Karimnagar
-
21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే ఇరుక్కుపోయిన పెన్ క్యాప్
హైదరాబాద్: కరీంనగర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువకుడు.. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగేశాడు. గత నెల రోజుల నుంచి దగ్గు రావడం, బరువు తగ్గిపోవడం లాంటి లక్షణాలతో బాధపడుతున్నాడు. పది రోజులుగా దగ్గు విపరీతంగా పెరిగిపోయి, నిద్రపోవడానికి కూడా ఏమాత్రం వీలు కాకపోవడంతో వైద్యులకు చూపించగా.. సీటీ స్కాన్ తీయించారు. అప్పుడు ఎడమవైపు కిందిభాగంలో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తెలిసింది. దాంతో వాళ్లు హైదరాబాద్ పంపారు. ఇక్కడ కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో ఆ యువకుడికి సీటీ స్కాన్ చేసి, విషయం తెలుసుకుని దానికి చికిత్స చేసిన కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.“ఆ యువకుడు ఇక్కడకు వచ్చినప్పుడు ముందుగా సీటీ స్కాన్ చేశాం. అప్పుడు లోపల ఏదో ఒక గడ్డలా కనిపించింది. ఆ గడ్డ వల్లే ఊపిరితిత్తుల వద్ద ఆటంకం ఏర్పడి.. దగ్గు వస్తోందని భావించాం. దాన్ని తీసేందుకు ప్రయత్నిస్తూ లోపల చూసేసరికి.. పెన్ క్యాప్ కనిపించింది. దాంతో ప్రొసీజర్ మధ్యలోనే ఆ యువకుడి అన్నను లోపలకు పిలిచి, గతంలో ఏమైనా మింగాడా అని అడిగాం. అప్పుడు.. ఐదేళ్ల వయసులో ఉండగా పెన్ క్యాప్ మింగేశాడని, అప్పట్లో తానే వైద్యుడి వద్దకు తీసుకెళ్తే అక్కడ పరీక్షించి లోపల ఏమీ లేదని.. బహుశా మలంతో పాటు వెళ్లిపోయి ఉండొచ్చని చెప్పారన్నాడు.దాంతో దాదాపు మూడు గంటల పాటు కష్టపడి, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కొపీ సాయంతో ముందుగా దాని చుట్టూ పేరుకుపోయిన కణజాలాలు, లింఫ్నోడ్, కండలను కొద్దికొద్దిగా తొలగించాం. క్రమంగా అదంతా క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఆ పెన్ క్యాప్ను కూడా బయటకు తీసేశాం. ఇన్ని సంవత్సరాల పాటు అలా ఒక ఫారిన్ బాడీ లోపల ఉండిపోవడం వల్ల ఊపిరితిత్తులు కూడా కొంత దెబ్బతిన్నాయి. అయితే, అక్కడ దెబ్బతిన్న ఇతర భాగాలను సరిచేసేందుకు యాంటీబయాటిక్స్ వాడాం. దాంతో అతను కోలుకున్నాడు.ఇలాంటివి అలా ఎక్కువ కాలం ఉండిపోవడం మంచిది కాదు. ఇతను ఇప్పుడు కూడా రాకపోయి ఉండి, అలాగే వదిలేస్తే దాని చుట్టూ కణజాలం పేరుకుపోతుంది. ఊపిరితిత్తి మొత్తం పాడైపోతుంది. అప్పుడు దాన్ని శస్త్రచికిత్సతో పాడైన భాగాన్ని కోసేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు ముందే గుర్తించడంతో మందులతోనే దాన్ని సరిచేయగలిగాం. చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో, నోట్లో ఏం పెట్టుకుంటున్నారో గమనించుకోవాలి. అలాంటివి ఏవైనా ఉంటే వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి, దాన్ని తీయించాలి. లేకపోతే ఇలాంటి తీవ్రమైన సమస్యలు వస్తాయి” అని డాక్టర్ శుభకర్ నాదెళ్ల తెలిపారు. -
అమ్మా.. లే అమ్మ
మల్యాల: ‘మా అమ్మకు ఏమైంది.. అమ్మ.. లే అమ్మా..’ ఆ చిన్నారుల కంటతడి అక్కడున్నవారిని కంట తడి పెట్టించింది. తల్లి తన ఒడిలో ఆడిస్తూ.. అల్లరి చేస్తే అడిగింది ఇస్తూ.. ఏడిస్తే బుజ్జగించే అమ్మ లేదని, ఇక తిరిగి రాదని ఆ పిల్లలకు తెలియదు. అమ్మే లోకంగా.. నిత్యం ఆమె ఒడిలో ఆడుకునే పిల్లల అమాయక చూపులు.. అమ్మ లేదని తెలియని ఆ పిల్లలకు ఎప్పుడొస్తుందని అడిగితే ఏం చెప్పాలో తెలియని ఆ తండ్రిని చూసి గ్రామస్తులు తల్లడిల్లిపోయారు. అనారోగ్యంతో బాధపడుతూ ఓ నిండు గర్భిణి మృతిచెందగా.. ఆమె మృతదేహం వద్ద కనిపించిన ఈ హృదయ విదారకమైన ఘటన మల్యాల మండలం నూకపల్లిలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం.. నూకపల్లికి చెందిన చెవులమద్ది మహేశ్తో పెగడపల్లి మండలం వెంగళాయిపేట గ్రామానికి చెందిన స్రవంతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు నిహాంత్ (7), కూతురు నిక్షిత (3) ఉన్నారు. మహేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వచ్చి వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. స్రవంతి బీడీలు చేస్తూ వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. స్రవంతి మూడోసారి గర్భం దాల్చినప్పటినుంచి జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ చేయించుకుంటోంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. కొద్దిరోజుల క్రితం ఆస్పత్రికి పరీక్షల కోసం వెళ్లగా.. కడుపులో బిడ్డ కదలడం లేదని, కరీంనగర్కు రెఫర్ చేశారు. అక్కడ కూడా కడుపులో బిడ్డ కదలడం లేదని, శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి పురుడుపోసినా.. అప్పటికే శిశువు మృతిచెందింది. కాసేపటికి పరిస్థితి విషమించి స్రవంతి కూడా చనిపోయింది.నూకపల్లిలో విషాదంస్రవంతి పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లి.. కడుపులో బిడ్డ, తల్లి కూడా మృతిచెందడంతో నూకపల్లిలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా ఆమె కుమారుడు, కూతురు బిక్కుబిక్కుమంటూ చూడడం స్థానికులను కంటతడి పెట్టింది. మా అమ్మకు ఏమైంది అని అక్కడున్నవారిని అమాయకంగా అడగడంతో ఏం చెప్పాలో.. వారిని ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి నెలకొంది. నూకపల్లిలో స్రవంతి అంత్యక్రియలు నిర్వహించారు. వందలాదిమంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆమె అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబసభ్యులకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించారు. -
140 మంది భారతీయులను విడిపిస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి పేరుతో బ్యాంకాక్ వెళ్లి అక్రమంగా మయన్మార్లో చిక్కుకుపోయిన 140 మంది భారతీయ యువకుల కుటుంబాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఈ విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ జోక్యంతో విదేశాంగశాఖ స్పందించింది. బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అక్రమంగా సైబర్ కేఫ్ల నిర్వహణ, అక్కడ యువకులను నిర్బంధించడం, హింసించడం వంటి ప్రతికూల చర్యలతో మయన్మార్పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. మాయ్ సాట్ ద్వారా ఇండియాకు.. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిళ్లతో మయన్మార్ అధికారు లు భారత దౌత్య కార్యాలయానికి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈలోపు బాధితులను ఇండియాకు పంపించేందుకు దౌత్య కార్యాలయం కూడా రోడ్మ్యాప్ రూపొందించుకునే పనిలో ఉంది. వాస్తవానికి వీరిని బ్యాంకాక్ నుంచి దాదాపు 505 కి.మీ.ల దూరంలో ఉన్న మయన్మార్లోని మైవాడీ జిల్లాకు బలవంతంగా తరలించారు. తిరిగి వీరిని బ్యాంకాక్ కాకుండా.. మైవాడీలోని మోయే నది దాటి కేవలం 11 కి.మీ.ల దూరంలో ఉన్న థాయ్లాండ్లోని మాయ్సాట్ ప్రావిన్స్ ద్వారా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం భారత యువకులంతా మైవాడీలోని కేకే2 పార్క్లో బందీలుగా ఉన్నారు.‘సాక్షి’కి మెయిల్మయన్మార్లోని మైవాడీ జిల్లాలో భారతీయ యువకులు చిక్కుకున్న విషయమై ‘సాక్షి’దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ విషయమై సాక్షి మయన్మార్ రాజధాని యంగాన్లోని దౌత్య కార్యాలయాన్ని సంప్రదించింది. బాధితుల పాస్పోర్టులు పంపి వారిని కాపాడాలని కోరింది. దీనిపై సానుకూలంగా స్పందించిన దౌత్య కార్యాలయం కాన్సులర్ ఆర్సీ యాదవ్ బందీల విడుదలకు చర్యలు తీసుకుంటున్నామని మంగళవారం ‘సాక్షి’కి మెయిల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు స్థానిక అధికారులతో చర్చలు మొదలుపెట్టామని తెలిపారు. -
‘బీజేపీలో ఏ ఇద్దరికై నా సఖ్యత ఉందా’?
కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీలో ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఏ ఇద్దరి మధ్యనైనా సఖ్యత ఉందో చెప్పాలని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్ని ప్రశ్నించారు. మంగళవారం నగరంలోని సిటీకాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేవలం ప్రచారం కోసమే కాంగ్రెస్పై సంజయ్ కామెంట్స్ చేస్తున్నారన్నారు. మైనార్టీల నెపంతో విధ్వంస రాజకీయాలు చేయడం తప్ప సంజయ్కి అభివృద్ధి చేతకాదన్నారు. నాయకులు తాజొద్దీన్, శ్రవణ్ నాయక్, కుర్ర పోచయ్య, జిడీ.రమేశ్, దన్నసింగ్, అర్ష మల్లేశం, భూమాగౌడ్, గంట శ్రీనివాస్, దండి రవి, అస్తపురం రమేశ్, నగేశ్ పాల్గొన్నారు. గణితంలో కరీంనగర్ విద్యార్థి ప్రతిభ విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్కు చెందిన మనీశ్రావు(12) జ్ఞాపకశక్తిలో అద్భుత ప్రతిభ కనబరిచి మ్యాథమెటిక్స్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ రెండు వందల వరకు జ్ఞాపకం ఉంచుకుని ప్రపంచ రికార్డు సాధించాడు. కరీంనగర్ ప్రెస్భవన్లో మంగళవారం మనీశ్రావుకు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. వివేకానంద సీబీఎస్ఈ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న మనీశ్రావు 200వరకు అన్ని అంకెల స్క్వేర్స్, క్యూబ్స్ కంఠస్తం చెప్పి ఈ రికార్డులు సొంతం చేసుకున్నాడు. మెమోరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ వేణుకుమార్, మనీశ్ తల్లిదండ్రులు శ్రీనివాస్, రాధ, చేంజ్ మెయోరీ అకాడమీ ట్రైనర్స్ తిరుపతి, హరీశ్కుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం కరీంనగర్–1 డిపోకు చెందిన సిబ్భందికి బస్స్టేషన్ సమావేశ మందిరంలో, డిపో–2 సిబ్బందికి డిపోలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆర్టీసీ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబ్బందితో నేరుగా మాట్లాడారు. రెండు డిపోలకు సంబంధించి 80 మంది డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. ఆర్ఎం రాజు, డిప్యూటీ ఆర్ఎంలు కె.సత్యనారా యణ, ఎస్.భూపతిరెడ్డి, డిపో–1 మేనేజర్ విజయమాధురి, డిపో–2 మేనేజర్ వి.మల్ల య్య, సూపర్వైజర్లు పాల్గొన్నారు. కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కరీంనగర్ అర్బన్: కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. మార్క్ఫెడ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్రం కొనసాగుతోందని కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి పురుషోత్తం వివరించారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.7550కు ఖరీదు చేస్తారని తెలిపారు. మార్క్ఫెడ్ సిబ్బంది, డీసీఎంఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఎల్ఎల్బీ షెడ్యూల్ విడుదల కరీంనగర్సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని మూడేళ్ల ఎల్ఎల్బీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు జరుగుతాయని తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని, సంబంధిత కళాశాలలో సంప్రదించాలని సూచించారు. -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
‘నలిమెల’కు జాతీయ అవార్డు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బహుభాష కోవిదుడు, కేంద్ర సాహి త్య అకాడమీ అవార్డు గ్రహీత నలిమెల భాస్కర్ సిటీ కాలేజ్ మగ్దూం మొహినూద్దీన్ జాతీ య పురస్కారానికి ఎంపికయ్యారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన భాస్కర్కు 14 భాషల్లో ప్రవేశం కలదు. ఆయన పలు రచనలు వివిధ భాషల్లో అనువాదం అయ్యాయి. ఇటీవల పీవీ నరసింహారావు మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. నలిమెల భాస్కర్ వివిధ సాహితీ ప్రక్రియల్లో 25 గ్రంథాలు వెలువరించారని, ఆయన కృషిని గుర్తించి జాతీయ అవార్డు ప్రకటించినట్లు అవార్డు కమిటీ అధ్యక్షుడు, సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ ఆచార్య పి.బాలభాస్కర్ సోమవారం ప్రకటించారు. పరిహారం ఇప్పిస్తానని కుచ్చుటోపీ● పూజారిని రూ.30లక్షలకు ముంచిన నకిలీ విలేకరి శంకరపట్నం: రెవెన్యూ రికార్డుల్లో తక్కువగా నమోదైన ఎకరం భూమితోపాటు ఎస్సారెస్పీ కింద పోయిన భూమికి పరిహారం ఇప్పిస్తానని మాచర్ల రాజయ్య అనే నకిలీ విలేకరి రూ.30 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడని పురోహిత్యం చేసుకుంటూ జీవించే వైరాగ్యపు రాజమల్లయ్య తన గోడు వెల్లబోసుకున్నాడు. కేశవపట్నంలో మంగళవారం విలేకరులతో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాడు. ఆయన వివరాల ప్రకారం.. మానకొండూర్ మండలం పచ్చునూర్ గ్రామానికి చెందిన రాజమల్లయ్య పచ్చునూర్, ఊటూర్, గట్టుదుద్దెనపల్లితో పాటు శంకరపట్నం మండలం చింతగుట్ట ఆలయాల్లో పూజారి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో నివాసం ఉంటున్న మాచర్ల రాజయ్య తల్లి 2023లో మరణిస్తే తన స్వగ్రామం ఊటూర్లో దశదినకర్మ చేసేందుకు రాజమల్లయ్య వెళ్లాడు. ఆ సమయంలో రాజయ్య తాను ఓ టీవీ చానల్ విలేకరిగా పరిచయం చేసుకున్నాడు. ఏదైన రెవెన్యూ కార్యాలయంలో పని ఉంటే చేయిస్తానని చెప్పాడు. పచ్చునూరులో తనకున్న ఏడు ఎకరాల్లో ఎకరం భూమి పట్టా కాలేదని చెప్పడంతో రూ.లక్ష ఇస్తే పనులు చేయిస్తానని నమ్మించాడు. దీంతో రాజమల్లయ్య రాజయ్యకు గూగుల్పే ద్వారా రూ.లక్ష పంపించాడు. ఎస్సారెస్పీకాలువలో పోయిన భూమల పరిహారం వచ్చిందని, అందుకు సంబంధించిన రూ.96లక్షల ఫేక్కాపీ చూపించడంతో విడుతలవారీగా రూ.30లక్షల పైచిలుకు డబ్బులు పంపించాడు. పనులు కాకపోవడంతో మోసపోయానని గ్రహించి శంకరపట్నం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నకిలీ విలేకరిపై విచారణ చేసి, డబ్బులు ఇప్పించాలని కోరాడు. అంతర్జాతీయ మాతృభాషా సదస్సుకు కొమిరవాసిఓదెల: యూనెస్కోలో ఈనెల 24నుంచి 26వరకు జరిగే అంతర్జాతీయ మాతృభాషా సిల్వర్ జూబ్లీ సదస్సుకు ఓదెల మండలం కొమిర గ్రామానికి చెందిన కొత్తిరెడ్డి మల్లారెడ్డి ఎంపికయ్యారు. హుజూరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మల్లారెడ్డి భారతీయ భాషల కోసం యూనిటైడ్ ఫీమెంట్ ఇంటర్న్షిప్ తరహాలో యూనిఫైడ్ లాంగ్వేజ్ ఇంటర్షిప్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మల్లారెడ్డిని గ్రామస్తులు అభినందించారు. గంజాయి పట్టివేతధర్మపురి: మండలంలోని మగ్గిడి, దొంతాపూర్ గ్రామాలకు చెందిన యువకులు గంజాయి సరఫరా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దుర్గం నిశాంత్, కాలువ గంగాధర్, ఎస్కె.ఆసిఫ్ నుంచి 829 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. -
డేంజర్ స్పాట్స్
● సీఎంఏ పనుల పెండింగ్ ఎఫెక్ట్ ● తరచూ చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ● ఏడాది దాటినా కదలని అసంపూర్తి పనులుకరీంనగర్ కార్పొరేషన్: స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని అంతర్గత రోడ్ల అభివృద్ధికి ముఖ్యమంత్రి హామీ పథకం కింద రూ.132 కోట్లు కేటాయించి గతంలో పనులు మొదలు పెట్టారు. ఈ పనులు ప్రారంభదశలో ఉండగానే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2023 డిసెంబర్లో కాంట్రాక్టర్ ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశాడు. అప్పటి నుంచి సీఎంఏ పనులు చేపట్టిన ప్రాంతవాసులు నిత్యం ఇక్కట్లు పడుతున్నారు. పాత రోడ్లను తొలగించడంతో పాటు, ఇళ్ల ఎదుట డ్రైనేజీ కోసం తవ్వి వదిలివేయడంతో ఏడాదిగా ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదకరంగా రోడ్డు కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్ వైపు మెయిన్రోడ్డులో సగం వరకు సీసీ రోడ్డు వేశారు. మిగితా సగం పాత రోడ్డును తవ్వి అలానే వదిలేశారు. పూర్తయిన రోడ్డులో కూడా డ్రైనేజీ నిర్మాణం పూర్తిగా జరగలేదు. డ్రైనేజీల కనెక్టివిటీ వద్ద పరిస్థితి మరింత భయంకరంగా మారింది. రోడ్డుకు అడ్డుగా రెండు గుంతలు ఏర్పడడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకొంటున్నాయి. రాత్రి వేళల్లో ఈ పరిస్థితి భయానకంగా ఉంటోంది. ఇక జ్యోతినగర్ మోర్ సూపర్మార్కెట్ నుంచి మంకమ్మతోట వైపు రోడ్డు నిర్మాణంలో భాగంగా పాత రోడ్డు, పాత డ్రైనేజీని తొలగించారు. కాని అలానే వదిలివేయడంతో ఇండ్లల్లోకి వెళ్లేందుకు ఆ ప్రాంత వాసులు ఏడాదిగా నానా తిప్పలు పడుతున్నారు. సర్కస్ గ్రౌండ్ ప్రక్క రోడ్డులోనూ ఇదే పరిస్థితి. కిసాన్నగర్, తీగలగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్ మంకమ్మతోట, పోచమ్మవాడ తదితర చాలా ప్రాంతాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. మోక్షమెప్పుడో... నగరంలో పెండింగ్ పనులు పూర్తి చేస్తారంటూ ఏడాదిగా ప్రచారం జరుగుతున్నా చిన్న కదలిక ఉండడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ అధికారులు చెబుతూ వస్తున్నా, అసలు ఎప్పుడు కదలిక మొదలవుతుందో స్పష్టత లేదు. ఆయా ప్రాంత వాసులు అధికారుల చుట్టూ తిరిగి విసిగి వేసారి పోయారు. పెండింగ్ పనులు పూర్తి చేయకపోవడంలో జాప్యం జరుగుతుండగా, ప్రమాదకరంగా ఉన్న చోట్ల నగరపాలకసంస్థ అధికారులు తాత్కాలిక మరమ్మతులు అయినా చేపట్టకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఏడాదికి పైగా నిత్యం ప్రమాదపుటంచుల్లో ప్రయాణిస్తున్న తమకు విముక్తి ఎప్పుడంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా నగర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సీఎంఏ పనులకు మోక్షం ఎప్పుడు కలుగుతుందో అని వేయికళ్లతో ఆయా ప్రాంతవాసులు ఎదురుచూస్తున్నారు.నగరంలోని 9వ డివిజన్ అలకాపురికాలనీలో ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకకు ఇతర ప్రాంతానికి చెందిన యువకుడు హాజరయ్యాడు. వేడుక ముగిసిన తరువాత, తన ద్విచక్ర వాహనంపై శ్రద్ధ ఇన్ లేన్ నుంచి మెయిన్రోడ్డు వైపు బయల్దేరాడు. రోడ్డు వెంట నేరుగా వచ్చిన ఆ యువకుడు అకస్మాత్తుగా ముగిసిన రోడ్డును చూసి తికమక పడడంతో బైక్ అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. బైక్ పక్కకు పడడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. నగరంలో ముఖ్యమంత్రి హామీ పథకం (సీఎంఏ) నిధులతో చేపట్టిన రోడ్డు, డ్రైనేజీ పనులను సగంలోనే వదిలివేయడంతో నెలకొన్న పరిస్థితికి ఇది తాజా నిదర్శనం. ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా సిరిసిల్ల బైపాస్ రోడ్డు, శ్రద్ధ ఇన్ లేన్ వద్ద సీఎంఏ పనులు చేపట్టిన కాంట్రాక్టర్, సంవత్సరం క్రితం నిలిపివేశాడు. అంతర్గత రోడ్డు ఎత్తులో ఉండడం...మెయిన్రోడ్డు దిగువలో ఉండడం... కింద ఉన్న డ్రైనేజీని అసంపూర్తిగా వదిలివేయడం...ఐరన్రాడ్లు తేలి ఉండడంతో అది డేంజర్ స్పాట్గా మారింది. ఏడాదిలో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలి ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్: పదోతరగతి పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి, విద్యార్థులు వందశాతం ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధతపై మంగళవారం ఎంఈవోలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గతేడాది పదోతరగతి డ్రాపవుట్ అయిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వారికి అవసరమైన స్టడీ మెటీరియల్ అందించాలన్నారు. వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడి పరీక్షలు పూర్తయ్యే వరకు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపాలని కోరాలన్నారు. నాలుగు మోడల్ ప్రశ్నపత్రాలను ప్రత్యేకంగా తయారుచేసి విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలన్నారు. సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో తనిఖీ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో జనార్దన్రావు, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, సైన్స్ అధికారి జైపాల్రెడ్డి పాల్గొన్నారు. బాలికలు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కశ్మీర్గడ్డలోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్దేశాయ్తో కలిసి మంగళవారం రాత్రి సందర్శించారు. మెస్, బాలికల వసతిగదులు, ఆర్వోవాటర్ ప్లాంటును పరిశీలించారు. మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున విద్యార్థులకు అన్ని హాస్టళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమయ్యే కెరియర్ ఆప్షన్ చాట్ను ఆవిష్కరించారు. ఆర్డీవో మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
65 ఏళ్ల మహిళతో వివాహేతర సంబంధం.. చివరికి..!
