యాన్ను అందజేయగా, జగిత్యాలకు కేటాయించిన వ్యాన్ను ఇటీవల రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ప్రారంభించగా, గోదావరి ఖనిలో సీపీ అంబర్కిషోర్ ఝా ప్రారంభించారు. ● సాక్ష్యాలు లేకుండా చేస్తుండడంతో.. కోర్టులో కేసు నిలబడాలంటే ఆ కేసులోని సాక్ష్యమే ప్రధాన ఆధారం. ఇందుకోసం పోలీసులు సంఘటన జరిగినప్పటి నుంచి కేసు విచారణలో భాగంగా పలు సాక్ష్యాలను సేకరిస్తుంటారు. విచారణ పూర్తయిన తర్వాత చార్జీషీట్ రూపంలో కోర్టుకు నివేదిక అందిస్తారు. అయితే, కొన్ని మర్డర్ కేసుల్లో మృతుల ఆనవాళ్లు సైతం లేకుండా కాలబెట్టడం, చోరీలు చేసినప్పుడు వేలిముద్రలు లేకుండా జాగ్రత్త పడటం..ఇలా హైటెక్ నేర ప్రవృత్తితో కేసు నుంచి తప్పించుకోవడానికి పలు రకాలుగా నిందితులు ప్రయత్నిస్తున్నారు. దీంతో, పోలీసులు ఘటన స్థలానికి వెళ్లినప్పటికీ ఎలాంటి ఆనవాళ్లు కనబడడంలేదు. ఒకవేళ నేర స్థలంలో ఏవైనా ఆనవాళ్లు దొరికితే వాటిని హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు లేదా ఫింగర్ప్రింట్ ఆఫీసుకు పంపించడం, ఆ రిపోర్టులు వచ్చే వరకు విచారణ ఆగిపోవడంతో నిందితులు తప్పించుకు తిరుగుతున్నారు. ● సమర్థవంతమైన సాక్ష్యాల కోసం.. నేరం జరిగిన ప్రాంతాల్లో వేగంగా సాక్ష్యాలు సేకరించేందుకు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. చేతి వేలు, కాళ్ల ముద్రలు, శరీర భాగాలు, వెంట్రుకలు, గంజాయి, డ్రగ్స్ వంటి పదార్థాలు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు, టైర్ ట్రాక్లు, షూ ప్రింట్లు, డిజిటల్ వస్తువులు..ఇలా ఏ ఆధారాలనైనా పోలీసులు అత్యాధునిక పద్ధతుల్లో సేకరించేందుకు వీలుపడుతుంది. గతేడాది అమలుల్లోకి వచ్చిన నూతన క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా అన్ని జిల్లాలకు మొబైల్ వ్యాన్లను కేంద్రం అందించింది. ● వ్యాన్లో ఏముంటాయంటే.. మొబైల్ వ్యాన్ చూడడానికి ఒక మినీ ఫోరెన్సిక్ ల్యాబోరేటరీలా కనబడుతుంది. ఇందులో ఉండే ఆధునాతన పరికరాల ద్వారా భారీ పేలుడు, హత్యలు, డ్రగ్స్ రవాణా, మహిళలపై అత్యాచారాలు, దాడులు.. ఇలా ఏ నేరం జరిగినా ఆధారాలను సత్వరమే సేకరించే అవకాశం ఉంటుంది. డిజిటల్గా ఉండే సాక్ష్యాలను సేకరించేందుకు కూడా అవసరమైన పరికరాలు ఉంటాయి. శిక్షణ పొందిన ఫోరెన్సిక్ ఆఫీసర్, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, డ్రైవర్తో పాటు ఇతర సిబ్బంది వ్యాన్లో ఉంటారు. నేరం జరిగిన ప్రాంతాల్లో కొన్ని ఆధారాలు అసలే కనిపించవు. అలాంటి వాటిని గుర్తించే మోడ్రన్ లైట్ల వంటి పరికరాలు ఉంటాయి. సేకరించిన ఆధారాలను భ ద్రపరిచి, ల్యాబ్కు పంపించేవరకు ప్రిడ్జ్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే నేరం జరిగిన ప్రాంతానికి వ్యాన్ వెళ్లలేకపోయినప్పుడు, అవసరమైన సాక్ష్యాలను పరిశీలించేందుకు వాహనానికి ప్రత్యేకంగా అమర్చిన కెమెరా ఉంటుంది. కొన్ని కేసుల్లో, కొ న్ని రకాల ఆధారాలను అప్పటికప్పుడు పరిశీలించేందుకు అవసరమైన రసాయన పదార్థాలు ఉంటాయి. ● నేరం జరిగిన వెంటనే.. నేర తీవ్రతను బట్టి పోలీసులు మొబైల్ ఫోరెన్సిక్ బృందానికి సమాచారం అందించగానే 108 అంబులెన్స్ మాదిరిగా అక్కడకు చేరుకుంటాయి. ఘటన స్థలం యొక్క ఫొటోలు, వీడియో తీయడంతో పాటు ఆ స్థలం మ్యాప్ కూడా వేస్తుంది. అక్కడ పడిఉన్న ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, వాచ్లు వంటి డిజిటల్ పరికరాలను పరిశీలించేందుకు వ్యాన్లోని డిజిటల్ వ్యవస్థకు ఆధునాతన సాఫ్ట్వేర్ను క్రోడీకరిస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సైతం ఉపయోగించి వీలైనంత వేగంగా సాక్ష్యాలను సేకరిస్తారు. ఫొటో, వీడియోల ద్వారా వ్యక్తులను గుర్తించడానికి, అనుమానితులు ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేయడంలో ఉపయోగిస్తారు. నేరం జరిగిన వెంటనే ఘటన స్థలానికి.. నేరం జరిగిన వెంటనే మొబైల్ వ్యాన్ ఘటన స్థలానికి చేరుకుంటుంది. వ్యాన్లో ఆధునిక క్లూస్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో నిందితుల గుర్తింపు, సాక్ష్యాల సేకరణ సత్వరమే ప్రారంభమవుతుంది. మినీ ఫోరెన్సిక్ వ్యాన్ అందించే సాక్ష్యాలతో కేసులను మరింత వేగంగా విచారించే అవకాశం ఉంటుంది. – అశోక్కుమార్, ఎస్పీ, జగిత్యాల -
నాన్న కళ్లు దానం చేశాం
మా నాన్న రాములు ఈనెల 14న అనారోగ్యంతో చనిపోయారు. ఇద్దరికి కంటిచూపు ప్రసాదించడానికి మా నాన్న కళ్లను ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు దానం చేశాం. – గజ్జెల్లి వెంకటేశ్వర్లు, అడ్వకేట్, గోదావరిఖని 50 కార్నియాలను ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద ట్రాన్స్ప్లాంటేషన్ సంస్థగా గుర్తింపు సాధించింది. ఇందంతా కుటుంబ సభ్యులు కార్నియాలు దానం చేయడం ద్వారా సాధ్యమయ్యింది. – తోట కిషన్రెడ్డి, ఐ బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్ నేత్రదానం చేయడంపై ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. ప్రతీ జిల్లాలో కార్నియా సేకరించే సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. 108 సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలి. – టి.శ్రవణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
తిరుపతికి మరో ప్రత్యేక రైలు
రామగుండం: తిరుపతికి వెళ్లేందుకు పెద్దపల్లి జంక్షన్ నుంచి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తుందని ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు కంకటి ఫణి శనివారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని ధర్మపురం నుంచి తిరుపతి, మహారాష్ట్రలోని నాందేడ్, పెద్దపల్లి జంక్షన్తోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోని రైల్వేస్టేషన్ల ద్వారా ఎక్స్ప్రెస్ రైలు సెప్టెంబరులో రాకపోకలు సాగిస్తుంది. సెప్టెంబర్లో 5, 12, 19, 26 తేదీల్లో తిరుపతి వైపు, సెప్టెంబర్ 7, 14, 21, 28వ తేదీల్లో పెద్దపల్లి వైపు నడవనుంది. ఇప్పటికే ఐఆర్సీటీసీ పోర్టల్లో బుకింగ్ సౌకర్యం ప్రారంభమైంది. ఇందులో నాలుగు సాధారణ, ఏడు స్లీపర్, ఆరు థర్డ్ ఏసీ, మూడు సెకండ్ ఏసీ బోగీలతోపాటు ఒకటి దివ్యాంగుల బోగీ ఉంటుంది. దీనికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తే రెగ్యులర్గా నడిపించే అవకాశాలు ఉన్నాయి. రైలు రాకపోకల వివరాలు.. రైలు నంబరు : 07189 : నాందేడ్ – ధర్మవరం : ప్రతీ శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు నాందేడ్లో బయలుదేరి, 6.00 గంటలకు బాసర, రాత్రి 6.25గంటలకు నిజామాబాద్ జంక్షన్, రాత్రి 8.00 గంటల జగిత్యాల, రాత్రి 9.00 గంటలకు కరీంనగర్, రాత్రి 10.15గంటలకు పెద్దపల్లి జంక్షన్, రాత్రి 11.40 గంటలకు వరంగల్, మరుసటిరోజు వేకువజామున 4.10 గంటలకు విజయవాడ జంక్షన్, ఉదయం 11గంటలకు తిరుపతి, ఉదయం 11.50 గంటలకు చిత్తూరు జిల్లా పాకాల జంక్షన్, మధ్యాహ్నం 12.30 గంటలకు పీలేరు, మధ్యాహ్నం 1.15 గంటలకు మదనపల్లి రోడ్డు, మధ్యాహ్నం 2.30 గంటలకు కదిరి, సాయంత్రం 5.00 గంటలకు ధర్మవరం జంక్షన్కు చేరుకుంటుంది. రైలు నంబరు : 07190 : ధర్మవరం – నాందేడ్ : ప్రతీ ఆదివారం ఉదయం 5.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరుతుంది. ఉదయం 6.30 గంటలకు కదిరి, మదనపల్లిరోడ్డుకు ఉదయం 7.30గంటలు, పీలేరుకు ఉదయం 8.30 గంటలు, పాకాల జంక్షన్కు ఉదయం 9.30గంటలు, తిరుపతికి ఉదయం 10.25 గంటలు, విజయవాడ జంక్షన్కు సాయంత్రం 6.35గంటలు, వరంగల్కు రాత్రి 10.20 గంటలు, పెద్దపల్లి జంక్షన్కు రాత్రి 12.05గంటలు, కరీంనగర్కు రాత్రి 12.40గంటలు, జగిత్యాలకు రాత్రి 1.30గంటలు, నిజామాబాద్ జంక్షన్కు వేకువజామున 3.50గంటలు, బాసరకు ఉదయం 4.27 గంటలు. నాందేడ్కు ఉదయం 7.30గంటలకు చేరుకుంటుంది. -
బహ్రెయిన్ జైలులో ఐదుగురు తెలంగాణ వాసులు
జగిత్యాలక్రైం/ముస్తాబాద్(సిరిసిల్ల): బహ్రెయిన్ దేశంలో గడువుతీరిన ఆహార ఉత్పత్తుల తేదీలను ఫోర్జరీ చేసిన కేసులో తెలంగాణకు చెందిన ఐదుగురు కటకటాలపాలయ్యారు. అక్కడి కోర్టు ముగ్గురికి మూడేళ్లు, 19 మందికి రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు బహ్రెయిన్లోని తెలంగాణ సామాజిక సేవకుడు కోటగిరి నవీన్ తెలిపారు. ఈ కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం కొండాపూర్కు చెందిన బంటు బాబుకు రెండేళ్ల శిక్ష పడింది. అతడి మేనమామ గాదం ప్రభాకర్ సాయం కోసం ఆదివారం తెలంగాణ ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డిని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా వివాహం కాని బాబు ఏడేళ్లుగా బహ్రెయిన్లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు లేరు. పెళ్లైన ఒక్క చెల్లె ఉంది. మే 15 నుంచి తనను ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి చేయాలని ఆల్ దాయిస్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ యాజమాన్యానికి మార్చి 2న దరఖాస్తు చేసుకున్నాడు. ఇండియాకు రావాల్సిన అతను అనుకోకుండా జైలు పాలయ్యాడు. అలాగే, ఇద్దరు యజమానులకు లక్ష దినార్ల చొప్పున (రూ 2.3 కోట్లు) జరిమానా విధించారు. చెప్పిన డ్యూటీ చేసినందుకు.. గోదాంలో ఆహార ఉత్పత్తులపై లేబుళ్లు తొలగించి, కొత్త తేదీలతో స్టిక్కర్లు అతికించడానికి కంపెనీ యాజమాన్యం కార్మికులను ఉపయోగించి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టివేసింది. యజమాన్యం చెప్పినట్లు డ్యూటీ చేయడం 19 మంది ప్రవాసీ కార్మికుల పాలిట శాపమైందని తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి నరేశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని బహ్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ద్వారా జైల్లో ఉన్న కార్మికులకు న్యాయ సహాయం అందించాలని కోరారు. ఆహార ఉత్పత్తుల తేదీల ఫోర్జరీ కేసులో శిక్ష -
మార్పురాదు.. కల్తీ ఆగదు
2024 మే 26న నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్సేఫ్టీ విభాగం ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించగా అంతటా కల్తీ, కాలం చెల్లిన మాంసం, హానికర సింతటిక్ ఫుడ్ కలర్స్ గుర్తించారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.2025 ఆగస్టు 12న ఫుడ్సేఫ్టీ అధికారులు నగరంలోని కమాన్ చౌరస్తాలో ఉన్న మోర్ సూపర్ మార్కెట్లో తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన వస్తువులను గుర్తించి పారబోయించారు.జిల్లా జనాభా : 10,43,087 కరీంనగర్ నగర జనాభా : 4.30లక్షలు జిల్లాలో హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు : సుమారు 2,500 నూనె విక్రయ కేంద్రాలు : 1,800 సూపర్ మార్కెట్లు : 320 బేకరీలు, స్వీట్ దుకాణాలు : 1,020 టిఫిన్ సెంటర్లు : 2,100 మసాలాల దుకాణాలు : 600 ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు : 450 పండ్ల దుకాణాలు : 1,500 చిరుతిళ్ల తయారీ కేంద్రాలు : 54 -
నేత్రదానం మహాదానం
కోల్సిటీ(రామగుండం): మరణించినా మరోఇద్దరికి లోకాన్ని చూసే అదృష్టం కల్పించడం నేత్రదానంతోనే సాధ్యం. చీకట్లో మగ్గుతున్నవారు అనేకమంది చూపు కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం కలిగిన కంటిచూపుపై ఏటా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా దానం చేయొచ్చు వయసుకు పరిమితి లేకుండా ఎవరైనా నేత్రాలు దానం చేయొచ్చు. కళ్లజోడు పెట్టుకునేవారు, బీపీ, షుగర్, ఉబ్బసం బాధితులు, కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకున్నవారు సైతం నేత్రదానం చేయొచ్చు. హైపటైటీస్, ఎయిడ్స్ తదితర అంటు వ్యాధులున్నవారు నేత్రదానం చేయకూడదు. 96 గంటల్లో ట్రాన్స్ప్లాంటేసన్.. కార్నియాను 96 గంటల్లోగా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఐ బ్యాంకులు మానవ అవయవ మార్పిడి చట్టం పరిధిలోకి వస్తాయి. ఒకరుదానం చేసిన రెండు కార్నియాలతో కొన్నిసందర్భాల్లో నలుగురికి కంటిచూపు ప్రసాదించడానికి సాధ్యమవుతుంది. మిగతా సందర్భాల్లో ఇద్దరికి చూపు వచ్చేలా వైద్యనిపుణులు ఆపరేషన్లు చేస్తున్నారు. అయితే, వ్యక్తి మరణించిన 6 గంటల్లోపే నేత్రాలను తీయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.. కార్నియా దానం చేయాలనుకుంటే మృతదేహం వద్ద ఫ్యాన్లు ఆఫ్ చేయాలి. ఎయిర్ కండిషనర్, కూలర్లు ఆన్ చేయాలి. తడిపిన దూది, ఐస్ ముక్కలను కళ్లపై ఉంచాలి. తలకింద తలగడ పెట్టి తలఎత్తుగా ఉండేలా చూడాలి. దీని ద్వారా టిష్యూ(కంటిపొర) తడిగా ఉంటుంది. ఒకరిగా మరణించి.. ఇద్దరుగా జీవిద్దాం నేటినుంచి జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు గత పదేళ్లలో ఉమ్మడి జిల్లాలో నేత్రదానం చేసినవారు నేత్రదాతలు 1,535 అవగాహన కార్యక్రమాలు 1,800 ప్రతిజ్ఞ చేసినవారు 65,000 అవగాహన కల్పిస్తున్న సంస్థలు – ఫోన్నంబర్లు సదాశయ ఫౌండేషన్ 90102 01669, 94927 81306 లయన్స్ క్లబ్ 73962 95999 తెలంగాణ నేత్ర, అవయవ, శరీరదాతల సంఘం 99486 09591 -
‘బంగారు’ చికిత
● ఆర్చరీ వరల్డ్ యూత్ గేమ్స్లో పసిడి పతకం సొంతం కరీంనగర్ స్పోర్ట్స్/ఎలిగేడు: షాంఘైలో జరిగిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 పోటీల్లో రజతం, బ్యాంకాక్ ఏషియాడ్లో కాంస్యం, ఉత్తరాఖండ్ జాతీయ క్రీడల్లో కాంస్యం.. ఇలా తను పాల్గొన్న ప్రతీ ఈవెంట్లో ఏదో ఒక పతకంతో సత్తా చాటుతోంది చికిత. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత కెనడా దేశంలోని వెన్నిపెగ్లో జరుగుతున్న వరల్డ్ యూత్ ఆర్చరీ చాంపియన్షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. ఆదివారం వేకువజామున కొరియా క్రీడాకారిణి పార్క్ యరీన్తో జరిగిన ఫైనల్ పోరులో 142–136 పాయింట్ల తేడాతో ఓడించింది. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో శిక్షణ పొందుతున్న చికిత ఇదివరకు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించింది. ప్రస్తుతం పసిడి పతకం సాధించడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్రావు, శ్రీలత ఆనందం వ్యక్తం చేశారు. 27న చవితి.. 5న నిమజ్జనం కరీంనగర్ కల్చరల్: వినాయక చవితి పండుగను ఆగస్టు 27న జరుపుకోవాలని నగర వైదిక పురోహితుడు మంగళపల్లి శ్రీనివాస్శర్మ ఒక ప్రకటనలో సూచించారు. నివాసాలు, మండపాల్లో ప్రతిిష్ఠించిన గణపతులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తొలిపూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. సెప్టెంబర్ 5న నిమజ్జనోత్సవం జరుపుకోవాలని పేర్కొన్నారు. 7న భాద్రపద పూర్ణిమా రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని వివరించారు. -
● మూడు నెలలకే కంకర తేలిన సీసీ రోడ్డు ● ఇబ్బంది పడుతున్న వాహనదారులు
నాణ్యత పట్టదా?కరీంనగర్ కార్పొరేషన్: వానాకాలం బురద, గుంతలతో... ఎండాకాలం దుమ్ము, ధూళితో పడుతున్న కష్టాలు ఇక ముగిసినట్లేనని ఆ కాలనీవాసులు ఊపిరిపీల్చుకున్నారు. కొత్తగా సీసీ రోడ్డు నిర్మించడంతో మురిసిపోయారు. ఆ మురిపెం మూణ్నాళ్లు కూడా ఉండలేదు. సీసీ రోడ్డుపై కంకర తేలుతుండడంతో, కొద్ది రోజులకే మళ్లీ పాత కష్టాలు తప్పవంటూ ఆ కాలనీ వాసులు ఊసురుమంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి రహదారి నుంచి రజ్విచమాన్, సిటిజెన్స్కాలనీలకు వెళ్లే మెయిన్రోడ్డు ఏళ్లకాలంగా అధ్వానంగా ఉంది. గతంలో బొమ్మకల్ గ్రామపంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఈ రోడ్డు కష్టాల గురించి కాలనీవాసులు ఎన్నిసార్లు అధికారులు చుట్టూ తిరి గినా ఫలితం కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రోడ్డు పనులు ప్రారంభించడం అప్పట్లో వివాదాస్పదమైంది. అప్పటికి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ రోడ్డుకు నగరపాలకసంస్థ నిధులు వెచ్చించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. వివాదం, ఫిర్యాదులు, ప్రభుత్వం మారడం తదితర కారణాలతో ఆ రోడ్డు నిర్మాణ పనులు సగంలోనే ముగిసిపోయాయి. అప్పటి నుంచి ఆకాలనీ వాసుల కష్టాలు మరింతగా పెరిగాయి. మూడు నెలలకే.. గత జనవరిలో బొమ్మకల్ నగరపాలకసంస్థలో విలీ నం కావడం తెలిసిందే. అనంతరం రజ్విచమాన్ రోడ్డు నిర్మాణానికి కదలిక వచ్చింది. సుమారు రూ.20 లక్షలతో ఈ సీసీ రోడ్డు పనులు చేపట్టారు. గత ఏప్రిల్లో నిర్మాణం పూర్తయింది. రెండు, మూడు నెలల్లోనే రోడ్డుపై సిమెంట్ పోయి కంకర తేలడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. నడిరోడ్డుపై కంకర తేలడంతో మళ్లీ గుంతలు పడే అవకాశం కనిపిస్తోంది. సీసీ రోడ్డుకు ఒక వైపు కుంగినట్లుగా మారడంతో, తరచూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీనిపై కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఇప్పటికై నా సీసీ రోడ్డు నాణ్యతపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని, లోపాలను సరిచేసి,నాలుగు కాలాలపాటు రోడ్డు ఉండేలా చూడాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/గంగాధర: ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పాల్గొన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి గంగాధర మధురానగర్ చౌరస్తా వరకు పాదయాత్ర సాగింది. మహిళలు బోనాలతో, ఒగ్గుడోలు కళాకా రులు, విద్యార్థులు, ప్రజలు ఘనస్వాగతం పలికా రు. మధురానగర్ చౌరస్తాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్ఠాకూర్, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తదితరులతో కలిసి మహేశ్కుమార్ గౌడ్ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్ఎస్లపై దుమ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇదే గంగాధరలో విజయోత్సవాలు చేసుకుందామని ప్రకటించారు. రోల్మోడల్గా చొప్పదండి: ఎమ్మెల్యే సత్యం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. పాదయాత్ర అనంతరం మధురానగర్ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతి గ్రా మానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిది రో జుల్లో తొమ్మిదివేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60వేల ఉద్యోగాలు, అర్హులందరికీ రేషన్కార్డులు, కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అదనంగా చుక్కా నీరు ఇవ్వలేదన్నారు. ఎవరు అడ్డుపడినా నియోజకవర్గ అభివృద్ధి ఆగదన్నారు. నారాయణపూర్ రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచి, నిర్వాసితులకు పరిహారంతో పాటు వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. త్వరలోనే గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయిందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం మండలంలోని కురిక్యాలలో ఇందిరమ్మ ఇల్లు పథకంలో బాలగోని భాగ్య– గంగయ్య దంపతులు నిర్మించుకున్న ఇంటిని పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. సొంత ఇల్లు కట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, పదేళ్లుగా రేషన్ కార్డు రాలేదని, కాంగ్రెస్ వచ్చాక రేషన్ కార్డు వచ్చిందని భాగ్య దంపతులు భావోద్వేగంతో కంటతడి పెట్టారు. -
కోల్కతా గంగానది మట్టితో..
కరీంనగర్కల్చరల్: నగరంలోని రాంనగర్ మిత్రయూత్ ఆధ్వర్యంలో 27 ఏళ్లుగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2022లో 26 అడుగుల మట్టిగణపతి, 2023లో 28 అడుగులు, 2024లో 30 అడుగుల మ ట్టి విగ్రహాన్ని తయారు చేయించారు. ఈసారి 35 అ డుగుల విగ్రహాన్ని ప్రతిష్టంచనున్నారు. వినాయకచవితికి 45రోజుల ముందు నుంచే విగ్రహం త యారీ పనులు ప్రారంభమయ్యాయి. కోల్కతాలోని గంగానది మట్టిని ప్రత్యేకంగా తెప్పించి, అక్కడి కళాకారులచే విగ్రహం తయారు చేయిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు చేస్తున్నం. అందరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలి. – కోడూరి అఖిల్గౌడ్ అధ్యక్షుడు, మిత్ర యూత్ క్లబ్ -
ట్రాక్టర్ కింద పడి యువకుడి దుర్మరణం
మెట్పల్లి రూరల్: ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు రాత్రివరకూ స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపాడు. ఓ స్నేహితుడు చాలారోజుల తర్వాత కలవడంతో అతడితోనే ఉండిపోయాడు. అంతలోనే ఇసుకకు గిరాకీ వచ్చిందని, త్వరగా రావాలని య జమాని ఫోన్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లిన అతడిని ఆ దేవుడు తిరిగిరాని లోకానికి తీసుకెళ్లాడు. ఈ విషాద ఘటన మెట్పల్లి మండలం ఆత్మనగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఆత్మనగర్కు చెందిన నర్ర శేఖర్(27) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి సమయంలో స్నేహితులతో చాలాసేపు గడిపాడు. ఇంతలో ఇసుక గిరాకీ రావడంతో ట్రాక్టర్లో ఇసుకను లోడ్ చేసుకుని డంప్ చేసేందుకు వెళ్తున్నాడు. వెల్లుల శివారు దొంగలమర్రి వద్దకు చేరుకోగానే అతడికి తరచూ ఫోన్కాల్స్ వచ్చాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న స్నేహితుడు దాండ్ల రవిని ట్రాక్టర్ నడపాలని సూచించాడు. ట్రాక్టర్ రన్నింగ్లో ఉండగానే శేఖర్ సీటు నుంచి లేచి ట్రాలీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడం... ఆ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్ ఉండడంతో.. పట్టుతప్పి టైర్ కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన శేఖర్ అ క్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. శేఖర్కు భార్య నాగలత, కూతురు ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని.. శేఖర్ కుటుంబానికి ట్రాక్టర్ యజమాని న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు, బంధువులు మెట్పల్లి పోలీస్స్టేషన్కు శనివారం భారీగా తరలివచ్చారు. ఆందోళనకు సిద్ధంకాగా పోలీసులు నచ్చచెప్పారు. తప్పనిసరిగా న్యాయం జరిగేలా చూస్తామని ఎస్సై కిరణ్కుమార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. డ్రైవింగ్ చేస్తుండగా ఫోన్కాల్ పక్కనే ఉన్న స్నేహితుడికి స్టీరింగ్ సీటు మారుతుండగా కింద పడి మృతి -
సంప్రదాయానికి పెద్దపీట
సిరిసిల్లటౌన్: మట్టితో తయారు చేసిన వినాయక ప్రతిమలను కొలవడం సంప్రదాయమని మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పాలిమర్స్, సంతోష్ ఎలక్ట్రికల్ ప్రతినిధులు పదేళ్లుగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఏటా సిరిసిల్ల కోర్టు ముందు వెయ్యి నుంచి 2 వేల విగ్రహాల వరకు ఉచితంగా అందిస్తున్నారు. మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు భాస్కర్ నేతృత్వంలో పర్యావరణ రక్షణకు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. నిమజ్జన వేడుకల్లో వాటర్, చల్లా ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. మట్టి విగ్రహాల పంపిణీకి ఇప్పటి వరకు రూ.లక్షకుపైగా వెచ్చించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
..గట్టి సంకల్పం
30 ఏళ్లు దాటింది వినాయక చవిత సందర్భంగా 30 ఏళ్లకుపైగా ఊరంతా కలిసి చందాలు వేసుకుని ఏటా గణనాథుడిని ప్రతిష్టించి పూజలు చేస్తాం. ఊరంతా ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. – ధర్మాజి నగేశ్, బెస్తపల్లి ఒకే మాటమీద ఉంటాం గణపతి నవరాత్రులు వస్తే ఊరంతా ఒక్క మాట మీదనే ఉంటాం. అందరం కలిసి పైసలు జమచేసి విగ్రహం తీసుకువచ్చి తొమ్మిది రోజులు పూజలు చేస్తం. ఇంటిల్లిపాది అక్కడకే వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. – బోరే లింగయ్య, బెస్తపల్లి నా ఎడ్ల బండిపైనే.. ఎనకట మా ఊర్ల పెట్టిన వినాయకుడిని నా ఎడ్ల బండిపైనే గోదావరినదికి తీసుకుపోయి నిమజ్జనం చేసిన. కొన్నేళ్ల నుంచి పిల్లలంతా ఊరేగింపు చేసి తీసుకుపోయి నదిలో నిమజ్జనం చేస్తున్ను. – తోకల వెంకటి, బెస్తపల్లి -
గడపగడపకు..
సిరిసిల్లటౌన్: పట్టణంలోని 24వ వార్డులో వ్యాపారవేత్త, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మందితో శ్రీనిధి పరస్పర సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. 15 ఏళ్లుగా సంఘం ఆధ్వర్యంలో వార్డులోని 350 ఇళ్లకు మట్టి వినాయకులను అందిస్తున్నారు. అలాగే స్థానిక శివనగర్ రాజరాజేశ్వరస్వామి ఆలయం వేదికగా ఏడాదికి 2 వేల వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజాప్రతినిధులు గోశికొండ హన్మంత్ పంతులు, బూర కిష్టయ్య తదితరులు ఈ భగవత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇప్పటి వరకు 20 వేల విగ్రహాలను పంపిణీ చేశారు. -
ఏటా వెయ్యి విగ్రహాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని వివిఽ ద గ్రామాల భక్తులకు నలమాచు శ్రీనివాస్ శైలజ దంపతులు 18 ఏళ్లుగా ఏటా వెయ్యి మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పిల్లలకు మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం వల్ల వారు మట్టి వినాయకులనే మండపాలలో ప్రతిష్టించి పూజించాలనే అవగాహనకు వస్తారని శ్రీనివాస్ తెలిపారు. త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో..జ్యోతినగర్(రామగుండం): పర్యావరణ పరిరక్షణకు తాము సైతం అంటూ ఏటా మట్టి వినాయకుడి విగ్రహాలతో ఉత్సవాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్టీపీసీ రామగుండం అ న్నపూర్ణకాలనీలో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఈసారి 15 ఫీట్ల వినాయకుడిని ప్రతిష్టించనున్నారు. మట్టి వినాయకుడిని పూ జించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతున్నారు. -
మట్టి విగ్రహాలకు కేరాఫ్ బొమ్మకల్
కరీంనగర్రూరల్: మట్టి విగ్రహాల తయారీకి కేరాఫ్ అడ్రస్గా బొమ్మకల్ మారింది. 14 ఏళ్ల నుంచి బొమ్మకల్ బైపాస్లో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో కొంతమంది యువకులు గాయత్రి పర్యావరణ సంస్థను ప్రారంభించి పీవోపీ విగ్రహాలతో కలుగుతున్న అనర్థాలపై ప్రచారం చేపట్టారు. అనంతరం సంస్థ సభ్యుడైన తోట కిరణ్కుమార్ 2011 నుంచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వంతెన వద్ద మట్టి విగ్రహాల తయారీకి శ్రీకారం చుట్టాడు. కలకత్తా కళాకారులతో వినాయక, దుర్గామాత విగ్రహాలను తయారు చేయిస్తున్నాడు. 2 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలున్నాయి. మట్టి విగ్రహాలకు ఆదరణ మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించేందుకు నిర్వాహకులు మొగ్గుచూపుతున్నారు. పదేళ్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. 14 ఏళ్ల నుంచి వివిధ రూపాల్లో మట్టి ప్రతిమలను రూపొందిస్తున్నాం. – తోట కిరణ్కుమార్, నిర్వాహకుడు -
ఎన్టీపీసీలో కొత్త నియామకాలు చేపట్టాలి
● ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు బాబర్ సలీంపాషా జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీలో 2వేల మంది పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని ఎన్టీపీసీ ఎన్బీసీ సభ్యుడు, ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ జ్యోతికహాల్లో శనివారం ఎనిమిదో ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ రెండు రోజుల సమావేశాలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అడిషనల్ ఎన్బీసీ సభ్యుడు చంద్రవంశీ అధ్యక్షత వహించారు. బాబర్ సలీంపాషా మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టడం లేదన్నారు. వారిస్థానంలో కాంట్రాక్ట్ కార్మికులతో బాధ్యతా రహిత పనులు చేయిస్తున్నారనా ఆరోపించారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల్లో ఫ్యూయల్ గ్యాస్ డీ సల్ఫరైజేషన్(ఎఫ్జీడీ)లను ఏర్పాటు చేసేందుకు రూ.వందల కోట్లువెచ్చించి ఇటీవల కొత్త చిమ్నీలు నిర్మించారని, ఎఫ్జీడీలతో పనిలేదని కార్పోరేట్ అధికారులు పకటించడంతో సంస్థకు రూ. వందల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన స్పష్టం చేశారు. ఎఫ్జీడీలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని ఎన్టీపీసీల్లో 70 శాతం మంది ఉద్యోగులు ఐఎన్టీయూసీని గెలిపించుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఐఎన్టీయూసీకి పట్టం కడుతున్నారని అన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా బీఎంఎస్ మినహా జాతీయ కార్మిక సంఘాలు 13సార్లు సమ్మె చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని దుయ్యబట్టారు. రామగుండం ఎన్టీపీసీలో నాయకత్వం లేని బీఎంఎస్ గెలుపు కోసం ఆరాటపడుతోందని ఎద్దేవా చేశారు. ఎన్టీపీసీ ఉద్యోగులకు కేరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(సీడీపీ)లో శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతినిధులు ధర్మేంద్రప్రధాన్, సత్యనారాయణ సాహూ, వేముల కృష్ణయ్య, ఆరెపల్లి రాజేశ్వర్, కొలిపాక సుజాత, భూమల్ల చందర్తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీపీసీల ఐఎన్టీయూసీ ప్రతినిధులు హాజరయ్యారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్యతంగళ్లపల్లి(సిరిసిల్ల): అనారోగ్యం, అప్పుల బాధతో తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన ముద్రకోల లోకేశ్(26) కొద్దిరోజుల క్రితం హైదరాబాద్లో ర్యాపిడోలో పనిచేస్తుండేవాడు. అక్కడ అనారోగ్యం బారిన పడడంతో స్వగ్రామం వచ్చి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. కానీ ఆరోగ్యం కుదుటపడకపోగా అప్పులు పెరి గాయి. తీవ్ర మనస్థాపానికి గురైన లోకేశ్ శని వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడికి తండ్రి తిరుపతి, తల్లి సుశీల, చెల్లెలు కావ్య ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెల్గటూర్: అనారోగ్యంతో వృద్ధుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎండపల్లి మండలం కొండాపూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇప్పల రాజయ్య కొంతకాలంగా హైబీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నాడు. శనివారం తన భార్యతో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. పొలం పక్కన ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. రాజయ్య భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రిలో వ్యక్తి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆందోళన జగిత్యాల: జగిత్యాలలోని గొల్లపల్లిరోడ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి మృతిచెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. తిప్పయపల్లికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో ఈనెల 18న ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యశ్రీ ఉండటంతో వైద్యులు ఆపరేషన్కు అప్రూవ్ ఇచ్చి శనివారం ఆపరేషన్కు సిద్ధమయ్యారు. అంతలోనే ఆయన చనిపోయాడు. ఇది ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. సంఘటన స్థలానికి సీఐ కరుణాకర్ చేరుకుని బంధువులకు నచ్చజెప్పడంతో శాంతించారు. -
భక్తులపై నీళ్లు చల్లే ‘గణేశుడు’
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడలో కొలువుదీరే గడ్డి గణేశుడు తన తొండం నుంచి భక్తులపై నీళ్లు చల్లడం ఇక్కడి ప్రత్యేకత. 49 ఏళ్ల క్రితం గడ్డి, బట్ట, వెదురుకర్రలతో తయారు చేయడం మొదలు.. ఇప్పటికీ అదే రీతిన భారీ ఆకారంలో గణేశుడిని తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ హితం కోసం గడ్డి వినాయకుడిని తయారు చేసుకుని ఉత్సవాలు జరుపుకుంటున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. గడ్డి వినాయకుడికే పూజలు తెనుగువాడలో విఠల్ అనే వ్యక్తి తొలిసారి గడ్డితో వినాయకుడిని తయారుచేశాడు. తర్వాత తమ కాలనీకే చెందిన బూతగడ్డ మధునయ్య, గరిగంటి మల్లయ్య ఆ బాధ్యతలు తీసుకున్నారు. తమ వినాయకుడి తయారీలో ప్రకృతి సిద్ధంగా దొరికే సామగ్రి వాడుతాం. – కొలిపాక రాయలింగు, పెద్దపల్లి -
మంత్రపురిలో 110 ఏళ్లుగా..
