Karimnagar
-
విద్యుత్ పొదుపుగా వాడాలి
కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్ ఆదాకు నాణ్యమైన ఐఎస్ఐ మార్కుగల, స్టార్ రేటేడ్ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్ కుక్కర్లకు బదులు ప్రెషర్ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి. – కె.ఉపేందర్, డీఈ (టెక్నికల్), కరీంనగర్ సర్కిల్ -
క్రికెట్ కిట్ కొన్నాను
సమ్మర్ హాలీడేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఈసారి నేను క్రికెట్ బ్యాట్, బాల్, కిట్ కొన్నాను. మా ఫ్రెండ్స్తో ప్రతి రోజు ఆడుకుంటున్నాను. టీవీ, మొబైల్ కంటే గ్రౌండ్లో ఆడటం బాగుంటుంది. ఈవినింగ్ క్రికెట్లో కోచింగ్ కూడా తీసుకుంటున్నాను. – హర్ష నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. ఈ సమ్మర్లో పేరెంట్స్ కొత్త రాకెట్ కొనిపెట్టారు. మా కాలనీలో ఫ్రెండ్స్తో కలిసి ఆడుతున్నాం. ఇలా ఆడడం ద్వారా చాలా యాక్టివ్గా ఉంటున్నాను. స్కూల్ మొదలయ్యాక కూడా ఈవినింగ్ ఆడుతాం. – ఆవంతిక -
నా విహార యాత్ర
నా పేరు సాత్విక్. నేను సచ్ దేవా పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఇటీవల నేను వైజాగ్, అరకు లోయలను సందర్శించాను. ఈ యాత్ర నాకు ఎంతో ఆనందం, కొత్త అనుభవాలను ఇచ్చింది. మొదట మేము ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వెళ్లాం. అక్కడ సముద్రపు అలలు, కెరటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సముద్ర తీరంలో నీళ్లలో ఆడుతూ చాలా సరదాగా గడిపాను. అక్కడి ప్రకృతి అందాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. తర్వాత మేము అరకు లోయను సందర్శించాం. అరకు లోయలోని పచ్చని కొండలు, చల్లని వాతావరణం ఎంతో అద్భుతంగా అనిపించాయి. ముఖ్యంగా కొండలపైకి వెళ్లి కిందికి చూస్తే మేఘాలు ఆకాశం నుంచి కిందికి దిగివచ్చినట్టుగా కనిపించాయి. ఆ దృశ్యం నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే గిరిజన గ్రామదర్శిని ఎంతో ప్రత్యేకంగా అనిపించింది. అక్కడి గిరిజనుల సంప్రదాయ వస్త్రధారణ చాలా ఆకట్టుకుంది. నేను కూడా వారిలా అలంకరించుకొని ఫొటోలు దిగాను. ఆ అనుభవం చాలా కొత్తగా, ఆనందంగా అనిపించింది. మేము ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, చాక్లెట్ ఫ్యాక్టరీ, ఉడెన్ బ్రిడ్జ్, బొర్రా గుహలు వంటి అనేక పర్యాటక ప్రదేశాలను సందర్శించాం. ఈ పర్యటన ద్వారా నాకు ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, కొత్త ప్రాంతాల విశేషాలు తెలుసుకున్నాను. ఈ యాత్ర నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోతుంది. –పేరు: కె. సాత్విక్ పాఠశాల: సచిదేవా స్కూల్. ఊరు: గోదావరిఖని , జిల్లా: పెద్దపల్లి -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో.. బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ.
● కార్యక్రమంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తాం‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గం.ల నుంచి మధ్యాహ్నం 01గం.వరకు శిక్షణ ఇస్తారు. శిక్షణలో నేర్పించే అంశాలు: ఐబ్రోస్(త్రేడింగ్), వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచ్,స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఫేస్ప్యాక్స్, హెయిర్ కట్స్, హెయిర్స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, బేసిక్ పింపుల్ ట్రీట్మెంట్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, హెయిర్ కట్స్, కమ్యూనికేషన్ అండ్ సెల్ఫ్ గ్రూమింగ్, శారీ డ్రాపింగ్. -
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణం ఇందిరానగర్కు చెందిన హమలీ కార్మికుడు సందెళ్ల శేఖర్ (27) చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఊపిరాడక మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శేఖర్ తోటి హమాలీలతో కలిసి శుక్రవారం రాయికల్ పెద్ద చెరువు వద్ద విందు ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం స్నానం చేసేందుకు శేఖర్ మద్యం మత్తులో చెరువులోకి వెళ్లగా ఈత వచ్చినప్పటికీ ఊపిరాడక మృతిచెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై దేవేందర్నాయక్ తెలిపారు. -
గంజాయి రవాణా కేసులో ఐదుగురి అరెస్టు
జ్యోతినగర్: గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్టీపీసీ పోలీస్స్టేషన్లో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం సీఐ కృష్ణకుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తరలిస్తేన్నారనే సమాచారంతో ఎస్సై ఆధ్వర్వంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానస్పదంగా వస్తున్న కారును ఆపి తనిఖీ చేయగాఅం గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఒడిశాలోని చిత్రగొండలో కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నారని విచారణలో తేలింది. ఈమేరకు మల్కాన్గిరి జిల్లాకు చెందిన రాజేశ్కుమార్ నాయక్, ఎస్.బషీర్, చైతన్య మాడి, గౌతమ్ రాయ్, సిద్ధార్థ రంజన్ దాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 12 కేజీల గంజాయితో పాటు కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాదారులను చాకచక్యంతో పట్టుకున్న పోలీసు సిబ్బందికి రివార్డులు అందజేయనున్నారు. 12 కేజీల గంజాయి, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి -
చివరి ఉత్తరం
● రాజమహేంద్రవరం గోదావరి గట్టుమీద పాత పోస్టాఫీసు ఉంది. అక్కడ రామయ్య తాత 40 ఏళ్లు పోస్ట్మ్యాన్గా పనిచేశాడు. రిటైర్ అయ్యాక కూడా ప్రతీ రోజు ఉదయం ఆ పోస్టాఫీసు మెట్ల మీద కూర్చుని గోదావరి చూసేవాడు. ● ఒకరోజు ఉదయం తాత చేతిలో పసుపు పచ్చని పాత కవరు పడింది. చిరునామా మసకబారింది. ‘కమల, శారద నిలయం, రాజమహేంద్రవరం’ అని మాత్రమే కనిపించింది. పంపిన వాడి పేరు ‘మోహన్, ముంబాయి’. తేదీ 1987. ● తాతకు గుర్తు వచ్చింది. మోహన్, కమల కాలేజీ ప్రేమ. మోహన్ ముంబాయి ఉద్యోగానికి వెళ్లాడు. కమల తండ్రి పెళ్లి కుదిర్చేశాడు. ఆ తర్వాత వాళ్లు కనిపించలేదు. ● తాత వెంటనే శారద నిలయం వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ 70 ఏళ్ల కమల అమ్మమ్మ ఒంటరిగా ఉంది. తాత ఆ కవరు చేతిలో పెట్టాడు. ఆమె చేతులు వణికాయి. ● ‘ఇది మోహన్ చివరి ఉత్తరం. నా పెళ్లి తర్వాత నేను తిరిగి రాయలేదు. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేదట. రెండేళ్ల క్రితం పోయాడని తెలిసింది’ అని కళ్లు తుడుచుకుంది. ● కవరు తెరిచింది. లోపల చిన్న కాగితం. ‘కమల, నీకు కోపమొచ్చినా నేను వేచి ఉంటా. గోదావరి ఆగుతుందా? నా ప్రేమ కూడా ఆగదు. – మోహన్’ ● కమల అమ్మమ్మ ఆ ఉత్తరం గుండెలకు హత్తుకుంది. 37 ఏళ్ల తర్వాత చేరిన మాటలు, గోదావరి గాలి మోసుకొచ్చిన జ్ఞాపకం. ● ఆ రోజు తాత ఇంటికి నడుస్తూ అనుకున్నాడు, ‘ఒక ఉత్తరం ఆలస్యమైనా, ప్రేమ ఆలస్యం కాదు’. నీతి: మాటలు, భావాలు సమయానికి చేరకపోయినా వాటి విలువ తగ్గదు. నీతి కథఎన్. శ్రీకర్ గ్రామం: ఊటురు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
పొడుపు కథలు
01. వీరు అవిభక్త కవలలు గాలి ప్రాణస్నేహితురాలు స్నేహితురాలు దగ్గరగా వచ్చిందా ఉబ్బితబ్బిబ్బవుతారు కాస్త దూరంగా జరిగిందా చప్పగా చప్పబడిపోతారు కాసేపు కనిపించనేలేదనుకో ప్రాణాలే విడుస్తారు 02. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో వడపొయ్యటమే పని తేనీటిని కాదు.. రక్తాన్ని మలినాలను బయట పారేస్తుంది ఇంటి నుంచి కాదు వంటి నుంచి జవాబులు: 01. ఊపిరితిత్తులు 02. కిడ్ని 03. లివర్03. అత్యంత పెద్ద గ్రంథి ఆహార ధాన్యాల గిడ్డంగి రసాయన ప్రయోగశాల ఎవరో చెప్పుకోండి! డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రచయిత్రి, సిరిసిల్ల -
బన్నీ వేసవి యాత్ర–8
పాలు తాగాక తాతయ్య బయటకు వెళ్లి, ‘బన్నీ రారా’ అని పిలిచాడు. బన్నీ వెళ్లాడు. చుక్క, రామ్ కూడా వచ్చారు. పొలం గట్టు. కింద నీళ్లు. నీళ్లలో బురద. పచ్చగా వరి నాట్లు. తాతయ్య చెప్పాడు, ‘ఇదే మన పొలం. ఇక్కడే అన్నం పుడుతుంది.’ బన్నీకి ఆశ్చర్యం. ‘బియ్యం షాప్ నుండి తెస్తారు కదా తాతయ్యా?’ తాతయ్య నవ్వాడు. ‘లేదు రా. మొదట ఇక్కడే. ఈ బురదలో వంగి పని చేస్తేనే, మనం తలెత్తుకు తినగలం.’ బన్నీకి వివరంగా తాతయ్య చెప్పాడు. బన్నీ గట్టు మీద నడుస్తున్నాడు. అడుగు జారింది. ‘భళ్లున’ బురదలో పడ్డాడు. కాలు మోకాలు వరకు దిగింది. బన్నీకి భయం వేసింది . ‘అమ్మా !’ అని అరిచాడు. చుక్క పరిగెత్తుకు వచ్చింది. ‘భయం వద్దు బన్నీ’ అంది. చెయ్యి ఇచ్చింది. బన్నీ చుక్క చెయ్యి పట్టుకున్నాడు. చుక్క గట్టిగా లాగింది. రామ్ కూడా సాయం చేశాడు. బన్నీ బయటికి వచ్చాడు. కాలు అంతా బురద. కానీ మనసులో నవ్వు. చుక్క అంది, ‘చూశావా? ఆపదలో ఉన్నవాడికి చెయ్యి అందించడమే స్నేహం.’ తాతయ్య బన్నీ తల నిమిరాడు. ‘ఇప్పుడు తెలిసిందా? అన్నం విలువ.’ కష్టపడితేనే పంటలు పండుతాయి. ఆ పంట నుండే తిండి గింజలు వస్తాయి. పిల్లలకి మాట: కష్టం తెలిస్తేనే అన్నం విలువ తెలుస్తుంది. స్నేహం అంటే కష్టంలో చెయ్యి అందించడం. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
అమ్మకాలు పెరిగాయి
ఈ సమ్మర్లో స్పోర్ట్స్ సామగ్రి అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా క్రికెట్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కిట్స్కు డిమాండ్ ఉంది. చిన్నారులు ఎక్కువగా తక్కువ ధరలో ఉండే కిట్స్ కొంటున్నారు. ప్రతీ రోజు షాపులో రద్దీ కనిపిస్తోంది. గతేడాది కంటే ఈసారి వ్యాపారం బాగుంది. – నాగిరెడ్డి సిధారెడ్డి, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు సమ్మర్ క్యాంప్స్తో అమ్మకాలు పెరిగాయి. క్యాంప్కు వచ్చే పిల్ల లు కిట్ కొంటున్నారు. స్విమ్మింగ్, క్యారమ్, చెస్, కరాటే స్పోర్ట్స్ కిట్స్ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. తల్లిదండ్రులు కూడా క్వాలిటీ వస్తువులే కొంటున్నారు. ఈ సీజన్ బిజినెస్ బిజీగా ఉంటుంది. – బుర్ర పవన్, స్పోర్ట్స్ సెంటర్ నిర్వాహకుడు -
పుస్తకం.. మంచి నేస్తం
కరీంనగర్ కల్చరల్: గ్రంథాలయాలు సమాజానికి విజ్ఞానాన్ని పంచే నిలయాలని కలెక్టర్ చిత్రామిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ పేర్కొన్నారు. ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలు’ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆర్టీవో మహేశ్వర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ యువత ఫోన్లకే పరిమితం కాకుండా పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. అనంతరం గ్రంథాల యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పలు పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. -
యూసీఎఫ్కు ఓకే!
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్: నగరపాలకసంస్థను అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకంలో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. గతంలో స్మార్ట్సిటీ కింద ఎంపికై న కరీంనగర్ వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చెందడం తెలిసిందే. మరోసారి అదే స్థాయిలో యూసీఎఫ్ కింద నిధులు వరద రానుంది. ఈ పథకంలో ఎంపిక కోసం ఇటీవల కౌన్సిల్ తీర్మాణం చేసి పంపించగా, క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు శనివారం కేంద్ర అధికారుల బృందం నగరానికి రానుంది. నేడు కేంద్ర అధికారుల బృందం రాక.. యూసీఎఫ్ కింద ప్రతిపాదించిన రూ.895 కోట్ల మూడు ప్రాజెక్ట్లకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అంగీకరించినట్లు సమాచారం. మూడు ప్రాజెక్ట్ల్లో పట్టణ రవాణా మెరుగుదలకు మోడల్ రోడ్లు, జంక్షన్లు, స్కైవాక్లు, నాన్ మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలతోపాటు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం కోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. వర్షపు నీటి కాలువల నిర్మాణం, పునరావాసం, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లు, సమగ్ర ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.65 కోట్లు ఉన్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కు చెందిన అపెక్స్ కమిటీ ఇటీవల ఢిల్లీలో సమావేశమై ఈ ప్రతిపాదనలపై చర్చించి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అందులో భాగంగా కమిటీ ఆదేశాల మేరకు శనివారం కేంద్ర అధికారుల బృందం కరీంనగర్ కు రానుంది. నగరంలో పర్యటించడంతోపాటు స్థానిక అధికారులతో సమావేశం కానున్నారు. ఫలిస్తున్న ‘బండి’ కృషి యూసీఎఫ్ పథకంలో కరీంనగర్ను చేర్చడంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కృషి ఫలిస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే నిధులు వరద పారిస్తానంటూ బండి సంజయ్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే బీజేపీ పాలకవర్గం ఏర్పడ్డాక యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్ ను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. -
పెట్రోమంటపై వినూత్న నిరసన
కరీంనగర్ టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచి సామాన్యులకు షాక్ ఇచ్చిందని, పెంచిన ధరలు తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక గీతా భవన్ చౌరస్తాలో పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే సర్కారు గ్యాస్, పెట్రోల్, డీజిల్, సీఎన్జీ ధరలు పెంచిందన్నారు. పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, జి.రాజేశం, తిప్పారపు సురేశ్, రాయికంటి శ్రీనివాస్, గజ్జల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ క్రీడల్లో ‘ఖాకీ’ సత్తా
హుజూరాబాద్: అఖిల భారత పోలీస్ క్రీడాపోటీల్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని హుజూరాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి సత్తాచాటారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈనెల 9 నుంచి 13 వరకు జరిగిన పోటీల్లో టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ విభాగాల్లో నాలుగు పతకాలు సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన పోలీస్ క్రీడాకారులతో జరిగిన హోరాహోరీ పోటీల్లో ఏసీపీ మాధవి తన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ఆకట్టుకున్నారు. విధుల్లో తీరికలేని అధికారిణిగా సేవలందిస్తూనే క్రీడల్లోనూ రాణించడం విశేషంగా మారింది. టేబుల్ టెన్నిస్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రజత పతకం, జీవో 40ప్లస్ మిక్స్డ్ డబుల్స్లో కాంస్య పతకం సాధించారు. ఎన్జీవో మిక్స్డ్ డబుల్స్లో కాంస్యం కై వసం చేసుకున్నారు. బ్యాడ్మింటన్ జీవో 50ప్లస్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఒకే జాతీయ పోటీల్లో రెండు విభిన్న క్రీడల్లో పతకాలు సాధించడం అరుదైన ఘనతగా చెప్పుకోవచ్చు. పతకాలు సాధించిన ఏసీపీ మాధవిని సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు. సహచర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
జమ్మికుంట: మక్కల కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులను కలిసి కొనుగోళ్ల ప్రక్రియ, గన్నీబ్యాగుల కొరత, రవాణా ప్రక్రియపై ఆరా తీశారు. అధికారులు కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. లోడ్ చేసిన బస్తాలను వెంటనే గోదా ముకు తరలించి, నిల్వ చేయాలన్నారు. మార్కె ట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న, హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, డీఎంవో మహ్మద్ షాబోద్దీన్, తాహసీల్దార్ వెంకట్రెడ్డి, టౌన్ సీఐ రామకృష్ణ, మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శి రాజా, సెంటర్ ఇన్చార్జి ఎగిత అశోక్ పాల్గొన్నారు. కాంగ్రెస్ రైతు దగా ప్రభుత్వంకరీంనగర్ అర్బన్: చెప్పేదొకటి.. చేసేదొకటన్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఉందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రైతు ప్రభుత్వమని సుద్దులు పలికే పాలకులు 20రోజులుగా మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతుల పక్షాన ఎందుకు నిలవడం లే దని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోళ్లను పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మార్కెట్లో అసౌకర్యాలతో పాటు దొంగల బెడద ఉందని, తాగునీరు, నీడ లేదని ఆరోపించారు. మార్క్ఫెడ్తో పాటు వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు పడే ప్రమాదం ఉందని, మక్కలను వెంటనే కాంటా పెట్టి గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. ప్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాం సుందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్లు పొన్నం అనిల్, ఏనుగు రవీందర్ రెడ్డి, తిరుపతి నాయక్, సుంకిశాల సంపత్ రావు, పాల్గొన్నారు. వేగవంతంగా కొనుగోళ్లుకరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మా ర్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగానే కొనసాగుతున్నాయని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేదని, వరి, మొక్కజొన్న కొనుగోళ్లు యథావిధిగా సాగుతున్నాయన్నారు. శుక్రవారం మార్కెట్ యార్డును పరిశీలించి పారిశుధ్య నిర్వహణపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రెండు నుంచి మూడు రోజుల్లో మార్కెట్ యార్డ్ మొత్తం క్లీనింగ్ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. చివరి గింజ వరకూ వరి, మొక్కజొన్నను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. నగర అభివృద్ధే లక్ష్యంకరీంనగర్ కార్పొరేషన్: నగర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని వివిధ డివిజన్లలో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. రెండవ డివిజన్ చంద్రపురికాలనీలో రూ.15.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. 13, 44వ డివిజన్ల పరిధి సప్తగిరికాలనీలో రూ.20 లక్షలతో నిర్మించిన కమ్యునిటీ హాల్ను ప్రారంభించారు. త్వరలోనే ప్రతి డివిజన్ను రూ.10 లక్షల సాధారణ నిధులతో అభివృద్ధి చేస్తామన్నారు. కార్పొరేటర్లు చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, తెల్ల లక్ష్మి రమేశ్ పాల్గొన్నారు. -
పైసలు కొట్టు.. కొలువు పట్టు!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో వివిధ ‘ఖాళీ’ల భర్తీ కొంతమంది అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. ఖాళీని కొత్త వారితో భర్తీ చేసినా, ఉన్నవారికి ‘అప్పగించినా’.. ఆ పోస్టుకు తగినట్లుగా రేటు పలకాల్సిందే. ఇలా కనిష్టంగా రూ.50 వేలు... గరిష్టంగా రూ.2 లక్షలు చేతులు మారుతున్నట్లుగా ఆరోపణలున్నాయి. కొంతమంది అధికారులు తమకు లేని అధికారాలతో బల్దియాపై పెత్తనం సాగిస్తున్న తీరు, అక్రమాలకు బాటలు వేస్తోంది. లేబర్ టు జవాన్.. రూ.50 వేలు? నగరపాలకసంస్థలోని 66 డివిజన్లలో పారిశుధ్య పనులను శానిటేషన్ జవాన్లు పర్యవేక్షిస్తుంటారు. తమకు కేటాయించిన డివిజన్లలో కార్మికుల హాజరు తీసుకోవడం, కార్మికులతో వీధులు, డ్రైనేజీలను శుభ్రం చేయించడం వీరి విధి. 66 డివిజన్లకు గానూ 52 డివిజన్లకే జవాన్లు ఉన్నారు. మిగితా డివిజన్లలో ఇన్చార్జీలు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి డివిజన్కు ఒక జవాన్ ఉండాలనే ఆదేశాలతో ఆరుగురు పారిశుధ్య కార్మికులను అప్గ్రేడ్ చేస్తూ జవాన్లుగా నియమించారు. ఇందులో రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. తాము చీపురు, తట్ట పట్టిన చోటే పర్యవేక్షించే అవకాశం రావడంతో రేటు గట్టిగానే పలికినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని, ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ ‘డీల్’ కుదిరినట్లు సమాచారం. మరో ఏడుగురు కార్మికులను జవాన్లుగా అప్గ్రేడ్ చేసేందుకు సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా ఒకరిద్దరు అధికారులు బేరసారాలు కొనసాగిస్తున్నట్లు పలువురు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. గతంలోనూ అంతే వివిధ కారణాలతో వారధికి సరెండర్ చేయడంతో ఏర్పడిన ఔట్సోర్సింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలోనూ ఒకరిద్దరు అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఇప్పటికే అధికంగా ఉన్నందున కొత్తగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాన్ని ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఖాళీలు ఏర్పడ్డాయనే సాకుతో ‘నియామకాల దందా’కు తెరతీసినట్లు, ఈ వ్యవహారంలో రూ.1.50 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు చేతులు మా రినట్లు సమాచారం. కారణం ఏదైనా ఖాళీల భర్తీ పేరిట కొత్త, పాత వాళ్లతో సాగుతున్న ఈ వసూళ్ల దందాపై కలెక్టర్ ప్రత్యేక దృష్టిపెట్టి విచారణ జరిపించాలని కార్పొరేటర్లు డిమాండ్ చేస్తున్నారు.‘నగరంలో పారిశుధ్య నిర్వహణకు ప్రతి డివిజన్కు ఒక జవాన్ ఉండాలి. ఒక్కో జవాన్కు రెండు డివిజన్ల బాధ్యతలు ఉంటే పర్యవేక్షణ కష్టంగా మారుతోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపిస్తోంది. జవాన్ ఖాళీలు భర్తీ చేయాలి’.. నగరంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు పాలకవర్గ సభ్యుల నుంచి వస్తున్న డిమాండ్ ఇది. దీంతో ప్రతి డివిజన్కు శానిటేషన్ జవాన్ ఉండేలా మేయర్, కమిషనర్లు చర్యలకు పూనుకున్నారు. ఇదే అదనుగా జవాన్ల ఖాళీలను భర్తీ చేసే సాకుతో పారిశుధ్య విభాగానికి చెందిన అధికారులు అక్రమ వసూళ్ల దందాకు తెరలేపారు’.‘నగరపాలకసంస్థ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను గతంలో వివిధ కారణాలతో వారధికి సరెండర్ చేశారు. దీంతో పలుశాఖల్లో ఖాళీలు ఏర్పడి పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. దీంతో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కొద్ది నెలల క్రితం తీసుకొన్నారు. ఈ ‘ఖాళీ’ లను భర్తీ చేసే క్రమంలోనూ పారిశుధ్య విభాగ అధికారులు ఒకరిద్దరు వసూళ్లకు పాల్పడ్డారనే ఫిర్యాదులున్నాయి. చర్యలు తీసుకోవాలి నగరపాలకసంస్థలో కొద్దిరోజులుగా నియామకాల పేరిట జరుగుతున్న పారిశుధ్య అధికారుల అక్రమ కలెక్షన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి. ఎలాంటి ప్రామాణికత లేకుండానే పారిశుధ్య కార్మికులను జవాన్లుగా నియమిస్తున్నారు. పారిశుధ్య నిర్వహణ పేరిట జవాన్లను నియమిస్తూ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించి, కొంతమంది అధికారులు రూ.లక్షలు దండుకొంటున్నారు. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపించి, అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. – గుగ్గిళ్లపు రమేశ్, మాజీ డిప్యూటీ మేయర్ -
బక్రీద్ బందోబస్తు కట్టుదిట్టం
కరీంనగర్క్రైం: బక్రీద్ సందర్భంగా కరీంనగర్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పండగ వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, అక్రమ రవాణా, అనుమానాస్పద కదలికలను అడ్డుకునేందుకు నగర సరిహద్దులు, ప్రధాన రహదారుల వద్ద ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. సీపీ గౌస్ ఆలం గురువారం అర్ధరాత్రి తరువాత మొగ్ధుంపూర్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది పనితీరు, అందుబాటులో ఉన్న రక్షణ పరికరాలపై ఆరా తీశారు. శనివారం వరకు ప్రతి చెక్పోస్టు వద్ద అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లాలో ఆరు చెక్పోస్టులు జిల్లా పరిధిలోని కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్, కొత్తపల్లి మండలం చింతకుంట, చొప్పదండి మండలం ఆర్నకొండ, తిమ్మాపూర్ మండలం రేణికుంట, హజూరాబాద్ మండలం పరకాల ఎక్స్రోడ్డు, గంగాధర మండలం తుర్కసినగర్ వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ చెక్పోస్టులో మూడు టార్చ్లైట్లు, ఎల్ఈడీ బాటన్లు, అత్యవసర విజిల్స్ అందుబాటులో ఉండాలని సీపీ స్పష్టం చేశారు. రాత్రివేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది రిఫ్లెక్టర్ జాకెట్లు ధరించాలని సూచించారు. చెక్పోస్టుల గుండా వెళ్లే ప్రతి వాహనం, వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అనుమానాస్పద వాహనాల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక రిజిష్టర్లు నిర్వహించాలని, సమాచార మార్పిడికి ప్రత్యేక కమ్యూనికేషన్ బేస్సెట్లు ఏర్పాటు చేయాలన్నారు. బక్రీద్ సమయంలో అక్రమ రవాణా, నిబంధనల ఉల్లంఘనలు, అనుమానాస్పద కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే ఈ ప్రత్యేక తనిఖీల ఉద్దేశమని సీపీ తెలిపారు. -
చెప్పుకోండి చూద్దాం
01. నల్లని పాయ కలిగిన జీవనది? 02. శివుడు తలపై పెట్టుకున్న నది దేవత? 03. రాతి గుండ్లకు కమ్మలు పెట్టే నది ? 04. బంగారు వదనం కలిగిన నది? 05. పనికి ‘నాగా’ పెట్టే నది? 06. నంద అలిగి కూర్చుంది ఏ నదిలో? 07. ‘తుంగ’కు జాగ్రత్త చెప్పే నది? 08. వరి పంటను ‘గోదా’ లోకి దింపే నది? 09. నీరు కడుపులో పెట్టుకుని మూసేసే నది? 10. కళ్ళున్న నది ఏమిటి?01. కృష్ణవేణి 02. గంగోత్రి 03. గుండ్లకమ్మ 04. స్వర్ణముఖి 05. నాగావళి 06. అలకనంద 07. తుంగభద్ర 08. గోదావరి, 09.మూసి, 10. నేత్రావతి. – డాక్టర్ కందేపి రాణీప్రసాద్, వైద్యురాలు, రచయిత్రి, సిరిసిల్ల -
నేడు తండ్రి.. నాడు తల్లి మృతి
● అనాథలైన పిల్లలు ఇల్లంతకుంట(మానకొండూర్): రోడ్డు ప్రమాదంలో తండ్రి బుధవారం మృతిచెందగా.. నాలుగేళ్ల క్రితం తల్లి మరణించడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లకు చెందిన ఎరవెల్లి పరుశురాం(43) హనుమాన్ మాల ధరించి విరమణ కోసం బుధవారం కొండగట్టుకు వెళ్లాడు. మాల విరమణ అనంతరం కారులో ధర్మపురి దర్శనానికి వెళ్లగా.. వెల్గటూరు మండలం చర్లపల్లి వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లీదండ్రులు మరణించడంతో ముగ్గురు పిల్లలు.. ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు అనాథలయ్యారు. పెద్దకూతురు ఇటీవల 10వ తరగతి పాసైంది. -
అమ్మ ప్రేమ
అమ్మ మొదటి దైవమురా నేస్తమా అమ్మ ప్రేమ వర్ణించలేము తమ్ముడా భూదేవికి ఉన్నంత ఓర్పు రా ఈ జగతిలో అమ్మ ప్రేమ వర్ణించలేమురా మనను నవమాసాలు కనిపెంచేనుర కంటికిరెప్పలా కపాడెనుర మనకు మొదటి గురువు అమ్మే నేస్తమా ఈ ప్రపంచంలో దొరకదు అమ్మ ప్రేమ తన సుఖాన్నీ కోరుకోదు అమ్మ తన పిల్లలను సుఖంగా చూసుకుంటోంది అమ్మ ప్రయోజకున్ని చేయలనుకుంటుంది అమ్మ తనకు ఆహారం లేకపోయినా నేస్తమా మనకోసం తపన పడుతుంది నేస్తమా కంటికి కనురెప్పలాగా అమ్మ మనల్ని నిత్యము కాపాడుతుంది అమ్మ అమ్మ లేకుంటే మనం లేము తమ్మ ఈ జగతికి మూలాధారం అమ్మ అమ్మ ప్రేమ వెల కట్టలేని ప్రేమ అమ్మను బాగా చూసుకో తమ్మా చిన్నపుడు నిన్ను ఎత్తుకుంది అమ్మ నీవు అనాఽథగా విడిచిపెట్టకు తమ్మ నీవు అమ్మను విడిచిపెట్టకు తమ్ముడా నక్క శ్రీకర్, గ్రామం: ఊటూర్, మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
అయ్యో దేవుడా..