పాలకుర్తి: బసంత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జీడీనగర్లో శివరాత్రి పోచమ్మ(65)ను హత్యచేసిన నిందితుడు ధర్మపురి శ్రీనివాస్ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. జీడీనగర్లో నివాసముంటున్న పోచమ్మ భర్త 20ఏళ్ల క్రితమే మృతిచెందగా.. కుమారుడు అంజి రామగుండంలో ఉంటున్నాడు. పోచమ్మ బీసీ కాలనీలో బిక్షాటన చేసుకుంటూ జీవిస్తోంది. అదేకాలనీలో నివాసముండే ధర్మపురి శ్రీనివాస్ మద్యానికి బానిస కావడంతో పదేళ్ల క్రితమే అతని భార్య వదిలిపెట్టి పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది, ఈనేపథ్యంలో పోచమ్మ, శ్రీనివాస్ల మధ్య పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. ఇద్దరు కలిసి రోజూ జీడీనగర్కు వెళ్లి గుడుంబా తాగుతుండే వారు. అయితే కొద్ది రోజులుగా పోచమ్మ తన ఇంటి సమీపంలో ఉండే పర్వతి కిష్టయ్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన శ్రీనివాస్ పోచమ్మను మందలించాడు. అయితే తాను ఇష్టమున్న వారితో మాట్లాడుతానని పోచమ్మ ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో అసహనానికి గురైన శ్రీనివాస్ పోచమ్మను హత్యచేయాలని నిర్థారించుకున్నాడు. దీనిలో భాగంగానే ఈనెల 9న సాయంత్రం ఇద్దరు కలిసి జీడీనగర్లో గుడుంబా తాగడానికి వెళ్లి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో శ్మశానవాటిక వద్దకు చేరుకోవడంతో శ్రీనివాస్ పోచమ్మతో కావాలనే గొడవకు దిగాడు. పథకం ప్రకారం ముందే సిద్దం చేసుకున్న కర్రతో పోచమ్మ తలపై గట్టిగా కొట్టడంతో మద్యం మత్తులో ఉన్న పోచమ్మ కిందపడి పోయింది. దీంతో పోచమ్మ చనిపోయిందని భావించిన శ్రీనివాస్ శ్మశానవాటిక లోపలికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం ఏమి తెలియనట్టుగా ఇంటికి వెళ్లిపోయాడు. ఈనెల 14న శ్మశానవాటిక వద్ద సగం కాలిన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సంఘటన స్థలానికి వెళ్లి లభించిన ఆధార్కార్డు, ఇతర వస్తువుల ఆధారంగా మృతదేహం పోచమ్మది గుర్తించి పంచనామా నిర్వహించారు. మృతురాలి కుమారుడు అంజి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు అనుమానంతో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బసంత్నగర్ ఎస్సై స్వామితో పాటు కానిస్టేబుళ్లు శివకుమార్, సురేశ్, శ్రీనివాస్లను పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ అభినందించారు. -
విలువిద్యలో జాతీయస్థాయిలో జిల్లా కీర్తి
మంథని: మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు కొమురోజు శ్రీనివాస్ శిక్షణలో జిల్లాలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన చికిత విలువిద్య క్రీడలో ప్రపంచ స్థాయిలో రాణిస్తూ జిల్లా కీర్తిని అగ్రదేశానికి వ్యాపింపజేసింది. ఇటీవల ఉత్తరాఖాండ్లోని డెహడ్రూన్ జరిగిన 38 జాతీయ క్రీడల్లో మహిళల విభాగంలో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్(పతాక దారిగా) వ్యవహారించడం జిల్లాకే గర్వకారణం. తండ్రి ప్రోత్సాహం.. కోచ్ మనోధైర్యం మధ్య తరగతి కుటుంబానికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయం చేస్తూ తన కూతురు చికితకు విద్యతో పాటు క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తూ వెన్నంటి ఉండి విజయానికి దోహద పడుతున్నాడు. అలాగే మంథనికి చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా విలువిద్య అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్ చికితకు చిన్నతనం నుంచి కోచ్గా, అడ్వయిజర్గా వ్యవహరిస్తూ తన విజయానికి చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు. జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో శిక్షణ ప్రస్తుతం ఎన్సీవోఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సోనీపట్లో జాతీయ స్థాయి శిక్షకుల పర్యవేక్షణలో చికిత శిక్షణ పొందుతోంది. భారత మహిళల జట్టులో స్థానం సంపాదించి వరల్డ్, కప్ స్జేడ్ వన్, స్టేజ్కు ఽఈనెల 26న అమెరికా, చైనాలో జరిగే ప్రపంచ స్థాయి పోటీలకు ఎంపికై ంది. అంతేగాకుండా జూనియర్ ఆసియా కప్ జట్టుకు కూడా ఎంపిక కావడం విశేషం. గతేడాది గోవాలో జరిగిన 37వ జాతీయ క్రీడల్లోనూ విలువిద్య విభాగంలో బంగారు పతకం సాధించింది. కాగా చికిత విజయాలను అభినందిస్తూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు రూ.10లక్షలు ఏదేళ్ల పాటు నెలకు రూ.15 వేల చొప్పున ఉపకారవేతనం అందించేదుకు ముందుకు వచ్చినట్లు కొమురోజు శ్రీనివాస్ తెలిపారు. తాను చిన్నతనం నుంచి విద్య నేర్పిన క్రీడాకారిణి ప్రపంచస్థాయికి ఎదగడంపై ఎంతగానో గర్వపడుతున్నట్లు తెలిపారు. అమెరికాలో జరిగే ప్రపంచ స్థాయి క్రీడలకు చికిత 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జట్టుకు ప్లాగ్ బేరర్ -
...అనే నేను!
● ఎమ్మెల్సీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా అభ్యర్థుల పేర్లు ● విద్యాసంస్థ పేరుతో నరేందర్ రెడ్డి ● భార్యపేరు జత చేసుకుని హరికృష్ణ గెజిట్ ● తనకు కావాలనే ప్రాధాన్యం తగ్గించారని సింగ్ ఆరోపణ ● సాధారణంగానే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ మండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు ఇంతకాలం ఒకలా.. ఇప్పుడు ఒకలా కనిపిస్తుండటమే ఇందుకు కారణం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంటిపేరు ముందుండి, ఆ తరువాత ఒంటి పేర్లు ఉండటం సహజం. అదే తెలుగు ఎన్ఆర్ఐలు అయితే కాస్త వైరెటీగా ఇంటి పేరును.. ఒంటి పేరు తరువాత పెట్టుకుంటారు. ఇక ఉత్తర భారతంలో అసలు పేరు తరువాతే ఇంటి పేరు ఉంటుంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ పేర్ల విషయంలో అభ్యర్థులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. తమ రంగంలో తమకు గుర్తింపు తెచ్చిన పేర్లతోనే బరిలో దిగుతుండటం విశేషం. ఈ అంశంపై ప్రజల్లో, నేతల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు పేర్ల మార్పు విషయాన్ని వివాదంగా చూస్తున్నారు.. ఇదంతా పోలింగ్ బ్యాలెట్ వరుస క్రమంలో ముందుకు వచ్చేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. మరికొందరు ఇందులో అసలు వివాదం ఏముంది? అని ప్రశ్నిస్తున్నారు. మార్పు కనిపించింది వీరిలోనే.. గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులందరికీ పేర్లలో చెప్పుకోదగ్గ మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు కాంగ్రెస్ అభ్యర్థి వుట్కూరి నరేందర్ రెడ్డి పేరును.. అల్ఫోర్స్ నరేందర్రెడ్డి వుట్కూరిగా ముద్రించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి గెజిట్ను విడుదల చేయలేదు. అదే సమయంలో తాజాగా నరేందర్రెడ్డి తన సతీమణి వనజా పేరును.. వనజారెడ్డిగా మారుస్తూ ఇటీవల గెజిట్ విడుదల చేయడం గమనార్హం. ఆల్ఫోర్స్ అనేది నరేందర్రెడ్డికి ఉనికి అని, ఆ విద్యాసంస్థలతోనే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు కాబట్టి.. పేరు అలా వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అదే సమయంలో బీఎస్పీ అభ్యర్థి పులి హరికృష్ణ పేరును ప్రసన్న హరికృష్ణగా పబ్లిష్ చేశారు. వాస్తవానికి ఆయన పులి హరికృష్ణ అయినప్పటికీ.. పోటీ పరీక్షలకు కంటెంట్ ఇచ్చిన క్రమంలో ప్రసన్న హరికృష్ణగానే ప్రసిద్ధి చెందారు. అందుకే, ప్రాచుర్యం పొందిన పేరుతో తన అధికారిక పేరుగా గెజిట్ తెచ్చుకుని మరీ మార్చుకున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఓడినా.. ఇకపై ఇవే పేర్లతో కొనసాగనున్నారు. ఈ విషయంపై ఏఐఎఫ్బీ బీఫామ్పై బరిలో ఉన్న మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తన పేరును 11వ స్థానానికి మార్చడంలో కుట్రదాగి ఉందని, కొందరు అభ్యర్థులకు నిబంధనలకు విరుద్ధంగా మేలు చేసినట్లుగా అధికారుల తీరు ఉందని ఆరోపిస్తున్నారు. తాను ప్రముఖ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేస్తున్నా.. తన పేరును కిందికి మార్చి ప్రాధాన్యం తగ్గించారని విమర్శించారు. అదే సమయంలో స్వతంత్ర అభ్యర్థి వేముల విక్రమ్రెడ్డి అనే అభ్యర్థి పేరుకు ముందర ‘జర్నలిస్టు’ అనే పదం వచ్చి చేరడం గమనార్హం. మరో ఇండిపెండెట్ మహమ్మద్ ముస్తాక్అలీ తన పేరుకు ముందు డాక్టర్ అని ప్రచారం జరిగినా.. తీరా పోస్టల్ బ్యాలెట్లో డాక్టర్ లేకుండానే పేరు ముద్రితమవడం గమనార్హం. టీచర్స్ ఎమ్మెల్సీలో ఇలాంటి చిత్రాలు పెద్దగా చోటు చేసుకోలేదు. -
ఇదేం పద్ధతి..!
● లారీలు విడిపించుకునేందుకు వస్తే తిడతారా..? ● ఆర్టీఏ ఆఫీస్లో లారీ యజమాని ఆందోళన ● డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణ ● తమపైనే దాడి చేశాడన్న ఆర్టీఏ సిబ్బంది సిరిసిల్లక్రైం: అధికలోడ్తో వెళ్తున్న రెండు లారీలను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారని, వాటిని వదిలిపెట్టేందుకు ఒక్కో లారీకి రూ.30 వేలు చొప్పున డీటీవో పర్సనల్ అసిస్టెంట్ డిమాండ్ చేశాడని లారీ యజమాని మంగళవారం కార్యాలయంలో ఆందోళన చేపట్టాడు. తనను సిబ్బంది తిట్టారని ‘ఇదేం పద్ధతి’ అంటూ ప్రశినంచాడు. వివరాలు.. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన నాగరాజు.. తన రెండు లారీలు ఫ్లైయాష్ లోడ్తో సిరిసిల్లకు వస్తున్న క్రమంలో అధిక లోడ్ ఉందని ఆర్టీఏ అధికారులు కేసు నమోదు చేశారు. లారీలను విడిపించేందుకు నాగరాజు ఆర్టీఏ ఆఫీస్కు వచ్చే క్రమంలో డీటీవో పీఏ డబ్బు డిమాండ్ చేశాడ ని బాధితుడు పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డీపీవో కు తెలిపి వాహనాలను విడిపించుకునేందుకు ఆరీ ్టఏ కార్యాలయానికి బాధితుడు చేరుకోగా అక్కడ ఉన్న సిబ్బంది దుర్భాషలాడారు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజుకు సిబ్బందికి వాగ్వాదం జరిగింది. తనను దుర్భాషలాడటంతోనే కోపానికి వచ్చినట్లు లారీ యజమాని మీడియా ఎదుట తన ఆవేదన వెల్లడించాడు. కాగా, లారీ యజమాని మద్యం తాగి సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా లారీలో ఓవర్ లోడ్ ఉందని అధికారులు కేసు నమోదు చేశారు. నిబంధనల ప్రకారం జరిమానా చెల్లిస్తా. కానీ, మధ్యవర్తిగా వేణు అనే వ్యక్తి ఒక్కో లారీకి రూ.30 వేలు అడగడం ఆవేదన కలిగించింది. ఒక్క లారీ లోడ్ అమ్మితే వచ్చేదానికి ఆరింతలు లంచాన్ని ఆర్టీఏ అధికారుల పేరిట అడిగాడు. అధికారులు ఆఫీసులో ఉంటే ప్రైవేట్ వ్యక్తి తనిఖీలు చేయడమేందో అర్థం కాలేదు. – నాగరాజు, లారీ యజమాని ఆరోపణలో వాస్తవం లేదు ఓవర్ లోడ్తో ఉన్న లారీలను పట్టుకొని కేసు నమోదు చేశాం. జరిమానా చెల్లిస్తే వాహనాలను వదిలేస్తాం. మా కార్యాలయంలో మధ్యవర్తులుగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరూ లేరు. మా పేరిట డబ్బులు అడిగితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా నిబంధనలు అనుసరించి సేవలందిస్తున్నాం. – లక్ష్మణ్, రవాణాశాఖ అధికారి, సిరిసిల్ల -
మహాశివరాత్రి వేడుకలకు రండి
వేములవాడఅర్బన్: వేములవాడ రాజన్న ఆలయంలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించే మహాశివరాత్రి వేడుకులకు రావాలని సీఎం రేవంత్రెడ్డి, మంత్రులకు మంగళవారం విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు ఆహ్వానపత్రిక అందజేశారు. అనంతరం సీఎంకు అర్చకులు రాజన్న ప్రసాదం అందజేసి వేదో ఆశీర్వచనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి పనులపై సీఎం ఆరా తీయగా, పనులు టెండర్ దశలో ఉన్నాయని విప్ వివరించారు. ఘనంగా ఏర్పాట్లు చేయాలి మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. భక్తులకు తాగునీటి వసతి, చలువ పందిళ్లు తదితర ఏర్పాట్లు ముమ్మరం చేసి జాతర ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ ఈవో వినోద్, ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్, అర్చకులు చంద్రగిరి శరత్, గోపన్నగారి చందు, మామిడిపల్లి శరత్, వెంకన్న తదితరులు ఉన్నారు. సీఎంను ఆహ్వానించిన విప్ ఆది శ్రీనివాస్ -
ఎన్సీడీల నివారణపై శిక్షణ
కరీంనగర్టౌన్: ఎన్సీడీల సర్వే, నివారణపై హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఆశా కార్యకర్తలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమావేశమందిరంలో నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు చేస్తున్న కృషి, సేవలను అభినందించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమానికి మహిళలను తీసుకెళ్లి స్క్రీనింగ్ నిర్వహించడంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం ఎన్సీడీ వ్యాధులు పెరిగిపోతున్నందున, ప్రజలు సమతుల్య ఆహారం తీసుకుని, సరైన వ్యాయామం, యోగా చేయాలని తద్వారా డయాబెటిస్, హైపర్టెన్షన్, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు నివారించుకోవచ్చని సూచించారు. పీవోడీటీటీ ఉమాశ్రీరెడ్డి కుక్కకాటు, నివారణ చర్యలు, రేబి స్ను నివారించడంపై అవగాహన కల్పించారు. -
దేశానికి మోడీ గుర్తింపు తెచ్చారు
● చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికరీంనగర్టౌన్: అంతర్జాతీయస్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయంలో టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కకొమరయ్యతో కలిసి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఒక సిద్ధాంతం ఉన్న పార్టీ ఎదైనా ఉందంటే అది బీజేపీ అన్నారు. ఇతరపార్టీల వారికి వారి సిద్ధాంతం అంటే తెలియదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన నమ్మకం పోయిందని, కాంగ్రెస్ ఒకరిని తప్ప అభ్యర్థులను పెట్టకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. నాయకులు గంగాడి కృష్ణారెడ్డి, బాస సత్యనారాయణ, వై.సునీల్రావు, గుగ్గిల్లపు రమేశ్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, రత్నం పాల్గొన్నారు. -
మహాలక్ష్మి పథకంలో..
