breaking news
Karimnagar
-
వెసక్టమీ సులువైన పద్ధతి
కరీంనగర్టౌన్: కుటుంబ నియంత్రణకు వెసక్టమీ సులువైన పద్ధతని డీఎంహెచ్వో వెంకటరమణ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స క్యాంపును సందర్శించి మాట్లాడారు. వెసక్టమీతో ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారం రోజులపాటు ఇచ్చిన సూచనలను పాటిస్తూ రెస్ట్ తీసుకుని మామూలు దైనందిన జీవితాన్ని కొనసాగించొచ్చని తెలిపారు. వెసక్టమీ ఆపరేషన్ జరిగిన కొన్ని నెలల వరకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ (కండోమ్ వాడటం) పద్ధతిని అవలంబించాలని పేర్కొన్నారు. దీని వల్ల ఇదివరకే ఆపరేషన్కు ముందు నిల్వ ఉన్న శుక్రకణాల వల్ల గర్భం రాకుండా ఉంటుందని, వెసక్టమీతో పురుషులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నా రు. క్యాంపులో డాక్టర్ మహమ్మద్ అలీం వెసక్టమీ ఆపరేషన్లు చేయడం జరిగిందన్నారు. ఈనెల 17న జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆసుపత్రి హుజురాబాద్, సామాజిక ఆసుపత్రి జమ్మికుంటలో వెసక్టమీ, ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ ఉమాశ్రీ, సన జవేరియా పాల్గొన్నారు. -
మితిమీరిన వేగం.. డ్రంక్ అండ్ డ్రైవ్
గోదావరిఖని: అతివేగం.. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం.. స్పోర్ట్స్ బైక్లపై విన్యాసాలు ప్రదర్శించడం.. ఇవన్నీ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు విస్మరించడంతో అమూల్యమైన ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అంతేకాదు.. కొంతకాలంగా ద్విచక్ర వాహన ప్రమాదాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈఏడాది జూన్ 30వ తేదీ వరకు జరిగిన 199 ప్రమాదాల్లో 75 మంది మృతి చెందారు. 22 మంది తీవ్రంగా, 204 మంది స్వల్పంగా గాయపడ్డారు. బ్లాక్స్పాట్ల వద్దే ప్రమాదాలు.. జిల్లాలోని పెద్దపల్లి మండలం దుబ్బపల్లిలో ప్రారంభమయ్యే రాజీవ్ రహదారి గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వరకు సుమారు 50 కి.మీ. మేర విస్తరించి ఉంది. దీనిపై పలుచోట్ల పోలీసు యంత్రాంగం ఆరేళ్ల క్రితమే బ్లాక్స్పాట్లు గుర్తించింది. వీటివద్దే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే, ప్రమాదాల నియంత్రణ కోసం రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్ విభాగానికి అప్పగించారు. ఆయా ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, వేగాన్ని నియంత్రించే చర్యలు తీసుకోవడంతో కొంతమేర ప్రమాదాలు తగ్గినా.. సూచిక బోర్డులు కనిపించకపోవడం, బ్లాక్ స్పాట్ల సమాచారం తెలియకపోవడంతో అతివేగంతో రాకపోకలు సాగించే వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. తెల్లవారుజామునే అధికం.. రాజీవ్ రహదారిపై తెల్లవారుజామునే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నిద్రలేక, అలసిపోయినా డ్రైవింగ్ చేయడంతో డ్రైవర్లు నిద్రలోకి జారుకుంటున్నారని, ఈక్రమంలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వివరిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై దృష్టి.. ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి దొరికితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. రెండోసారి పట్టుబడితే కోర్టులో హాజర్చుతున్నారు. దీంతో నిందితులకు జైలు శిక్ష పడుతోంది. అయితే, గతేడాది మద్యం తాగి డ్రైవింగ్ చేస్తూ 6,725 మంది పట్టుపడగా, అందులో 3,352 మంది నుంచి రూ.44.14 లక్షల జరిమానా వసూలు చేశారు. పెరుగుతోన్న రోడ్డుప్రమాదాలు గోల్డెన్ అవర్లో అందని వైద్యసాయం గాల్లో కలుస్తున్న ప్రాణాలు కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్లో ఈనెల 9న ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొట్టడంతో ఆర్టీసీ డ్రైవర్ తోట శ్రీకాంత్(30) దుర్మరణం చెందాడు. విలేజ్ రామగుండంలో ఈనెల 7న రెండు బైక్లు ఢీకొనడంతో ఎన్టీపీసీ కాంట్రాక్ట్ సూపర్ వైజర్ అంబాల రాజశేఖర్(50) తీవ్రగాయాలతో చనిపోయాడు. యైటింక్లయిన్కాలనీ సింగరేణి అధికారుల క్వార్టర్ల సమీపంలో జూన్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి అధికారి ఉప్పటి రమేశ్బాబు(37) అక్కడికక్కడే మరణించాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడడంతో ప్రమాదం జరిగింది. హెల్మెట్ఉంటే బతికేవాడని స్థానికులు తెలిపారు. రాజీవ్రహదారిపై బ్లాక్స్పాట్లు ఇవే.. రామగుండం తహసీల్లార్ కార్యాలయం ఎదుట ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్గేట్, మేడిపల్లి సెంటర్, ఎఫ్సీఐ క్రాస్ రోడ్డు, మున్సిపల్ ఆఫీస్ అంబేడ్కర్ టీ జంక్షన్ సింగరేని బీ –గెస్ట్హౌస్ మూలమలుపు, మిలీయం కార్టర్స్ సమీపంలోని గంగానగర్ ఫ్లైఓవర్ మల్యాపల్లి ఐవోసీ, బుగ్గరోడ్డు, ధర్మారం ఎక్స్రోడ్డు, అప్పన్నపేట, మంథని ప్లైఓవర్ చిన్నకల్వల, సుల్తానాబాద్ బస్టాండ్, కాట్నపల్లి క్రాస్రోడ్డు, గర్రెపల్లి, దుబ్బపల్లి నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 127 53 262 2023 113 65 300 2024 145 57 342 2025 75 22 204 (జూన్ వరకు)అతివేగమే కారణం అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. కొంతకాలంగా ద్విచక్రవాహనాల ప్రమాదాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. మద్యం తాగి డ్రైవింగ్ చేసేవారురెండోసారి పట్టుబడితే కోర్టు జైలు శిక్ష విధిస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేస్తాం. – శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ, రామగుండం -
ఆపరేషన్ ఫుట్పాత్
● ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణపై బల్దియా స్పెషల్ డ్రైవ్కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ట్రాఫిక్కు తీవ్ర సమస్యంగా మారిన ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణలపై సుదీర్ఘకాలం తర్వాత నగరపాలకసంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుల సహకారంతో నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నగరంలోని రద్దీ ప్రాంతాల్లో రోడ్లు, ఫుట్పాత్లు ఆక్రమించి చేస్తున్న వ్యాపారాల తొలగింపు చురుగ్గా సాగుతోంది. ఫుట్పాత్లపైనే వ్యాపారాలు నగరం శరవేగంగా విస్తరిస్తున్న క్రమంలో అంతే వేగంగా వ్యాపారాలు పెరుగుతున్నాయి. అయితే రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మించిన విశాలమైన ఫుట్పాత్లు వ్యాపారాల కోసం నిర్మించినట్లుగా మారాయి. కొంతమంది నేరుగా ఫుట్పాత్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తుండగా, మరికొందరు తమ దుకాణాల ముందున్న ఫుట్పాత్లు, రోడ్లపై సామగ్రి ఉంచి వ్యాపారం చేస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే టవర్సర్కిల్, రాజీవ్చౌక్, శాసీ్త్రరోడ్, మార్కెట్ఏరియాలతో పాటు నగరంలోని హైదరాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల వైపు వెళ్లే ప్రధాన రహదారులపై ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణ వ్యాపారాలు ఎక్కువగా సాగుతున్నాయి. దీంతో తరచూ ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొనసాగిస్తేనే మేలు నగరంలో ఫుట్పాత్లు, రోడ్ల ఆక్రమణలపై బల్దియా స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రత్యేక చొరవ తీసుకొని స్వయంగా డ్రైవ్ను పర్యవేక్షిస్తున్నారు. ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలను డీఆర్ఎఫ్ సిబ్బందితో తొలగింపచేస్తున్నారు. అయితే బల్దియా సిబ్బంది తొలగించిన కొద్దిరోజులకు పరిస్థితి షరామామూలుగా మారుతోంది. తిరిగి ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారా లు మొదలు పెడుతున్నారు. దుకాణదారులు సైతం కొన్నిరోజులు తమ షట్టర్లకే పరిమితమైనట్లు కని పించినా, తర్వాత మెల్లిగా ఫుట్పాత్లు, రోడ్లపైకి సామగ్రిని చేరుస్తున్నారు. కొంతమంది దుకాణ దారులు ఫుట్పాత్పై రెయిలింగ్, ర్యాంప్లు లాంటి శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. కాగా ఆక్రమణల తొలగింపు కోసం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ను పూర్తి చేసిన అనంతరం కూడా కొనసాగిస్తేనే బల్దియా అధికారుల లక్ష్యం నెరవేరుతుంది. తొలగింపు నిరంతర ప్రక్రియ : కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ నగరంలో ఫుట్పాత్లు, రోడ్ల ఆక్రమణల తొలగింపు నిరంతర ప్రక్రియ అని నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. సోమవారం టౌన్ప్లానింగ్, ట్రాఫిక్పోలీసులతో కలిసి నగరంలోని తెలంగాణ చౌక్ నుంచి పద్మనగర్ వరకు సిరిసిల్ల రహదారిపై ఉన్న ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదచారులు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. రోజూ ఒక రోడ్డులో డ్రైవ్ చేపట్టి ఆక్రమణలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమ షాప్ల పరిధిలోనే వ్యాపారాలు నిర్వహించుకోవాలని, ఫుట్పాత్లు, రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు రాజ్కుమార్, తేజస్విని, సంధ్య, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. -
అమ్మా తినవే.. కలెక్టరమ్మ న్యాయం చేస్తది..
‘ఈ వృద్ధురాలి పేరు ఎలిగేటి రుక్కవ్వ, వయసు 80. మలివయసులో తోడుగా ఉండాల్సిన కొడుకులు నిర్దయగా వ్యవహరించడంతో ఇదిగో ఇలా కూతురు లక్ష్మి సాయంతో కలెక్టరేట్కు వచ్చింది. ఉదయమే కలెక్టరేట్కు సద్దన్నంతో వచ్చారు. సమయం 12 కావడంతో వృద్ధురాలికి ఆకలి వేయగా కలెక్టరేట్ పొడియం వద్ద తినిపించింది. అయితే కలెక్టరమ్మను కలిసిన తరువాతే తింటానని మారాం చేయగా ‘కలెక్టరమ్మ న్యాయం చేస్తది తినవే’ అంటూ బతిమిలాడుతూ తినిపించింది. చొప్పదండి మండలం రాగంపేటలో తన పేరిట రెండు ఇళ్లు, భూమి ఉండగా, పెద్ద కొడుకు అక్రమంగా తన పేరున మార్చుకుంటున్నాడని వాపోయింది. ఆలనా పాలన చూసుకోవాల్సిందిపోయి పట్టించుకోవడం లేదని రోదించింది’. -
ప్రాణం తీసిన చేపల వేట
గంగాధర(చొప్పదండి): చేపల వేట ఓ యువకుడి ప్రాణం తీసింది. ఆదివారం వరదకాలువ నీటిలో మునిగి మృతిచెందిన యువకుడి మృతదేహాన్ని సోమవారం బయటకు తీశారు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. రామడుగు మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్ (30) మండలంలోని కొండన్నపల్లి గ్రామ శివారులో వరదకాలువలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వచ్చాడు. ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయాడు. ఈత రాక నీటిలో మునిగి చనిపోయాడు. సోమవారం మృతుడి సోదరుడు ఇమ్రాన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గుండెపోటుతో మత్స్యకారుడి మృతిమల్లాపూర్: చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లిన మత్స్యకారుడు చిట్యాల రెడ్డి (70) అక్కడే గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని ముత్యంపేటలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చిట్యాల రెడ్డి (70)కి భార్య రాజగంగు, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పిల్లలందరికీ వివాహమైంది. చేపలు పడుతూ.. వ్యవసాయ పనులు చేసుకుంటూ.. జీవిస్తున్నాడు. కులసభ్యులతో కలిసి శివారులోని చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లాడు. అక్కడ ఒక్కసారిగా గుండెపోటుకు గురైన రెడ్డి కుప్పకూలగా.. కులసంఘం సభ్యులు ఒడ్డుకు చేర్చి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన మెట్పల్లిలోని ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తరలిస్తుండగానే మార్గంమధ్యలో పరిస్థితి విషమించి మృతి చెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. చికిత్సపొందుతూ ఒకరు..రామగుండం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్సపొందుతూ మృతిచెందాడు. ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. అక్బర్నగర్కు చెందిన సలిగంటి పూర్ణ చంద్రశేఖర్(33) ఆదివారం మల్యాలపల్లి సబ్స్టేషన్ నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా కుందనపల్లి ఎక్స్రోడ్ వద్ద కరీంనగర్ నుంచి గోదావరిఖని వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. కాగా మృతుడి కుటుంబసభ్యుల కోరిక మేరకు అతడి నేత్రాలను దానం చేయడానికి నిర్ణయించగా, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సీనియర్ టెక్నీషియన్ సతీశ్కుమార్ బృందం కళ్లను సేకరించారు. మృతుడికి భార్య అనూష, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆర్టీసీ డ్రైవర్పై దాడిచేసిన వ్యక్తిపై కేసు
మల్యాల: స్టేజీపై కాకుండా దూరంగా బస్సు ఆపడంటూ డ్రైవర్ను తిడుతూ.. దాడి చేసిన ద్విచక్ర వాహనదారుడిపై కేసు నమోదు చేసినట్లు మల్యాల ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. పెగడపల్లి నుంచి జగిత్యాలకు వస్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్ రవీందర్ మండలంలోని లంబాడిపల్లి స్టేజీపై కాకుండా కాస్త దూరంగా ఆపాడు. ప్రయాణికులను దింపి సమీపంలో ఉన్న ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. అయితే స్టేజీపై లంబాడిపల్లికి చెందిన ఎనుగందుల దిలీప్ బస్సు కోసం పరుగెత్తినా డ్రైవర్ ఆపలేదు. దీంతో దిలీప్ బైక్పై వచ్చి మల్యాల స్టేజీ వద్ద బస్సుకు అడ్డంగా నిలిపి, బస్సు ఎందుకు ఆపడం లేదంటూ డ్రైవర్ రవీందర్ను బూతులు తిడుతూ దాడి చేశాడు. బస్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు దిలీప్పై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రెండిళ్లలో చోరీతంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని వేణుగోపాల్పూర్లో రెండిళ్లలో సోమవారం చోరీ జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గ్రామంలోని సామ అంజవ్వ, సింగిరెడ్డి కవిత ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతననానికి పాల్పడ్డారు. కవిత ఇంట్లో రూ.లక్ష, రెండు బంగారు ఉంగరాలు, 20 తులాల పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు. అంజవ్వ ఇంట్లో ఏమి చోరీకి గురికాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
‘పొలాస’కు కోరుట్ల వ్యవసాయ విద్యార్థినులు
జగిత్యాలఅగ్రికల్చర్: సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోరుట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థినులను సామాజిక కోణంలోనే పొలాస వ్యవసాయ కళాశాలకు తరలించామని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ డీన్ ఝాన్సీరాణి అన్నారు. పొలాస వ్యవసాయ కళాశాలకు కోరుట్లలోనివ్యవసాయ కళాశాల నుంచి 93 మంది విద్యార్థినులను తరలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ వర్సిటీలో ఓ కళాశాల నుంచి మరో కళాశాలకు వెళ్లడం కుదరదని, ఆ నిబంధనను మార్చి.. పేద విద్యార్థినులకు న్యాయం చేయాలనే ఆశయంతో వర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్య, గురుకులం సొసైటీ కమిషనర్ అలుగు వర్షిణి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. గురుకులం సొసైటీ అడిషనల్ సెక్రటరీ ఎన్. కిరణ్మయి మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు సరైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే పొలాస వ్యవసాయ కళాశాలలో కలిపారని పేర్కొన్నారు. స్టూడెంట్ ఆఫైర్ డీన్ సీహెచ్. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ విద్యను సవాల్గా తీసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. గురుకులం సొసైటీ జాయింట్ సెక్రటరీ పీఎస్ఆర్.శర్మ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్ రంగం కంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. పొలాస వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీనారాయణ్ భట్ మాట్లాడుతూ.. పొలాస వ్యవసాయ కళాశాలకు పేరు తేవాలని, ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. నూతనంగా వచ్చిన విద్యార్థినులకు పొలాస విద్యార్థినులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పరిశోధన స్థానం డైరెక్టర్ హరీశ్కుమార్ శర్మ, కళాశాల స్టూడెంట్ ఆఫైర్ కన్వీనర్ రత్నాకర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో రైల్వేశాఖ విఫలం
రామగుండం: ఎగుమతులతో రూ.కోట్ల ఆదాయం సాధిస్తున్న రైల్వేశాఖ.. రైల్వేగేట్లతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో విఫలమైందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రైల్వేగేట్తో ఇరువైపులా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనడమే కాకుండా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. రైల్వేగేట్ల రహిత మార్గంపై దృష్టి పెడుతున్నామని చెబుతున్న రైల్వేశాఖ.. కుందనపల్లిలో ఐదు రైల్వేట్రాక్లు ఉన్నా ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రతీ ఐదు నిమిషాలకు ఒక రైలు రాకపోకలు సాగిస్తుండడంతో గేటు ఎప్పుడూ మూసే ఉంటుందని, గేటుతీసే సమయం తగ్గిపోవడంతో ప్రజల భాదలు వర్ణనాతీతమన్నారు. పెద్దపల్లి, కరీంనగర్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే రైల్వే ప్రయాణికులు ఇదే రహదారి గుండా రాకపోకలు సాగిస్తుండడంతో రైలు సమయానికి నాలుగు గంటల ముందు ప్రయాణాన్ని ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై రైల్వేశాఖ స్పందించి తక్షణమే భూగర్భ, ఫ్లై ఓవర్ నిర్మించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి అనుమాస శ్రీనివాస్, సజ్జత్ తదితరులు ఉన్నారు. తెలంగాణకు 60 శాతం యూరియా కేటాయించాలి ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు. ఆర్ఎఫ్సీఎల్ సీజీఎం రాజీవ్ ఖుల్బే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. కర్మాగారంలోని మెయిన్ కంట్రోల్ యూనిట్ను పరిశీలించారు. యూరియా ఉత్పత్తి, రవాణా, వివిధ రాష్ట్రాల కేటాయింపుల వివరాల గురించి సీజీఎం ఆయనకు వివరించారు. అనంతరం వంశీకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి అయిన యూరియాను తెలంగాణ రాష్ట్రానికి 60 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. గతేడాది 60 శాతం కేటాయించగా ప్రస్తుతం 30 శాతానికి తగ్గించారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియాని కేటాయిస్తోందని ఆరోపించారు. కార్మికుల సమస్యలు, వేతనాలు, భద్రత తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. నాయకులు పి.మల్లికార్జున్, గుమ్మడి కుమారస్వామి, తొగరు తిరుపతి, సాగంటి శంకర్, వీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గేట్ల రహిత రైల్వేట్రాక్ ఏర్పాటుపై శ్రద్ధ వహించాలి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ -
చైన్స్నాచింగ్ ముఠా అరెస్ట్
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించేందుకు దొంగలుగా మారి ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని చైన్స్నాచింగ్లకు పాల్పడున్న ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. సుల్తానాబాద్ ఠాణాలో సోమవారం సీఐ వివరాలు వెల్లడించారు. కాల్వశ్రీరాంపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని కునారం గ్రామానికి చెందిన దెవుల రాజమ్మ మేడలోంచి బంగారం చైన్ను ఈనెల అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో సోమవారం సుల్తానాబాద్ మండలం కనుకుల ఎక్స్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా వచ్చిన నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నింగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొత్తపల్లికి చెందిన యాకబ్, మహమ్మద్ పారుఖ్ఖాన్, షేక్బాశు, షేక్ సైదుగా తమ పేర్లు వెల్లడించారు. పోలీసు శైలిలో విచారణజరపగా.. ఒంటరి వృద్ధులు లక్ష్యంగా చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారు. వీరు నేరాలు చేసేలా ప్రోత్సహించిన షేక్ షబ్బీర్, షేక్ బాబా, షేక్ మక్తుం ఆలీ పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులు.. బిందెలు, వంటపాత్రలు అమ్ముకునేందుకు మంచిర్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, జనగామ, వరంగల్ జిల్లాల్లో డేరాలు వేసుకొని సమీప గ్రామాల్లో వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారంతో వచ్చిన డబ్బులు సరిపోకపోగా జల్సాలు తీర్చుకునేందుకు అధికంగా డబ్బులు సంపాదించాలని నిర్టయించుకున్నారు. ఇలా చోరీలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 10 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. బసంత్నగర్, మంచిర్యాల, ముత్తారం, ధర్మారం, దండెపల్లి, కొడకండ్ల, పెద్దపల్లి, చెన్నూర్, ఎలిగేడ్, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లోని వృద్ధుల మేడలోంచి గొలుసులు చోరీచేశార. చోరీచేసిన బంగారాన్ని షేక్ సైదు విక్రయించేవాడు. డబ్బులను అందరూ పంచుకొని జల్సాలు చేసేవారు. నిందితుల నుంచి రూ.3లక్షల నగదు, 10తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సైలు వెంకటేశ్, సనత్రెడ్డి, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుళ్లు సదానందం, వెంకటేశ్, లక్ష్మణ్, స్వామి, శ్రీనివాస్ను డీసీపీ, ఏసీపీలు అభినందించారు. 10 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీఐ సుబ్బారెడ్డి -
అక్షర చైతన్యానికి శ్రీకారం
● మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం ● పూర్తయిన నిరక్షరాస్యుల గుర్తింపు సర్వే ● విద్యాశాఖ, వయోజన విద్య, ఐకేపీలకు సమన్వయ బాధ్యతలు ● ‘ఓపెన్’లో చేర్పించి చదివించేలా చర్యలు ● జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్య మహిళలుగంభీరావుపేట(సిరిసిల్ల): స్వయం సహాయక సంఘాల్లోని మహిళలల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. విద్యాశాఖ, వయోజన విద్య(ఉల్లాస్), ఐకేపీ శాఖలు సంయుక్తంగా మహిళల్లో అక్షర చైతన్యం కలిగించడానికి శ్రీకారం చుట్టారు. టాస్(తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ)లో చేర్పించి అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ కారణాలతో చదువుకోలేకపోయిన, మధ్యలో చదువు మానేసిన వారిని ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్లో చేర్పిస్తున్నారు. జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్యులు జిల్లాలోని 10 వేల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న నిరక్షరాస్యులైన మహిళా సభ్యులను గుర్తించడానికి అధికారులు సర్వే చేపట్టారు. ఐకేపీ అధికారులు, సీసీలు, వీవోఏలు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారు. జిల్లాలో 21,894 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు అంచనా. వారిలో ఇప్పటి వరకు 12,203 మందిని గుర్తించారు. అందులో ఓపెన్ స్కూల్లో చదివించడానికి 1,157 మందిని పదో తరగతిలో, 712 మందిని ఇంటర్లో చేర్పించారు. అక్షర జ్ఞానం కలిగించడానికి ఉల్లాస్ యాప్లో 1,802 మంది పేర్లను అధికారులు నమోదు చేశారు. స్వచ్ఛంద వలంటీర్లతో విద్యాబోధన చదువు నేర్పించడానికి ఎలాంటి పారితోషికం ఆశించకుండా విద్యాబోధన అందించడానికి స్వచ్ఛందంగా పనిచేయడానికి 1,071 మంది వలంటీర్లు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి 110 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, ఆశకార్యకర్తలు వలంటీర్లుగా పనిచేసే అవకాశం ఉంది. వీరికి ప్రత్యేక ప్రశంసాపత్రాలు, సత్కారాలు చేసి ప్రొత్సహించడానికి ప్రభుత్వం యోచిస్తోంది. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయండి
కరీంనగర్అర్బన్: ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతు వంటి అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీ క్షలో మాట్లాడారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనా ల్లో మౌలిక వసతుల కల్పన, కిచెన్షెడ్, టాయిలెట్, ప్రహరీ వంటివి పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో ప్రతీ పనిని పర్యవేక్షించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న పలు ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాళ్లలో మరమ్మతులు చేపడుతున్నామని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, జిల్లా సంక్షేమ అధికారి పనులను పర్యవేక్షిస్తూ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ఆయిల్పాం సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ప్రైవేట్ అంబులెన్స్లను ప్రభుత్వ ఆసుపత్రులకు అతి సమీపంలో నిలుపుతున్నారని, ఈ విధానాన్ని కట్టడి చేయాలన్నారు. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని ప్రత్యేక ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. ● కలెక్టర్ పమేలా సత్పతి -
పోచమ్మ విగ్రహం ధ్వంసం
ధర్మపురి: గ్రామ దేవత పోచమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన కోస్నూరుపల్లెలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని కోస్నూర్పల్లెలో ఆరేళ్ల క్రితం అమ్మవారికి గుడికట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. సోమవారం ఉదయం ఓ భక్తురాలు జున్ను పాలను అమ్మవారికి సమర్పించడానికి వెళ్లగా విగ్రహం రెండు ముక్కలుగా పడిపోయి ఉంది. ఆమె మాజీ సర్పంచ్ ఎన్నం లక్ష్మారెడ్డికి సమాచారం చేరవేసింది. ఆయన సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్తో కలిసి ఆలయానికి చేరుకున్నారు. జగిత్యాల నుంచి డాగ్ స్క్వాడ్ను రప్పించారు. మాజీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఐదుగురిపై కట్నం కేసుజమ్మికుంట(హుజూరాబాద్): అదనపు కట్నం తేవాలని వేధిస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. వివరాలు.. మండలంలోని రంగమ్మపల్లి గ్రామానికి చెందిన సుజాతకు ఇల్లందకుంట మండల కేంద్రానికి చెందిన మీసా కిరణ్తో 2022లో కట్న కానుకలతో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. తర్వాత అదనపు కట్నం తేవాలని బూతులు తిడుతూ, మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని భర్త కిరణ్, అత్త రాజవ్వ, బావ–తోటికోడలు అశోక్, మమత, ఆడపడుచు భర్త సదానందంపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. -
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
కరీంనగర్క్రైం: ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యా ఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకో వాలని బీసీ కుల సంఘాలు, జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, మహిళ విభాగాల ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యా దు చేశారు. బీసీ కుల సంఘాల మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కర్రె పావని, నాయకులు గంటల రేణుక, గుబురే సుజాత, పాదం అజాంతా, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, నాయకులు గొట్టం మహేశ్, పూసాల రణధీర్, మడిపెల్లి వినీత్ ఉన్నారు. -
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు 11 కేవీ సివిల్ ఆస్పత్రి ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలివేయనున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పంజాల శ్రీనివాస్గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఎస్వీజేసీ కళాశాల, రామాలయం, జానకి చికెన్సెంటర్, ప్రశాంత్నగర్కాలనీ, రెనె ఆస్పత్రి ప్రాంతాలు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు 11 కేవీ గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని భవానీనగర్, జానకి స్ట్రీట్ అపార్ట్మెంట్స్, ఏఓస్ పార్కు, సప్తగిరికాలనీ, హెల్త్ సెంటర్ రోడ్, గ్రీన్ స్ట్రీట్, శ్రీనగర్కాలనీ, ఏఓస్కాలనీ, తాహెరామజీద్, సంతోషిమాత ఆలయ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. చెర్లభూత్కూర్ సబ్స్టేషన్ పరిధిలో.. 33/11 కేవీ చెర్లభూత్కూర్ సబ్స్టేషన్ పరిధిలో బ్రేకర్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చెర్లభూత్కూర్, చామన్పల్లి, ఫకీర్పేట, తాహెర్కొండాపూర్, దుబ్బపల్లి, జూబ్లీనగర్, బహద్దూర్ఖాన్పేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు పేర్కొన్నారు. -
రేకుర్తి..
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025ఇంటి నంబర్ల కక్కుర్తి!● విచారణ మొదలుపెట్టిన విజిలెన్స్ ● యజమానులను పిలిచి ప్రశ్నిస్తున్న అధికారులు ● విలీనమయ్యాక ఇంటి నంబర్లు ఎలా వచ్చాయని ఆరా? ● కోట్లాది రూపాయల ప్రభుత్వ ఖజానాకు నష్టం ● గూగుల్ మ్యాప్స్లో ఇండ్లు కట్టనేలేదని గుర్తించిన అధికారులుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ఎంత పెద్ద నేరస్తుడైనా.. ఏదో చిన్న క్లూ వదిలేసి వెళ్తాడు. ‘సీఎం చచ్చిపోతే మీరు సీఎం అవుతారు.. కానీ, సీఎంను చంపితే మీరు నేరస్తులవుతారు.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు?’ అంటూ ఓ పోలీసు అధికారి ఓ సినిమాలో ప్రశ్నిస్తాడు. సరిగ్గా ఇలాగే ఉంది కరీంనగర్ బల్దియా అధికారుల తీరు.. రేకుర్తి పరిధిలో వందలాది ఇంటి నంబర్లు అడ్డదారిలో జారీ చేసిన అధికారులు.. ఆ సమయంలో గూగుల్ మ్యాప్స్లో ఇండ్లు చూడొచ్చన్న చిన్న లాజిక్కుతో అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు అధికారుల జేబుల్లో పడగా.. అంతకుమించి బల్దియా ఖజానాకు గండి పడింది. దీనిపై విజిలెన్స్కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో వెంటనే.. అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ వ్యవహారంలో అనుమానాస్పద ఇంటి నంబర్ల యజమానులను విజిలెన్స్ కార్యాలయానికి పిలిచి విచారణ చేపడుతున్నారు. ‘మీ ఇంటి నంబర్లు ఎలా వచ్చాయి? ఎంతకాలం కింద భూములు కొన్నారు? ఎప్పుడు అనుమతులు తీసుకున్నారు?’ తదితర వివరాలపై కూపీ లాగుతున్నారు. గూగుల్ మ్యాప్స్లో పరిశీలించిన అధికారులకు ఆ సమయంలో అసలు ఇండ్లే కట్టలేదని నిర్ధారించడం కలకలం రేపుతోంది. అసలేం జరిగింది? 31–07–2018 తేదీతో రేకుర్తి గ్రామపంచాయతీ గడువు ముగిసింది. ఆ తర్వాత సెక్రటరీ బాధ్యతలు చేపట్టారు. 2019 మార్చిలో కరీంనగర్ కార్పొరేషన్లో రేకుర్తి విలీనం అయింది. అనంతరం రేకుర్తి గ్రామపంచాయతీకి సంబంధించిన దాదాపు 33 రకాల అంశాల రికార్డులు, చెక్బుక్కులతో సహా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు స్వాధీనం చేశారు. అందులో అన్నిరకాల రికార్డులు భద్రంగా ఉన్నాయి. కానీ, గృహ నిర్మాణ అనుమతి రిజిస్ట్రార్ మాత్రం గల్లంతైంది. ఈ కారణాన్ని సాకుగా చూపి.. 2019 నుంచి కరోనా దాకా అనేక రేకుర్తి గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు ఇండ్లు లేకున్నా పుట్టుకొచ్చాయి. వాస్తవానికి ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయి ఉండాలి. బల్దియాలో ఆర్ఐ, ఆర్వో క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలి. వాళ్లు సరే అంటే.. డిప్యూటీ కమిషనర్, కమిషనర్ ఆమోదంతో ఇంటి నంబరు జనరేట్ అవుతుంది. కానీ, బల్దియా సిబ్బంది కొత్త ఇంటి నంబర్లు పాత రికార్డులలో ఎంటర్ చేసి ఇవ్వడం ప్రారంభించారు. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారాయి. వీటిలో అత్యధికంగా 2019 మార్చి 11వ తేదీన రేకుర్తి గ్రామపంచాయతీ రికార్డులో నమోదు చేయడం గమనార్హం. 85 మంది ఇంటి యజమానుల విచారణ రేకుర్తి పాత గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు పొందిన వైనంపై తీవ్ర దుమారం రేగింది. ఈ క్రమంలోనే విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. 2019 తరువాత పాత గ్రామపంచాయతీ ఇంటి నంబర్లు పొందిన అనుమానాస్పద ఇంటి యజమానులకు విజిలెన్స్ కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. వారంతా అధికారుల ముందు హాజరయ్యారు. అధికారులు వారిని ఇంటి నంబర్లు ఎప్పుడు వచ్చాయి? ఇంటి అనుమతి పత్రాలు, ఎల్ఆర్ఎస్, ఇంటినంబరు కోసం ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నారు? ఏ రోజు ఇంటి నంబరు వచ్చింది? తదితర ప్రశ్నలను యజమానులను అడిగారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు కొత్త విషయాలు తెలుసుకున్నారు. వాస్తవానికి వీరంతా 2019 లేదా 2018లో ఇంటి నిర్మాణ అనుమతి పొంది ఉంటే అదే సమయంలో నిర్మాణం ప్రారంభించి ఉండాలి. కానీ, గూగుల్ మ్యాప్స్లో విజిలెన్స్ అధికారులు పరిశీలించినప్పుడు.. అసలు ఆ సమయంలో ఇండ్లే లేవని గుర్తించారు. దీంతో ఇంటి నంబర్ల జారీ అంతా ఉత్తిదేనని తేలిపోయింది. కాకపోతే, మరింత మంది ఇంటి యజమానులను విచారించాల్సి ఉన్నందున వారి స్టేట్మెంట్లు కూడా తీసుకుని నివేదిక రూపొందించనున్నారు. ఇంటినంబర్లు నకిలీవని తేలిన దరిమిలా.. బల్దియాలో భారీ భూకంపమే రానుంది. న్యూస్రీల్ -
చొప్పదండి పీఏసీఎస్కు బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డు
చొప్పదండి: నాబార్డ్ 44వ వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డులలో చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బెస్ట్ ఫర్ఫార్మింగ్ అవార్డును సొంతం చేసుకుంది. మంగళవారం హైదరాబాద్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేతుల మీదుగా పీఏసీఎస్ చైర్మన్ వెల్మ మల్లారెడ్డి, సీఈవో కళ్ళెం తిరుపతిరెడ్డి అవార్డు అందుకోనున్నారు. పాలకవర్గం సమష్టి నిర్ణయాలు తీసుకొని సమయానుకూలంగా సభ్యులకు సేవలు అందిస్తూ, అమలుపరచడంలో వంద శాతం పనితీరు కనబరుచడంతో చొప్పదండి పీఏసీఎస్కు వరుసగా అవార్డులు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయస్థాయి ఉత్తమ పీఏసీఎస్ అవార్డు రాగా, దేశవ్యాప్తంగా ఉన్న 96 వేల సంఘాలలో చొప్పదండి పీఏసీఎస్ హైట్రిక్ అవార్డు అందుకుంది. చైర్మన్గా మల్లారెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడుసార్లు జాతీయ ఉత్తమ పీఏసీఎస్ అవార్డు అందుకోవడం గమనార్హం. తిరుపతిరెడ్డి కూడా పలుమార్లు ఉత్తమ సీఈవోగా అవార్డులు అందుకున్నారు. అవార్డు అందుకుంటున్న సందర్భంగా పాలకవర్గం, సిబ్బందిని జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు సీఈవో సత్యనారాయణరావు అభినందించారు. రైల్వేస్టేషన్ అభివృద్ధికి కేంద్రం కృషిజమ్మికుంట(హుజూరాబాద్): ప్రయాణికులు, సరుకుల రవాణాకు జమ్మికుంట రైల్వేస్టేషన్ ఎంతో కీలకమని, స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్టేషన్ను సందర్శించి ప్రయాణికుల ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైల్వేస్టేషన్ను మరింత అభివృద్ధి చేయించేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ లక్ష్యంతో ఉన్నారని, అమృత్ భారత్లో భాగంగా ఆధునీకరించడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జిని కొత్తపల్లి వరకు పొడిగించడం, లిఫ్ట్ సౌకర్యం, హైలెవల్ ప్లాట్ఫాం నిర్మాణం, ముఖ్యమైన రైళ్ల హాల్టింగ్ ఉండేలా కేంద్ర మంత్రి చర్యలు తీసుకున్నారని వివరించారు. కార్యక్రమంలో జమ్మికుంట, హుజూ రాబాద్ పట్టణాల అధ్యక్షులు కొలకాని రాజు, తూర్పాటి రాజు, మాడ వెంకట్రెడ్డి, ఆకుల రాజేందర్, జీడి మల్లేశ్, శీలం శ్రీనివాస్, రమారెడ్డి, రాజేశ్ఠాకూర్, గణేశ్, అశోక్, బచ్చు శివన్న, మోతే స్వామి, నగేశ్, నిరుపరాణి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. కేంద్ర జల శక్తి బృందం తనిఖీ కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం ఇరుకుల్లలో కేంద్ర జల శక్తి అభియాన్ కింద చేపట్టిన పనులను సోమవారం జల శక్తి బృందం తనిఖీ చేసింది. గ్రామంలో నిర్మించిన ఇంకుడుగుంతలను జిల్లా నోడల్ అధికారి డి.చైతన్య, కో ఆర్డినేటర్ శ్రీధర్ పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో నీటి సంరక్షణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీవో శోభరాణితోపాటు సిబ్బంది పాల్గొన్నారు. ‘బహుజనగణమన’ పుస్తకం ఆవిష్కరణ కరీంనగర్ కల్చరల్: తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ రచించిన ‘బహుజనగణమన’ సామాజిక పుస్తకాన్ని సోమవారం కరీంనగర్లోని జయశంకర్ విగ్రహం వద్ద బీసీ సంఘం నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఉల్లంగుల ఏకానందం, రాచకొండ సత్యనారాయణ, గుంజపడుగు హరిప్రసాద్, కలర్ సత్తన్న, మెతుకు సత్యం, తిప్పారపు శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కళాశాలలకు మహర్దశ
● జూనియర్ కాలేజీలకు నిధులు ● జిల్లాలోని 10 కళాశాలల్లో వసతుల కల్పనకు రూ.1.29 కోట్లుకరీంనగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతుల కల్పకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఏళ్లుగా నిధులు లేక వసతుల లేమితో సతమతమవుతున్న జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టనుంది. జిల్లాలోని 10 కళాశాలల్లో సౌకర్యాల కల్పనకు రూ.1,29,70,000 నిధులు విడుదల చేసింది. వీటితో భవనాల మరమ్మతు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, విద్యుద్ధీకరణ, తాగునీరు, గ్రీన్చాక్ బోర్డులు, డ్యూయల్ డెస్కులు, ఫ్యాన్లు, షెడ్లు, భవనాలకు రంగులు వంటి పనులు చేపట్టనున్నారు. దీంతో గత కొన్నేళ్లుగా వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న జూనియర్ కళాశాలలు కొత్త శోభను సంతరించుకోనున్నాయి. 10 కళాశాలలు జిల్లాలోని 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 4వేల మందికి పైగా చదువుతున్నారు. బోధన, బోధనేతర పరంగా కొరత పెద్దగా లేకపోయినా, సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ కృష్ణ ఆదిత్య తొలుత సంస్కరణలపై దృష్టిసారించారు. వాస్తవిక ఫలితాల కోసం పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు తరగతి గదుల్లో, కళాశాల పరిసరాలు, ప్రిన్సిపాల్, అధ్యాపకుల గదుల్లోనూ కెమెరాలను బిగించే పనులు కొనసాగిస్తున్నారు. కమిషనరేట్లోని కమాండ్ కంట్రోల్రూం నుంచి బోధనను పర్యవేక్షిస్తూ ఇంటర్ విద్య వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ గాడిలో పెడుతున్నారు. ప్రభుత్వ పరంగా విద్యార్థులకు పుస్తకాలు, నోట్స్, వసతులతో పాటు నీట్, ఎంసెట్, ఇతర కోర్సులకు ఉచిత కోచింగ్ ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేస్తూ ప్రభుత్వ కళాశాలలను ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నారు. నిధుల మంజూరు ఇలా..కళాశాల నిధులు(రూ.లక్షల్లో) కరీంనగర్(ఆర్ట్స్ కళాశాల) 20,10,000 కరీంనగర్(సైన్స్ కళాశాల) 15,30,000కరీంనగర్(బాలికలు) 4,50,000మానకొండూర్ 28,10,000గంగాధర 19,10,000హుజూరాబాద్ 12,70,000సైదాపూర్(వి) 11,40,000జమ్మికుంట 11,50,000వీణవంక 5,30,000చిగురుమామిడి 1,70,000ప్రవేశాలు పెరుగుతాయి జిల్లాలోని 10 జూనియర్ కళాశాలలకు 1.29 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయడంతో మంచి రోజులు వచ్చినట్లే. అరకొర వసతుల నడుమ ఇప్పటి వరకు మెరుగైన ఫలితాలు సాధించాం. సౌకర్యాల కల్పనతో ప్రవేశాలు పెరుగుతాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచితవిద్య, పుస్తకాలు, నోట్బుక్స్, కోచింగ్ను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – వి.గంగాధర్, డీఐఈవో, కరీంనగర్ -
బాధ్యులను వదిలి.. ఆపరేటర్ బలి