● నాలుగేళ్లలో తల్లిదండ్రుల మృతి ● ఒంటరైన కూతుళ్లు ముస్తాబాద్(సిరిసిల్ల): చేయిపట్టి నడిపించే నాన్న దూరమయ్యాడు. అన్నీ తానై పెంచిన తల్లి కానరాని లోకాలు వెళ్లింది. నాలుగేళ్ల వ్యవధిలో ఆ ఆడబిడ్డలు అనాథలుగా మిగిలారు. మేము ఏం పాపం చేశాం దేవుడా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆలనపాలన చూసుకునే తల్లిదండ్రులు లేక అనాథలుగా మిగిలిన ఆడపిల్లల అంతులేని కథ పలువురి హృదయాలను కదిలిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్కు చెందిన పుట్ట రజిత(38) గుండెపోటుతో బుధవారం మృతిచెందింది. రజిత భర్త బాలరాజు నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మృత్యువాత పడ్డాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు కూతుళ్లు సాయిప్రియ, సాయిప్రసన్న దిక్కులేని పక్షులయ్యారు. నాలుగేళ్ల క్రితం బాలరాజు మృతిచెందినప్పటి నుంచి తల్లి రజిత బీడీలు చుడుతూ పిల్లలను పోషించింది. ఆమె కూడా ఏడాది క్రితం గుండెజబ్బుకు గురైంది. కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. రెక్కాడితే కాని డొక్కాడని రజిత బాధను దిగమింగుకుని జబ్బును భరించింది. తాను ఉన్నంతకాలం పిల్ల లను పోషించుకుంది. వ్యాధి ముదరడంతో రజిత ప్రాణాలు కోల్పోయింది. అన్నీ తానై ఉంటుందనుకున్న అమ్మ కూడా మృతిచెందడంతో సాయిప్రియ, సాయిప్రసన్నల రోదనలు మిన్నంటాయి. గురువారం జరిగిన అంత్యక్రియలలో పెద్ద కూతురు సాయిప్రియ తల్లి చితికి కొరివిపెట్టింది. ఒంటరై అనాథలుగా మిగిలిన సాయిప్రియ, సాయిప్రసన్నలను ప్రభుత్వం, మానవతావాదులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
హుజూరాబాద్: పట్టణంలోని సబ్స్టేషన్ ఎదురుగా కరీంనగర్ ప్రధాన రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి సదానందం, రమేశ్ బైక్పై వెళ్తుండగా ఎదురెదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సదానందం చికిత్స పొందుతూ మృతి చెందాడని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మానేరులో మునిగి బాలిక మృతితిమ్మాపూర్: మానేరు రిజర్వాయర్ వద్దకు విహార యాత్రకు వచ్చిన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎల్ఎండీ పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్కు చెందిన షషాబ్ మోహల్లా (పండ్ల వ్యాపారి) తమ్ముడు పర్వేజ్ ఖాన్, అతని భార్య, పిల్లలు, షషాబ్మోహల్లా కూతురు బమెమా ఐరా ఖాన్ (14) ఇతర కుటుంబ సభ్యులు సాయంత్రం 4:30 గంటలకు మానేరు ప్రాజెక్టు వద్దకు వచ్చారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో పిల్లలు, కుమార్తె నీటిలో దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారు. గమనించిన పర్వేజ్ ఖాన్ నీటిలోకి దూకాడు. చేపలు పడుతున్న వారి సహాయంతో కుమార్తెలను రక్షించాడు. అయితే అప్పటికే షషాబ్ మోహు కుమార్తె ఐరా ఖాన్ నీటిలో మునిగి చనిపోయింది. సాయంత్రం 6 గంటలకు జాలరులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
ఆ నాటి ఆటలే బాగుండే..
మా నాన్న చిన్ననాటి కాలంలో ఊరు మొత్తం పది టీవీలే ఉండేవి. వేసవి కాలం వచ్చిందంటే ఉదయాన్నే నిద్రలేవగానే వరికోసిన మడికట్లలో తొమ్మిదింటి వరకు క్రికెట్ ఆడేవారు. ఇంటికి వచ్చి అన్నం తిని చేనుల వద్దకు వెళ్లేవారు.. ఈత పళ్లు, తాటి ముంజలు, పులిచింతకాలు తెంపుకుని పంచుకునే వారు. దగ్గర్లో ఉన్న బావుల్లో ఈత కొట్టేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ అన్నం తిని చింతచెట్ల కింద ఆడుకునేవారు. ఎండ చల్లబడగానే.. మళ్లీ మడికట్లకు చేరుకునేవారు. సాయంత్రం సూర్యుడు వెళ్లిపోయే వరకు క్రికెట్ ఆడుకుని వచ్చేవారు. రాత్రికి మా నానమ్మ.. చేసిచ్చే చిరుతిండి తినుకుంటూ టీవీ చూసేవారమని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. కానీ.. ఇప్పుడు ఆ ఆటలు కనిపించడం లేదు. అలాంటి స్నేహితులు దొరకడం లేదు. నాన్న ఉద్యోగం, మా చదువుల కోసం సిటీకొచ్చి పడ్డాం.. ఇరుకు గదుల్లో ఉంటూ పంజరంలో పక్షిలా బతుకుతున్నాం. ఎండాకాలం అని మా మమ్మీ ఉదయం తొమ్మిదైనా నిద్ర లేవనివ్వడం లేదు. నిద్రలేచి స్నానం చేసిన తరువాత టిఫిన్ తిని టీవీ చూడడం, మళ్లీ చదువుకోవడం పొద్దంతా ఇంట్లో టీవీలో కార్టూన్లు చూడడం వరకే సరిపోతుంది. బయటికి వెళ్దామంటే అమ్మ ఎండ అంటుంది. గంటో అరగంటో ఆడితేనే అలిసిపోతున్నాం. ఎంతైనా మా నాన్న వాళ్ల చిన్నతనం నాటి రోజులే బాగుంటే.. ఆ ఆటలే మంచిగుండే. – ఎ.అద్వైత్, రెండో తరగతి, హనుమాన్నగర్, కరీంనగర్ -
పిల్లలను ప్రోత్సహించాలి
సెలవుల సమయంలో చదువుతోపాటు కొత్త వ్యాపకాల వైపు పిల్లలను మళ్లించాలి. వేసవి శిక్షణ శిబిరాల్లోనూ పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్స్.. ఇలా పిల్ల ల అభిరుచికి అనుగుణమైన అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. – లీనా ప్రియదర్శిని. ప్రిన్సిపాల్ సెయింట్పాల్స్ హైస్కూల్ నాకు నటన అంటే చాలా ఇష్టం. పైగా అందరిలో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సినిమా, టీవీ చానెళ్లలో నటించాలన్నదే నా కోరిక. అందుకే నటనలో శిక్షణ పొందుతున్నాను. – ఎస్.మాన్విత, 6వ తరగతి -
విద్యుత్షాక్తో కౌలురైతు మృతి
బోయినపల్లి(చొప్పదండి): కౌలుకు తీసుకునన్న మామిడితోటలో విద్యుత్ వైరు తొలగించే క్రమంలో షాక్కు గురై కౌలురైతు గన్నెబోయిన చంద్రయ్య(49) గురువారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం మద్దులపల్లికి చెందిన చంద్రయ్య బోయినపల్లి మండలం కోరెం శివారులో మామిడితోటను కౌలుకు తీసుకున్నాడు. మామిడితోటలో వేసిన కరెంటువైర్ను తొలగించే క్రమంలో చేతికి చుట్టుకుంటూ తీసుకెళ్తుండగా మధ్యలో ఉన్న జాయింట్ వద్ద విద్యుత్ ప్రవహించి షాక్ తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు పరిశీలించగా అప్పటికే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ సీఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. -
నేటితరం అభీష్టం ప్రకారం
మన జీవితంలో సినిమా, సోషల్ మీడియా భాగమై పోయింది. స్టేజీషోలు, టీవీషోల్లో పాల్గొనాలని తమలోని నటనను పదుగురికి చూపించాలని పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి, అభీష్టం మేరకు సినిమాకు సంబంధించిన వివిధ అంశాలలో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 30 మంది చిన్నారులు మా ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. – అనసూరి భూనాథాచారి, మాస్క్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, రోల్ ప్లే ఇన్స్ట్రక్టర్ -
బన్నీ వేసవి యాత్ర–7
ఉదయం అయ్యింది. కొక్కొరోకో అని కోడి కూసింది. బన్నీకి మెలకువ వచ్చింది. పక్కన చూశాడు. రామ్, చుక్క, స్వప్న లేచారు. అందరూ శుభోదయం చెప్పుకున్నారు. నానమ్మ దగ్గరకు వచ్చింది. చేతిలో ఒక పుల్ల. ఇది వేప పుల్ల రా బన్నీ అంది. దీంతో పళ్ళు తోము.్ఙ అన్నది. బన్నీ మొహం చిట్లించాడు. కోల్గేట్ లేదా? అన్నాడు. తాతయ్య నవ్వాడు. ఇదే మన పాత పేస్ట్ రా. పంటికి బలం. అన్నాడు. బన్నీ వేప పుల్లతో పళ్ళు తోమాడు. కొంచెం చేదు. కానీ ఫ్రెష్గా ఉంది. తర్వాత తాతయ్య బన్నీని కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఆవు. పేరు లక్ష్మి. ఇది మన లక్ష్మ్ఙి అన్నాడు తాతయ్య. తాతయ్య పాలు పితికాడు. బన్నీ చూస్తూ ఉన్నాడు. నానమ్మ పాలను వేడి చేసి, ఒక గ్లాసులో పోసి బన్నీకి ఇచ్చింది. బన్నీ తాగాడు. చక్కెర వెయ్యలేదు. అయినా తియ్యగా ఉన్నాయి. ‘ఎందుకు నానమ్మా?’ అన్నాడు బన్నీ. నానమ్మ నవ్వింది. ‘ప్రేమ కలిపానురా కన్నయ్యా... అందుకే తియ్యగా ఉన్నాయి’. అన్నది. బన్నీకి ఆశ్చర్యం. ప్రేమకి రుచి ఉంటుందా? పిల్లలకి మాట: పాలు ప్యాకెట్లో రావు. ఆవు, గేదెల నుంచి వస్తాయి. ప్రేమతో రుచి పెరుగుతుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
మేము గీసిన బొమ్మలు
పేరు : మొగిలి సౌధామిని 8వ తరగతి గ్రామం: ముత్తారం జిల్లా: పెద్దపల్లిపేరు: స్రవిష్ట గంగుల పాఠశాల: సెయింట్ జాన్స్ హైస్కూల్ 7వ తరగతి కరీంనగర్పేరు: డి. జాయ్ నిర్వేద్ 4వ తరగతి గ్రామం: ఎఫ్సీఐ, ఎలకలపల్లి గేట్ రామగుండం జిల్లా: పెద్దపల్లి పేరు: టేకుమట్ల చరిష్మా ఏడో తరగతి, గ్రామం: పాతర్లపాడు మండలం: చింతకాని జిల్లా: ఖమ్మంపేరు: బుర్ర భవానిఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ తరగతి: 9వ తరగతి గ్రామం: కరీంపేట, మండలం: శంకరపట్నం జిల్లా: కరీంనగర్ పేరు: సంగుల మోక్ష తరగతి: 4వ తరగతి వేములవాడ జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: తడుక శ్రేయాన్షి తరగతి: 2వ తరగతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రామం: కనగర్తి, కోనరావుపేట జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: విహాన్ దవాల్జీ తరగతి: యూకేజీ స్వస్థలం: సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల -
ప్రియుడే హంతకుడు
● దూరం పెడుతోందని అంతం చేశాడు ● వీడిన మహిళ హత్యకేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ పాలకుర్తి: పాలకుర్తి మండలం పుట్నూర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన మహిళ హత్యకేసు మిస్టరీ వీడింది. తనను దూరం పెడుతోందని ప్రియుడే దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బసంత్నగర్ పోలీస్స్టేషన్లో పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గురువారం వెల్లడించారు. గ్రామానికి చెందిన బౌతు సుమలత తండ్రి పక్షవాతంతో మంచానికే పరిమితం అయ్యాడు. అతనికి సేవలు చేస్తూ సుమలత జీవనం సాగిస్తోంది. కొన్నేళ్ల క్రితం గ్రామానికి చెందిన వేల్పుల స్వామితో సుమలతకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు ప్రేమగా మారింది. ఇరువురు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామి మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో పలుమార్లు తన తల్లిని కొట్టడంతో పోలీస్స్టేషన్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సుమలత తనను పెళ్లి చేసుకోవాలంటే తాగుడు మానేయ్యాలని ఆంక్షలు విధించింది. దీనికి తోడు స్వామి సెల్ నంబరును బ్లాక్లిస్టులో పెట్టింది. మాట్లాడడం మానేసింది. దీంతో సుమలతపై స్వామి కోపం పెంచుకున్నాడు. ఇంకెవరికో దగ్గరవుతున్నదనే అనుమానం పెంచుకున్నాడు. సుమలతను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 12వ తేదీ రాత్రి 11.40 గంటల ప్రాంతంలో తన ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న సుమలత మెడపై గొడ్డలితో ఎడమ వైపు దారుణంగా నరికి చంపాడు. గ్రామ శివారులోని వాగులో గొడ్డలి పడేసి పారిపోయాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై శ్రీధర్ దర్యాప్తు నిర్వహించారు. స్వామిని ఈసాలతక్కళ్లపల్లి సమక్క– సారలమ్మ గద్దెల వద్ద అదుపులోకి తీసకున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. -
కాంగ్రెస్ ఎస్సీ సెల్లో సంస్థాగత సందడి
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీ సెల్ సంస్థాగత ప్రక్రియలో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. గురువారం నగరంలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్కుమార్ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనుంది. జిల్లా అధ్యక్ష స్థానానికి 20 దరఖాస్తులు పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎస్సీ సెల్ నూతన కార్యవర్గాలను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆశావాహుల నుంచి దరఖాస్తులు సేకరించేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కొరివి అరుణ్కుమార్ను ఇటీవల నియమించారు. ఈ క్రమంలో గురువారం డీసీసీ కార్యాలయంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పదవులకు ఆశావాహుల నుంచి దర ఖాస్తులు స్వీకరించారు.మొదటి రోజు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షస్థానానికి 20 దరఖాస్తులు వచ్చాయి. అలాగే నగర అధ్యక్ష స్థానానికి పది మంది దరఖాస్తు చేసుకొన్నారు. అలాగే మండల అధ్యక్ష పదవికి పది దర ఖాస్తులు వచ్చాయి. కష్టపడ్డ కార్యకర్తలతోనే కమిటీ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు కమిటీల్లో గుర్తింపు ఉంటుందని ఎస్సీ సెల్ ఉమ్మడి జిల్లా పరిశీలకుడు కొరివి అరుణ్కుమార్ తెలిపారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి నేతృత్వంలో వినూత్న తరహాలో కమిటీల ఎంపిక ప్రక్రియను చేపట్టామన్నారు. డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ల అనుమతితో డీసీసీ కార్యాలయంలో ఆశావాహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో గడువు ముగుస్తుందన్నారు. -
సంక్షిప్తం
ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలికరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీపై విచారణ జరిపించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ చిత్రామిశ్రకు లేఖ రాశారు. నగరంలో ఎలాంటి అనుభవం లేని వ్యక్తుల ఆధ్వర్యంలో విచ్చలవిడిగా ప్రైవేట్ ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయని తెలిపారు. అర్హత లేని డాక్టర్లు, సిబ్బందిని తక్కువ జీతాలకు పెట్టుకుని వారితో శస్త్రచికిత్సలు చేయిస్తున్నారని ఆరోపించారు. చిన్న జ్వరం వచ్చి చికిత్స కోసం డాక్టర్ను సంప్రదిస్తే అనవసర పరీక్షలు రాసి రూ.లక్షల్లో బిల్లులు వేసి దోచుకుంటున్నారని ఆరోపించారు. భగీరథ్ను ఎందుకు అరెస్టు చేయరు? కరీంనగర్ టౌన్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కొడుకు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు అయినప్పటికీ.. ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడంపై ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, నారదాసు లక్ష్మణ్రావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. కరీంనగర్లో గురువారం బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జీల సమావేశం జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి, అతనికి తప్పించుకునే అవకాశం కల్పించిందని ప్రజలు భావిస్తున్నరని ఆరోపించారు. భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా కోసం దరఖాస్తు చేస్తే సీపీ నిరాకరించారని తెలిపారు. ధర్నా కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. వర్సిటీని అభివృద్ధి చేస్తాంకరీంనగర్ సిటీ: ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డు శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా వారోత్సవాల సందర్భంగా శాతవాహన విశ్వవిద్యాలయ పరిపాలనా భవనంలో శాతవాహన ఎడ్యుకేషనల్ ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్రస్టుకు అధ్యక్షుడిగా వీసీ వ్యవహరిస్తారన్నారు. ట్రస్ట్ సెక్రటరీ రిజిస్టార్ సతీశ్కుమార్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ బుర్ర మధుసూదన్రెడ్డి, జాయింట్ సెక్రటరీ దీపిక, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తాం: మెప్మా పీడీకరీంనగర్ కార్పొరేషన్: మహిళల ఆర్థికాభివృద్ధికి తోడ్పడమే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లక్ష్యమని పీడీ స్వరూపరాణి అన్నారు. సీఓలు, ఆర్పీలు, టౌన్ లెవల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్)తో గురువారం సమీక్షించారు. వార్డుస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలను ఆర్పీలు, సీఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల్లో అలసత్వం వద్దని, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుకరీంనగర్ టౌన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి నాన్ రెసిడెన్షియల్, 5వ తరగతి రెసిడెన్షియల్లో ప్రవేశానికి షెడ్యూల్డు కుల విద్యార్థ్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు తెలిపారు. దరఖాస్తులను జూన్ 6వ తేదీ సాయంత్రం 5గంటల లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. -
ముగ్గురు దొరికారు.. పరారీలో పది మంది!
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. ఈ దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలు నుంచే ఈ ఆపరేషన్ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపిస్తూ గురువారం సీపీ గౌస్ ఆలం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరా సింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్లు, వీరికి సిమ్కార్డులు సరఫరా చేసిన మెహతాబ్ఖాన్ అలియాస్ మహబూబ్ఖాన్ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో జువెల్లరీ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం●: పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ వెనుక బిహార్లోని కరుడుగట్టిన నేరగాడు సుభోద్సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుభోద్సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్లోని పీఎంజే జ్యువెల్లరీ షాప్ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు. కేసు వివరాలు చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి ముందుగానే రెక్కి చూసి మెయిన్ రోడ్లపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితులైన గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన పానిక్ బటన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐపీఎస్ అధికారి సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్తోపాటు పలువురు సీఐలు పాల్గొన్నారు. దోపిడీ జరిగింది: మే 3, 2026దోపిడీకి పాల్పడింది: సుబోధ్ ముఠా, బిహార్ ఎత్తుకెళ్లిన నగల విలువ : రూ.82,02,000దోపిడీలో పాల్గొంది: 13 మందికిపైగా చిక్కిన నిందితులు: ముగ్గురు పరారీలో ఉన్నవారు: దాదాపు 10 మంది వాడిన ఆయుధాలు: 6 పిస్టళ్లు, 12 మేగ్జిన్లు, 60 బుల్లెట్లు రికవరీ అయిన సొత్తు : ఏమీ లేదు స్వాధీనం చేసుకున్నవి: రూ.51వేల నగదు, పల్సర్, హెల్మెట్, సెల్ఫోన్లు 2, సిమ్కార్డులు 2, నకిలీ ఆధార్కార్డు. గాలించిన రాష్ట్రాలు: బిహార్, పశ్చిమ బెంగాల్ పాల్గొన్న సిబ్బంది: 132 మంది కరీంనగర్ సిబ్బంది, 24 మంది ఎస్పీలు -
ధాన్యం అన్ లోడింగ్కు ఏర్పాట్లు
చొప్పదండి: కొనుగోలు కేంద్రాలకు ఇన్చార్జీలను నియమించి తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్, ఆర్నకొండ కొనుగోలు కేంద్రం, గంగాధర మండలం మధురానగర్ కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సీపీ గౌస్ ఆలంతో కలిసి గురువారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. లారీలు సమకూర్చాలని అధికారులను ఆమె ఆదేశించారు. మిల్లుల వద్ద అన్లోడింగ్ చేయాలని సూచించారు. రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవసరమైతె ట్రాక్టర్లను వినియోగించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ జాప్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఎస్వో నర్సింగరావు, డీఎం రజనీకాంత్, తహసీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
రూ. 42 లక్షలు!
40 రోజులుకొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై ట్రైనీ ఐపీఎస్ అధికారి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ సోహం సునీల్ దూకుడు పెంచారు. కొత్తపల్లి స్టేషన్ హౌజ్ ఆఫీసర్గా మార్చి 16న బాధ్యతలు చేపట్టిన నాటినుంచి అక్రమ దందాలపై విరుచుపడుతున్నారు. 40 రోజుల్లో.. రూ.42,83,542 అపరాధ రుసుం ప్రభుత్వ ఖాతాలో జమ చేయించారు. మారువేషంలో సామాన్యుడిలా..ద్విచక్ర వాహనంపై రహస్యంగా తనిఖీలు చేపడుతూ గ్రానైట్, మట్టి, ఇసుక, మార్బుల్, బెల్టుషాపు వ్యాపారుల పాలిట సింహ స్వప్నంలా తయారయ్యారు. ఓ వైపు స్టేషన్కు వచ్చిన ప్రతి ఒక్కరికి సమయం కేటాయిస్తూనే అక్రమార్కులకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. ఇలాంటి అధికారి ఇలాగే కొనసాగితే అక్రమ దందాలు మూతపడటంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చే అవకాశముంది.సాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్)●: కొత్తపల్లి పోలీస్స్టేషన్ ఎస్హెచ్వోగా బాధ్యతలు చేపట్టిన సోహం సునీల్ తనదైన శైలిలో అక్రమ దందాలపై కొరడా ఝళిపించారు. కొత్తపల్లి మండలంలోని అక్రమ దందాలపై దాడులు కొనసాగిస్తుండటంతో అక్రమ కార్యకలాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు గ్రానైట్.. మరోవైపు మట్టి.. ఇంకోవైపు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించారు. శిక్షణ కాలంలో భాగంగా సుమారు 40 రోజుల్లోనే రూ.42,83,542 అపరాధ రుసుంను ప్రభుత్వ ఖాతాలో జమ చేయించి ప్రత్యేకతను చాటారు. ఓవర్ లోడ్, అనుమతి లేకుండా, ఇన్సూరెన్స్ తదితర అనుమతులు లేకుండా నడుస్తున్న 26 గ్రానైట్ వాహనాల నుంచి రూ.38,16,427, ఏడు ఇసుక వాహనాల నుంచి రూ.38,765, మూడు మార్బుల్ వాహనాల నుంచి రూ.2,95,234, 8 మట్టి వాహనాల నుంచి రూ.1,33,116 వివిధ పన్నుల రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరింది. కేవలం పోలీస్శాఖ పరిధిలోని అంశంలోనే ఇంత ఆదాయం వచ్చిందంటే మిగిలిన సంబంధిత శాఖలు ఏంచేస్తున్నాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్నగర్, బద్ధిపల్లి, ఎలగందుల, శ్రీరాములపల్లి, ఖాజీపూర్, కమాన్పూర్, నాగులమల్యాల గ్రామాల్లోని ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు స్థానికుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. అనుమతుల్లేకుండా..పన్నులు చెల్లించకుండా..ప్రభుత్వ నిబంధనలకు పాతరేస్తూ.. ఇష్టమొచ్చినట్లు ప్రభుత్వ భూముల్లో గ్రానైట్ చూర్ణం (స్లర్రీ) పోస్తూ.. అక్రమ రవాణాకు పాల్పడుతూ.. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక గ్రామస్థాయి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నప్పటికీ పైస్థాయి అధికారుల నుంచి స్పందన రాకపోవడం, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు అల్లాడిపోతున్నారు. పల్లెల్లో గ్రానైట్ అఘాయిత్యాలు యథేచ్ఛగా సాగుతున్నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కాలుష్య వైపరీత్యం
ప్రకృతిలో ఎన్నో మార్పులు చేర్పులు వనరులను నాశనంచేసే రసాయనాలు పట్టణంలో కలదు కాలుష్యం పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కాలుష్యమయం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రకృతిని నాశనం చేసే ఎక్కడ చూసినా కాలుష్యం నీరు తాగుదామన్న చెడు రసాయనాలు మురికి నీళ్లు తాగి మురికి తిండి తిని మానవులు రోగాల బారిన పడుతున్నారు. కెమికల్ ఉన్న ఆహారం తిని మానవులు ఆయుష్షు తగ్గిపోతుంది ఎవరిని చూసినా బీపీ, షుగర్లు ఎవరిని చూసినా ఊపిరితిత్తుల సమస్యలు ఎవరిని చూసినా కిడ్నీ సమస్యలు నియంత్రించాలి ఈ వైపరీత్యం తగ్గించాలి ఈ వైపరీత్యం పెంచాలి మానవ వనరులు తగ్గించాలి ఈ వైపరీత్యం అరికట్టాలి ఈ రసాయనాలు నియంత్రించాలి ఈ వైపరీత్యం పేరు: కుమ్మరికుంట ఆరాధ్య తరగతి: 6వ తరగతి పాఠశాల: పీఎంశ్రీ మోడల్ స్కూల్ ఊరు: గోదావరిఖని జిల్లా: పెద్దపల్లి ఎన్.శ్రీకర్ గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
విద్యతోనే భవిష్యత్
● ‘సుడా’ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ టౌన్: ప్రభుత్వం పాఠశాల విద్యకు అధిక నిధులు వెచ్చిస్తోందని, విద్యాభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విద్యావారోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల కార్పొరేటర్లు, సర్పంచులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి జరిగితేనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. ఆర్డీవో కుందారపు మహేశ్వర్, డైట్ ప్రిన్సిపాల్, ఇన్చార్జి అసిస్టెంట్ డైరెక్టర్, డీఈవో శ్రీరాం మొండయ్య, ఎంఈవోలు ఆనందం, భద్రయ్య, వాసవి, జిల్లా సైన్స్ అధికారి చాడ జయపాల్ రెడ్డి, జీసీడీవో ఉమ, ఆర్పీలు గాజుల రవీందర్, కేఎస్.అనంతాచార్య పాల్గొన్నారు. -
అమ్మాయిలు.. నాంచాక్
● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్ ● కర్ర, నాంచాక్లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తివేములవాడ: అమ్మాయిలే కదా.. అని అనుకోవద్దంటున్నారు ఈ చిచ్చరపిడుగులు. వారు కర్రసాము చేస్తే ఎదురుగా ఎవరూ ఉన్న బేజార్ కావాల్సిందే. వారు నాంచాక్ పడితే ఎంతటి వారైనా జీ హుజూర్ అనాల్సిందే. ఇదంతా వేములవాడ మున్సిపల్ పార్క్లో నిత్యం ఉదయం కనిపించే బాలికల గురించే. వారు కొన్నాళ్లుగా కోచ్ ఎంఏ మన్నాన్ సమక్షంలో కర్ర, నాంచక్ వంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణకు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బాలికలు ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు. నాంచాక్ నైపుణ్యానికి మరో పేరు కరాటే విద్యలో భాగంగా వినియోగించే శస్త్రాయుధాలలో నాంచాక్కు ప్రత్యేక స్థానం. రెండు చిన్న ఐరన్ పైపులకు మధ్యలో గొలుసుతో కలిపి ఉంటుంది. చూసేందుకు సాధారణంగా కనిపించినా నిపుణుల చేతిలో పడితే శత్రువులకు భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. దాడిచేయడం, ఆత్మరక్షణకు నాంచాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాంచాక్ను సాధనతో శరీర నియంత్రణ, వేగం, స మతుల్యత పెరుగుతాయి. ఇది కేవలం దెబ్బ కొట్టే ఆయుధమే కాదు, ఒక నృత్యకళా రూపంగా కూడా చెప్పుకుంటారు. పోటీలు, ప్రదర్శనలు, ఆత్మరక్షణలో తమకు కొత్త శక్తిని అందిపుచ్చుకుంటున్నారు. -
జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
● జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి కరీంనగర్ కార్పొరేషన్: జనగణనను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా సెన్సెస్ ఇన్చార్జి తిరుపతి సూచించారు. నగరంలోని కాశ్మీర్గడ్డ, చైతన్యపురి, రాంనగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న జనగణన ప్రక్రియను బుధవారం ఆయన పరిశీలించారు. హౌస్లిస్ట్ బ్లాక్ బౌండరీలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. నెంబరింగ్, డిజిటల్ మ్యాపింగ్పై ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్ల పనితీరు పరిశీలించారు. ప్రతీ ఇంటి సమాచారాన్ని కచ్చితంగా సేకరించాలన్నారు. స్వీయ గణన చేసుకున్న వాళ్లు ఎన్యుమరేటర్లకు ఐడీని చూపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్, టీపీబీవో ఖాదర్ మొహియొద్దిన్, ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టిన డీఆర్డీవోకరీంనగర్ అర్బన్: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా ఎం.గీత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. నెల రోజుల క్రితమే రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి జిల్లాకు బదిలీ అయ్యారు. కానీ.. బాధ్యతలు చేపట్టలేదు. దీంతో గత డీఆర్డీవో శ్రీధర్ ఆ పదవీలో కొనసాగారు. తాజాగా గీత బాధ్యతలు స్వీకరించి కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ధాన్యం రవాణాకు స్పెషల్ టీంలుకరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని ట్యాగ్డ్ రైస్మిల్లులకు రవాణా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు. మండలస్థాయిలో మొబైల్ టీంలను ఏర్పాటు చేయగా తహసీల్దార్ టీం లీడర్గా వ్యవహరిస్తారని వివరించారు. కరీంనగర్ రూరల్, చొప్పదండి, గంగాధర, రామడుగు, గన్నేరువరం, చిగురుమామిడి, కొత్తపల్లి మండలాల్లో ధాన్యం ఎక్కువగా ఉందని గుర్తించినట్లు తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా ప్రత్యేక టీంలు పనిచేస్తాయని వెల్లడించారు. వీరిపై పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ అధికారి ఉంటారని, టీంలలో సివిల్ సప్లయ్, రెవెన్యూ, పోలీస్, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖలు ఉంటాయన్నారు. ఇంటర్ ఫలితాల్లో నవోదయ వందశాతం ఉత్తీర్ణతచొప్పదండి: సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాల్లో చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. విద్యాలయానికి చెందిన హనుమాండ్ల అక్షర 94.4 శాతం మార్కులు సాధించి విద్యాలయంలో మొదటి స్థానంలో నిలిచింది. చెక్కల రాజు 92.6 శాతంతో రెండో స్థానం, దొంత జశ్వంత్ 90.2 శాతంతో మూడో స్థానంలో నిలిచారు. ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
బ్లడ్ కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: బ్లడ్ కేన్సర్ చికిత్స రంగంలో ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వైద్య పద్ధతులతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనో థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం కేన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర–6