జిల్లా లబ్ధిదారులు సబ్సిడీ (రూ.కోట్లలో) జగిత్యాల 1,82,801 9.49 కరీంనగర్ 1,43,899 8.12 పెద్దపల్లి 1,05,913 5.54 సిరిసిల్ల 93,104 4.72జిల్లా కనెక్షన్లు సబ్సిడీ (రూ.కోట్లలో) కరీంనగర్ 1,33,872 594.82 పెద్దపల్లి 1,05,761 484.06 జగిత్యాల 1,71,940 719 సిరిసిల్ల 90,780 388.50 -
అక్షరాస్యత శాతం
కరీంనగర్ 69.2 పెద్దపల్లి 65.6 జగిత్యాల 60.2 సిరిసిల్ల 62.7ఉపాధి హామీ కూలీలు కరీంనగర్ 1,22,862 పెద్దపల్లి 1,17,821 జగిత్యాల 1,67,355 సిరిసిల్ల 97,252కరీంనగర్ 993 పెద్దపల్లి 992 జగిత్యాల 1,036 సిరిసిల్ల 1014సీ్త్ర, పురుష నిష్పత్తి (ప్రతీ వెయ్యి మంది పురుషులకు ఉన్న మహిళల సంఖ్య)పశుసంపద (గొర్రెలు) కరీంనగర్ 6,38,706 పెద్దపల్లి 5,49,286 జగిత్యాల 6,10,985 సిరిసిల్ల 3,88,227 -
ఉపాధ్యాయ సమస్యలపై గళమెత్తుతా
● ఎమ్మెల్సీగా గెలిపించండి ● టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకరీంనగర్టౌన్: ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలపై మండలిలో గళమెత్తుతానని టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య అన్నారు. మంగళవారం పలు ఉపాధ్యాయ సంఘా ల బాధ్యులు కరీంనగర్లో సమావేశమై, ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపారు. కొమురయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కారించేలా మండలిలో ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. పీఆర్సీ, డీఏ, జీపీఎఫ్, శిశు సంరక్షణ సెలవుల పెంపు, 20 ఏళ్ల సర్వీస్కే పూర్తి పెన్షన్, అలవెన్సుల పెంపు వంటి కీలక సిఫారసులను గత సర్కారు అమలు చేయలేదని మండిపడ్డారు. బీసీ సంఘాల మద్దతు.. టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మంగళవారం కరీంనగర్లో ఆయనను కలిసి, మద్దతు ప్రకటించారు. కొమురయ్యను గెలిపించుకొని, చట్టసభలకు పంపిస్తే బీసీ వాదం బలపడుతుందన్నారు. త్వరలో బీసీల రాజ్యాధికారం వస్తుందని, 2028 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీ ఫైనల్ అని పేర్కొన్నారు. కొమురయ్య మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫోన్ చేస్తే ఎత్తడు
మొదటి నుంచి అంతే.. ● ఏడాది క్రితం ఇక్కడ పనిచేసిన ఎకై ్సజ్ సీఐకి స్థానిక మద్యం వ్యాపారులతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో ఆమెను బదిలీ చేసి.. పెద్దపల్లిలో పని చేస్తున్న వినోద్రాథోడ్ను నియమించారు. ● ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విధులకు సక్రమంగా హాజరుకావడం లేదని, ఫోన్ చేసినా స్పందించరనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ● గతంలో ఇక్కడ సీఐలుగా పని చేసిన ఏ అధికారి కూడా ఇలా వ్యవహరించకపోవడం గమనార్హం. ● రోజులు తరబడి విధులకు డుమ్మా కొడుతున్న సీఐ తీరుపై ఉన్నతాధికారులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదు. అనేక ఆరోపణలు ● విధులకు సక్రమంగా హాజరు కాని సీఐ మద్యం, బెల్టు వ్యాపారుల నుంచి మామూళ్లు మాత్రం వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ● దీనివల్లనే మద్యం వ్యాపారులు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నప్పటికీ అటు వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. ● ప్రధానంగా పట్టణంలోని కొన్ని మద్యం దుకాణాల వద్ద రోడ్ల పక్కన మద్యం సేవిస్తున్నారు. దీనివల్ల అటు వైపు నుంచి వెళ్లడానికి మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ● దీనిని దృష్టిలో పెట్టుకొని బహిరంగంగా మద్యం సేవించడాన్ని అరికట్టాలని పలువురు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. ● అలాగే ఇటీవల బెల్టు దుకాణాలకు మందు సరఫరా చేసే విషయంలో పట్టణ మద్యం, బార్ వ్యాపారుల మధ్య విభేధాలు తలెత్తాయి. ఈ వ్యవహారంలో ఎకై ్సజ్ సిబ్బంది మద్యం వ్యాపారుల సూచనతో కొన్ని బెల్టు దుకాణాలపై దాడులు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కనీసం కేసు నమోదు చేయలేదని తెలిసింది. ● ఈ ఒక్కటే కాదు.. బెల్టు దుకాణాల నుంచి తరుచుగా స్వాధీనం చేసుకుంటున్న మద్యాన్ని రికార్డుల్లో చూపకుండా ఆ తర్వాత లైసెన్స్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీఐపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ ● సీఐ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడమే కాకుండా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, ఆయనను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ప్రకటన విడుదల చేసిన నాయకులు.. రెండోరోజైన మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి సీఐ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఐ వినోద్రాథోడ్ను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన స్పందించలేదు. విచారణ జరిపిస్తాం సీఐ వినోద్రాథోడ్పై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై విచారణ జరుపుతాం. ఎక్కడైనా సమస్యలుంటే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేయాలి. నా దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – సత్యనారాయణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అందుబాటులో ఉండడు.. మెట్పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్రాథోడ్ తీరుపై విమర్శలు అతడిపై చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ నాయకుల డిమాండ్ మెట్పల్లి: ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వరిస్తూ.. ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాల్సిన మెట్పల్లి ఎకై ్సజ్ సీఐ వినోద్ రాథోడ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విధులను నిర్లక్ష్యం చేస్తూ.. అందుబాటులో ఉండకపోవడం.. సమస్యలపై ఎవరైనా ఫోన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తే స్పందించకపోవడం వివాదానికి దారితీస్తోంది. ఇష్టారాజ్యంగా నడుచుకుంటున్న ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఏకంగా అధికార కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది. -
రాములపల్లిలో కుల బహిష్కరణ
ఎలిగేడు(పెద్దపల్లి): భూవివాదం విషయంతో తమను కుల బహిష్కరణ చేశారని పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన పలుమారు కొమురయ్య, అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల వివరాలు.. ఓ భూవివాదం విషయంలో తన కొడుక్కు సంబంధం ఉందని గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి కులంలోని పెద్ద మనుషులను బెదిరించి తమతో ఎవరూ మాట్లాడకుండా చేస్తున్నారని మనోవేదనకు గురయ్యారు. రెండురోజుల క్రితం ఇంట్లో మల్లన్న పట్నాలు వేసేందుకు బంధువులను పిలిపించుకున్నామని కానీ, ఓ పెద్దమనిషి ఒగ్గు కళాకారులను బెదిరించడంతో వారు పట్నం వేయకుండానే వెళ్లిపోయారని, పొలం పనులకు సైతం ఎవరూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబసభ్యులతో ఎవరు మాట్లాడిన పదివేల రూపాయల జరిమానా విధిస్తామని ఓ పెద్దమనిషి కులంలో ఇంటింటికీ తిరిగి చెప్పించారని అన్నారు. బహిష్కరణపై జూలపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు బాధితులు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై సనత్కుమార్ను వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంకా ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. ఫిర్యాదు రాగానే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
వికసిత్ లక్ష్యాల సాధనలో మైనింగ్ పాత్ర కీలకం
● ఎంఈఏఐ జాతీయ సదస్సులో సింగరేణి సీఎండీ బలరాం గోదావరిఖని: మన దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లోని హోటల్ తాజ్దక్కన్లో మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో ‘ఖనిజ అన్వేషణ: ఆత్మనిర్భర్ వికసిత భారత్–2047 వైపు ముందడుగు’ అంశంపై రెండురోజుల పాటు నిర్వహించిన జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో మాట్లాడారు. క్రిటికల్ మినరల్స్ రంగంలో గణనీయమైన పురోగతి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పోత్సాహంతో క్రిటికల్ మినరల్ రంగం అన్వేషణలో ఉన్న అవకాశాలపై సింగరేణి అధ్యయనానికి చర్యలు తీసుకుంటునట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం కూడా మైనింగ్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం, బడ్జెట్లో ప్రత్యేక నిధులను కేటాయించడం ద్వారా ఈ రంగంపై దృష్టిసారిస్తోందన్నారు. లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర అరుదైన ఖనిజాల అన్వేషణ చేపట్టడం ద్వారా భవిష్యత్ టెక్నాలజీ వృద్ధికి దోహదపడిన వాళ్లమవుతామన్నారు. ముఖ్యంగా మన దేశాన్ని 2070 నాటికి నెట్ జీరోగా మార్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ అరుదైన ఖనిజాల అన్వేషణ ప్రస్తుతం అత్యంత అవసరమన్నారు. సింగరేణి జీఎం(కోఆర్డినేషన్) ఎస్డీఎం.సుభాని, ఎంఈఏఐ సభ్యులు, మైనింగ్ రంగ నిపుణులు పాల్గొన్నారు. దొంగ అరెస్ట్మెట్పల్లిరూరల్: దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ తెలిపారు. మేడిపల్లి శివారులోని ఇబ్రహీంపట్నం క్రాసింగ్ వద్ద మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు విషయాలను చెప్పాడు. గతేడాది డిసెంబర్ రెండున మేడిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. నిందితుడిని కరీంనగర్ జిల్లా రేకుర్తి గ్రామానికి చెందిన తూర్పాటి కనకయ్యగా పోలీసులు వెల్లడించారు. కనకయ్య ఇతర ప్రాంతాల్లోని ఆలయాల్లో కూడా దొంగతనాలు చేశాడని, జైలుకు కూడా వెళ్లొచ్చాడని పోలీసులు తెలిపారు. -
మూలన పడేశారు
● నగరపాలక ఉద్యోగుల నిర్లక్ష్యం ● బల్దియాలో వృథాగా ఫ్రీజర్లుకరీంనగర్కార్పొరేషన్: వాహనాలు, పరికరాలను వినియోగించడంలో, పనులు చేయడంలో నగరపాలకసంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యానికి అంతుండడం లేదు. ఉద్యోగుల నిర్లక్ష్యంపై ఎన్నిమార్లు ఫిర్యాదులు వచ్చినా, ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. వాహనాలు, పరికరాలు చిన్న మరమ్మతుకు గురైనా, మూలనపడేసి అవి పూర్తిగా పనికిరాకుండా చేయడంలో బల్దియా అధికారులు, ఉద్యోగులది ఒక ప్రత్యేకత. నగరంలో ఎవరైనా మరణిస్తే వారి అంతిమయాత్రకు నగరపాలకసంస్థ నుంచి వైకుంఠరథం, ఫ్రీజర్లను సమకూరుస్తారు. గతంలో రూపాయికే అంతిమసంస్కారం ప్రవేశపెట్టగా, అంతిమయాత్రకు వేల రూపాయలు ఖర్చు చేయలేని నగరంలోని నిరుపేదలకు అది ఒక వరంలా మారింది. కానీ, ఈ పథకం నిర్వహణలో మాత్రం అధికారులు తరచూ విఫలమవుతూ వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠరథాలు సరైన మరమ్మతుకు నోచుకోవడం లేదు. కొద్ది రోజులు పనిచేస్తే, మరికొన్ని రోజులు షెడ్కే పరిమితమవుతున్నాయి. తాజాగా మృతదేహాలను భద్రపరిచే రెండు ఫ్రీజర్లను నగరపాలకసంస్థ కార్యాలయంలో వృథాగా పడవేశారు. అంతిమసంస్కారానికి ముందు కొన్ని గంటల పాటు మృతదేహం చెడిపోకుండా ఉండేందుకు ఉపయోగించే ఫ్రీజర్లు నగరపాలకసంస్థ కార్యాలయంలో ఓ పక్కన వృథాగా పడవేయడంపై సామాజిక కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీజర్లు పనిచేయని పక్షంలో మరమ్మతు చేసి ఉపయోగించాల్సిన అధికారులు, పట్టించుకోకుండా పక్కన పడవేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉపయోగించకపోతే ఎవరైనా స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు ఫ్రీజర్లు అప్పగిస్తే బాగుండేదని, వృథాగా పడేయడంతో అవి పూర్తిగా పనికిరాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా నగరపాలకసంస్థ ఉన్నాధికారులు రెండు ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు. -
ఉపాధ్యాయ ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 325 145 00 470 మంచిర్యాల 999 665 00 1,664 ఆదిలాబాద్ 1,095 498 00 1,593 నిర్మల్ 1,282 684 00 1,966 నిజామాబాద్ 2,176 1,375 00 3,751 కామారెడ్డి 1,307 704 00 2,011 జగిత్యాల 1,232 537 00 1,769 పెద్దపల్లి 647 464 00 1,111 కరీంనగర్ 2,663 1,642 00 4,305 రాజన్నసిరిసిల్ల 677 273 00 950 సంగారెడ్డి 1,520 1,170 00 2,690 మెదక్ 799 548 00 1,347 సిద్దిపేట 2,020 1,192 00 3,212 హన్మకొండ 126 40 00 166 భూపాలపల్లి 64 19 00 83 మొత్తం 16,932 10,156 00 27,088 -
పట్టభద్రుల ఓటర్లు ఇలా..
జిల్లా పురుషులు మహిళలు థర్డ్జెండర్ మొత్తం ఆసిఫాబాద్ 4,297 1,840 00 6,137 మంచిర్యాల 19,041 11,880 00 30,921 ఆదిలాబాద్ 10,323 4,612 00 14,935 నిర్మల్ 11,497 5,644 00 17,141 నిజామాబాద్ 19,993 11,581 00 31,574 కామారెడ్డి 11,616 4,793 01 16,410 జగిత్యాల 21,667 13,614 00 35,281 పెద్దపల్లి 19,008 12,028 01 31,037 కరీంనగర్ 42,806 28,739 00 71,545 రాజన్నసిరిసిల్ల 13,772 8,625 00 22,397 సంగారెడ్డి 17,383 8,269 00 25,652 మెదక్ 8,879 3,593 00 12,472 సిద్దిపేట 21,587 11,002 00 32,589 హన్మకొండ 3,162 1,423 00 4,585 భూపాలపల్లి 1,734 749 00 2,483 మొత్తం 2,26,765 1,28,392 02 3,55,159 -
గ్రాడ్యుయేట్స్ 3,55,159, టీచర్స్ 27,088
● ఎమ్మెల్సీ ఎన్నికల తుది ఓటర్లు ఖరారు ● ఓటర్లలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ● నేతలందరి దృష్టి కన్నారంపైనే..సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాలకు తుది ఓటర్ల జాబితా ఖరారైంది. సోమవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకా ల ప్రకారం.. పట్టభద్రుల ఓటర్లుగా ఇప్పటివరకు 3,55,159 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 27,088 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈనెల 3న నామినేషన్ ప్రక్రియ మొదలైంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేష న్లు వేశారు. ఉపసహంరణల అనంతరం గ్రాడ్యుయే ట్ ఎమ్మెల్సీ బరిలో 56 మంది, టీచర్స్ బరిలో 15 మంది నిలిచారు. ఇప్పటికే ఇటు గ్రాడ్యుయేట్స్, టీ చర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 27న జరిగే ఎన్నిక కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ ఓటర్ల జాబితాలో కొత్త, పాత జిల్లాలవారీగా చూసినా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముందంజలో ఉంది. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, 15 కొత్త జిల్లాలలోని 3.55 లక్షల ఓటర్లలో పాత కరీంనగర్ జిల్లాలోనే 1,60,260 మంది గ్రాడ్యుయేట్లు ఎన్రోల్ అయి ఉన్నారు. ఇక టీచర్స్ నియోజకవర్గంలో మొత్తం 27,088 ఓటర్లకు 18,953మంది నమోదు చేసుకున్నారు. ఏ రకంగా చూసినా.. కొత్త, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓటర్ల పరంగా అగ్రభాగాన ఉన్న నేపథ్యంలో నాయకులంతా ఈ జిల్లాపైనే ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ నియోజవర్గాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అత్యల్ప ఓట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు, 08న ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. -
చొప్పదండి పీఏసీఎస్ సేవలు భేష్
చొప్పదండి: పట్టణంలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని సోమవారం హిమాచల్ప్రదేశ్కు చెందిన అధికారుల బృందం సందర్శించింది. హిమాచల్ ప్రదేశ్కు చెందిన సహకార సంఘాల అధ్యక్షులు, అధికా రులు చొప్పదండి సొసైటీని సందర్శించి సహకార సంఘం పనితీరును పరిశీలించారు. పీఏసీ ఎస్ అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయస్థాయిలో మూడుసార్లు చొప్పదండి సొసైటీ ఉత్తమ అవార్డులు సాధించడానికి దోహదం చేసిన అంశాలను వివరించారు. వ్యవసాయ రుణాలను వందశాతం రికవరీ చేయడంతో పాటు, ఇతర రుణాలు 85 శాతం రికవరీ అయ్యాయని, సభ్యులకు పది శాతం డివిడెంట్ అందిస్తున్నామని ఆయన అధికారుల బృందానికి తెలిపారు. సొసైటీలోని సిబ్బందికి, రైతులకు బీమా సౌకర్యం కల్పించామని, రైతులకు అందుబాటులో గ్రామాల్లో గోదాములు ఏర్పాటు చేసి ఎరువులు అందిస్తున్నామని వివరించారు. రుణాలు ఇవ్వడమే కాకుండా రైతులకు బహుముఖ సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో పీడీసీ రిసోర్స్ పర్సన్ సత్యనారాయణ, డైరెక్టర్లు, సీ ఈవో కళ్లెం తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. -
అభివృద్ధి ఘనత కేసీఆర్దే
కరీంనగర్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను సోమవారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావులు 71 కేజీల భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు, పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ పదేళ్లపాటు ప్రజలకు ఎనలేని సేవలందించారన్నారు. ఎవరూ పేదరికంతో ఇబ్బందులు పడకూడదని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుంతుందన్నారు. కల్లబొల్లి మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ గౌడ్, కొత్తపెల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్ర రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రెడ్డివేణి మధు, నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ -
ఆధునిక పద్ధతిలో బోధించాలి
సైదాపూర్(హుస్నాబాద్): విద్యార్థులకు ఆధునిక పద్ధతిలో విద్యా బోధన చేయాలని కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు డీఈవో జనార్దన్రావు సూచించారు. సోమవారం వెన్నంపల్లి ఆంగ్ల బోధన కాంప్లెక్స్ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, హెచ్ఎం ప్రభాకర్రెడ్డి, ఆర్పీలు ప్రవీణ్కుమార్, సరిత, తిరుపతిరెడ్డి, పవన్కుమార్, కాంప్లెక్స్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జైలుశాఖ ఉద్యోగుల ప్రతిభ కరీంనగర్క్రైం: తెలంగాణ జైళ్ల శాఖ 7వ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు హైదరాబాద్లో జరుగగా జిల్లా జైలు ఉద్యోగులు సత్తాచాటారు. జిల్లా జైలు నుంచి 17 మంది ఉద్యోగులు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. కరాటే, లాంగ్జంప్, 800 మీటర్లు, టీం కరాటే, మిమిక్రీ విభాగాల్లో ఆరు బంగారు పతకాలు గెలుచుకున్నారు. అలాగే హైజంప్, 100 మీటర్లు, 400 మీటర్లు, కరాటే, బాస్కెట్ బాల్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన విభాగాల్లో 12 సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారు. ఈసందర్భంగా పతకాలు గెలుచుకున్న సిబ్బందిని పర్యవేక్షణ అధికారి జి.విజయ డేని, జిల్లా జైలు మెడికల్ ఆఫీసర్ వేణుగోపాల్, జైలర్ పి.శ్రీనివాస్, బి.రమేశ్, డిప్యూటీ జైలర్స్ ఎ.శ్రీనివాస్రెడ్డి, ఎస్.సుధాకర్రెడ్డి, ఎల్.రమేశ్, అజయ్చారి తదితరులు అభినందించారు. కంటి పరీక్ష శిబిరాల సందర్శనకరీంనగర్టౌన్: పాఠశాలల విద్యార్థులకు ఆర్బీఎస్కే టీంల ద్వారా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్న కంటి పరీక్ష శిబిరాలను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ సందర్శించారు. కరీంనగర్లో 101 మంది విద్యార్థులు, హుజూరాబాద్లో 126 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయా ఆస్పత్రుల్లో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డాక్టర్ సా జీదా అతహరి, సనా జవేరియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ ప్రసవాలకే మొగ్గు