● రేకుర్తిలో ఇంటి నంబర్ వ్యవహారం ● సహచరులను కాపాడే ప్రయత్నంకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని రేకుర్తిలో రేకులషెడ్డుకు ఇంటినంబర్ ఇచ్చిన బాధ్యులను కాపాడేందుకు కొంతమంది బల్దియా అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. తప్పు చేసిన ఉద్యోగులను వదిలేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్ను బలిచేసినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కేవలం ఆపరేటర్ను సరెండర్ చేసి చేతులు దులుపుకోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నగరంలోనే అత్యంత వివాదాస్పద భూముల వ్యవహారం ఉన్న రేకుర్తిలో కొన్నేళ్లుగా ఇంటి నంబర్ల దందా కొనసాగడం తెలిసిందే. వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ఇంటి నంబర్లను సృష్టించడం ఇక్కడ ఒక విధానం. నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగానికి చెందిన కొంతమంది అధికారుల సహకారంతో ఖాళీ స్థలాలకు, చిన్న గదులకు ఇంటినంబర్లు ఇచ్చి, ఆ తరువాత ఆ స్థలాన్ని తమ సొంతం చేసుకుంటుంటారు. గతంలో చాలాసార్లు ఈ ఇంటి నంబర్ల దందా వెలుగు చూడడం, ఫిర్యాదులు రావడం, విచారణ చేపట్టడం, ఆనక వదిలేయడం ఇక్కడ ఏళ్లుగా జరుగుతున్న తంతు. అనంతరం షరామామూలుగానే ఈ దందా కొనసాగుతుంటుంది. ఇల్లు లేకున్నా ఇంటి నంబర్ నగరంలో ఎక్కడైనా అసంపూర్తిగా ఉన్న ఇల్లు, రేకులషెడ్డుకు ఇంటి నంబర్లు కేటాయించేందుకు నిరాకరించే అధికారులు, రేకుర్తిలో రేకులతో వేసిన ఒక గదికి మాత్రం ఇంటినంబర్ కేటాయించారు. రేకులషెడ్కు ఇంటినంబర్ జారీ చేయడంలో కనీసం రూ.లక్ష చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై ‘రేకుల గదికి ఇంటి నంబర్’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనంపై ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆర్ఐ, ఆర్ఓలకు తెలియకుండా? ఇంటి నంబర్ కావాలంటే సంబంధిత వ్యక్తి సెల్ఫ్ అసెస్మెంట్, ఇతరత్రా మార్గంలో ఆన్లైన్లో మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీ)కి దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు ఆపరేటర్ లాగిన్ నుంచి ఆర్ఐ లాగిన్కు, ఆర్ఐ నుంచి ఆర్వో లాగిన్, ఆర్వో లాగిన్ అనంతరం చివరగా ఎంసీ లాగిన్కు వెళ్తుంది. ఆర్ఐ లాగిన్కు రాగానే క్షేత్రస్థాయిలో విచారించాలి. దరఖాస్తుదారు పేర్కొన్న వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూసి ఇంటినంబర్కు సిఫారసు చేయాలి. అక్కడ ఇల్లు లేకపోతే, అదే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ఐ వివరాలు సక్రమంగా ఉంటే ఆర్వో ఆమోదించి, ఎంసీకి పంపిస్తారు. ఇంటినంబర్ వ్యవహారంలో ఆర్ఐ, ఆర్వోల రిపోర్ట్ కీలకం. లాగిన్ అవుతున్న ప్రతీసారి సంబంధిత అధికారికి ఓటీపీ వెళ్తుంది. ఆ అధికారి ఓటీపీ చెబితేనే లాగిన్ సాధ్యమవుతుంది. అంటే ఆర్ఐ, ఆర్వోలకు తెలియకుండా ఇంటినంబర్ జారీ అయ్యే అవకాశమే లేదు. సహచరులను కాపాడేందుకు? ఇంటినంబర్ల జారీలో ఒక ముఠాగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారులు సహచరులను కాపాడుకునే క్రమంలో ఆపరేటర్ను బలి చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆపరేటర్ లాగిన్ అయినా, ఆ స్థలంలో ఇల్లు ఉందా లేదా అనేది అధికారులే చూడాలి. ఆర్ఐ, ఆర్వోల రిపోర్ట్ ఆధారంగానే ఇంటినంబర్ జనరేట్ అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా గదికి ఇంటి నంబర్ జారీ చేసిన సదరు అధికారులను కాపాడే క్రమంలోనే ఆపరేటర్ను సరెండర్ చేసినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహరంపై బల్దియా కమిషనర్ దృష్టి సారించి అసలైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇంటినంబర్ల దందాకు ఫుల్స్టాప్ పెట్టాలని సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. -
ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి
కరీంనగర్: ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, పొడపంగి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకువస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, విద్యా సంవత్సరం ప్రారంభమైనా అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకుండా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నెలకొల్పుతామని ఆర్భాటంగా ప్రకటించి, ప్రభుత్వ బడుల విధ్వంసానికి పాల్పడుతుందని మండిపడ్డారు. ఇప్పటికీ జిల్లాలో అనేక సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, తక్షణమే వాటికి సొంత భవనాలు కేటాయించాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించి భర్తీ చేయాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కుతాటి రాణాప్రతాప్, ఉపాధ్యక్షుడు కేంసారం రవితేజ, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు అస్లాం, రాకేశ్, అజయ్, బాబు, శ్రీనివాస్, నవీన్, సాయికుమార్, అయాన్ తదితరులు పాల్గొన్నారు.ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులపై వివక్షకరీంనగర్: కరీంనగర్ అర్బన్ ఎంఈవోగా భద్రయ్యను కొనసాగించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బానోతు కిషన్నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఫిలింభవన్లో జిల్లా అధ్యక్షుడు మీసాల మల్లిక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్ అర్బన్ ఇన్చార్జి ఎంఈవోగా కొనసాగుతున్న భద్రయ్యను విద్యాశాఖాధికారులు తప్పుదోవ పట్టించడం వల్ల అకారణంగా ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించడం జరిగిందన్నారు. గతంలో కూడా పోతన శ్రీనివాస్ అనే దళిత ఉపాధ్యాయున్ని సస్పెండ్ చేసి సుదూర ప్రాంతానికి బదిలీ చేయడం జరిగిందన్నారు. విద్యాశాఖలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఒక పథకం ప్రకారం ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులపై వివక్ష కొనసాగుతున్నట్లు అవగతం అవుతుందన్నారు. జిల్లా విద్యాశాఖలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు జరుగుతున్న అన్యాయాన్ని జిల్లా కలెక్టర్ అరికట్టాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు శంకర్, బలరాం, శివకుమార్, రంగయ్య, రమేశ్, బానోతు శంకర్, కుమారస్వామి, రాజన్న, గిరి, సురేశ్, శ్రీనివాస్, తిరుపతి, సమ్మయ్య పాల్గొన్నారు. బెల్టుషాపులను మూసివేయాలికరీంనగర్: చట్ట వ్యతిరేక బెల్టుషాపులను వెంటనే మూసివేయాలని సర్వాయి పాపన్న గీత పారిశ్రామిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పర్శరాంగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దాదాపు 2లక్షల మంది గీతకార్మికులు గీతవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, వారి పాట్టగొడుతూ కొందరు దురాశపరులు ప్రమాదకర రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేసి, అదే చెట్టుమీది కల్లు అని అబద్ధాలు చెప్పి సొమ్ము జేసుకుంటున్నారని పేర్కొన్నారు.కల్తీ కల్లు వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చెట్టుపై నుంచి పడి చనిపోయినవారికి, వికలాంగులుగా మారినవారికి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లిస్తామనే ప్రకటనలే తప్ప నిధులు విడుదల చేయడం లేదన్నారు. కల్తీ కల్లును అరికట్టాలని, కానీ, కల్తీకల్లు పేరుతో పల్లెల్లోని గీతకార్మికులను వేధించవద్దన్నారు. పలు సమస్యలపై త్వరలో కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు మల్లేశం, రాజమల్లు, పర్శరాం, రాంశంకర్గౌడ్, నర్స య్య, ఆంజనేయులు, పర్శరాములు, అయిలయ్య, రాజయ్య, ఐలన్న, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ పోలీసింగ్
● అధునాతన పరికరాలతో విధులు, నిరంతర తనిఖీలు ● సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్తో నగరంపై నిఘా ● వేగంగా సేవలందించేందుకు కృషికరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీసులు అధునాతన టెక్నాలజీతో విధులు నిర్వహిస్తున్నారు. డిజిటల్ పోలీసింగ్ అమలు చేస్తూ స్మార్ట్గా ముందుకు సాగుతున్నారు. నేరస్తులను పట్టుకోవడంతో పాటు.. నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధిస్తున్నారు. రేయింబవళ్లు తనిఖీలు చేస్తూ.. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. వివిధ సంఘటనలు జరిగినప్పుడు మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనం వినియోగిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నగరంలో వందలాది సీసీ కెమెరాలతో 24గంటల పాటు పర్యవేక్షిస్తున్నారు. సరికొత్త పరికరాలు వాహనాలకు ఏర్పాటుచేసిన బ్లాక్ఫిల్మ్ను గుర్తించేందుకు టింట్ మీటర్, సౌండ్ పొల్యూషన్ను గుర్తించే వాయిస్ సౌండ్ లెవల్ మీటర్, డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో డిజిటల్ బ్రీత్ అనలైజర్, పాత నేరస్తులను పట్టుకునేందుకు పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ వినియోగిస్తున్నారు. నిత్యం రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ.. అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ.. పాత నేరస్తులను పట్టుకుంటున్నా రు. విధుల్లో బాడీవార్న్ కెమెరాలు, ఈపెట్టీ కేసుల నమోదుకు ట్యాబ్స్ వినియోగిస్తున్నారు. షీటీం పోలీసులు మఫ్టీలో ఉంటూ రద్దీ ప్రాంతాల్లో పోకిరీల ఆగడాలను అరికట్టడానికి బటన్ కెమెరాలు వాడుతున్నారు. స్పీడ్ హంటర్ ద్వారా అధికవేగంతో వెళ్తున్న వాహనాలకు జరిమానా విధిస్తున్నారు. 769 కెమెరాలతో సిటీపై నిఘా నగరం 769 కెమెరాల నిఘాలో ఉంటోంది. ఇటీవల కరీంనగర్ బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్లోని సీసీటీవీల ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. నగరంలో సర్వేలెన్స్ కెమెరాలు 335 ఉన్నాయి. పీటీజెడ్ కెమెరాలు 35, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలు 24, ఆర్ఎల్వీడీ కెమెరాలు 85, ఏఎన్పీఆర్ కెమెరాలు 174, 60 స్పీడ్ డిటెన్షన్ కెమెరాలు, ఎవిడెన్స్ కెమెరాలు 20, ఏఎన్పీఆర్ కెమెరాలు 40, రాంగ్రూట్ కెమెరాలు పదిస్థానాల్లో 30 ఏర్పాటు చేశారు. నగరంలోని 24 జంక్షన్లలో 85 కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుంది. -
సీఐ వార్నింగ్.. వ్యక్తి ఆత్మహత్య
చొప్పదండి/కరీంనగర్ క్రైం: గృహహింస, వరకట్న వేధింపుల కేసులో తనను అత్తింటివారితోపాటు మధ్యవర్తులు, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ వేధిస్తున్నారని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 7వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగిన కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్కుమార్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. ఈ వ్యవహారంలో చొప్పదండి పోలీసులు కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ సీఐ శ్రీలత, మృతుడి భార్య, అత్త, మధ్యవర్తులపై కేసు నమోదు చేశారు.కరీంనగర్ రూరల్ రెవెన్యూ కార్యాలయంలో శ్రవణ్ కుమార్ రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. అతనికి కరీంనగర్ బస్ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న కరీంనగర్ నివాసి నీలిమతో 2021 జూన్లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండేళ్ల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి నీలిమ తల్లిగారింట్లో ఉంటోంది. గత నెలలో కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్లో నీలిమ వరకట్నం వేధింపుల కేసు పెట్టడంతో శ్రవణ్తోపాటు, అతని తండ్రి నర్సింగం, తల్లి విజయ, అక్క కడారి వనజ పోలీస్స్టేషన్కు వెళ్లారు. అక్కడ సీఐ శ్రీలత ‘నువ్వు ప్రభుత్వ ఉద్యోగివి. నేను చెప్పినట్లు వింటే మంచిది. కంప్రమైజ్ చేసుకో. లేకుంటే ఇబ్బంది పడతావు’అని బెదిరిస్తూ అతడిపై కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో సీఐ శ్రీలత, తన భార్య, అత్త, మధ్యవర్తుల వేధింపులు భరించలేకపోతు న్నానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని శ్రవణ్ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. శ్రవణ్ తండ్రి నర్సింగం ఫిర్యాదుతో సీఐ శ్రీలత, నీలిమ, ప్రవీణ్కుమార్, నవీన్కు మార్, ఎడ్ల ప్రసన్న, బత్తుల వినోద, బత్తుల మధుకుమార్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్రెడ్డి తెలిపారు. శ్రవణ్ మృతితో కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద అతడి బంధు వులు ఆందోళన నిర్వహించారు. శ్రవణ్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
విలువలతో కూడిన విద్య సోషలిజంతోనే సాధ్యం
కరీంనగర్: సామాజిక స్పృహ, విలువలతో కూడిన విద్య కేవలం సోషలిజం ద్వారానే సాధ్యమని, నేటి విద్యార్థి, యువత సోషలిస్టు సమాజ నిర్మాణంలో క్రియాశీలక భాగస్వాములు కావాలని అఖిలభారత విద్యా పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్పట్నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణ తరగతులు రెండోరోజు కొనసాగాయి. శ్రీజాతీయత– దేశభక్తిశ్రీ అనే అంశాన్ని విద్యా పరిరక్షణ కమిటీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ పట్నాయాక్ బోధించారు. మార్క్సిస్టు మహోపాధ్యాయుల– జీవిత చరిత్రశ్రీ అనే క్లాసును పీడీఎస్యూ రాష్ట్ర మాజీ నాయకులు కొత్తపల్లి రవి వివరించారు. ‘నిర్మాణం– పని విధానం’ అంశాన్ని పీడీఎస్యూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడే ఆవుల అశోక్ బోధించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, నరేందర్, భాస్కర్, ఎర్ర అఖిల్ కుమార్, సహాయ కార్యదర్శులు సాయి, కర్క గణేశ్, సురేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
‘విపంచి’ పుస్తకావిష్కరణ
కరీంనగర్కల్చరల్: ఆరోగ్యకర, ఉత్తమ సమాజ నిర్మాణానికి విపంచి గేయ సంపుటిలోని పాటలు దోహదపడతాయని ప్రముఖ రచయిత కస్తూరి మురళీకృష్ణ అన్నారు. కవి నగునూరి రాజన్న వెలువరించిన ‘విపంచి’ గేయ సంపుటిని ఆదివారం భవానీ సాహిత్య వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించి మాట్లాడారు. పాటల రచనకు వయసుతో సంబంధం లేదని, కవి భావాల ప్రతిస్పందనలే కవితలు, పాటలుగా రూపొందుతాయన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న కవి, రచయిత, విమర్శకులు దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ, విపంచి గేయ సంపుటిలో బాలగేయాలు, భక్తి గేయాలు, పర్యావరణ, చైతన్య, అభ్యుదయ, జానపద, లలిత గేయాలతోపాటు కార్మిక గేయాలు కూడా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కవులు వేములవాడ ద్రోణాచారి, బొమ్మకంటి కిషన్, అన్నాడి గజేందర్రెడ్డి, దామరకుంట శంకరయ్య, ఎలగొండ రవి, గూడెపు కుమార్, ఏడెల్లి రాములు, మేడి చంద్రయ్య, వెల్ముల జయపాల్రెడ్డి, మానుపాటి రాజన్న, గుండు రమణయ్య, ఎన్.రాజయ్య తదితరులున్నారు. -
సర్కారు వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
జమ్మికుంట: సర్కారు ఆస్పత్రిలో వైద్యం సామాన్యుల ప్రాణాలమీదకు తెస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతోందని, సద్వినియోగం చేసుకోవాలని పాలకులు, అధికారులు ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం, వైద్యుల పర్యవేక్షణ లేనితనం శాపంగా మారుతోంది. జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు ఇవ్వగా.. సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. బాధితుల వివరాల ప్రకారం.. జమ్మికుంట పట్టణంలోని గణేశ్నగర్ చెందిన హరీశ్– కావ్య దంపతులు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగులు. కావ్య ప్రస్తుతం ఐదునెలల గర్భిణి. ఏఎన్ఎం సూచనల మేరకు ప్రతీనెల జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ నెల 10వ తేదీన నెలవారీ పరీక్షలకు ఆస్పత్రికి వచ్చింది. వైద్యురాలు ప్రణీత మల్టీ విటమిన్, ఐరన్ ట్యాబ్లెట్లు రాశారు. ఆస్పత్రి ఫార్మసీలో మందులు తీసుకుని వాడుతోంది. శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కావ్య ముఖంపై దద్దుర్లు వచ్చాయి. కడుపునొప్పితో ఇబ్బంది పడింది. ఆదివారం ఉదయం మల్టీ విటమిన్ మందులను పరిశీలించగా జూన్ 2025న గడువు ముగిసినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో సంప్రదించగా.. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో, విధుల్లో ఉన్న నర్సు సూపరిటెండెంట్తో ఫోన్లో మాట్లాడించారు. సదరు అధికారి ‘అక్కడ మందులు ఇచ్చి, వేరే మందులు తీసుకెళ్లండి’ అంటూ దబాయించాడు. దీంతో బాధితులు డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు మొదలు వేరే ఆస్పత్రిలో చికిత్స పొందాలని సూచించడంతో వెళ్లిపోయారు. కాగా.. ఈ విషయమై సూపరింటెండెంట్ శ్రీకాంత్రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఫార్మసిస్టుపై విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని సమాధానం ఇచ్చారు. జమ్మికుంట ఆస్పత్రిలో కాలం చెల్లిన మందులు మందులు వాడిన గర్భిణికి దద్దుర్లు, కడుపునొప్పి ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇచ్చిన వైద్యులు -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల గ్రామంలో ఇందిర్మ ఇల్లు రాలేదని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఎండీ భరన్ఖాన్ గతంలో డబుల్ బెడ్రూం లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. కాగా గ్రామంలో నిర్మించిన 26 డబుల్ బెడ్రూమ్లను శనివారం కలెక్టర్ పంపిణీ చేయగా అందులో భరన్ఖాన్ పేరు తొలగించారు. ఈ విషయంపై ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కాంగ్రెస్ నాయకులను, అధికారులను నిలదీశాడు. అక్కడితో ఆగకుండా ఆదివారం జిల్లెల్ల కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడిని ఇంటి కోసం రూ.50వేలు డిమాండ్ చేశావంటూ నిలదీశాడు. ఈ వీడియో స్థానికంగా వైరల్గా మారింది. తమ పార్టీ వారే మోసం చేశారని మనస్థాపానికి గురై పురుగులమందు డబ్బాతో చెరువు వద్దకు వెళ్లాడు. ఆత్మహత్య చేసుకోబుతున్నానంటూ స్నేహితులకు వీడియోకాల్ చేశాడు. వారు వెంటనే అతడి భార్య రుబీనాకు తెలపగా.. ఆమె చెరువు వద్దకు పరుగెత్తి పురుగులమందు డబ్బాను లాగిపడేసింది. అతడిని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లింది. భరన్ఖాన్కు భార్య రుబీనా, ముగ్గురు కొడుకులు ఉన్నారు. తంగళ్లపల్లి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రూ.50 వేలు డిమాండ్ చేశారంటూ ఆరోపణలు -
సింగరేణి కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి మేడిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు సింగం మల్లికార్జున్గౌడ్ (40) పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు, ఎస్సై ఉదయ్కిరణ్ కథనం ప్రకారం.. మల్లికార్జున్గౌడ్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన మల్లికార్జున్గౌడ్ గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య మంగ, కుమార్తెలు హర్షిణి, హసిని ఉన్నారు. మృతుడి సోదరుడు రాజబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిధర్మపురి: మండలంలోని నాగారం గ్రామానికి చెందిన పసుల అరుణ్ నెల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్పత్రికి వెళ్లి మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి.. దహన సంస్కారాల కోసం రూ.10వేలు అందించారు. కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు గాయాలుమెట్పల్లి: పట్టణంలో కుక్కల బెడద ప్రజలను అందోళనకు గురి చేస్తున్నాయి. స్థానిక దుబ్బవాడలో శుక్రవారం కుక్కల దాడిలో తొమ్మిది మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం దుబ్బవాడలో ఇద్దరు బాలురు నడుచుకుంటూ వెళ్తుండగా.. పాత బస్టాండ్ వద్ద ఒక బాలిక కుటుంబ సభ్యులతో కలిసి ఉండగా కుక్కలు దాడికి పాల్పడ్డాయి. గాయపడిన వీరిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. యువకుడి గల్లంతుగంగాధర: గంగాధర మండలం కొండన్నపల్లె శివారులోని వరద కాలువలో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లిన వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామడుగు మండలానికి చెందిన ఎనిమిది మంది కొండన్నపల్లె శివారులోని వరదకాలువలో చేపల వేటకు వచ్చారు. ఇర్ఫాన్(30) అనే యువకుడు ప్రమాదవశాత్తు వరదకాలవలో పడి గల్లంతయ్యాడు. గంగాధర్ ఎస్సై వంశీకృష్ణ రాత్రి వరకు రెస్క్యూటీంతో గాలించినా ఆచూకీ లభించలేదు. -
నీట్ ర్యాంకర్లకు అభినందనలు
కరీంనగర్: నీట్ యూజీలో జాతీయస్థాయి, రాష్ట్రస్థాయిలో 2వేల ర్యాంకు సాధించిన గుడికందుల సింధును ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి అభినందించారు. ప్రోత్సహించిన సింధు తండ్రి గుడికందుల సత్యంను శాలువాతో సన్మానించారు. సత్యం మాట్లాడుతూ పిల్లలు మరింత ఉన్నతస్థాయిలో ఎదగాలని, తన కూతురు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కొదురుపాకలో గొర్రెలు చోరీబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలో గొర్రెలు చోరీకి గురైనట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన నలుగురు గొర్రెలకాపర్లు తమ గొర్రెలను శనివారం రాత్రి బీ సైడ్ కాలనీ శివారులో మంద పెట్టుకున్నారు. ఆదివారం తెల్లవారు జామున లేచి చూసేసరికి పెంజర్ల తిరుపతికి చెందిన 21 గొర్రెలు, పెంజర్ల అంజయ్యవి 10, పెంజర్ల ఎల్లయ్యవి 7, మల్యాల బాలయ్యవి 10 గొర్రెలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. రెండు గొర్రెలు సమీప ఆలయాల వద్ద గల మురుగుకాలువలో పడ్డట్లు గుర్తించారు. మరో గొర్రె గ్రామ సమీపంలో పడిపోగా, ఇంకో గొర్రె తప్పించుకొని మంద వద్దకు వచ్చినట్లు వివరించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. -
మరుపురాని ‘కోట’ జ్ఞాపకం
● మధ్యంతర ఎన్నికలలో సాగర్జీతో కోట శ్రీనివాస్రావు ప్రచారం చందుర్తి(వేములవాడ): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరుగుతున్న సమయం. 2009లో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్బాబు గెలువగా, 2010లో పదవికి రాజీనామా చేశారు. దీంతో మధ్యంతర ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున కేంద్ర మాజీ హోంశాఖ సహాయమంత్రి చెన్నమనేని సాగర్రావు వేములవాడ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నమనేని సాగర్రావు తరఫున సినీనటుడు కోట శ్రీనివాస్రావు 2010లో రుద్రంగిలో ప్రచారానికి వచ్చారు. కోట శ్రీనివాస్రావు మరణవార్త విన్న రుద్రంగివాసులు, బీజేపీ శ్రేణులు ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. బీజేపీ నాయకుడు పడాల గణేశ్ ఆధ్వర్యంలో కోట శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో కోటకు నివాళి అర్పించారు. -
చూడచక్కని చెక్కపల్లి
వేములవాడరూరల్: పర్యావరణ పరిరక్షణలో ఆ పల్లె ముందుంది. గ్రామస్తులు అంతా ఏకతాటిపైకి వచ్చి ప్లాస్టిక్ను నిషేధించాలని ప్రతిన బూనారు. అనుకున్నదే తడవుగా గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాస్లను వినియోగించడం లేదు. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు వాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి. గ్రామస్తులు పాటిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యలపై ప్రత్యేక కథనం. ఓడీఎఫ్ ప్లస్లో ముందడుగు స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ క్యాంపెయిన్లో భాగంగా 2025 ఏప్రిల్ 2న కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించింది. ఈ గ్రామంలో ఇంకుడుగుంతలు, కంపోస్ట్షెడ్, స్కూళ్లలో టాయిలెట్స్, సామూహిక ఇంకుడుగుంతలు పరిశీలించారు. ఓడీఎఫ్ ప్లస్ బహిరంగ మలవిసర్జన రహితంగా ఘన, ద్రవ విసర్జన బయటకు కనిపించకుండ, రోడ్డుపై చెత్త వేయకుండా, ఇంకుడుగుంతలతో నీరు బయటకు రాకుండా చేయడంతో ఓడీఎఫ్ ప్లస్గా గ్రామాన్ని ఎంపిక చేశారు. చెక్కపల్లిలో 464 గృహాలు ఉండగా 2,320 జనాభా ఉన్నారు. చెత్తను సేంద్రీయ ఎరువుగా తయారు చేసి ఆ గ్రామంలోనే రైతులకు విక్రయించడం ఇప్పటి వరకు గ్రామపంచాయతీకి రూ.6,625 ఆదాయం వచ్చింది. గ్రామంలో ఎవరి ఇంటిలో అయినా శుభకార్యాలు జరిగినప్పుడు పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులు వాడకుండా గ్రామస్తులు తీసుకున్న నిర్ణయాలతో యజమాని స్టీల్ వస్తువులను వాడేలా గ్రామపంచాయతీ ఉచితంగా ఇచ్చేందుకు స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నివారణకు ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా గ్రామంలో ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపడుతున్నారు. ప్రతీ ఇంటితోపాటు గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలైన ప్రైమరీ, హైస్కూళ్లలో కూడా ఈ విధానం ఉండాలని గ్రామస్తులందరూ, కమిటీ సభ్యులు ఇంకుడుగుంతలు నిర్మించారు. గ్రామంలో డ్రెయినేజీ అనేది లేకుండా ప్రతి ఒక్కరు ఇంటివద్ద ఇంకుడుగుంతలనే ఏర్పాటు చేసుకున్నారు. దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకుండా పేపర్, క్లాత్ బ్యాగుల అమ్మకాలు కూడా ప్రారంభించారు. ఉత్తమ గ్రామపంచాయతీగా మూడుసార్లు అవార్డు రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే వేములవాడరూరల్ మండలం చెక్కపల్లిని ఉత్తమ గ్రామపంచాయతీగా 2020, 2021, 2023 సంవత్సరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లాలో ఉన్న అన్ని గ్రామపంచాయతీలను పరిశీలించిన జిల్లా అధికారులు ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక చేస్తారు. అందులో చెక్కపల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకున్న జిల్లా యంత్రాంగం ఈ గ్రామాన్ని ఉత్తమ జీపీగా ఎంపిక చేశారు. – పర్యావరణ పరిరక్షణలో అగ్రభాగం – ఓడీఎఫ్ ప్లస్లో ముందడుగు – జిల్లాకే ఆదర్శం ఆ గ్రామం అందరి సహకారంతోనే చెక్కపల్లి గ్రామం ఓడీఎఫ్ ప్లస్లో ముందుంజలో ఉండి ఉత్తమ గ్రామపంచాయతీగా మూడుసార్లు అవార్డు అందుకోవడంలో గ్రామస్తు ల సహకారం ఉంది. గ్రామ ంలో ప్రతి ఒక్కరి కృషితోనే స్వచ్ఛభారత్, హరి తహారం, ఇంకుడుగుంతలు అందరి సహకారంతోనే విజయవంతమై ఆదర్శంగా నిలిచింది. – గడ్డం చందన, పంచాయతీ కార్యదర్శి, చెక్కపల్లి -
కారడవి కాదు.. సాగునీటి కాలువ
వీణవంక: వానాకాలం సీజన్ ప్రారంభమైంది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వ్యవసాయ బావుల వద్ద నార్లు పోసిన రైతులు నాట్లు వేస్తున్నారు. మండల ప్రజలకు తాగు, సాగునీటికి ఎస్సారెస్పీ నీటిపైనే ఆధారపడతారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో గత యాసంగిలో చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు చేరలేదు. వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో మళ్లీ రైతుల్లో కలవరం మొదలైంది. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామం ప్రధాన కాల్వ నుంచి డీబీఎం–15 ప్రారంభమై పోతిరెడ్డిపేట మీదుగా బేతిగల్, వల్భాపూర్, నర్సింగాపూర్ గ్రామాల వరకు నీరు చేరుతుంది. దీని పరిధిలో 9 ఉప కాల్వలుండగా.. 1,200 ఎకరాలకు నీరు పారుతుంది. డీబీఎం–15 కాల్వ చెత్త, చెట్లతో పేరుకుపోయింది. చెట్లను తొలిగిస్తే దిగువన ఉన్న గ్రామాల వరకు నీరు చేరనుంది. కానీ అధికారులు చెట్లను తొలిగించకపోవడంతో రానున్న రోజుల్లో ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తే చివరి ఆయకట్టు వరకు చేరదని రైతులు వాపోతున్నారు. పోతిరెడ్డిపేట బ్రిడ్జి నుంచి బేతిగల్ వరకు చెత్త పేరుకుపోయింది. జగ్గయ్యపల్లి– బేతిగల్ గ్రామాల మధ్య ఉన్న ఉప కాల్వ, కనపర్తి, వల్భాపూర్ గ్రామాలకు వెళ్లే ఉప కాల్వల దుస్థితి కూడా అధ్వానంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారులు స్పందించి నీటిని విడుదల చేసే లోపు చెత్తను తొలిగించాలని కోరుతున్నారు. డీబీఎం–15 కెనాల్లో పేరుకుపోయిన చెత్త చివరి ఆయకట్టు ప్రశ్నార్థకం నీటిని వదిలే లోపు చెత్తను తొలగించాలంటున్న రైతులు -
మేధస్సుకు పదును చదరంగం
● అడిషనల్ డీసీపీ వెంకటరమణ ● ముగిసిన 3వ ఆలిండియా జూనియర్, ఓపెన్ చెస్ టోర్నీ కరీంనగర్స్పోర్ట్స్: చిన్నారుల మేధస్సుకు చదరంగం పదును పెడుతుందని కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటరమణ పేర్కొన్నారు. కరీంనగర్లోని వీకన్వెన్షన్లో జీనీయస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న 3వ ఆలిండియా జూనియర్, ఓపెన్చెస్ చాంపియన్షిప్– 2025 పోటీలు ఆదివారంతో ముగిశాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి అడిషనల్ డీసీపీ వెంకటరమణ హాజరయ్యారు. విజేతలకు ట్రోపీలు, నగదు పురస్కారం అందించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాకేంద్రంగా జాతీయ పోటీలు జరగడం అభినందనీయమన్నారు. చెస్తో చిన్నారుల్లో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారత చదరంగ క్రీడాకారులు నంబర్వన్ స్థానంలో నిలుస్తున్నారని తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ డైరెక్టర్, కోచ్ కంకటి అనూప్కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో జిల్లాలో 3వ ఆలిండియా పోటీలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య, అర్బిటర్లు బొల్లం సంపత్, అమిత్, కంకటి సృజన్కుమార్, కె.సతీశ్బాబు పాల్గొన్నారు. -
చేతకాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగించండి
గోదావరిఖని: ‘మీకు చేతకాకపోతే.. మీకు నడపడం రాకపోతే.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్కు అప్పగిస్తే మూడురోజుల్లో ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం’ అని మాజీమంత్రి జగదీశ్వర్రెడ్డి సవాల్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వ్యవసాయ రంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను గోస పెడుతోందన్నారు. ప్రస్తుతం సాగునీరు అందించేందుకు కాళేశ్వరం జోన్ పరిధిలోని ప్రాజెక్టులు సిద్ధంగా ఉన్నాయని, కావాలనే కాళేశ్వరం నీళ్లను రైతులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుకు సాగి సుభిక్షంగా ఉండేదని గుర్తుచేశారు. కమీషన్లు, కంపు మాటలు తప్ప 18 నెలల్లో జరిగిందేమీ లేదన్నారు. అజ్ఞాని ముఖ్యమంత్రిగా ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సుభిక్షంగా ఉంచితే సీఎం రేవంత్రెడ్డి అప్పల పాలు చేస్తున్నారని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో మేల్కొల్పిందే కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ పాలనలో సుభిక్షంగా ఉన్న తెలంగాణను సీఎం రేవంత్రెడ్డి అప్పుల పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుజోన్ పరిధిలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కన్నెపల్లి బ్యారేజీలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, లక్షలాది ఎకరాలకు నీళ్లందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇప్పటికే రెండుపంటలు ఎండబెట్టారన్నారు. అన్నిరంగాలు వెనకపడి పోయాయన్నారు. నిరంతరం కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆదాయంలో రూ.15వేల కోట్లు తగ్గిందన్నారు. కేసీఆర్ పాలనలో ఏటా రూ.15వేల కోట్ల ఆదాయం పెరిగిందన్నారు. సమావేశంలో నాయకులు కౌశిక హరి, నడిపెల్లి మురళీధర్రావు, పీటీ స్వామి, పెంట రాజేశ్, బొడ్డు రవీందర్, మారుతి చిలకలపల్లి శ్రీనివాస్, అచ్చే వేణు, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మూడురోజుల్లో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం అజ్ఞాని రేవంత్ పాలనలో తిరోగమనంలో రాష్ట్రం మాజీ మంత్రి జగదీశ్వర్రెడ్డి ధ్వజం -
జువెల్లరీ షాపులో చోరీ
జమ్మికుంట: జమ్మికుంటలోని జువెల్లరి షాపులో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పట్టణంలోని ధనాల కొండయ్య కాంప్లెక్సులో హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన భోగి వంశీకృష్ణ అనే వ్యక్తి బ్రాండ్ కళ్యాణి జువెల్లరి షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం షాపు మూసి ఇంటికెళ్లాడు. శనివారం ఉదయం పక్కన గల షాపు వ్యక్తులు జువెల్లరి షాపు షెటర్ పగలగొట్టి ఉందని సమాచారమివ్వడంతో షాపు వద్దకొచ్చి పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు 2 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు గుర్తించాడు. పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకొని కరీంనగర్ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. హుజూరాబాద్ డివిజన్ ఏసీపీ మాధవి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలడిగి తెలుసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కిరాణ దుకాణంలో.. పట్టణంలోని ఓ కిరాణం షాపులో చోరి జరిగింది. సీఐ వివరాల ప్రకారం.. కొండూరి కాంప్లెక్స్ పరిధిలో మున్సిపల్ పరిధి రామన్నపల్లి గ్రామానికి చెందిన కొలకాని గణేశ్ అనే వ్యక్తి కిరాణం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. షాపు షెటర్ పగలగొట్టి గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడినట్లు గుర్తించాడు. రూ.20వేల నగదు చోరీ జరిగిందని బాధితుడి ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
సామాజిక పరివర్తనకు మార్గం కవిత్వం
కరీంనగర్కల్చరల్: సామాజిక పరివర్తనకు కవిత్వం మార్గం వేస్తుందని విశ్రాంత ఐఏఎస్ అధికారి సి. పార్థసారథి పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ జిల్లా శాఖ నిర్వహించిన రజనీశ్రీ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కార ప్రదానం కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కవిత్వం మాటల సమాహారం మాత్రమే కాదని, అది భావోద్వేగాల ప్రతిబింబంగా, విలువల్ని నిలబెట్టే సాధనంగా సమాజంపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మల్లారెడ్డి మురళీమోహన్ రచించిన శ్రీనిశాచరుడి దివాస్వప్నంశ్రీ కవిత్వ సంపుటికి రజినీశ్రీ పురస్కారం కింద రూ.11 నగదు బహుమతి, మెమోంటోతో సత్కరించారు. జాతీయ సాహిత్య పరిషత్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాజుల రవీందర్ అధ్యక్షత వహించిన కార్యక్రమంలో పురస్కార ప్రదాత, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంయుక్త కార్యదర్శి జీవీ శ్యాంప్రసాద్లాల్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, ప్రముఖ సాహితీవేత్త డా.గండ్ర లక్ష్మణరావు, ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ తదితరులున్నారు. -
అట్టహాసంగా ఆల్ ఇండియా చెస్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో డెమొక్రటిక్ చెస్ ఫెడరేషన్ సహకారంతో వీ కన్వెన్షన్లో శనివారం 3వ ఆల్ ఇండియా జూనియర్, ఓపెన్ చెస్ చాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. నిర్వాహకులు స్విస్ లీగ్ పద్ధతిలో 8 రౌండ్ల వరకు పోటీలు ఏర్పాటు చేయగా, తొలిరోజున నాలుగురౌండ్ల వరకు నిర్వహించారు. అంతకుముందు పోటీలను జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి బి.శ్రీనివాస్గౌడ్, ఉద్యోగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు దారం శ్రీనివాస్రెడ్డి, సంగం లక్ష్మణ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కరీంనగర్ అంటేనే క్రీడాపోటీల నిర్వహణకు, క్రీడాకారులకు నిలయం అన్నారు. జాతీయస్థాయి చెస్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం గర్వంగా ఉందని, నిర్వాహకులను అభినందించారు. ప్రస్తుత కాలంలో విద్యార్థులందరూ విశ్వనాథన్ ఆనంద్, గుకేష్, ప్రజ్ఞానంద్, అర్జున్, కోనేరు హంపి లాంటివారిని స్ఫూర్తిగా తీసుకొని ఎదగాలని సూచించారు. పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి రూ.లక్షకు పైగా నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు జీనియస్ అకాడమీ డైరెక్టర్ కోచ్ కంకటి అనూప్కుమార్ తెలిపా రు. అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. 600 మందికి పైగా క్రీడాకారులు హాజరు -
మాటే మంత్రం కావాలి.. ప్రభావం చూపాలి
హుజూరాబాద్: ప్రాథమిక విద్య సమయంలోనే విద్యార్థులపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెడితే ఉన్నత విద్యకు వచ్చే సరికి సరైన దారిలో ముందుకెళ్లే అవకాశముంటుంది. కాగా, గతం, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విద్యాబోధనలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లిదండ్రులు సైతం తపన పడుతున్నారు. దానికి తగ్గటుగా డిజిటల్ బోధన అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటుండగా, ఉన్నత విద్యకు వచ్చేసరికి చాలా మందిలో క్రమశిక్షణ లోపిస్తుండటంతో ఉన్నత విద్య ప్రమాదంలో పడిపోతోంది. కుదరని సత్సంబంధాలు విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సత్సంబంధాలు కుదరడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు తోడ్పాటు లేకపోవడం, వారి మంచి ప్రవర్తనను అభినందించకపోవడం, వారికి ఎక్కువ అవకాశాలు కల్పించకపోవడం, సృజనాత్మక సామర్థ్యాలు, అభిరుచులను ప్రోత్సహించకపోవడం, జీవిత ప్రాముఖ్యతను తెలుసుకునేలా చెప్పకపోవడం, వారిలో భద్రతాభావనను పెంపొందించకపోవడం తదితర కారణాలతో సత్సంబంధాలు లేక అర్థవంతమైన బోధన జరగడం లేదు. ఫలితంగా విద్యార్థుల్లో చదువు భరోసా కంటే భయాన్ని రెట్టింపు చేస్తోంది. తల్లిదండ్రులే రోల్ మోడల్ ● పిల్లల్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులే రోల్మోడల్. బాల్యంలో తల్లిదండ్రులు ఏం చెబితే అది చేస్తారు. ఏది నేర్పిస్తామో అదే పాటిస్తారు. ఈ విషయాన్ని కీలకంగా భావించాలి. ● వేలకు వేలు ఫీజులు చెల్లించి బడికి పంపిస్తే గురువులే పిల్లల్ని తీర్చిదిద్దుతారని భావించడం భ్రమ. ● మనం ఎంత బిజీ జీవితంలో ఉన్నా.. వారితో కలిసి ఆహారం తీసుకోవం మరువద్దు. అలాగే పిల్లలతో ఆటలాడాలి. అవి ఏ ఆటలైనా సరే.. క్యారమ్స్, గల్లీ క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి ఆటలు ఆడటం మంచిది. అలాగే వారితో కలిసి పుస్తక పఠనం చేయాలి. పిల్లలు చదువుతున్న పుస్తకాల్ని చూసి అందులోని మంచి విషయాల్ని వివరించాలి. ● పిల్లలతో గడిపే సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా ఉండాలి. వీడియో గేమ్స్, ఫోన్లో వీడియోలు చూపించడం చేస్తుంటాం. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ● పెద్దల మధ్య ఎన్నో జరగవచ్చు. వాటిని పిల్లల ముందు మాట్లాడుకోకూడదు. వారు అలాంటి వారు.. ఇలాంటి వారంటూ వ్యతిరేక భావనల్ని నూరిపోయొద్దు. అలాగే ఒకరితో మరొకరిని పోల్చడం కూడా మంచిది కాదు. ● పిల్లలతో గడిపే సమయంలో అతి గారాబానికి అవకాశమిస్తారు. ఏదీ అడిగితే అది కొనిస్తారు. అడిగిన వెంటనే కొనిస్తే ఆ వస్తువు విలువ పిల్లలకు తెలియదు. అలాగే పిల్లల బ్లాక్మెయిలింగ్కు పెద్దలు భయపడడం ఇది వారిని చెడగొడుతుంది. ఏమైనా వారు గట్టిగా కోరుతుంటే దాని ప్రాధాన్యం, లాభనష్టాల్ని వివరించి ఆ తర్వాత ఇప్పించవచ్చు. ● పిల్లలపై కోపతాపాలు వద్దు. వారి అభిప్రాయాలపై వెంటనే వ్యతిరేకత వ్యక్తం చేయొద్దు. వారు చెప్పింది పూర్తిగా విని మంచి చెడుల్ని చెప్పాలి. మీ పిల్లాడు చదువుపై ఏకాగ్రత చూపించట్లేదని ఎవరైనా చెబితే కోపం వ్యక్తం చేస్తూ వారు మరింత కఠినంగా ఉండేలా చేయడం మంచిది కాదు. ● పిల్లల్ని కొట్టడం, తిట్టడం.. ఆడ, మగ తేడా చూపించడంతో ఏకాగ్రత దెబ్బతిని, వ్యతిరేక భావనల్ని వారు పెంచుకుంటారు. ప్రవర్తనను బట్టి వారిని తీర్చిదిద్దాలి -
అమ్మ నేను చనిపోతున్నా..