రాత్రి 8 అయ్యింది. బస్ ఆగింది. బన్నీ దిగాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు. మట్టి గోడలు. గూనపెంకుల ఇల్లు. ముందు అరుగు. అరుగు మీద తాతయ్య. పక్కన నానమ్మ. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ... నవ్వుతున్నారు. ‘రా కన్నయ్య‘ అంది నానమ్మ. బన్నీని దగ్గరకు తీసుకుంది. తల నిమిరింది. తాతయ్య చెయ్యి పట్టుకున్నాడు. ‘ఇది నీ ఇల్లు రా బన్నీ‘ అన్నాడు. ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు. చాలా మంది. ముగ్గురు అత్తయ్యలు, మామయ్యలు. బాబాయ్, పిన్ని మరియు ఆరుగురు పిల్లలు. చుక్క, స్వప్న, రామ్ కూడా ఉన్నారు. ‘హాయ్ బన్నీ!‘ అన్నారు. బన్నీ ఆశ్చర్యపోయాడు. మేము కూడా వచ్చాము అన్నారు. అందరూ నవ్వుకున్నారు. నానమ్మ ఒక పళ్లెం తెచ్చింది. పళ్లెంలో గారెలు. బెల్లం గారెలు. ‘తినరా‘ అంది. బన్నీ ఒక గారె తిన్నాడు. తియ్యగా ఉంది. వేడిగా ఉంది. అమ్మ చేసినట్టే ఉంది. తాతయ్య అన్నాడు, ‘బన్నీ, ఇక్కడ అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అందరం కలిసి తింటాం. కలిసి నవ్వుతాం. ఇది మన ఉమ్మడి కుటుంబం.‘ బన్నీ చుట్టూ చూశాడు. అందరి మొహాల్లో నవ్వు. బన్నీకి కూడా నవ్వు వచ్చింది. భయం పోయింది. పిల్లలకి మాట: ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు. ప్రేమతో ఉన్న మనుషులు.డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా గోంగూర పాపహలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గోంగూరమ్మాయి బాగుందా? నేను మా కుండిలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూరను తేత ఆకుల్ని తీసుకున్నాను. దీని ని ’రెడ్ సోరెల్’ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ’ఎ’ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు కూ డా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తినే పెంపొందిస్తుంది. -
బక్రీద్కు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. బక్రీద్ పండుగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముస్లింలు బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈద్గాల వద్ద అవసరమైన వసతులు కల్పించడంతో పాటు నమాజ్ సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యుత్శాఖ అధికారులను ఆదేశించారు. సీపీ గౌస్ఆలం మాట్లాడుతూ, బక్రీద్ సందర్భంగా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ డి శ్రీనివాస్రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. అత్యుత్తమ సేవలకు కేరాఫ్గా సర్కారు ఆస్పత్రి అత్యుత్తమ సేవలకు కేరాఫ్ అడ్రస్గా ప్రభుత్వ ఆసుపత్రులు నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, ప్రభుత్వ హాస్పిటళ్ల బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజలతో వైద్య శాఖ మరింత అనుసంధానం కావాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అత్యుత్తమ వైద్య సేవలకు కేరాఫ్ అడ్రస్గా నిలవాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమగ్ర హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఎంహెచ్వో వెంకటరమణ, కేశవరెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
మానకొండూర్: ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు దుర్మరణం చెందగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, స్థానికుల వివరాలు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ కుటుంబం వరంగల్ జిల్లాలో బుధవారం జరిగిన వివాహానికి హాజరై కారులో తిరిగి వస్తున్నా రు. మండలంలోని ఖాదర్గూడెం శివారులో బోధన్ డిపోకు చెందిన బస్సు వరంగల్ వైపు వెళ్తూ కారును ఢీకొట్టింది. కారు డ్రైవర్ ఖలీద్, పెద్దపల్లికి చెందిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. సుమతి(65), ఉమ(36), వెంకటవరప్రసాద్ అలియాస్ శ్రీధర్(52) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించారు. రాజు భార్య సుమతి పరిస్థితి విషమంగా ఉంది. రాంగ్రూట్లో ప్రయాణం చెంజర్ల శివారులో కారు డ్రైవర్ రాంగ్రూట్లో వెళ్లడంతో ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. డ్రైవర్ ఖలీద్ సీటులోనే మృతిచెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ శ్రీలత 108 వాహనంలో క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అతి కష్టంమీద బయటకు తీశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆసిఫాబాద్కు చెందిన వెంకట వరప్రసాద్ అలియాస్ శ్రీధర్ భార్య ఉమ ఉద్యోగిని కావడంతో మంచిర్యాలలో ఉంటున్నారు. శ్రీధర్ బావ రాజు, సోదరి సుమతిని పెద్దపల్లిలో దింపి వెళ్లాలని కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఖలీద్ మృతదేహంరాజు మృతదేహం -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
చిగురుమామిడి: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. చిగురుమామిడి మండలం నవాబుపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. అధికారులు అలసత్వం వీడాలని, పంచాయతీకార్యదర్శులు, ఏఈవోలు సమన్వయం చేసుకోవాలన్నారు. తూకం వేసిన తరువాత లారీలను మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధాన్యం రవాణా విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా ప్రత్యేకంగా ఎంవీఐ అధికారిని నియమించినట్లు తెలిపారు. అనంతరం నవాబుపేట్లో బోదాసు లలిత–రవి దంపతుల ఇందిరమ్మ గృహప్రవేశానికి హాజరయ్యారు. సర్పంచ్ గూల్ల రజితరాజు, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు గీకురు రవీందర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయిని వేణుగోపాల్ పాల్గొన్నారు. -
ఐక్యమత్యమే ఉద్యోగుల బలం
కరీంనగర్ అర్బన్/కరీంనగర్ టౌన్ :విధుల్లో విరా మం లేకుండా గడపడమే కాకుండా వీలుచిక్కినప్పుడల్లా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకోవాలని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి అన్నా రు. ఉద్యోగుల మధ్య ఆత్మీయ అనుబంధం పెంపొందించుకోవాలని అన్నారు. బుధవారం స్థానిక టీఎన్జీవోల కమ్యూనిటీ హాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరవేసేది పంచాయతీ కార్యదర్శులేనన్నారు. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికెట్ వరకు, తాగునీరు, డ్రైనేజీ, వీధిదీపాలు, పారిశుధ్యం, పల్లె ప్రకృతి వనం వంటి అనేక బాధ్యతలను కార్యదర్శులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ప్రొబేషన్, రెగ్యులరైజేషన్, పెండింగ్ బిల్లులు తదితర అంశాల్లో న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ మాట్లాడుతూ, అన్ని శాఖల పనులు నిర్వహించడంతో ఒత్తిడి ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో ప్రజల ఆదరణ, గౌరవం పంచాయతీ కార్యదర్శులకే ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రతీ నాలుగో శనివారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశఽం ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటానని తెలిపారు. సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, టీఎన్జీవోల కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుపాక రాజేశ్ భరద్వాజ్, సుస్మిత, గోదావరి అజయ్, రాకేశ్, రేవంత్ రెడ్డి, కిరణ్, వాహజ్, మధుమిత, కార్తీక్, మహేందర్ రావు పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఉపాధి కల్పించేలా కోర్సులు
కరీంనగర్ సిటీ: సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిలో భాగంగా విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏఈడీపీ కోర్సులు రూపొందించబడ్డాయని కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సర్పంచ్లు, కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులకు వర్క్షాప్ నిర్వహించారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి ఉన్నత విద్యలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎఈడీపీ (అప్రెంటిస్షిప్ ఇన్బిడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) కోర్సుల ప్రాముఖ్యతను వివరించారు. సాధారణ డిగ్రీ విద్యతో పాటు నైపుణ్యాభివద్ధి ఎంతో అవసరమన్నారు. ఈ కోర్సుల ద్వారా డిగ్రీ చదువుతున్న సమయంలోనే పరిశ్రమలు, సంస్థలు, సేవా రంగాలలో ప్రాక్టికల్ శిక్షణ పొందే అవకాశముంటుందన్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ లేదా స్కాలర్షిప్ లభించడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన గ్రామీణ విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. సర్పంచ్లు, కార్పొరేటర్లు గ్రామస్థాయిలో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేలా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. -
బేకరీల్లో నాసిరకం పదార్థాలు
కరీంనగర్ అర్బన్: నగరంలోని ఫాస్డ్ఫుడ్, బేకరీలలో నాసిరకం ఆహార పదార్థాలు వాడుతున్న ఆహారభద్రత అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నూడిల్స్, మంచూరియా, ఫ్రైడ్రైస్ ఏదైనా నాసిరకమేనని, పురుగులు పట్టిన గుడ్లను వాడుతున్నారని స్పష్టమైంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్, తెలంగాణచౌక్, కమాన్ ఏరియాల్లో బుధవారం నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. పలు దుకాణాలు చెల్లుబాటయ్యే ఫుడ్లైసెన్స్ లేకపోవడంతో నోటీసులు జారీచేశారు. నాణ్యత లేని టీ పొడి, నూనెలు వాడుతున్నట్లు తేలింది. ఎస్ఎఫ్ఎస్ బేకరీలో గడువు ముగిసిన బిస్కెట్ ప్యాకెట్లు, జ్యూస్ తయారీలో ఉపయోగిస్తున్న దెబ్బతిన్న ద్రాక్షపండ్లను గుర్తించి పారబోశారు. బస్స్టాండ్ కాంప్లెక్స్లోని కింగ్స్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీలో కుళ్లిపోయిన, దెబ్బతిన్న గుడ్లను ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సెంటర్ను మూసివేశారు. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): వృద్ధాప్యం.. అనారోగ్యం..ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సోల నర్సయ్య(80) భార్య నలభై ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి నర్సయ్య ఒంటరిగా ఉంటున్నాడు. గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న నర్సయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరి జీవితం ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతిగోదావరిఖనిటౌన్: కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తున్న కరీంనగర్–2 డిపో బస్సులో మహారాష్ట్ర సిరొంచకు చెందిన అబ్ధుల్ రజాక్ కరీంనగర్లో గోదావరిఖనికి టికెట్ తీసుకున్నాడు. స్టాఫ్ వద్ద దిగకపోవడంతో కండక్టర్ గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇతడు మార్గమధ్యలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గంగాధర: మండలంలోని మప్పిడినర్సింహులపల్లి జీపీ పరిధి పెండలోనిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముత్యాల హేమలత ఈ నెల 11న ఇంటికి తాళం వేసిన బంధువుల దగ్గరికి వెళ్లిది. బుధవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని ముప్పై తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.ఏడువేలు దొంగలు ఎత్తుకెళ్లారని, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింతపెగడపల్లి: మండలంలోని మద్దులపల్లిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ జమున, చైల్డ్లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్, బాలల పరిరక్షణ సమితి ఔట్రిచ్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు శోభ, శైలజా, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లారు. ఆధార్కార్డు, పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో వివాహం చేస్తే అనర్థాలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు దాటే వరకూ వివాహం చేయబోమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు. రేబిస్తో చిన్నారి మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బాలులు రేబిస్తో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన లోకుర్తి రాజు–మమతల కొడుకు లోకుర్తి నిశాంత్(11) ఇటీవల 5వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నాడు. ఏప్రిల్ 23న గ్రామంలో ఓ పిచ్చికుక్క కరవడంతో తలకు, తొంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్లు ఇప్పించారు. వారం రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్కు తీసుకెళ్లారు. రేబిస్తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు హైదరాబాద్కు వెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిశాంత్ హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
డాక్టర్.. నిఖిత
● మల్యాల మండలంలో మొదటి దళిత డాక్టర్ ● నిఖిత వైద్య విద్యకు ‘సాక్షి’ దాతల తోడ్పాటుమల్యాల: నిరుపేద దళిత కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి ఎదిగారు మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన బెక్కం నిఖిత. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు సాధించారు. బెక్కం గంగయ్య, పద్మ ఏకై క కూతురు నిఖిత సిరిసిల్లలోని బోనాల రెసిడెన్షియల్లో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డి రెసిడెన్షియల్లో ఇంటర్ పూర్తి చేసి.. నీట్లో ర్యాంకుతో ఎంబీబీఎస్లో సీటు సాధించారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ 2020 డిసెంబర్ 10న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీ కటాక్షం కరువు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన దాతలు ఎంబీబీఎస్ విద్యకు తోడ్పాటు అందించారు. నిఖిత విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా అందుకున్నారు. తమ కూతురు డాక్టర్ కావడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన కల సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించిన అందరికీ నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ జయకేతనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులతో జయకేతనం ఎగురవేసినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 460పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీసీఎం విభాగంలో వి.శ్రేయాస్రెడ్డి 475 మార్కులతో పాఠశాల టాపర్గా నిలవగా, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాశ్ 469, బి.లిఖిత్ సాయి 461, ఐశ్వర్య 458, హర్షఫ్ అర్మాన్ 456, వి.సాయి హర్షిత్ 456, బి.రోహిత్, ఎన్.కావ్య, జె.సరయు 450 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా పీసీబీ విభాగంలో డి.రుత్విక్ 476 మార్కులతో పాఠశాల టాపర్గా, పి.శృత్విక 472, డి.శ్రేయన్ష్ 462 సాధించగా మిగిలిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. -
ఆ సెల్ఫోనే పట్టించింది
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎంత పెద్ద క్రిమినల్ అయినా.. ఏదో ఒక క్లూ వదిలేస్తాడు.. అదే దొంగలను చిక్కేలా చేస్తుంది. పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసులో ఇదే తరహాలో దొరికిపోయారు. ఈనెల 3వ తేదీన పీఎంజేలో దోపిడీ చేసి, నలుగురు సిబ్బందిని తుపాకులతో కాల్చిన అనంతరం ధర్మపురి మీదుగా పారిపోయిన దొంగలు తాము వినియోగించిన ఒక సెల్ఫోన్ను మద్దునూరు వద్ద పగలగొట్టి వెళ్లిపోయారు. స్థానికులు ఆ సెల్ఫోన్ను పోలీసులకు అప్పగించారు. ఇక్కడే కేసు మలుపు తిరిగింది. ఆ సెల్ఫోన్లో లభించిన డేటా ద్వారా దొంగల సమాచారం లభించింది. దీంతో పోలీసులు బృందాలుగా విడిపోయి బిహార్లో ఒకరిని, బెంగాల్లో మరొకరిని పట్టుకున్నారు. నిందితులంతా స్మార్ట్ఫోన్ల నుంచి ఎన్క్రిప్టెడ్యాప్స్ ద్వారా సంభాషించుకోవడం గమనార్హం. పోలీసులు డేటా రీట్రైవ్ చేయడం ద్వారా కీలక సమాచారం లభించింది. సినీ తరహాలో దోపిడీ ఈ మొత్తం చోరీకి బిహార్ జైలు వేదికగా ప్రణాళిక జరిగింది. దేశంలోని పలు బంగారం సంస్థలే టార్గెట్గా చోరీలు చేసే సుబోధ్ గ్యాంగ్ ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 70 మందికిపైగా ప్రైవేటు సైన్యంతో ఆరు రాష్ట్రాల్లో ఇతని నెట్వర్క్ విస్తరించి ఉంది. సినీ తరహాలో దో పిడీలు చేయడం వీరి ప్రత్యేకత. కరీంనగర్ దోపిడీ కోసం ఆరుగురు ఒకరితో మరొకరికి పరిచయం లేనివారిని ఎంచుకున్నారు. కేవలం దోపిడీ మాత్రమే వీరి పని. ఆ తరువాత బంగారం తరలించేందుకు ఒక గ్యాంగ్, విక్రయానికి మరోగ్యాంగ్, ఆ డబ్బు తరలించేందుకు ఇంకో గ్యాంగ్ పనిచేస్తాయి. ఒకవేళ పోలీసులకు నిందితులు చిక్కినా పూర్తిస్థాయి సమాచారం దొరకక కేసు జాప్యం అవుతుంది. ఈలోపు బంగారం విక్రయించి సొమ్ము చేసుకోవచ్చు. ఈ దోపిడీలో పాల్గొన్న వారికి రూ.5లక్షలు ఇస్తామని ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రెస్మీట్.. ధర్మపురి వద్ద విడిపోయిన దొంగలు... వేర్వేరుగా బెంగాల్, బిహార్, రాజస్థాన్, ముంబై వైపు పారిపోయారు. ఈ నేపథ్యంలో చోరీ చేసిన సొత్తు రికవరీ చేయడం, మిగిలిన ముగ్గురు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. అయితే, నిందితులు సొత్తు ఎక్కడ విక్రయించారు? అన్న విషయంలోనూ పోలీసులు పలు కీలక ఆధారాలు సంపాదించారు. సుబోధ్ గ్యాంగ్ ఇప్పటి వరకూ 30 కిలోల వరకు బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు సమాచారం. ఈ గ్యాంగ్ వద్ద దొంగ బంగారం కొనే వ్యాపారుల జాబితా కూడా కరీంనగర్ పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని కూడా త్వరలోనే పట్టుకుంటామని డిపార్ట్మెంట్ ధీమాగా ఉంది. త్వరలోనే నిందితులందరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు. -
భగీరథ్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు..?
కరీంనగర్ టౌన్: పోక్సోకేసు నమోదైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను పోలీసులు ఇంకా ఎందుకు అరెస్టు చేయ డం లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్లో మాట్లాడుతూ భగీరథ్ పరారీలో ఉన్నడని చెబుతుంటే, రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, ఐబీ, స్పెషల్ బ్రాంచ్లు ఏం చేస్తున్నాయని నిలదీశారు. సాధారణ వ్యక్తిపై ఇలాంటి కేసు నమోదైతే వెంటనే అరెస్ట్ చేసే పోలీసులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కావడంతో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారా అని ప్రశ్నించారు. పోక్సో చట్టంలోని సెక్షన్ 19 ప్రకా రం సమాచారం దాచిపెట్టిన వారిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఈ కేసులో బండి సంజయ్, ఆయన పీఆర్వోపై చర్యలు తీసుకోవాలన్నారు. బాలికకు రూ.50 వేలు ఇచ్చి నట్లు నగరంలోని టూ టౌన్లో ఫిర్యాదు చేయ డం ద్వారా అసలు కేసును మళ్లించే ప్రయత్నం జరుగుతోందన్నారు. బండి సంజయ్ మాటపై నిలబడాలంటే, ముందుగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు.ఉచిత పీజీ ఎంట్రెన్స్ కోచింగ్కరీంనగర్ సిటీ: ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా ఎస్సారార్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉచిత ఎంకాం పీజీ ఎంట్రెన్స్ కోచింగ్ను మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం 40రోజుల పాటు కొనసాగనుంది. ఆన్లైన్ విధానంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, కామర్స్ నిపుణులు విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు అవసరమైన పరిజ్ఞానం, మోడల్ పరీక్షలు, ప్రశ్నాపత్ర విశ్లేషణ, సమయ నిర్వహణ, పరీక్ష వ్యూహాలపై సమగ్ర శిక్షణ అందిస్తారని కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు. కన్వీనర్ బూర్ల నరేశ్, వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్ , కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, కో–కన్వీనర్ అర్జున్ పాల్గొన్నారు. 16న జాబ్మేళాసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 16వ తేదీ కరీంనగర్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ నివాబూపాలో 25 ఖాళీల భర్తీకి నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, 25ఏళ్లు పైబడి ఉండాలని తెలిపారు. వేతనం నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలు ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు 16న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కరీంనగర్లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ఈ సేవ కేంద్రం పైఅంతస్తుకు రావాలని, బయోడేటాతో పాటు విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 99082 30384, 99633 57250 నంబర్లను సంప్రదించాలని సూచించారు. అనుమతి లేని అకాడమీల్లో అడ్మిషన్లు తీసుకోవద్దుసప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని డీఐ ఈవో ఆంజనేయరావు మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల కొన్ని అకాడమీ లు, కోచింగ్ సెంటర్లు తమకు ఇంటర్ బోర్డు అనుమతి ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తూ, విద్యార్థులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆకాశ్, బన్సల్క్లాసెస్ వంటి సంస్థలు అకాడమీలు మాత్రమేనని, గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డు కళాశాలలు కాదని గుర్తుంచుకోవాలన్నారు. ఐఐటీ, నీట్, ఏప్సెట్ అకాడమీలూ ఇంటర్ బోర్డు కిందికి రావన్నారు. అడ్మిషన్ తీసుకునే ముందు కళాశాల పేరు, అనుమతి పొందిన చిరునామా, గ్రూపులు, అర్హత గల అధ్యాపకులు, ల్యాబ్ సౌకర్యాలను స్వయంగా తనిఖీ చేయాలని, ప్రతి కళాశాల ఎదుట వివరాలతో కూడిన బోర్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. అనుమతి లేని సంస్థల్లో చేరి విద్యార్థులు తమ భవి ష్యత్ను నాశనం చేసుకోవద్దని సూచించారు. -
గడువు ముగిసింది.. గుబులు పట్టుకుంది
మండలాల వారీగా ఈకేవైసీ నమోదు వివరాలుకరీంనగర్రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలకు ఈకేవైసీ నమోదు గుబులు పట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి విధించిన గడువు ఈ నెల 10తో ముగిసింది. జిల్లాలో పూర్తిస్థాయిలో కూలీల ఈకేవైసీ నమోదు పూర్తికాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకంలో అక్రమాలను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయాలని గతేడాది ఏప్రిల్లో ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశాల్లో కూలీల నమోదు, వేతనాల చెల్లింపులకు ఈకేవైసీని ప్రామాణికంగా పరిగణిస్తామని ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. ముగిసిన గడువుతో ఆందోళన జిల్లాలో ఉపాధి కూలీలు 1,07,667 మంది ఉండగా 1,03,877 మంది ఈకేవైసీ పూర్తయింది. ఇంకా 3,790 మంది నమోదు పూర్తి చేయాల్సి ఉంది. రామడుగు, తిమ్మాపూర్ మండలాలు 98శాతం నమోదుతో మొదటిస్ధానంలో ఉన్నాయి. కూలీ ఆధార్కార్డు వివరాలతోపాటు ఫొటో, ఐరిస్లను సెల్ఫోన్లో నమోదు చేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది. గతేడాది ఏప్రిల్ నెల నుంచి చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ 96శాతం పూర్తికాగా వందశాతం నమోదు పూర్తికాకపోవడం గమనార్హం. ఈకేవైసీ నమోదుకు కొంతమంది కూలీలు అందుబాటులో లేకపోవడం, ఆధార్కార్డులోని వివరాలు, ఫొటో మ్యాచింగ్ కాకపోవడం, ఐరిస్లో మార్పులు తదితర కారణాలతో వందశాతం నమోదు కాలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విధించిన గడువు ఈ నెల 10తో పూర్తయిందని, నమోదు ప్రక్రియ గడువు పొడిగిస్తారా లేదా అనే సమాచారం ఇంకా రాలేదని తెలిపారు.మండలం కూలీలు ఈకేవైసీ మిగిలినవారు జమ్మికుంట 7,578 7,228 350 కరీంనగర్రూరల్ 3,872 3,697 175 ఇల్లంతకుంట 7,596 7,262 334 మానకొండూరు 10,097 9,669 428 గన్నేరువరం 5,359 5,145 214 చొప్పదండి 5,883 5,652 231 సైదాపూర్ 9,142 8,819 323 వీణవంక 10,757 10,380 377 హుజూరాబాద్ 7,004 6,774 230 శంకరపట్నం 9,587 9,287 300 కొత్తపల్లి 2,317 2,247 70 చిగురుమామిడి 6,803 6,603 200 గంగాధర 8,553 8,316 237 రామడుగు 6,856 6,685 171 తిమ్మాపూర్ 6,263 6,113 150 -
మెరుగైన విధానాలతో వ్యాపారాభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: మెరుగైన విధానాలు, నాణ్యతతో కూడిన వ్యాపారాలతో వీధి వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం కళాభారతిలో వీధి వ్యాపారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం ఉపాధి, పట్టణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో వీధి వ్యాపారులు, స్వయం సహాయక బృందాల పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమన్నారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ, వినియోగదారుల సేవ, స్వయం ఉపాధి కార్యకలాపాల ద్వారా జీవనోపాధిని బలోపేతం చేసుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, మెప్మా ఇన్చార్జీ డీఎంసీ మల్లీశ్వరి, టీఎంసీ మానస, సీఓలు పద్మ, స్వప్న, తిరుపతి, మంజుల, దీప తదితరులు పాల్గొన్నారు. -
రామ లక్ష్మణ జానకీ.. జైబోలో హనుమాన్కీ
భక్తులతో కిక్కిరిసిన కొండగట్టు అంజన్న ఆలయంజయంతి సందర్భంగా విశేష అలంకరణలో కొండ గట్టు అంజన్న స్వామినగరంలోని టవర్లో ఏక్తాయాత్రహిందూ ఏక్తాయాత్రతో కాషాయమయమైన కరీంనగర్ సిటీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి పెద్ద జయంతి సందర్భంగా ఆలయం కిక్కిరిసిపోయింది. మంగళవారం వేకువజామున మూడు గంటలకు స్వామివారికి తిరుమంజనం నిర్వహించారు. విశేష అభిషేకం, అర్చనలు చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. హోమం, మహాపూర్ణాహుతి, ఊయల సేవ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల జై హనుమాన్.. జై శ్రీరాం నామస్మరణలతో పరిసరాలు మార్మోగాయి. ఇరుముడులతో పాదయాత్ర వేలాదిమంది స్వామివారి సన్నిధికి చేరుకున్నారు. ఉత్సవాలను కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ బి.రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో అంజనారెడ్డి వారి వెంట ఉన్నారు. లక్షలాది మంది భక్తుల రాకతో స్వామివారి కోనేరు కాషాయమయమైంది. మాల విరమణ చేసిన అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పొన్నం సత్తయ్య గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. స్వామివారిని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు.కరీంనగర్: కరీంనగర్ నగరం కాషాయమయమైంది. ‘రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి’ నినాదాలతో మార్మోగింది. హనుమాన్ జయంతి సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ నేతృత్వంలో నిర్వహించిన హిందూ ఏక్తాయాత్ర వైశ్య భవన్ నుంచి ప్రారంభమై టవర్, కమాన్, వన్టౌన్, అమరవీరుల స్తూపం మీదుగా తిరిగి వైశ్య భవన్ వరకు వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా హనుమాన్ భక్తులు, ప్రజలు తరలివచ్చారు. యాత్రలో శ్రీరాముడు, ఆంజనేయస్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యారణ్య భారతీస్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు ఇలాంటి యాత్రలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. యాత్రకు 400 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
సెన్సెస్ షురూ..!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో జనగణన 2027 ప్రారంభమైంది. ఇప్పటివరకు స్వీయ గణనకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, 11వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన మొదలు పెట్టడం తెలిసిందే. నగరంలో బ్లాక్లవారీగా ముందుగా కుటుంబాల సంఖ్య ఆధారంగా ఇళ్లకు నంబరింగ్ (సెన్సెస్ హౌస్ నంబరింగ్) చేస్తున్నారు. 14వ తేదీ నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి తిరిగి కుటుంబాలవారీగా జనగణన చేపట్టనున్నారు. 666 బ్లాక్లు 2027 జనగణన తొలిదశను విజయవంతంగా పూర్తి చేసేందుకు నగరపాలకసంస్థ అధికారులు బ్లాక్ల వారీగా గణనను విభజించారు. నగరపాలకసంస్థలో 66 డివిజన్లు ఉండగా, 666 బ్లాక్లుగా విభజించారు. 180 నుంచి 200 ఇళ్లకు ఒక బ్లాక్గా పరిగణిస్తారు. ప్రతి బ్లాక్కు ఒక ఎన్యుమరేటర్ చొప్పున 666 బ్లాక్లకు 666 మంది ఎన్యుమరేటర్లను, పర్యవేక్షించేందుకు 111 మంది సూపర్వైజర్లను నియమించారు. 14 నుంచి ‘ఇంటి లెక్కలు’ జనగణన మొదటి దశ ప్రారంభం కావడంతో ఎన్యుమరేటర్లు కుటుంబాలవారీగా ఇళ్లకు నంబరింగ్ వేస్తున్నారు. ఇంటింటికి తిరిగి ఆ ఇంట్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయనే లెక్కల ఆధారంగా ఆ ఇంటి గోడ లేదంటే తలుపులకు చాక్పీస్లు, స్టిక్కర్లతో నంబర్ వేస్తున్నారు. బుధవారం వరకు హౌస్నంబరింగ్ను పూర్తి చేయనున్నారు. 14వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వారీగా జనగణనను చేపడుతారు. ప్రభుత్వం రూపొందించిన 33 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నారు. ఇప్పటికే స్వీయ గణనను నమోదు చేసుకుంటే, ఆ ఐడీ ఆధారంగా జనగణన ఎన్యుమరేటర్ పూర్తి చేయనున్నారు. ప్రజలు సహకరించాలి : ప్రఫుల్దేశాయ్ జన గణనలో భాగంగా ప్రజలు తమ వివరాలు అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కోరారు. నగరంలో జనగణన ప్రక్రియలో భాగంగా సెన్సెస్ హౌసెస్ నంబరింగ్ సాగుతున్న తరుణంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన 2027 జనాభా లెక్కలకు నగర ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని అన్నారు. సర్వే సమయంలో ఇంటికి వచ్చిన ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలన్నారు.డివిజన్లు 66 బ్లాక్లు 666 (180 నుంచి 200 ఇండ్లకు ఒక బ్లాక్) ఎన్యుమరేటర్లు 666 సూపర్వైజర్లు 111 -