● పెరుగుతున్న నార్మల్ డెలివరీలు ● ఎంసీహెచ్లో ప్రసవానికి పలువురి ఆసక్తి ● ఉద్యోగులూ ప్రభుత్వాసుపత్రికి వస్తున్న వైనం ● సౌకర్యాలు సరిపడక కొందరు వెనకడుగు ● వచ్చేది వేసవికాలం.. ఏసీలు లేక ఆగమాగం ● టీవీవీపీ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందికరీంనగర్టౌన్: జిల్లా కేంద్రంలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో సాధారణ ప్రసవాలు పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం 16 శాతం మాత్రమే నార్మల్ డెలివరీలు జరగడం గమనార్హం. గతేడాది జనవరి నుంచి ఈ జనవరి వరకు ప్రభుత్వాసుపత్రిలో 2,345 సాధారణ, 5,244 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. అంటే 37 శాతం సాధారణ ప్రసవాలే. ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో 599 నార్మల్, 3,179 సిజేరియన్ ప్రసవాలు జరిగాయి. అంటే 15 శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు. సాధారణ ప్రసవాలతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉంటారని, వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో భవిష్యత్లో వచ్చే అనర్థాలను గర్భిణులకు, వారి కుటుంబ సభ్యులకు వివరిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల వైపు మొగ్గుచూపేలా చూస్తున్నారు. ప్రైవేటులో సిజేరియన్లే.. జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 15 శాతం మాత్ర మే నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయి. ఇటీవల ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో సాధారణ ప్రసవాలు చేసుకోవాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో ఒత్తిడి పెరుగుతోంది. టీవీవీపీ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) ఆసుపత్రుల్లో డెలివరీలు చేయాలని పలుమార్లు జిల్లా కలెక్టర్లను సైతం సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వం ఆదేశించింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, టీవీవీపీ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరిగితే ఎంసీహెచ్పై ఒత్తిడి తగ్గడమే కాకుండా సాధారణ ప్రసవాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. అయితే, టీవీవీపీ ఆసుపత్రులైన హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి, మానకొండూర్లలో సౌకర్యాలు, మెషినరీ, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీవీవీపీ సిబ్బంది కరీంనగర్ జీజీహెచ్లో తిష్టవేయడంతో ఆయా ఆసుపత్రుల్లో కొరత ఏర్పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రసవాలు పెరిగే అవకాశం ఉంది. సౌకర్యాలు లేక.. జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో ప్రతినెలా సుమారు 650 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. ఇందులో 37 శాతం ప్రసవాలు సాధారణమే అవుతుండడం గమనార్హం. అయితే ఆసుపత్రిలో సౌకర్యాలపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. వేసవికాలం వచ్చిందంటే డెలివరీలు అయిన మహిళలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు ఉగ్గపట్టి ఏడుస్తుంటారు. ఏసీలు లేక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సొంతగా ఫ్యాన్లు తెచ్చిపెట్టుకున్న సందర్భాలున్నాయి. అద్దె గదుల్లోనూ అదే పరిస్థితి ఎంసీహెచ్లో 33 అద్దెగదులున్నాయి. డెలివరీలు అయిన తర్వాత రూ.500 అద్దెతో గదులు ఇస్తుంటా రు. వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అద్దెగదుల్లో కూడా ఫ్యాన్లు మాత్రమే ఉండడం ఇబ్బందికరంగా మారుతోంది. కనీసం అద్దె గదుల్లోనైనా ఏసీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. మరిన్ని అద్దెగదులు ఏర్పాటు చేసినా పోటీ తగ్గే పరిస్థితి లేదు. ఏసీలు ఏర్పాటు చేస్తే మాత్రం పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా ఉన్నతవర్గాలు, ఉద్యోగులు సైతం డెలివరీల కోసం ఎంసీహెచ్ గడపతొక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాతాశిశు ఆరోగ్య కేంద్రంఅన్ని సౌకర్యాలు కల్పిస్తాం ఎంసీహెచ్లో డెలివరీల కోసం వచ్చేవారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా ఇప్పటి వరకు రిపేర్లో ఉన్న ఏసీలన్నీ రిపేరు చేయించి వర్కింగ్ కండీషన్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం. మరో 30 కొత్త ఏసీలు వచ్చే అవకాశం ఉంది. అవి వస్తే వేసవిలో బాలింతలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. – డాక్టర్ వీరారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ జిల్లాలో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు..మొత్తం ప్రభుత్వాసుపత్రుల్లో.. ప్రైవేటు ఆసుపత్రుల్లో.. డెలివరీలు 11,367 7,589 3,778సాధారణ 2,944 2,345 599సిజేరియన్ 8,423 5,244 3,179నార్మల్ వైపు ఉన్నతవర్గాల చూపు ప్రైవేటు ఆసుపత్రులు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి, అవసరమైతే భయపెట్టి కేవలం డబ్బుల కోసమే సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలే కాకుండా, ఉన్నతవర్గాలు, ఉద్యోగుల కుటుంబాలు సైతం నార్మల్ డెలివరీలపై ఆసక్తితో ప్రభుత్వ ఆసుపత్రి బాట పడుతున్నారు. సాధారణ ప్రసవాలతో మహిళలు ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడం కూడా ఇందుకు కారణం. -
కబ్జాలపై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఇటీవల విలీనమైన చింతకుంట గ్రామంలోని శాంతినగర్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఎంఎ జమీల్ డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కి ఫిర్యాదు చేశారు. విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వ్యవహారంపై ‘సర్కారు భూములు మాయం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం రావడం తెలిసిందే. ఈ క్రమంలో శాంతినగర్ కాలనీలోని సర్వేనంబర్ 439లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కబ్జాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. -
కోల్మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుభాని
గోదావరిఖని: కోల్మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుభానిని నియమిస్తూ సింగరేణి సీఎండీ ఎన్.బలరాం సోమవా రం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కో ఆర్డినేషన్ జీఎంగా పనిచేస్తున్న సుభానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరుగురు జీఎంల బదిలీ గోదావరిఖని: సింగరేణి సంస్థలోని ఆరుగురు జీఎంలను బదిలీ చేస్తూ యాజమాన్యం సోమవారం ఆదేశాలు జారీచేసింది. శ్రీరాంపూర్ జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఆపరేషన్ డైరెక్టర్గా, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు ప్రాజెక్టు అండ్ప్లానింగ్ జీఎంగా నియామకం అయ్యారు. రెండు జీఎం పోస్టులు ఖాళీ కావడంతో వారిస్థానంలో కొత్తవారిని జీఎంలుగా నియమించారు. శ్రీరాంపూర్ జీఎంగా బెల్లంపల్లి జీఎంగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ను నియమించారు. ఏపీఏ జీఎంగా ఆర్జీ–3లో అడిషనల్జీఎంగా పనిచేస్తున్న కొలిపాక వెంకటేశ్వర్రావును నియమించారు. సీఎంసీ కార్పొరేట్ జీఎంగా పనిచేస్తున్న ఎం.విజయభాస్కర్రెడ్డిని బెల్లంపల్లి జీఎంగా, ఆర్ అండ్ డీ కార్పొరేట్లో పనిచేస్తున్న మేకల కనకయ్యను కొత్తగూడెం క్వాలిటీ జీఎంగా, మందమర్రి కేకే గ్రూప్ ఏవోగా పనిచేస్తున్న వి.రామదాసును కార్పొరేట్ బిజినెస్ డెవలప్మెంట్ జీఎంగా, ఓసీపీ–3 అధికారిగా పనిచేస్తున్న ఎస్.మధుసూదన్ను కార్పొరేట్ సీఎంసీ జీఎంగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలుజగిత్యాలజోన్: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సో మవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్ర కారం.. జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాలికపై అలిశెట్టి బాలకృష్ణ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం బాలకృష్ణకు 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
కాకతీయ కెనాల్లో దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం
తిమ్మాపూర్: మండలంలోని అల్గునూర్ శివారులోని కాకతీయ కెనాల్లో దూకి ఓ వివాహిత సోమవారం ఆత్మహత్యకు యత్నించింది. వెంట వచ్చిన భర్త ఆమెను కాపాడేందుకు కాలువలో దూకాడు. ఇద్దరూ కాలువలో కొట్టుకుపోతుండగా గమనించిన స్థానికులు వారి ప్రాణాలు కాపాడారు. ఎల్ఎండీ ఎస్ఐ వివేక్ తెలిపిన వివరాలు.... కరీంనగర్ కార్పొరేషన్ శ్రీనగర్ కాలనీకి చెందిన పెద్దాపురం శ్రావణి, భర్త లక్ష్మణ్తో గొడవ పడి ఇంట్లోనుంచి బయటకు వెళ్లింది. ఆమె వెంటే భర్త వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం కాకతీయ కెనాల్ వద్దకు చేరుకుని అందులో దూకింది. వెంటనే ఆమెను కాపాడేందుకు లక్ష్మణ్ కూడా కాలువలో దూకాడు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు గమనించి వెంటనే వారిని కాపాడారు. నీటి ప్రవాహంలో యువతి కొద్ది దూరం కొట్టుకుపోవడంతో అపస్మారకస్థితికి చేరుకుంది. సదరు యువతిని హుటాహుటినా హాస్పిటల్కు తరలించారు. శ్రావణి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రాణాలు కాపాడం.... కాలువ వద్ద జనాలు ఉండటం చూసి ఏం జరిగిందోనని చూస్తే మహిళ కెనాల్లో కొట్టుకుపోవడం కనిపిచింది. అందరూ కేకలు వేస్తున్నారు ఎవరూ కాపాడేందుకు ధైర్యం చేయడం లేదు. నేను వెంటనే కెనాల్లో దుకాను నన్ను చూసి మరో యువకుడు సైతం కాలువలో దూకుడు. ఇద్దరం కలిసి మహిళాను బయటకు తీసుకువచ్చాం. ప్రాణాలతో ఉందని తెలియగానే ఆనందం వేసింది. – రెడ్డవేణి లక్ష్మణ్ ప్రాణాలు తెగించి కాపాడిన ఇద్దరు వ్యక్తులు -
రాయితీ ట్రాక్టర్ల పేరిట మోసం
● రూ.26 లక్షలు కాజేసిన వైనం ● ముగ్గురు నిందితుల అరెస్టు పెగడపల్లి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఆరుగురు రైతులను రాయితీ టాక్టర్ల పేరిట మోసగించిన ముగ్గురు వ్యక్తులను పెగడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో సోమవారం మల్యాల సీఐ రవి, ఎస్సై రవికిరణ్తో కలిసి డీఎస్పీ రఘుచందర్ వివరాలు వెల్లడించారు. పెగడపల్లి మండలం బతికపల్లికి చెందిన మన్నె మల్లేశం, చింతకంది కిశోర్, మంచిర్యాలకు చెందిన కామెర చంద్రమౌళి ముఠాగా ఏర్పడ్డారు. ఇదే మండలం నందగిరి, బతికపల్లికి చెందిన ఆరుగురు రైతులకు న్యాప్స్ సంస్థ నుంచి 40 శాతం రాయితీపై ట్రాక్టర్లు ఇప్పిస్తామని రూ.36 లక్షలు వసూలు చేశారు. ఇందులోంచి గంగాధరలోని శ్రీవెంకటసాయి ఎంటర్ ప్రైజెస్ ట్రాక్టర్ షోరూం వారికి రూ.10 లక్షలు చెల్లించి ఆరు ట్రాక్టర్లు ఇప్పించారు. మిగిలిన రూ.26 లక్షలు పంచుకున్నారు. ట్రాక్టర్లకు నెలనెలా వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లిస్తామని రైతులకు తెలపకుండా.. రాయితీపై అని చెప్పి.. అగ్రిమెంట్ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. కొద్ది రోజుల తరువాత ట్రాక్టర్ షోరూం యాజమాన్యం కిస్తీల ప్రకారం డబ్బులు చెల్లించాలని రైతులపై ఒత్తిడి తెస్తోంది. దీంతో తాము మోసపోయిన విషయాన్ని గ్రహించిన రైతులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు విచారణ చేపట్టారు. మంచిర్యాలలో ఇదే తరహాలో నాప్స్ సంస్థ పేరుతో గతేడాది కామెర చంద్రమౌళి రైతులను మోసం చేయడంతో కేసు నమోదైనట్లు గుర్తించారు. రాయితీ ట్రాక్టర్ల పేరిట రైతులను మోసగించిన వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ట్రాక్టర్ షోరూం నిర్వాహకుల పాత్రపైనా విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన అనుప కనకయ్య(40) ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. కనకయ్య కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల పనులు దొరక్కపోవడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఆర్థిక సమస్యలు వెంటాడుతుండడంతో మానసికవేదనకు గురైన కనకయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికితోడు ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో చిన్నచిన్న గొడవలు జరగడంతో ఉరివేసుకున్నట్లు గ్రామస్తులు తెలి పారు. కనకయ్య మృతితో భార్య లక్ష్మి, కూతురు శ్రీలత, కుమారుడు నవీన్ రోడ్డునపడ్డారు. కారు, బైక్ ఢీ● దంపతులకు గాయాలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మొదటి బైపాస్రోడ్డుపై సోమవారం కారు, బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న దంపతులకు గాయాలయ్యాయి. ఇరు వాహనాలదారులు ఘర్షణకు దిగడంతో సంఘటన స్థలంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. ఇద్దరిని పోలీస్స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నదిలో దూకిన మహిళ యైటింక్లయిన్కాలనీ(రామగుండం): రామగిరి మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ(35) సోమవారం గోదావరినదిలో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సదరు మహిళ సా యంత్రం గోదావరి వంతెన వద్దకు చేరుకొంది. హఠాత్తుగా నదిలో దూకింది. లోనీరు లేకపోవడంతో ఇసుకలో పడితీవ్ర గాయాలపాలైంది. టూటౌ న్ బ్లూకోల్ట్స్ సిబ్బంది బాధితురాలిని వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సిం ఉందని పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిమానకొండూర్: రోడ్డు ప్రమాదంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థి సోమవారం మృతిచెందాడు. సీఐ లక్ష్మీనారాయణ వివరాలు.. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన రామంచ కిషన్కు కుమారుడు మణివర్దన్, కుమార్తె వైష్టవి సంతానం. మణివర్దన్ (18) హన్మకొండలోని కాకతీయ యూనివర్శిటీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని తన స్నేహితుడి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి తిరిగి జమ్మికుంట– మానకొండూర్ రహదారి వెంట వస్తుండగా, వెనకనుంచి ద్విచక్రవాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఈప్రమాదంలో మణివర్దన్కు తీవ్రగాయాలు కాగా కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రాజన్న భక్తుడికి ఫిట్స్వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఫిట్స్ వచ్చి ఆలయ ప్రాంగణంలో పడిపోయాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన లెంకల తిరుపతి కుటుంబ సభ్యులతో సోమవారం రాజన్న దర్శనానికి వచ్చాడు. ఆలయ ప్రాంగణంలో ఫిట్స్తో పడిపోగా.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
గురుకుల టీచర్ల సమస్యలు పరిష్కరిస్తా
● బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య కరీంనగర్టౌన్: రాష్ట్రంలో బీసీ రెసిడెన్షియల్ గురుకులాలు, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య తెలిపారు. ఆయా గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు, అధ్యాపకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపిస్తే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసేలా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యకు కేరాఫ్గా నిలిచిన గురుకులాల విద్యార్థులు సాధించిన విజయాల వెనుక ఉన్న ఉపాధ్యాయుల శ్రమను గుర్తించి ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తనను ఎమ్మెల్సీగా మండలికి పంపితే.. ఉపాధ్యాయులకు బోధనేతర పనుల భారం తగ్గించి స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించేలా ప్రభుత్వంతో పోరాటం చేస్తానని, రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేస్తున్న వారికి కనీస వేతనాల అమలుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ పాలకుర్తి(రామగుండం): పుట్నూర్, కుక్కలగూడూర్ గ్రామ శివారుల్లోని రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఆదివారం రాత్రి చోరీ చేశారు. 25 కేవీ సామర్థ్యం కలిగిన రెండు ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్వైర్ను దొంగలు అపహరించారు. -
మూతపడుతున్న సొసైటీ ‘బంక్’లు
● రిటైల్ బంక్లతో పోటీ పడలేక చతికిల ● కొనుగోలు, అమ్మకం ధరల్లో వ్యత్యాసం ● భారీ నష్టాలు మూటగట్టుకుంటున్న వైనం జగిత్యాలఅగ్రికల్చర్: ప్రాథమిక సహకార సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న డీజిల్, పెట్రోల్ బంక్లు ఆయా ఆయిల్ కంపెనీల రిటైల్ బంక్లతో పోటీ పడలేకపోతున్నాయి. సొసైటీ బంక్ల్లో సరైన నిర్వహణ లేక, నష్టాలబాట పడుతున్నాయి. రకరకాల కారణాలతో కొన్ని సొసైటీ బంక్లు మూతపడుతున్నాయి. దీంతో, సహకార బంక్లన్నింటినీ రిటేల్ బంక్ విధానంలోకి మార్చుతున్నారు. ● సొసైటీల పరిధిలో 9 బంక్లు జగిత్యాల జిల్లాలో 51 సొసైటీలు ఉండగా, అందులో 9 సొసైటీలు బంక్లను నిర్వహిస్తున్నాయి. రాయికల్, బీర్పూర్, నంచర్ల, యామాపూర్, సిర్పూర్, జగిత్యాల, భూషణ్రావుపేట, జైనా, పైడిమడుగు గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్లు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సగటున ఏడాదికి 10.55 లక్షల లీటర్ల పెట్రోల్, 21.64 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు సాగించాయి. అయితే, జగిత్యాల, యామాపూర్ పెట్రోల్ బంక్లు మూతపడగా, పైడిమడుగు బంక్ ఇంకా ప్రారంభం కాలేదు. మిగతా ఆరు బంక్లు లాభ, నష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. ● రెండురకాలుగా అమ్మకాలు కేంద్ర ప్రభుత్వం రెండురకాలుగా పెట్రోల్, డీజిల్ అమ్మకాలు చేస్తుంది. రిటైల్ పంప్స్ పద్ధతిలో.. హెచ్పీ, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తమ ఏజెన్సీల ద్వారా పెట్రోల్, డీజిల్ విక్రయిస్తుంటాయి. కన్సూమర్ పద్ధతిలో.. ప్రాథమిక సహకార సంఘాలు, జైళ్లు, పోలీస్ శాఖ నిర్వహించే బంక్లు, పరస్పర సహకార సంఘంగా ఏర్పడి నిర్వహించే బంక్లు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తుంటాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఆయిల్ కంపెనీలు కన్సూమర్ బంకులకు టాక్స్ మినహాయించుకుని గతంలో కొంత తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ విక్రయించేవి. దీంతో సొసైటీ పరిధిలోని కన్సూమర్ బంకులు రూపాయి, అర్థ రూపాయి లాభం చూసుకుని, రిటైల్ పెట్రోల్ బంక్ల కంటే తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ అందించి సామాన్య ప్రజల మన్ననలు పొందేవి. ● కన్సూమర్ నుంచి రిటేల్ వైపు.. ఆయిల్ కంపెనీల నూతన విధానంతో డీజిల్, పెట్రోల్ కొనుగోలు, అమ్మకం ధరల మధ్య భారీ వ్యత్యాసం మొదలైంది. సెప్టెంబర్ 30, 2021కు ముందు కొనుగోలు రేటు, అమ్మకం రేటు మధ్య వ్యత్యాసం రూ.1–2 మాత్రమే ఉండేది. దీంతో సొసైటీలకు కొంత లాభం వచ్చేది. రిటైల్ బంక్లో ఏజెన్సీలకు కమీషన్ ఇస్తారు కానీ కన్సూమర్ బంకుల్లో కమీషన్ ఉండదు. కేవలం కొనుగోలు, అమ్మకం మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే లాభంగా తీసుకుంటారు. దీంతో రిటైల్ బంక్ల కంటే అర్ధ రూపాయి, రూపాయి తక్కువ ధరకు సొసైటీ బంక్లో పెట్రోల్, డీజిల్ పోయించుకునేవారు. ఇప్పుడు, రేటు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం, కమీషన్ రాకపోవడం వంటి కారణాలతో కన్సూమర్ పద్ధతిలో ఉన్న సొసైటీ బంక్లన్నీ రిటేల్ బంక్లవైపు దృష్టి పెట్టాయి. ఇప్పుడు అన్ని బంక్ల్లోనూ రేటు ఒకేలా ఉండటంతో జనాలు సొసైటీ బంక్లవైపు మళ్లడం లేదు. దీంతో, బంక్ల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. ● రూ.కోట్లలో పెట్టుబడి డీజిల్, పెట్రోల్ బంక్ల ఏర్పాటుకు ఒక్కో సొసైటీ రూ.కోట్లలో పెట్టుబడి పెడుతుంది. స్థలం కొనుగోలు చేయడానికే కనీసం రూ.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. బంక్ సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, నిర్వహణకే నెలకు కనీసం రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. వీటివల్ల ఏదో లాభం వస్తుందనుకుంటే, నష్టాల పాలవడాన్ని సంఘ సీఈవోలు, చైర్మన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో డీజిల్ రేట్ల ధరల వ్యత్యాసంతో ఇప్పటికే ఒక్కో సొసైటీ రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల నష్టాలను మూటగట్టుకుంది.నష్టపోకుండా ఉండేందుకే.. సొసైటీ బంక్ ద్వారా నష్టపోవాల్సి వస్తుంది. ధరల్లో వ్యత్యాసంతో కొద్ది నెలలుగా మా సొసైటీ పరిధిలోని డీజిల్ బంక్ను మూసేశాం. ఇప్పటివరకు కన్సూమర్ పద్ధతిలో ఉన్న బంక్ను రిటేల్ వైపు మార్చుతున్నాం. నేషనల్ హైవే రోడ్డు సమస్యతో కూడా తెరవడం ఇబ్బందిగా మారింది. – పత్తిరెడ్డి మహిపాల్రెడ్డి, సంఘం చైర్మన్, జగిత్యాల చమురు సంస్థల నిబంధనలతో.. చమురు సంస్థలు మార్చిన నిబంధనలతో భారీ వ్యత్యాసం వల్ల బంక్లు ఏర్పాటు చేసిన సొసైటీలు నష్టపోవాల్సి వస్తుంది. ఎక్కువ ధరకు డీజల్, పెట్రోల్ కొని తక్కువ ధరకు సరఫరా చేయడం సాధ్యం కాదు. కాబట్టి సొసైటీ పరిధిలోని బంక్లన్నీ రిటేల్ వైపు మళ్లుతున్నాయి. – సీహెచ్.మనోజ్కుమార్, జిల్లా సహకార అధికారి, జగిత్యాల -
కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో.. ఊడుతుందో..