ముస్తాబాద్(సిరిసిల్ల): కన్నవారిని కట్టుకున్న వారిని పోషించుకునేందుకు పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలసజీవి అర్ధంతరంగా తనువు చాలించాడు. కడసారి చూపు కోసం పరితపించిన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తరలించుకుపోయేందుకు డబ్బులు లేక ఇక్కడే ఖననం చేసేందుకు అంగీకరించడం విషాదకరం. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో బచ్చు చౌదరి(33) అనే వలస కూలీ శుక్రవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకున్నాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం మాల్డ జిల్లా చోటుపూర్ వెస్ట్పారకు చెందిన బచ్చు చౌదరి 10 రోజుల క్రితం చీకోడుకు మేసీ్త్ర పనులు చేసేందుకు వచ్చాడు. ఈనేపథ్యంలో స్వగ్రామంలోని కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందాడు. తన తల్లికి ఫోన్చేసి ‘అమ్మ నేను చనిపోతున్నా.. బతకాలని లేదంటూ..’ చెప్పి చెట్టుకు ఉరివేసుకున్నాడు. గమనించిన కార్మికులు బచ్చు చౌదరిని ఆసుపత్రికి తరలించేలోగా మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్నారు. మృతదేహన్ని పశ్చిమబెంగాల్కు తరలించాలంటే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుందని, తినేందుకు తిండిలేక ఇబ్బంది పడుతున్నామని వారు పేర్కొన్నారు. బచ్చు చౌదరికి అంతిమ సంస్కారాలు ముస్తాబాద్లోనే నిర్వహించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ తెలిపారు. ఎస్సై గణేశ్ ముస్తాబాద్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుని స్నేహితుడు బిష్ణుచౌదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. వలసజీవి బలవన్మరణం కడసారి చూపునకు నోచుకోని కుటుంబం ముస్తాబాద్లోనే వలసజీవి ఖననం -
రాజన్నసేవలో ప్రముఖులు
వేములవాడ: శ్రీరాజరాజేశ్వర స్వామిని హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహెచ్.పంచాక్షరి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వచనాలతో ఆహ్వానించి, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కోడెముక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు. వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్కుమార్జాదవ్, వేములవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అర్ర ప్రవీణ్కుమార్, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఉన్నారు. జ్యోతిష్మతి విద్యార్థికి రూ.12లక్షల ప్యాకేజీతో ఉద్యోగంతిమ్మాపూర్: మండలంలోని జ్యోతిష్మతి కళాశాలలో సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న కోగిల వారజ హైదరాబాద్లోని మల్టీ నేషనల్ కంపెనీలో పైథాన్ బ్యాకెండ్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించింది. వార్షిక వేతనం రూ.12 లక్షలు ఉంటుందని చైర్మన్ జువ్వాడి సాగర్రావు తెలిపారు. సాంకేతిక నైపుణ్యం, కళాశాల శిక్షణ ఫలితమని అన్నారు. జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు ఆధునిక సాంకేతికతలైన పైథాన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. సాగర్రావుతోపాటు సెక్రటరీ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి.అనిల్కుమార్, అకాడమిక్స్ డాక్టర్ పీకే వైశాలి, విభాగాధిపతి డాక్టర్ ఆర్.జగదీషన్, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. -
జీజీహెచ్లో అరుదైన శస్త్రచికిత్స
కోల్సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యు లు శనివారం అరుదైన దంత శస్త్ర చికిత్స చేశా రు. ముత్తారం మండలానికి చెందిన ఇనుముల ఉప్పలయ్య శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తో శనివారం ఆస్పత్రికి వచ్చాడు. పరీక్షించిన డెంటల్ వైద్యులు పలు పరీక్షలు చేశారు. లుడ్విగ్స్ ఆంజినా అనే అరుదైన సమస్యగా, వేగంగా ఇన్ఫెక్షన్ సోకుతుందని గుర్తించారు. పేషెంట్కు వెంటనే శస్త్రచికిత్స చేసి అర్ధ లీటరు వరకు చీము తొలగించారు. శస్త్రచికిత్సలో డాక్టర్లు శ్రవణ్, హెచ్వోడీ సుమలత, లహరి, నయన పాల్గొన్నారు. పేషెంట్కు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులను ఆస్పత్రి సూపరింటెండెంట్ దయాల్సింగ్, సిమ్స్ ప్రిన్సిపాల్ హి మబింద్ సింగ్, ఆర్ఎంవో రాజు అభినందించారు. అంగన్వాడీ టీచర్ మృతికి కారణమైన వ్యక్తి రిమాండ్ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ మాజోజ్ స్వరూప(52) మృతికి కారణమైన వ్యక్తిని పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపిన వివరాలు. అంగన్వాడీ టీచర్ స్వరూప సమీపంలోని తండాలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. ఈనెల 7న విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా అదే తండాకు చెందిన కొడావత్ నరేశ్ ఇంటి వద్ద దించుతానని బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో మద్దిమల్లకు కాకుండా గుండారం వైపు బైక్ మళ్లించాడు. భయాందోళనకు గురైన స్వరూప కేకలు వేసిన ఆపకపోవడంతో బైక్ పై నుంచి దూకింది. తీవ్రంగా గాయపడ్డ స్వరూప ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. మృతురాలి కొడుకు విష్ణుసాగర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి కారణమైన కొడావత్ నరేశ్ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రెండోసారి పట్టుబడిన జగదీశ్ కరీంనగర్క్రైం: కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగాధర వద్ద ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.90వేలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు పట్టుబడిన పీఆర్ ఏఈ జగదీశ్.. గతంలో కూడా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జగదీశ్ లంచం తీ సుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం ఇది రెండోసారి. తొలిసారి 2017లో ఏఈ జగదీశ్ కరీంన గర్ పీఆర్ ఏఈగా పనిచేశారు. ఆ సమయంలో బొమ్మకల్కు చెందిన సీసీ రోడ్డు పనుల విషయంలో ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.1.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. శనివారం మళ్లీ రూ.90 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. గతంలో ఓసారి పట్టుబడినా ఆయన తీరుమారలేదు. ఇది ఇలా ఉండగా శనివారం సాయంత్రం వరకూ కరీంనగర్లోని భాగ్యనగర్లో గల జగదీశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. జగదీశ్ బంధువులు, ఆయన ఆస్తులపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పెద్దపల్లి పీఆర్ ఆఫీసులో తనిఖీలు పెద్దపల్లిరూరల్: ఏఈ జగదీశ్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. ఆ తర్వాత పెద్దపల్లిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి చే రుకున్నారు. అక్కడ తనిఖీలు చేశారు. ఏసీడీ డీఎ స్పీ విజయ్కుమార్ వివరాలు వెల్లడించారు. రాజు నుంచి లంచం తీసుకుంటుండగా జగదీశ్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకుని పెద్దపల్లిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయానికి వచ్చామన్నారు. -
హత్య కేసులో నిందితుల అరెస్టు
ధర్మపురి: యువకుడిని హత్య చేసిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసి శనివారం రిమాండ్కు పంపినట్లు సీఐ రాంనర్సింహారెడ్డి తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్ల డించారు. మండలంలోని దోనూర్కు చెందిన గొల్లన రవి, నాగరాజు అన్నదమ్ముల కొడుకులు. ఇరువురి ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. కొంతకాలంగా గెట్టు విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రవికి ఇందిరమ్మ ఇల్లు రావడంతో నిర్మాణం చేపడుతున్నాడు. ఈనెల 10న రాత్రి ఇంటి స్థలం విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగగా నాగరాజు ఆయన తల్లిదండ్రులు అమ్మక్క, బక్కయ్య ప్రోత్సాహంతో రవిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. రవి కుమారుడు విష్ణు అడ్డుకునేందుకు యత్నించగా.. అతడిపైనా దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు రవి, విష్ణును ఆస్పత్రికి తరలించారు. రవి అప్పటికే మృతి చెందినట్లు జగిత్యాల వైద్యులు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాగరాజు, అతడికి సహకరించిన అమ్మక్క, బక్కయ్యను శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు ఉదయ్కుమార్, రవి కుమార్ ఉన్నారు. -
గడ్డి మందుతాగిన ఆంధ్రా మేసీ్త్ర మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన మేసీ్త్ర ఎనమల యేసుబాబు(55) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురై బుధవారం గడ్డిమందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన యేసుబాబును మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో స్థానికంగానే వైద్యం అందించాలని కుటుంబ సభ్యులు కోరడంతో ఇక్కడే చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి శనివారం మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం ఒంగోలుకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని విజయపురి కాలనీకి చెందిన అంకం కృష్ణవేణి (28) ఈనెల 3న భవనంపైనుంచి పడగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. కృష్ణవేణి మరో ఇంటికి మారడం కోసం సామాన్లు సర్దుతుండగా రాత్రి సమయంలో పిల్లలు మొదటి అంతస్తులో ఆడుకుంటున్నారు. వారు పడిపోతారన్న తొందరపాటులో వారిని కాపాడే క్రమంలో ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కింద పడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కాగా.. కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందింది. ఆమె భర్త అంకం తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. వ్యసనాల కోసం చోరీ.. యువకుడి అరెస్ట్చొప్పదండి: ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడుతూ డబ్బు సరిపోక చోరీకి పాల్పడి పట్టుబడ్డ యువకుడి ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రాగంపేటకు చెందిన కొలిపాక మధుకుమార్ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ వ్యసనాలకు బానిసయ్యాడు. డబ్బు కోసం దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఈ నెల 8న పట్టపగలు గ్రామంలోని కొమురయ్య అనే వ్యక్తి ఇంట్లో ఎవరూలేని సమయంలో లోపలికి ప్రవేశించి బీరువాలోని తులం బంగారం, రూ.22 వేల నగదు ఎత్తుకెళ్లాడు. అదే రోజు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై నరేశ్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా మధును గుర్తించి శనివారం రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై నరేశ్రెడ్డి, ఏఎస్సై సమ్మయ్య, అనిల్కుమార్, శ్రీధర్, ఎండీ ఖలీఫాను సీఐ ప్రదీప్కుమార్ అభినందించారు. -
ఎమర్జెన్సీని తలదన్నేలా మోదీ పాలన
కరీంనగర్: దేశంలోని ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాయడంలో నాటి ఎమర్జెన్సీని తలదన్నే రీతిలో నేడు మతం ముసుగులో మోదీ ప్రభుత్వం దుర్మార్గపూరితపాలన కొనసాగిస్తున్నదని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విమర్శించారు. శనివారం స్థనిక జార్జిరెడ్డినగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో పీడీఎస్ఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల్లో హాజరై మాట్లాడారు. దేశంలో విద్యార్థి, యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. సీపీఐ (ఎం.ఎల్) మాస్లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు నందిరామయ్య మాట్లాడుతూ.. దేశంలో ప్రభుత్వాలు విద్యను వ్యాపారమయంగా మార్చాయని మండిపడ్డారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కాంపాటి పృథ్వీ, ఎస్. అనిల్ మాట్లాడుతూ విద్యారంగంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న విద్యార్థి వ్యతిరేక సంస్కరణలపై సంఘటితంగా ఉద్యమించాలన్నారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు రమేశ్ ‘మూఢనమ్మకాలు– సైన్స్’పె అవగాహన కల్పించారు. ‘విద్యారంగంలో మార్పులు –జాతీయ విద్యా విధానం’పై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.నరసింహారావు, భాస్కర్, ఎర్ర అఖిల్ కుమార్, నరేందర్, సహాయ కార్యదర్శులు సాయి, కర్క గణేశ్, వెంకటేశ్, రాకేశ్, సురేశ్, కోశాధికారి మహేందర్, రాష్ట్ర నాయకులు అంగిడి కుమార్, ఎల్.అనిల్, మునిగల శివ, అజయ్, గౌతం, నరేందర్, సీతారాం, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య -
మెడికల్ మాఫియాకు షాక్!
● వేణు ఏజెన్సీ యజమానికి 14 రోజుల జైలు ● నకిలీ తీగలాగితే కదిలిన డొంక ● కరీంనగర్లో మొట్టమొదటి రిమాండ్ ● నకిలీ మూలాలపై దృష్టిపెట్టిన అధికారులుకరీంనగర్టౌన్: కరీంనగర్ మెడికల్ మాఫియాకు షాక్ తగిలింది. ఇన్నాళ్లు యథేచ్ఛగా నకిలీ మందులు తెచ్చి రోగుల ప్రాణాలతో చెలగాటమాడిన మాఫియాపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు తప్పని పరిస్థితుల్లో దృష్టిసారించారు. దీంతో నకిలీ మందులు తెచ్చి విక్రయిస్తున్న మెడికల్ వ్యాపారులకు వణుకు మొదలైంది. నగరంలో నకిలీ మందులు సరఫరా చేసే కొన్ని ఏజెన్సీల యజమానులు నకిలీ మందులను గుట్టుచప్పుడు కాకుండా చీకటిప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సన్ఫార్మ కంపెనీ ఫిర్యాదుతో.. పక్షవాతం వచ్చిన రోగులకు వాడే లెవిపిల్–500 మందులను ప్రముఖ సన్ఫార్మ కంపెనీ తయారు చేస్తుండగా బిహార్, ఉత్తరప్రదేశ్, కలకత్తా వంటి ప్రాంతాల నుంచి అదే లేబుల్, అదే పేరుతో అసలును పోలిన లెవిపిల్–500 మందును నకిలీగా మార్చారు. నకిలీ మందులను తెప్పించి రిటైల్ షాపులకు అంటగట్టి దందా సాగించడంతో సన్ఫార్మ కంపెనీ దృష్టిపడింది. దీంతో సన్ఫార్మ కంపెనీ ప్రతినిధులు వేణు ఏజెన్సీలో మందులను తీసుకెళ్లి ల్యాబ్లో పరీక్షించగా అవి తాము తయారుచేసినవి కావని, నకిలీ మందులని తేలింది. వీటితో రోగులుకు కలిగే నష్టాన్ని గుర్తించిన సన్ఫార్మ కంపెనీ వెంటనే హైదరాబాద్లోని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈనెల 4న వేణు ఏజెన్సీపై నకిలీ మందుల విక్ర యం కింద కేసు నమోదు చేశారు. అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న డ్రగ్ కంట్రోల్ అధికారులు హై దరాబాద్ నుంచి వచ్చిన ఆదేశాలతో వేణు మెడికల్ ఏజేన్సీలో నకిలీ మందుల స్టాక్ను సీజ్ చేశారు. అ ప్పటికే ఆ ఏజెన్సీపై కేసు నమోదు కావడంతో య జమాని వేణుగోపాల్ పరారయ్యాడు. ఎట్టకేలకు అతడిని పట్టుకొని శుక్రవారం రిమాండ్ చేశారు. మొట్టమొదటి రిమాండ్ ఇన్నాళ్లు డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు పెట్టిన కేసులన్నీ తూతూ మంత్రంగానే ఉండేవి. కేసు ఏదైనా బెయిల్ తీసుకొని యథేచ్ఛగా మళ్లీ దందా నడిపేవారు. కానీ, నకిలీ మందుల వ్యవహారంపై సన్ఫార్మా తన ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా ఏజెన్సీ డీలర్షిప్ రద్దు చేయడంతో పాటు కేసు పెట్టడంతో నిందితుడిని కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇది కరీంనగర్ డ్రగ్ కంట్రోల్ అధికారులు చేసిన మొదటి రిమాండ్ అని మెడికల్ వర్గాలు చెబుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక.. వేణు ఏజెన్సీ యజమాని అరెస్ట్తో నకిలీ మందుల మాఫియాకు మొట్టమొదటి షాక్ తగిలింది. ఇప్పుడు అధికారులు తీసుకునే చర్యలపై, నకిలీ మందుల సరఫరా మూలాలపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి పడింది. కాగా స్థానిక డాక్టర్లు, వ్యాపారులు అత్యధికంగా ఈ మాఫియా దందాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ వ్యవహారాలకు ఆజ్యం పోస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా డ్రగ్ కంట్రోల్ అధికారులు నకిలీ దందాను మామూలుగా తీసుకోకుండా కరీంనగర్లోని సుమారు 400 మెడికల్ ఏజెన్సీలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలను రక్షించేలా చర్యలు తీసుకుంటారా, లేదా మళ్లీ పాత కథే పునరావృతమవుతుందా వేచిచూడాల్సిందే. -
యువరానర్ నుంచి ఆర్డర్.. ఆర్డర్ వరకు
● జడ్జీలుగా వేములవాడ యువతులు ● టాలెంట్కు అడ్డురాని పేదరికం ● కష్టపడి చదివి.. ఇష్టంగా గెలిచి ● ఆదర్శంగా యువ జడ్జీల విజయగాథవేములవాడ: జడ్జీ.. కా వాలనే లక్ష్యానికి కష్టాలు తలొగ్గాయి. లక్ష్యం బలమైనది అయితే వి జయం దరిచేరుతుందనేందుకు వేములవాడకు చెందిన యువతులే నిదర్శనం. పదో తరగతి వరకు పుట్టిన ఊరిలోనే చదివిన వారు.. ‘యువరానర్ అనే స్థాయి నుంచి ఆర్డర్.. ఆర్డర్’.. అనే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో అడుగులు వేశారు. ఒక్కో అడుగును లక్ష్యం వైపు తీసుకెళ్లారు. మొదట లా పట్టా సాధించి.. వేములవాడ బార్ అసోసియేషన్లో సభ్యులుగా చేరారు. కోర్టులో న్యాయ వ్యవహారాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఆ అనుభవం.. చదువుకున్న జ్ఞానం.. కష్టపడేతత్వంతో జడ్జీలుగా ఎంపికయ్యేందుకు మార్గమయ్యాయి. వేములవాడకు చెందిన ప్రియాంక, వందన, ప్రవళిక, జాహ్నవిలు జడ్జీలుగా ఎంపికయ్యారు. వారి సక్సెస్ స్టోరీ ఈ సండే స్పెషల్. కృషితోనే విజయం వేములవాడకు చెందిన ఈ నలుగురు యువతులు ముందుగా స్థానిక బార్ అసోసియేషన్ సభ్యులుగా చేరి జూనియర్ లాయర్లుగా తమ ప్రయాణం ప్రారంభించారు. కోర్టులో కేసుల ట్రయల్స్ చూడడంతోపాటు వాటి నుంచి రోజుకో కొత్త విషయం నేర్చుకున్నారు. ఆ అనుభవాలను తమ విజయానికి బాటలుగా వేసుకున్నారు. కోచింగ్ తీసుకోకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యారు. చిన్నపట్టణాల నుంచి వచ్చిన వారు పెద్ద స్థాయి ఉద్యోగాలు సాధించలేరనే అపోహలను వీరు తొలగించారు. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. -
స్థానిక సమరంలో కాంగ్రెస్దే విజయం
కరీంనగర్కార్పొరేషన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై శనివారం నగరంలోని ఇందిరాచౌక్లో సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వెనుకబడినవర్గాల డిమాండ్ అయిన 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న కాంగ్రెస్కు బీసీలు రుణపడి ఉంటారన్నారు. అయితే రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందో బీజేపీ నాయకులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఎండీ తాజ్, గడ్డం విలాస్రెడ్డి, మోసిన్, అహ్మద్అలీ, పొన్నం శ్రీనివాస్గౌడ్, రాచకొండ చక్రధర్రావు, విద్యాసాగర్, సతీశ్, కిషన్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. బుద్ధుడి బోధనలు అనుసరణీయంకరీంనగర్కల్చరల్: బుద్ధుడి ఆలోచనలు, బోధనలు అనుసరణీమమని సైనిక్ సమత దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్ల వెంకటేశ్ అన్నారు. శనివారం టీఎన్జీవో భవనంలో బుద్ధుడి నాటికను ప్రదర్శించారు. కులనిర్మూలన, సమసమాజం కోసం అంబేడ్కర్ ఎలా కృషి చేశారో కళ్లకు కట్టినట్టు నాటికలో చూపించారు. కార్యక్రమంలో బీఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, స్టేట్ ఈసీ మెంబర్ మారు సునీల్, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలాజీ గైక్వాడ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి లక్ష్మణరావు, రాజేశ్, శ్రవణ్, రోహిత్, నారాయణ, దేవేందర్, రవీందర్, బిక్షపతి తదితరులున్నారు. బల్దియాకు ఇద్దరు డీఈలు కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థకు ఇద్దరు డీఈలు పదోన్నతి బదిలీపై వచ్చారు. ప్రజారోగ్య శాఖలో ఏఈగా ఉన్న దేవేందర్, కోరుట్ల మున్సిపాల్టీలో ఏఈగా పనిచేస్తున్న అరుణ్లు డీఈలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఇద్దరు డీఈలను నగరపాలకసంస్థకు కే టాయించారు. కాగా... నగరపాలికలో మొత్తం ఆరు డీఈ పోస్టులు చాలా సంవత్సరాల తర్వాత పూర్తిస్థాయిలో భర్తీ అయ్యాయి. ఇప్పటివరకు నలుగురు డీఈలు లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, సంజీవ్లు మాత్రమే ఉండగా, ఏఈ అయ్యూబ్ఖాన్ ఇన్చార్జి డీఈగా వ్యవహరించారు. కాగా అయూబ్ఖాన్ ఏఈగా బాధ్యతలు కొనసాగించనున్నారు. ఏఈలు నలుగురే... నగరపాలకసంస్థ కార్యాలయంలో పది మంది ఏఈలకు కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. మొత్తం పది పోస్టుల్లో ఆరు ఖాళీగా ఉండడంతో క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులపై ప్రభావం పడుతోంది. కీలకమైన ఇంజినీరింగ్ విభాగంలో ఏఈల పోస్టులు కూడా పూర్తిస్థాయిలో భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ ఇరుకుల్ల వ్యవసాయ ఫీడర్ పరిధిలోని ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ రైతులకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమినరీ ఉచిత శిక్షణ పరీక్షలు సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కరీంనగర్లో నిర్వహించిన ఉచిత శిక్షణ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం 12నుంచి 2 గంటల వరకు జరిగిన పరీక్షలకు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. 189 మంది హాజరైనట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. -
గెస్ట్హౌస్ గోల్మాల్!
కార్పొరేషన్ కహానీ–4సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్కార్పొరేషన్●: నగరపాలక సంస్థలో మరో సంచలనం. అక్రమంగా నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించిన జీతాలను, అధికారుల నుంచి రివకరీ చేయాలని విజిలెన్స్ ఆదేశించింది. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ (అప్పట్లో కేసీఆర్ హౌస్)లో 12 మందిని ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతి లేకుండా నియమించారనే ఫిర్యాదులపై ఏడాదిన్నరగా విచా రణ కొనసాగుతుండడం తెలిసిందే. ఈ క్రమంలో నియమకాలు అక్రమమే అని తేల్చిన విజిలెన్స్, సంబంధిత బల్దియా అధికారుల నుంచి రూ.9 లక్షలు రికవరీ చేయాలనడం ప్రకంపనలు సృష్టిస్తోంది. అడ్డదారిలో 12 మంది నియామకం... గత ప్రభుత్వ హయాంలో నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ను కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ (కేసీఆర్ హౌస్)గా ఆధునీకరించారు. నిర్మాణం పూర్తయ్యాక, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గెస్ట్ హౌస్లో పనిచేసేందుకు నగరపాలక సంస్థ నుంచి 12 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిన నియమించారు. అయితే ప్రభుత్వ పరంగా ఎలాంటి అనుమతులు లేకుండా, కనీస ఉత్తర ప్రత్యుత్తరాలు జరగకుండానే స్థానికంగా నిర్ణయం తీసుకొని నియామకాలు చేపట్టారు. 12 మందిని తొలగించేనాటికి నగరపాలకసంస్థ నుంచి రూ.9,26,585 జీతాల రూపంలో చెల్లించారు. ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేసీఆర్ హౌస్ పేరును తిరిగి ఆర్అండ్బీ గెస్ట్ హౌస్గా మార్చడంతో పాటు, అక్రమ నియామకాలపై దృష్టి సారించింది. 12 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారాయని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఒక్కొక్కరి నుంచి ఉద్యోగం పేరిట రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు పలువురు మాజీ కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు వసూలుచేసినట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీనితో ప్రభుత్వ పెద్దల సూచనతో విజిలెన్స్ విచారణ మొదలైంది. ఏడాదిన్నరగా సాగిన విజిలెన్స్ విచారణలో 12 మంది నియామకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేలింది. అంతేకాకుండా రాజకీయ నేతల ఒత్తిళ్ల వల్లే తాము 12 మందిని నియమించామని విచారణలో సంబంధిత అధికారులు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. నియామకానికి కారణం ఎవరైనా, నియమించడం, ఆ తరువాత వారికి జీతాల చెల్లింపులో సాంకేతికంగా అధికారులదే తప్పిదంగా విజిలెన్స్ నిర్ధారించింది. రూ.9లక్షలు రికవరీ గెస్ట్హౌస్లో అనుమతి లేకుండా నియమించిన 12 మందికి చెల్లించిన జీతాలను సంబంధిత అధికారుల నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్ ఆదేశించడం ప్రస్తుతం ప్రకంపనాలు సృష్టిస్తోంది. 12 మందికి జీతాల రూపంలో చెల్లించిన రూ.9 లక్షల 26 వేల 585ను అప్పటి అధికారుల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. అందులో 8 లక్షల 99 వేల 600 నగరపాలక సంస్థ అధికారుల నుంచి, మూడు శాతం కమీషన్ రూపంలో ఆదాయం పొందిన వారధి నుంచి రూ.26,985ని రికవరీ చేయాలని సూచించారు. కాగా.. రికవరీకి ఆదేశించిన అధికారుల్లో గతంలో పనిచేసిన ఇద్దరు నగరపాలకసంస్థ కమిషనర్లు, శానిటరీ సూపర్వైజర్, సూపరింటెండెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్ ఉండడం సంచలనంగా మారింది. ఏ అధికారి నుంచి ఎంత వసూలు చేయాలనే స్పష్టత రాలేదు. 12 మంది నియామకం అక్రమం విచారణలో తేల్చిన విజిలెన్స్! రూ.9లక్షలు రికవరీకి ఆదేశం బల్దియాలో ప్రకంపనం -
తల్లిదండ్రుల కష్టాలను చూసి..
మాది బోయినపల్లి మండలం కొదురుపాక. అమ్మ విజ య, నాన్న మురళి వ్యవసా యం చేస్తారు. మేము ముగ్గురం అక్కాచెల్లెళ్లం. ఇద్ద రు అక్కలకు పెళ్లిళ్లు అయ్యా యి. చిన్నదాన్నైన నన్ను కష్టపడి చదివించారు. నేను నిద్రపోయేంత వరకు అమ్మనాన్న కూడా మేల్కొనే ఉండేవారు. వారి కష్టాన్ని చూసి నేను స్ఫూర్తి పొందాను. కొదురుపాకలో 6 వరకు, 7 నుంచి ఇంటర్ వరకు కరీంనగర్లో, ఐదేళ్ల లా కోర్సు కాకతీయ యూనివర్సిటీలో చదివాను. కరోనా సమయంలో అందివచ్చిన అవకాశాన్ని జార విడచుకోవద్దనే పట్టుదలతో చదివాను. 150 నుంచి 200 వరకు జడ్జిమెంట్లు చదివాను. విజయం సాధించి, ప్రస్తుతం హన్మకొండలో పనిచేస్తున్నాను. – తడిగొప్పుల ప్రవళిక -
నైతిక విలువలతో నాణ్యమైన విద్యనందించాలి
కరీంనగర్కల్చరల్: విద్యాలయాలు నైతిక విలువలు కాపాడుతూ నాణ్యమైన విద్యను అందించాలని, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు సమాజానికి ఉపయోగపడేలా పలు సేవలు చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శనివారం తీగలగుట్టపల్లిలోని ఓ కన్వెన్షన్లో పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు చేయాలని సంకల్పించామని తెలిపారు. ఇందుకు ముందుకు వచ్చిన జిల్లాలోని చాలా ప్రైవేట్ స్కూళ్లు తమ సేవా నిరతిని చాటుకున్నాయన్నారు. పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం బాధ్యులు మధుసూదన్రావు, యాదగిరి శేఖర్రావు తదితరులున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి -
మట్టిలో కలిసిపోకుండా..
ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం గుంపుల గ్రామానికి చెందిన తుమ్మ రామకృష్ణ అనారోగ్యంతో ఇటీవల మృతిచెందగా అతడి కిడ్నీలు, కాలేయం దానం చేశారు. మృతుడి భార్య నిర్మల, కూతురు ప్రవళిక, కుమారుడు పృథ్వీరాజ్, కుటుంబసభ్యుల సమక్షంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. ఓదెల గ్రామానికి చెందిన అయిలు మల్లేశ్ ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందగా, అతడి కళ్లను భార్య రాధిక, కుటుంబసభ్యులు సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దానం చేశారు. అలాగే ఓదెల మండలం అబ్బిడిపల్లె గ్రామస్తులంతా అవయవదానానికి ముందుకొచ్చి జిల్లా కలెక్టర్కు అంగీకారపత్రం అందజేశారు. -
చట్టబద్ధత తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల కుమార్గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కరీంనగర్లోని టవర్సర్కిల్లో వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఎన్నికలకు ముందు చెప్పిన కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమే అన్నారు. పార్టీలకు అతీతంగా ఈనెల 15న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుప్ప ప్రకాశ్, తమ్మన్నగారి సంగన్నచ సిద్దగోని శ్రీనివాస్, వల్లూరి వీరేశ్, నవీన్, సాగర్, రాజేశ్, మేకల కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
నలుగురికి మేలు జరగాలని..
