Karimnagar
-
ఇసుక అక్రమ రవాణాను అరికట్టండి
కరీంనగర్ అర్బన్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ గౌస్ ఆలంతో కలిసి నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్శాఖ అధికారులు సంయుక్తంగా ఇసుక రీచ్ లను తరచూ తనిఖీ చేయాలని పేర్కొన్నారు. టాస్క్ఫోర్స్ బృందాలు ఇసుక స్టాక్ యార్డులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా నిరంతరం ప్రత్యేక నిఘా పెడుతున్నామని వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా విషయమై 400 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్బాబు, మైనింగ్శాఖ ఏడీ రాఘవరెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, టీజీఎండీసీ పీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. సమాచార నమోదు ప్రతీ ఒక్కరి బాధ్యత సమాచార నమోదు ప్రతీ ఒక్కరి బాధ్యతని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ‘మన జనాభా గణన– మన అభివృది’ నినాదంతో జనాభా గణన 2027కు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన ఫ్లెక్సీలను శుక్రవారం ఆవిష్కరించారు. -
బీజేపీకే కో ఆప్షన్!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదు స్థానాలకు శనివారం ఉదయం 11గంటలకు నగరపాలకసంస్థ కౌన్సిల్ హాల్లో ఎన్నిక నిర్వహించనున్నారు. అధికార బీజేపీకి పూర్తి బలం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికకు దూరంగా ఉంటామని చెబుతుండగా, బీఆర్ఎస్ పోటీదారులు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో బీజేపీ అభ్యర్థులు ఐదుగురు గెలవడం లాంఛనమే అయింది. అభ్యర్థుల పేర్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం వెల్లడించారు. నేడు కో ఆప్షన్ ఎన్నిక నగరపాలకసంస్థ కో ఆప్షన్ సభ్యులను శనివారం ఉ దయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో నిర్వహించే సర్వసభ్య ప్రత్యేక సమావేశంలో ఎన్నుకోనున్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఐదుగురు సభ్యులను చేతులెత్తే పద్ధతిలో ఎన్నుకుంటారు. 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే, ముందు కోరంకు అవసరమైన 35 మంది సభ్యులు ఉన్నారా లేరా అని చూస్తారు. కో రం లేకపోతే వాయిదా వేస్తారు. పోటీచేస్తున్న అభ్యర్థుల పేర్లను కేటగిరీ వారీగా చదివి వినిపిస్తారు. అనంతరం చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఒక్కో సభ్యుడు ఐదుగురికి చేతులెత్తి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై నట్లు ప్రకటిస్తారు. 66 మంది కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యుల హోదాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు కో ఆప్షన్ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. పోటీలో 40 మంది ఐదు కో ఆప్షన్ స్థానాలకు 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 46 మంది దరఖాస్తు చేసుకోగా, ఐదుగురు రిజెక్ట్ అయ్యారు. ఒకరు ముందుగానే విరమించుకొన్నారు. ఐదుస్థానాల్లో మూడు జనరల్, రెండు మైనార్టీ కోటాలో ఉన్నా యి. జనరల్, మైనార్టీల్లో ఒక్కోటి మహిళకు రిజర్వ్ చేశారు. మూడు జనరల్ స్థానాలకు 27 మంది, రెండు మైనార్టీ స్థానాలకు 13 మంది పోటీలో ఉన్నారు. జాబితా రూపొందించిన తరువాత విరమించుకుంటున్నట్లు బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు దరఖాస్తు చేసుకున్నా సాంకేతికంగా పోటీలోనే ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు వీళ్లే... – పరిచయం చేసిన బండి సంజయ్ కో ఆప్షన్ ఎన్నికల్లో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్పొరేటర్లకు పరిచయం చేశారు. నగరంలోని ఓ హోటల్లో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావుతో కలిసి కార్పొరేటర్లు, అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. కన్న కృష్ణ, నందకుమార్, చిగిరి వెంకటమ్మ, హఫీజా బేగం, బల్బీర్సింగ్లను బీజేపీ కో ఆప్షన్ అభ్యర్థులుగా పరిచయం చేశారు. అభ్యర్థులను కలిసికట్టుగా గెలిపించాలని కార్పొరేటర్లకు సూచించారు. కాంగ్రెస్ దూరం.. బీఆర్ఎస్ హాజరు? కో ఆప్షన్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. 18 మంది కార్పొరేటర్ల బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్తో కలిసే ఉద్దేశం లేక, పోటీచేసేందుకు తమ పార్టీ నాయకులు ఎవరు ముందుకురాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. శనివారం నాటి ఎన్నికకు దూరంగా ఉండనుంది. ఇక బీఆర్ఎస్ నుంచి పలువురు దరఖాస్తు చేసుకొన్నప్పటికి, ఇందులో కొంతమంది పోటీనుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. పదిమంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఎన్నికల తీరుపై విపక్షాల ఆగ్రహం కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియలో గోప్యతను పాటించడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఎన్నికకు ఒక్కరోజు ముందు వరకు పోటీదారుల జాబితాను కార్పొరేటర్లకు ఇవ్వకపోవడంపై ప్రశ్నిస్తున్నారు. ఎవరు, ఏ కేటగిరీలో పోటీచేస్తున్నారో తెలియకుండా, ఎన్నికల్లో పాల్గొనడం ఇదే ప్రథమమని చెబుతున్నారు. జనరల్బాడీలో ప్రాతినిథ్యం లేని మైనార్టీలను ఎన్నుకోవాలని నిబంధన ఉన్నప్పటికి, ప్రాతినిథ్యం ఉన్న వాళ్లనే ఎన్నుకోవడమేమిటంటున్నారు. జనరరల్బాడీలో ప్రస్తుతం ముస్లింలు, సిక్కులు ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఆ కేటగిరీలు కాకుండా క్రిస్టియన్, పార్శీ, బుద్దుల నుంచి ఎన్నుకోవాల్సి ఉంటుందని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. -
వరదకాలువ.. మెట్ట రైతులకు వరం
బోయినపల్లి(చొప్పదండి): వరిపంటలు పొట్ట దశలో ఉండి ఈనే సమయంలో ఎల్లంపల్లి నీరు వరదకాలువకు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మార్చి రెండో వారంలో పంటలకు ఎల్లంపల్లి నీరు అందడంతో చేలు పచ్చగా మారాయి. వరదకాలువ ఆధారంగా యాసంగి సీజన్లో వరి పంటలు వేసిన రైతులు మెజార్టీగా పంట కోశారు. ఇంకా కొందరు వరి కోతలకు సిద్ధంగా ఉన్నారు. వరదకాలువలోని నీటి స్టోరేజీ కెపాసిటీ 1.7 టీఎంసీలు. ప్రస్తుతం వరదకాలువలో సుమారు ఐదు మీటర్ల మేర నీరు ఉంది. జలయజ్ఞంలో నిర్మాణం జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వరదకాలువ నిర్మించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎస్సారెస్పీ నుంచి జగిత్యాల, కరీంనగర్ జిల్లాల మీదుగా రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యూలేటరీ వరకు 122 కిలోమీటర్ల మేర వరదకాలువ విస్తరించి ఉంది. నాలుగు జిల్లాల పరిధిలోని వరదకాలువ పరిసరాల్లో ఉన్న రైతులకు ఈ నీరు పంటలకు జీవం పోస్తుంది. ఏటా వానాకాలం సీజన్లో వరదకాలువ నీటితో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 70 వేలకు పైగా ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఇందులో జగిత్యాల జిల్లాలో వరదకాలువ ఆధారంగా అత్యధికంగా సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు వరి పంట వేస్తారు. వరి పంటలను ఆదుకున్న ఎల్లంపల్లి నీరు ప్రస్తుత యాసంగి సీజన్లో వరదకాలువ ఆధారంగా చాలా మంది రైతులు వరి సాగుచేశారు. కాగా వరి పంటలు ఈనే సమయంలో నీటి కొరత ఏర్పడింది. ఈక్రమంలో ఎల్లంపల్లి నీరును వరదకాలువకు విడుదల చేయాలని రైతులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విన్నవించారు. ఎమ్మెల్యే సత్యం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో మాట్లాడి వరదకాలువకు నీరు విడుదల చేయించి పంటలను కాపాడారు. ఐదు డివిజన్లు ఏర్పాటు చేశారు. ఐదు డివజన్ల పరిధిలో ఐదుగురు ఈఈలు, ఇద్దరు ఎస్ఈలు పర్యవేక్షిస్తారు. జీవనదిలా.. వరదకాలువలో నిల్వ ఉండే నీరు సుమారు 18 మీటర్ల లోతు ఉంటుంది. ఈనీటితో నిజామాబాద్ జిల్లాతో పాటు, ఉమ్మడి కరీంనగర్లో ఉన్న జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలోని మండలాల్లో రైతులు వానాకాలం సీజన్లో సుమారు లక్ష ఎకరాల మేర వరి సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కథలాపూర్, కోరుట్ల, మేడిపెల్లి, మల్యాల మండలాల్లో సుమారు 50 వేల ఎకరాల్లో, కరీంనగర్ జిల్లా పరిధిలోని గంగాధర, రామడుగు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో, రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఐదు వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. వరదకాలువ నీటితో జగిత్యాల జిల్లాలో ఎక్కువగా వరి సాగు అవుతోంది. రైతులు వరదకాలువకు ఇరువైపులా మోటార్లు అమర్చుకుని వ్యవసాయ భూములకు పైపులైన్ల ద్వారా నీరు అందిస్తూ సేధ్యం చేస్తున్నారు. ఎల్లంపల్లి నీరు చేరికతో జలసిరి ఎండాకాలంలో సైతం వరదకాలువలో నీరు గత వానాకాలం, యాసంగి పంటలకు నీరు ఎస్సారెస్పీ నుంచి 122 కి.మీ. మేర వరదకాలువవరదకాలువ స్వరూపం పొడవు : 122 కిలోమీటర్లు విస్తరించి ఉన్న జిల్లాలు: నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల డివిజన్లు: 05 స్టోరేజీ కెపాసిటీ : 1.7 టీఎంసీ ప్రస్తుతం ఉన్న నీరు : సుమారు ఐదు మీటర్లు -
చిన్న బాబుకు పెద్ద కష్టం
కోరుట్ల: పదమూడేళ్లు నిండలే దు.. రెండు కిడ్నీల్లో వాపులు వ చ్చి దెబ్బతిన్నాయి.. ట్రీట్మెంట్ కోసం రూ. లక్షల్లో ఖర్చు చేయాల్సిన దుస్థితి. ఆ పేద కుటుంబంపై పెనుభారం పడింది. బాబు బాగు కోసం ఆ తల్లిదండ్రులు ప డుతున్న వ్యథ అంతాఇంతా కాదు. కోరుట్లలోని ఏసికోని గుట్టలో నివాసముండే శ్రీనివాస్–మానస దంపతుల కుమారుడు వాసు. ఏడాది నుంచి కిడ్నీ వాపులతో ఆరోగ్యం క్షీణించగా చికిత్స కోసం జగి త్యాల, కరీంనగర్ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించారు. చిన్నవయసులోనే రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని తేలిపోయింది. అసలే రోజువారీ కూలీనాలి చేసుకుని పొట్టగడుపుకునే ఆ కుటుంబం..ఉన్న బంగారం అమ్ముకుని రూ. 3 లక్షల దాకా అప్పు చేసి చి కిత్స కోసం నిమ్స్కు వెళ్లారు. దాదాపు నాలుగు నెలలుగా చికిత్స అందుతున్నాఅదనపు ఖర్చులు భా రంగా మారాయి. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ పరిస్థితిలో తమ బాబును దక్కించుకోవడానికి శ్రీనివాస్ దంపతులు లెక్కలేని తిప్పలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు తమను ఆర్థికంగా ఆదుకుని బాబును కాపాడుకోవడానికి ఆసరా ఇవ్వాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు. రెండు కిడ్నీలు ఫెయిల్ నాలుగు నెలలుగా నిమ్స్లో చికిత్స పేద కుటుంబంలో పెను చిచ్చు అపన్నహస్తం కోసం ఎదురుచూపులు -
ఓపెన్ విద్యలో ఫీ‘జులుం’!
సిరిసిల్లటౌన్: మధ్య వయస్కులు, రెగ్యులర్గా చదువు ఆపేసిన వారి ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఓపెన్ స్టడీ సొసైటీ(టాస్) ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఓపెన్స్కూల్, ఇంటర్ విద్య అక్రమార్కులకు నెలవుగా మారింది. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుకు మించి అభ్యర్థుల నుంచి వసూళ్లకు పాల్పడటం వివాదానికి దారితీసింది. అభ్యర్థులకు తరగతుల నిర్వహణ మాట అటుంచి కనీసం స్టడీ మెటీరియల్ లేకుండానే పరీక్షలు రాయించడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొన్న వైనమిది. 10 స్టడీ కేంద్రాలు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 10 స్టడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో ఓపెన్ టెన్త్లో 348, ఇంటర్మీడియట్లో 999 మంది అభ్యర్థులు చేరారు. వీరు ఆన్లైన్ telanganaopenschool.org వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సెస్సీ అభ్యర్థులు రూ.150 రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.1400 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు, ట్రాన్స్జెండర్స్, మహిళలకు అడ్మిషన్ ఫీజులో రూ.400 మినహాయింపు ఉంటుంది. ఇంటర్మీడియట్కు జనరల్ అభ్యర్థులు రూ.300 రిజిస్ట్రేషన్, రూ.1500 అడ్మిషన్ ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది. ఎంచుకున్న స్టడీసెంటర్లో ఆన్లైన్ దరఖాస్తు, ఇతర రషీదులు అందించాలి. ఫీజు చెల్లించిన అభ్యర్థులకు సెంటర్ నిర్వాహకులు ఉచితంగా స్టడీ మెటీరియల్తోపాటు సెలవు దినాల్లో తరగతులు నిర్వహించాలి. ఒక్కొక్కరి నుంచి రూ.1000 వసూలు ! అభ్యర్థుల నుంచి స్టడీమెటీరియల్ పేరుతో స్టడీ సెంటర్ల నిర్వాహకులు రూ.వెయ్యి చొప్పున అధికంగా వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు నిర్వాహకులైతే ఏకంగా అభ్యర్థుల నుంచి ఫోన్పే, గూగుల్పే ద్వారా వసూలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి కోర్సు అభ్యసనకు సొసైటీ నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందిస్తారు. అలా కాదని కొందరు నిర్వాహకులు అభ్యర్థుల నుంచి రూ.వేయి అధికంగా ముక్కుపిండి వసూలు చేశారు. అయితే అధికంగా వసూలు చేసిన వారు అభ్యర్థులకు కనీసం స్టడీ మెటీరియల్ అందించకపోవడం వివాదానికి దారితీసింది. ఈనేపథ్యంలో ఈనెల 20 నుంచి 27 వరకు ఓపెన్ విద్య పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులకు స్టడీమెటీరియల్ అందివ్వకపోవడంతో పరీక్షలు సరిగ్గా రాయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం. మాల్ప్రాక్టీస్కు డీఈవో చెక్ ఓపెన్ విద్య పరీక్షలు అంటే గతంలో మాల్ ప్రాక్టీస్కు అవకాశం ఉంటుందన్న పేరుంది. అయితే ఈఏడాది జిల్లా విద్యాధికారి జగన్మోహన్రెడ్డి ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేలా పటిష్ట చర్యలు చేపట్టారు. ఈక్రమంలోనే పరీక్ష కేంద్రాల ఇన్చార్జీలు, ఇన్విజిలేటర్ల నియామకంలో మార్పులు చేశారు. దీంతో అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందక చదవలేకపోవడంతోపాటు మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకపోవడంతో వారిలో ఆందోళన నెలకొంది. పరీక్షల్లో పాసయ్యేందుకు ఒకే సిట్టింగ్లో పాస్ గ్యారెంటీ పేరుతో కొందరు మధ్యవర్తులు అక్రమాలకు తెరలేపుతూ.. పలువురి నుంచి అదనపు వసూళ్లకు పాల్పడ్డట్లు చర్చ సాగుతోంది. అయితే డీఈవో మాల్ప్రాక్టీస్ జరక్కుండా చర్యలు తీసుకోవడం వారికి మింగుడు పడక తీసుకున్న డబ్బులను అభ్యర్థులకు తిరిగి చెల్లిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా నిబంధనలు ఉల్లంఘించి స్టడీ సెంటర్ల నిర్వాహకులు స్డటీమెటీరియల్ ఇవ్వకుండా అభ్యర్థులను పరీక్షలకు పంపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లో సుమారు 1,400 మంది అభ్యర్థులుండగా వారి నుంచి రూ.లక్షల్లో అ ధికంగా వసూలు చేయడం చర్చనీయాంశమైంది. ముక్కుపిండి వసూలు చేసిన అక్రమార్కులు ఒక్కొక్కరి నుంచి అదనంగా రూ.వెయ్యి ఆన్లైన్లో ఫీజులు.. ఆఫ్లైన్లో అధిక వసూళ్లు జిల్లా ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్లో అవినీతి వ్యవహారంఓపెన్ పరీక్షల్లో పారదర్శక విధానం ఓపెన్ విద్య పరీక్షల నిర్వహణలో పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నాం. మాల్ప్రాక్టీస్కు ఎలాంటి తావులేదు. స్టడీమెటీరియల్కు ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. నిర్ణీత రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఎవరైనా అధికంగా ఫీజు వసూలు చేసినట్లు అయితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – జగన్మోహన్రెడ్డి, డీఈవో -
ఇందిరమ్మ ఇంటికి అనుమతి ఇవ్వడం లేదని..
జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇల్లు మంజూరైనా నిర్మాణానికి పంచాయతీ సెక్రటరీ అనుమతులు ఇవ్వడం లేదని సారంగాపూర్ మండలం నాగునూర్ గ్రామంలో శుక్రవారం రేగుంట గంగు ఆందోళన చేపట్టింది. బాధితురాలు తెలిపిన వివరాలు.. రేగుంట గంగుకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం చేసుకునేందుకు సిద్ధం కాగా, గ్రామానికి చెందిన కొంత మంది ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వొద్దని పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీంతో కావాలనే పంచాయతీ కార్యదర్శి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని రేగుంట గంగు, పంచాయతీ కార్యదర్శికి డబ్బు ఇచ్చేందుకు రాగా నిరాకరిస్తూ వెళ్లిపోయాడు. ఈ విషయంపై సారంగాపూర్ ఎంపీడీవో సలీంను వివరణ కోరగా, ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు నిర్మించే భూమిపై వివాదం కొనసాగుతుందని, సెక్రటరీ డబ్బులు అడగలేదని పేర్కొన్నారు. సెక్రటరీకి రూ.50 వేలు ఇచ్చేందుకు డబ్బుతో వచ్చిన మహిళ నాగునూర్ పంచాయతీ వద్ద ఆందోళన -
పూరిగుడిసె దగ్ధం
ధర్మపురి: మండలంలోని రాజారం గ్రామానికి చెందిన గుర్రాల మమత, గంగాధర్ దంపతులు శుక్రవారం పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. గ్రామస్తులు ఫైరింజన్కు ఫోన్ చేయగా అది చేరుకునేలోగా గుడిసె పూర్తిగా దగ్ధమైంది. రూ.25 వేల నగదు, పట్టాదారు పాసు పుస్తకాలు, సుమారు రూ.లక్ష విలువ గల వస్తువులు కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ప్రముఖ గాయకుడు శంకర్శర్మ మృతి ధర్మపురి: ప్రముఖ గాయకుడు, తెలంగాణ ఘంటశాలగా ప్రసిద్ధి చెందిన రిటైర్డ్ టీచర్ గుండి శంకర్శర్మ (72) మృతిచెందారు. ధర్మపురికి చెందిన గుండి శంకర్శర్మ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా 2013లో రిటైర్డ్ అయ్యారు. 10 రోజుల క్రితం గుండెనొప్పి రాగా వైద్యులు స్టంట్ వేశారు. శుక్రవారం వేకువజామున మరోసారి గుండెనొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందారు. ఆయన మృతిపై ఉపాధ్యాయ సంఘాలు, గాయకులు, కవులు, కళాకారులు సానుభూతి తెలిపారు. -
రేపటి నుంచి స్వీయ లెక్కింపు
కరీంనగర్ కార్పొరేషన్: జనగణన 2027లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి నగరప్రజలు స్వీయ లెక్కింపు (సెల్ఫ్ ఎన్యుమరేషన్) చేసుకోవచ్చని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి దశలో గృహ లెక్కింపు, గృహ పరిస్థితుల లెక్కింపు మే 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. అంతకుముందే ప్రజల సౌలభ్యం కోసం స్వీయ లెక్కింపు సదుపాయం కల్పిస్తున్నామన్నారు. ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. వివరాలు నమోదు పూర్తయిన తరువాత ఒక యూనిక్ కోడ్ వస్తుందని, ఆ కోడ్ను సంబంధిత ఎన్యుమరేటర్కు చూపించాలన్నారు. ఎస్ఐఆర్ను పారదర్శకంగా చేపట్టాలి ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పారదర్శకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఓటరు జాబితా సమగ్ర సవరణ) ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం పలు డివి జన్ల పరిధిలో జరుగుతున్న ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పర్యవేక్షించారు. బీఎల్వోలు, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలతో పాటు మరణించిన, వలస వెళ్లిన వారి పేర్ల తొలగింపు తదితర వివరాలను అడిగి తెలుసుకొన్నారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల, పక్కపక్క డివిజన్లలో ఓటు హక్కు ఉన్నట్లు గుర్తిస్తే, క్షేత్రస్థాయి విచారణ జరిపి నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రావొద్దు నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మానేరుడ్యాం సమీపంలోని బూస్టర్ పంపులను సందర్శించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేస్తున్న రా వాటర్ సంపు, రిజర్వాయర్ అభివృద్ధి పనులను తనిఖీచేశారు. డీఈ దేవేందర్ అధికారులున్నారు. -
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం
రాయికల్(జగిత్యాల): నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడమే జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ధ్యేయమని మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. రాయికల్ పట్టణంలోని జీఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్, జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణపొందిన వారికి శుక్రవారం సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ, నిరుద్యోగులు తమ కుటుంబాలను పోషించుకునేందు కు శిక్షణ ఎంతో దోహదపడుతుందన్నారు. ఇలాంటి ట్రస్ట్లకు పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు సేవలందించాలని పేర్కొన్నారు. యువత మాత్రం మాదక ద్రవ్యాలకు బానిసలై భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, రాయికల్ మండలం బోర్నపల్లి, జగన్నాథపూర్ బ్రిడ్జి నిర్మాణం కో సం తాను, ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర మంత్రి ని కలిశామని, నిధుల మంజూరుకు విద్యాసాగర్రా వు కృషి చేయాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రాంతీయ ప్రచారక్ లింగం శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ కట్కం రవీందర్, కౌన్సిలర్ రాకేశ్నాయక్, జీఎంఆర్ ప్రో గ్రాం ఆఫీసర్ మహేశ్, జీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఇన్చార్జి ముత్యం రాజిరెడ్డి, ప్రతిమ ఫౌండేషన్ ప్రో గ్రాం మేనేజర్ గీతరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కౌశి క్, ఆర్గనైజర్లు రఘుపతి, విజయ, శ్యామల, సిబ్బంది ప్రమోద్, నాగేందర్, చిరంజీవి పాల్గొన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు -
డంపింగ్ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి
హుజూరాబాద్: హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్ నాయకులను పట్టణంలో తిరగనీయమని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలో బీజేపీ మండల,పట్టణశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆఽందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. డంప్ యార్డు నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్ నేతల ఇళ్ల ఎదుట చెత్త కుప్పలు, చనిపోయి కుళ్లిపోయిన జంతువుల కళేబరాలను వదిలేస్తామన్నారు. దుర్గంధం ఎంత భయంకరంగా ఉంటుందో అర్థిమయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లను కలిసి ఫిర్యాదు చేస్తామని, గవర్నర్ను కలిసి సమస్య తీవ్రత వివరిస్తామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పట్టణ, మండల అ ధ్యక్షులు తూర్పటి రాజు, పారుపల్లి కొండాల్రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్మలారెడ్డి, నాయకులు మాడ వెంకట్రెడ్డి, పుప్పాల రఘు, నర్సింహరాజు, రాజు, రమేశ్ పాల్గొన్నారు. -
ఉమ్మడి జిల్లాలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ల బదిలీ
జగిత్యాలజోన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు కోర్టుల్లో పనిచేస్తున్న జ్యుడీషియల్ మెజి స్ట్రేట్లను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్లో పనిచేస్తున్న షీరీనాను రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్, జగిత్యాలలో పనిచేస్తున్న శ్రీనిజ కోహిర్కర్ను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మెట్పల్లిలో పనిచేస్తున్న ఎన్.అరుణ్కుమార్ను రంగారెడ్డి జిల్లా అమన్గల్, వేములవాడలో పనిచేస్తున్న కె.జ్యోతిర్మయిని ఖమ్మం, సిరిసిల్లలో పనిచేస్తున్న ఎ.ప్రవీణ్ను ఖమ్మం, గోదావరిఖనిలో పనిచేస్తున్న డి.వెంకటేశ్ను గద్వాలకు బదిలీ చేశారు. అలాగే, ఖమ్మంలో పనిచేస్తున్న వి.మాధవిని మెట్పల్లి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పనిచేస్తున్న యశ్వంత్సింగ్ను కరీంనగర్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో పనిచేస్తున్న అపర్ణను పెద్దపల్లి జిల్లా మంథనికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైకోర్టు జడ్జీలను కలిసిన బార్ అసోసియేషన్ సభ్యులుకరీంనగర్ క్రైం: హైకోర్టు జడ్జిలను నూతనంగా ఎన్నికై న కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రతి నిధులు అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలిశారు. కరీంనగర్ పోర్ట్ పోలియో జడ్జి జస్టిస్ తుకారాంజీ, జస్టిస్ ఇవి. వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. బార్ కౌన్సిల్ సభ్యులు పొన్నం అశోక్, సుజాతను కలిశారు. కోర్టు భవనాలు త్వరగా పూర్తిచేసేలా చూడాలని కోరగా, సానుకూలంగా స్పందించారు. ప్రధాన కార్యదర్శి సీహెచ్.కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు బండ శివకుమార్, బి.గీతారాణి, జా యింట్ సెక్రటరీ ఎస్.దేవకిషన్, ట్రెజరర్ బి. స్వామి, లైబ్రరీ సెక్రటరీ బి.రాజేశ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ బి.శ్రీకాంత్ పాల్గొన్నారు. కో ఆప్షన్ ఎన్నికపై గోప్యమెందుకు..?కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ ఎన్నికను చట్టవిరుద్ధంగా నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ రవీందర్ సింగ్ ధ్వజమెత్తారు. శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో మాట్లాడుతూ కో ఆప్షన్ ఎన్నిక ప్రక్రియను ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో బీజేపీ పాలకవర్గం, కమిషనర్, కలెక్టర్ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఎన్నిక నిర్వహించనుండగా, ఇప్పటివరకు ఎవరు పోటీచేస్తున్నారో కూడా కార్పొరేటర్లకు తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. 46 మంది పోటీ చేస్తున్నారనే సమాచారం పత్రికల ద్వారా నే తెలిసిందని, అధికారికంగా మాత్రం ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఓట్లు వేయాల్సిన కార్పొరేటర్లకు ఎవరు పోటీచేస్తున్నారో తెలియకపోవడమేమిటని ప్రశ్నించారు. మున్సిపల్ యాక్ట్–2019 సెక్షన్ 11 ప్రకారం ప్రస్తుత జనరల్బాడీలో ప్రాతినిధ్యం లేని మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పించాలని నిబంధనలు ఉన్నప్పటికి, పూర్తిగా పక్కనపెట్టారన్నారు. నాయకులు తుల భాస్కర్రావు, జక్కని ఉమాపతి, మహమ్మద్ ఇస్తియాక్ అహ్మద్, మైకేల్ శ్రీనివాస్, దండబోయిన రాము, కెమసారం తిరుపతి పాల్గొన్నారు. ఉపాధి పనులు తనిఖీకొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం నాగులమల్యాలలో శుక్రవారం గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను డీఆర్డీవో శ్రీధర్ తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వేసవిలో ఎండ తీవ్రతను అధిగమించేందుకు జాగ్రత్తలు పాటించాలన్నారు. మంచినీటి సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక చికిత్స కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ లక్కాకుల చంద్రకళ మోహన్రావు, ఏపీవో శోభారాణి, కవిత, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆదుకున్న ఎల్లంపల్లి నీరు
యాసంగి సీజన్లో తొమ్మిదిన్నర ఎకరాల మేర వరి సాగుచేసిన. వరి ఈనే సమయంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొరవతో ఎల్లంపల్లి నీరు విడిచారు. ఆరున్నర ఎకరాలు వరికోసిన. సుమారు 210 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చింది. ఇంకా మూడెకరాలు వరి కోయాల్సి ఉంది. – నిమ్మ చెంద్రారెడ్డి, దేశాయిపల్లి విలాసాగర్లో వరద కాలువ నీరు ఆధారంగా యాసంగి సీజన్లో 8 ఎకరాల మేర వరి పంట సాగు చేశాను. కాలువ నుంచి చేలోకి కిలోమీటర్ మేర పైపులైన్ వేసుకున్నాను. మోటారు అమర్చుకుని పంటలకు నీరు అందిస్తాను. గతేడాది వానాకాలం సీజన్లో వరి పంట సాగు చేశాను. – గంగాధర కనకయ్య, విలాసాగర్ వరదకాలువ మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయినిగా మారింది. యాసంగి పంటలు కాపాడేందకు సరైన సమయంలో ఎల్లంపల్లి నీరు విడుదల చేయించడం జరిగింది. జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో వానాకాలం, యాసంగి సీజన్లలలో రెండు పంటలు సాగు చేస్తున్నారు. ఈఎండాకాలంలో సైతం వరదకాలువలో నీరు నిల్వ ఉంది. – మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే, చొప్పదండి -
తిరుగులేని సంస్థ భారతి సిమెంట్
కరీంనగర్: సిమెంట్ వ్యాపారంలో తిరుగులేని సంస్థగా వికాట్ గ్రూపుకి చెందిన భారతి సిమెంట్ ఎదుగుతోందని సంస్థ మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ మైత్రి హోటల్లో సివిల్ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మధుసూదన్రెడ్డి మాట్లాడుతూ వికాట్ గ్రూప్ కంపెనీస్ ప్రపంచంలోని 12 దేశాల్లో విస్తరించి ఉన్నయాని తెలిపారు. మార్కెట్లో లభించే ఇత ర సిమెంట్తో పొలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్తో నిర్మాణ ప్రక్రియ చాలావేగవంతంగా పూర్తవుతుందని తెలిపారు. టెక్నికల్ మేనేజర్ సునీల్ మాట్లాడుతూ, అల్ట్రాఫాస్ట్ సిమెంట్ ముఖ్యంగా స్లాబులు, పిల్లర్లు, బ్రిడ్జిలు, రోడ్లకు సరైన ఎంపికన్నారు. మార్కెటింగ్ మేనేజర్ రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఇతర సిమెంట్లతో పోలిస్తే భారతి అల్ట్రాఫాస్ట్ సర్వీస్ చాలా వేగంగా ఉంటుందన్నారు. ఈసమావేశంలో మార్కెటింగ్ ఆఫీసర్ అభిలాష్, ఇంజినీర్స్ పాల్గొన్నారు. మార్కెటింగ్ చీఫ్ మేనేజర్ మధుసూదన్ రెడ్డి -
నడుం నొప్పి.. కంటి సమస్య
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్) ప్రక్రియ నమోదు సిబ్బందికి కొత్త సమస్యలు తీసుకొస్తోంది. సర్ దరఖాస్తు పత్రంలో 2003నాటి ఎస్ఐఆర్ ప త్రంలో ప్రచురితమైన ఓటరు వ్యక్తిగత వివరాలను అతడు లేదా ఆమె, తాతతండ్రుల పేర్లను కాని ఇవ్వాలి. ఈ మేరకు 2003 నాటి ఓటరు జాబి తాలను ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఉంచారు. ఏ ఓటరుకై నా 2003జాబితాలోని తన అసెంబ్లీ నియోజకవర్గం కానీ, పోలింగ్ బూత్ కానీ స్పష్టంగా తెలియకపోతే పెద్ద చిక్కే వస్తుంది. దీంతో ఆ ఓట రు వివరాల కోసం ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్ల్లో వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటరు దీర్ఘకాలంగా ఒకేచోట నివసిస్తున్నా, నియోజకవర్గం, పోలింగ్ కేంద్రం మారిపోయిన వారి వివరాలను వెతకడం సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయా ఓటర్ల వివరాలను 2003 జాబితా ఆధారంగా సేకరించలేక బీఎల్వోలకు కొత్తగా కంటి స మస్యలు, నడుం నొప్పి వస్తోందని వాపోతున్నారు.సర్ అంటే ఏమిటంటే.. -
అంజన్నకు వెండి గద బహూకరణ
మల్యాల(చొప్పదండి): కొండగట్టు ఆంజనేయస్వామికి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సతీమణి మనాలి రూ.1.38లక్షల విలువైన గద బహూకరించారు. శుక్రవారం ఆంజనేయస్వామిని దర్శించుకుని 453గ్రాముల వెండి గద అధికారులకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రామకృష్ణ, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవస్వామి, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, చెక్కిళ్ల అశోక్ పాల్గొన్నారు. ‘మా భూమి మాకు ఇప్పించండి’ గోదావరిఖని: కబ్జాకోరుల నుంచి రక్షించి త మ భూమి తమకు ఇప్పించాలని పెద్దపల్లి జి ల్లా గోదావరిఖనిలోని అడ్డగుంటపల్లికి చెందిన ముప్పులక్ష్మి–ఐలయ్య దంపతులు కోరారు. శుక్రవారం స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.1983 లో గోదావరిఖని అడ్డగుంటపల్లి సర్వే నంబర్ 666 లో 240 గజాల భూమిని తన పేరున కొనుగోలు చేశామన్నారు. భూమి ఖాళీగా ఉండడంతో కొంతమంది కలిసి నకిలీ దస్తావేజులు సృష్టించి అందులో షెడ్డు వేసుకున్నారని ఆరోపించారు. ఆ భూమిపై 1983 నుంచి లింక్ డాక్యుమెంట్లతో సహా అన్నిఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. వారిలో దళితులు ఉండడంతో భూమి వద్దకు వచ్చి గొడవ చేస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ విషయంలో కలెక్టర్ జోక్యం చేసుకుని తమ న్యాయం చేయాలని దంపతులు కోరారు. జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బొల్లె సిద్దార్థను (18) గుర్తుతెలి యని వాహనం ఢీకొని మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చల్గల్కు చెందిన బొల్లె సిద్దార్థ, మదన్, మసీదు వెంకటేశ్ గురువారం రాత్రి గ్రామ శివారులోని మ్యాంగో మార్కెట్లో కూలీ పని కోసం వెళ్లారు. పని ముగించుకుని శుక్రవారం వేకువజామున 3.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా జగిత్యాల–నిజామాబాద్ ప్రధాన రహదారిపై చల్గల్ సబ్స్టేషన్ వద్ద వెనక నుంచి వాహనం ఢీకొనడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సిద్దార్థను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. కాగా, ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సిద్దార్థ మృతితో చల్గల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుడి సోదరుడు దుబాయ్లో ఉండటంతో శనివారం ఉదయం అతను రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తాం
● ట్రాఫిక్ నియమాలు పాటించాలి ● డీజీపీ శివధర్రెడ్డి ● రుద్రంగిలో నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపనరుద్రంగి(వేములవాడ): రాష్ట్రంలో సిటీజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ బి.శివధర్రెడ్డి అన్నారు. రుద్రంగిలో రూ.2.50కోట్లతో నిర్మించే ఆధునిక పోలీస్స్టేషన్ భవన పనులకు శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి శంకుస్థాపన చేశారు. డీజీపీ శివధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజల కేంద్రంగానే సేవలు అందించేలా పోలీసులకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక మరణాలు రోడ్డు ప్రమాదాలతోనే జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సేవలు ఎంతో కీలకం ప్రజల రక్షణలో పోలీసుల సేవలు ఎంతో కీలకమైనవి అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించేలా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. అరైవ్.. అలైవ్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. వేములవాడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్, మహిళా పోలీస్స్టేషన్ కేటాయించాలని, భీమారంలో కొత్తగా పోలీస్స్టేషన్ మంజూరు చేయాలని, వేములవాడ ఆలయ భద్రత సిబ్బంది సంఖ్యను పెంచాలని డీజీపీని కోరారు. నూతన పోలీస్స్టేషన్ ఎంతో కీలకం కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజలకు భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు నూతన పోలీస్స్టేషన్ ఎంతో అవసరమన్నారు. జిల్లా పోలీస్ శాఖ, అధికార యంత్రాంగంతో కలిసి ఇటీవల జిల్లాలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు, మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రశాంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. అరైవ్.. అలైవ్లో భాగంగా జాతీయ భద్రతా మాసోత్సవాలు నిర్వహించామన్నారు. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇటీవల జిల్లాలో నో హెల్మెట్.. నో ఎంట్రీ అమలు చేస్తున్నామని తెలిపారు. నేరాల నియంత్రణకు.. రుద్రంగి మండలం చిన్నదని, రుద్రంగి పోలీస్స్టేషన్ పరిధిలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మండల ప్రజల సహకారంతో మండల కేంద్రంలో నేరాల నియంత్రణకు ఇటీవల హై క్వాలిటీ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ (ఏఎన్పీఆర్) సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మితమయ్యే ఈ పోలీస్స్టేషన్ ద్వారా మండల ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయన్నారు. రాష్ట్ర కో ఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మోహన్రెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, ఆర్డీవో రాధాభాయ్, డీఎస్పీ శ్రీనివాసులు, తహసీల్దార్లు పుష్పలత, జయంత్కుమార్, సీఐ వెంకటేశ్వర్లు, సర్పంచ్ లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి పాల్గొన్నారు. భీమన్న ఆలయంలో పూజలు వేములవాడ: భీమేశ్వరస్వామి వారిని డీజీపీ శివధర్రెడ్డి దర్శించుకున్నారు. ముందుగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆలయంలో అర్చకులు, వేదపండితులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు తీర్థ ప్రసాదం అందజేశారు. ఆలయ డీఈవో భాస్కరశర్మ స్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదం అందజేశారు. -
శాంతిర్యాలీ.. సంతాపం
కరీంనగర్టౌన్: తమ డిమాండ్లు పరిష్కరించాలని చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని అన్ని డిపోల పరిధిలో శుక్రవారం కార్మికులు ఆందోళనను కొనసాగించా రు. సమ్మెకారణంగా ప్రయాణికులకు తిప్పలు త ప్పలేదు. ప్రైవేటు వాహనాల దోపిడీ యథావిధిగా కొనసాగింది. కరీంనగర్లోని ఒకటో డిపో ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాకు మేయర్ కొలగాని శ్రీనివాస్ సంఘీభావం ప్రకటించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్ నుంచి అమరవీరుల స్తూపం వరకు శాంతిర్యాలీ నిర్వహించారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం ప్రకటించారు. మే యర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయపోరాటానికి బీజేపీ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తన మొండివైఖరిని వీడాలన్నారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాతంగి అశోక్ కార్మికులకు మద్దతు తెలిపారు. మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా 60వేల మంది తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం కనీసం స్పందించకుండా నలుగురు ఐఏఎస్ అధికారుల కమిటీ పేరుతో కాలయాపన చేయడం వంచించడమేనని అన్నారు. -
మిస్సింగ్ కేసు నమోదు
జ్యోతినగర్: ఇంటినుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్లో చోటుచేసుకుంది. ఎస్సై ఉదయ్ కిరణ్ కథనం ప్రకారం.. మాణిక్రావు సతీశ్(40) ఎన్టీపీసీ ప్రాజెక్టులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో ఈనెల 22న సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. సతీశ్ భార్య నిర్మల శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనుమతులు లేకుండా తరలిస్తున్న వాహనాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. మండలంలోని సింగారం గ్రామానికి చెందిన సంపంగి బాబు అనే వ్యక్తి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నారు. అనుమతుల సమయం దాటిన తర్వాత ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఆర్టీసీ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్.. దొందూ దొందే
సాక్షి, కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అన్యాయమే చేశాయని విమర్శించారాయన. కార్మికుల కోసమే శంకర్ బలిదానం అయ్యాడని.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని బండి సంజయ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వలన నర్సంపేటకి అర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కార్మికుల కొసం శంకర్ గౌడ్ బలిదానం అయ్యాడు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం హత్యనే. కాంగ్రెస్ ప్రభుత్వం బెదిరింపులకు దిగడం సరికాదు. ఆర్టీసీలో 39 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్లు దుర్భర జీవితం గడుపుతున్నారు. రిటైర్డ్ కార్మికులకు వచ్చే ఫించన్ కూడా చాలా తక్కువ. బీఆర్ఎస్ హయాంలో కార్మికులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించారు. ఆ సమ్మెలో 20 మంది చనిపోయారు. అయినా బీఆర్ఎస్ కనికరించలేదు. కార్మికులు 52 రోజులపాటు సమ్మె చేశారు. ఆ సమయంలో కార్మికుల కోసం పోరాడి మేం జైలుకు వెళ్లాం. మా పోరాటం ఫలితంగానే బీఆర్ఎస్ దిగి వచ్చింది. కాంగ్రెస్ది అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆర్టీసీ పునరుద్ధరణకు సహకరిస్తామని చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే ఆ హామీని నెరవేరుస్తామని చెప్పింది. కానీ, 900 రోజులు అవుతున్నా ఆ డిమాండ్లు నెరవేరలేదు. ఆ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ఇవాళ కార్మికులు అడుగుతున్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం వ్యవహారిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ.. కేంద్రాన్ని అడిగి మీ మేనిఫెస్టో రూపకల్పన చేశారా? బీఅర్ఎస్ పార్టీ మోసం చేసిందనే కదా మీకు ఓటు వేసింది. అలాంటప్పుడు కమిటీల పేరుతో కాలయాపన ఎందుకు?. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యని పరిష్కారించాలి. మంత్రుల యాభై శాతం జీతం కోత వలన ఏం ప్రయోజనం?. డిల్లీ, తమిళనాడు, కేరళ,అస్సాం రాష్ట్రాలకి తెలంగాణ నుండే డబ్బులు పోతున్నాయి. మంత్రులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తుల్లో సగం అమ్మినా కార్మికుల బాధలు పొతాయి అని విమర్శలు గుప్పించారాయన. ఆర్టీసీ కార్మికుల దీక్షకి బీజేపీ సంపూర్ణ మద్దతు ఉందన్న బండి సంజయ్.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా లైసెన్స్, శిక్షణ లేనివారిని తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అలాగే తొందరపడవద్దని.. కలిసి కొట్లాడుదామని ఆర్టీసీ కార్మికులకు ఆయన పిలుపు ఇచ్చారు. -
ప్రయాణికులకు రెండోరోజూ సమ్మె తిప్పలు
కరీంనగర్టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగింది. గురువారం అద్దెబస్సులతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్తో పాటు గోదా వరిఖని, నిజామాబాద్, మంచిర్యాల, వరంగల్ వంటి ప్రధాన రూట్లలో నడిపారు. బస్సుల బంద్తో కరీంనగర్ బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఇక్కట్లు పడ్డారు. ప్రైవేటు వాహనాల యజమానులు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసుల భద్రత నడుమ కొన్ని బస్సులు నడిచాయి. ఆర్టీసీ కార్మికులు ఉదయం 10 గంటలకే వన్డిపో గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి బీజేపీ, బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఏఐటీయూసీ, సీఐటీయూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీలు మద్దతుగా నిలిచాయి. నేటి నుంచి జేఏసీ కార్యాచరణ ప్రకటించారు. 24న డిపోల ఎదుట మౌన ప్రదర్శన, 25న వంటావార్పు, 26న కార్మిక కవాతు, 27న ప్రజాప్రతినిధులకు, మంత్రులకు వినతిపత్రాల సమర్పణ, 28న మహిళా ఉద్యోగులతో నిరసన, 29న అర్ధనగ్న ప్రదర్శనలు చేయాలని జేఏసీ నిర్ణయించింది. కాగా.. రీజియన్ పరిధిలోని 11 డిపోల ద్వారా రోజుకు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ఆదా యం వచ్చేది. సమ్మె కారణంగా ఆదాయం రూ.15 లక్షలు దాటడం లేదని ఓ అధికారి వెల్లడించారు. -
మొగులు.. బుగులు
కరీంనగర్ అర్బన్: పంట చేతికందే సమయాన అన్నదాతకు చినుకు చింత నెలకొంది. గురువారం జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లలో పలు చోట్ల వర్షం కురియగా రెండ్రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతుండగా, చేతికందివచ్చిన పంట కొంత కల్లాల్లో, కొంత చేలలోనే ఉండటంతో అరిగోస పడుతున్నారు. హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, శంకరపట్నం, గన్నేరువరం, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, శంకరపట్నం తదితర ప్రాంతాల్లో వర్షం కురియగా చేతికందివచ్చిన వరి కోసేందుకు రైతులు పాట్లు పడుతున్నారు. కమ్ముకున్న మేఘాలు జిల్లాలో ఎక్కువశాతం వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, మినుము పంటలు వేశారు. హుజూరాబాద్, సైదాపూర్, వీణవంక, చిగురుమామిడి, గన్నేరువరం మండలాల్లో వరి కోతలు మొదలయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని ప్రకటనలు గుప్పిస్తుండగా ఎక్కడా కొనుగోళ్లు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో యాసంగిసాగు విీస్తీర్ణం 3.01లక్షల ఎకరాలు కాగా 2.75లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో వరి సాగైంది. ఇందులో దొడ్డురకాలే సింహభాగం ఉండగా కోతల దశకు చేరుకున్నాయి. 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించగా ఇప్పటివరకు వరకు కొనుగోలు కేంద్రాలు మొదలవలేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 1.50లక్షల ఎకరాలకు పైగా వరి పంట చేలలోనే ఉండగా కోత దశకు చేరింది. ఈ సమయంలో మేఘావృతం కావడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దోచుకుంటున్న హార్వెస్టర్ యజమానులు హర్వెస్టర్ యజమానులు రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు. కమ్ముకున్న మేఘాల క్రమంలో రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా దోచుకుంటున్నారు. జిల్లాలో సుమారు వంద వరకు హార్వెస్టర్లుండగా ఇతర జిల్లాల నుంచి లీజుపై మరో వంద వరకు కోతలు కోస్తున్నాయి. గతంలో గంటకు రూ.1600 తీసుకోగా ప్రస్తుతం రూ.1800 వరకు వసూలు చేస్తున్నారు. ఎకరా కోతకు రెండు గంటలు పడుతుండగా జిల్లా రైతులపై రూ.కోట్ల భారం పడుతోంది. ఇక దిగబడే పొలాల్లో కోసేందుకు గంటకు రూ.2400 నుంచి రూ.2600 వరకు వసూలు చేస్తున్నారు. -
భగీరథ మహర్షి సంకల్పం ఆదర్శం
● కలెక్టర్ చిత్రామిశ్రా కరీంనగర్ టౌన్: శ్రీ సగర భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వం తరఫున అందించే విద్య, స్కాలర్షిప్, విద్యాలయాల్లో సీట్లు, అందించే రుణాలపై సగర సంఘం నాయకులకు అవగాహన కల్పించాలని బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్ను కలెక్టర్ ఆదేశించారు. ఆర్డీవో మహేశ్వర్, వివిధశాఖల ఉన్నతాధికారులు, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు దేవుని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కట్ట రాజు, కోశాధికారి కుమారస్వామి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వహక సభ్యులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్కరీంనగర్ అర్బన్: జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా డి.శ్రీనివాస్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన లక్ష్మికిరణ్ సిద్దిపేటకు బదిలీ కాగా ఇన్చచార్జి అదనపు కలెక్టర్గా కరీంనగర్ ఆర్డీవో కె.మహేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శ్రీనివాస్రెడ్డికి ఆర్డీవో కె.మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్, సూపరింటెండెంట్లు రాజేశ్, మాధవి, మడిపల్లి కాళిచరణ్, నేరేళ్ల కిషన్ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్యూను అన్ని రంగాల్లో ముందుంచుతాంకరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంచుతామని వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయాల చాన్స్లర్ శివ్ ప్రతాప్ శుక్లాను గురువారం హైదరాబాద్లో కలిశారు. శాతవాహన విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్ర యత్నం చేస్తున్నామని తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, విద్యార్థులకు ముఖ బయోమెట్రిక్ అమలు చేస్తున్నామని, అన్ని కళాశాలలకు డిజిటల్ తరగతి గదులు, మిషన్ భగీరథ పైప్ లైన్ సాయంతో 24గంటల పాటు నీటి సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. -
చేతులెత్తేశారు!