కరీంనగర్టౌన్: రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం కరీంనగర్లోని కొండా సత్యలక్ష్మీగార్డెన్లో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లోని బీజేపీ మండలాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి ఒక్క తప్పు చేయాలని అంటే ఐఏఎస్లు మూడు తప్పులు చేస్తున్నారని వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. సీఎంగా ఉంటూ అవినీతిని, తప్పులను నిరోధించాల్సింది పోయి తప్పులు చేయాలని చెప్పడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రే అవినీతి, తప్పులు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్లయిందన్నారు. రాష్ట్రంలో మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చిందన్నారు. కొందరు మంత్రులు సొంత దుకాణాలు ఓపెన్ చేసి ప్రతి పనికీ 15 శాతం చొప్పున కమీషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుస్థానాల్లో బీజేపీ గెలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకక బయటనుంచి అద్దెకు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. కులగణన పేరుతో కాంగ్రెస్ పార్టీ కొరివితో తలగొక్కోంటోందన్నారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీలు రఘునందన్రావు, జి.నగేశ్, ఎమ్మెల్యేలు కాటేపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్.ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, బొడిగె శోభ, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్లను తప్పు చేయాలని ముఖ్యమంత్రే అంటారా? మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ -
చింతచెట్టు పైనుంచి జారి పడి వ్యక్తి మృతి
వెల్గటూర్: చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన ఎండపల్లి మండలం శానబండలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి లచ్చయ్య (48) చింతకాయలు తెంపేందుకు చెగ్యాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఆదివారం కూలీ పనులకు వెళ్లాడు. చెట్టు పైకి ఎక్కి కాయలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం స్థానికులు వెంటనే కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందాడు. లచ్చయ్య భార్య భాగ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. వేములవాడఅర్బన్: వేములవాడ మండలం శాభాష్పల్లికి చెందిన కట్కూరి కవిత (38) చికిత్స పొందుతూ మృతిచెందింది. వారం రోజుల క్రితం శాభాష్పల్లి నుంచి 10 మంది మహిళలు బోయినపల్లి మండలం కొదురుపాకలోని బ్యాంక్కు ఆటోలో వెళ్తుండగా సంకెపల్లి వద్ద కరీంనగర్ – సిరిసిల్ల ప్రధాన రహదారిపై ఆటోబోల్తా పడింది. ఆటోలో ఉన్న 10 మందికి, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. తీవ్రగాయాలైన కవిత హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
కష్టపడే అధికారులకే ఉజ్వల భవిష్యత్
● సింగరేణి సీఎండీ ఎన్.బలరాం గోదావరిఖని: సింగరేణి ఉన్నతికి అహర్నిశలు శ్రమించేవారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతీ విభాగ అధిపతి వచ్చే పదేళ్లకు సరిపడా భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేయాలని సంస్థ సీఎండీ ఎన్.బలారం సూచించారు. సోమవారం అన్ని ఏరియాల జీఎంలు, ప్రాజెక్టు అధికారులు, ఏజెంట్లతో విడివిడిగా సమావేశమైయ్యారు. లక్ష్య సాధనలో ఉద్యోగులను భాగస్వాములను చేయాలన్నారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారికి స్థానం ఉండదని స్పష్టం చేశారు. ఏరియాలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి గురించి అడిగి తెలుసుకొని రానున్న 43 రోజుల్లో మిగిలిన లక్ష్యాలను సాధించాలన్నారు. రోజూ 2.60లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి వార్షిక లక్ష్యాలు సాధించడానికి రోజూ 2.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగాలని బలరాం సూచించారు అలాగే 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని తెలిపారు. రక్షణ, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదే సమయంలో రవాణా విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నూతన గనుల విషయంలో అపరిష్కృతంగా ఉన్న భూ సేకరణ, పర్యావరణ అనుమతులపై త్వరితగతిన వచ్చేలా చూడాలని కార్పొరేట్జీఎంలను ఆదేశించారు. కార్మికుల్లో నైపుణ్యం పెంపుదల, గనుల్లో మ్యాన్ రైడింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, గైర్హాజర్ నివారించేలా కౌన్సిలింగ్ నిర్వహించాలను తద్వార ఉత్పత్తి పెంచే వీలుంటుందని అన్నారు. మస్టర్ పడి బయటకు వెళ్లేవారిపై చర్యలు మస్టర్ పడి బయటకు వెళ్లే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం ఆదేశించారు. అలాగే ప్రతీ ఉద్యోగి విధులకు సకాలంలో వచ్చేలా చూడాలని, గ్రేస్ టైమ్ వరకు మస్టర్ నమోదుకు అనుమతించొద్దన్నారు. సమావేశంలో డైరెక్టర్లు డి.సత్యనారాయణ(ఈ అండ్ ఎం), ఎల్వీ.సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వేంకటేశ్వర్లు (పీఅండ్ పీ), అడ్వైజర్(ఫారెస్ట్రీ) మోహన్పర్గేన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్డీఎం. సుభానీ, జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(మార్కెటింగ్) డి.రవిప్రసాద్ పాల్గొన్నారు. -
కోల్మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుభాని
గోదావరిఖని: కోల్మూమెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సుభానిని నియమిస్తూ సింగరేణి సీఎండీ ఎన్.బలరాం సోమవా రం ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు కో ఆర్డినేషన్ జీఎంగా పనిచేస్తున్న సుభానికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరుగురు జీఎంల బదిలీ గోదావరిఖని: సింగరేణి సంస్థలోని ఆరుగురు జీఎంలను బదిలీ చేస్తూ యాజమాన్యం సోమవారం ఆదేశాలు జారీచేసింది. శ్రీరాంపూర్ జీఎం ఎల్వీ సూర్యనారాయణ ఆపరేషన్ డైరెక్టర్గా, ఏపీఏ జీఎం వెంకటేశ్వర్లు ప్రాజెక్టు అండ్ప్లానింగ్ జీఎంగా నియామకం అయ్యారు. రెండు జీఎం పోస్టులు ఖాళీ కావడంతో వారిస్థానంలో కొత్తవారిని జీఎంలుగా నియమించారు. శ్రీరాంపూర్ జీఎంగా బెల్లంపల్లి జీఎంగా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్ను నియమించారు. ఏపీఏ జీఎంగా ఆర్జీ–3లో అడిషనల్జీఎంగా పనిచేస్తున్న కొలిపాక వెంకటేశ్వర్రావును నియమించారు. సీఎంసీ కార్పొరేట్ జీఎంగా పనిచేస్తున్న ఎం.విజయభాస్కర్రెడ్డిని బెల్లంపల్లి జీఎంగా, ఆర్ అండ్ డీ కార్పొరేట్లో పనిచేస్తున్న మేకల కనకయ్యను కొత్తగూడెం క్వాలిటీ జీఎంగా, మందమర్రి కేకే గ్రూప్ ఏవోగా పనిచేస్తున్న వి.రామదాసును కార్పొరేట్ బిజినెస్ డెవలప్మెంట్ జీఎంగా, ఓసీపీ–3 అధికారిగా పనిచేస్తున్న ఎస్.మధుసూదన్ను కార్పొరేట్ సీఎంసీ జీఎంగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలుజగిత్యాలజోన్: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సో మవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్ర కారం.. జగిత్యాల రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన బాలికపై అలిశెట్టి బాలకృష్ణ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం బాలకృష్ణకు 45 రోజుల జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబా ద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్లో సోమవారం జరి గిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తిమ్మాపూర్కు చెందిన సోహెల్(26) బతుకుదెరువు కోసం బ హ్రెయిన్ వెళ్లి రెండు రోజుల క్రితమే సొంతూరుకు వచ్చాడు. సోహెల్ను కలిసేందుకు సమీప బంధు వు, జగిత్యాల జిల్లా యూసుఫ్నగర్కు చెందిన మ హమ్మద్ సుమేర్ (21) ద్విచక్రవాహనంపై తిమ్మాపూర్ వచ్చాడు. ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా మార్గంమధ్యలో విద్యుత్స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. భీమ్గల్ సీఐ సత్యనారాయణ, మోర్తా డ్ ఎస్సై విక్రమ్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భార్య, కూతురును చూడకుండానే మృత్యువాత సోహెల్ భార్య ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో త ల్లి వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే కూతురు మొదటి పుట్టినరోజు జరిగింది. రెండు రోజుల క్రితం బహ్రెయిన్ నుంచి వచ్చిన సోహెల్.. భార్య, కూతురును త్వరలోనే ఇంటికి తీసుకెళ్లాలనుకున్నాడు. వారిని చూడకుండానే రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్ సిరిసిల్ల
సిరిసిల్ల: రాష్ట్రస్థాయి కుంగ్ఫూ పోటీల్లో రాజన్నసిరిసిల్ల జట్టు చాంపియన్గా నిలిచింది. జిల్లా కేంద్రంలోని సాయికృష్ణ ఫంక్షన్హాల్లో సోమవారం రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ కరాటే పోటీలు ముగిశాయి. రాష్ట్రంలోని 12 జిల్లాలకు చెందిన కరాటే ఆల్ స్టైయిల్ కుంగ్ఫూ క్రీడాకారులు పాల్గొన్నారు. అన్ని విభాగాల్లో 286 ఈవెంట్లతో రాజన్నసిరిసిల్ల జిల్లా చాంపియన్షిప్ దక్కించుకుంది. 96 ఈవెంట్లతో కరీంనగర్ జిల్లా ద్వితీయ, 84 ఈవెంట్లతో మంచిర్యాల జిల్లా మూడో స్థానంలో నిలిచాయి. బ్లాక్బెల్ట్ విభాగంలో బాలుర బాలికల స్పారింగ్లో బ్రౌన్, బ్లాక్బెల్ట్ గ్రాండ్ ఛాంపియన్షిప్ బాలుర విభాగంలో మంచిర్యాల జిల్లా విద్యార్థి శ్రీకాంత్, బాలికల బ్రౌన్ మరియు బ్లాక్ బెల్ట్ గ్రాండ్ చాంపియన్షిప్ స్పారింగ్లో మంచిర్యాల జిల్లా విద్యార్థిని సౌమ్య గ్రాండ్ చాంపియన్షిప్ గెలుపొందారు. మాస్టర్ రాజేశం, హెల్పింగ్ హార్ట్స్ స్వచ్ఛందసంస్థ ఫౌండర్ కనుకుంట్ల పున్నంచందర్, పండ్రాల లింగమూర్తి, కరాటే మాస్టర్ వడ్నాల శ్రీనివాస్, సీనియర్ మాస్టర్ రాజమల్లు, శ్రీధర్, సదానందం, అక్కనపెల్లి వినోద్, విక్రమ్, బొల్లోజి శ్రీనివాస్, స్వప్న, వొడ్నాల అన్నపూర్ణ, ప్రియాంక, నివేదిత వేణు, ప్రవళిక, కనకప్రసాద్, రాకేశ్ పాల్గొన్నారు. రెండో స్థానంలో కరీంనగర్ సిరిసిల్లలో ముగిసిన కరాటే పోటీలు.. -
‘చెప్పు’కోలేని బాధలు..