కోరుట్లటౌన్: ‘మనం చచ్చినా, బతికినా నలుగురికి మేలు జరగాలి. అదే చిన్ననాటి నుంచి ఆశయం. టీచర్ ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పది మందికి సాయం చేయాలనే తపనతో కొనసాగిన. రిటైర్డ్ అయ్యాక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న. ఆఖరికి చనిపోయినా నలుగురికి ఉపయోగపడాలి’. అని అంటున్నాడు కోరుట్లకు చెందిన రిటైర్డ్ టీచర్ వోటారికారి చిన్నరాజన్న. మరణానంతరం అవయవదానం చేయాలన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం సదాశయ ఫౌండేషన్ నిర్వాహకులను సంప్రదించి అంగీకారపత్రం తీసుకున్నారు. అవయవదాతలు పునర్జన్మ ఇచ్చినవారవుతారని పేర్కొన్నారు. – చిన్నరాజన్న -
రూ.18.71 కోట్ల సీఎంఆర్ మాయం
సుల్తానాబాద్రూరల్/సుల్తానాబాద్: రైతుల వద్ద కొనుగోలు చేసి సీఎంఆర్(మర ఆడించేందుకు)కు కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్న రైస్మిల్లుల పన్నాగాన్ని సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ రైస్మిల్లుల యజమానులు తమకు కేటాయించిన ధాన్యాన్ని 5 లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్సాదేశాల మేరకు అధికారులు గురువారం పట్టుకొని పోలీసుస్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా సివిల్ సప్లయ్ అధికారి శ్రీనాథ్ రైస్మిల్లుల్లోని ధాన్యం ప రిశీలించి విచారణ చేపట్టారు. ఆయన మా ట్లాడుతూ, రెండు రైస్మిల్లులకు 2023–2024 సంవత్సరంలో యాసంగి ధాన్యం సీఎంఆర్ కోసం కేటాయించగా సాయి మహాలక్ష్మీ మిల్లులో 61, 65,305 క్వింటాళ్లు, సౌభాగ్యలక్ష్మీ మిల్లులో 10,800 క్వింటాళ్ల ధాన్యంలో వ్యత్యాసం వచ్చిందన్నారు. దీని విలువ(ఎకానమిక్ కాస్ట్) ప్రకారం సుమారు రూ.18.71కోట్లు ఉంటుందని తెలిపారు. ప్రభు త్వం కేటాయించిన ధాన్యాన్ని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్న యజమాని మారుతిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. లారీల్లో ధాన్యం ఎక్కడికి తరలించారనే దానిపైనా లోతుగా విచారణ చేస్తున్నట్లు డీఎస్వో తెలిపారు. ధాన్యం తరలిస్తున్న ఐదు లారీలను పట్టుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది విచారణ చేపట్టిన జిల్లా సివిల్ సప్లయ్, టాస్క్ఫోర్స్ అధికారులు -
వేర్వేరు కారణాలతో ముగ్గురు రైతుల మృతి
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు రైతులు వివిధ కారణాలతో దుర్మరణం చెందారు. ఒకరు గుండెపోటుకు గురైతే.. మరొకరు వ్యవసాయ బావిలో పడగా.. ఇంకొకరు నీటిగుంతలోపడి ప్రాణాలు విడిచారు.బతుకుపోరులో ఆగిన గుండె తంగళ్లపల్లి(సిరిసిల్ల): పశువులను మేతకు తీసుకెళ్లిన రైతు గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘ టన తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో శుక్రవారం చో టుచేసుకుంది. రైతు అనవేని దేవయ్య(55) ఈనెల 6న పశువులను మేపేందు కు గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఈక్రమంలోనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దేవయ్యను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా స్టంట్ వేశారు. కానీ దేవయ్య కోమాలోకి వెళ్లడంతో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వ్యవసాయబావిలో పడి.. శంకరపట్నం(మానకొండూర్): లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపురెడ్డి(55) బంధువులు వ్యవసాయబావి పూడిక తీస్తుండగా వెళ్లి పక్కనే ఉన్న మరోబావి లో అదుపు తప్పి పడిపోయా డు. క్రేన్ పనులు, సమీపంలో వరి నాటు వేస్తున్న కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో బాపురెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. నీటిగుంతలోపడి.. ఓదెల(పెద్దపల్లి): గుంపుల గ్రామానికి చెందిన రైతు దాసరి మురళి(50) ప్రమాదవశాత్తు గుంతలోపడి మృతిచెందాడు. పంట పొలానికి నీరు పెట్టేందుకు శుక్రవారం మురళి సైకిల్పై వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కనున్న నీటిగుంతలో పడి ఊపిరాడక చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు. -
ప్రభుత్వ పాఠశాలలో ఐఐటీ పాఠాలు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం గాలిపల్లి, ఇల్లంతకుంట, రేపాక, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్లో భాగంగా మద్రాస్ ఐఐటీతో భాగస్వామ్యం అయ్యాయని ఆయా పాఠశాలల హెచ్ఎంలు పావని, ప్రేమలత, రేవతీదేవి శుక్రవారం తెలిపారు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ ఈమెయిల్ ద్వారా తమకు సమాచారం అందినట్లు తెలిపారు. పాఠశాల, ఉన్నతవిద్య మధ్య అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా ఐఐటీ మద్రాస్ సెంటర్ ఫర్ అవుట్ రీచ్ అండ్ డిజిటల్ ఎడ్యుకేషన్(కోడ్) ద్వారా స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. తమ పాఠశాలలోని విద్యార్థులకు ఆన్లైన్లో మద్రాస్ ఐఐటీ ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ వంటి పది రకాల కోర్సులు 8 వారాల వ్యవధితో నామమాత్రపు రుసుంతో అందించనున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో ఆగస్టు నుంచి రెండు నెలలపాటు ఈ కోర్స్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇల్లంతకుంటలో మూడు హైస్కూళ్లు ఎంపిక -
40 సెకండ్లు.. 118 మూలకాలు
● పీరియాడిక్ టేబుల్ కంఠస్థం ● బాలుడి అద్భుత ప్రదర్శన ● మెమోరీ చాంపియన్ అవార్డు సాధన కరీంనగర్కల్చరల్: కరీంనగర్కు చెందిన కనపర్తి మనవేంద్ర రసాయన శాస్త్రంలోని 118 మూలకాల పేర్లు, వాటి అటామిక్, మాస్ నంబర్లను 40 సెకన్లలోనే కంఠస్థంగా చెప్పి శ్రీఅమేజింగ్ మైండ్ ప్రెజంటేషన్ ఇన్ కెమిస్ట్రీశ్రీ రికార్డు సాధించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన యూఎస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం విశేషం. నగరంలోని ఫిలింభవన్లో శుక్రవారం కనుపర్తి మనవేంద్రను సన్మానించి సర్టిఫికెట్ అందజేశారు. జిల్లా కేంద్రంలోని చేంజ్ మెమొరీ అకాడమీ శిక్షణలో ఉన్న మనవేంద్ర.. వివేకానంద స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. డాక్టర్ వేణుకుమార్ నేతృత్వంలో మెమొరీ ఫైలింగ్ టెక్నిక్స్ ద్వారా శిక్షణ పొందాడు. గతంలోనే ఈ బుడతడు జాతీయస్థాయి మెమొరీ చాంపియన్షిప్ సాధించాడని ట్రైనర్ వేణుకుమార్ గుర్తుచేశారు. ఈ ఘనతకు గుర్తింపుగా శ్రీసూపర్ మెమొరీ చాంప్శ్రీ అవార్డు పొందిన మనవేంద్రను తల్లిదండ్రులు శతి – మురళి అభినందించారు. విద్యార్థి ప్రతిభను వెలికితీస్తున్న డాక్టర్ వేణుకుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ ట్రైనర్లు తిరుపతి, హరీశ్ కుమార్, అశోక్ సామ్రాట్, నోముల రాజకుమార్, ఈశ్వర్, కిశోర్ పాల్గొన్నారు. -
తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా జైలు శిక్ష, జరిమానాలు తప్పవని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. ఇటీవల డ్రంకెన్డ్రైవ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి పోలీస్స్టేషన్ ఆవరణలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ర్యాష్గా లారీ నడిపిన వ్యక్తికి 20 రోజుల జైలు, రూ.10వేల జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 45 మందికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్కుమార్ తీర్పు వెల్లడించారు. అనంతరం డ్రంకెన్డ్రైవ్ తనిఖీల్లో దొరికిన వారితో ట్రాఫిక్ ఆర్ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపమని ప్రతిజ్ఞ చేయించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్కు 20 రోజుల జైలు 24 మందికి జరిమానా -
ధన్యజీవులు
కోల్సిటీ(రామగుండం)/ిసరిసిల్లకల్చరల్: అస్తమిస్తూ వెలుగునిస్తున్నారు. మట్టిలో కలవకుండా మరో ప్రాణాన్ని బతికిస్తున్నారు. ఓ మనిషిగా మరణించి కుటుంబ సభ్యులకు కడుపు కోత పెట్టినా.. మరో వ్యక్తిలో సజీవంగా బతికే ఉంటున్నారు. అవయవదానంతో మరొకరికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. వారూ పునర్జన్మను ఎత్తుతున్నారు. వేలల్లో అవయవ దానాలు సదాశయ ఫౌండేషన్ సంస్థ ద్వారా నేత్ర, అవయవ, శరీర, చర్మదానాలతోపాటు, సమాజహితానికి తోడ్పడే అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 1,500 నేత్రదానాలు, 90 వరకు అవయవ, 150 వరకు దేహదానాలు చేయగా, 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. దీంతో సుమారు 50,000 మందికి పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు స్వచ్ఛందంగా అంగీకారం తెలుపడం గమనార్హం. అవయవదాతలకు గౌరవం దక్కాలి మరణాంతరం నేత్ర, అవయవ, దేహదానాలు చేస్తున్న దాతలకు గౌరవం కల్పించాలని సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు కొంతకాలంగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. అవయవదానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం చేయాలని, అవయవ దానం చేసిన కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్న తరహాలోనే తెలంగాణలో కూడా అందించాలని కోరుతున్నారు. ముందుకొచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ అరుదైన త్యాగానికి శ్రీకారం చుట్టారు. తనతో పాటు సతీమణి, తండ్రిని దేహదానానికి ఒప్పించి తమ అభ్యర్థన పత్రాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు అందజేశారు. రఘునందన్ స్ఫూర్తిగా మరి కొంత మంది దేహ, అవయవ దానానికి ముందుకు వస్తున్నారు. జిల్లాలో దేహదానానికి సంబంధించిన ఇలాంటి గుర్తింపు తెచ్చుకున్న తొలి కుటుంబం రఘునందన్దే కావడం విశేషం. -
చికిత్స పొందుతూ అంగన్వాడీ టీచర్ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల)/సిరిసిల్లటౌన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్లతండాలో ప్రమాదవశాత్తు గాయపడిన అంగన్వాడీ టీచర్ మాజోజు స్వరూప(52) చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మద్దిమల్ల గ్రామానికి చెందిన మాజోజు స్వరూప తండాలోని అంగన్వాడీ టీచర్గా పనిచేస్తుంది. నిత్యం అక్కడికి వెళ్లి వస్తుంటుంది. ఈనెల 8న విధులు ముగించుకొని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్పై ఎక్కించుకున్న వ్యక్తి మార్గమధ్యలో అఘాయిత్యానికి పాల్పడేందుకు యత్నించాడు. అతని నుంచి తప్పించుకునే క్రమంలో బండి పై నుంచి పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు 108 వాహనంలో ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. మృతురాలి కుమారుడు విష్ణుసాగర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ మృతి విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ దహన సంస్కారాల కోసం రూ.20వేల చెక్కును అందజేశారు. అఽఘాయిత్యాలు నిలువరించాలి ఐసీడీఎస్ కార్యకర్తలపై అఽఘాయిత్యాలను ప్రభుత్వం నిలువరించాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు ఎదురుగట్ల మమత కోరారు. మద్దిమల్లతండా అంగన్వాడీ టీచర్ మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధుల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, కాంగ్రెస్ కార్యకర్త కల్లూరి చందన, అంగన్వాడీ టీచర్లు శాంత, సరోజన, మంజుల, అన్నపూర్ణ, వనజ, శోభ తదితరులు పాల్గొన్నారు. కన్నీరుపెట్టుకున్న అంగన్వాడీలు నిందితుడిని శిక్షించాలని డిమాండ్ -
తండ్రి స్ఫూర్తితో..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కా ర్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన దాసారపు మో హన్ గత డిసెంబర్లో అనా రోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు అతడి నే త్రాలు, దేహాన్ని ‘సిమ్స్’కు దానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ సభలో బాధిత కుటుంబానికి అభినందన పత్రం అందజేశారు. ఈసందర్భంగా మోహన్ చిన్న కూతురు అశ్విని తన మరణానంతరం దేహదానం చేసేందుకు అంగీకారం తెలుపగా, పలువురు ఆమెను అభినందించారు. ఈసందర్భంగా అశ్విని మాట్లాడుతూ, తన తండ్రి చెప్పిన విధంగా మనిషి మరణించిన తర్వాత అవయవాలు మట్టిలో కలిసిపోకుండా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో దేహదానం చేసేందుకు ముందుకొచ్చానని పేర్కొన్నారు. -
టీచర్ చెప్పిన పాఠం స్ఫూర్తి
సింగరేణి స్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పు అవయవదానంతో ఇతరులకు పునర్జన్మ ఇవ్వొచ్చని బయాలజీ టీచ్చర్ చెప్పిన మాటలు, టీచర్ కూడా అవయవదానానికి అంగీకరించడం నాకు స్ఫూర్తిని చ్చాయి. ఇటీవలే నాకు 18 ఏళ్లు నిండాయి. ఈనెల 4న సింగరేణి స్కూల్ టీచర్ శశికళ సమక్షంలో నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారం తెలుపుతూ సదాశయ ఫౌండేషన్కు రాసి ఇచ్చాను. మా అమ్మ కూడా నా నిర్ణయాన్ని మెచ్చుకుంది. నాతోపాటు అమ్మ కూడా అవయవదానం చేయడానికి అంగీకారం తెలిపింది. – శివగణేశ్, డీఎంఎల్టీ స్టూడెంట్, గోదావరిఖని అమ్మ నేత్రాలను.. రామగుండం మేయర్ పదవిలో ఉన్నప్పుడు అవయదానాలపై చాలా అవగాహన సదస్సుల్లో అతిథిగా పాల్గొన్నాను. మరణించిన వారి నేత్రాలు, అవయవాలను దానం చేసినట్లు సదస్సుల్లో కుటుంబ సభ్యులు చెబుతుంటే చాలా ప్రేరణ కలిగింది. అప్పుడే నా మరణాంతరం అవయవదానం చేస్తానని అంగీకారపత్రాలపై సంతకాలు చేసిన. మా అమ్మ మరణిస్తే ఆమె నేత్రాలను దానం చేయించా. నేత్ర, అవయదానాలకు సెలబ్రెటీలు, అన్నివర్గాల యువత ముందుకు రావాలి. – కొంకటి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు -
అమ్మ, అక్క పార్థివదేహాలు
నేత్ర, అవయవదానంతోపాటు దేహదానంపై కాళోజీ నారాయణరావు మరణించినప్పుడు అవగాహన వచ్చింది. దీంతో 2003లో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీకి నా శరీరాన్ని దానం చేస్తానని రాసి ఇచ్చాను. మా అమ్మ, అక్క కూడా ముందుకు వచ్చారు. అమ్మ 2014లో మరణించగా కరీంనగర్లోని చల్మెడ మెడికల్ కాలేజీకి, అక్క 2023లో మరణిస్తే వరంగల్ మెడికల్ కాలేజీకి వారిద్దరి దేహాలను దానం చేశాం. నా నిర్ణయాన్ని గౌరవించి నా భార్య నిర్మల కూడా దేహదానానికి అంగీకారాన్ని తెలిపింది. – సురేశ్బాబు, ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగి, గోదావరిఖని అవగాహన పెరిగింది నేత్ర, అవయ, దేహదానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లా ముందుంది. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి స్ఫూర్తి నా సోదరుడు అశోక్కుమార్. 2006లో హార్ట్ ఎటాక్తో మరణించగా, ఆయన ఆశయం మేరకు నేత్రదానంతోపాటు, పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశాం. మాది సంప్రదాయ వైష్ణవ కుటుంబం. మా కుటుంబం సానుకూలంగా ఉన్నా బంధువర్గం నిరాకరించి గొడవకు దిగారు. తమ్ముడి ఆశయం నెరవేర్చడానికి అందరూ అంగీకరించేలా నచ్చజెప్పి చేశాం. – టి.శ్రవణ్కుమార్, జాతీయ అధ్యక్షుడు, సదాశయ ఫౌండేషన్ -
మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి
కరీంనగర్: మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించా లని, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల ఆహారం తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. జిల్లా కేంద్రంలో ని కోతిరాంపూర్ అంగన్వాడీ కేంద్రంలో మహిళా భివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవా రం సభ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ‘ఆరోగ్య మహిళ’ ఉచిత వైద్య పరీక్షలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరు నెలలకోసారి చేయించుకోవాలని సూచించారు. ఆరోగ్య మహిళ పరీక్షల ద్వారా ఏడాదిలో 13 మంది మహిళలకు క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తించినట్లు తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు ఓపెన్ స్కూల్లో చేరి పదో తరగతి, ఇంటర్ పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్న శుక్రవారం సభ ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుతున్నామని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, మెప్మా పీడీ వేణుమాధవ్, సీడీపీవో సబిత పాల్గొన్నారు. -
అభివృద్ధి పేరుతో ఆర్థిక విధ్వంసం
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరంలో అభివృద్ధి పేరిట ఆర్థిక విధ్వంసం చేశారని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ధ్వజమెత్తారు. అసూయ, అధికారం పోయిందనే బాధతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు పట్టించుకోవడం లేదని గంగుల విమర్శించడాన్ని తప్పుబట్టారు. గతంలో నాణ్యత లేకుండా పనులు జరిగాయని, అక్రమాలు చోటుచేసుకున్నాయని వాటిపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యిందని, సాంకేతిక సమస్య కారణంగా జాప్యం జరిగిందన్నారు. నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు ఇస్తామన్నారు. పదేండ్లలో కేవలం 640 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి, అవికూడా పూర్తి చేయలేకపోయారన్నారు. పాత మున్సిపల్గెస్ట్ హౌజ్లో చేపట్టిన భవన నిర్మాణాన్ని అర్ధాంతరంగా వదిలేయడంతో అసాంఘీకకార్యకలాపాలకు వేదికగా మారిందన్నారు.రూ.78 లక్షలతో ఆ భవన ని ర్మాణాన్ని పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సొంత ఖర్చులతో సైకిళ్లు ఇవ్వనప్పుడు అవి బర్త్డే గిఫ్ట్లు ఎలా అవుతాయన్నారు. తన ప్రచారం కోసం రెండు వేల మందిని పిలిచి ఇవ్వడంతో ఓ విద్యార్థి సైకిల్ నుంచి పడి గాయాలపాలయ్యాడన్నారు. సమావేశంలో ఎండీ. తాజ్, బానోతు శ్రవణ్నాయక్, కొరివి అరుణ్కుమార్, దన్నసింగ్, సుదర్శన్తదితరులు పాల్గొన్నారు. -
డ్రగ్ మాఫియాపై కొరడా
● వేణు ఏజెన్సీపై కేసు.. యజమాని రిమాండ్ కరీంనగర్టౌన్: కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా నడుస్తున్న డ్రగ్ మాఫియాపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్రమ ధనార్జనే ధ్యేయంగా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నకిలీ మందులు అమ్ముతున్న వేణు ఏజెన్సీ ఆథరైజ్డ్ డీలర్షిప్ను సన్ఫార్మా ఇప్పటికే రద్దు చేయగా, డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులు సీరియస్గా తీసుకొని వేణు ఏజెన్సీ యజమానినిపై కేసుపెట్టారు. కోర్టులో వేణుకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే కరీంనగర్కు చెందిన వేణు మెడికల్ ఏజెన్సీస్ పక్షవాతం వచ్చిన పేషెంట్లకు వాడే లివిపిల్–500 అనే మెడిసిన్ను ప్రముఖ సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుండగా, ఆ కంపెనీ నుంచి డీలర్షిప్ హక్కును పొందింది. కొంతకాలంగా వేణు ఏజెన్సీ నిర్వాహకులు అక్రమ సంపాదన కోసం అధికారుల కళ్లుగప్పి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ పేరుతో నకిలీ మందులను తీసుకొచ్చి రిటైల్ వ్యాపారులకు ఇస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడడం, ఈ మందులను సన్ఫార్మా నకిలీవిగా గుర్తించడంతో అధికార యంత్రాంగం కదిలింది. నకిలీ మందులను బీహార్ నుంచి తెప్పించినట్లు విచారణలో తేటతెల్లమైంది. ఈ విషయం బయటపడిన నాటి నుంచి వేణు ఏజెన్సీ యజమాని పరారీలో ఉండగా, శుక్రవారం హైదరాబాద్లో అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపర్చారు. నకిలీకి అడ్డుకట్ట పడేనా..? కరీంనగర్ కేంద్రంగా విచ్చలవిడిగా కొనసాగుతున్న నకిలీ మందుల దందా పూర్తిగా కమీషన్ల మీదే నడుస్తోంది. అడ్డగోలుగా కమీషన్లకు అలవాటు పడిన మందుల మాఫియా అసలును పోలిన నకిలీ మందులతో మార్కెట్ను ముంచెత్తుతున్నారు. ఈ మందులు వాడిన పేషెంట్ల రోగాలు తగ్గడం దేవుడెరుగు.. ప్రాణాపాయ స్థితికి చేరుతున్నారు. ఇలాంటి మందులు అన్ని బ్రాండ్లలోకి విస్తరించినట్లు తెలుస్తోంది. లివిపిల్–500 మెడిసిన్ నకిలీగా బయటపడడంతో మిగతా మందులపై కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. నకిలీ మందులపై జరుగుతున్న దాడులతోనైనా కల్తీమయంగా మారిన కరీంనగర్ డ్రగ్ మార్కెట్లో నకిలీ మందులకు అడ్డుకట్ట పడేనా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే విషయమై డ్రగ్ కంట్రోల్ అథారిటీకి చెందిన డ్రగ్ ఇన్స్పెక్టర్, అడిషనల్ డైరెక్టర్లను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. జనన రేటు తగ్గడం ఆందోళనకరం కరీంనగర్టౌన్: దేశంలో జనన రేటు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కరీంనగర్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలో బెస్ట్ సర్జన్లుగా డాక్టర్ మహమ్మద్ అలీమ్, డాక్టర్ నిక్కత్ పర్వీన్, డాక్టర్ శ్రీకాంత్రెడ్డిని సత్కరించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ సీ్త్రవిద్యలో అభివృద్ధి, వివాహ వయస్సు పెరగడం, అందుబాటులో ఉన్న గర్భ నిరోధక సాధనాలు, జీవన వ్యయం పెరుగుదల, వృత్తి, కెరీర్పై దృష్టి సారించడంతోనే జనన రేటు తగ్గుతుందన్నారు. వైద్యులు సుధ, రవీందర్రెడ్డి, ఉమాశ్రీ, సాజిదా, విప్లవశ్రీ, సనజవేరియా, రాజగోపాల్, విమల, స్వామి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పత్తి మార్కెట్కు రెండు రోజుల సెలవు జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్కు శని, ఆదివారం సెలవులు ఉంటాయని ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికిందని వారు వివరించారు. -
ధన్యజీవులు!
● అపురూప త్యాగం దేహదానం ● వైద్య విద్యార్థులకు పాఠ్య పుస్తకం ● అవయవదానంతో పునర్జన్మ ● నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు ● ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న అవగాహనమనం మరణించినా.. బతకవచ్చు. మన కళ్లు ఈలోకాన్ని చూస్తాయి. మన గుండె లబ్డబ్ అంటూ కొట్టుకుంటోంది. మన ఊపిరితిత్తులు శ్వాసను అందిస్తాయి. కిడ్నీలు శుద్ధి చేస్తూనే ఉంటాయి.. ఇదంతా శరీరంలోని అవయవ దానంతోనే సాధ్యమవుతుంది. కేవలం అవగాహన లేక అనేక మరణాలు మట్టిపాలు, నిప్పుపాలు చేస్తున్నారు. ఇంకొకరికి దానం చేస్తే, వారి ఆయుష్షు పెంచవచ్చు. బ్రెయిన్డెడ్తో అవయవ దానం చేస్తే కనీసం ఎనిమిది మందికి పునర్జన్మ ఇవ్వొచ్చు. నేత్రదానంతో ఇద్దరి జీవితాల్లో వెలుగులు పంచవచ్చు. మళ్లీ మన కళ్లు ఈ లోకాన్ని చూడొచ్చు. దేహదానం చేస్తే.. మెడికో స్టూడెంట్స్కు పాఠ్యపుస్తకం కావచ్చు. వారి పరిశోధనకు దోహదపడవచ్చు. ఈ దానాలపై కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అవగాహన పెరుగుతోంది. దానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.‘భగవంతుడి కోసం కళ్లు పెకిలించి ఇచ్చిన భక్త కన్నప్ప... గురు దక్షిణ కోసం బొటనవేలిని కోసి ఇచ్చిన ఏకలవ్యుడు... దానంగా తొడకోసిచ్చిన శిబిచక్రవర్తి వీరంతా గొప్పవాళ్లయితే... ప్రస్తుత సమాజంతో లక్షలు, కోట్లున్నా కొనలేని.. కొనడానికి విలువకట్టలేని తమ నేత్రాలు, అవయవాలు, పార్థీవ దేహాలను దానం చేయడానికి ముందుకు వస్తున్న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కొందరు వ్యక్తులు ధన్యజీవులు’.. పరోపకారమే ఇదమ్ శరీరమ్.. అని సంపూర్తిగా నమ్మి తాము పుట్టిందే పరులకు ఉపకారం చేయడానికనుకొని మనసా.. వాచా.. కర్మ.. అని ఆచరించేవారు జీవించినంత కాలం ఇతరులకు సేవచేయాలని కోరుకోవడం సాధారణమైన విషయం. జీవం పోయిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడడమే గొప్ప విషయం.స్ఫూర్తి -
యూరియా.. మాయ!
● అన్నదాతతో వ్యాపారుల ఆటలు ● కృత్రిమ కొరత సృష్టిస్తూ.. పొటాష్ అంటగడుతూ.. ● ఆపై అధిక ధరలకు విక్రయం ● తనిఖీల్లో వెలుగు చూడకపోవడం విచిత్రం కరీంనగర్ అర్బన్ ●: అన్నదాతతో ఆటలాడుతున్నారు వ్యాపారులు. నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన అధికారగణం నామమాత్రానికే పరిమితమవుతుండటంతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు. ఎరువుల కొరత లేకుండా నిర్ణీత ధరకే రైతులకు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించగా ఆచరణలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. అవసరం లేని ఎరువులను అంటగడుతూ రైతును పీల్చిపిప్పిచేస్తుండగా వ్యవసాయ శాఖ పట్టించుకోవడంలేదు. ఇక యూరియా కొరతతో రైతాంగం అల్లాడుతుంటే ప్రతిపక్ష పార్టీలు కిమ్మనకపోవడం ఆందోళనకర పరిణామం. ఇదిలాఉంటే వ్యవసాయ అధికారుల్లో ఒకరు తనిఖీల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. కింది నుంచి పైస్థాయి వరకంటూ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారని పలువురు డీలర్లు వాపోయారు. ఆర్గానిక్ పోటాష్తో ముడిపెడుతూ దోపిడీ ఎరువులను మార్క్ఫెడ్ సంస్థ ద్వారా 60 శాతం, ప్రైవేటు డీలర్ల ద్వారా మరో 40 శాతం విక్రయాలు చేపట్టాలి. కాగా అధికారులు, వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందంతో విక్రయాల శాతం మరోరకంగా ఉందన్న ఆరోపణలున్నాయి. కరీంనగర్ పట్టణంలోని చేపల మార్కెట్, గాంధీ ఏరియాలోని పలు ఫెర్టిలైజర్ దుకాణాలతో పాటు కరీంనగర్ రూరల్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, గంగాధర, మానకొండూరు, శంకరపట్నం, వీణవంక, చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాలతో పాటు దాదాపు జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు నానాపాట్లు పడుతున్నారు. బస్తా యూరియా ధర రూ.266.50 కాగా సొసైటీల్లో కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తాను రూ.310కి విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. పలు సొసైటీలు, ప్రైవేట్ వ్యాపారులు ఇష్టారీతిగా విక్రయాలు చేస్తుండటం గమనార్హం. కృత్రిమ కొరత సృష్టిస్తూ రూ.330 నుంచి రూ.350 వరకు విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే మరికొన్ని రోజులైతే అసలు యూరియానే దొరకదంటూ మాటల గారడీతో సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా ఇవ్వాలంటే ఆర్గానిక్ పొటాష్ను కొనాల్సిందేనని ముడిపెడుతున్నారు. 20కిలోల బస్తా ధర రూ.1400లు కాగా దాంతో ముడిపెడుతుండటం శోచనీయం. ఆదేశాల అమలేది? ఎకరాకు బస్తా యూరియా మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంచేయగా అంతకుమించి ఇస్తే డీలర్ల డీలర్షిప్ రద్దు చేస్తామని ప్రకటించింది. కానీ.. ఆచరణలో మాత్రం విరుద్ధ పరిస్థితని తెలుస్తోంది. యూరియా విక్రయాలపై నిఘాను తీవ్రతరం చేశామని వ్యవసాయ శాఖ బీరాలు పలుకుతున్నా.. ఆచరణలో మాత్రం అన్నదాతకు ఇబ్బందులు తప్పడం లేదు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లు ఉండగా సదరు స్థాయిలో ఏడీఏలు ఉన్నారు. కరీంనగర్లో చొప్పదండి ఏడీఏ, హుజూరాబాద్లో మానకొండూరు ఏడీఏ, మానకొండూరులో హుజూరాబాద్ ఏడీఏ, చొప్పదండిలో కరీంనగర్ ఏడీఏలు తనిఖీలు చేస్తుండగా యూరియా బస్తాల విక్రయాల్లో దోపిడీ వీరికి కనిపించలేదా..నన్నది అనుమానాస్పద ప్రశ్న. తనిఖీల పేరుతో స్టేటస్లు, గ్రూప్ల్లో హడావుడి తప్ప నోటీసులిచ్చిన దుకాణాలెన్ని, ఏ ఏ దుకాణాలపై చర్యలు తీసుకున్నారో..నన్నది శేషప్రశ్న. ప్రాథమిక సహకార సంఘాలు, డీసీఎంఎస్, ఆగ్రోస్ కేంద్రాలతోపాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాలను వారంలో ఒక్కరోజు తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని డీలరు ఓ రైతుకు ఒకే పట్టాదారు పాసుపుస్తకంపై 50 బస్తాలను అమ్మినట్లు అధికారులు గుర్తించగా సదరు డీలర్పై అవ్యాజ ప్రేమ కనబర్చడం అధికారులకే చెల్లు. బ్లాక్ మార్కెట్కు యూరియా పంట ఎంత వరకు సాగైంది.. ఇప్పటివరకు ఎంత విక్రయాలు జరిగాయో ఆయా ప్రాంతాలను బట్టి పరిశీలిస్తే స్పష్టమవనుండగా ఆ దిశగా చర్యల్లేవు. మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడమే తప్ప సదరు తనిఖీలతో రైతులకు ప్రయోజనం సున్నా. యూరియా వివిధ రకాల పంటలకు వినియోగించాల్సి ఉండగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పౌల్ట్రీ, డెయిరీ ఫాంలలో యూరియాను ఉపయోగిస్తున్నారు. పేరొందిన డెయిరీలు కూడా పెద్దమొత్తంలో యూరియాను నిల్వచేస్తున్నాయి. లిక్కర్లోనూ యూరియా విచ్చలవిడిగా వాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సదరు కంపెనీల యాజమాన్యాలు అడ్డదారిలో యూరియాను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్నాయి. అయితే ఈ–పోస్ ద్వారా యూరియా విక్రయాలు జరుగుతుండగా ఎక్కువగా ఎవరు తీసుకున్నారు? సదరు రైతు సాగు చేసిన భూమి ఎంత, ఇంట్లో ఉన్నదెంతననే కోణంలో అధికారులు విచారణ చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తాయి.వానాకాలం సీజన్లో నెలల వారీగా అవసరమిలాజిల్లాకు యూరియా అవసరం: 43,254 మెట్రిక్ టన్నులు జిల్లాలో ఉన్న యూరియా: 24,493మె.టలుసరిపడా యూరియా ఏది? యూరియా రైతులకు దొరకడం లేదు. అవసరం లేని ఎరువులను అంటగడుతున్నారు. ప్రభుత్వం ముందు చూపుతో ఎరువులను సరఫరా చేయాల్సిందిపోయి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. – గూడూరి మల్లారెడ్డి, రైతు, హూజూరాబాద్ ఎక్కువ ధరకు అమ్ముతున్రు.. యూరియా బస్తా ధర రూ.266.50 అని ప్రభుత్వం చెబుతున్నా.. వ్యాపారులు మాత్రం రూ.300లకుపైగా విక్రయిస్తున్నారు. ఇదేంటంటే మార్కెట్లో యూరియా లేదంటున్రు. వర్షాలు లేక ఇబ్బందిపడుతుంటే ఇదెక్కడి గోస. – ముత్యంరెడ్డి, రైతు, కరీంనగర్ రూరల్జూన్: 5,190 మె.ట, జూలై: 12,976 ఆగస్టు: 15,139, సెప్టెంబర్: 8,651 -
కాళోజీ స్ఫూర్తితో..
కోల్సిటీ(రామగుండం): స్వాతంత్య్ర సమరయోధులు, గొప్ప కవి కాళోజీ నారాయణరావు తన మరణానంతరం శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేశారు. వారే నాకు స్ఫూర్తి. నాతోపాటు నా భార్య కూడా మా మరణాంతరం మెడికల్ కాలేజీలకు మా శరీరాలను దానం చేస్తామని ప్రకటించాం. కాల్చడమో, పూడ్చడమో చేయకుండా వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం పార్థివ దేహాలను దానం చేయడానికి ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలి. గత నెల 15న మా ఇద్దరి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఇంట్లో పెద్ద సభ ఏర్పాటు చేసి, అందరికీ నేత్ర, అవయవ, దేహదానంపై అవగాహన కల్పించాం. – ఎల్.రాజయ్య, రిటైర్డ్ ఎంఈవో, గోదావరిఖని అమ్మ కళ్లను దానం చేశాం ధర్మపురి: మాది జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నాగారం. అమ్మ చెలుముల చిన్నలక్ష్మి గుండె సమస్యతో బాధపడుతూ 2016లో మృతి చెందింది. ఆమె కళ్లను సజీవంగా ఉంచడం కోసం మృతిచెందిన కొద్ది నిమిషాల్లోనే లయన్స్క్లబ్ వారికి దానం చేసినం. దేశంలో కళ్లు లేనివారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఉపయోగపడతాయి. అన్ని దానాల కంటే అవయవ దానం గొప్పది. – చిలుముల లక్ష్మణ్ -
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం: ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోంచి బంగారు చైన్ దొంగలించిన ఇద్దరుని త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధి ంచిన వివరాలను సీఐ జాన్రెడ్డి వెల్లడించారు. ఈ యన కథనం ప్రకారం.. నగరంలోని మారుతినగర్ కు చెందిన స్వరూప ఇంట్లో నిద్రిస్తోంది. బుధవార ం వేకువజామున నగరానికి చెందిన చింతకింద స దాశివ, టేకుమల్ల నాగరాజు మహిళ ఇంట్లోకి ప్రవేశించి, ఆమె మెడలోంచి 42 గ్రాముల బంగారు గొ లుసు అపహరించారు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన త్రీటౌన్ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగరాజును గర్రెపల్లి సమీపంలో, సదాశివను హౌజింగ్బోర్డుకాలనీలో అరెస్టు చేసి, చై న్, బైకు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో ఒంటరిగా నివసించే మహిళలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మారుతినగర్లో ఒంటరిగా నిద్రిస్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారం చోరీచేసిన ఘటనను గుర్తుచేశారు. ఊరెళ్లేవారు ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదును బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని లేదా సురక్షితంగా దాచుకోవాలని సూచించారు. ఇంటి ప్రధాన ద్వారానికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎటైనా వెళ్తే స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. -
ఓ వైపు భయం.. మరో వైపు దావత్లు
● స్కైలాబ్ ఉపగ్రహం నేలకూలి 46 ఏళ్లు ● జ్ఞాపకాల యాదిలో అప్పటి తరం చొప్పదండి: ఉపద్రవం ముంచుకొస్తోందని ఒకవైపు ఆందోళన, ఎలాగూ మరణిస్తున్నామనే భావనలో జల్సాలు చేసుకోవడం మరోవైపు వెరసి, జన జీవనాన్ని అతలాకుతలం చేసిన శ్రీస్కైలాబ్శ్రీ ఘటనకు 46 ఏళ్లు నిండాయి. స్కైలాబ్ అనే ఉపగ్రహం దారితప్పి భూమండలంపై కూలిపోతోందని, అది దేశంలో పడితే మరణాలు తప్పవనే ప్రచారంతో 1979 జూలైలో అప్పటి జన జీవనమే అదుపుతప్పింది. శాస్త్రవేత్తలు ప్రయోగించిన ఉప గ్రహమైన స్కైలాబ్ కూలిపోతుందని అప్పట్లో రేడియోలలో ప్రచారం జరిగింది. దీంతో ధనిక, పేద లేకుండా గ్రామాల్లో భయాందోళనలతో గడిపారు. మేకలు, కోళ్లు, గొర్రెలను కోసుకొని తిని ఎలాగు చనిపోతున్నామని పండుగ చేసుకున్నారు. తమకున్న వస్తువులను తక్కువ ధరలకే అమ్ముకుని మరీ జల్సాలు చేశారు. శాస్త్రవేత్తలు ఎట్టకేలకు స్కైలాబ్ను సముద్రంలో కుప్పకూల్చేలా విజయం సాధించారు. ఉపగ్రహంతో ఉపద్రవం లేదనే రేడియో వార్తలు రావడంతో మళ్లీ కొద్ది రోజుల పాటు ప్రజలు ఉత్సవాలు జరుపుకున్నారు. స్కైలాబ్ సముద్ర మట్టమైన రోజు పుట్టిన పిల్లలకు గుర్తుగా అదేపేరు పెట్టడం గమనార్హం. జూలై 11కు స్కైలాబ్ పడి 46 ఏళ్లు గడిచినా అప్పటి జ్ఞాపకాలు మాత్రం పలువురి మదిలో ఇంకా పదిలంగానే ఉన్నాయి. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్దే విజయం
● కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావుతో కలిసి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. కన్నెపల్లి నుంచి నీరు లిప్ట్ చేసి మధ్యమానేరు, ఎల్ఎండీ, వరదకాలువల్లో నింపాలన్నారు. జిల్లా సమస్యలపై ప్రభుత్వానికి, సంబంధిత మంత్రులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై పక్షపాత ధోరణితో ఉన్నారని, కరీంనగర్లో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేదన్నారు. పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం మానుకోవాలని హెచ్చరించారు. రసమయి బాలకిషన్ మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. బండ ప్రకాశ్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్ పాల్గొన్నారు. హవ్వా.. ఇదేం చోద్యం!● ఫోర్లైన్ మంజూరైనా మొక్కలు నాటిస్తున్న అధికారులు చిగురుమామిడి: తొలగిస్తారని తెలిసినా.. మొక్కలు నాటేందుకు గుంతలు తీస్తున్నారు సంబంధిత అధికారులు. హుస్నాబాద్ నుంచి చిగురుమామిడి మండలంలోని కొండాపూర్, సుందరగిరి, చిగురుమామిడి, సీతారాంపూర్, చిన్నముల్కనూర్ ద్వారా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వరకు ఫోర్లైన్ మంజూరైంది. మొదటి విడతగా రూ.80కోట్లు మంజూరు చేశారు. త్వరలో పనులు ప్రారంభం కానున్నా యి. ఈ విషయం తెలిసినా చిగురుమామిడిలో ప్రధాన రహదారికి ఇరువైపులా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఈజీఎ స్ కూలీలు గుంతలు తీస్తున్నారు. వారంరోజులుగా గుంతలు తీస్తుండగా ఇదెక్కడి చోద్యమ ని మండల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా రు. రోడ్డు పనులు ప్రారంభం అయితే నాటిన మొక్కలు తొలగించరా అని ప్రశ్నిస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలికరీంనగర్టౌన్: తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేస్తున్న దాడులతో ఆగమైపోతున్నామని ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం బాధ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్లో గురువారం మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక చికిత్స చేస్తున్న ఆర్ఎంపీలను దొంగలు, నకిలీ వైద్యులని భయభ్రాంతులకు గురిచేస్తూ కేసులు పెడతామని బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమకు ప్రాథమిక చికిత్స అందించేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆర్ఎంపీ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అద్యక్షుడు డి.మనోహర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు రవీందర్రెడ్డి, శ్రీనివాసమూర్తి, రాజేశ్వర్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ పాల్గొన్నారు. 12న ఆన్లైన్ స్క్రీనింగ్కరీంనగర్: రాష్ట్ర వెనుకబడిన తరగతుల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సివిల్స్కు హైదరాబాద్లో 9 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా స్టడీ సర్కిల్ డైరెక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాకు చెందిన అభ్యర్థులకు ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 12న ఉదయం 12 గంటల నుంచి 2గంటల వరకు నిర్వహించబడునని తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు వాగేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో హాల్ టికెట్, ఏదైనా గుర్తింపు కార్డుతో హాజరుకాగలరని పేర్కొన్నారు. వివరాలకు 0878– 2268686, కరీంనగర్లోని సీబీ స్టడీసర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
భయపెటిన్రు
ఉపగ్రహం పడుతోందని చెప్పినప్పుడు నాకు ప్రెగ్నెన్సీ ఉంది. అప్పుడు రేడియో వార్తలు వినేటోళ్లం. అందరూ కోళ్లు, గొర్రెలు కోసుకొని తినుకుంటనే.. చనిపోతమని భయపడేటోళ్లు. జూలై 11న ఉపగ్రహం గండం గడిచిందని వార్త వచ్చిన రోజు నాకు కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టిండు, అందరిని బతికించిండు అని అందరూ సంబర పడ్డరు. – కందుల చంద్రమ్మ, మంగళపల్లిపేరులో ప్రత్యేకత ఉంది స్కైలాబ్ ఉపగ్రహం సముద్రంలో పడిపోయి గండం గడిచిపోయిన రోజు నేను పుట్టానట. దాంతో మా అమ్మానాన్న, మేనమామలు నా పేరు స్కైలాబ్ అని పెట్టడంతో, ఊహ తెలిశాక పేరులో ప్రత్యేకత ఉందని అర్థమైంది. నా పేరు వినగానే అప్పటి తరానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థం అవుతుంది. – స్కైలాబ్ గౌడ్, చొప్పదండి -
శేఖర్రావుకు డాక్టరేట్ పురస్కారం
కరీంనగర్: 30 సంవత్సరాలుగా విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తిగా, కరోనా కాలం నుంచి వారు చేస్తున్న సేవలను గుర్తించి హోప్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు ప్రముఖ విద్యావేత్త, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రజ్ఞా వికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావుకు గురువారం డాక్టరేట్ పురస్కారం అందజేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ పాఠశాలలో పని చేసే బోధన, బోధనేతర సిబ్బందికి కరోనా సమయంలో యాజమాన్యాల సహకారంతో ఎంతోకాలం నిత్యావసర సరుకులు అందించి ఆదుకున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంలో కూడా సఫలీకృతులయ్యారు. ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య గంభీరావుపేట(సిరిసిల్ల): ఉద్యోగం రావడం లేదని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నర్మాలలో గురువారం జరిగింది. నర్మాలకు చెందిన లోకం శ్రీకాంత్(25) హైదరాబాద్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చి గ్రామ శివారులోని వరి పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. -
అక్రమ నిర్మాణాలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అక్రమ నిర్మాణాలపై నగరపాలకసంస్థ దృష్టి సారించింది. క మిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణా ళిక విభాగం అధికారులు అనుమతి లేని నిర్మాణాలపై చర్యల కు పూనుకున్నారు. అందిన ఫిర్యాదుల మేరకు నగరంలోని ప లు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు, గురువా రం మరో రెండు కూల్చివేతలు చేపట్టారు. ఆరెపల్లిలో రోడ్డును ఆక్రమించి చేపట్టిన ప్రహరి, షెడ్ను జేసీబీతో తొలగి ంచారు. బ్యాంక్కాలనీలో డెడ్ఎండ్ స్ట్రీట్లో వేసిన టిన్షెడ్ను తొలగించారు. పట్టణ ప్రణాళిక విభాగం ఇన్చార్జి డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య పాల్గొన్నారు. 5 ట్రాక్టర్లు, జేసీబీ పట్టివేత సిరిసిల్లక్రైం: నిబంధనలు అతిక్రమించి అక్రమంగా మట్టిని తవ్వి సరఫరా చేస్తున్న వాహనాలను జిల్లా టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ సీఐ నటేశ్ తెలిపిన వివరాలు. ముస్తాబద్ మండలం చిప్పలపల్లి శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తవ్వి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్పీ ఆదేశాలతో దాడులు చేశారు. ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. -
భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి
కరీంనగర్కల్చరల్: వ్యాస, గురుపౌర్ణమి సందర్భంగా గురువారం పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పలువురు తమ గురువులను ఘనంగా సత్కరించారు. నగరంలోని సాయిబాబా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. సాయినగర్ విజయగణపతి సాయిబాబా ఆలయంలో మంగళాస్నానాభిషేకాలు, పుష్పార్చనలు, విశేషాలంకరణాలు నిర్వహించారు. ఓంసాయి శ్రీసాయి జయ జయ సాయి 24 గంటల అఖండనామం కీర్తనలు ఆరంభించారు. డాక్టర్ ప్రదీప్ కుమార్, కాంచన ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ నాయిని సుప్రియ, ఆలయ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య, ధర్మకర్తలు అయిందాల లక్ష్మయ్య, ఈవో ఎండపల్లి మారుతి పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీ
● ఇద్దరు యువకుల దుర్మరణం ● రేణికుంట వద్ద ఘటన తిమ్మాపూర్: రాజీవ్ రహదారి గురువారం వేకువజామున నెత్తురొడింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను తిమ్మాపూర్ మండలం రేణికుంట శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్గౌడ్ వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా బెజ్జంకికి చెందిన కోడూరి భానుప్రసాద్(19) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి గ్రామానికి చెందిన బామండ్ల నరేశ్(17)తో కలిసి బుధవారం రాత్రి పని నిమిత్తం ద్విచక్రవాహనంపై కరీంనగర్ వెళ్లారు. గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నారు. రేణికుంట శివారులో రాజీవ్ రహదారిపై గుర్తు తెలియని వాహనం వీరి బైక్ను ఢీకొట్టింది. ఇద్దరూ కిందపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. భానుప్రసాద్ తల్లి రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో పదేళ్ల జైలుకరీంనగర్క్రైం: బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్కు పదేళ్ల జైలుశిక్ష, రూ.6వేల జరిమానా విధిస్తూ కరీంనగర్ మొదటి అదనపు జిల్లా జడ్జి వెంకటేశ్ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కరీంనగర్ వన్టౌన్ పరిధిలో నివసించే మహిళ కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరు కూతుళ్లను చదివిస్తోంది. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండో కూతురు కనిపించకపోవడంతో వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల తరువాత కరీంనగర్ బస్టాండ్కు వచ్చి తల్లికి ఫోన్ చేసింది. తనకు రేకుర్తికి చెందిన ఆటోడ్రైవర్ అక్కినపల్లి వంశీధర్ పరిచయం అయ్యాడని, మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని అడగగా.. అతడికి అంతకుముందే పెళ్లయిందని బెదిరించి కరీంనగర్ బస్స్టేషన్లో వదిలి వెళ్లాడని సదరు బాలిక తల్లికి వివరించింది. దాంతో బాలిక తల్లి వంశీధర్పై వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ విజయ్కుమార్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జిషీట్ వేశారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పంజాల కుమారస్వామి విచారించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన జడ్జి నిందితుడు అక్కినపల్లి వంశీధర్కు జైలుశిక్ష, జరిమానా విధించారు. కరీంనగర్ కోర్టుకు హాజరైన అఘోరి శ్రీనివాస్కరీంనగర్క్రైం: ఉమ్మడి రాష్ట్రంలో హల్చల్ చేసిన అఘోరి శ్రీనివాస్ గురువారం కరీంనగర్ కోర్టుకు హాజరయ్యాడు. కొత్తపల్లి పోలీసులు పీటీ వారెంటుపై చర్లపల్లి జైలు నుంచి తీసుకొచ్చి కరీంనగర్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషాన్పల్లికు చెందిన శ్రీనివాస్తో జిల్లాకు చెందిన ఓ మహిళకు నవంబర్ 2024లో పరిచయం ఏర్పడింది. శ్రీనివాస్ తనపై లైంగిక దాడి జరిపాడని, జనవరి 2025లో కొండగట్టు తీసుకెళ్లి తాళికట్టాడని, రూ.3 లక్షలు తీసుకున్నాడని సదరు మహిళ కొత్తపల్లి పోలీసులకు 2025 ఏప్రిల్ 28న ఫిర్యాదు చేసింది. పోలీసులు శ్రీనివాస్పై పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి జైల్లో ఉన్న శ్రీనివాస్ను పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. కోర్టు శ్రీనివాస్కు ఈనెల 23వరకు రిమాండ్ విధించింది. అనంతరం శ్రీనివాస్ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. పొలంలో కుప్పకూలిన రైతుఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లిలో పొలంలో పని చేస్తుండగా ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. గ్రామానికి చెందిన కనుకుల నరసింహారెడ్డి(70) గురువారం తన వ్యవసాయ బావి వద్ద పొలంపనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమీప రైతులు గమనించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజన, కొడుకు, కూతురు ఉన్నారు. -
ఆరుగురు పిల్లలతో ఆనందంగా..