కరీంనగర్ కార్పొరేషన్: కో ఆప్షన్ ఎన్నికలపై బీజేపీయేతర పార్టీలు దాదాపు చేతులెత్తేశాయి. చేతులెత్తే పద్ధతిలో ఎన్నిక జరగనుండడం, రహస్య ఓటింగ్ లేకపోవడం, ఇప్పటికే ఎన్నికకు దూరమంటూ కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పోటీ చేయాలా వద్దా అనే అంశంపై శుక్రవారం అధికారికంగా వెల్లడించనున్నట్లు చెబుతున్నారు. ఐదుస్థానాలు కై వసం చేసుకోవడంపై బీజేపీ పూర్తిస్థాయిలో ధీమాగా ఉంది. ఐదుస్థానాలకు 40 మంది పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ మాజీలు విత్డ్రా బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు పలువురు కో ఆప్షన్ పోటీనుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు గందె మాధవి, బోనాల శ్రీకాంత్, జంగిలి ఐలేందర్ యాదవ్, జంగిలి సాగర్ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు నగరపాలకసంస్థ అధికారులకు గురువారం దరఖాస్తు చేశారు. వాటిని ఆమోదించే పరిస్థితి లేదని నగరపాలకసంస్థ అధికారులు చెబుతున్నారు. సాధారణ ఎన్నికల తరహాలో కో ఆప్షన్ ఎన్నికల్లో నామినేషన్లు, ఉపసంహరణ ఉండదు. ఓటింగ్కు పోటీదారుల జాబితా రూపొందించే నాటికి తాము పోటీలో ఉండమని మరోసారి దరఖాస్తు చేస్తే వారి పేర్లను తప్పిస్తారు. 25వ తేదీన ఎన్నిక జరగనుండగా, ఇప్పటికే జాబితాను రూపొందించారు. పోటీనుంచి విరమించుకుంటున్నట్లు గురువారం దరఖాస్తు ఇచ్చినా, ఇప్పటికే జాబితా తయారైనందున సాంకేతికంగా వారిని పోటీదారులుగానే పరిగణిస్తామని డీసీపీ బషీర్ తెలిపారు. సమన్వయ లోపంతో కాంగ్రెస్ దూరం పార్టీలో కొరవడిన సమన్వయం, పోటీకి పార్టీ నాయకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం తదితర కారణంగా కాంగ్రెస్ ఎన్నికలకు దూరంగా ఉంది. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై చర్చించేందుకు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఓ వైపు కార్పొరేటర్లు, నాయకులతో చర్చిస్తుండగానే, పార్టీ నేత ఒకరు ఇదే బాధ్యతను మరో కార్పొరేటర్పై పెట్టడం గందరగోళానికి గురిచేశాయి. ఇటీవల మేయర్ ఎన్నికలో కాంగ్రెస్కు చేయి ఇచ్చి బీజేపీకి బీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు పలికిన క్రమంలో తాము బీఆర్ఎస్తో కలిస్తే తప్పుడు సంకేతాలు పోతాయనే భావనను కార్పొరేటర్లు వ్యక్తం చేశారు. వీటిన్నిటి దృష్ట్యా ఎన్నికల్లోనే పాల్గొనరాదని నిర్ణయించారు. బీజేపీ ఖాతాలోకే... నగరపాలకసంస్థలో సంపూర్ణ మెజార్టీ ఉన్న అధికార బీజేపీ ఖాతాలోకే ఐదు కో ఆప్షన్ పదవులు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం 69 ఓట్లలో గెలవడానికి అవసరమైన 35 ఓట్ల బలం బీజేపీకి ఉండగా, ప్రతిపక్షాల్లో అనైక్యత ఆ పార్టీకి ఈ ఎన్నికల్లోనూ కలిసొస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్అఫిషియో ఓటు అవసరం లేకుండానే కై వసం చేసుకొంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. పోటీలో 40 మంది... ఐదు కో ఆప్షన్ పదవులకు గాను 40 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 46 మంది దరఖాస్తు చేసుకోగా, స్క్రూటినిలో పోటీకి అర్హత లేని నలుగురు మాజీ ఎంపీటీసీలు, ఒక ఎన్జీవో దరఖాస్తులు తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. ఒకరు ముందుగానే దరఖాస్తును ఉపసంహరించుకున్నారు. దీంతో 40 మంది పోటీదారులతో జాబితాను సిద్ధం చేశారు. 25వ తేదీన జరిగే ఎన్నికల్లో 40 మంది పేర్లను అధికారులు చదివి వినిపిస్తారు. అందులో నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు. -
భౌబోయ్ కుక్కలు!
కరీంనగర్: కుక్కల తాకిడికి ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నారు. వీధివీధినా గుంపులుగా తిరుగుతున్న కుక్కలు కాలికనడకన.. బైక్పై వెళ్లినా వెంటబడి దాడి చేస్తున్నాయి. వేసవిలో వేడిని తట్టుకోలేక విపరీత ధోరణి ప్రదర్శిస్తూ ప్రజలను హైరా నా పెడుతున్నాయి. వేడితో పాటు ఆహారం, నీటి లభ్యత తగ్గడంతో అగ్రెసివ్గా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి కుక్కల వద్దకు వెళ్లగానే ఒక్కసారిగా దాడి చేస్తున్నాయి. ఈ ఏడాది కుక్కల సంఖ్యతో పాటు వాటి బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒ క్క కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నమోదైన కుక్కకాటు కేసులు 5,565 ఉన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య రెట్టింపవగా జనాలు భయాందోళనకు గురవుతున్నారు. పెరిగిన సంతానోత్పత్తి.. ఇటీవల వీధికుక్కలు విపరీతమైన సంతా నోత్పత్తి పెంచుకున్న వ్యవహారం వీధుల్లో కనిపిస్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా ఏ వీధిలో చూసినా పిల్లలతో దర్శనమివ్వడం, పిల్లలను కాపాడుకునేందుకు అవి క్రూరంగా వ్యవహరించడం కనిపిస్తోంది. అత్యధిక ఉష్ణోగ్రతలతో.. జిల్లాలో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కుక్కల్లో విపరీతమైన ఇరిటేషన్ వచ్చి, దాహం ఎక్కువై స్వైరవిహారం చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఆగ్రహంతో ఎవరు కనిపించినా దాడి చేసేందుకు యత్నిస్తున్నాయి. సరైన సమయంలో ఆహారం, నీళ్లు దొరక్క ఇలా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా పిల్లలపై అధికంగా ప్రతాపం చూపుతున్నాయి. మాంసాహారానికి అలవాటు పడి.. జీవవ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్హాల్స్, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడ్డాయి. అక్కడ ఆహారం లభించనప్పుడు జనావాసాల వైపు తరలివస్తున్నాయి. ఆ సమయంలో చేతిలో సంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది తీవ్రంగా గాయపడుతున్నారు. అది ప్రాణాలు కోల్పోయే వరకు వస్తుంది. మాంసానికి అలవాటు పడిన కుక్కలు గ్రామాల్లో మేకలు, గొర్రెల మందలపై కూడా దాడులు చేసి వాటిని పీక్కు తింటున్నాయి. మూడేళ్లలో 10,390 కేసులు జిల్లాలో కుక్కకాటు బాధితుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. మూడేళ్లలో 10,390 కేసులు కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలోనే నమోదు కావడం వాటి దాడుల తీరుకు అద్దం పడుతుంది. ఇంకా పీహెచ్సీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య మరో 10 వేలకు పైగా ఉంటుందని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఆదేశాలు బుట్టదాఖలు వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జిల్లాలో మాత్రం ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్లు చేపట్టిన దాఖలాలు లేవు. కుక్కలను సంక్షణ కేంద్రాలకు తరలించడంలో యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.కుక్కకరిస్తే వెంటనే ఏం చేయాలి?స్థానిక సంస్థలు స్పందిస్తేనే వీధికుక్కలను అరికట్టడానికి శాసీ్త్రయ పద్ధతిలో ఏనిమల్ బర్త్ కంట్రోల్ శస్త్ర చికిత్సలు చేయడమే ఏకై క మార్గం. ఈ ప్రక్రియలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల పాత్రే కీలకం. నిబంధనల ప్రకారం ముందుగా స్థానిక సంస్థలు ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను నియమించాలి. ఆయా కమిటీల ఆధ్వర్యంలో సిబ్బ ందితో కుక్కలను పట్టుకొని పశుసంవర్ధక శాఖకు అప్పగించాలి. వాటికి పశువైద్యాధికారులు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తారు. ఇందుకు బల్దియాలు, పంచాయతీలు నడుం బిగించాలి.మూడేళ్లలో ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో కుక్కకాటు బాధితుల వివరాలునెల 2023–24 2024–25 2025–26 ఏప్రిల్ 192 205 315 మే 114 207 316 జూన్ 154 232 238 జూలై 194 196 361 ఆగస్టు 158 192 252 సెప్టెంబర్ 164 175 307 అక్టోబర్ 175 221 481 నవంబర్ 210 233 1,295 డిసెంబర్ 193 221 585 జనవరి 229 250 467 ఫిబ్రవరి 165 217 475 మార్చి 265 263 473 మొత్తం 2,213 2,612 5,565 -
● అధికారులకు మేయర్ కొలగాని హెచ్చరిక
తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే సరెండర్ చేస్తాకరీంనగర్ కార్పొరేషన్: తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే సరెండర్ చేస్తానని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను హెచ్చరించారు. నగరంలోని కోర్టు రిజర్వాయర్లో హైలెవెల్ జోన్ పరిధి నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. హైలెవెల్ పరిధిలో తరచూ తాగునీటి సమస్యలు తలెత్తుతుండడం, ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమావేశం వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నీటి సరఫరా సమయంలో ఈఈ, డీఈ, ఏఈ, లైన్మెన్, ఫిట్టర్ ఫీల్డ్లో ఉండి పర్యవేక్షించాలన్నారు. సరైన ప్రెషర్తో నీరు సరఫరా అవుతుందా, లేదా గమనించి సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదు వచ్చి నా పరిష్కరించాలన్నారు. అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలన్నారు. ప్రజలతో దురుసుగా మాట్లాడినట్లు తమ దృష్టికి వస్తే, చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. కోర్టు నుంచి సుభాష్నగర్ వరకు కొత్త పైప్లైన్ పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. నీటి సరఫరాలో 60 మందిని కొత్తగా తాత్కాలిక కార్మికులను తీసుకోవడం జరిగిందన్నారు. కార్మికుల సహకారంతో నగరవ్యాప్తంగా ఎక్కడా లీకేజీలు ఉన్నా గుర్తించి మరమ్మతు చేయాలన్నారు. అధికారులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలి ‘లైన్మెన్లు, ఫిట్టర్లు ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వరంగల్ నుంచి రాకపోకలు సాగిస్తూ పర్యవేక్షణ మరిచారు. చాలా చోట్ల పైప్లైన్లు, వాల్వ్లు సరిగా లేక నల్లా నీళ్లు రావడం లేదు. తాగునీటి సరఫరాను మెరుగుపరచాలి’ అంటూ కార్పొరేటర్లు ఏకరువు పెట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు వైద్యుల అంజన్కుమార్, చాడగొండ కవిత బుచ్చిరెడ్డి, సరిళ్ల రాజకుమారి ప్రసాద్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, బోయినపల్లి ప్రవీణ్రావు, బండ రమణారెడ్డి, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. -
రాజన్న ఆలయ పనులపై సమీక్ష
వేములవాడ: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనుల పురోగతిపై హైదరాబాద్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం సమీక్షించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఎండోమెంట్ కమిషనర్ హన్మంతరావు, వీటీఏడీఏ వైస్చైర్మన్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ హాజరయ్యారు. ప్రస్తుతం వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి, విస్తరణ పనులపై సవివరంగా చర్చించారు. ఇందులో భాగంగా ఈ దశలో చేయాల్సిన పనులను గుర్తించి సవివరంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అధికారులకు సూచించారు. మరోసారి శృంగేరిపీఠం జగద్గురువులు విధుశేఖర భారతిస్వామి వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి రాజన్న ఆలయ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి, ఆర్అండ్బీ అధికారులు, ఆర్కిటెక్చర్, స్థపతి తదితరులు పాల్గొన్నారు. -
అందని ‘ఉపాధి’ డబ్బులు
● రెండున్నర నెలలుగా నిలిచిపోయిన వైనం ● ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు ● నీరుగారుతున్న పథకం లక్ష్యం మెట్పల్లిరూరల్: వలసలను నివారించి స్థానికంగానే కూలీలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. పథకం కిందట పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బుల చెల్లింపులు జరగడంలేదు. దీంతో కూలీలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసిన పనులకు డబ్బులు రావడంలో కాలయాపన జరగుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాల్సి ఉండగా.. రెండున్నర నెలలుగా అందడం లేదు. రూ.లక్షల్లో పెండింగ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి పరిధిలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు వేసవిలోనే కాకుండా మిగతా కాలంలోనూ జోరుగానే సాగుతుంటాయి. పూడికతీత, భూముల చదును, కందకాలు తీయడం, చెరువులు, కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగించడం వంటి పనులు చేపడుతుంటారు. మెట్పల్లి మండలంలోని 23 గ్రామాల్లో 5600 జాబ్ కార్డులు నమోదై ఉన్నాయి. ఇందులో పనులకు హాజరయ్యే జాబ్ కార్డులు 1600 వరకు మాత్రమేనని రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. ఫిబ్రవరి 6 నుంచి ఇప్పటివరకు చేసిన పనిదినాలకు సంబంధించిన రూ.14 లక్షలకు పైగా కూలీలు డబ్బులు రావాల్సి ఉంది. చేసిన పనులకు సంబంధించిన డబ్బులు కోసం కూలీలు ఎదురుచూపులు చూస్తున్నారు. పక్షం రోజుల్లోనే చెల్లింపులు పథకం నిబంధనల ప్రకారం ప్రతి 15 రోజులకు ఒకసారి కూలీ డబ్బులు తప్పనిసరిగా చెల్లించాలి. ఒకవేళ జాప్యం చోటుచేసుకుంటే తగిన పరిహారం చెల్లించాలి. రెండున్నర నెలలుగా చెల్లింపులు నిలిచిపోవడంతో కూలీలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో సకాలంలో డబ్బులు వచ్చాయని, ఇప్పుడెందుకు జాప్యం జరుగుతోందని కూలీలు ఫీల్డ్అసిస్టెంట్లు, అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు త్వరగా చెల్లించేలా చూడాలని కోరుతున్నారు. -
ఒకరితో నిశ్చితార్థం.. మరొకరితో వివాహం
● పెళ్లి కొడుకు, తల్లిదండ్రులపై కేసు నమోదు జమ్మికుంట: ఒకరితో పెళ్లి నిశ్చయించుకుని, రూ.2లక్షల కట్నం తీసుకుని, మరొకరిని వివాహం చేసుకున్న యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం జమ్మికుంట పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి హనుమకొండ జిల్లా కాజీపేటకు చెందిన గండికోట కవిత, రాజేందర్ దంపతుల కొడుకు గణేశ్తో వివాహం నిశ్చయమైంది. రూ.11లక్షలు కట్నంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. గతనెల 27న కాజీపేటలో పెద్దమనుషుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. రూ.2లక్షలు అప్పగించారు. ఇక పెళ్లి జరుగుతుందని అనుకున్న క్రమంలో గణేశ్ వేరే యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో బాధితుల ఫిర్యాదుతో గణేశ్తో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేశామని టౌన్ సీఐ తెలిపారు. భీమన్నకు మొక్కులువేములవాడ: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో భక్తులు సొంత వాహనాల్లోనే వేములవాడకు చేరుకుంటున్నారు. గురవారం భీమన్న ఆలయంలో కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు చేశారు. మధ్యాహ్నం వేళ వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. హఠాత్తుగా కురిసిన వానతో భక్తులు ఇబ్బంది పడ్డారు. -
అమ్మానాన్న.. ఒక్క క్షణం ఆలోచించండి
వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన జక్కుల సరిత కుటుంబం. దివ్యాంగుడైన తన భర్త లింబాద్రితో కలిసి కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ త్రీవీలర్ స్కూటీపైన కూరగాలయలు అమ్ముకుంటూ వారి ముగ్గురు అడపిల్లలను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అన్యోన్యంగా సాగుతున్న ఆ కుటుంబంలో క్షణికావేశం నిప్పులు పోసింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద సంసారంలో గొడవలు ముగ్గురు పసిప్రాణాలను అనాథలను చేశాయి. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి పురుగుల మందు తాగి తనువు చాలించాడు. అప్పటి వరకు ఎంతో ఆప్యాయంగా బతికిన వారు తండ్రి దూరం కావడంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. పెద్ద దిక్కుగా ఉన్న లింబాద్రి మరణంతో భార్య సరిత కుప్పకూలిపోయింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ముగ్గురు పిల్లలను ఎలా సాదుకోవాలనేది అర్థం కావడం లేదు. పిల్లల చదువులు, తిండి, ఇతర అవసరాలు తీర్చడం సరితకు తలకుమించిన భారంగా మారింది. వీర్నపల్లి(సిరిసిల్ల): ‘అమ్మా.. ఆకలేస్తోంది అన్నం పెట్టవా?’ అని అడిగే లోపే అమ్మ లేదు.. ‘నాన్నా.. బడికి ఫీజు కట్టాలి’ అని అడిగే లోపే నాన్న లేరు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు చిన్నారుల జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నపాటి మనస్పర్థలు చివరికి ఆత్మహత్యలకు దారితీస్తుండడంతో వారి చిన్నారులు అనాథలుగా మిగిలిపోతున్నారు. అమ్మానాన్న ఉన్న రోజుల్లో తమ భవిష్యత్పై భరోసాగా బతికిన పిల్లలు తల్లిదండ్రుల మరణం తర్వాత అంతా శూన్యంగా గడుపుతున్నారు. కన్నవారు తమ ప్రాణాలు తీసుకుంటుంటే.. ఆ చిన్నారుల ఆలనా పాలనా చూసే వారు కరువవుతున్నారు. కుటుంబాలు వీధిపాలు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యక్తిగత గొడవలు కావచ్చు.. సమస్య ఏదైనా పరిష్కరించుకోవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదనే ఆలోచన రాక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలా అనాలోచిత నిర్ణయాలతో ఆ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడుతున్నాయి. ముఖ్యంగా అమ్మ ప్రేమకు, నాన్న నీడకు దూరమైన పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా తోటి పిల్లలను చూసి వారు పడే వేదనకు అంతులేకుండా పోతోంది. క్షణికావేశంతో మమ్మల్ని అనాథలను చేయకండి వేడుకుంటున్న చిన్నారులు పెద్దల ఆత్మహత్యలతో రోడ్డున పడుతున్న కుటుంబాలు అంధకారమవుతున్న భవిష్యత్ -
25 క్వింటాళ్లే కొంటున్నారు
మక్కల కొనుగోళ్లకు రైతులను దూరం చేయాలనే నెపంతోనే ఎకరాకు కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వాస్తవంగా ఎకరాకు 40 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. మిగిలిన 15 క్వింటాళ్లను ఎక్కడ అమ్ముకునుడో అర్థం కావడం లేదు. – బందెల మల్లయ్య, జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు, చల్గల్ జిల్లాలో మక్కల కొనుగోలుకు 10 కేంద్రాలు ఏర్పాటు చేశాం. అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. త్వరితగతిని రైతుల నుంచి మక్కలు సేకరిస్తాం. ఎకరానికి 25 క్వింటాళ్లు మాత్రమే కొనాలనే నిబంధనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లతాం. – ఎండీ.హబీబ్ -
చెల్లిని తీసుకెళ్లడానికి వచ్చి.. అనంతలోకాలకు..