పాత ఆటలు... భలే సరదాలు
వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలున్న రోజుల్లోనే పిల్లలు ఫోన్లు వదలడం లేదు. ఇక సెలవుల్లో మన మాట వింటారా? ఆ ఫోన్లకే అతుక్కుపోతారు అంటూ తల్లిదండ్రులు బాధపడొద్దు. మీరు కూడా ఖాళీ సమయం చూసుకుని పిల్లలతో ఈ పాత ఆటలు ఆడించండి. మీరు చిన్నతనంలో ఆడుకునే ఉంటారు. వారూ వాటిని వదిలి పెట్టరు. గడులాట: క్లాసురూంలో ఖాళీ పీరియడ్ వచ్చిందంటే చాలు నోట్ పుస్తకాలు తీసుకొని దానిలో గడులాట ఆడేవారు. ఒకరు ఒక గీత గీయాలి. వేరొకరు దానికి ఆనించి మరో గీతగీయాలి. ఇలా నాలుగు గీతలు గీస్తే ఒక గడిలా తయారవుతుంది. చివరి గీత ఎవరు గీస్తే గడిలా తయారవుతుందో వారిదే ఆ గడి అన్నమాట. ఆ గడిలో వారి పేరు మొదటి అక్షరం రాసుకుంటారు. అలా పేజీ అంతా అయ్యాక లెక్కిస్తే ఎవరికి ఎక్కువ గడులొస్తే వారు గెలిచినట్టు. చిట్ల పొట్లకాయ ఆట: ఇది దాదాపు దాగుడుమూతల్లానే ఉంటుంది. ఒక మూలవైపుగా ఒకమ్మాయిని కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళలో ఒకరు వెళ్ళి కూర్చున్న అమ్మాయి కళ్ళు మూస్తారు. అప్పుడు ఎవరు కళ్ళు మూశారో చెప్పాలి. కళ్ళు మూసిన అమ్మాయి పేరు కనుక్కుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరల ఆడతారు. పేరు కనుక్కోలేకపోతే మొదట అమ్మాయికే కళ్లు మూయాలి. చిట్ల పొట్లకాయ–సీమనెల్లి కాయ గోడ పుచ్చకాయ–గొట్టినెల్లి కాయ అత్తకు పెడితే అల్లం–అల్లుడు తింటే బెల్లం కొత్త కుండల్లోని కోడళ్లారా–పాలపిడతలోని పాపల్లారా! అంటూ ఈ ఆట ఆడుతూ పాట పాడతారు. ఇప్పటి పిల్లలు అంత్యాక్షరి ఆడుకున్నట్లుగా మా కాలంలో ఈ ఆట ఆడేవారు. ఆటలో పాల్గొనే వాళ్లంతా తలా ఒక పుస్తకం, పెన్నుతీసుకొని ఒక పేజీలో పేరు, ఊరు అని పైన రాస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక్కరు ఒక అక్షరం పేరు చెబుతారు. ఆ అక్షరంతో వచ్చే పేరు, ఊరు పేరు రాయాలి. ఎదుటి వాళ్లకు రాని విధంగా ఉండేలా కష్టమైన అక్షరాలు ఇస్తారు. దానికి వాళ్లు పేరు, ఊరు పేరు రాయాలి. ఇప్పటిలా దీవీలు లేవు కాబట్టి. ఊర్ల పేర్లు చాలామందికి తెలియవు. అట్లాస్లో చూడటమే తప్ప విడిగా తెలియదు. అప్పట్లో మేము ఎవ్వరికీ తెలియని వికారాబాద్ పేరును తెగ రాసేవాళ్లం. ఇలా ఎవరికీ తెలియనివి రాసినపుడు పక్క ఫ్రెండ్స్ ఒప్పుకునే వాళ్లు కాదు. ఇంకా కొంత మంది ఊరు, పేరుతో పాటు ఆట, పండు, తినే వస్తువు అని ఇలా నచ్చినట్టుగా పెట్టుకునే వాళ్లు.. ఎన్ని గంటలైనా ఆడుకునే వాళ్లం. ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆటఇది. ఒక తాడును తీసుకొని ఎగరేస్తూ రెండు కాళ్లకింద నుంచి తీసుకెళ్తారు. ఎగురుతూ ఆడే ఈ ఆట వ్యాయామానికీ ఉపయోగ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, పెద్ద వాళ్లయ్యాక కూడా అంతే సరదాగా ఆడుకోవచ్చు. ఒంటి కాలితో, రెండు కాళ్లతో ఆడే స్కిప్పింగ్ ఎక్కడా తడబడకుండా వంద వరకూ ఆడేవాళ్లం అలుపు లేకుండా. ఈ రోజుల్లో ఇవేవీ లేవు. రచన: డాక్టర్ కందేపి రాణీప్రసాద్, రాజన్నసిరిసిల్ల -
సుల్తానాబాద్ ‘అల్ఫోర్స్’కు సీబీఎస్ఈ గుర్తింపు
పెద్దపల్లి: సుల్తానాబాద్లోని అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడం ఆనందంగా ఉందని విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్రెడ్డి అన్నారు. అల్ఫోర్స్కు సీబీఎస్ఈ గుర్తింపు రావడంతో సుల్తానాబాద్లోని అల్ఫోర్స్ హైస్కూల్లో మంగళవారం వేడుకలు నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 14 ఏళ్లుగా అన్నివర్గాల విద్యార్థులకు తమ సంస్థ విద్యా సేవలు అందిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, బోధన సిబ్బందిని దృష్టిలో పెట్టుకొని గుర్తింపు ఇచ్చారని అన్నారు. విద్యార్థులకు ప్రాథమికదశ నుంచే నాణ్యమైన విద్య అందిస్తున్నామని చెప్పారు. సీబీఎస్ఈ గుర్తింపు ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయని, ఐఐటీ, నీట్లో సులభంగా సీట్లు సాధించే అవకాశం ఉంటుందని వివరించారు. పాఠశాల సీబీఎస్ఈ గుర్తింపు నంబర్ 3630668గా ఉందని ఆయన చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల సిబ్బంది నరేందర్రెడ్డిని సన్మానించారు. -
ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు
సిరిసిల్లటౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 12నుంచి జూన్ వరకు ఉమ్మడి జిల్లా క్రికెట్ సెలెక్షన్స్కు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్టు డీసీసీ చైర్మన్ వంకాయల కార్తీక్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల ప్రెస్క్లబ్లో మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండర్–14,16,19,23 బాలురు, బాలికల ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బాలబాలికల ప్రతిభను గుర్తించి క్రికెట్ నైపుణ్యం సాధించేలా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. పాల్గొనే క్రీడాకారులు తప్పనిసరిగా ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్కార్డు వైట్ డ్రెస్తో హాజరై తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని వివరించారు. -
బన్నీ వేసవి యాత్ర–5 రామ్ డాన్స్
సాయంత్రం అయ్యింది. బస్ ఒక ఊర్లో ఆగింది. ఇది బస్ స్టాండ్. అక్కడ చాలా మంది. మధ్యలో ఒక అబ్బాయి. పేరు రామ్. వయసు 11. పక్కన ఒక తాత డప్పు కొడుతున్నాడు. ‘డమ్ డమ్’ అని శబ్దం. రామ్ డాన్స్ చేస్తున్నాడు. గెంతుతున్నాడు. తిరుగుతున్నాడు. అందరూ చూస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు. రామ్ బన్నీని చూశాడు. ‘ఏయ్ బాబూ! రా!’ అన్నాడు. ‘నాకు డాన్స్ రాదు’ అన్నాడు బన్నీ. సిగ్గు పడ్డాడు. రామ్ నవ్వాడు. బన్నీ చెయ్యి పట్టుకున్నాడు. మధ్యలోకి లాగాడు. ‘డాన్స్ రాకున్నా పర్లేదు. చిన్నగా మొదలు పెట్టు. ఆనందం చాలు’ అన్నాడు రామ్. బన్నీ రెండు గెంతులు గెంతాడు. చెయ్యి ఊపాడు. కాలు కదిపాడు. తప్పు అయ్యింది. అయినా పర్లేదు. అందరూ ‘భలే!’ అన్నారు. చప్పట్లు కొట్టారు. బన్నీకి నవ్వు వచ్చింది. గుండె హాయిగా ఉంది. బస్ ‘పాం పాం’ అని అరిచింది. బన్నీ బస్ ఎక్కాడు. రామ్ చెయ్యి ఊపాడు. ‘బై!’ అన్నాడు. పిల్లలకి మాట: డాన్స్ రావాల్సిన పని లేదు. మనసులో ఆనందం ఉంటే చాలు. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
శవమై కనిపించిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి
శంకరపట్నం: ఇంటి నుంచి వెళ్లిన సింగరేణీ రిటైర్డ్ ఉద్యోగి మాతంగి కొంరయ్య(75) మండలంలోని కాచాపూర్ గ్రామశివారులో శవమై కనిపించాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కొంరయ్య సింగరేణిలో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడు. కుటుంబంతో కలిసి అత్తగారి ఊరు ముత్తారంలో నివాసం ఉంటున్నాడు. కొంరయ్య పెద్ద కుమారుడు ఆనంద్ ఐదేళ్ల క్రితం మృతిచెందడంతో అదే బెంగతో ఈ నెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం గొర్రెల కాపరులకు కాచాపూర్ శివారులో శవమై కనిపించాడు. కొడుకుపై బెంగతోనే చనిపోయి ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. -
తండ్రి దినకర్మ రోజే తనయుడి ఆత్మహత్య
● దుమాలలో విషాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఓ ఆటో డ్రైవర్ తండ్రి దినకర్మ రోజు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో మంగళవారం విషాదం నింపింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు. దుమాలకు చెందిన పాముల భాస్కర్గౌడ్(43) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐదురోజుల క్రితం తన తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి దినకర్మ సోమవారం జరిపించారు. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్థలు తలెత్తడంతో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భాస్కర్గౌడ్కు భార్య పద్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ శరవిందు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఉరేసుకుని మహిళ..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని హనుమాన్వాడకు చెందిన సాయిని అంజవ్వ (51) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అంజవ్వకు సారంగాపూర్ మండలం రేచపల్లిలో కొంత భూమి ఉంది. వారి సమీప బంధువులతో వివాదం కొనసాగుతోంది. భూమి పోతుందని మనస్తాపానికి గురైన అంజవ్వ ఇంట్లోనే ఉరేసుకుంది. అంజవ్వ కూతురు సాయిని సాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఏఎస్సై అజిజోద్దీన్ తెలిపారు. మానకొండూర్: మండల కేంద్రానికి చెందిన దివ్యాంగుడు సీతాల రమేశ్ (38) జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ శ్రీలత తెలిపిన వివరాలు.. రమేశ్కు ఆరేళ్ల క్రితం వివాహమైంది, భార్యతో విడాకుల కేసు కొనసాగుతోంది. తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో రమేశ్ ఒంటరిగా జీవిస్తున్నాడు. దీంతో మనస్థాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు..● చెప్పుతో కొడతానన్న మహిళా సర్పంచ్ ● సోషల్ మీడియాలో ఆడియో వైరల్ శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. గ్రామంలో చెట్ల నరికివేతపై ఓ వ్యక్తి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. గతంలోనూ మరో వ్యక్తి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజావాణిని ఆశ్రయించాడు. దీంతో విచారణ నిమిత్తం అధికారులు తరచూ గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో ‘కావాలనే కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని, వారిని చెప్పుతో కొడతా’ అంటూ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై వార్డు సభ్యులు సమావేశం అయ్యారు. శ్రీఎవరిని చెప్పుతో కొడతారంటూ’ సర్పంచ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నిజాయతీ ఫలం
ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు. ఒక రోజు పాఠశాలకు వెళ్తూ రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. అందులో చాలా డబ్బు, కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్నాయి. రాము ఆ పర్సును తీసుకుని ఇంటికి వెళ్లకుండా నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లాడు. గ్రామ పెద్ద ఆ పర్సు ఎవరిదో తెలుసుకోవడానికి గ్రామంలో ప్రకటించాడు. కొంతసేపటికి ఒక వృద్ధుడు వచ్చి అది తనదేనని చెప్పాడు. అతను చాలా ఆందోళనలో ఉన్నాడు, ఎందుకంటే ఆ డబ్బుతో తన కుమార్తె చదువు ఫీజు చెల్లించాల్సి ఉంది. రాము పర్సును అతనికి ఇచ్చాడు. వృద్ధుడు ఆనందంతో రామును ఆశీర్వదించి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కానీ రాము శ్ఙ్రీనిజాయితీకి బహుమతి అవసరం లేదుశ్రీశ్రీ అన్నాడు. రాము మంచితనాన్ని చూసి గ్రామస్థులందరూ అతన్ని ప్రశంసించారు. అప్పటి నుండి గ్రామంలో ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నారు. పేరు: నక్క శ్రీకర్, గ్రామం: ఊటూరు, మండలం: మానకొండూర్, జిల్లా: కరీంనగర్ -
దళిత క్రైస్తవులకు కాంగ్రెస్ నమ్మక ద్రోహం
కరీంనగర్ టౌన్: దళిత క్రెస్తవులకు కాంగ్రెస్ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని ఎమ్మార్పీస్ వ్యవస్ధాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రిస్టియన్ పాస్టర్స్ ఫెలోషిప్ సంస్థ కరీంనగర్లోని ఇందిరా భవన్లో ‘దళిత క్రైస్తవులు .. రాజ్యాంగ హక్కులు, సామాజిక హోదా’ అంశంపై మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. దేశంలోకి ఇస్లాం ప్రవేశించకముందు ఉన్న కులవిక్షను క్రైస్తవం ఇప్పటికీ అనుభవిస్తోందన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడపై కత్తిలాగా వేలాడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25కు ఇవి పూర్తి వ్యతిరేకమైనవని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిక్కు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగా దళిత క్రైస్తవులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1947 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నా ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. తాను ఏ పార్టీ వాడిని కాదని, తన ఒంటిపై కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని తీర్పు చెబితే అన్నిరాజకీయ పార్టీలు మౌనం వహించాయని విమర్శించారు. న్యాయం, ధర్మం దళిత క్రైస్తవుల పక్షాన ఉందని, శక్తిమంతమైన ఉద్యమాన్ని నడిపి ప్రజా మద్దతు సమీకరిద్దామని ఆయన కోరారు. పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జాఘవా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎలీషా, గంగరాజు, బెన్ని, మోజెశ్బాబురావు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థులు సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు –2026 ఫౌండేషన్ డే కార్యక్రమాన్ని సోమవారం పీఎం శ్రీ కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి చెస్, క్యారమ్ ఆటలాడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఎంఈఓ తుమ్మ ఆనందం, ఈఈ అశోక్కుమార్, కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఏఏపీసీ చైర్పర్సన్ సుగుణ, హెచ్ఎం కన్నం రమేశ్, ఐఈఆర్పీ దీప్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపల్లి మండలం ఎలగందుల మోడల్ స్కూల్లో సమ్మర్ క్యాంపును ఎంఈవో ప్రారంభించారు. హిందూ ఏక్తాయాత్రను విజయవంతం చేయండికరీంనగర్: హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఆధ్వర్యంలో క రీంనగర్లోని వైశ్యభవన్ నుంచి నిర్వహించే ‘హిందూ ఏక్తాయాత్ర’ను విజయవంతం చే యాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సోమవారం ఏక్తాయాత్ర ఏర్పాట్లను కార్పొరేటర్లు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలతో కలిసి పరిశీలించి మాట్లాడారు. హిందువుల సంఘటిత శక్తిని చాటేందుకు 12 ఏళ్లుగా లక్షలాది మందితో జరిగే యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. హిందూ సమాజం తరలిరావాలని కోరారు. భగీరథ్పై చర్యలు తీసుకోండివిద్యానగర్(కరీంనగర్): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ లైంగిక దాడి చేసినట్లు మైనర్ బాలిక ఫిర్యాదు చేసినా అతడిపై చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం వివిధ సంఘాలు, పార్టీలు నగరంలో నిరసన తెలిపాయి. భగీరత్ను పోక్సో కేసులో అరెస్ట్ చేయాలని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేపట్టారు. గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ అక్రమ సంబంధం వల్లే భగీరత్ను అరెస్ట్ చేయడం లేదని బీఎస్పీ జోన్ ఇన్చార్జి నిషాని రామచంద్రం ఆరోపించారు. నిందితుడు కేంద్ర మంత్రి కొడుకు అయినందుకే పోలీసులు అరెస్ట్ చేయడం లేదన్నారు. మాతంగి అశోక్, పల్లె ప్రశాంత్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానంసప్తగిరికాలనీ(కరీంనగర్): హైదరాబాద్లోని బేగంపేట, రామాంతాపూర్ పబ్లిక్ స్కూల్స్లో 2026–27 విద్యా సంవత్సరానికి 1వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశానికి అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలిపారు. జిల్లాకు కేటాయించిన 6 సీట్లలో ఎరుకల వారికి 3, లంబాడ వారికి 2, ఇతరులకు 1 సీటు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. 1 జూన్ 2019 నుంచి 31 మే 2020 మధ్య జన్మించి ఉండాలని, తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు మించరాదని సూచించారు. ఆసక్తి గల వారు ఈనెల 12 నుంచి 18 వరకు కలెక్టరేట్లోని గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఉండదని, దరఖాస్తులు ఎక్కువగా వస్తే ఈనెల 22న లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ఎంపికై న విద్యార్థులకు హాస్టల్ వసతి ఉండదని, మరిన్ని వివరాలకు 95026 64044 నంబరులో సంప్రదించాలని కోరారు. -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్సిటీ(రామగుండం)తూకంలో దోపిడీ తగదుకరీంనగర్అర్బన్: కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ తూకం వేయడం, తరుగు పేరిట మిల్లర్లు దోచుకోవడం వంటి చర్యలను తక్షణమే నియంత్రించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రామిశ్రాను కోరారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వినతిపత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్ విధానంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు, స్టోరేజ్ కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్ వివరించారు. అదనపు తూకం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని, రైతులకు నష్టం జరగకుండా చూస్తామని తెలిపారు. మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోండి రైస్ మిల్లుల్లో ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేసి, కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా అన్నారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అధికారులు, మిల్లర్లు, రవాణా దా రుల సమన్వయంతోనే కొనుగోళ్ల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయగలమన్నారు. మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ఎక్కువమంది హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు కొనుగోళ్లను నిరంత రం పర్యవేక్షించాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో మహేశ్వర్, జిల్లా పౌరసరఫర ాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్, డీఆర్డీవో శ్రీధర్, డీసీవో రామానుజచారి, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. -
యానిమల్ హౌస్తో పరిశోధనలకు ఆస్కారం
కరీంనగర్సిటీ: శాతవాహన ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కళాశాలలో సోమవారం ‘యానిమల్ హౌస్’ను వీసీ ఉమేశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జంతువులకు ఆశ్రయం కల్పించి, వాటి సంరక్షణ, ఫ్రీ క్లినికల్ రీసెర్చ్ చేయడానికి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ, కొత్త పరిశోధనలు చేసి అంతర్జాతీయ స్థాయి సదస్సులలో పాల్గొనడానికి అధ్యాపకులకు ఉపయోగపడుతుందన్నారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్ మాట్లాడుతూ, పరిశోధనలో భాగంగా ఫార్మ కాలేజీకి జంతుశాల వెన్నెముక వంటిదని, పరిశోధనలతో మరింత ముందుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శ్రీశైలం, సీడీసీ డీన్ డా.జాఫర్, డా. శ్రీవాణి, డా. నజీముద్దీన్మున్వర్, అధ్యాపకులు డా.క్రాంతి, డా.అనిల్ డా.భాగ్యలక్ష్మి, డా.శ్రీవిద్య, డా. అశ్విని, డా.అర్చన తదితరులు పాల్గొన్నారు. -
పడుతున్నారు..!
రాష్ట్రాలను జల్లెడకరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నింది తులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్వి చ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్ర మే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్యవధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్టగా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజావాణి.. వినతుల బాణి
కరీంనగర్అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో జిల్లాస్థాయిలో కలెక్టర్, రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీవో కుందారపు మహేశ్వర్ వినతులను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపగా, ఎక్కువగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మొత్తం 129 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. కాగా, అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులు క్లియర్ చేయాలని ఆదేశించారు. కరీంనగర్ రెవెన్యూ డివిజన్కు 40, హుజురాబాద్ డివిజన్కు 16 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఆర్డీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ‘సాక్షి’తో తమ సమస్యలను వివరించారు. వారి మాటల్లోనే.. మొత్తం అర్జీలు: 129 మునిసిపల్ కార్పొరేషన్: 23 ఎస్సీ వెల్ఫేర్: 11, హౌజింగ్: 11 సీపీ ఆఫీస్: 06, వారధి: 06 -
ఇష్టంతో నర్సింగ్ వృత్తి..
4చాలా ఇష్టంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్ఎం చేశాను. నర్సింగ్ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్లో నర్సింగ్ ఆఫీసర్గా ఐదేళ్లుగా పని చేస్తున్న. – స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని చాలా సంతృప్తిగా ఉంది మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్ కూడా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్ సేవలపై ఇంట్రెస్ట్ కలిగింది. – కె.సరిత, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని -
లైఫ్ డో‘నర్స్’
ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు. వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్షీట్పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు. సేవలకు సలాం ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే. నర్సింగ్ కోర్సులపై ఆసక్తి నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు కూడా పోటీ పడుతున్నాయి.కరీంనగర్/కోల్సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
పాపం పసివాడు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు -
మద్యం తాగించి.. కత్తితో పొడిచి..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు. ప్రాణం తీసిన గెట్టూగెదర్.. వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్క్లాస్ గెట్టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్చేస్తూ, మెసేజ్లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్ద్వారా నవీన్కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను. – శోభ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ రోగులను కాపాడడంలోనే సంతృప్తి రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్ను ఆదర్శంగా తీసుకోవాలి. – దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్ నర్స్ పాత్ర గొప్పది రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి -
వడదెబ్బతో వృద్ధుడి మృతి
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి(వట్టిమల్ల) లో వడదెబ్బతో ఓ వృద్ధుడు మృతి చెందాడు. గొల్లపల్లికి చెందిన గోపు లచ్చయ్య(65) ఆదివారం బంధువుల వివాహానికి వెళ్లి వచ్చి, సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే వేములవాడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. రైల్వే ఉద్యోగిపై కోతుల దాడి ● తలకు, ముక్కు, కన్నుకు తీవ్రగాయాలు రామగుండం: పెద్దపల్లి జి ల్లా రామగుండం రైల్వేక్వార్టర్లలో కోతులు బీభత్సం సృష్సిఉ్తన్నాయి. ఈ నేప థ్యంలోనే స్థానిక రైల్వే సీ అండ్ డబ్ల్యూ సహాయకు డు రవికిషన్ విధులు ముగించుకుని ఆదివారం రాత్రి తన క్వార్టర్కు చేరుకున్నాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వాష్రూమ్కు వెళ్లేందుకు డోర్ తీసి బయటకు రాగానే కోతుల గుంపు మూకుమ్మడిగా దాడి చేసేందుకు య త్నించాయి. వాటిని తప్పించు కునేందుకు రవి కిషన్ ఇంట్లోకి పరుగెత్తినా వెంటాడి దాడి చేశా యి. ఘటనలో ముఖం, ము క్కు, కంటిపై తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో స్థానికు లు భయాందోళనలకు గురవుతున్నారు. భార్య కాపురానికి రావడంలేదని ఆత్మహత్య సుల్తానాబాద్రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రాళ్ల రాజు(34) తన భార్య కాపురానికి రావడంలేదనే మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై చంద్రకుమార్ కథనం ప్రకారం.. రాజుకు భార్య రజిత, ఇద్దరు కొడుకులున్నారు. రాజు మద్యానికి బానిస కావడంతో భార్యతో రోజూ గొడవలు జరిగేవి. విసుగు చెందిన భార్య ఆర్నెల్ల క్రితం పుట్టింటికి వెళ్లింది. తన ఇంటికి రావాలని ఎంతపిలిచినా రాలేదు. మరింత మద్యానికి బానిసైన రాజు.. మనస్థాపంతో ఆదివారం మద్యం తాగాడు. ఆ మత్తులో తాను ఉరివేసుకుని చనిపోతున్నని తన చిన్నఅక్కకు ఫోన్ చేసి చెప్పాడు. భయపడిన ఆమె వెంటనే ఇంటిపక్కన ఉన్న బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. వారు వెళ్లిచూసేసరికే ఫ్యాన్కు ఉరివేసుకొని చనిపోయాడు. అక్క లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. వడదెబ్బతో వృద్ధురాలు మృతివీణవంక: మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూలం వెంకటమ్మ(70) వడదెబ్బకు గురై మృతి చెందింది. వెంకటమ్మ కూలీ పనులు చేస్తూ జీవిస్తుంది. సోమవారం పొలం పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
వేసవిలో చిన్నారులు భధ్రం
సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు ●ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి. జ్యోతినగర్: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు. -
కాసుపత్రులు..!
జిల్లా వివరాలు ప్రైవేటు ఆస్పత్రులు 286 ప్రైవేటు క్లినిక్లు 222రోగనిర్ధారణ కేంద్రాలు 58 కరీంనగర్: కరీంనగర్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కమీషన్ల దందా నడుస్తోంది. ప్రాణాల కన్నా కమీ షన్లే లక్ష్యంగా ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల రక్తం తాగుతున్నాయి. సాధారణ జ్వరంతో వెళ్లినా అవసరం లేని వైద్య పరీక్షలు చేయించి రూ.వేలల్లో గుంజుతున్నారు. ఆస్పత్రి నిర్వాహకులు, ల్యాబ్, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకుల మధ్య ఉన్న ఒప్పందంతో అవసరం లేకపోయినా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పీడిస్తున్నారని పలువురు సీనియర్ వైద్యులే వాపోతున్నారు. కొంత మంది రోగి ముఖం చూడకుండానే వైద్య పరీక్షలు రాస్తున్నారు. చాలా ఆస్పత్రుల్లో అసిస్టెంట్లే జూ నియర్ డాక్టర్ పేరిట అవసరం లేకున్నా వివిధ రకాల టెస్టులు రాసి పేదలను దోచుకుంటున్నారు. ఎమ్మారై, సిటీస్కాన్లో సగానికి పైగా వైద్యులకే ఆస్పత్రుల నిర్వాహకులు తాము రాసిచ్చిన ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్కే వెళ్లాలని ఒత్తిడి చేస్తుండగా.. ఎమ్మారై, సిటీస్కాన్ లాంటి వైద్య పరీక్షలకు డయాగ్నోస్టిక్ సెంటర్లు రోగుల వద్ద నుంచి వసూలు చేసే ఫీజులో సగానికి పైగా వైద్యులకే అందజేస్తున్నామని స్కాన్ సెంటర్ల నిర్వాహకులే చెబుతున్నారు. సిటీస్కాన్కు రూ.3 వేలు నుంచి రూ.6 వేల వరకు ఫీజు తీసుకుంటున్నారు. ఎమ్మారైకి రూ.5 వేల నుంచి రూ.12 వేలు వరకు వసూలు చేస్తున్నారు. ఇతర ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్లో పరీక్షలు చేయించుకుని రిపోర్టులు తీసుకెళ్తే సరిగా లేవని తిప్పి పంపడం సర్వసాధారణమైంది. స్కానింగ్ ఫీజు ఆస్పత్రిలోనే వసూలు స్కానింగ్ సెంటర్లో చెల్లించాల్సిన డబ్బులు కొన్ని ఆస్పత్రుల నిర్వాహకులే వసూలు చేస్తున్నారు. కమీ షన్ తీసుకుని మిగతావి అప్పగిస్తున్నారు. ఇలా చే యడం వల్ల తాము సూచించిన స్కానింగ్ సెంటర్ కు పేషెంట్ ఖచ్చితంగా వెళ్లాల్సి వస్తుంది. ఇక ల్యాబ్ల్లో చేసే వివిధ రకాల రక్త పరీక్షలకు వసూలు చేసే ఫీజులో 40 నుంచి 60శాతం వరకు వైద్యులకు ముట్టచెబుతున్నారు. సాయంత్రానికి కమీషన్ పంపించకుంటే మరునాడు తమ స్కానింగ్ సెంటర్ లేదా ల్యాబ్కు రోగులను పంపటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. కమీషన్ల దందా బహిరంగమే అయినా యంత్రాంగం నియంత్రణ కరువైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కలెక్టర్ దృష్టి సారించాలి -
‘ఆది’ ఔదార్యం
● తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడి తరలింపు వేములవాడ: భగవంతరావునగర్కు చెందిన ఊరడి భూమయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పట్టణంలోని పెద్దమ్మ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. వేములవాడ రూరల్ పరిధిలో తన పర్యటన ముగించుకొని వేములవాడ వస్తున్న క్రమంలో ఇది చూసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమయ్యను పరామర్శించి రోడ్డు ప్రమాద వివరాలడిగి తెలుసుకున్నారు. వెంటనే తన సొంత వాహనంలో క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
మెడిటేషన్, జాతీయ గీతాలాపన
ప్రతీ సబ్జెక్టుల్లో ఉత్తమ అధ్యాపకులతో శిక్షణ అందిస్తున్నాం. నాలుగేళ్లుగా పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నాం. పోటీపరీక్షల్లో రాణించేలా విద్యార్థులకు మెరుగైన మెటీరియల్తోపాటు మెడిటేషన్ చేయిస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ తర్వాత జాతీయ గీతాలాపన చేయిస్తున్నాం. పాలిటెక్నిక్ ద్వారా ఉద్యోగావకాశాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – గోశికొండ బాలరాజు, సత్యసాయి సమితి జిల్లా యువజన సమన్వయకర్త -
నేపాలీ ముఠా కోసమే సోదాలు..?