కోల్సిటీ(రామగుండం): మాది పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామం. 1987లో నాకు పరుగు పందెం ద్వారా సింగరేణిలో ఉద్యోగం రావడంతో, భార్య లక్ష్మితో గోదావరిఖని ఫైవింక్లయిన్ ఏరియాకు వలసొచ్చినం. అప్పటికే మాకు నలుగురు కొడుకులు రాజు, సదానందం, మల్లేశ్, ప్రదీన్తోపాటు కూతురు విజయ ఉన్నారు. గోదావరిఖనికి వచ్చాక చిన్న కొడుకు శ్రీనివాస్ పుట్టాడు. ఆరుగురు పిల్లలను చదివించి ఏ కష్టం రాకుండా పెద్దవాళ్లను చేశాం. 2020లో రిటైర్డ్ అయ్యాను. చిన్న కొడుకు తప్ప, అందరికీ పెళ్లిల్లు చేశాం. కోడళ్లు, అల్లుడు, మనమలు, మనమరాళ్లతో సందడిగా ఉంటుంది. ఇల్లు సరిపోకపోవడంతో దగ్గర్లోనే పిల్లలందరూ వేర్వేరుగా ఉంటున్నారు. కానీ, ఏ పండుగైనా, వేడుకలైనా కలిసి చేసుకుంటాం. కలిసి వంటలు చేసుకొని సంబరంగా కష్టసుఖాలను పంచుకుంటూ ఆనందంగా గడుతున్నాం. – దుడపాక నర్సయ్య, సింగరేణి రిటైర్డ్ కార్మికుడు, గోదావరిఖని -
రేపటి నుంచి ఆల్ ఇండియా చెస్ టోర్నీ
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా జీనీయస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో 3వ ఆల్ ఇండియా చెస్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్, కోచ్ కంకటి అనూప్కుమార్ పేర్కొన్నారు. గురువారం డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్తో కలిసి పోటీల వివరాలు వెల్లడించారు. ఈ నెల 12,13 తేదీల్లో కరీంనగర్లోని వీ కన్వెన్సన్లో రెండు రోజుల పాటు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సుమారు 1000 మంది క్రీడాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉచిత వసతి భోజన, సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల పాటు పోటీలను స్విస్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నామని తెలిపారు. విజేతలకు సుమారు రూ.లక్షకు పైగా నగదు బహుమతులతో పాటు ట్రోపీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. జీనీయస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనుకయ్య, కో ఆర్డినేటర్లు సృజన్కుమార్, సతీశ్ బాబు, పెటా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, జిల్లా ప్రైవేటు వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బత్తిని శ్రీధర్గౌడ్, దారం శ్రీనివాస్రెడ్డి, శివకృష్ణ, మైపాల్, రమ్య పాల్గొన్నారు. హాజరుకానున్న 1000 మంది క్రీడాకారులు జీనీయస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ -
ఫైనాన్స్ కార్యాలయాలపై పోలీసుల దాడులు
● 10 మందిపై కేసు.. రూ.60 లక్షల పత్రాలు స్వాధీనం సిరిసిల్లక్రైం/ఇల్లంతకుంట/ఎల్లారెడ్డిపేట: రాజన్నసిరిసిల్ల జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆఫీస్లు, ఇళ్లపై జిల్లా పోలీసులు గురువారం దాడులు చేశారు. 20 బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న పది మందిపై కేసులు నమోదుకాగా రూ.60లక్షల విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అప్పు ఇవ్వడానికి తాకట్టు పెట్టుకున్న నాలుగు బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అవసరాలను ఆసరాగా చేసుకొని వడ్డీతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతితో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలని, అనుమతి లేకున్నా అక్రమంగా ఫైనాన్స్ వ్యాపారం నడిపే వారి వివరాలు తెలపాలని కోరారు. సిరిసిల్లకు చెందిన నల్ల ప్రదీప్, దూస శ్రీనివాస్, దుబాల మొండయ్య, ఉషాకోయిలా మనోహర్, ఎనగందుల శ్రీహరి, ఒడ్నాల ఆంజనేయులు, బోయినపల్లికి చెందిన మేడిశెట్టి పురుషోత్తం, తాళ్లపల్లికి చెందిన గొర్ల రాములు, మల్లారెడ్డిపేటకు చెందిన బొందుగుల జగదీశ్వర్, దండవేని అశోక్లపై కేసులు నమోదు చేశారు. -
పిచ్చికుక్కల దాడిలో 12 మందికి గాయాలు
చందుర్తి(వేములవాడ): చందుర్తి మండల కేంద్రంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చందుర్తిలో గురువారం 12 మందిపై దాడి చేయగా ఐదుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. చందుర్తికి చెందిన పోతురాజు తిరుపతి, పోంశెట్టి లక్ష్మి, జైనభీ, భారతి, మర్రి మల్లయ్య, ఎన్నం రవి, వై.రామయ్య, ఆశిరెడ్డిపల్లికి చెందిన భసూరి బ్రహ్మచారి, మల్యాలకు చెందిన ఎన్.శేషాద్రి, రామన్నపేటకు చెందిన లక్ష్మీరాజం, లింగంపేటకు చెంందిన తిరుమల మోహినయ్య, కమటం హిమబిందులపై దాడిచేశాయి. జైనభీ, లక్ష్మీరాజం, పోంశెట్టి లక్ష్మి, పోతురాజు తిరుపతి, భసూరి బ్రహ్మచారిలకు తీవ్ర గాయాలు కావడంతో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చందుర్తి పీహెచ్సీ వైద్యాధికారి సురేష్కుమార్ తెలిపారు. -
ప్రభంజనం
● ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న జనాభా ● జననాలు పెరగుతుండగా.. తగ్గుతున్న మరణాలు ● భయపెడుతున్న పట్టణీకరణ సమస్య నేడు ప్రపంచ జనాభా దినోత్సవంసాక్షి,పెద్దపల్లి ●: దేశ ప్రగతికి, పతనానికి ప్రధాన కారణమైన జనాభా ఇప్పుడు ప్రపంచాన్నే భయపెడుతున్న అతిపెద్ద సమస్య. జనాభా తగ్గుదలపై ప్రభుత్వాలు ఆందోళన చెందుతుండగా, మారిన జీవనశైలితో పిల్లలను కనేందుకు ఆసక్తిచూపని దంపతుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరు ముద్దు.. ఇద్దరు హద్దు.. ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేయగా, నేడు వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. ఉమ్మడి జిల్లాలో జనాభా పెరుగుదల కనిపిస్తుండగా, మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గాయి. పెరిగిన జనాభా విద్య, ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసపోతుండడంతో పల్లె చిన్నబోతుంది. పంట పొలాలు కనుమరుగై ఆకాశ హారామ్యలు వెలుస్తున్నాయి. కరీంగనర్, రామగుండం కార్పొరేషన్తో సహా జిల్లాకేంద్రాలుగా మారిన మున్సిపాలిటీలు, పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారుతుండటం పట్టణాలకు వలసపోతున్న జనాభాకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నియంత్రణతో అడ్డుకట్ట జనాభా పెరుగుదల అభివృద్ధికి ఆటంకమన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. అయినా 1952 నుంచి 1975 ఎమెర్జెన్సీ కాలం వరకు విపరీతంగా పెరిగింది. ఎమర్జెన్సీ తర్వాత 1976లో ప్రకటించిన జాతీయ జనాభా విధానం అనుగుణంగా వివాహ వయస్సు పెంచడం, ఆర్థిక ప్రోత్సాహకాలు, మహిళ అక్షరాస్యత పెంపుతో జనాభా తగ్గుదల నమోదైంది. అయితే ఇటీవల కరోనా సమయం అనంతరం జనాభా స్థిరీకరణపై ప్రభుత్వాలు దృష్టిసారించాయి. పట్ణణీకరణే ప్రధాన సమస్య జిల్లాల విస్తరణ, కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుతో ఉఫాది, సౌకర్యవంతమైన జీవనం కోరుతూ ప్రజలు నగరం బాట పడుతున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పడిన పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కేంద్రాల్లోనూ పట్టణీకరణ వేగం పుంజుకుంటోంది. ప్రభుత్వ వైద్యం, విద్యా సదుపాయాలను మెరుగుపరుస్తుండడం, కొత్త కట్టడాల నిర్మాణం పెరుగుతుండడంతో వివిధ వర్గాలకు ఉపాధి లభిస్తోంది. దీంతో ఆయా కేంద్రాల్లో జనాభా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మున్సిపాలిటీల్లో జనాభా ఒత్తిడి పెరుగుతుంది. ఆయా జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం సవాలుగా మారుతుంది. పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వసతుల కల్పనపై ప్రత్యేక చొరవ చూపిస్తేనే సమస్యలు తీరనున్నాయి. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
● డీఎంహెచ్వో వెంకటరమణ కరీంనగర్టౌన్: సాధారణ ప్రసవాల కోసం గర్భిణులను ప్రోత్సహించాల ని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. డీఎంహెచ్వో కార్యాలయంలో గురువారం ఆశా ఫెసిలిటేటర్స్, మహిళా సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు. సిజేరియన్తో ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలను తెలియజేయాలన్నారు. ప్రపంచ జనా భా దినోత్సవం సందర్భంగా జూలై 14, 17తేదీల్లో కరీంనగర్, హుజూ రాబాద్, జమ్మికుంట ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స శిబిరాలకు అర్హత కలిగిన దంపతులను తరలించాలన్నారు. డాక్టర్లు ఉమాశ్రీ, సన జవేరియా, విమల, స్వామి, రామనాథం, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
విద్య.. వైద్యం.. 22 సూత్రాలు
కరీంనగర్: ఆమె ఆలోచనలు వినూత్నం.. కార్యాచరణ విభిన్నం.. విద్యార్థులకు గురువులా.. అనాథలను అమ్మలా ఆదరిస్తున్నారు. కలెక్టర్గా కరీంనగర్ జిల్లా అభివృద్ధితోపాటు భవిష్యత్ తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని 22 రకాల కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు కలెక్టర్ పమేలా సత్పతి. బాలికల సాధికారత.. సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్గా జిల్లాలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టిని సారించారు. కరీంనగర్ కలెక్టర్గా పమేలా సత్పతి (Pamela Satpathy) చేస్తున్న పనులపై ప్రత్యేక కథనం. ఏబీసీ ఆఫ్లైఫ్ రైమ్ పిల్లలకు ఏ నుంచి జెడ్ వరకు 26 విలువలను సరదాగా, సంగీతం ద్వారా అవగాహన కల్పించే వినూత్న విద్యాసాధనం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో దృశ్యరూపకం రూపొందించి ప్రదర్శిస్తున్నారు. 2025 మే 6న లక్నోలో జరిగిన 10 రాష్ట్రాల ఉన్నతాధికారులకు ఇచి్చన నాయకత్వ శిక్షణ కార్యక్రమంలో ఈ రైమ్ ప్రదర్శించారు. » స్నేహిత అనే కార్యక్రమం ద్వారా విద్యార్థినుల్లో గుడ్, బ్యాడ్ టచ్పై అవగాహన కల్పిస్తున్నారు. బాలికల్లో విద్య, నైపుణ్యత, సాధికారత గురించి వివరిస్తున్నారు. సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమయంలో 1098 హెల్ప్లైన్కు సమాచారం అందించడమే స్నేహిత లక్ష్యం. » బ్రిక్స్ టు బుక్స్.. దీని ద్వారా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన 500 మంది విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పించారు. ఈ పిల్లలకు ఇటుక బట్టీల యజమానులను గార్డియన్లుగా ఉంచి.. వారి ద్వారానే విద్యార్థులకు రెండు జతల ట్రాక్ సూట్లు, బ్లేజర్, రవాణా సౌకర్యం కల్పించారు. జిల్లాలోని వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి విద్యార్థికి 3 జతల చొప్పున మొత్తం 22,033 జతల షూలు, 66,099 జతల సాక్స్ పంపిణీ చేశారు. » గత నాలుగైదేళ్లుగా ఎస్ఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత కాని విద్యార్థుల పరీక్ష రుసుం చెల్లించారు. వ్యక్తిగతంగా మార్గనిర్దేశనం చేయగా 483 మందిలో 432 మంది 2024 జూన్లో జరిగిన అడ్వాన్స్డ్ పరీక్షలకు హాజరై 418 మంది ఉత్తీర్ణులయ్యారు. మిగిలిన వారిలో 2025 మార్చిలో 13 మంది పాస్ అయ్యారు. » విద్యావాహిని–బడి బాట.. ద్వారా కరీంనగర్ జిల్లాలోని 16 మండలాల్లో విద్యావాహిని ద్వారా వేసవి సెలవులలో బడిబాట నిర్వహించారు. దీని ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో 7,642 (58.18శాతం) మంది విద్యార్థులు పెరిగారు. ‘విద్యావాహిని కరీంనగర్’ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యాసంబంధిత, ప్రేరణ, సృజనాత్మక అంశాలను అప్లోడ్ చేస్తున్నారు. » వాయిస్ ఫర్ గరల్స్.. బాలికల సామాజిక జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. చిన్న వయసులో పెళ్లి, చదువు మానేయడం ద్వారా కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడం. » కాన్షియస్నెస్ క్లబ్స్.. డ్రగ్స్, గంజాయి వంటి మత్తుపదార్థాల వినియోగం ద్వారా కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగించడం దీని ఉద్దేశం. ఈ క్లబ్లో ఇద్దరు టీచర్లు, తల్లి లేదా తండ్రి, విద్యారి్థ, ఎక్సైజ్ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. » టెడ్ ఎడ్ టాక్స్... రాష్ట్రంలో మొదటిసారిగా గ్రామీణ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సాధికారత కోసం పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పారమిత విద్యాసంస్థల సహకారంతో టెడ్ టాక్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎంపికైన 300పైగా విద్యార్థులు మండల స్థాయిలో పోటీపడి.. జిల్లా స్ధాయికి చేరిన 40 మంది నుంచి 20 మందిని ఎంపికచేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు విద్యార్థుల టెడ్ ఎడ్ ప్రసంగాలు రాష్ట్రంలో వైరల్గా మారాయి. న్యూయార్క్లోని టెడ్ ఎడ్ ప్రధాన కార్యాలయం ప్రచురించింది. జూన్ 25న మరో నలుగురు విద్యార్థులు వారి టెడ్ ఎడ్ ప్రసంగాలు చేశారు. ఈ టెడ్ ఎడ్ టాక్స్ లైసెన్స్ను జంగపల్లి జిల్లా పరిషత్ పాఠశాల, ముల్కనూర్ తెలంగాణ మోడల్ స్కూల్ పొందాయి. ఈ కార్యక్రమం జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో విశేషమైన ఆదరణ పొందుతూ 2024–25 విద్యాసంవత్సరంలో 4,831 ఉన్న విద్యార్థుల నమోదు కాగా 2025–26లో 6,393కు చేరింది. గణిత ఒలింపియాడ్స్ » జిల్లాలోని 175 పాఠశాలల నుంచి మండల, జిల్లా స్థాయిలకు రెసిడెన్షియల్ పద్ధతిలో 350 మంది విద్యార్థులను గణిత, సైన్స్ ఒలింపియాడ్లో పాల్గొనేందుకు నామినేట్ చేశారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం కింద అల్ఫోర్స్ పాఠశాలతో చేసుకున్న ఒప్పంద సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. 40 మంది టాపర్లు వేసవి సెలవుల్లో ప్రత్యేక కోచింగ్ తీసుకొని మోడల్ పరీక్షల్లో ప్రతిభ చూపారు. » సైన్స్ టీచర్లకు, యునైటెడ్ కింగ్డమ్ రాయల్ సొసైటీ వారిచే శిక్షణ ఇప్పిస్తున్నారు. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం ద్వారా వీరితో ఎంవోయూ చేసుకొని 2024 నవంబర్ 5 నుంచి 8 వరకు ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఉచిత సమ్మర్ క్యాంపులు » 27 విభాగాల్లో అల్ఫోర్స్, సెయింట్జార్జ్, పారమిత, వివేకానంద, సాధన ప్రైవేట్ పాఠశాలల సహకారంతో ఉచిత సమ్మర్ క్యాంపులు నిర్వహించారు. దాదాపు 1,500 మంది విద్యార్థులు ఈత, కంప్యూటర్ శిక్షణ, యాంకరింగ్, ఇంగ్లిష్ భాషనైపుణ్యాలు నేర్చుకున్నారు. » విటమిన్ గార్డెన్స్ (స్కూల్ లైఫ్ స్కిల్స్ చాలెంజ్).. విటమిన్ గార్డెన్లలో పెంచుతున్న వివిధ కూరగాయలను, జిల్లాలోని అన్ని ప్రాథమిక, ఉన్నత, కస్తూర్బా, మోడల్ స్కూల్స్లలో మధ్యాహ్న భోజన వంటల్లో ఉప యోగిస్తున్నారు. ప్రకృతితో అనుసంధానంగా గణిత, సైన్స్ ప్రయోగాలు చేస్తూ గార్డెన్స్ పెంచుతున్నారు. » 30 ప్రేరణాత్మక దృశ్య చిత్రాలను ఎంపిక చేసి ప్రతీ మొదటి, మూడో శనివారం ప్రదర్శిస్తున్నారు. విద్యార్థులు ఈ సినిమాలు చూసిన తర్వాత వీటిపై సమీక్షలు రాయిస్తున్నారు. తద్వారా భాషాభివృద్ధి, భావవ్యక్తీకరణ, చదవడం, కుదిరించి రాయడం నేర్చుకునే అవకాశం కలుగుతుంది. » ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి 2024 నవంబర్ 10న ప్రారంభించి 14 ఆదివారాలపాటు నటన నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించి వారితో కరీంనగర్ కళాభారతిలో థియేటర్ ఫెస్టివల్ నిర్వహించారు. » విద్యార్థుల చదువు నైపుణ్యాల అభివృద్ధికి ప్రతీ బుధవారం ఒక పాఠం శబ్ధపూర్వకంగా చదవడాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఇంటి వద్ద వారి తల్లిదండ్రులు, పెద్దవారిముందు గట్టిగా చదివి వినిపించడం ద్వారా వారు అవసరాన్ని బట్టి సరిచేసి చదివించే అవకాశం ఉంటుంది. » రోజూ ఒక పేజీ రాత వలన విద్యార్థులు రాతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులు రాత నైపుణ్యాలను పరిశీలిస్తూ తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. » వీధుల్లో ఉన్న జంతువులను చూస్తే ఎలా స్పందించాలనే అంశాలపై సైతం అవగాహన కల్పిస్తున్నారు. రేబిస్ వంటి వ్యాధులు, టీకాలు చికిత్స విషయాలు తెలుసుకుంటారు. జిల్లా స్థాయిలో 630 మంది హెచ్ఎంలు, 900 ఎకో క్లబ్ సభ్యులకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నారు. » 2005లో ప్రారంభమైన సైన్స్ మ్యూజియంను 2024లో పునర్నిర్మించారు. 56 వర్కింగ్ మోడల్స్, 80 నమూనాలు, సైన్స్ మోడల్స్, డైనోసార్ మోడల్, ప్లానెటోరియం ఉన్నాయి. » సారథి ట్రాఫిక్ పార్క్.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోడ్డు భద్రత, ట్రాఫిక్ సంకేతాలు, రోడ్డు గుర్తుల అవగాహన కల్పిస్తున్నారు. తిమ్మాపూర్ మండలానికి చెందిన విద్యార్థులు 2024 డిసెంబర్ 21 నుంచి 2025 ఏప్రిల్ 4 వరకు కరీంనగర్ ఆర్టీవో ఉన్న సారథి ట్రాఫిక్ పార్క్ను సందర్శించి రోడ్ సేఫ్టీపై అవగాహన పొందారు. ఇప్పటివరకు 450 మంది విద్యార్థులు, 44 మంది ఉపాధ్యాయులు సందర్శించారు. » కెరీర్ గైడెన్స్ చార్ట్.. జిల్లాలోని ఉన్నత, కస్తూర్బా, మోడల్ స్కూల్స్లో చదివి పాస్ అయిన విద్యార్థులకు (5,595 మంది) పదో తరగతి తరువాత ఏం చదవాలో తెలిపే డిటైల్డ్ చార్ట్ను, కౌన్సెలింగ్ బుక్లెట్స్ను పదోతరగతి ఫలితాలు రాగానే అందజేశారు. -
ఇసుక టిప్పర్ పట్టివేత
వేములవాడఅర్బన్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్ను పట్టుకుని వేములవాడ ఆర్టీసీ బస్సు డిపోకు తరలించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. నాంపల్లి శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై బుధవారం తనిఖీలు చేస్తుండగా టిప్పర్ నంబర్ప్లేట్ మార్చి ఇసుక తరలిస్తున్న వాహనం పట్టుబడింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వీణవంక మండలం కొండపాక ఇసుక రీచ్ నుంచి టీజీ 23 టీ 1225పై అనుమతి ఉంది. పోలీసుల తనిఖీల్లో టిప్పర్ నంబర్, ఇంజన్ చాసిస్ నంబర్కు తేడా ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఇసుక అక్రమ రవాణా జరుగగా పోలీసు కేసులు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం కరీంనగర్లోని టీజీఎన్పీడీసీఎల్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో భోజన విరామ సమయంలో ఉద్యోగులు ని రసన తెలిపారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థలతోపాటు విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. కొంతకాలంగా ఉత్తరప్రదేశ్లోని రెండు డిస్ట్రిబ్యూటరీ కంపెనీలను ప్రైవేట్పరం చేయడానికి నిర్ణ యం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించా రు. జేఏసీ నాయకులు ఎన్.అంజయ్య, సీహెచ్.భాస్కర్, కె.శ్రీనివాస్, సీహెచ్.సంపత్కుమార్, ఎం.రమేశ్, వి.కిరణ్కుమార్, జి.శ్రీనివాస్, సంతోష్, ఆకుల వీరయ్య, శ్యామయ్య, రఘు, శ్రీనివాస్, కె.రాజు, షరీఫ్, మల్లేశం, సంపత్, మోయిన్పాషా, శ్రీమతి పాల్గొన్నారు. ప్రైవేటీకరించొద్దని డిమాండ్ -
యువకుడి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగెపు చందుకుమార్ (22) కొన్నాళ్లుగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఒంటరితనంతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ శివారులోని నల్లగుట్ట వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతుని సోదరుడు సంగెపు రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఈదులపూర్ గ్రామశివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంథని డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తోట శ్రీకాంత్(30) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వగ్రామం కాల్వశ్రీరాంపూర్ మండలం జాఫర్ఖాన్పేట. ముత్తారం వైపు నుంచి తన బైక్పై జాఫర్ఖాన్పేట వెళ్తున్న శ్రీకాంత్ను పెద్దపల్లి నుంచి అడవిశ్రీరాంపూర్ వైపు బైక్పై వెళ్తున్న వారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయాలైన శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య శ్రీజ, ఏడాదిన్నర వయసుగల బాబు ప్రణీత్, తల్లిదండ్రులు అనసూర్య, గట్టయ్య ఉన్నారు. శ్రీకాంత్ మృతితో జాఫర్ఖాన్పేట గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాలక్రైం: జగిత్యాలలోని పురాణిపేటలో తాళం వేసిన ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. రాయికల్ మండలం దావన్పల్లికి చెందిన బానోవత్ సంతోష్ పురాణిపేటలో అద్దెకుంటాడు. ఇంటి వద్ద పండుగ ఉండటంతో ఇంటికి తాళం వేసి స్వగ్రామానికి వెళ్లాడు. బుధవారం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని సామగ్రి చిందరవందరగా పడి ఉంది. బీరువాలో ఉన్న 4 గ్రాముల బంగారం, 7 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ కరీంనగర్క్రైం: ఒక మహిళ మెడలోంచి గుర్తుతెలియని వ్యక్తి బంగారు గొలుసు దొంగిలించాడు. త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని మారుతీనగర్కు చెందిన స్వరూప, ఆమె సోదరి అంజలి ప్రధాన కూరగాయల మార్కెట్ వద్ద కూరగాయల వ్యాపారం చేస్తుంటారు. అంజలి బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆటోలో మార్కెట్ వెళ్లింది. తర్వాత గుర్తుతెలియని వ్యక్తి వారి ఇంట్లోకి ప్రవేశించి స్వరూప మెడలో ఉన్న బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్తుండగా.. అప్రమత్తమైన స్వరూప అతడిని వెంబడించగా ఇంటి గేటు నుంచి పరారయ్యాడు. ఈ విషయంపై త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం బృందాలుగా ఏర్పడిన పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్టు
జమ్మికుంట: జల్సాలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. చివరకు పోలీసులకు చిక్కడంతో నలుగురు యువకులు కటకటాలపాలయ్యారు. బుధవారం జమ్మికుంట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ మాధవి వివరాలు వెల్లడించారు. కమలాపూర్ మండలం బీంపల్లి చెందిన మహమ్మద్ అప్రీద్, వేములవాడ మండలం శాత్రాజుపల్లికి చెందిన పాశం తరుణ్, గోదావరిఖని విఠల్నగర్కు చెందిన జంగం శశిప్రీతం, కరీంనగర్ పట్టణంలోని కిసాన్నగర్కు చెందిన బండి పూర్ణచందర్కుమార్ నలుగురు జులాయిగా తిరుగుతూ ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. ఏపీలోని సీలేరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేశారు. జమ్మికుంట శివారులోని ఎఫ్సీఐ సమీపంలో చిన్న ప్యాకెట్లుగా మార్చి విక్రయాలు జరిపేందుకు వెళ్తుండగా మంగళవారం పోలీసులకు పట్టుబడ్డారు. వారినుంచి 15 కిలోల గంజాయి (రూ.3లక్షల75వేలు) రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకున్నారు. గతంలో అప్రీద్, శశిప్రీతం, పూర్ణచందర్ కుమార్పై కరీంనగర్లోని పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో టౌన్ సీఐ రామకృష్ట, ఎస్సై సతీశ్, హెడ్ కానిస్టేబుల్ ఎండీ యాకూబ్, కానిస్టేబుళ్లు, అబ్దుల్ ఖదీర్, రాజేందర్ ఉన్నారు. 15 కిలోల గంజాయి , రెండు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం -
పేదింటి బిడ్డకు బంగారు పతకం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పేదింటి బిడ్డను కాకతీయ యూనివర్సిటీ బంగారు పతకంతో సత్కరించింది. మండలం కేంద్రానికి చెందిన వొడ్నాల రాజయ్య– సరోజన దంపతుల ఏకై క కుమారుడు శివలింగం కాకతీయ యూనివర్సిటీలో ఎంకామ్ 2015–17 బ్యాచ్ (ఫైనాన్షియల్ అకౌంటెంట్)లో యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడు. ఇటీవల నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణ్దేవ్వర్మ, వైస్చాన్స్లర్ ప్రతాపరెడ్డి ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. తల్లిదండ్రు లు కడుపేదరికంలోనివారు. అంతేకాదు.. శివలింగం చిన్న తనంలోనే ఆయన తండ్రి అనారోగ్యంతో చనిపోయా డు. తల్లి టైలరింగ్ చేస్తూ కుమారుడిని పోషించి చదివించింది. తన తల్లి ప్రోత్సాహం, ఉపాధ్యా యుల మార్గదర్శనంలో బంగారు పతకం సాధించానని శివలింగం తెలిపాడు. పేదకుటుంబం నుంచి వచ్చి న తాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పేద, మధ్యతరగతి విద్యార్థులకు భోజనం అందజేస్తామని అన్నాడు. తల్లి కష్టంతో చదువుకొని కేయూలో టాపర్గా నిలిచి.. ఎంకామ్లో విద్యార్థి ప్రతిభ -
తేలని బకాయిల రికవరీ !
● విచారణలో బయటపడి మూడు నెలలు ● సీఈవో స్వాహా చేసిన సొమ్ము రూ.1.03కోట్లు ● పాలకవర్గం రికవరీ చేయాల్సిన సొమ్ము రూ.65లక్షలు ● బకాయిల వసూళ్లపై అధికారుల ఉదాసీనత చందుర్తి(వేములవాడ): చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి, అక్రమాలు విచారణలో బయటపడి మూడు నెలలు గడుస్తున్నా రికవరీకి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే రైతుల పేరిట పంట రుణాలను తీసుకుని స్వాహా చేసిన సీఈవో గంగారెడ్డిని 8 నెలల క్రితమే సస్పెన్షన్ చేసి, రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. 51 విచారణలో సొసైటీకి సంబంధించిన రూ.1.68 కోట్లు పక్కదారి పట్టాయని విచారణలో తేలింది. ఇందులో రూ.1.03 కోట్లు సస్పెన్షన్కు గురైనా సీఈవో గంగారెడ్డి స్వాహా చేశాడని తేలింది. అంతేకాకుండా మరో రూ.65లక్షలను సొసైటీలో వ్యక్తిగత రుణాలు, దీర్ఘకాలిక రుణాలు అందించినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ బకాయిలను 2008 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం సభ్యులు వసూలు చేయించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటి సమాచారం తమ వద్ద లేదని ఈనెల 4న సహకార సంఘం అధికారి వివరణ ఇచ్చినట్లు పాలకవర్గం సభ్యులు ప్రచారం చేస్తున్నారు. కానీ సహకార సంఘం అధికారులు మాత్రం విచారణ కొనసాగుతోందని తెలుపుతున్నారు. స్వాహా సొమ్మును, బకాయిపడ్డ డబ్బుల వసూలుకు సహకార అధికారులు పాలకవర్గం సభ్యులకు నోటీసులు జారీ చేస్తూ జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రుణగ్రహీతలకు పోలీసుల పిలుపు చందుర్తి సహకార సంఘంలో వ్యక్తిగత, దీర్ఘకాలిక రుణం తీసుకుని ఏళ్లుగా చెల్లించకుండా బకాయిపడడానికి కారణాలను తెలుసుకునేందుకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విచారణకు రంగం సిద్ధ చేస్తున్నారు. రైతులకు తెలియకుండా సస్పెన్షన్కు గురైన సీఈవో తీసుకున్న రుణాలపై ఆరా తీసేందుకు పోలీసులు దృష్టి సారించినట్లు తెలిసింది. ఆడిట్ అధికారులు చర్యలేవి ? సహకార సంఘంలోని ఆదాయ, వ్యయాలను ఏటా ఆడిట్ చేసి నివేదికలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలు చెప్పాలని డిమాండ్ ఉంది. అవినీతి, అక్రమాల వెనుక సీఈవోతోపాటు ఆడిట్ అధికారులను విస్మరించడం వెనుక అనుమానాలకు దారితీస్తున్నాయి. సుమారు 13 ఏళ్లుగా కొనసాగుతున్న అవినీతి, అక్రమాల తంతును ఆడిట్ అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేకపోయారన్న సందేహాలు సభ్యులకు, పాలకవర్గ సభ్యుల్లో తలెత్తుతున్నాయి. ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పాలకవర్గం సభ్యులకు జిల్లా సహకార సంఘం అధికారి రెండు పర్యాయాలు నోటీసులు జారీచేయడం విమర్శలకు తావిస్తోంది. బకాయి వసూళ్లకు భయమెందుకు? సహకార సంఘంలో ఏళ్ల తరబడి బకాయిలు ఉంటే సహకార సంఘం చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేయకుండా పాలకవర్గం సభ్యులు నోటీసులు ఇస్తూ జాప్యం చేయడం వెనుక ఉద్దేశ్యమేమిటన్న ప్రశ్నలు పలువురిలో తలెత్తుతున్నాయి. చిన్న, సన్నకారు రైతులు బకాయిలు చెల్లించకుంటే గతంలో ఇంటి తలుపులు తీసిన సంఘటనలు ఉన్నాయి. బకాయిపడ్డ వీరిపై చర్యలు తీసుకోకపోవడానికి ఏ సహకార సంఘం చట్టం అడ్డు వచ్చిందని సభ్యులు, అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది 51 విచారణతోపాటు వ్యక్తిగత విచారణ కొనసాగుతోంది. అవినీతి, అక్రమాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టేదే లేదు. అంతేకాకుండా వ్యకిగత, దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారిని పోలీసులు విచారణ చేపడుతున్నారు. వారి విచారణ అనంతరం తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నాం. సహకార చట్టం ప్రకారం చర్యలు తప్పవు. – రామకృష్ణ, జిల్లా సహకార సంఘం అధికారి -
ధర్నాలో పాల్గొని.. తిరుగు ప్రయాణంలో గుండెపోటుకు గురై..
ధర్మారం(ధర్మపురి): దొంగతుర్తి గ్రామ పంచాయతీ పంప్ ఆ పరేటర్, పంచాయతీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు ఆ కుల రాజయ్య(52) బుధవారం గుండెపోటుతో హ ఠాన్మరణం చెందారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ధర్మారం తహసీల్దార్ కార్యాల యం ఎదుట పంచా యతీ కార్మిక సంఘం అధ్యక్షుడు రాజయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేశారు. అనంతరం తన ఇంటికి వెళ్లేందుకు కార్మికులతో కలిసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెంటనే తన శరీరం అదుపు తప్పుతుందని చెప్పడంతో తోటికార్మికుడు రాగుల మల్లేశం బైక్పై ఆస్పతికి త రలిస్తుండగా మార్గమధ్యంలోనే కిందపడిపోయా రు. గమనించిన లయన్స్క్లబ్ మాజీ అధ్యక్షుడు తల మక్కి రవీందర్శెట్టి వెంటనే డాక్టర్ను పిలిపించి ప రీక్షించగా గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. ఆ వైద్యుడు సీపీఆర్ చేశాక అంబులెన్స్లో కరీంనగ ర్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. రాజయ్య మృతితో కార్మికుల్లో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పంచాయతీ కార్మిక సంఘం నేత మృతి -
14 మంది ట్రాన్స్కో సిబ్బందికి షోకాజ్ నోటీసులు?