● ఆటో బోల్తా పడి మహిళ మృతి ● ముగ్గురికి గాయాలు ● పర్లపల్లిలో ఘటన మొగుళ్లపల్లి: పాఠశాలకు సెలవులు రావడంతో చెల్లిని ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చి అక్క తిరుగు ప్రయాణంలో అనంతలోకాలకు చేరింది. ఆటో బోల్తాపడిన ఘటనలో మృతి చెందింది. ఈ ఘటన గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమారం గ్రామానికి చెందిన కోల సాన్విక (25) తన భర్త అనిల్, అక్క ముదురుకోళ్ల స్వప్నతో కలిసి ఆటోలో మొగుళ్లపల్లి మండలం కొర్కిశాల ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తమ చెల్లి సాత్వికను తీసుకెళ్లడానికి పాఠశాలకు చేరుకున్నారు. అనంతరం నలుగు రు కలిసి ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో పర్లపల్లి శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సాన్విక అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యా యి. దీంతో క్షతగాత్రులను 108లో హుజూ రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గోదావరిలో దూకి వ్యక్తి ఆత్మహత్యధర్మపురి: గోదావరిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన అట్టపెల్లి రాజేంద్రప్రసాద్ ఈనెల 18న ఉత్తరప్రదేశ్లో ఉన్న తన స్నేహితుడైన తరుగుల సంపత్ను కలవడానికి వెళ్లాడు. వాహనంలో తిరిగి వస్తూ.. గుడిహత్నూర్ వద్ద దిగిపోయాడు. గురువారం రాయపట్నం వంతెన వద్ద శవమై కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బంధువులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు అట్టపెల్లి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రాజేంద్రప్రసాద్ది ఆత్మహత్యనా.. లేక హత్యచేసి పడేశారా..? తేలాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. చెరువులో పడి వృద్ధురాలి మృతిబోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రొమాల మల్లవ్వ(70) మానసిక అనారోగ్యంతో బాధపడుతూ చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై ఎన్.రమాకాంత్ గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు. మల్లవ్వ కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో ఈనెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తిరిగింటికి రాలేదు. తన తల్లి మల్లవ్వ కనిపించడం లేదని ఆమె కుమారుడు రొమాల శరవాండు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా గురువారం గ్రామంలోని చెరువు వద్ద మృతదేహం కనిపించింది. తన తల్లి మల్లవ్వ మానసిక పరిస్థితి బాగాలేక చెరువులో పడి మరణించి ఉండవచ్చని ఆమె కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మృతదేహం కుళ్లిపోవడంతో కోరెం చెరువు వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు. -
అమ్మానాన్న.. ఒక్క క్షణం ఆలోచించండి
వీరు రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతి నగర్కు చెందిన గుగులోతు గోపాల్ కుటుంబ సభ్యులు. అప్పుల బాధ భరించలేక గత మార్చి 21న తన పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని మరణించాడు. ఇప్పుడు వారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇద్దరు బిడ్డలు, కొడుకు, భార్య నిర్మల ఏం చేయాలో తెలియడం లేదు. ఆ ఇల్లాలికి పిల్లలను ఎట్ల పెంచుకోవాలో తెలియక భర్త జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీవ్ర మనోవేదనకు గురవుతోంది. అమ్మానాన్న.. ఇద్దరు ఉంటేనే పిల్లలకు తోడునీడ. కుటుంబానికి భరోసా. స్కూల్ నుంచి వస్తుండగా అమ్మ ఎదురుగా రాకపోతే ఆ చిన్నారుల ఆందోళనకు అంతుండదు. అదే శాశ్వతంగా కనిపించకుండా పోతే ఆ గుండె లయతప్పుతుంది. సాయంత్రానికి నాన్న కనిపించకపోతే పిల్లల ఆతృత పెరిగిపోతుంది. అదే నాన్న ఇక కనిపించబోడు అని తెలిస్తే కళ్ల ముందు అంధకా రం నిండిపోతుంది. ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. పలువురు బాధిత చిన్నారులు పడుతున్న ఆవేదనను ‘సాక్షి’ అక్షరీకరించింది. – వీర్నపల్లి(సిరిసిల్ల) నాన్న.. నీవే నా ధైర్యం అనుకున్న నాన్న.. నేను స్కూల్ నుంచి రాగానే ప్రతి రోజూ నా కోసం ఎదురుచూసే వాడివి. ఇప్పుడు నువ్వు కనిపించడం లేదు. నువ్వు ఉన్నావనే ధైర్యంతో అందరితో నవ్వుతూ తిరిగేవాడిని. ఇప్పుడు నా వెనుక నువ్వు లేవని తెలిసి కన్నీళ్లు ఆగడం లేదు. మా నాన్న లాగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లలను అనాథలుగా చేయకండి. మమ్మల్ని వదిలి వెళ్లిపోకండి. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దు. – జంగునాయక్, శాంతినగర్(గుగులోత్ గోపాల్ కొడుకు) -
గోదాముల్లో మూలుగుతున్న మక్కలు
జగిత్యాలఅగ్రికల్చర్: యాసంగి సీజన్లో సాగు చేసిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మార్క్ఫెడ్ అధికారులు నామమాత్రంగా ప్రారంభించారు. కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కలను ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కొనుగోళ్లలో ప్రతిష్టంభన ఏర్పడి ఆలస్యం అవుతోంది. ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలోని 10 కొనుగోలు కేంద్రాల ద్వారా కేవలం 82,314 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. వానాకాలం మక్కలు గోదాముల్లోనే. వానాకాలం సీజన్లో 13కేంద్రాల ద్వారా 2.73 లక్షల క్వింటాళ్ల మక్కలను మార్క్ఫెడ్ సంస్థ కొనుగోలు చేసింది. వాటిని మెట్పల్లి, మల్లాపూర్, రాయికల్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి, గొల్లపల్లి, జగిత్యాలలోని చల్గల్ గోదాంలను అద్దెకు తీసుకుని అందులో నిల్వ చేసింది. సాధారణంగా, నిల్వ చేసిన మక్కలను మార్క్ఫెడ్ సంస్థ సీజన్ పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయిలో వేలం వేస్తుంది. కానీ.. నెలలు గడిచినా వేలం వేయకపోవడంతో గోదాముల్లో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ సంస్థకు ప్రస్తుత సీజన్కు గోదాంలు దొరకని పరిస్థితి ఏర్పడింది. పైగా గోదాంలకు భారీ స్థాయిలో అద్దె చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లాకు మక్కలు జగిత్యాల జిల్లాలో 6నుంచి7 లక్షల క్వింటాళ్ల మక్కలు ఉత్పత్తి అయినప్పటికీ మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించలేదు. దీంతో దాదాపు 70 శాతం మంది రైతులు పౌల్ట్రీఫాంకు, దళారులకు అమ్ముకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 80వేల క్వింటాళ్లే కొనుగోలు చేయగా.. ఇంకా లక్ష క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉందని మార్క్ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు కొన్న మక్కలను జిల్లాలోనే నిల్వ చేసారు. కేంద్రాలకు ఎక్కువగా మక్కలు వస్తుండటంతో 20వేల క్వింటాళ్ల మక్కలను పెద్దపల్లి జిల్లాలోని గోదాంలకు తరలించారు. ఇంకా కొనే మక్కలను కూడా పెద్దపల్లికే తరలించేందుకు అక్కడి గోదాంలను అద్దెకు తీసుకుంటున్నారు. మొక్కుబడిగా కొనుగోలు మక్క పంట చేతికొచ్చి నెల కావస్తున్నా.. కొనుగోలులో తాత్సారం చేయడంతో రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు విక్రయించారు. రైతుల ఒత్తిడితో జిల్లాలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మొక్కుబడిగా కొంటున్నారు. జగిత్యాలలో 16,187 క్వింటాళ్లు, ఇబ్రహీంపట్నంలో 16,071క్వింటాళ్లు, మెట్పల్లిలో 15,233 క్వింటాళ్లు, రాయికల్లో 12,431 క్వింటాళ్లు, కోరుట్లలో 10,224 క్వింటాళ్లు, కథలాపూర్లో 6,867 క్వింటాళ్లు, మల్లాపూర్లో 2,625 క్వింటాళ్లు, మేడిపల్లిలో 1591 క్వింటాళ్లు, లక్ష్మీపూర్లో 825 క్వింటాళ్లు, ధర్మపురిలో 258 క్వింటాళ్లు కొన్నారు. యాసంగి సీజన్ కోసం గోదాముల వెతుకులాట 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 82,314 క్వింటాళ్ల కొనుగోలు ఇంకా కేంద్రాలకు లక్ష క్వింటాళ్లు వచ్చే అవకాశం పెద్దపల్లి జిల్లా గోదాంలకు తరలిస్తున్న మక్కలు -
రాష్ట్ర పండుగగా వాసవీ మాత జయంతి
విద్యానగర్(కరీంనగర్): వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున ఆర్యవైశ్యుల కులదేవత వాసవి మాత జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయిస్తూ శుక్రవారం జీవో విడుదల చేసింది. ఈనెల 26 వాసవీ మాత జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా వేడుకలు నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ ఆలయం ప్రసిద్ధమైంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించడంతో తమ జన్మ ధన్యమైనదని ఆర్యవైశ్యు భక్తులు భావిస్తారు. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ఆలయ ట్రస్ట్ వాసవీ దేవి గురువు శ్రీ భాస్కరాచార్య రచించిన మూల పురాణం ‘వైశ్య పురాణ కావ్యము’ ఆధారంగా, ఆమె 2617 (జూలియన్) సంవత్సరంలో జన్మించారు. జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం 26న వాసవీ మాత జయంతి -
కోర్టులో స్పృహతప్పి పడిపోయిన కక్షిదారుడు
కరీంనగర్క్రైం: కరీంనగర్ కోర్టుకు కేసు విషయంలో వచ్చిన రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన సంతోశ్ గురువారం మధ్యాహ్నం 12గంటలకు స్పృహ తప్పిపడిపోయాడు. కరీంనగర్ కోర్టు సముదాయంలోని ఎకై ్సజ్ కోర్టుకు కేసు విషయంలో హాజరైన సంతోష్ ఒక్కసారిగా కిందపడిపోవడంతో అప్రమత్తమైన న్యాయవాదులు, పోలీసులు వైద్యుడికి సమాచారం ఇచ్చాఉ. వెంటనే వచ్చి అతడిని పరీక్షించారు. కోర్టు పోలీసులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. మృతురాలి మెడలోంచి బంగారం మాయం● పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు జగిత్యాలక్రైం: జగిత్యాలలోని ధరూర్ క్యాంప్లోగల ప్రభుత్వ క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో మృతురాలి మెడలోంచి బంగారం మాయంకాగా.. పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన వేల్పుల బాలవ్వ (84) అనారోగ్యంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం క్రిటికల్ కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున 5గంటలకు మృతిచెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకెళ్లగా.. చెవులకున్న పావుతులం బంగారం కనిపించలేదు. బాలవ్వ అల్లుడు గాండ్ర శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. రోగి వద్దనున్న బంగారం మాయం కావడంపై ఆస్పత్రిలో చర్చనీయాంశంగా మారింది. -
రైతులకు ఇబ్బంది రానీయొద్దు
కొత్తపల్లి/చిగురుమామిడి: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్, చిగురుమామిడి మండలం పీచుపల్లి, లంబాడిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆర్డీవో మహేశ్వర్, పౌర సరఫరాల శాఖ అధికారి నర్సింగరావు, డీఎం రజనీకాంత్తో కలిసి పరిశీలించారు. అన్ని కేంద్రాల్లో తూకం, తేమయంత్రాలు సరిగా పనిచేసేలా చూడాలన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం కొనుగోళ్లు చేపట్టాలని సూచించారు. మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఏఎన్ఎం సేవలు అందుబాటులో ఉండాలన్నారు. అకాల వర్షాలతో నష్టం వాటిల్లకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లను మండల అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ సందర్భంగా ధాన్యం కుప్పలు, తేమ శాతం, రికార్డులు, సౌకర్యాలను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, తహసీల్దార్ ముద్దసాని రమేశ్, ఎంపీడీవో విజయ్కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు కాటం సంపత్రెడ్డి, పీచు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైలు కిందపడి యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: రైలు కింద పడి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని జగదేవుపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరా ల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండి శివకుమార్ (18) నిజామాబాద్లో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మంగళవా రం రాత్రి కళాశాల హాస్టల్ నుంచి వ్యక్తిగత పని ఉందని చెప్పి బయటికి వెళ్లాడు. నేరుగా రైల్వేస్టేషన్కు వెళ్లి రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలపగా వారు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. మృతికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్..కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట గాంధీనగర్కు చెందిన ఆటో డ్రైవర్ గాండ్ల శ్రీకాంత్(40) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కొత్తపల్లి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ తెలిపారు. ఎస్హెచ్వో వివరాల మేరకు.. గాంధీనగర్లో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఆటో సరిగా నడవక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ తరచూ ఇంట్లో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు అధికమై జీవితంపై విరక్తి చెంది శ్రీకాంత్ మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి భార్య వెంటనే కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించింది. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య రూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. యువకుడి బలవన్మరణంచిగురుమామిడి: మండల కేంద్రానికి చెందిన చొప్పదండి అభిలాష్(22) అనే యువకుడు జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. అభిలాష్ ఇంటర్ ఫస్ట్ ఈయర్ చదివి ఇంటి వద్దే ఉంటూ వెల్డింగ్ పనులకు వెళ్లేవాడు. నెల రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యానికి అలవాటు పడ్డాడు. కుటుంబ సభ్యులు మందలించినా.. తన ప్రవర్తనలో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన అభిలాష్ను తండ్రి మందలించాడు. ఇది మనసులో పెట్టుకొని బుధవారం వేకువజామున చెట్టుకు ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పృధ్వీధర్గౌడ్ తెలిపారు. -
ఆర్టీసీ సమ్మె.. బస్సులు సగమే
కరీంనగర్ రీజియన్ పరిధిలో.. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు బుధవారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగడం ఉమ్మడి జిల్లా రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్–1, కరీంనగర్–2, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని మొత్తం 11 డిపోల్లోని ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 3,057 మంది ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తున్నారు. బుధవారం ఉదయం 99 శాతం మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు సమ్మెలో పాల్గొన్నారు. కేవలం 40 మంది డ్రైవర్లు, కండక్టర్లు మాత్రం విధులకు హాజరు కాగా, మిగతా వారంతా సమ్మెలో పాల్గొన్నారు. అన్ని డిపోల వద్ద కార్మికులు నిరసనలకు దిగగా.. ముందు జాగ్రత్త చర్యగా తెల్లవారుజాముకు ముందే పోలీసు బలగాలు మోహరించారు. కరీంనగర్ రీజియన్లో దాదాపు 1,000 బస్సులు అందుబాటులో ఉండగా.. బుధవారం 401 బస్సులను హైదరాబాద్, వరంగల్, వేములవాడ, గోదావరిఖని, మెట్పల్లి, తదితర అన్ని రూట్లలో నడిపారు. 330 అద్దెబస్సులు, వాటి డ్రైవర్లు విధుల్లో పాల్గొన్నారు. –సాక్షిప్రతినిధి,కరీంనగర్/ కరీంనగర్టౌన్ ప్రయాణికుల ఇక్కట్లు జిల్లాలో రైల్వే మార్గాలు అంతగా అభివృద్ధి చెందకపోవడంతో సింహభాగం ప్రజారవాణాకు ఆర్టీసీ మీదే ఆధారపడాలి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజారవాణా దాదాపుగా స్తంభించింది. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం డిగ్రీ, ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులపై ఆర్టీసీ సమ్మె ప్రభావం పడింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆటోడ్రైవర్లు, ట్యాక్సీలు ఽచార్జీలు అమాంతంగా పెంచారు. హైదరాబాద్, వరంగల్ రూట్లలోనూ ట్యాక్సీ డ్రైవర్లు చార్జీలు రూ.500 నుంచి రూ.800 వరకు ముక్కుపిండి మరీ వసూలు చేశారు. మరోవైపు కార్పూలింగ్, కార్ షేరింగ్ యాప్లకు డిమాండ్ పెరిగింది. వరంగల్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కరీంనగర్ బైపాస్ వద్ద ప్రమాదం జరగడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. అనుభవం లేని ప్రైవేటు డ్రైవర్కు బస్సులు ఇవ్వడం వల్లే ప్రమాదం జరిగింది ఆర్టీసీ ఐకాస నాయకులు ఆరోపించారు.డిపోలు 11ఆర్టీసీ బస్సులు 550అద్దె బస్సులు 330ఎలక్ట్రికల్ బస్సులు 100ఆర్టీసీ డ్రైవర్లు 984ఆర్టీసీ కండక్టర్లు 1,354ఇతర సిబ్బంది 719 (ఆఫీసు, డిపో,వర్క్షాపులు కలిపి) -
సూరీడు సుర్రు.. మీటర్లు గిర్రు
కొత్తపల్లి(కరీంనగర్): నిప్పులు కక్కుతున్న సూర్యుడు.. భరించలేని ఎండ, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొద్దిసేపు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరికరాలు నడుస్తుండటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. విద్యుత్ మీటర్లు గిరగిరా తిరుగుతూ విద్యుత్ డిమాండ్ పెరుగుదలకు కారణమవుతోంది. పట్టణాల్లో పెరిగి.. పల్లెల్లో తగ్గి.. పట్టణ ప్రాంతాల్లో ఎయిర్ కండీషనర్ల వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల విద్యుత్ డిమాండ్ మరింత పెరుగుతోంది. పల్లెల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో ఫ్రిడ్జ్లు, టీవీలు, కూలర్ల వంటి పరికరాల వినియోగిస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ మోటార్ల వినియోగం లేక వినియోగం కొంతమేర తగ్గింది. కొత్త టీడీఆర్ల ఏర్పాటు వేసవిలో లో ఓల్టేజీ సమస్య తలెత్తకుండా నిరంతరం సరఫరా చేయాలనే లక్ష్యంతో విద్యుత్ శాఖ కొత్త డీటీఆర్లను ఏర్పాటు చేసింది. కరీంనగర్టౌన్ (కరీంనగర్ నగరం–49) డివిజన్లో 115, కరీంనగర్రూరల్ డివిజన్లో 158, హుజురాబాద్లో 105 డీటీఆర్లను ఏర్పాటు చేసింది. అలాగే ఆకునూర్, బేతిగల్, గునుకులకొండాపూర్, చల్లూర్, బొమ్మకల్, ఎస్సారార్ కళాశాల, జంగపల్లిలో డీటీఆర్ల సామర్థ్యం పెంచారు. రికార్డు వినియోగం.. కరీంనగర్ సర్కిల్ పరిధిలో ఈ నెల 11న రికార్డు వినియోగం నమోదైంది. జిల్లాకు 8.79 మిలియన్ యూనిట్ల కోటాకుగాను 12.68 మిలియన్ యూనిట్లు వినియోగించారు. ఎండ తీవ్రతతో గృహ, పరిశ్రమలతో పాటు వ్యవసాయ పంప్సెట్లు ఒకేసారి వినియోగించడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అలాగే కొద్ది రోజులుగా కరీంనగర్ నగరంతో పాటు మున్సిపాలిటీల్లో విద్యుత్ వాడకం పెరిగి డీటీఆర్లపై లోడ్ పడుతోంది. కరీంనగర్ జిల్లాలో.. విద్యుత్ సర్వీసులు 5,70,580 గృహ కనెక్షన్లు 3,92,330వ్యవసాయ కనెక్షన్లు 1,33,344జిల్లాలో విద్యుత్ వినియోగం ఇలా.. (మిలియన్ యూనిట్లలో)తేదీ(ఏప్రిల్) 2025 2026 17 7.438 8.906 18 7.438 8.613 19 7.438 8.331 20 7.438 8.257 21 7.313 7.924కరీంనగర్ నగరంలో.. తేది(ఏప్రిల్) 2025 2026 17 3.528 3.453 18 3.568 3.619 19 3.628 3.858 20 3.598 3.783 21 3.654 3.678 అంతరాయం లేకుండా విద్యుత్ ఎండల తీవ్రతతో గృహ వినియోగం పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నాం. ఓవర్లోడ్ సమస్యల నివారణకు 352 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 14 పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. కొత్తగా 4 సబ్స్టేషన్లు ప్రారంభించగా, మరో 12 నిర్మాణ దశలో ఉన్నాయి. వినియోగదారులకు సమస్యలుంటే వాట్సప్ చాట్బాట్ నంబర్ 79016 28348, టోల్ ఫ్రీ 1912కు తెలియజేయాలి. – రాపెల్లి రవీందర్, ఎస్ఈ కరీంనగర్ -
సమ్మె శాంతియుతంగా జరుపుకోవాలి
కరీంనగర్క్రైం: ఆర్టీసీ కార్మికులు శాంతియుత వాతావరణంలో సమ్మె నిర్వహించుకోవాలని సీపీ గౌస్ ఆలం అన్నారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎలాంటి బెదిరింపులు లేకుండా పూర్తిస్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించినా, అధికారులపై దాడులకు పాల్పడినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సులు నడిపే డ్రైవర్లను బెదిరింపులకు గురి చేస్తే వెంటనే కరీంనగర్ పోలీసు స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నంబర్ 87126 70713కు ఫోన్ చేయాలని లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని తెలిపారు. హాస్టల్ పరిసరాలు శుభ్రంగా ఉండాలికరీంనగర్కార్పొరేషన్: పరిశుభ్ర వాతావరణంతోనే విద్యార్థులకు విద్యపై శ్రద్ధ కలుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం నగరంలోని కశ్మీర్గడ్డ ఎస్సీ హాస్టల్లో పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల గదులతో పాటు మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. హాస్టల్ ఆవరణలో పారిశుధ్య కార్మికులు, సిబ్బందితో కలిసి పరిశుభ్రత పనులు నిర్వహించారు. చెత్తాచెదారం, కలుపు మొక్కలు తొలగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హాస్టల్ అధికారులు, సిబ్బంది హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. అదనపు కమిషనర్ సువార్త, వెటర్నరి అధికారి దుర్గాప్రసాద్రెడ్డి, ఎంహెచ్వో సుమన్, శానిటేషన్ సూపర్వైజర్లు శ్యామ్రాజ్, అనిల్, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకంకరీంనగర్టౌన్: ఆర్టీసీ కరీంనగర్–2 డిపోలో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్గా పనిచేసేందుకు ఆసక్తిగల వారు సంప్రదించాలని డిపో మేనేజర్ మంగళవారం పేర్కొన్నారు. డ్రైవర్కు హెవీ లైసెన్స్తో పాటు 18 నెలల అనుభవం కలిగి ఉండి ఒరిజినల్ లైసెన్స్, ఆధార్కార్డు, 2 ఫొటోలతో రావాలని సూచించారు. కండక్టర్కు ఎస్సెస్సీ (10వ తరగతి) పాస్ అయి ఉండాలి. ఒరిజినల్ మెమో, ఆధార్కార్డు, 2 ఫొటోలతో రావాలన్నారు. డ్రైవర్కు రోజుకు రూ.1,000, కండక్టర్కు రోజుకు రూ.800 భత్యం ఉంటుందన్నారు. వివరాలకు 70131 94357, 93986 58062, 99592 25921 నంబర్లలో సంప్రదించాలని కోరారు. బీఆర్ఎస్ సంబరాలు కరీంనగర్టౌన్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ బుధవారం కరీంనగర్ తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. రేవంత్రెడ్డి కుట్ర పూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, నాయకులు గందె మహేశ్ తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు కాళోజీనగర్, గౌడ్స్కాలనీ, రేకుర్తి చౌరస్తా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
వడదెబ్బతో వలస కూలీ మృతి
ధర్మపురి: జీవనోపాధి కోసం వలస వచ్చిన కూలీ వడదెబ్బ తగిలిమృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన యోహన్ అలియాస్ మహేష్ (28) కూలీ పనుల కోసం ధర్మపురి వచ్చాడు. మండలంలోని కమలాపూర్లో బుధవారం అతిగా మద్యం సేవించాడు. వడదెబ్బకు గురై మృతి చెందాడు. సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేత అరెస్ట్ధర్మపురి:గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండుకు పంపినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన ప్రణీత్కుమార్ గంజాయికి అలవాటు పడ్డాడు. పైగా విక్రయించేందుకు సిద్ధమయ్యారు. పట్టణంలోని పెట్రోల్ పంప్ వద్ద అనుమానాస్పదంగా వెళ్తుండడంతో పోలీసులు సోదా చేయగా అతని వద్ద 60 గ్రాముల గంజాయి లభించింది. గంజాయిని సీజ్ చేసి యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై తెలిపారు. ముగ్గురికి జైలుకరీంనగర్క్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి కరీంనగర్ కోర్టు 4 రోజుల జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. మొగ్గ ప్రశాంత్, బోయిని గంగరాజు, భానోతు జయరాంకు సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. మహిళ ఆత్మహత్యాయత్నంకరీంనగర్క్రైం: కరీంనగర్కు చెందిన ఓ మహిళ కుటుంబ గొడవలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటానని పద్మనగర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కింది. అక్కడే ఉన్న స్థానికులు వెంటనే పోలీస్, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన టూటౌన్ సీఐ సృజన్రెడ్డి, డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డి సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మహిళకు నచ్చజెప్పి కిందకు తీసుకొచ్చారు. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. గుడుంబా విక్రేతలపై కేసువీర్నపల్లి: మండలంలోని భావుసింగ్నాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని గొన్యనాయక్తండాలో గుడుంబా స్థావరాలపై పోలీ సులు బుధవారం దాడి చేశారు. గుడుంబా విక్రయిస్తున్న ఇద్దరు పట్టుబడ్డట్లు ఎస్సై లక్ష్మణ్ తెలిపారు. గుడుంబా తయారీ కోసం నిల్వ ఉంచిన సుమారు 100 లీటర్ల బెల్లం, సారాయికి ఉపయోగించే ముడి పదార్థాలను ధ్వంసం చేశారు. -
ఉద్యమకారుల ఎంపిక విధానం సరిగా లేదు
● తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ కరీంనగర్ టౌన్: తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక విధివిధానం సరిగా లేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ అన్నారు. బుధవారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర సాధనలో అమరులైన వారి కుటుంబాలను, దివ్యాంగులైన ఉద్యమకారులను, జైలుకెళ్లిన ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం కమిటీని ప్రకటిస్తే.. ఆ కమిటీకి సంబంధించిన జీవో కాలపరిమితి విధివిధానాలు బహిర్గతం చేయాలని అన్నారు. వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారి పత్రిక వార్తలు, వీడియోల ఆధారంగా గుర్తించాలన్నారు. ఉద్యమకారుల మనోభావాలను గుర్తించి కమిటీ విధివిధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, చొప్పరి సుధాకర్, గరిగే కోటేశ్వర్, మేకల మాధవి, కారుపాకల మున్న, గర్షకుర్తి ఉమారాణి, మహాదేవుని భార్గవి, బాలామణి, వనజ, పద్మ, కనకలక్ష్మి, సంధ్య, కోమల, శారద, సుజాత, దేవేంద్ర, గాలి రమేశ్, బూడిద వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ వాహనాలతో జాగ్రత్త!
జ్యోతినగర్: అపార్ట్మెంట్లు, ఇళ్లు, వీధుల్లో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) సంఖ్య వేగంగా పెరుగుతోంది. సాధారణ పెట్రోల్, డీజిల్ వాహన ప్రమాదాలకు ఈవీ ప్రమాదాలకు మధ్య చాలాతేడా ఉంటుంది. లిథియం–అయాన్ బ్యాటరీల స్వభావాన్ని అర్థం చేసుకోవడం వాహనదారులకే కాదు.. అపార్ట్మెంట్లలో నివసించే ప్రతీఒక్కరికి చాలాముఖ్యం. ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు ప్రారంభమైతే శ్రీథర్మల్ రన్అవేశ్రీ అనే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఒకగొలుసుకట్టు చర్య వంటిది. ఇక్కడ ఒక బ్యాటరీ సెల్ మంటలు అంటుకోగానే పక్కనే ఉన్నసెల్స్ను సెకన్ల వ్యవధిలో వేడి చేస్తుంది. తద్వారా ఉష్ణోగ్రతలు 600 సెంటీగ్రేడ్ల నుంచి 1000 సెంటిగ్రేడ్ల వరకు చేరుకుంటుంది. ఇలాంటి మంటలను ఆర్పడానికి సాధారణ పౌడర్ ఆధారిత ఫైర్ ఎక్స్టింగ్యుషర్లు ఏమాత్రం పనిచేయవు. ప్రమాదాలపై అప్రమత్తం వాహనం నుంచి పొగ రావడం గమనించిన వెంటనే తొలిప్రాధాన్యతగా అక్కడి నుంచి పారిపోవడం మాత్రమే అయి ఉండాలి. ఫోన్, బ్యాగ్ వంటి వస్తువుల కోసం సమయం వృథా చేయకండి. కారులో ఉన్నవారు గరిష్టంగా 60 సెకన్లలోపు బయటకు వచ్చి కనీసం 100 నుంచి 200 మీటర్ల దూరం పారిపోవాలి. బ్యాటరీ కాలిపోయేటప్పుడు ‘హైడ్రోజన్ ఫ్లోరైడ్’ అనే అత్యంత భయంకరమైన విషవాయువు వెలువడుతుంది. ఇది గాలి కన్నా బరువుగా ఉండి, ఊపిరితిత్తులను, చర్మాన్ని క్షణాల్లో దెబ్బతీస్తుంది. పొగను పీల్చడం ప్రాణాంతకం. గాలి వీచే దిశకు ఎదురుగా కాకుండా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి. బకెట్లతో నీళ్లు చల్లడంతో మంటలు ఆరకపోగా, ఆ నీరు విషవాయువులను నేరుగా ముఖంపైకి నెట్టే ప్రమాదం ఉంది. అపార్ట్మెంట్ సెల్లార్లలో, బేస్మెంట్లలో ఈవీ వాహనాలు ఉన్నప్పుడు ప్రమాద తీవ్రత ఇంకా అధికంగా ఉంటుంది. మంటలు అంటుకున్నప్పుడు పొగ సెల్లార్ అంతా నిండిపోయి లిఫ్ట్ షాఫ్టుల ద్వారా పైఅంతస్తులకు వ్యాపిస్తుంది. అందుకే ప్రమాదం జరిగినప్పుడు పొరపాటున కూడా లిఫ్ట్ వాడకూడదు. ముఖ్యమైన విషయాలు ఈవీ బ్యాటరీలు మంటలు ఆరిపోయినట్లు కనిపించినా 24 నుంచి 48 గంటల వరకు ఎప్పుడైనా మళ్లీ కాలిపోయే అవకాశం ఉంటుంది. లోపల రసాయన చర్య జరుగుతూనే ఉండటంతో ఇలా సంభవిస్తుంది. అందుకే మంటలు ఆరిపోయాయి కదా అని వాహనం దగ్గరకు వెళ్లకూడదు. ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇచ్చేటప్పుడు అది ‘ఎలక్ట్రిక్ వాహనం’అని కచ్చితంగా చెప్పాలి, అప్పుడే వారు ఆక్సిజన్ మాస్కులు, ప్రత్యేక హాజ్మత్ రక్షణ గేర్తో వస్తారు. ముందస్తు జాగ్రత్తలు బ్యాటరీని ఎప్పుడూ 100శాతం వరకు చార్జ్ చేయకుండా 20 నుంచి 80శాతం మధ్య ఉంచడం శాసీ్త్రయంగా సురక్షితం. ఎండఎక్కువగా ఉన్నప్పుడు, ఇంజిన్ వేడిగా ఉన్నప్పుడు వెంటనే చార్జింగ్ పెట్టకూడదు. అపార్ట్మెంట్లలో చార్జింగ్ పాయింట్ల వద్ద నాణ్యమైన వైరింగ్, తగిన సర్క్యూట్ బ్రేకర్లు ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్సేఫ్టీ -
కోర్సులపై దృష్టి పెట్టాలి
ప్రభుత్వం అందిస్తున్న కోర్సులు యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. క్రీడారంగంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇవి కీలకం. గ్రామీణ ప్రాంతాల యువతకు కూడా మంచి అవకాశాలు అందిస్తున్నాయి. ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా ఇవి చాలా సహాయపడతాయి. ప్రతీ క్రీడాకారుడు కోర్సులపై దృష్టి పెట్టాలి. – బుర్ర మల్లేశ్గౌడ్, కబడ్డీ సంఘం కార్యదర్శి శిక్షణ ద్వారా క్రీడాకారులు ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు శిక్షణ ఇచ్చే మెలకువలు నేర్చుకుంటారు. శాసీ్త్రయ శిక్షణ పద్ధతులు నేర్పుతారు. ట్రైనింగ్ తీసుకున్నవారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కోచ్గా ఎదిగి, దేశానికి పతకాలు తెచ్చే క్రీడాకారులను తయారు చేయొచ్చు. – బసరవేణి లక్ష్మణ్, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి ఈ కోర్సులు క్రీడాకారులకు కొత్త దిశను చూపుతాయి. శిక్షణతో పాటు శాసీ్త్రయ పరిజ్ఞానం అందించడం గొప్ప విషయం. ప్రస్తుతం ప్రొఫెషనల్ కోచ్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు పూర్తి చేసినవారు దేశానికి మంచి సేవ చేయగలరు. – గెల్లు మధుకర్యాదవ్, ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్ -
అంతర్జాతీయ వేదికపై ‘సింగరేణి’
గోదావరిఖని: అంతర్జాతీయ రెస్క్యూ పోటీలకు సింగరేణి సిద్ధమైంది. జాంబియా దేశంలో నిర్వహించే పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 24 ఆ దేశానికి పయనమవుతోంది. మొత్తం ఆరుగురు సభ్యులు గల బృందానికి 45 రోజులుగా ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్రెస్క్యూ స్టేషన్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కఠోర సాధనతో బ్రిగేడియర్లు శిక్షణ ముగించుకుని జాంబియాకు బయలుదేరి వెళ్లనున్నారు. మే ఒకటి వరకు పోటీలు 14వ అంతర్జాతీయ మైన్ రెస్క్యూ పోటీలు (ఐఎంఆర్సీ) జాంబియాలో నిర్వహించనున్నారు. సింగరేణి బ్రిగేడియర్లు ఈనెల 25న అక్కడకు చేరుకుంటారు. ఈనెల 28 నుంచి మే ఒకటే తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారు. వివిధ దేశాల మైన్స్ రెస్క్యూ బృందాలు హాజరవుతాయి. ప్రతీరెండేళ్లకోసారి జరిగే ఐఎంఆర్సీ పోటీల్లో సింగరేణి రెండు దశాబ్దాలుగా పాల్గొంటూ వస్తోంది. ఆలిండియా రెస్క్యూ పోటీల్లో డబుల్ హాట్రిక్ సాధించి తనకంటూ ప్రత్యేక స్థానం నిలుపుకున్న సింగరేణి రెస్క్యూ.. గతంకన్నా ఈసారి భిన్నంగా పోటీలకు ముందస్తుగా ప్రాక్టీస్ పొంది అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు తహతహలాడుతోంది. సింగరేణిదే ఖర్చు.. రెస్క్య బ్రిగేడియర్లు విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేవరకు సింగరేణి సంస్థ ఖర్చులు భరిస్తోంది. ప్రత్యేక యూనిఫాం, షూలు, ఇతర ఏర్పాట్లు చేసింది. జట్టు సభ్యులకు రెస్క్యూ రికవరీ, ఫైర్ఫైటింగ్, రోప్రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ స్కిల్స్ విభాగాల్లో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చారు. టీం సభ్యులు వీరే.. అంతర్జాతీ రెస్క్యూ పోటీలకు బయలుదేరి వెళ్లే సభ్యుల పేర్లను సింగరేణి ప్రకటించింది. కెప్టెన్గా ప్రమోద్కుమార్, బ్రీతింగ్ ఆఫీసర్గా నితిన్కుమార్, సభ్యులుగా శ్యాంకుమార్, శ్రీకాంత్, బానుప్రసాద్, రాకేశ్, టెక్నీషియన్గా సాయికృష్ణ, టెక్నికల్ ట్రాన్స్లేటర్గా రాజేందర్రెడ్డిని ప్రకటించారు. షెడ్యూల్ ఇలా ఈనెల 24న బయలు దేరివెళ్లడం 25న జాంబియాలో రిపోర్టింగ్ 27న ఓరియెంటేషన్ పోగ్రాం 28న ఫెర్ఫైటింగ్ పోగ్రాం 29న రోప్రెస్క్యూ మే 1న ఫస్ట్అండ్రెస్క్యూ 2న అండర్గ్రౌండ్ రెస్క్యూ 4న సిటీ విజిట్ 5న పోటీల ముగింపు వేడుకలు మే6 ఇండియాకు తిరిగి రావడం రెస్క్యూ పోటీలకు బ్రిగేడియర్లు సిద్ధం ఈనెల 24న జాంబియాకు పయనం 28 నుంచి మే ఒకటి వరకు పోటీలు జాంబియాలో జరిగే అంతర్జాతీయ రెస్క్యూ పోటీల్లో పాల్గొనేందుకు సింగరేణి జట్టు సర్వసన్నద్ధమైంది. సభ్యులు పూర్తిస్థాయిలో తర్ఫీదు పొందారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సత్తా చాటుతాం. – శ్రీనివాస్రెడ్డి, రెస్క్యూ జీఎం -
రూ.1.30కోట్ల కాపర్ వైర్ మాయం
గోదావరిఖని: సింగరేణి ఓసీపీలోని డ్రాగ్లైన్(పృథ్వీభంజన్)కు విద్యుత్ సరఫరా చేసే కాపర్ కేబుల్ను దొంగలు ఎత్తుకెళ్లారు. 3 –కోర్ ఆర్మ్డ్ కాపర్కేబుల్పై కన్నేసిన దొంగలు.. కొన్నిరోజుల క్రితమే చోరీచేసినట్లు తెలుస్తోంది. డ్రాగ్లైన్ జీవితకాలం పూర్తికావడంతో ప్రాజెక్టు ఉపరితలంపైకి తీసుకొచ్చి అలాగే ఉంచారు. దానికి విద్యుత్ కేబుల్ను అలాగే ఉంచారు. దీనిపై కన్నేసిన దొంగలు.. సుమారు 250 మీటర్ల పొడవున కత్తిరించి తీసుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనివిలువ సుమారు 1.30కోట్లు ఉంటుంది కార్మికవర్గాలు చెబుతున్నాయి. రాగితీగ చోరీకి గురైన మాట వాస్తవమే అయినా.. విలువ అంతగా ఉండదని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసులు, సింగరేణి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇంటి దొంగల సహకారంతోనే చోరీ జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. -
గుండెపోటుతో వైద్యుడి హఠాన్మరణం
భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. పేద కుటుంబం నుంచి.. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్దాస్పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్గా పేరు గడించారు. సురేందర్కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పిల్లల అక్రమ రవాణా కేసులో ఆర్ఎంపీ అరెస్టుమల్యాల: దేశవ్యాప్తంగా నవజాత శిశువుల విక్రయం కేసులో మండలంలోని మద్దుట్లకు చెందిన ఓ ఆర్ఎంపీని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. నవజాత శిశువులను పిల్లలు లేని వారికి ఒక్కో చిన్నారిని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో గుజరాత్ నుంచి వచ్చిన పోలీసులు మద్దుట్ల వాసిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఆపరేషన్ దేవ్ పేరుతో పోలీసులు గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురిని అరెస్టు చేయగా.. వారిలో మద్దుట్లకు చెందిన వ్యక్తి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
కరీంనగర్కార్పొరేషన్: పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని సుడా కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఇప్పటికే చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సుడా కమర్షియల్ బిల్డింగ్ మొదటి విడత పనులు చివరి దశకు వచ్చాయని, అవి పూర్తి కాగానే, మిగతా పనులకు టెండర్లు పిలవాలన్నారు. రాజీవ్చౌక్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న రాజీవ్గాంధీ కాంస్య విగ్రహాన్ని మే 21న ఆయన వర్ధంతి సందర్భంగా ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరపాలక కమిషనర్, సుడా వైస్చైర్మన్ ప్రఫుల్ దేశాయ్, ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ శివానంద్, డీఈలు రాజేంద్రప్రసాద్, వెంకటేశ్వర్లు, ఏఈలు పాల్గొన్నారు. సకాలంలో ధాన్యం కొనాలి కరీంనగర్రూరల్: రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సుడా చైర్మన్ కె.నరేందర్రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం కరీంనగర్ మండలం నగునూరు, ఎలబోతారం, చామనపల్లి, బహుదూర్ఖాన్పేట, దుబ్బపల్లి, చెర్లభూత్కూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సర్పంచులు సాయిల్ల శ్రావణి, బోగొండ ఐలయ్య, తప్పెట్ల రాజు, గుర్రం సంధ్యతిరుపతిరెడ్డి, మోతే ప్రశాంత్రెడ్డి, సుద్దాల కమలాకర్, ఉపసర్పంచులు పాల్గొన్నారు. దుర్శేడ్ సొసైటీ ఆధ్వర్యంలో మొగ్ధుంపూర్, చేగుర్తి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రత్యేక అధికారి శైలజతో కలిసి సర్పంచులు మాదాసు శీనమ్మ,బాషవేణి సరోజనమల్లేశం ప్రారంభించారు. ఉపసర్పంచులు, పంచాయతీకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘సాయ్’ పిలుస్తోంది
కరీంనగర్స్పోర్ట్స్: క్రీడా రంగానికి భారత క్రీడాప్రాధికారిక సంస్థ మార్గదర్శకంగా నిలుస్తుంది. పంజాబ్ రాష్ట్రం పటియాలలోని నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ యువ క్రీడాకారులకు సువర్ణావకాశాన్ని అందించింది. 2026–27 సంవత్సరంలో పలు కోర్సుల్లో శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడలను వృత్తిగా తీసుకోవాలనుకునే యువతకు గొప్ప అవకాశం. కోర్సులు కేవలం శిక్షణకు మాత్రమే కాకుండా, శాసీ్త్రయ ధృక్పథంతో ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడనున్నాయి. కోర్సులు పూర్తి చేసిన క్రీడాకారులు దేశవ్యాప్తంగా కోచ్లుగా, ఫిట్నెస్ ట్రైనర్లు, అనలిస్ట్, క్రీడా సంస్థల్లో ఉన్నత స్థానాల్లో అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా అవకాశాలు దొరుకుతాయి. క్రీడలపై ఆసక్తి ఉన్న యువత https:// www. dipsc. nsnis. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సందర్భంగా పలు కోర్సుల వివరాలతో కథనం. కోర్సుల వివరాలు 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ (2 ఏళ్లు), 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, 5వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ న్యూట్రిషన్, 4వ పీజీ డిప్లొమా ఇన్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ (ఒక సంవత్సరం). కాగా 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్కు దరఖాస్తులు ఈ నెల 23 లోపు, మిగిలిన కోర్సులకు ఈ నెల 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్లు ఇలా.. 64వ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ఒక ఏడాది నిర్వహిస్తారు. 26 క్రీడాంశాల్లో 785 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆర్చరీ 30, అథ్లెటిక్స్ 75, బ్యాడ్మింటన్ 20, బ్యాడ్మింటన్ 20, బాస్కెట్బాల్ 30, బాక్సింగ్ 50, కానోయింగ్ కయాకింగ్ 15, సైక్లింగ్ 30, ఫెన్సింగ్ 30, ఫుట్బాల్ 50, జిమ్నాస్టిక్స్ 20, హ్యాండ్బాల్ 20, హాకీ 50, జూడో 30, కబడ్డీ 30, ఖోఖో 20, రోయింగ్ 10, షూటింగ్ 20, స్విమ్మింగ్ 20, టేబుల్ టెన్నిస్ 40, తైక్వాండో 20, టెన్నిస్ 20, వాలీబాల్ 30, వెయిట్లిఫ్టింగ్ 30, రెజ్లింగ్ 50, వుషూ 25, యోగాసన 20 సీట్లు ఉన్నాయి. క్రీడల కోర్సుకు దరఖాస్తులు ప్రొఫెషనల్ ట్రైనింగ్తో భరోసా క్రీడలపై ఆసక్తి ఉన్నవారికి చాన్స్ 42వ ఎంఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ క్రీడలివే.. అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిప్టింగ్, రెజ్లింగ్. ఆధునిక క్రీడల్లో డేటా విశ్లేషణ కీలకం. పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ వంటి కోర్సులు చేయడం ద్వారా ప్రత్యర్థుల బలహీనతలను పసిగట్టే నైపుణ్యం లభిస్తుంది. ఇది క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. కోర్సులు పూర్తి చేసినవారు పాఠశాలలు, కళాశాలలు, ప్రొఫెషనల్ క్లబ్లలో ఫిట్నెస్ నిపుణులుగా స్థిరపడి, ఆరోగ్యవంతమైన క్రీడా సమాజాన్ని నిర్మించగలరు. – నాగిరెడ్డి సిధారెడ్డి, శాట్స్ అసిస్టెంట్ రిటైర్డ్ డైరెక్టర్ -
నెగ్గిన పాలకవర్గం పంతం
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పాలకవర్గం ప్రతిపాదించిన పాత పనుల రద్దు, కొత్త ప్రతి పాదనలను సీడీఎంఏ అంగీకరించింది. రూ.50 కోట్లతో 87 పనులు చేపడుతూ పిలిచిన పాత టెండర్ను రద్దు చేస్తూ, రూ.50 కోట్లతో 87 పనుల కొత్త ప్రతిపాదనలకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. దీంతో సాంకేతికపరమైన అనుమతులు తీసుకొని టెండర్ ప్రక్రియచే పట్టేందుకు నగరపాలకసంస్థ అధికారులు సమాయత్తమవుతున్నారు. 87 పనులకు ఓకే రూ.50 కోట్లతో నగరంలోని 66 డివిజన్లలో పాలకవర్గం ప్రతిపాదించిన 87 అభివృద్ధి పనులకు సీడీఎంఏ పరిపాలనా మంజూరు ఇచ్చింది. కొత్త పాలకవర్గం కొలువు తీరిన తరువాత నగరవ్యాప్తంగా అభివృద్ధి పనులు జరగాలనే ఆలోచనతో పాత టెండర్ను రద్దు చేసి కొత్త ప్రతిపాదనలు రూపొందించడం తెలిసిందే. 66 డివిజన్లలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి 87 పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ ప్రతిపాదనలను ఆమోదించాలని కోరుతూ నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశం ఇటీవల ఏకగ్రీవంగా తీర్మాణించింది. పాత టెండర్ రద్దు నగరపాలకసంస్థలో అసాధారణ రీతిలో టెండర్ ప్రక్రియ మధ్యలో రద్దయింది. విలీన గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ, ప్రత్యేక అధికారి పాలనలో రూ.50 కోట్ల యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలెప్మెంట్ ఫండ్) నిధులతో 87 పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. రూ.50 కోట్లలో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ వాటా రూ.40 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.10 కోట్లు. 87 పనులకు టెండర్ పిలవగా, 25 పనులకు కాంట్రాక్టర్లు స్పందించలేదు. 62 పనుల్లో 21 పనులకు సంబంధించి టెండర్ ఓపెన్ చేశారు. ఆ సమయంలోనే నగరపాలకసంస్థ ఎన్నికలు రావడంతో టెండర్ ప్రక్రియ నిలిచిపోయింది. కొత్త పాలకవర్గం కొలువు తీరిన అనంతరం కొన్ని డివిజన్లకే పరిమితమైన రూ.50 కోట్ల పనులను నగరవ్యాప్తంగా విస్తరించాలనే ఆలోచన వచ్చింది. దీంతో పాత టెండర్లను రద్దు చేస్తూ, కొత్తగా 66 డివిజన్లలో 87 పనుల కొత్త ప్రతిపాదనలను కార్పొరేటర్ల అందించారు. గత నెల 31వ తేదీన నిర్వహించిన బల్దియా సర్వసభ్య సమావేశంలో పాత టెండర్ రద్దు, కొత్త పనుల ప్రతిపాదనలను ఆమోదిస్తూ తీర్మాణం చేశారు. టెండర్ల రద్దు అప్పట్లో రాజకీయ రగడకు కారణమైనా, ఆ తరువాత అన్ని పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో పాత టెండర్లు రద్దు చేస్తూ, కొత్తగా 87 పనులకు ఆమోదం తెలుపుతూ సీడీఎంఏ నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త పాలకవర్గం పంతం నెగ్గించుకున్నట్లయింది. పనులకు సాంకేతిక పరమైన అనుమతులు తీసుకొని, టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మే నెలలో పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు. -
రేవంత్ సర్కార్ ఎందుకు పోవాలి
కరీంనగర్ కార్పొరేషన్: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు పోవాలో బీఆర్ఎస్ చెప్పాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ చావును ఎవరూ కోరుకోలేదన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చూడాలన్నారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వం పోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. తన చావు కోరుకున్నారంటూ జగిత్యాల సభలో కేసీఆర్ అనడాన్ని ఖండించారు. ప్రతిపక్షనాయకుడిగా ఆయన్ను గౌరవించామన్నారు. సీఎం రేవంత్ను బీఆర్ఎస్ నాయకులు ఏకవచనంతో మాట్లాడుతూ అవమానిస్తున్నారన్నారు. తమ ప్రతి పక్షనాయకులు అప్పటి సీఎం కేసీఆర్ను ఏనాడూ ఏకవచనంతో సంబోధించలేదన్నారు. సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ మంత్రులతో కూడా మాట్లాడలేదని, రేవంత్ అందరి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. 2023లో చివరి రైతుబంధు వేసేందుకు కేసీఆర్ ఔటర్రింగ్రోడ్డును అగ్గువకు కుదవపెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేసిన అప్పులకు ప్రతినెల రూ. 6వేల కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామన్నారు. ఎఫ్సీఐ గోదామల్లో పేరుకుపోయిన బియ్యం నిల్వ లను కేంద్రంతో మాట్లాడి తరలించే ప్రక్రియను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీసుకోవాలన్నారు. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగిస్తే కేంద్రం స్పందించడం లేదని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మా ట్లాడి సీబీఐ విచారణ జరిపించేలా బండి సంజయ్ చూడాలన్నారు. జీవన్రెడ్డి పార్టీ మారడం వల్ల లా భమా, నష్టమా ప్రజలు నిర్ణయిస్తారన్నారు. త్వరలో జగిత్యాలలో సీఎం సభ నిర్వహిస్తామని తెలిపా రు. డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. -
నగరాన్ని ఆదర్శంగా మార్చుదాం