సైదాపూర్ (హుజూరాబాద్): యూరియా తదితర ఎరువుల కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. ప్రస్తుతం యాసంగి నేపథ్యంలో ఉదయం 7 నుంచి 8 గంటల సమయంలో ఎరువులు తీసుకెళ్తుంటారు. కానీ ఆ సమయంలో గేటు తీయకపోవడంతో.. గోడపై నుంచి లోపలికి దూకి చెప్పులను క్యూలో పెట్టారు. గోడపై ఉదయం 10 గంటల వరకు కూర్చుని నిరీక్షించారు. అధికారులు ఎరువుల కొరత తీర్చాలని అన్నదాతలు కోరుతున్నారు.పంటలు తడారి.. పొలాలు ఎడారిరాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని పలు గ్రామాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంటలు ఎండిపోతున్నాయి. వరినాట్లు వేసిన రైతులు పంట పొలాలకు నీరు సరిపోకపోవడంతో ఎండుతున్న పొలాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పంట పొలాల్లో గొర్రెలను మేపుతున్నారు. మండల కేంద్రానికి చెందిన కాకల్ల ఎల్లయ్య, గొల్లపల్లి శ్రీనులు తమకున్న భూమిలో ఒక్కొక్కరు మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు వరి సాగు చేశారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం.. వారం రోజులుగా ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పొలాలకు నీరు అందడం లేదు. దీంతో ఎండిపోయిన వరి పొలంలో మూగజీవాలను తోలి మేపుతున్నారు. వర్ణాల పొద్దుఉదయాస్తమయాలు ఎప్పుడూ మనోహరమే. ప్రకృతి ప్రేమికులకు పరవశమే. పగలంతా వెలుగులు నింపే భానుడు.. సాయం సంధ్య వేళ కాషాయరంగులో నిష్క్రమించడం అద్భుతమే. పెద్దపల్లి శివారులో సూర్యాస్తమయమిది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి స్కానర్ కొట్టు.. కల్లు పట్టు మారుతున్న కాలానికి అనుగుణంగా మారితేనే మనుగడ సాధ్యం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందిన గీత కార్మికుడు గంగపురపు వెంకన్న ఇందుకు నిదర్శనం. వెంకన్న వద్దకు కల్లు తాగడానికి వచ్చే వారిలో ఎక్కువ మందికి స్మార్ట్ ఫోన్ ఉంది. వెంకన్న వద్ద స్మార్ట్ ఫోన్ లేకపోవడంతో చెల్లింపులకు ఇబ్బంది ఏర్పడి.. గిరాకీ దెబ్బ తింది. దీంతో చేసేదిలేక వెంకన్న ఇటీవల తన బ్యాంక్ ఖాతాపై క్యూఆర్ కోడ్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కల్లు ప్రియులంతా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి.. డబ్బు చెల్లించి కల్లు తాగుతున్నారు. – కేసముద్రంయక్షగాన కళాకారుల భిక్షాటన టీవీలు, స్మార్ట్ ఫోన్ల రాకతో వీధి నాటకాలు అంతరించి పోయాయి. నేటి తరానికి యక్షగానం అంటే తెలియని పరిస్థితి ఏర్పడింది. ఆదరణ లేక యక్షగాన కళాకారులు.. బతుకు కోసం భువనగిరిలో భిక్షాటన చేస్తూ కనిపించారు. – భువనగిరి టౌన్చదవండి: ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరుగుమ్మి.. జ్ఞాపకాలు విరజిమ్మి గ్యాస్ పొయ్యిలు వచ్చాక కట్టెల పొయ్యిల్ని మరిచిపోయారు. కానీ ఒకప్పుడు కట్టెల పొయ్యి వెలిగించి వంట చేయాలంటే.. కంకిబెండ్లు, పిడకలు, కట్టెలు.. సేకరించి.. ఇలా గుమ్మిలో దాచుకోవలసిందే. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనుకుల గ్రామ శివారులోని ఓ ఇంట్లోని గుమ్మిలో దాచిన కంకిబెండ్లు పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేశాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్: కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..మేధావులారా.. బాకీల సర్కార్ను బండకేసి బాదండి’ అంటూ బీజేపీ కేంద్రమంత్రి బండిసంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది.కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..నిరుద్యోగులకు 56 వేల నిరుద్యోగ భృతి.2 లక్షల ఉద్యోగాల బాకీ.. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ. ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ. ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ. మేధావులారా..బాకీల సర్కార్ను బండకేసి బాదండి.మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీదే. బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?’ అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. -
బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. చికెన్ సేల్స్ ఢమాల్
జగిత్యాల: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చికెన్ అమ్మకాలు భారీగా తగ్గాయి. చికెన్ సెంటర్లు గిరాకీ లేక వెలవెలబోతున్నాయి. కోళ్లకు బర్డ్ఫ్లూ వ్యాపిస్తోందని, చికెన్ తినొద్దని ఇటీవల ప్రభుత్వం నుంచి ప్రకటన రావడంతో కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్తోపాటు, కొన్ని జిల్లాలో బర్డ్ఫ్లూ కేసులు నమోదు కావడంతో ఉమ్మడి జిల్లాలో భయాందోళనకు గురవుతున్నారు. ఎక్కువగా ఉడికించిన చికెన్ తింటే వైరస్ ఉండదని అధికారులు చెబుతున్నా వైరస్ వ్యాపిస్తోందని సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ కావడంతో ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు పడిపోయినా రేటు మాత్రం తగ్గడం లేదు. ఉమ్మడి జిల్లాలో ప్రతి చికెన్ సెంటర్లో సగానికిపై విక్రయాలు తగ్గిపోయాయి.అసలే పెళ్లిళ్ల సీజన్ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం మంచి రోజులు కావడంతో రెండునెలలపాటు శుభకార్యాలు అధికంగా ఉన్నాయి. శుభకార్యాల్లో చికెన్ తప్పనిసరి. ఈ క్రమంలో బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో వివాహాల్లో చికెన్ వడ్డించాలా..? వద్ద సంశయంలో ప్రజలు ఉన్నారు. చాలా మంది చికెన్ తినాలంటే జంకుతుండటంతో మటన్, ఫిష్, ఎగ్స్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. చికెన్కు కొంత తక్కువ ధర ఉండటంతో చాలామంది దీనివైపే దృష్టి సారిస్తుంటారు. ప్రభుత్వ హాస్టళ్లు, వైద్య కళాశాల హాస్టళ్లలో చికెన్ నిలిపివేస్తున్నారు. మటన్, చేపలకు రేటు ఎక్కువగా ఉండటంతో అది కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది.తగ్గని రేటుచికెన్ విక్రయాలు పడిపోయినా ధరలు మాత్రం తగ్గడం లేదు. చికెన్ రేటు కిలోకు రూ.200 కిలో పలుకుతోంది. మరికొందరు కిలోకు రూ.180 నుంచి రూ.160వరకు విక్రయిస్తున్నారు. మరిన్ని రోజులు బర్డ్ఫ్లూ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్ కాకుండా గుడ్ల విక్రయాలు కూడా సగానికి పడిపోయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడ బర్డ్ఫ్లూ కేసులు నమోదు కాలేదని పశుసంవర్దక శాఖ అధికారులు పేర్కొంటున్నా ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు పశువైద్యాధికారులు పౌల్ట్రీలపై దృష్టి పెట్టామని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. కానీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు పోవడం లేదు. దుకాణాల అద్దె, వర్కర్స్కు జీతాలు, విద్యుత్ బిల్స్, కోళ్ల క్రయవిక్రయాల్లో పెట్టిన పెట్టుబడి రాక ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీల వద్ద కోళ్లను కొనుగోలు చేయకుండా ఉన్న కోళ్లను విక్రయించేలా చికెన్ సెంటర్ల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ కంపెనీల వద్ద నుంచి కోళ్లను కొనుగోలు చేసినా సేల్స్ లేకపోవడంతో అధిక నష్టం వచ్చే అవకాశం ఉండటంతో చికెన్ సెంటర్ల నిర్వాహకులు భయాందోళన చెందుతున్నారు. -
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్రెడ్డి పాస్పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్కు, థాయ్లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్ను సంపాదించిన మధుకర్రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
టార్గెట్ రూ.40 కోట్లు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ఈ ఆర్థిక సంవత్సరం రూ.40 కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు ల క్ష్యంగా పెట్టుకుంది. మరో 45 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండగా, ఇప్పటివరకు కేవలం 58 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మరో 45 రోజుల్లో 42 శాతం వసూలు చేస్తేనే వందశాతం లక్ష్యం చేరే అవకాశం ఉంది. నగరపాలకసంస్థకు ప్రధాన ఆదాయ వనరైన ఆస్తిపన్ను వసూళ్లను అధికారులు వేగవంతం చేశారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు రూ.40 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు చేయాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఈ లక్ష్యాన్ని చేరేందుకు అధికారులు రోజూవారి సమీక్షలతో వేగం పెంచుతున్నారు. ఇప్పటివరకు 58శాతం నగరంలోని 60 డివిజన్ల పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లు చేపట్టారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన వార్డు అధికారులకు ఆస్తిపన్ను వసూళ్ల బాధ్యతలను పూర్తిగా అప్పగించారు. గతంలో పన్ను వసూళ్లు బిల్కలెక్టర్లు చేస్తుండగా, ఈ సారి మాత్రం వార్డు అధికారులపై బాధ్యత పెట్టారు. అంతేకాకుండా వారికి ప్రత్యేక డివైస్లు అప్పగించారు. తమకు అప్పగించిన డివైస్ ద్వారా ఆయా డివిజన్లలో తిరుగుతూ, వార్డు అధికారులు పన్ను వసూలు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఆస్తి పన్ను 58 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. సుమారు రూ.40 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, సగం మాత్రమే పూర్తవడంతో వంద శాతం లక్ష్యం చేరడం కష్టతరంగా మారింది. 45 రోజుల్లో 42 శాతం ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం మరో 45 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువులోగా ఆస్తి పన్ను వసూళ్లు వంద శాతం చేరేందుకు వార్డు అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నా, కాస్త కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 58 శాతం వసూళ్లు పూర్తి కాగా, 45 రోజుల్లో మరో 42 శాతం పూర్తి కావడం గగనంగానే ఉంది. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ మొండి బకాయిదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అంతగా ఫలించినట్లు కనిపించడం లేదు. ఏదేమైనా రూ.40 కోట్ల ఆస్తి పన్ను లక్ష్యం చేరేందుకు బల్దియా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి. బల్దియా ఆస్తి పన్ను వసూళ్లు ఇప్పటివరకు 58 శాతం పూర్తి -
బతుకు భారమై..
అప్పులు చెల్లించలేక..జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ల లింగన్నకు తోకల లక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. లింగన్న వ్యవసాయం, లక్ష్మీ బీడీలు చేసేవారు. లింగన్నకున్న మూడెకరాల్లో పసుపు, మొక్కజొన్న, సజ్జ, వరి పండించాడు. దిగుబడి సరిగా రాక రూ.16 లక్షలు అప్పు చేశాడు. అది వడ్డీతో కలిపి రూ.20 లక్షల వరకు అయ్యింది. ఈ సీజన్లో పసుపు రెండెకరాల్లో వేయగా దుంపకుళ్లు రోగం వచ్చింది. దీనికితోడు బ్యాంకులో తీసుకున్న రుణం రూ.2లక్షలు మాఫీ కాలేదు. రైతు భరోసా సమయానికి అందలేదు. ఆ ఆవేదనతో లింగన్న ఈ ఏడాది జనవరి 14న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ 20వ తేదీన మృతిచెందాడు. లింగన్న కొడుకు హర్షవర్దన్ 8వ తరగతి, కూతురు నైనిక 2వ తరగతి చదువుతున్నారు. పెంకుటింట్లో నివసిస్తూ, బీడీలు చుడుతూ లక్ష్మి ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. ఉన్న మూడెకరాలు అమ్మినా.. తన భర్త చేసిన అప్పులు తీరవని ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మి. -
● విలీన గ్రామాల్లో అన్యాక్రాంతం ● పెరిగిపోతున్న ఆక్రమణలు ● హద్దులు జరిపి నిర్మాణాలు
సర్కారు భూములు మాయంకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం అవుతున్నాయి. పల్లెలు పట్టణాలుగా మారిన క్రమంలో భూముల ధరలకు రెక్కలొస్తుండగా, ఇదే అదనుగా కొంతమంది ప్రభు త్వ స్థలాల్లోనే అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. నగరపాలకసంస్థలో ఇటీవల చింతకుంట, మల్కాపూర్, లక్ష్మిపూర్, గోపాల్పూర్, దుర్శేడ్ గ్రామాలతో పాటు కొత్తపల్లి మున్సిపాలిటీ విలీనం కావడం తెలిసిందే. విలీనం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన వెంటనే, నగరపాలకసంస్థ పూర్తిస్థాయిలో గ్రామాల్లో పాలనాపరమైన బాధ్యతలు తీసుకునే పని చేపట్టింది. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, ఇళ్ల వివరాలు సేకరిస్తోంది. ఈ సందర్భంలోనే పల్లెల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కొంతమంది తమ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోకి హద్దులు జరుపుతుండగా, మరికొంతమంది ఏకంగా ప్రభుత్వ భూముల్లోనే ఇంటినంబర్లతో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. చింతకుంట విలీన గ్రామంలోని 439 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నంబర్లో గతంలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడంతో, దీన్ని అవకాశంగా తీసుకొని పలువురు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తాజాగా నగరపాలకసంస్థగా మారడంతో కబ్జాలు వేగం పుంజుకుంటున్నాయి. అలాగే గత విలీన గ్రామమైన అలుగునూరులోనూ భూ ఆక్రమణలు కొనసాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభు త్వ భూమి సర్వేనంబర్ 436లో కొంతమంది అక్రమంగా భవన నిర్మాణం చేపట్టారంటూ అంబేడ్కర్ యువజనసంఘం ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ప్రభు త్వ భూమి లో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా విలీన ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్ర భుత్వ భూములు కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు స్వయంగా, ఫోన్లో ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. -
కాంగ్రెస్కు ఓట్లడిగే హక్కు లేదు
కరీంనగర్టౌన్: టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఓట్లడిగేందుకు కాంగ్రెస్ పార్టీకి అర్హతే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో ఆదివారం జరిగిన కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ... టీచర్లు, గ్రాడ్యుయేట్ల పక్షాన ఎన్నడైనా పోరాటాలు చేశారా అని ప్రశించారు. 317 జీవోకు వ్యతిరేకంగా ఎన్నడైనా కేసీ ఆర్ సర్కార్ తో కొట్లాడారా అని అన్నారు. గ్రూ ప్–1 సహా నిరుద్యోగుల పక్షాన ఎన్నడైనా జైలుకు వెళ్లారా? అని, కాంగ్రెస్ అభ్యర్థులకు ఎందుకు ఓట్లేయాలన్నారు. టీచర్లు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం కొట్లాడింది, జైలుకు వెళ్లింది, లాఠీదెబ్బలు తిన్న చరిత్ర బీజేపీదే అని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అనేక మంది బీజేపీ కార్యకర్తలపై నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పా టు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పలు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. నిరుద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేసిన చరిత్ర బీజేపీదే అన్నారు. గ్రూప్–1 ఉద్యోగుల పక్షాన కేంద్రమంత్రిగా ఉంటూ మద్దతు తెలిపి పోరాటం చేశానని స్పష్టం చేశారు. తాను 317 జీవోను సవరించాల ని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుంటే తన ఆఫీస్ గేట్లను గ్యాస్ కట్టర్ల్లతో పోలీసులు కత్తిరించి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని గుర్తుచశారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించి బీజే పీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్వీఎస్ ప్రభాకర్, మాజీ మేయర్ సునీల్రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప తదితరులు పాల్గొన్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ల పక్షాన ఒక్కనాడైనా పోరాటాలు చేశారా? కమీషన్లు, కుట్రలు తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమిటి? ఎమ్మెల్సీ నియోజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలతో కేంద్రమంత్రి సంజయ్ -
మరోమారు కుటుంబ సర్వే
● ఈ నెల 28 వరకు నిర్వహణ ● మూడు పద్ధతుల్లో అవకాశం ● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ అర్బన్: తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేలో వివిధ కారణాలతో పాల్గొనని వారి కోసం తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని కలెక్టర్ పమేలా సత్పతి ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే కొనసాగనుందని తెలిపారు. ఈ సర్వేలో మూడు విధాలుగా వివరాల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉండడం, వివిధ కారణాలతో వివరాలు ఇవ్వని వాళ్లు మాత్రమే ఈ సర్వేను వినియోగించుకోవాలని తెలిపారు. ఇంతకుముందు సర్వేలో పాల్గొనని వారు నేరుగా ప్రజా పాలన సేవ కేంద్రాల్లోనూ సంప్రదించవచ్చని, పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కార్యాలయాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎంపీడీవో కార్యాలయాలలో ఈ ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు . అక్కడి సిబ్బంది వివరాలను సేకరించి సర్వేలో నమో దు చేస్తారని తెలిపారు. ఆన్లైన్ నుంచి సర్వే ఫారం డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ఆ ఫారాన్ని నేరుగా ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వొచ్చని తెలిపారు. https:// seeepcsurvey. cgg. gov. in లాగిన్ ద్వారా సర్వే ఫారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. మూడు పద్ధతుల ద్వారా ఇదివరకు వివిధ కారణాల వల్ల సర్వేలో నమోదు కాని వారు రీ సర్వేలో పాల్గొనాలని కలెక్టర్ వెల్లడించారు. -
33.0/20.0
7గరిష్టం/కనిష్టం‘తూర్పున’ పెద్దపులి మంథని పరిధిలో పెద్దపులి సంచరిస్తోందన్న విషయం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. 8లోuవాతావరణం జిల్లాలో నేడు వాతావరణం సాధారణంగా ఉంటుంది. రాత్రిపూట చలి తీవ్రత కొనసాగుతుంది. మంచు కురుస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.చికెన్ ఢమాల్ బర్డ్ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో ఆదివారం చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. పలు దుకాణాలు గిరాకీ లేక వెలవెలబోయాయి. 8లోu -
కవిత్వం మానవతా విలువలు తెలియజేస్తుంది
కరీంనగర్ కల్చరల్: కలల లోగిలిలోని కవితలు మానవ సంబంధాలు, మానవతా విలువలను పెంపొందించే విధంగా ఉన్నాయని వ్యంజకాలు ప్రక్రియ రూపకర్త పొత్తూరి సుబ్బారావు అన్నారు. ఆదివారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరై నగునూరి రాజన్న రచించిన ‘కలల లోగిలి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ కవికి మారుతున్న ప్రపంచ పరిణామాలపై అవగాహన ఉండాలన్నారు. సాహిత్యంలో భిన్న ప్రక్రియల సృజన శుభపరిణామమని తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన ప్రముఖ కవి రచయిత దాస్యం సేనాధిపతి నగునూరి రాజన్న రాసిన హైకూల సంపుటి వెలుగు పూలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కేవీ.గోపాలాచార్య, బొమ్మకంటి కిషన్, సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, జనగాని యుగంధర్, నడిమెట్ల రామయ్య, ఇటిక్యాల రాము, మఠం సాంబమూర్తి, విలాసాగరం రవీందర్, గంప ఉమాపతి, వెల్ముల జయపాల్రెడ్డి, దామరకుంట శంకరయ్య, దేవి యాదగిరి, ఎలగొండ రవి, యడవెల్లి తిరుమలరెడ్డి, శ్యాంసుందర్, సింగిరెడ్డి రాజిరెడ్డి, పి.రాంమోహన్, ఆర్.పాండురంగం పాల్గొన్నారు. ముగిసిన స్వదేశీ మేళా కరీంనగర్టౌన్: స్వదేశీ సంస్థలు, వస్తు ఉత్పత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో గత ఆరు రోజులుగా నిర్వహించిన స్వదేశీ మేళా విజయవంతమైంది. ఈనెల 11న ఉద్యోగ మహోత్సవ్ జాబ్మేళా, దాదాపు 210 స్వదేశీ వస్తు ప్రదర్శన స్టాళ్లతో స్వదేశీ మేళా వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ రోజు ప్రముఖులతో వివిధ అంశాలతో సెమి నార్లు, సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం ముగింపు రోజున జరిగిన సెమినార్కు కాలమిస్ట్, ప్రోమినెంట్ అథార్ భాస్కర్యోగి, ఉస్మానియా యూనివర్శిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్యవక్తలుగా హాజరై మాట్లాడారు. స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సహం కోసం పనిచేస్తున్న ఏకై క స్వచ్ఛంద సంస్థ అని కొనియాడారు. జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో పతకాలు కరీంనగర్స్పోర్ట్స్: తైక్వాండో నేషనల్ చాంపియన్షిప్ పోటీలు హైదరాబాద్లోని యూసుఫ్గూడ కోట్ల విజయ భాస్కర్రెడ్డి స్టేడియంలో జనవరి 28 నుంచి 30వ తేదీవరకు జరిగాయి. కరీంనగర్కు చెందిన క్రీడాకారుల్లో బాలికల విభాగంలో డి.శ్రీనిధి కాంస్యం, బాలుర విభాగంలో ఎ.విష్ణు తేజ కాంస్యం, ఎన్.విహన్రావ్ కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా తైక్వాండో కోచ్ పెండ్లి రాజేందర్, పెద్దపల్లి జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ నేవూరి సతీశ్కుమార్ను సప్తగిరి గవర్నమెంట్ పాఠశాలలో సత్కరించారు. వాకర్స్ అసోసియేషన్ డిప్యూటీ గవర్నర్ గడప కోటేశ్కుమార్, సెక్రటరీ నర్సింగోజు రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పాకానందు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. నేటి నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు కరీంనగర్టౌన్: జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సోమవారం నుంచి కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, డాక్టర్ కె. వెంకటరమణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ హెల్త్– ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ఆదేశాల మేరకు గత కొన్ని నెలల క్రితం ‘రెఫ్రాక్టివ్ ఎర్రర్స్’తో పరీక్ష చేయబడిన 2,588 విద్యార్థుల దృష్టి లోపాలను మళ్లీ నిర్ధారించేందుకు కంటి పరీక్షలు ఈనెల 17 నుంచి 15 రోజులపాటు నిర్వహించడానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. జీజీహెచ్ కరీంనగర్, ఏరియా హాస్పిటల్ హుజూరాబాద్లో షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారని పేర్కొన్నారు. -
నేడు కేసీఆర్ జన్మదిన వేడుకలు
కరీంనగర్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ సుడా చైర్మన్ జీవీ.రామకృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావులు పాల్గొంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని రామకృష్ణారావు కోరారు. -
చావు శరణ్యమై..