మంథని: మంథనికి చెందిన బ్రాహ్మణ సామాజికవర్గం వంటలు చేసేందుకు మధ్యభారత్లోని నాగ్పూర్ (ప్రస్తుత మహారాష్ట్ర) వెళ్లేవారు. అక్కడి సంప్రదాయాన్ని మంథనికి తీసుకొచ్చి గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించారు. బాలగంగాధర్ తిలక్ 1913లో ముంబైలో ప్రారంభించిన గణేశ్ ఉత్సవాల స్ఫూర్తితో మంథనిలో సర్వజన– గజానన మండలి ఏర్పాటు చేసి 1916 నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. నాగ్పూర్, మంథనిలోనే సిద్ధి, బుద్ధి.. మహారాష్ట్రలోని నాగ్పూర్, మంథని మినహా దేశంలో ఎక్కడా సిద్ధి, బుద్ధి విగ్రహాలతో గణేశ్ దర్శనం లభించదు. నాడు నాగ్పూర్లో గణపతి విగ్రహాన్ని సేకరించి రైలులో బల్హార్ష వరకు వచ్చి, అక్కడి నుంచి విగ్రహానికి గుడ్డలు చుట్టి, ఎడ్లబండిలో మంథని గోదావరి తీరం వరకు తీసుకొచ్చి తర్వాత కాలిబాటన నిజాం పోలీసుల కంట పడకుండా రహస్యంగా మంథనికి చేర్చినట్లు అప్పటివారు చెప్పారని నిర్వాహకులు చెబుతారు. మంథని పెంజేరుకట్ట హనుమాన్ ఆలయంలో గణపతి ఉత్సవాలను 1916 నుంచి నిర్వహిస్తున్నారు. మోతారాం గారి రాజేశ్వర్రావు, టక్కేగారి మల్లన్న, మంథని లింగయ్య తదితరులు నాడు ఉత్సవాల నిర్వహణ చూసేవారు. అలాగే నడివీధిలో 1918 నుంచి, మందాట వీధిలో 65 ఏళ్లుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. రావుల చెరువుకట్టతో పాటు మంథనిలోని ఆయా వార్డుల్లోనూ 50 ఏళ్లుగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. -
కరీంనగర్ తొలి గణపతి
కరీంనగర్కల్చరల్: కరీంనగర్లో మొదటిసారిగా 1950లో పాతబజార్లోని చిన్న హనుమాన్ ఆలయ ప్రాంగణంలో గణపతి నవరాత్రోత్సవాలు ప్రారంభించారు. బ్యాంక్ ఉద్యోగి ఆర్.పెంటయ్య సహకారంతో కె.నర్సయ్య, పి. నందయ్య, పి.ఓంకార్, రామన్న, ఆ ప్రాంతవర్తకుల ఆధ్వర్యంలో మంగళపెల్లి గోపాల్కృష్ణయ్యశర్మ, శంకర్శర్మ నేతృత్వంలో రాగిమట్టితో చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈసారి 75 ఏళ్ల వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నిమజ్జనం రోజు టవర్ సర్కిల్లో పాతబజార్ గణపతి తుది పూజలు అందుకున్న తర్వాతే శోభాయాత్ర ప్రారంభమవుతోంది. -
హిందూ సేవక్ సమితి ఆదర్శం
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో ఏటా వినాయక ఉత్సవాల్లో హిందూ సేవక్ సమితి గణపతి హైలెట్గా నిలుస్తున్నారు. పర్యావరణ హితమే తమ అభిమతమని యువత భక్తిభావంతో పాటు సామాజిక స్పృహను చాటుతున్నారు. 15 ఏళ్లుగా స్థానిక పద్మనగర్కు చెందిన హిందూ సేవక్ సమితి నిర్వాహకులు మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. వడ్లకొండ దేవదాస్ ఆధ్వర్యంలో స్థానిక యువకులు ఒక్కో ఏడాది వినాయకుడు ఒక్కో రూపంలో ఉండేలా చూస్తున్నారు. 10 నుంచి 14 అడుగుల ఎత్తులో ఉండే మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రత్యేకత. చందాలకు వెళ్లకుండానే సొంత డబ్బులతో 25 మంది యువకులు కలిసి సంఘాన్ని ఏర్పాటు చేసి వేడుకలు జరుపుతున్నారు. -
గణనాథుని కొలువు..‘కోరుట్ల’
కోరుట్ల: ఆధ్యాత్మికత, జీవకళ, వైవిధ్యం మేళవించిన కోరుట్ల గణనాథుల విగ్రహాలకు ఏటా ఎక్కడా లేని డిమాండ్. సుమారు 50 ఏళ్లుగా వినాయక విగ్రహాల తయారీకి పెట్టింది పేరుగా నిలుస్తోంది. పట్టణంలో ప్రస్తుతం 25 వరకు వినాయక విగ్రహా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సుమారు వెయ్యిమంది కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారు చేసిన భారీ విగ్రహాల ధర రూ. 50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుందంటే ఆతిశయోక్తి కాదు. మండపాల నిర్వాహకులు వీటి కోసం వినాయక చవితి ఉత్సవాలకు ఆరునెలల ముందుగానే అడ్వాన్స్ చెల్లిస్తారు. టర్నోవర్ సుమారు రూ.5 కోట్లు కోరుట్లలోని గణనాథుల విగ్రహా తయారీ కేంద్రాల్లో ప్రతీ సీజన్లో సుమారు 3–4 వేల విగ్రహాల అమ్మకాలు సాగుతాయి. ఇక్కడి విగ్రహాలను కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల మండపాల నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. ఏటా విగ్రహాల తయారీ కేంద్రాల టర్నోవర్ దాదాపు రూ.3–5 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
ఆరోగ్య సేవలకు తాళం
సౌకర్యాలు కరువు.. వైద్యులు లేరుచొప్పదండి: పట్టణంలోని ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల పీహెచ్సీలో వైద్య సేవలు గాడి తప్పా యి. ఆయుష్తో కలిసి నలుగురు డాక్టర్లను కేటా యించగా, డిప్యుటేషన్పైనే కొనసాగిస్తున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్గ్రేడ్ చేసినా సేవలు విస్తరించక పోవడంతో పీహెచ్సీగానే కొనసాగుతోంది. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా, డాక్టర్లు ముందే వెళ్లిపోతుండడంతో నర్సులపైనే ఆధారపడాల్సి వస్తోంది. వైద్యులు కరీంనగర్ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో రాత్రిపూట అత్యవసర వైద్యసేవలకు ఇబ్బంది ఏర్పడుతోంది. మరుగుదొడ్డి ద్వారా నికి మరమ్మతు చేయక పోవడంతో తాడుతో డోరును బిగించడం గమనార్హం. పీహెచ్సీ ఆవరణలో గడ్డి తొలగించకపోవడంతో దోమలు ఆవాసం ఏర్పరుచుకుంటున్నాయి. -
రోబోటిక్ విద్యను సద్వినియోగం చేసుకోవాలి
సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ ఆధ్వర్యంలో అందిస్తున్న రోబోటిక్ విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సప్తగిరికాలనీ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులు ప్రదర్శించిన రోబోటిక్ ప్ర యోగాలను శనివారం పరిశీలించారు. జిల్లాలోని 15 ప్రభుత్వ పాఠశాలల్లో సోహం అకాడమీ రోబో టిక్స్ ఎడ్యుకేషన్ను ఉచితంగా అందిస్తున్నదన్నారు. నేర్చుకున్న అంశాల ద్వారా విద్యార్థులు సొంతంగా ప్రయోగాలు చేసేలా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సోహం అకాడమీ ఫౌండర్ సహదేవ్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా క్రీడా పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: జాతీయ క్రీడా వారోత్సవాలను కలెక్టర్ పమేలా సత్పతి శనివారం స్థానిక సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. పాఠశాలలోని ప్రాథమిక, అంగన్వాడీ చిన్నారులకు పోటీలు నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి జెండా ఊపి రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానం సాధించిన వారికి పతకాలు ప్రదానం చేశారు. డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్రెడ్డి, సీపీడీవో సబిత, జిల్లా సైన్స్ అధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. -
మట్టి గణపతి
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025మట్టి గణపతిని తయారు చేస్తున్న రమేశ్ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పర్యావరణ హితమైన మట్టి ప్రతిమల ప్రతిష్ఠకే మొగ్గు చూపుతున్నారు. చిన్నచిన్న విగ్రహాలు మొదలు.. భారీ విగ్రహాల వరకు మట్టి గణపతులనే పూజిస్తామంటున్నారు. నాటి పద్ధతులను ఇప్పటికీ పాటిస్తూ పాతతరంవారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నవరాత్రులు నిర్వహిస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఊరంతా కలిసి ఒకే మండపం ఏర్పాటు చేస్తూ ఐకమత్యాన్ని చాటి చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు కొందరు స్వచ్ఛందంగా మట్టి ప్రతిమలను తయారు చేస్తూ.. వారు ప్రతిష్ఠించడంతో పాటు ఇంటింటా పంపిణీ చేస్తున్నారు. విగ్రహాల తయారీకి కరీంనగర్, కోరుట్ల కేరాఫ్గా మారాయి. ఇక్కడ గంగమట్టితో తయారు చేసిన ప్రతిమలను వివిధ ప్రాంతాలకు చెందిన వారు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని ఒక్కో ప్రాంత మండపానికి ఒక్కో ప్రత్యేకత ఉండగా.. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కథనాలు.. – మరిన్ని కథనాలు 8లోu -
చిల్లరగాళ్లతో న్యూసెన్స్ చేస్తున్నారు
కరీంనగర్ కార్పొరేషన్/గంగాధర: తన నియోజకవర్గంలో కొంతమంది చిల్లరగాళ్లకు కేటీఆర్ డబ్బులు ఇచ్చి న్యూసెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నియోజకవర్గంలో కొత్తగా ఒక ఎకరాకు నీళ్లిచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. గాయత్రి పంప్హౌస్ సందర్శనకు వచ్చిన నేతలు బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు నీళ్లిచ్చారో కేటీఆర్, హరీశ్రావు చెప్పాలని డిమాండ్ చేశారు. కొండగట్టుకు రూ.500 కోట్లు ఇస్తానన్న కేసీఆర్, కనీసం రూ.5కూడా ఇవ్వలేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో చిల్లరగాళ్లకు డబ్బులు ఇచ్చి న్యూసెన్స్ చేస్తే, సిరిసిల్ల, సిద్దిపేటలో కూడా తాము అలానే చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలు చేస్తే నాలుక చీరేస్తామని, పండబెట్టి తొక్కుతామని ధ్వజమెత్తారు. గంగాధరలో త్వరలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వు రానుందన్నారు. గతంలో వైఎస్ఆర్ హయాంలో ఇండ్లు ఇచ్చామని, ఇప్పుడు రేవంత్ ఆధ్వర్యంలో ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఆదివారం గంగాధరలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, ఓబీసీ సెల్ రుద్ర సంతోష్ పాల్గొన్నారు. అనంతరం శనివారం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు నిర్వహించే మీనాక్షి నటరాజన్ జనహిత యాత్ర రూట్ మ్యాప్ను, మధురానగర్లో నిర్వహించే రోడ్షో ప్రాంతాన్ని పరిశీలించారు. -
రాజన్న సన్నిధిలో నిత్యాన్నదాన సత్రం
సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాజన్న ఆలయ సమీపంలో ప్రభుత్వం తలపెట్టిన విస్తరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తరహాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం సమీపంలో నిర్మించనున్న నిత్యాన్నదాన సత్రం పనులు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పనులను ప్రారంభించనున్నారు. గంగాధరలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ‘జనహిత’ పాదయాత్రకు ముందే మంత్రులు వేములవాడలో నిత్యాన్నదానం పనులను ప్రారంభించి, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. దాదాపు రూ.40కోట్ల బడ్జెట్తో రూపొందించిన ప్లాన్, డిజైన్లను ఇప్పటికే వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ (వీటీడీఏ) ఖరారు చేసింది. ఈ పనులతోపాటు వేములవాడలో పలు రోడ్ల విస్తరణ పనులు ఆదివారం నుంచి పునఃప్రారంభం కానుండగా, తిప్పాపూర్ వద్ద అదనపు పనులు కూడా వేగం పుంజుకోనున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం రెండెకరాల సువిశాల స్థలంలో దాదాపు రూ.40 కోట్లతో పనులు చేపట్టనున్నారు. మొత్తం రెండంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో తొలి అంతస్తులో ఒకేసారి 1500 మంది భక్తులు భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తున్నారు. రోజుకు 15,000 మంది భోజనం చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. భవిష్యత్తులో భక్తుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా రెండో అంతస్తును కూడా వినియోగంలోకి తీసుకువస్తారు. అప్పుడు రోజుకు 30వేల మంది భోజనం చేసే వీలుంటుందని అధికారులు తెలిపారు. కిలోమీటరు వరకు విస్తరణ షురూ.. వేములవాడలోని తిప్పాపూర్ వంతెన నుంచి రాజరాజేశ్వర స్వామి దేవాలయం వద్దకు దాదాపు 1.1 కిమీ దూరం వరకు తలపెట్టిన రోడ్డు విస్తరణ పనులు పునః ప్రారంభం కానున్నాయి. గతంలో పలు న్యాయ వివాదాలు ఎదురైనప్పటికీ.. వాటిని విజయవంతంగా ఎదుర్కొన్న కలెక్టర్ సందీప్కుమార్ ఝా పనులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మాస్టర్ప్లాన్లో రాజీపడకుండా.. రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు. తిప్పాపూర్ వద్ద రూ.15 కోట్లతో అదనపు వంతెన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే టెండర్లు పూర్తయిన ఈ పనులను గుత్తేదారు ప్రారంభించారు. ప్రస్తుతం మట్టి తవ్వకాలు నడుస్తున్నాయి. గతేడాది నవంబరులోనే వేములవాడ ఆలయానికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. -
విక్రయాలకు కేరాఫ్
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట పరిసర ప్రాంతాల్లో తయారవుతున్న వినాయక విగ్రహాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తరలుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 40 దుకాణాల్లో గణేశుని విగ్రహాలను తయారు చేస్తున్నారు. సుమారు 300 మంది ప్రత్యక్షంగా, మరో 300 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. రాజస్థాన్కు చెందిన కార్మికులు విగ్రహాల తయారీలో నిష్ణాతులు కాగా.. స్థానిక కార్మికులు కలరింగ్, అద్దకం పనుల్లో పాల్పంచుకుంటున్నారు. సుమారు రూ.20 వేల నుంచి రూ.లక్ష విలువ చేసే విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ను బట్టి ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది నచ్చిన ప్రతిమలకు అడ్వాన్స్ రూపంలో చెల్లిస్తూ రిజర్వ్ చేసుకుంటున్నారు. మట్టి వినాయకులపై అవగాహన పెరగడంతో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రతిమలకు గిరాకీ తగ్గిందని చెబుతున్నారు. -
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి
కరీంనగర్క్రైం: పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. నగరంలోని మర్కజీ మిలాద్ కమిటీ, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ, మదరసా అన్వార్ ఉల్ ఉలూమ్ కమిటీ పెద్దలతో శనివారం సమావేశం నిర్వహించారు. గణేశ్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ పండుగలను శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పది రోజుల పాటు నిర్వహించే జల్సాలు, చివరి రోజు జరిగే జులూస్కు శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా షరతులతో కూడిన అనుమతి ఇస్తున్నామని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొన్నారు. 13న జరిగే లోక్ అదాలత్ కోసం సమావేశం సెప్టెంబర్ 13న నిర్వహించే లోక్ అదాలత్లో రాజీపడే కేసులను కోర్టులవారీగా పరిష్కరించాలని సీపీ గౌస్ ఆలం జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ను కోరారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్లో కో ఆర్డినేషన్ మీటింగ్లో పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్లో ఉండి, రాజీపడే కేసుల వివరాలను చర్చించారు. సైబర్ నేరాల్లో ఖాతాల్లో నిలిపివేయబడిన మొత్తాన్ని బాధితులకు రిఫండ్ చేసే అంశాన్ని లోక్ అదాలత్ సమయంలో మాత్రమే కాకుండా రెగ్యులర్గా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
చేతి సంచులు.. కొత్త రేషన్ కార్డులు
కరీంనగర్ అర్బన్: కొన్నాళ్లుగా కొత్త రేషన్ కార్డులకు నోచుకోని వారికి కొత్త కార్డులు మంజూరయ్యాయి. అలాగే చౌకధరల దుకాణాల్లో చేతి సంచులు ఇవ్వనున్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు జూట్ బ్యాగులను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే మండలస్థాయి నిల్వ కేంద్రాలకు(ఎంఎల్ఎస్ పాయింట్) చేతి సంచులు చేరగా సెప్టెంబర్ నుంచి డీలర్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇక జిల్లాలో కొత్త రేషన్ కార్డుదారులకు సెప్టెంబర్ నుంచి సరుకులు అందనున్నాయి. జూన్ వరకు 2.79లక్షల కార్డులుండగా కొత్తగా 37,474 కార్డులు మంజూరయ్యాయి. చేతి సంచులపై పథకాల ముద్రణ సెప్టెంబర్లో రేషన్ బియ్యంతో పాటు చేతి సంచులు ఇవ్వనున్నారు. రూ.50 విలువ చేసే బ్యాగును అందించనుండగా నిత్యావసర వస్తువులు, కూరగాయల విక్రయాలకు ఉపయోగపడనుంది. సదరు బ్యాగుపై ఆరు పథకాలకు సంబంధించిన చిత్రాలను ముద్రించారు. ఎంఎల్ఎస్ పాయింట్లకు సదరు బ్యాగులు చేరగా వాటిని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో కార్డుదారుకు ఒక్కో బ్యాగు ఇవ్వనున్నారు. 37,474 కార్డులకు బియ్యం కొన్నేళ్లుగా రేషన్కు నో చుకోని కుటుంబాలకు ఇక సన్న బియ్యం చేరనున్నాయి. మూడునెలల క్రితం కార్డులు మంజూరు కాగా 3 నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో బియ్యం తీసుకోలేకపోయారు. సెప్టెంబర్ నుంచి ప్రతినెలా బియ్యం పంపిణీ చేయనుండగా 37,474 కుటుంబాలకు లబ్ధి కలగనుంది. జూన్ వరకు 2.79లక్షల కార్డుదారులుండగా 10లక్షల యూనిట్లున్నాయి. తాజాగా పెరిగిన సంఖ్యతో కార్డుదారుల సంఖ్య 3లక్షలు దాటింది. కొత్త కార్డుల్లో 1,09,994 యూనిట్లు పెరగగా యూనిట్ల సంఖ్య 11 లక్షలు దాటింది. అలాగే రేషన్ కార్డుల్లో పేర్ల చేర్పులకు సంబంధించి 52,992 దరఖాస్తులను అప్రూవ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ ఉద్యోగులు వివరించారు. -
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో..
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో అత్యధికశాతం ఉండే పద్మశాలి సామాజికవర్గం వారే తొలిసారిగా గణపతి ఉత్సవాలను నిర్వహించారు. స్థానిక గాంధీచౌక్లో అప్పటి పుర ప్రముఖులు రుద్ర శంకరయ్య, మడూరి అంబాజి, భీమనాఽథిని నారాయణ, కుడిక్యాల రాజారాం, ఎలగొండ నారాయణ సమాజ సేవా సంఘాన్ని ఏర్పాటు చేసి మొదటి గణపతిని ప్రతిష్ఠించారు. 1947 నుంచి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం స్థానిక మార్కండేయ భవనంలో 79వ వినాయక చవితి ఉత్సవాలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా గోలి వెంకటరమణ కొనసాగుతున్నారు. సిరిసిల్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో 1948 నుంచి వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు. తొలితరంలో గాండ్ల వీరయ్య నేతృత్వంలో సంఘాన్ని స్థాపించారు. ఈ ఏడాదితో 78వ వార్షికోత్సవం జరుపుతున్న వర్తక సంఘానికి ప్రస్తుతం పుల్లూరి వేణు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
ఎల్ఎండీకి నీటి విడుదల
బోయినపల్లి(చొప్పదండి)/ఇల్లంతకుంట(మానకొండూర్): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి శనివారం ఎల్ఎండీకి 8,018 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ప్యాకేజీ–10 అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 9,600 క్యూసెక్కుల నీరు వెళ్తోంది. మిడ్మానేరులోకి ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి 21,368 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 17.936 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మిడ్మానేరు గేట్లు ఎత్తడంతో ఇల్లంతకుంట మండలం కందికట్కూర్, పొత్తూరు గ్రామ శివారు నుంచి మానేరువాగు ప్రవహిస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. కరీంనగర్క్రైం: కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాలలోని తెలుగు, కామర్స్, వృక్షశాస్త్ర విభాగాలను పరిశోధనా కేంద్రాలుగా గుర్తిస్తూ శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జాస్తి రవికుమార్ ఉత్తర్వులు జారీ చేశారని ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో శనివారం మాట్లాడుతూ.. శాతవాహన యూనివర్సిటీ అధికారు ల బృందం ఈ మూడు విభాగాల్లోని ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్లు, గ్రంథాలయాలు, అధ్యాపకుల పరిశోధన పత్రాలు, రచించిన గ్రంథాలను తనిఖీ చేసి పరిశోధన కేంద్రాలుగా గుర్తించినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టి.రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడారు సురేందర్రెడ్డి, పరి శోధన కమిటీ సమన్వయకర్త ఎం.మల్లారెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్క్రైం: హుస్నాబాద్లోని గాంధీనగర్లో ఉన్న శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కె.తిరుపతిరెడ్డి తెలిపారు. సీఎస్ఈ, ఈసీఈ, సీఎస్సీఏఐ కోర్సుల్లో ఎక్కడా అడ్మిషన్ తీసుకోని ఆసక్తి గల అభ్యర్థులు ఉదయం 11 గంటల వరకు కళాశాలలో ఇంటర్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీతో హాజరుకావాలని సూచించారు. -
తెల్లవారకముందే లైన్లోకి..
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతు న్నాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పీఏసీఎస్కు యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు శనివారం కార్యాలయం తీయకముందే ఆధార్ కార్డులు లైన్లో పెట్టి వేచి ఉన్నారు. డోర్నకల్ మండలం కస్నాతండా సమీపంలోని పీఏసీఎస్ కార్యాలయం ఎదుట రైతులు క్యూ కట్టారు. రైతులు భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసుల సమక్షంలో యూరియా పంపిణీ చేశారు. గూ డూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఎదుట తెల్లవారు జామున 4 గంటలకే క్యూ లో నిలబడ్డారు. మహబూబాబాద్లో రైతులు మధ్యా హ్నం సమయంలో తమకు బస్తాలు వస్తాయో రావో అనే దిగులుతో ఏఓ తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. కరీంనగర్ జిల్లాలో...కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కెపల్లి సహకార సంఘం గోదాంకు శనివారం మధ్యాహ్నం లారీలో 230 బస్తాలు వచ్చాయి. 500 మందికి పైగా గోదాం వద్దకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు క్యూలో నీరసించారు. సహకార సిబ్బంది ఒక్కరికి ఒక బస్తా చొప్పున టోకెన్లు ఇచ్చారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గోదాంకు లారీ యూరియా వచ్చింది. 15 రోజుల క్రితం ఆధార్ కార్డు ఇచ్చిన వారికే టోకెన్లు ఇవ్వడంతో ఓ రైతు యూరియా ఇవ్వకుంటే షట్టర్ మూసివేస్తానని సిబ్బందితో వాదనకు దిగాడు.పోలీసు బందోబస్తుతో 450 బస్తాలను రైతులకు అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తికి శనివారం యూరియా లోడ్ వచ్చింది. ఆదివారం పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెప్పడంతో రైతులు తమ చెప్పులను క్యూలో విడిచి వెళ్లారు.300 బస్తాలు వచ్చాయి.. 102 మందికి పంపిణీశనివారం ఆత్మకూర్ పీఏసీఎస్ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కట్టారు. మధ్యాహ్నం 3:30 గంటలకు 300 బస్తాలతో లోడ్ కావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసుల భద్రత మధ్య సాయంత్రం వరకు 102 మందికి పంపిణీ చేశారు.యూరియా కోసం నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద రైతులు శనివారం తెల్లవారుజాము నుంచే వరుసలో నిల్చున్నారు. శుక్రవారం రాత్రి యూరియా లారీ లోడ్ వచి్చందన్న సమాచారంతో భారీగా తరలివచ్చారు. గోదాము తెరవకముందే వచ్చి వరుసలో నిలబడి నిరీక్షించారు. పోలీసుల బందోబస్తు నడుమ ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియాను పంపిణీ చేశారు. -
కరెంట్ షాక్తో బీఆర్ఎస్ నేత మృతి
● మృతిపై కుటుంబ సభ్యుల అనుమానం ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ మాజీ సర్పంచ్ గందం వరలక్ష్మి భర్త, బీఆర్ఎస్ నాయకుడు గందం నారాయణ(53) శుక్రవారం కరెంట్ షాక్తో మరణించినట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. నారాయణ ఉదయం 7 గంటలకు వరి పొలానికి నీళ్లు పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్లారు. స్టార్టర్ డబ్బా బయట ఉన్న తీగ ప్రమాదవాశాత్తు తగలడంతో షాక్కు గురై పోయాడు. ఆయన కుమారుడు అక్షయ్ వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. గ్రామస్తుల అనుమానాలు నారాయణ మృతిపై గ్రామస్తులతో పాటు కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నారాయణ ప్రతీరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తారని, దీనిని అవకాశంగా తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు కరెంట్ మోటార్ స్టార్టర్ డబ్బాలోని తీగను బయటకు తీసుకవచ్చారని, బావివద్దకు వెళ్లేదారిలో దానినుంచి జే వైర్కు కనెక్షన్ ఇచ్చి వదిలేశారని అంటున్నారు. మోటార్ ఆన్ చేసేక్రమంలోనే జే వైరును చూడకుండా ప్రమాదవాశాత్తు తగిలి షాక్కు గురై మరణించినట్లు పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో పదేళ్ల శిక్ష గోదావరిఖని: పోక్సో కేసులో వ్యక్తికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పెద్దపల్లి కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి కథనం ప్రకారం.. ఓ ప్రభుత్వ స్కూల్లో స్వీపర్గా పనిచేస్తున్న షేక్ సర్వర్.. 2019లో తరగతి గదిలోకి వెళ్లి తలుపులు మూసివేశాడు. బాలికపై ను అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాలిక తప్పించుకునేందుకు యత్నించగా.. కొట్టి ఎవరికీ చెప్పవద్దని బెదిరించి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లి విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. ఈమేరకు అప్పటి వన్టౌన్ సీఐ రమేశ్ కేసు నమోదు చేయగా, ఏసీపీ ఉమేందర్ దర్యాప్తు చేశారు. జిల్లా జడ్జి ఇరుపక్షాల వాదనలు విన్నారు. నేరం రుజువుకావడంతో షేక్ సర్వర్కు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.సునీత తీర్పునిచ్చారు. నేరస్తుడికి శిక్ష పడడంలో ముఖ్యపాత్ర పోషించిన పీపీ రమేశ్, సాక్షులను ప్రవేశపెట్టడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, కోర్టు కానిస్టేబుళ్లు సతీశ్కుమార్, కోటేశ్వర్రావును రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, డీసీపీ కరుణాకర్ అభినందించారు. -
ఖమ్మంపల్లిలో మహిళకు డెంగీ
ముత్తారం(మంథని): ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన అక్కపాక రాజేశ్వరికి డెంగీ పాజిటివ్ రావడంతో జిల్లా మలేరియా అధికారి శ్రీరాము లు, స్థానిక ప్రభుత్వ వైద్యుడు అమరేందర్రావు, సిబ్బంది శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. తీవ్రజ్వరంతో ఈనెల 19న కరీంనగ ర్ ప్రభుత్వ అస్పత్రిలో చేరగా.. డెంగీ పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. వైద్యాధికారులు స్పందించి గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటా వైద్య పరీక్షలు చేశారు. 12 మంది రక్తనమూనాలు సేకరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైద్య సిబ్బంది లావణ్య, రమాదేవి, శ్రీనివాస్, శృతి, దుర్గ, సరిత, పంచాయతీ కార్యదర్శి బద్రు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడు మృతి రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామంలో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని దివ్యాంగుడు బి.రాజేందర్ (32) మృతిచెందాడు. ఎస్సై సుధీర్రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కొత్తపేట గ్రామానికి వెళ్తున్న క్రమంలో అల్లీపూర్లో రాజేందర్ రోడ్డు దాటుతుండగా ఢీకొంది. ఈ ప్రమాదంతో రాజేందర్కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం వరంగల్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తల్లి గౌరమ్మ ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్ సారయ్యపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోచమ్మ ఉత్సవాల్లో విషాదం జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణం పురాణిపేటలోని లోకమాత పోచమ్మతల్లి ఆలయంలో జరుగుతున్న 63వ వార్షికోత్సవ కార్యక్రమాల్లో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. పోచమ్మవాడకు చెందిన భక్తుడు క్యాసం వెంకన్న (65) భోజనం చేసేందుకు అన్నదానం వద్ద సిద్ధమవుతుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కిందపడ్డాడు. స్థాని కులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. దర్జీ బలవన్మరణంకోనరావుపేట(వేములవాడ): అనారోగ్య బాధలు భరించలేక ఓ టైలర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన బోయిని మల్లేశం(58) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. తన అనారోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్నోట్ రాసి ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
వేర్వేరు కారణాలతో నలుగురి ఆత్మహత్య
కరీంనగర్క్రైం/మానకొండూర్/శంకరపట్నం/మల్యాల ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ బస్టాండు సమీపంలోని ఓ హోటల్లో ఓ యువకుడు శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ సీఐ రాంచందర్రావు, ఎస్సై రాజన్న వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని బాలబస్తీకి చెందిన మహమ్మద్ సాదిక్పాషాకు ముగ్గురు కొడుకులు. చిన్న కొడుకు మహమ్మద్ మదస్సర్ ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కొన్నాళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ఉద్యోగాలు, చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవించేవాడు. ఉద్యోగం పోయి, చేసిన వ్యాపారంలోనూ నష్టం రావడంతో అప్పులు పెరిగిపోయాయి. జీవితంపై విరక్తి చెంది చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్తున్నానని నరేశ్ అనే స్నేహితుడికి చెప్పి కరీంనగర్ వచ్చాడు. బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో గది తీసుకొని ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. నరేశ్ సాధిక్పాషాకు ఫోన్ చేసి మదస్సర్ చనిపోతానని చెప్పాడని తెలుపగానే హైదరాబాద్లో ఉన్న తమ బంధువులకు సమాచారం ఇచ్చాడు. వారు తుకారాం గేటు పోలీసులను ఆశ్రయించారు. టెక్నాలజీ సాయంతో కరీంనగర్లోని హోటల్ వివరాలు చెప్పగా, శుక్రవారం వారు వచ్చి హోటల్ గదికి కిటికీలో నుండి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి ఉన్నాడు. సాధిక్ పాషా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అత్తింటి వేధింపులతో వివాహిత మానకొండూర్ మండలంలోని ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి శైలజ(28) అత్తింటి వేధింపులతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. ముంజంపల్లి గ్రామానికి చెందిన పిల్లి నాగరాజుకు తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన శైలజతో 2021లో వివాహమైంది. కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 21న పెద్దమనుషుల సమక్షంలో సర్దిచెప్పి వెళ్లిపోయారు. ఇదే రోజు సాయంత్రం శైలజ అత్తారింట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శైలజ తండ్రి గోనెల తిరుమలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. అనారోగ్యంతో.. శంకరపట్నం మండలం కాచా పూర్ గ్రామానికి చెందిన తడిగొప్పుల పోచయ్య(75) అనా రోగ్యంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పోచయ్య మూడేళ్లుగా అనా రోగ్యంతో బాధపడుతున్నాడు. 10 రోజుల క్రితం రూ.లక్ష ఖర్చు చేసి వైద్యం చేయించినా నయం కాలేదు. గురువారం భోజనం చేసిన తర్వాత అందరూ నిద్రపోగా, ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. మల్యాలలో.. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. మల్యాల మండల కేంద్రానికి చెందిన బైరి బీరయ్య భార్య కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేకుండా బాధపడుతోంది. బీరయ్యసైతం అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు రాజమల్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుదాఘాతంతో ప్రైవేట్ కార్మికుడి మృతి
● పరిహారం చెల్లించాలని ఎస్ఈ కార్యాలయం ఎదుట గిరిజన సంఘాల ధర్నాకొత్తపల్లి(కరీంనగర్): సిద్దిపేట జిల్లా అక్కన్నపల్లి మండలం గండిపల్లి గ్రామానికి చెందిన బూక్య భాస్కర్ శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో మృతిచెందాడు. కరీంనగర్లోని ఎన్టీఆర్ విగ్రహం సమీపంలోని ఓ మెస్ ఎదుట టవర్లకు ఎల్టీ లైన్ల పనులను కాంట్రాక్టర్ భూపేశ్ తీసుకోగా.. అతడు సబ్ కాంట్రాక్ట్ కింద తిరుపతికి అప్పజెప్పాడు. ఈ పనులను చేసేందుకు భాస్కర్ను కూలీగా నియమించుకున్నారు. ఎల్టీ లైన్ల పనులు చేస్తున్న క్రమంలో టవర్పై ఉన్న హైవోల్టేజీ విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురై కింద పడగా.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈలోపే భాస్కర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. సాయంత్రం సమయంలో ధర్నా చేపట్టడంతో కార్యాలయంలోని ఉద్యోగులు, సిబ్బంది బయటకు వెళ్లలేక అవస్థలు పడ్డారు. గిరిజన సంఘాల నాయకులు తిరుపతినాయక్, రాజునాయక్, సోమానాయక్, నరసింహనాయక్, రాజు, శ్రేయస్, లక్పతినాయక్, బాధితుని కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షలు ఇచ్చేందుకు కాంట్రాక్టర్ అంగీకరించినట్లు, రూ.50లక్షలు ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. -
సెప్టిక్ ట్యాంక్లో పడి బాలుడి మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణ శివారులోని ఉప్పరిపేటలో కొత్తగా నిర్మిస్తున్న సెప్టిక్ ట్యాంకులో అనుష్మాన్ మణీశ్వర్ (3) ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. మధ్యప్రదేశ్కు చెందిన రాజేందర్, మన్విర్ యునోలి దంపతులకు ఇద్దరు కుమారులు. కొద్దికాలంగా జగిత్యాలలో ఉంటూ మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఉప్పరిపేటలో ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా వెంట ఉన్న చిన్నకుమారుడు అనుష్మాన్ మణీశ్వర్ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్లో పడ్డాడు. వెంటనే గమనించిన వారు నీటి నుంచి బయటకు తీసే సరికి మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేక..జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఓ హాస్టల్లో ఉంటున్న చేతన్ అనే 6వ తరగతి విద్యార్థి హాస్టల్లో ఉండడం ఇష్టంలేక శుక్రవారం లారీ కింద దూకబోయాడు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ ఎస్సై మల్లేశ్ గమనించి అప్రమత్తమై బాలున్ని రక్షించారు. అనంతరం ట్రాఫిక్ ఎస్సై బాలున్ని విచారించగా.. ఈ వినాయక చవితి సమయంలో ఇంటి వద్దే ఉండాలని ఉందని, హాస్టల్లో ఉండలేనని రోదిస్తూ చెప్పాడు. వెంటనే పోలీసులు చేతన్ను స్టేషన్కు తరలించారు. పట్టణ సీఐ కరుణాకర్ బాలుడి తండ్రిని పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించారు. -
అంతుచిక్కని వ్యాధి.. అవస్థల్లో విద్యార్థిని
● పంద్రాగస్టు వేడుకల్లో కుప్పకూలిన కీర్తన ● ఆపన్నహస్తం కోసం వేడుకోలు కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): రాఖీ పౌర్ణమి సందర్భంగా ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపిన విద్యార్థిని.. పండుగ పూర్తయ్యాక కాలేజీకి వెళ్లింది. పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని హఠాత్తుగా కుప్పకూలింది. అప్పట్నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆరెపల్లె గ్రామానికి చెందిన కాంటాల లావణ్య– వీరన్న దంపతుల కూతురు కీర్తన. కరీంనగర్లోని ఓ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువులో ముందుండే బాలిక 15 ఆగస్టు వేడుకల్లో జెండా వందనం చేస్తూ కుప్పకూలింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు కాలేజీకి పరుగెత్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అంతుచిక్కని వ్యాధిగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.10 లక్షల వరకు బిల్లు అయ్యింది. అయినా, ఇంకా నయం కాలేదు. స్థోమతకు మించి అప్పు చేసి వైద్యం చేయించామని, తమ కూతురును ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కూతురును బతికించుకునేందుకు దాతలు సాయం చేయాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నారు. ఆదుకునేవారు ఫోన్ నంబరు 99634 56258లో సంప్రదించవచ్చు. -
ఫొటోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
● ఫొటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ సుల్తానాబాద్(పెద్దపల్లి): మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫొటో, వీడియోగ్రాఫర్లు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని ఫొటో, వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే హుస్సేన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్లో శుక్రవారం జరిగిన ప్రపంచ ఫొటోగ్రఫీ వేడుకల్లో ఆయన మాట్లాడారు ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కుటుంబ భరోసా పథకం ప్రవేశపెట్టామని, దీనిద్వారా ఇప్పటివరకు చనిపోయిన 140 కుటుంబాలకు రూ.2 కోట్లపైగా సాయం చేశామన్నారు. రామగుండం అసోసియేషన్ సభ్యుడు కడమంచి దినేశ్ సంబంధించిన రూ.4,20,000 విలువైన చెక్కును అసోసియేషన్ బాధ్యులకు అందించారు. జిల్లా అధ్యక్షుడు పోగుల విజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు సిరి రవి, రాజేశ్రెడ్డి, మహిమాల కేదార్రెడ్డి, తుమ్మ చందు, మధు, అప్పాసు రామన్న, శ్వాస తిరుపతి, ముక్కెర శ్రీనివాస్, ఎండీ ఇర్ఫాన్, అల్లం సతీశ్, వనపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చాలీచాలని వేతనాలు !