● రైళ్లలో ఆకస్మిక సోదాలతో ప్రయాణికుల బెంబేలు ● లక్నో, గోరఖ్పూర్ రైళ్లపైనే ప్రత్యేక నిఘా రామగుండం: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఇటీవల ఓ మాజీ డీజీ సతీమణిని ఇంట్లోనే మట్టుబెట్టిన నేపాలీ గ్యాంగ్పైనే పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. రామగుండం రైల్వే స్టేషన్తోపాటు రైళ్లలో పోలీసుల ఆకస్మిక సోదాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తోందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఆదివారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సీఐలు కొదురుపాక రాజేంద్రప్రసాద్, లింగమయ్య, ఎస్సై క్రాంతికుమార్ తదితరులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్తో గోరఖ్పూర్ రైలులో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించారు. ప్రధానంగా నేపాల్ రాష్ట్రానికి సమీపంలో ఉన్న లక్నో, గోరఖ్పూర్ రైళ్లలో ఎక్కువగా నేపాల్ రాష్ట్రానికి చెందిన వారు కూడా ప్రయాణిస్తుండడంతో.. వారి కదలికలు, లగేజీపై ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్ రాష్ట్రానికి చెందిన వేలాది మంది రోహింగ్యాలు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్లు సమాచారమందడంతో వారిపై కూడా నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటికే తమ కాలనీల్లో అద్దెకు దిగే ఇళ్లలో అనుమానితులను గుర్తిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఓవైపు చోరీ నిందితులు, మరోవైపు దేశ ద్రోహులను పట్టుకునేందుకు రైళ్లలో నిఘా వ్యవస్థను పెంచినట్లు స్పష్టమవుతోంది. -
రోడ్డు ప్రమాదంలో యువకుల దుర్మరణం
వేములవాడఅర్బన్: రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఆరెపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన వంశీ(19), కేసీఆర్నగర్కు చెందిన నవీన్ కరీంనగర్ నుంచి కారులో వస్తున్నారు. వేములవాడ మండలం ఆరెపల్లి శివారులో లారీని ఢీకొట్టడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ నవీన్ను వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ధర్మపురిలో..ధర్మపురి: ధర్మపురిలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై మహేశ్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన తోగిటి వాసు(32) ద్విచక్రవాహనంపై జగిత్యాల వెళ్లి తిరిగి వస్తున్నాడు. పట్టణ శివారులో ట్రాక్టర్ బైక్ను ఢీకొనడంతో వాసుకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ట్రాక్టర్ డ్రైవర్ పబ్బతి జగదీష్గా గుర్తించారు. వాసు ధర్మపురిలో ఓ జువెల్లరీ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. తండ్రి గతంలోనే మృతిచెందాడు. తల్లి వరలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కొడుకు మృతి వార్త తెలియగా తల్లి గుండెలవిసేలా రోదించింది. వాసు చిన్నాన్న వెంకటేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శతాధిక వృద్ధురాలు మృతికథలాపూర్(వేములవాడ): సిరికొండ గ్రామానికి చెందిన చిలుక రాజుబాయి(105) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతురాలికి ఒక కుమార్తె, కుమారుడు ఉండగా.. 60 మంది వరకు మనుమలు, మనుమరాళ్లున్నట్లు బంధువులు పేర్కొన్నారు. రాజుబాయి వందేళ్ల వయస్సులోనూ తన పని తాను చేసుకునేదని, మనుమలు, మనుమరాళ్లకు పురాతన కథలు చెప్తూ ఆనందంగా గడిపేదన్నారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కాగా.. ఆదివారం మృతిచెందిందని తెలిపారు. -
అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభం
స్వామివారికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, భద్రాచలం ఆలయ ఈవో, అర్చకులు, అధికారులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు మల్యాల: మల్యాల మండలం కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి వారి పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భద్రాచలంలోని శ్రీసీతారాముల ఆలయం నుంచి ఆలయ ఈవో దామోదర్ పట్టువస్త్రాలు తీసుకొచ్చారు. వాటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వీకరించి.. వైజంక్షన్ నుంచి మేళతాళాలు, డప్పు చప్పుళ్లు, ఒగ్గు డోలు కళాకారుల విన్యాసాల మధ్య శోభాయాత్రగా అంజన్న ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తరలివస్తున్న భక్తులు.. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, హైదరాబాద్తోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. సుమారు 3 నుండి 4లక్షల మంది భక్తులు తరలివస్తారనే అంచనాతో అధికారులు ఆలయంలో లడ్డూ, ప్రసాదాలు, తాగునీటి వసతులు కల్పించారు. -
నా బాల్యం
కథల పుస్తకాలు చదివేవాడిని సిరిసిల్ల: వేసవి సెలవులు వస్తున్నాయంటే ఎంతో సంతోషంగా ఉండేదని రాజన్నసిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. ఎండాకాలం సెలవుల్లో తన చిన్నతనంలో ఎలా గడిపేవారో వివరించారు. ఆయన మాటల్లోనే.. బాల్యం .. నిజంగానే అమూల్యమైనది. తిరిగిరాని గొప్ప వరం. వేసవి సెలవులు వస్తే.. చాలు మా ఊరిలోని పెద్దవాగులో ఈతకొడుతూ.. ఈతకాయలు.. తాటి ముంజలు తింటూ ఎంజాయ్ చేస్తూ గడిపే వాడిని. మాది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం వెల్గ టూర్. నాన్న గడ్డం రాంరెడ్డి ప్రభుత్వ టీచర్, అమ్మ పద్మ. మా అమ్మమ్మ ఊరు కమ్మర్పల్లి మండలం నాగాపూర్. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరికి వెళ్లేవాడిని. ఈ రోజుల్లో లాగా మాకు సెల్ఫోన్లు, టీవీలు అందుబాటులో లేవు. నిజానికి మా నాన్న బాలమిత్ర, బాలజ్యోతి చందమామ వంటి పుస్తకాలు తెప్పించి చదివించేవారు. వేసవి సెలవుల్లోనూ క్రికెట్ వంటి ఆటలతోపాటు కథల పుస్తకాలు బాగా చదివే వాడిని. ఇప్పటికీ నాపై ఆ ప్రభావం ఉంటుంది. వేసవి సెలవులు వస్తున్నాయంటేనే ఎంతో సంతోషంగా ఉండేది. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
● గాడిదల గండి వద్ద యువకుడి మృతదేహం లభ్యం ● కుటుంబ సభ్యులతో కలిసి దళిత సంఘాల ఆందోళన యైటింక్లయిన్కాలనీ/మంథని: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జూల వంశీ(29) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏప్రిల్ 29న కనిపించకుండా పోయిన వంశీ మృతదేహం కుళ్లిన స్థితిలో ఆదివారం మంథని మండలం గాడిదల గండి వద్ద పొదల్లో లభ్యమైంది. వంశీ కనిపించడం లేదని ఈనెల 1న గోదావరిఖని టూటౌన్ పోలీసులకు మృతుడి తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దళిత సంఘాలు గాడిదల గండి వద్ద మంథని ప్రధాన రోడ్డుపై కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. గోదావరిఖని ఏసీపీ మడత రమేశ్ ఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు. ఏసీపీ మాట్లాడుతూ.. వంశీ చిన్ననాటి స్నేహితురాలు అలేఖ్యతోపాటు నవీన్, భాస్కర్కు ఎక్కువగా కాల్ చేశాడని తెలిపారు. అలేఖ్యకు వంశీతో ఉన్న గొడవల కారణంగా హైదరాబాద్కు పిలిపించి శంషాబాద్లో భాస్కర్ అనే వ్యక్తి గదిలో హత్య చేసినట్లు తెలిపారు. శవాన్ని చాపలో చుట్టి గాడిదల గండి వద్ద పడేసినట్లు పేర్కొన్నారు. విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కంచర్లలో చిరుత కలకలం
● దాడిలో గేదె మృతి వీర్నపల్లి: కంచర్ల గ్రామంలో చిరుత పులి దాడి ఒక్కసారిగా కలకలం సృష్టించింది. శనివారం రాత్రి గ్రామానికి చెందిన రైతు, మంత్రి శ్రీనివాస్కు చెందిన పాడి గేదైపె చిరుత దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, బాధితుడి వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే శ్రీనివాస్కు చెందిన గేదె తోటి గేదెలతో మేతకెళ్లగా.. అర్ధరాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఆదివారం తన గేదె కోసం అడవిలో గాలించగా.. గేదె చిరుత దాడిలో అక్కడికక్కడే మృతిచెందడంతో బాధితుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రభుత్వం నుంచి సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. గ్రామ సమీపంలోనే చిరుత సంచరిస్తుండడంతో కంచర్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు జంకుతున్నారు. పెద్దమ్మ ఆలయంలో చోరీమల్లాపూర్: సిరిపూర్ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ఆదివారం గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామ శివారులోని పెద్దమ్మ ఆలయంలో ప్రతి ఏటా ముదిరాజ్ కులస్తులతోపాటు ఇతర భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి కానుకలు హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఆదివారం మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఆలయ గర్భగుడి తాళం పగలగొట్టి అమ్మవారి బంగారు పుస్తెలు, ముక్కెర, బొట్టు, వెండి మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఎస్సై అనిల్ స్థానిక ప్రజాప్రతినిధులతో వెళ్లి విచారణ చేపట్టారు. ఆలయంలోని సీసీ ఫుటేజీ చూడగా.. దుండగుడు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యం రికార్డయింది. ముదిరాజ్ కులస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక.. ఇక చౌక
కొత్తపల్లి(కరీంనగర్): ఇసుక అక్రమ రవాణాను అరికట్టి, సామాన్యులకు తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ యాప్ను తీసుకువచ్చింది. వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 24 గంటల్లోపు ఇంటికే ఇసుక సరఫరా అవుతుంది. ఇసుక వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం వల్ల అక్రమ రవాణాను గుర్తించవచ్చు. స్మార్ట్ఫోన్ లేని వారు పంచాయతీ కార్యదర్శి ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ శివారుల్లోని మానేరు వాగులో రీచ్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందిరమ్మ ఇళ్లకు.. ఇందిరమ్మ ఇళ్లకు, ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఈ రీచ్ల్లో ఇసుక తీసుకునేందుకు ప్రాధాన్యతనివ్వనున్నారు. చాలాచోట్ల ఇందిరమ్మ ఇళ్లు ఇసుక లేక నిలి చిపోతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఎంపిక చేసిన రీచ్ల్లో ఇసుక తవ్వుకునే అవకాశమి చ్చింది. వినియోగదారులు gmiv. cgg. gov. in వెబ్సైట్ ద్వారా ఇసుక బుక్ చేసుకోవచ్చు. ఐదు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా.. ఇసుక నూతన విధానాన్ని కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైల ట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. ఈ జిల్లాల్లో ఫలితాలను బట్టి త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను విస్తరించనున్నారు. నేరుగా ప్రభుత్వ పోర్టల్ ద్వారా బుకింగ్ జరగడం వల్ల మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. దూరాన్ని బట్టి ధరలను నిర్ణయించడం వల్ల విని యోగదారులపై అదనపు ఆర్థిక భారం పడదు. ఇసుక లోడ్తో బయలుదేరిన ప్రతి వాహనానికి జీపీఎస్ పరికరాన్ని అమర్చుతారు. దీంతో వాహనం ఏ మార్గంలో వెళుతోంది..? ఎక్కడ ఆగుతోంది అనే వివరాలను అధికారులు పర్యవేక్షించవచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతం కావడానికి రెవెన్యూ, పోలీస్, రవాణా, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2017లో పెద్దపల్లి జిల్లాలో ‘స్యాండ్ టాక్సీ’ పేరుతో ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టినా కొన్ని కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు టెక్నాలజీని జోడించి మరింత పకడ్బందీగా దీనిని అమలు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఆర్డీవోలు అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
సర్కారుకు ఆదాయం.. సామాన్యులపై భారం
కరీంనగర్క్రైం: భూముల మార్కెట్ విలువను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. పట్టణ, నగర ప్రాంతాల్లో కమర్షియల్ ప్రాంతాలు, ఖాళీ స్థలాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువను 50శాతం నుంచి 100 శాతం వరకు పెంచే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్, రెవెన్యూ, మున్సిపల్శాఖల అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విషయమై ఈనెల 8న చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ ఆడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ) అధికారులు వీసీలో సమీక్షించారు. ఈ నెల 13లోపు నివేదిక పంపాలని ఆదేశించారు. జిల్లాల నుంచి నివేదిక రాగానే జూన్ 1వ తేదీ నుంచే కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది. ఎక్కడ ఎంత వరకు? ప్రస్తుత మార్కెట్ విలువ, వాస్తవ మార్కెట్ ధరలకు చాలా వ్యత్యాసముందని ప్రభుత్వం భావిస్తోంది. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పట్టణ విస్తరణ, కొత్త లేఅవుట్లు, కమర్షియల్ నిర్మాణాలు, రహదారి అభివృద్ధితో భూముల అసలు ధరలు భారీగా పెరిగాయి. దీంతో కొత్త విలువలు నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కరీంనగర్ పరిసర ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ధరల విలువలు పెంచుతున్నట్లు తెలిసింది. రేకుర్తి, పద్మనగర్, చింతకుంట, అలుగునూర్, హౌసింగ్బోర్డు, బొమ్మకల్, నగునూరుతో తదితర ప్రాంతాల్లో భారీగా పెంపు ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లపై ప్రభావం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నెలకు రూ.20 కోట్ల వరకు ఆదా యముంటుంది. మార్కెట్ ధర పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.10 లక్షల మార్కెట్ విలువ ఉన్న స్థలం కొత్త ధర ప్రకారం రూ.18లక్షల నుంచి రూ.20 లక్షలకు చేరితే, రిజిస్ట్రేషన్ ఖర్చు రెట్టింపవుతుంది. తద్వారా రిజిస్ట్రేషన్శాఖకు అదనపు ఆదాయం చేకూరుతుంది. కాగా.. మధ్యతరగతి, చిన్న స్థలాలు కొనుగోలు చేసేవారు పెరుగుతున్న ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ వృద్ధే లక్ష్యమా? భూముల మార్కెట్ విలువల పెంపు వెనుక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే ఉద్దేశమే ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రిజిస్ట్రేషన్శాఖ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గత కొంతకాలంగా కీలక వనరుగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో భూముల అసలు ధరలు ఎక్కువగా, ప్రభుత్వ విలువ తక్కువగా ఉండటంతో భారీగా ఆదాయం కోల్పోతున్నామన్న అభిప్రాయమున్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుత మార్కెట్ ధరకు దగ్గరగా ప్రభుత్వ విలువలను తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములపైనా ప్రభావం వ్యవసాయ భూముల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ధరల పెంపు ఉండే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూవర్గాలు చెబుతున్నాయి. హైవేలకు సమీ పంలో ఉన్న భూములు, త్వరలో మున్సిపల్ పరిధి లోకి వచ్చే గ్రామాలు, ఇండస్ట్రియల్ కారిడార్ ప్రభా విత ప్రాంతాల్లో గణనీయమైన పెంపు ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం అధికారులు ప్రాథమిక అంచనాలు, మార్కెట్ సర్వే, రిజిస్ట్రేషన్ డేటా ఆధారంగా నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుండగా, పెంపు శాతం, అమలు తేదీపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగా -
వాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఉక్కపోత ఉంటుంది. వడగాలులు వీస్తాయి.
నేటి నుంచి పీఎంశ్రీ స్కూళ్లలో క్రీడా శిబిరాలుకరీంనగర్స్పోర్ట్స్: విద్యార్థుల వేసవి సెలవులను విజ్ఞానదాయకంగా మార్చేందుకు పీఎంశ్రీ పాఠశాలల్లో నేటి నుంచి ఈ నెల 25 వరకు సమ్మర్ క్యాంప్లు నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎంశ్రీ పాఠశాలల్లో విజ్ఞాన, క్రీడా శిబిరాల కోసం ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.50వేలు కేటాయించింది. కరీంనగర్ జిల్లాలో ఉన్న 17 పాఠశాలలకు రూ.8లక్షలు, జగిత్యాలలోని 15 పాఠశాలలకు రూ. 7.5లక్షలు, రాజన్న సిరిసిల్లలోని 9 పాఠశాలలకు రూ.4.5లక్షలు, పెద్దపల్లి జిల్లా పరిధిలోని 8 పాఠశాలలకు రూ.4లక్షలు కేటా యించారు. పీఎంశ్రీతో పాటు సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ ఈ క్యాంప్ల్లో అవకాశం కల్పించనున్నారు. -
1,893 బ్లాకులు.. 1,967 ఎన్యుమరేటర్లు
కరీంనగర్ అర్బన్: జనగణన– 2027 ప్రక్రియ తొలి దశ నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎన్యుమరేటర్లకు శిక్షణనివ్వగా, యాప్ వివరాలు అప్లోడ్ చేశారు. ముందుగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. పోర్టల్ ద్వారా ప్రజల తమ మొబైల్ నంబర్తో లాగిన్ అయి గృహాన్ని జియోట్యాగ్ చేసి వివరాలు నమోదు చేసుకోగా, హెచ్తో ప్రారంభమయ్యే 11అంకెల సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీని భద్రపరిచారు. ఎన్యుమరేటర్లే ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేసుకోనుండగా , ఐడీ నంబర్ ఇస్తే సరిపోతుంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ద్వారా కుటుంబ వివరాలను ధ్రువీకరిస్తారు. జనగణన ప్రక్రియ కాగిత రహితమే కా గా.. సాంకేతికతతో డిజిటల్ గణన చేయనున్నారు. జూన్ 10వరకు హౌస్ లిస్టింగ్ హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో)లో భాగంగా బ్లాకులవారీగా ఇళ్లకు నంబర్లు కేటాయించనున్నారు. రెండో దశలో 2027 ఫిబ్రవరి 9నుంచి 25వరకు వ్యక్తిగత వివరాల సేకరణ ఉండనుంది. స్థానికులతోపాటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనగణనలో పాల్గొనవచ్చని అధికారులు వివరించారు. జిల్లాస్థాయిలో ముఖ్య గణాంక అధికారిగా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా మండలస్థాయిలో చార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అర్బన్లో మున్సిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారు. జిల్లాలోని 16 మండలాలు, జమ్మికుంట, హుజూరాబాద్, చొప్పదండి మున్సిపాలిటీలు కలుపుకొని 1,227 హౌస్ లిస్టింగ్ బ్లాక్లుగా విభజించగా 1,234 మంది ఎన్యుమరేటర్లు, 215 మంది సూపర్వైజర్లను నియమించారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో 666 బ్లాకులుగా విభజించగా 733 మంది ఎన్యుమరేటర్లు, 122 మంది సూపర్వైజర్లు విధులు నిర్వహించనున్నారు. ఆరుగురు ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్, ఒక్కో ఎన్యుమరేటర్ సుమారు 200 ఇళ్ల వివరాలు సేకరిస్తారు.2011 లెక్కల ప్రకారం జిల్లా జనాభా 10,05,711 నివాసాలు 2,58,485 కుటుంబాలు 2,90,657 కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ఒకరి మొబైల్ నంబరు ఎంటర్ చేయాలి. ఆ నంబర్తో ఒక కుటుంబం వివరాల నమోదుకు మాత్రమే అవకాశముంటుంది. మొబైల్ నంబరుతో పాటు ఈ మెయిల్కు ఐడీ నంబరు వస్తుంది. పిన్కోడ్, గ్రామం/నగరం, ప్రాంతం, స్థానిక ల్యాండ్ మార్క్, భవనం నంబరు, నివాసయోగ్య స్థితి, వసతులు, మతం, షెడ్యూల్ కులాలు, తాగునీటి వసతి, గృహ వినియోగం, ఇంధనం తదితర వివరాలను చెప్పాల్సి ఉంటుంది. -
ఆడపిల్ల పుట్టిన ఇంటికి రూ.10 వేలు
కరీంనగర్ టౌన్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నిక ల సమయంలో తన డివిజన్లోని దంపతులకు ఆడపిల్ల పుడితే రూ.10వేలు అందిస్తానని ఇచ్చిన హామీని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ నెరవేర్చా రు. డివిజన్కు చెందిన పైండ్ల రవళి, ప్రశాంత్ దంపతులకు ఆడపిల్ల జన్మించగా ఆ మొత్తాన్ని ఆదివారం అందించారు. రవీందర్ సింగ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డ పుట్టిన ఇంట్లో ఆనందం రెట్టింపు కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు. సభకు తరలిన బీజేపీ శ్రేణులు కరీంనగర్: సికింద్రాబాద్లోని పరేడ్గ్రౌండ్లో ఆదివారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ సభకు జిల్లా నుంచి భారీ ఎత్తున బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కరీంనగర్ నుంచి వెళ్లిన వాహనాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లానుంచి 120 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులతో పాటు దాదాపు 500 సొంత వాహనాల్లో సభకు తరలి వెళ్లారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుగ్గిళ్ల రమేశ్, ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, సీనియర్ నాయకుడు గుజ్జ శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు, అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడు భూముల అనిల్ పాల్గొన్నారు. నైపుణ్యం పెంచుకోవాలి కరీంనగర్ టౌన్: కళాకారులు శిక్షణ ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జరుగుతున్న ఉమ్మడి జిల్లా తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. నర్సింహ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో కళాకారులు ఉ పాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, జానపదం, యక్షగాన, బుర్రకథ, ఒగ్గుకథ, వీధి బాగోతం కళాకారుల బతుకులు దుర్భరంగా ఉన్నాయని, వారికి గుర్తింపు కార్డులతో పాటు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ అనుబంధమైన తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర మహాసభలు ఈనెల 25, 26వ తేదీల్లో హైదారాబాద్లో జరగనున్నాయని, విజయవంతం చేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, ఇఫ్టా జాతీయ కౌన్సిల్ సభ్యుడు కవ్వంపల్లి స్వామి, అందె స్వామి, కన్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది.ప్రత్యేక బృందాలతో...ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేçపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు.బిహార్లో నగలు విక్రయిస్తుండగాదర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. -
11 నుంచి ప్రత్యేక విద్యా వారోత్సవాలు
కరీంనగర్టౌన్: ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 11 నుంచి 17 వరకు జిల్లాలో ప్రత్యేక విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చిత్రామిశ్రా, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి తెలి పారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదుశాతం పెంచడం లక్ష్యంగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయన్నారు. 11న ఫౌండేషన్ డే, సమ్మర్ క్యాంప్, 12న ఎస్సెస్సీ రిమీడియల్ క్యాంపుల ప్రారంభం, ఇంటర్ రిమీడియల్ క్యాంపుల ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. 13న పాఠశాల విద్యా అభివృద్ధిపై సర్పంచ్లు, వార్డు సభ్యులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులతో వర్క్షాప్లు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాల మెరుగుదలపై చర్చ నిర్వహించాలన్నారు. 14న జయశంకర్ బడిబాట కార్యక్రమంతో పాటు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 15న లైబ్రరీ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. 16న ఆర్ట్, క్రాఫ్ట్, కల్చరల్ డే కళావైభవం పేరుతో జిల్లావ్యాప్తంగా నిర్వహించాలి. చిత్రలేఖనం, హస్తకళలు, నృత్యం, సంగీతం, సాంస్కృతిక పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేయాలి. 17న విద్యా విజయోత్సవం కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు. -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
హలో.. టీజీఎన్పీడీసీఎల్
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు పారదర్శక విద్యుత్ సేవలు అందించాలనే లక్ష్యంతో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఇప్పటికే విద్యుత్ యాప్ ద్వారా సేవలందిస్తున్న సంస్థ మరింత వేగవంతంగా వినియోగదారులను చేరుకునేందుకు ‘వాట్సాప్ చాట్ బాట్‘ అనే కొత్త ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐని జోడిస్తూ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఈ ఫీచర్ సేవలందించనుంది. ఎంచుకున్న భాషలో వినియోగదారుడి ప్రశ్నను ఏఐలో విశ్లేషించి సమాచారం ఇవ్వనుంది. ఎటువంటి విద్యుత్ సమస్య తలెత్తిన 1912 టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులో ఉంచిన విద్యుత్ సంస్థ కొత్తగా ఏఐ ఆధారిత వాట్సాప్ ఫీచర్ను 24/7 వినియోగంలోకి తెచ్చింది. టీజీఎన్పీడీసీఎల్ పరిధిలోని 18 జిల్లాల్లో గల 70.39 లక్షల వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు విద్యుత్ సంస్థ సిద్ధమైంది. 8712481489 వాట్సాప్ నంబర్ ద్వారా సేవలు మొదటగా వినియోగదారులు తమ మొబైల్ నుంచి వాట్సాప్లో 8712481489 సంప్రదించి అవరమైన సేవలను సులభంగా పొందవచ్చు. వినియోగదారుడి ప్రస్తుత బిల్లు మొత్తం, చెల్లింపు తేదీ వివరాలు, చెల్లించిన బిల్లు వివరాలు అందుబాటులో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషలో ఫిర్యాదు చేస్తే టికెట్ ఇస్తుంది. ఈ టికెట్ ఆధారంగా ఫిర్యాదు స్థితిగతులను తెలుసుకోవచ్చు. వినియోగదారులు ఉంటున్న ప్రాంతంలోని ప్రస్తుత అంతరాయ స్థితులను తెలుసుకోవచ్చు. చాట్బాట్కు సమాధానం చెప్పలేని, పరిష్కరించలేని సమస్య తలెత్తినప్పుడు వినియోగదారుని ఏజెంట్కు తరలించి సమస్య పరిష్కరించబడుతుంది. -
బీఆర్ఎస్, బీజేపీ బల నిరూపణకు అల్లర్లు
ముత్తారం: బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బలనిరూపణ కోసం అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నారని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్లో శనివారం మంత్రి ఇందిరమ్మ గృహప్రవేశం చేయించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ జిల్లాను హింసాత్మకం చేస్తున్నారని విమర్శించారు. గూండాయిజం, రౌడీయిజంతో కొట్లాడుకుంటూ ప్రశాంతతను దెబ్బతీశారని ఆరోపించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ మిత్ర పక్షంగా ఉంటూ అధికారం లేకపోవడంతో అల్లర్లు సృష్టిస్తోందని, కేటీఆర్ పేదలకు గూడు ఇవ్వలేక మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు చోప్పరి సదానందం, మాజీ జెడ్పీటీసీ నాగినేని జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
నాణ్యమైన సేవలందించడానికే
నాణ్యమైన, పారదర్శకమైన సేవలందించడమే ప్రధాన లక్ష్యంగా విద్యుత్ సంస్థ పనిచేస్తోంది. మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యుత్ సంస్థ ఏఐ ఆధారిత వాట్సాప్ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులోకి తెచ్చిన ఏఐ ‘వాట్సాప్ చాట్ బాట్‘ కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు, వినియోగదారులకు అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచారాన్ని పొందవచ్చు. విద్యుత్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకొని అవాంతరాలు లేని విద్యుత్ను పొందాలి. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
బీఆర్ఎస్ బంద్ ప్రశాంతం
కమలాకర్ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులుషాప్ మూసివేయిస్తున్న బీఆర్ఎస్ నాయకులుటవర్ సర్కిల్లో సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణకరీంనగర్టౌన్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం బీఆర్ఎస్ చేపట్టిన కరీంనగర్ బంద్ ప్రశాంతంగా సాగింది. పోలీసులు ముందస్తుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మానకొండూర్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, రసమయి బాలకిషన్, చొప్పదండిలో సుంకె రవిశంకర్ను హౌస్ అరెస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, రవీందర్ సింగ్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు గంగుల ఇంటికి చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గంగుల బయటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల జెండాలతో రోడ్డెక్కేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకొని పీటీసీకి తరలించారు. పలువురు కార్యకర్తలు కోర్టు చౌరస్తాలో బీజెపీ, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రోజంతా హైరానా బంద్లో పాల్గొనవద్దని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ప్రజలకు పిలుపునివ్వడం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బంద్ జరిగి తీరుతుందని ప్రజలు సహకరించాలని కోరడంతో నగరంలో హైటెన్షన్ నెలకొంది. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు మోహరించడంతో ప్రజలు హైరానా పడ్డారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఆస్తులు, ప్రజా ప్రతినిధులపై దాడులకు దిగడం అప్రజాస్వామికమన్నారు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి బంద్ను విఫలం చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించినా ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. గుగ్గిళ్ల జయశ్రీ, తిరుపతినాయక్, బోనాల శ్రీకాంత్, జమీలోద్దీన్, గందె మాధవి, ఎడ్ల అశోక్, మైకెల్ శ్రీనివాస్, సోహన్ సింగ్, లక్ష్మయ్య, శ్యాంసుందర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, దిండిగాల మహేశ్, పావని, రుద్ర రాధ, గంటల రేణుక పాల్గొన్నారు. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు
కుత్బుల్లాపూర్/సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ తనయుడిపై హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని సుచిత్ర ప్రాంతంలో ఉండే ఓ మైనర్ బాలిక (17) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపిస్తూ శుక్రవారం రాత్రి ఫిర్యాదురాగా పేట్ బషీరాబాద్ సీఐ విజయవర్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ (24) డిసెంబర్ 31న మొయినాబాద్లోని ఓ ఫామ్ హౌస్లో స్నేహం పేరిట తిరుగుతూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి అదే రోజు రాత్రి అసభ్యకరంగా ప్రవర్తించాడనేది ప్రధాన ఆరోపణ. భగీరథపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తోపాటు సెక్షన్ 11 రెడ్విత్ 12 పోక్సో చట్టం కింద నమోదు చేశారు. భగీరథపై గతంలో బహదూర్పల్లిలో ఉన్న కళాశాలలో ర్యాగింగ్తోపాటు డ్రగ్స్ విషయంపై ఫిర్యాదులు రాగా దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాగా, ప్రధాని మోదీ నగరానికి విచ్చేస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కుమారుడిపై పోక్సో కేసు నమోదుకావడం చర్చనీయాంశమైంది. స్నేహం పేరుతో బ్లాక్మెయిల్ స్నేహం పేరుతో తనను బ్లాక్మెయిల్ చేస్తూ వివాహానికి ఒత్తిడి తెచ్చారని బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక యువతిపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సదరు యువతితో తన స్నేహితులకు కూడా ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. ఈ మేరకు సదరు యువతి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మాటలు.. మంటలు.. దాడులు!