ప్రభుత్వం సాయం చేయాలి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం జవారిపేట గ్రామానికి చెందిన రైతు కోమటి నాగరాజు (49) అప్పుల బాధ తాళలేక 2024 నవంబర్ 30న తనపొలం వద్ద క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణానంతరం భార్య లక్ష్మి తన కొడుకు రంజిత్తో కలిసి తనకున్న నాలుగెకరాలతోపాటు మరికొంత కౌలుకు తీసుకుని పత్తి, వరి సాగు చేస్తున్నారు. ముగ్గురు కూతుళ్లలో పెద్దమ్మాయి వివాహమైంది. రెండో కూతురు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగిని. చిన్న కూతురు కరీంనగర్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. తమకు రైతు రుణమాఫీ కాలేదని లక్ష్మి తెలిపింది. తన భర్త పేరిట రైతుబీమా వచ్చినట్లు పేర్కొంది. బ్యాంకుల్లో అప్పులు ఉన్నాయని, ప్రభుత్వం సాయం చేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. -
● కలవరం రేపుతున్న రైతు ఆత్మహత్యలు ● ఏడాదిలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 30 మంది బలవన్మరణం ● పంటలు సరిగా పండక పెరుగుతున్న అప్పులు ● వడ్డీలు కట్టలేక ప్రాణాలు తీసుకుంటున్న రైతులు ● రైతు భరోసా, రుణమాఫీ జాప్యంతో ఇబ్బందులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఆరుగాలం శ్రమించి.. నలుగురికి పట్టెడన్నం పెట్టే అన్నదాత అలసిపోతున్నాడు. ఎంత కష్టపడ్డా.. ఫలితం రాకపోగా.. చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి కట్టలేకపోతున్నాడు. రుణభారం భరించలేక జీవిత పోరాటంలో ఓడి ప్రాణాలు తీసుకుంటున్నాడు. నేలతల్లిని నమ్ముకున్న రైతుబిడ్డ మధ్యలోనే ఆ తల్లితో బంధం తెంచుకుని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నాడు. దిగుబడి రాని పంటలు, పెరిగిన వడ్డీలకు భయపడి అప్పులోళ్లకు ముఖం చెల్లక ప్రాణాలు తీసుకుంటున్నాడు. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో దాదాపు 30 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు అన్నదాత దయనీయ స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రైతు భరోసా, రుణమాఫీ సమయానికి కాకుండా జాప్యమవడం రైతుల ఆర్థిక ఇబ్బందులను మరింత పెంచేలా చేస్తున్నాయన్న విమర్శలు పెరుగుతున్నాయి. పాత జిల్లాలో కలకలం ఉమ్మడి జిల్లాలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. సాగును నమ్ముకుని అప్పులు చేసి పొలాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తే.. చివరికి వడ్డీలు పెరిగి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో 50 ఏళ్లలోపు వారే అధికంగా ఉండటం కలవరపెడుతోంది. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక వేదనతో ప్రాణాలు తీసుకోవడంతో ఆ రైతుల కుటుంబాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాది కాలంలో కరీంనగర్లో 10 మంది, జగిత్యాలలో 6 మంది, సిరిసిల్లలో 10 మంది, పెద్దపల్లిలో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ప్రాణాలు తీసుకుంటున్న రైతుల్లో మెజారిటీ సాగు కోసం అధిక పొలం కౌలుకు తీసుకున్న వారే కావడం గమనార్హం. వీటికితోడు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అయ్యే ఖర్చ అదనం. ఫలితంగా రైతు చేస్తున్న అప్పులకు వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. అన్ని కష్టాలకు ఓర్చి పండించిన పంట సరైన దిగుబడి రాక, అనుకున్న మేర గిట్టుబాట ధర రాకపోవడంతో రైతు కలత చెందుతున్నాడు. ముందున్న బాధ్యతలు, అప్పులు, వాటికి వడ్డీలు తలచుకుని ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాడు. ఉమ్మడి జిల్లాలో మరణించిన రైతులకు చెల్లించిన రైతు బీమా వివరాలుజిల్లా రైతులు బీమా కరీంనగర్ 234 రూ.11 కోట్లు రాజన్నసిరిసిల్ల 186 రూ.9.30 కోట్లు జగిత్యాల 378 రూ.18.90 కోట్లు పెద్దపల్లి 183 రూ.9.15 కోట్లు -
రోడ్డునపడిన కుటుంబం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్ గ్రామానికి చెందిన చల్ల సమ్మయ్య, కోమల దంపతులకు కూతురు, కొడుకు శివసాగర్ ఉన్నారు. తండ్రి మూగవాడు కావడంతో తల్లి కోమలతో కలిసి శివసాగర్ వ్యవసాయం చేసేవాడు. వీరికి 20 గుంటల భూమి ఉండగా మరో ఏడెకరాలు కౌలుకు తీసుకున్నారు. పత్తి, వరిసాగు పెట్టుబడికి రూ.5లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి రాక, అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై గతేడాది నవంబర్ 24న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు మృతితో ఆ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింది. 20 గుంటల భూమి సమ్మయ్య పేరున ఉండడంతో శివసాగర్కు రైతుబీమా వర్తించలేదు. సమ్మయ్య బిజిగిరిషరీఫ్ దర్గా వద్ద భిక్షాటన చేస్తుండగా.. తల్లి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. -
55 ఏళ్లకు కలిశారు
వేములవాడ: స్థానిక హైస్కూల్లో మొట్ట మొదటి పదోతరగతి బ్యాచ్(1968–69) విద్యార్థులు 55 ఏళ్లకు కలుసుకున్నారు. స్థానిక ఎస్సారార్ గ్రాండ్ హోటల్లో ఆదివారం బాల్యమిత్రులు కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పి చనిపోయిన గురువులకు నివాళి అర్పించారు. ప్రస్తుతం ఉన్న ఏకై క గురువు విఠల్ను సన్మానించుకున్నారు. నగుబోతు ప్రభాకర్, ఎండీ ఖాజాపాషా, మధు రాధాకిషన్, వెంకటేశ్వర్లు, గంగయ్య, జి.జ్యోతి, జి.విజయ, జనబాయి, సలీం పాషా, ఎండ మునీర్, శర్మ, బాలకిషన్, ఉమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
తూర్పు అడవుల్లో పెద్దపులి సంచారం
● అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ● ఆందోళన చెందుతున్న అటవీ గ్రామాల ప్రజలుమంథని: గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లో ఆవాసం కోసం పెద్దపల్లి ఏటా సంచారిస్తూ అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉండే గ్రామీణులను భయపెడుతోంది. నాలుగేళ్లుగా తూర్పు డివిజన్ పరిధిలోని కాటారం, మహదేవపూర్, మల్హర్, ముత్తారం మండలాల్లో పులి జాడలు కనిపిస్తూనే ఉన్నాయి. తాజా మంథని నియోజకవర్గంలోని మహదేవపూర్ మండలంలో వారంరోజుల నుంచి పెద్దపులి సంచరిస్తోందని ప్రచారం జరుగుతోంది. అంతేగాకుండా శనివారం మహదేవపూర్ మండలం కుదురుపల్లి సమీపంలో సమ్మక్క–సారలమ్మ గద్దెలవద్ద పులి కనిపించినట్లు రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. ఆవాసం కోసం సంచారం పెద్దపులి ఏటా ఆవాసం కోసం మహారాష్ట్ర అడవుల నుంచి మంథని తూర్పు డివిజన్లోని అడవుల్లోకి వస్తోంది. ఇక్కడి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. రోజూ 20 కి.మీ.– 25 కి.మీ. పరిధిలో ఇది సంచరిస్తుందని అటవీ శాఖ అదికారులు అంటున్నారు. ఈ క్రమంలోనే కుదురుపల్లి నుంచి అటు వైపు వెళ్తుందా.. లేదా కాటారం మండలం మీదుగా మల్హర్ నుంచి ఆ తర్వాత గతంలో లాగా ముత్తారం వైపు వస్తుందా? అనే ఆందోళన మానేరు, గోదావరి నదీ తీర ప్రాంత ప్రజల్లో వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు పెద్దపులి సంచారంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు.. ప్రత్యేక బృందాలతో యానిమల్ ట్రాకింగ్ నిర్వహిస్తున్నారు. పెద్దపులి సంచారం ఉన్న ప్రాంతాల్లో పశువుల కాపరులు వెళ్లవద్దని, అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పంట పొలాల్లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే, గతంలో ఈ ప్రాంతంలో సంచరించిన పులినా? లేక కొత్తగా వచ్చిందా? అనే దానిపై అటవీ అధికారులు అన్వేషణ చేస్తున్నారు. గతంలో మంథని ప్రాంతంలో సంచరించిన సమయంలో ఆవులు, దూడలపై పంజా విసిరి చంపేసింది. ఈ క్రమంలో పెద్దపులి సంచారంతో తూర్పు డివిజన్ గోదావరి, మానేరు తీరం వెంట ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
బీసీ ముస్లింలను మినహాయిస్తే ఉద్యమిస్తాం
కరీంనగర్: రాష్ట్రంలో బీసీ కులగణన, రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పష్టత లేకుండా ప్రకటనలు చేస్తున్నాయని, బీసీ ముస్లింలను మినహాయించి తీర్మానం చేస్తే ఆందోళనలు చేస్తామని రాష్ట్ర సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో మాట్లాడారు. తెలంగాణలో జరిగిన కులగణన ద్వారా ఎవరెంత ఉన్నది స్పష్టం అయినందున బీసీల లెక్కలు తేలాలయని, కానీ బీసీలను కూడా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని మతపరంగా విభజించడం బాధాకరమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో 42శాతం రిజర్వేషన్ల పెంపు హామీ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదని, అసెంబ్లీలో 56శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయాలన్నారు. 10శాతం ముస్లిం బీసీలను మినహాయించాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. -
దస్తావేజులేఖరిపై కేసు
మానకొండూర్: మానకొండూర్ మండలకేంద్రంలోని దస్తావేజులేఖరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసుల తెలిపారు. వారి వివరాల ప్రకారం.. మానకొండూర్కు చెందిన అడప వినయ్ స్థానికంగా దస్తావేజులేఖరిగా పనిచేస్తున్నాడు. నకిలీ సాదాబైనామాతో 24గుంటల భూమిని తనతో పాటు తన తండ్రి అడప వీరయ్య, చెల్లెలు దివ్య పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అడప కిష్టయ్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసి వినయ్పై ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మినారాయణ పేర్కొన్నారు. డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కరీంనగర్: కరీంనగర్ జిల్లా బిల్డింగ్ అండ్ ఆధర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో ముద్రించిన డైరీ, క్యాలెండర్ను ఆదివారం ముకుందలాల్ మిశ్రాభవన్లో జిల్లా కార్యదర్శి, యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేయడానికి సిద్ధంగా ఉందని, లేబర్ కోడ్స్ వల్ల భవన నిర్మాణ కార్మికుల 3 చట్టాలు రద్దయ్యే అవకాశం ఉందన్నారు. లేబర్ కోడ్స్ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా లబ్ధి పొందే క్లెయిమ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మోటార్ సైకిల్ ఇస్తామని ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కదిరే రమేశ్, కోశాధికారి వట్టి జగదీశ్, ఉపాధ్యక్షులు రేణుకుంట సారయ్య, రావుల ఎల్లయ్య, జంబుకం వెంకన్న, అనుముల మల్లారెడ్డి, సహాయ కార్యదర్శులు శనగరపు రాజు, చక్రపాణి, లింగారెడ్డి, శ్రీధర్, ఇళ్ళందుల రవి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో ఆత్మహత్య రామగుండం: పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణంల చోటు చేసుకుంది. ఎస్సై సంధ్యారాణి కథనం ప్రకారం.. పోస్టాఫీసు సమీప జెన్ క్వార్టర్లో నివాసం ఉండే సివిల్ కాంట్రాక్టర్ పుల్లూరి భగవాన్రావు ఏకై క కుమారుడు బాలాజీ(34) కొంతకాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. తనకు వివాహం కావడం లేదని మదనపడుతూ ఉన్నాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆదివారం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. దహన సంస్కారాల కోసం కుటుంబసభ్యులు ప్రత్యేక వాహనంలో కరీంనగర్లోని సొంతింటికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సెల్టవర్ ఎక్కి నిరసన
శంకరపట్నం: తన తమ్ముడు తనపై, తన భార్యపై దాడిచేశాడని సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఎస్సై పట్టించుకోవడం లేదని సైదాపూర్ మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన దుర్గం కొమురయ్య ఆదివారం మండలంలోని కేశవపట్నంలో సెల్టవర్ ఎక్కాడు. బాధితుడి వివరాల ప్రకారం.. దుర్గం కొమురయ్యతో ఇటీవల తన సోదరుడు తిరుపతి గొడవ పడ్డాడు. కొమురయ్య, ఆయన భార్యపై దాడిచేశాడు. దీంతో కొమురయ్య భార్య పురుగుల మందు తాగింది. ఈ విషయమై సైదాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడంలేదని కేశవపట్నంలో సెల్టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. బ్లూకోల్ట్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని, కొమురయ్యతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. -
రోడ్డు ప్రమాదంలో ధర్మపురి వాసి మృతి
ధర్మపురి: కుంభమేళకు వెళ్లి వస్తుండగా.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ మహిళ మృతి చెందింది. బంధువుల కథనం ప్రకారం.. ధర్మపురికి చెందిన వెంగల ప్రమీల (50) వారం క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి రెండు కార్లలో ప్రయాగ్రాజ్లోని కుంభమేళకు వెళ్లారు. అక్కడ పుణ్య స్నానాలు ఆచరించి అక్కడి నుంచి కాశీ, వారణాసి తదితర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. తిరిగి వస్తుండగా.. మార్గంమధ్యలో మధ్యప్రదేశ్లోని రేనా ప్రాంతంలో కారు అదుపు తప్పి స్తంభానికి ఢీ కొట్టింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ప్రమీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమీల ప్రయాణిస్తున్న కారులోనే ఉన్న ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు, మనుమరాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమీల భర్త గతంలోనే మృతి చెందాడు. ధర్మపురిలోని గోదావరి వద్ద కొబ్బరికాయలు అమ్ముకొని జీవనోపాధి పొందుతోంది. ఆమె మృత దేహాన్ని ధర్మపురికి తీసుకొస్తున్నట్లు బంధువులు తెలిపారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా ఘటన -
డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడిన ఆటో డ్రైవర్కు మూడు రోజుల జైలు
వేములవాడ: మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుశిక్షతోపాటు జరిమానా తప్పదని వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ హెచ్చరించారు. వేములవాడలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల చేపట్టిన డ్రంకెన్డ్రైవ్లో 120 మంది పట్టుబడ్డారన్నారు. వీరందరిని ఈనెల 15న కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి జ్యోతిర్మయి ఆటో డ్రైవర్కు మూడు రోజుల జైలుశిక్షతోపాటు రూ.2వేలు జరిమానా విధించారన్నారు. మద్యం సేవించిన మరో 119 ద్విచక్ర వాహనదారులకు రూ.2,38,500 జరిమానా విధించినట్లు వివరించారు. మరో 119 మందికి జరిమానా టౌన్ సీఐ వీరప్రసాద్ -
ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
శంకరపట్నం: ఆన్లైన్ బెట్టింగ్ యువకుడి ప్రాణం తీసింది. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఏడిగ మధు(33) కొన్ని రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటయ్యాడు. ఈ క్రమంలో సుమారు రూ.10లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. మనస్తాపానికి గురై ఈనెల 10న ఇంట్లో ఎవరు లేని సమయంలో గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ ఆదివారం మరణించాడు. మధుకు భార్య గీత, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గీత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవి తెలిపారు. -
అధికారులను తప్పుదోవ పట్టించిన ముగ్గురిపై కేసు
వేములవాడరూరల్: అక్రమ ఇసుక తరలింపు అంటూ అధికారులను తప్పుదోవ పట్టించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వేములవాడరూరల్ మండలం లింగంపల్లి మూలవాగు నుంచి ప్రభుత్వ అనుమతులతో ఇసుకను తరలిస్తుండగా ఈ విషయాన్ని ముగ్గురు వ్యక్తులు అక్రమ ఇసుక తరలిస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తహసీల్దార్ సుజాత ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు లింగంపల్లికి చెందిన ఎ.మహేందర్, ఎ.నరేశ్, హన్మాజీపేటకు చెందిన రాకేశ్రెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ధర్మారం(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన నార మహిపాల్(32) శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని ఎస్సై ఆదివారం లక్ష్మణ్ తెలిపారు. పని నిమిత్తం జగిత్యాల జిల్లా ఎండపల్లికి వెళ్లిన మహిపాల్.. పని పూర్తయ్యాక ఎండపల్లి నుంచి మోటార్ సైకిల్పై స్థానిక ఓ ఫంక్షన్హాల్లో జరుగుతున్న వివాహానికి హాజరయ్యేందుకు మోటార్ సైకిల్పై వస్తున్నాడు. ఈక్రమంలో ఫంక్షన్ హాల్ సమీపంలోని క్రీడాప్రాంగణం వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు జైపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
ఒకరి ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని మెట్పల్లి గ్రామంలో బావమరిది ఇంట్లో బావ ఆత్మహత్య చేసుకున్నాడు. కేశవపట్నం ఎస్సై రవి వివరాల మేరకు.. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ గ్రామానికి చెందిన ముప్పిడి రాంరెడ్డి(72) కొన్ని రోజులుగా మండలంలోని మెట్పల్లి గ్రామంలోని తన బావమరిది తుమ్మల పురుషోత్తమరెడ్డి ఇంటివద్ద ఉంటున్నాడు. కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దినసరి కూలీ మృతి సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): స్థానిక ఆర్టీసీ బస్స్టాండ్లో చైన్నెకి చెందిన జీవా(55) అనే దినసరి కూలీ ఆదివారం మృతి చెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. ఆర్నెల్ల క్రితం చైన్నె నుంచి ఇక్కడకు వచ్చిన జీవా దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. బస్టాండ్లోనే తలదాచుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం కూలీ పనిచేసి మద్యం తాగాడు. అక్కడే పడుకున్నాడు. సకాలంలో మంచినీరు తాగలేదు. దీంతో బాడీ డీహెడ్రేషన్కు గురై మృతి చెందాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు భార్యలు, పిల్లలు ఉన్నారు. గుండెపోటుతో చిత్రకారుడు.. జగిత్యాలరూరల్: జగిత్యాల పట్టణానికి చెందిన చిత్రకారుడు మచ్చ రవి (50) గుండెపోటుతో మృతి చెందాడు. రవికి శనివారం రాత్రి గుండెపోటు రాగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడు. మహిళకు గాయాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): కనగర్తి గ్రామంలో ఆదివారం ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవాశాత్తు సరోజన కిందపడి గాయాలపాలైందని ప్రయాణికులు తెలిపారు. తలకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గంజాయి స్వాధీనంబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని జగ్గారావుపల్లి గ్రామ పరిసరాల్లో గంజాయి విక్రయించడానికి వచ్చిన ఇదే గ్రామానికి చెందిన గంగాధర్ నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై పృథ్వీధర్ ఆదివారం తెలిపారు. గ్రామ పరిసరాల్లో గంజాయి విక్రయించడనానికి వస్తున్నట్లు శనివారం సాయంత్రం పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా 64 గ్రాముల గంజాయి దొరికింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. రుద్రంగి మండలంలో.. రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని నేవూరిపల్లి బస్స్టాండ్ వద్ద గంగాధర గ్రామానికి చెందిన పొత్తూరి అలియాస్ సముద్రాల రాకేశ్ అలియాస్ రాఖి నుంచి గంజాయి పట్టుకున్నట్లు సీఐ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం రాత్రి పక్కా సమాచారం మేరకు ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో రాఖి నుంచి 24 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకుల అరెస్టువీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఎల్లయ్యగౌడ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. వీర్నపల్లి గ్రామ శివారులో ఆదివారం పోలీసులు వాహన తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో అనుమానాస్పదంగా ఉన్న లాల్సింగ్తండాకు చెందిన దినేశ్, అజ్మీర పవన్, హరీశ్లను తనిఖీ చేయగా గంజాయి లభించింది. ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. -