● పర్మినెంట్ కాని ఉద్యోగాలు ● 14 ఏళ్లుగా ఎదురుచూపులే ● ఆందోళనలో ఐఈఆర్పీలువేములవాడరూరల్: చాలీచాలని వేతనాలతో ఏళ్లుగా పనిచేస్తున్నారు. దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్న వారిపై ప్రభుత్వాలకు చిన్నచూపే. ఏళ్లుగా విధులు నిర్వరిస్తున్నా వేతనాలు పెరగక.. ఉద్యోగాలు పర్మినెంట్ కాక ఐఈఆర్పీలు ఆందోళన చెందుతున్నారు. ఒకప్పుడు రాజీవ్ విద్యా మిషన్గా ఉండే వీరిని ప్రత్యేక ఉపాధ్యాయులుగా పిలిచేవారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్స్(ఐఈఆర్టీ) ఇప్పుడు సర్వశిక్ష అభియాన్గా మారింది. భవిత సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్(ఐఈఆర్పీఎస్)ల సేవలు మరువలేనివి. చాలీచాలని వేతనాలతో ఇబ్బంది పడుతున్న వీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిసి తమ సమస్యను విన్నవించారు. స్పందించిన సీఎం వెంటనే సమస్య పరిష్కరిస్తానని మనోధైర్యం కల్పించారు. కానీ ఇప్పటి వరకు వారికిచ్చిన హామీ మాత్రం అమలుకు నోచుకోలేదు. 13 భవిత సెంటర్లు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 13 భవిత సెంటర్లు ఉన్నాయి. అందులో 10 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి గత 14 ఏళ్లుగా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 2014 నుంచి 2019 వరకు రూ.15వేలు ఉన్న వేతనాన్ని 2019 నుంచి ఒక్కరోజు జాబ్తో రెన్యూవల్ చేసి రూ.19,550 ఇస్తున్నారు. జిల్లాలో 13 భవిత కేంద్రాలు ఉండగా ఇందులో 10 మంది విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో విద్యార్థులు 594 మంది ఉన్నారు. చాలా మంది పూర్తిగా అంగవైకల్యం ఉండి భవిత కేంద్రాలకు రాలేని పిల్లల ఇంటికి వెళ్లి ఫిజియోథెరపీ, ఇతర శిక్షణ అందించిన సంఘటనలు ఉన్నాయి. సిరిసిల్ల, గంభీరావుపేట, వేములవాడ అర్బన్ మండలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. చందుర్తి, వేములవాడరూరల్, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, రుద్రంగి, బోయినపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో ప్రభుత్వ బడుల్లోనే ఒక గదిలో భవిత కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇవీ డిమాండ్లు.. -
సిటీలో పోలీసుల కవాతు
కరీంనగర్క్రైం: కరీంనగర్ సిటీలో శుక్రవారం పోలీసులు కవాతు నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ఈ కవాతు బస్టాండ్, వన్టౌన్, కమాన్, రూరల్ పోలీస్ స్టేషన్, శాస్త్రిరోడ్డు, టవర్సర్కిల్, రాజీవ్చౌక్, గాంధీరోడ్డు, మంచిర్యాలచౌరస్తా, కోర్ట్ చౌరస్తా, తెలంగాణ చౌక్ మీదుగా తిరిగి పరేడ్గ్రౌండ్కు చేరుకుంది. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రజలకు భరోసా కల్పించడం పోలీసుల కర్తవ్యమన్నారు. ఏసీపీ వెంకటస్వామి, సీఐలు రాంచందర్రావు, సృజన్రెడ్డి, జాన్రెడ్డి పాల్గొన్నారు. -
ఆధునిక విద్యకు అడుగులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆధునిక బోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల (సమీకృత గురుకులాలు) నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు రెండు స్కూళ్లకు శంకుస్థాపన జరగగా, మరో రెండు స్కూళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. గతేడాది నవంబరులో మంథని, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల(సమీకృత గురుకులాలు)కు మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెద్దపల్లి జిల్లాలోనే రెండు సమీకృత పాఠశాలల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయి. ప్రతీ పాఠశాలను అత్యాధునిక సదుపాయాలతో, పర్యావరణహితంగా సౌరవిద్యుత్తుతో నిర్మించాలనే ఆలోచనలో ప్రభుత్వం ముందుకెళ్తుండడం విశేషం. ఇప్పటికే టెండర్లు పూర్తి చే సుకున్న నాలుగు పాఠశాలలను 2026 దసరా నాటి కి పాఠశాలను ప్రారంభించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో.. వాస్తవానికి 4 తరగతి నుంచి 12 తరగతి వరకు చది వే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యనందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ మేరకు రూ.1,100 కోట్లకుపైగా నిధులు విడుదల చేసింది. తొలిదశలో ఒక్కో గురుకులానికి రూ.145 కోట్లు చొప్పున వెచ్చించి సదుపాయాలు కల్పించనున్నారు. ఇప్పటికే మంథని, హుస్నాబాద్ టెండర్లు పూర్తవగా.. తాజాగా పెద్దపల్లి, రామగుండంలోనూ టెండర్లు అయ్యాయి. రామగుండం నుంచి అంతర్గాంకు వెళ్లే దారిలో సోషల్ వెల్ఫేర్ పాఠశాల సమీపంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం ప్రభుత్వం 27ఎకరాల భూమి కేటాయించింది. పెద్దపల్లి నియోజవర్గంలో ఎలిగే డు మండలం ర్యాకల్దేవ్పల్లి గ్రామం వద్ద 25 ఎకరాల భూమిని కేటాయించారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోనూ మంత్రి పొన్నం గతేడాది నవంబరులోనే శంకుస్థాపన చేశారు. మంథని మండలం అడవిసోమన్పల్లి వద్ద 25 ఎకరాలల్లో సమీ కృత పాఠశాలకు మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ఒక్కో పాఠశాలకు రూ.150కోట్ల చొప్పున ప్రభుత్వ విడుదల చేయనుంది. టెండర్లు ఖరారవగానే.. తొలివిడతగా రూ.30 కోట్ల చొప్పున పనుల కోసం విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలను 25 ఎకరాల్లో నిర్మిస్తారు. 4 నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తారు. తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడల కోసం మైదానం ఏర్పాటు చేస్తారు. వచ్చే దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతీ స్కూల్లో 2500 పైగా విద్యార్థులు, వీరికి 120 మంది టీచర్లతో బోధించనున్నారు. భవనాలు, సదుపాయాలకు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు వెచ్చించనున్నారు. సొంత సోలార్ విద్యుత్తుతో లిప్టులు, వీధిదీపాలు, క్లాస్రూమ్ ఉపకరణాల నిర్వహణ ఉంటుంది. బీసీ, ఎస్టీ, ఎస్టీ విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. -
మంజూరు పోస్టులకు మహర్దశ
కరీంనగర్ అర్బన్: నామమాత్రంగా ఉన్న కొత్త తహసీల్దార్ కార్యాలయాలకు జవసత్వాలనిస్తూ సీసీఎల్ఎ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజన క్రమంలో 2016లో కొత్త మండలాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సదరు తహసీల్దార్ కార్యాలయాలకు క్యాడర్ స్ట్రెంత్ పేరిట కొత్త పోస్టులను మంజూరు చేస్తూ భూ పరిపాలన విభాగం తాజాగా చర్యలు చేపట్టింది. తహసీల్దార్ మొదలుకొని ఆఫీసు సబార్డినేట్ వరకు మొత్తం 51పోస్టులను కేటాయించింది. ఇందులో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంట మండలాలకు పోస్టులను రెగ్యులర్ చేసింది. కొత్త మండలాలు ఏర్పడినట్టే కానీ ఇన్నాళ్లు డిప్యూటేషన్పై విధులు నిర్వహించేవారు. ఆఫీస్ సబార్డినేట్ నుంచి తహసీల్దార్ వరకు ఇదే పరిస్థితి. వేతనాలు ఒక చోట విధులు మరో చోటగా వ్యవహరించారు. పది రెవెన్యూ గ్రామాలున్న మండలానికి ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను కేటాయించగా.. ఆపై గ్రామాలున్న మండలానికి ముగ్గురిని నియమించింది. జిల్లా విభజన సమయంలో 12 మండలాలుండగా 2016 ఆక్టోబర్ 11న నాలుగు కొత్త మండలాలను ఏర్పాటు చేశారు. అప్పుడు పరిపాలన సౌలభ్యం కోసం ఇతర మండలాల నుంచి ఉద్యోగులను తాత్కాలిక పద్ధతిన సర్దుబాటు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం పోస్టులను మంజూరు చేయడంపై రెవెన్యూ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.తహసీల్దార్: 04, నాయబ్ తహసీల్దార్: 04 గిర్దావర్లు: 08, సీనియర్ అసిస్టెంట్లు: 04 జూనియర్ అసిస్టెంటు: 04, టైపిస్టు: 04 సర్వేయర్లు: 04, ఏఎస్: 04 ఆఫీసు సబార్డినేట్/వాచ్మెన్: 11, చైన్మెన్: 04 -
పత్తి మార్కెట్కు రెండ్రోజులు సెలవు
జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు ఇద్దరు రైతులు 14 క్వింటాళ్ల పత్తిని అమ్మకానికి తెచ్చారు. క్వింటాల్కు గరిష్ట ధర రూ.7,600, కనిష్ట ధర రూ.6,500కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్కు శనివారం, ఆదివారం సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్– 2 కార్యదర్శి రాజా తెలిపారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ సబ్స్టేషన్లలో నెలావారీ నిర్వహణ పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 33/11 కె.వీ.మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ సబ్స్టేషన్ల పరిధిలోని మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, నల్లకుంటపల్లి, చెర్లభూత్కూర్, తాహెర్కొండాపూర్, దుబ్బపల్లి, ఫకీర్పేట, చామన్పల్లి, జూబ్లీనగర్, బహద్దూర్ఖాన్పేట, ఎలబోతారంలో విద్యుత్ నిలిపివేయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 33/11 కె.వీ.బొమ్మకల్ సబ్స్టేషన్ పరిధి లోని శ్రీపురం కాలనీ, రజ్వీచమన్, సిటిజన్కా లనీ, విజయనగర్కాలనీ, ప్రియదర్శిని కాలనీ, బైపాస్రోడ్, బొమ్మకల్, లక్ష్మీనగర్, చల్మెడ ఆసుపత్రి, గుంటూర్పల్లి, దుర్శేడ్, గోపాల్పూ ర్ గ్రామాల్లో సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 33/11 కె.వీ.ఖాజీపూర్ సబ్స్టేషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వర కు ఆసిఫ్నగర్ సబ్స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. పాదయాత్ర విజయవంతం చేయాలికరీంనగర్కార్పొరేషన్: ఈ నెల 24వ తేదీన గంగాధరలో జరిగే జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని ప్రజా కార్యాలయంలో వెలి చాల, సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో నరేందర్రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ప్రతి డివిజన్ నుంచి, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలన్నారు. నాయకులు మల్లికార్జున రాజేందర్, అర్ష మల్లేశం, ఆకుల నర్సయ్య, వైద్యుల అంజన్కుమార్, మాచర్ల ప్రసాద్, గంట శ్రీనివాస, కోటగిరి భూమాగౌడ్, కర్ర రాజశేఖర్, పత్తెం మోహన్, ఎండీ తాజ్, సమద్నవాబ్, చర్ల పద్మ పాల్గొన్నారు.‘తెలుగు తేజం’ పురస్కారాలకు ఎంపికకరీంనగర్ కల్చరల్: తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన సాహితీవేత్తలకు శ్రీశ్రీ కళావేదిక ప్రతి ఏటా అందజేసే ‘తెలుగు తేజం’ పురస్కారానికి ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ, రచయిత్రి చిందం సునీత ఎంపికయ్యారు. ఈ నెల 31న గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగే తెలుగు భాషా దినో త్సవ వేడుకల్లో పురస్కారం అందుకోనున్నా రు. సాహితీవేత్తలు లక్ష్మణ్ రావు, అనిల్, ప్ర మోద్కుమార్, చంద్రశేఖర్ అభినందించారు. రేపు జిల్లాస్థాయి పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఈనెల 24న స్థానిక అంబేద్కర్ స్టేడియంలో సబ్ జూనియర్, జూనియర్ యోగా ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కరీంనగర్ యూనిట్ కన్వీనర్ ముత్యాల రమేశ్ తెలిపారు. జిల్లాస్థాయిలో రాణించినవారిని సెప్టెంబర్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 9గంటల వరకు ఆధార్కార్డుతో రిపోర్టు చేయాలని, పూర్తి వివరాలకు 85229 20561, 94400 65556 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఎమ్మెల్యే ‘కవ్వంపల్లి’కి నిరసన సెగ
తిమ్మాపూర్: మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. తిమ్మాపూర్ మండలం బాలయ్యపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం వచ్చారు. ఆయన వాహనాన్ని గ్రామస్తులు అడ్డుకుని నిరసన తెలిపారు. బాలయ్యపల్లి, సాయబ్పల్లి గ్రామాలను గత ప్రభుత్వం ఒకే పంచాయతీగా ఏర్పాటు చేసింది. పంచాయతీ భవనాన్ని సాయబ్పల్లిలో నిర్మించాలన్న ఎమ్మెల్యే నిర్ణయాన్ని బాలయ్యపల్లివాసులు వ్యతిరేకించారు. రెండు గ్రామాల మధ్యలో లేదా బాలయ్యపల్లిలోనే నిర్మించాలని కోరారు. ఉదయం సాయబ్పల్లిలో భవన నిర్మాణానికి ఎమ్మెల్యే ముగ్గు పోస్తుండగా, బాలయ్యపల్లి వాసులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్ ఆరుగురు గ్రామస్తులను అదుపులోకి తీసుకున్నారు. -
వేగంగా అభివృద్ధి పనులు
చిగురుమామిడి: హుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం చిగురుమామిడి మండలంలో పర్యటించారు. సీతారాంపూర్– పీచుపల్లి– తిమ్మాపూర్ మండలం పర్లపల్లి వరకు రూ.5కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. స్వశక్తి సంఘాల మహిళలకు స్టీల్ సామగ్రి పంపిణీ చేశారు. సుందరగిరి ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే సీసీరోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, చిగురుమామిడి ఎంపీడీవో మధుసూదన్ పాల్గొన్నారు. -
విద్య, ఆరోగ్యంపై దృష్టి
కరీంనగర్రూరల్: అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. దుర్శేడ్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శుక్రవారం సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల బరువు, ఎత్తు, పోషణలోపం పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం అంగన్వాడీ చిన్నారులతో ముచ్చటించి, భోజనం వడ్డించారు. గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన చేయించారు. ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. 5వ తరగతి విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠం చదివించారు. దుర్శేడ్ ప్రాథమిక సహకార సంఘంలో ఎరువుల విక్రయాలను తనిఖీ చేశారు. సంఘం ఆవరణలో మొక్క నాటారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, సీడీపీవో సబిత, సొసైటీ చైర్మన్ తోట తిరుపతి పాల్గొన్నారు. -
గుంతల రోడ్డుతో చింత
కరీంనగర్కార్పొరేషన్: నగరంలోని పలు కాలనీల్లో రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శివారు కాలనీలు, మట్టి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా తయారైంది. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లపై గుంతలు మరింతగా ఇబ్బందిగా మారుతున్నాయి. నగరంలోని భగత్నగర్ శివాలయం ప్రాంతంలో రోడ్డుపై గుంతలు ప్రమాదకరంగా మారాయి. కాలనీలోని అంతర్గత ప్రధాన రోడ్డుపై ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కాలనీవాసుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.రాత్రివేళల్లో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో, ఇటీవల స్థానికులే ముందుకు వచ్చి గుంతలను పూడ్చే ప్రయత్నం చేశారు. గుంతలను మట్టిని పోసిపూడ్చివేశారు. మళ్లీ చిన్న వర్షానికే ఆ మట్టి కొట్టుకుపోయింది. అధికారులు రోడ్డుపై ఏర్పడిన గుంతలకు శాశ్వత మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు. గంతలు పూడ్చాలి భగత్నగర్లోని శివాలయం ప్రాంతంలో రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చాలి. గుంతల వల్ల కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందులపై ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదు. – వెంకన్న, భగత్నగర్, కరీంనగర్ -
మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో..!
పెద్దపల్లిరూరల్: పరాయి మహిళ మోజులో పడి కట్టుకున్న భార్య, కన్నబిడ్డలను పట్టించుకోని భర్తకు సఖి కేంద్రం నిర్వాహకులు కౌన్సెలింగ్కు యతి్నంచినా సహకరించలేదు. ఆగ్రహించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లా సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి వేణుగోపాలరావు బుధవారం విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాంతానికి చెందిన రవీందర్ (ఓదెల పీహెచ్సీలో ఫార్మసిస్ట్) కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంత కాలంగా పరాయి స్త్రీ మోజులో పడిన రవీందర్.. భార్యాబిడ్డల పోషణ పట్టించుకోవడం మానేశాడు. పోషణ భారం కావడంతో ఆయన భార్యాపిల్లలు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్.. ఆయనకు కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబంతో కలిసి ఉండేలా చూడాలని జిల్లా సంక్షేమశాఖ, సఖి కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు. వారు పలుమార్లు కౌన్సెలింగ్ పిలిచినా సహకరించలేదు. ఉద్యోగం చేసే పీహెచ్సీకి వెళ్తే.. “మీరు నా వద్దకు రావొద్దు.. నేను వేరొక మహిళతో సహజీవనం చేస్తే తప్పేంటి’ అని దబాయించాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లొచ్చంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చాడు. ఈ వ్యవహారంపై స్త్రీ, శిశు సంక్షేమశాఖ ద్వారా కలెక్టర్కు సమగ్ర నివేదిక అందించారు. ఆగ్రహించిన కలెక్టర్.. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి చట్టం ప్రకారం రవీందర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
పసిగడుతూ.. పట్టిస్తూ..!
● కేసుల దర్యాప్తులో జాగిలాల పాత్ర ● కీలక సమాచారం అందిస్తున్న శునకాలు ● ఆ దిశగానే పోలీసుల ప్రత్యేక పరిశోధనలు జగిత్యాలజోన్: జిల్లాలో ఇటీవల జరిగిన పలు మర్డర్లు, దొంగతనాల్లో అనుమానితులను కనిపెట్ట డంలో పోలీసు జాగిలాలు కీలకంగా మారుతున్నాయి. ఆయా కేసుల్లో పోలీసులకు ప్రాథమికంగా సమాచారం అందిస్తూ కేసు దర్యాప్తులో సహకరిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా ముందుగా పోలీసు జాగిలాలు సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి. డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను కనిపెట్టడం.. పేలుడు పదార్థాలను ముందే పసిగట్టి ప్రమాదాలు జరగుకుండా చూడడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ● నేరం జరిగిదంటే జాగిలం రంగ ప్రవేశం దొంగతనాలు, అనుమానిత హత్యలు జరిగినప్పుడు జాగిలం రంగ ప్రవేశం చేసి పోలీసులకు కీలక సమాచారాన్ని అందిస్తుంది. భారీ బహిరంగ సభలు, మంత్రుల సమావేశాలు జరిగినప్పుడు పరిసరాలను కలియతిరిగి ఓకే చెప్పిన తర్వాతనే కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. జాగిలానికి ఎక్కడైనా అనుమానం వచ్చిందంటే చాలు.. పోలీసులు పరుగెత్తుకుంటూ వచ్చి అక్కడ పూర్తిస్థాయిలో శోధిస్తుంటారు. ఏదైనా నేరం జరిగినప్పుడు.. నేరానికి పాల్పడింది ఎవరనే విషయం తెలియనప్పుడు ఆయా పోలీసు స్టేషన్ల ఎస్సైలు ఎస్పీకి సమాచారం ఇస్తారు. ఎస్పీ ఆదేశాల మేరకు జాగిలాలు రంగప్రవేశం చేసి పోలీసులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంటాయి. జాగిలాలు డ్యూటీలోకి వచ్చినప్పుడు మాత్రమే హ్యాండ్లర్ మెడకు బెల్టుతో పట్టుకుంటాడు. డ్యూటీ అయిపోగానే హ్యాండర్లతో సరదాగా ఆడుకుంటుంది. ● రాష్ట్రస్థాయిలో ప్రత్యేక శిక్షణ తొలుత జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఎంపిక చేసుకున్న అన్ని జాగిలాలకు ఒకే రకమైన శిక్షణ కాకుండా చురుకుగా ఉండేవాటికి సూపర్ స్పెషాలిటీ శిక్షణ ఇస్తారు. తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు మాత్రమే ఆ జాగిలాలను ఉపయోగిస్తారు. ప్రభుత్వం కేవలం శిక్షణలోనే పోలీసు జాగిలం, ఇద్దరు హ్యాండర్లకు దాదాపు రూ.4నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేస్తుంది. పోలీసు జాగిలం 14 ఏళ్ల వరకు జీవిస్తుంది. అయితే తొమ్మిదేళ్లకే డాగ్కు రిటైర్మెంట్ ఇస్తారు. రిటైర్మెంట్ తర్వాత పోలీసు సంరక్షణలోనే ఉంటుంది. అనారోగ్యంతో మరణిస్తే పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తుంటారు. వీటికి కూడా డ్యూటీ మీట్లు పెట్టి, బంగారం, రజక, కాంస్య పతకాలు అందిస్తారు. వీటికి హోంఫుడ్, ప్యాకెట్ ఫుడ్, మిశ్రమ ఆహారాన్ని అందిస్తుంటారు. పోలీసు డాగ్ను చూసుకునే హ్యాండ్లర్ మాటలు అర్థమయ్యేలా కమాండ్ పదాలు వాడుతూ.. వాటి మెడను నిమురుతూ ఉంటారు. హ్యాండ్లర్స్తో పోలీసు జాగిలాలు జాగిలాలతో కలెక్టర్ సత్యప్రసాద్ లాబ్రాడార్, లేట్రీవర్, డాబర్ మాన్, జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన డాగ్లను నాలుగు నెలల వయస్సున్నప్పుడే ఎంపిక చేసుకుంటారు. తర్వాత డాగ్స్తో పాటు దాన్ని చూసుకునే హ్యాండ్లర్కు 8 నెలల పాటు హైదరాబాద్లో పలు రకాలుగా శిక్షణ ఇస్తారు. బాంబులను పసిగట్టడం, మాదకద్రవ్యాలను గుర్తించడం, నిందితులను గుర్తించడం వంటివాటిపై శిక్షణ ఇస్తారు. తర్వాత జాగిలం ఎంతవరకు వీటిని పసిగడుతోందో అనేదానిపై మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తారు. శిక్షణలో మొదటి రెండు నెలలపాటు హ్యాండ్లర్ జాగిలాన్ని మచ్చిక చేసుకోవడానికే సరిపోతారు. హ్యాండ్లర్ శిక్షణను ఎప్పటికప్పుడు జాగిలం నేర్చుకుంటూ.. అవసరమైన చోట ఉపయోగిస్తుంటుంది. శిక్షణ అనంతరం ఆయా జిల్లాలకు కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాలో మూడు జాగిలాలను పోలీసులు అవసరాన్ని బట్టి ఉపయోగిస్తున్నారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో హ్యాండ్లర్ ర్యాంబోకు అవసరమైన ఆహారపదార్థాలు అందిస్తూ.. విధుల్లో చురుకుగా ఉండేందుకు పరుగెత్తించడం, దూకడం వంటివి శిక్షణ ఇస్తుంటారు. వాస్తవానికి జాగిలానికి 100 రేట్లు గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. పోలీసులు జాగిలాలను వివిధ పేర్లతో పిలుస్తూ హ్యాండ్లర్స్ పిల్లల మాదిరిగా చూసుకుంటారు. నేరాల్లో పోలీసు జాగిలాల ద్వారా కీలక సమాచారం దొరుకుతుంది. అవి ఇచ్చే సూచనల మేరకు పోలీసు బృందాలు వేగవంతంగా దర్యాప్తు చేస్తుంటారు. ఒక్కోసారి గంటల వ్యవధిలోనే నిందితులు పట్టుబడుతున్నారు. పోలీసు జాగిలాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండి ముందుకు దూసుకెళ్లుతుండటంతో నేర పరిశోధనలు త్వరగా పూర్తవుతున్నాయి. – అశోక్కుమార్, ఎస్పీ -
నేతన్న కంట్లో దిగిన జోటా
సిరిసిల్లటౌన్: సాంచాలు నడుపుతున్న నేతకార్మికుడి కంట్లో ప్రమాదవశాత్తు జోటా వచ్చి పడింది. నరాలు దెబ్బతిని కంటి చూపు కోల్పోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రగతినగర్కు చెందిన సబ్బని ధర్మేందర్ సాంచాల కార్ఖానాలో బొప్ప రాజనర్సయ్య(56) సాంచాలు నడిపిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం జోటా ఎగిరివచ్చి ఎడమ కంటికి తగిలింది. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానిక ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ కోసం హైదరాబాద్కు పంపించారు. అక్కడి ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యులు బుధవారం రాజనర్సయ్యకు ఆపరేషన్ చేశారు. కంట్లో నాడీవ్యవస్థ దెబ్బతినడంతో చూపు పోయిందని తెలిపారని రాజనర్సయ్య బంధువులు ఆవేదనతో చెప్పారు. చేతిలో పైసల్లేని కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద రూ.లక్షకు పైగా అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. అత్యవసర ఆపరేషన్కు ఆరోగ్యశ్రీ వర్తించలేదని ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని ఆ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాంచాలు నడుపుతుండగా ప్రమాదం చూపు కోల్పోయిన కార్మికుడు -
ఊరు పేర్లతో రైళ్లు
రామగుండం: సికింద్రాబాద్, విజయవాడ–బల్హర్షా రూట్లో పలు రైళ్లు ఊర్ల పేర్లతో నడుస్తుండడంతో పలువురు ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. రైల్వేయాప్, రైల్వేస్టేషన్లలో అనౌన్స్మెంట్లోనూ ఊరు పేర్లతోనే చెబుతుండడాన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్– కాగజ్నగర్ మధ్య నడిచే రైలు నంబరు 12758(కాగజ్నగర్ ఎక్స్ప్రెస్), సికింద్రాబాద్– రాయ్పూర్ మధ్య నడిచే రైలు నంబరు 12772 (సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్), కాజీపేట– బల్హర్షా మధ్య నడిచే రైలు నంబరు 17036 (బల్హర్షా/కాజీపేట ఎక్స్ప్రెస్), యశ్వంతపూర్– గోరఖ్పూర్ మధ్య నడిచే రైలు నంబరు 12591 (యశ్వంత్పూర్/గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్), సికింద్రాబాద్– దాణాపూర్ మధ్య నడిచే రైలు నంబరు 12791 (దాణాపూర్ ఎక్స్ప్రెస్) ఇలా చాలా రైళ్లు వెళ్లే క్రమంలో ఓ ఊరు పేరుతో, తిరుగు ప్రయాణంలో స్టేషన్ పేరుతో రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు తికమక సికింద్రాబాద్– కాగజ్నగర్ మధ్య మూడు రైళ్లు నడుస్తున్నాయి. ఒక రైలుకు భాగ్యనగర్గా పేరుంది. మిగతావి ఇంటర్సిటీ, కాగజ్నగర్ ఎక్స్ప్రెస్గా పిలుస్తున్నారు. కాగజ్నగర్– సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబరు (17011/17012) ఎగువ ప్రయాణ సమయంలో ఇంటర్సిటీగా, తిరుగు ప్రయాణంలో బీదర్ ఎక్స్ప్రెస్గా రైల్వే యాప్లో ఉండడంతో పాటు రైల్వే అనౌ న్స్మెంట్ సైతం ప్రయాణికులను అయోమయానికి గురి చేస్తోంది. బీదర్ రూట్కు స్థానికంగా ఎలాంటి సంబంధమూ లేదు. సికింద్రాబాద్– హిస్సార్ మధ్య నడిచే రైలుకు మంజీర ఎక్స్ప్రెస్గా, కరీంనగర్– సిర్పూర్ మధ్య నడిచే పుష్పుల్కు శ్రీరాజరాజేశ్వరస్వామి, దానా పూర్ ఎక్స్ప్రెస్కు మణికర్ణిక పేర్లను ప్రతిపాదించినా అధికారికంగా అమలు చేయడం లేదు. తికమకపడుతున్న ప్రయాణికులు నంబర్తోనే సదరు రైలుగా గుర్తింపు ఏళ్లుగా పలు రైళ్లకు పేరు లేని వైనం -
బెడ్లు సరిపోక.. నవారు మంచాలపై చికిత్స
వాతావరణ మార్పులతో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. చిన్నారులు జబ్బుపడి చికిత్స కోసం ఆసుపత్రి బాట పడుతున్నారు. అడ్మిట్ అయినవారు జ్వరం తగ్గకపోవడంతో.. ఆస్పత్రుల్లోనే ఉంటుండగా.. కొత్తగా వచ్చే రోగులకు బెడ్లు సరిపోని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకేంద్రంలో పిల్లల వార్డులో బెడ్లు సరిపోక నవారు మంచాలు వేసి చికిత్స అందిస్తున్నారు. పిల్లలు మంచాల్లో చికిత్స పొందుతూ కిక్కిరిసిన పిల్లల వార్డు ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
మోడల్ స్కూల్ విద్యార్థులకు గాయాలు
మానకొండూర్: మండలంలోని పోచంపల్లి మోడల్ స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడటంతో గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు...చెంజర్ల గ్రామానికి చెందిన గాజుల అభిషేక్ ఎనిమిదో తరగతి, ఇదే గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి యశ్వక్ చేతన్ యథావిధిగా గురువారం ఉదయం మోడల్ స్కూల్కు ప్రత్యేక బస్సులో వెళ్లారు. సాయంత్రం మోడల్ స్కూల్ వద్ద బస్సు ఎక్కేక్రమంలో ఫుట్బోర్డు నుంచి జారి కిందపడిపోయారు. అభిషేకు తీవ్ర, యశ్వక్చేతన్కు స్వల్ప గాయాలయ్యాయని ఆ సమయంలో బస్సు రన్నింగులో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని తెలిపారు. -
విరిగిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్ రాడ్
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రహీంఖాన్పేట మీదుగా ఇల్లంతకుంటకు వస్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్, వీల్ జాయింట్ రాడ్ విరిగిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల నుంచి వెల్జీపురం మీదుగా ఇల్లంతకుంటకు గురువారం సాయంత్రం ఐదు గంటలకు వస్తున్న ఆర్టీసీ బస్సు రహీంఖాన్పేట సమీపంలో స్టీరింగ్, వీల్టైర్లకు కలిసి ఉండే జాయింట్ రాడ్ ఊడిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును అక్కడికక్కడే నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ప్రయాణిస్తున్నారు. -
స్థానిక సంస్థల్లో యువతకే ప్రాధాన్యం
సిరిసిల్లఅర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామనిచ్చే అవకాశం ఉందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రగుడు మల్లీకార్జున ఫంక్షన్హాల్లో గురువారం నిర్వహించిన పార్టీ సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తల శ్రమ ఫలితంగానే అధికారంలోకి వచ్చామన్నారు. కొత్త, పాత అనే తేడా లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు అవకాశాలు వస్తాయని స్పష్టం చేశారు. రాబోయే కాలానికి కాబోయే ప్రధాని రాహుల్గాంధీ అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సన్నబియ్యం ఇస్తున్న ప్రభుత్వం లేదన్నారు. యూరియాపై కేటీఆర్ కేంద్రాన్ని నిలదీయాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యానారాయణగౌడ్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి, నాయకులు పకృద్దీన్, సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి శ్రీనివాస్, సూర దేవరాజు, గడ్డం నర్సయ్య, చక్రధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ -
వేగంగా డబ్బులు జమచేస్తున్నాం
జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నాం. లబ్ధిదారులకు ఇబ్బందులు రాకుండా నిర్మాణాల దశలను పరిశీలించి డబ్బులు ఖాతాల్లో జమ చేయిస్తున్నాం. తాపీ, ఇసుక, ఇటుక, ఇంటి సామగ్రి యజమానులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ధరలను అదుపులో ఉంచాం. 45 రోజుల్లో ఇళ్లు పూర్తయ్యే అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – రాజేశ్వర్, హౌసింగ్ పీడీ, పెద్దపల్లి ఇందిరమ్మ ఇళ్ల పైలెట్ ప్రాజెక్టు కింద మా గ్రామాన్ని ఎంపిక చేశారు. ముగ్గు పోసి నిర్మాణం ప్రారంభించగా, దశల వారీగా డబ్బు ఖాతాలో జమచేశారు. దీంతో ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పటికే నా బ్యాంక్ ఖాతాలో రూ.4లక్షలు జమయ్యాయి. సొంతింటి కల నెరవేరింది. – కనుకుంట రమే్శ , సోమన్పల్లి -
బల్దియాలో సరెండర్ రగడ!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థలో అదనపు కమిషనర్ సువార్త సరెండర్ వ్యవహారం హైడ్రామాను తలపిస్తోంది. ఆమెను సరెండర్ చేసి రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్యాలయానికి రావడంతో పాటు, తన చాంబర్ కు తాళం వేసుకోవడం గందరగోళానికి దారితీసింది. ఆ తాళాన్ని పగలగొట్టిన సిబ్బంది చాంబర్ కు మరో తాళం వేశారు. విధుల్లో అలసత్వం, తదితర కారణాలతో ఈ నెల 19వ తేదీన సువార్తను సీడీఎంఏకు సరెండర్ చేయడం తెలిసిందే. అయితే బుధ, గురువారాల్లో ఆమె కార్యాలయానికి వచ్చి చాంబర్లో ఉండడంతో చర్చనీయాంశంగా మారింది. ఆమె సరెండర్ను రద్దు చేసేందుకు కొంతమంది నాయకులు, మాజీ కార్పొరేటర్లు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారని, కానీ.. రాజకీయ ఒత్తిళ్లు పెద్దగా ఫలించలేదని ప్రచారంలో ఉంది. తాళం పగలగొట్టిన సిబ్బంది అదనపు కమిషనర్ చాంబర్ తాళం గురువారం రాత్రి సిబ్బంది పగలగొట్టారు. అంతకుముందు సువార్త తాళం వేసుకుని వెళ్లడంతో, ఆ తాళాన్ని పగలగొట్టి, కొత్త తాళం వేశారు. చాంబర్ బయట ఉన్న ఆమె నేమ్ ప్లేట్ ను తొలగించారు. బాధ్యతలు ఇతరులకు.. అదనపు కమిషనర్ సువార్త చూస్తున్న బాధ్యతలను ఇతర అధికారులకు అప్పగిస్తూ గురువారం రాత్రి కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాలు జారీచేశారు. ట్యాప్సెక్షన్ (డిజిటల్ కీ), నీటి పన్ను వసూళ్లు ఎస్ఈ రాజ్కుమార్కు, ఎస్టాబ్లిష్మెంట్, రెవెన్యూ, ప్రజావాణి డిప్యూటీ కమిషనర్–1 ఖాదర్ మొహియొద్దిన్కు, శానిటేషన్, ఏబీసీ సెంటర్, ప్రజాదర్బార్(సీఎంవో), ప్రజాపాలన, డంపింగ్యార్డ్, కంపోస్టు యూనిట్, డీఆర్సీసీ, లైబ్రరీ, బర్త్ అండ్ డెత్ (డిజిటల్ కీ), ట్రేడ్ లైసెన్స్, ఆర్టీఐ యాక్ట్–2005లు డిప్యూటీ కమిషనర్–2 వేణు మాధవ్కు, మెప్మా, రికార్డు రూమ్, సిటిజన్ సర్వీస్ సెంటర్, ఆడిట్, కోర్టు వ్యవహారాలు, పెన్షన్స్ (డిజిటల్కీ), కౌన్సిల్ విభాగాలు సహాయ కమిషనర్ దిలిప్కుమార్కు అప్పగించారు. -
ఇందిరమ్మ ముందుకు