కొత్తపల్లి: ప్రజల సహకారంతో పార్టీలకతీతంగా అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతూ కరీంనగర్ రూపురేఖలు మార్చుదామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అమృత్ 2.0 కింద రూ.1,98 కోట్ల నిధులతో రేకుర్తి పెంటకమ్మ చెరువు సుందరీకరణ పనులకు మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కె.నరేందర్రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, స్థానిక కార్పోరేటర్లు సుదగోని మాధవి, పర్వతం మల్లేశంతో కలిసి మంగళవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రూ.5.82 కోట్ల అమృత్ 2.0 నిధులతో నగరానికి దగ్గరున్న తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, రేకుర్తి చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గుగ్గిళ్లపు రమేశ్, కార్పొరేటర్లు బోయినపల్లి ప్రవీణ్రావు, బండ రమణారెడ్డి, మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్, ఎన్నం ప్రకాశ్ పాల్గొన్నారు. తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దుచొప్పదండి: జనగణన– 2027ను పారదర్శకంగా చేపట్టాలని, తప్పులు లేకుండా చూడాలని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఏర్పాటు చేసిన మొదటి విడుత శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డిజిటల్ సర్వేపై అనుమానాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. గతంలో సర్వే చేసిన సిబ్బంది అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మొదటి దశలో మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన నిర్వహిస్తారని, జూన్ 9 వరకు పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రతి కుటుంబం వివరాలు పక్కాగా సేకరించి నమోదు చేయాలని సూచించారు. వివరాలు గోప్యంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచాలి విద్యార్థుల భద్రత, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వసతి గృహాలను నిర్వాహకులు పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానా.ఈ వాకడే కోరారు. మంగళవారం పట్టణంలోని సాంఘీక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది హాస్టల్లోనే ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీపీవో జగదీశ్వర్, తహసీల్దార్ నవీన్ కుమార్, వార్డెన్ కుమారస్వామి పాల్గొన్నారు. పక్కాగా ధాన్యం కొనుగోలుకరీంనగర్ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 318 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 31 కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలిన కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా, మండల స్థాయిలో నోడల్ అధికారులు కొనుగోలు కేంద్రాల పనితీరును పర్యవేక్షించాలని సూచించారు. -
25న కో ఆప్షన్ ఎన్నిక
● బీజేపీ ఖాతాలోకే పదవులు! కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్ పదవుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎన్నికకు సంబంధించి ఈ నెల 25వ తేదీన నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో కార్పొరేటర్లు, ఎక్స్అఫిషియో సభ్యులు ఐదుగురు కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఐదు స్థానాలకు గాను గతంలో ఎప్పు డూ లేని విధంగా 46 మంది దరఖాస్తు చేసుకోవడం తెలిసిందే. ఈ నెల 16వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగియగా 25వ తేదీన కో ఆప్షన్ సభ్యుల ఎన్నికను చేపట్టనున్నారు. 46 మంది దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికార బీజేపీ ఐదు స్థానాలను కై వసం చేసుకోనుంది. బీజేపీ నుంచి కన్న కృష్ణ, నందకుమార్, హఫీ జాబేగం, బల్బీర్సింగ్, చిగిరి వెంకటమ్మ పోటీపడుతుండగా, ఎన్నిక లాంచనమే కానుంది. ఇప్పటికే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించగా, బీఆర్ఎస్తో పాటు దరఖాస్తు చేసుకొన్న ఇతరులకు పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. కో ఆప్షన్ ఎన్నికల్లో మొత్తం 69 ఓట్లు ఉండగా, 35 మంది బలం ఇప్పటికే బీజేపీకే ఉంది. తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దుకరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధి లో తాగునీటి సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఎస్సారార్ రిజర్వాయర్ను సందర్శించారు. నీటి ని లువ సామర్థ్యం, పంపింగ్ విధానం, మోటార్ల పనితీరుపై ఆరా తీశారు. నీటి సరఫరాలో డివిజన్లవారీగా పాటిస్తున్న సమయపాలన అడిగి తెలుసుకొని, 1వ, 2వ డివిజన్ ప్రజలకు నీటి సరఫరాచేయాలని సూచించారు. హై లెవెల్ పరిధిలోని అన్ని డివిజన్లకు సమయం ప్రకారం తాగునీరు సరఫరా చేయాలన్నారు. నగరవ్యాప్తంగా ఎక్కడైనా లీకేజీలు ఉంటే మరమ్మతులు చేపట్టి, అరికట్టాలన్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చడంలో నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా, అప్రమత్తంగా పనిచేయాలన్నారు. కరీంనగర్ అర్బన్: రైస్మిల్లర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అన్నమనేని సుధాకర్రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికా రులు కాసం మహేందర్, పీవీ రామకృష్ణ వెల్ల డించారు. రెండు రోజుల క్రితం నామినేషన్లు స్వీకరించగా పలువురి పోటీపడినా చివరికి నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎ న్నిక ఏకగ్రీవమైంది. గతంలో సుధాకర్రావు రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షునిగా విశిష్ట సేవలందించారు. కాగా ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 15మంది ఎన్నికయ్యారు. వి.వీరకుమార్, బోనగిరి శశికిరణ్, పి.మల్లారెడ్డి, కె.కేశవరెడ్డి, వి.మల్లన్న, యం.జితేందర్, టి.అశోక్రావు, టి.శివ, బుక్క శ్రీనివాస్, కె.మల్లిఖార్జున్, బి.తిరుపతి, సీహెచ్.అయిలయ్య, క్యాస ఉపేందర్, పి.సదానందం, పి.విజయేందర్రెడ్డి ఎన్నికవగా జిల్లా సెక్రటరీని ఎన్నుకోనున్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతకరీంనగర్ సిటీ: పర్యావరణ సుస్థిరత, పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ వంటి అంశాలే ‘మనశక్తి– మనగ్రహం’ ఉద్యమానికి మూల స్తంభాలని ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ రా మకృష్ణ తెలిపారు. ఎస్సారార్ కళాశాలలో వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘బోటనీ అండ్ బియాండ్ అవర్ పవర్– అవర్ ప్లానెట్’ అంశంపై ఒకరోజు జాతీయ వెబినార్ మంగళవా రం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్ జీవవైవిధ్య పరిరక్షణ, వాతావరణ సమతుల్య తలో వృక్షశాస్త్రం అనివార్యతను వివరించారు. -
బదిలీల సందడి
కరీంనగర్ అర్బన్: అధికారులు, ఉద్యోగుల బదిలీ కల త్వరలోనే నెరవేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు షెడ్యూల్ ప్రకటించడంతో కసరత్తు మొదలైంది. రెండేళ్ల తరువాత సాధారణ బదిలీలు జరుగుతుండటంతో శాఖలవారీగా ఖాళీలు, సీనియారిటీ జాబితాతో పాటు తప్పనిసరి బదిలీ అయ్యేవారి జాబితా రూపొందిస్తున్నారు. ప్రతిశాఖలో బదిలీల సందడి నెలకొనగా ఎవరెక్కడికి బదిలీ అవుతారన్న ఉత్కంఠ నెలకొంది. అటెండర్ల నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు స్థానచలనం తప్పనిసరి కావడంతో పలువురు పైరవీలు మొదలుపెట్టగా, మరికొందరు ఆదృష్టాన్ని విశ్వసిస్తున్నారు. సంబంఽధిత హెచ్వోడీలు మే 1నుంచి 7వరకు ఖాళీల ప్రదర్శన, సీనియారిటీ జాబితాతో పాటు బదిలీ తప్పనిసరి అయ్యేవారి జాబితా ఏర్పాటు చేయనున్నారు. మొదలైన పైరవీలు పట్టణాలు, కలెక్టరేట్ను వీడని అధికారులు, ఉద్యోగులు పైరవీలు ప్రారంభించారు. తమకున్న పలుకుబడి, రాజకీయ నేపథ్యాలతో పాటు మంత్రులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. త మకు అనుకూలమైన ప్రాంతానికి పోస్టింగ్ కల్పించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులతో పాటు రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులను కలిసి కీలక స్థానాల్లోనే ఉండేలా కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏఈ లు, ఏవోలు, ఏపీవోలతో పాటు ఇరిగేషన్, డీఆర్డీ వో, తదితరశాఖలవారు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పని స్థానచలనం.. పలువురికి మినహాయింపు సాధారణ బదిలీల్లో భాగంగా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. మూడేళ్లు ఒకే చోట పనిచేసి ఉంటే బదిలీకి అర్హులు. నాలుగేళ్లు ఒకే చోట పనిచేసిన ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. గరిష్టంగా 40శాతం ఉద్యోగులకు మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. మే 31 2027కి ముందు రిటైర్డ్ అయ్యేవారికి బదిలీ ఉండదు. ఎక్కువమంది ఒకే చోట కోరితే స్పౌజ్ కేటగిరితో పాటు 70శాతం వైకల్యం ఉన్న ఉద్యోగులు, మానసిక వైకల్యంతో కూడిన పిల్లలున్న ఉద్యోగులు, వితంతువులు, మెడికల్ గ్రౌండ్స్ ఉన్న ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వనున్నారు. శాఖల వారీగా హెచ్వోడీ సంబంఽధిత ఉద్యోగుల సీనియారిటీ జాబితా ప్రచురించాలి. అధికారులు, ఉద్యోగుల నుంచి 5 ఆప్షన్లు తీసుకోనున్నారు. బదిలీల గైడ్లైన్స్ వాణిజ్య పన్నులు, ఎకై ్సజ్, రవాణా, విద్య, అటవీ, పోలీసుశాఖలకు వర్తించవని స్పష్టం చేసింది. కేడర్ వారీగా బదిలీల బాధ్యతలు బదిలీలను రాష్ట్రస్థాయి, మల్టీజోన్, జోనల్, జిల్లా కే డర్గా విభజించారు. ఆయా స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నా రు. రాష్ట్రస్థాయిలో పోస్టులకుశాఖకు ప్రత్యేక ప్రధా న కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి చైర్మన్గా వ్యవహరించనుండగా హెచ్వోడీ కన్వీనర్గా, అదనపు, సంయుక్త, ఉప కార్యదర్శులు సభ్యులుగా ఉండనున్నారు. మల్టీజోనల్, జోనల్ స్థాయి పోస్టు ల బదిలీలకు హెచ్వోడీ చైర్మన్గా కార్యదర్శి సూ చించినవారు సభ్యులుగా, హెచ్వోడీ సూచించినవారు కన్వీసర్గా వ్యవహరించనుండగా జిల్లా కేడర్ పోస్టులకు కలెక్టర్ చైర్మన్గా అదనపు కలెక్టర్, డీఆర్వో సభ్యులుగా ఉండనుండగాశాఖకు సంబంధించిన జిల్లా అధికారి కన్వీనర్గా వ్యవహరిస్తారు.జిల్లాలో ఉద్యోగులిలా గెజిటెడ్ అధికారులు: 1,155నాన్గెజిటెడ్ అధికారులు: 6,295నాలుగో తగరతి ఉద్యోగులు: 1,157మొత్తం ఉద్యోగులు: 8,607 బదిలీ షెడ్యూల్ ఇదీ మే 1నుంచి 7: ఉద్యోగులు/ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు, సీనియారిటీ జాబితా, ఖాళీల ప్రదర్శన, బదిలీ అయ్యే ఉద్యోగుల జాబితా 8 నుంచి 15: ఉద్యోగుల ఆప్షన్లతో కూడి దరఖాస్తుల స్వీకరణ 16 నుంచి 24 వరకు: దరఖాస్తుల పరిశీలన, మాస్టర్ లిస్ట్ తయారీ 25 నుంచి 31: బదిలీ ఉత్తర్వులు, తదుపరి మూడు రోజుల్లో విధుల్లో చేరిక -
రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం సహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.కరీంనగర్లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్పై నిప్పులు చెరిగారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా అమృత్- 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు..ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకొనితింటున్నారు. కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి.. సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వృథాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తుంది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు బీజేపీ గెలుచుకుంది.తేజస్వీ సూర్య కామెంట్స్పై.. తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే.. అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కన్నందుకేనా మాకీ శిక్ష
నా ముగ్గురు కుమారులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, సంపత్రెడ్డికి నాకున్న 11.36ఎకరాల భూమిని పంచి రిజిస్ట్రేషన్ చేశాను. భూమి పంచిన నుంచి మమ్మల్ని పట్టించుకుంటలేరు. ఇంటి నుంచి వెళ్లగొట్టి, నా భార్య మెడలో ఉన్న బంగారం కూడా లాక్కున్నారు. న్యాయం కోసం కలెక్టర్ దగ్గరికి వచ్చినం. కన్నందుకా మాకీ శిక్షా? – కె.రాజిరెడ్డి, రేకొండ, చిగురుమామిడి ఉన్నది 1.03ఎకరాలు.. నమోదైంది 29గుంటలు నాకు పాత పాస్బుక్లో సర్వేనంబర్ 601/ఎలో 1.03ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చాక ఉన్న భూమి వివరాలు రావాల్సి ఉండగా 29గుంటలుగా వస్తుంది. ఇదెక్కడి అన్యాయమని ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. ఎవరూ పట్టించుకోవడం లేదు. మిగతా 14 గుంటల భూమిని రికార్డులో నమోదు చేయాలని కోరితే పరిష్కరించడం లేదు. – తిరుపతి, కోర్కల్, వీణవంక -
ప్రజా‘వాణి’ వినరూ!
కరీంనగర్ అర్బన్: మా భూమి సంబంధం లేని వ్యక్తిపేరున నమోదైంది. ఇదెక్కడి న్యాయమని మండల, డివిజన్, జిల్లా అధికారులను కలిస్తే పరిష్కారం లేదు. తిరగవట్టి నాలుగేళ్లవుతుంది. ఇంకెప్పుడు మా సమస్యకు మోక్షం లభిస్తుందంటూ బాధితులు ఏకరవు పెట్టారు. ప్రజావాణికి వచ్చే సమస్యల్లో అత్యధికం భూ సమస్యలే కాగా పరిష్కారం ఎండమావే. కొత్త కలెక్టర్తోనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలే రావడం విశేషం. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవో మహేశ్వర్ అర్జీలు స్వీకరించారు. మొత్తం 238అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.మొత్తం అర్జీలు: 238కరీంనగర్ కార్పొరేషన్: 59ఎంపీడీవో కొత్తపల్లి: 14డీపీవో: 12కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 11ఆర్డీవో,కరీంనగర్: 10మానకొండూరు తహసీల్దార్: 09 -
సంఘ సంస్కర్త బసవేశ్వరుడు
కరీంనగర్ టౌన్:కుల, లింగ, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి.. తన బోధనలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడని కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో బసవేశ్వరుడి జ యంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ సహా ఇతర అధికారులు పూలమాలలు వేసి ని వాళి అర్పించారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా బీసీ అ భివృద్ధి అధికారి అనిల్ ప్రకాశ్, వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు న్యాలమడుగు శంకరయ్య, 9వ డివిజన్ కార్పొరేటర్ పడిశెట్టి వసంతలక్ష్మి, లుక్క రాజేశం, గాజుల స్వప్న పాల్గొన్నారు. -
డంప్యార్డ్పై బీజేపీ ఉద్యమం
కరీంనగర్: హుజూరాబాద్ శివారులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు, దీక్షలు సహా వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు సోమవారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్తో భేటీ అయ్యారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంతో హుజూరాబాద్ ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటైతే ఆ పరిసరాల్లో నివసించే ప్రజల బతుకులు దుర్భరంగా మారతాయని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు పడుతున్న బాధలను కళ్లారా చూశానని, అలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని అన్నారు. హుజూరాబాద్ ప్రజలకు మద్దతుగా బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. కలెక్టర్ నుంచి రాష్ట్ర పెద్దల వరకు కలిసి నిరసన తెలియజేయాలని కోరారు. మంగళవారం హుజూరాబాద్లో బీజేపీ ముఖ్య నేతలతో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. -
వివరాల సేకరణలో పొరపాట్లు చేయొద్దు
కరీంనగర్ కార్పొరేషన్: జనగణన సందర్భంగా వివరాల సేకేరణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు. నగరంలో జనగణన చేపట్టబోయే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో సోమవారం నుంచి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 30వ తేదీ వరకు ఈ శిక్షణ కొనసాగనుంది. శిక్షణా తరగతులను సందర్శించిన కమిషనర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలన్నారు. హౌస్ లిస్టు బ్లాక్ల ప్రకారం ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించాలన్నారు. ప్రణాళిక ప్రకారం జనగణన చేపట్టి ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సమాచారం తెలిపేలా ప్రోత్సహించాలని సూచించారు. 666 హౌజ్ లిస్ట్ బ్లాక్ల ప్రకారం 855మంది ఎన్యూమరేటర్లు, సూపర్ వైజర్లు జనగణన చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ప్లానింగ్ ఏసీపీలు వేణు, శ్రీధర్,జనగణన ట్రైనర్లు పాల్గొన్నారు. బల్దియా ప్రజావాణికి 22 దరఖాస్తులు నగరపాలక సంస్థ ప్రజావాణి దరఖాస్తులను ప్రాధాన్యతగా పరిష్కరించాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 22 దరఖాస్తులు రాగా, ఇందులో ఇంజినీరింగ్ 6, టౌన్ ప్లానింగ్ 10, రెవెన్యూ విభాగంలో ఆరు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను సెక్షన్లవారీగా సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటి కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. -
దారి లేదంటుండు
గ్రామ సర్వే నంబర్ 959లో 22గుంటల భూమి ఉంది. 50 ఏళ్ల నుంచి సాగు చేసుకుని బతుకుతున్నం. మా వ్యవసాయ భూమికి వెళ్లేదారిని నారాయణ, రాజయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇబ్బందులు పెడుతున్నారు. ఆ దారిలోకి వస్తే నరికి చంపుతామంటున్నారు. సాగుభూమిలోకి మేము ఎలా వెళ్లాలి? – బి.పోచయ్య, జగ్గయ్యపల్లి, మానకొండూరు ఉద్యోగం ఇవ్వకుండా తిప్పుకుంటుర్రు నా తండ్రి ఖాదర్పాషా డీసీఎంఎస్లో డ్రైవర్గా పనిచేసి మెడికల్ ఇన్వాలిడేషన్ కింద విధుల నుంచి తప్పుకున్నాడు. నాకు ఉద్యోగమివ్వాలని దరఖా స్తు చేశారు. నాకు ఉద్యో గం ఇవ్వకపోగా నా తరువాత దరఖాస్తు చేసినవారికి ఉద్యోగమిచ్చారు. వారికివ్వడంలో నాకు అభ్యంతరం లేదు. కానీ నా కు ఉద్యోగమివ్వడంలో ఏళ్ల తరబడి నాన్చుతున్నా రు. కోర్టు డైరెక్షన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. – ఎండీ.అరిఫ్పాషా, శ్రీనగర్కాలనీ, కరీంనగర్ -
నూతన సంఘానికి గ్రీన్సిగ్నల్
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం సేవలందించనుంది. జిల్లాల విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటగా ఉమ్మడి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘంగానే సేవలందాయి. 55 మండలాలు, 707 ప్రాథమిక సహకార సంఘాల భాగస్వామ్యంతో సంఘం సేవలందించింది. తాజాగా జిల్లాల వారీగా సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర గొర్రెల పెంపకందారుల సహకార ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.సుబ్బారాయుడు జిల్లా రిజిస్ట్రేషన్ నంబర్ను అధికారికంగా సోమవారం అందజేశారు. 16 మండలాలు, 243 గ్రామ ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సంఘాలతో జిల్లా నూతన సంఘం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ నంబర్ స్వీకరించిన జిల్లా యూని యన్ అడహక్ కమిటీ ఛైర్మన్ బాసవేని మల్లేశం, డైరెక్టర్లు బుచ్చన్న, ఓదెలు, సురేష్, శ్రీనివాస్, రవీందర్, సదానందం, ఆంజనేయులు, రంజిత్, సదయ్య ఎండీకి కృతజ్ఞతలు తెలిపారు. అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరంకరీంనగర్ సిటీ: అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. ప్రగతిపథంలో తెలంగాణ అగ్నిమాపకశాఖ సంసిద్ధత అనే అంశంపై తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్శాఖ ఆధ్వర్యంలో వర్సిటీలో సోమవారం అవగాహన కా ర్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హా జరైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాన్ని అగ్ని ప్రమాదాల నుంచి కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్, ప్రయోగశాలలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్, వోఎస్డీ హరికాంత్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ రామకాంత్, లా కాలేజీ ప్రిన్సిపాల్ పద్మావతి పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.8,150 జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.8,150 పలికింది. మోడల్ ధర రూ.7,600, కనిష్ట ధర రూ.7,000 చెల్లించారు. క్రయవిక్రయాలను మార్కెట్ చైర్పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
కేసీఆర్ నన్ను అక్కున చేర్చుకున్నారు: జీవన్ రెడ్డి
సాక్షి, జగిత్యాల: జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నాటి జగిత్యాల జైత్రయాత్రను తలపించేలా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కూడా ఉండబోతోందన్నారు. రాజకీయంగా తాను విభేదించినా కేసీఆర్ మాత్రం తనను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నట్టు జీవన్ రెడ్డి చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ..‘మేడిగడ్డ ప్రాజెక్టుతో మాత్రమే తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుంది. తుమ్మిడిహట్టి కట్టాలని నేను డిమాండ్ చేసిన మాట వాస్తవమే. కానీ, కాళేశ్వరంతో పెద్ద సంఖ్యలో రైతాంగానికి మేలవుతుంది. మళ్లీ తుమ్మిడిహట్టి నిర్మాణం కావాలన్నా కేసీఆర్ రావాల్సిందే. మేడిగడ్డ మీద ఎన్డీఎస్ఎఫ్ రిపోర్ట్ ఇచ్చి ఏడాదైతే గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?. ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నాడు. పునరుద్ధరణ ఎప్పుడు పూర్తి అవుతుంది? అని ప్రశ్నించారు.అలాగే, నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంతకాలం నా రాజకీయ భవిష్యత్తుపై మనస్థాపం చెందాను. రాజకీయంగా నేను విభేదించినా కేసీఆర్ పెద్ద మనసులో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఇవాళ నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమైన తెలంగాణా పరిస్థితులపై ఈరోజు సభ ఉండబోతోంది. జగిత్యాల బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. జగిత్యాల బీఆర్ఎస్ సభపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. తనను బీఆర్ఎస్ నేతలు క్రాస్ బ్రీడ్ అని సంబోధించడంపై మండిపడ్డారు. తాజాగా సంజయ్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ..‘జగిత్యాల సభతో ఒరిగేదేమీ లేదు. కేసీఆర్, కేటీఆర్ను వందల సార్లు తిట్టిన జీవన్ రెడ్డి చేరికపై ప్రజలందరికీ స్పష్టత ఉంది. బీఆర్ఎస్ సభకు నాకు ఆహ్వానం లేదు. నేను మేడిగడ్డకు ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తున్నాను. నా చివరి అంకం వరకు ఇక కాంగ్రెస్తోనే నా ప్రయాణం’ అని వ్యాఖ్యలు చేశారు. -
చట్నీలో గడ్డిపురుగు
జగిత్యాల: జిల్లా కేంద్రంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఇడ్లీ సెంటర్లో చట్నీలో గడ్డిపురుగు వచ్చింది. అజయ్ అనే వ్యక్తి పూరి తినేందుకు ఆ హోటల్కు వెళ్లాడు. పూరితోపాటు చట్నీ వేసుకున్న అతడికి గడ్డిపురుగు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యానికి చూపించినా.. నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని బాధితుడు పేర్కొన్నారు. ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందించలేదని ఆరోపించాడు. కరీంనగర్ క్రైం: పోలీసుల భయంతో ఓ యువకుడు భవనం ఎక్కి హల్చల్ చేశాడు. పోలీసుల కథనం ప్రకారం రాజస్థాన్కు చెందిన రావత్ ఆకాశ్(19) నగరంలోని జ్యోతినగర్లో నివాసం ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నాడు. ఓ యువతిని వేధించగా రెండు రోజుల క్రితం టూటౌన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఆదివారం ప్రయత్నించగా పారిపోయాడు. ముకరంపురలోని ఒక భవనంపైకి చేరుకుని కిందకు దూకేందుకు ప్రయత్నం చేశాడు. సీఐ సృజన్రెడ్డి, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని వలలు, నిచ్చెనలతో పట్టుకుని స్టేషన్కు తరలించారు. పీఎంఐకి దరఖాస్తులు ఆహ్వానం రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. శిక్షణ(ఇంటర్న్షిప్) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు ((httpr://pmintern ship.mca.gov.in)) లేదా ((myrcheme.gov.in/ rchemer/pmir) పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలి. గంజాయి విక్రేతల అరెస్ట్మెట్పల్లి: మెట్పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. మెట్పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన బాణాల రాజుల కొంతకాలంగా మెదక్ జిల్లా నుంచి గంజాయిని ఇక్కడకు తీసుకొచ్చి అర్బన్ హౌజింగ్ కాలనీలోని ఓ ఇంట్లో చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 140గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. -
ఉద్యాన సాగుకు ఊపిరి
కరీంనగర్ అర్బన్: మూస ధోరణిలో పంటల సాగు కాకుండా ప్రజారోగ్యం, అవసరాల క్రమంలో సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఒకప్పుడు పత్తి, వరి తక్కువ విస్తీర్ణంలో సాగయ్యేది. మొక్కజొన్న, రాగులు, సజ్జలు, జొన్నలు, అవిసెలు, ఉలవలు, పెసర, కంది, మినుములు, శనగ వంటి పంటలకు ప్రాధాన్యతనిచ్చేవారు. కాలక్రమేణా పత్తి, వరి సాగే సింహభాగం కాగా ఇతర పంటలు కనుమరుగయ్యాయి. ఇక కూరగాయల సాగు అంతంతమాత్రమే. ఇతర రాష్ట్రాలు, జిల్లాలపై ఆధారపడాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఖర్చులు, ఏజెంట్ కమీషన్ తదితర కారణాలతో వాటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. సదరు సమస్యకు పరిష్కారంగా కూరగాయలను పెద్దఎత్తున పండించాలని రాష్ట్ర ఉద్యానశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో పలువురు రైతులను గుర్తించి వలంటీర్లుగా శిక్షణనిస్తోంది. 30 ప్యాక్స్లు.. 30మంది వలంటీర్లు పీఏసీఎస్కు ఒకరి చొప్పున వలంటీర్లను ఎంపిక చేయగా ఇప్పటికే రాజేంద్రనగర్లోని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఽఆధ్వర్యంలో శిక్షణనిచ్చారు. ఈ నెల 18న జిల్లా ఉద్యానశాఖ కార్యాలయంలో మలిదశ శిక్షణనిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని 30 ప్యాక్స్లకు 30 మంది వలంటీర్లను ఎంపిక చేశారు. వారంతా తాము నేర్చుకున్న మెలకువలను రైతులకు వివరించి కూరగాయల రైతులను చైతన్యవంతులను చేయనుండగా బాసటగా నిలువనున్నారు. ఒక్కో వలంటీరు.. వంద ఎకరాలు ఒక్కో వలంటీరు వంద ఎకరాల చొప్పున కూరగాయల పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా నిర్దేశించారు. సదరు లెక్కన 300 ఎకరాలలో కూరగాయలు పండించేలా కృషి చేయనున్నారు. విస్తీర్ణం పెరుగనుంది. తద్వారా విస్తీర్ణం మరింత పెరగనుందన్నది ప్రభుత్వ భావన. ఉచితంగా నారు ఇవ్వనుండగా టమాట, వంకాయ, మిర్చి వంటి వాటిని గరిష్టంగా 5ఎకరాల వరకు ఇవ్వనున్నారు. 50శాతం రాయితీతో ప్లాస్టిక్ మల్చింగ్ ఎకరానికి రూ.8వేల చొప్పున గరిష్టంగా 5 ఎకరాల వరకు ఇవ్వనుండగా 50శాతం రాయితీతో యూనిట్(అర్ధ ఎకరం)కు రూ.50వేల చొప్పున ఇవ్వనున్నారు. శాశ్వత పందిళ్లు వేసుకోలేని వారికి కట్టెలతో స్టేకింగ్ కోసం 50శాతం రాయితీతో ఎకరానికి రూ.4వేలు, నీరుపారుదలకు డ్రిప్ లేదా స్ప్రింక్లర్ రాయితీపై ఇస్తారు. ఇక సాగుకు కావాల్సిన స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర వాటిని 40–50శాతం రాయితీతో ఇవ్వనున్నారు. వర్మీకంపోస్ట్ తయారీకి 50శాతం రాయితీ, పండిన పంటను ప్యాక్ చేయడం, మిగిలిన వాటిని ఉంచడం కోసం ప్యాక్ హౌస్ 50శాతం రాయితీ, అంతేకాకుండా సోలార్ డ్రయర్, పాలీహౌస్, షెడ్నెట్, ఫామ్పాండ్స్ వంటి వాటిని రాయితీపై ఇవ్వనున్నారు. మూడు చోట్ల విత్తనోత్పత్తి వ్యవసాయశాఖ, నాబార్డు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో జిల్లాలోని మూడు సహకార సంఘాల పరిధిలో విత్తనోత్పత్తి చేయనున్నారు. వరితో పాటు పెసర, కంది పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట ప్రాంతాల్లో ఒక్కో సంఘం పరిధిలో 10ఎకరాలు సాగు చేయాలని నిర్ణయించారు. ఆదర్శ రైతులను ఎంపిక చేసి వారి ద్వారా సాగు చేయించనున్నారు.ప్రభుత్వమిచ్చే రాయితీని వినియోగించుకుని రైతులు కూరగాయల సాగు చేసుకోవాలి. ప్రభుత్వమిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రైతులే విక్రయించుకునేలా గిట్టుబాటు ధర లభించేలా మార్కెట్ సౌకర్యం ఉంటుంది. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి సహకార సంఘాల పరిధిలో వలంటీర్ల నియామకం 30 ప్యాక్స్లలో 300 ఎకరాల్లో సాగుకు రైతుల ఎంపిక సాగుకు ప్రభుత్వ రాయితీ, ప్రోత్సాహం -
వృద్ధులు, చిన్నారులు పైలం
వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పుచక్కెర వేసుకుని తాగాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ పొట్లాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనూ అజాగ్రత్త వహించకుండా బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు నీటిని తాగుతూ ఉండాలి. – సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్ వేసవిలో వాహనాల్లో గాలిని తరచూ చెక్ చేసుకోవాలి. నేరుగా ఎండ పడే చోట వాహనాన్ని నిలుపరాదు. నీడ ఉంటే చోటే నిలుపాలి. ఇంజిన్ అత్యధికంగా వేడెక్కితే డ్యాష్బోర్డులోని చెక్ ఇంజిన్, ఓవర్ హీట్ గుర్తులు బ్లింక్ అవుతుంటాయి. అప్రమత్తమై కూలంట్, రెడియేటర్ క్యాప్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఏసీ కంప్రెసర్, వాటర్ లెవల్స్ తరచూ చెక్ చేస్తుండాలి. ఎండ అత్యధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీలైతే అసలు ప్రయాణం చేయకుండా ఉంటేనే మేలు. లాంగ్ టూర్ వెళ్లేవారు 50కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కారు, బైక్ వేటిలో ప్రయాణించినా అత్యవసరంలో ఉపయోగపడేలా రకరకాల సైజుల స్క్రూడ్రైవర్లు, రెంచ్లు, జాకీ, టైరు ఐరన్, చేతికి గ్లౌజులు, చీకట్లో ఉపయోగపడే ఫ్లాష్లైట్ వెంట ఉంచుకోవాలి. – రమణ, మెకానిక్ -
హార్వెస్టర్ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం
పెగడపల్లి: పొలం కోస్తుండగా ప్రమాదవశాత్తు హార్వెస్టర్తోపాటు వ్యవసాయ బావిలో పడి డ్రైవర్ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని నందగిరిలో ఆదివారం విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పాలకాల లింగయ్య, నర్సవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకు వివాహమైంది. లింగయ్య జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్లాడు. నర్సవ్వ బీడీకార్మికురాలు. పెద్ద కుమారుడైన మధు (35) డైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. గ్రామానికి చెందిన దనాల పర్శరాం అనే యజమానికి హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ రైతు వరిపంటను కోసేందుకు వెళ్లిన మధు ప్రమాదవశాత్తు హార్వెస్టర్తో పాటు వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఈ ఘటనలో మధు అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై కిరణ్కుమార్ ప్రమాదస్థలికి చేరుకుని క్రేన్ సహాయంతో హార్వెస్టర్ను బయటకు తీయించి, గజ ఈతగాళ్ల సహాయంతో మధు మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మధుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య కావ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అన్ని విధాలా ఆదుకుంటాం: మంత్రి అడ్లూరి డ్రైవర్ మధు కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ప్రమాదస్థలికి చేరుకున్న ఆయన మృతుని కుటుంబసభ్యులను ఓదార్చారు. ఇందిరమ్మ ఇంటితోపాటు కావ్యకు విద్యార్థత ఆధారంగా అంగన్వాడికేంద్రంలో హెల్పర్, లేదా మధ్యాహ్న భోజనం కేర్టేకర్, ఔట్సోర్స్ ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసానిచ్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచ్ రజిత ఉన్నారు. నందగిరిలో విషాదం -
నృసింహుడి నవరాత్రి ఉత్సవాలు
● ఈనెల 22 నుంచి 30 వరకు.. ధర్మపురి: ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహుని జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని ఈవో శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు చేపట్టే ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాగునీరు, చలువ పందిళ్లు, లడ్డూప్రసాదాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 6 గంటలకు బిందే తీర్థం, 8 గంటలకు పుణ్యవచనం, కలశస్థాపన, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, 25న అన్నకూటోత్సవం, 26న సహస్ర కలశాభిషేకం, 27న చందనోత్సవం, 28న పల్లవోత్సవం, వసంతోత్సవం, 29న లక్ష తులసి అర్చన, 30న స్వామివారల జయంతి ఉత్సవం నిర్వహిస్తారు. -
హెల్మెట్ ధరించి.. సైకిల్ సవారీ
వేములవాడరూరల్: వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కానీ, 70 ఏళ్ల వృద్ధ రైతు హెల్మెట్ ధరించి సైకిల్పై రోజూ మార్కెట్కు వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేములవాడ మున్సిపల్ పరిధి కోనాయపల్లికి చెందిన సాయిని నారాయణ 50 ఏళ్ల నుంచి సైకిల్ వాడుతున్నాడు. సైకిల్పై ఇంటి నుంచి బయటకు వచ్చాడంటే హెల్మెట్ ధరిస్తాడు. ఆయన సైకిల్కు చార్జింగ్ బ్యాటరీ ఏర్పాటు చేసుకున్నాడు. తాను పండించిన పంటలను కోనాయపల్లి నుంచి వేములవాడ మార్కెట్కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా నారాయణ హెల్మెట్ ధరించి సైకిల్పై రావడంతో పలువురు అభినందిస్తున్నారు. -
కేసీఆర్ బయటకొస్తుండంటే భయపడుతున్నారు
కరీంనగర్టౌన్: కేసీఆర్ బయటకొస్తున్నాడంటే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జగిత్యాల సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తూ ఆదివారం మార్గంమధ్యలో కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 20న జగిత్యాలలో కేసీఆర్ సభ ఘనంగా జరుగుతుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు.. ప్రజల్లోకి రావడం లేదని పదేపదే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారని, కేసీఆర్ బయటకు వస్తుండు అంటే వణికిపోతున్నారన్నారు. కేసీఆర్ జగిత్యాల సభ రోజే రైతుభరోసా నిధులు విడుదల చేయడం, మేడిగడ్డ రిజర్వాయర్ సందర్శన ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక హామీల అమలును మరిచిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, పొన్నం అనిల్ కుమార్గౌడ్, ఐలేందర్ యాదవ్, గందె మహేశ్ పాల్గొన్నారు. -
నిప్పుల కొలిమి.. జాగ్రత్త సుమీ
కరీంనగర్ అర్బన్: ప్రచండ భానుడి ప్రతాపానికి సకల వర్గాలు సతమతమవుతున్నాయి. అప్రకటిత కర్ఫ్యూతో మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గతకొన్ని రోజులుగా 40–43డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అరెంజ్ అలర్ట్ జోన్లో ఉండగా రానున్న రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశముందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన పదార్థాలేంటీ వంటి వివరాలను వివరించారు. ఉష్ణోగ్రతలు హెచ్చరిక స్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. టమాట తోటకు నీడ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి. షెడ్నెట్ వేసుకుంటే మరీ మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. మామిడికి కోతకు ఒక నెల ముందు నుంచే నీటి సరఫరా నిలిపివేయాలి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే కాయ నాణ్యతగా పెరుగుతుంది. రుచికరంగా ఉంటుంది. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు. – పల్లె కమలాకర్రెడ్డి, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యాన శాఖ అధికారి ఎండల వేళ పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మూడు పూటలు నీరు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను ఉంచాలి. గ్రామాల్లో ఉండే నీటి తొట్లలో ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్తో నింపాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు అధిక ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు పైన గడ్డి లేదా తుంగను కప్పాలి. రెండు గంటలకోసారి నీటితో తడపాలి. – తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశు వైద్యులు మండుటెండలో స్వీయ జాగ్రత్తలే రక్ష -
బోగస్ క్రీడా సంఘాలను నమ్మొద్దు
● తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలో కిక్ బాక్సింగ్ పేరిట పలువురు క్రీడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, అవి అన్ని బోగస్ క్రీడాసంఘాలని తెలంగాణ కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు పేర్కొన్నారు. కరీంనగర్లో ఆదివారం మాట్లాడుతూ ఏదైనా క్రీడా సంఘం ఏర్పాటైతే అది తెలంగాణ ఒలంపిక్ సంఘం, జాతీయ ఫెడరేషన్, భారత ప్రభుత్వం గుర్తింపు పొంది ఉండాలన్నారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ కిక్బాక్సింగ్ అసోసియేషన్ మాత్రమే గుర్తింపు ఉందని ఈ సంఘం ఆధ్వర్యంలోనే ఏటా రెండుసార్లు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించి, జాతీయ పోటీలకు తెలంగాణ జట్లను పంపిస్తున్నట్లు తెలిపారు. కొందరు మోసపూరితంగా సంఘాలను ఏర్పాటు చేసుకొని తల్లిదండ్రులను, పాఠశాలల యాజమాన్యాలను తప్పుదోవపట్టిస్తున్నారని వాటన్నింటని నమ్మవద్దని హితవు పలికారు. తెలంగాణ కిక్ బాక్సింగ్ ఆధ్వర్యంలో జారీ చేసిన క్రీడా సర్టిఫికెట్లలకు ట్రిపుల్ఐటీ, ఎంసెట్ తదితర ఉన్నత విద్యకు స్పోర్ట్స్ కోటా వర్తిస్తుందన్నారు. తెలంగాణలో 25 జిల్లాల్లో కిక్ బాక్సింగ్ సంఘాలున్నాయని, ఇవన్ని ఒలంపిక్ సంఘంలో గుర్తింపుపొందాయని తెలిపారు. అనధికార సంస్థలు లేదా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న వారు మానుకోవాలని హెచ్చరించారు. బోగస్ లేదా అనధికార సంస్థలు నిర్వహించే ఈవెంట్స్లో పాల్గొంటే అందులో పొందిన సర్టిఫికెట్లు చెల్లుబాటు కావని సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల కిక్ బాక్సింగ్ సంఘాల కార్యదర్శులు, కోచ్లు సురభి అన్వేష్, వి.శ్రీనివాస్, సురభి ఇంద్ర, ఎ.సంజీవ్, ఎస్.వినీశ్, కె.వెంకటేశ్ పాల్గొన్నారు. మట్టి తరలిస్తున్న టిప్పర్ పట్టివేతచందుర్తి(వేములవాడ): అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను ఆదివారం చందుర్తి పోలీసులు పట్టుకున్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్ శివారులో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా అక్రమంగా తరలిస్తునట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిసింది. పట్టుకున్న టిప్పర్ను పోలీస్స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న ప్రచారంతో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. -
నేటి నుంచి ఓపెన్ పరీక్షలు
కరీంనగర్ టౌన్: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నా యి. 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఉద యం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా 23, కరీంనగర్లో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. పదో తరగతి 1,588 మంది, ఇంటర్ పరీక్షలకు 2,752 మంది హాజరుకానున్నారు. కరీంనగర్లో సుభాష్నగర్ ప్రభు త్వ హైస్కూల్, సప్తగిరికాలనీ హైస్కూల్, దన్గర్వాడీ హైస్కూల్, కుమ్మర్వాడి హైస్కూల్, ఆర్ట్స్ కాలేజీ, సైన్స్ కాలేజీ, సహస్ర కాలేజీ, వాణినికేతన్ స్కూల్, సాన్వి కాలేజీ, కార్ఖానగడ్డ హైస్కూల్, రాంనగర్ హైస్కూల్, సవరన్ హైస్కూల్, ట్రినిటీ జూనియర్ కళాశాల భగత్నగర్, సెయింట్ అల్పోన్స్ , జ్యోతినగర్, హు జూరాబాద్, జమ్మికుంటలో కేంద్రాలు ఏర్పా టు చేశారు. వివరాలకు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ రామడుగు రవీందర్ 9440415099ను సంప్రదించవచ్చు. నేడు రెండో విడత రైతు భరోసా కరీంనగర్ అర్బన్: సీజన్కు ముందు ఇవ్వాల్సి న రైతు భరోసా ఇంకా సాగుతోంది. ఏటా వానాకాలం, యాసంగి సీజన్కు ఎకరానికి రూ.6వేలు అన్నదాత ఖాతాలో జమ కావాల్సి ఉండగా పడిగాపులు తప్పడం లేదు. గత నెల 25న మొదటి విడతగా ఎకరం సాగు భూమి గల రైతులకు రైతు భరోసా నిధులు జమ కాగా తాజాగా సోమవారం రెండో విడతగా రైతు భరోసా నిధులు జమ కానున్నాయి. రెండెకరాల వరకు జమవుతాయా.. ఐదెకరాల వరకా అన్నది స్పష్టత లేదు. కాగా సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయనుండగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు రైతు వేదికల్లో ఏర్పాట్లు చేశారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. మహిళా బిల్లు వెనుక బీజేపీ కుట్రకరీంనగర్ కార్పొరేషన్: మహిళా బిల్లు వెనుక, డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గించే బీజేపీ కుట్ర దాగి ఉందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. వాస్త వ పరిస్థితిని విస్మరించి స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన చేయడాన్ని ఎద్దేవా చేశారు. ఆదివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో, కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్తో కలిసి మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని అధికారాన్ని హస్తగతం చేసుకొనే కుటిల రాజకీయంలో భాగంగానే, మహిళా బిల్లుతో కలిపి డీలిమిటేషన్ బిల్లు తెచ్చారని ఆరోపించారు. పైగా మహిళా బిల్లుపై కాంగ్రెస్ను అపవాదుకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి సవాలును స్వీకరించి, సోమవారం మళ్లీ కేవలం మహిళా బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దక్షిణాదికి నష్టం వాటిల్లుతున్నా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నోరుమెదపకపోవడం విడ్డూరమన్నారు. అర్బన్ బ్యాంక్చైర్మన్ కర్ర రాజశేఖర్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, గంట శ్రీనివాస్, కాంతాల జగన్రెడ్డి, పర్వతం మల్లేశం, గుమ్మడి రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఎస్సై కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయంఇల్లందకుంట: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎస్సై చంద్రశేఖర్ దంపతుల కుటుంబానికి పోలీస్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు అండగా నిలిచారు. మండలంలోని సీతంపేట గ్రామంలో ఆదివారం చంద్రశేఖర్ కుటుంబసభ్యులకు రూ.25లక్షల విలువైన చెక్కు అందించారు. చంద్రశేఖర్ ఇద్దరు కుమారుల పేరిట తలో రూ.12.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 2014 బ్యాచ్కు చెందిన సుమారు 700 మంది ఎస్సైలు 2021లో వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్సై ఆరోగ్యం తెలిపారు. పిల్లల చదువులకు, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
డిఫాల్టర్లకు షాక్
కరీంనగర్ అర్బన్: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)ను పక్కాగా నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. గత అనుభవాల క్రమంలో రైస్మిల్లర్లు మోసం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినతరం చేసింది. తాజాగా మిల్లింగ్ చార్జీలను విడుదల చేయగా బకాయిదారులకు షాక్ ఇచ్చింది. సీఎంఆర్ బకాయిదారులకు మిల్లింగ్ చార్జీలు నిలిపివేయగా హామీపత్రాన్ని తెరపైకి తెచ్చింది. డిఫాల్టర్లకు తోడూ బకాయిదారులకు పూచీకత్తు ఇచ్చినవారికి చార్జీలు ఇవ్వమని తేల్చేసింది. జిల్లాలో దాదాపు 60మిల్లులకు మిల్లింగ్ బకాయిలు విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో బకాయిదారులకు రావాల్సిన సొమ్ముపై రైస్మిల్లర్ల సంఘం నేతలు ప్రయత్నాలు షురూ చేశారు. అయిదేళ్ల మిల్లింగ్ బకాయిలు విడుదల ఐదేళ్లుగా సీఎంఆర్ మిల్లింగ్ చార్జీలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఒక్కో మిల్లుకు సుమారు రూ.30లక్షల నుంచి 50లక్షల వరకు రావాల్సి ఉండగా, చాలాకాలంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గత వారం సీఎంఆర్ ధాన్యం కేటాయించే సమయంలో మిల్లర్లు ఇవ్వాల్సిన గ్యారంటీల్లో పౌరసరఫరాలశాఖ నూతన విధానాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మిల్లర్లు నూతన విధానాలను వ్యతిరేకిస్తూ యాసంగి ధాన్యం దించుకునేందుకు ఒప్పుకోకపోవడంతో మిల్లర్లతో చర్చలు జరపాలని ప్రభుత్వం పౌరసరఫరాలశాఖను ఆదేశించింది. అధికారులు, మిల్లర్లు సమావేశం కాగా గ్యారంటీలకు సంబంధించి పాత పద్ధతినే అమలు చేయాలని, మిల్లింగ్ చార్జీల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటికి పౌరసరఫరాల శాఖ అంగీకరించగా చర్చల వివరాలు ప్రభుత్వానికి నివేదించగా రూ.200 కోట్లు విడుదల చేసినట్లు సమాచారం. మిల్లింగ్ చార్జీల బకాయిలు పొందాలనుకునే మిల్లర్లు ముందుగా ఏ సీజన్లోనూ డిఫాల్టర్ కాలేదని, బకాయిదారులకు పూచీకత్తు లేనని హామీ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మిల్లర్లు అదనంగా బకాయిలు ఉండి మిల్లింగ్ చార్జీలు తీసుకున్నట్లయితే వాటిని రాబట్టుకునేందుకు అంగీకరిస్తూ అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. సీఎంఆర్ గడువు పొడిగింపు 2024–25 యాసంగి సీఎంఆర్ గడువును కేంద్రం మరో రెండు నెలలు పొడిగించింది. ఈ మేరకు ఈనెల 17న వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ కేంద్ర మంత్రిత్వశాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, పౌరసరఫరాలశాఖకు ఉత్తర్వులు అందాయి. మిల్లర్ల యజమానులు సీఎంఆర్ను మిల్లర్ల యజమానులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పూర్తిగా చెల్లించాలని పేర్కొనగా గడువు పెంచుతూ ఉత్తర్వులు వచ్చినట్లు పౌరసరఫరాల అధికారులు వివరించారు. రీసైక్లింగ్ కాకుండా అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎఫ్సీఐని కేంద్రం కోరింది. కేంద్రాల నుంచి తరలించే వాహనాలకు జీపీఎస్ ఆధారిత ట్రాకింగ్ను అమలు చేయాలని స్పష్టం చేసింది. -
కలెక్షన్ ఆటో.. ఇటో!