శుక్రవారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2026సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ టౌన్: కేటీఆర్పై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన విమర్శలు, దానిని ఖండిస్తూ హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి చేసిన ప్రతివిమర్శలు భౌతికదాడులకు దారితీశాయి. గురువారం ఉదయం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండిపై కౌశిక్ చేసిన వివాదాస్పద విమర్శలతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కర్రలతో ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడికి దిగారు. గన్మన్లు కౌశిక్ను లోపల గదికి తరలించి ఆయనపై దాడిని తప్పించారు. కౌశిక్ చిక్కకపోవడంతో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయం ఫర్నిచర్ను అక్కడే ఉన్న పాడి కారును బీజేపీ నేతలు ధ్వంసంచేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకురాలు పావనిగౌడ్ ఇంటి మీద దాడిచేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ నేతలను అడ్డగించిన బీజేపీ నాయకులు సంపత్గౌడ్ అనే బీఆర్ఎస్ నాయకుడి తలపగులగొట్టారు. అనంతరం పాడికౌశిక్ తీరుపై నిరసన వ్యక్తం చేసేందుకు పలువురు బీజేపీ నాయకులు హుజూరాబాద్ తరలేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకున్నారు. మరోవైపు హుజూరాబాద్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసనకు దిగడంతో బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. పరస్పర వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. మొత్తానికి ఇటు కరీంనగర్లో అటు హుజూరాబాద్లో పోలీసుల అప్రమత్తతో ఉద్రిక్త పరిస్థితులను నివారించగలిగారు. ఇంకోవైపు పాడి కౌశిక్పై చర్యలు తీసుకోవాలంటూ న్యాయవాదులు సోమిరెడ్డి వేణు ప్రసాద్, కొలిపాక చంద్రమౌళి, కామారపు విశ్వ ప్రసాద్, కనుకయ్య పెద్దపెల్లి జితేందర్ రెడ్డి, శ్రీలేఖ, ఊస కోయిల రమేశ్, వెన్న ఆనందం కోరారు. ఘటనపై ఎవరేమన్నారంటే.. లా అండ్ ఆర్డర్ ఉందా?: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యుడినైన తనను చంపేయత్నం జరిగింది. అసలు కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ ఉన్నాయా? ఈ విషయంలో సీఎం, బండి ఒక్కటయ్యారు. ఎమ్మెల్యేపైనే దాడులు చేస్తే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? దాడులకు భయపడం. నోటికివచ్చినట్లు తిట్టి ఇదేంటని అడిగితే దాడులు చేస్తారా? ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకుల నిరసనకేంద్ర మంత్రి బండి సంజయ్ గురించి మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. డ్రగ్స్ టెస్టుకు సంజయ్ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో కేటీఆర్ భయపడుతున్నారని కౌశిక్ మాటల ద్వారా అర్థం అవుతుంది. – ప్రవీణ్రావు, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్‘మిస్టర్ కౌశిక్ రెడ్డి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం మానుకోకపోతే ఇదేవిధంగా దాడులు కొనసాగుతాయి. తెలంగాణలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. – ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, డీసీసీ ప్రెసిడెంట్ కరీంనగర్కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వయంగా దాడులు చేయించడం సిగ్గుచేటు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడికి తెగబడి, ఆఫీస్ ఫర్నిచర్, అద్దాలు, కారు ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. – జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు -
బీజేపీ, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్
● డ్రగ్స్ మత్తులో మాట్లాడుతున్న కేటీఆర్ ● సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీ, బీఆర్ఎస్ చీకట్లో రహస్య ఒప్పందాలు చేసుకొని బహిరంగంగా కొట్టుకొన్నట్లు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మండిపడ్డారు. గురువారం నగరంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల జరిగిన నగరపాలక సంస్థ మేయర్, కోఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పరస్పరం సహకరించుకోవడం అందరికీ తెలిసిందేనన్నారు. అవసరమైనప్పుడు సహకరించుకుంటూ.. మరోవైపు తిట్టుకుంటూ.. పరస్పరం దాడులు చేసుకుంటూ ప్రజాపాలనను అపవాదుకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడితే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డ్రగ్స్ మత్తులో ఉండి కేటీఆర్ ఇంకా తానే రాజనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. జువెల్లరీ షాప్లో జరిగిన దొంగతనంపై పోలీసులు దర్యాప్తు చేస్తుంటే.. కౌశిక్రెడ్డి కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారని విమర్శించారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, పడిశెట్టి భూమయ్య, కాంతాల జగన్రెడ్డి, పర్వతం మల్లేశం, గంట శ్రీనివాస్, ఎండీ తాజొద్దీన్, కొరివి అరుణ్కుమార్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు.కరీంనగర్ నుంచి విహార యాత్రకు బస్సులువిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్–2 డిపో నుంచి మైసూర్ మీదుగా ఊటి విహార యాత్రకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 16న మైసూర్లో మైసూర్ ప్యాలెస్, చాముండే టెంపుల్, బృందావన్ గార్డెన్ మొదలగు ప్రదేశాలు చూసి అదేరోజు మైసూర్లో బస చేసి 17న ఉదయం 4 గంటలకు మైసూర్ నుంచి బయలుదేరి ఊటి వెళ్తుందన్నారు. ఊటిలో రెండు రోజులపాటు బస చేసి ఊటిలోని వివిధ ప్రదేశాలు సందర్శించి 18న రాత్రి డిన్నర్ తరువాత బెంగళూరు చేరుకుంటుందని చెప్పారు. బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, బెంగళూరు ప్యాలెస్ సందర్శన అనంతరం బెంగళూరు నుంచి బయలుదేరి 21న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.6వేలు, పిల్లలకు రూ.4,500 టికెట్ ఉంటుందని, భోజనం ఖర్చులు, దర్శనం టికెట్ చార్జీలు ప్రయాణికులే భరించాలని పేర్కొన్నారు. వివరాలకు 7382847727, 7382850707, 8978383084 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సోలార్ విద్యుత్ కేంద్రాలతో ప్రయోజనం
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ కరీంనగర్రూరల్: రైతులు సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవ డం ద్వారా ఎంతో ప్రయోజనం పొందుతారని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ రవీందర్ అన్నారు. గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా దుర్శేడ్ రైతు వేదికలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రాల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పీఎం కుసుమ్ పథకంలో సోలార్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించిందన్నారు. సబ్ స్టేషన్ల పరిధిలో సోలార్ కేంద్రాలను ఏర్పాటు చేసి విద్యుత్ను విక్రయించడం ద్వారా ఆదాయం పొందొచ్చని తెలిపారు. డీఈ రాజం, ఏఈ ప్రదీప్రెడ్డి, ఏవో సత్యం, ఏఈవో స్వర్ణలత, రైతులు పాల్గొన్నారు. -
రేపు కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పిలుపు
కరీంనగర్టౌన్: మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అధికారిక క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు చేసిన దాడిని నిరసిస్తూ ఈనెల 9న శనివారం కరీంనగర్ బంద్కు బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణా రావు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై ఇలాంటి దాడులు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని... ఈ ఘటనతో కరీంనగర్ పట్టణంలో శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందన్న విషయం స్పష్టమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని కరీంనగర్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దాడికి నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్ పట్టణ బంద్కు పిలుపునిస్తున్నామని కరీంనగర్ నగర ప్రజలు, వ్యాపార వర్గాలు, యువత, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
తాలు, తరుగు పేరిట కొర్రీలొద్దు
కరీంనగర్ అర్బన్: తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే సహించమని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, రానున్న 15 రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. సమస్య ఎక్కువగా ఉన్న కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లుపై ముందుగా దృష్టి సారించాలని తెలిపారు. స్థానిక హమాలీలకు ప్రాధాన్యం ఇస్తూ వారితో మాట్లాడి హమాలీ కొరత పరిష్కరించాలని తెలిపారు. అవసరమైతే నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల నుండి హమాలీలను మాట్లాడుకోవాలని అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ద్రావణం అందించాలని అన్నారు. ధాన్యం రవాణా కోసం మరో 200 అదనపు వాహనాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కొన్న ధాన్యాన్ని మిల్లులు, స్టోరేజీ కేంద్రాలకు తరలించాలన్నారు. రైతులకు చెల్లింపు ప్రక్రియలో ఆలస్యం చేయవద్దని ఆదేశించారు. కలెక్టర్ చిత్ర మిశ్రా మాట్లాడుతూ... రానున్న 15 రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున ధాన్యం రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవోలు కె.మహేశ్వర్, రమేశ్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.రజనీకాంత్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ట్రాన్స్పోర్ట్ యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఇసుక లారీలు ఇలా.. వెళ్లేదెలా?
ఇసుక లారీలతో రోడ్లు కిక్కిరిసిపోతున్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలిగి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వీణవంక మండలం కొండపాక గ్రామ మానేరు వాగు శివారులో రెండు ఇసుక క్వారీలు ఉన్నాయి. ఇక్కడ ఇసుక నింపుకొని హిమ్మత్నగర్ గ్రామం మీదుగా రెడ్డిపల్లి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ క్రమంలో రెడ్డిపల్లి గ్రామ మూలమలుపు వద్ద తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. లారీ డ్రైవర్లు ఒకరి కంటే మరొకరు పోటీపడి రోడ్డుకు ఇరువైపులా నిలపడం కూడా సమస్యగా మారింది. వీణవంక మండల కేంద్రంలో బస్టాండ్ వెనుక రోడ్డు ప్రమాదకరంగా ఉంది. జనం రద్దీగా ఉండే ఈ ఏరియాలో లారీల ఓవర్ స్పీడ్తో వాహనదారులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది. – వీణవంక -
ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్య
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్గా నగరంలోని కట్టరాంపూర్కు చెందిన ఆకుల నర్సయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. చైర్మన్గా ఆకుల నర్సయ్య, వైస్చైర్మన్ గా సుదగోని లక్ష్మీనారాయణగౌడ్, సభ్యులుగా పంజాల శ్రీనివాస్గౌడ్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసాల శంకర్, తపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావనవేని సంపత్, కే శవేని భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్లను నియమించారు. వీరితో పాటు కరీంనగర్ సింగిల్విండో చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ ఏడీ, నగరపాలకసంస్థ మేయర్ సభ్యులుగా ఉంటారు. పంతం నెగ్గించుకున్న ‘వెలిచాల’ ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్య నియామకంతో కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు తన పంతం నెగ్గించుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన అనంతరం కరీంనగర్లో పట్టుపెంచుకోవడానికి వెలిచాల తీవ్రంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఏఎంసీ చైర్మన్గా తన మద్దతుదారుడు ఆకుల నర్సయ్య పేరును అధిష్టానానికి ప్రతిపాదించారు. ఇదే సమయంలో తిమ్మాపూర్ మండలానికి చెందిన సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ పేరును రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తుమల్లేశం సూచించారు. దీంతో ఇందులో ఎవరిది పైచేయి అవుతుందో అనే ఉత్కంఠ కొంతకాలంగా కాంగ్రెస్ వర్గీయుల్లో నెలకొంది. చివరకు ఏఎంసీ చైర్మన్గా ఆకుల నర్సయ్యను నియమించడంతో వెలిచాల రాజేందర్రావు తనపంతం నెగ్గించు కొన్నట్లయింది. కాగా.. చైర్మన్గా నియమితులైన నర్సయ్యను నగరంలోని ఆయన కార్యాలయంలో రాజేందర్రావు సన్మానించారు. -
అన్నదాత ఆగ్రహం
గంగాధర: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకుందామంటే జరుగుతున్న జాప్యం, అధిక తూకం, మిల్లుకు వెళ్లిన తరువాత మరోసారి కోతలు విధించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. వెంకటాయిపల్లి గ్రామానికి చెందిన రైతులు కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. పలువురు రైతులు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా తూకం వేయడం లేదన్నారు. కేంద్రం ప్రారంభించిన నుంచి ఇప్పటివరకు రెండు లారీలు మాత్రమే తూకం వేశారని అన్నారు. సంచికి 41 కిలోలు మాత్రమే తూకం వేయాల్సి ఉండగా.. 42.200 కిలోల తూకం వేస్తున్నారని, మిల్లుకు వెళ్లిన తరువాత మరో కిలో కోత పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో ఇరువైపులా పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎస్సై వంశీకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తాననడంతో రైతులు ఆందోళన విరమించారు. మంగపేట రైతులు.. ధాన్యం తూకం వేయడంలో జాప్యం జరుగుతోందని, కొనుగోలు కేంద్రం వద్ద సౌకర్యాలు కరువయ్యాయని మంగపేట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, తూకం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలోని మంగపేట స్టేజీ వద్ద ఆందోళన నిర్వహించారు. తహసీల్దార్ రజిత సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అభివృద్ధికి యూసీఎఫ్ గొప్ప అవకాశం
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని సుందరంగా మార్చేందుకు అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) స్కీం గొప్ప అవకాశమని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం మేయర్ శ్రీనివాస్ అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో జరిగింది. సమావేశంలో నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ యూసీఎఫ్ స్కీంలో ప్రవేశం, కేంద్ర,రాష్ట్ర, నగరపాలక సంస్థ వాటాలు, పనుల అమలుపై సభ్యులకు వివరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ అర్బన్ చాలేంజ్ ఫండ్ పథకాన్ని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ త్వరలో ప్రకటించనుండడంతో ఈ పథకం లో కరీంనగర్ నగరపాలక సంస్థ ను చేర్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1150 కోట్ల నిధులతో ప్రతిపాదనలు సిద్దం చేసి పంపిస్తున్నామని తెలిపారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో ఈ నిధులను సమర్థవంతంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతామన్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్ వైద్యుల అంజన్కుమార్ మాట్లాడుతూ... యూసీఎఫ్ స్కీం విజయవంతం కావాలంటే మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజలకు పాలకవర్గానికి వారధిగా ఉండాల్సిన అధికారులు నిబంధనల సాకుతో ఇబ్బందులు పెడుతున్నారని, ఈ విధానం మార్చుకోవాలన్నారు. అనంతరం రూ.1150 కోట్ల ప్రతిపాదనలను ఆమోదిస్తూ నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్రావు, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు మాధవ్, ఎస్ఈ రాజకుమార్, ఈఈ సంజీవ్ కుమార్, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో అలర్ట్.. బీఆర్ఎస్ నేతలు హౌజ్ అరెస్ట్
కరీంనగర్ బంద్ అప్డేట్స్.. కరీంనగర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో.. దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిరసనగా నేడు కరీంనగర్ నగర బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో, బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్లు చేస్తున్నారు.గంగుల కమలాకర్ కామెంట్స్..కరీంనగర్లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.నన్ను, మా బీఆర్ఎస్ నాయకులని అరెస్టు చేసినా.. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలిసే జరిగింది.మమ్మల్ని అరెస్టు చేయడం పోలీసులు పెట్టిన శ్రద్ధ కరీంనగర్పై పెడితే జువెలరీ షాపులో దొంగతనం జరిగేది కాదు.గోల్డ్ రాబరీ ఖచ్చితంగా పోలీసుల వైఫల్యం..వారం రోజులు అవుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు.కరీంనగర్ నిషేధిత ప్రాంతమా?కేటీఆర్ ఎందుకు అడుగుపెట్టవద్దు.బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..కరీంనగర్ బందుకు బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలు ముందస్తు అరెస్ట్..పలువురు బీఆర్ఎస్ కార్పోరేటర్లను ముందస్తు అరెస్ట్ చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలింపుగంగాధరలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హౌజ్ అరెస్ట్..కరీంనగర్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు..బంద్ వద్దని బీజేపీ, కాంగ్రెస్ పిలుపు..బంద్ చేయాలని బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో హైఅలర్ట్ వాతావరణం. నేడు కరీంనగర్ బందుకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్కరీంనగర్లో ఉద్రిక్తికర వాతావరణంఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కారు, ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బందుకు పిలుపుఎవరూ బంద్ చేయాల్సిన అవసరం లేదంటూ బీజేపీ కరపత్రాల పంపిణీప్రెస్ మీట్స్, ప్రెస్ నోట్స్తో బంద్ పెట్టొద్దంటూ బీజేపీ నాయకుల పిలుపుబీజేపీకి మద్దతుగా బందుపై కాంగ్రెస్ విముఖతబంద్ అవసరం లేదంటూ ప్రకటన విడుదల చేసిన డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంరెండు జాతీయ పార్టీలు వర్సెస్ ఓ ప్రాంతీయ పార్టీ అన్నట్టుగా కరీంనగర్ బంద్పై కొనసాగుతున్న యుద్ధం. -
ఏఎంసీ రేటు రూ.3.50 కోట్లు
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి విలువ రూ.3.50 కోట్లు అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ సంచలన ఆ రోపణలు చేశారు. ఏఎంసీ చైర్మన్ విషయంలో జరిగిన అన్యాయానికి నిరసనగా, తనకు ఇచ్చిన వైస్ చైర్మన్, మానకొండూరు బ్లాక్కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడారు. 35 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగుతున్న తనకు ఏఎంసీ చైర్మన్ పదవి ఇవ్వాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యానారాయణ, మే డిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, అర్బన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ సిఫారసు చేశారని, కానీ, పార్టీలోకి కొత్తగా వచ్చిన ఆకుల నర్సయ్యకు వెలిచాల రాజేందర్రావు పదవి కట్టబెట్టారన్నారు. మున్సిపల్ ఎన్నికల సమసయంలో రూ.3 కోట్లు, ఏఎంసీ చైర్మన్ కోసం రూ.50 లక్షలు మొత్తం రూ.3.50 కోట్లు ఇచ్చారనే ఆయనకు చైర్మన్ పదవి ఇచ్చారని విమర్శించారు. డైరెక్టర్లుగా నియమించిన వారిలో కేవలం ఒక్కరు మా త్రమే కాంగ్రెస్ పార్టీకి చెందినవారని, పార్టీతో సంబంధం లేని ఇతర పార్టీ నాయకులకు డైరెక్టర్ పదవులు ఇచ్చారని ఆవేదన చెందారు. వెలిచాల రాజేందర్రావును అసెంబ్లీ ఇన్చార్జి పదవి నుంచి తప్పిస్తేనే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగిస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ జోక్యం చేసుకొని ఏఎంసీ కమిటీని రద్దు చేసి, పార్టీకి కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలతో కొత్తగా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రెడ్డిగాని రాజు, బుర్ర కనుకయ్యగౌడ్, తిరుపతి, కిరణ్, తిరుపతిరెడ్డి, వరాల అనిల్, రాజమల్లు పాల్గొన్నారు. -
యంగ్ ఇండియా సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్
● రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహణ ● ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణకరీంనగర్స్పోర్ట్స్: వేసవి సెలవుల్లో విద్యార్థులను క్రీడల వైపు మళ్లించి, వారిలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) క్రీడా శిబిరాలకు శ్రీకారం చుట్టింది. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్– షేపింగ్ యంగ్ ఇండియా చాంపియన్స్–2026 పేరుతో శిబిరాలను నిర్వహించనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈనెల 11 నుంచి ఆయా జిల్లాల కేంద్రాలు, మండల కేంద్రాల్లో శిబిరాలు ప్రారంభం కానున్నాయి. నిష్ణాతులైన కోచ్ల పర్యవేక్షణలో శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. కాగా, కరీంనగర్లో నగర పాలక సంస్థ, క్రీడాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో పాల్గొనే చిన్నారులకు పాలు, గుడ్డు, అరటిపండు ఇస్తారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏయే క్రీడల్లో శిక్షణ శిబిరాలు జరుగనున్నాయి, ఎలా దరఖాస్తులు చేసుకోవాలి.. తదితర వివరాలతో కథనం. ఉమ్మడి జిల్లాలో నిర్వహించే క్రీడలివే.. కరీంనగర్: ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, క్రికెట్, చెస్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, వాలీబాల్, యోగా, జూడో, రెజ్లింగ్. రాజన్న సిరిసిల్ల: కబడ్డీ, అథ్లెటిక్స్, హ్యాండ్బాల్, వాలీబాల్, కరాటే, యోగా, టేబుల్ టెన్నీస్, బ్యాడ్మింటన్, క్రికెట్, బాస్కెట్బాల్, ఆర్చరీ, క్యారమ్, చెస్, ఖోఖో, నెట్బాల్. పెద్దపల్లి: ఫుట్బాల్, ఖోఖో, తైక్వాండో, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్. జగిత్యాల: వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, తైక్వాండో, అథ్లెటిక్స్, కరాటే. శిక్షణ వేళలు: ఉదయం 6 నుండి 9, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు. రిజిస్ట్రేషన్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ( https:// satgasc. telangana. gov. in).అర్హత: 10 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సువారు అర్హులు. ఫీజు: ఆన్లైన్లో ఎంచుకున్న క్రీడ, వేదికను బట్టి ఫీజు వివరాలు మారుతూ ఉంటాయి. -
క్రీడానైపుణ్యాన్ని పెంచేందుకు..
ఐపీఎల్ మ్యాచ్లను టీవీల్లో చూస్తున్న చిన్నారులు తమను తాము విరాట్ కోహ్లి.. రోహిత్శర్మ.. ఇషాన్ కిషన్.. మార్ష్.. బుమ్రాలా పోల్చుకుంటూ గల్లీల్లో క్రికెట్ ఆడుతున్నారు. ఇలాంటి చిన్నారులకు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జిల్లా కేంద్రంలోని కాలేజీ మైదానానికి బ్యాట్లు, గ్లౌజ్లు, హెల్మెట్లు, ప్యాడ్లతో వచ్చి శిక్షణ తీసుకుంటున్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు క్రికెట్ శిక్షణ శిబిరం సాగుతోంది. 35 మంది విద్యార్థులు ప్రస్తుతం శిక్షణ పొందుతుండగా.. మరింత మంది వచ్చేందుకు నిర్వాహకులను సంప్రదిస్తున్నారు.● సిరిసిల్లలో క్రికెట్ క్యాంపు ● వేసవి సెలవుల్లో శిక్షణ ● ఉదయం.. సాయంత్రం ప్రాక్టీస్సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ బ్యాటింగ్ ప్రాక్టీస్సిరిసిల్ల: ఇన్నాళ్లు పుస్తకాల బ్యాగులు.. టిఫిన్ బాక్స్లతో కనిపించిన చిన్నారులు సెలువులు మొదలుకావడంతో ఇష్టమైన క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నారు. చేతిలో బ్యాట్లు.. కాళ్లకు ప్యాడ్లతో ప్రొఫెషనల్ క్రికెటర్లను మరిపించేలా శిక్షణ తీసుకుంటున్నారు. బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్లలో ట్రెయినింగ్ పొందుతున్నారు. సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో క్రికెట్ శిబిరం కొనసాగుతోంది. చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోతున్న క్రికెట్ శిక్షణ శిబిరంపై సాక్షి కథనం. -
శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
కొన్నేళ్లుగా నిర్లక్ష్యపు శిథిలాల కింద చిక్కుకున్న జిల్లాలోని ప్రభుత్వ బడులు ప్రస్తుతం పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పొచ్చు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు విద్యాశాఖపై ప్రత్యేక దృష్టిసారించడమే కాకుండా అత్యధిక నిధులు కేటాయిస్తుండడంతో సర్కార్ బడి గాడిలో పడింది. నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నిధులు కేటాయిస్తుండడంతో విద్యాశాఖ తీరులో గణనీయమైన మార్పు జరుగుతుంది. నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఉచిత సదుపాయాలు, బోధనలో మార్పులకు చిహ్నంగా నిలుస్తున్న డిజిటల్ తరగతులు, క్రీడలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలన్న దృక్పథంలోకి ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయి. –కరీంనగర్టౌన్...●తల్లిదండ్రుల్లో కొన్నేళ్లుగా వస్తున్న మార్పులకు అనుగుణంగా జిల్లాలోని ప్రభుత్వ బడులు కూడా ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాట కార్యక్రమం ప్రయోజనంగా నిలిచినట్లు జిల్లా విద్యాశాఖ గణంకాలు చెబుతున్నాయి. సన్నబియ్యంతోమధ్యాహ్న భోజనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు బడుల్లో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పౌష్టికాహారంగా వారానికి మూడు కోడిగుడ్లు అందించడం, కూరల్లో గతేడాది నుంచి నాణ్యత మెరుగుపడింది. ఉచిత పుస్తకాలు, దుస్తులు ప్రభుత్వ బడిలో చదివే అన్ని తరగతుల విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా పుస్తకాలు అందజేస్తుంది. విద్యార్థులకు ఏటా రెండు జతల దుస్తులు, దూర ప్రాంతం నుంచి వచ్చేవారికి రవాణా భత్యం కూడా అందజేస్తుంది. ఉపాధ్యాయుల కృషి మార్గదర్శకం విద్యార్థుల ప్రవేశాల కోసం పలు ప్రభుత్వ స్కూళ్ల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అంకితభావాన్ని ప్రదర్శిస్తూ వినూత్న తరహాలో చేపడుతున్న చర్యలు మిగతా ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు విద్యను అందించి మెరుగైన ఫలితాలు సాధిస్తూనే పేద, మధ్య తరగతి కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నాయి. జిల్లాలోని సర్కార్ బడుల్లో విద్యార్థులు ఇబ్బంది పడకుండా పాలకులు, అధికారులు పలు రకాల వసతులను గతానికి భిన్నంగా కల్పిస్తున్నారు. తరగతి గదిలో రోజంతా కూర్చున్న విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ప్రైవేటును పోలిన రీతిలో డ్యూయల్ డెస్క్లను జిల్లాలోని అన్ని స్కూళ్లకు విద్యాశాఖ సరఫరా చేసింది. తాగునీటి వసతి, ఆటలాడే విశాలమైన క్రీడా మైదానాలు తదితర వసుతులు కల్పిస్తున్నారు. కాగా, వసతులు, పాఠశాల నిర్వహణ, గ్రంథాలయం, సైన్స్ ల్యాబ్, ఆటల పరికరాల కోసం ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తుండగా వాటి వినియోగంపై నిర్లిప్తత లేకుండా పోతుంది.ప్రభుత్వ బడుల్లో గతంతో పోలిస్తే బోధనలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. ఐదేళ్లుగా జిల్లాలోని విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రైవేట్కు దీటుగా సాధిస్తున్న ఫలితాలను నిదర్శనంగా తీసుకోవచ్చు. వివిధ పాఠ్యాంశాల్లో మంచి అవగాహన కలిగి బోధన నైపుణ్యాల్లో నిపుణులైన ఉపాధ్యాయులు ఉన్నారు. చదువులో వెనుకబడిన పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిని చదువులో ముందుకు నడిపిస్తున్నారు. -
అన్నదాత సంక్షేమమే ధ్యేయం
కరీంనగర్ అర్బన్: అన్నదాత సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని, రైతులే తమకు తొలి ప్రాధాన్యతని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య స్పష్టం చేశారు. నూతనంగా నియామకమైన మార్కెట్ పాలకవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. వైస్ చైర్మన్గా నియమితులైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ పదవి పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్లుగా పంజాల శ్రీనివాస్, బోనాల శ్రీనివాస్, ఖాజా, రుద్ర రాము, మీసల శంకర్, తాపట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేని సంపత్, కాశవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్ల శివకుమార్ బాధ్యతలు స్వీకరించారు. వైస్ చైర్మన్ విముఖత కరీంనగర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నియామకమైన సుధగొని లక్ష్మీనారాయణగౌడ్ తనకు ఆ పదవి వద్దని స్పష్టం చేస్తున్నారు. లాబీయింగ్ ద్వారా వెలిచాల రాజేందర్రావు తనకు అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. కాగా, వారం క్రితం లక్ష్మీనారాయణగౌడ్ చైర్మన్గా ప్రతిపాదనలు పంపగా మూడు రోజుల క్రితం ఆకుల నర్సయ్య చైర్మన్గా మార్కెట్ కమిటీ నుంచి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఆకుల నర్సయ్య వెలిచాల రాజేందర్రావు వర్గం కాగా లక్ష్మీనారాయణ మరో వర్గం. ఈ క్రమంలో రాజేందర్రావు ప్యానెల్కే చైర్మన్ పదవి దక్కగా లక్ష్మీనారాయణకు వైస్ చైర్మన్ ఇవ్వగా ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. తన పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. -
ఉపాధి పొడిగింపు