కోరుట్ల: జూన్ 15న.. కోరుట్ల–మెట్పల్లి రోడ్లో గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందడం.. మరో తొమ్మిది మంది గాయపడిన ఘటనను ట్రాన్స్కో సీఎండీ కార్యాలయం సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. షాక్కు కారణమైన స్తంభాలు, వైర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు. వల్లంపల్లి 33/11 కేవీ విద్యుత్ లైన్ వేలాడుతోందని, దీన్ని సరిచేయాల్సిన అవసరముందని, మరికొన్ని లైన్లు కూడా సరిచేయాలని రెండేళ్ల క్రితమే అప్పటి ఆ ఏరియా లైన్మెన్ పైస్థాయి అధికారులకు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక ట్రాన్స్కో అధికారులు ఎవరూ దృష్టి పెట్టకపోవడం.. వల్లంపల్లి లైన్ క్రమంగా మరింత కిందికి జారి గణపతి విగ్రహం తరలింపు సందర్భంగా ప్రమాదానికి కారణమైంది. ఆ ప్రమాదం ఎలా జరిగింది..? ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారు..? దీనికి ఎవరెవరు బాధ్యులు..? అనే విషయంలో ట్రాన్స్కో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ మొదలుపెట్టారు. మంగళవారం కోరుట్ల ఏడీఈ స్థాయి అధికారి ఒకరు, ఆరుగురు లైన్మెన్లు, మరో ఏడుగురు జూనియర్ లైన్మెన్లకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్లు సమాచారం. ప్రమాద సంఘటనపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. నోటీసులు అందుకున్న సిబ్బంది ఇచ్చే వివరణ ప్రకారం ప్రమాద సంఘటనకు బాధ్యులపై ట్రాన్స్కో ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు. కోరుట్లలో కరెంట్ షాక్ ఘటనపై.. వివరణ కోరిన సీఎండీ కార్యాలయం -
యూరియా కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం
గోదావరిఖని/ఫెర్టిలైజర్సిటీ: తెలంగాణ రాష్ట్రానికి యూరి యా కేటా యింపులో కేంద్రప్రభుత్వం అన్యాయం చేస్తోందని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విమర్శించారు. ఈమేరకు బుధవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ఆయన ఒకలేఖ రాశారు. తెలంగాణకు అవసరమైన యూరియా మొత్తాన్ని కేటాయించకుండా, రాజకీయ ప్రేరణతో ఇతర రాష్ట్రాలకు మళ్లించడం అన్యాయమని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు కోత విధిస్తూ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆ యూరియా మళ్లిస్తున్నారని ఆరోపించారు. గతేడాది 60 వేల టన్నుల యూరియా కేటాయించగా, ఈసారి కేవలం 30వేల టన్నులే కేటాయించి అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఆర్ఎఫ్సీఎల్ ఉత్పత్తి చేసిన యూరియా కూడా తెలంగాణకు ఇవ్వకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. గతేడాది స్థాయి లో యూరియా కేటాయింపులను వెంటనే పునరుద్ధరించాలని, ఆర్ఎఫ్సీఎల్లో తయారైన యూరి యాను తొలుత తెలంగాణకే కేటాయించాలని, రాజకీయ ప్రేరణకన్నా.. రైతుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ -
పచ్చిరొట్ట.. చేనుకు పుష్టి
జగిత్యాలఅగ్రికల్చర్: భూమికి కావాల్సిన పోషకాలు అందించేందుకు రైతులు రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్టను ఎంచుకుంటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచన మేరకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను చల్లి.. పూతదశకు చేరుకున్న తర్వాత కేజీవీల్స్ ట్రాక్టర్స్తో కలియ దున్నుతున్నారు. ఇలా దాదాపు ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేల వరకు ఖర్చు తగ్గించుకుంటున్నారు. దొరకని సేంద్రియ ఎరువులు జగిత్యాల జిల్లాలో వరిని దాదాపు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తుంటారు. వరికి అవసరమైన పోషకాలు అందిచేందుకు కోళ్లఎరువు లేదా పశువుల ఎరువు వేయాల్సి ఉంది. అయితే కోళ్ల ఎరువు లారీ లోడ్ ధర రూ.28వేలకు చేరింది. పశువుల ఎరువుకు రూ.25వేలు పలుకుతోంది. పైగా రైతులందరికీ సరిపడా లభ్యం కావడం లేదు. గొర్రెలమందను ఒక్కరోజు పెట్టించాలంటే దాదాపు రూ.రెండుమూడువేలు తీసుకుంటున్నారు. ఇలా పంటకు వచ్చే ఆదాయం కంటే.. ఖర్చే ఎక్కువ అవుతోంది. దీంతో రైతులు సేంద్రియ ఎరువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించారు. పచ్చిరొట్ట పైర్లతో భూమికి బలం తక్కువ ఖర్చు.. తక్కువ సమయంలో భూమిలో ఉండే పంటలకు ఎరువుగా ఉపయోగపడే పచ్చిరొట్ట పంటలైన జనుము, జీలుగ, పిల్లి పెసర వేయడం వైపు రైతులు దృష్టి పెట్టారు. ఈ విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తుండడంతో రైతులు మరింత ఆసక్తి కనబర్చుతున్నారు. తొలకరి వర్షాలు పడగానే జూన్ మొదటి వారంలో పచ్చిరొట్ట విత్తనాలు వేసిన రైతులు, ప్రస్తుతం పూతదశలో ఉన్న జనుము, జీలుగను పొలంలోనే కేజీవీల్స్తో దున్నేస్తున్నారు. దున్నిన తర్వాత ఎకరాకు 25కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ వేస్తే నీటిలో కలిసిపోతుంది. మరోసారి ట్రాక్టర్తో దున్ని నాట్లు వేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 15 వేల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను రైతులు వరి నాటు వేసే పొలంలో వేశారు. ఎరువుల ఖర్చు తగ్గించుకుంటున్న రైతులు పచ్చిరొట్ట పంటలతో ఎకరాకు 8నుంచి9 టన్నుల పచ్చిరొట్ట లభ్యమవుతుంది. దీనివల్ల భూమి బలంగా తయారవడమే కాకుండా ప్రధాన పోషకాలైన నత్రజని అధికంగా.. భాస్వరం, పోటాషియం మోస్తరుగా అందుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పచ్చిరొట్ట వేసిన భూమిలో కొందరు రైతులు రసాయన ఎరువులను తక్కువగా వినియోగిస్తున్నారు. చేను ఏపుగా పెరగడం ద్వారా మరికొందరు రైతులు అసలే వేయడమే లేదు. పచ్చిరొట్ట పదార్థంలో ఉండే ఎంజైములు మట్టిలో లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరం, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఇనుము మొదలైన పోషకాలతో దిగుబడి గణనీయంగా పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పూత దశలో కేజీవీల్స్తో దున్నుతున్న రైతులు తగ్గనున్న రసాయన ఎరువుల ఖర్చు పచ్చిరొట్ట ఏటా వేస్తా ఏటా వరి సాగు చేసే పొలాల్లో జీలుగ చల్లుతాను. పూత దశకు వచ్చిన తర్వాత ట్రాక్టర్తో కలియదున్నుతాను. రసాయన ఎరువులను సిఫారసు చేసిన దానికంటే తక్కువగా వేస్తాను. పంట దిగుబడి కూడా అధికంగా పెరుగుతోంది. – ఏలేటి జలేందర్, ఇటిక్యాల, రాయికల్ పూత దశలో దున్నితే లాభం వరి పండించే భూముల్లో ఎక్కువగా పచ్చిరొట్ట సాగు చేయడం మంచి పరిణా మం. జీలుగ, జనుమును పూతదశ వచ్చిన తర్వాత భూమిలోనే కలియదున్నితే బలంగా తయారవుతుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. – భాస్కర్, వ్యవసాయాధికారి, జగిత్యాల -
అమ్మవారికి బెండకాయల మాల
కరీంనగర్ నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమాసం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారిని బెండ కాయల మాలలతో అలంకరించారు. ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. – విద్యానగర్(కరీంనగర్) కంట్రోల్ రూం త్వరగా పూర్తి చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. నగరంలోని కేబుల్ బ్రిడ్జి సమీపంలోని కమాండ్ కంట్రోల్ రూం భవన నిర్మాణ పనులను ఆమె బుధవారం పరిశీలించారు. రూ.16.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాలని చెప్పారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయంలోని చివరి అంతస్తులో కమాండ్ కంట్రోల్రూం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్నారు. 350 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ను కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారన్నారు. నగరపాలకసంస్థ, పోలీస్ అధికారులు సమన్వయంతో కంట్రోల్ రూం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో న గరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీ మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లు లచ్చిరెడ్డి, అయూబ్ ఖాన్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కొత్త సబ్ స్టేషన్లు ● కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి కొత్తగా కరీంనగర్ సర్కిల్ పరిధిలో 16 కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. విద్యుత్ డిమాండుకనుగుణంగా అవసరమున్న మేరకు కొత్తగా సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు, భవిష్యత్తులో ఎటువంటి లోవోల్టేజీ సమస్య ఉండకపోగా, విద్యుత్ పంపిణీ మరింత మెరుగుపడుతుందని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధికనుగుణంగా కొత్త సబ్ స్టేషన్ల రాకతో రైతులు, వినియోగదారులకు అంతరాయాలు తగ్గుతాయని తెలిపా రు. పొడవాటి ఫీడర్లుండవని, ఫీడర్ నష్టాలు త గ్గుతాయన్నారు. ఉన్న సబ్ స్టేషన్లపై లోడ్ భారం తగ్గుతుందని, తద్వారా మెరుగైన, నిరంతరాయ సరఫరా అందించగలుగుతామని చెప్పారు. నిరంతరం పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి ఈ నూతన సబ్ స్టేషన్లు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ సబ్ స్టేషన్లతో నూతన వ్యవసాయ కనెక్షన్లు త్వరితగతిన మంజూరయ్యే అవకాశముంటుందన్నారు. సాగు, గృహ, వాణిజ్య అవసరాల కోసం, విని యోగదారులకు ఆర్థికంగా పరిపుష్టం కావడానికి కొత్త సబ్ స్టేషన్లు ప్రధాన భూమిక పోషిస్తాయని స్పష్టం చేశారు. ఇందులో స్కాడ అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికతను అమలు చేస్తున్న ట్లు, రియల్ టైం ఫీడర్ మానిటర్ ఉంటుందని, విద్యుత్ సంబంధిత పూర్తి సమాచారం తెలుసుకునే వీలుంటుందన్నారు. -
వేతనాలు మహాప్రభో
● 4 నెలలుగా వేతనాలకు దూరం ● ఉపాధి ఉద్యోగుల పడిగాపులు ● పని దినాల కుదింపుతో కూలీల ఆందోళనఉపాధిహామీలో కాంట్రాక్ట్ ఉద్యోగులు: 350 ఏపీవోలు: 16, టెక్నికల్ అసిస్టెంట్లు: 38 ఫీల్డ్ అసిస్టెంట్లు: 270 ఇంజినీరింగ్ కన్సల్టెంట్లు: 06 కంప్యూటర్ ఆపరేటర్లు: 20 ఉపాధి కూలీలు: 2,96,756కరీంనగర్ అర్బన్ ●: ఒక నెల వేతనం రాకుంటే అల్లాడే కుటుంబాలు ఎన్నో. అలాంటిది 4 నెలలుగా వేతనాల్లేక పడిగాపులు కాస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఓవైపు పిల్లల స్కూలు ఫీజులు, పుస్తకాల ఖర్చులు, మరోవైపు నిత్యావసరాలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అవసరాలు తీర్చుకుంటుండగా.. వడ్డీ తడిసి మోపెడవుతోందని వాపోతున్నారు. సాంకేతిక కారణాలను బూచిగా చూపుతూ ప్రభుత్వం వేతనాలను మంజూరు చేయడకపోవడం ఆందోళనకర పరిణామం. జీతాలపై అధికారులను అడిగినా సరైన స్పందన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆపరేటర్ నుంచి ఏపీవో వరకు.. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఏపీవో, ఈసీ(ఇంజినీరింగ్ కన్సల్టెంట్), టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లను ప్రభుత్వం అప్పట్లో నియమించుకుంది. జిల్లాలో ఏపీవోలు 16, ఆరుగురు ఈసీలు, 38 మంది టెక్నికల్ అసిస్టెంట్లు 274 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 20 మంది కంప్యూటర్ ఆపరేటర్లున్నారు. జిల్లాలో మొత్తంగా 350 మంది ఉపాధిహామీ కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనం వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అయితే 4 నెలల నుంచి జీతం రావడం లేదు. వేతనాలకు సంబంధించి స్పర్స్ సాఫ్ట్వేర్లో తలెత్తిన లోపాల కారణంగా రావడం లేదని తెలుస్తోంది. వేతనాలు రాకున్నా ప్రభుత్వం మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.2.01కోట్ల వేతనాలు పెండింగ్ ఉపాధిహామీలో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.18,000 నుంచి రూ.20వేలు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.11,500, టెక్నికల్ అసిస్టెంట్లకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ఈసీలు, ఏపీవోలకు రూ.50 వేల వరకు వేతనాలిస్తున్నారు. వీరికి నెలకు రూ.50.25 లక్షల చొప్పున నాలుగు నెలలకుగా ను రూ.2.01 కోట్ల వేతనాలు పెండింగ్లో ఉన్నా యి. విధుల్లో మాత్రం తగ్గని లక్ష్యాలు వేతనాలు పెండింగ్లో ఉన్నా.. విధుల్లో మాత్రం తేడా రావొద్దంటూ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు విధిస్తున్న లక్ష్యాలు ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఈసీ, ఏపీవోలను మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లదే కీలకపాత్ర. గ్రామాల్లో ఉపాధిహామీ కింద పనులు చేయించడం ఫీల్ ఆసిస్టెంట్ల బాధ్యత కాగా.. చేపట్టిన పనులను క్షేత్రస్థాయికి వెళ్లి కొలతలు వేయాల్సిన బాధ్యత టెక్నికల్ అసిసెంట్లపై ఉంటుంది. కొలతలకు సంబంధించి ఎంబీ రికార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత టీఏలపై ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్లు వేసిన కొలతల ఆధారంగానే కూలీలకు వేతనాలు వస్తాయి. పని తక్కువ చేసిన కూలీకి తక్కువ, పని ఎక్కువ చేసిన కూలీకి ఎక్కువ డబ్బులు వస్తుంటాయి. కూలీలకు రూ.300 వేతనం కచ్చితంగా రావాలన్న అధికారుల ఆదేశాలు టీఏలకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజనతండాలు, పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఆ పని భారం టీఏలపై పడుతోంది. ఒక్కో గ్రామంలో కనీసం పది ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే సమయం సరిపోని పరిస్థితి. ఆందోళనలో కూలీలు ఆర్థిక సంవత్సరానికి గానూ ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలు పూర్తయ్యాయి. ఈ 3 నెలల్లోనే కూలీలకు 35లక్షల పని దినాలు పూర్తి చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటించారు. ఇంకా 14.93లక్షల పని దినాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మిగతా 8 నెలలు కూలీలకు సరిపడా పనుల కల్పన గగనంగా మారే అవకాశముంది. పని దినాలు తక్కువగా ఉన్నందున అధికారులు తీసుకునే చర్యలపైనే కూలీలకు ఉపాధి అవకాశాలుండనున్నాయి. వన మహోత్సవానికి సంబంధించి కూడా గతంలో ఉన్న లక్ష్యానికన్నా తక్కువగా నిర్దేశించారు. గుంతలు తీయడం, మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, మళ్లీ నర్సరీల నిర్వహణ వంటి పనుల్లో కూలీలకు పని లభిస్తుండగా.. పని దినాలను కుదించడం ఆందోళనకర పరిణామం. కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలతోపాటు ఉపాధి కూలీలకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అధికారులు వివరించారు. -
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ గీతాభవన్ ఫీడర్ పరిధిలోని మార్క్ఫెడ్, ప్రగతినగర్, రాంనగర్, మంకమ్మతోట లేబర్అడ్డ, రాజీవ్పార్కు, పద్మనగర్ పారమిత స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కొత్తపల్లిలో.. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందు గురువారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 కేవీ కొత్తపల్లి టౌన్ ఫీడర్ పరిధిలోని కొత్తపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు. -
అట్టహాసంగా సైకిళ్ల పంపిణీ
కరీంనగర్టౌన్: మోదీ గిఫ్ట్గా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో టెన్త్ విద్యార్థులకు చేపట్టిన సైకిళ్లను పంపిణీ అట్టహాసంగా జరిగింది. మొత్తం 20వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశలవారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్ నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. అతి త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు మోదీ కిట్స్ను అందజేస్తానని హామీ ఇచ్చారు. నేను ఎంపీగా గెలిచానంటే అందులో 50 శాతం ఓట్లు పిల్లలు తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఒట్టు వేయించుకొని గెలిపించారని అన్నారు. నామీద ఇంత అభిమానం కురిపిస్తున్న పిల్లల రుణం తీర్చుకునేందుకే ఈ కార్యక్రమం చేపట్టానని స్పష్టం చేశారు. అందరికీ ఆదర్శం: టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం మా అందరికీ ఆదర్శం. ఇతర ప్రజాప్రతినిధులు కూడా స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేయాలనే ఆలోచనను తీసుకొచ్చారు. పేదరికం నుంచి వచ్చిన మోదీ చాయ్ అమ్ముతూ ప్రధానిగా ఎదిగారు. బండి సంజయ్ కూడా సామాన్య కుంటుంబం నుంచి వచ్చి కేంద్ర మంత్రి అయ్యారు. క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదే: కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులందరికీ 20వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయం. ఈ క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదే. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్. నాకు కూడా చిన్నప్పుడు సైకిలే నా ఆస్తి. ఆటోలు, బైకులు, కార్లపై స్కూల్కు వెళ్లి ట్రాఫిక్కు కారణం కంటే.. సైకిల్పై స్కూల్కు వెళ్లడమే మంచిది. దీనివల్ల ఎవరిపై ఆధారపడకుండా సమయానికి స్కూల్కెళ్లి వచ్చే అవకాశముంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ అలవాటు చేయాలి. తద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీక సైకిల్. మీరంతా బాగా చదివి టెన్త్ క్లాస్ ఫలితాల్లో అగ్రగామిగా నిలవాలి. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: సీపీ గౌస్ ఆలం ఇది చాలా గ్రాండ్ ప్రోగ్రాం. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రతిపాదన చేశారు. ఇంత తొందరగా కార్యరూపం దాల్చేలా చేయడం చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా కేంద్ర మంత్రికి అభినందనలు చెబుతున్నా. నాకు సైకిల్ చాలా ఇష్టం. సైకిల్పై జాగ్రత్తగా వెళ్లాలి. లేకుంటే ప్రమాదాలు జరిగే ప్రమాదముంది. చిన్న ఆలోచనకు కార్యరూపం: మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదివే విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలనే ఆలోచనను బండి సంజయ్ తొలుత మాతో పంచుకున్నారు. ఒక చిన్న ఆలోచన ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం చాలా గొప్ప విషయం. అది కేంద్ర మంత్రికే చెల్లింది. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులుంటాయనే ఉద్దేశంతో వారికి ఆర్థిక భారం కాకుండా ఉండేలా ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేయడం చాలా గొప్ప విషయం. ఇందులో భాగస్వాములం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సైకిళ్లు మోదీ ఇస్తున్న గిఫ్ట్ త్వరలో విద్యార్థులందరికీ మోదీ కిట్స్ ఇస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కు ప్రతీక సైకిల్: కలెక్టర్ పమేలా సత్పతి బండికి ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు అంబేడ్కర్ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు సైకిల్ ర్యాలీ ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించిన విద్యార్థులుశుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు ఈనెల 11న బండి సంజయ్ పుట్టిన రోజును పురస్కరించుకొని విద్యార్థులు బండికి ముందస్తు బర్త్డే శుభాకాంక్షలు చెప్పారు. సైకిళ్ల పంపిణీ అనంతరం అంబేడ్కర్ స్టేడియం నుంచి ప్రతిమ చౌరస్తా వరకు విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో జై బండి సంజయన్న అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్, యాదగిరి సునీల్రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, ఆర్డీవో మహేశ్వర్, డీఈవో మొండయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
● మెటా ఫండ్తో మొదలై మెటాప్రో అవతారం ● ఎదురు తిరిగిన బాధితులకు చెల్లని చెక్కులు జారీ ● సాక్షికి చెక్కులు, ఫ్రాంసరీ నోట్లు పంపుతున్న బాధితులు ● టింబర్ డిపో, మొబైల్ షాప్ యజమానులు, మాజీ కార్పొరేటర్ కీలకం ● అరబ్ షేక్లు, యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లను చూప
బాధితులు ముందుకు రావాలి లోకేశ్ను పదేపదే కరీంనగర్కు తీసుకువచ్చి.. మొబైల్ షాప్ యజమాని, టింబర్ డిపో ఓనర్లు రూ.కోట్లల్లో వసూలు చేశారు. ఇందుకోసం జ్యోతినగర్లోని ఓల్డ్ డీఐజీ కార్యాలయంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచే మెటా క్రిప్టో ఆపరేట్ చేస్తున్నారు. పేరుకు క్రిప్టో కరెన్సీ అని చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఇది మల్టీ లెవల్ మార్కెటంగ్ తరహాలోనే తమను మోసం చేశారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ విషయమై బాధితులు నెమ్మదిగా బయటికి వస్తున్నారు. తమకు నిందితులు ఇచ్చిన ఫ్రాంసరీ నోట్లు, చెల్లని చెక్కులు తదితరాలను ‘సాక్షి’కి పంపుతున్నారు. నేరుగా సీపీకే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై సీపీ గౌస్ ఆలం కూడా సీరియస్గానే ఉన్నారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే... తప్పకుండా కేసు నమోదు చేసి చర్యలు చేపడతామని భరోసా ఇస్తున్నారు. -
కోకొల్లలు!
క్రిప్టో పాపాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: కరీంనగర్ కేంద్రంగా వెలుగుచూసిన మెటా క్రిప్టో దందా రోజుకో మలుపు తిరుగుతోంది. వాస్తవానికి ఇందులో జరుగుతున్న మోసాలపై బాధితులు నగరంలోని పలు ఠాణాల్లో ఇప్పటికే ఫిర్యాదులు చేసినా.. పోలీసులు పట్టించుకోకపోవడంతో పాపాల పుట్ట ఆలస్యంగా బద్దలవుతోంది. తొండ ముదిరి ఊసరవెల్లిగా మారినట్లు.. మెటా ఫండ్ పేరుతో మొదలైన క్రిప్టో దందా.. రెండు నెలలకే మెటా ప్రో అని పేరు మార్చుకుంది. అదేంటంటే సాంకేతిక మార్పులు అని సర్ది చెప్పారు. ఇక మొత్తం వ్యవహారంలో నగరంలోని ఓ టింబర్ డిపో యజమాని, ఓ మొబైల్ షాప్ ఓనర్, ఓ మాజీ కార్పొరేటర్ ముగ్గురు అమాయక ప్రజల నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. ఇక ఈ వ్యవహారంలో కీలక సూత్రధారి లోకేశ్ ఏపీకి చెందినవాడని కొందరు, ఆయన పూర్వీకులు సిద్దిపేటకు చెందినవారని మరికొందరు బాధితులు చెబుతున్నారు. వీరంతా పథకం ప్రకారం అమాయక ప్రజలకు డబ్బులు రెట్టింపు అవుతాయని ఆశ చూపించి.. వారి నుంచి రూ.కోట్లు వసూలు చేసి ఇపుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. -
ముగిసిన పోలీస్ డ్యూటీమీట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా జరిగిన రాజన్న జోన్స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ మంగళవారం ఘనంగా ముగిసింది. ఇందులో ఆరు విభాగాల్లో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని వరంగల్లో జరగనున్న రాష్ట్రస్థాయి డ్యూటీమీట్కు పంపించనున్నారు. విజేతలకు సీపీ గౌస్ ఆలం పతకాలు అందించారు. సైంటిఫిక్ ఎయిడ్స్ టు ఇన్వెస్టిగేషన్ విభాగంలోని ఫోరెన్సిక్ సైన్స్ రాతపరీక్షలో గంగాధర ఎస్సై వంశీకృష్ణ బంగారుపతకం సాధించారు. క్రైం ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ చట్టాలు విభాగంలో సిద్దిపేట కమిషనరేట్లోని రాయపోల్ ఎస్సై రఘుపతి, మెడికల్ లీగల్ టెస్ట్లో చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎ.ప్రదీప్ కుమార్, లిఫ్టింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎగ్జిబిట్స్ పరీక్షలో కామారెడ్డి ఎస్సై ఆంజనేయులు, ఫింగర్ ప్రింట్ సైన్స్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఎస్సై యూనస్, క్రైంసీన్ ఫొటోగ్రఫీ పరీక్షలో కామారెడ్డి జిల్లాకు చెందిన ఎస్సై ఆంజనేయులు, పోలీస్ పోట్రైట్ పరీక్షల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ప్రసన్న కుమార్ బంగారు పతకం సాధించారు. యాంటీ సాబెటేజ్ చెక్లోని గ్రౌండ్సర్చ్లో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన కానిస్టేబుళ్లు వి.సంతోష్, వి.వెంకటేశ్, రూంసెర్చ్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.శ్రవణ్ కుమార్, జి.కిరణ్కుమార్, వెహికల్సెర్చ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ బి.శ్రీనివాస్, ఎం.శంకర్ బంగారు పతకం సాధించారు. యాక్సెస్ కంట్రోల్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుళ్లు ఎం.దుర్గాప్రసాద్, కె.సిద్ధిరాములు, డాగ్స్క్వాడ్ కాంపిటీషన్లోని ట్రాకింగ్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ జి.శంకర్, నార్కోటిక్ విభాగంలో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ పి.అజయ్, ఎక్స్ప్లోజివ్లో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన డాగ్ హ్యాండ్లర్ పి.వెంకటేశ్ బంగారు పతకం, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్లో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ ఎస్.సతీశ్కుమార్, ఆఫీస్ ఆటోమేషన్లో సిద్దిపేట కమిషనరేట్కు చెందిన కానిస్టేబుల్ యూ.భాస్కర్, ప్రోగ్రామింగ్ ఎబిలిటీలో కరీంనగర్ కమిషనరేట్కు చెందిన ఫోరెన్సిక్ ల్యాబ్ కానిస్టేబుల్ జి.సంతోష్ కుమార్ బంగారు పతకం పొందారు. పోలీస్ ఫొటోగ్రఫీ విభాగంలో మెదక్ జిల్లాకు చెందిన ఎం.శ్రీధర్గౌడ్, వీడియోగ్రఫీలో మెదక్ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ శ్రీధర్ గౌడ్కు బంగారు పతకాలు వచ్చాయి. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు. విజేతలకు పతకాలు అందించిన సీపీ గౌస్ ఆలం -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చీర్లవంచలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. చీర్లవంచకు చెందిన గంగు శ్రీనివాస్ (22) మద్యానికి బానిసై ఏ పని చేయక తిరుగుతూ ఉండేవాడు. సోమవారం రాత్రి గ్రామ శివారులోని డంపింగ్ యార్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలు..ఇల్లందకుంట: మండలంలోని మర్రివానిపల్లి గ్రామానికి చెందిన కాటిపల్లి అమృతమ్మ(70) అనారోగ్యంతో జీవితంపై విరక్తిచెంది వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ వివరాల ప్రకారం.. అమృతమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో సోమవారం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రయినా ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు మంగళవారం చుట్టుపక్కల వెతుకుతుండగా.. గ్రామశివారులోని ఓ వ్యవసాయబావిలో మృతదేహం లభించింది. తనతల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుందని అమృతమ్మ కొడుకు రవీందర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 15 కిలోల గంజాయి స్వాధీనంజమ్మికుంట: జమ్మికుంటలోని ఎఫ్సీఐ సమీపంలో కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం 15కిలోల గంజాయిని పట్టుకున్నారు. కరీంనగర్కు చెందిన ముగ్గురు యువకులు, కమాలాపూర్ మండలం భీంపల్లికి చెందిన ఓ యువకుడు అంధ్రప్రదేశ్లోని సీలేరు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. రైలుమార్గం ద్వారా వస్తున్నారని తెలుసుకుని ముగ్గురిని ఎఫ్సీఐ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై టౌన్ సీఐ రామకృష్ణను సంప్రదించగా, గంజాయి పట్టుకున్నది నిజమేనని, విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని వివరించారు. -
మరణించినా.. నలుగురికి చూపునిచ్చారు
కోల్సిటీ(రామగుండం): రామగుండం పోలీస్ కమిషరేట్ పరిధిలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. వారి నేత్రాలను దానం చేసి, నలుగురికి చూపు ప్రసాదించి ఆదర్శంగా నిలిచాయి వారి కుటుంబాలు. గోదావరిఖని ఓల్డ్ అశోక థియేటర్ సమీపంలోని సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి కడారి చంద్రయ్య(61), ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. విషాదంలో ఉన్న ఆయన కుటుంబసభ్యులు.. చంద్రయ్య నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి(జీజీహెచ్)లో మంగళవారం ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. అలాగే స్థానిక విలేజ్ రామగుండానికి చెందిన అంబాడి రాజశేఖర్(55) ఈనెల 7న రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇంటి పెద్దను కోల్పోయిన దుఃఖంలో కూడా కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలుదానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీజీహెచ్లో టెక్నీషియన్ సహకారంతో నేత్రాలను సేకరించి హైదరాబాదుకు తరలించారు. మృతుల కుటుంబాలను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్, కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి వాసుతోపాటు రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, కోశాధికారి రాజేందర్, మాజీ అధ్యక్షుడు పి.మల్లికార్జున్ అభినందించారు. రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి కళ్లు దానం చేసిన రెండు కుటుంబాలు అభినందించిన సదాశయ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ -
ముగిసిన డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన
కరీంనగర్ కల్చరల్: ప్రతీగ్రామంలో ఒక ఆలయానికి నిత్యం దీపదూపాలు నిర్వహించాలనే ఉద్దేశంతో 2007లో వైఎస్సార్ హయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డీడీఎన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాలకు దూపదీప నైవేద్య పథకం వర్తింపజేసేందుకు దేవాదాయశాఖ మే1న నోటిపికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో 317 దరఖాస్తులు రాగా.. ఎంపిక పరిశీలన ఇటీవలే ముగిసింది. ప్రతి తీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీతో చర్చించి, సభ్యులతో సంతకాలు చేయించి, ఆమోదం పొందిన తరువాత జాబితాను దేవాదాయశాఖ కమిషన్ కార్యాలయానికి పంపించనున్నారు. ఉమ్మడి జిల్లా దేవాయశాఖ సహాయ కమిషనర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సీనియర్ ఈవోలు, రెగ్యులర్ అర్చకుల నుంచి ఒకరు, డీడీఎన్ అర్చకుల నుంచి ఇద్దరు కమిటీగా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణం చేపట్టి 15ఏళ్లు పూర్తయ్యిందా..? డీడీఎన్ నిబంధనల మేరకు ఉన్నాయా అని పరిశీలించారు. ‘డీడీఎన్ ఆలయాల ఎంపిక పరిశీలన ముగిసింది. ప్రతీ జిల్లాలో దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ సంతకాల స్వీకరణ తరువాత జాబితా దేవాదాయ కమిషనర్కు పంపిస్తాం’ అని దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లా సహాక కమిషనర్ నాయిని సుప్రియ వివరించారు. ఉమ్మడి జిల్లాలో డీడీఎన్ దరఖాస్తుల వివరాలు జిల్లా ప్రస్తుత వచ్చిన ఆలయాలు దరఖాస్తులు కరీంనగర్ 256 100 పెద్దపల్లి 153 69 రాజన్న సిరిసిల్ల 167 42 జగిత్యాల 322 106 మొత్తం 898 317 -
ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నం
మేడిపల్లి: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన గోడిశెల గట్టయ్య ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గట్టయ్యకు ఇద్దరు కొడుకులు. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారు. భార్యకు లోకజ్థానం తక్కువ. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. ఈ క్రమంలో మనస్తాపంతో ఆదివారం ఉదయ క్రిమిసంహారక మందు తాగాడు. స్థానికులు అతడిని వెంటనే జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరిన ఆయన సాయంత్రం సమయంలో మల్యాల మండలం కొండగట్టు ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కేకలు వేయడంతో స్తానికులు గమనించి మంటలు ఆర్పి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు గట్టయ్యను కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మీ సేవ.. మరింత చేరువ
కరీంనగర్ అర్బన్: కాగిత రహిత పాలనగా సేవలందిస్తున్న మీసేవ మరిన్ని సేవలకు వేదికవుతోంది. ఇప్పటికే పలు రకాల ప్రయోజనాలు అందిస్తుండగా రెండు నెలల క్రితం తొమ్మిది రకాల సేవలను పొందుపర్చారు. తాజాగా మరో రెండు రకాల సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం స్వాగతించదగ్గ పరిణామం. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు రెవెన్యూ, పురపాలిక, పంచాయతీరాజ్ తదితర శాఖల సేవలు అందిస్తూ పలు ధ్రువీకరణ పత్రాల జారీతో ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తోంది. తాజాగా రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసే వివాహ ధ్రువీకరణ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రాలను మీసేవ ద్వారా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల పేరు మార్పిడి, ఆదాయ, కుల తదితర ధ్రువీకరణ పత్రాలు, లోకల్ క్యాండిడేట్, స్టడీ గ్యాప్ సర్టిఫికెట్, మైనారిటీ ధ్రువీకరణ, క్రీమిలేయర్, నాన్ క్రీమిలేయర్, మార్కెట్ విలువ, ఖాస్రా, పహాణీల వంటి పాత ధ్రువీకరణ పత్రాలు, ఆర్వోఆర్–1(బి) సర్టిఫైడ్ కాపీలు పొందొచ్చు. అప్లికేషన్ కాగితాలతో కార్యాలయాలకు వెళ్లకుండా మీ సేవలోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చని అధికారులు వివరించారు. ● వివాహ ధ్రువపత్రం పొందడం తేలిక వివాహమైన నూతన దంపతులకు వివాహ ధ్రువపత్రం తప్పనిసరి. సదరు ఎలా పొందాలో తెలియక చాలా మంది ఇబ్బందులు పడేవారు. ఏజెంట్లను సంప్రదించి రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తుండేవారు. బ్రోకర్లు వేలకు వేలు దండుకుని ఇబ్బందులకు గురిచేస్తుండగా పలువురు అన్ని పత్రాలకు తామే బాధ్యులమంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ ప్రయాస లేకుండా వివాహ ధ్రువీకరణ పత్రం అవసరం ఉన్నవారు మీ సేవ కేంద్రం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దళారులకు అస్కారం లేకుండా ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. ● కావాల్సినవి ఏంటంటే.. వధూవరులిద్దరి ఆధార్ కార్డులు, ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు ఐడీ కార్డు తదితర గుర్తింపు పత్రాలు. వయసు రుజువు కోసం పదో తరగతి మెమో. రెండు కుటుంబాలకు చెందిన వివాహ ఆహ్వాన పత్రికలు, పెళ్లికి సంబంధించిన రెండు ఫొటోలు. ముగ్గురు సాక్షులకు చెందిన గుర్తింపు పత్రాల జిరాక్స్ ప్రతులు. ● మార్కెట్ విలువ పత్రాలు పొందొచ్చు గృహ నిర్మాణాలు, ఇతర బ్యాంకు రుణాల కోసం వ్యవసాయేతర భూములకు మార్కెట్ విలువ ధ్రువపత్రాలు తప్పనిసరిగా అవసరం. గతంలో వీటిని రిజిస్ట్రేషన్ శాఖలో మ్యానువల్గా అందించేవారు. ఇప్పుడు వాటిని సైతం మీ సేవ ద్వారా అందించనున్నారు. ● త్వరలో ఇసుక బుకింగ్ కూడా.. ఇసుక అక్రమ తరలింపునకు అడ్డుకట్ట వేసే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకు ‘మీ సేవ’ను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక అవసరమైన వారు మీ–సేవ కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకుని తెప్పించుకునే వెసులుబాటు కల్పించనుంది. కొత్తగా మరో రెండు సేవలు -
‘ఎల్లంపల్లి’పైనే ఆశలు
● వరదనీటిని ఒడిసి పట్టుకుంటేనే ప్రయోజనం ● రెండేళ్లుగా నిలిచిపోయిన కాళేశ్వరం ఎత్తిపోతలు రామగుండం: దశాబ్దకాలంగా తాగు, సాగునీటి రంగంతో పాటు పారిశ్రామిక అవసరాలకు క్రమంగా పెరుగుతున్న నీటి వినియోగం మూలంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా అనతికాలంలోనే నీటి నిల్వలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా రెండేళ్లుగా కాళేశ్వరం జలాలను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో వివిధ అవసరాలకు ఎల్లంపల్లి జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యంలో ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యానికి చేరే క్రమంలోనే ఎల్లంపల్లికి ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపుకునేలా నీటిపారుదలశాఖ అధికారులు ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలతో పని లేకుండానే గతేడాది అధికారులు ప్రత్యేక చొరవతో వరద నీరు సముద్రంలో కలవకుండా ఏడాది మొత్తం అప్రమత్తంగా ముందస్తు ప్రణాళికతో అన్ని అవసరాలను ఎల్లంపల్లితోనే పూర్తి చేసుకోవడం గమనార్హం. ప్రాజెక్టు వివరాలు.. ఎల్లంపల్లి పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 148.00 మీటర్ల ఎత్తులో 20.175 టీఎంసీలు. నీటి పారుదలశాఖ అధికారులు ఆదివారం తెలిపిన వివరాల మేరకు 8.66 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాగా ఇదే రోజు గతేడాది కేవలం 4.80 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలతో నింపుకునే రిజర్వాయర్లు ● లోయర్ మానేర్ డ్యాం 24.034 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ రిజర్వాయర్ను ఏటా ఎల్లంపల్లి జలాలతో నింపుకోవడం జరుగుతోంది. ● రంగనాయకసాగర్ రిజర్వాయర్ మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ● శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 80.5 టీఎంసీలు నీటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఎస్సారెస్పీ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా 9.68 లక్షల ఎకరాలు, సరస్వతీ కెనాల్ 34వేల ఎకరాలు, లక్ష్మి కెనాల్ నుంచి 21వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. వీటితో పాటు ఇతరత్రా తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ● మిడ్మానేర్ రిజర్వాయర్కు 27.55 టీఎంసీల సామర్థ్యం ఉంది. ● కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్కు 15 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. ● కొమురవెల్లి మల్లన్నసాగర్ 50 టీఎంసీల వరద నీటిని ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా నింపుకునే సామర్థ్యం కలిగి ఉంది. -
శ్మశానవాటికలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారా?
పెద్దపల్లిరూరల్: రాఘవాపూర్ శివారులోని ప్రభుత్వ స్థలంలో అప్పన్నపేట ప్రాథమిక సహకార సంఘం ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్ స్థలం కేటాయింపు వివాదాస్పదమైంది. శ్మశానవాటిక కోసం వినియోగించుకుంటున్న స్థలంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడమేమిటని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈమేరకు మంగళవారం చదును పనులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అంత్యక్రియల కోసం వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు సరికాదన్నారు. పనులను నిలిపివేయించిన గ్రామస్తులు.. ఆ తర్వాత కలెక్టరేట్కు తరలివెళ్లారు. అడిషనల్ కలెక్టర్ వేణును కలిసి వినతిపత్రం అందజేశారు. శ్మశానవాటికలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని వారు కోరారు. రాఘవాపూర్లో గ్రామస్తుల నిరసన స్థలం మార్చాలని అధికారులకు ఫిర్యాదు -
35 ఏళ్లుగా సాయి సేవలో..
● ట్రస్ట్, దాతల సహకారంతో అభివృద్ధి వేములవాడ: పట్టణంలోని మార్కండేయనగర్లో 1990 లో నిర్మించిన సాయిబాబా ఆలయానికి 35 ఏళ్లుగా సేవలందిస్తూ భక్తులు, స్థానికుల మన్ననలు పొందుతున్నా రు. ట్రస్టీలు, దాతల సహకారంతో 35 ఏళ్లు పూర్తిచేసుకు ని రూ.3 కోట్లతో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న నిర్వహించే గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టీలు ప్రణాళికలు సిద్ధం చేశారు. 1990లో బాబా గుడి పునాది మార్కండేయనగర్లో 1990లో అప్పటి సర్పంచ్ ప్రతాప చంద్రమౌళి ఆధ్వర్యంలో పాలకమండలి లేఅవుట్ స్థలాన్ని సాయిబాబా సంస్థాన్కు అప్పగించింది. షిరిడీ సాయిబాబా సేవాసంస్థాన్ ట్రస్ట్ పేరుతో ఏర్పడిన ఈ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా అప్పటి వార్డు సభ్యుడు వారాల దేవయ్యను ఎన్నుకున్నారు. 1993లో ఆలయ నిర్మాణం పూర్తయింది. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం ఇరుకుగా మారింది. దీంతో దాతల సహకారం, ట్రస్టీల ప్రోత్సాహంతో ఇప్పటివరకు రూ.3 కోట్లు ఖర్చుచేసి 2011లో నూతన భవనం నిర్మించుకున్నారు. ట్రస్టీల సేవానిరతి ఎలాంటి పారితోషికం లేకుండా 35 ఏళ్లుగా ఆలయంలో ఉచితంగా భక్తులకు సేవలందిస్తున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా వారాల దేవయ్య, ట్రస్టీలుగా గంప రాజేందర్, కూర రమేశ్, కోనమ్మగారి నాగరాజు, బండారి కుమార్, రైకనపాట శ్రీనివాస్, గంప గౌరిశంకర్, నాగుల యాదగిరి, ఎంబేరి నర్సయ్య, పీచర రవీందర్రావు, టి. కృష్ణస్వామి, తొగరి వెంకటేశ్ కొనసాగుతున్నారు. ట్రస్టీలు చేస్తున్న సేవలు గుర్తించిన పలు సంస్థలు అవార్డులు ప్రకటించాయి. 2009లో తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్లో వేములవాడ సాయిబాబా ఆలయం నుంచి వారాల దేవయ్యను ఎంపిక చేశారు. -
మరోచోట ఏర్పాటు చేయాలి
శ్మశానవాటిక స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పా టు చేయడం సరికాదు. ప్లాంట్ ఏర్పాటు పనుల్లో శవాల ఎముకలు బయటపడ్డాయి. ఇది మా మనోభావాలను దెబ్బతీయడమే. మరోచోట ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. – మర్కు లక్ష్మణ్, బీఆర్ఎస్ నేత ఉన్నతాధికారులు చొరవ చూపాలి శ్మశానవాటిక స్థలాన్ని చదును చేసే పనులు విరమించుకోవాలి. అంత్యక్రియలు జరిపేందుకు వినియోగిస్తున్న స్థలంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలనే యోచన సరికాదు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలి. – తాడిచెట్టి శ్రీకాంత్, రాఘవాపూర్ ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు కొందరు గ్రామస్తులు సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మా దృష్టికి వచ్చింది. శ్మశానవాటికలో కాకుండా రెవెన్యూ అధికారులు నిర్ధారించిన హద్దుల్లోనే సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం. – శ్రీమాల, జిల్లా సహకారశాఖ అధికారి -
గొప్పనేత వైఎస్సార్
● మాజీ మంత్రి జీవన్రెడ్డి జగిత్యాల టౌన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గొప్ప నేత అని మాజీ మంత్రి జీవన్రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్లో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాతో వైఎస్సార్కు ఎనలేని మమకారం ఉందని, అందుకే జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. నాచుపల్లిలో జెఎన్టీయూ, కోరుట్లలో వెటర్నరీ కళాశాల, జగిత్యాలలో పండ్ల మార్కెట్ ఆయన చలవే అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
సాలె గూడు!
దురాశల‘మెటా’లో నిలువుదోపిడీకి గురైన ఒకే సామాజిక వర్గం ● కొందరు ఫిర్యాదు చేసినా నమోదవని కేసులు ● బాధితుల్లో పోలీసులు, రెవెన్యూ, టీచర్లే అధికం ● గుండె, పక్షవాతం, బీపీ బారిన పడుతున్న వైనం ● ప్రజల నుంచి రూ.100 కోట్లకు పైగానే వసూలు ● ఘటనపై కరీంనగర్ సీపీ, నిఘా వర్గాల ఆరా -
ఇప్పట్లో అయ్యేనా!