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో స్వచ్ఛ ఆటోల పేరిట అక్రమ దందా కొనసాగుతోంది. ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ చార్జీలు నగరపాలకసంస్థ ఖజానాకు కాకుండా, ఏళ్లకాలంగా కొంతమంది జేబుల్లోకి చేరుతున్నాయి. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ.3 కోట్లు ఇప్పటికే స్వచ్ఛ ఆటోల పేరిట స్వాహా అయినట్లు సమాచారం. తాజాగా వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతం బల్దియాలో సంచలనం సృష్టిస్తోంది. చెత్త సేకరణకు ఆటోలు నగరంలో నివాసాలు, దుకాణాల నుంచి ప్రతి రోజు చెత్త సేకరించేందుకు స్వచ్ఛ ఆటోలను తీసుకొచ్చారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంప్యార్డ్కు తరలిస్తాయి. ఇందుకోసం డ్రైవర్ కమ్ ఓనర్ స్కీం కింద దాదాపు 60 స్వచ్ఛ ఆటోలు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కేటాయించిన డివిజన్లలో తిరుగుతున్నాయి. నగరపాలకసంస్థకు సొంతంగా ఉన్న 18 ఆటోలు చెత్తను సేకరిస్తున్నాయి. ఇందుకు నెలకు ప్రతి ఇంటి నుంచి రూ.50, వాణిజ్య వ్యర్థాలైతే రూ.100 నిర్ణీత రుసుం వసూలు చేస్తుంటారు. బల్దియా డబ్బులతో ఆటోలు సొంతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ను కొంతమంది నగరపాలకసంస్థ పారిశుధ్య విభాగం అధికారులు ఏళ్లుగా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గతంలో ఓనర్ కమ్ డ్రైవర్ స్కీంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తులు కొనుగోలు చేసిన ఆటోలకు ఈఎంఐలు నగరపాలకసంస్థ చెల్లించింది. ప్ర తీ ఇంటి నుంచి రూ.50 వసూలు చేయడం, వ్యర్థా ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయం కూడా స్వచ్ఛ ఆటో యజమానులకే చెందుతోంది. నగరపాలకసంస్థ డబ్బులతో సుమారు రూ.6 నుంచి రూ.7 లక్షల విలువైన ఆటోలు తమకు దక్కుతుండడంతో, ఈ స్కీంకు పెద్ద ఎత్తున పైరవీలు చోటుచేసుకొన్నాయి. భారీ మొత్తంలో ముడుపులు ఇచ్చిన వారినే అప్పట్లో ఈ స్కీంలో చేర్పించినట్లు సమాచారం. మళ్లీ అదే తంతు స్వచ్ఛతకు ఇస్తున్న అధిక ప్రాధాన్యం క్రమంలో నగరపాలకసంస్థ ఇటీవల మరో 10 స్వచ్ఛ ఆటోలు కొనుగోలు చేసింది. వీటిన పాత పద్ధతిలోనే అప్పగించాలంటూ అధికారులపై ఒత్తిళ్లు మొదలయ్యా యి. పాత ఆటోలను రూ.50 వేలు డిపాజిట్ తీసుకొని, డ్రైవర్ కమ్ ఓనర్ పద్ధతిన లీజుకు ఇచ్చేందు కు ఇటీవల అధికారులు నిర్ణయించారు. ఓనర్ కమ్ డ్రైవర్ పద్ధతే అయినా ఆటోలు నడుపుకుంటూ ఇంటింటి ఆదాయం, వ్యర్థాల విక్రయ ఆదాయం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆటోలు వద్దనుకొంటే, తిరిగి బల్దియాకు అప్పగిస్తే డిపాజిట్ రూ.50 వేలు వాపసు ఇస్తారు. మరమ్మతు ఏర్పడితే అవి మినహాయించుకుంటారు. కాగా.. కొత్త ఆటోల రాకతో, ‘బల్దియా సొమ్ముతో ఆటోలు సొంతం చేసుకొనే’ బ్యాచ్ మళ్లీ రంగంలోకి దిగింది. కొత్తగా కొనుగోలు చేసిన 10 ఆటోలను పాతపద్ధతిలో ఇవ్వాలంటూ రాజకీయ ఒత్తిళ్లు మొదలుపెట్టింది. ఏదేమైనా వివి ధ స్కీంల నెపంతో స్వచ్ఛ ఆటోల పేరిట బల్దియాలో ఏళ్లుగా సాగుతున్న స్వాహా పర్వంపై ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేపడితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.18 ఆటోల కలెక్షన్ ఎక్కడ?{OyðlÐ]lÆŠ‡ MýSÐŒl$ K¯]lÆŠ‡ ç³£ýlMýS… MìS…§ýl G…í³MýS ^ólíܯ]l {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢-ÌSMýS$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ çÜÓ^èle BsZ-Ë$ Mö¯]l$-VøË$ ^ólíÜ C_a…¨. C…§ýl$MýS$ yú¯ŒS-õ³-Ððl$…sŒæ MóSrWÈÌS-ÐéÈV> Æý‡*.40ÐólÌS ¯]l$…_ Æý‡*.70Ðól-Ë$ ^ðlÍÏõÜ¢, Mö™èl¢ BsZ¯]l$ Aç³µ-WÝë¢Æý‡$. ™èlÆý‡$-Ðé™èl BsZÌS ¯ðlÌS-ÐéÈ Ð鯇$$-§éÌS¯]l$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ ^ðlÍÏçÜ$¢…¨. {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢Ìôæ B BsZ §éÓÆ> ^ðl™èl¢¯]l$ õÜMýS-Ç…_ yîlBÆŠ‡-ïÜ òÜ…rÆŠæ, yýl…‹³ Ķæ*-ÆŠ‡zMýS$ ™èlÆý‡-ÍçÜ$¢…sêÆý‡$. {糆 C…sìæ ¯]l$…_ Ð]lçÜ*-Ë$ ^ólõÜ Æý‡*.50™ø ´ër$ ´÷yìl ^ðl™èl¢¯]l$ yîlBÆŠ‡-ïÜ òÜ…rÆŠ‡-ÌZ Ñ{MýS-Ƈ$$…^ól yýlº$¾-Ë$ çܧýlÆý‡$ {ò³•ÐólsŒæ Ð]lÅMýS$¢Ìôæ ¡çÜ$-MýS$…sêÆý‡$. ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦMýS$ ^ðl…¨¯]l Ý÷…™èl BsZÌS Ñ«§é¯]l… ÐólÆó‡-V> E…r$…¨. ºÍªÄ¶æ* BsZ-ÌSOò³ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ M> ÇÃోM Ñ«§ýl$-Ë$ °Æý‡Ó-Ç¢çÜ$¢…-sêÆý‡$. ºÍªÄ¶æ* Ý÷…™èl BsZ-Ë$ C…yýl$Ï, Ðé×ìæ-fÅ çÜÐ]l¬-§éĶæ*ÌS ¯]l$…_ Ð]lçÜ*-Ë$ ^ólíܯ]l ĶæÊfÆŠ‡ ^éÈjÌS¯]l$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦMýS$ fÐ]l$ ^ólĶæ*-ÍÞ E…r$…¨. JMøP BsZMýS$ MýS°çÙt…V> 500 C…yýl$Ï, §ýl$M>×êË$ MóSsê Æ‡$$-Ýë¢Æý‡$. A…sôæ ¯ðlÌSMýS$ Æý‡*.50, Æý‡*.100 ^ö糚 ¯]l JMøP BsZ §éÓÆ> MýS±çÜ… Æý‡*.25ÐólÌS ¯]l$…_ Æý‡*.30 ÐólË$ ĶæÊfÆŠ‡-^éÈjË$ Ð]lçÜ*-Ë$ ^ólçÜ$¢…sêÆý‡$. D ĶæÊfÆŠ‡ ^éÈjË$ ¯ólÆý‡$-V> ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…çܦ Qgê¯éMýS$ fÐ]l$ ^ólĶæ*-ÍÞ E…r$…¨. D Ý÷Ð]l¬Ã ç³MýSP-§éÇç³-sìæt-¯]lr$Ï BÆøç³-׿Ë$¯é²Æ‡$$. MìS…¨Ýë¦Æ‡$$ ¯]l$…_ ò³§ýlª A«¨M>Æý‡$ÌS Ð]lÆý‡MýS$ C…§ýl$-ÌZ ÐésêË$¯]l²r$Ï íœÆ>Å-§ýl$-Ë$¯é²Æ‡$$. Ý÷…™èl BsZ, Ý÷…™èl M>ÇÃMýS$-Ë$, yîlhÌŒæ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦ§ól.. CÌê JMøP BsZMýS$ ¯ðlÌSMýS$ çÜ$Ð]l*Æý‡$ Æý‡*.70 ÐólË$ Ððl_açÜ$¢…yýl-V>, ºÍªÄ¶æ*MýS$ Ð]lçÜ$¢¯]l² B§éĶæ$… Ð]l*{™èl… Ô¶æ*¯]lÅ…. ĶæÊfÆŠ‡ ^éÈjË$ ¯]lVýS-Æý‡-´ë-ÌS-MýS-çÜ…-çܦ-ÌZ fÐ]l$-M>° ÑçÙ-Ķæ$…Oò³ A«¨M>Æý‡$-Ë$ ò³§ýl-ÑÑ-ç³µyýl… Ìôæ§ýl$. -
నేడు ప్రజా ఆశీర్వాద సభ
జగిత్యాలటౌన్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మంత్రి హాజరుకానున్న ప్రజాఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. సభావేదికపై కేసీఆర్ సమక్షంలో మాజీమంత్రి జీవన్రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. కేసీఆర్ హాజరుకానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేశారు. మాజీమంత్రులు హరీశ్రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, సభ ఇన్చార్జి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, దావ వసంత తదితరులు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీవన్రెడ్డి ఫ్లెక్సీ చించివేత.. అనుచరుల నిరసన మరికొన్ని గంటల్లో సభ జరగనున్న నేపథ్యంలో కేసీఆర్, జీవన్రెడ్డి కలిసి ఉన్న ఫ్లెక్సీలో జీవన్రెడ్డి ఫొటోను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడం కలకలం రేపింది. సభ విజయవంతం కోసం జీవన్ అనుచరులు పాత బస్టాండ్ చౌరస్తాలో కేసీఆర్, జీవన్రెడ్డి ఉన్న ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం జీవన్రెడ్డి ఫొటోను మాత్రమే చించివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జీవన్రెడ్డి అనుచరులు, బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రజాఆశీర్వాద సభ కోసం పలుచోట్ల మినీస్టేడియం గోడలు కూల్చివేయడం చర్చనీయాంశమైంది. -
హిందూ ధర్మ రక్షణకు నడుం బిగిద్దాం
కరీంనగర్: హిందూ ధర్మ రక్షణకు ప్రతి హిందువు నడుం బిగించాలని శ్రీశ్రీశ్రీ ముక్తానంద స్వామీజీ పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్లోని బృందావన్గార్డెన్లో హిందూ సమ్మేళనం జరిగింది. స్వామీజీ మాట్లాడుతూ హిందుత్వం మానవాళిహితం కోరే ధర్మమని అన్నారు. మతం వేరు, ధర్మం వేరని పేర్కొన్నారు. కుటుంబం నుంచి పరివర్తనకు మహిళలు పాటుపడాలని కోరారు. హిందువులు కులాల వారీగా విభజించబడడం హేయమని, సమైక్యంగా కలిసి జీవించాలన్నారు. ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ విభాగ్ సంపర్క్ ప్రముఖ్ ఎన్నమనేని అశోక్రావు మాట్లాడుతూ దేశభక్తి సంస్థ ఆర్ఎస్ఎస్ అని, దేశభక్తులను తయారు చేయడమే ఉద్దేశమన్నారు. పాఠశాల విద్యార్థుల నాటికలు, సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. సమితి అధ్యక్ష, కార్యదర్శులు గూ డ అశోక్రెడ్డి, మేకల ఓంప్రకాశ్, డిప్యూటీ మేయర్ సునీల్రావు, కార్పొరేటర్లు నాంపల్లి రేణుక, సౌగాని కొమురయ్య, దక్షిణామూర్తి, నీలిమ, నాగరాజు, గజేందర్, రవీందర్, రాజిరెడ్డి, మల్లారెడ్డి, మామిడి రమేశ్ పాల్గొన్నారు. -
తూర్పున సీఎం.. పశ్చిమాన మాజీ సీఎం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి కేంద్రబిందువు. ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతీ చిన్న పరిణామం రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో ఈనెల 20న సోమవారం ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా పర్యటనలు కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశముంది. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తూర్పు ప్రాంతాల్లో పర్యటిస్తూ పాలన, ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలించనుండగా, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పశ్చిమ ప్రాంతమైన జగిత్యాలలో జరిగే పార్టీ బహిరంగసభలో రాజకీయంగా కీలకమైన సందేశం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ సమాంతర పర్యటనలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి.రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి...సీఎం, మాజీ సీఎం పర్యటనలు ఒకేరోజు ఉండడంతో ప్రజల దృష్టి పూర్తిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాపైనే ఉంది. ఇది రాజకీయంగా శక్తి ప్రదర్శనగా మారింది. ఒకవైపు అధికార పార్టీ తన పరిపాలనను సమర్థించుకుంటూ, గత ప్రభుత్వాన్ని విమర్శించేందుకు సిద్ధమవుతుండగా, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తన బలాన్ని చాటుకునేందుకు ప్రయత్నించే అవకాశముంది. ఇద్దరు నేతల పర్యటన భవిష్యత్ ఎన్నికలకు పునాదులు వేసుకునేందుకేనని స్పష్టమవుతోంది. జీవన్రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్లో చేరిక ఆ పార్టీకి మోరల్ బూస్ట్, కాంగ్రెస్కు పరీక్షగా మారనుంది. ఒక్కటవుతున్న ప్రత్యర్థులుతెలంగాణ మలి దశ ఉద్యమం కరీంనగర్ నుంచే ప్రారంభమైంది. కరీంనగర్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్.. తనపై రెండుసార్లు పోటీ చేసిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకోవడానికి ఈనెల 20న సోమవారం జగిత్యాలకు వస్తున్నారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న కేసీఆర్ ఈసారి తనదైన శైలిలో రాష్ట్రపరిస్థితులపై మాట్లాడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో జగిత్యాలలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత అయిన జీవన్రెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకునే ప్రయత్నం రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశముంది. కాంగ్రెస్లో నాలుగు దశాబ్దాల పాటు పనిచేసిన నాయకులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో పార్టీలో కొంత కలకలం రేపుతోంది. కేసీఆర్ జగిత్యాలలో చేసే ప్రసంగం, పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించే అవకాశముంది. ఆయన ప్రభుత్వం మీద చేసే విమర్శలు, కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తారని అంచనా.ఆసక్తికరంగా సీఎం పర్యటనఉమ్మడి జిల్లా పరిధిలోని మంథని నియోజకవర్గంలో ఉన్న మేడిగడ్డ బారేజ్ అంశం ఇప్పుడు కేవలం ఇంజినీరింగ్ సమస్య కాదు.. రాజకీయ ఆయుధంగా మారింది. మేడిగడ్డ బారేజ్ కుంగిన ఘటనను పరిశీలించడానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పించనున్నారు. మేడిగడ్డ బారేజ్, కాలేశ్వరం ప్రాజెక్టులో కీలక భాగం కావడం 2023 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా అది కుంగిన విషయం బయటకు రావడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని కాంగ్రెస్ ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. కాటారం సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం కీలకంగా మారనుంది. ఆయన బీఆర్ఎస్పై మాటల దాడి చేయడం, అవినీతి ఆరోపణలను పునరుద్ఘాటించడం, అభివృద్ధి వాగ్దానాలను ముందుకు తెచ్చే అవకాశముంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రజల ముందు తీసుకెళ్లి, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేస్తోంది. -
మహిళా లోకానికి ఏప్రిల్ 17 బ్లాక్ డే
కరీంనగర్: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యవహరించిన తీరును నిరసిస్తూ కరీంనగర్ బీజేపీ శ్రేణులు నగరంలోని తెలంగాణ చౌక్లో నిరసన చేపట్టారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ సునీల్ కుమార్ పార్లమెంటులో కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా బిల్లును వ్యతిరేకించిన విధానంపై మండిపడ్డారు. మహిళా లోకానికి, దేశానికి ఏప్రిల్ 17 బ్లాక్ డేగా అభివర్ణించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పిస్తామంటే హర్షించాల్సిన ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేసి బిల్లును అడ్డుకొని వీగిపోయేలా చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయని మండిపడ్డారు. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని, మహిళలకు ఆ పార్టీలు సమాధానం చెప్పాలన్నారు. -
రాజన్న సన్నిధిలో శంకరజయంతి
వేములవాడ: రాజన్న సన్నిధిలో శనివారం శంకర జయంతి కార్యక్రమాలను ప్రారంభించారు. వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి పంచమి వరకు ఐదు రోజులపాటు స్వామి వారి సన్నిధిలో ఏకాంతంగా కొనసాగనున్నాయని అర్చకులు తెలిపారు. అనంతరం మూలమూర్తులైన లక్ష్మీగణపతి, స్వామివారికి అధర్వశీర్ష పఠనంతో అభిషేకాలు చేశారు. సాయంకాలం శంకర విజయంపై ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. భీమన్న సేవలో సినీ హీరోయిన్ భీమేశ్వరస్వామిని సినీ హీరోయిన్ అనన్య నాగళ్ల దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. డీఈవో భాస్కరశర్మ లడ్డూ ప్రసాదం అందజేశారు. ‘లీసా’ సినిమా షూటింగ్ను కరీంనగర్లో పూర్తి చేసుకున్న సందర్భంగా, చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. డీపీవో సతీష్రెడ్డి, వీడియో గ్రాఫర్, డైరెక్టర్ జోహార్, ప్రొడ్యూసర్ చందు, బీరప్పనేని శివ పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన అన్నపూర్ణమ్మ (106) శనివారం అనారోగ్యంతో మృతిచెందింది. అన్నపూర్ణమ్మకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. కొన్నాళ్లు మునిమనుమల ఆనందంగా గడిపారు. చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్..గోదావరిఖని(రామగుండం): ట్రాక్టర్ ప్రమాదంలో డ్రైవర్ కవ్వంపల్లి సత్తయ్య(46) తీవ్రగాయాల పాలై చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈనెల 13న జీఎం కాలనీ సమీపంలో సత్తయ్య ట్రాక్టర్ నిలిపి మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కదిలి అతడి తొడపై నుంచి టైరు వెళ్లింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన సత్తయ్యను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి కరీంనగర్, అక్కడి నుంచి హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ట్రక్ ఢీకొని ప్రైవేట్ టీచర్.. గోదావరిఖని(రామగుండం): గోదావరిఖనిలోని ఇందిరానగర్ మహాలక్ష్మి ఫంక్షన్హాల్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మేరుగు వెన్నెల(26) మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ప్రైవేట్ టీచర్గా పనిచేస్తున్న వెన్నెల తాను ఉంటున్న ఎన్టీఆర్నగర్ నుంచి స్కూటీపై ఆర్ఎఫ్సీఎల్లోని ప్రైవేట్స్కూల్కు బయలుదేరింది. మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ మూలమలుపు వద్ద వెనక నుంచి ట్రక్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టింది. ఈప్రమాదంలో వెన్నెలకు తీవ్రగాయాలయ్యాయి. తలకు హెల్మెట్ ఉన్నా అది పగిలి చెవులు, ముక్కులో నుంచి రక్తం కారింది. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకగా చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందింది. మృతురాలి భర్త సింగరేణి ఉద్యోగం చేస్తుండగా, మూడేళ్ల కుమారుడున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. -
కాలేయం.. కాపాడుకుందాం
కరీంనగర్: కాలేయం (లివర్).. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఆహారం జీర్ణమై చివరికి పిండి పదార్థాలుగా, కొవ్వు ఆమ్లాలుగా, ప్రోటీన్లుగా మారి రక్తంలో కలవాలంటే ఇది సక్రమంగా పని చేయాలి. అయితే మారిన ఆహారపు అలవాట్లు, జీవనశైలి వల్ల లివర్ అనారోగ్యానికి గురవుతోంది. హెపటైటిస్ బీ, సీ వైరస్ల వల్ల కూడా పాడవుతోంది. సిర్రోసిస్ ఆఫ్ లివర్గా మారితే రూ.20 లక్షలకు పైగా ఖర్చు చేసి కాలేయ మార్పిడి ఆపరేషన్లు చేయించుకోవాలి. దానం చేసేవారు కూడా అందుబాటులో ఉండాలి లేదా బ్రెయిన్డెడ్ అయి అవయవదానం చేసేవారు ఉండాలి. లేకుంటే ప్రాణాలు పోతాయి. ఈ పరిస్థితిని గుర్తించి ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఏప్రిల్ 19న కాలేయ దినోత్సవంగా ప్రకటించింది. కాలేయం శరీరంలో మెదడు తర్వాత అతి ప్రధానమైన అవయవం. రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో సాయపడటం, విటమిన్ డీని శరీరానికి అందేలా చూడటం, చక్కెర స్థాయిని సమతుల్యం చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, ఖనిజ లవణాలు, విటమిన్లను నిల్వ చేయడం లాంటి పనులు చేస్తోంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం కొనసాగితే హెపటైటీస్, సిర్రోసిస్, కామెర్లు, కేన్సర్ లాంటి తీవ్రమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల లివర్ను మంచి ఆహారపు అలవాట్లతో కాపాడుకోవాలి. ఆల్కహాల్తో పాటు కల్తీ ఆహారం డేంజర్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్న వారికే లివర్ సమస్యలు వస్తుంటాయని ప్రజల్లో బలంగా నాటుకు పోయింది. ఆల్కహాల్లో 50 శాతం లివర్ సమస్యలు వస్తే కల్తీ ఆహారంతో మరో 50 శాతం సమస్యలు వస్తుంటాయి. ఆల్కహాల్ అలవాటు లేని వారు కూడా లివర్ సమస్యలతో బాధపడుతున్నారు. వీరంతా జంకుఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, రోడ్సైడ్ ఫుడ్ ముఖ్యంగా పానీపూరీ లాంటివి తినడం చాలా డేంజర్. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పులు, పాలు తీసుకుంటే మంచిది. మితంగా భుజించాలి. లివర్ సమస్యలకు ఊబకాయం కూడా ఒక కారణం. ఒబేసిటీ ఉన్న వారికి ప్యాటీ లివర్ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. షుగర్, బీపీ ఉన్నవారు అప్పుడప్పుడూ లివర్ పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహాలు పాటించాలి. ఊబకాయం, ఆహార అలవాట్లు, జీవనశైలితో ముప్పు ఉమ్మడి జిల్లాలో 3.5 లక్షల మందికి ఏదో ఒక రకమైన సమస్య హెపటైటిస్ బీ, సీ వైరస్లతో మరింత డ్యామేజీ నేడు వరల్డ్ లివర్ డే ఉమ్మడి జిల్లాలో సుమారు 36 లక్షల జనాభా ఉండగా అందులో వివిధ రకాల కాలేయ సమస్యలతో బాధపడేవారు దాదాపు 3.5 లక్షల మంది ఉన్నట్లు అంచనా. అతిగా తినడం, శారీరక శ్రమ లేకపోవడం, కుర్చీలకు పరిమితమై పనులు చేస్తున్న వారికి ఊబకాయం వస్తోంది. ఇలా ఉన్న వారిలో ప్యాటీ లివర్ సమస్యలున్నాయి. ఇది ఉన్నట్టు చాలా మందికి తెలియదు. తక్కువ మందిలో జన్యుపరమైన అంశాలు కూడా ప్యాటీ లివర్కు కారణమవుతున్నాయి. స్కానింగ్ చేయించుకుంటేనే సమస్య తెలుస్తుంది. -
అవసరాలు గుర్తించి పనులు చేశాం
సాయుధులుగా పల్లెల్లో తిరుగుతున్న క్రమంలో ప్రజలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలను, వారి అవసరాలను గుర్తించి పనులు చేయించాం. అప్పట్లో ఉండే ప్రజాప్రతినిధుల ద్వారా కొన్ని పనులు, మరికొన్నింటిని నేరుగా పార్టీ రంగంలోకి దిగి ప్రజల భాగస్వామ్యంతో చేశాం. అనేక బోర్లు వేయించాం. బస్షెల్టర్లు కట్టించాం. పార్టీకి పట్టున్న గ్రామాల్లో ప్రజాసమస్యలను అనేకం తీర్చాం. – ఎడ్ల లక్ష్మీరాజం అలియాస్ సాగర్, జనశక్తి జిల్లా మాజీ కార్యదర్శి కట్టలింగంపేటలో స్థలం కొనుగోలు చేసి బస్షెల్టర్ కట్టాం. ఇంటికి రూ.600 చొప్పున జమచేసుకున్నాం. అప్పట్లో కొన్ని డబ్బులు అన్నలు ఇచ్చారు. ఆ తరువాత మళ్లీ డబ్బులు తీసుకున్నారు. ప్రజల భాగస్వామ్యంతో అన్నల ప్రోద్బలంతో పనులు చేశాం. ఇప్పటిలాగా లేదు.. అప్పట్లో రాత్రి 6 గంటలు అయిందటే తలుపులు మూసుకుని పడుకునేవాళ్లం. భయం భయంగా ఉండేది. – గండ్ర లక్ష్మణ్రావు, మాజీ సర్పంచ్, కట్టలింగంపేట అప్పట్లో నక్సలైట్లు ఏది చెబితే అది జరిగేది. ప్రజలకు ఇది కావాలంటే.. గ్రామస్తుల భాగస్వామ్యంతో చేసేవారు. అప్ప ట్లో ప్రైవేటు బస్సులను కొని చ్చారు. బస్షెల్టర్ నిర్మించా రు. ప్రైవేటుగా టీచర్లను నియమించి వాళ్లకు జీతాలు ఇచ్చాం. రోడ్డు వేయించుకున్నాం. మా ఊరిలో అన్నల ఆధ్వర్యంలో అనేక పనులు జరిగాయి. ఇప్పుడు అదంతా గతించిన చరిత్ర. నేటితరం యువకులకు ఆ నాటి సంగతులు తెలియవు. – లింగంపల్లి రాజం, సనుగుల రంగంపేట మార్గండి(జంపన్న) చెరువు నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యాను. అప్పట్లో ఊరంతా చెరువు పనులు చేయాలని నిర్ణయించడంతో పనులు జరిగాయి. అనేక గ్రామాల్లో అప్పట్లో ఏదో ఒక్క పని నక్సలైట్ల ప్రోద్బలంతో జరిగేవి. పోలీసులతోనూ ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇప్పుడు పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. అప్పటి సంగతులు ఇప్పటి తరానికి ఏమి తెలియవు. – సుతారి మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్, రంగంపేట -
కో ఆప్షన్పై కోర్టుకు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ ఎన్నికల్లో పోటీకి తమకూ అవకాశం ఇవ్వాలంటూ మాజీ ఎంపీటీసీ దాది సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలకు సంబంధించిన సర్క్యులర్లో మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లకు మాత్రమే అవకాశం ఉండగా, మాజీ ఎంపీటీసీలకు అవకాశం ఇవ్వలేదు. నగరపాలకసంస్థ పరిధిలోని మాజీ వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్లకు పోటీచేసేందుకు అవకాశం కల్పించినప్పుడు, అదే గ్రామాల నుంచి ప్రజలతో ఎన్నికకాబడిన తమకు ఎందుకు అవకాశం ఇవ్వరంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారంతో దరఖాస్తుల స్క్రూటీ ముగియనుండగా, అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. హైకోర్టులో పిటిషన్ నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్ పదవులకు నోటిఫికేషన్ వెలువడడం, ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం తెలిసిందే. ఐదు స్థానాలకు గాను రెండు మైనార్టీలకు, మూడు జనరల్ కేటగిరీకి కేటాయించారు. మూడు జనరల్లో ఒకటి మహిళకు రిజర్వ్ చేశారు. జనరల్ కోటాలోని మూడు స్థానాలకు మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నగరపాలకసంస్థ పరిధిలోని (విలీన గ్రామపంచాయతీలు) మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు, రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు అర్హులు. మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులకు అవకాశం ఇచ్చినప్పుడు, అవే గ్రామాల నుంచి తాము ప్రజలతో ఎన్నుకోబడిన మాజీ ప్రజాప్రతినిధులమని తమకు పోటీకి అవకాశం ఇవ్వాలని బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ దాది సుధాకర్ హైకోర్టులో పిటిషన్ (డబ్లూపీ.1166/2026) దాఖలు చేశారు. తాము ఇప్పటికే దరఖాస్తులు దాఖలు చేశామని, తమను పోటీకి అర్హులుగా ప్రకటించాలని కోరారు. నిర్ణయంపై ఉత్కంఠ కో ఆప్షన్ పదవులకు ప్రస్తుతం నగరపాలకసంస్థలో ఉన్న, గతంలో గ్రామపంచాయతీలైన బొమ్మకల్, చింతకుంట, పద్మనగర్లకు చెందిన మాజీ ఎంపీటీసీలు ముగ్గురు దరఖాస్తు చేసుకొన్నారు. ఐదు స్థానాలకు మొత్తం 46 దరఖాస్తులు రాగా, ఆదివారంతో పరిశీలన ముగియనుంది. దరఖాస్తులు ఆమోదం పొందాయా, తిరస్కరించారా అనేది అధికారులు ఎప్పుడు వెల్లడిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముందుగా చెప్పాలని ఏమీ లేదని, ఓటింగ్ సమయంలోనే తిరస్కరణకు గురైన దరఖాస్తుల వివరాలు చెబుతామంటుండడం సమస్యను జఠిలం చేస్తోంది. క్లారిటీ తీసుకుంటాం కో ఆప్షన్ ఎన్నికలు సాధారణ ఎన్నికల తరహాలో ఉండవు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ముందుగా తిరస్కరించిన దరఖాస్తుల వివరాలు చెప్పాలని ఎక్కడా లేదు. ఆమోదం పొందిన దరఖాస్తుల వివరాలను ఓటింగ్ సమయంలో కౌన్సిల్ ఎదుట ఉంచుతాం. మాజీ ఎంపీటీసీ ఒకరు కోర్టుకు వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. కో ఆప్షన్ ఎన్నికలకు సంబంధించి జారీ చేసిన సర్క్యులర్లోనే ఎంపీటీసీలకు అవకాశం లేదు. అయినప్పటికీ ముందుగా వివరాలు వెల్లడించాలా లేదా అనే అంశంపై క్లారిటీ తీసుకుంటాం. – ప్రఫుల్దేశాయ్, కమిషనర్, నగరపాలకసంస్థ -
జనగణన పకడ్బందీగా చేపట్టాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో జనగణన ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పట్టణప్రణాళిక అధికారులు, జనగణన శిక్షకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో త్వరలో చేపట్టబోయే జనగణనను ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 666 హౌస్ లిస్ట్ బ్లాక్ల ప్రకారం గుర్తించిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు మూడు విడుతలుగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ట్రైనర్లకు సూచించారు. గుర్తించిన 855 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు బ్యాచ్లవారీగా శిక్షణ ఇవ్వాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీలు వేణు, శ్రీధర్, ఎంహెచ్వో సుమన్, జనగణన ట్రైనర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాల తనిఖీ కరీంనగర్ సిటీ: డిగ్రీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఫలితాలు సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని శాతవాహన వీసీ ఉమేశ్ కుమార్ తెలిపారు. వర్సిటీ పరిధిలోని పలు కళాశాలల్లో జరుగుతున్న రెండో సెమిస్టర్ పరీక్ష కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద, అపూర్వ మహిళా డిగ్రీ కళాశాలను పరీక్షల నియంత్రణాధికారి డి.సురేశ్ కుమార్తో కలిసి సందర్శించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ పరీక్షల్లో 12,083 మంది విద్యార్థులకు గాను 534మంది గైర్హాజరయ్యారని తెలిపారు. దరఖాస్తులు ఆహ్వానం కరీంనగర్ టౌన్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణ సంస్థలో మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు తల్లిదండులను కోల్పోయిన, అక్రమ రవాణాకు గురైన, దివ్యాంగ బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఎం.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి కోర్సులో 60సీట్లకు మొత్తం 360 సీట్లలో 70శాతం కేటాయించబడతాయన్నారు. పాలిటెక్నిక్ అర్హత ప్రవేశ పరీక్ష రాయకున్నా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, దివ్యాంగులకు 3శాతం సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎంపికై న బాలికలకు ఉచిత విద్య, వసతి కల్పించడం జరుగుతుందని, కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలోని 2వ అంతస్తులోగల బాల రక్ష భవన్లో లభించే దరఖాస్తుఫారానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి మే 23, 2026 లోగా సమర్పించాలని, వివరాలకు 94908 81098 నంబరును సంప్రదించాలని సూచించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ సబ్స్టేషన్ నిర్వహణతో పాటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 33/11 కె.వీ.శాతవాహన విశ్వవిద్యాలయ సబ్స్టేషన్ పరిధిలోని చింతకుంట, కమాన్పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్ కాలనీ ఫీడర్ పరిధిలోని సీతారాంపూర్, సూర్యనగర్, బాలాజీనగర్, సాయిబాలాజీనగర్, ఆర్టీసీ కాలనీ, జగిత్యాల రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. సభ విజయవంతం చేయాలి కరీంనగర్ కార్పొరేషన్: కాటారంలో ఈనెల 20న జరుగనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగసభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు ఒక ప్రకటనలో కోరారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో సభకు తరలిరావాలని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన ఎస్యూ వీసీ ఉమేశ్కుమార్ -