చిత్రంలో స్లాబ్ పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమైన ఇల్లు పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలోని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన అడవిసోమన్పల్లి గ్రామంలోనిది. గ్రామంలో 348 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. 192 నివాసాలు బెసెమ్మెంట్ లెవల్, 85 గోడలు, 51స్లాబ్, 20 ఇళ్లు నిర్మాణాలు పూర్తిచేసుకుని గృహప్రవేశాలకు సిద్ధం అయ్యాయి. మంచిరోజు చూసి మంత్రి శ్రీధర్బాబు చేతుల మీదుగా గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.సాక్షి, పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతోంది. అర్హుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటి నుంచి ఇటు ప్రజాప్రతి నిధులు, అటు అధికారులు పర్యవేక్షిస్తూ ఇళ్ల పూర్తికి చర్యలు తీసుకుంటున్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నవారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్కు రూ.2లక్షలు గృహప్రవేశ సమయంలో రూ.లక్షను మంజూరు చేస్తూ, లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు. మండలానికో మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించగా, హౌసింగ్ ఆఫీసులుగా వినియోగించనున్నారు. ఇళ్లు మంజూరై ఆర్థిక ఇబ్బందులతో నిర్మించుకోలేక పోతున్న పేదలకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోగా, త్వరితగతిన బిల్లులు మంజూరు అవుతున్నాయి. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 470 మంది లబ్ధిదారులకు సుమారు రూ.4.7కోట్ల రుణాలు అందించారు. ఇందిరమ్మ ఇల్లును 400 చదరపు గజాల నుంచి 600 చదరపు గజాల లోపు మాత్రమే నిర్మించుకోవాలి. లేకుంటే జీపీఎస్ యాప్లో నమోదు కాదు. బిల్లుల చెల్లింపు జరగదు. ప్రతివారం ఇంటి నిర్మాణ పనులను జీపీఎస్ ద్వారా చిత్రీకరించి, ప్రగతిని బట్టి ఏదేనీ సోమవారం చెల్లింపులు చేస్తున్నారు. లబ్ధిదారుల అకౌంట్లో నాలుగు విడతలుగా బిల్లులు చెల్లిస్తున్నారు. బేస్మెంట్తో పాటు ఇతర దశల వారీగా పనులు పూర్తి కాగానే సంబంధిత అధికారులు వాటి ఫొటోలు తీసి ప్రత్యేక యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. బేస్మెంట్స్థాయిలో రూ.లక్ష, గోడల నిర్మాణానికి రూ.లక్ష, స్లాబ్ వేసిన తర్వాత రూ.2 లక్షలు, మిగతా పనులు పూర్తి చేసిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తున్నారు. నిర్మాణాలకు ఇబ్బందులు లేకుండా వారంలో రెండు రోజులు ఇసుక, మట్టి కోసం అనుమతులు మంజూరు చేస్తున్నారు. బ్యాంకుల విలీనం, వేరువేరు ఖాతాలు, ఇతరత్రా సాంకేతిక సమస్యలతో బిల్లుల మంజూరులో తలెత్తుతున్న సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమచేస్తోంది. ఈ విధానంతో క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్లో అప్లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరు చేస్తున్నారు.ఈ చిత్రంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటి ఎదుట కనిపిస్తున్న మహిళ సీహెచ్ స్వరూప. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట. స్వరూప ఇంటి నిర్మాణానికి మార్చిలో ఎమ్మెల్యే విజయరమణరావు చేతుల మీదుగా ముగ్గు పోశారు. గ్రామంలో ఈమెతో పాటు మరో ఇద్దరు నిర్మాణాలు పూర్తిచేసుకుని, గృహప్రవేశానికి సిద్ధమవ్వగా, ఒక్కొక్కరి ఖాతాలో ఇప్పటికే రూ.4లక్షల చొప్పున బిల్లు జమైంది. గృహప్రవేశం సందర్భంగా మరో రూ.లక్ష పడనుంది. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా గృహప్రవేశం చేయనున్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండండి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ప్రమాదాలు జరగకుండా, విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని టీజీఎన్పీడీసీఎల్ డైరెక్టర్(ఆపరేషన్స్) టి.మధుసూదన్ సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్లోని సమావేశ మందిరంలో గురువారం విద్యుత్ సరఫరా.. ప్రమాదాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు.. కేబుల్ వైర్ల తొలగింపు.. తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మున్సిపల్ సంస్థలతో కలిసి నగరాలు, పట్టణాల్లో ఉన్న కేబుల్ వైర్లను తొలగించే చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖలోని సిబ్బంది తప్పిదాలు ప్రాణాపాయానికి దారి తీసే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సమయంలో వినాయకుల ప్రతిమలను తరలించే క్రమంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంతకుముందు స్థానిక బ్యాంకుకాలనీ సబ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆటోమేషన్ కంట్రోల్ పనితీరును తనిఖీ చేశారు. హెచ్టీ సర్వీసుల మోడేముల ఆటోమేటిక్ మీటర్ రీడింగులను పరిశీలించారు. ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఉద్యోగులు పని చేయాలని, జిల్లాలో టీమ్స్వారీగా విద్యుత్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలన్నారు. చీఫ్ ఇంజనీరు ఆపరేషన్ బి.అశోక్, ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈలు ఉపేందర్, జంపాల రాజం, పి.చంద్రమౌళి, ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్, ఏడీలు ఎన్.అంజయ్య, జి.శ్రీనివాస్, ఎం.లావణ్య, ఏవోలు, ఏఏవోలు, ఏఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
గణేశ్ నవరాత్రులకు మార్గదర్శకాలు
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని గణేశ్ మండపాల నిర్వాహకులు, ప్రజలు నవరాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. దీనికోసం పోలీసుశాఖ తరఫున పలు మార్గదర్శకాలు జారీ చేశారు. గణేశ్ మండపాలను ఏర్పాటు చేసేవారు పోలీసు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతిమ ఎత్తు, మండపం ఏర్పాటు చేసే స్థలం, నిమజ్జనం తేదీ, ప్రదేశం వివరాలను తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత, సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులు అనుమతులు జారీ చేస్తారన్నారు. అనుమతి పత్రం, క్యూఆర్ కోడ్, పోలీస్ సూచనలను మండపం వద్ద స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. మండపం వద్ద 24గంటలు ఒక వలంటీర్ ఉండాలని, కమిటీ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడటం, లక్కీ డ్రాలు నిర్వహించడం, అసభ్యకర నృత్యాలు చేయడం నిషేధం అన్నారు. పోలీస్ తనిఖీల కోసం మండపం వద్ద పాయింట్ పుస్తకం ఉంచాలన్నారు. అనుమానాస్పద బ్యాగులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు.1,852 పనులు.. రూ.31.75కోట్లుకరీంనగర్ అర్బన్: పల్లెల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో పనులను చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు జరగనుండగా జిల్లాలో మంత్రి ప్రాతినిథ్యం వహించే మండలాలతో పాటు శాసనసభ్యుల నియోజకవర్గాల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. శుక్రవారం జిల్లాలో రూ.31.75 కోట్ల వ్యయంతో 1,852 పనులను ప్రారంభించనున్నారు. మంత్రి, ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ వివిధ ప్రాంతాల్లో పాల్గొననున్నారు. 13 విభాగాల్లో వివిధ పనులు గుర్తించగా జీపీ బిల్డింగులు, అంగన్వాడీ బిల్డింగులు, పశువుల పాకలు, గొర్రెలు, మేకల షెడ్లు, పౌల్ట్రీషెడ్లు, అజోల్లా, వర్మీ కంపోస్ట్ పిట్స్, చెక్ డ్యాం, కమ్యూనిటీ కాంప్లెక్స్, మరుగుదొడ్లు, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు, సెగ్రిగేషన్ షెడ్లు వంటి పనులు చేపట్టనున్నారు.పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కరీంనగర్లోని సంతోష్నగర్, భాగ్యనగర్, జ్యోతినగర్, గీతాభవన్ వెనుక ప్రాంతం, కార్పెంటర్ సొసైటీ, సంతోషిమాత, హనుమాన్ దేవాలయాలు, కొత్త లేబర్ అడ్డ, సాయిబాబా దేవాలయం, సెయింట్ జాన్స్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు.ట్రాక్టర్ పనిముట్లకు దరఖాస్తులు ఆహ్వానంకరీంనగర్ అర్బన్: వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా జిల్లాకు ట్రాక్టర్ పనిముట్లు కేటాయించారని, ఆసక్తి ఉన్న రైతులు సెప్టెంబర్ 6 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. 2,822 బ్యాటరీ లేక మాన్యువల్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 481 పవర్ స్ప్రేయర్లు, 188 రోటవేటర్లు, 32 సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్లర్లు, డిస్క్ హేరో, కల్టివేటర్, కేజ్ వీల్స్, రోటో పడ్లర్ 212, బండ్ ఫార్మర్ 9, పవర్ విడర్ 17, బ్రష్ కట్టర్ 33, పవర్ టిల్లర్ 25, స్ట్రాబెలర్ 29 జిల్లాకు ఇచ్చారని వెల్లడించారు. చిన్న, సన్నకారు, మహిళా, ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. అప్లికేషన్ ఫామ్, 2 పాస్పోర్ట్ ఫొటోలు, ఆధార్ కార్డు, ట్రాక్టర్ ఆర్సీ, పట్టాదారు పాస్ పుస్తకం, చిన్న, సన్నకారు రైతు పత్రంతో ఆయా రైతు వేదికల్లో గాని, మండల వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయంలో గాని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కేటీఆర్ భాష థర్డ్క్లాస్కు చేరింది
సాక్షిప్రతినిధి,కరీంనగర్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భాష థర్డ్క్లాస్కి మారిపోయిందని, ఆపార్టీ బీజేపీ వైపు ఉంటుందా? లేదా ? అన్నది 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తేలపోనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్లతో కలిసి మాట్లాడారు. ప్రభుత్వంపై ప్రజలకు మరింత భరోసా కల్పించేందుకు మీనాక్షి నటజరాన్ జనహితయాత్ర చేపట్టారన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత విషయంలో బీఆర్ఎస్ రైతుల్లో గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. ఈ విషయంలో కేటీఆర్ భాష థర్డ్ క్లాస్కు మారిపోయిందన్నారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చి హైకోర్టు, సుప్రీం కోర్టు జడ్జిగా చేసిన సుదర్శన్రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిందన్నారు. ఈ విషయంలో గోడ మీద పిల్లిలా ఉన్న బీఆర్ఎస్ వైఖరి 9న తేలనుందన్నారు. కేటీఆర్ ఎవరు యూరియా ఇస్తే.. వారికి ఓటేస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ నియోజకవర్గంలో ఎరవుల కొరతపై చొరవ తీసుకోవాలన్నారు. ఈ నెల 24వ తేదీన జిల్లాలో జరిగే మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల నుంచి మధురానగర్వరకు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్లు పాదయాత్ర చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో పార్టీశ్రేణులు అధికసంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 24వ తేదీన గంగాధరలోనే బస చేసి, 25న ప్రభుత్వ పాఠశాలలో శ్రమదానం, మొక్కలు నాటుతారన్నారు. నాయకులు వెలిచాల రాజేందర్రావు, వైద్యుల అంజన్కుమార్, ఆకారపు భాస్కర్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఆకుల ప్రకాశ్, వీరదేవెందర్, పులి ఆంజనేయులు, శ్రవణ్నాయక్ పాల్గొన్నారు. -
టీచర్ల పదోన్నతులు షురూ
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం గత నెలలోనే నిర్వహించాల్సి ఉండగా పీజీహెచ్ఎం గ్రేడ్–1 పదోన్నతుల ప్రక్రియలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో వాయిదా పడింది. అయితే కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖను హైకోర్టు ఆదేశించడంతో పదోన్నతుల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఇందులో భాగంగా పీజీహెచ్ఎం గ్రేడ్ మల్టీజోన్–1కు సంబంధించి పదోన్నతులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు(లోకల్బాడీ) పదోన్నతు ఉత్తర్వులను దాదాపు 90 మంది హెచ్ఎంలకు గురువారం రాత్రి అందజేశారు. వారు తక్షణమే పనిచేస్తున్న పాఠశాల నుంచి రిలీవ్ కావాలని, పోస్టింగ్ పొందిన స్కూల్లో శుక్రవారం జాయిన్ కావాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. నేడు సీనియార్టీ జాబితా విడుదల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందిన వారి ఖాళీ స్థానాలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)తో భర్తీ చేసేందుకు పదోన్నతుల ప్రక్రియ శుక్రవారం నుంచి మొదలుకానుంది. 22న సీనియార్టీ జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందపర్చనున్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే డీఈవో కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. 23న ఎస్జీటీల నుంచి వివిధ కేటగిరీలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన వారి జాబితాను ప్రదర్శించనున్నారు. 24, 25, 26వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు వారి స్థానాల నుంచి రిలీవ్ అయి కొత్తగా పదోన్నతులు పొందిన పాఠశాలల్లో చేరాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
హెచ్ఐవీ నిర్మూలనకు కృషి చేయాలి
కరీంనగర్టౌన్: జిల్లాలో హెచ్ఐవీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి వెంకటరమణ అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మీటింగ్ హాల్లో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం అంగన్వాడీ టీచర్లకు హెచ్ఐవీపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలందరూ హెచ్ఐవీపై పూర్తి విధివిధానాలు తెలుసుకొని నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. క్రార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి(ఎయిడ్స్ అండ్ లెప్రసీ) సుధా, డాక్టర్ సన జవేరియా, డెమో రాజగోపాల్, సఖి కన్సల్టెంట్ లక్ష్మి, డాప్కో టీం జిల్లా సభ్యులు, అడ్వకేట్ హేమంతాపటేల్, సఖి లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణి, డీపీహెచ్ఎన్వో విమల పాల్గొన్నారు. -
24న ‘జనహిత’ యాత్ర
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈనెల 24న చొప్పదండిలో ఆమె పాదయాత్ర చేయనున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోని ఉప్పరమల్యాల నుంచి మధురానగర్ వరకు యాత్ర సాగనుంది. దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారిగా రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు పట్టుదలతో ఉన్నారు. గంగాధరలో బహిరంగ సభ ఉప్పర మల్యాల నుంచి గంగాధరలోని మధురానగర్ చౌరస్తా వద్ద బహిరంగ సభకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయి. దాదాపు 6 కిలోమీటర్ల వరకు సాగే పాదయాత్రలో మీనాక్షి పలువురు ప్రజలతో మాట్లాడతారు. అదే సమయంలో అవసరమైన చోట శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు తరలనున్నాయి. ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల పార్టీ అధ్యక్షులు ఇప్పటికే ఈ సభ నిర్వహణ, ఏర్పాట్లపై ఫోన్లో మంతనాలు సాగిస్తున్నారు. 24న పాదయాత్ర అనంతరం మీ నాక్షి జిల్లాలోనే బస చేయనున్నారు. ఆమె కరీంనగర్ జిల్లా కేంద్రంలో బస చేస్తారా..? లేక గంగాధర మండలంలోనే ఆగుతారా..? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మరునాడు 25న ఉదయం గంగాధర మండలంలోని వెంకటాయపల్లిలోని ఎల్కే గార్డెన్స్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశానికి ఆమె నేతృత్వం వహిస్తారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భర్తీ కాని నామినేటెడ్ పదవుల విషయంలో కేడర్ తీవ్ర అసంతృప్తిగా ఉంది. పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతీ అసెంబ్లీకి ఇద్దరు నేతల పేర్లు సూచించాలని అధిష్టానం ఆదేశించింది. అయితే కరీంనగర్ అసెంబ్లీకి మాత్రం కనీసం ఐదుగురు నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఇక్కడి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీలు మారి వచ్చిన వారికి కాకుండా.. పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. డీసీసీ, పట్టణ, మండల, గ్రామ, బ్లాక్ అధ్యక్షుల భర్తీకి దరఖాస్తులు తీసుకున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి పదవుల కేటాయింపు జరగలేదు. 25న మీనాక్షి నటరాజన్ నేతృత్వరంలో జరిగే సమావేశంలో ప్రతీ కార్యకర్తతో ఆమె మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో మెజారిటీ సీనియర్ నేతలు తమకు పదవుల్లో ప్రాధాన్యమివ్వాలని కోరనున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లా నేతలు పార్టీ పరిస్థితిని వివరిస్తూ.. పలువురు నటరాజన్కు ఇప్పటికే సమాచారం చేరవేసినట్లు తెల్సింది. ముఖ్యంగా కరీంనగర్ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని పలువురు ఆమెకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. -
వేలాడుతున్న ప్రమాదం
గురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025నగర ప్రజలారా జాగ్రత్త... చవితి పండుగ సమీపిస్తున్న సందర్భంలో మండపాలు వేసేటప్పుడు.. విగ్రహాలు తెచ్చేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే.. మీ నెత్తిమీద యమపాశం వేలాడుతోంది. ఆదమరిచారా..? ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల హైదరాబాద్, సిరిసిల్లతో పాటు పలుచోట్ల విగ్రహాలు, మండపాలకు వైర్లు తాకిన ఘటనల్లో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోనూ పలు విద్యుత్ స్తంభాలకు కేబుల్, సర్వీస్ వైర్లు వేలాడుతున్నాయి. రోడ్డు అడ్డంగా.. అతి తక్కువ ఎత్తులో ఉన్నాయి. పలుచోట్ల వినాయక మండపాలు వైర్ల కిందనే ఏర్పాటు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో పందిర్లు సిద్ధం చేస్తున్నారు. వైర్లు అతితక్కువ ఎత్తులో ఉండడంతో విగ్రహాలు తెచ్చే సమయంలో, శోభాయాత్ర సందర్భంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. విద్యుత్శాఖ అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, వేలాడుతున్న వైర్లకు మరమ్మతు చేయాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
యూరియా అక్రమాలకు చెక్
కరీంనగర్రూరల్: జిల్లాలో యూరియా విక్రయాలు పక్కదారి పట్టకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాల్లోని యూరియా విక్రయాల బాధ్యతను క్లస్టర్ పరిధిలోని ఏఈవోలకు అప్పగించారు. ఆయా కేంద్రాల్లో యూరియా సక్రమంగా రైతులకు పంపిణీ చేసేలా ఏవోలు, ఏడీఏలు పర్యవేక్షణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం నుంచి సంబంధిత సహకార సంఘాల్లో ఏఈవోల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ జరుగుతోంది. కరీంనగర్ మండల వ్యవసాయాధికారి బి.సత్యం దుర్శేడ్, చెర్లభూత్కూర్, నగునూరు కేంద్రాల్లో యూరియా పంపిణీ విధానాన్ని తనిఖీ చేశారు. కొత్తగా సేల్స్ రిజిస్టర్ సహకార సంఘాలు, ఆగ్రోస్, డీసీఎంఎస్ కేంద్రాల్లో బుధవారం నుంచి యూరియా విక్రయాల వివరాలను నమోదు చేసేందుకు కొత్తగా సేల్స్ రిజిస్టర్లు ఏర్పాటు చేశారు. గతంలో కేవలం ఈపాస్ మిషన్ల ద్వారానే రైతులకు అవసరమైన ఎరువులను విక్రయించగా స్టాక్ రిజిస్టర్లను నిర్వహించారు. దీంతో ఏ రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు విక్రయించారనే సమాచారం అందుబాటులో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. ఎరువుల విక్రయాల పక్కా సమాచారం కోసం సేల్స్ రిజిస్టర్లు ఏర్పాటు చేసి వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు పేరు, గ్రామం, ఎంత విస్తీర్ణం, ఎన్ని యూరియా బస్తాలు ఇచ్చారనే వివరాలు ఏఈవోలు రిజిస్టర్లో నమోదుచేస్తున్నారు. ఈ విధానంతో ఆయా గ్రామాల్లోని ఎంతమంది రైతులు ఎన్ని యూరియా బస్తాలు తీసుకెళ్లారనే సమాచారం తెలుస్తోంది. సేల్స్ రిజిస్టర్లలోని యూరియా విక్రయాల వివరాలను ఏఈవోలు ఎప్పటికపుడు ఉన్నతాధికారులకు అందించడంతో సరిపడే యూరియా స్టాక్ తెప్పించేందుకు వీలవుతుంది. మండలపరిధిలోని గ్రామాల రైతులకు మాత్రమే యూరియా విక్రయించాలనే కలెక్టర్ ఆదేశాలతో స్థానిక రైతులకు సరిపడే యూరియా లభించే అవకాశం ఏర్పడింది. -
అపరిశుభ్రం.. అధ్వానం
కరీంనగర్ అర్బన్: ముడి పదార్థాలపై బల్లుల మలం.. ఈగలు, దోమలు, పరిసరాలు అపరిశుభ్రం ఇదీ పలు బేకరీల్లో వెలుగు చూసిన నిజం. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల క్రమంలో కరీంనగర్లోని పలు బేకరీలు, స్వీట్ షాపులను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఖలీల్, గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ రోహిత్ రెడ్డి, ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ అంకిత్రెడ్డి తనిఖీ చేశారు. టవర్ సర్కిల్ లోని అనిల్ స్వీట్స్, బేకరి, ఆనంద్ స్వీట్స్, ముకరంపురలోని మహారాజా స్వీట్ దుకాణాన్ని తనిఖీ చేయగా అపరిశుభ్ర వాతావరణం గుర్తించినట్లు వివరించారు. స్వీట్స్ భద్రపరచడంలో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. స్వీట్స్పైన బళ్లుల మలం గుర్తించగా, కిచెన్లో డ్రైనేజ్ బ్లాక్ అవ్వడంతో దుర్వాసనతో పాటు పాలలో ఈగలు, దోమలు పడి ఉన్నాయని తెలిపారు. స్వీట్స్ తయారీలో పరిమితికి మించి ఆర్టిసిఫియల్ ఫుడ్ కలర్స్ ఉపయోగిస్తున్నారన్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపినట్లు అధికారులు వివరించారు. స్వీట్షాపుల్లో అధికారుల తనిఖీలు -
శాతవాహన అధ్యాపకుడికి అవార్డు
కరీంనగర్క్రైం: రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ, తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో 2022– 23 ఏడాదికిగానూ ఉత్తమ అధ్యాపకులను సత్కరించారు. శాతవాహన విశ్వవిద్యాలయ ఉర్దూ విభాగ సహాయ ఆచార్యుడు డాక్టర్ నజీముద్దీన్ మునవర్ సీఎం రేవంత్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఎస్యూ రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, పరీక్షల నియంత్రణ అధికారి డి.సురేశ్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ సూరేపల్లి సుజాత, ఉర్దూ విభాగాధిపతి అబ్రారూల్ బాకీ, జాఫర్, హుమేరా తస్లీమ్ శ్రీవాణి అభినందించారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
కోల్సిటీ(రామగుండం): వ్యాధి నిర్ధారణ, చికిత్సలో వినియోగించిన దూది, సూది, సిరంజీ, సర్జికల్ బ్లేడ్, రక్తంతో తడిసిన కాటన్, వాడిన యూరిన్ బ్యాగ్.. బ్లడ్ బ్యాగ్.. ఇలా అనేక జీవ వైద్యవ్యర్థాలు(బయో మెడికల్ వేస్ట్)ను చెత్తలో కలిపేస్తున్నారు. బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ సక్రమంగా లేక ప్రజారోగ్యానికి పెనుప్రమాదం పొంచిందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులతోపాటు ల్యాబ్ల నుంచి వెలువడే బయో మెడికల్ వేస్ట్ వ్యర్థ ట్రీట్మెంట్ ప్లాంట్కు చేరుతుందా? లేదా? అనేదానిపై పర్యవేక్షణ లేక ఈ పరిస్థితి దాపురించిందంటున్నారు. సాధారణ చెత్తలో.. బయో మెడికల్ వేస్ట్.. బయో మెడికల్ వేస్ట్ను సేకరించడానికి కరీంనగర్లోని వెంకటరమణ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాహనాలు ఉంటాయి. ఆస్పత్రుల నిర్వాహకులు జీవవైద్య వ్యర్థాలను రోజూ వచ్చే ఆ వాహనాలకు ఇవ్వాలి. కానీ కొందరు చెత్తలోనే కలిపేస్తున్నారు. డబ్బాల వినియోగంపైనా నిర్లక్ష్యం.. ఆస్పత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను వాటి తీరునుబట్టి పసుపు, ఎరుపు, నీలం, నలుపు తదితర రంగు డబ్బాల్లో వేయాలి. కానీ, వీటిపై సిబ్బందికి కూడా అవగాహన లేదని తెలుస్తోంది. 48 గంటలకు మించి వ్యర్థాలను ఆస్పత్రుల్లో నిల్వ ఉంచరాదని, శాసీ్త్రయ పద్ధతిలో రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నాయి. వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. భారీ జరిమానా వసూలు.. రామగుండం నగరంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు, బయో మెడికల్ వేస్ట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ను బయట పడవేసిన శ్రీఅదితి హాస్పిటల్కు రూ.లక్ష, సత్యం హాస్పిటల్కు రూ.50వేలు, వెంకటసాయి క్లినికల్ ల్యాబ్కు రూ.10వేలు చొప్పున ఈనెల 14న బల్దియా అధికారులు జరిమానా విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్ల నుంచి వెలువడే బయో మెడికల్ వేస్ట్ను కరీంనగర్లోని వెంకటరమణ ప్లాంట్కు పంపిస్తున్నారా? లేదా? అనేదానిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ట్రీట్మెంట్ ప్లాంట్కు వ్యర్థాలను ఇవ్వడానికి జిల్లాలోని 141 ప్రైవేట్ ఆస్పత్రులు(హెల్త్ కేర్ ఫెసిలిటీ–హెచ్సీఎఫ్)కు అనుమతి పొందితే, మిగిలిన 46 ఆస్పత్రులు అనుమతి తీసుకోలేదు. ప్రభుత్వ ఆస్పత్రులు 68 ఉండగా, ఇందులో గోదావరిఖని జనరల్ గవర్నమెంట్ ఆస్పత్రి, పెద్దపల్లి సివిల్ ఆస్పత్రి మినహా మిగిలిన 21 పీహెచ్సీలకూ అనుమతుల్లేకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల ఇష్టారాజ్యం రోడ్లపై పడేస్తున్న బయో మెడికల్ వేస్ట్ వ్యర్థాలతో వ్యాధులు సోకే ప్రమాదం చోద్యం చూస్తున్న ఉన్నతాధికారులు -
కిడ్నాప్ చేసి.. ప్రాణాలు తీసి
● వృద్ధురాలి మిస్సింగ్ కేసు ఛేదన గంగాధర: గంగాధర పోలీస్స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. గంగాధరకు చెందిన పెగు డ మల్ల వ్వ(65)ను కారులో తీసుకెళ్లి రాజన్నసిరిసిల్ల జిల్లా శివారులో హత్య చేశారని, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సై కథనం ప్రకారం.. పెగుడ మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఈనెల 16న కనిపించకుండా పోయింది. ఆమె బంధువు ఈరవేణి రాయమల్లు ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసుకున్న పోలీసులు ఏసీపీ విజయ్కుమార్, సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన దేవూరి సతీశ్, దేవునూరి శ్రావణ్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామానికి చెందిన గంగరాజు సూచనల మేరకు వృద్ధురాలిని కిడ్నాప్ చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట శివారులో హత్యచేసి, ఆభరణాలు దోచుకొని, శవాన్ని చెత్తకుప్పలో పడేసినట్లు వెల్లడించా రు. కేసులో ప్రధాన నిందితుడు గంగరాజుతోపాటు మరికొంత మంది పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. ఏడాదిన్నర కుమారుడితో తల్లి అదృశ్యంమల్యాల: మండలకేంద్రంలోని ఒడ్డెర కాలనీకి చెందిన అలకుంట పూజ తన ఏడాదిన్నర కుమారుడితో అదృశ్యమైంది. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం..పూజకు రెండేళ్ల క్రితం కరీంనగర్ మండలం వడ్డపల్లి గ్రామానికి చెందిన అలకుంట చందూతో వివాహమైంది. భర్తతో మనస్పర్థలు ఏర్పడి కుమారుడు యశ్వంత్తో తల్లిగారిల్లయిన మల్యాలలో ఉంటోంది. మంగళవారం అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా కుమారుడితో ఇంట్లోనుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
లక్ష్య సాధనలో బ్యాంకర్లు సహకరించాలి
కరీంనగర్ అర్బన్: వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జీపీవై, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై కలెక్టరేట్లో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్షించా రు. 2025–26 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి జూన్ 2025 వరకు రూ.4,314.88 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1,591.41కోట్లు, ఎంఎస్ఎంఈ రంగంలో రూ.1,186.38కోట్లు, విద్యా రుణాల కు రూ.3.38కోట్లు, హౌసింగ్ లోన్స్ రూ.57.24కోట్లు, స్వయం సహాయక సంఘాల రుణాలు రూ.258 కోట్లు, ఇ తర రంగాలకు రూ.1218.47 కోట్లు రుణాలను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న లక్ష్యాల్లో జూన్ 30వరకు 32.12 శాతం పూర్తయిందని, పెండింగ్లో ఉన్న రుణాల ప్రతిపాదనలు అందించి త్వరగా మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాల న్నారు. జూలై 1నుంచి జన సురక్ష శిబిరాలు జిల్లాలో ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ అధికారి తాన్య, నాబార్డ్ డీడీఎం జయప్రకాశ్, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, టీజీబీ ఆర్ఎం బాలనాగు పాల్గొన్నారు. -
జరిమానా విధిస్తాం
ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ను బహిరంగ ప్రదేశాలు, చెత్త కుండీల్లో వేసే ఆస్పత్రుల నిర్వాహకులకు జరిమానా విధిస్తాం. హానికర బయో మెడికల్ వేస్ట్ను నగరపాలక సంస్థ డంపింగ్ యార్డుకు తరలించదు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏజెన్సీ ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనానికి వ్యర్థాలను అందించి ఆస్పత్రుల నిర్వాహకులు సహకరించాలి. – అరుణశ్రీ, కమిషనర్, రామగుండం బల్దియా బయో మెడికల్ వేస్ట్ను చెత్తలో వేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇటీవల రామగుండం నగరపాలక అధికారులు పలు ఆస్పత్రులకు ఈవిషయంలో జరిమానా విధించారని తెలిసింది. వాటికి ట్రీట్మెంట్ ప్లాంట్తో అనుసంధానం ఉందో? లేదో? తెలుసుకుంటాం. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. – భిక్షపతి, ఈఈ,, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి -
ఎమ్మెల్యే సోదరుడి మృతి
● బండి సంజయ్ సహా పలువురి సంతాపం కరీంనగర్ కార్పొరేషన్: డీసీసీ అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం అనారోగ్యంతో నగరంలోని ఆయన నివాసంలో బుధవారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మో హన్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి త దితరులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫోన్లో సత్యనారాయణను పరామర్శించారు. కలెక్టర్ పరామర్శఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్ పరామర్శించారు. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కందునూరిపల్లి గ్రామానికి చెందిన హార్వెస్టర్ డ్రైవర్ కందునూరి తిరుపతి(39) బుధవారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రావణ్కుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. తన నానమ్మ పేరిట ఉన్న భూమిని పట్టాచేయడం లేదని, సొంతింట్లో ఉండడం లేదని, తన ఇద్దరు కుమారులకు ఏమీ చేయడం లేదని తిరుపతి కొంతకాలంగా మానసికంగా వేదనలో ఉన్నాడు. పాతఇంట్లో పడుకుంటాని భార్యకు చెప్పి మంగళవారం రాత్రి వెళ్లాడు. మరునాడు ఉదయం భర్తను నిద్రలేపడానికి వె ళ్లగా ఎంతకీలేవలేదు. కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు ఉరివేసుకొని కనిపించాడు. ఈమేరకు భార్య సరిత ఫిర్యాదు చేసిందని ఎస్సై వివరించారు. కరీంనగర్క్రైం: అత్తింటివారి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ సీఐ రాంచందర్రావు వివరాల ప్రకా రం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పేట సెంగెం గ్రామానికి చెందిన అబ్రమ్ జ్ఞానేశ్వర్కు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేట్ గ్రామానికి చెందిన భావన అలియాస్ మానసకు 2023 నవంబర్లో వివాహం జరిగింది. అప్పుడు 16 తులాల బంగారం, రూ.లక్ష కట్నంగా ఇచ్చారు. వీరికి ఆరు నెలల కూతురు ఉంది. జ్ఞానేశ్వర్ కరీంనగర్లోని ఓ రెస్టారెంట్లో పనిచేస్తూ.. భగత్నగర్లో భార్య, కూతురుతో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా అదనపు కట్నం కావాలంటూ జ్ఞానేశ్వర్, అతని తల్లిదండ్రులు సంగమణి, అంజయ్య, చిన్న ఆడపడుచు శ్యామల వేధిస్తున్నారని మానస తన తండ్రి క్యాస కిష్టయ్యకు చెప్పుకుంటూ బాధపడేది. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని మృతిచెందింది. తన కూతురు మృతికి భర్త జ్ఞానేశ్వర్, అతని తల్లిదండ్రులు, చిన్న ఆడపడుచు కారణమంటూ కిష్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పెద్దమ్మస్టేజీ మూలమలుపు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా పాల్వంచమర్రికి చెందిన కడమంచి వెంకటి మృతిచెందాడు. వెంకటి బైక్పై సముద్రలింగాపూర్ వెళ్లి వస్తుండగా పెద్దమ్మ స్టేజీ మూలమలుపు వద్ద కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ వెంకటిని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య లీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
చవితి సందడి
విద్యానగర్(కరీంనగర్): భక్తకోటి నుంచి తొలి పూజలు అందుకునే వినాయక నవరాత్రోత్సవాల సందడి ప్రారంభమైంది. కొలువుదీరేందుకు భారీ విగ్రహాలు వివిధ రూపాల్లో సిద్ధంగా ఉన్నాయి. గణేశ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి యువత, కాలనీలవాసులు చందాలవేటలో మునిగిపోయారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో సందడి జోరందుకుంది. సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేయాలనుకునే ఆశవహులు ఈ సారి గణేష్ మండపాల ఏర్పాటులో ప్రధాన పాత్ర వహించేందుకు ఉత్సాహం చూపుతున్నారు. పోటాపోటీగా చందాలు రాస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో యువత, ఓట్లరు మచ్చిక చేసుకోవడానికి భారీగా విరాళాలు ఇవ్వడంతో పాటు, అన్నదానాలు, సౌండ్ సిస్టమ్, లైటింగ్, ప్రతిమల నిమజ్జనానికి వాహనాలు సమకూరుస్తామని హామీ ఇస్తున్నారు. కరీంనగర్లోనూ పలు డివిజన్లలో మాజీ కార్పోరేటర్లు, ప్రస్తుతం పోటీ చేయాలని చూస్తున్న వారు మండపాలకు భారీగా చందాలు రాస్తున్నారు. విగ్రహాలను సమకురుస్తామని, అన్నదానం చేస్తామని ముందుకొస్తున్నారు. కాగా.. వినాయక చవితి సంబరాలకు మండపాలు ముస్తాబు అవుతున్నాయి. నగరంలోని గంజ్, టవర్ సర్కిల్, బోయవాడ రావిచెట్టు, గాంధీరోడ్డు తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద మండపాలు సిద్ధం చేస్తున్నారు. నవరాత్రోత్సవాలకు సిద్ధమవుతున్న మండపాలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఊరూరా జోష్ భారీగా విరాళాలు ఇస్తున్న ఆశావహులు మండపాల ఏర్పాటుకు పోటాపోటీ -
యూరియా తెచ్చే సోయి లేదా?