● రెండేళ్లుగా సా..గుతున్న కశ్మీర్గడ్డ రైతు బజార్ పనులు ● రోడ్లపై వ్యాపారాలతో ప్రజల ఇక్కట్లుకరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని కశ్మీర్గడ్డలో చేపట్టిన సమీకృత మార్కెట్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండేళ్లు దాటినా సగం పనులు కూడా కాలేదు. దశాబ్దాలుగా ఆదరణ ఉన్న కశ్మీర్గడ్డ రైతుబజార్ మళ్లీ అందుబాటులోకి రావడానికి మరెన్ని సంవత్సరాలు పడుతుందోనని ఈ ప్రాంత వాసులు, చిరువ్యాపారులు బేజారవుతున్నారు. రూ.10 కోట్లతో నిర్మాణం నగరంలో పద్మనగర్, కశ్మీర్గడ్డ మార్కెట్ నిర్మాణాలను స్మార్ట్సిటీ నిధులతో చేపట్టారు. పద్మనగర్ మార్కెట్ పూర్తి కాగా, నగరానికి దూరంగా ఉండడంతో డిమాండ్ తక్కువగా ఉంది. కశ్మీర్గడ్డ రైతు బజార్ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రూ.10 కోట్ల నిధులతో కశ్మీర్గడ్డలోని రైతు బజార్ స్థానంలో వెజ్,నాన్వెజ్ సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టారు. రెండేళ్లయినా.. కశ్మీర్గడ్డ రైతుబజార్కు డిమాండ్ అధికంగా ఉంటుంది. టవర్సర్కిల్ సమీపంలోని ప్రధాన కూరగాయల మార్కెట్తో పాటు నగరంలో ఉన్న పు రాతన మార్కెట్ ఇది. అశోక్నగర్లో రైతు బజార్ నిర్మాణానికి ముందు ఇవే రెండు పెద్ద మార్కెట్లు అందుబాటులో ఉండేవి. కొత్త మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత రైతుబజార్ను పూర్తిగా తొలగించారు. ఆ స్థలంలో కొత్తగా సమీకృత మార్కెట్ నిర్మాణానికి 2023 జూన్ 21వ తేదీన శంకుస్థాపన చేశారు. కారణాలేవైనా పనులు మాత్రం ఇప్పటివరకు సగం కూడా చేయలేదు. రోడ్లపైనే విక్రయాలు పాత రైతుబజార్ను తొలగించి కొత్త మార్కెట్ను నిర్మిస్తుండడంతో వ్యాపారులు రోడ్లపై చేరారు. ఒక వైపు రోడ్డుపై తాత్కాలికంగా కూరగాయల వ్యాపారులకు ఏర్పాట్లు చేయగా, మరో వైపు రోడ్డుపైన కూడా వ్యాపారం కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కశ్మీర్గడ్డ మార్కెట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచి, త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని నగరవాసులు కోరుతున్నారు. -
చెరగని ముద్ర వైఎస్సార్
కరీంనగర్ కార్పొరేషన్: ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతిని డీసీసీ కార్యాలయంలో ఘనం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎస్సారెస్పీ వరదకాలువ, మిడ్ మానేరు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ను తీసుకొచ్చిన అభివృద్ధి ప్రదాత అని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని 56 మండలాలకు రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొబ్బిలి విక్టర్ ఆధ్వర్యంలో సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అర్బన్ బ్యాంక్చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి, నాయకులు ముల్కల ప్రవీణ్, వెన్న రాజ మల్లయ్య, పడిశెట్టి భూమయ్య, దిండిగాల మధు, చింతల కిషన్, వంగల విద్యాసాగర్, మాదాసు శ్రీనివాస్, మహిళా నాయకురాలు చెర్ల పద్మ పాల్గొన్నారు.● కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాజశేఖరరెడ్డి జయంతి -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
● కలెక్టర్ పమేలా సత్పతిమానకొండూర్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మండలంలోని లింగాపూర్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల నుంచి 35మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం అభినందనీయం అన్నారు. అ నంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. రెండోతరగతి విద్యార్థినిని ఒడిలో కూర్చోబెట్టుకుని పాఠం చదివించారు. ఎంపీడీవో వరలక్ష్మి, తాహసీల్దార్ విజయ్కుమార్, ఎంఈవో మధుసూదనాచారి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ ఇల్లు సందర్శించాలిచొప్పదండి: కొత్త ఓటర్ల నమోదు సందర్భంగా బూత్స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రతీఇంటిని సందర్శించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలా సత్పతి అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన బూత్ లెవల్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా ఓటర్ల నమోదు, తొలగింపు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎంపీడీవో వేణుగోపాల్రావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో రాజగోపాల్రెడ్డి, ఎలక్షన్ డీటీ మనోజ్ పాల్గొన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజి పట్టణంలోని ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ సందర్శించి చొప్పదండి, చిట్యాలపల్లిలో ఇందిరమ్మ ఇళ్లను తనిఖీ చేశారు. -
వామ్మో.. సెల్యులైటిస్
కరీంనగర్టౌన్: జిల్లా ప్రజలను సెల్యులైటిస్ వ్యాధి భయపెడుతోంది. గతేడాది ఇదే సీజన్లో ప్రారంభమైన ఈ వ్యాధి బాధితులను ప్రాణాపాయ స్థితివరకు తీసుకెళ్లింది. మళ్లీ ప్రస్తుత సీజన్లో విజృంభిస్తోంది. వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వర్షాకాలంలో వ్యాపించే ఈ వ్యాధి ఎన్నడూ లేనంతగా నెల రోజులుగా విజృంభిస్తోంది. సెల్యులైటిస్ సాధారణ బాక్టీరియల్ చర్మ ఇన్ఫెక్షనే అయినప్పటికీ వ్యాధి తీవ్రతతో ప్ర మాదకరంగా మారుతుంది. ఎక్కువగా కాళ్లపై కనిపిస్తుంది. చికిత్స నిర్లక్ష్యం చేస్తే అన్ని శరీర భాగా లకు సోకే ప్రమాదముంది. వ్యాధి వ్యాపిస్తే చర్మం ఎరుపు, వాపు, వెచ్చగా, నొప్పిగా ఉంటుంది. జ్వరం, వాపు, తీవ్రమైతే చర్మం మీద చీము వస్తుంది. పుండు, గాట్లు పడినప్పుడు బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. మెల్లగా రక్తనాళాల్లోనికి చేరుతుంది. ఒక దశలో ఇన్ఫెక్షన్ సోకిన అవయవాలను తొలగించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీర్ఘకాలిక చర్మవ్యాధులు, బోదకాలు, వెరికోస్వెయిన్స్, మధుమేహం, హెచ్ఐవీతో బాధపడేవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవీ కారణాలు బాక్టీరియా (స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోకోకస్) చర్మంలోనికి పుండు లేదా పగుళ్ల ద్వారా ప్రవేశించినప్పుడు సెల్యులైటిస్ ఏర్పడుతుంది. ఇందులో రెండు దశలు ఉన్నాయి. ఇది ప్రారంభమైన తర్వాత శరీరంలోని ఏ భాగానికై నా వ్యాపించవచ్చు. చర్మం ఎర్రగా మారడం, ఉబ్బడం, దురుద, పుండుగా మారుతుంది. రెండోదశలో ఇన్ఫెక్షన్గా మారితే చీము వస్తుంది. జిల్లాలో దోమలు పెరగడంతో ఈ వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పెద్ద ఎత్తున సెల్యులైటిస్ కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దోమ కాటుకు గురైన వ్యక్తులు ఆ ప్రాంతంలో దురదగా అనిపించి గోకడం ద్వారా గాట్లు, పుండు పడిన ప్రాంతం నుంచి బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి సెల్యులైటిస్ సంభవిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమా దం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, గాట్లు, పుండు పడిన చోట మందులు వాడడం చేయాలి. మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. దోమల నుంచి రక్షణ పొందేందుకు నెట్, రిపెలెంట్స్ వాడా లి. కాళ్లు తడి కాకుండా కాపాడితే వ్యాధి సోకదు.చికిత్స తీసుకోవాలి సెల్యులైటిస్ ప్రమాదకరంగా మారుతోంది. దోమలు కుట్టి దురుద వచ్చిన ప్రాంతంలో గోకినప్పుడు, చర్మం మీద పగుళ్లు, పుండ్లు ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా చర్మం లోపలకు వెళ్లే అవకాశముంది. మధుమేహం ఉన్న రోగిలో సెల్యులైటిస్ గ్యాంగ్రీన్కు దారితీస్తుంది, ఇది ఒక అవయవాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖ్యంగా కాళ్లు శుభ్రంగా ఉంచుకోవాలి. కాళ్లు ఉబ్బడం, నొప్పి, బొబ్బలు రావడం, జ్వరం వంటి సెల్యులైటిస్ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. లేని పక్షంలో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. – డాక్టర్ దిలీప్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీవర్షాకాలంలో జాగ్రత్త వర్షాకాలం ప్రారంభం కావడంతో తడి వాతావరణం, దోమలవ్యాప్తితో చర్మ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కాలంలో గాట్లు, పుండు పడిన చోట బాక్టీరియా (స్టెఫిలోకాకస్, స్ట్రెప్టోకోకస్) చర్మం లోపలకు ప్రవేశించి సెల్యులైటిస్ను కలిగిస్తుంది. మధుమేహం, హెచ్ఐవీ, బోదకాలు, వెరికోస్ వెయిన్స్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. – డాక్టర్ అబ్దుల్ వారిస్ ఉస్మాని (తాహా), జనరల్ అండ్ లాప్రొస్కోపిక్ సర్జన్ -
Telangana: ఆదివారం మద్యం, మాంసం బంద్
కరీంనగర్ జిల్లా: ఆదివారం వచ్చిందంటే మాంసం దుకాణాల వద్ద ప్రజలు పడి గాపులు కాస్తారు. ఆరోజు సెలవు దినం కావ డంతో పల్లెలు, పట్టణాల్లోని కుటుంబాలు మటన్, చికెన్ తినడానికి ప్రా«ధాన్యం ఇస్తుంటాయి. కాగా, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామస్తులు ఆదివారం పవిత్ర దినంగా భావిస్తూ ఆరోజు మటన్, చికెన్ తిన డం మద్యం తీసుకోవడం నిషేధించుకున్నారు. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ మార్చి 2 నుంచి గ్రామంలో మహాభారత, రామాయణంపై ప్రవచనాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ప్రాముఖ్యతను వివరించారు. ఆదివారం ఆదిదేవుడు సూర్యభగవానుడి రోజని ఆరోజు మద్యం తాగరాదని, మాంసం తినవద్దని బోధించారు. దీంతో గ్రామస్తులు సమావేశమై ఆదివారం ఏ ఇంట్లో మద్యం తీసుకోవడం, మాంసం తినడం చేయరాదని తీర్మానించారు. ఈ విషయం ఇంటింటికీ వెళ్లి వివరించారు. మద్యం, మాంసం నిషేధంపై గ్రామ కూడళ్లలో బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గర్షకుర్తిలో ఆదివారం ఎవరూ మద్యం, మాంసం ముట్టడంలేదు. -
స్థానిక సమరానికి బీజేపీ సై
● కేంద్రమంత్రి బండి సంజయ్ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చర్యలు లేవా? గ్రామ ఽశివారులోని సర్వే నంబర్ 399లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతోనే ఇదంతా జరిగింది. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించడమే కాకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఫిర్యాదు చేస్తే ఇప్పటికి చర్యలు లేవు. 27 నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా తీసుకుంటలేరు. – ఆకుల రాజేశ్వర్రావు, గట్టుదుద్దెనపల్లి, మానకొండూరుకరీంనగర్టౌన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు కమల దళం సై అంటోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహం, చేపట్టాల్సిన కార్యక్రమాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోమవారం సాయంత్రం కరీంనగర్లోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పార్టీ మండలాధ్యక్షులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల్లో వాతావారణం బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ హవా ఎంత ముఖ్యమో, పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థికి ఉన్న ఇమేజ్ కూడా అంతే ముఖ్యమన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకని పంచాయతీ, మండల, మున్సిపాలిటీల పరిధిలో వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉన్న నాయకులంతా పోటీలో ఉండాలని సూచించారు. మిగిలిన వారంతా పార్టీని గెలిపించే బాధ్యతను భుజాన వేసుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా రెండు అంశాలను ప్రచారం చేయాలన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులివ్వకుండా స్థానిక సంస్థలను ఏ విధంగా నీరుగార్చింది? అభివృద్ధి పనులు చేసిన సర్పంచులకు బిల్లులివ్వకుండా ద్రోహం చేసిందనే విషయంతో పాటు 19 నెలల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలకు నిధులివ్వకుండా, కనీస అభివృద్ధి పనులు చేయకుండా ఏ విధంగా నష్టం చేకూరుస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు సహా శ్మశానవాటికల నిర్మాణం వరకు కేంద్రం ఇచ్చిన నిధులతోనే నిర్మించారనే విషయాన్ని ఇంటింటికీ, గల్లీగల్లీకి తీసుకెళ్లి స్థానిక సంస్థల్లో విజయాలు సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్ యాదగిరి సునీల్రావు, పార్లమెంట్కన్వీనర్ ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల ప్రతిభ గుర్తించడానికే పోటీలు
● సీపీ గౌస్ ఆలం ● పోలీస్ డ్యూటీ మీట్ ప్రారంభంకరీంనగర్క్రైం: పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంచడం కోసం పోలీసు డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. సోమవారం కమి షనరేట్ కేంద్రంగా రాజన్న జోన్–3 స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నేర దర్యాప్తులో మరింత శాసీ్త్రయత కోసం డ్యూటీ మీట్ ఉపయోగపడుతుందన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారు వరంగల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికచేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, విజయ్ కుమార్, వాసాల సతీశ్, వేణుగోపాల్, యాదగిరి స్వామి, రంగనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజు బాధేసింది.. ఈరోజు ఆనందంగా ఉంది
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలో ఇన్నాళ్లు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ప్రతిష్టాత్మకంగా భావించానని, చాలామంది తమను హకీంపేటకు మార్చాలని దరఖాస్తులు వచ్చాయని కానీ 200 ఎకరాల్లో ఉన్న హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కంటే కరీంనగర్లోని స్పోర్ట్స్ స్కూల్ చాలా బాగుందని సంబురపడ్డారు క్రీడా మంత్రి వాకటి శ్రీహరి. సోమవారం కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డిలతో కలిసి పర్యటించారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు శాట్స్ ఎండీ, చైర్మన్లతో కలిసి ఒక రోజు ఉదయాన్నే వెళ్లానని కానీ నేను అనుకున్నట్లుగా అక్కడ వసతులు లేవని తినకుండానే తిరిగొచ్చామన్నారు. కరీంనగర్కు వచ్చే ముందు హకీంపేటలోనే ఏమీ లేవు ఇక కరీంనగర్ ఎలా ఉంటుందో అనుకొని వచ్చానని కానీ ఇక్కడి వసతులు, వాతావరణం, సౌకర్యాలు చూసి మనసు ఉల్లాసమైందన్నారు. నాకు ఆరోజు బాధేసిందని..కానీ ఈ రోజు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగ ఆయాన కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ను చూసి మురిసిపోయారు. ప్రపంచం గర్వపడేలా క్రీడల్లో రాణించాలని చిన్నారులకు సూచించారు. క్రీడా వసతులపై శాట్స్ ఎండీ ఆరా కరీంనగర్లో క్రీడా శాఖ మంత్రి పర్యటన సందర్బగా రాష్ట్ర క్రీడా శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి కూడా వచ్చారు. మంత్రి ఇతర కార్యక్రమాలకు వెళ్లగా ఆమె ప్రాంతీయ క్రీడా పాఠశాలను పరిశీలించి క్రీడా వసతులపై ఆరా తీశారు. కాసేపు శాట్స్, క్రీడా శాఖ, ఒలింపిక్, క్రీడాపాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. క్రీడా పాఠశాలలో రెజ్లింగ్, జూడో, అథ్లెటిక్స్ తదితర క్రీడాంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో శాట్ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, డీవైస్వో శ్రీనివాస్ గౌడ్, డీఈవో శ్రీరామ్ మొండయ్య, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త గసిరెడ్డి జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ క్రీడా పాఠశాలపై మంత్రి వాకటి శ్రీహరి -
రాజన్నకు మొక్కులు
వేములవాడ: రాజన్నను సోమవారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముసురును సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్, అశోక్, జయకుమారి, పర్యవేక్షకులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. 25 రోజుల్లో రూ.2 కోట్ల ఆదాయం రాజన్నకు 25 రోజుల్లో హుండీల ద్వారా రూ.2 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో రాధాబాయి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య సోమవారం హుండీలలోని కట్నాలు, కానులను ఆలయ అధికారులు, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు లెక్కించారు. రూ.1,99,84,960 నగదు, మిశ్రమ బంగారం 188 గ్రాములు, మిశ్రమ వెండి 14.300 కిలోలు సమకూరినట్లు ఈవో తెలిపారు. ఆలయ ఎస్పీఎఫ్ ఏఎస్సై మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
ప్రమాణాలు పాటించకనే కాళేశ్వరం కుంగుబాటు
శంకరపట్నం(మానకొండూర్): కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడంతోనే కుంగిపోయిందని, బాధ్యులపై ప్రభుత్వం కేసు నమోదు చేయాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. సోమవారం ప్లీనరీ సమావేశంలో మాట్లాడారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే కాంట్రాక్టర్లు, బీఆర్ఎస్ నేతలు లబ్ధి పొందారని ఆరోపించారు. అవినీతి పాల్పడిన నాయకులు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరంకుశపాలనను అంతం చేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామని వివరించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి అంబేడ్కర్ సుజల స్రవంతి అని నామకరణం చేయాలన్నారు. అనంతరం తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. కోదండరాంకు జిల్లా కన్వీనర్ మోరె గణేశ్ నాగలిని బహూకరించారు. రాష్ట్ర ప్రధన కార్యదర్శులు ముక్కెర రాజు, అరికెల్ల స్రవంతి, ధర్మార్జున్, మండల అధ్యక్షుడు రమేశ్, శ్రీనివాస్, సతీశ్, భానుకిరణ్, సాయిరాం, అరుణ్, రాజేశ్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం -
సెలవు ప్రకటించాలి
ఏటా జూలై రెండో మంగళవారం శీత్లా పండుగ జరుపుకుంటాం. అమ్మవారలకు సంప్రదాయ వేశధారణలో మొక్కులు చెల్లించుకుంటాం. శీత్లాభవాని వేడుకలకు ప్రభుత్వం సెలవు ప్రకటించాలని కోరుతున్నాం. – గుగులోత్ కళావతి, మాజీ జెడ్పీటీసీ, వీర్నపల్లి రాష్ట్ర పండుగగా గుర్తించాలి శీత్లాభవాని పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి బడ్జెట్ కేటాయించాలి. గోర్ బంజారాల పండుగలను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికై నా ప్రభుత్వం గుర్తించాలి. – గూగులోత్ రవిలాల్నాయక్, మద్దిమల్ల ఒకే రోజు జరుపుకోవాలని.. జిల్లాలోని అన్ని మండలాల్లో గల తండాల్లో ఒకే రోజు శీత్లా భవాని వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించాం. గతంలో రెండు వారాల పాటు పండుగను జరుపుకునేవారు. ఈసారి ఈనెల 8న అన్ని తండాల్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని సూచించాం. – గుగులోతు సురేశ్నాయక్, బంజారాసేవా సంఘం జిల్లా అధ్యక్షులు -
తండ్రి సాయంతో కొడుకు చోరీ
మంథని: మంథని మండలం బిట్టుపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ కేసులో తండ్రీకొడుకులను అరెస్ట్ చేసినట్లు సీఐ రాజు తెలిపారు. సోమవారం మంథని పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. గత 18న బిట్టుపల్లికి చెందిన కందుకూరి లక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ధర్మారం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు రాయినేని అనిల్, రాయినేని మల్లయ్య.. లక్ష్మి ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఘటనా స్థలంలో అంబర్ ప్యాకెట్ను గుర్తించారు. ఈ క్రమంలో మలయ్య, అనిల్పై అనుమానంతో విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. అలాగే మంథని మండలం పుట్టపాకలో ట్రాక్టర్, సుందిళ్ల పంపుహౌస్లో ఇనుపరాడ్స్, మంథని పెట్రోల్బంకు వద్ద బైక్, వాసవీనగర్లోని ఓ ఇంట్లో దొంగతనం, ముత్తారం మండలంలో వడ్ల చోరీ, రామగిరి మండలంలో రెండు ట్రాన్స్ఫార్మర్ల దొంగతనం కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పల్లెల్లో స్పెషల్డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మంథని, రామగిరి, ముత్తారం ఎస్సైలు పాల్గొన్నారు. -
పదిగంటల జీవో సంగతి తేల్చాలి
జ్యోతినగర్(రామగుండం): రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ పది గంటల జీవో విడుదల సంగతిని తెలియజేయాలని ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద మాట్లాడారు. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించకుండా పది గంటల జీవో ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని విధానంపై జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో కాపీలను దహ నం చేశారు. నాయకులు రెడపాక లక్ష్మణ్, పుల్లూరి నాగభూషణం, రాజమల్లయ్య, చింతల సత్యం, దగ్గుల సత్యం, కడారి సునీల్, సీహెచ్.ఉపేందర్, తోకల రమేశ్, కె.విశ్వనాథ్, ముద్దసాని దామోదర్రెడ్డి, జయసింహ తదితరులు పాల్గొన్నారు. -
అడవంతా పండుగ..
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి: గిరిజనుల ఆరాధ్య దైవం శీత్లాభవాని అమ్మవారి వేడుకలకు తండాలు ముస్తాబయ్యాయి. అడవి బిడ్డల ప్రత్యేక పండుగగా శీత్లా భవానిని వేడుకుంటారు. వర్షాకాలం ఆరంభమై పెద్దపూసల కార్తీలో గిరిజన తండాలో శీత్లా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. జూలై తొలి, రెండో మంగళవారాల్లో సంప్రదాయ బద్ధంగా పండుగ జరుపుకుంటారు. తండాల పోలిమేర్ల వద్ద శీత్లా భవానిని ప్రతిష్టించి యువతులు బోనాలు ఎత్తుకుని అక్కడికి చేరుకుంటారు. కోళ్లు, మేకలు, గొర్రెలను బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. పశువులన్నింటినీ ఒక చోట చేర్చి బలి ఇచ్చిన మేక పేగు మీదుగా వాటిని దాటిస్తారు. బావి నుంచి తెచ్చిన నీటిని వాటిపై చల్లుతారు. ఆ కారణంగానే దీనికి దాటుడు పండుగగా పేరొచ్చింది. గిరిజన యువతుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కాగా రాజన్నసిరిసిల్ల జిల్లాలోని 126 తండాల్లో ఒకే రోజు మంగళవారం పండుగ నిర్వహించాలని జిల్లా బంజారా సేవా సంఘం ప్రతినిధులు నిర్ణయించారు. నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు.. శీత్లా భవాని వేడుకలను పురస్కరించుకుని ఉదయమే గిరిజనులు నైవేద్యాలతో ఊరేగింపుగా అటవీ ప్రాంతానికి తరలివెళ్తారు. అక్కడ తమ దేవతలైన శీత్లా భవాని, తుల్జా భవాని, మసూరి భవాని, అంబ భవాని, దుర్గా భవాని, మాతలకు మొక్కులు చెల్లించుకుంటారు. పిల్లపాపలు, పశు సంపద బాగుండాలని, పంటలు సంమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా కురువాలని పూజలు చేస్తారు. అనంతరం గిరిజన మహిళల నృత్యాలు ఉంటాయి. శీత్లా భవాని తల్లిని ప్రధాన దేవతగా కొలుస్తారు. పెళ్లికాని యువతులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మంచి వరుడు దొరకాలని వేడుకుంటారు. మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండుగ కోసం సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా స్థిరపడినవారు స్వగ్రామాలకు చేరుకుంటారు. నేడు శీత్లా భవాని వేడుకలకు తండాలు ముస్తాబు నైవేద్యాలతో అటవీ ప్రాంతాలకు తరలనున్న గిరిజనులు కోరికలు నెరవేరుతాయి శీత్లాభవాని అమ్మవారిని కొ లిస్తే కోరికలు నెరవేరుతా యి. పశుసంపద, పంటలు, ఆయురారోగ్యాలతో ఉండాలని పండగ రోజు అమ్మవా రిని కొలుస్తాం. పిండి నైవేద్యాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకుంటాం. ఏటా ఇదే మాసంలో పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. – అజ్మీరా రజిత, మాజీ సర్పంచ్, బుగ్గారాజేశ్వర తండా -
విద్యారంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కరీంనగర్: పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగిడి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారని, ప్రైవేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు పెంచుతున్నా వి ద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్నా రు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షులు అంగిడి దేవేందర్, జీవన్, తాత్విక్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక రైలుకు స్పందన కరువు
కరీంనగర్రూరల్: కరీంనగర్–తిరుపతి ప్రత్యేక రైలుకు ప్రయాణికులు కరువయ్యారు. వారానికి ఒకరోజు నడిచే ఈ ప్రత్యేక రైలు పూర్తిగా త్రీ టైర్ ఏసీ కంపార్ట్మెంట్లు ఉండటంతో పాటు ప్రయాణ సమయం, హాల్టింగులు ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు ఆసక్తి చూపడంలేదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణమధ్య రైల్వే ఈనెల 6నుంచి తిరుపతి–కరీంనగర్ ప్రత్యేక రైలును నడిపిప్తోంది. తిరుపతిలో ప్రతీ ఆదివారం రాత్రి7.45గంటలకు బయల్ధేరి మరుసటిరోజు సోమవారం ఉదయం7.18గంటలకు కరీంనగర్కు చేరుకుంటుంది. మొత్తం తిరుపతి నుంచి 4ట్రిప్పులు, కరీంనగర్ నుంచి 4ట్రిప్పులు నడిపించనున్నారు. సాధారణంగా తిరుపతి వెళ్లే రైళ్లకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. నెలరోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకునే ప్రక్రియతో పాటు తత్కాల్ సౌకర్యం ఉంటుంది. మొత్తం ఏసీ కంపార్ట్మెంట్లుండగా జనరల్ కంపార్ట్మెంట్లు లేకపోవడంతో పాటు అనువుగాని సమయంలో నడిపిస్తున్న ప్రత్యేక రైలుకు ప్రయాఱికుల ఆదరణ కరువైంది. ఈ ప్రత్యేక రైలును రెగ్యులర్ రైలు తరహాలో అన్ని కంపార్ట్మెంట్లతో నడిపించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. త్రీ టైర్ ఏసీ బోగీలకే పరిమితం జనరల్ ప్రయాణికులకు నిరాశ -
తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా తల్లీ!
కరీంనగర్: బతకడం కన్నా... చావడమే చాలా తక్కువ బాధ.. అంటూ వేములవాడకు చెందిన రోహిత్(24) రాసిన సూసైడ్నోట్ కంటతడి పెట్టిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఉప్పుగడ్డకు చెందిన దీటి వేణుగోపాల్–రాణి దంపతులకు ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు రోహిత్ శనివారం అర్ధరాత్రి దాటాక ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం తల్లిదండ్రులు చూడడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇటీవల రోహిత్ బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్ద ఉంటున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రోహిత్ మరణం ఆ కుటుంబంలో విషాదం నింపింది. తండ్రి గోపాల్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.సూసైడ్నోట్లో ఇలా..నా జీవితంలో గొప్ప సూసైడ్ లేఖ రాయాలన్న కోరిక నెరవేరింది. బతకడం కన్నా చావడం తక్కువ బాధగా అనిపిస్తోంది. చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఇది నా విధి కావచ్చు. ఇక జన్మలు వద్దు. నా శరీరాన్ని కాశీ ఘాటులో దహనం చేయండి. నా కోరికలు నెరవేరినవే.. కానీ కలలు కాదు. నా జీవితం తట్టుకోలేనిది అయిపోయింది. మానవ సంబంధాలు కొన్ని పవిత్రం, మరికొన్ని బాధతో నిండినవే. నేను ఇక జన్మించనక్కర్లేదు. అంటూ ఆ యువకుడు డాక్టర్ డి.ఆర్. అని తన సూసైడ్నోట్లో రాశాడు. -
గొర్రెలు.. బర్రెలు ఇస్తే నేనేం చేసుకోవాలి?..తనకు కేటాయించిన శాఖలపై మంత్రి అసంతృప్తి
సాక్షి, కరీంనగర్ జిల్లా: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కింద ఇచ్చిన శాఖలపై శ్రీహరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన శాఖలన్నీ గందరగోళంగా ఉన్నాయి.ఇది అదృష్టమో, దురదృష్టమో తెల్వదు.పదేళ్లలో ఆగమైన శాఖలను నాకు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ గందరగోళంగా ఉంది.ఐదు శాఖలూ ఆగమాగంగానే ఉన్నాయి.యువజన సర్వీసులు ఇస్తే నేనేం చేసుకోవాలి..? గొర్రెలు, బర్రెలు ఇస్తే ఏం చేసుకోవాలి?అని వ్యాఖ్యానించారు. -
అప్పుల బాధతో దినసరి కూలీ మృతి
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లికి చెందిన దినసరి కూలి కుమ్మరి పోచయ్య(65) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పోచయ్యకు ఒక్కగానొక్క కూతురు చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడుతుండగా.. పలు ఆస్పత్రుల్లో చూపించేందుకు రూ.2లక్షల వరకు వెచ్చించాడు. కుటుంబ పోషణ, కూతురుకు వైద్యం అందించేందుకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక ఆదివారం తెల్లవారుజామున చెట్టుకు ఉరివేసుకున్నాడు. మృతునికి భార్య రాజవ్వ, కుమార్తె తిరుమల ఉన్నారు. ఎస్సై వేముల లక్ష్మణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్షాక్తో వ్యక్తి మృతికరీంనగర్ క్రైం: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఓ కూలీ కరెంట్షాక్తో మృతి చెందాడు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల వివరాల ప్రకారం మధ్యప్రదేశ్కు చెందిన సునీల్ విశ్వకర్మ(29) భవన నిర్మాణ కూలీ పనులు చేసేందుకు కరీంనగర్కు వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. శనివారం సాయంత్రం నగరంలోని చైతన్యపురిలో ఒక భవనంలో పనిచేస్తుండగా ఇనుప చువ్వలను కట్చేసే క్రమంలో కరెంట్ షాక్ వచ్చి కింద పడిపోయాడు. తోటి కార్మికులు అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. ఈ విషయంపై అతని భార్య పూజ ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. హైందవ సంస్కృతిని ఇతర దేశాలూ ఆచరిస్తున్నాయి వేములవాడ: హైందవ సంస్కృతిని ప్రపంచ దేశాలు సైతం ఆచరిస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. నాలుగు రోజులుగా రాజన్న ఆలయంలో నిర్వహిస్తున్న చతుర్వే స్మార్త పరీక్షలు ఆదివారం ముగిశాయి. దేశ నలుమూలల నుంచి వచ్చిన పండితులు, విద్యార్థులనుద్దేశించి ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. చతుర్వేద స్మార్త పరీక్షల్లో ఉతీర్ణత సాధించిన 157 మంది వేద పండిత విద్యార్థులకు పట్టాల పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. రూ.76కోట్లతో ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వేదపండితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈవో రధాభాయి, ఏఈవో శ్రీనివాస్, అశోక్కుమార్, జయకుమారి పాల్గొన్నారు. -
కథలాపూర్లో ఒకరిపై హత్యాయత్నం
కథలాపూర్: మండలకేంద్రంలో ఓ వ్యవసాయ భూమికి వెళ్లే దారి విషయంలో ఆదివారం వివాదం చోటుచేసుకుని హత్యాయత్నానికి దారితీసింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన తిక్క మల్లేశ్, తిక్క రాహుల్ మధ్య కొంతకాలంగా దారి విషయంలో వివాదం నడుస్తోంది. ఆదివారం ఉదయం మల్లేశ్ పొలం వద్దకు వెళ్లగా.. అక్కడే రాహుల్, కోరుట్లకు చెందిన ఆదిత్య ఉన్నారు. దారి విషయంలో మరోసారి వివాదం జరిగింది. దీంతో మల్లేశ్పై రాహుల్, ఆదిత్య కలిసి కట్టెలతో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మల్లేశ్ను చికిత్స నిమిత్తం కోరుట్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాహుల్, ఆదిత్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. -
చిన్నమ్మే పాప ప్రాణం తీసింది..!?
కోరుట్ల: పట్ణణంలో శనివారం రాత్రి హత్యకు గురైన ఆరేళ్ల బాలిక హితక్షి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. చిన్నారిని ఆమె చిన్నమ్మే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముందుగా మృతదేహం దొరికిన ఇంటి యజమానిని అనుమానించినా వాస్తవం కాదని నిర్ధారించుకున్నారు. తోటికోడలు పెత్తనం సహించలేకే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. హత్యలో ఒక్కరే ఉన్నారా..? లేక మరెవరైనా పాలుపంచుకున్నారా..? అన్న కోణంలో విచారణ చేపడుతున్నారు. ఇంటి పెత్తనంపై ఈర్ష్య..? కోరుట్లలోని ఆదర్శనగర్కు చెందిన ఆకుల మదన్మోహన్కు ఇద్దరు కుమారులు. రాము, లక్ష్మన్ కవలలతోపాటు ఓ కూతురు ఉన్నారు. రాముకు నవీనతో.. లక్ష్మణ్కు మమతతో గతంలోనే వివాహమైంది. నవీన, మమత అక్కాచెల్లెళ్ల కూతుళ్లు. రాము, నవీన దంపతులకు కుమారుడు వేదాంశ్, కూతురు హితక్షి (6) ఉన్నారు. లక్ష్మణ్ మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మదన్మోహన్ ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. ఏడాది క్రితం కుమారులిద్దరినీ తన వెంట తీసుకెళ్లాడు. అప్పటి నుంచి నవీన, మమత అత్తతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన మమత నాలుగు నెలల క్రితం ఆన్లైన్లో బెట్టింగ్కు పాల్పడి రూ.18 లక్షలు కోల్పోయినట్లు సమాచారం. దీనిపై కోరుట్ల పోలీస్స్టేషన్లో సైబర్క్రైం కేసు నమోదైంది. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియకుండా ఉంచాలని అనుకు న్నా.. సాధ్యంకాలేదు. పైగా కుటుంబంలో కొద్ది కాలంగా గొడవలు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో నవీనకు గుర్తింపు ఎక్కువగా ఇస్తున్నారని మదనపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నవీనాపై ద్వేషం, ఈర్ష్య పెంచుకున్నట్లు తెలిసింది. అంతా పథకం ప్రకారమే.. కక్ష పెంచుకున్న మమత.. నవీన కూడా తనలాగే బాధపడాలని భావించి అదునుకోసం కొద్దికాలంగా ఎదురుచూసినట్లు సమాచారం. శనివారం ఉదయం వేదాంశ్, హితక్షిని స్కూల్కు పంపిన నవీన.. ఆడపడుచుతో కలిసి కరీంనగర్కు షాపింగ్ కోసమని వెళ్లడంతో ఇంట్లో అత్తతోపాటు మమత మాత్రమే ఉన్నారు. సాయంత్రం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మమత వారితో కలిసి పెద్దపులుల వేషధారణలు చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో తన వెంట కూరగాయలు కోసే కత్తి, మొక్కలు కత్తిరించే కట్టర్ను వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. సమీపంలోని ఇంటికి గేట్, బాత్రూంకు తలుపు లేకపోవడం.. సదరు ఇంటి యజమానికి ఆ ఏరియాలో కొంత వివాదాస్పదుడిగా పేరు ఉండటంతో ఆ ఇంటిని హత్య కోసం ఎంచుకున్నట్లు సమాచారం. రాత్రి 7.30 గంటల సమయంలో ముగ్గురు పిల్లలను ఇంటికి పంపిన మమత హితక్షిని సదరు ఇంట్లోకి తీసుకెళ్లి గొంతుపై కత్తితో కోసినట్లు, కట్టర్తో మెడ, గొంతు చుట్టు కత్తిరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హితక్షి చనిపోగానే హడావుడిగా ఇంటికి తిరిగి వెళ్లిన మమత.. రక్తం మరకలు ఉన్న దుస్తులు వాషింగ్ మిషన్లో వేసి దుస్తులు మార్చుకుని.. అందరితోపాటు హితక్షి కోసం వెతికినట్లు సమాచారం. హితక్షి మృతదేహం దొరకగానే నవీనతో కలిసి ఆసుపత్రికి వచ్చిన మమత అక్కడ బోరున విలపించడం గమనార్హం. కీలకంగా మారిన డాగ్స్క్వాడ్ శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో హితక్షి కనిపించకపోవడంతో సుమారు గంటన్నర పాటు వెతికిన నవీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 9 గంటల సమయంలో సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని బాత్రూంలో హితక్షి మృతదేహం లభ్యమైంది. రాత్రి పది గంటల సమయంలో ఎస్పీ అశోక్కుమార్, మెట్పల్లి డీఎస్పీ రాములు కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి క్లూస్ టీం, డాగ్స్క్వాడ్ సాయంతో విచారణ జరిపారు. మొదటగా బాలిక మృతదేహం దొరికిన వ్యక్తిని అనుమానించిన పోలీసులు.. అతను వరంగల్ జిల్లాలోని నర్సంపేటలో ఉన్నానని చెప్పడంతో వీడియోకాల్ సాయంతో ధ్రువీకరించుకున్నారు. ఇంట్లో ఏమైనా కుటుంబకలహాలు ఉన్నాయా..? అనే విషయంపై దృష్టి సారించిన పోలీసులు అదే రాత్రి డాగ్ స్క్వాడ్ను రప్పించారు. ఆ డాగ్ బాలిక మృతదేహం దొరికిన ఇంటి నుంచి మళ్లీ బాలిక ఉండే ఇంటికి వెళ్లి ఆగిపోయినట్లు సమాచారం. దీంతో బాలికను ఇంట్లోని వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానించారు. పట్టించిన సీసీ కెమెరా.. డాగ్ స్క్వాడ్ చిన్నారి ఇంటి గేటు వద్ద ఆగిపోవడంతో పోలీసులు.. ఇంటి ముందున్న సీసీ కెమెరాను పరిశీలించారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో పెద్దపులుల వేషధారులు ఆడుతుండగా.. మమత వాటిని చూసేందుకు తన ఇద్దరు కూతుళ్లతోపాటు వేదాంశ్, హితక్షిని తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. అరగంట తర్వాత ముగ్గురు పిల్లలు మాత్రమే ఇంటికి చేరుకున్నారు. తరువాత 15 నిమిషాలకు మమత హడావుడిగా ఇంట్లోకి వెళ్లిన దృశ్యాలు కనిపించాయి. అదే సమయంలో మమత వెంట హితక్షి లేకపోవడంతో పోలీసులు ఆమెను అనుమానించి అదుపులోకి తీసుకుని విచారించారు. బాలిక హత్యలో మమతతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం మాత్రమే వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం హితక్షి తాత మదన్మోహన్, తండ్రి రాములు సౌదీ నుంచి ఇంటికి చేరుకోగా.. అంత్యక్రియలు పూర్తి చేశారు. మలుపు తిరిగిన బాలిక హత్య కేసు.. పోలీసుల విచారణలో నివ్వెరపోయే నిజాలు తోటికోడలు పెత్తనంపై ఈర్ష్య, ద్వేషమే కారణమా..? కొంత కాలంగా ఇంట్లో గొడవలు లోతుగా విచారణ చేపడుతున్న పోలీసులు -
చేపల వేటపై నిషేధం
● పునరుత్పత్తి దశ కావడంతో నిర్ణయం ● జూలై, ఆగస్టులో చేపలు పడితే చర్యలు ● రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర చేప పిల్లల ఉత్పత్తి జగిత్యాలఅగ్రికల్చర్: జలాశయాలు, చెరువులు, కుంటలు, వరదకాలువ, గోదావరి పరీవాహక ప్రాంత జలాశయాల్లో జూలై, ఆగస్టు నెలల్లో చేపలు పట్టకుండా మత్స్యశాఖ నిషేధాజ్ఞలు జారీ చేసింది. మత్స్యశాఖ ఆదేశాలు ఉల్లంఘించి చేపలు పడితే, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ రెండు నెలల్లో చేపల పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి, చేపల పునరుత్పత్తి ప్రక్రియను దెబ్బతీయవద్దని సూచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లంపల్లి బ్యాక్ వాటర్, గోదావరి నదిలో, వరదకాలువలో చేపలవేటపై పూర్తిస్థాయి మానిటరింగ్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. నిషేధం ఎందుకంటే వర్షాకాలంలో ఇబ్బడి, ముబ్బడిగా వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో చేపల్లో పునరుత్పత్తి హార్మోన్ బలంగా అభివృద్ధి చెందుతుంది. జూలై, ఆగస్టులో చేపలు తమ పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆడ చేపలు ఎగ్ రిలీజ్ చేస్తే, మగ చేపలు స్పెర్మ్ను రిలీజ్ చేస్తాయి. దీంతో చేప పిల్లలు బయటకు వస్తాయి. ముఖ్యంగా, వర్షాకాలంలో జలాశయాల్లోకి కొత్త నీరు వస్తుండటం, ఆ నీరుతో పాటు చెత్త, చెదారం కొట్టుకుని వచ్చి నీళ్లపై తేలుతూ ఉంటాయి. ఈ సమయంలో చెత్త, చెదారం కింది భాగంలో ఆడ చేపలు గుడ్లపై పొదుగుతుంటాయి. వాటిపై సూర్యరశ్మి పడి, 2–3 రోజుల్లోనే గుడ్ల నుండి చేప పిల్లలు బయటకు వస్తాయి. ఈ ప్రక్రియంతా జూలై, ఆగస్టులో 3నుంచి 5 సార్లు జరుగుతుంది. రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు రెండు కిలోల చేపల నుంచి లక్షన్నర పిల్లలు బయటకు వస్తాయి. అందులో 10శాతం బతికినా.. పదివేల చేపలు ఉత్పత్తి అవుతాయి. దాదాపు టన్ను నుంచి టన్నున్నర చేపల ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. వర్షాకాలంలో చేపలు వేటగాళ్లకు తొందరగా చిక్కుతాయి. ఈ రెండు నెలల్లో ఒక్కచేపను కోల్పోయిన, దాని నుంచి వచ్చే లక్ష చేప పిల్లలను కోల్పోయినట్లే. ఈ మేరకు చేపల సంఖ్యను పెంచేందుకు మత్స్యశాఖ స్పష్టమైన అదేశాలు జారీ చేసింది. జిల్లాలో నెలకు 100– 150 టన్నుల చేపల ఉత్పత్తి జిల్లాలోని అన్ని జలాశయాల్లో నెలకు 100నుంచి 150 టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. 696 చెరువులు, కుంటలు ఉండగా, వాటి పరిధిలో 18,336 హెక్టార్ల విస్తీర్ణం గల భూమి ఉంది. జిల్లాలో మొత్తం 254 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, వాటిలో 18,500 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు. వీరంతా చెరువులు, కుంటల్లోని చేపలను పట్టుకుని ఉపాధి పొందుతున్నారు. చెరువుల్లోని చేపలతోనే ఉత్పత్తి గత కొన్నేళ్లుగా జిల్లాలోని చెరువుల్ల్లో 100 శాతం సబ్సిడీపై చేప పిల్లలను వదిలారు. ఈ పథకం పెద్దగా ఉపయోగపడలేదు. చేప పిల్లలను వదిలే సమయం అంటూ లేకుండా వదలడంతో చిన్న చేప పిల్లలను పెద్దవి తినడం, వాతావరణం సహకరించక కొన్ని చేప పిల్లలు చనిపోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్న చేపలను రెండు నెలల పాటు వేటాడకుండా, అలాగే వదిలేస్తే ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలు అవసరం లేకుండా, చెరువుల్లోని చేపలతోనే లక్షలు, కోట్లు చేపలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్క చేపను పట్టినా పునరుత్పత్తిని దెబ్బతీసినట్లే ఈ రెండు నెలల్లో ఒక్కచేపను పట్టినా లక్షల చేపలను పుట్టకుండా చేసినట్లే. జూలై, ఆగస్టు నెలల్లోనే చేపలు పునరుత్పత్తి చేస్తుంటాయి. కాబ ట్టి జలాశయాల్లోని చేపలకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. ఎవరైనా చేపలు పడితే అధికారుల దృష్టికి తీసుకురావాలి. – అరుణ్కుమార్, మత్స్యశాఖ నిపుణుడు, జగిత్యాల రెండునెలల పాటు నిషేధం జూలై, ఆగస్టు నెలల్లో జిల్లాలోని జలాశయాల్లో చేపల వేటను నిషేధించడమైంది. మత్స్యకారుల ఉపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిషేధాజ్ఞలు జారీ చేయడమైంది. చేపలు పట్టడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియ నిలిచిపోతుంది. – శ్రీనివాస్, మత్స్యశాఖాధికారి, జగిత్యాల -