రాహుల్ గాంధీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాహుల్ గాంధీ కులం, మతం, జాతి లేనివాడంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వదేశీ మేళా ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కులం, మతంపై చర్చ జరుగుతుండటం దురదృష్టకరం. 1994లో మోదీ కులాన్ని బీసీగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.‘‘రాహుల్ తల్లి సోనియా గాంధీ క్రిస్టియన్. రాహుల్ తాత ఫిరోజ్ఖాన్ గాంధీ. రాహుల్ మాత్రం బ్రాహ్మణ్ అంటున్నారు. రాజీవ్ గాంధీ తండ్రి ముస్లిం అయితే.. రాహుల్ గాంధీ కూడా ముస్లిం అవుతారు. తండ్రి కులమే కొడుకుకు వస్తుందన్న కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ పక్కా ఇండియన్’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.10 శాతం ముస్లింలను బిసీలుగా మార్చారు. బీసీలకు ఇచ్చేది 32 శాతమే. 42 శాతం ఎలా అవుతుంది?. లవ్ జిహాదీ, మత మార్పిడిలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ చట్టం రావాలి. హిందూ బీసీలకు 42 శాతం ఇస్తే కేంద్రం సహకరిస్తుంది. మమ్మల్ని మతతత్వ వాదులు అన్నా పర్వాలేదు’’ అని బండి సంజయ్ చెప్పారు. -
రైలు టికెట్ దొరకలే
ప్రయాగ్రాజ్కు రై లులో వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం లేకుండాపోయింది. రెండు నెలల క్రితమే టికెట్లు రిజర్వు అయ్యాయి. తత్కాల్ టికెట్ కోసం రెండురోజులు ప్రయత్నించినా దొరకలే. చివరకు స్నేహితులతో కలిసి ప్రత్యేక వాహనంలో వెళ్లాం. – పానుగంటి సత్యనారాయణ, గోలివాడ పోలేని పరిస్థితి కాశీకి పోదామనే ఆశ ఉంది. కానీ, రైళ్లలో పోలేని పరిస్థితి ఉంది. మా ఇంటికాడోళ్లు కాశీ, త్రివేణి సంగమం వెళ్లి పుణ్య స్నానం చేసి వస్తామని నిర్ణయించారు. కానీ రైలు టికెట్ దొరకలే. హైదరాబాద్ వెళ్లి రైలు ఎక్కాలంటే నా వయసు సహకరించడం లేదు. – మామిడి లక్ష్మి, సుల్తానాబాద్ టికెట్ కన్ఫమ్ కాలేదు ప్రయాగ్రాజ్ వెళ్లేందుకు నెలరోజుల క్రితమే రైలు టికెట్ బుక్ చేసుకున్నం. దాణాపూర్ రైలుకు ఈనెల 16వన వెళ్లాలి. ఇంకా 30 వెయిటింగ్ లిస్టులోనే ఉంది. టికెట్ కాన్ఫమ్ కాకుంటే మా టూర్ రద్దవుతుంది. ఇన్నోవాలో వెళ్లేందుకు అంత ఓపిక లేదు. – రావికంటి జ్యోతి, గౌతమినగర్ అధికారులకు విన్నవించాం కరీంనగర్ – పెద్దపల్లి, రామగుండం నుంచి ప్రయాగ్రాజ్కు ప్రత్యేక రైలు ను నడిపించాలని కోరా. రామగుండం నుంచి బొగ్గు ర వాణాతో రైల్వేకు రూ.వేల కోట్ల ఆదా యం వస్తోంది. ఇక్కడివారి కోసం ప్రత్యేక రైలు నడిపించాలని రైల్వే జీఎం, డీఆర్ఎంలకు విన్నవించా. – శ్రీనివాస్, రైల్వే ప్రజాసంబంధాల ప్రతినిధి -
ఆ జిల్లాల్లో ఇందిరమ్మ నిర్మాణాలు
uమొదటి పేజీ తరువాయిరెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, సమాచార శాఖ కమిషనర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. భూములపై నిరంతర పర్యవేక్షణ రెవెన్యూ శాఖ సమీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ భూములపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వం చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కోర్టు కేసుల్లో ఉన్న భూములను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. సినిమా రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు సమాజ వికాసానికి దోహదపడే విధంగా లఘుచిత్రాలను తీసుకువచ్చేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల చుట్టూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం శాటిలైట్ టౌన్షిప్ నిర్మాణాలపై హౌజింగ్ శాఖ దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్లోని మధ్య తరగతి ప్రజల సొంతింటి కల సాకారం చేసేందుకు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపడం ద్వారా భూసేకరణ చేసుకోవాలని సూచించారు. ఇక, రాష్ట్రంలో భూముల డిజిటల్ సర్వేకు సంబంధించి అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితాను సేకరించాలని, ప్రతి నెలా ఈ అద్దెలను చెల్లించేలా ఆర్థిక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై సోలార్ విద్యుత్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
మైసమ్మకు పూజలు.. మొక్కులు
● భారీగా తరలివచ్చిన ఆదివాసీలు ● దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు ● తల్లిని దర్శించుకున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● నేటి దర్బార్తో ముగియనున్న జాతరరామకృష్ణాపూర్: మందమర్రి మండలం బొక్కలగుట్ట శివారులోని గాంధారీ మైసమ్మ జాతరకు రెండో రోజు శనివారం భక్తులు పోటెత్తారు. సాయంత్రం సదర్ భీమన్న వద్ద దేవతామూర్తులకు ఆదివాసీ గిరిజనుల సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి దేవతామూర్తులను జాతర జరిగే గాంధారీ ఖిల్లా దిగువ భాగంలోనికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. పిల్లనగ్రోవి వాయిద్యాలు, లక్ష్మీదేవర నృత్యాలు, తప్పెటగూళ్ల ఆటపాటలతో ఆదివాసీలు దేవతామూర్తులను జాతర ప్రాంగణంలోనికి తీసుకువచ్చారు. అక్కడ దేవతామూర్తులను ఉంచి ఆదివాసీ నాయక్పోడ్ల సంప్రదాయ ఆటపాటలతో దేవతామూర్తులను ఆనందపరిచారు. అనంతరం మహిళలు ఖిల్లాపై భాగంలో కొలువుదీరిన అమ్మవారిని పవిత్ర నదీ జలాలతో శుద్ధిచేసి మైసమ్మ తల్లికి పట్నాలు వేశారు. ప్రత్యేక పూజలు చేశారు. అర్ధరాత్రి సమయంలో పెద్దపూజ నిర్వహించారు. జాతరలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీలతోపాటు పొరుగు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఐటీడీఏ పీవో పూజలు.. గాంధారి ఖిల్లాను ఉట్నూర్ సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్తా సందర్శించారు. ఏపీవో పీవీటీజీ పురుషోత్తం, నాయక్పోడ్ సంఘం ప్రతినిధులతో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ నాయక్పోడ్ సంఘం నాయకులతో జాతర జరిగే తీరు, ఖిల్లా చరిత్ర, అభివృద్ధి గురించి చర్చించారు. ప్రశాంత వాతావరణంలో జాతర జరుపుకుని అందరి సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని నాయక్పోడ్ సంఘ నాయకులు, ఆయా శాఖల అధికారులకు సూచించారు. నేడు దర్బార్.. మైసమ్మ జాతరలో భాగంగా ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు మొక్కులు చెల్లించుకున్న అనంతరం జాతర ప్రాంగణంలో ద ర్బార్ నిర్వహిస్తారు. గాంధారి మైసమ్మ జాతర విశి ష్టత, ఆదివాసీ నాయకపోడ్ల సమస్యలు, ఖిల్లా అ భివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై చర్చిస్తా రు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, నాయక్పో డ్ సంఘం ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. -
‘గురి’ తప్పిన గురుకులాలు
uమొదటి పేజీ తరువాయిచేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంవత్సరాలవారీగా దాదాపుగా సీట్లు, దరఖాస్తులు సంవత్సరం మొత్తం సీట్లు దరఖాస్తులు 2020–21 48,000 1,68,000 2022–23 48,000 1,50,000 2023–24 48,000 1,32,000 2024–25 51,000 1,20,000 2025–26 51,000 80,000 సొసైటీల వారీగా పాఠశాలలు, ఐదో తరగతిలో సీట్లు ఇలా.. సొసైటీ స్కూళ్లు సీట్లు ఎస్సీ 232 18,560 ఎస్టీ 82 6,560 బీసీ 294 23,680 జనరల్ 35 3,124 మొత్తం 643 51,924 -
సీపీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి గిరిజన ఉపాధ్యాయ సంఘం మద్దతు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డికి తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థి ఇన్నా రెడ్డి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్లను.. శనివారం తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్ తదితరులు కలిసి మద్దతు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, ఓపీఎస్ సాధనే లక్ష్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీపీఎస్ అభ్యర్థి విజయం సాధించడం ద్వారా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. -
‘స్థానిక’ పోరులో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలవాలి
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాక్షి, హైదరాబాద్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మిత్రపక్షాలతో పరస్పర అవగాహన విషయంలో కాంగ్రెస్ తన చిత్తశుద్ధిని చాటుకోవాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నా రు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, శత్రువును ఎదుర్కొనేందుకు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని మొన్నటి ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయన్నారు. కాంగ్రెస్, ఆప్ పార్టీల స్వయంకృతాపరాధం వల్లనే ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే అ ప్పులు చేసైనా.. ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఉచితాల కారణంగా వ్యవసాయ పనులకు కూలీలు దొరకడం లేదని, ఇతర పనులకు కూడా ఎవ్వరూ రావడం లేదని మేధావులు, న్యాయమూర్తులు వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనే సంక్షేమ పథకాల రూపంలో తిరిగి వారికి ఇస్తున్నారు తప్ప ఉచితంగా కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనను దేశవ్యాప్తంగా చేపట్టాలన్నారు. -
కేటీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో చిలక జోస్యం చెప్పు
● మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ సాక్షి, హైదరాబాద్: నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర అని గొప్పలు చెప్పుకునే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు చిన్న అమ్మాయి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినా సిగ్గు రాలేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఆయన చిల కజోస్యం చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందంటూ ఎర్రబెల్లి చెప్పిన మాటలు చిలుక జో స్యం లాగానే ఉన్నాయని, ఆయనకు నిజంగా జ్యోతిషం తెలిస్తే ఫామ్హౌస్లో పడుకున్న కేసీఆర్ ఎప్పుడు లేస్తాడో, ఫార్ములా ఈ–రేసులో కేటీఆర్ ఎప్పుడు అరెస్టు అవుతాడో చెప్పాలని శ్రీనివాస్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఆలోచించాల్సిన అవసరం ఎర్రబెల్లికి లేదని, ఇప్పటికే ఆ పార్టీ నుంచి 10 మంది వెళ్లిపోగా మిగిలిన వారిని కాపాడుకోవాలని సూచించారు. సీఎం వ్యాఖ్యలను బండి సంజయ్ వక్రీకరిస్తున్నారని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా 18, 19 తేదీల్లో నిరసన ● 9 వామపక్ష పార్టీల నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రజల మౌలిక అవసరాలకు కేటాయింపులు తగ్గించి, సంపన్నులకు రాయితీలు పెంచడం ద్వారా సామాన్యులకు తీరని ద్రోహం చేసిందని తొమ్మిది వామపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రజావ్యతిరేక బడ్జెట్ను నిరసిస్తూ అఖిలభారత వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా ఈ నెల 18, 19 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వామపక్ష పార్టీల నేతలు జాన్ వెస్లీ (సీపీఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పోటు రంగారావు (సీపీఎం–ఎంఎల్) మాస్లైన్, గాదగోని రవి (ఎంసీపీఐ–యూ), సాదినేని వెంకటేశ్వర్రావు (సీపీఐ–ఎంఎల్ న్యూ డెమోక్రసీ), జానకిరాములు (రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ), సీహెచ్ మురహరి (ఎస్యూసీఐ–సీ), రమేశ్ రాజా (సీపీఐ–ఎంఎల్ లిబరేషన్), బి.సురేందర్ రెడ్డి (ఫార్వర్డ్ బ్లాక్) శనివారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు హామీ కల్పించి, బీమా రంగంలో 100 శాతం ఎఫ్డీఐని ఉపసంహరించాలనే పలు డిమాండ్లతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజ లు స్వచ్ఛందంగా పాల్గొన్నాలన్నారు. క్లుప్తంగా... -
బడ్జెట్ కసరత్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన నిధులను అన్ని ప్రభుత్వ శాఖలు ఇప్పటికే ఆన్లైన్లో ఆర్థిక శాఖకు పంపాయి. ఈ ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో బడ్జెట్ తయారీ కోసం శాఖల వారీగా సమీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమం, ఆర్ అండ్ బీ, బీసీ సంక్షేమం, రవాణా, వ్యవసాయం, జౌళి శాఖలపై సమీక్షలు పూర్తికాగా, శనివారం రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిసి ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూపకల్పన, ప్రభుత్వ ప్రాధాన్యతల గురించి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిగిలిన శాఖల అంచనాలపై కూడా వచ్చే వారం నాటికి సమీక్షలు పూర్తవుతాయని, అనంతరం బడ్జెట్ తయారీలో ఆర్థిక శాఖ పూర్తిస్థాయిలో నిమగ్నమవుతుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమావేశాల్లో 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. కాగా, ఈసారి బడ్జెట్ పరిమాణం పెరుగుతుందా, తగ్గుతుందా అన్న దానిపై ఆర్థిక శాఖ వర్గాలు తర్జనభర్జనలు పడుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన సాయం విషయంలో ఆశించిన మేర నిధులు రాకపోవడం, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో సొంత ఆదాయ రాబడులపైనే దృష్టి సారించి బడ్జెట్ను రూపొందించాల్సి ఉంటుందని, బడ్జెట్ పరిమాణంపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ప్రభుత్వానికి చేరిన అన్ని శాఖల అంచనాలు శాఖల వారీగా సమీక్షలు జరుపుతున్న డిప్యూటీ సీఎం భట్టి -
వ్యవసాయంలో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట
జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ రంగంలో నూత న ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నట్లు జగిత్యాల వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ భారతీ నా రాయణ్ భట్ అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో శనివారం ‘గ్రామీణ ఆవిష్కరణ స్పో క్, అగ్రి ఇన్నోవేషన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగ్మాఫ్ అగ్రి టెక్ మార్కెట్ యాక్సెస్’ నిర్వహించారు. భార తీ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆధునిక టెక్నాలజీతో వస్తున్న వివిధ కంపెనీల సేవలను రై తులు ఉపయోగించుకోవాలన్నారు. చాలా స్టార్టప్ కంపెనీలు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు.. ఖ ర్చు తగ్గించేందుకు రకరకాల కొత్త ఆవిష్కరణలతో వస్తున్నారని, వారి సేవలను వినియోగించుకోవాల ని కోరారు. వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో కూలీల ఖర్చు పెరిగినందున కూలీలు లేని వ్యవసాయాన్ని ఆవిష్కరించేందుకు పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. ఆగ్హబ్ సీఈఓ విజయ్ అగ్రికల్చర్ హబ్ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నాబార్డు ఏజీఎం జయప్రకాష్, రూరల్ ఇ న్నోవేషన్ స్పోక్ కన్వీనర్ రజనీదేవి, జగిత్యాల, కా మారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల రైతు ఉత్పత్తి దారుల సంఘాల సభ్యులు, అగ్రిహబ్ ప్రాజెక్టు మే నేజర్ ముఖేష్, రంజిత్కుమార్ పాల్గొన్నారు. -
భయపెడుతున్న జీబీ సిండ్రోమ్
సాక్షి ఫ్యామిలీ హెల్త్ డెస్క్ గులియన్ బ్యారి సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి లక్షణాలేమిటి? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలను ప్రజలు శోధిస్తున్నారు. కలుషిత నీరు, ఆహారం తీసుకునేవారిలోనే జీబీఎస్ అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. తక్కువ ఖర్చుతో చికిత్స ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్ పొరను ధ్వంసం చేసే యాంటీబాడీస్ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. మరో పద్ధతిలో రోగి బరువును బట్టి ప్రతి కిలోగ్రాముకు 250 ఎంఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం మేలు. –డాక్టర్ బి. చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ న్యూరో ఫిజీషియన్ ● ఏదైనా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత పోస్ట్ వైరల్ లేదా పోస్ట్ బ్యాక్టీరియల్ వ్యాధిగా కనిపించేదే జీబీఎస్. ● మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికి ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. యాంటీబాడీస్ ఈ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి సిగ్నల్స్ అందక అవయవాలు అచేతనమవుతాయి. ● మొదట కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా దేహమంతా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతన మైతే కళ్లు కూడా మూయలేడు. ● ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ● గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం వస్తుంది. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితులు క్రమంగా కోలుకుంటారు. ఆ ప్రక్రియ రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. ● శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గినా జీబీఎస్ లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి. ● కలుషిత నీరు, ఆహారమే జీబీఎస్ రావటానికి ప్రధాన కారణమని గుర్తించారు. జీబీ సిండ్రోమ్ లక్షణాలు -
డిమాండ్ ఎక్కువ.. రైళ్లు తక్కువ
రామగుండం: జిల్లాలోనేకాదు.. రాష్ట్రంలోనూ ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభామేళా విశేషాలపైనే చర్చ సాగుతోంది. ఈనెల 26న మహాశివరాత్రి రోజు మహాకుంభామేళా వేడుకలు ముగియనున్నాయి. 144 ఏళ్లకోసారి వచ్చే ఈ ఉత్సవాల సందర్భంగా ప్రయాగ్రాజ్లో పుణ్నస్నానం ఆచరించాలనేది భక్తుల అచంచల విశ్వాసం. అందుకే ప్రయాగ్రాజ్కు నడిపిస్తున్న రైళ్లు భక్తులతో రద్దీగా మారుతున్నాయి. ఎంతగా అంటే.. తత్కాల్ టికెట్లు కూడా క్షణాల్లో రిజర్వుకావడం డిమాండ్ను తెలియజేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ప్రయాగ్రాజ్ సుమారు 1,120 కి.మీ. దూరంలో ఉంది. రైళ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో కొందరు భక్తులు గ్రూపుగా ఏర్పడి ప్రత్యేకంగా ప్రైవేట్ వాహనం అద్దెకు మాట్లాడుకుని వెళ్తున్నారు. ఇలావెళ్ల వారిసంఖ్య పెరిగిపోతుండడంతో రహదారులన్నీ రద్దీగా మారుతున్నాయి. ఫలింగా గంటల తరబడి ట్రాఫిక్ జామవుతోంది. మరిన్ని ప్రత్యేక రైళ్లు అవసరం.. మరికొన్ని రోజుల్లో మహాకుంభామేళా పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో భక్తులు సురక్షితంగా అక్కడకు వెళ్లి వచ్చేందుకు రైల్వేశాఖ డిమాండ్కు అనుగుణంగా ప్రధాన రైల్వేస్టేషన్ల నుంచి మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపించాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం రైల్వేస్టేషన్ల నుంచి రోజూ ఒక ప్రత్యేక రైలును నడిపించేందుకు ఎంపీలు రైల్వేశాఖపై ఒత్తిడి పెంచాలని అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్, వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఏసీ, నాన్ ఏసీ కేటగిరీల్లో అదనపు బోగీలు జోడించినా భక్తులకు కొంత ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. సురక్షితం.. సౌకర్యం.. రామగుండం నుంచి ప్రయాగ్రాజ్ వెళ్లే రైళ్లలో ప్రయాణం సురక్షితంగా, తక్కువ ఖర్చుతో, సుఖమయంగా ఉంటుంది. నిర్దేశిత గడువులోగా ప్రయాగ్రాజ్ చేరుకునే అవకాశం ఉంది. దీంతోపాటు రైల్వేస్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోనే త్రివేణి సంగమం చేరుకోవచ్చు. అక్కడే పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు తక్కువ ఖర్చుతో సకాలంలో చేరుకునే వీలుంటుంది. వాహనాలు లభ్యం కానిభక్తులు కూడా నేరుగా నడక మార్గం ద్వారా చేరుకునే అవకాశాలూ ఉన్నాయి. రైల్వేశాఖకు రూ.కోట్ల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రయాగ్రాజ్కు ప్రయాణం నరకం క్షణాల్లో రిజర్వు అవుతున్న ‘తత్కాల్’ టికెట్లు రహదారి మార్గంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ 26తో ముగియనున్న కుంభామేళా పుష్కరాలు ప్రత్యేక రైళ్ల సంఖ్య పెంచాలని భక్తుల డిమాండ్