తిమ్మాపూర్: మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియాను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. యూరియా కొరతను నిరసిస్తూ బుధవారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో సొసైటీ వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికై నా రైతులకు సరిపడా యూరియా అందించాలని, లేనిపక్షంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణరావు, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం, ల్యాగాల వీరారెడ్డి, గంప వెంకన్న, పాశం అశోక్రెడ్డి పాల్గొన్నారు. -
మేడిపల్లి భూముల సేకరణకు చర్యలు
● పోలీసు పహారా మధ్య రైతుల ఇళ్లకు నోటీసులు రామగిరి(మంథని): ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం రైతుల ఇళ్లకు నోటీసులు అంటించారు. రత్నాపూర్ పరిధి మేడిపల్లి శివారులోని భూముల స్వాధీనం కోసం రెవెన్యూ అధికారులు పోలీసు పహారా మధ్య పట్టదారుల ఇళ్లకు వెళ్లి వారి ఇళ్ల గోడలకు నోటీసులు అంటించారు. మేడిపల్లి శివారులో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్టేర్పాటుకు రైతుల భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని రెవెన్యూ అధికారులు ఈనెల 1న అభిప్రాయ సేకరణ చేపట్టారు. రైతులు వ్యతిరేకించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూసేకరణ కోసం నోటీసులు అంటించారు. తమ భూములను కోల్పోతే జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కళాశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
సైదాపూర్/హుజూరాబాద్/చిగురుమామిడి: కళాశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అశ్వినీ తానాజీ వాకడే ఆదేశించారు. సైదాపూ ర్, హుజూరాబాద్, చిగురుమామిడిలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలల్లో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్లో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న మరమ్మతు పనులు పరిశీలించారు. విద్యార్థులకు స్టాఫ్క్లబ్ ఆధ్వర్యంలో ఐడీ కార్డులు పంపిణీ చేశారు. మున్సిప ల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి మొక్క నాటా రు. చిగురుమామిడిలో విద్యార్థులతో మాట్లా డి, సమస్యలుంటే తమ దృష్టికి తేవాలన్నారు.రాజీవ్ గాంధీకి నివాళికరీంనగర్ కార్పొరేషన్: దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికిన మహనీయుడు రాజీవ్గాంధీ అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయం, రాజీవ్చౌక్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్గాంధీ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ కార్పొరేటర్లు మాచర్ల ప్రసాద్, కట్ల సతీష్, పడిశెట్టి భూమయ్య, నాయకులు ఎండీ.తాజొద్దీన్, కొరివి అరుణ్కుమార్, శ్రావణ్నాయక్, కర్ర రాజశేఖర్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారుహుజూరాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణానికి చెందిన బీజేపీ ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరగా వారికి ఎమ్మెల్యే పార్టీ కుండవా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కౌశిక్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పాలన తీరును చూస్తున్న ప్రజలు, వివిధ పార్టీల నేతలు కేసీఆర్ నాయకత్వమే మేలు చేస్తుందని స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. హుజూరాబాద్ రాజకీయాల్లో మరో మలుపు నమోదైందని, స్థానిక సంస్థల ఎన్నికలో పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో జూపాక సింగిల్ విండో చైర్మన్ అనుమళ్ల శాముందర్రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, కట్కూరి కోమల్రెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణ కోసమే మహాసభలుకరీంనగర్: గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం కోసమే సీపీఐ రాష్ట్ర మహాసభలని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈనెల 22 నుంచి మూడు రోజుల పాటు జరిగే మహాసభలకు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్వర్యంలో జిల్లా ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మహాసభల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, వివిధ సమస్యలపై చర్చించి తీర్మాణాలు చేయనున్నామని, మూడేళ్లుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, పార్టీ, ప్రజాసంఘాల పని విధానంపై సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, అందె స్వామి, బోయిని, అశోక్,గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ముస్తాబాద్(సిరిసిల్ల): బంధువుల ఇంటికి శుభకార్యానికి ఇంటికి తాళం వేసి వెళ్లగా.. తిరిగి వచ్చే సరికి దొంగలు లూఠీ చేశారు. బంగారం, వెండి ఆభరణాలతోపాటు భారీగా నగదును దోచుకుపోయారు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లెకు చెందిన మడకుంట రాములు ఇంటిలో దొంగలు పడి రూ.50వేల నగదు, 2 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రాములు బంధువుల ఇంటిలో జరిగిన శుభకార్యానికి భార్య పిల్లలతో కలిసి గత సోమవారం వెళ్లాడు. బుధవారం తిరిగి రాగా.. బీరువాలోని వస్తువులు చిందర వందర పడి ఉండడం గమనించాడు. బీరువాలోని రూ.50వేల నగదు, 2 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. ఇంటి వెనుకగల తలుపు నుంచి దొంగలు లోనికి ప్రవేశించినట్లు గుర్తించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్సై గణేశ్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. కార్మికుడి ఇంట్లో చోరీ యైటింక్లయిన్కాలనీ(రామగుండం): స్థానిక సింగరేణి కార్మికుడు గడ్డం పరేశ్ నివాసం ఉంటున్న టీ2–592లో బుధవారం చోరీ జరిగింది. కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖనికి వెళ్లిన పరేశ్.. సాయంత్రం వచ్చిచూడగా ఇంటి తలుపు తీసి ఉంది. బీరువా తెరిచి ఉంది. అందులోని రెండు బంగారు గొలుసులు, రెండు కమ్మలు, ఒకరింగ్ కనిపించలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తమకు ఫిర్యాదు అందలేదని సీఐ ప్రసాద్రావు తెలిపారు. రూ.50వేలు నగదు, 2తులాల బంగారం అపహరణ -
రాజన్నకు 10.300 కిలోల వెండి
వేములవాడ: రాజన్నకు 34 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,97,54,588 నగదు, బంగారం 170 గ్రాములు, వెండి 10.300 కిలోలు వచ్చినట్లు ఈవో రాధాభాయి తెలిపారు. ఓపెన్స్లాబ్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమెరాల నిఘా మధ్య హుండీ లెక్కింపు నిర్వహించారు.వాటర్ ట్యాంక్ క్లోరినేషన్వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ తో గ్రామస్తులు బాధపడుతున్న తీరుపై ‘సాక్షి’లో ఈ నెల 17న ‘బేతిగల్కు జాండీస్’ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. వరంగల్ రీజియన్ బాక్టీర్యాలోజిస్ట్ హెల్త్ ల్యాబరేటరీ అధికారి కృష్ణారావు సోమవారం గ్రామంలో పర్యటించి, మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నీటిని పరిశీలించారు. క్లోరినేషన్ చేయడంలేదని సిబ్బదిని మందలించారు. దీంతో బుధవారం మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, జీపీ వాటర్ ప్లాంట్ను సిబ్బంది శుభ్రం చేశారు. ఆనంతరం క్లోరినేషన్ చేసి గ్రామంలోకి నీటిని వదిలారు.తిమ్మాపూర్: మండలంలోని ఇందిరానగర్ సమీపంలో రెండు రోజుల క్రితం బస్సు, కారు ఢీకొన్న విషయం తెల్సిందే. సదరు కారు టైర్లను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ప్రమాద స్థలంలో వాహనాలను పర్యవేక్షించే విషయంలో పోలీసులు నిర్లక్ష్యం చేయడంతో ఈ ఘటన జరిగి ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాదస్థలంలో వాహనాలను సురక్షితంగా ఉంచడం, రాత్రిపూట పెట్రోలింగ్ను పెంచడం వంటి చర్యలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు సంభవిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసి దొంగలను పట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.కొత్తపల్లి(కరీంనగర్): గణేశ్ పండుగ సందర్భంగా వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ తీగలతో అప్రమత్తంగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి సూచించారు. ప్రమాద భరితంగా ఉన్న విద్యుత్ లైన్ల ఎత్తు పెంచాలని తెలిపారు. ఈ మేరకు బుధవారం హన్మకొండ విద్యుత్ భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో విద్యుత్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు, భక్తులు, మండప నిర్వాహకులు మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని కోరారు. స్తంభాలపైన ఉన్న టీవీ కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు తొలగించాలని అన్నారు. విగ్రహాల ఎత్తుని బట్టి రూట్ని నిర్ణయించుకోవాలని, ఒక వేళా ఎక్కడైనా సమస్యలు ఉంటే విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. -
హోంగార్డు, కానిస్టేబుల్పై దాడి
కోరుట్ల: డయల్ 100కు కాల్ రాగా.. సంఘటన స్థలానికి వెళ్లిన కానిస్టేబుల్ గంగాధర్, హోంగార్డు జహీద్పై షేక్ యాసిన్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో జహీద్, గంగాధర్కు గాయాలయ్యాయి. ఎస్సై కథనం ప్రకారం.. పట్టణంలోని తాళ్లచెరువు ప్రాంతంలో కొందరు వ్యక్తులు మంగళవారం రాత్రి మద్యంమత్తులో ఉండి అసభ్యకరంగా కేకలు వేస్తుండటంతో స్థానికులు 100కు డయల్ చేశారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు గంగాధర్, జహిద్ వెళ్లారు. న్యూసెన్స్ చేయొద్దని అక్కడ మద్యం సేవిస్తున్న వ్యక్తులతో చెబుతుండగా.. మహమ్మద్ యాసిన్ కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు. కానిస్టేబుల్ గంగాధర్ పిర్యాదు మేరకు యాసిన్పై బుధవారం కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. అతనికి 14 రోజులు జుడీషియల్ రిమాండ్ విధించారని ఎస్సై తెలిపారు. యాసిన్పై గతంలో రెండు హత్యాప్రయత్నం కేసులు ఉన్నాయని, అతడిపై రౌడీషీట్ తెరుస్తామని పేర్కొన్నారు. పాముకాటుతో కౌలు రైతు మృతిచిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన మెడబోయిన రమేశ్(40) పాముకాటుతో మృతి చెందాడు. చిగురుమామిడి ఎస్సై సాయికృష్ణ వివరాల ప్రకారం.. రమేశ్ కౌలురైతు. రోజూవారి పనుల్లో భాగంగా బుధవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. చేనులో కూరగాయలు తెంపుతుండగా పాముకాటు వేసింది. కుటుంబసభ్యులు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. రమేశ్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రమేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కలెక్టరేట్, ఆస్పత్రి పరిశుభ్రంగా ఉండాలి
కరీంనగర్ కార్పొరేషన్: కలెక్టరేట్, సివిల్ హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియం, పరిసరాలను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డితో కలిసి హాస్పిటల్ను, పరిసరాలను తనిఖీ చేశారు. బొమ్మకల్లోని మిషన్ భగీరథ వాటర్ట్యాంక్ను పరిశీలించారు. సిటిజన్స్కాలనీ తాగునీటి సమస్యపై చర్చించారు. హౌసింగ్బోర్డుకాలనీలో శానిటేషన్ వాహనాల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్, హాస్పిటళ్లలో పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించొద్దని చెప్పారు. నూతనంగా కొనుగోలు చేస్తున్న శానిటేషన్ వాహనాలకు షెడ్ నిర్మాణం చేపట్టాలని అన్నారు. హౌసింగ్బోర్డుకాలనీలోని మినీస్టేడియం స్థలంలో షెడ్డునిర్మాణానికి పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ వద్ద స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులు ఆకుల ప్రకాశ్, తోట రాజేందర్ విజ్ఞప్తి చేశారు. డీఈ లచ్చిరెడ్డి, దేవేందర్, వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీశ్ పాల్గొన్నారు. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ప్రణాళికాబద్ధంగా జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లోని తాజ్కృష్ణ హోటల్లో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తుమ్మల మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల పురోగతికి చర్యలు చేపట్టామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. రైతుబజార్లను విస్తరించాలని, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు రుణమాఫీ, పంటల నష్ట పరిహారం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, మైనార్టీ, మహిళల అభివృద్ధికి పథకాలను పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మాజీమంత్రి టి.జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరమణారావు, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్, మేడిపల్లి సత్యం, సంజయ్, ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్రావు, నియోజక వర్గ ఇన్చార్జిలు వొడితెల ప్రణవ్, కేకే.మహేందర్రెడ్డి, జువ్వాడి నర్సింగరావు, నాయకులు వెలిచాల రాజేందర్రావు, వూట్కూరి నరేందర్రెడ్డి పాల్గొన్నారు. -
నవరాత్రులకు పటిష్ట ఏర్పాట్లు
కరీంనగర్క్రైం: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సీపీ గౌస్ఆలం అధికారులను ఆదేశించారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో బుధవారం నేర సమీక్ష నిర్వహించారు. గణపతి విగ్రహాల ప్రతిష్టాపన నుంచి నిమజ్జనం వరకు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. ఉత్సవ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. శాంతి కమిటీలతో సమావేశాలు నిర్వహించాలన్నారు. సీఐలు తమ పరిధిలోని పోలీస్స్టేషన్లను తరచూ సందర్శిస్తూ, సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. డివిజన్ల వారీగా ఏసీపీలు నెలవారీ నేరసమీక్షలు నిర్వహించాలన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను రికార్డుల్లో నమోదు చేయాలన్నారు. రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, పాయింట్ బుక్ల ఏర్పాటు, సమన్ల జారీ వంటి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ డీసీపీ (ఏఆర్) భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, మాధవి, యాదగిరిస్వామి, శ్రీనివాస్, వేణుగోపాల్, సతీశ్, విజయకుమార్, శ్రీనివాస్జి, నర్సింహులు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
పుట్టినరోజునే నూరేళ్లు
సిరిసిల్లటౌన్: పుట్టినరోజున ఇంట్లో అమ్మ ఆశీస్సులు పొంది, దోస్తులతో ఆనందంగా గడుపొచ్చన్న యువకుడిని విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కబళిచింది. స్థానికులు తెలిపిన వివరాలు..తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్కు చెందిన కొమ్ము మైసయ్య–నవీన దంపతులు సిరిసిల్ల నెహ్రూనగర్లో నివాసం ఉంటున్నారు. మైసయ్య ఉపాధి కోసం గల్ఫ్లో ఉండగా..భార్య నవీన ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. వీరికి లక్ష్మీనారాయణ ఉరఫ్ లక్కీ(20), నిఖిల్, శ్వేత సంతానం. కొద్దిరోజులు హైదరాబాద్లో పనిచేసిన లక్ష్మీనారాయణ ఇటీవలే సిరిసిల్లకు వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు గణేశ్ ప్రతిమను తీసుకురావడానికి లక్ష్మీనారాయణ సోమవారం ఫ్రెండ్స్తో ఆర్మూర్ వెళ్లాడు.పుట్టినరోజే కానరాని లోకాలకు..మంగళవారం తన పుట్టినరోజు కావడంతో దోస్తులతో కలిసి అప్పటికే ఆర్డర్ ఇచ్చిన 15 అడుగుల వినాయక ప్రతిమను తీసుకొచ్చి వేడుకలు జరుపుకోవాలని లక్కీ, ఫ్రెండ్స్ నిశ్చయించుకున్నారు. సోమవారం రాత్రి వర్షంలో ఇబ్బందులు ఎందుకని ఫ్రెండ్స్ అందరూ ఆర్మూర్లోనే పడుకున్నారు. మంగళవారం ఉదయం సిరిసిల్లకు వినాయక విగ్రహంతో ప్రయాణమయ్యారు. కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామ స్టేజీ వద్ద హైటెన్షన్ కరెంటు తీగలకు గణపతి విగ్రహానికి అమర్చిన ఇనుప పైపులు తగిలి లక్ష్మీనారాయణ, సాయి అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే షాక్తో పడిపోయారు. స్నేహితులు, స్థానికులు వెంటనే వారికి సీపీఆర్ చేయగా, సాయి మెలకువలోకి రాగా, లక్ష్మీనారాయణ అలానే పడిపోయాడు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో గంట సమయం గడిస్తే సిరిసిల్లకు చేరేవారు. కాగా, లక్కీ, సాయిలకు కాళ్లకు చెప్పులు లేకపోవడంతో షాకు తగిలినట్లు ఫ్రెండ్స్ చర్చించుకుంటున్నారు. పుట్టినరోజునే లక్కి జీవితం విషాదాంతంగా ముగియడం సిరిసిల్లలో తీరని విషాదం నింపింది. -
గల్లంతైన ఇద్దరు మహిళలు శవాలుగా..
● మరో మహిళ కోసం గాలింపు జగిత్యాలక్రైం: మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహ వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల శివారు టీఆర్నగర్కు చెందిన ముగ్గురు మహిళలు ఆదివారం గల్లంతయిన విషయం తెల్సిందే. మంగళవారం ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యమయ్యాయి. షేక్ అఫ్రిన (30), సమీన (50), హసీన (28)తోపాటు వారి బంధువు, ఆర్మూర్కు చెందిన సోహెబ్ కలిసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముక్హేడ్ తాలూకా దెగ్లూర్ వెళ్లి తిరిగి వస్తుండగా రవిగాం వద్ద వరదలో గల్లంతయ్యారు. భారీ వరదల్లో కారు కొట్టుకుపోయింది. అక్కడి గ్రామస్తులతో పాటు, రెస్క్యూ టీం, పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టగా హసీన, అఫ్రిన్ మృతదేహాలు దొరికాయి. సమీన మృతదేహం కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకురానున్నారు. అఫ్రిన (ఫైల్) హసీన (ఫైల్) -
ఎస్జీఎఫ్ క్రీడలకు వేళాయె..