‘చిరు’సాయం భవితకు నవోదయం
● సత్ఫలితాలిస్తున్న ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ● అనాథ పిల్లలకు కొండంత అండ ● ఈనెల 31వరకు ఆపరేషన్ ముస్కాన్ కరీంనగర్: చిన్నారుల సంరక్షణలో భాగంగా జిల్లా బాలల సంరక్షణ విభాగం, పోలీసు, కార్మిక శాఖ సంయుక్తంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో ఏటా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట నిర్వహిస్తున్నారు. అనాథలకు కొండంత అండగా భరోసా ఇస్తున్న ఆపరేషన్ స్మైల్, అపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. ఎవరెవరిని సంరక్షిస్తారంటే భిక్షాటన చేసే, తప్పిపోయిన చిన్నారులు, బస్టాండ్లోని బాలలు, వీధి, అనాథ, బాల కార్మికులు, బడి మానేసిన పిల్లలు, చెత్త సేకరించే వారు, మతి స్థిమితం లేని వారు, బాల్య వివాహాలు అడ్డుకోవడం, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనే విభాగాల్లో చిన్నారులను గుర్తించి సంరక్షిస్తారు. సందర్భానుసారంగా ఆయా వాటిల్లో యజమానులు, నిర్వాహకులపై పోలీసు, కార్మిక శాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. అనాథ బాలల సంరక్షణలో భాగంగా సీడబ్ల్యూసీ (బాలల సంక్షేమ సమితి) ఎదుట హాజరుపర్చుతారు. వారి ఆదేశాల మేరకు చర్యలు చేపడుతారు. శాఖల సమన్వయంతో రెండు బృందాలు ఏర్పాటు ప్రభుత్వం ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జులైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు 11వ విడత ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్లకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కాని స్టేబుళ్లు, మహిళా కానిస్టేబుల్ను నియమించారు. ఈ కమిటీలు జిల్లా బాలల సంరక్షణ విభాగం, కార్మిక, విద్య, ఇతర శాఖల సమన్వ యంతో నెలపాటు వ్యాపార సంస్థలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, పరిశ్రమలు, బస్టాండ్, రైల్వే స్టేషన్లు.. ఇలా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తారు. బిచ్చగాళ్లుగా మారిన వారిని, వీధి బాలలు, బాల కార్మికులు, డ్రాపౌట్లు, వేధింపులు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు. ఐదేళ్లలో 479 మందికి విముక్తి చిన్నారులను ఎవరైనా పనిలో పెట్టుకుంటే మొదట సదరు యజమానికి, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తారు. మార్పు రాకుంటే కేసులు నమోదు చేస్తారు. బాల కార్మికులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించడం, బడుల్లో చేర్పించడం, అనాథలైతే.. చైల్డ్ హోంలో చేర్పించడం, ఇతర రాష్ట్రాల వారుంటే అక్కడి సిబ్బందితో మాట్లాడి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం, బాల్య వివాహాలు ఆపడం వంటివి చేస్తుంటారు. ఐదేళ్లల్లో ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాలు నిర్వహించగా 479మంది బాల కార్మికులు, ఇతరులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏడాది ఆపరేషన్ స్మైల్ ఆపరేషన్ ముస్కాన్ 2021 244 45 2022 58 31 2023 17 07 2024 19 25 2025 33 ముస్కాన్ ప్రారంభమైంది ఈనెల 31వరకు కార్యక్రమం ఈనెల అఖరు వరకు జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ము స్కాన్ కార్యక్రమం నిర్వహిస్తాం. ప్రతి ఏడాది ప్రత్యేక డ్రైవ్లు చేపట్టి బాల కార్మికులను గుర్తిస్తున్నాం. పట్టుబడిన బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం, వారి తల్లిదండ్రులకు అప్పగించడం, పనిలో పె ట్టుకునే యాజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. – సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారి, కరీంనగర్ -
ఎస్సై వేధించాడని ఆత్మహత్యాయత్నం
ధర్మారం(ధర్మపురి): పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్స్టేషన్ ఎస్సై లక్ష్మణ్ వేధించాడని ఆరోపిస్తూ మండలంలోని మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబసభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాములు చిన్న కుమారుడు సాగర్ను ఇదే గ్రామానికి చెందిన 8 మంది 2021 జూలై 7న హత్య చేశారు. ఈ కేసులో ఇదే గ్రామానికి చెందిన పోలవేణి రామయ్యతో పాటు అతడి కుటుంబసభ్యులు ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు ప్రసుత్తం కోర్టులో ట్రయల్కు వచ్చింది. ఈక్రమంలో రాములు రాజీపడితే పోలవేని రామయ్య రూ.22 లక్షలు ఇచ్చేందుకు గ్రామ పెద్దమనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ కేసులో కోర్టు తీర్పు ప్రకారం శిక్షపడితే నిందితులకు ఆ డబ్బులు రాములు వాపస్ ఇవ్వాలని పెద్దల సమక్షంలో దాదాపు ఎడు నెలల క్రితం ఒప్పందం జరిగింది. కాగా, అదే రోజు ధర్మారం గ్రామీణ బ్యాంకులో మృతుడి తండ్రి రాములు సోదరుడు మల్లేశంతో పాటు హత్య కేసులో నిందుతుల తరఫున మరో వ్యక్తి పేరిట జాయింట్ అకౌంట్లో రూ.22లక్షలు జమచేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో నిందితులకు సానుకూలంగా సాక్ష్యం చెప్పాలని ఒప్పందం ఉండగా, సాక్ష్యులతో పాటు తండ్రి సైతం నిందితులకు సానుకూలంగా చెప్పినట్లు సమాచారం. కానీ, మృతుడి తల్లి మాత్రం తన కుమారుడిని గ్రామానికి చెందిన రామయ్య, అతడి కుటుంబసభ్యులే హత్య చేశారని కోర్టులో వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. మృతుడి తల్లి తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని నిందితులకు సంబంధించిన పెద్దమనుషులు రాములు సోదరుడు మల్లేశంపై ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తానని చెప్పినా పెద్దమనుషులు ఒత్తిడి తీసుకువస్తున్నారని శనివారం రాములు పోలీస్స్టేషన్లో ఎస్సైని కలిసి వివరించాడు. ఈ విషయంలో డబ్బులు ఇవ్వాల్సిందేనని ఎస్సై వేధించడంతో మనస్తాపానికి గురైన రాములు ఆదివారం మధ్యాహ్నం 100 నంబర్కు ఫోన్ చేసి తాను ఎస్సై వేధింపులకు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాని చెప్పాడు. పొలం వద్ద పురుగుల మందుతాగాడు. కుటుంబసభ్యులు అక్కడకు వెళ్లి అపస్మారక స్థితిలో పడిఉన్న రాములును కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రాములును వేధించలేదు: ఎస్సై లక్ష్మణ్ హత్యకేసులో రాజీ కుదుర్చుకున్న విషయంలో బ్యాంకులో జమ చేసిన డబ్బులు ఇవ్వాలని పెద్దమనుషులు ఒత్తిడి తెస్తున్నారని, వారిని స్టేషన్కు పిలిపించాలని రాములు శనివారం స్టేషన్ వచ్చినట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. అయితే హత్య కేసులో రాజీ కుదుర్చుకోవడం నేరమని, తాను ఎవరినీ పిలిపించనని రాములకు చెప్పి పంపించినట్లు పేర్కొన్నారు. అతడిని వేధించినట్లు ఆరోపించడం సరికాదన్నారు. కరీంనగర్ ఆసుపత్రికి తరలింపు -
ఆధునిక హంగులు.. సౌకర్యాలు
● సింగరేణిలో డబుల్, ట్రిపుల్ బెడ్రూం క్వార్టర్లు ● అధికారులకు 143, కార్మికులకు 860 క్వార్టర్లు ● 1,003 క్వార్టర్లకు రూ.450 కోట్లు కేటాయింపు గోదావరిఖని(రామగుండం): సంస్థవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు ఆధునిక హంగులతో క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. జీప్లస్ వన్ పద్ధతిలో అధికారులకు ట్రిపుల్ బెడ్రూం, కార్మికులకు డబుల్ బెడ్రూం నిర్మించనున్నారు. ఈమేరకు సింగరేణి బోర్డు ఆమోదం పొందింది. అధికారులు, ఉద్యోగుల 1,003 క్వార్టర్ల నిర్మాణానికి రూ.450కోట్లు కేటాయించింది. గోదావరిఖని, శ్రీరాంపూర్, భూపాలపల్లి, మణుగూర్ ప్రాంతాల్లో క్వార్టర్లను నిర్మించనుంది. శిథిలావస్థకు చేరిన క్వార్టర్లు సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కార్మికుల కోసం 50 ఏళ్ల క్రితం టీవన్టైపు, డీ టైపు పేరుతో పైకప్పు సిమెంట్ రేకులతో క్వార్టర్లను నిర్మించింది. సింగిల్ బెడ్రూం, హాలు, కిచెన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పురాతన క్వార్టర్లు కార్మికులకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఐటీ ఇంజినీర్లు, పలు ప్రాంతాల్లో ఉన్నతస్థాయి విద్యను అభ్యసించిన కార్మికుల పిల్లలు ఇక్కడకు వస్తే ఉండేందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఈక్రమంలో క్వార్టర్ పక్కనున్న స్థలంలో షెడ్డు, అదనపు నిర్మాణం చేపట్టినా ఏమూలకూ సరిపోవడం లేదు. గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు సంస్థలో నూతన క్వార్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో పలు ఏరియాల్లో పాత క్వార్టర్లను తొలగించి వాటిస్థానంలో నూతనంగా క్వార్టర్లను నిర్మించేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఆధునిక పద్ధతిలో విశాలంగా.. సింగరేణిలో అధికారులకు మిలీనియం ఏబ్లాక్ పద్ధతిలో 35 క్వార్టర్లు, మిలీనియం బీబ్లాక్ విధానంలో 108 క్వార్టర్లు ఖరారు చేసింది. ఉద్యోగులు, సూపర్వైజర్ క్యాడర్ కోసం మిలీనియం సీబ్లాక్ పద్ధతిలో 300 క్వార్టర్లు, వర్క్మెన్ల కోసం మిలీనియం డీబ్లాక్ 560 క్వార్టర్లు నిర్మించనున్నారు. గతంలో నిర్మించిన ఎండీటైపు క్వార్టర్ల మాదిరిగా ప్రతీ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నారు. క్వార్టర్ల కోసం యాజమాన్యం టెండర్ ప్రక్రియ సిద్ధం చేసింది. త్వరలో టెండర్ల ద్వారా క్వార్టర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్కు కేటాయించనున్నారు. ఆధునిక సౌకర్యాలతో.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, హంగులతో కార్మికులకు డబుల్ బెడ్రూం, అధికారులకు ట్రిపుల్ బెడ్రూంలు నిర్మించేందుకు నిర్ణయించాం. జీప్లస్ వన్ విధానంలో నిర్మాణాలు కొనసాగుతాయి. రూ.450కోట్లు వెచ్చించేందుకు బోర్డు అనుమతి లభించింది. – ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి ప్రాంతం అధికారులు కార్మికులు వ్యయం (రూ.కోట్లలో) గోదావరిఖని 36 282 133 శ్రీరాంపూర్ 39 410 193 భూపాలపల్లి 22 60 45 మణుగూరు 46 108 79 -
కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ
కరీంనగర్: కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ అవినీతికి పాల్పడ్డ వారికి అండగా ఉంటూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతి పరులు విదేశాల్లో డ్యాన్స్లు చేస్తుంటే మోదీ ప్రభుత్వం, రాజ్యాంగం, చట్టాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పుతుందని, సమాజం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచిందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాల్సి అవసరముందన్నారు. అర్హులైన వారందరికీ ఇండ్లు ఇవ్వాలని ఈనెల 15లోపు జిల్లాలోని అన్ని నియోజక వర్గాల శాసన సభ్యులకు వినతిపత్రాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్లపెల్లి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడే బాగుండేది
మేము ఇద్దరం, మా పిల్లలు న లుగురు.. వారి పిల్లలతో కలిసి ఉండేవాళ్లం. మా మనుమలు, మనుమరాండ్లు పెద్దగా అ య్యే వరకు కలిసి ఉన్నాం. ఆ కాలంలో అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉండేవాళ్లం. రాత్రి పూట క లిసి భోజనం చేసేవాళ్లం. ఇంట్లో ఎవరికీ కష్టం వచ్చి నా పెద్దమనిషి ముందు ఉండి నడిపించేవారు. రా త్రయితే ఇంటి ముందర మా గల్లీలో ఉన్న వాళ్లంతా చేరి మాట్లాడుకునేవాళ్లం. ఇప్పుడు అందరూ టీవీ లు చూస్తూ ఇళ్లలోనే ఉంటున్నారు. పక్కింటి వారిని కూడా మాట్లాడించే పరిస్థితులు లేవు. ఆ రోజులే బాగుండేవి. – నిమ్మ మల్లమ్మ, నారాయణపూర్ కలిసిమెలిసి ఉండేవాళ్లం మేము ఐదుగురం అన్నదమ్ములం. అందరం ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా అందరికీ పెళ్లిళ్లు అయి, పిల్లలు కలిగే వరకు కూడా మా పెద్ద ఇంట్లోనే కలిసి ఉన్నాం. రాత్రయితే అందరం కలిసి భోజనం చేసేవాళ్లం. భోజనం సమయంలో మా ఇంట్లో రోజూ పండుగ వాతావరణం కనిపించేది. ఉద్యోగం, ఉపాధి, పిల్లలు చదువుల దృష్ట్యా ఇతర ప్రాంతాలకు వెళ్లడం.. ఒకే ఊరిలో ఉన్న విడివిడిగా ఉండిపోతున్నాం. అప్పటి రోజులు ప్రేమానురాగాలతో బాగుండేవి. – లద్దునూరి తిరుపతి, నారాయణపూర్ ఎవరి పనిలో వారు బిజీ ఎనుకటి రోజులే బాగుండేవి. ఇద్దరు కొడుకులు, ఒక కూతురుతో కలిసి ఉన్న జ్ఞాపకాలను మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబానికి మించిన ఆనందం మరొకటి లేదు. పండుగ వచ్చిందంటే అందరం ఒక చోట చేరితే ఇల్లంతా సందడిగా ఉండేది. కొడుకులు, కోడళ్లు, కూతురు, అల్లుడు.. వారి పిల్లలతో రోజులు గడిచిపోయేది. ఇప్పుడు ఎవరికి వారు వేరుగా ఉండడంతో రోజుల తరబడి కలుసుకోవడం లేదు. అప్పటి రోజులు మళ్లీ వస్తే బాగుండు అనిపిస్తుంది. – ముంజ ఎల్లయ్య, ఇల్లంతకుంట -
తల్లీ, కొడుకుల ఆదర్శ నిర్ణయం
● మరణానంతరం నేత్ర, అవయవాల దానంకు అంగీకారం ● కూతురు పుట్టిన రోజున స్ఫూర్తిదాయకమైన సందేశం కోల్సిటీ(రామగుండం): ‘అమ్మా... నేను చనిపోయాక నేత్ర, అవయదానం చేయ్యాలని నిర్ణయించుకున్న...’ అని కొడుకు తన మనసులోని మాటను తల్లికి చెబితే... ఇదేం పిచ్చి ఆలోచన అంటూ వద్దని వారించలేదు తల్లి. మంచి నిర్ణయం బిడ్డాని భుజం తట్టింది. నేను కూడా నీలెక్కనే నేత్ర, అవయదానం చేస్తానంటూ తల్లి కూడా ముందుకు వచ్చింది. తనకు పాఠాలు చెప్పిన టీచ్చర్ సమక్షంలో ఆ ఆదర్శ కొడుకు, తన తల్లితో కలిసి అంగీకార పత్రాలను సదాశయ ఫౌండేషన్కు సమర్పించారు. గోదావరిఖని పవర్హౌజ్ కాలనీలో నివాసం ఉంటున్న కాంపెల్లి స్వామి, జయ దంపతుల కుమారుడు శివగణేశ్. డిప్లామోఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ(డీఎంఎల్టీ) కోర్సు చేస్తున్నాడు. మరణానంతరం మనిషి నేత్రాలు, అవయవాలను దానం చేస్తే పలువురికి పునఃర్జన్మ ఇవ్వొచ్చని భావించాడు. విషయాన్ని తనకు చదువు చెప్పిన టీచర్ శశికళకు తెలిపాడు. తన సోదరి ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా శనివారం శివగణేశ్ తన తల్లితో కలిసి నేత్ర, అవయవదానం చేయడానికి అంగీకారాన్ని ప్రకటించారు. వారి నివాసంలోనే అంగీకార పత్రాలపై సంతకాలు చేసి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి సీహెచ్.లింగమూరికి శశికళ టీచర్ సమక్షంలో సమర్పించారు. వారికి ఆర్గాన్ డోనర్కార్డులతోపాటు అభినందన పత్రాలను అందజేశారు. తల్లీ, కొడుకు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శనీయమని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, గౌరవ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, ముఖ్య సలహాదారులు నూక రమేశ్ కార్యదర్శి భీష్మాచారి, ప్రచార కార్యదర్శి కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎ.ఎల్లప్ప, సారయ్య, కోశాధికారి రాజేందర్ అభినందించారు. -
అను‘బంధం’ దూరమై..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అవ్వ..అయ్య..అన్న..తమ్ముడు..వదిన..మరదలు..అక్క..బావ.. పిల్లలు.. ఇలా అందరూ కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబాలు పల్లెల్లో గతంలో కనిపించేవి. ఒక్క పూటకు అందరికీ భోజనాలు సరిపోవాలంటే పెద్ద గంజులో అన్నం, కూర వండి కలిసి తినేవారు. ఆ ఇళ్లలో నిత్యం పండుగ వాతావరణం కనిపించేది. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వస్తే అందరూ దగ్గర ఉండి ధైర్యం చెబుతూ వ్యాధి తగ్గే వరకు చుట్టూ తిరుగుతూ ప్రతీ క్షణం బాగోగులు చూసుకునేవారు. కానీ నేడు భార్య, భర్త, పిల్లలు చాలు అంటున్న కుటుంబాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ కుక్కర్లో అన్నం.. ప్రెషర్ కుక్కర్లో కూరలు వండుకొని ఎవరికీ తీరినప్పుడు వారు తినేసి ఉద్యోగం, ఉపాధిబాట పడుతున్నారు. జ్వరమొచ్చినా.. జలుబు వచ్చినా పరామర్శించే వారు కరువవుతున్నారు. మనోధైర్యం చెప్పేవారు కనిపించడం లేదు. ఫలితంగా చిన్నపాటి సమస్యలకే ఇంట్లో గొడవలు పెట్టుకోవడం.. అవి కాస్త తీవ్రమైతే ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. పెనవేసుకునే ఉమ్మడి బంధం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు భార్యభర్తల మధ్య పొరపచ్చాలు వస్తే పెద్దలు సర్ది చెప్పేవారు. దీంతో సమస్య అక్కడికక్కడే పరిష్కారమయ్యేది. కానీ నేడు హితబోధ చేసే పెద్దలు దగ్గర ఉండకపోవడంతో దంపతుల మధ్య చిన్నపాటి గొడవలకే మనస్పర్థలకు పోతూ విడిపోవాలనే ఆలోచన లేదంటే లోకం నుంచే వెళ్లిపోవాలనే దురాలోచనతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే బంధాలు.. అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్ సిటిజెన్స్ తాము గడిపిన ఉమ్మడి కుటుంబాల నాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇప్పటి పరిస్థితులను చూస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు మారిన పరిస్థితుల్లో చిన్నకుటుంబాలుగా జీవనం రక్తసంబంధీకుల మధ్య అడ్డుగోడలు ఉద్యోగం, ఉపాధి వేటలో ఇతర ప్రాంతాలకు.. గతాలను నెమరువేసుకుంటున్న నాటితరం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
జమ్మికుంట: మున్సిపల్ పరిధి ఫ్లైఒవర్ బ్రిడ్జిపై 2 బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జోడు కుమార్(27) మున్సిపల్ పరిధిలోని అబాది జమ్మికుంటలోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు వెళ్లి శుక్రవారం అర్ధరాత్రి బైక్పై వస్తున్నాడు. మున్సిపల్ పరిధి కొత్తపల్లి ఫ్లైఒవర్ దిగువకు వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న రామన్నపల్లి గ్రామానికి చెందిన పురెల్ల మధుకర్ అనే వ్యక్తి అజాగ్రత్తగా అతివేగంగా బైక్తో ఢీకొట్టాడు. డివైడర్పై పడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. చికిత్స పొందుతూ మృతిపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన నందయ్య (68) ఒంటరి తనం భరించలేక గతనెల 27న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడని రూరల్ ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. నీటి సంపులో పడి బాలుడు..వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చింతాల్ఠాణాలోని లింగంపల్లి రవి–స్వప్న దంపతుల కుమారుడు లింగంపల్లి రిషి(6) శనివారం ప్రమాదవశాత్తు నీటి సంపులోపడి మృతి చెందాడు. శనివారం పాఠశాలకు సెలవు కావడంతో రిషి ఇంటి వద్దే ఉన్నాడు. ఈక్రమంలో ఆడుకుంటూ వీరి ఇంటి పక్కన కొత్తగా నిర్మిస్తున్న గుర్రం బాలకిషన్ ఇంటి వద్ద గల నీటి సంపులో పడి మృతిచెందాడు. విద్యుత్షాక్తో రైతు..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన చింతల రమేశ్ (49)అనే రైతు శనివారం పొలంమడికి నీరు పెట్టేందుకు ఉపక్రమిస్తుండగా విద్యుత్షాక్తో అక్కడికక్కడే మరణించాడు. పొలం దున్నేందుకు వీలుగా మడిలో నీరు నింపేందుకు విద్యుత్ మోటారును ఆన్చేసే సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు రూరల్ఎస్సై మల్లేశ్ పేర్కొన్నారు. మృతుడికి భార్య సంధ్య, కుమారులు ప్రశాంత్, పవన్కుమార్ ఉన్నారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. -
సీనియర్ పాత్రికేయుడి హఠాన్మరణం
సిరిసిల్లటౌన్: సీనియర్ పాత్రికేయుడు గర్దాస్ ప్రసాద్(43) శనివారం తెల్లవారు జామున హఠాన్మరణం చెందారు. వివిధ సంస్థల్లో పదేళ్లుగా పనిచేసిన ఆయన సిరిసిల్ల నియోజకవర్గం టీవీ 9 కంట్రిబ్యూటర్గా నాలుగేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఉదయం గుండెపోటుకు గురికాగా కుటుంబ సభ్యులు సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనలతో కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ప్రసాద్కు భార్య రేవతి, కూతుళ్లు సంజన(19), సిరిచందన(16), కొడుకు శివేంద్ర(11) ఉన్నారు. సంతాపాలు..ఆర్థిక సాయం ప్రసాద్ మృతిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ సంతాపం ప్రకటించారు. రూ.50వేల ఆర్థికసాయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ చేతలు మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ రూ.25వేలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ రూ.10వేలు అందజేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు రూ.50వేల ఆర్థికసాయాన్ని పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు చేతుల మీదుగా అందజేశారు. ప్రెస్క్లబ్లో అధ్యక్షుడు, కార్యదర్శి ఆకుల జయంత్కుమార్, ఆడెపు మహేందర్ ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయులు కరుణాల భద్రాచలం, టి.వి.నారాయణ, వూరడి మల్లికార్జున్, ప్రెస్క్లబ్ కార్యవర్గం, పాత్రికేయులు నివాళి అర్పించారు. -
ముఖంపై పౌడర్ చల్లి బంగారం చోరీ
రాయికల్: పట్టణంలోని కేశవనగర్కు చెందిన వెల్మ రాధ ముఖంపై పౌడర్ చల్లి నాలుగున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. కేశవనగర్కు చెందిన రాధ మధ్యాహ్నం వేళ ఒంటరిగా ఉంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు గమనించి రాధ వద్దకు వచ్చి ముఖంపై పౌడర్ చల్లారు. ఆ మత్తులో రెండు తులాల కడెం, రెండున్నర తులాల చైన్ ఆగంతులకు ఇచ్చేసింది. కాసేపటికి తేరుకున్న బాధితురాలు లబోదిబోమంది. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సుదీర్రావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యరామడుగు: దేశరాజ్పల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం దేశరాజ్పల్లి గ్రామానికి చెందిన బోడిగె నర్సయ్య(60) అనే వ్యక్తి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. నర్సయ్య కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ వెలిచాలలోని అనాథ ఆశ్రమంలో జీవనం సాగించినట్లు చెప్పారు. ఇటీవల గ్రామానికి వచ్చిన నర్సయ్య అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ శనివారం గ్రామ శివారులో ఉన్న రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు వివరించారు. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న గూడ్స్ రైలు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే గూడ్స్ రైలు సిబ్బంది పోలీసులకు సమాచారమందించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎత్తివేసేందుకు కుట్ర
కరీంనగర్: రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేవేసేందుకు కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్లోని గణేశ్నగర్లో గల బద్దం ఎల్లారెడ్డిభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పెండింగ్ బకాయిల విడుదలపై పూటకో మాట మాట్లాడుతూ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరావు, వెంకటేష్, మచ్చ రమేశ్, జిల్లా ఆఫీస్ బేరర్స్ కేశబోయిన రాము యాదవ్, కనకం సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
బైపాస్ పనుల్లో కదలిక!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: ఉమ్మడి జిల్లా ప్రజలంతా ఎప్పుడెప్పుడా అనిఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ విషయంలో శుభవార్త. ఇప్పటికే పూర్తయిన ఈ రైల్వేలైన్ను కాజీపేట– బల్లార్ష ప్రధాన లైన్తో కనెక్ట్ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇంటర్లాకింగ్ పనులు మార్చి నెలాఖరు నాటికి పూర్తి కావాల్సింది. మే నెలాఖరు నాటికి బైపాస్ రైల్వేలైన్ అందుబాటులోకి రావాల్సింది. ఆ సమయంలో కరీంనగర్–తిరుపతి రైలుకు పెద్దపల్లి స్టాప్ కూడా ఎత్తేశారు. ఇక రైలు పెద్దపల్లికి వెళ్లకుండా నేరుగా.. బైపాస్ మీదుగా జమ్మికుంట వైపు వెళ్లేది. కానీ.. అప్పు డు ఎదురైన పలు సాంకేతిక కారణాలతో పనుల్లో కాస్త జాప్యం చోటుచేసుకున్నట్లు సమాచారం. కానీ... ప్రధాన లైన్కు 1.78 కి.మీల పొడవైన పెద్దపల్లి బైపాస్ లైన్ను కలపడం అంత సులువేం కాదు. ఢిల్లీ మార్గం కావడంతో అనేక రైళ్లను గంటలపాటు నిలపాల్సి ఉంటుంది. చాలా రైళ్లను దారి మళ్లించాల్సి ఉంటుంది. వేలాది కుటుంబాల ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకే అధికారులు ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రైళ్ల రద్దీ తక్కువ ఉన్న రోజున కనీసం 2 నుంచి 3 గంటల్లో ప్రధాన మార్గాన్ని బైపాస్ మార్గంతో కలిపేలా ప్రణాళికలు రూపొందించారు. దీనిని ఆమోదిస్తూ.. సికింద్రాబాద్లోని దక్షిణమధ్య రైల్వే కేంద్ర కార్యాలయం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. ఈనెల 7వ తేదీ దక్షిణ మధ్య రైల్వే జీఎం పర్యటన ఉంది. ఆయన పర్యటన అనంతరం బైపాస్ మార్గం అనుసంధానం షెడ్యూల్పై స్పష్టత రానుంది. ఆర్వోబీ కష్టాలు అన్నీ ఇన్నీ కావు.. కరంనగర్ నగరంలోని తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్వోబీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు ప్రారంభించిన ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పుకున్నా.. ఆ మేరకు పురోగతి కనిపించడం లేదు. ఈ మధ్య పిల్లర్ల పనుల్లో వేగంపెంచారు. ఇపుడున్న రైల్వే గేటు ప్రాంతంలో పిల్లర్లు నిర్మించాల్సిన నేపథ్యంలో రైల్వేగేటును పక్కకు మార్చారు. చొప్పదండికి వెళ్లే క్రమంలో కుడివైపునకు తిరిగే క్రమంలో రోడ్డు చాలా ఇరుకుగా ఉంది. చొప్పదండి నుంచి కరీంనగర్కు వచ్చే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటు అపోలో వరకు, అటు తీగలగుట్టపల్లి అమ్మగుడి వరకు వాహనాలు బారులు తీరి, ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 సార్లు గేట్లు పడటం, ఈ కష్టాలకు వానలు తోడవటంతో స్థానికుల కష్టాలు రెట్టింపయ్యాయి. స్కూలు బస్సులు, చిరువ్యాపారులతోపాటు ముఖ్యంగా అంబులెన్స్లో వచ్చే అత్యవసర రోగులు ఈ మార్గంలో రెట్టింపైన ట్రాఫిక్ కష్టాలతో అవస్థలు పడుతున్నారు. వాస్తవానికి రైల్వే స్టేషన్కు అవతల నుంచి కిసాన్ నగర్ మీదుగా రైల్వే అండర్పాస్ మార్గం ఉంది. దాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో ట్రాఫిక్ పోలీసులు, బల్దియా, ఇతర ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడు నెలల నుంచి సాగుతున్న పనులు రేపు కాజీపేట–బల్లార్ష మార్గంలో జీఎం పర్యటన? ఇంటర్లాకింగ్ పనులకు ఇంకా విడుదల కాని షెడ్యూల్ కొనసాగుతున్న కరీంనగర్ ఆర్వోబీ పనులు నరకం చూస్తున్నామని ప్రజల ఆవేదన కిసాన్నగర్ మార్గాన్ని అభివృద్ధి చేయాలి మేంచిరు వ్యాపారులం. రోజులో కనీసం నాలుగైదుసార్లు రైల్వేగేటు దాటాల్సి ఉంటుంది. ఆర్వోబీ పనుల ఆలస్యంతో మాలాంటి వాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం పనులు వేగంగా చేయాలి. స్టేషన్ పక్కన ఉన్న అండర్పాస్ల మార్గం అభివృద్ధిచేసి ప్రచారం కల్పిస్తే.. ట్రాఫిక్ భారం కాస్త తగ్గుతుంది. అలాగే అంబులెన్స్లకు ఇబ్బందులు తప్పించినవారవుతారు. – లక్ష్మణ్, చంద్రాపూర్ కాలనీ -
స్మార్ట్బిన్ దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి
● లోకాయుక్తను ఆశ్రయించిన సామాజిక కార్యకర్త సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ స్మార్ట్సిటీగా ఏర్పడిన తర్వాత చెత్త సేకరణకు అండర్గ్రౌండ్ స్మార్ట్బిన్లను ఏర్పాటు చేశారు. ఈ స్మార్ట్బిన్ల ఏర్పాటుకు సుమారు రూ.1.07 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ స్మార్ట్ బిన్లను ఇన్స్టాల్ చేసే పని పూర్తికాకముందే మున్సిపల్ అధికారుల సహకారంలో సంబంధిత కాంట్రాక్టర్ బిల్లులు పొందారని సామాజిక కార్యకర్త ఒకరు లోకాయుక్తను ఆశ్రయించారు. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. స్మార్ట్బిన్ల నిర్వహణ లేకపోవడంతో కేవలం కమిషన్లు పొందేందుకే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందని పే ర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన లోకా యుక్త ఈ విషయంపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సీడీఎంఏను ఆదేశించడంతో పాటు ఈ కేసును ఈనెల 24కు వాయిదా వేసింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి ● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం రెవెన్యూ, నగరపాలకసంస్థ రెవెన్యూ, టౌన్ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఫుట్ పాత్, అక్రమ కట్టడాలు, తదితర అంశాలపై చర్చించారు. సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలు అందించాలన్నారు. విలీన డివిజన్లలోని ప్రభుత్వ భూముల్లో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా క్షేత్రస్థాయి సర్వే ద్వారా గుర్తించాలన్నారు. నగరంలో ఎక్కడ ఫుట్ పాత్, రోడ్డు ఆక్రమణలు ఉన్నా వెంటనే డీఆర్ఎఫ్ సాయంతో తొలగించాలని సూచించారు. రీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, నగరపాలక డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, ఇన్చార్జీ డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, తహసీల్దార్ రాజేశ్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య, ఆర్వో భూమానందం పాల్గొన్నారు. మెడికల్ రిప్ల సమ్మెకు ఐఎంఏ మద్దతుకరీంనగర్టౌన్: రేపటి నుంచి(సోమవారం) నుంచి ప్రారంభించనున్న మెడికల్ రిప్రజెంటేటివ్స్ల సార్వత్రిక సమ్మెకు కరీంనగర్ ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) మద్దతు తెలిపిందని తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ కార్యదర్శి మిరుపాల అంజయ్య తెలిపారు. శనివారం ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎనమల్ల నరేశ్, డాక్టర్ నవీన్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులతో మాట్లాడుతూ... నిత్యావసర వస్తువులు, ఔషధాల ధరలు నియంత్రించి, ఔషధాలు , పరికరాలపై జీఎస్టీని ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రవేశాలపై నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ రిప్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చీకోటి శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, కరీంనగర్ శాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు హరీశ్, సహాయ కార్యదర్శి నరేందర్ పాల్గొన్నారు. సమాజాన్ని చదివిన కవి భరద్వాజ కరీంనగర్కల్చరల్: సమాజాన్ని చదివిన కవి రావూరి భరద్వాజ అని కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ పొన్నం రవిచంద్ర కొనియాడారు. శనివారం డాక్టర్ రావూరి భరద్వాజ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువు మధ్యలో ఆపేసిన భరద్వాజ.. గ్రంథాలయంలో పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించి రచయితగా ఎదిగారన్నారు. ప్రముఖ కవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగు రచన ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు భరద్వాజ అ న్నారు. లక్ష్మీగౌతం వందన, సయ్యద్ ము జాఫర్, చెన్న అనిల్కుమార్, అన్నవరం దేవేందర్, నాగభూషణం, అంజయ్య, తంగెడ అశోక్రావు, సురే్శ్ దామెరకుంట శంకరయ్య, ని ర్మల, పీఎస్ రవీంద్ర, గజేందర్రెడ్డి, ప్రభాకర్, జితేందర్, మహేందర్ రాజు తదితరులున్నారు. -
ఎల్ఎండీలోని జెట్ స్కి స్కూటర్ తరలింపు
● అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులుకరీంనగర్: కరీంనగర్ ఎల్ఎండీలోని జెట్ స్కి స్కూటర్ను శనివారం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు తరలిస్తుండగా బీఆర్ఎస్ నగరశాఖ అడ్డుకుంది. నాయకులు లేక్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పర్యాటకశాఖ అధికారులు జెట్ స్కి స్కూటర్ను తిరిగి మానేరు నదిలో యథాస్థానానికి చేర్చారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వందల కోట్లతో అభివృద్ధి చేశారన్నారు. మానేరు డ్యామ్లో రెండు జెట్ స్కి స్కూటర్లు, స్క్రూఈజ్ బోట్ను కొనుగోలు చేసి పర్యాటకులకు అందుబాటులో ఉంచారన్నారు. ప్రస్తుతం మానేరులో నీటి నిలువ డెడ్ స్టోరేజీకి చేరిందని, ప్రభుత్వం స్పందించి డ్యాంను నీటితో నింపాలన్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిరసనలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేశ్, ఏవీ రమణ, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, మైనార్టీ శాఖ అధ్యక్షుడు మీర్ షాకత్ అలీ, ప్రధాన కార్యదర్శి వాజిద్ హుస్సేన్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు చేతి చంద్రశేఖర్, ఆరె రవి, జల్లోజి శ్రీనివాస్, నారదాసు వసంతరావు, నదీం, ఒడ్నాల రాజు, పటేల్ సుధీర్ రెడ్డి, కొత్త అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డ్రైనేజీ నీటి మళ్లింపునకు చర్యలు చేపట్టండి
● ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశంకొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్–సిరిసిల్ల ప్రధా న రహదారిపై కొత్తపల్లి మండలం బావుపేట వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఇంజినీరింగ్ అధికారులకు కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. ప్రయాణం.. ప్రమాదకరం.. రోడ్డుపై నిలుస్తున్న మురుగు నీరు అనే శీర్షికన శనివారం సాక్షిలో ప్రచరితమైన కథనానికి కలెక్టర్ స్పందించారు. బావుపేటలోని రోడ్డుపై నిలిచిన డ్రైనేజీ నీటిని పరిశీలించారు. రహదారి విస్తరణలో భాగంగా నిర్మించిన డ్రైనేజీ మ్యాపును చూశారు.తాత్కాలికంగా నాలా ఏర్పాటు చేసి నిల్వ ఉన్న నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ డీఈ, ఎంపీడీవోను ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం రూ.90లక్షలతో డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని, త్వరలో పనులు చేపడతామని కలెక్టర్ తెలిపారు. రోడ్లు భవనాల శాఖ డీఈ కిరణ్, కొత్తపల్లి తహసీల్దార్ ఆర్.వెంకటలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. కలెక్టర్ ఆదేశాలతో.. కరీంనగర్–వేములవాడ ప్రధాన రహదారి బావుపేట వద్ద నిలిచిన డ్రైనేజీ నీటి మళ్లింపు తాత్కాలిక చర్యలు ప్రారంభమయ్యాయి. మురుగు నీటి మళ్లింపును వెంటనే చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించిన సందర్భంగా గ్రామస్తుల సహకారంతో కచ్చా కాల్వ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గతంలో కొంతమంది స్వార్థం కోసం అడ్డుకోగా.. ప్రస్తుతం వారిపై ప్రజలు, ప్రయాణికులు తిరగబడే సమ యం ఆసన్నమవడంతో తాత్కాలిక పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధుల పర్యవేక్షణలో కచ్చా కాలువ ద్వారా మురుగు నీటి మళ్లింపు చర్యలు చేపడుతున్నారు. -
జై జగన్నాథ
ఆదివారం శ్రీ 6 శ్రీ జూలై శ్రీ 2025భజనలు, కోలాటాలు, నృత్యాలు, భక్తి పారవశ్యం నడుమ సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ రథయాత్ర నగర పురవీధుల్లో శనివారం వైభవంగా సాగింది. జగన్నాథ రథయాత్ర కమిటీ ఆధ్వర్యంలో రాంనగర్లోని రమాసత్యనారాయణస్వామి ఆలయం వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంపూజలు చేసి రథయాత్రను ప్రారంభించారు. వందలాది మంది రథాన్ని లాగగా.. యాత్ర రాంనగర్, మంకమ్మతోట, తెలంగాణచౌక్, బస్టాండ్, వన్టౌన్ పోలీస్స్టేషన్, కమాన్, శాస్త్రిరోడ్, టవర్, రాజీవ్చౌక్ మీదుగా వైశ్యభవన్కు చేరుకుంది. ఇస్కాన్ నరహరి ప్రభుదాస్, యాత్ర కమిటీ సభ్యులు కన్నకృష్ట, తుమ్మల రమేశ్రెడ్డి, ఎల్.భాస్కర్రెడ్డి, బుర్ర మధుసూన్రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపాల్రెడ్డి, జానార్దన్రెడ్డి పాల్గొన్నారు. – కరీంనగర్ కల్చరల్న్యూస్రీల్ -
బల్దియా కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్
● పన్నులు చెల్లించాలంటూ ఫోన్లు ● వాట్సప్ ద్వారా పేటీఎం స్కానర్ ● నమ్మొద్దంటూ కమిషనర్ విజ్ఞప్తికరీంనగర్ కార్పొరేషన్: ‘మున్సిపల్ కమిషనర్ను మాట్లాడుతున్నా.. మీ ట్యాక్స్ పెండింగ్లో ఉంది. స్కానర్ పంపిస్తున్నా.. కట్టండి’. ‘హే బాబు.. పంపించుకోలేదంటా ఇంకా.. పంపించండి.. ఇంకోసారి ఇలా అయితే కేసేస్తా చెబుతున్నా.’ ‘రూ.2,100 పంపించండి.. మీకోసం చేస్తున్నా, మీటింగ్ వెళ్లేదుంది’..అంటూ కరీంనగర్ నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ పేరిట ఫేక్కాల్స్ వచ్చాయి. రెండు రోజులుగా నగరంలోని పలువురి ఫోన్లకు 91210 97923 నంబర్ నుంచి కాల్స్ వచ్చాయి. తాను కమిషనర్ ప్రఫుల్దేశాయ్ని మాట్లాడుతున్నానంటూ చెబుతూ, ట్యాక్స్ కట్టాల్సి ఉంది.. చెల్లించండంటూ వాట్సప్ ద్వారా స్కానర్ పంపించారు. ఫోన్ నంబర్ డీపీ, ట్రూకాలర్లోనూ ‘మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కార్పొరేషన్ ఆఫీస్ తెలంగాణ కరీంనగర్’ అని ఉంది. కాగా, కాల్స్ చేసిన వ్యక్తి కమిషనర్ వాయిస్ని ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయడం గమనార్హం. కాల్స్ను నమ్మిన ఓవ్యక్తి రూ.500 పంపి, తనకు ట్రేడ్ లైసెన్స్ రావడం లేదంటూ అధికారుల వద్దకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫేక్ కాల్స్ నమ్మొద్దు: ప్రఫుల్దేశాయ్ కమిషనర్ను మాట్లాడుతున్నానంటూ వచ్చే ఫోన్ కాల్స్ను నమ్మొద్దు. ఎలాంటి పన్నులు బకాయి ఉన్నా నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయంలోని పౌర సేవా కేంద్రంలో, బిల్ కలెక్షన్ డివైస్ యంత్రాలతో మీ వద్దకు వచ్చే వార్డు ఆఫీసర్లకు (రెవెన్యూ బిల్ కలెక్టర్లు) మాత్రమే చెల్లించాలి. మీ సేవా కేంద్రంలో, మీ మొబైల్ ఫోన్ ఆన్లైన్ యాప్ ద్వారా ఇంటి నంబర్, పీటీఐఎన్ నంబర్తో వివరాలను పరిశీలించిన తర్వాతే పే మెంట్ చేయాలి. ఫేక్ ఫోన్ కాల్స్పై పోలీసులకు ఫిర్యాదు చేశాం. -
నియోజకవర్గాన్ని నంబర్వన్గా తీర్చిదిద్దుతా
● ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్జమ్మికుంట రూరల్/వీణవంక: ఆరేళ్లలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అభివృద్ధికి రూ.20వేల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేశానని, కరీంనగర్ పార్లమెంట్ పరిధిని అభివృద్ధిలో నంబర్వన్గా తీర్చిదిద్దుతానని కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం గండ్రపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.78లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన సీసీ రోడ్లను హుజూరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి ప్రారంభించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్రావు, మండల అధ్యక్షుడు సంపత్రావు, బీఆర్ఎస్ పీఏసీఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, తహసీల్దార్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలకతీతంగా పని చేస్తా వీణవంకలో జాతీయ ఉపాధిహామీ పథకం కింద రూ.1.56కోట్ల నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లను ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డితో కలిసి బండి సంజయ్ ప్రారంభించారు. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయ పార్టీలకతీతంగా స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పని చేస్తున్నానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్రావు, బీజేపీ మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్గౌడ్, జిల్లా కార్యదర్శి నరసింహారాజు, గొట్టిముక్కుల సంపత్రావు, దేవేందర్రావు, సమ్మిరెడ్డి, ఆదిరెడ్డి తదితరులున్నారు.