సమతుల ఆహారం తీసుకోవాలి
ఆహారం ద్వారానే ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ప్రాసెస్డ్, నిల్వ ఉంచే ఆహారం, బేకరీ ఫుడ్స్ మానాలి. చిన్నపిల్లలకు మంచి ఆహారంపై అవగాహన కల్పించాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచించిన ప్రకారం సమతుల ఆహారం తీసుకుంటే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. హెపటైటిస్–సీ కి ఇప్పుడు వైద్యం ఉంది. చికిత్స పొందినవారందరూ కోలుకుంటారు. హెపటైటిస్–బీ కి పూర్తి చికిత్స లేకున్నా నియంత్రణకు నాలుగేళ్లు మందులు వాడాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. – డాక్టర్ దిలీప్రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో -
పిచ్చికుక్కల దాడిలో ముగ్గురికి గాయాలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అందుగులపల్లిలో శనివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల వయస్సు గల తోడెంగుల నిహాన్స్తో పాటు కొయ్యడ ఓదెలు, నారాయణపై దాడి చేసి గాయపర్చాయి. గాయపడిన వారిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో పిచ్చికుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ అంజయ్య, ఉపసర్పంచ్ తలారి స్వప్న తెలిపారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం కోనరావుపేటలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన కొడిదల లాస్య మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి తల్లిగారింటికి వెళ్లింది. శనివారం వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించింది. విషయాన్ని సర్పంచ్ గంగారెడ్డి, ఉపసర్పంచ్ పరందాములు దృష్టికి తీసుకెళ్లగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో దేవుడా.. అన్యాయం చేశావయ్యా
● రోడ్డు ప్రమాదంలో అర్చకుడు మృతి ● నిత్య పూజలు చేసి వస్తుండగా ఘటన ● గుండెలవిసేలా రోదించిన కుటుంబసభ్యులు జ్యోతినగర్(రామగుండం): ‘అయ్యో.. భగవంతుడా నిత్య పూజలు చేశాము కదయ్యా.. నువ్వు మాకు ఇలా చేశావు దేవుడా..నీకు ఏమి అపకారం చేశామయ్యా.. మాపై కనికరం లేకుండా చేశావు తండ్రి’ అంటూ దేవునిపల్లి ఆలయ అర్చకుడి కుటుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్, కటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గోదావరిఖని గౌతమినగర్లో నివసిస్తున్న తిరునహరి సంతోష్కుమార్(43) పెద్దపల్లి మండలం అందుగులపల్లె సమీపంలోని దేవునిపల్లి నరసింహస్వామి ఆలయంలో పూజారి. శనివారం దేవునికి పూజలు చేసి ద్విచక్రవాహనంపై గోదావరిఖని వస్తుండగా ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు లేబర్ గేట్ రాజీవ్ రహదారిపై బూడిద ట్యాంకర్ ఢీకొంది. 30 మీటర్లు అతడిని ట్యాంకర్ వెనక టైరు ఈడ్చుకెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమైంది. పోలీసుల విచారణ.. ఎన్టీపీసీ ఎస్సై తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకుని టిప్పర్ టైరుకింద నలిగిపోయిన సంతోష్కుమార్ మృతదేహాన్ని స్థానిక మెకానిక్లు షారూక్, అస్లాం, పాషా సహకారంతో బయటకు తీశారు. మృతుడి బావ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్ల డించారు. ఘటన స్థలాన్ని రామగుండం సీఐ ప్రవీణ్కుమార్ సందర్శించారు. కాగా, ఎన్టీపీసీ ప్రాజెక్టు లేబర్ గేట్ వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రమాదం జరిగి సంతోష్కుమార్ మృతి చెందాడని కాంట్రాక్టు కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ ఆరోపించారు. గతంలో చాలా ప్రమాదాలు జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది నియమించాలని కోరారు. -
గోదాం అధికారా.. మజాకా
కరీంనగర్ అర్బన్: అసలే ఎండాకాలం.. ఆపై 42 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉదయం 9దాటిందంటే బయట అడుగుపెట్టలేని పరిస్థితి. అత్యవసర పరిస్థితని బయటకెళితే తడారే గొంతు. ఈ నేపథ్యంలో రేషన్ పంపిణీలో డీలర్ల పాట్లు వర్ణనాతీతం. ఉష్ణోగ్రతల క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఎంఎల్ఎస్ పాయింట్ అధికారి నిర్వాకంతో డీలర్ల పడిగాపులు.. ముంచుకొస్తున్న గడువుతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. నిప్పుల కొలిమిలో రేషన్ దుకాణానికి కార్డుదారులు ఆశగా రావడం, బియ్యం లేవని డీలర్ చెప్పే సమాధానంతో నిరాశగా వెనుదిరగడం తంతుగా మారింది. కేవలం ప్రణాళిక లేమి.. ఒంటెద్దు పోకడే ఇందుకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదాం అధికారి తీరును నిరసిస్తూ శనివారం గోదాం వద్ద డీలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికీ 60శాతమే రవాణా కరీంనగర్ ఎంఎల్ఎస్ పాయింట్ కింద 218 రేషన్ దుకాణాలున్నాయి. దుకాణం సంఖ్య, కేటాయించే రేషన్ బియ్యం క్రమంలో ముందస్తు ప్రణాళిక అత్యవసరం. కరీంనగర్ అర్బన్తో పాటు కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, తిమ్మాపూర్, గన్నేరువరం, మానకొండూరు మండలాల్లోని రేషన్ దుకాణాలకు ఇక్కడి నుంచే రవాణా చేయాల్సి ఉంటుంది. ఒక్కో దుకాణానికి గరిష్టంగా 400 క్వింటాళ్ల వరకు బియ్యం రవాణా చేయాల్సి ఉంటుంది. నేటికి 60శాతం మాత్రమే మూవ్మెంట్ పూర్తవగా కొన్ని దుకాణాల్లో 50శాతం కూడా మూవ్మెంట్ కాలేదని తెలుస్తోంది. మరో 11రోజులే గడువు ఒక్కో కార్డుదారుకు రేషన్ పంపిణీ చేయాలంటే మూడు సార్లు వేలిముద్ర తీసుకుంటుండగా సదరు ప్రక్రియకు 20– 25నిమిషాలు పడుతోంది. ఒక్కో రోజుకు 20మందికి మించి పంపిణీ చేసే పరిస్థితి లేదని డీలర్లు వాపోతున్నారు. 3నెలల బియ్యం కావడంతో ఈ నెలాఖరు వరకు పంపిణీకి గడువిచ్చినప్పటికీ మూవ్మెంట్ పరిస్థితిని పరిశీలిస్తే సదరు గడువు సరిపోదని స్పష్టమవుతోంది. గోదాం అధికారి తెలిసినవారికే బియ్యం సరఫరా చేస్తుండగా, ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ డీలర్ల సంఘం రూట్ ప్రోగ్రాం ఇచ్చినా సదరు ప్లాన్ను అమలు చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. సొంత ఎజెండాతో మూవ్మెంట్ చేస్తుండగా సమస్య మరింత జటిలమవుతోంది. దుకాణంలో బియ్యం పంపిణీ చేయాల్సిన రేషన్ డీలర్లు నిత్యం గోదాం చుట్టూ తిరగడం ఆందోళనకర పరిణామం.ఓ పద్ధతి లేదు.. ప్రణాళిక లేదు గోదాం అధికారి నియంతృత్వ విధానం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది. మండుతున్న ఎండలో ప్రాణాలకు తెగించి బియ్యం పంపిణీ చేస్తుంటే యుద్ధప్రతిపాదికన బియ్యం రవాణా చేయాల్సి ఉండగా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అందరం పనిచేసేది కార్డుదారుల కోసమే కదా.. ఇదేం పద్ధతి. – రొడ్డ శ్రీనివాస్, రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
మనస్తాపంతో టవరెక్కిన ఎకై ్సజ్ కానిస్టేబుల్
రామగుండం: రామగుండం నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ నయీం ధర్మపురిలో ఎకై ్సజ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలతో శనివారం మనస్తాపం చెంది బీ–కాలనీలోని బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై సంధ్యారాణి ప్రత్యేక చొరవతో బాధితుడితో మాట్లాడి రెండు గంటల తర్వాత కిందకు దింపారు. బాధితుడి కథనం మేరకు.. అబ్దుల్ నయీం 2020లో ఓ యువతిని మతాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కూతురు సంతానం. గతేడాది డిసెంబర్లో కుటుంబసభ్యుల ప్రమేయంతో కేసు నమోదు కావడంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తర్వాత అత్తాగారి కుటుంబంతో వివాదాలు తలెత్తాయి. ఈనేపథ్యంలో భార్యాభర్తల వివాదంలో ఓ వ్యక్తి జోక్యం చేసుకొని ఆర్థికంగా సర్దుబాటు చేస్తూ తన భార్యకు దగ్గరయ్యాడని అబ్దుల్ నయీం ఆరోపించాడు. ఈక్రమంలో కూతురు సంరక్షణపై భార్యాభర్తల మధ్య వివాదం నెలకొంది. కూతురును తల్లికి అప్పగించాలని ఓ వైపు పోలీసులు ఒత్తిడి చేయడం, మరో వైపు భార్యతో తనకు ప్రాణపాయం ఉందంటూ బాధితుడు వాయిస్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రోదించాడు. ఈ విషయమై రామగుండం సీఐని వివరణ కోరగా ఆదివారం ఇరువర్గాలతో చర్చించి బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు. -
‘అన్నల’ ఆనవాళ్లు !
● మూడు దశాబ్దాల కిందటే పనులు ● ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి బాటలు ● మౌలిక వసతులకు నక్సలైట్ల శ్రీకారం ● రాజన్నసిరిసిల్ల జిల్లాలో వినూత్న పనులు ● సనుగులలో ఎన్నెన్నో పనులు చందుర్తి మండలం సనుగులలో జనశక్తి నక్సలైట్ల ప్రోద్బలంతో గ్రామాభివృద్ధి కమిటీ(వీడీసీ) అనేక పనులకు శ్రీకారం చుట్టారు. కూడలిలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఏర్పాటు చేసి, బస్షెల్టర్ను నిర్మించారు. పాఠశాలను అప్గ్రేడ్ చేసుకోవడంలో, ప్రైవేటుగా టీచర్లను నియమించి జీతాలు ఇవ్వడం, ఏకంగా రెండు ప్రైవేటు బస్సు సర్వీసులను కొనుగోలు చేసి ఊరి ప్రజలకు ప్రయాణ వసతిని కల్పించారు. ఆ బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మళ్లీ గ్రామాభివృద్ధికి వినియోగించారు. రోడ్డు వేయాలన్నా.. శ్రమదానంతో గ్రామస్తులను ముందుకు కదిలించారు. సనుగుల శివారులోని ఎర్రచెరువు పటేల్ చెరువు ఆధునీకరణ పనులను వీడీసీ ఆధ్వర్యంలో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి విద్యాసాగర్రావు నిధులతో నక్సలైట్లు పనులు చేయించారు. ● అనేక గ్రామాల్లో బస్షెల్టర్లు, విగ్రహాలు, చేతిబోర్లు సీపీఐ(ఎంఎల్) జనశక్తి నక్సలైట్ల ప్రాబల్యమున్న జిల్లాలోని కోనరావుపేట, చందుర్తి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులను నక్సలైట్ల ఆధ్వర్యంలో చేపట్టారు. చందుర్తి మండలం లింగంపేట, కట్టలింగంపేట, రామారావుపల్లెల్లో బస్షెల్టర్ల నిర్మాణం, కోనరావుపేట మండలం బావుసాయిపేట, మల్కపేట, శివంగాళపల్లె వంటి గ్రామాల్లో అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఏర్పాటు చేశారు. అనేక అటవీ గ్రామాల్లో దాహార్తి తీర్చేందుకు బోర్లు వేయించి, మోటార్లు అమర్చారు. పలు పల్లెలకు రోడ్లు వేయించారు. 1990 నుంచి 2005 వరకు ప్రజల భాగస్వామ్యంలో అభివృద్ధి పనులకు బాటలు వేశారు. ● బహిరంగ రహస్యం.. తెరవెనుక ‘అన్నలు’ గతంలో కోనరావుపేట మండలం బావుసాయిపేట హైస్కూల్కు స్థలం లేదు. దీంతో ఊరికి చెందిన భూయజమాని తన భూమిని అమ్ముకునేందుకు సిద్ధపడగా.. స్కూల్కు మూడెకరాలు ఉచితంగా అప్పగించి మిగతా భూమిని అమ్ముకోవాలని నక్సలైట్లు సూచించారు. దీంతో సదరు భూమి యజమాని మూడెకరాలను స్కూల్కు విరాళంగా అందించారు. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.కోటిపైగా ఉంటుంది. బావుసాయిపేటలో హైస్కూల్ ఏర్పాటుతోపాటు తెలంగాణ క్రీడాప్రాంగణం ఏర్పాటైంది. అంతకుముందు బస్టాండు విస్తరణలోనూ నక్సలైట్లు కీలకపాత్రను పోషించారు. ఇలా అంతా బహిరంగ రహస్యంగా తెరవెనుక శ్రీఅన్నలుశ్రీ ఉండి అనేక పనులు చేయించారు. కోనరావుపేట మండలం మరిమడ్లలో ప్రభుత్వం సేకరించిన రూ.60 లక్షల విలువైన తునికాకును రహస్యంగా నక్సలైట్లు అమ్మేసి ఆ డబ్బును గ్రామాల అభివృద్ధికి వినియోగించారు. ● చెరువుల నిర్మాణం జిల్లాలో చిన్న చిన్న పనులే కాదు.. ఏకంగా గండిపడిన చెరువులను పునర్ నిర్మాణంలో నక్సలైట్ల పాత్ర మరువలేనిది. వీర్నపల్లి మండలంలోని రంగంపేట మార్గండి(జంపన్న) చెరువును జనశక్తి నక్సలైట్లు ప్రజల సహకారంతో నిర్మించారు. యంత్రాలను నక్సలైట్లు సమకూర్చగా.. ప్రజలను స్వచ్ఛందంగా కులాల వారీగా చెరువుకు శ్రమదానం చేశారు. కోనరావుపేట మండలం వట్టిమల్ల నారాయణచెరువు గండి కూడా నక్సలైట్ల ఆధ్వర్యంలో పూడ్చారు. వీర్నపల్లి మండలం మద్దిమల్ల చెరువును సైతం నక్సలైట్ల పర్యవేక్షణలో పూర్తి చేశారు. ఇలా జిల్లాలో సాగు, తాగునీరు, రోడ్డు, మౌలిక వసతుల కల్పనలో సాయుధ నక్సలైట్లు భాగస్వాములు కావడం విశేషం. సిరిసిల్ల: రాష్ట్రంలో నక్సలిజం అంతమైందని, సాయుధ పోరాటం ఆగిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు పెద్దలు ఇటీవల ప్రకటించారు. సాయుధ నక్సలైట్ల సామూహిక లొంగుబాటు నేపథ్యంలో రాష్ట్రంలో నక్సలైట్ల కదలికలు సద్దుమణిగాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో మూడు దశాబ్దాల కిందట నక్సలైట్లు ప్రజల భాగస్వామ్యంతో అనేక అభివృద్ధి పనులు చేయించారు. నక్సలైట్లు అంటే.. బస్సులను కాల్చివేస్తారు. టెలిఫోన్ ఎక్స్ఛేంజీలను పేల్చివేస్తారు.. ఇన్ఫార్మర్లు అంటూ.. హత్యలు చేస్తారు.. ప్రభుత్వంపై నిరసన పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారు.. అని తరచూ వింటుంటాం. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. శ్రీఅన్నలుశ్రీ కూడా అభివృద్ధికి బాటలు వేస్తారని రాజన్నసిరిసిల్ల జిల్లాలో నిరూపించారు. మూడు దశాబ్దాల క్రితం నక్సలైట్ల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి పనుల జాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. -
పాఠశాల గదులకు తాళం వేసిన మాజీ సర్పంచ్ అరెస్టు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ పాఠశాల గదులను మూడేళ్ల క్రితం నిర్మించగా బిల్లులు ప్రభుత్వం చెల్లించడం లేదని గదులకు గురువారం తాళాలు వేయగా పోలీసులు పగులగొట్టారు. మళ్లీ రెండో రోజు శుక్రవారం సైతం తాళాలు వేయడంతో పోలీసులు చేరుకొని వల్లంపట్ల మాజీ సర్పంచ్ దంపతులను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3 తరగతి గదులను, హైస్కూల్లో డైనింగ్హాల్ను మూడేళ్ల క్రితం మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ నిర్మించారు. వీటికి బిల్లులు రూ.20లక్షల వరకు పెండింగ్ ఉన్నాయి. దీంతో మాజీ సర్పంచ్ గురువారం పాఠశాల గదులకు తాళాలు వేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. పాఠశాల హెచ్ఎం గురువారం ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం మాజీ సర్పంచ్ మళ్లీ పాఠశాల గదులకు తాళాలు వేసి బైటాయించగా ఇల్లంతకుంట ఎస్సై అశోక్ సిబ్బందితో వచ్చారు. మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ–వెంకట నరసింహారెడ్డిలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టు చేసిన మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ దంపతులను నోటీసులు అందజేసి సాయంత్రం విడుదల చేశారు. -
మిల్లర్ల కొత్త దందా
కరీంనగర్ అర్బన్: అక్రమ ఆదాయానికి రుచిమరిగిన మిల్లర్లకు పలువురు అధికారులు తోడవడంతో రేషన్ దందా భారీగా సాగుతోంది. ప్రత్యేక బృందాల కళ్లుగప్పి వ్యాపారం వర్ధిల్లుతోంది. ఒక్కో ఏసీకేకు రూ.లక్షల్లో ముడుపులు చేరుతుండటంతో దందా సాఫీగా జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్లోని ఓ జిల్లాలో పలువురు అధికారులు, రేషన్ దందాలో ఆరితేరిన మిల్లర్లు కొత్త పథకానికి తెరదీసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్కు చేర్చి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఎఫ్సీఐ పరిశీలన, పరీక్షలు లేకుండానే పంపిస్తున్నారు. అంటే రీసైక్లింగ్ అన్న మాట. లబ్ధిదారులు, రేషన్ డీలర్లు అమ్మిన బియ్యమే మళ్లీ కార్డుదారులకు చేరుతోంది. దీనివెనుక రైస్మిల్లర్ల సంఘం నేతలు చక్రం తిప్పుతుండగా అధికారులకు లక్షల్లో మామూళ్లు చెల్లిస్తున్నారు. నిబంధనలకు మంగళం సీఎంఆర్ ధాన్యాన్ని మరాడించి మిల్లర్లు రాష్ట్ర, కేంద్ర గిడ్డంగులకు చేర్చాలి. ఇచ్చిన ధాన్యానికి నిర్దేశిత లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన బియ్యాన్ని ఎఫ్సీఐ అధికారులు బీఆర్ఎల్ టెస్ట్(ఏజ్ టెస్ట్) చేసి తాజా బియ్యమైతేనే ధ్రువీకరిస్తారు. ఒకవేళ పాత బియ్యమైతే టెస్ట్లో కలర్ మారిపోతుంది. ఎఫ్సీఐ అధికారుల ఫిజికల్ వెరిఫికేషన్(పీవీ) ఉంటుంది. తాజా మిల్లింగ్ బియ్యమని తేల్చిన తరువాత స్టేజ్–1 నుంచి స్టేజ్–2(ఎంఎల్ఎస్ పాయింట్)కు బియ్యాన్ని తరలించాలి. అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేయడం తదుపరి కార్డుదారులకు పంపిణీ జరుగుతోంది. అక్రమాలకు పెద్దపీట నిబంధనలను విస్మరించిన మిల్లర్లు అధికారుల అండతో అక్రమాలకు బరితెగించారు. గత కొన్ని నెలలుగా దందా సాగుతుండగా పౌరసరఫరాల శాఖలో పలువురు అధికారులు అక్రమార్కులకు అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఎఫ్సీఐ తనిఖీలు చేస్తే అసలు రంగు బయటపడుతుందని భావించిన మిల్లర్లు అధికారుల సలహాతో నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్కే తరలిస్తున్నారు. వేల క్వింటాళ్లలో కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు సరఫరా చేస్తున్నారు. సదరు వ్యవహారమంతా పౌరసరఫరాల అధికారుల కనుసన్నలో సాగుతుండటంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. నేరుగా తీసుకెళ్లే బియ్యానికి సదరు శాఖలోని పలువురు అధికారులే సీఎంఆర్ బియ్యమని కాగితాలు సృష్టిస్తుండటంతో తనిఖీలు చేసినా దొరికే అవకాశమే లేదు. ఇక పాత బకాయిలకు సంబంధించి ఓల్డ్ డిఫాల్టర్లకు రారైస్ బియ్యం పెట్టమని అవకాశమిస్తే పలువురు విచ్చలవిడిగా రేషన్ దందా నిర్వహిస్తున్నారు. మిల్లర్లకు డబుల్ ధమాకా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి సీఎంఆర్ కింద మిల్లర్లకు సరఫరా చేస్తోంది. ఇచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా ప్రభుత్వానికి అప్పగించడం దానికి కమీషన్ రూపంలో ప్రభుత్వం చెల్లించడం జరిగే ప్రక్రియ. ఈ దందాలో మిల్లర్లకు డబుల్ ధమాకా. ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని బయటకు విక్రయిస్తుండగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని ప్రభుత్వానికే అప్పగిస్తోంది. అంటే ఇచ్చిన ధాన్యంతో లాభాలు గడిస్తుండగా కొనుగోలు చేసిన ధాన్యంతో లాభమే. దీంతో పలువురు మిల్లర్లు, మిల్లర్ల సంఘం నేతలు అనతికాలంలోనే రూ.50కోట్ల వరకు కూడగట్టినట్లు పక్కా సమాచారం. -
ఎవరైనా.. ఎక్కడి నుంచైనా
కరీంనగర్ అర్బన్: అభివృద్ధి ప్రణాళికలైనా.. వనరుల పంపిణీ అయినా.. ఉపాధి అవకాశాలైనా.. ప్రభుత్వ నిర్ణయాలకు ఆధారం జనగణనే. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇది ఎంతో ఉపయుక్తం. కేంద్రం దేశవ్యాప్తంగా సమగ్ర జనగణన చేపడుతుండగా డిజిటల్ పద్ధతిని అనుసరిస్తోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు నమోదు చేసుకునే పద్ధతిలో కొన్ని మార్పులు చేసింది. స్మార్ట్ఫోన్తో పౌరులే ఆన్లైన్లో స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. సంబంధిత వెబ్సైట్, మొబైల్ యాప్లో ఈ నెల 26 నుంచి వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా.. కుటుంబంలో ఎవరైనా.. జిల్లాలో మే 11నుంచి జన గణన తొలి దశ ప్రారంభం కానుంది. హౌస్ లిస్టింగ్ పక్రియ జరగనుండగా జనగణనలో ఈసారి ప్రజలకు కూడ ఎన్యుమరేటర్లుగా బాధ్యతలు అప్పగించింది. వివరాలు చెప్పేందుకు ప్రజలు ఎవరికోసమో ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. సొంత ఊళ్లో లేకపోతే ఎక్కడి నుంచైనా వివరాలు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్ఫోన్ లేదా సాంకేతిక పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది. సంబంధిత పోర్టల్, మొబైల్లో నివాస గృహం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇతర సమాచారాన్ని స్వయంగా నమోదు చేసుకోవచ్చు. ఈ విధానంతో ఎన్యుమరేటర్ల కోసం వేచి చూడాల్సిన పని లేదు. దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఖర్చు ఆదా కానుండగా కుటుంబ సభ్యులందరూ అందుబాటులో లేకపోయినా పర్లేదు. 15 రోజులు అవకాశం దేశవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మే10 వరకు వివరాల స్వీయ నమోదుకు ప్రత్యేక అవకాశమిచ్చారు. హౌస్ లిస్టింగ్కు ముందుగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు సూచిస్తున్నారు. సీడాక్ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్ ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది. మొత్తం 18 భారతీయ భాషల్లో వివరాలు నమోదు చేయవచ్చు. దీంతో ప్రతి వర్గానికి యాప్ అందుబాటులో ఉంటుంది. ఎలా నమోదు చేయాలంటే జనగణన వివరాలను http///se.census.gov.in వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. కుటుంబ యజమాని పేరు, మొబైల్ నంబరు, ఈ– మెయిల్ నమోదు చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసిన వెంటనే ప్రశ్నావళి తెరుచుకుంటుంది. అందులో అవసరమైన వివరాలు నింపి సమర్పించాలి. తరువాత 11 అంకెల ప్రత్యేక ఐడీ వస్తుంది. ఇంటికొచ్చే ఎన్యుమరేటర్కు ఈ ఐడీని ఇవ్వాలి. వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశముంది. జనగణన స్వీయ నమోదుకు అవకాశం ఈనెల 26 నుంచి మే 10వ తేదీ వరకు అవకాశం -
నారీశక్తి వందన్ పాదయాత్ర
కరీంనగర్: నారీ శక్తి వందన్ అధినియం అద్భుత చట్టమని, దేశ చరిత్రలోనే మహిళలకు చారిత్రకంగా మిగిలిపోయే బిల్లుకు ప్రతిపక్షాలు అడ్డుతగలడం విచారకరమని, మహిళా లోకం ప్రతిపక్షాల కపట బుద్ధిని గమనించాలని బీజేపీ రాష్ట్ర మహిళా నాయకురాలు, సినీనటి కవిత అన్నారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నారీ శక్తి వందన్ పాదయాత్రను గీతాభవన్ నుంచి కళాభారతి వరకు నిర్వహించారు. కళాభారతిలో మహిళల సమావేశం చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన సినీనటి కవిత మాట్లాడుతూ నారీ శక్తి వందన్తో చట్టసభల్లో మహిళలకు తగిన గుర్తింపు లభించకుండా ప్రతిపక్షాలు అడ్డుపడ్డాయన్నారు. ఆడబిడ్డలకు 33శాతం రిజర్వేషన్లు మోడీ ప్రభుత్వం ఇస్తున్న బహుమానాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేని స్థితికి తెచ్చాయన్నారు. బిల్లును వ్యతిరేకించిన ప్రతిపక్షాలకు మహిళలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలదేవి, మహిళా మోర్చా అధ్యక్షులు చొప్పరి జయశ్రీ, సాధినేని లావణ్య, గుగ్గిల మంజుల, గొట్టిముక్కల ఉమరాణి, పెద్దపల్లి శ్రీలేఖ, తాటిపర్తి ప్రభావతి, కొలిపాక రమ్యశ్రీ, వేముల కవిత, మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
వీణవంక: జల్సాలకు, తాగుడుకు బానిసై ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జమ్మికుంట సీఐ లక్ష్మినారాయణ, ఎస్సై ఆవుల తిరుపతి వివరాల ప్రకారం మంచిర్యాల జిల్లాకు చెందిన కుంటాల భీమయ్య(40), మడక నరసయ్య అలియాస్ చిరంజీవి కలిసి ఆలయాలను టార్గెట్ చేసుకొని రాత్రి వేళలో చోరీలకు పాల్పడేవారు. వీణవంక మండలం ఎల్బాక– గంగారం గ్రామాల మధ్య ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం, కొండపాకలోని రేణుక ఎల్ల మ్మ , పెద్దమ్మ తల్లి ఆలయాల్లో తాళాలను పగలగొట్టి ఇటీవల చోరీలకు పాల్పడ్డారు. గుడి వద్ద బీమయ్య కాపలా ఉండగా నర్సయ్య గుడి లోపలికి వెళ్లి దొంగతనం చేసేవాడు. దొంగలించిన సొమ్మును జల్సాలకు, తాగుడుకు ఖర్చు పెట్టేవారు.ఈ నెల 16న రెడ్డిపల్లి శివారులో అనుమానస్పదంగా తిరుగుతుండగా భీమయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు ఓప్పుకున్నాడు. అతని వద్ద రూ.వెయ్యి స్వాధీనం చేసుకొన్నామని, నర్సయ్య పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. -
కుట్రతోనే సెస్ను విలీనం చేస్తున్నారు
సిరిసిల్లటౌన్: వందలాది కోట్లతో లాభాల్లో నడుస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)ను రాజకీయ కుట్రతోనే ఎన్పీడీసీఎల్లో విలీనం చేస్తున్నారని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విమర్శించారు. సిరిసిల్లలోని తన ఆఫీస్లో శుక్రవారం ప్రెస్మీట్లో మాట్లాడారు. ఎలాంటి సమాచారం, నోటీసుల్లేకుండానే ఏప్రిల్ 1న ఎన్పీడీసీఎల్ నుంచి అధికార యంత్రాంగం విజిలెన్స్, స్థానిక పోలీసు బలగాలతో వచ్చి సంస్థను విలీనం చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. సంస్థలో 3.51 లక్షల విద్యుత్ కనెక్షన్లు, 3.10 లక్షల వినియోగదారులతో రూ.787 కోట్లకు పైగా లాభంతో నడుస్తుందన్నారు. కొందరి స్వార్థ రాజకీయ లబ్ధి కోసం గతంలోనూ సంస్థను విలీనం చేశారని ఆ సమయంలో సీఎంగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి లాభాల్లో నడుస్తున్న సంస్థను విలీనం చేయడం ఏంటని ఒప్పుకోలేదని గుర్తు చేశారు. దేశంలో 56 ఏళ్లకు పైగా అధికారంలో ఉండి అవినీతికి పాల్పడిన పార్టీ ఇప్పుడు తమ పాలకవర్గం అవినీతికి పాల్పడించదని నిందలు మోపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2007–10 వరకు అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో జీవో 51 ప్రకారం విచారణ చేపట్టగా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు. అనంతర కాలంలో కృష్ణయ్య కమిషన్ సైతం నిబంధనలు అతిక్రమణ జరుగలేదని రిపోర్టు ఇచ్చిందన్నారు. కోర్టు తీర్పుకోసం వేచి ఉన్నామని, సంస్థను కాపాడుకోవడానికి ప్రజాక్షేత్రంలో పోరాటానికి సిద్ధమైతున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై న పాలకవర్గంపై కోపం ఉంటే సెస్ను యథాతథంగా కొనసాగిస్తే తాము రాజీనామాలు చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.500కోట్లకు పైగా బకాయిలను సకాలంలో చెల్లించకుంటే సంస్థ నష్టాల్లో ఉందని ప్రచారం చేస్తూ సెస్ను విలీనం చేస్తున్నారన్నారు. ఎన్పీడీసీఎల్ అధికారులు విలీనం చేసుకుని సంస్థకు సంబంధించిన రూ.400 కోట్ల ఆస్తులనే వినియోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కొందరు స్వార్థానికి సహకార సంస్థను ప్రైవేటు పరం చేయకుండా స్వయం ప్రతిపత్తితో సేవలను యథావిధిగా కొనసాగించేలా చర్యలను ఇప్పటికై నా తీసుకోవాలని కోరారు. సెస్ వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి మాధవి, దార్నం లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అవినీతిని బహిర్గతం చేయాలి సెస్ చైర్మన్ చిక్కాల రామారావు -
కూలర్లు నడవాల్సిందే..