● షెడ్యూల్ ఖరారు చేసే పనిలో కార్యదర్శులు ● చివరి వారంలో ప్రారంభం కానున్న మండలస్థాయి పోటీలు ● సన్నద్ధమవుతున్న విద్యార్థులుకరీంనగర్స్పోర్ట్స్: జిల్లాల్లో క్రీడల సందడి నెలకొననుంది. 2025–26 విద్యాసంవత్సరం ఆరంభమైంది. ఈ విద్యాసంవత్సరంలో జరగనున్న పాఠశాలలు, కళాశాలల క్రీడా సమాఖ్యల క్రీడాపోటీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో రానున్న 2 నెలలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలతో ఆయా మైదానాలు కిక్కిరిసిపోనున్నాయి. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతీ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాలస్థాయిలో అండర్–14, 17, కళాశాల స్థాయిలో అండర్–19 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా మండలస్థాయి నుంచి మొదలుకొని జిల్లా, ఉమ్మడి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిల్లో క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు చివరి వారం నుంచి క్రీడాసందడి మొదలు కానుంది. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్.. పాఠశాలస్థాయిలో అండర్–14, 17 విభాగాలకు మండల, జిల్లా, జోనల్(ఉమ్మడి జిల్లా) స్థాయిల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడాపోటీలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో చివరి వారం నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ టోర్నమెంట్, ఎంపిక నిర్వహిస్తారు. సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాస్థాయి, మూడో వారంలో ఉమ్మడి జిల్లా(జోనల్) స్థాయిలో టోర్నమెంట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన జట్లు అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి టోర్నమెంట్లలో పాల్గొననున్నాయి. డీఈవోలతో సమావేశం 2025–26 సంవత్సరానికి 69వ ఎస్జీఎఫ్ క్రీడలకు సంబంధించి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులతో ఎస్జీఎఫ్ బాధ్యులు, వ్యాయామ ఉపాధ్యాయులు సమావేశాలు ని ర్వహించారు. పోటీల నిర్వహణ, భోజన సౌకర్యం, ఎస్జీఎఫ్ కార్యదర్శుల నియామకం తదితర వాటిపై చర్చించారు. మండల , జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలను ఏవిధంగా నిర్వహించాలి.. పోటీలను ఏఏ తేదీల్లో నిర్వహించాలి.. వర్షం కురుస్తున్న సందర్భంగా పోటీల నిర్వహణ ఏవిధంగా చేయాలని తదితర వాటిపై చర్చించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎస్జీఎఫ్ పోటీలకు సంబంధించిన తేదీలు ఖరారు కానున్నట్లు పలువురు పీఈటీలు తెలిపారు. సన్నద్ధమవుతున్న విద్యార్థులు ఎస్జీఎఫ్ క్రీడల్లో సత్తా చాటేందుకు ఆయా జిల్లాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు సమాయత్తమవుతున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీల్లో రాణించి పతకాలు సాధించి జిల్లా, పాఠశాలకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు సాధన చేస్తున్నామంటున్నారు. గత సంవత్సరం కంటే మెరుగైన ఆటతీరును కనబరిచేలా కసరత్తు చేస్తున్నామని, రాష్ట్ర పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్ల గెలుపే ధ్యేయంగా సాధన చేస్తున్నామని, పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటామని పలువురు చిన్నారులు చెబుతున్నారు. -
అంజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం మంగళవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి.. కోనేరులో స్నానాలు చేశారు. క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. సామూహిక ఆంజనేయస్వామి అభిషేకాల్లో పాల్గొన్నారు. లడ్డూ, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.6లక్షలు, ప్రత్యేక దర్శనం టికెట్ల విక్రయాల ద్వారా రూ.4.12 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు, చంద్రశేఖర్, సునీల్కుమార్, హరిహరనాథ్, అశోక్, తదితరులు పర్యవేక్షించారు. -
ప్రతిభ చాటాలి
పాఠశాలస్థాయిలో విద్యార్థులకు క్రీడావేదికగా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ఎంతగానో దోహదపడుతున్నాయి. రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థులు ప్రతిభ చాటాలి. ప్రతీ ఏడాది ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయస్థాయి ఎస్జీఎఫ్ టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం మరింత మెరుగ్గా రాణించి పతకాలు తీసుకురావాలి. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి -
అమ్మవారికి చేనేత కళాకారుడి ప్రత్యేక చీర
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి సిరిసిల్ల సాయినగర్కు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి మంగళవారం ఈవో రాధాబాయికి సమర్పించారు. ఈ సందర్భంగా విజయ్ని ఈవో సత్కరించారు. అలాగే దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినం సందర్భంగా ఆలయంలో ఈవో ప్రత్యేక పూజలు చేశారు. నేడు హుండీ లెక్కింపు వేములవాడ రాజన్న హుండీలలోని కట్నాలు, కానుకలను బుధవారం ఉదయం 8 గంటల నుంచి స్వామివారి ఓపెన్స్లాబ్లో లెక్కించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో పేర్కొన్నారు. ఆలయ ఉద్యోగులు సకాలంలో హాజరుకావాలని ఆదేశించారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యంకరీంనగర్క్రైం: కరీంనగర్ వన్టౌన్ పరిధిలోని మార్కెట్ ప్రాంతంలో మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి(50) వర్షంలో తడుస్తూ వణుకుతుండగా, వన్టౌన్ పోలీసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉదయం 10.30 గంటలకు మృతి చెందాడు. మృతుడి బంధువులు ఎవరైనా ఉంటే వన్టౌన్ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని సీఐ రామచంద్రరావు తెలిపారు. -
వేధింపులతో హమాలీ ఆత్మహత్య
కరీంనగర్రూరల్: వడ్డీ వ్యాపారుల వేధింపులతో ఓ హమాలీ కార్మికుడు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం మేరకు బొమ్మకల్ పరిధిలోని కృష్ణానగర్కు చెందిన తంగెళ్ల శ్రీనివాస్(44) గ్రామంలోని చింతపండు నాగరాజు వద్ద రూ.4లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పలు విడతల్లో రూ.15 లక్షల వరకు చెల్లించాడు. ఇంకా రూ.27.60లక్షలు ఇస్తేనే అప్పు ముట్టుతుందంటూ శ్రీనివాస్కు లాయర్ నోటీసులు పంపించాడు. శ్రీనివాస్ తన వద్ద డబ్బులు లేవని చెప్పగా, భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటూ నాగరాజు తోపాటు మరో వ్యక్తి బట్టు రాజేందర్ వేధింపులకు గురిచేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ సోమవారం రాత్రి 10గంటలకు ఇంటి వెనక ఉన్న మామిడిచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు హర్షిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. గుంపులలో ఉరివేసుకొని వ్యక్తి..ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన ఉరగొండ లక్ష్మణ్(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇంట్లోని ఓ గదిలో పడుకున్న లక్ష్మణ్ను భోజనం చేయాలని కోరుతూ తల్లి మధునమ్మ మంగళవారం ఉదయం పిలిచింది. అతడు ఎంతకూ గదిలోంచి బయటకు రాకపోయే సరికి కిటకీలోంచి చూసింది. దీంతో ఉరివేసుకొని మృతిచెంది కనిపించాడు. ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్లో ఉన్న లక్ష్మణ్ రోడ్డుప్రమాదంలో గాయపడ్డాడు. అనారోగ్యానికి గురయ్యాడు. భార్య విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. కొంతకాలంగా ఒంటరి జీవితం గడుపుతున్న లక్ష్మణ్.. మద్యానికి బానిసై ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బావిలో దూకి యువకుడు..జమ్మికుంట: తరచూ తాగి వస్తున్న కొడుకును తల్లి మందలించడంతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లికి చెందిన హమాలీ శివకుమార్(25) మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగివస్తుండడంతో తల్లి మందలించింది. కోపంతో సోమవారం ఉదయం ఇంటినుంచి వెళ్లి కొత్తపల్లి సమీపంలోని వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి తల్లి లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం కమాన్పూర్ పరిధిలోని ఒడ్డెపల్లి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతన్పల్లికి చెందిన జడ బక్కవ్వ(80) మృతి చెందింది. కొత్తపల్లి ఎస్హెచ్వో బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం.. బక్కవ్వ మనుమరాలు జడ మౌనిక అనారోగ్యంతో బాధపడుతోంది. కొత్తపల్లి మండలం బావుపేటలో తాయత్తు కట్టించుకునేందుకు ఆటోలో వెళ్తుండగా ఒడ్డెపల్లి వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొట్టింది. బక్కవ్వ, మౌనిక, ఆటోడ్రైవర్కు గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా బక్కవ్వ మృతి చెందింది. తల్లి మృతికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని జడ రాయమల్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ఎంసీ శేఖర్కు అంతర్జాతీయ ఫొటోగ్రఫీ అవార్డులు
సిరిసిల్ల: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2025 సంవత్సరానికి రెండు అంతర్జాతీయ అవార్డులను రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఎంసీ శేఖర్ (మేర్గు చంద్రశేఖర్) సాధించాడు. ఫ్రాన్స్కు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ అఫ్ ఫొటోగ్రఫీ (ఎఫ్ఐఏపీ) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ(ఎఫ్ఐపీ)సంస్థలతో కలిపి ఇండోర్ కు చెందిన ‘మాల్వా ఫొటోగ్రఫీ’ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో ఎంసీ శేఖర్ హైదరాబాద్ గోల్కొండ కోటలో తీసిన ‘ఫోర్ట్ గేట్’ ఫొటోకు బంగారు పతకం వరించింది. ఇదే పోటీలో తెలంగాణకు చెందిన మథుర లంబాడాల జీవనశైలిపై తీసిన ‘చిట్ చాట్’ చిత్రానికి ఫ్రాన్స్కు చెందిన ‘ఫియాప్’ (ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ ఫొటోగ్రఫీ, ఫ్రాన్స్) సంస్థ ‘హనరెబుల్ మెన్షన్’ అవార్డు ప్రకటించింది. ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు, పలు దేశాల గౌరవ పురస్కారాలు పొందిన శేఖర్ మూడున్నర దశాబ్దాలుగా సిగ్నా ఫొటో గ్రఫీ సంస్థ ద్వారా రాణిస్తున్నారు. తాజా మరో రెండు అవార్డులు సాధించిన చంద్రశేఖర్ను పలువురు అభినందించారు. -
టెక్స్టైల్ పార్కు కార్మికుల మెరుపు సమ్మె
తంగళ్లపల్లి(సిరిసిల్ల): పవర్లూమ్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్టైల్ పార్కులో వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. తమ కూలి రేట్లను పెంచాలని కోరుతూ కార్మికులు మంగళవారం మెరుపు సమ్మెకు దిగినట్లు సీఐటీయూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికులకు రోజూ రూ.1,000 వేతనం చెల్లించేలా కూలి రేట్లను సవరించాలన్నారు. అలాగే ఒప్పంద గడువు ముగిసన ప్రైవేటు వస్త్రానికి 10 పిక్కులకు రూ.50 పైసలు పెంచాలన్నారు. యజమానులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగినట్లు పేర్కొన్నారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే సమ్మె ఉధృతం చేస్తామన్నారు. టెక్స్టైల్ పార్కు పవర్లూమ్ కార్మికుల యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు వస్త్రాలకు సంబందించి యజమానులు కూలి పెంచే వరకు కార్మికులు ఎవరూ పనులకు వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం గేటు వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్మిక నాయకులు సదానందం, సంపత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేబుల్ వైర్ల తొలగింపు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్ల తొలగింపు పనులకు విద్యుత్శాఖ శ్రీకారం చుట్టింది. గత కొన్నేళ్లుగా పట్టించుకోకుండా వ్యవహరించిన విద్యుత్శాఖలో సోమవారం హైదరాబాద్లోని రామంతాపూర్లో జరిగిన ఘటనతో కదలిక వచ్చింది. ఈ నెల 27వ తేదీ నుంచి వినాయక చవితి, తరువాత దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిమల తరలింపు సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేసేందుకు అప్రమత్తమైంది. సీఎండీ వరుణ్రెడ్డి ఆదేశాలతో ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈలు ఉపేందర్, జంపాల రాజం విద్యుత్ స్తంభాలు, వైర్లకు సమీపంలో ఉన్న కేబుళ్లు, డిష్వైర్ల తొలగింపు పనులు చేపట్టారు. విద్యుత్ స్తంభాలపై అస్తవ్యస్తంగా వైర్లు నగరరంలోని విద్యుత్ స్తంభాలపై కేబుల్వైర్లు వేలా డుతున్నాయి. ఇంటర్నెట్, కేబుల్వైర్లను విద్యుత్ స్తంభాలపై గల 33, 11 కేవీ వైర్ల సమీపం నుంచి వైర్లు లాగుతున్నారు. మెయింటెనెన్స్పై దృష్టి సా రించకపోవడంతో ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యుత్శాఖకు రెవెన్యూ చెల్లించకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తున్నారు. చూసిచూడనట్లు వ్యవహరించిన అధికారులు హైదరాబాద్ ఘటనతో అప్రమత్తమయ్యారు. కేబుళ్లు, ఇంటర్నెట్ వైర్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. దీంతో ఆయా కంపెనీల ఇంటర్నెట్లు, కేబుల్ వాడుతున్న వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది. మూడు రోజుల్లో కేబుల్, ఇంటర్నెట్ కేబుళ్లను సరి చేసుకోవాలని విద్యుత్శాఖ ఆదేశాలు జారీ చేసింది. లేకుంటే తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. కేబుల్ వైర్లు తొలగించండి విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలి. ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా విద్యుత్ అధికారులు వ్యవహరించాలి. ఒక పద్ధతి ప్రకారం కేబుల్ వైర్లు అమర్చుకోవాలి. వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను సందర్శించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల క్లియరెన్స్ చేపట్టాలి. వినాయక నిమజ్జన రూట్లన్నీ తనిఖీ చేపట్టి క్లియరెన్స్ ఉండేలా సత్వర చర్యలు తీసుకోవాలి. – వరుణ్రెడ్డి, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ -
కబ్జా.. బ్యాంకు రుణం!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ శివారులో నకిలీ ఇంటి నంబర్ల దందాలో రోజుకో కొత్తకోణం వెలుగుచూస్తోంది. నకిలీ ఇంటి నంబర్లు, నిర్మాణ అనుమతులతో రిజిస్ట్రేషన్లు చేసుకున్న కబ్జాదారులు, ఆ పత్రాలతో బ్యాంకుల్లో లోన్లు తీసుకుంటున్న విషయం తెలిసి బాధితులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఈ తతంగాల పై విజిలెన్స్, పోలీసులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. నిజనిజాలు తెలుసుకునేందుకు ఇంటి అనుమతుల రిజిష్టర్ కోసం సహచట్టం ద్వారా బా ధితులు దరఖాస్తు చేస్తే బల్దియా అధికారులు తమవద్ద రికార్డులు ప్రస్తుతం అందుబాటులో లేవని దాటవేస్తున్నారు. 2019 మార్చిలో టౌన్ప్లానింగ్ ఆఫీసర్కు తాను ఇంటి అనుమతులతో పాటు అన్ని రికార్డులను అప్పగించానని రేకుర్తి పాత గ్రామ కార్యదర్శి గతేడాది రూరల్ ఏసీపీకి స్వయంగా లేఖ రాయడం గమనార్హం. దీంతో బల్దియా అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇంటినంబర్ల సమాచారాన్ని తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. పేరు లేకున్నా రిజిస్ట్రేషన్ రేకుర్తిలో సర్వే నంబరు 67లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు.. ఖాళీగా ఉన్న నాలుగు గుంటల భూమిని ‘అట్టారా’ ముఠా తెలివిగా కాజేసింది. గతంలో ఇది 18వ డివిజన్గా ఉండేది. ఖాళీ భూములకు నకిలీ పత్రాలతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం, ఆక్రమించుకోవడం ఈ గ్యాంగ్ దినచర్య. గతంలో ఆక్రమించుకున్న ఓ భూమి కేసు ప్రస్తుతం వీరి మెడకు చుట్టుకుంది. ఆ సమయంలో రెండు ప్లాట్లను గంగాధర సబ్రిజిస్ట్రా ర్ వద్ద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విషయంపై సీఎం కార్యాలయం ఆదేశాలతో ప్రస్తు తం కొత్తపల్లి పోలీసులు విచారణ జరపుతున్నారు. అసలు ఆజ్ఞా పత్రాల్లో దరఖాస్తుదారుల పేర్లు లేకున్నా.. సబ్రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడం చూసి పోలీసులే ముక్కున వేసుకున్నారు. అవే కాగితాలతో బ్యాంకుల్లో లోన్లు.. వీరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి అసలు యజ మానులను బెదిరించడమే కాదు.. పలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటారు. అప్పుడు భూమి అసలు యజమాని.. ఇటు కబ్జాదారులతో, అటు రుణాలి చ్చిన బ్యాంకులతో ఒకేసారి న్యాయపోరాటం చే యాల్సిన దుస్థితి కల్పిస్తారు. తప్పుడు ఇంటి నంబర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుని, బ్యాంకుల్లో కుదవపెట్టి.. అట్టారా ముఠా రూ.కోట్లు సంపాదించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్, బల్దియా కమి షనర్, సీపీ ఈ విషయంలో జోక్యం చేసుకుని లోతుగా విచారణ చేపట్టాలని స్థానికులు విన్నవిస్తున్నారు. ఇటీవల బల్దియా పరిధిలో 1,002లో వివాదాస్పద ఇంటినంబర్లలో మెజారిటీ ఇదే తరహాలో ఉన్నాయి. ఇప్పటి వరకు 800వరకు రద్దు చేయగా.. మిగిలిన 200 కూడా త్వరలో రద్దు చేస్తామని బల్దియా అధికారులు ‘సాక్షి’కి వివరించారు. -
గంగాధర పీహెచ్సీ సేవలు భేష్
కరీంనగర్టౌన్/కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్): ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో గత నవంబర్ నుంచి పీహెచ్సీల్లో జరిగిన ప్రసవాలపై సమీక్షించారు. గంగాధర పీహెచ్సీలో 28 ప్రసవాలు కావడంపై అభినందించారు. ఆరోగ్య మహిళ వైద్య పరీక్షలు మొదటి స్క్రీనింగ్ 100 శా తం పూర్తి చేస్తూనే రెండోస్క్రీనింగ్ ప్రారంభించాల ని ఆదేశించారు. టీబీ పరీక్షలు పెంచాలని ఆదేశించారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీ సర్ సనా, ఇమ్యునైజేషన్ అధికారి సాజిత ఉన్నారు. ‘బుధవారం బోధన’కు ప్రాధాన్యం ఇవ్వాలి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఆంగ్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై సమీక్షించారు. పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇంగ్లిష్లో రాణించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్పెల్బీ, హ్యాండ్ రైటింగ్, బుక్రివ్యూ, సందేశాత్మక సినిమా రివ్యూ రాయించడం వంటివి అమలు చేయాలని తెలిపారు. పాఠశాలల్లో లిటరల్లీ ల్యాంటన్ లాంగ్వేజ్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. డీఈవో చైతన్య జైనీ, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. చింతకుంటలోని శాంతినగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం సందర్శించారు. తరగతి గదులు తిరుగుతూ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మధ్యాహ్నం భోజ నం, బోధన మెటీరియల్, రీడింగ్ కార్నర్ను పరిశీ లించారు. అదనపు తరగతి గదుల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎంఈవో ఆనందం, హెచ్ఎం గౌస్ఖాన్ పాల్గొన్నారు. -
యూరియాను పక్కదారి పట్టిస్తేకఠిన చర్యలు
కరీంనగర్ అర్బన్: యూరియా బస్తాకు నిర్ణీత ధరకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వొద్దని, యూరియా ఇతర బస్తాలు లింకు పెట్టి విక్రయిస్తే ఉపేక్షించమని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, కావాలనే పుకార్లు లేపుతున్నారని రైతులు నమ్మవద్దని సూచించారు. యూరియా పక్కదారి పట్టిస్తే సహించబోమ ని, ఎంతటివారైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. జిల్లాలో యూరియా సమస్య, అధిక ధరలకు విక్రయాలు, లింకు విక్రయాలపై మంగళవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. వ్యవసాయ శాఖ, రెవెన్యూ, పోలీస్శాఖలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని, యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు.రైతుల సమస్యలు, ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ 89777 41771 -
యూరియాకు పొటాష్ లింక్
శంకరపట్నం(మానకొండూర్): యూరియాకు పొటాష్ లింక్తో కేశవపట్నంలోని ఫర్టిలైజర్ దుకాణం యజమాని విక్రయిస్తున్నారు. సోమవారం కేశవపట్నంలోని ప్రైవేట్ ఎరువుల దుకాణానికి యూరియా లారీ లోడ్ వచ్చింది. యూరియా లోడ్ దుకాణంలో దిగుమతి చేస్తుండగానే రైతులు చేరుకున్నారు. యూరియాకు డిమాండ్ ఉండడంతో.. ఒక్కో రైతు యూరియాతోపాటు పొటాష్ తీసుకెళ్లారు. కాచాపూర్ గోదాంలో యూరియా పంపిణీలో ఆదివారం గొడవ జరగగా.. 40 బస్తాలు గోదాంలో ఉన్నాయి. సోమవారం గోదాం తెరవకముందే రైతులు చేరుకున్నారు. గద్దపాక సీఈవో శ్రీనివాస్ చేరుకొని గోదాంలో ఉన్న బస్తాలను రైతులకు పంపిణీ చేయించారు. తాడికల్ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆధార్ జిరాక్స్ అందించారు. శంకరపట్నం: మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సింగిల్ విండో చైర్మన్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రభుత్వం ఇటీవల పదవీకాలం మరో ఆరునెలలు పొడిగించడంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో స్థానిక ఎన్నికల సమయంలో పార్టీలో చేర్చుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే వ్యవహారాలను చక్కబెట్టే వ్యక్తి వీరందరితో సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కాగా, శంకరపట్నం మండలం తాడికల్ విండో చైర్మన్ కేతిరి మధుకర్రెడ్డి కొంతకాలంగా బీఆర్ఎస్తో అంటిముట్టనట్టుగానే ఉంటున్నారు. ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యేతోపాటు, కాంగ్రెస్ పెద్దలను కలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు చైర్మన్లు హైదరాబాద్కు తరలివెళ్లినట్లు సమాచారం. క్వింటాల్ పత్తి ధర రూ.7,600జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ.7,600 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. 17,384 మంది పిల్లలకు ఆల్బెండజోల్ పంపిణీ కరీంనగర్టౌన్: జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఈనెల 11న పంపిణీ చేసిన అల్బెండజోల్ మాత్రలను వివిధ కారణాలతో వేసుకోకుండా మిగిలిన 17,384 మంది పిల్లలకు సోమవారం అందజేసినట్లు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సజిదా అతహరి తెలిపారు. 2,59,365 మంది పిల్లలకు గాను 2,58,593 మందికి మాత్ర లువేసి 99.7 శాతం టార్గెట్ చేరుకున్నామని పేర్కొన్నారు. -
మంగళవారం శ్రీ 19 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పాపన్న ఆశయాలు కొనసాగిద్దాంసామాజిక సమానత్వానికి కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో పాపన్న 375వ జయంతిని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. కుల వ్యవస్థ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పాపన్న పోరాడారని, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, జిల్లా అధికారులు, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్అర్బన్ -
అమ్మా.. ఆలకించండి!
కరీంనగర్ అర్బన్: ‘ఏళ్ల తరబడి తిరుగుతున్నాం.. మా దరఖాస్తులను పరిష్కరించరూ’.. అంటూ బాధితులు ఏకరవు పెట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చి దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు డా.అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్వో వెంకటేశ్వర్లు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలే ఎక్కువగా రాగా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన అర్జీలొచ్చాయి. మొత్తంగా 265 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు. -
ఎరువులు ఏవైనా.. కంపెనీ ఏదైనా..
ఒకే రంగులో మందు బస్తాకరీంనగర్అర్బన్: రసాయనిక ఎరువుల బస్తా రూపు మారింది. బస్తాపై ఉన్న వివరాలూ మారా యి. దాంతో పాటే ఎరువు తయారీ చేయడానికి కంపెనీకి ఇచ్చిన రాయితీ ఎంత అనేది కూడా బస్తాపై కనబడుతోంది. ఎరువులు ఏవైనా, కంపెనీ ఏదైనా సరే బస్తా మాత్రం ఒకే రంగులో ఉండనున్నాయి. ఏ రకానికి చెందిన రసాయనిక ఎరువు అన్న వివరాలు సైతం ఓకే రకమైన రంగుతో కనిపించడం రైతులకు శుభపరిణామం. కేంద్రం ద్వారా రాయితీలు పొంది ఎరువులను డీలర్లకు సరఫరా చేసే ఏ కంపెనీ అయినా సరే ఈ విధానం అమలు చేయాల్సిందేనని కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు డీలర్లకు మునుపటిలా కాకుండా ఎరువుల బస్తాను విభిన్నమైన రంగులో ముద్రించి సరఫరా చేస్తున్నాయి. బస్తాపై రాయితీ వివరాలు పెద్ద అక్షరాలతో కనిపిస్తున్నాయి. కంపెనీల పేరు, సింబల్ సైజు బాగా తగ్గింది. కంపెనీల ప్రచారానికి తెర వివిధ కంపెనీలు ఎరువుల రాయితీ పొంది నిర్దేశిత ధరకు కాకుండా అధిక ధరలకు విక్రయస్తూ వస్తున్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం కంపెనీలు పాల్పడుతున్న అక్రమాలను అరికట్టేందుకు ఎరువుల బస్తాలను ఇలా కొత్త డిజైన్లోకి తీసుకొచ్చింది. గతంలో కంపెనీలు తమ పేరుతో ఎరువుల బస్తాలపై ముద్రణను ప్రచారంగా వాడుకొనేవి. రాయితీ వివరాలు ఎక్కడా కనిపించేవి కావు. వివిధ ఎరువులను అధిక ధరలకు మార్కెట్లో విక్రయిస్తూ వచ్చా యి. కంపెనీల అక్రమాల కారణంగా ఎరువుల సబ్సిడీ అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం గతేడాదే నిర్ణయం తీసుకున్నా ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చింది. దీంతో బస్తా మధ్యలో ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వారక్ పరియోజన అని ముద్రించి ఉంది. కంపెనీల బస్తాలన్నీ ఒకేలా ఉండనున్నాయి. కంపెనీలతో సంబంధం లేకుండా యూరియా బస్తాలన్నీ ఒక రంగులో, డీఏపీ బస్తాలు మరో ప్రత్యేక రంగులో మార్కెట్లోకి వచ్చాయి. ధరల నియంత్రణ.. పారదర్శకత అన్ని ఎరువుల బస్తాలు ఒక్కో రంగులో, ముఖ్యంగా రాయితీ వివరాలు ఉండటం వల్ల విక్రయాల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. దాంతో పాటే కంపెనీలు సైతం కచ్చితంగా ధరల నియంత్రణ పాటించడం తప్పనిసరి. ఒక్కో ఎరువు ఒక్కోరంగులో అందుబాటులోకి వచ్చాయి. కొన్ని కంపెనీల వద్ద ఎరువులు నిల్వ ఉండడం వల్ల వాటి విక్రయాలు పూర్తి కాగానే కొత్తగా తయారయ్యే ప్రతీ ఎరువు బస్తా ఇక ముందు కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారమే మార్కెట్లో కనిపించనుంది. యూరియా 43,637 డీఏపీ 7,412 ఎంవోపీ 6,375 కాంప్లెక్స్ 20,627 ఎస్ఎస్పీ 1,000 కంపోస్ట్ 550డీఏపీ 1,350 20:20:0:13 1,175 ఎస్ఎస్పీ 540 ఇతర 1,200 -
బేతిగల్కు అధికారులు
వీణవంక: మండలంలోని బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాధితో గ్రా మస్తులు బాధపడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం క దిలింది. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, బ్యాక్టీర్యాలోజిస్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరి వరంగల్ రీజియన్ అధికారి డాక్టర్ కృష్ణారావు, డెప్యూటీ డీఎంహెచ్వో చందు, ఎంపీవో, మిషన్ భగరీథ ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వ్యాధితో పాటు, జ్వరాలు వస్తుండటంతో గ్రామస్తులు ఆసుపత్రుల పాలవుతున్న తీరుపై ఆదివారం సాక్షిలో శ్రీబేతిగల్కు జాండీస్శ్రీ కథనం ప్రచురితమైంది. ఈక్రమంలో డీఎంహెచ్వో బాధితుల ఇళ్లకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంపును పరిశీలించి వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, జాండీస్కు నూనే పదార్థాలు తినకూడాదని గ్రామస్తులకు సూచించారు. వారం రోజుల పాటు గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తామని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తాగునీటి శ్యాంపిల్స్ సేకరణ వరంగల్ రీజియన్ బ్యాక్టీర్యాలోజిస్ట్ ల్యాబరేటరీ అ ధికారి కృష్ణారావు గ్రామంలో పర్యటించి బాధితుల వివరాలు సేకరించారు. గ్రామంలోని వాటర్ ప్లాంట్, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను పరిశీలించి నీటి శాంపిళ్లను సేకరించారు. వీటిని ల్యాబ్కు పంపించి పరీక్షలు జరుపుతామని తెలిపారు. వాటర్ ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్లోరైడ్ ఎక్కువగా ఉందని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీవో సురేందర్ గ్రామంలో పర్యటించి శానిటేషన్ చేయించారు. డ్రైయినేజీలు, మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ చేయించారు. భగీరథ ఏఈలు శ్రీనివాస్, రాముతో పాటు ల్యాబ్ సిబ్బంది వాటర్ నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యూకేటర్ పంజాల ప్రతాప్, డాక్టర్ వరుణ, ల్యాబ్ సిబ్బంది సురేశ్, మధు, గ్రిడ్ సూపర్వైజర్ శ్రీనివాస్ రాజేంద్రప్రసాద్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
చెరుకు రైతుకు రవాణా భారం
రాజన్నకు శ్రావణ మొక్కులువేములవాడ: రాజన్నను సోమవారం 60 వే ల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రావణమాసం చివరి సోమవారం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో వ్యాపారాలు ఊపందుకున్నాయి. ట్రాఫిక్ పెరిగిపోవడంతో టౌన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఫ్యాక్టరీ ప్రారంభం కాక అదనపు ఖర్చులు టన్నుకు రూ.700 వరకు భారం ఆదుకోవాలని రాష్ట్ర మంత్రులకు విన్నపాలు -
ఇంట్లో జారిపడి వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని గంజ్రోడ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అతిక్ (38) తన ఇంట్లో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతిచెందాడు. అతిక్ ఆదివారం సాయంత్రం తన ఇంట్లో కాలుజారి పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో పని చేస్తు న్న జుట్టు స్వామి విషజ్వ రంతో సోమవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. స్వామి వారంరోజులు కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందాడు. అయినా జ్వరం తగ్గలేదని తెలిపారు. జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ (35) అనే వ్యక్తి ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్దుర్తి గ్రామానికి చెందిన బందెల రాజశేఖర్ భార్య మూడు నెలల క్రితం అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి రాజశేఖర్ ఒంటరితనంతో బాధపడుతూ తీవ్ర ఆందోళనలో ఉన్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి బందెల గంగు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రెండు ఆలయాల్లో చోరీవీణవంక: మండలంలోని కోర్కల్ గ్రామంలో ఆదివారం రాత్రి రెండు ఆలయాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామ శివారులోని రేణుక ఎల్లమ్మ ,పెద్దమ్మ తల్లి ఆలయాల్లో రెండున్నర తులాల బంగారం, 59తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుడు పూదరి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. జగిత్యాలజోన్: సెల్ఫోన్లో మాట్లాడుకుంటూ.. వాహనాన్ని అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా నడిపి ఒకరి మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్కు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్కు చెందిన 12 మంది మహిళలు రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి ఓ మినీటాక్సీలో వెళ్లారు. మోరపల్లి శివారులో డ్రైవర్ పరాంకుశంవంశీకృష్ణ సెల్ఫోన్ మాట్లాడుతూ.. వాహనాన్ని అజాగ్రత్తగా నడిపి రోడ్డుపక్కనున్న కల్వర్టును ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఆటోలో ఉన్న తోట్ల గంగవ్వ అక్కడికక్కడే చనిపోయింది. మిగతావారు గాయపడ్డారు. దీనిపై బాధితురాలు రాధ ఫిర్యాదు మేరకు అప్పటి జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు. సీఐ కృష్ణకుమార్ దర్యాప్తు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్కుమార్, కె. నరేశ్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో వంశీకృష్ణకు రెండేళ్ల జైలు, జరిమానా విధించారు. -
చిత్రం.. జ్ఞాపకాల పత్రం
● ఫొటోగ్రఫీ డే గురించి ఫ్రెంచ్ దేశస్తుడైన డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రాఫీక్ ప్రాసెస్ కనిపెట్టి అదే సంవత్సరం ఆగష్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయొడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్లో మొదటి పోర్ట్రయిట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ స్థాపించింది. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్తో కలర్ ఫొటోగ్రఫీ విస్తరించింది. రాజా త్రయంబక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి సారి 1957లో ఫొటోగ్రఫీ సొసైటీ ప్రారంభమైంది. ● ఉమ్మడి జిల్లా ప్రస్థానం 1940లో ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్లో మొదటి ఫొటోస్టూడియో నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ(ఇంగ్లాండ్) సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకై క వ్యక్తి కోరుట్లకు చెందిన ఫొటోగ్రాఫర్ బండి రాజన్బాబు. 1987లో నగ్న చిత్రాలపై థీసిస్ సమర్పించి రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. జగిత్యాలకు చెందిన అల్లె శ్రీకాంత్, కోరుట్లకు చెందిన బండి వెంకటరమణ, కరీంనగర్కు చెందిన బాబురెడ్డి, వేణు, రాజు, సంపత్కుమార్, వాసు, గంగాధర్, సదానందం, ఆత్మారాం, వేములవాడకు చెందిన రాజయ్య, జగిత్యాలకు చెందిన రామ్మోహన్, సతీష్, సిరిసిల్లలో ఎం.సి. శేఖర్, బోడ రవీందర్, కోడం దేవేందర్, వంకాయల శ్రీకాంత్, కోరుట్లకు చెందిన నాగరాజు, రాజేశం, శేఖర్, మహేందర్, మారుతి, మెట్పల్లి రాము, మల్యాల శ్రీనులు, ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభాకర్రెడ్డి, సిరిసిల్లకు చెందిన శంకర్ మరెందరో ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను జోడించి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు. ● ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ ఏ ఫంక్షన్ జరిగిన, ఎక్కడికి వెళ్లిన సెల్ఫోన్లతోనే ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీపై కొత్తగా జంటలు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్ ఫొటోలతోపాటు పెళ్లి వేడుకలను ఫొటోగ్రాఫర్లతో తీయించుకుంటున్నారు. చరితకు చెరిగిపోని సాక్ష్యం నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్ల: ఫొటో.. చెదిరిపోని జ్ఞాపకం. గతించిన కాలాన్ని కళ్ల ముందుంచే సాక్ష్యం. మదిలే మెదిలే భావాలను కళ్ల ముందు నిలిపే ఛాయాచిత్రం. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత తోడైతే అద్భుత చిత్రాలు కళ్లముందుంటాయి. మదిని పులకింపజేసి.. మనుసును తట్టిలేపి.. మధురమైన అనుభూతులను పదిలం చేసేది ఫొటో. ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రఫీలో వస్తున్న మార్పులు.. జిల్లా వాసుల ప్రతిభపై ప్రత్యేక కథనం. 1961 ప్రాంతంలో కరీంనగర్లో ఫొటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్లోని క్లాక్టవర్ వద్ద ఏవీఎం ఫొటో స్టూడియో, తిలక్రోడ్లో అజంతా ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కరీంనగర్కు చెందిన ఏలేటి వేణుమాధర్రెడ్డి 1961 జనవరి 1న ఆయన పేరుతో ఏవీఎం స్టూడియో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత గురుదత్త నిర్మాత సారథ్యంలో ముంబైలో రూపొందిన మొదటి స్కొప్ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ మాన్యువల్ నుంచి 35 ఎంఎం మినియేచర్ ఫిలిం, కలర్ ప్రాసెసింగ్ కంప్యూటర్ వరకు కొనసాగారు. ఆయన వాడిన 1945 నాటి రోలిఫ్లెక్స్, ఎగ్జాక్ట, మన్య, కేబినేట్, ఫుల్సైజ్ల నెగెటివ్ల బాడీ కెమెరాలు ఇప్పటికి వాళ్ల ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఆయన నలుగురు కొడుకులు ఈ రంగంలోనే రాణిస్తున్నారు. నాడు రీళ్లతో ఫొటోలు తీసేవాళ్లం, సాంకేతిక ప్రగతిలో నేడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్ కెమెరాలు, ఇంటింటికీ కెమెరాలు వచ్చినప్పటికీ ఫొటో స్టూడియోలకు ఆదరణ తగ్గలేదు. రీళ్ల పద్ధతి పోయి, డిజిటల్ కెమెరాలు, ప్రింటింగ్ యంత్రాలు ప్రవేశించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. – ఆవుల నరేశ్, ఫొటోగ్రాఫర్, జ్యోతినగర్, కరీంనగర్ మా చిన్నప్పుడు ఫొటో అంటే ఓ క్రేజ్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫొటోగ్రాఫర్ వచ్చి ఫొటోలు తీయడం, స్టూడియోకి వెళ్లి ఫొటోలు దిగడం చాలా కొత్తగా అనిపించేది. ఇప్పుడు సెల్ఫోన్లో అన్ని ఫంక్షన్లు, అన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడం, మెమొరీ కార్డుల్లో భద్రపరచుకుంటున్నాం. – పల్లెర్ల శ్రీనివాస్, అశోక్నగర్, కరీంనగర్ సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్(ఎంసీ శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దక్షిణాఫ్రికా పర్యాటక గిరిజనశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిలా ఆర్ట్ ఆఫ్ ఫొటోగ్రఫీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో శేఖర్ తీసిన ‘హార్టీస్మైల్’ బంగారు పతకం సాధించింది. అంతకుముందే శేఖర్ దశాబ్దకాలంగా గిరిజన జీవనశైలిపై, సామాజిక అంశాలపై ఫొటోలు తీసి పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపించారు. ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల సాలర్జంగ్ మ్యూజియంలో రాష్ట్రస్థాయి ఫొటో వర్క్షాప్ నిర్వహించారు. ఎం.సీ.శేఖర్ తీసిన ఫొటోలకు 98 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్కు చెందిన దాసరి మల్లేశ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న మల్లేశ్ ఫొటోగ్రఫీలోని మెలకువలను నేర్చుకొని.. తీరక సమయంలో తన కళాభిరుచిని తీర్చుకుంటున్నారు. ఫొటో వర్క్షాప్లలో పాల్గొని అద్భుత ఫొటోలు తీసి బహుమతులు అందుకున్నారు. పల్లె ప్రజల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన ఫొటోలకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన జోనల్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫొటోగ్రఫీ విభాగంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా మూడో బహుమతి అందుకున్నారు. -
రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
● వేగంగా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టిన కారు ● నుజ్జునుజ్జయిన వాహనం.. వేలాడిన మృతదేహం తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ స్టేజీ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం.. కరీంనగర్ నుంచి కొంగారి మృత్యుంజయ్ (32) భార్య, కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్నారు. ముందున్న మరో వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో రోడ్డుపై కారు అదుపుతప్పింది. డివైడర్ అవతలివైను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు సగం బస్సు కిందికి చొచ్చుకుపోయింది. డ్రైవర్ పక్కసీట్లో కూర్చున్న మృత్యుంజయ్ అక్కడిక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. మృతుడు మత్యుంజయ్ హైదరాబాద్కు చెందిన వాడు. ఈయన ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నట్లు సమాచారం. ఇసుక వివాదం.. ● ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా గ్రామస్తుల మధ్య వాగ్వాదం ● నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు ● విచారణ చేపట్టిన మెట్పల్లి డీఎస్పీ రాములు మెట్పల్లి రూరల్: ఇసుక విషయమై జరిగిన వివాదంపై మెట్పల్లి పోలీసులు నలుగురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఈనెల 10న అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా రెండు రోజులైనా అదుపులోకి రాలేదు. యార్డులో గన్నీసంచులు కాలుతుండగా వాటిపై ఇసుక పోసి మంటలు ఆర్పాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆత్మకూర్ పెద్దవాగు నుంచి ఈనెల 12న ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. ఆ సమయంలో పలువురు ట్రాక్టర్లను అడ్డుకుని వివాదం చేశారు. అక్కడే ఉన్న తనను కులం పేరుతో దూషిస్తూ దుర్భషలాడారని వీడీసీ చైర్మన్ రమేశ్ మెట్పల్లి పోలీస్ స్టేషన్లో నలుగురిపై ఫిర్యాదు చేశాడు. దీంతో గ్రామానికి చెందిన తాటిపెల్లి సురేశ్రెడ్డి, తిప్పిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, కేశిరెడ్డి నవీన్రెడ్డి, శోభపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ మేరకు మెట్పల్లి డీఎస్పీ రాములు సోమవారం ఆత్మకూర్కు వెళ్లి విచారణ జరిపారు. ఆయన వెంట మెట్పల్లి ఎస్సై కిరణ్కుమార్ ఉన్నారు. -
‘మీట్ అండ్ గ్రీట్’లో శాతవాహన వీసీ
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ ఆమెరికాలోని బోస్టన్ను సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన మేధావులతో కలిసి ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, తెలంగాణలో విద్య యొక్క పాత్ర, యూనివర్సిటీల బాధ్యతల గూర్చి వివరించారు. యూనివర్సిటీల్లోని మౌలిక, సాంకేతిక సదుపాయాలు, అవసరాల పై వెల్లడించారు. విద్య, యూనివర్సిటీ అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి వారి సలహాలు స్వీకరించారు. అక్కడి ప్రముఖులు జంధ్యం దివాకర్, మారోజు వెంకట్, మంతెన రాయదాసు, పలువురు పాల్గొన్నారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ ట్రస్ట్ను బలోపేతం చేయాలని సూచించారు. -
ప్రభుత్వం భరించాలి