కరీంనగర్రూరల్: ఉపాధి హామీ పథకాన్ని మే నెలాఖరు వరకు పొడిగించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీరామ్జీ పథకం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించాల్సి ఉండగా గైడ్లైన్స్ ఖరారు కాకపోవడంతో పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. గత నెలలో ఉపాధి హామీలో చేపట్టిన పనులనే ఈ నెలాఖరువరకు కొనసాగించాలని ఆదేశాలిచ్చారు. జిల్లాకు 4.76లక్షల పనిదినాలు... ఉపాధి పథకంలో ప్రతీ గ్రామం నుంచి కనీసం 50 మంది కూలీలకు పనులు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాకు ఏప్రిల్లో మొత్తం 4,59,612 పనిదినాలు కేటాయించగా నెలాఖరు వరకు 2,74,110 పనిదినాలు పూర్తి చేశారు. మే లో 4.76 లక్షలను కేటాయించగా అన్ని గ్రామాల్లో కూలీలు ఎక్కువ సంఖ్యలో పనులకు వచ్చేలా మండలాలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. రెండు నెలలకు సంబంధించి మొత్తం 6.92లక్షల పనిదినాలు లక్ష్యం కాగా ఇప్పటివరకు 2.63లక్షల పనిదినాలను పూర్తి చేశారు. కరీంనగర్ మండలంలో మొత్తం 42,112 పనిదినాలు లక్ష్యం కేటాయించగా ఇప్పటివరకు 13,592 పనిదినాలు పూర్తిచేసినట్లు ఉపాధి అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. పంచాయతీల వారీగా కూలీల హాజరు పెంచేందుకు లక్ష్యాలను పెట్టడంతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లకు రోజువారీగా నగదు బహుమతులను అందిస్తున్నారు. దీంతో అన్ని గ్రామాల్లో ఉపాధి పనులకు కూలీలు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. -
నగర బంద్ విజయవంతం చేయండి
కరీంనగర్టౌన్: దాడులకు ప్రతి దాడులు తప్పవని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడారు. బీజేపీ దాడులకు నిరసనగా శనివారం కరీంనగర్ నగర బంద్కు ప్రజలతో పాటు వ్యాపార, వాణిజ్య ఇతరాత్ర సంఘాలు మద్దతు తెలిపి జయప్రదం చేయాలని కోరారు. కేంద్ర హోంమంత్రి హోదాలో ఉండి బండి సంజయ్ గూండాలను ప్రోత్సహిస్తే దేశ సైనికులకు ఏ సందేశం ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ లక్ష్యం కేసీఆర్, కేటీఆర్ను బద్నాం చేయడమే అని విమర్శించారు. ప్రతీ రాజకీయ కార్యక్రమానికి పోలీసులు కరీంనగర్ను మరో బిహార్లా మార్చాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలు దాడి ఘటనను సమర్థించినట్లు ఉన్నాయని, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యలు కూడా అలాగే ఉండటంతో రెండు పార్టీల వైఖరి ఒకటేననే అనుమానం కలుగుతోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ప్రతిపక్షాలపై దాడులు చేయించడం జరుగుతోందని విమర్శించారు. నాయకులు చల్లా హరిశంకర్, ఏనుగు రవీందర్రెడ్డి, పొన్నం అనిల్కుమార్, రుద్ర రాజు, జమీల్, ప్రశాంత్రెడ్డి, పావనిగౌడ్, చిట్టీ రాజేందర్రావు, తిరుపతి నాయక్, వసంతరావు, ఆరే రవి తదితరులున్నారు. ప్రజలు సహకరించాలి కరీంనగర్టౌన్: ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యం, భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ కరీంనగర్ చరిత్రలో ప్రథమంగా తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు దాడి చేయడాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనను నిరసిస్తూ శనివారం కరీంనగర్ నగర బంద్కు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు బంద్కు మద్దతు ఇవ్వాలని, బీఆర్ఎస్ శ్రేణులందరూ శాంతియుతంగా పాల్గొని సహకరించాలని కోరారు. -
పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలి
విద్యానగర్(కరీంనగర్): కాళేశ్వరంలో ఈనెల 21 నుంచి జూన్ 1 వరకు జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లుతోపాటు ప్రయాణికులకనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగడిమర్రి సోలమన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కరీంనగర్ బస్ స్టేషన్ ఆవరణలోని సమావేశ మందిరంలో కరీంనగర్ జోన్ పరిధిలోని రీజనల్ మేనేజర్లు, డిప్యూటీ రీజనల్ మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని రీజియన్ల పనితీరుపై చర్చించారు. అన్ని బస్ స్టేషన్లలో చల్లని తాగునీటి వసతి కల్పించి తగినన్ని బస్సులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. కరీంనగర్ రీజనల్ మేనేజర్ బి.రాజు, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం రీజనల్ మేనేజర్లు ఎస్.భవానీప్రసాద్, డి.విజయభాను, టి.జ్యోత్న్స, ఎ.సరిరాం, డిప్యూటీ మేనేజర్లు ఎస్.భూపతిరెడ్డి, పి.మల్లేశం, ఎస్.మధుసూదన్, భానుకిరణ్, డి.శ్రీహర్ష, ఎస్.రామయ్య, పి.మల్లయ్య, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్యదర్శి కె.యుగంధర్ పాల్గొన్నారు. -
అంధుల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలు
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి 1 నుంచి 10వతరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎ.భాస్కర్ శుక్రవారం తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన 6 నుంచి 14 ఏళ్లున్న అంధ బాలబాలికలు ప్రవేశానికి అర్హులని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన వారికి ప్రవేశంలో ప్రాధాన్యముంటుందన్నారు. ఆసక్తి ఉన్నవారు తగిన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9701190127, 9440338424 నంబర్లలో సంప్రదించాలన్నారు.ఒంటరితనం భరించలేక ట్రాన్స్జెండర్ ఆత్మహత్యగోదావరిఖని: ఒంటరితనం భరించలేక ట్రాన్స్జెండర్ అరారి రేవతి(34) గురువారం అర్ధరాత్ధ్రాత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాంనగర్లో నివాసం ఉంటున్న రేవతి పదేళ్ల క్రితం ట్రాన్స్జెండర్లలో కలిసిపోయింది. మూడేళ్ల క్రితం సర్జరీ చేయించుకుంది. అప్పటినుంచి యాచన చేస్తూ జీవిస్తోంది. ఈక్రమంలో మద్యానికి బానిసైంది. ఒంటరితనం వేధించడంతో భరించలేక జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఇంట్లోని పైకప్పుకు చున్నీతో ఉరివేసుకుంది. ఆమె అన్న ఆరారి రాజు ఫిర్యాదు మేరకు గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై మనోహర్ కేసు నమోదు చేకున్నారు. నూకలమర్రిలో వివాహిత..వేములవాడరూరల్: తల్లిగారింటి నుంచి వచ్చిన కొద్దిసేపటికే వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ రూరల్ మండలం నూకలమర్రిలో శుక్రవారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపురం గ్రామానికి చెందిన గుగులోతు దివ్య(26)ను వేములవాడరూరల్ మండలం నూకలమర్రికి చెందిన గుగులోతు వినోద్కు ఇచ్చి ఐదేళ్ల క్రితం పెళ్లి చేశారు. భర్త వినోద్ బతుకుదెరువు కోసం 16 నెలల క్రితం గల్ఫ్ దేశం వెళ్లాడు. నూకలమర్రిలో ఉంటున్న దివ్య 15 రోజుల క్రితం తల్లిగారింటికి వెళ్లింది. శుక్రవారం మధ్యాహ్నం ఆమె తండ్రి అత్తగారింటిలో దింపి వెళ్లాడు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే దివ్య తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఎస్సై చల్లా వెంకట్రాజం విచారణ చేపడుతున్నారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు చేపట్టారు. రూ.3.50కోట్లకు వ్యాపారీ కుచ్చుటోపివేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఓ వ్యాపారి రూ.3.50కోట్లకు కుచ్చుటోపీ పెట్టారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నివసించే ఓ వ్యాపారీ రూ.7.56కోట్ల వరకు అప్పులు చేశారు. ఇందులో రూ.4.77 లక్షల వరకు అప్పు తిరిగి చెల్లించాడు. మిగిలిన రూ.3.51 కోట్లకు ఐపీ పెట్టారు. బాకీ ఇచ్చిన 39 మందికి ఐపీ నోటీసులు పంపారు. వారం రోజులుగా వ్యాపారీ కనిపించడం లేదు. ఈక్రమంలోనే బాకీ ఇచ్చిన వారికి ఐపీ నోటీస్లు అందుతుండడం కలకలం రేపింది. పెద్ద మొత్తంలో ఐపీ దాఖలు చేయడంతో వేములవాడలో చర్చనీయాంశంగా మారింది. నిందితుడి అరెస్ట్బుగ్గారం: మండలంలో పలు దొంగతనాలకు పాల్పడిన నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. చిన్నాపూర్కు చెందిన ఎనగంటి గంగయ్య తన చికెన్ సెంటర్లో దొంగతనం జరిగి రూ.12,500 ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేయగా వివిధ ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి గట్టు రాజేందర్ వ్యక్తి చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. గతంలో బుగ్గారం శివాలయంతో పాటు మరో రెండు దొంగతనాల కేసుల్లో నిందితుడికి ప్రమేయం ఉందని తెలిపారు. రూ.5,800 నగదు స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
సౌదీలో మోసపోయిన జగిత్యాల యువకుడు
● రక్షణ కోసం ప్రజావాణిలో తల్లి ఫిర్యాదుజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్పల్లికి చెందిన దాసరి అరవింద్ (23) ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీ ఎడారిలో గొర్రెల కాపరిగా అష్టకష్టాలు పడుతున్నాడు. ప్యాకింగ్ వర్కర్ ఉద్యోగమని చెప్పి రూ. 90 వేలు తీసుకున్న ఏజెంట్ అతడిని ఎడారిలో వదిలేశాడు. కనీస వసతులు, తిండి లేక అరవింద్ పడుతున్న కష్టాల వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై అతని తల్లి రాజవ్వ శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఇన్చార్జి జి.చిన్నారెడ్డి.. బాధితుడిని సురక్షితంగా స్వదేశానికి రప్పించి, మోసం చేసిన ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని ఎన్నారై విభాగం అధికారులను, జగిత్యాల ఎస్పీని ఆదేశించారు. -
ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడు మృతి
జూలపల్లి: పెద్దపల్లి జిల్లా వడ్కాపూర్లో సైకిల్పై వెళ్తున్న సుంకె గంగయ్య(64) ద్విచక్రవాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గంగయ్య (64) గురువారం బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లి వస్తున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆకుల సందీప్ ద్విచక్రవాహనంతో అతివేగంగా వచ్చి బలంగా ఢీకొనడంతో గంగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. తొలుత పెద్దపల్లి, ఆ తర్వాత కరీంనగర్లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి అల్లుడు మార్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. గుర్తు తెలియని వ్యక్తి.. జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని వాటర్ ట్యాంక్ సమీపంలో ఓ వ్యక్తి(40) మృతి చెంది కనిపించాడని టౌన్ సీఐ రామకృష్ణ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. పదిహేను రోజులుగా లేబర్ పనులు చేసుకుంటూ, స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాలో ఉంటున్నాడని పేర్కొన్నారు. వడదెబ్బతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిఓ భద్రపరిచామన్నారు. బంధువులెవరైనా ఉంటే జమ్మికుంట టౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని ఆయన కోరారు. బైక్ను ఢీకొని ఒకరు.. సిరిసిల్ల: కారుతో అతివేగంగా బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన సిరిసిల్ల రెండో బైపాస్రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని గణేశ్నగర్కు చెందిన అలువాల అంజయ్య(62) సిమెంట్ బ్రిక్స్ వ్యాపారం చేస్తుండేవాడు. శుక్రవారం అదే పనిపై బయటకు వెళ్లాడు. స్థానిక రగుడు చౌరస్తా సమీపంలో డివైడర్ నుంచి యూటర్న్ తీసుకుంటుండగా కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఆసరి దేవరాజు కారులో వేగంగా వచ్చి బైక్ను ఢీకొట్టాడు. ఈ సంఘటనలో బైక్పై వెళ్తున్న అంజయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వరదకాలువలో గుర్తు తెలియని మృతదేహం మల్యాల: మల్యాల మండలం నూకపల్లి శివారులోని వరదకాలువలో నీటిపై తేలియాడుతూ గుర్తు తెలియని శవం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, భద్రపర్చారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సీఐ నీలం 8712656818, ఎస్సై నరేశ్కుమార్ 8712656830 నంబర్లో సంప్రదించాలని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. -
దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి
కరీంనగర్స్పోర్ట్స్: దేశ భవిష్యత్, అభివృద్ధి ప్రణాళికలను నిర్ణయించేందుకు జనాభా లెక్కింపు అత్యంత కీలకమైన ప్రక్రియ అని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బల్దియా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు జరిగిన 2కే రన్ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. 2011లో జనాభా గణన జరిగిందని, అప్పటి నుంచి దేశంలో అనేక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రతీ పౌరుడు తమ వివరాలను నమోదు చేయించుకోవడం ద్వారా దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రభుత్వం అందుబాటులో ఉంచిన స్వీయ గణన ద్వారా ప్రజలు తమ వివరాలు సొంతంగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి జనాభా లెక్కింపు ప్రారంభమవుతుందని, ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు ఇళ్లకు వచ్చి జనాభా లెక్కల వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. ప్రజలు కచ్చితమైన వివరాలు అందించి సహకరించాలని కోరారు. సుడా చైర్మన్ నరేందర్రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా లెక్కింపు చాలా ప్రధానమైందని తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్రావు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న పంట దగ్థం
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి కౌలు రైతు గోపు శ్రీనివాస్ కు చెందిన మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తు నిప్పంటుకుని దగ్ధమైంది. పొరుగు రైతు కొయ్యకాలుకు నిప్పంటించడంతో నిప్పులు ఎగిరిపడి మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో మొక్కజొన్న పంట కాలిపోయింది. సుమారు ఎకరన్నర పంట మంటల్లో కాలిబూడిదైనట్లు, సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు రోదించాడు. గంజాయి విక్రేత రిమాండ్సిరిసిల్ల అర్బన్: గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సీఐ నాగేశ్వర్రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు. వేములవాడకు చెందిన భరత్కుమార్ తంగళ్లపల్లిలో గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారంతో స్థానిక ఎస్సై ఉపేంద్రచారి తన సిబ్బందితో కలిసి దాడి చేశాడు. అతని వద్ద 400 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, ఒడిశా నుంచి గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి వేములవాడ, సిరిసిల్ల, తంగళ్లపల్లి ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎస్సై ఉపేంద్రచారి, పోలీస్ సిబ్బంది ఉన్నారు. -
జేసీబీ తగిలి ఒకరి దుర్మరణం
పెగడపల్లి: వ్యవసాయ భూమి చదును చేస్తుండగా జేసీబీ బకెట్ తగిలిన ఓ రైతు మృతి చెందిన ఘటన పెగడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. గొల్లపల్లి మండలం అగ్గిమల్ల గ్రామానికి చెందిన ఎనగందుల రాములు (57)కు పెగడపల్లి మండలం లింగాపూర్ శివారులో వ్యవసాయ భూమి ఉంది. జేసీబీతో బండరాళ్లు తొలగిస్తున్న క్రమంలో రాములుకు జేసీబీ బకెట్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జగిత్యాల అసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. డ్రైవర్ ఉప్పుల అఖిల్ అజాగ్రత్తగా.. నిర్లక్ష్యంగా జేసీబీని నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని, రాములు భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు..● ఒకరికి గాయాలు వీణవంక: వీణవంక మండలం వల్భాపూర్ గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి గాయాలయ్యాయి. గ్రామస్తుల వివరాల ప్రకారం.. జమ్మికుంట మండలం కృష్ణకాలనీలో ఉంటున్న మైస సురేందర్(52), మారపెల్లి దేవేందర్(50)తోపాటు మరొకరు ద్విచక్ర వాహనంపై చల్లూరు నుంచి జమ్మికుంటకు వెళ్తున్నారు. వల్భాపూర్ శివారుకు రాగానే ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మైస సురేందర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మారపెల్లి దేవేందర్ను 108లో జమ్మికుంట ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సురేందర్ కరీంనగర్లోని ఆర్టీసీ డిపోలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిసింది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. జమ్మికుంట నుంచి వీణవంక వరకు ఫోర్లైన్ ఉండగా.. ఒకవైపు రైతులు ధాన్యం ఆరబోశారు. ఒక సైడ్ నుంచే వాహనాలు వెళ్తున్నాయి. ఈక్రమంలో ఎడ్లబండిని గమనించక ఢీకొనడంతో రెండు ప్రాణాలు గాలిలో కలిశాయి. కొలనులో పడి యువకుడి మృతిగంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలోని శ్రీవీరాంజనేయస్వామి ఆలయ ఆవరణలోని కొలనులో ప్రమాదవశాత్తు పడిపోయి యువకుడు మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అచ్చనూర్కు చెందిన నీరడి వినయ్(16) సిద్దిపేటలోని అమ్మమ్మ దగ్గర ఉంటాడు. ఇటీవల హనుమాన్ దీక్ష చేపట్టి మల్లారెడ్డిపేటలోని ఆలయ సందర్శనకు మిత్రులతో వచ్చాడు. కొలనులో స్నానం చేస్తుండగా అందులో పడి మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సాక్షితోనే ఉత్తమ ఫలితాలు
కథలాపూర్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అనేకమంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. విద్యార్థుల విజయంలో శ్రీసాక్షిశ్రీ యాజమాన్యం అందించిన స్టడీ మెటీరియల్ ఎంతగానో దోహదపడిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. ‘సాక్షి’ మెటీరియల్తో ఉత్తమ ఫలితాలు సాధించామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సులభతరంగా మెటీరియల్.. పదో తరగతి విద్యార్థులకు గణితం, ఫిజికల్ సైన్స్ పాఠ్యాంశాలపై కొంత ఆందోళన ఉంటుంది. ఈ భయాన్ని పోగొట్టేందుకు ‘సాక్షి’ దినపత్రిక ప్రముఖ విద్యానిపుణులు, సీఎస్ఆర్ సంస్థ సౌజన్యంతో అత్యంత సులభమైన పద్ధతిలో మెటీరియల్ రూపొందించి విద్యార్థులకు అందించడంతో వారు ఉత్తమ మార్కులు సాధించారు. ఈ మేరకు ప్రభుత్వం, ప్రైవేట్ హైస్కూళ్లకు చెందిన అనేకమంది విద్యార్థులకు దాతల సాయంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించారు. విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతోపాటు ‘సాక్షి’ పదోతరగతి పాఠ్యాంశాలపై సమగ్ర సమాచారం, మోడల్ పేపర్లను ప్రచురించింది. దీంతో విద్యార్థులు గతంకంటే మెరుగైన ఫలితాలను సులభంగా సాధించారు. టెన్త్ విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీమెటీరియల్ వినియోగించుకున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపి డిసెంబర్లో సిలబస్ పూర్తి చేశారు. పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే క్రమంలో సాక్షి మెటీరియల్ గ్రూప్లవారీగా చర్చించుకునేందుకు ఉపయోగపడింది. మరింత ఫోకస్ చేయడంతో సైన్స్లో 93 మార్కులు సాధించా. సరైన సమయంలో కీలక సబ్జెక్టుల మెటీరియల్ ఇచ్చినందుకు సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు. – గాజుల లిఖిత, జెడ్పీ హైస్కూల్, సిరికొండ -
ఇద్దరు దొంగల అరెస్టు
కరీంనగర్రూరల్: మద్యానికి బానిసైన ఇద్దరు ఆటోడ్రైవర్లు దొంగలుగా మారి గతేడాది నుంచి దొంగతనాలకు పాల్పడుతుండగా గురువారం కరీంనగర్రూరల్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మకల్, చింతకుంటకు చెందిన ఆటోడ్రైవర్లు ఎండీ మహ్మద్, మహ్మద్ మెయిన్లు మద్యానికి బానిసై దొంగతనం చేసేందుకు ఆటోలో గతేడాది జూలైలో చొప్పదండికి వెళ్లి ఓ ఇంటి తాళం పగులకొట్టారు. బీరువా నుంచి బంగారం, వెండిని దొంగతనం చేశారు. ఈనెల 5న రాత్రి విజయ్నగర్కాలనీ, సిటిజన్కాలనీ, బొమ్మకల్లోని తాళాలు వేసి ఉన్న నాలుగిళ్లల్లో బంగారం, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. కరీంనగర్లో కొంత బంగారం విక్రయించి జల్సా చేసిన అనంతరం మొబైల్ఫోన్లను నాందేడ్లో విక్రయించేందుకు గురువారం కరీంనగర్ రైల్వేస్టేషన్లో ఆటోలో చేరుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని పోలీసులు పట్టుకొని విచారించగా చేసిన దొంగతనాలను ఒప్పుకున్నారు. ఇద్దరి నుంచి సుమారు 7.3 తులాల బంగారం, 90 గ్రాముల వెండి, 2 సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. బంగారం విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని, ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. రూ.10లక్షల విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం -
అల్ట్రాటెక్ ఎన్నికల్లో ‘మల్క’ విజయం
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్ల బసంత్నగర్లోని అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో గురువారం జరిగిన పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు, కన్నాల గ్రామ సర్పంచ్ మల్క రామస్వామి ఫ్యానెల్ ఘన విజయం సాధించింది. హోరాహోరిగా సాగిన పోరులో అధ్యక్ష అభ్యర్థి రామస్వామి ప్రత్యర్థి బయ్యపు మనోహర్రెడ్డిపై 76 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రధాన కార్యదర్శిగా రమేశ్ మౌర్య, పోతుల ప్రసాద్పై 88ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 307 ఓట్లకు అన్నీ పోలయ్యాయి. వీటిలో ఒక పోస్టల్ బ్యాలెట్ ఉండగా 1 ఓటు చెల్లకుండా పోయింది. ఒక ఓటు మిస్సింగ్ అయింది. రామస్వామికి 167, మనోహర్రెడ్డికి 91 ఓట్లు వచ్చాయి. బీజేపీ నుంచి పోటీలో నిలిచిన అధ్యక్ష అభ్యర్థి నల్ల మనోహర్రెడ్డికి 48, ప్రధాన కార్యదర్శి జేసీబీ శ్రీనివాస్కు 48 ఓట్లు వచ్చాయి. ఈసందర్భంగా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడారు. కార్మికుల సమష్టి విజయమని అన్నారు. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు, మనాలిఠాకూర్ సహకారంతో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అనంతరం మద్దతుదారులతో కలిసి బసంత్నగర్లో విజయోత్సవ ర్యాలీ తీశారు. ఉత్కంఠ పోరులో 76 ఓట్ల మెజార్టీతో గెలుపు -
నా బాల్యం
● పంచ్ పడాల్సిందే.. ● ఆత్మరక్షణ విద్యలో శిక్షణ ● వేములవాడలో కరాటేకు క్రేజీకరాటే అంటే కళ కాదు. మన శరీరాన్ని, మనసును క్రమశిక్షణగా ఉంచే మార్గం. బాలికలు స్వీయరక్షణకు తప్పకుండా శిక్షణ తీసుకోవాలి. వేసవిలో కరాటే శిక్షణతో స్వీయరక్షణ కలుగుతుంది. – కె.ఆయుశ్రీ, వేములవాడ ఈ శిక్షణకు వస్తుండడంతో ఫిట్నెస్పై అవగాహన కలిగింది. భయపడకుండా బయటకు వెళ్లగలుగుతున్నాను. ఫిట్నెస్తోపాటు స్టడీలోనూ చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ప్రతీ బాలిక తప్పకుండా కరాటే నేర్చుకోవాలి. – కె.అవంతిక, వేములవాడ ఆత్మరక్షణ అంటే కేవలం శారీరకంగా పోరాడటం కాదు. అది ఒక మనోభావం. దాడులకు గురికాకుండా ముందుగా అప్రమత్తంగా ఉండే చైతన్యం. ఇప్పటి సమాజంలో బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో వారికి ఆత్మరక్షణ శిక్షణ ఎంతో అవసరం. ఈ శిబిరంలో పాల్గొంటున్న చిన్నారులు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – ఎం.ఎ.మన్నాన్, కరాటే మాస్టర్ కరాటే కేవలం ఆట కాదు. కరాటే యోగాలా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. కోచ్ బాగా నేర్పిస్తున్నారు. ఉచితంగా నేర్పించడం బాగుంది. అమ్మాయిలు ఆత్మరక్షణకు ఇలాంటి శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. – పి.శివగౌతమ్, వేములవాడ సెలవుల్లో ఇంట్లో కూర్చుని బోరు కొట్టకుండా ఈ కరాటే క్లాసులకు వస్తున్నాను. ఇక్కడ పంచ్లు, కిక్స్ నేర్చుకోవడం ద్వారా శారీరకంగా బలంగా తయారవుతున్నాను. ఏదైనా ఆపద వస్తే ఎదురించగలననే ధైర్యం కలుగుతుంది. కరాటేతో క్రమశిక్షణతోపాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. – బి.క్రాంతికుమార్, వేములవాడ వేములవాడ: వేసవి సెలవులు వచ్చాయంటే అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లేవాడినని.. సెలవులన్నీ రోజులు ఆటలతోనే గడిచేవని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన చిన్ననాటి వేసవి సెలవుల ముచ్చట్లు వివరించారు. ఆయన మాటల్లోనే.. రుద్రంగిలోని మా అమ్మమ్మ పుప్పాల మల్లమ్మ–నర్సయ్యల ఇంటి కాడి నుంచి 1971లో బండమీది పెద్దబడిలో చేరాను. స్కూల్కు దోస్తు లక్ష్మీనారాయణ, బావ శ్రీనివాస్లతో కలిసి వెళ్లేవాడిని. పదో తరగతి వరకు అక్కడే చదువుకున్న. బడి నుంచి రాగానే ఆటలు ఆడుకునేవాళ్లం. ఉశికనూతి బావిలో ఈతకు వెళ్లేవాళ్లం. సోరకాయ బుర్రలతో ఈతనేర్చుకున్నాం. రామకృష్ణాపూర్ వెళ్లే దారిలోని ఒర్రె ఒడ్డున ఉన్న చింతచెట్టుపై కోతికొమ్మ ఆట ఆడుకునేటోళ్లం. మూడుబజార్ల కాడ రాత్రిపూట లైటు కింద దొంగ, పోలీసు ఆడుకునేవాళ్లం. గోటీలు, సిర్రగోనె, తాడు–బొంగురం ఆడేవాళ్లం. ఎండాకాలం వచ్చిందంటే ఆటలతోనే పొద్దుపోయేది. తిండి తినాలని కూడా గుర్తుండేది కాదు. ఆటలతోనే నా బాల్యం ఎంతో ఆనందంగా గడిచిపోయింది.వేములవాడ: ‘అలర్ట్.. బో..’ అరుపులతో వేములవాడ సినారె కళామందిరం పరిసరాలు మారుమోగుతున్నాయి. పిడికిలి బిగించి పంచ్లు ఇవ్వడంలో నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. గాలిలో ఎగురుతూ కిక్స్తో చిన్నారులు అదుర్స్ అనిపిస్తున్నారు. ఎలాంటి ఆపద ఎదురైనా తమను తాము రక్షించుకునేందుకు బేసిక్ కరాటేలో ప్రావీణ్యం పొందుతున్నారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు మొదలైనప్పటి నుంచి నిత్యం ఉదయం, సాయంత్రం విద్యార్థినులు కరాటేలో శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల ఆత్మరక్షణ విద్యపై ఆసక్తి పెరిగింది. బాలికలకు ఆత్మరక్షణ విద్య అవసరమని తల్లిదండ్రులు గుర్తిస్తుండడంతో ఈ శిక్షణకు నిత్యం 50 నుంచి 60 మంది చిన్నారులు హాజరవుతున్నారు. కరాటే మాస్టర్ ఎంఏ మన్నాన్ వీరిని చిచ్చరపిడుగుల్లా తయారు చేసేందుకు కఠినమైన శిక్షణ ఇస్తున్నారు. సెలవుల్లో ఇంట్లో ఖాళీగా కూర్చోకూడదని కరాటే ఉచిత శిక్షణను మాస్టర్ మన్నాన్ ప్రారంభించారు. శారీరకంగా బలంగా తయారయ్యేందుకు ఈ విద్య ఎంతగానో దోహడపడుతుందని మాస్టర్ తెలిపారు. శారీరకంగా బలంగా ఉంటే మానసికంగా ధైర్యంగా ఉంటామని.. ఆ సమయంలో ఎలాంటి ఆపద వచ్చిన ఎదుర్కోగలుగుతామంటున్నారు. కరాటేతో క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాకుండా చదువుల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
● ఇంటి పర్మిషన్కు రూ.20 వేలు డిమాండ్ ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రామినేని కుమారస్వామి గురువారం లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐ తిరుపతి తెలిపిన వివరాలు.. పొత్కపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పర్మిషన్ కోసం కార్యదర్శికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈనేపథ్యంలో ఇంటి పర్మిషన్కు కార్యదర్శి రూ.20వేలు లంచం డిమాండ్ చేయగా రూ.15వేలు క్యాష్ ఇచ్చాడు. మిగతా రూ.5వేలు ఫోన్ పే చేశాడు. అయినా పర్మిషన్ ఇవ్వకుండా దరఖాస్తును కార్యదర్శి రిజెక్టు చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్యదర్శి డబ్బు తీసుకుంటుండగా పట్టుకొని రిమాండ్కు పంపినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. -
మంచి మార్కులు సాధించగలిగా
ఉపాధ్యాయుల కృషితో మంచి మార్కులు వస్తాయని అనుకున్నా. పరీక్షలకు రెండు నెలల ముందు ఇచ్చి న సాక్షి మెటీరియల్ కటింగ్ చేసి తరగతి గదిలో విద్యార్థులందరం చర్చించుకునేవాళ్లం. గణితం, ఫిజిక్స్, సోషల్ స్టడీస్ స్పెషల్ మెటీరియల్ మాకు మరింత ప్రోత్సాహం లభించింది. సాక్షి మెటీరియల్ వల్ల సోషల్ స్టడీస్లో 96 మార్కులు సాధించా. – ఉత్కం నవిత, జెడ్పీహైస్కూల్, చింతకుంట ప్రతి టాపిక్ నుంచి పరీక్షల్లో రాయడానికి కష్టతరమైన వాటిని సులభతరమైన రీతిలో నమూనా ప్రశ్నలు విశ్లేషించి అందించారు. తద్వారా ఫిజికల్ సైన్స్లో ప్రతి ప్రశ్నకూ విభిన్న కోణాల్లో సమాధానం రాసేవిధంగా విద్యార్థులకు దోహదపడింది. విద్యార్థుల్లో సాక్షి మెటీరియల్తో భయం పోయింది. పరీక్షల్లో సమయాన్ని సమన్వయం చేసుకునేలా ఉపయోగపడింది. – వంతడుపుల రవికుమార్, ఫిజికల్ సైన్స్ టీచర్, జెడ్పీ హైస్కూల్, సిరికొండ సోషల్ సబ్జెక్ట్ ఎంత చదివినా పరీక్షల వేళ ఏదో వెలితిగా ఉందని విద్యార్థులు ఆందోళనకు గురవుతుంటారు. తరగతి గదిలో మేం విశ్లేషించి బోధించాం. సాక్షి మెటీరియల్లో పట్టికల విశ్లేషణ, మ్యాప్ పాయింటింగ్ విద్యార్థులకు సలువుగా అర్థమయ్యేలా ఉంది. విద్యార్థులు వ్యాసరూప, లఘు ప్రశ్నలకు సమాధానాలు సులభంగా రాసేందుకు సహకరించింది. – ఉశకోల విశ్వనాథం, సోషల్ టీచర్, జెడ్పీ హైస్కూల్, చింతకుంట -
భగ్గుమన్న బీజేపీ.. పాడి కౌశిక్ రెడ్డిపై దాడికి యత్నం!
సాక్షి, కరీంనగర్: నగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై దాడికి ప్రయత్నం జరిగింది. అయితే ఆయన సురక్షితంగా బయటపడ్డారు. అయితే క్యాంప్ కార్యాలయం, వాహనం అద్దాలు మాత్రం ధ్వంసం అయ్యాయి. బీజేపీ శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి.బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఆయనపై దాడికి ప్రయత్నించింది. దాడిలో కౌశిక్ క్యాంప్ కార్యాలయం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడితో కరీంనగర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కౌశిక్ ఏమన్నారంటే.. కరీంనగర్లో పరిస్థితులపై తాజాగా తాజాగా కౌశిక్ రెడ్డి ప్రెస్మీట్ నిర్వహించారు. శాంతి భద్రతల విషయంలో సీపీ గౌష్ ఆలంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్పైనా తీవ్ర పదజాలం ఉపయోగించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. గంగుల ఆఫీస్పైనా..మరోవైపు.. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్పైనా బీజేపీ శ్రేణులు దాడి చేశాయి. పాడి కౌశిక్రెడ్డి అక్కడ ఉన్నాడనే సమాచారంతో విధ్వంసం సృష్టించాయి. ఈ పరిణామంతో అక్కడి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. -
సిటీకి మరో రూ.1,150 కోట్లు!