పొద్దంతా, రాత్రంత కూలర్లు నడవాల్సిందే. లేదంటే ఎండ, ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఉన్నతస్థాయి ఇళ్లలో ఏసీలు ఉన్నా.. మధ్యతరగతి కుటుంబాలకు కూలర్లు ఎంతోఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. ఉక్కపోత, ఎండతీవ్రత తట్టుకోలేక జనాలు చల్లదనం కోసం తపిస్తున్నారు. ఈక్రమంలో కొందరుపాతవి రిపేరు చేస్తున్నార. ఇంకొందరు కొత్తవి కొనుగోలు చేస్తున్నారు. ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. కొందరు కూలర్ల మరమ్మతు చేయించి తీసుకొస్తే, మరికొందరు కొనుగోలు చేస్తూ శ్రీసాక్షిశ్రీ కెమెరాకు ఇలా చిక్కారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ఐఎస్వో పంచాయతీలు
కరీంనగర్రూరల్: కేరళ స్ఫూర్తితో తెలంగాణలోని గ్రామపంచాయతీలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్( ఐఎస్వో) గుర్తింపు లభిస్తోంది. కేరళలో ప్రతీ గ్రామపంచాయతీకి ఐఎస్వో గుర్తింపు ఉండటంతో తెలంగాణలోని గ్రామపంచాయతీలు ఆ దిశగా ముందడుగు వేశాయి. రాష్ట్రంలో తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోని ముఖరా(కే), పిప్రి, వాన్వాట్, మూత్నూర్, నార్నూర్ గ్రామపంచాయతీలకు ఐఎస్వో సర్టిఫికెట్లు దక్కించుకున్నాయి. కరీంనగర్ జిల్లాలో ప్రజలకు అత్యుత్తమ ప్రమాణాలతో పారదర్శక సేవలు, జవాబుదారీతనంతో పాలన సాగిస్తున్న కరీంనగర్ మండలం చామనపల్లి, రామడుగు మండలం వెలిచాల గ్రామపంచాయతీలను గుర్తించారు. శుక్రవారం ఐఎస్వో క్వాలిటీ ఆడిటర్, మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివరామయ్య ఆద్వర్యంలో సభ్యులు చామనపల్లి, వెలిచాల గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, నర్సరీలు, క్రీడాప్రాంగణాలు, కంపోస్టు షెడ్లను పరిశీలించారు. 32 అంశాల ప్రాతిపదికన గుర్తింపు ఐఎస్వో గుర్తింపు కోసం ఎంపిక చేసిన చామనపల్లి, వెలిచాల గ్రామపంచాయతీల్లో ఆడిటర్ శివరామ య్య బృందం సభ్యులు పర్యటించారు. నర్సరీ, కంపోస్టుషెడ్లను పరిశీలించి సర్పంచులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఆయా గ్రామాల్లోని డ్రైనేజీ నిర్వహణ, తాగునీటి సరఫరా, పౌరసేవల అమలు, అంగన్వాడీ కేంద్రం నిర్వహణ, పీహెచ్సీలోని సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించడం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, భూగర్భ జలాల సంరక్షణకు చేపట్టిన చర్యలు, ఘన వ్యర్ధాల నిర్వహణ, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధికి అవసరమైన 32 అంశాల ఆధారంగా ఐఎస్వో సర్టిఫికెట్కు ఎంపిక చేస్తారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన సేవలను పరిగణనలోకి తీసుకుని గ్రామపంచాయతీలకు ఐఎస్వో సర్టిఫికెట్ను వారంరోజుల్లో జారీ చేయనున్నట్లు ఐఎస్వో ఆడిటర్ శివరామయ్య తెలిపారు. రెండు గ్రామపంచాయతీలను స్ఫూర్తిగా తీసుకుని మిగితా గ్రామపంచాయతీల్లో నాణ్యత ప్రమాణాలతో ప్రజలకు సేవలందించేందుకు సర్పంచులు, కార్యదర్శులు కృషి చేయాలని సూచించారు. -
నుస్తులాపూర్లో చోరీ
తిమ్మాపూర్: మండలంలోని నుస్తులాపూర్లో చోరీ జరిగింది. గ్రామంలో షాజిదా బేగం తన కొడుకు ముజహిద్, కూతురు సన సుల్తానాతో నివాసముంటోంది. కొడుకు కార్ డ్రైవర్గా, కూతురు ఆసుపత్రిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 11న మానకొండూరులోని వీరి బంధువు మరణించగా ఆదివారం అందరూ వెళ్లారు తిరిగి ఉదయం ఇంటికి వచ్చారు. ఇంటిని శుభ్రం చేసుకుని తిరిగి అందరూ మళ్లీ మానకొండూర్ వెళ్లారు. శుక్రవారం ఉదయం తలుపులు పగుల గొట్టి ఉండటం గమనించిన పక్కింటివారు షాజిదా బేగంకు సమాచారం ఇచ్చారు. దాంతో వారు వెంటనే ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని రూ.1.10లక్షల నగదు, అర్ధతులం బంగారం, చెవికమ్మలు, 13తులాల వెండి అపహరణకు గురైనట్టు తెలిపారు. ఎల్ఎండీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేశారు. -
17 రోజుల హుండీ ఆదాయం రూ.73 లక్షలు
మల్యాల(చొప్పదండి): కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయ హుండీలను శుక్రవారం శ్రీలలిత సేవా ట్రస్టు సభ్యులు ఈవో అంజనారెడ్డి, దేవాదాయశాఖ పర్యవేక్షకుల ఆధ్వర్యంలో లెక్కించారు. 17 రోజుల హుండీ ఆదాయం రూ.73,02,163 సమకూరినట్లు ఈవో తెలిపారు. ఏఈవో హరిహరనాథ్, ప్రధాన అర్చకుడు రామకృష్ణ, స్థానాచార్యులు కపీందర్, సూపరింటెండెంట్ సునీల్కుమార్, ఏఎస్సై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమన్న సేవలో రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీవేములవాడ: భీమన్నను రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేశ్నాయుడు(ఐపీఎస్) శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ మండపంలో స్వామివారి శేషవస్త్రం కప్పి, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి ఆశీర్వచనం ఇచ్చారు. వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ వీరప్రసాద్, ఆర్ఐ సురేష్, ఎస్సైలు, ప్రొటోకాల్ ఏఈవో అశోక్కుమార్, ఆలయ పర్యవేక్షకులు ఎన్.రాజేందర్, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంకులో అగ్నిప్రమాదం ● రూ.5.50 లక్షల ఆస్తినష్టం గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని ఇండియన్ బ్యాంకులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం బ్యాంకు నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చామని ఫైర్ ఆఫీసర్ పి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఘటనలో సుమారు రూ.5 లక్షల 50 వేల ఆస్తినష్టం వాటిల్లందని, మరో రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం కాకుండా కాపాడమని ఆయన పేర్కొన్నారు. -
వానాకాలానికి సిద్ధం కండి
కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్ సాగుకు యంత్రాంగం సన్నద్ధం కావాలని జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం కరీంనగర్ ఏడీఏ కార్యాలయంలో వా నాకాలం సీజన్పై సమీక్షించారు. సీజన్కు ముందే రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవడం తప్పనిసరని స్పష్టం చేశా రు. ఏడీఏ రణధీర్రెడ్డి, కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండల వ్యవసాయ అధికారులు వంశీకృష్ణ, సత్యం, సంతోష్ కుమార్, ఏఈవోలు పాల్గొన్నారు. వర్సిటీ అభివృద్ధికి కృషికరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయానికి నూతనంగా నియామకం అయిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వీసీ ఉమేశ్కుమార్ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వవిద్యాలయం అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, పరిపాలనా వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై చర్చించారు. విశ్వవిద్యాలయాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తామని అన్నారు. ఎస్యూ రిజిస్ట్రార్ సతీశ్ కుమార్ పాల్గొన్నారు. అమృత్ పథకం పేరుతో పైప్లైన్ దందాకరీంనగర్ టౌన్: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్యలు రోజు రోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని 58వ డివిజన్ కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ అన్నారు. నగరంలో శుక్రవారం మాట్లాడుతూ నగర ప్రజల ప్రాథమిక హకై ్కన తాగునీటిని పాలకవర్గం సమయానికి అందించడం లేదన్నారు. అమృత్ పథకం పేరుతో అధికారులు రూ.కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమృత్ పథకంలో పైపులైన్లు ఉన్న ప్రాంతా ల్లోనే మళ్లీ పైపులైన్ పేరుతో రోడ్డులను తవ్వి ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అమృత్ పథకం పనులపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరానికి సంబంధించిన టెండర్లు వరంగల్లో నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. మానేరు డ్యామ్లో నీటిమట్టం 5 టీఎంసీల దిగువకు పడిపోతున్నా, ముందస్తు చర్యలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. పీజీ ఫలితాలు విడుదలకరీంనగర్ సిటీ: కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పీజీ తృతీయ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను ప్రిన్సిపాల్ డి.వరలక్ష్మి శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 170 మంది పరీక్షలు రాయగా 158మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. ఉత్తీర్ణత శాతం 92.94గా ఉందని పేర్కొన్నారు. ఎంఎస్సీ బోటనీ కెమిస్ట్రీలో వందశాతం ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ అఫ్సరీ ఉస్మాని, పరీక్షల నియంత్రణాధికారి జి.శ్రీనివాస్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు బి.రజనీదేవి, కె.సతీశ్ కుమార్, అకడమిక్ కోఆర్డినేటర్లు మనోజ్కుమార్, విద్య పాల్గొన్నారు. 27 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలికరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, నాల్గవ సెమిస్టర్ ఫీజు ఈనెల 27వ తేదీ లోపు చెల్లించాలని శాతవాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ శుక్రవారం తెలిపారు. పరీక్షలు జూన్ 2026లో జరుగుతాయని తెలిపారు. రూ.300 అపరాధ రుసుంతో ఈనెల 29వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. -
బాధలు తప్పడంలేదు
కొలనూర్ గేట్ మరమ్మతులతో గేట్ మూసివేశారు. రాకపోకలకు బాధలు పడుతున్నాం. రైల్వేశాఖ పదిరోజులపైగానే మరమ్మతులు చేస్తోంది. ఆర్టీసీ బస్సులు బంద్ అయ్యాయి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం కష్టంగా మారింది. – నారాయణ, ప్రయాణికుడు, కనగర్తి చుట్టూ తిరిగిపోతున్నాం కొలనూర్ గేట్ను తరచు మరమ్మతులు చేస్తున్నారు. సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ వైపులకు వెళ్లాలంటే.. అనేక ఊళ్లచుట్టూ తిరిగి పోవాల్సి వస్తోంది. పదిరోజులు రిపేరు చేస్తున్నా పనులు పూర్తి కావడంలేదు. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి. – బొయిని కొమురయ్య, ప్రయాణికుడు, గోపరపల్లె -
ప్రజావాణి అర్జీలు నిర్లక్ష్యం చేయొద్దు
కరీంనగర్ అర్బన్: ప్రజావాణికి వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజావాణి అర్జీల ప్రగతిపై సమీక్షించారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, సంక్షేమ శాఖ, నీటిపారుదలశాఖ, విద్యు త్, వెటర్నరీ, పంచాయతీ తదితరశాఖల వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్నారు. పెండింగ్ దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు. తరచుగా ఫిర్యాదులు వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయి తనిఖీ చేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జిల్లా సంక్షేమ అధికా రి సరస్వతి, జెడ్పీ సీఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్యాన్సర్ నుంచి కాపాడండి
వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ నిరుపేద కుటుంబానికి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. ఉన్న ఊరిలో సొంత గూడు లేదు. సాగు చేసుకోవడానికి గుంట భూమి లేదు. రోజువారీ కూలి పనులకు వెళ్తేనే ఆ ఇల్లాలికి బుక్కెడు బువ్వ దొరుకుతుంది. అటువంటి నిరుపేద దళిత కుటుంబంలో క్యాన్సర్ మహమ్మారి తీవ్ర ఆందోళనను నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన గుంటుకు రాములు ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల రాములుకు కడుపునొప్పి రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి క్యాన్సర్గా తేల్చారు. మెరుగైన చికిత్స అందిస్తేనే ప్రాణాలు నిలుస్తాయని డాక్టర్లు స్పష్టం చేశారు. అప్పటికే ఉన్నదంతా ఊడ్చి, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. కానీ, తదుపరి వైద్యానికి లక్షల్లో ఖర్చవుతుందని చెప్పడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పెద్ద మనసుతో ఆదుకోండి.. ఇంటి పెద్ద అనారోగ్యం బారిన పడటంతో రాములు భార్య స్వరూప కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. వైద్యం చేయించుకోవడానికి డబ్బులు లేక ఆ కుటుంబం ఆవేదన చెందుతోంది. దాతలు స్పందించి ఆదుకుంటే నాకు ఆయుష్షు పోసిన వారు అవుతారు అని రాములు కన్నీటి పర్యంతమయ్యాడు. ఆదుకోవాలని నిరుపేద వేడుకోలు కూలీపని చేస్తేనే పూట గడిచే పరిస్థితి డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని దుస్థితి -
ట్రాక్టర్ బోల్తాపడి యువ రైతు మృతి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం కిషన్రెడ్డి(29) ట్రాక్టర్ బోల్తాపడి చనిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం. కిషన్రెడ్డి శుక్రవారం తన పొలాన్ని హార్వెస్టర్తో కోయించాడు. ధాన్యాన్ని మార్కెట్ స్థలానికి ఆరబోసేందుకు ట్రాక్టర్లో తీసుకొస్తున్నాడు. చెరువు కట్టపై వెళ్తుండగా చిన్న గుంతలో ట్రాక్టర్ బోల్తా పడటంతో కిషన్రెడ్డి తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కాటం లింగారెడ్డి ఫిర్యాదు మేరకు శవపంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై పృధ్వీధర్గౌడ్ తెలిపారు. అప్పుల బాధతో వృద్ధుడి బలవన్మరణంబోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన వృద్ధుడు వల్లంపట్ల ఎల్లయ్య(71) అప్పుల బాధతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై ఎన్.రమాకాంత్ తెలిపిన వివరాలు. ఎల్లయ్య కొత్తగా ఇంటిని నిర్మించుకోవడంతో అప్పులపాలయ్యాడు. ఈక్రమంలోనే అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం తెల్లవారుజామున తన కొత్త ఇంటి మెట్ల వద్ద లుంగీతో ఉరివేసుకున్నాడు. మృతుని కుమారుడు వల్లంపట్ల దుర్గయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య తిమ్మాపూర్: భార్య చనిపోయిన బాధలో క్షోభపడుతూ భర్త ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన మండలంలోని ఇందిరానగర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎలుక బాలయ్య(63) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. కొన్ని నెలల క్రితం ఆయన భార్య భారతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోతున్నాడు. గురువారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి పడుకుని, శుక్రవారం తెల్లవారి గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరివేసుకొని కనిపించాడు. స్థానికులు సాయంతో కిందకు దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తన తల్లి మరణించినప్పటి నుంచి ఆవేదనతో అనారోగ్యానికి గురై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బాలయ్య కొడుకు అరుణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
కొత్త మండలిపై దుమారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీని వివాదాలు ఇప్ప ట్లో వీడేలా లేవు. తాజాగా వెలువడిన కొత్త పాలకమండలి సభ్యుల విషయం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. అర్హతలు లేని వారికి పాలకమండలిలో చోటు కల్పించారని, అర్హత ఉన్నవారి ని పక్కన పెట్టారన్న వాదనలు వర్సిటీలోని ప్రతీ విభాగంలో మార్మోగుతున్నాయి. తాజాగా వెలువడిన పాలకమండలిలో సీనియర్ ప్రొఫెసర్ స్థానంలో అసోసియేట్ ప్రొఫెసర్కు చోటు కల్పించారు. యూనివర్సిటీలో ప్రస్తుతం ఇద్దరే ప్రొఫెసర్లు ఉన్నా రు. అందులో ఒకరు వరప్రసాద్, మరొకరు సూరేపల్లి సుజాత. ఇటీవల సుజాతకు ఇప్పటికే నాలుగు పదవుల్లో కోతపెట్టిన వీసీ ఉమేశ్ కుమార్ ఈసారి పాలకమండలిలో చోటు ఇవ్వకపోగా వారి కన్నా జూనియర్, అసోసియేట్ ప్రొఫెసర్ అయిన జాఫర్ జారీకి చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఆయనకు ఇంకా ప్రొఫెసర్ హోదా రాలేదు. అయినా ఉన్నత విద్యామండలికి ఆయన్ను సీనియర్ ప్రొఫెసర్గా చూపించడం వి డ్డూరంగా ఉందని వర్సిటీ సిబ్బందే వాపోతున్నా రు. ఇప్పటికీ శాతవాహన యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లోనూ మహమ్మద్ జాఫర్ అసోసియేట్ ప్రొఫెసర్ అనే పేర్కొనడం గమనార్హం. ఎస్ఆర్ఆర్ కాలేజీకి దక్కని ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఉత్తర తెలంగాణలోనే శ్రీ రాజరాజేశ్వర కాలేజీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రస్తుతం హాస్టల్ సదుపాయంతో అటామనస్ హోదా కలిగి ఉంది. అలాంటి ఈ కళాశాలకు ఈసారి పాలకమండలిలో సభ్యత్వం దక్కకపోవడం హాట్ టాపిక్గామారింది. గత వీసీ మల్లేశం ఉన్న సమయంలో 2024 మార్చిలో పాలకమండలిని ప్రతిపాదించినా అది అమలులోకి రాలేదు. ఆ జాబితాలో ఎస్ఆర్ఆర్ కాలేజీతోపాటు, ప్రొఫెసర్ సూరేపల్లి సుజాతకు చోటు దక్కడం విశేషం. అదే జాబితాలో తాజా ఈసీ జాబితాలో ప్రొఫెసర్గా చూపించిన మహమ్మద్ జాఫర్ని అసోసియేట్ ప్రొఫెసర్గా పేర్కొనడం గమనార్హం. మొత్తానికి తాజా జాబితాలో సభ్యుల ఎంపిక, చూపించిన సమాచారంలో లోపాలపై ఇటు విద్యార్థులు, అటు వర్సిటీ సిబ్బంది మండిపడుతున్నారు. బెయిల్ రద్దుకు న్యాయ పోరాటం ఇటీవల వర్సిటీలో దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లంటూ ప్రచారం చేస్తున్న ఓ పార్ట్టైం ఫ్యాకల్టీ బెయిల్ రద్దుకు న్యాయపోరాటానికి దిగుతున్నామని శాతవాహన విద్యార్థి సంఘాల జేఏసీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో శాతవాహన వైస్ చాన్స్లర్గా పనిచేసిన మల్లేశంను ఇదే తరహాలో సోషల్ మీడియాలో కించపరిచిన కేసులో ఆ ఫాకల్టీపై అట్రాసిటీ కేసు నమోదైందని గుర్తుచేశారు. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం గడిపి.. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడని పేర్కొన్నారు. వర్సిటీలో అశాంతి.. ఆందోళనలకు కారణం అవుతున్న సదరు ఫాకల్టీ బెయిల్ రద్దుకు తాము కోర్టును ఆశ్రయిస్తామని వెల్లడించారు. బ్యాంకులను మోసం చేసిన వ్యక్తికి మా వర్సిటీలో స్థానం లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విద్యార్థులు కరికె మహేశ్, శివాజీ, లక్ష్మణ్, సాయి, ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.వీసీతో ఎమ్మార్పీఎస్ నేతల సమావేశం జిల్లా ఎమ్మార్పీఎస్ నేతలు వీసీ ఉమేశ్కుమార్ను ఆయన ఛాంబర్లో శుక్రవారం కలిశారు. యూనివర్సిటీలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజా తను అర్బన్ నక్సలైట్గా చిత్రీకరించడం, ఆమెకు ఉన్న పదవులను వరుసగా తొలగించడంపై వీసీతో ఆరా తీశారు. సుజాత విషయంలో ఎ లాంటి కక్షసాధింపు చర్యలు లేవని, వీసీ వారికి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మార్పీఎస్ నేతలు ప్రొఫెసర్ సుజాతను కలిసి సంఘీభావం తెలిపారు. దళితులపై అకారణంగా దు ష్ప్రచారానికి దిగితే.. ఉద్యమిస్తామని స్పష్టంచేశారు. జిల్లా అధ్యక్షులు అనిల్, రేణుకుంట్ల సాగర్, తునికి వసంత్, చెంచాల నవీన్ పాల్గొన్నారు. -
‘యమునా’ పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు ఏవి?
రామగుండం: వచ్చే జూన్ 2 నుంచి 13వ తేదీ మధ్య యమునా నది పుష్కరాలు నిర్వహించనున్నారు. అయితే, ఉత్తరప్రదేశ్ వైపు వెళ్లేందుకు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లన్నీ రెండు నెలల ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటున్నారు. కనీసం వెయిటింగ్ లిస్టులోనూ టికెట్ లభించగదు. గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన కుంభామేళా తరహాలో యమునానది పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లి పుణ్యస్నానాలు ఆచరించేందుకు మొగ్గు చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ ముందస్తుగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ఎలాంటి ప్రకటన చేయలేదు. పుష్కరాలు జరిగే ప్రాంతాలు ఉత్తరాఖండ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో యమునా నది పుష్కరాలు జరుగుతాయి. మథుర(విశ్రామ్ఘాట్), బృందావన్(కేశిఘాట్), ప్రయాగ్రాజ్ (త్రివేణి సంగమం), యమునోత్రి(నది జన్మస్థలం), ఢిల్లీ(నిగంబోధ్ ఘాట్) తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు హైదరాబాద్ నుంచి దానాపూర్ ఎక్స్ప్రెస్, యశ్వంతపూర్–లక్నో ఎక్స్ప్రెస్ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ వైపు ఎక్స్ప్రెస్ రైళ్లలో నోబెర్త్లు రెండు నెలల క్రితమే రిజర్వేషన్లు ఫుల్ జూన్ 2 నుంచి యమునా పుష్కరాలు -
మరమ్మతులు.. ప్రయాణానికి ఆటంకాలు
ఓదెల: పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, రాఘవాపూర్, కన్నాల, రామగుండం లెవల్ క్రాసింగ్ గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేక గ్రామస్తులు, ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. దాదాపు పదిరోజులుగా 104, 108 వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసర వైద్యసేవల కోసం ఆస్పత్రులకు తరలించేవారి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. గేట్ల వద్ద స్లీపర్లు వేయడం, మరమ్మతులు చేయడంతో రాకపోకలను నిలిపివేయడం తప్పనిసరిగా మారింది. అనుమతించని రైల్వేశాఖ యంత్రాలు, కూలీలతో లెవల్ క్రాసింగ్ గేట్ల మరమ్మతులు చేపట్టిన రైల్వేశాఖ ఉన్నఽతాధికారులు.. రాకపోకలకు ఆయా ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడంలేదు. పనుల్లో జాప్యం కావడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు 15రోజులుగా బంద్ కావడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు సైతం సుమారు 15 కి.మీ. వరకు దూరం తిరిగి ప్రయాణం చేయాల్సి వస్తోంది. రద్దీ ఉండే లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మించాలని చాలాఏళ్లుగా విన్నవించుకుంటున్నా ఫలితం లేకుండాపోతోంది. -
‘కవర్లు’ సిద్ధం చేసుకోండి!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యో గి చేసిన కొన్ని ఫోన్ కాల్స్ కలకలం రేపుతున్నాయి. వాస్తవానికి నేటి నుంచి యూనిర్సిటీ పరిధిలోని ప్రై వేటు డిగ్రీ కళాశాలల తనిఖీ ఉంది. తనిఖీ బృందాలు కాలేజీల్లో వసతులు, ల్యాబులు, మైదానం, మరుగుదొడ్లు, అకడమిక్స్ తదితర సదుపాయాలు ఉన్నాయా? లేవా అని స్వయంగా తనిఖీ చేస్తాయి. ఇదే అదనుగా ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెద్దసార్లు తనిఖీకి వస్తున్నారని, మీ కాలేజీ పరిస్థితి తెలిసిందేగా.. అందుకే, కవర్లు సిద్ధం చేసి ఉంచాలని, ప్రతీ కవర్లో రూ.30వేలకు తగ్గకుండా నగదు ఉంచాలని ఫోన్లు చేసినట్లు సమాచారం. కనీస వసతులు కరువు ఏటా యూనివర్సిటీ నుంచి వచ్చే కాలేజీ డెవలప్మెంట్ కమిటీ (సీడీసీ) బృందాలు కాలేజీని తనిఖీ చేసి యూనివర్సిటీ అప్లియేషన్ను రెన్యూవల్ చేయాల్సి ఉంది. శాతవాహన యూనివర్సిటీ పరిధిలో నడుస్తోన్న పలు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో కనీస వసతులు లేవు. ఈ విషయం వర్సిటీలో పెద్ద సారు వద్ద పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి తెలుసు. వర్సిటీ పరిధిలో 70 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, 25 ప్రైవేట్ పీజీ కాలేజీలు, 24 ప్రైవేట్ బీఈడీ కాలేజీలు, 7 ఎంబీఏ, ఒక ఎంసీఏ కాలేజీ, రెండు ప్రైవేట్ లా కాలేజీలు ఉండగా.. వీటిలో సదుపాయాలు సరిగా లేని కాలేజీకి సదరు ఉద్యో గి కాల్ చేసినట్లు సమాచారం. కనీసం రూ.30వేల నగదుతో కూడిన కవర్లు సిద్ధం చేయాలని పెద్దసార్లకు ‘సిరి’కాంతులు కనిపిస్తేనే కాలేజీలు నడుస్తాయని, లేకపోతే ఇబ్బందులేని సదరు ఉద్యోగి స్ప ష్టంచేసినట్లు తెలిసింది. ఇటీవల వర్సిటీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చిన వ్యక్తి కూడా ఇదే తరహాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావడం విశేషం. -
గర్జించిన ఉద్యోగులు
కరీంనగర్ అర్బన్: సమస్యల పరిష్కారంలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉద్యోగ లోకం గర్జించింది. కలెక్టరేట్ వేదికగా ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, సరెండర్ లీవ్, మెడికల్ బిల్లులు, ఇన్సూరెన్స్ బిల్లులు, జీపీఎఫ్ వంటి రాజ్యాంగబద్ధ హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జూలై 1 2023నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికీ అమలు కాకపోవడం, ఐదు డీఏలు పెండింగ్లో ఉండటం ఉద్యోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతుందని అవేదన వ్యక్తం చేశారు. ఓపీఎస్ పునరుద్ధరణ, హెల్త్ కార్డు అమలు, కాంట్రాక్ట్– ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతి పత్రం ఇచ్చారు. జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్, కటకం రమేశ్, పెండ్యాల కేశవరెడ్డి, పీఆర్టీయూ నాయకులు కరుణాకర్రెడ్డి, జేఏసీ నాయకులు తిరుపతిరావు, జావిద్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన దండవేని సుధాకర్ (57) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. సుధాకర్ అతని కుమారుడు శ్రీపాల్ ఈనెల 11న ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వస్తుండగా రాజీవ్గాంధీ చౌరస్తా వద్ద కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. సుధాకర్, శ్రీపాల్కు గాయాలయ్యాయి. సుధాకర్ను కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. శ్రీపాల్ ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సదాకర్ తెలిపారు. సౌదీలో దాచారం వాసి..ఇల్లంతకుంట(మానకొండూర్): రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామానికి చెందిన పొన్నం దశరథంగౌడ్(56) సౌదీలో గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. దశరథం గత ఇరువై ఏళ్లుగా సౌదీ అరేబియాలోని జుబెల్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని భార్య సుమలత అక్కడే కొన్ని నెలలు ఉండి తిరిగి బుధవారం తెల్లవారుజామున ఇండియాకు తిరిగి వచ్చింది. ఆమెను ఫ్లైట్ ఎక్కించి డ్యూటీకి వెళ్లారు. కంపెనీలో పనిచేస్తుండగానే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దశరథంగౌడ్కు ఇద్దరు కుమారులు, భార్య సుమలత ఉన్నారు. కట్టెల లారీ బోల్తాజగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం తక్కళ్లపల్లి శివారులో గురువారం ఉదయం కట్టెల లారీ బోల్తాపడింది. కట్టెల లోడ్తో వెళ్తున్న లారీ జగిత్యాల–ధర్మపురి ప్రదాన రహదారిపై తక్కళ్లపల్లి శివారులో అదుపుతప్పి బోల్తాపడింది. ఉదయం వేళ కావడం.. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్తోపాటు, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. కుక్కల దాడిలో గొర్రెలు మృతి ఎలిగేడు: పెద్దపల్లి జిల్లా ఎలిగేడులోని గుజ్జుల కనకయ్య చెందిన గొర్రెలు మందపై గురువారం తెల్లవారుజామున కుక్కలు దాడిచేశాయి. ఇందులో 7 గొర్రెలు మృతి చెందాయని బాధితుడు తెలిపాడు. వాటివిలువ దాదాపు రూ.80 వేలు ఉంటుందని వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని కనకయ్య విన్నవించాడు. -
బిల్లులు రాలేవని పాఠశాల గదులకు తాళం
ఇల్లంతకుంట(మానకొండూర్): పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించలేదని మండలంలోని వల్లంపట్ల మాజీ సర్పంచ్ ప్రభుత్వ పాఠశాల గదులకు గురువారం తాళాలు వేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.22.30లక్షతో మూడు గదులు, రూ.21.80లక్షలతో హైస్కూల్లో డైనింగ్హాల్, ఇతర పనులను మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ చేశారు. పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా బిల్లులు మంజూరుకాలేదు. దీంతో గురువారం ఉదయం ప్రాథమిక పాఠశాలలోని మూడు గదులకు, హైస్కూల్లోని డైనింగ్హాల్కు తాళాలు వేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై అశోక్ వచ్చి తాళాలు వేసిన గదులను పరిశీలించారు. రెండు గదులలో విద్యార్థుల సర్దుబాటు పాఠశాల గదులకు తాళాలు వేయడంతో ఒక గదిలో 1, 2, 3 తరగతి విద్యార్థులను, మరో గదిలో 4, 5వ తరగతి విద్యార్థులను కూర్చోపెట్టినట్టు హెచ్ఎం శ్రీనివాస్ తెలిపారు. ఎంఈవో శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ వల్లంపట్లలోని ప్రభుత్వ పాఠశాలల గదులకు తాళం వేసిన విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ మాట్లాడుతూ రెండేళ్ల క్రితం అధికారులు మెడపై కత్తి పెట్టి పనులు చేయించడంతో రూ.44లక్షల పనులు చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని, తన బంగారం అమ్మి పనులు చేపించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించే వరకు తాళాలు తీయబోమన్నారు. మాజీ సర్పంచ్ దంపతులపై కేసు పాఠశాల గదులకు, భోజనశాలకు, తాళం వేసి విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించిన మాజీ సర్పంచ్ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు తరగతి గదులకు, హైస్కూల్ డైనింగ్ హాలుకు తాళం వేసినట్టు పేర్కొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది కలగజేసినందుకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. వల్లంపట్ల మాజీ సర్పంచ్పై కేసు -
ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్లోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్న మహిళ అనుమానాస్పదంగా మృతిచెందింది. బీర్పూర్ మండలం కందెనకుంట గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండగా కృష్ణానగర్లోని ఆస్పత్రిలో పరీక్ష చేయించుకోగా.. వైద్యులు గర్భసంచి ఆపరేషన్ చేయాలని సూచించారు. బుధవారం సాయంత్రం ఆపరేషన్ చేశారు. గురువారం ఉదయం అకస్మాత్తుగా మృతిచెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యజమాన్యం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇవ్వడంతో శాంతించారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన -
చేపలవేట.. సుందర దృశ్యం
సూర్యోదయం వేళ ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న భానుడు.. సూర్యుని లేలేత కిరణాలతో ఆకాశం నారింజ, ఎరుపు రంగులో మెరిసిపోతోంది. మత్స్యకారులు విసిరిన వలను చూసి మురిసిపోయింది. ఆకాశం ప్రతిబింబంతో నీళ్లు ఎర్రగా మెరుస్తుంటే.. మత్స్యకారులు గంటల తరబడి వేచిచూస్తూ చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణంలో చేపలవేట కొనసాగించారు. ఇది చూపరులకు ఒకగొప్ప అనుభూతి ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల మానేరులో మత్య్సకారుల చేపలవేట దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా అందంగా కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో నందెల్లి మహిపాల్
కరీంనగర్స్పోర్ట్స్: నాగాలాండ్ రాజధాని కోహిమాలో ఈ నెల 13 నుండి 16 వరకు నిర్వహించిన అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సర్వసభ్య సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, జిల్లా ఒలింపిక్, అథ్లెటిక్ సంఘం అద్యక్షుడు నందెల్లి మహిపాల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాగాలాండ్ గవర్నర్ నందకిషోర్ యాదవ్, ముఖ్యమంత్రి నిప్పయు రియో, ఉప ముఖ్యమంత్రి పాటిల్, సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ అధ్యక్షుడు లలిత్ కె.భాను పాల్గొనగా తెలంగాణ నుంచి ప్రతినిధిగా మహిపాల్ హాజరయ్యారు. మహిపాల్ వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి దేశంలో అథ్లెటిక్స్ క్రీడల అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలికితీసి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇచ్చేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓసీపీ–3లో తప్పిన పెను ప్రమాదం గోదావరిఖని: సింగరేణి రామగుండం డివిజన్–2 పరిధిలోని ఓసీపీ–3లో పెద్దప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఓసీపీ–3 కృషిభవన్ సమీపంలోని బేస్వర్క్షాప్ వద్ద నిలిపిఉన్న బొలేరోను గమనించకుండా ఆపరేటర్ డంపర్తో ఢీకొట్టాడు. అక్కడున్నవారు అరవడంతో డంపర్ నిలిపివేశాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే బొలెరోపై డంపర్ ఎక్కి ఉంటే అందులో ఉన్న నలుగురు చనిపోయేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి అధికారులు చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన ఘటనపై ఆరా తీశారు. ఆరబోసిన ధాన్యం చోరీపెద్దపల్లిరూరల్: కాదేదీ దొంగతనానికి అనర్హం అన్నట్టు.. ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ధాన్యాన్ని రోడ్డు పక్కన ఆరబోస్తే దొంగలు ఐదారు బస్తాల వరకు అపహరించుకుపోయారని పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన కౌలు రైతు మాటూరి రమేశ్ వాపోయాడు. తేమశాతం తగ్గితే కొనుగోలు కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముకోవచ్చనే ఆశతో ప్రధాన రోడ్డుకు సమీపంలో ఆరబోయగా.. దొంగలు ధాన్యం ఎత్తుకు పోయారని పేర్కొన్నాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపారు. -
వీడిన వృద్ధురాలి హత్య మిస్టరీ
సిరిసిల్లక్రైం: జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న నిందితుడు దొంగతనం కోసం హత్య చేయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్లలోని రాజీవ్నగర్లో కోన లక్ష్మి(75) ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఇదే అవకాశంగా చూసుకున్న గడీల రాజు(55) అనే వ్యక్తి.. కొంతకాలంగా ఆమె ఇంటిని గమనిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడంతో రాజు డబ్బుల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈనెల 13న మధ్యాహ్నం సమయంలో కత్తెరతో లక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె నిద్రిస్తుండగా ఇంట్లో డబ్బుల కోసం వెతికాడు. నగదు, పత్రాలు, చీరలు సేకరించాడు. ఆ సమయంలో శబ్దం రావడంతో లేచిన వృద్ధురాలు అరవడంతో వెంటనే తన వద్ద ఉన్న కత్తెరతో ఆమె గొంతు, మెడపై పలుమార్లు దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయింది. తన దుస్తులపై పడిన రక్తపు మరకలు చూస్తే స్థానికులకు అనుమానం వస్తుందని వెంటనే ఇంటికి వెళ్లి వాటిని మార్చుకున్నాడు. వృద్ధురాలి ఇంటిలో ఇంకా ఏమైన డబ్బులు, బంగారం దొరుకుతుందన్న అత్యాశతో మళ్లీ వచ్చి అన్ని వెతికాడు. కానీ ఏమి దొరక్కపోవడంతో వృద్ధురాలి చెవికి ఉన్న బంగారు పోగుల కోసం చెవులు కోసేశాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లాడు. రక్తం పట్టిన బట్టలను ఆనవాళ్లు లేకుండా కాల్చివేశాడు. మూడు రోజులుగా గాలిస్తున్న పోలీసులకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా హంతకుడిని పట్టుకున్నట్లు డీఎస్పీ నాగేంద్రచారి వెల్లడించారు. హంతకుడు వృద్ధురాలి ఇంటి నుంచి తీసుకున్న రూ.2 వేల నగదు, హత్యకు ఉపయోగించిన కత్తెర, రెండు చీరలు, బ్యాంక్ పాస్బుక్కులు, ఆరోగ్యశ్రీ కార్డు, వికలాంగ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే చెవి పోగులకు అంటుకున్న రక్తాన్ని కడిగే క్రమంలో అవి చేజారిపోయినట్లు హంతకుడు పోలీసులకు వెల్లడించడం గమనార్హం. చేధించిన పోలీసులు -
భర్తతో ఘర్షణ పడి వివాహిత ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గుండారం పంచాయతీ పరిధిలోని పోచమ్మతండాకు చెందిన అజ్మీర అనిత(38) భర్తతో ఘర్షణపడి మనస్థాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. అనిత భర్త భాస్కర్ పదేళ్లుగా దుబాయ్కి వెళ్లి వస్తున్నాడు. ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ తిరిగి దుబాయ్కి వెళ్లాడు. ఇంటి వద్దనే ఉంటున్న అనితకు భర్త భాస్కర్ మధ్య ఇటీవల కొన్ని విభేదాలు వచ్చాయి. కొంతకాలంగా భర్త తనతో ఫోన్లో మాట్లాడడం లేదని అనిత తండాలో పలువురితో చెప్పుకొని బాధపడుతుండేది. ఈక్రమంలోనే బుధవారం రాత్రి భర్తతో వీడియోకాల్ మాట్లాడింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటలు పెరిగి తీవ్ర స్థాయికి చేరాయి. మనస్థాపానికి గురైన అనిత మొదట వంటింట్లో ఉరివేసుకోవడానికి ప్రయత్నించింది. అనంతరం హాల్లోకి వచ్చి దులానికి ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయింది. దుబాయ్ నుంచి వస్తున్న భర్త భాస్కర్ చివరి చూపు కోసం అనిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బంధువులు ఫ్రీజర్లో భద్రపరిచారు. భార్య, భర్తల మధ్య జరిగిన సంభాషణ కోసం పోలీసులు అనిత ఫోన్ను పరిశీలించారు. బుధవారం రాత్రి అనితకు వచ్చిన కాల్డేటాను పోలీసులు సేకరించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటకు చెందిన వివాహిత మానుక భానుశ్రీ(22) గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. మామిడిపల్లికి చెందిన గెంటె శివయ్య–దేవలక్ష్మి దంపతుల కూతురు భానుశ్రీకి అదే మండలం మల్కపేటకు చెందిన మానుక కరుణాకర్తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భర్త కరుణాకర్ సౌదీలో ఉండడంతో ఇటీవల భానుశ్రీ కూడా సౌదీకి వెళ్లి కొద్ది రోజులు ఉండి వచ్చింది. గురువారం సాయంత్రం భర్తతో మాట్లాడిన వీడియోకాల్లో గొడవ జరిగింది. వీడియోకాల్ మాట్లాడిన వెంటనే కుమారుని ముందరే ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చుట్టు పక్కల వారు వచ్చి చూసేసరికి మృతి చెందింది. విషయం తెలుసుకుని మృతురాలి సోదరులు వేణు, రవి, బంధువులు ఆందోళనకు దిగారు. అత్తింటివారి వేధింపులతోనే భానుశ్రీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. కోనరావుపేట ఎస్సై ప్రశాంత్రెడ్డి చేరుకుని ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి గెంటె దేవలక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బహిరంగ సభపై సమీక్ష సమావేశం
జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి రవీందర్రావు జగిత్యాలకు రాగా వారిని ఆహ్వానించారు. జన సమీకరణే లక్ష్యమని, ప్రతి కార్యకర్త ప్రజలను తరలించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీరమణ, జెడ్పీచైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. రాజమ్మ నేత్రాలు సజీవంబోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి రాజమ్మ అనారోగ్యంతో ఈనెల 15న మృతిచెందగా ఆమె కుటుంబసభ్యులు లయన్స్క్లబ్ ఆఫ్ కమాన్పూర్ ఆధ్వర్యంలోని సదాశయ ఫౌండేషన్కు ఆమె నేత్రాలు దానం చేశారు. కమాన్పూర్ లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ సభ్యుడైన రాజమ్మ పెద్ద కుమారుడు చేపూరి దేవేందర్ నేత్రదానంపై తన సోదరుడు చేపూరి రవీందర్తోపాటు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో వారు నేత్రదానానికి ఒప్పుకోవడంతో టెక్నీషియన్ గాజుల సతీశ్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాద్లోని ఐ బ్యాంక్ పంపించారు. కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అభినందించారు. మాజీ సర్పంచ్ చిందం రమేశ్, మున్నూరుకాపు సంఘం నాయకులు సింగరి రమేశ్, బుర్ర రాజు, రేండ్ల కనకయ్య, ముదాం శ్రీనివాస్, చిందం శ్రీనివాస్ ఉన్నారు. -