చెరుకు రైతులపై పడే రవాణా భారాన్ని ప్రభుత్వం భరించాలి. చెరుకు పండిస్తే మాకు ఆదాయం కాకుండా ఖర్చులు మిగులుతున్నాయి. త్వరగా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించి చెరుకు రైతులకు అండగా ఉండాలి. – మామిడి మహేందర్రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి చెరుకు పంటపై మమకారం చంపుకోలేక సాగు చేస్తున్నాం. ఇక్కడ ఫ్యాక్టరీ ప్రారంభం కాకపోవడంతో కామారెడ్డికి తరలించాల్సి వస్తోంది. రవాణా భారం, కటింగ్ వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం. – పీసు రాజేందర్రెడ్డి, మూడుబొమ్మల మేడిపల్లి, మెట్పల్లి -
ముదురుతున్న క్రిప్టోయాప్స్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ దందా పెరుగుతోంది. అనతికాలంలోనే రూ.కోట్ల లాభాలు అంటూ అమాయకులకు ఆశచూపి.. విదేశీ ప్రయాణాలు ఎరవేసి.. వారి నుంచి రూ.లక్షలు గుంజుతున్న యాప్ల సంఖ్య పెరిగిపోతోంది. మార్కెట్లో వీటిని నియంత్రించే మెకానిజం ఏదీ లేకపోవడంతో కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఫలితంగా వీటి మధ్య ఆధిపత్య పోరు కూడా సాగుతోంది. ఇటీవల హైదరాబాద్లో నెక్ట్స్ బిట్ అనే క్రిప్టో కరెన్సీగా చలామణి అవుతున్న ఓ యాప్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్టు చేయడం సంచలనం సృష్టించింది. ఈ విషయంలో రాచకొండ పోలీసులను అంతా అభినందించారు. అయితే.. ఈ అరెస్టు వెనుక కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తం పోలీసు యాక్షన్ అంతా నెక్ట్స్బిట్ వ్యతిరేక యాప్ వర్గం వాళ్లు చెప్పినట్లు సాగిందని జగిత్యాలలో ప్రచారం సాగుతోంది. వాస్తవానికి నెక్ట్స్బిట్ ప్రవేశించేందుకు ముందు.. డజనువరకు యాప్లు అక్కడ దందా చేస్తున్నాయి. వీరంతా జనాలను నమ్మించేందుకు ఒకరిని మించి మరొకరు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని యాప్లు జనాల నుంచి డబ్బులు వసూలు చేసి అదృశ్యమయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త యాప్లను అంత తేలిగ్గా నమ్మడం లేదు. అందుకే వీరి పెట్టుబడికి ఆస్తల ను ష్యూరిటీగా ఇస్తున్నారు. ఉదాహరణకు వీరు ఐదు నుంచి పది మంది పెట్టుబడిదారులను ఒక గ్రూపుగా పోగుచేస్తారు. వీరికి నమ్మకం కలిగేలా రూ.20 లక్షలు కూడా చేయని భూమికి రూ.50 లక్షలు అని చెప్పి.. బాధితుల నుంచి అంతమేరకు డబ్బును క్రిప్టో పేరిట వసూలు చేస్తారు. ఆ డబ్బుకు సమాన విలువ అంటూ కొన్ని డాలర్లను వారి ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్కు పంపుతారు. ఇటు యాప్లో ఉన్న డాలర్లను, అటు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూములను ష్యూరిటీగా చూసుకుని మురిసిపోతున్నారు. తమ పెట్టుబడి పెట్టిన డబ్బు తిరిగి రాదని, తాము కొన్న భూమికి అంత విలువలేదన్న విషయం వీరు గ్రహించే సరికి నిర్వాహకులు ఆ డబ్బును లక్కీభాస్కర్ సినిమాలో మాదిరిగా దేశం దాటిస్తున్నారు. ఇటీవల జీబీఆర్ క్రిప్టో కరెన్సీపేరిట రూ.95 కోట్లు, మెటాపేరిట రూ.100 కోట్లు, నెక్ట్స్బిట్ పేరిట రూ.19 కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాడంత ఉంటుంది. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లిలో బాధితుల సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తమ కంటే అధిక వ్యాపారం చేస్తున్నాడన్న కోపంతో వ్యతిరేక యాప్ వారే.. హిమాన్షు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో క్రిప్టో కరెన్సీ పేరిట అనేక యాప్లు నడుస్తున్నా.. ఎలాంటి ఫిర్యాదూ లేకుండా విశ్వసనీయ సమాచారంతో అరెస్టు చేసింది ఈ ఒక్క కేసులోనే కావడం గమనార్హం. ఇందుకోసం నెక్ట్స్బిట్ పోటీదారైన యాప్ స్వయంగా రంగంలో కి దిగింది. నెక్ట్స్బిట్ యాప్కు సంబంధించిన కొందరు బాధితులను వెంటేసుకుని రాచకొండలోని మే డిపల్లి పోలీసులను ఆశ్రయించారు. వీరిచ్చిన సమాచారంతోనే పోలీసులు ఓ హోటల్లో తమ యాప్ ను ప్రమోట్ చేసుకుంటున్న హిమాన్షును అరెస్టు చేశారు. అతని అరెస్టు తతంగం అయ్యేవరకూ పో టీదారు యాప్ నిర్వాహకుల ప్రతినిధులు అక్కడే ఉండటం కొసమెరుపు. దాదాపు 400 మంది వద్ద రూ.19కోట్ల మేరకు మోసం చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ క్రిప్టోదందా సాగుతోంది. ఈ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నా.. కేసు పెట్టేందుకు పోలీసులు సహకరించడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఈ వ్యవహారంపై ఇంటలిజెన్స్ ఎప్పటికపుడు డీజీపీకి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తూనే ఉంది. అయినప్పటికీ ఒక్క రాచకొండ కమిషనరేట్లో మాత్రమే పోలీసులు స్వయంగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించడం గమనార్హం. ఈ మొత్తం ఆపరేషన్ వెనక నెక్ట్స్బిట్ పోటీదారులే ఉన్నారని జగిత్యాల వాసులు ఆరోపిస్తున్నారు.ఎలా చేస్తున్నారు..? అసలేం జరిగింది..? -
భారం కాదు.. బాధ్యత
కరీంనగర్: తల్లిదండ్రుల తర్వాతే దైవం.. ప్రత్యక్ష దైవాలైన వీరు మలిసంధ్యలో పడరాని పాట్లు పడుతున్నారు. పిల్లలను పెంచి పెద్ద చేసి వారి బంగారు భవిష్యత్ కోసం శ్రమిస్తే.. వృద్ధాప్యంలో వారిని పట్టించుకోవడం లేదు. రెక్కలొచ్చిన కొడుకులకు కన్నవారు బరువైపోతున్నారు. రక్త బంధాన్ని తెంచుకుని ముసలి తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. అయితే ఇలాంటి వాటికి చెక్ పెడుతూ ప్రభుత్వం డివిజన్స్థాయిలో ఓ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. వృద్ధులైన తల్లిదండ్రులను వీధిపాలు చేస్తే కొడుకులు కటకటాలు లెక్కపెట్టాల్సిందే. వృద్ధాశ్రమాల్లో చేర్పించి.. కోట్లు సంపాదించి ఇచ్చిన తల్లిదండ్రులకు తనయులు పట్టెడు అన్నం పెట్టడం లేదు. అయినవారికి దూరంగా ఉంటూ జీవనం గడుపుతున్న వారి గాథలు కన్నీళ్లు తెప్పించక మానవు. జీవిత చరమాంకంలో ఆదుకోవాల్సిన తనయులు వదిలేస్తున్నారు. వయోభారంతో వృద్ధులు అవస్థలు పడి విసిగిపోయి న్యాయం కోసం పోరాడుతున్నారు. పోలీస్స్టేషన్లు, కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కొందరు కుమారులు తెలివిగా వృద్ధాశ్రమంలో చేర్పించి చేతులు దులుపుకుంటున్నారు. విస్మరిస్తే క్రిమినల్ కేసులు వృద్ధుల సంపూర్ణ బాధ్యత ఉన్న వ్యక్తులెవరైనా అందుకు విరుద్ధంగా శాశ్వతంగా వదిలించుకునే ఉద్దేశంతో ఏదైనా ప్రదేశంలో విడిచిపెట్టినా, వారికి హానీ తలపెట్టినా 3 నెలల జైలు లేదా రూ.5 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండూ అమలుకావచ్చు. సహాయ కేంద్రం వయోవృద్ధుల సహాయార్థం జిల్లా కేంద్రంలో హెల్ప్లైన్ నంబర్ 14567 ఏర్పాటు చేశారు. చైల్డ్ హెల్ప్లైన్ 1098, హుజూరాబాద్, కరీంనగర్ రెవెన్యూ డివిజన్ అధికారులకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరికి ఫిర్యాదు చేయాలి? చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కలెక్టర్ డివిజన్ల వారీగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. అక్కడ డివిజన్ ప్రిసైడింగ్ అధికారిగా ఆర్డీవో వ్యవహరిస్తారు. వృద్ధుల సంఘం నుంచి ఒక ప్రతినిధి, కౌన్సిలేషన్ అధికారి ఉంటారు. సంబంధిత డివిజన్ కార్యాలయంలో వృద్ధులు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించిన అనంతరం ఆర్డీవో సంబంధిత తహసీల్దార్ను విచారణకు ఆదేశిస్తారు. ఇరు వర్గాలను పిలిచి వాదనలు విని న్యాయం చేస్తారు. వినని పక్షంలో కౌన్సిలేషన్ అధికారికి అనుసంధానం చేస్తారు. ఆయన ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇస్తారు. ఒకవేళ న్యాయం జరగలేదని భావిస్తే జిల్లా అప్పిలేట్ అధికారి కలెక్టర్ను ఆశ్రయించవచ్చు. వృద్ధులే కాకుండా ఎన్జీవోలు కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసేవారు నిర్ణీత ఫాం పూర్తి చేసి డివిజన్ రెవెన్యూ అధికారికి అందించాలి. ప్రయోజనం ఇలా.. సొంత సంపాదనతో తమను తాము పోషించుకోలేని వృద్ధులు ఈ చట్ట ప్రకారం తమ పిల్లలను, సంతానం లేని వృద్ధులు వారి ఆస్తిని అనుభవించే బంధువులను పోషణ గురించి అడగవచ్చు. పోషణ ఖర్చులో ఆహారం, దుస్తులు, నివాసం, వైద్య సహాయం, చికిత్సకు అవసరమైన మొత్తం నెలకు రూ.10 వేలకు మించకుండా అందేలా ట్రిబ్యునల్ చర్యలు తీసుకుంటుంది. పత్రికా కథనాలపై విచారణ వివిధ దినపత్రికల్లో వచ్చే వృద్ధుల కథనాలను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. పత్రికల కథనాలపై జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం సంబంధిత తహసీల్దార్లకు సమాచారం ఇస్తుంది. తహసీల్దార్ వాస్తవ నివేదికను రూపొందించి ఆర్డీవోకు నివేదిస్తారు. అధికారులు ఇరువర్గాలను పిలిచి రాజీ కుదర్చడమో, కేసు నమోదు చేయడమో నిర్ణయిస్తారు.వయోవృద్ధుల సంక్షేమ చట్టం వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007 ప్రకారం కన్నవారిని విస్మరిస్తే జైలు కూడు తినాల్సిందే. మలిసంధ్యలో ఆదరించాల్సిన కుమారులు వారిని పట్టించుకోపోతే ఈ చట్టం తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ చట్టం ప్రకారం తల్లి, తండ్రి, సవతి తండ్రి/తల్లిని వయో వృద్ధుల కింద పరిగణిస్తారు. జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు జిల్లావ్యాప్తంగా 2023లో 117 ఫిర్యాదులు, 2024లో 129 ిఫర్యాదులు, 2025లో (ప్రస్తుతం ఇప్పటి వరకు)101 ఫిర్యాదులు వచ్చినట్లు సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
రైతులకు తప్పని యూరియా తిప్పలు
చిగురుమామిడి(హుస్నాబాద్): రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఆదివారం మండలంలోని రేకొండ గ్రామంలో యూరియా కోసం బారులు తీరారు. ఉదయం ఐదు గంటల నుంచి మహిళలు, రైతులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు. చిగురుమామిడి సింగిల్ విండో ఆధ్వర్యంలో 230 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు పంపిణీ చేశారు. 115 మంది రైతులకు పంపిణీ చేయగా మరో 40 మంది బస్తాలు అందక తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ప్రభుత్వం సరిపడా బస్తాలను పంపించక తమను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో ఆదివారం నిర్వహించిన జిల్లా జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలకు విశేశ స్పందన వచ్చింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరుకాగా పలు విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. సమారు 160 మంది క్రీడాకారులు ప్రతిభచాటగా అత్యుత్తమంగా రాణించిన 30 మందిని ఈనెల 30, 31వ తేదీల్లో మహబూబ్నగర్ జిల్లాలోని పాలమూరు యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు 29న పాలమూరు స్టేడియంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని పేర్కొన్నారు. పోటీల నిర్వహణలో పీఈటీ, పీడీలు రమేశ్, చంద్రశేఖర్, ఎజాజ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాల దర్శనానికి ప్రత్యేక బస్సువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్– 1 డిపో నుంచి ఈనెల 21న అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారక తిరుమల దర్శనాల కోసం ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. ఈ బస్సు 21 గురువారం సాయంత్రం 6గంటలకు కరీంనగర్ బస్స్టేషన్ నుంచి బయలుదేరి తిరిగి 23వ తేదీన కరీంనగర్ చేరుకుంటుందని పేర్కొన్నారు. ఇందులో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,250 టికెట్ ఉంటుందని, వివరాలకు 99592 25920, 80746 90491, 73828 49352 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. బీసీలకే కాంగ్రెస్ ఇన్చార్జి ఇవ్వాలి కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పదవి బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశిపెద్ది శ్రీధర్రాజు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలో జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒకప్పుడు అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగు పర్యాయాలు బీసీ అభ్యర్థియే గెలుస్తూ వచ్చారని తెలిపారు. బీసీల్లో చైతన్యం రావడాన్ని చూసి అన్ని పార్టీలు కరీంనగర్లో బీసీలకే మొగ్గు చూపుతున్నాయన్నారు. అందుకే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు బీసీలకే టికెట్లు ఇచ్చాయని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి పదవిని అగ్రవర్ణాలకు ఇస్తే, మళ్లీ పాత రోజులు పునరావృతమవుతాయన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో కొట్లాడుతున్న కాంగ్రెస్ అధిష్టానం, అదే తరహాలో కరీంనగర్ ఇన్చార్జీగా బీసీనే నియమించాలని కోరారు. సంఘం జిల్లా కన్వీనర్ రవీంద్రచారి, సత్యనారాయణ, జగన్, రాజు, రమేశ్ పాల్గొన్నారు. -
నయా భూ దందా
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో నయా భూ దందా వెలుగులోకి వచ్చింది. ఎవరికీ పట్టని హౌ జింగ్బోర్డు స్థలాలపై గురిపెట్టిన కబ్జారాయుళ్లు గుట్టుగా దందా కొనసాగిస్తున్నారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను కబ్జాకు పెడుతున్నారు. పక్క సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంటున్నారు. ఆ పై ఇంటినంబర్లతో అధికారిక ముద్ర వేసుకునేందుకు బల్దియాలో పైరవీలు కూడా మొదలుపెట్టారు. 1994లో అలాట్మెంట్ దశాబ్దాల క్రితం నగరంలోని పాత బైపాస్ పక్కన 99 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని హౌజింగ్బోర్డుకాలనీని నిర్మించింది. మొ త్తం 1,205 క్వార్టర్స్ నిర్మించడంతో పాటు, రోడ్లు, క్రీడా స్థలం, హెల్త్ సెంటర్, షాపింగ్కాంప్లెక్ష్ తదితర అవసరాలకు ఈ స్థలాన్ని వినియోగించింది. పూర్తయిన క్వార్టర్స్ అలాట్మెంట్ను 1994లో ప్రారంభించి, 2006లో అధికారులు పూర్తి చేశారు. మిగిలిన ఖాళీ స్థలాలు.. నిర్ణీత సైజుల్లో క్వార్టర్స్ నిర్మించిన సమయంలోనే అక్కడక్కడా ఖాళీస్థలాలు మిగిలిపోయాయి. ఖాళీ స్థలం 99 గజాల లోపు ఉంటే ఆ స్థలాన్ని పక్కనే ఉన్న ఇంటి యజమానికే నిర్ణీత ధర ప్రకారం హౌజింగ్బోర్డు విక్రయించింది. 100 గజాలు, అంతకన్నా ఎక్కువ స్థలం ఉంటే బహిరంగ వేలం ద్వారా విక్రయించాల్సి ఉంటుంది. చివరగా 2002లో కొన్ని స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించారు. ఖాళీ స్థలాల కబ్జా హౌజింగ్బోర్డు కాలనీ నిర్మాణం పూర్తయి మూడు దశాబ్దాలవుతున్నా, కాలనీలో విలువైన ఖాళీ స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. 100 గజాలకు పై బడి విస్తీర్ణం కలిగిన పది వరకు ఖాళీ స్థలాలపై కొంతమంది కన్ను పడింది. హౌజింగ్బోర్డు డివిజన్ కార్యాలయం ఎక్కడో వరంగల్లో ఉండడం, పర్యవేక్షణ లేకపోవడం వారికి అనువుగా మారింది. పైగా స్మార్ట్ సిటీలో కాలనీ అభివృద్ధి చెందడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఖాళీ స్థలాలను కబ్జా చేసేందుకు సదరు ముఠా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే కనీసం కోట్ల రూపాయల విలువైన స్థలాలను సొంతం చేసుకుంది. పక్క సర్వే నంబర్ వేసి.. ఖాళీ స్థలాల కబ్జా కోసం ముఠా కొత్త ఎత్తులు వేస్తోంది. హౌజింగ్బోర్డు కాలనీ సరిహద్దులో ఉన్న స్థలాలకు, పక్కనే ఉండే ప్రైవేట్ భూముల సర్వే నంబర్లు వేసి ఏకంగా రిజిస్ట్రేషన్లు చేసుకుంటోంది. హౌజింగ్బోర్డు కాలనీ స్థలాలు 225,226,227,228,229,230,231/ఏ,231/బీ,233/ఏ,233/బీ,234,235,236/ఏ,236/బీ,727 సర్వే నంబర్లలో ఉన్నాయి. కాని పక్కనే ఉన్న 224 సర్వే నంబర్ వేసి ఆ నంబర్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తితో తాజాగా 155 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కాలనీ మెయిన్రోడ్డులోని మరో స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే ఆ స్థలంలో కొంత భాగం ఆక్రమణకు గురికాగా, మిగతా స్థలంలో సైతం ప్రహారీ నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల ప్రాంతంలోనూ ఇలాంటి స్థలాలను ఇప్పటికే కబ్జా చేశారు. ఇదిలాఉంటే కబ్జాకు అధికారిక ముద్ర వేసుకునేందుకు నగరపాలకసంస్థ నుంచి ఇంటినంబర్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాపాడాల్సిందే.. అన్యాక్రాంతమవుతున్న కోట్ల రూపాయల హౌజింగ్బోర్డు ఖాళీ స్థలాలను అధికారులు కాపాడాలని కాలనీవాసులు కోరుతున్నారు. తాజాగా కబ్జాకు గురైన స్థలాల విలువ రూ.1.30 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి భూములు కాపాడేందుకు హౌజింగ్బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని, వేలం వేసే వరకు ఆ స్థలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. హౌజింగ్బోర్డుకాలనీలో స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారం ఈ స్థలాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. ఆ లోగా స్థలాల రక్షణకు చర్యలు చేపడుతాం. అవసరమైతే పోలీసుల సహకారంతో ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకుంటాం. – పృథ్విరాజ్, ఏఈ, హౌజింగ్బోర్డు స్వాధీనం చేసుకుంటాం -
వెన్నుచూపని వీరుడు పాపన్న
కరీంనగర్టౌన్: గొల్లకొండ కోటపై జెండా ఎగరేసిన బహుజనుల ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్రావు తదితరులతో కలిసి నగరంలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సామాన్య కల్లుగీత కుటుంబంలో పుట్టి నాటి మొగల్ చక్రవర్తుల వెన్నులో వణుకు పుట్టించిన అసామాన్యుడు, వెన్నుచూపని వీరుడి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్, సర్దార్ సర్వాయి పాపన్న దాదాపు సమకాలీనులేనని కానీ, ఛత్రపతి శివాజీకి దేశ చరిత్రలో దక్కిన స్థానం సర్దార్ పాపన్నకు దక్కకపోవడం బాధాకరమన్నారు. తాడిత, పీడిత ప్రజల కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టి రాజ్యస్థాపన చేసిన పాపన్న చరిత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి పర్శరాములు, బుర్ర పర్శరాములు, పడాల రమేశ్, బుర్ర కనకయ్య, పంతంగి అనిల్, సంపత్, ముంజ ప్రశాంత్, బత్తిని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
సైక్లింగ్తో పర్యావరణ, ఆరోగ్య పరిరక్షణ
కరీంనగర్స్పోర్ట్స్: ప్రస్తుత జీవనశైలిలో ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను భాగం చేసుకుంటే సమాజ శ్రేయస్సుతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ బుర్ర మధుసూదన్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో రైడ్ ఫర్ వెల్నెస్, శ్రేయస్సు కోసం సైక్లింగ్ అనే నినాదంతో నిర్వహించిన సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పురుషులతో పాటు మహిళలు తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని విధిగా కేటాయించి శారీరక వ్యాయామం కలిగేలా క్రీడలు, నడక, సైక్లింగ్, యోగా లాంటి కార్యాలను నిత్య జీవితంలో భాగం చేసుకొని ఆయురారోగ్యాలతో జీవితాలను సుసంపన్నం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నేటి డిజిటల్ యువత స్మార్ట్ ఫోన్ నీలి తెరలకు పరిమితం కాకుండా మైదాన క్రీడలు, సైక్లింగ్ లాంటివి ఆచరణలో పెట్టాలన్నారు. 9వ తెలంగాణ ఎన్సీసీ బెటాలియన్ సుబేదార్ మేజర్ సాగర్సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కెడెట్లు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తు తాపీమేసీ్త్ర మృతి
మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన కొండ్ర రమేశ్(50) అనే తాపీమేసీ్త్ర ప్రమాదవశాత్తు ఆదివారం మృతిచెందాడు. మానకొండూర్ సీఐ సంజీవ్ వివరాల ప్రకారం.. రమేశ్ ఆదివారం శ్రీనివాస్నగర్లో ఓ నూతన గృహ నిర్మాణంలో భాగంగా తాపీమేసీ్త్రగా వెళ్లాడు. పిల్లర్ బాక్స్లో సిమెంట్ కంకర నింపేందుకు నిచ్చెన పైకి ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు పైనుంచి కింద పడి గాయాలపాలయ్యాడు. వెంటనే కరీంనగర్లోని ఆసుపత్రికి స్థానికులు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరందరికీ వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. -
ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలో దొంగతనం
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్ర శివారులోని దీక్షిత ఇండేన్ గ్యాస్ ఏజేన్సీలో శనివారం రాత్రి దొంగతనం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఈ ఏజెన్సీలో దొంగతనానికి పాల్పడ్డ దొంగ ముందుగా సీసీ కెమెరా తీగ, కరెంట్ ఫ్యూజ్ తొలగించాడు. ఏజెన్సీ కార్యాలయ గొళ్లాన్ని ఇనుప రాడు సహాయంతో తొలగించి కార్యాలయంలో ఉన్న రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలను మాయం చేశాడు. చందుర్తి ఎస్సై రమేశ్ను వివరణ కోరగా.. నిజమేనని, రూ.7వేల నగదు, రశీదు పుస్తకాలు మాయమైనట్లు తెలిపారు. 5 రోజుల క్రితం మర్రిగడ్డ పాఠశాలలో.. మర్రిగడ్డ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. మధ్యాహ్న వంట గదిలోని సిలిండర్, 2 వంట పాత్రలు, వాటి మూతలను ఎత్తుకెళ్లారని ఈనెల 12న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వినయ్కుమార్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం చందుర్తి పోలీసులు బయటకు రానివ్వలేదు. -
నెల రోజులుగా ఇబ్బందులు
త్రిఫ్ట్ ఫండ్ డబ్బుల కోసం కార్మికులు నెల రోజులుగా తిరుగుతున్నారు. మీ పొదుపు డబ్బులు తప్ప.. ప్రభుత్వ వాటా జమ కాలేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. చేనేత, జౌళిశాఖ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం లేదు. స్కూల్ ఫీజులు, పండుగల నేపథ్యంలో నేతన్నలకు ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నాయి. వెంటనే త్రిఫ్ట్ ఫండ్ నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – మూషం రమేశ్, పవర్లూమ్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రిఫ్ట్ ఫండ్ పథకం నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా మంత్రుల చేతుల మీదుగా నేతన్న బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమం నిర్వహించనున్నారు. కార్మికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. తప్పకుండా వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. – రాఘవరావు, చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు, సిరిసిల్ల -
బేతిగల్లో వైద్యశిబిరం
వీణవంక(హుజూరాబాద్): వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో నెల రోజులుగా జాండీస్(పచ్చ కామెర్లు) వ్యాధి వ్యాప్తి చెందడంతో గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. వ్యాధితోపాటు జ్వరాలు వస్తుండడంతో గ్రామస్తులు ఆసుపత్రులపాలవుతున్న తీరుపై ఆదివారం సాక్షిలో బేతిగల్కు జాండీస్ కథనం ప్రచురితమైంది. ఈ సంఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కార్యాలయం నుంచి ఆరా తీశారు. నీటి నమూనా పరీక్షలు చేయాలని ఆహార భద్రత అధికారులకు సూచించారు. గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే నిమ్స్ వైద్యులతో విశ్లేషణ చేయాలని సూచించినట్లు సమాచారం. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ దృష్టికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తీసుకెళ్లారు. కలెక్టర్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిసింది. గ్రామంలో వారం రోజులపాటు క్యాంపు ఏర్పాటు చేయాలని సూచించారు. కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని కోరారు. కేశవపట్నం వైద్యాధికారి శ్రావణ్తోపాటు వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించారు. జీపీ వద్ద శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. జాండీస్, జ్వరాల బారిన పడిన వ్యక్తుల వద్దకెళ్లి రిపోర్టులను పరిశీలించారు. శానిటేషన్ పరిశీలించారు. డ్రైనేజీలు అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, తలనొప్పి, ఒళ్లు నొప్పులుంటే వెంటనే పరీక్షలు చేసుకోవాలని సూచించారు. వైద్యులు వరుణ, రజనీకాంత్, ఎంఎల్హెచ్పీ రత్నమాల, అనిల్కుమార్, ఏఎన్ఎం పద్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
హుజూరాబాద్: పట్టణంలో ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. బొడిగె సందీప్(25) ఆదివారం తన స్కూటీపై బతుకమ్మ సౌళ్ల వద్ద నుంచి వస్తుండగా.. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొనడంతో సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ సందీప్ అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య ప్రత్యూష, ఇద్దరు పిల్లలు శ్రీత్విక్, ఆయాన్ష్ ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. చందుర్తి(వేములవాడ): చందుర్తి మండలం మూడపల్లి బస్టాండ్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం.. సనుగుల గ్రామానికి చెందిన బొజ్జ చరణ్, మహ్మద్ షారుక్ అనే ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వేములవాడ వైపు వెళ్తుండగా.. మూడపల్లి బస్టాండ్ ప్రాంతంలో పోలీసులు ఫొటోలు తీస్తున్నారని గమనించారు. తొందరపాటులో వెనక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించకపోవడంతో ద్విచక్ర వాహనానికి బస్సు తగిలి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో చరణ్కు కాలు విరగగా.. షారుక్ స్పృహ తప్పి పడిపోయాడు. 108 అంబులెన్స్లో వీరిని వేములవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చరణ్కు వేములవాడలో చికిత్స చేస్తుండగా.. షారుక్ను కరీంనగర్ తరలించారు. ఇతడి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంగాధర: మధురానగర్ చౌరస్తాలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కారుకు నిప్పు పెట్టి పేల్చే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మోతె శ్రీహరిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి పక్కన కారు పార్కింగ్ చేశాడు. రాత్రి సమయంలో దుండగులు కారుకు నిప్పు పెట్టి పారిపోయారు. కారు యజమాని మంటలు గమనించి ఆర్పేశాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఆదివారం సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. నిప్పు పెట్టినవారు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ధర్మం చిరకాలం నిలుస్తుంది
కరీంనగర్ కల్చరల్: సంఘర్షణతో సమాజం విడిపోతుందని, సంఘటన మాత్రమే మానవులను కలిపి ఉంచుతుందని, తద్వారా ధర్మం చిరకాలం నిలుస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి చామర్తి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం భగవతి పాఠశాల ప్రాంగణంలో జాతీయ సాహిత్య పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పాక రాజమౌళి రచించిన భారత భారతి, భావతరంగాలు గ్రంథాల ఆవిష్కరణ సభలో మాట్లాడారు. పాక రాజమౌళి దేశ, దైవభక్తి కలిగిన రచయితగా అద్భుతమైన పద్య, గేయ, అనువాద కవిత్వాన్ని రచించారని, ప్రతీ రచనలోనూ జ్ఞానం, శీలం, దేశభక్తి, సమానత్వం, సద్గుణాల నిర్మాణం కలగలిసి పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయని ప్రశంసించారు. వ్యక్తిత్వం లేని మనిషి మనోవిగ్రహాన్ని సాధించలేడని, తద్వారా ధర్మ రక్షణ సాధ్యం కాదని, ధర్మ రక్షణకు సంఘటిత శక్తిని అలవర్చుకోవాలని తన కవిత్వం ద్వారా రాజమౌళి స్పష్టం చేశారన్నారు. పాఠకుల్లో జాతీయ భావజాలాన్ని పెంపొందించి, ప్రతీ పౌరున్ని కర్తవ్య పథంలో నడిపించే శక్తి ఈ కవిత్వానికి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యుడు డా.భీమనాథుని శంకర్, కాకతీయ విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు చిలకమారి సంజీవ, భగవతి విద్యాసంస్థల అధినేత రమణారావు, కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత నాగిరెడ్డి కేశవరెడ్డి, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, ప్రధాన కార్యదర్శి నంది శ్రీనివాస్, స్తంభంకాడి గంగాధర్, కవులు గంగుల శ్రీకర్, అనంతోజు పద్మశ్రీ, నీలగిరి అనిత, వినీత్ కాశ్యప్, జక్కని గణేశ్, డా.కల్వకుంట్ల రామకృష్ణ, కేఎస్ అనంతాచార్య, పుప్పాల కృష్ణగోపాల్, జంగానీ యుగంధర్, బొమ్మకంటి కిషన్, ఎంఆర్వీ ప్రసాద్, దేవరం సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో వడ్రంగి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లతిమ్మాపూర్కు చెందిన న్యాలపల్లి అజ య్(46) అనే వడ్రంగి కుడు ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. సొంతంగా ఇల్లు కట్టుకోడానికి రూ.2లక్షల అప్పు చేశాడు. మహిళా సంఘంలో మరో రూ.2లక్షలు, అందినకాడల్లా రూ.4లక్షలు అప్పులు చేసి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. అప్పులు తెచ్చిన చోట మి త్తితో కలిపి అవి రూ.13లక్షల వరకు అయ్యాయి. వ డ్రంగి పని చేసుకునే అజయ్ వచ్చిన కూలి డబ్బులతో అప్పులు తీర్చే మార్గం కానరాలేదు. దీంతో మనస్తాపంతో గుండెపోటుకు గురయ్యాడు. మృతుడికి భార్య రమాదేవి, కుమారులు కృష్ణచైతన్య, బనిత్, కూతురు శ్రీజ ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇతిహాసాలే మన సంస్కృతి
కరీంనగర్ కల్చరల్: రామాయణ, మహాభారత ఇతిహాసాలు మన సంస్కృతిగా స్థిరపడ్డాయని ప్రముఖ వైద్యుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర పూర్వాధ్యక్షుడు డాక్టర్ బీఎన్రావు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఆదివారం ఫిలింభవన్లో కవి ఆవంచ ప్రమోద్ రచించిన మేలిమి చింత పుస్తక పరిచయ సభలో మాట్లాడారు. వాక్యం రసాత్మకం కావాలంటే భాష శైలిలను పట్టించుకొని, సొంత అభివ్యక్తిని కవులు శ్రమతో సాధించాల్సి ఉంటుందన్నారు. రెండు ఇతిహాసాలను రచించిన రచయితలే మన సంస్కృతి నిర్మాతలని అభిప్రాయపడ్డారు. ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ బి.విజయమోహన్రెడ్డి మాట్లాడుతూ.. మానవులను ఉన్నతీకరించే ఉత్తమ సాధనం సాహిత్యమని అన్నారు. ఇటీవల మరణించిన వరంగల్ రచయిత్రి అనిశెట్టి రజితకు సభ ప్రారంభంలో సభికులు నివాళి అర్పించారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కవులు కందుకూరి అంజయ్య, విజయకుమార్, కూకట్ల తిరుపతి, కనకం శ్రీనివాసులు, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, పీఎస్ రవీంద్ర, గులాబీల మల్లారెడ్డి, దామరకుంట శంకరయ్య, బూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెరవే సభలో డాక్టర్ బీఎన్రావు -
పురుగుల మందు తాగి విద్యార్థి బలవన్మరణం
రాయికల్: అయోధ్య గ్రామానికి చెందిన ఎడ్మల శ్రీసాహిత్రెడ్డి(21) అనే డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీసాహిత్రెడ్డి హైదరాబాద్లో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ఇంటికొచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగగా.. గమనించిన స్థానికులు జగిత్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఉన్న ఒక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతికి గల కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సంజయ్కుమార్ జగిత్యాల ఆస్పత్రిలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహిళ..శంకరపట్నం: కాచాపూర్ గ్రామంలో అబ్బు శకుంతల(58) అనే మహిళ ఆదివారం వేకువజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కాచాపూర్ గ్రామానికి చెందిన అబ్బు సత్యానారాయణరెడ్డి–శకుంతల దంపతులకు ముగ్గురు కూతుళ్లుండగా.. అందరికీ వివాహమైంది. కొంతకాలంగా శకుంతల మానసిక వ్యాధితో బాధ పడుతోంది. మానసిక వైద్యుడి వద్ద చికిత్స చేయిస్తున్నారు. మందులు వాడుతున్నా నయం కాలేదు. ఆదివారం వేకువజామున ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావిలో దూకింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. వృద్ధురాలు..ధర్మారం: నర్సింగపూర్ గ్రామానికి చెందిన చల్లా రాజమ్మ(78) అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ధర్మారం ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. కొంతకాలంగా బీపీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్నా నయం కావడం లేదు. దీంతో రాజమ్మ మానసికంగా కుంగిపోయి ఇంటి సమీపంలోని మంచినీటి బావిలో దూకింది. ఆమె కుమారుడు గంగయ్య ఆదివారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. సైదాపూర్: ఎగ్లాస్పూర్లో సంతపురి రవీందర్రెడ్డి(65) శనివారం రాత్రి ఇంటి ఎదుట రేకుల షెడ్కు ఉరేసుకున్నట్లు సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రవీందర్రెడ్డి కూతురు శైలజకు వివాహమైంది. ఆమె హైదరాబాద్లో ఉంటోంది. భార్యతో కలిసి రవీందర్రెడ్డి ఎగ్లాస్పూర్లో ఉంటున్నాడు. రవీందర్రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. తనను చూసుకోవడానికి అయినవారు అందుబాటులో లేక మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. శైలజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మృతిపెగడపల్లి: బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాజనర్సు(55) అనే వ్యక్తి చేపలు పట్టేందుకని వెళ్లి దుర్మరణం చెందాడు. పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం ఇంటి నుంచి స్థానిక చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లిన రాజనర్సు మధ్యాహ్నం తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో కస్తూరి మల్లేశం అనే రెతుకు చెందిన పొలం గట్టుపై ప్రమాదవశాత్తు పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గ్రామ స్వరాజ్య కృషీవలుడు వాజ్పేయ్
కరీంనగర్టౌన్: ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేదవాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వాజ్పేయ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయ్ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంతో పాటు మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టారని గుర్తు చేశారు. అణుబాంబు తయారు చేసి అగ్రదేశాలకు వణుకు పుట్టించిన ధీశాలి అని కొనియాడారు. -
సైకిల్పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం. సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది. -
గోపాల.. గోపాల
కరీంనగర్ కల్చరల్/జమ్మికుంట: జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం వైభవంగా జరుపుకున్నారు. చిన్నారులు రాధాకృష్ణ, గోపికల వేషధారణతో సందడి చేశారు. నగరంలోని సాయినగర్ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. పలుప్రాంతాల్లో ఉట్టి సంబురాలు జరుపుకు న్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్వద్ద నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మ ల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజూరా బాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు. -
బల్దియాపై కాంగ్రెస్ నజర్
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్పై కాంగ్రెస్ నజర్ పెట్టింది. తెలంగాణ ఆవిర్భావం నుంచి నగర పాలికపై కాంగ్రెస్ జెండా ఎగరలేదు. వాస్తవానికి 20 ఏళ్ల క్రితం కార్పొరేషన్ ఆవిర్భవించినప్పటి నుంచి కాంగ్రెస్కు ఇక్కడ తిరుగులేదు. తెలంగాణ ఉద్యమంతో బీఆర్ఎస్ బలోపేతమైంది. హిందుత్వ నినాదంతో బీజేపీ వేళ్లూనుకుంది. ఫలితంగా కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసీటు కూడా గెలవకుండా ప్రాతినిథ్యం కరవైంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్లు వ్యవస్థాగతంగా బలంగా ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ కాగా, ఎంపీ బీజేపీ నుంచి ప్రాతినిఽథ్యం వహిస్తున్నా రు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా కరీంనగర్ కా ర్పొరేషన్ను గెలవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ బాధ్యతలను ఇటీవల కరీంనగర్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేందర్రావుకు సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ బ లోపేతానికి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ బలోపేతం, చేరికలపై కసరత్తు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీది వింత పరిస్థితి. ఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ.. కరీంనగర్లో పార్టీని నడిపించేవారు లేరు. ఇటీవల నియోజకవర్గ ఇన్చార్జి పురమల్ల శ్రీనివాస్ను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో నియోజకవర్గ ఇన్చార్జి పోస్టు ఖాళీగా ఉంది. ప్రభుత్వం త్వరలో స్థానిక సంస్థలకు వెళ్లనున్న నేపథ్యంలో కరీంనగర్ బల్దియా పీఠాన్ని దక్కించుకోవాలని కరీంనగర్ అసెంబ్లీ బాధ్యతలను వెలిచాల రాజేందర్కు సీఎం అప్పగించారని సమాచారం. ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఇప్పటికే వెలిచాల క్షేత్రస్థాయిలో తన పనిచేసుకుంటున్నారు. పార్టీలో చేరికలపై దృష్టి సారించారు. కరీంనగర్లోని 66 డివిజన్లలో మెజారిటీ స్థానాలు గెలవడం లక్ష్యంగా.. ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను ఆహ్వానించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి పార్టీ మారే యోచనలో ఉన్న పలువురు వెలిచాలతో తరచుగా చర్చలు జరుపుతున్నారు. ఇక సొంత పార్టీ టికెట్ల మీద పోటీకి ఆసక్తి చూపిస్తున్న వారిలో ఎవరి బలాబలాలు ఎంతెంత? అన్న విషయంపైనా సమాంతరంగా పనిచేస్తున్నారు. సీఎం స్వయంగా నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పనుండటంతో జిల్లాలో గ్రూపు రాజకీయాలకు ఇక తెరపడనుందని వెలిచాల అనుచరులు ధీమాగా ఉన్నారు. -
నీళ్లు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వర్షపు నీళ్లు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. శనివారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలు గౌతమినగర్, అలుగునూరు చౌరస్తాలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం వేకువజాము వరకు కురిసిన వర్షాలతో నగరంలోని పలు లోతట్టు, డ్రైనేజీలు లేని ప్రాంతాల్లో నీళ్లు నిలిచాయి. వీటిని తనిఖీ చేసిన కలెక్టర్, వరదనీళ్లు నాలాల్లోకి వెళ్లేలా చూడాలన్నారు. రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలు పడుతాయనే సూచన మేరకు అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. నాలాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వర్షాలతో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. భూ యజమానుల అభ్యంతరం నగరంలోని కట్టరాంపూర్ పరిధి గౌతమినగర్ ప్రాంతంలో వరదనీళ్లు నిలిచిన ప్రాంతాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీళ్లు ఖాళీ స్థలాలు, ఇళ్ల నడుమ, రోడ్లపై నిలుస్తున్నాయి. గతంలో కాలువ ఉన్న ప్రాంతాన్ని గుర్తించి, కచ్చా నాలా తీసి నీళ్లు మళ్లించాలని ఆదేశించారు. కాలువగా చెబుతున్న స్థలం తమ సొంతమని,అందులో నుంచి ఎలా కాలువ తీస్తారంటూ సదరు స్థల యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కచ్చా నాలా ప్రతిపాదన విరమించుకొని, తిరిగి సర్వే చేయాలని ఆదేశించారు. అప్పటివరకు వరదనీళ్లతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. నగరపాలకసంస్థ డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ శ్రీధర్ ఉన్నారు. -
కొనసాగుతున్న ఎత్తిపోతలు
రామడుగు: రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్ నుంచి ఐదు మోటార్ల ద్వారా నీటిని ఎత్తి పోసి గ్రావిటీ కాలువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.1 టీఎంసీ మిడ్ మానేరుకు పంపింగ్ చేశారు. 1,2,4,5,6 బాహుబలి మోటార్ల ద్వారా ఎత్తి పోస్తున్నట్లు అధికారులు తెలిపారు. ‘కాళేశ్వరం’పై సీఎంవి పచ్చి అబద్ధాలురామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వాతంత్య్రదినోత్సవం రోజున పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరికాదని, కాళేశ్వరం నీటినే ఇప్పుడు గాయత్రి పంపుహౌజ్ నుంచి ఎత్తిపోస్తున్నారని మాజీ ఎంపీ బి.వినో ద్కుమార్ విమర్శించారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంపుహౌజ్ నుంచి నీటిని గ్రావిటీ కాలువలోకి తరలిస్తుండడంతో శనివారం పరిశీలించి, పూజలు చేశారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం గంగపాలైందని రేవంత్రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కుంగిన పిల్ల ర్లకు మరమ్మతు చేయకుండా రాజకీయం చే యడం ఏంటని విమర్శించారు. మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్, నారదాసు లక్ష్మణ్రావు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వేంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు గంట్ల జితేందర్రెడ్డి పాల్గొన్నారు. శంకరపట్నం: మండలంలోని గద్దపాక సహకార సంఘం పరిధిలో ఉన్న కాచాపూర్ గోదాం వద్ద శనివారం యూరియా కోసం రైతులు క్యూకట్టారు. యూరియా లోడ్ రావడంతో పెద్ద సంఖ్యలో గోదాంకు చేరుకున్నారు. ఆధార్ జిరాక్స్తో క్యూ కట్టడంతో కాసేపటికే వచ్చిన లారీ యూరియా అయిపోయిందని, మరో లారీ యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో వాగ్వివాదానికి దిగారు. క్యూలో ఉన్న రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం మరోలారీ యూ రియా తెప్పించి రెండు బస్తాలు పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఇంటిదారి పట్టారు. వీణవంక: వర్షం కాస్త గెరువిచ్చిందని ఆరుబయట ధాన్యం ఆరబోస్తే కోతుల గుంపు అందినకాడికి లూటీ చేశాయి. పదుల కొద్ది కోతులు గుంపుగా దండయాత్ర చేయడంతో సదరు రైతు చేతులెత్తాశాడు. వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో ఓ రైతు సన్నరకం ధాన్యాన్ని ఇంటి ముందు ఆరబోశాడు. అప్పటి వరకు కాపలా ఉండి భోజనం కోసం ఇంట్లోకి వెళ్లేలోపే కోతులు ధాన్యాన్ని చిందరవందర చేశాయి. సుమారు గంట పాటు ఆరగించాయి. చివరికి రైతు టపాసులు పేల్చడంతో కోతుల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయింది. -
కవిత్వంతో నిలిచిపోయింది..
సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది. వికసించిన రాజేశ్వరీ కవిత్వం రాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది. వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజ బూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్టాప్ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం. మహారాష్ట్రలో పాఠ్యాంశం రాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం.రాజేశ్వరీ జీవిత పాఠ్యాంశం మహారాష్ట్రలో పాఠ్యాంశమైన బూర రాజేశ్వరీ జీవితం 2021లో పాఠ్యాంశంగా చేర్చిన అక్కడి ప్రభుత్వం 2022లో చనిపోయిన కవయిత్రి తన పరిస్థితిపై.. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు.. తెలంగాణ ఉద్యమంపై.. భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం.. ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం. -
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం. ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం. -
పరిశుభ్రత ఎలా?
● జాడలేని స్కావెంజర్లు ● అరకొర వేతనాలు.. అవీ సరిగా ఇవ్వరు..కోరుట్ల: ‘రెండు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు’. అక్కడున్న వారంతా.. ఒకే సర్ అని తలలు ఊపారు.. ఇదంతా బాగానే కానీ.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడానికి పనిచేస్తున్న స్కావెంజర్లకు దాదాపు ఆరునెలలుగా వేతనాలు లేవు. అడపదడప వేతనాలు ఇస్తున్నా..అవి అరకొరగానే ఉండటంతో స్కావెంజర్లు ఆసక్తిగా పనిచేయడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. జిల్లాలో విద్యాశాఖ పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలుపుకుని మొత్తం 270 వరకు ఉన్నాయి. వీటిలో టాయ్లెట్స్, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతీ పాఠశాలకు ఒక స్కావెంజర్ను నియమించుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పాఠశాల విద్యార్థుల సంఖ్యను బట్టి స్కావెంజర్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడి పాఠశాలల్లో మాత్రం విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నా.. కేవలం ఒక్క స్కావెంజర్ను మాత్రమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ మేరకు దాదాపుగా జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్ల నియామకం జరిగింది. ఇక్కడితో సమస్య సమసిపోతుందని భావించినా గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చే అరకొర వేతనాలు సైతం ఇవ్వడం లేదు. ‘ఇదిగో వేతనాలు వస్తున్నాయి..అదిగో వస్తున్నాయి’.. అంటూ ఊరించడమే తప్ప ఇప్పటికీ వేతనాలు ఇవ్వలేదు. స్కావెంజర్ల వేతనాల విషయంలో జిల్లాతో పోలిస్తే ఇతర జిల్లాలో ఎక్కువ మొత్తంలో వేతనాలు అందుతున్నట్లు సమాచారం. పొరుగు జిల్లాలో స్కావేంజర్లకు నెల రూ. 6వేలు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అదనంగా స్కావెంజర్ల నియామకానికి అవకాశం ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో మాత్రం స్కావెంజర్లకు కేవలం రూ.3వేలు వేతనం ఇవ్వడం..ఆ వేతనం సకాలంలో ఇవ్వకపోవడం సమస్యగా మారింది. వేతనాలు సరిగా రాకపోవడంతో స్కావెంజర్లు సరిగా పనులకు రావడం లేదు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తే..‘అరకొర వేతనాలు..అవీ సరిగా రావడం లేదు.. కానీ ఎక్కడా లేని ఆజమాయిషి’ ఎందుకని వర్కర్లు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పాఠశాలల్లో పరిశుభ్రతను ఎలా మెయింటేన్ చేయాలో తెలియక నిర్వాహకులు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు. పాఠశాల విద్యకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్న జిల్లా కలెక్టర్ ఈ మధ్య కాలంలో తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించడంతో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏలాంటి చర్యలు ఉంటాయోనని ఉపాధ్యాయులు బెదిరిపోతున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. పాఠశాలల పరిశుభ్రతకు అవసరమైన వనరులు కల్పించి ఫలితం ఆశిస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అజయ్ని బతికించారు
వీణవంక: వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బొంగోని అజయ్(26) వినాయకుడి విగ్రహాల తయారీలో కూలీ పనికి వెళ్లగా విగ్రహం మీదపడటంతో మెడనరాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఆయన దీనస్థితిని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. జూలై 16న ‘నిరుపేదకు పెద్ద కష్టం’ కథనం ప్రచురితమైంది. స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహా అజయ్ పరిస్థితిపై వాకబు చేశారు. చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్కు తరలించాలని ఆదేశించారు. నెల రోజులుగా నిమ్స్లో చికిత్స పొందిన ఆజయ్కి శుక్రవారం ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా శ్రీసాక్షిశ్రీకి అజయ్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఆపరేషన్ తర్వాత మూడు నెలల పాటు ఫిజియోథెరఫి చేయించాలి. దీని కోసం డిహాబిటేషన్ సెంటర్లో ఉంచాలి. రోజుకు రూ.38,00 ఖర్చు అవుతుంది. ఈ మూడు నెలలు అజయ్కి కీలకం. ఈ సమయంలో ఎంత ఫిజియోథెరిఫి చేపిస్తే అంత తొందరగా కోలుకునే పరిస్థితి ఉంటుందని నిమ్స్ వైద్యులు చెప్పుతున్నారు. పేద కుటుంబం కాబట్టి దాతలు సహకరిస్తే అజయ్ పూర్తిస్థాయిలో కోలుకుంటాడని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సాయం చేయాల్సినవారు ఫోన్ నంబర్ 97013 14308ను సంప్రదించాలని కోరుతున్నారు. -
దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: పలు దోపిడీలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం రూరల్ పోలీస్స్టేషన్లో నిందితులను అరెస్ట్ చూపారు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మండంపల్లికి చెందిన వనం పాపయ్య, జగిత్యాల శివారు టీఆర్నగర్కు చెందిన వనం పాపయ్య, వనం రాము, దాసరి రవి, బాన్సువాడకు చెందిన జగన్నాథం కృష్ణ ముఠాగా ఏర్పడి కొద్దికాలంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జగిత్యాల, రాయికల్, మల్యాల, భూపాలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లో 30కి పైగా దొంగతనాలు చేశారు. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్, రాయికల్ ఎస్సై సుధీర్రావు రాయికల్ శివారులోని లలితామాత దేవాలయం వద్ద శనివారం తనిఖీలు చేస్తుండగా.. సమీపంలోని మామిడితోటలో నిందితులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా దొంగతనాలు ఒప్పుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, రూ.15 వేలు, మూడు సెల్ఫోన్లు, నిందితులు ఉపయోగించిన కార్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వనం పాపయ్య, వనం రాము, దాసరి రవిని రిమాండ్కు తరలించారు. జగన్నాథం కృష్ణ పరారీలో ఉన్నాడు. దొంగలను పట్టుకోవడంలో కృషి చేసిన రూరల్ సీఐ సుధాకర్, ఎస్సైలు సుధీర్రావు, సదాకర్, హెడ్కానిస్టేబుల్ గంగాధర్, సుమన్ను అభినందించారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ పరారీలో ఒకరు 12 తులాల బంగారం, కారు, రూ.15వేలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
సైదాపూర్: సోమారం గ్రామ పంచాయతీ పరిధిలోని బూడిదపల్లిలో గడ్డి మందు తాగిన అమరగొండ రాహుల్(20) అనే యువకుడు శనివారం చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సైదాపూర్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. ఎస్ఐ, గ్రామస్తుల కథనం ప్రకారం.. విజయ–కొమురయ్య ఏకై క కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 4 రోజుల నుంచి జ్వరంతో బాధ పడుతున్నాడు. ఆస్పత్రిలో చూపించడం లేదని ఇంట్లో గొడవ పడ్డాడు. మనస్తాపం చెంది ఆగస్టు 15న సాయంత్రం వ్యవసాయ పొలాల వద్ద గడ్డి మందు తాగాడు. చికిత్స కోసం హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాగా రాహుల్ గడ్డి మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. హాయిగా చనిపోతున్నాను.. ఎప్పుడో చచ్చిపోదామనుకున్నా.. ఈరోజు అవకాశం వచ్చిందంటూ నవ్వుతూ గడ్డి మందు తాగే వీడియో గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వైరలైంది. నవ్వుతూ తిరిగే రాహుల్ ఆత్మహత్యకు పాల్పడడం గ్రామస్తుల హృదయాలను కలచివేసింది. హుజురాబాద్కు చెందిన వ్యక్తి.. హుజూరాబాద్: పట్టణానికి చెందిన పంజాల కృష్ణ(42) ఈనెల 3న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. కృష్ణ హుజురాబాద్కు చెందిన వనం హరీశ్కు రూ.25లక్షలు అప్పుగా ఇచ్చాడు. గత 15నెలలుగా అసలు, వడ్డీ ఇవ్వడం లేదు. ఇటీవల డబ్బుల కోసం అడగగా, ఇవ్వననడంతో మనస్తాపానికి గురై పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఈనెల 3న రాత్రి తన చావుకు హరీశ్ కారణమని సెల్ఫీ వీడియో తీశాడు. అనంతరం పురుగుల మందుతాగాడు. చావు బతుకుల మధ్య ఉన్న కృష్ణను హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం జమ్మికుంట, అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కృష్ణ భార్య హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. -
క్రిమిసంహారక మందు తాగి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని ఎండపల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన అంగడి రాజు (26)కు కొంతకాలంగా భార్యతో గొడవలు జరుగుతున్నాయి. గురువారం కూడా గొడవ కాగా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎండపల్లి శివారులో క్రిమి సంహారక మందు తాగాడు. చుట్టుపక్కల వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. రాజు తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ధర్మపురి: మేకలను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కెనాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దోనూర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దోనూరుకు చెందిన మాసం చంద్రయ్య (59) ఎప్పటిలాగే శనివారం మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని భీమన్న గుట్ట వద్ద ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ చిన్న కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య నర్సవ్వ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ సమీపంలోని రాజీవ్ రహదారిపై రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనగా నలుగురికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి న్యూపీకేరామయ్య కాలనీకి చెందిన రాధారపు గట్టయ్య టీవీఎస్ వాహనంపై ప్రాజెక్టు లేబర్ గేట్ నుంచి మెయిన్ రోడ్కు వస్తుండగా మంథని ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు మరో బైక్పై వేగంగా వచ్చి గట్టయ్య వాహనాన్ని ఢీ కొట్టారు. గట్టయ్యతో పాటు మంథని కౌశిక్, బూడిద మనోజ్, బూడిద సాయి మనోహర్కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఓదెల(పెద్దపల్లి): శ్రావణమాసం సందర్భంగా ఈ నెల 21న ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో లక్షబిల్వార్చన పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో సదయ్య శనివారం తెలిపారు. సామూహిక లక్షబిల్వార్చన పూజలో పాల్గొనే దంపతులు రూ.200 చెల్లించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
బేతిగల్కు జాండీస్
వీణవంక(హుజూరాబాద్): ఆ ఊరు జాండీస్ (పచ్చకామెర్లు)తో వణికిపోతుంది. ఒకరిద్దరు కాదు 15 రోజుల వ్యవధిలో సుమారు 60 మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో జాండీస్ వ్యాప్తి చెందడం గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరడంతో రూ.వేలలో ఖర్చు అవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. 2వ వార్డులోని ఓ ఇంట్లో తండ్రితో పాటు, కూతురు, కుమారుడికి జాండీస్ రావడంతో రూ.40 వేలు ఖర్చు అయ్యాయని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. గ్రామస్తులు వ్యాధి బారిన పడుతున్నా ఇప్పటి వరకు వైద్యాధికారులు సందర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలుషిత నీరే కారణమా..? గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు సరఫరా అవుతున్నాయి. వాటిని వంట, స్నానం, తాగడానికి వినియోగిస్తున్నారు. ఈ నీళ్లు కలుషితం కావడంతోనే వ్యాధి ప్రబలుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ నీళ్లు కూడా వ్యాధికి కారణమని మరికొంత మంది గ్రామస్తులు పేర్కొంటున్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరుతున్నారు. తీరా వైద్యాధికారులు పరీక్షలు చేయడంతో జాండీస్తో పాటు ప్లేట్లెట్స్ కూడా పూర్తిగా తగ్గిపోవడం గ్రామస్తులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇప్పటికై నా గ్రామంలో వైద్య సిబ్బంది పర్యటించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను గ్రామస్తులు కోరుతున్నారు. పది రోజుల క్రితం జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన. డాక్టర్లు టెస్టు చేస్తే జాండీస్ 9.1 రేంజ్లో ఉందని రిపోర్టు వచ్చింది. ఇప్పటి వరకు రూ.40వేలు ఖర్చయ్యాయి. అయినా తగ్గకపోవడంతో కరీంనగర్కు రెఫర్ చేశారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్నా నయం కావడం లేదు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. డాక్టర్లను అడిగితే ఊర్లో నీళ్లు కలుిషితం అవుతున్నాయని చెబుతున్నారు. – శ్రీ సాయి, యువకుడు, బేతిగల్ వ్యాధి వ్యాప్తిపై గ్రామస్తుల ఆందోళన పట్టించుకోని వైద్యసిబ్బంది -
కొనసాగుతున్న ఎత్తిపోతలు
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం నందిమేడారంలోని నందిపంప్హౌస్ నుంచి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరగడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నంది పంప్హౌస్లోని నీటిని తరలిస్తూ నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కులు, నాలుగు పంపుల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి సొరంగాల ద్వారా లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్లోకి తరలిస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు పంపులను కొనసాగించిన అధికారులు ఒక్క పంపును ఆఫ్చేసి మూడు పంపుల నుంచి ఎత్తిపోతలు కొనసాగిస్తున్నట్లు ఏఈఈ వెంకట్ తెలిపారు. -
‘నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’
కరీంనగర్: నక్సల్స్(మావోయిస్టులు) ఏరివేతే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ కగార్ వంటి ఆపరేషన్లను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఈరోజు(శనివారం, ఆగస్టు 16వ తేదీ) కరీనంగర్లో నక్సల్స్ నరమేధం-మేథోమథనం చర్చలో బండి సంజయ్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా నక్సల్స్ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళులర్పించారు బండి సంజయ్. అనంతరం మాట్లాడుతూ.. నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ను ఎందుకు ఎత్తివేయాలని ప్రశ్నించారు. నక్సల్స్తో చర్చలు జరిపిన వారు ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. ‘తూపాకీ పట్టి అమాయకులను చంపుతుంటే చూస్తూ ఊర్కోవాలా?, నక్సల్స్ తూటాలకు 50 వేల మంది బలి అయ్యారు. 50 ఏళ్లలో భారీ విధ్వంసం జరిగింది. ప్రజాస్వామ్య విలువలను ధ్వంసం చేశారు. నక్సల్స్కు మద్దతిస్తున్న వారికి విద్యా కమిషన్ లో చోటు కల్పిస్తారా?, ఎంతో మందిని నక్సల్స్ చంపినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా?, జాతీయ జెండాను ఎగరనీయని నక్సలైట్లు ఏ దేశ భక్తులు?, బాక్సైట్ తవ్వకాల కోసమే ‘ఆపరేషన్ కగార్’ నిర్వహిస్తున్నారని ప్రచారం చేయడం దుర్మార్గం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి నేటి వరకు గనుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి కదా?, బ్యాలెట్, బుల్లెట్ ఒకే ఒరలో ఉండలేవు. నక్సలైట్ల ఏరివేతను కొనసాగిస్తాం. 2026 మార్చినాటికి నక్సలిజాన్ని నిర్మూలించి తీరుతాం. నక్సల్స్ ముక్త్ భారత్ మా ధ్యేయం’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
ముకుందా.. ముకుందా..
కృష్ణతత్వం.. కృష్ అంటే భూమి న అంటే లేకపోవడం అని అర్థం. కృష్ణుడు అన్ని మతాలు, దేశాలు, కాలాలకు వర్తించే దివ్య సందేశాన్ని భగవద్గీత ద్వారా అందించి చిరస్మరణీయుడయ్యాడు. పరమ దుష్టులైన కంస, జరాసంధ, శిశుపాల, నరకాసురాది రాక్షసులను సంహరించి జగద్రక్షకుడయ్యాడు. భారతదేశాన్ని యుధిష్టరుని పాలనలో ఏకచత్రాధిపత్యం కిందికి తెచ్చిన రాజనీతి దురంధరుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. కృష్ణావతారం.. సమగ్రమైన ఐశ్వర్యం అంటే శాసించే అధికారం, సంపూర్ణ ధర్మం, నిర్మలమైన యశస్సు, పరిపుష్టమైన సౌభాగ్యం, విజ్ఞానం, నిశ్చలమైన వైరాగ్యం ఈ 6 భగవంతుడి లక్షణాలు. నారాయణుని దశావతారాల్లో ప్రతీ అవతారానికి ఇందులో కొన్ని లక్షణాలు మాత్రమే ఉన్నాయి. అన్ని లక్షణాలున్న పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. నీలమేఘశ్యాముడు, పీతాంబరధారి, చతుర్భుజుడు, శంకచక్ర, గద, పద్మాదరుడు, మణిమయ రత్నమకుట కంకణ ధారుడై శ్రీమహా విష్ణువు ఎనిమిదో అవతారం కృష్ణావతారం. సుమారు 5వేల సంవత్సరాల క్రితం కారాగారంలో దేవకి–వాసుదేవులకు శ్రావణ బహుళ కృష్ణపక్ష అష్టమి రోజు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఆ బాల గోపాల పుణ్యాల పున్నమిగా శ్రీకృషు్?ణ్డ జన్మాష్టమి వేడుకలను శనివారం ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. బాల కృష్ణుడి లీలలు వయోభేదం లేకుండా అందరినీ అలరించేవే. పాలు, పెరుగు, వెన్నె చౌర్యంతో చిలిపి చేష్టలతోపాటు పసి వయసులోనే పలువురు రాక్షసులను సంహరించిన శ్రీకృష్ణుడి లీలావినోదం వర్ణనలకు అతీతమైంది. అందుకే పారాడే పసిబిడ్డలందరూ ఈరోజు బాలకృష్ణులు మాత్రమే కాదు.. వాళ్ల అల్లరిని ఆనందించి, అల్లారు ముద్దుగా పెంచుకునే తల్లులందరూ యశోదమ్మలే. ఉట్ల పండుగ శ్రీకృష్ణుడి జన్మాష్టమి రోజున పిల్లలకు బాలకృష్ణుడి వేషధారణ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బాల్యంలోని శ్రీకృష్ణుడి విన్యాసాలకు చిహ్నంగా ఉట్ల పండుగను వేడుకగా జరుపుతారు. అందనంత ఎత్తులో ఉట్టిని కట్టి.. అందులోని వెన్నను సాహసంతో తీసుకొచ్చిన వాళ్లను బాలకష్ణుడి ప్రతీకలుగా భావించేవారు. ప్రస్తుతం ఉట్లలో పాలు, వెన్నకు బదులు డబ్బులు ఉంచి గెలిచినవారికి బహుమతిగా ఇస్తున్నారు. ఉట్టి కొట్టే వేడుక ఆద్యంతం పిల్లలు, యువకులతోపాటు అందరినీ అలరిస్తుంది. ఉట్టిని అందుకునేందుకు చేసే ప్రయత్నాలను సున్నితమైన పద్ధతుల్లో భంగపరుస్తూ వినోదిస్తుంటారు. నేడు శ్రీకృష్ణ జన్మాష్టమివిద్యానగర్(కరీంనగర్): కృష్ణ అనే రెండు అక్షరాలు ప్రణవ మంత్రము, మొదలైన పవిత్ర మంత్రాలన్నింటితో సమానమైనవి. సర్వ భయాలు, విఘ్నాలను తొలగించి విజయ పథంలో నడిపించే అద్భుత చైతన్యం కృష్ణనామం. సత్యం జ్ఞాన మనస్తం బ్రహ్మ, ఆనందోబ్రహ్మ, ఆనందం బ్రహ్మణో విద్యాన్ వంటి ఉపనిషత్ వాక్యాల సారం శ్రీకృష్ణ నామమే. -
గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
ధర్మపురి: భర్త అనారోగ్యంతో మంచానికే పరిమితం కాగా, మనస్తాపానికి గురై భార్య ధర్మపురి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ఉదయ్కుమార్ తెలిపిన వివరాలు.. ధర్మపురికి చెందిన జువ్వాడి పద్మ (55)కు బాపు అనే వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్తకు కళ్లు సరిగా కనిపించకపోవడంతో ఏ పని చేయక ఇంట్లోనే ఉంటున్నాడు. భార్య చిన్నచిన్న పనులు చేస్తూ భర్తను పోషించేది. ఇటీవల భర్త ఆరోగ్యం మరింత బాగా లేక మంచానికే పరిమితం కావడంతో ఎలా పోషించాలని మనస్తాపానికి గురైంది. శుక్రవారం గోదావరి స్నానానికి వెళ్లి అందులో దూకి మునిగిపోయింది. వెంటనే జాలర్ల సాయంతో బయటకు తీయగా అప్పటికే మృతిచెందింది. మృతురాలి మేనల్లుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బైకులు.. భారీ శబ్దాలు..
తిమ్మాపూర్: సెలవులు వచ్చాయంటే చాలు రాజీవ్ రహదారి శబ్దాలతో దద్దరిల్లుతుంది. కరీంనగర్, తిమ్మాపూర్లోని ఇంజినీరింగ్ విద్యార్థులు పదుల సంఖ్యలో కలిసి భారీ శబ్దాలతో కూడిన వాహనాలు నడుపుతూ హడలెత్తిస్తున్నారు. సైలెన్సర్ల శబ్దంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం 40 మంది యువకులు జట్టుగా బైకులపై మండలంలోని రేణికుంట వరకు వెళ్లి, తిరిగి కరీంనగర్ వస్తూ స్టేజీల వద్ద హల్చల్ చేశారు. అటూఇటుగా వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది గురిచేశారు. పోలీసులు స్పందించి జరగరానిది జరగకముందే చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. -
విద్యుత్షాక్తో మహిళ మృతి
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన కరికవేణి లక్ష్మి(35) శుక్రవారం విద్యుత్షాక్తో చనిపోయింది. లక్ష్మికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైంది. కొత్తఇళ్లు నిర్మించేంత వరకు నివాసం ఉండేందుకు పాతఇంటి వెనకాల గురువారం రేకులషెడ్డు వేశారు. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పిల్లలు స్కూల్కు వెళ్తారని నీళ్లు వేడి చేసేందుకు స్విచ్బోర్డులో వాటర్ హీటర్ ప్లగ్ పెట్టే ప్రయత్నంలో విద్యుత్షాక్కు గురై కింద పడిపోయింది. బంధువులు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిశీలించి చనిపోయిందని చెప్పారు. లక్ష్మి కొడుకు వరుణ్ కుమార్ తొమ్మిదోతరగతి, కూతురు వైష్ణవి నాలుగోతరగతి చదువుతున్నారు. భర్త రాజు అంధుడు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పిట్టలు కొట్టేందుకు వెళ్లి.. బావిలో పడి ● మహిళా రైతు దుర్మరణం మల్యాల(చొప్పదండి): మహిళా రైతు మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందిన ఘటన ముత్యంపేట గ్రామంలో జరిగింది. మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన సంత లక్ష్మి(49) శుక్రవారం ఉదయం ఇంటి సమీపంలోని మొక్కజొన్న చేనులో పిట్టలు కొట్టేందుకు వెళ్లింది. ఈక్రమంలో ప్రమాదశాత్తు బావిలో పడిపోయింది. లక్ష్మి చాలాసేపటి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో చేనుకు వెళ్లి వెతకగా బావిలో మృతదేహం కనపడడంతో స్థానికుల సాయంతో బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. క్రెడిట్కార్డు పేరిట సైబర్మోసం జగిత్యాలక్రైం: ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన రమేశ్ను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. వివరాలు.. రమేశ్కు సైబర్ నేరగాళ్లు నో బ్రోకర్ అనే యాప్ను పంపించారు. దానిని ఓపెన్ చేస్తే క్రెడిట్ కార్డు లిమిట్ పెరుగుతుందని నమ్మించారు. దీంతో రమేశ్ యాప్ను ఓపెన్ చేయగానే ఆయన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.40,997 సైబర్ నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు శుక్రవారం రాత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రోడ్డు ప్రమాదంలో కార్మికుడి మృతి
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పీటీఎస్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామగుండంలోని విద్యుత్ నగర్కు చెందిన పెయింటర్ మేకల మల్లేశ్(50) పర్మినెంట్ టౌన్షిప్లో ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఈక్రమంలో బొద్దున సంజయ్ తన బైక్ను అజాగ్రత్తగా వేగంగా నడిపి మల్లేశ్ వాహనాన్ని వెనుకవైపు నుంచి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన మల్లేశ్ను స్థానిక ధన్వంతరి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశాక గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. రైలు కిందపడి ఆత్మహత్య ఓదెల(పెద్దపల్లి): మండల కేంద్రానికి చెందిన గీతకార్మికుడు అయిలు రాజు(41) శుక్రవారం ఇంటర్సిటీ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజు మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని రైల్వే హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపారు. మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. చిరుత దాడిలో లేగదూడ హతంకోనరావుపేట: మండలం గోవిందరావుపేటతండా (బావుసాయిపేట)లో లేగదూడపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన గుగులోత్ పర్శరాములు పొలం వద్ద లేగదూడను ఉంచాడు. శుక్రవారం ఉదయం వెళ్లి చూసే సరికి దూడ మృతి చెందింది. ఆనవాళ్లను బట్టి చిరుతపులి దాడి చేసి చంపినట్లు భావిస్తున్నారు. కొంతకాలంగా ఎలాంటి కదలిక లేని చిరుతపులి మళ్లీ దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ముగ్గురిపై కేసుబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక గ్రామంలోని ఓ ఆలయ బడ్జెట్ విషయంలో జూలై 28వ తేదీ రాత్రి చెన్నమనేని కొండలరావుపై బాలగోని వెంకటేశ్, సిద్ధాంతి దీక్షిత్, సిద్ధాంతి కళాధర్ దాడి చేసినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై రాజయ్య తెలిపారు. వెంకట రామారావు ప్రోత్సాహంతోనే దాడి చేశారని చెన్నమనేని కొండలరావు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు. -
రాజన్నకు ‘పంద్రాగస్టు’ రద్దీ
మహాలక్ష్మి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులుసినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ప్రసాదం అందజేస్తున్న మహేశ్ఆలయంలో భక్తులు వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 15 సందర్భంగా రద్దీ నెలకొంది. ధర్మగుండంలో స్నానాలు చేసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. కాగా.. రాజన్నను దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వాదం అందించారు. ప్రొటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. ప్రత్యేక హోమాలు రాజన్న ఆలయ అనుబంధ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, పట్టుచీర సమర్పించారు. శ్రావణశుక్రవారం సందర్భంగా అర్చకులు రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.