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణాల్లో అమలు చేయనున్న అర్బన్ చాలెంజ్ ఫండ్ (సీయూఎఫ్)పథకంలో కరీంనగర్ నగరాన్ని చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, న గరపాలకసంస్థ భాగస్వామ్యం కలిగిన ఈ పథకంలో ఆమోదం లభిస్తే సుమారు రూ.1150 కోట్ల నిధులతో నగరంలో అభివృద్ధి పనుల జాతర నెలకొననుంది. ఈ పథకం నిధుల్లో ఎక్కువ భాగం నగరపాలకసంస్థయే భరించాల్సి ఉండగా...ఆస్థాయిలో ఆదాయాన్ని ఎలా సృష్టించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. అర్బన్ చాలెంజ్ ఫండ్.. నగరపాలకసంస్థ ఆదాయం అంతంతమాత్రంగానే ఉండడం, ప్రభుత్వాల నుంచి పెద్దగా నిధులు రాకపోవడం నగర అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయిస్తే తప్ప నగర అభివృద్ధి అనుకున్న మేర సాగే అవకాశం లేదు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకాన్ని తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాలకు నిధులు కేటాయించే ఈ పథకానికి, ఐదు సంవత్సరాల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.లక్ష కోట్లు కేటాయించింది. పట్టణాల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఈనెల 11వ తేదీలోగా ఆయా మున్సిపల్ పాలకవర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉంది. బల్దియాపైనే భారం... అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నగరపాలకసంస్థ భాగస్వామ్యంగా ఉంటాయి. ఎంపికై న పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం నిధులు నేరుగా ఇస్తుంది. మరో 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం లేదా నగ రపాలకసంస్థ వాటా ఉంటుంది. మిగతా 50 శాతం నిధులు నగరపాలక సంస్థ బాండ్లు, బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ద్వారా సమీకరించుకోవాలి. అంటే అధిక బాధ్యత బల్దియాపైనే ఉంది. రూ.1,150 కోట్లతో ప్రతిపాదనలు అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో భాగంగా రూ.1150 కోట్లతో నగరపాలకసంస్థ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సుమారు రూ.650 కోట్లతో నగరంలో రో డ్లు, డ్రైనేజీల ని ర్మాణం, మిగతా నిధులతో డంప్యార్డ్, ఎస్టీపీ, ఆదాయం వచ్చే వాణిజ్య భవనాలు, సుందరీకరణ, పర్యాటకానికి కేటాయించనున్నారు. బుధవారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అదనపు కార్యదర్శి డి.తారా మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు, నగరం నుంచి రావాల్సిన ప్రణాళికలు, ప్రతిపాదనలపై చర్చించారు. కరీనగర్ నుంచి మేయర్ కొలగాని శ్రీనివాస్, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొన్నారు. అమలైతే.. అద్భుతమే.. సీయూఎఫ్ పథకం సాఫీగా అమలైతే కరీంనగర్ సిటీ స్వరూపమే మారిపోనుంది. గతంలో స్మార్ట్ సిటీలో నగరం ఎంపిక కావడంతో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి జరగడం తెలిసిందే. అయినప్పటికీ అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు తదితర సమస్యలు అలానే ఉన్నాయి. సీయూఎఫ్ పథకం ఆచరణకు నోచుకొంటే నగర రూపురేఖలు మారిపోనున్నాయి. నేడు అత్యవసర సమావేశం అర్బన్ చాలెంజ్ ఫండ్లో ఎంపిక చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మాణం పంపించేందుకు గురువారం నగరపాలకసంస్థ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు నగరమేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రూ.1150 కోట్ల ప్రతిపాదనలపై చర్చించి, యూసీఎఫ్లో నగరపాలకసంస్థను చేర్చాలని కోరుతూ తీర్మానించనున్నారు. -
నైపుణ్యంతోనే ఉద్యోగావకాశాలు
పెద్దపల్లి: నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. పెద్దపల్లిలోని వెంకటపద్మ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన మెగా జాబ్మేళాలో మంత్రి మాట్లాడారు. 77 కంపెనీల్లో 4,000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించగా.. 4,156 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. అందులో 1,500 మందికి ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేమని అన్నారు. టాస్క్ సెంటర్లో శిక్షణ పొందిన వారిలో 261 మందికి ఉపాధి కల్పించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. త్వరలోనే డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్, ఫినిషింగ్ స్కిల్ పాఠశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రతీఒక్కరు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకోవాలని, డాటా సైన్స్ నైపుణ్యం కలిగి ఉండాలని కోరారు. ప్రభుత్వ విప్ విజరమణారావు మాట్లాడుతూ, ఉత్పత్తుల బ్రాండింగ్ కేంద్రంగా పెద్దపల్లి నిలవాలన్నారు. రెండేళ్లక్రితం పెద్దపల్లిలో టాస్క్ సెంటర్ ఏర్పాటు చేశామని, ఇందులో శిక్షణ పొందిన 261 మంది ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీల్లో అధిక వేతనాలతో ఉద్యోగాలు సాధించారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ వైఖరితోనే నిరుద్యోగ సమస్య పెరిగి, యువకులు కొందరు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ ఖాళీలు భర్తీ చేయడంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, మంచిర్యాలలో మెగా జాబ్ మేళా నిర్వహించాలని మంత్రి శ్రీధర్బాబును కోరారు. జాబ్ మేళాకు భారీ స్పందన మెటీ జాబ్ మేళాకు స్పందన లభించిందని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశ్రమల శాఖ, టాస్క్ సహకారంతో చేపట్టిన మేళాకు 77 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. అగ్నివీర్, పోలీస్ ఉద్యోగాల ఎంపిక కోసం ఆసక్తిగల నిరుద్యోగ యువతకు జిల్లాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, రామగుండం మేయర్ మహంకాళి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారితో మంత్రి శ్రీధర్బాబు, విప్ విజయరమణారావు, ఎంపీ వంశీకృష్ణఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మెగాజాబ్ మేళాకు విశేష స్పందన -
● జన సమీకరణకు 4 రోజులుగా కరీంనగర్లో మకాం వేసిన కేంద్ర మంత్రి ● పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల సమావేశాలతో బిజీబిజీ
కరీంనగర్: ఈనెల 10న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి భారీఎత్తున జనాన్ని సమీకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో జన సమీకరణ చేయడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. 4 రోజులుగా కరీంనగర్లోనే మకాం వేసి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి పార్టీ నేతలతో జన సమీకరణపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం కరీంనగర్లో గ్రామాలవారీగా వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు. మాజీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కంటెస్టెట్ కార్పొరేటర్లతోనూ మీటింగ్లు నిర్వహించారు. జిల్లాలవారీగా మండలాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోనూ భేటీ అయ్యారు. గ్రామాలు, మండలాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లవారీగా జన సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏకంగా వెయ్యి కార్లు, 250 బస్సులను ఏర్పాటు చేసి వేలాది మందిని సభకు తరలించాలని నిర్ణయించారు. నేటి నుంచి సికింద్రాబాద్లో మకాం బండి సంజయ్కుమార్ గురువారం నుంచి సికింద్రాబాద్లోనే మకాం వేయనున్నారు. పరేడ్ గ్రౌండ్ బహిరంగ సభకు సిటీ నుంచే భారీఎత్తున జనాన్ని సమీకరించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ముషీరాబాద్ అసెంబ్లీ నేతలతో బర్కత్పురాలోని సిటీ కార్యాలయంలో భేటీ కానున్నారు. -
మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా బొమ్మ శ్రీరాం
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా నగరానికి చెందిన బొమ్మ శ్రీరాంచక్రవర్తి నియమితులయ్యారు. నామినేటెడ్ పదవుల పందేరంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పలు కార్పొరేషన్లకు చైర్మన్, వైస్చైర్మన్లను ప్రకటించింది. మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరాంను నియమించింది. మాజీ ఎమ్మెల్యే, బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడు శ్రీరాం ఏళ్లుగా కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో హౌజ్ఫెడ్ చైర్మన్గా పనిచేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మున్నూరుకాపు సామాజిక కార్యక్రమాలు, సంఘం వ్యవహారాల్లో శ్రీరాం చురుకై న పాత్ర పోషిస్తున్నారు. మున్నూరుకాపు విద్యార్థి వసతిగృహం చైర్మన్గా, మున్నూరుకాపు సంఘం గౌరవ అధ్యక్షుడిగా, మున్నూరుకాపు రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. కాగా తన నియామకంపై సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాకు తొలి కార్పొరేషన్ పదవి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరేండ్లకు కరీంనగర్కు తొలి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా రామడుగు మండలానికి చెందిన నేరెళ్ల శారద నియమితులు కాగా.. సుడా, లైబ్రరీ, ఆర్టీఏ తదితర పదవులను భర్తీ చేయడం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలోని కార్పొరేషన్ చైర్మన్ పదవి తొలిసారిగా శ్రీరాం ద్వారా కరీంనగర్కు వచ్చింది. -
యూరియా ఎటెళ్లినట్టు..?
యూరియా వాడకంపై కేంద్ర ప్రభుత్వం సునిశిత పరిశీలనకు ఆదేశించింది. గత యాసంగి కన్న ఈసారి యూరియా వాడకం విపరీతంగా పెరిగింది. ఈక్రమంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసి తదనుగుణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖను అలర్ట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయితే యాప్ ద్వారా యూరియా కొనుగోళ్లు జరిగినా.. హోల్సేల్ దగ్గరి నుంచే పక్కదారి పట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు తమ చెప్పుచేతల్లో ఉంటారన్న హోల్సేల్ డీలర్ల అత్యుత్సాహంతో ఇష్టారీతిగా యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించారన్న ఆరోపణలున్నాయి. మిల్క్ డెయిరీల్లోనూ కుప్పలు తెప్పలుగా వినియోగించారని తెలుస్తోంది.కరీంనగర్ అర్బన్: అవసరానికి మించి యూరియా వాడకమనేది పోషకాల అసమతుల్యతకు దారి తీయడమే కాకుండా నేల ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలంలో వ్యవసాయ రంగానికి ప్రతికూలమే. సదరు కారణంతో మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు పలు జాగ్రత్తలు చేపట్టాలని సూచించింది. తరచూ ఎరువు కొనుగోలు చేస్తున్నవారి వివరాలు పరిశీలించడం.. ఏ డీలర్ల నుంచి కొనుగోలు చేశారు.. ఏ పంటలకు వాడారు.. సాగేతర వాటికి తరలించారా అనే అంశాలను పరిశీలించనున్నారు. రైతు యూరియాపైనే అక్రమార్కుల కన్ను రైతులకు రాయితీపై ఇచ్చే యూరియా కిలో రూ.6కే లభిస్తోంది. వ్యవసాయేతర రంగాలు యూరియా వినియోగించాలంటే టెక్నికల్ గ్రేడ్ యూరియా వాడాల్సి ఉంటుంది. అయితే ఇది మార్కెట్లో కిలో రూ.65కు లభిస్తోంది. దీంతో ఇతర రంగాల వ్యాపారులు సబ్సిడీ యూరియాకే మొగ్గు చూపుతున్నారు. అధికారులతో మామూలు బంధాలు నెరుపుతూ పక్కదారి పట్టిస్తుండగా.. మరికొందరు రాజకీయ బలాన్ని చాటుతున్నట్లు తెలుస్తోంది. రాయితీ యూరియాను 15 రకాల పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. యాడ్ బ్లూ యూనిట్లు, పశువుల దాణా తయారీ యూనిట్లు, ప్లయ్వుడ్, మిల్క్ డెయిరీలు మొదలైన వాటిలో యూరియా వాడుతున్నారు. క్లాజు 25, ఫెర్టిలైజర్(కంట్రోలు) ఆర్డర్ 1985 ప్రకారం వ్యవసాయ యూరియా వేరే పరిశ్రమల్లో వాడకం నిషేధం. అలా వాడే ప్రదేశాలను తనిఖీ చేయడం, చర్యలు తీసుకోవడం చేయాలి. అయితే ఎరువుల కేటాయింపు, పంపిణీ అనేది ఫెర్టిలైజర్ మూవ్మెంట్ కంట్రోల్ ఆర్డర్, 1973 ప్రకారం జరుగుతోంది. ఒక జిల్లాకు, ఒక రాష్ట్రానికి కేటాయించిన దాన్ని వేరొక చోటుకు డైవర్షన్, రవాణా చేయడం నిషేధం. అక్రమాలు నిగ్గు తేలేనా..? యూరియా వినియోగంలో అక్రమాలు వెలుగుచూస్తాయా అన్నది అనుమానమే. తనిఖీ చేసే అధికారులు వారి తప్పులను వారెలా బయటకు చెప్పుకుంటారన్నది ఇక్కడ ప్రశ్న. జిల్లాలో ఎక్కువగా హోల్సేల్ డీలర్ల నుంచే అక్రమాలు జరుగుతున్నాయని ఇంటాబయట వినిపిస్తున్న మాట. యాప్ వినియోగంతో కూడా యూరియా అక్రమార్కులకు చేరిందని తెలుస్తోంది. గతంలో సాగు భూములను సర్వే చేసిన వ్యవసాయ శాఖ.. సదరు భూములకు రైతు భరోసా ఇవ్వడం లేదు. కాగా యాప్లో అలా లేదని తెలుస్తోంది. పట్టా పాస్బుక్లో ఉన్న విస్తీర్ణం ప్రకారం యూరియా కేటాయింపు జరుగుతోంది. అంటే సాగులో లేని భూమికి కూడా యారియా వెళ్లిందన్న మాట. -
కొనసాగుతున్న సర్వే
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణాంకశాఖ ఆధ్వర్యంలో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే కొనసాగుతోంది. జాతీయ గణాంక శాఖ 2026 సంవత్సరానికి గాను ప్రజల ఉపాధి స్థితిగతులను నమోదు చేస్తున్నారు. గణాంక శాఖ అధికారి గుర్రం శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో సర్వే చేస్తుండగా ప్రజల జీవన స్థితిగతులను నివేదించనున్నారు. తొలి విడతలో కుటుంబ యజమాని పేరు, సభ్యులు, విద్యార్హతలు, చదువు మానేసిన, ఉన్నత చదువులు, వృత్తివిద్యా కోర్సులు, ఉద్యోగం, సరోజువారీ కూలీ అయితే వారంలో ఏ పని చేశారో, వేతన వివరాలతో పాటు మహిళలు స్వయం ఉపాధి పొందే వారయితే వారి ఆదాయ వివరాలను కూడా నమోదు చేసుకుంటామని తెలిపారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో సర్వే జరగగా కార్పొరేటర్ గంట శ్రీనివాస్, మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ నాగారపు హరికృష్ణ, మున్సిపల్ మెప్మా సెక్షన్ సిబ్బంది ఆర్పీలు రమ్య, కల్పన, మున్సిపల్ సిబ్బంది తంగళ్లపల్లి కల్యాణ్ పాల్గొన్నారు. ఎస్సీసెల్ పరిశీలకుడిగా అరుణ్కుమార్కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ ఎస్సీసెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిశీలకుడిగా కరీంనగర్కు చెందిన కొరివి అరుణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామక ఉత్తర్వులు జారీచేశారు. పీసీసీ ఎస్సీసెల్ చైర్మన్గా కవ్వంపల్లి నియామకం తర్వాత, నూతన కమిటీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే పాత కమిటీలన్నింటిని రద్దు చేశారు. కొత్త కమిటీల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిశీలకుడిగా కరీంనగర్ జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు అరుణ్కుమార్ను నియమించారు. అరుణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించి, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షుల అనుమతితో స్థానిక కాంగ్రెస్ నాయకులతో సమావేశాల ద్వారా ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం నివేదికను కవ్వంపల్లికి అందించనున్నారు. -
దోపిడీకి స్కెచ్!
గురువారం శ్రీ 7 శ్రీ మే శ్రీ 2026● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్బెంగాల్లో కేసులు. బిహార్ జైలు నుంచివెయ్యి కార్లు.. 250 బస్సులుసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్నే కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
బీఆర్క్, బీబీప్లానింగ్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): ఐఐటీ–జెఈఈ (మెయిన్) బీఆర్క్, బీప్లానింగ్–2026 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి తెలిపారు. పట్టణంలోని అల్ఫోర్స్ టూనీటాట్స్లో బుధవారం ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో విద్యార్థులను సత్కరించారు. బీఆర్క్లో ఎస్.శ్రీహిత 174వ ర్యాంకుతో అత్యున్నత స్థానంలో నిలవగా, పటేల్ అక్షయ 189వ ర్యాంకు, డి.తనుశ్రీ 227, వి.రితిక 287, ఎస్.ఆధ్య 319, టి.వెంకట నిహిత్ 903, సి.హెచ్.భీమ 1107, ఆర్.నేహగాయత్రి 1719, పి.శ్రీనిధి 1776, పి.హర్షిణి 2325, ఉమైరా సన్నున్ 2626, పి.అక్షయప్రియ 2786వ ర్యాంకు సాధించిందన్నారు. బీప్లానింగ్లో వి.ప్రణతి 858వ ర్యాంకు, పి.క్రిష 1281, ఎమ్.వివేక్ రెడ్డి 1554, ఎమ్.షాలిని 1757, రహీన్ ఉమేద 2448, జి.మహాలక్ష్మి 3053, పి.ఆదిత్యలక్ష్మి 3122వ ర్యాంకు సాధించారన్నారు. రాబోయే ఐఐటీ (అడ్వాన్) పరీక్ష రాసేందుకు ఎంపికై న విద్యార్థులకు అధ్యాపక బృందంతో కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఐఐటీ, నీట్, ఈఏపీసెట్ పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులతో ప్రతిష్టాత్మక కళాశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నట్లు పేర్కొన్నారు. -
సరిహద్దులు దాటిన సాహితీ పరిమళాలు
హాజరైన కవులు కవి సమ్మేళనంలో మాట్లాడుతున్న జీవీ శ్యాం ప్రసాద్లాల్కరీంనగర్ కల్చరల్: సాహితీ పరిమళాలు సరిహద్దులు దాటి ఫరిడవిల్లుతోంది. రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటి నే పాల్లో అరుదైన రీతిలో తెలుగుకవి సమ్మేళనం జరిగింది. ఇండో– నేపాల్ కవి సమ్మేళనం పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ప్రఖ్యాత కవులు కవితా గానం చేశారు. వంద మందికి పైగా తెలుగు వారు దీనికి హాజరయ్యారు. ఖాట్మాండులోని క్రిస్టల్ పశుపతి హోటల్ ఈ సమ్మేళనానికి వేదికై ంది. ఐఏఎస్ అధికారి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ జీవీ శ్యాంప్రసాద్లాల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో 135 మంది తెలుగు వారితో చేపట్టిన నేపాల్ యాత్రలో భాగంగా ఈ కవి సమ్మేళనం నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ ఎస్.రఘు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జీవీ శ్యాంప్రసాద్లాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కవి అన్నవరం దేవేందర్ కవి సమ్మేళనాన్ని ప్రారంభించారు. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యం విశ్వజనీనమైందన్నారు. సమ్మేళనంలో బూర్ల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్, నాంపల్లి సుజాత, మాడిశెట్టి గోపాల్, రావికంటి శ్రీనివాస్, స్థంభంకాడి గంగాధర్, సీవీ శ్రీనివాస్, డాక్టర్ కూరెళ్ల పద్మాచారి, కృష్ణ గోపాల్, ముత్తినేని శ్రీనివాసరావు, డాక్టర్ దాసోజు జ్ఞానేశ్వర్, సంపత్, అశోక్, జ్యోతి, గోనె శ్రీనివాస్, ప్రేమలత తదితరులు కవితలు వినిపించారు. మల్లికార్జున్ దేవ్, నల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఖాట్మాండులో తెలుగు కవి సమ్మేళనం -
క్లుప్తంగా
అరుణాచలం, రామేశ్వరం ప్రత్యేక బస్ విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం, కంచి, చిదంబర నటరాజ ఆలయం, శ్రీరంగం, మధురై, జంబుకేశ్వర్, రామేశ్వరం, జోగులాంబ దర్శనాలకు కరీంనగర్ 1 డిపో నుంచి రాజధాని ఏసీ బస్సు వెళ్తున్నట్లు డీఎం ఐ.విజయమాధురి తెలిపారు. ఈనెల 14న మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయలుదేరి 19 తిరిగి చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.8,800, పిల్లలకు రూ.6,600 టికెటు ఉంటుందని తెలిపారు. వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491లలో సంప్రదించాలని కోరారు. గంజాయి అమ్మితే సమాచారం ఇవ్వండివేములవాడ: గంజాయి అమ్మిన వారి సమాచారం ఇవ్వాలని డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. పట్టణంలోని పెద్దమ్మగుడి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో బుధవారం దాడి చేశారు. బైక్పై వచ్చిన నాంపల్లికి చెందిన జడల నాగరాజు(50), వడిచర్ల జాన్ ప్రతాప్రెడ్డి(60)ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి 160 గ్రాముల గంజాయి (రూ.8 వేల విలువ), మొబైల్ ఫోన్, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ పాల్గొన్నారు. -
మాయామురళి..సాహసికుడు
చాలాకాలం క్రితం నీలగిరి పర్వతాల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఆర్యన్ అనే ఒక ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. ఆ గ్రామానికి దగ్గర్లో చీకటి అడవి ఉండేది. ఆ అడవిలోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగి రారని అక్కడి ప్రజలు నమ్మేవారు. ఒకరోజు గ్రామంలోని పంటలన్నీ ఎండిపోయి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అప్పుడు ఒక ముసలితాత ‘అడవి మధ్యలో ఒక మాయా మురళి ఉంది. దానిని ఊదితే వానలు కురుస్తాయి..నేల పచ్చబడుతుంది’ అని చెప్పాడు. సాహసం ప్రారంభం గ్రామస్తుల కష్టాలను చూడలేక ఆర్యన్ ఒంటరిగా అడవిలోకి బయలుదేరాడు. అడవిలో వింతవింత శబ్దాలు.. దట్టమైన పొగమంచు అతన్ని భయపెట్టాయి. కానీ... ఆర్యన్ వెనకడుగు వేయలేదు. దారిలో అతనికి ఒక గాయపడిన పక్షి కనిపించింది. ఆర్యన్ దానికి చికిత్సచేసి, తన దగ్గర ఉన్న నీటిని తాగించాడు. ఆ పక్షి ఒక అడవి దేవతగామారి, ‘నీ దయాగుణానికి మెచ్చాను. ఈ దారిలో వెళ్తే నీకు మురళి కనిపిస్తుంది. కానీ.. దాన్ని పొందే ముందు నువ్వు నీ అహాన్ని వదులుకోవాలి’ అని చెప్పి మాయమైపోయింది. ముగింపు చివరికి ఆర్యన్ ఒక పెద్ద గుహలోకి చేరుకున్నాడు. అక్కడ బంగారంలా మెరుస్తున్న మురళి ఉంది. దాన్ని తాకగానే, ఒక గంభీరమైన స్వరం వినిపించింది: ‘దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం వాడుకుంటావా? లేక ఇతరుల కోసమా?’ అని శబ్ధం వచ్చింది. ఆర్యన్ ఏమాత్రం ఆలోచించకుండా, ‘నా గ్రామం క్షేమం కోసమే నాకు ఇది కావాలి’ అని సమాధానమిచ్చాడు. అతని నిస్వార్థానికి మెచ్చి ఆ మురళి ఆర్యన్ చేతికి చిక్కింది. అతను గ్రామానికి వచ్చి మురళిని ఊదగానే, ఆకాశం నుంచి వర్షం కురిసి గ్రామం మళ్లీ పచ్చదనంతో నిండిపోయింది. ఆర్యన్ అందరికి హీరో అయ్యాడు. నీతి: నిస్వార్థమైన మనసుతో చేసే ఏ ప్రయత్నమైనా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది. మనన్, బాలరచయిత 4వ తరగతి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామం: రాచ్పల్లి, మండలం: ధర్మారం జిల్లా: పెద్దపల్లి -
ఉచిత కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతం
కరీంనగర్: కరీంనగర్లోని రెనే హాస్పిటల్, శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోకాలి కీళ్ల మార్పిడి శిబిరం విజయవంతమైంది. ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ బంగారి రజని ప్రియదర్శిని ఆధ్వర్యంలో ఎంపికై న 18 మంది లబ్ధిదారులకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, వారిని ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ చేశారు. ప్రతీ ఏడాది నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఈసారి ఆరోసారి నిర్వహించారు. మార్చి 2026లో జరిగిన మెడికల్ క్యాంపుకు హాజరైన సుమారు 600 మంది పేషెంట్లలో నుంచి లక్కీ డ్రా విధానం ద్వారా 18 మందిని ఎంపిక చేసి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశారు. వీరిలో 8 మందికి అత్యాధునిక జాన్సన్ అండ్ జాన్సన్ రోబోటిక్ సాంకేతికతతో కీళ్ల మార్పిడి చేయగా.. మిగతావారికి సాధారణ పద్ధతిలో చికిత్స అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. సుమారు రూ.40లక్షల విలువైన వైద్య సేవలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు. ఆధునిక రోబోటిక్ వైద్యసేవలను జిల్లాకు తీసుకురావడమే కాకుండా పేదలకు అందించడం గొప్ప విషయమని కొనియాడారు. డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ... తన తల్లిదండ్రుల స్ఫూర్తితో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రెనీ హాస్పిటల్ వైద్యులు మునిష్, కృష్ణారెడ్డి, లతీశ్రెడ్డి, సురేశ్కుమార్, సుధీర్ ద్వారాక్ నాయుడు, నిఖిల్ లక్ష్మణ్, విశాల్, వైభవ్, కమలుద్దీన్, పులి స్ఫూర్తి, నవ్య, సారా ఫాతిమా, ఆదిత్య, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. 18 మందికి ఆపరేషన్లు చేసిన డాక్టర్ బంగారి స్వామి -
మూడు నెలలకోసారి జాబ్మేళా
కరీంనగర్టౌన్: జిల్లాలో మూడు నెలలకు ఒకసారి జాబ్మేళా నిర్వహిస్తామని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్మేళాను పర్యవేక్షించారు. ఎంతమంది హాజరయ్యారు, ఏయే కంపెనీలకు అవకాశం కల్పించారు.. తదితర వాటిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ఇతర ప్రాంతాల్లో మూడు నెలలకోసారి జాబ్మేళా ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో అవకాశాలు కల్పిస్తామని, తద్వారా వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడుతామన్నారు. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వివిధ రంగాలకు చెందిన 90 కంపెనీలు నియామక ప్రక్రియను నిర్వహించాయి. మూడు వేల మంది యువత హాజరుకాగా, 997మంది వివిధ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికయ్యారు. మరో 478 మందిని వివిధ కంపెనీలు తక్షణమే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, త్వరలో వారికి నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆర్డీవో కే.మహేశ్వర్, జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, పరిశ్రమలశాఖ జీఎం సాల్మ న్ రాజు, పీడీ మెప్మా స్వరూపరాణి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి పాల్గొన్నారు. -
రూ.70 కోట్లతో పనులు
కరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్ సిటీ నిధులు రూ.70 కోట్లతో నగరంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని స్మార్ట్సిటీ బోర్డు సమావేశం నిర్ణయించింది. బోర్డు సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. సీడీఎంఏ శ్రీదేవి, ఈఎన్సీలతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ హాజరయ్యారు. రూ.70 కోట్ల గ్రాంట్తో నగరంలోని టవర్సర్కిల్ వద్ద మల్టీ పార్కింగ్ భవనం నిర్మించాలని తీర్మానించారు. మదీనాకాంప్లెక్స్ వద్ద గతంలో నిర్మించిన భవనం ఉపయోగంలోకి రాకపోగా, శిథిలావస్థకు చేరడం తెలిసిందే. తాజాగా స్మార్ట్ సిటీ నిధులు సుమారు రూ.50 కోట్లతో మల్టీపార్కింగ్ భవనం నిర్మించాలని నిర్ణయించడంతో టవర్సర్కిల్ వద్ద పార్కింగ్ తిప్పలు తప్పే అవకాశం ఉంది. ప్రతి వర్షాకాలం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పడుతున్న ముంపును నివారించేందుకు నిధులు కేటాయించారు. మంచిర్యాల చౌరస్తా, ముకరాంపుర, రాంనగర్, ఆర్టీసీ వర్క్షాప్, కోతిరాంపూర్ తదితర ప్రాంతాల్లో వరద ముంపును తప్పించేందుకు నాలా నిర్మాణాలను చేపట్టనున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. -
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026
వెదిరలో రాస్తారోకో చేస్తున్న రైతులుశంకరపట్నం మండలం కరీంపేటలో తడిసిన ధాన్యంహుజూరాబాద్ మండలంలో తడిసిన ధాన్యంవెదిరలో రాస్తారోకోలో చిక్కుకున్న 108 వాహనంరామడుగు/శంకరపట్నం/హుజూరాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడిన అన్నదాతకు ధాన్యం విక్రయించుకునేందుకు తిప్పలు తప్పడం లేదు. కల్లాల్లోని ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ అన్నదాతలు ఆగ్రహానికి గురవుతుండగా, పలుచోట్ల అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. ఎటుతిరిగీ అన్నదాతే నష్టపోతుండగా.. కొనుగోళ్లు వేగిరం చేయాల్సిన అవసరం ఉంది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడం లేదని, వేసిన ధాన్యానికి 4కిలోల తరుగు తీస్తున్నారని కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపైన వెదిరలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా గంటపాటు ఆందోళన చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గంగాధర ఎస్సై వంశీకృష్ణ రైతులకు నచ్చజెప్పి అందోళన విరమింప జేసే ప్రయత్నం చేసినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్ రాజేశ్వరి వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్యను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. శంకరపట్నం మండలంలో మంగళవారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కరీంపేట, కొత్తగట్టు, మొలంగూర్, మెట్పల్లిలో అకాలవర్షంతో సంచుల్లో కాంటా వేసిన ధాన్యంతో పాటు కుప్పలు తడిసిపోయాయి. హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్, సిర్సపల్లి, చెల్పూర్ గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొట్టుకు పోయింది.అన్నదాత అరిగోస -
అమ్మా.. బతకాలని ఉంది..!
గొల్లపల్లి: వారిది నిరుపేద కుటుంబం. కూలీపనులు చేసుకుంటూ.. ఉన్నంతలో ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటున్న ఆ కుటుంబంలో పెద్ద ఆపద వచ్చిపడింది. కుమారుడికి కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ముందుగా జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్య సిబ్బంది ప్యాంక్రియా టైటిస్గా గుర్తించారు. అక్కడ వైద్యం అందించినా.. నయం కాకపోవడంతో చేతిలో చిల్లిగవ్వలేకున్నా.. అప్పు చేసి హైదరాబాద్లోని యశోధ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడిని బతికించుకునేందుకు ఆ కుటుంబం తాపత్రయపడుతోంది. ఆపన్నహస్తం కోసం ఎదరుచూస్తోంది. కన్నీరు పెట్టిస్తున్న బాలుడి కథ గొల్లపల్లి మండలం భీంరాజ్పల్లి గ్రామానికి చెందిన రజితను మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన ఆరే తిరుపతికి ఇచ్చి 20ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి కుమారుడు దీక్షిత్, కూతురు ఉన్నారు. తండ్రి తిరుపతి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు. పిల్లల ఆలనాపాలన తల్లి రజిత చూసుకుంటోంది. దీక్షిత్ కొన్నాళ్ల క్రితం అనారోగ్యం బారిన పడడంతో రజిత ఆస్పత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు అతడికి ప్యాంక్రియాటైటిస్ వ్యాధి వచ్చినట్లు గుర్తించారు. మందులు వాడినా.. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా అల్లాడుతున్నాడు. ఏడాది కాలంగా దీక్షిత్ పరిస్థితి దయనీయంగా మారింది. దీంతో ఆ తల్లి కొడుకును కాపాడుకునేందుకు జగిత్యాలతోపాటు కరీంనగర్, హైదరాబాద్ వంటి ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తోంది. అప్పుల ఊబిలో కుటుంబం కుటుంబం గడిచేందుకే ఆ కుటుంబం పడరానిపాట్లు పడుతోంది. ఇక దీక్షిత్ చికిత్స కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆ కుటుంబానికి సొంత ఇల్లు లేదు. గుంటభూమి లేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. అప్పు చేసి.. సుమారు రూ.7లక్షల వరకు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా ఫలితం కనిపించడం లేదు. వ్యాధి మళ్లీ మళ్లీ తిరగబెడుతోంది. తీవ్ర కడుపునొప్పితో కొడుకు విలవిల్లాడిపోతుంటే ఆ తల్లి ఏం చేయాలో తెలియక మౌనంగా రోదిస్తూ.. లోలోపల కుమిలిపోతోంది. చదువులో ముందంజ అనారోగ్యంతో ఉన్నా దీక్షిత్కు చదువుపై ఆసక్తి తగ్గలేదు. మందులు వాడుతూనే పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఉపాధ్యాయులు అతడిని అభినందించి.. ఆయన దీనస్థితిని చూసి చలించిపోయారు. దాతల సాయం కోసం ఎదురుచూపులు ‘నా కొడుకుకు ప్రాణభిక్ష పెట్టండి.. దేవుడా.. బతికించు..’ అంటూ ఆ తల్లి కలిసిన ప్రతిఒక్కరికీ చేతులెత్తి దండం పెడుతోంది. కళ్లముందే కొడుకు దీనస్థితికి చేరడం.. వైద్యం అందిస్తామన్నా.. చేతిలో చిల్లిగవ్వలేకపోవడంతో ఆ తల్లి వేదన వర్ణణాతీతం. ప్రస్తుతం దీక్షిత్కు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే రూ.7లక్షలు ఖర్చయ్యాయని, మరో రూ.7లక్షలు అయితే కొడుకు బతికే అవకాశం ఉందని ఆ తల్లి వేడుకుంటోంది. దాతలు స్పందించి తన కొడుకును బతికించాలని అర్థిస్తోంది. మృత్యువుతో పోరాడుతున్న 17 ఏళ్ల బాలుడు ప్యాంక్రియా టైటిస్గా గుర్తించిన వైద్యులు అప్పు చేసి వైద్యం అందిస్తున్న పేద కుటుంబం ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు దాతలు స్పందించాలని వేడుకోలు సహాయం చేయాలనుకునే దాతలు 96664 21275 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటోంది. -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్య, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్లే బాధ్యత వహిస్తారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్హౌజ్లో గడుపుతున్న కేటీఆర్ విలాసవంతమైన జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడి, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నిందితులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్లోని ముషీరాబాద్కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్గానే భావిస్తున్నారు.