అడుగంటిన మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): మొన్నటిదాకా జలసిరితో కళకళలాడిన రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరులో నీటిమట్టం ఇప్పుడు రోజురోజుకు అడుగంటుతోంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్ఫ్లో లేకపోవడం.. ప్రాజెక్టులో ఉన్న నీరు ఎల్ఎండీ ప్రాజెక్టులోకే తరలిపోవడం.. నీటిమట్టం తగ్గడానికి కారణమైంది. ప్రాజెక్టులో ఈ ఏడాది జనవరి 1న 26.74 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండగా గురువారం 8.435 టీఎంసీల మేర నీరు మాత్రమే నిల్వ ఉంది. సుమారు 18 టీఎంసీల మేర నీరు బయటకు తరలిపోయింది. మండే ఎండలకు రోజుకు 145 క్యూసెక్కుల మేర నీరు ఆవిరి అవుతోంది. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్ఎండీకి 500 క్యూసెక్కులు, కుడికాల్వకు 450 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మరో మూడు రోజులు ఆయకట్టుకు నీరు మిడ్మానేరు ప్రాజెక్టు మూడు డివిజన్ల కింద సుమారు 50వేల ఎకరాల మేర ఆయకట్టుకు కుడికాల్వ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేస్తున్నట్లు మిడ్మానేరు ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. కుడికాల్వ ద్వారా ఆయకట్టుకు ఇప్పటి వరకు 3.146 టీఎంసీల మేర నీరు వదిలారు. కుడికాల్వ ద్వారా ఇల్లంతకుంట, గన్నేరువరం, మానకొండూర్, హుస్నాబాద్, కోహెడ తదితర మండలాల్లోని పంట పొలాలకు నీరు అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఎండీకి 16 టీఎంసీల నీటి తరలింపు మిడ్మానేరు ప్రాజెక్టు ప్రారంభం నుంచి ప్రతీ ఏడు ఎల్ఎండీ ఆయకట్టుకు, కరీంనగర్ పట్టణ తాగునీటి అవసరాలకు మెజార్టీగా మిడ్మానేరు ప్రాజెక్టు నీరే పెద్ద దిక్కు అవుతోంది. గత జనవరి 11 నుంచి ఏప్రిల్ 16 వరకు మిడ్మానేరు నుంచి ఎల్ఎండీకి 16.848 టీఎంసీల మేర నీరు విడుదల చేశారు. ప్రస్తుతం 2 గేట్ల ద్వారా ఎల్ఎండీకి రోజుకు 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. గత మూడేళ్లుగా మిడ్మానేరు నుంచి ఎల్ఎండీ ప్రాజెక్టులోకి సుమారు 80 టీఎంసీల మేర భారీగా నీరు వది లారు. ఎల్ఎండీకి మరో అర టీఎంసీ మేర మాత్ర మే నీరు వదులుతామని అధికారులు తెలిపారు. మూడేళ్లుగా కాళేశ్వరం నీళ్లు బంద్ జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వరదకాల్వ మీదుగా మిడ్మానేరు ప్రాజెక్టులోకి 26.70 టీఎంసీల మేర నీరు వచ్చి చేరింది. అప్పుడు కాళేశ్వరం జలాలు భారీగా రావడంతో మిడ్మానేరు ప్రాజెక్టు నిండుకుండలా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టుకు గత రెండేళ్లుగా కాళేశ్వరం నీళ్లు నిలిచిపోవడంతో పై ప్రాంతం నుంచి భారీ ఇన్ఫ్లో లేదు. ఔట్ఫ్లో మాత్రమే ఉండడంతో మిడ్మానేరు ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రస్తుతం కేవలం 8 టీఎంసీల మేర నీటి నిల్వకే పరిమతమైంది. ప్రాజెక్టు బ్యాక్వాటర్ ఇప్పుడు 9 కిలోమీటర్ల మేరకే పరిమతమైంది. మరో రెండు నెలలు నిండు వేసవి ఉన్న తరుణంలో మిడ్మానేరు ప్రాజెక్టులో నీటిమట్టం ఎలా ఉంటుందోనని రైతుల్లో ఆందోళన నెలకొంది. మిషన్ భగీరథకు రోజుకు 45 క్యూసెక్కులు ప్రాజెక్టులో 8 టీఎంసీలు ఉన్నా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని గ్రామాలకు మిషన్ భగీరథ నీటి పథకానికి రోజుకు సుమారు 45 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేస్తున్నారు. మిడ్మానేరులో చివరికి 4 టీఎంసీల వరకు నీరు ఉన్నా మిషన్ భగీరథకు నీరు విడుదల చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జూలై 31 వరకు 7 టీఎంసీలు ఉండేలా చర్యలు మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీకి, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీరు విడుదల చేసినప్పటికీ జూలై చివరి వరకు 7 టీఎంసీల మేర నీరు ఉండేలా చూసుకుంటామని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రణాళికను ఇప్పటికే రూపొందించుకున్నారు. భారీగా తగ్గుతున్న నీటి నిల్వలు 8 టీఎంసీలకు పడిపోయిన నీటిమట్టం ఎల్ఎండీలోకి తరలిన నీరు మండే ఎండలకు భారీగా నీరు ఆవిరి మిడ్మానేరు ప్రాజెక్టు స్వరూపం పూర్తి నీటి సామర్థ్యం : 27.55 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం : 8.435 టీఎంసీలు కుడి, ఎడమ కాలువలకు నీటివిడుదల : 3.146 టీఎంసీలు మిషన్భగీరథ నీటి పథకానికి : 0.454 టీఎంసీ ఎల్ఎండీకి తరలిన నీరు : 16.848 టీఎంసీలు ఎండలకు ఆవిరి అయిన నీరు : 1.521 టీఎంసీలు -
రైలులో గర్భిణికి పురిటినొప్పులు
రామగుండం: ప్రసవం కోసం తమ స్వస్థలం ఒడిశాలోని రూర్కెలాకు బిలాస్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తున్న గర్భిణికి హఠాత్తుగా నొప్పులు రావడంతో రామగుండం రైల్వేస్టేషన్లో దింపి పురుడు పోశారు. జీఆర్పీ ఔట్పోస్టు ఇన్చార్జి తిరుపతి, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దినేశ్ మీనా కథనం ప్రకారం.. గర్భిణి జిథానీదేవి తన భర్తతో కలిసి బిలాస్పూర్ రైలులో బుధవారం ఉదయం తమిళనాడులోని తిరుప్పూర్లో ఎక్కింది. రైలు పెద్దపల్లి స్టేషన్ దాటిన తర్వాత పురిటినొప్పులు అధికం అయ్యాయి. సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించి రామగుండంలో రైలును అత్యవసరంగా నిలిపివేయించారు. అప్పటికే సిద్ధంగా ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది.. వెంటనే ఆటోలో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యులు ప్రసవం చేయడంతో తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా, గత జనవరి 14న బిహార్కు వెళ్లే క్రమంలో రామగుండంలోనే పురిటి నొప్పులతో రైల్వే శానిటరీ సిబ్బంది ఓ గర్భిణికి ప్లాట్ఫారంపైనే సుఖప్రసవం చేసినవిషయం తెలిసిందే. అత్యవసరంగా రామగుండంలో దింపిన సిబ్బంది -
జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి విన్నవించారు. జాతీయ రహదారి (ఎన్హెచ్ 563) విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతోందని సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. పనుల్లో జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రహదారి పనుల్లో పురోగతి పెంచి, నిర్ణీత గడువులోగా పూర్తిచేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలను కలిపే ఈ కీలకమైన జాతీయ రహదారి పూర్తయితే కరీంనగర్, జగిత్యాల ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారికి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకొంటానని హామీ ఇచ్చినట్లు సత్యం తెలిపారు. వేం నరేందర్రెడ్డికి శుభాకాంక్షలు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్రెడ్డిని ఢిల్లీలో కలిసిన డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, హౌజ్ఫెడ్ మాజీ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తితో కలిసి నరేందర్ రెడ్డిని సన్మానించారు. -
5 స్థానాలు.. 46 మంది పోటీ
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ కో ఆప్షన్ పదవులకు అనూహ్యంగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గురువారంతో ముగియగా, ఐదు స్థానాలకు భారీస్థాయిలో 46 మంది దరఖాస్తు చేశారు. వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల పాటు అధికారులు పరిశీలించనున్నారు. 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. 46 మంది దరఖాస్తు నగరపాలకసంస్థలోని ఐదు కో ఆప్షన్ పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఐదు స్థానాల్లో రెండు మైనార్టీలు(అందులో ఒకరు మహిళ), మూడు జనరల్ (అందులో ఒకరు మహిళ)కు కేటాయించారు. కో ఆప్షన్ పదవులకు దరఖాస్తుల స్వీకరణ గురువారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఐదుస్థానాలకు 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. అజీమ్ మహమ్మద్, నాంపల్లి శ్రీనివాస్, నక్క పద్మ, దిండిగాల మహేష్, స్వర్గం వజ్ర, కన్న కృష్ణ, చిందం శ్రీనివాస్, వరాల నారాయణ, చిగిరి వెంకటమ్మ, లింగంపల్లి శ్రీనివాస్, పుట్ట నరేందర్, ఎలగందుల నందకుమార్, నాగవెల్లి వెంకట రెడ్డి, సుంకిశాల సంపత్రావు, గుర్రాల మంగారాణి, సర్ధార్ బల్బీర్ సింగ్, కుర్ర తిరుపతి, గందె మాధవి, దాది సుధాకర్, బోనాల శ్రీకాంత్, ఆకుల రమేశ్, జి.కొమురయ్య, హఫీజాబేగం, జంగిలి సాగర్, జంగిలి ఐలేందర్ యాదవ్, భూక్యా తిరుపతి, భూక్యా లావణ్య, ఎదుల్ల రాజశేఖర్, మహమ్మద్ అహ్మద్ మొహియొద్దీన్, అర్ష కిరణ్మయి, అర్ష మల్లేశం, మందల మహేందర్రెడ్డి, కమల్జిత్కౌర్, మహమ్మద్ అబ్దుల్ అహద్ నవీద్, కొండపల్లి సరిత, సర్ధార్ సోహాన్సింగ్, గుంజేటి శివకుమార్, జిట్టవేని కోమలత, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ అబ్బాస్, మహమ్మద్ ఖమరుద్దీన్, ఆస్మా పర్వీన్, సాదిక్ సుల్తానా, సయ్యద్ అబ్దుల్ బషీర్, లింగంపల్లి సుజాత, మాతంగి కృష్ణ క్రిస్టోఫర్ దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీటీసీలుంటే రిజెక్ట్ కో ఆప్షన్ పదవులకు వచ్చిన దరఖాస్తులను మూడు రోజుల పాటు అధికారులు పరిశీలించనున్నారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యుల పదవీ కాలాన్ని పరిశీలిస్తారు. కో ఆప్షన్ పదవులకు ఎంపీటీసీలు దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తులను తిరస్కరిస్తామని నగరపాలకసంస్థ అధికారులు తెలిపారు. మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కరీంనగర్ నగరపాలకసంస్థ పరిధిలోని మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు సభ్యులు మాత్రమే అర్హులని అన్నారు. కో ఆప్షన్ పదవులకు గాను పలువురు ఎంపీటీసీలు కూడా దరఖాస్తు చేసుకోగా, ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. పోటీలో ఉండేదెవరో... ఐదు స్థానాలకు 46 మంది దరఖాస్తు చేసుకొన్నప్పటికీ, పోటీలో ఉండేదెవరనే చర్చ మొదలైంది. 46 మందిలో ఒకరిద్దరు మైనార్టీ, జనరల్ కోటా రెండింటిలోనూ దరఖాస్తు చేసుకొన్నారు. కొంతమంది దరఖాస్తు వాపసు తీసుకొనే అవకాశం ఉంది. ఓటింగ్ సమయంలో పోటీనుంచి తప్పుకొన్న వారి పేర్లు కూడా చదివివినిపిస్తామని అంటున్నారు. కాంగ్రెస్ దూరం కో ఆప్షన్ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉంది. గురువారం కరీంనగర్ కార్పొరేషన్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కా ర్పొరేటర్లు భేటీ అయ్యారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ను నమ్మి పోటీ చేయలేమని కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఎవరూ పోటీచేయడం లేదని అంజన్కుమార్ తెలి పారు. క్రాస్ ఓటింగ్కు అవకాశం తక్కువగా ఉండడం కూడా కాంగ్రెస్ వెనక్కి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది తాజా మాజీ కార్పొరేటర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. వీరు పోటీలో ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక బీజేపీ నుంచి హఫీజాబేగం, బల్బీర్సింగ్, కన్న కృష్ణ,నందకుమార్, వెంకటమ్మ పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. -
తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: వేసవిలో తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. గురువారం 48వ డివిజన్ శ్రీహరినగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షలతో చేపట్టనున్న తాగునీటి పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఇటీవలే నగరపాలక సంస్థ ఫిల్టర్బెడ్తో పాటు, బూస్టర్ పంపులు, ఇన్ టెక్వెల్ను తనిఖీ చేసినట్లు తెలిపారు. నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించామన్నారు. ఎల్ఎండీలో ప్రస్తుతం 6 టీఎంసీల నీటి సామర్థ్యం ఉందని, 10 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదలశాఖ, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా కోరామన్నారు. ప్రస్తుతం ప్రజలకు రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నామని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మూడు భూస్టర్ పంపులను రన్ చేస్తున్నామన్నారు. కార్పొరేటర్లు కర్రె పద్మ అనిల్, ఎన్నం లక్ష్మి ప్రకాశ్, బండ రమణారెడ్డి, గాజ రమ శివరాం, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బాధితులకు అండగా భరోసా కేంద్రాలు
కరీంనగర్క్రైం: లైంగిక వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సురక్షితమైన వాతావరణంలో చేయూతనందించి, వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ‘భరోసా’ కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని అడిషనల్ డీజీపీ (సీఐడీ–ఏసీబీ) చారు సిన్హా పేర్కొన్నారు. గురువారం జిల్లాలో పర్యటించారు. కొత్తపల్లిలోని భరోసా కేంద్రాన్ని సందర్శించి, సేవలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలించి, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. బాధితులకు తక్షణ న్యాయసాయం, కౌన్సెలింగ్ అందించాలన్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు పడేలా పక్కాగా ఆధారాలు సేకరించాలన్నారు. కమిషనరేట్ కేంద్రంలోని అస్త్ర కన్వెన్షన్హాల్లో నిర్వహించిన అరైవ్– అలైవ్ కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలంతో కలిసి పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అత్యంత కీలకమన్నారు. మద్యం సేవించి, సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దన్నారు. విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అడిషన ల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్జి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
కరీంనగర్ అర్బన్: వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వన్యప్రాణి సంరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల అటవీ శాఖ అధికారులు పాల్గొనగా వన్యప్రాణుల అక్రమ రవాణా నివారణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. అడవి జంతువులు, పక్షుల అక్రమ తరలింపును అరికట్టేందుకు శాఖల మధ్య సమన్వయం పెంచాలని సూచించారు. సరిహద్దు ప్రాంతాలు.. కీలక మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి, అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి బాలమణి, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. -
బాహుబలులు
బహుజనులే...సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జనాభాపరంగా బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన (ఎస్ఈఈఈ పీసీ–2024) సర్వేలో వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కులాల గణన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం గతేడాది కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో చేసిన ఎస్ఈఈఈపీసీ సర్వే ఉమ్మడి జిల్లా గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జనాభాపరంగా బీసీలు, ఎస్సీలు అగ్రభాగాన నిలిచారు. ఎస్టీ, బీసీ జనాభాలో అగ్రభాగంలో జగిత్యాల ఉంది. ఎస్సీ, ఓసీ పాపులేషన్లో అగ్రభాగాన కరీంనగర్ నిలిచింది. -
కొనసాగుతున్న ఆర్టిజన్ల సమ్మె
కొత్తపల్లి: విద్యుత్ ఉద్యోగులతో సమానంగా సర్వీ సు రూల్స్ వర్తింపజేసి సంస్థలో విలీనం చేసుకోవా లని ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఎదుట చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 9వ రోజైన గురువారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, బీఎంఎ స్ రాష్ట్ర, జిల్లా నాయకులు మద్దతు ప్రకటించారు. హన్మకొండ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రా మానికి చెందిన పెద్దాపూర్ సబ్స్టేషన్ ఆపరేటర్ బోడ కొమ్మాలు టర్మినేషన్ చేస్తారమోనన్న భయంలో హఠాన్మరణం చెందడంపై సంతాపం ప్రకటించారు. పల్లె పల్లెనా చలివేంద్రాలుకరీంనగర్ అర్బన్: వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తదనుగుణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభవృద్ధిశాఖ సంచాలకురాలు దివ్య దేవరాజన్ డీఆర్డీవోకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా 40కి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా వేడి తీవ్రత తట్టుకోలేక జనాలు తల్లడిల్లిపోతున్నారు. కాగా జిల్లాలో 318 గ్రామ పంచాయతీలుండగా అన్ని గ్రామాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. -
నగరంలో పోలీస్ బాస్
కరీంనగర్క్రైం: ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ పోలీస్శాఖ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్– అలైవ్’ భద్రత వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు డీజీపీ శివధర్రెడ్డి గురువారం కరీంనగర్ చేరుకున్నారు. డీజీపీకి సీపీ గౌస్ ఆలం ఇతర ఉన్నతాధికారు లు పుష్పగుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికా రు. శుక్రవారం నగరంలో నిర్వహించే జిల్లాస్థాయి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఉదయం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విజిలెన్స్ తనిఖీలుకరీంనగర్క్రైం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ డీజీ శిఖా గోయల్ ఆదేశాల మేరకు అధికారులు గురువారం ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీ లు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నిబంధనల ఉల్లంఘన, జీఎస్టీ ఎగవేత, పాన్కార్డుల దుర్విని యోగం వంటి అంశాలపై ఆరా తీశా రు. బాండుపేపర్ల లైసెన్సులు, ప్రభుత్వ ఆదా యానికి గండికొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై దృష్టి సారించారు. ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో లోపాలను పరిశీలించారు. కార్యాలయాల్లో అనధికా రిక వ్యక్తుల జోక్యంపై చర్యలు తీసుకుంటా మని విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. జగిత్యాల సభకు తరలిరావాలికరీంనగర్టౌన్: ఈనెల 20న జగిత్యాలలో కేసీఆర్ నాయకత్వంలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలతో పాటు, ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూ చించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నియోజవర్గ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభకు ఏ గ్రామం నుంచి ఎంత మంది తరలివస్తున్నా రు. పట్టణం నుంచి ఎంత మంది రానున్నారు. రవాణా, భోజన సదుపాయాల నిర్వహణపై చర్చించారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కమలాకర్ పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.8,050జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర నిలకడగా కొనసాగుతుంది. గురువారం మార్కెట్కు ఏడు వాహనాల్లో 75 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. గరిష్టంగా 8,050, మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.6,000కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. శుక్రవారం అమవాస్య, శని, ఆదివారాలు సాధారణ సెలవులు ఉంటాయని, సోమవారం మార్కెట్లో కొనగోళ్లు యథావిధిగా జరుగుతాయని చైర్పర్సన్ పూల్లూరి స్వప్నసదానందం, ఇన్చార్జి కార్యదర్శి రాజా తెలిపారు. సిటీలో పవర్కట్కొత్తపల్లి: విద్యుత్ పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కె.వీ. డీఎఫ్వో ఫీడర్ పరిధిలోని సవరన్ స్ట్రీట్, డీఎఫ్ఓ చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్ మాల్, సాహెత్నగర్ ప్రాంతాలతో పాటు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ.సుభాష్నగర్ ఫీడర్ పరిధిలోని సుభాస్నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
ఇంటింటికీ సురక్షిత నీరు
● ‘హర్ ఘర్ జల్ పథకం’లో గ్రామాల ఎంపికకు శ్రీకారం ● జిల్లాలో 12 గ్రామాల ఎంపికగంభీరావుపేట(సిరిసిల్ల): ఇంటింటికీ సురక్షిత నీరు అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సురక్షిత నీటితోనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయని విశ్వసిస్తున్నారు. ఈక్రమంలోనే జల్ జీవన్ మిషన్లో భాగంగా ‘హర్ ఘర్ జల్’ అనే పథకాన్ని గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా అమలు చేస్తోంది. ఆరేళ్ల క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. అన్ని గ్రామాల్లోని ఇళ్లకు పైపులైన్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించాలనేది లక్ష్యం. తొలి గ్రామం కోళ్లమద్ది జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేశారు. వందశాతం ఇళ్లకు పైపులైన్ల ద్వారా నీరందిస్తున్నారా.. లేదా పరిశీలించి ఎంపిక చేస్తారు. జిల్లాలో మొట్ట మొదటిసారిగా గంభీరావుపేట మండలం కోళ్లమద్ది గ్రామాన్ని ఎంపిక చేసి హర్ ఘర్ జల్ పథకం కింద ఎంపిక చేసినట్లు ఆర్డబ్ల్యూఎస్ డీఈ పావని చేతుల మీదుగా సర్టిఫికెట్ను సర్పంచ్ దిలీప్కుమార్కు బుధవారం అందించారు. కోళ్లమద్దిలో 292 ఇళ్లు ఉండగా.. ప్రతీ ఇంటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. కలిగే ప్రయోజనాలు శుభ్రమైన నీరు లభించడం ద్వారా జలజనిత వ్యాధులు తగ్గుతాయి. నీటిని తెచ్చే కష్టాలు తగ్గి సమయం ఆదా అవుతుంది. ఆరోగ్యంగా ఉండడం ద్వారా ఆర్థిక పురోగతి సాధిస్తారు. నీటి నిల్వలపై అవగాహన పెరుగుతుంది. నీటి సంరక్షణ, నీటి వినియోగాన్ని తగ్గించడానికి వీలవుతుంది. ఎంపికై న గ్రామాలివే..మండలం గ్రామం ముస్తాబాద్ రాంరెడ్డిపల్లి తంగళ్లపల్లి కస్బెకట్కూర్ వీర్నపల్లి అడవిపదిర ఎల్లారెడ్డిపేట బుగ్గరాజేశ్వరతండా ఇల్లంతకుంట ఆరేపల్లి బోయినపల్లి తడగొండ వేములవాడ గుర్రంవానిపల్లె వేములవాడరూరల్ చెక్కపల్లి కోనరావుపేట మర్తన్నపేట చందుర్తి అనంతపల్లి రుద్రంగి రూప్నాయక్తండా -
ఇన్సెంటివ్ ఇచ్చి రికవరీ అంటారా?
కరీంనగర్ అర్బన్: కేడీసీసీ బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన బాట పట్టారు. లాభాలు వచ్చినప్పుడు ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా ఇచ్చి తీరా వెనక్కి ఇవ్వాలనడం చరిత్రలో తొలిసారని మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కరీంనగర్లోని ప్రధాన కార్యాలయం ఎదుట భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కేడీసీసీబీ పరిధిలో 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, 71 బ్యాంకులు సేవలందిస్తున్నాయి. మొత్తం 509 మంది అధికారులు, ఉద్యోగులు విధులు నిర్వహిస్తుండగా ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ చేసే నిర్ణయాన్ని ఖండిస్తున్నారు. ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా రికవరీ ఏంటంటే పాలకవర్గాలు ఉన్న 2023–24, 2024–25 కాలంలో బ్యాంకులు ఊహించని లాభాలు గడించాయి. ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 80 రోజులు ఇన్సెంటివ్, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అటెండర్ నుంచి డీజీఎం వరకు ఉద్యోగ హోదాను బట్టి రూ.2లక్షల నుంచి రూ.8లక్షల వరకు నజరానా అందుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పాలకవర్గాలు రద్దవడంతో ఐఎండీ, ఆర్బీఐ, నాబార్డు, టెస్కాబ్ వంటి వాటితో భాగస్వామ్యమైన హైలెవల్ కమిటీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఒక్కో ఆర్థిక సంవత్సరానికి 30 రోజులే తీసుకోవచ్చని, రెండు దఫాలకు గానూ 60రోజులకు అర్హత మాత్రమేనని పేర్కొంది. అంటే ఈ లెక్కన మిగతా వంద రోజుల ఇన్సెంటివ్ వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఉద్యోగులు ఏమంటున్నారంటే బ్యాంకులు ఇన్సెంటివ్లు ఇవ్వడం సహజం కానీ ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఐటీ చెల్లించి ఏడాది దాటుతోందని వాపోతున్నారు. చెల్లించిన ఐటీని ఎవరు ఇవ్వాలి, రిటైర్మెంట్ అయిన వాళ్లు, వేరే ఉద్యోగాలకు వెళ్లినవారు ఎలా కడుతారన్నది ప్రశ్న. నిబంధనల పేరిట తమను మానసికంగా హింసిస్తున్నారని అందుకే ఆందోళన బాట పట్టామని అవేదన వ్యక్తం చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు, వినతులు, సామూహిక సెలవు హైలెవల్ కమిటీ నోటీసులపై తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తునే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బుధవారం నుంచి ఈ నెల 24వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి, భోజన విరామ సమయంలో ఆందోళన, ఈ నెల 23, 24 తేదీల్లో అధికారులకు మెమోరండం సమర్పించడం, ఈ నెల 27న డీసీసీ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, నిరసన కార్యక్రమాలు, 29న ధర్నాతో పాటు సామూహిక సెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా, మే 2న ఒక రోజు సమ్మె, నిరసన కార్యక్రమాలు తదుపరి హైలెవల్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు బ్యాంకు ఉద్యోగులు వెల్లడించారు. ఇన్సెంటివ్ ఇచ్చి రికవరీ అనడం హైలెవల్ కమిటీకి తగదు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే. ఇచ్చిన ఏడాదికి తిరిగి ఇవ్వమనడం భావ్యమా..? ఉద్యోగుల కృషి లేకుండా లాభాలు వచ్చాయా..? మానవతా ధృక్పతంతో వ్యవహరించాలే తప్పా మానసికంగా వేధించడం తగదు. – గోనె హన్మంతరావు, తెలంగాణ కోఅపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాంకు ఉద్యోగుల ఆందోళన బాట ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమాలు ఈ నెల 24 వరకు భోజన విరామంలో ఆందోళన మే 2నుంచి సమ్మె.. నిరసన -
‘సెస్’ రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్
సిరిసిల్ల: సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వివరాలతో హైకోర్టులో బుధవారం కౌంటర్ దాఖలు చేసింది. ‘సెస్’ పాలకవర్గం పదవీకాలం 20 నెలలు ఉండగానే.. ‘సెస్’ వ్యాపార లైసెన్స్ను రెన్యూవల్ చేయకుండా ఎన్పీడీసీఎల్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై ‘సెస్’ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇప్పటికే ఎన్పీడీసీఎల్ కౌంటర్ దాఖలు చేయగా.. ప్రభుత్వ న్యాయవాదులు మరో కౌంటర్ను దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణను న్యాయమూర్తి వై.రేణుక ఏప్రిల్ 20కి వాయిదా వేశారు. ఇప్పటికే జిల్లాలో ఎన్పీడీసీఎల్ పూర్తి స్థాయిలో విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తోంది. ‘సెస్’ సంస్థకు ఎండీగా పనిచేస్తూ ఎన్పీడీసీఎల్ ఎస్ఈగా మారిన బి.భిక్షపతిని ఉన్నతాధికారులు ములుగు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లా పూర్తి స్థాయి ఎస్ఈగా టి.వేణుమాధవ్ను నియమించారు. ‘సెస్’ సంస్థ ఉంటుందా.. రద్దు అవుతుందా.. అనే అంశం కోర్టు పరిధిలో ఉండగా.. అది ఎప్పుడు తేలనుందో అంతుచిక్కడం లేదు. ఏది ఏమైనా సిరిసిల్ల ‘సెస్’ సంస్థ భవిష్యత్, పాలకవర్గం ఆజమాయిషీ కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉండడం చర్చనీయాంశమైంది. విచారణ 20కి వాయిదా -
నాణ్యమైన విత్తనాలే ప్రభుత్వ లక్ష్యం
కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్లో రైతులకు విత్తన కొరత లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన విత్తనాలను సంస్థ ద్వారా అందిస్తామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో విత్తన డీలర్లు, సహకార సంఘాల సీఈవోలు, ఎఫ్పీఓలు, ఏఆర్ఎస్కే ప్రతినిధులతో చైర్మన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్వేశ్రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విత్తన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. సీడ్స్ కార్పొరేషన్ కరీంనగర్ యూనిట్ రంగపేట నుంచి నాణ్యమైన విత్తనాలను ఉమ్మడి జిల్లా రైతులకు సరఫరా చేస్తామని తెలిపారు. రైతులు పండించిన విత్తనాలనే సేకరించి, వాటిని అధునాతన ల్యాబ్ల్లో పరీక్షించి, నాణ్యత నిర్ధారణ అయిన తర్వాతే తిరిగి రైతులకు సాగు కోసం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని, ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాల్లో ప్రధానంగా బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, జేజీఎల్ 27356 రకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దొడ్డు రకాల విషయానికి వస్తే కేఎన్ఎం 118, ఎంటీయూ 1010 రకాలు నిల్వ ఉంచినట్లు తెలిపారు. డీలర్లు ఎట్టి పరిస్థితులో సంస్థ విత్తనాలు అమ్మాల్సిందేనని సూచించారు. కేవలం రాయితీపై ఇచ్చే విత్తనాల విక్రయానికే పరిమితం కాకుండా, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల విత్తనాలను విక్రయించాలని ఆదేశించారు. లైసెన్స్ ఉన్న ప్రతి డీలర్ తప్పనిసరిగా ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను తమ దుకాణాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ గ్రామాన ప్రభుత్వ విత్తనాలను రైతులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేలా ప్రత్యేక ప్రణాళిక రచిస్తున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జిల్లా సహకార అధికారి రామాంజనేయులు, సీడ్ కార్పొరేషన్ మేనేజర్ రాజీవ్ కుమార్, కరీంనగర్ ప్రాంతీయ మేనేజర్ విష్ణు వర్ధన్ రెడ్డి, జిల్లా మహిళా సమైక్య అధ్యక్షురాలు సబిత, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, విత్తన అధికారులు శ్రీకాంత్, మౌనిక, డీలర్లు, ఎఫ్పీఓ మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామ గ్రామాన విత్తన విక్రయానికి ప్రణాళిక సీడ్స్ కార్పొరేషన్ విత్తనాలనే రైతులు వాడాలి తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి ప్రభుత్వ విత్తనాల విక్రయానికి ప్రత్యేక కృషి కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా -
భర్త ప్రేమాయణం.. భార్య ఆత్మహత్య
సుల్తానాబాద్రూరల్: ఆమెను ప్రేమించాడు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాడు. కానీ, మరో యువతి మోజులోపడి భార్యను వేధించాడు.. మనస్తాపం చెందిన మండల ఆకాంక్ష(24) మంగళవా రం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై చంద్రకుమార్, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తానాపూర్ గ్రామానికి చెందిన ఆకాంక్షను సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మండల నాగరాజు మూడేళ్లక్రితం ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. నారాయణపూర్లోనే ఇద్దరూ నివాసం ఉంటున్నారు. నాగరాజు సుల్తానాబాద్లోని ఓ హోటల్లో టీ మాస్టర్ పనిచేస్తున్నాడు. మరోహోటలో పనిచేస్తున్న ఓ యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. తర చూ చాటింగ్ చేయడం, ఫోన్ లో మాట్లాడటం చేస్తున్నాడు. ఈవిషయం భార్య ఆకాంక్షకు ఆర్నెల్ల క్రితం తెలిసి భర్తను నిలదీసింది. అప్పటి నుంచి నాగరాజు భార్యను వేధిస్తున్నాడు. సుల్తానాపూర్లోని తన అత్తగాంటి వద్ద ఓ దైవ కార్యక్రమానికి నాగరాజు తల్లిదండ్రులతో కలిసి వెళ్లాడు. అక్కడ భార్యతో గొడవపెట్టుకొన్నాడు. భార్యను ద్విచక్ర వాహనంపై తీసుకుని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే ‘నువ్వు చస్తే చావు’ అని బెదిరించాడు. ఇంటికి చేరుకున్నాక పనిపై భర్త బయటకు వెళ్లాడు. ఈక్రమంలోనే తీవ్రంగా మనస్తాపం చెందిన ఆకాంక్ష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఓ యువతిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు ఇదేమిటని ప్రశ్నించిన భార్యను వేధించాడు మనస్తాపం చెంది వివాహిత ఆత్మహత్య -
ఇంటి పైనుంచి పడి యువకుడు మృతి
రాయికల్: మండలంలోని కట్కాపూర్కు చెందిన కని కుట్ల నాగరాజు (27) మద్యం మత్తులో ఇంటిపైనుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. నాగరాజు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇంటి పైనుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు పేర్కొన్నారు. నాగరాజు తల్లి గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందుతూ బాలుడు మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): కుక్క వెంటబడడంతో కిందపడి తలకు గాయాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన సంగీత, మహేశ్ దంపతులకు కొడుకు ఇటికాల ఆదిత్య(8). గత 18 రోజుల క్రితం ఇంటి వద్ద ఆడుకుంటుండగా కుక్క వెంటపడింది. భయంతో పరుగెత్తిన బాలుడు కిందపడడంతో తలకు గాయమై రక్తం గడ్డకట్టింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. చెరువులో పడి వృద్ధుడు..కరీంనగర్: ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధుడు మృతి చెందిన సంఘటన వెల్గటూర్ మండలం ముక్కట్రావుపేటలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన అంకతి పెద్ద కోటయ్య (65) ఎప్పటిలాగే ఇంటినుంచి పశువులు మేపడానికి వెళ్లాడు. పశువులు చెరువులోకి వెళ్లగా.. వాటిని బయటకు రప్పించేందుకు పెద్ద కోటయ్య నీటిలో దిగాడు. ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఉదయ్కుమార్ శవాన్ని చెరువులోంచి బయటకు తీయించారు. కోటయ్య కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పోక్సో కేసులో యువకుడి రిమాండ్రాయికల్: మండలంలోని ధర్మాజీపేటకు చెందిన మధును పోక్సో కేసులో బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. తాట్లవాయి గ్రామానికి చెందిన ఓ బాలికపై అత్యాచారం విషయంలో మధును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. -
సీబీఎస్ఈలో అల్ఫోర్స్ విద్యార్థుల సంచలనం
కొత్తపల్లి(కరీంనగర్): సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్లోని అల్ఫోర్స్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలన మార్కులు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. స్థానిక అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించారు. 103 మంది విద్యార్థులు 500 మార్కులకు 450 సాధించి జిల్లా స్థాయిలో చరిత్ర సృష్టించారని తెలిపారు. సానీక 494 మార్కులు, ఆదిత్య 492, ఎం.శ్రీహిత, ఏ.హర్ష, ఏ.శ్రీనిత 490, కే.ఓంకార్తికేయ, కె.అస్మిత, కే.అభిజ్ఞ 488, ఏ.స్వరవిస్తృతి 487, ఎం.శ్రీగౌరీ 486, కె.వర్దిని 485, ఉదయశ్రీ, వి.అభిరామ్ 484, కే.మోక్స్, జి.సాయి సుశేన్, ఈ.ప్రమేష్ రెడ్డి 483 మార్కులు సాధించడం హర్షణీయమన్నారు. పలువురు విద్యార్థులు వివిధ సబ్జెక్టులలో వందశాతం మార్కులు సాధించడం సంతోషకరమన్నారు. విద్యార్థులకు చక్కటి ప్రణాళిక, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో బోధన అందిస్తూ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో రాణించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
పారమిత విద్యార్థుల ప్రభంజనం
కరీంనగర్ టౌన్: సీబీఎస్ఈ పదోతరగతి ఫలితాల్లో కరీంనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. 500కు 492 మార్కులతో చెన్న శ్రీశాంత్ జిల్లాలో మొదటిస్థానం సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.గోపికృష్ణ తెలిపారు. మొత్తం 347 మంది 100శాతం ఉత్తీర్ణతతో అద్భుత ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఎం. శ్రీవర్షిణి 487, కె.అగస్త్య 486, ఎం.పంజ్వాని 485, గంప సహస్త్ర 485, ఎం.రాహుల్ 485, సీహెచ్. వెంకట మోక్షిత్ 485, దియా బుల్డాక్ 483, ఎం.సాయిఅక్షర 481, ఎండీ. అబ్దుల్ అరహాన్ లతీఫ్ 481, పి.రిధి 480 మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను పారమిత పాఠశాలల అధినేత డా. ఇ. ప్రసాద రావు ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, వినోదరావు, రశ్మిత, రాకేష్, వి.యూ.ఎం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయులు పి.గోపికృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు, రాము పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
● ఎంబీ రికార్డుకు రూ.50 వేలు లంచం డిమాండ్ ● డబ్బులు తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేతహుజూరాబాద్: హుజూరాబాద్ మున్సిపల్ ఏఈ నుసుం సుధాకర్రెడ్డి.. కనీసం ప్రొబేషనరీ కూడా పూర్తికాలేదు. అప్పుడే రూ.50వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబ డ్డాడు. బాధితుడు, ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. హుజూరాబాద్లోని వరంగల్ రోడ్ వైపు రూ.15లక్షలతో డ్రైనేజీ పనులను కాంట్రాక్టర్ సంతోష్ చేపడుతున్నాడు. మొదటి బిల్లు కింద రూ.4లక్షల వచ్చాయి. మరో రూ.14లక్షల బిల్లుకు ఎంబీ రికార్డు చేయాల్సి ఉంది. దీనికి ఏఈ సుధాకర్రెడ్డిని సంప్రదించగా రూ.50వేలు లంచం డిమాండ్ చేశా డు. అంత మొత్తం ఇచ్చుకోలేమని కాంట్రాక్టర్ చెప్పినా ససేమిరా అన్నాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేర కు బుధవారం రూ.50వేలు ఇస్తానని సుధాకర్రెడ్డికి చెప్పగా.. వరంగల్ రోడ్లోని ఓ మటన్ షాపు వెనుక తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం.. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సుధాకర్రెడ్డిని డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణ చేపట్ట గా నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ సీఐ చందర్ తెలిపారు. అనంతరం మున్సిపల్ కా ర్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఇందులో అనేక విషయాలు బయటపడినట్లు సమాచారం. నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ విజయ్కుమార్ తెలిపారు. అధికారులెవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 1064 టోల్ ఫ్రీ నంబర్లోనైనా.. లేదా 9440446106 నంబర్కు వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. -
మైలురాయిని ఢీకొని వ్యక్తి మృతి
ఇల్లంతకుంట(మానకొండూర్): స్నేహితుని పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి తన స్వగ్రామానికి వ స్తుండగా రోడ్డుపక్కన ఉన్న మైలురాయిని ఢీకొ ని వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లకు చెందిన వర్కోలు రామకృష్ణ(కోటి) (28) తన స్నేహితుని పెళ్లికి బైక్పై రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లికి బుధవారం వచ్చాడు. రిసెప్షన్ వేడుకలు ముగిసిన తర్వాత సాయంత్రం తన బైక్పై ఇంటికి వెళ్తుండగా గాలిపెల్లి సమీపంలోని రోడ్డు పక్కగ గల మైలురాయిని ఢీకొని ఎగిరిపడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకొని యువకుడు మరణించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు, భార్య లాస్య సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. రామకృష్ణకు ఐదేళ్ల క్రితమే వివా హమైంది. హెల్మెట్ పెట్టుకుని ఉంటే బతికేవా డని స్థానికులు తెలిపారు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మృతుని స్వగ్రామం పారువెల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలో లేగదూడపై మంగళవారం రాత్రి చిరుత దాడిచేసి హతమార్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. పోతిరెడ్డిపల్లెకు చెందిన సదుల పూర్ణ గ్రామ శివారు ప్రాంతంలో నివసిస్తుంది. రాత్రి వారి గుడిసెల వద్ద గేదె, దూడను కట్టేయగా, తెల్లవారుజామున లేచి చూసేసరికి చిరుతదాడిలో చనిపోయి ఉంది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. చిరుత సంచారంతో రాత్రిపూట వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి రైతులు జంకుతున్నారు. రైతులు రాత్రిపూట పోలాల వద్దకు కర్రలతో గుంపులుగా వెళ్లాలని ఒంటరిగా వెళ్లవద్దని అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి మోహన్లాల్ కోరారు. -
రహదారి నియమాలు పాటించాలి
కరీంనగర్ సిటీ: రహదారి భద్రత నియమాలు పాటించాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ సూచించారు. ఎస్యూలోని అంబేడ్కర్ లైబ్రరీ ఆడిటోరియంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రహదారి భద్రత వారో త్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ రైన వీసీ ఉమేశ్ కుమార్ మాట్లాడుతూ యువ త జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ వీడాలని, సీట్బెల్ట్ ధరించాలన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహన్ సునీల్ మాట్లాడుతూ సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం మత్తులో డ్రైవింగ్ చేయవద్దన్నారు. సీఐ కోటేశ్వర్, వీసీ ఓఎస్డీ హరికాంత్, పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్ కుమార్ పాల్గొన్నారు. ఆదాయ వనరులు పెంచుకోవాలి కరీంనగర్ కార్పొరేషన్: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సొంత ఆదాయవనరులు పెంచుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ సూచించారు. బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ నగరపాలకసంస్థ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణుమాధవ్, ఎస్ఈ రాజ్కుమార్, ఇతర అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. పట్టణ సదుపాయాలను మెరుగు పరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అర్బన్ చాలెంజ్ ఫండ్ పథకంపై మంత్రి వివరించారు. పట్టణాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా మున్సిపల్శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ డిపోల పనితీరుపై ఆర్ఎం సమీక్ష విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలోని డిపో మేనేజర్లతో బుధవా రం బస్స్టేషన్లో ఆర్ఎం బి.రాజు సమీక్ష నిర్వహించారు. 2025–26 మార్చి మాసాంతం వరకు ఆపరేషన్స్, మెయింటెనెన్స్ విభాగాల్లో రీజియన్లోని అన్ని డిపోల పనితీరు, ఆర్థిక పరిస్థితిపై ఆరా తీశారు. వేసవికాలం నేపథ్యంలో అన్ని బస్స్టేషన్లలో తాగునీరు ఏర్పాటు చేయాలన్నారు. డిప్యూటీ ఆర్ఎంలు ఎస్,భూపతిరెడ్డి, పి.మల్లేశం, డిపోమేనేజర్లు విజయమాధురి, ఎం,శ్రీనివాస్, ఎన్.నాగభూషణం, ఎన్,వెంకన్న, వి.రవీంద్రనాథ్, వి.శ్రవణ్కుమార్, ఎన్.మనోహర్, సరస్వతి, బి,శ్రీనివాస్, పర్సనల్ ఆఫీసర్ ఎం.సంపత్కుమార్, ట్రాఫిక్ అసిస్టెంట్ మేనేజర్ బి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్సారార్లో ‘దోస్త్’ హెల్ప్లైన్ సెంటర్ కరీంనగర్ సిటీ: దోస్త్ ఆన్లైన్ అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలను పరి ష్కరించేందుకు కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ను బుధవారం ప్రారంభించారు. దోస్త్ కో– ఆర్డినేటర్, ప్రిన్సి పాల్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు దోస్త్ ఆన్లైన్ ద్వారా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల (7172)ను ఎంచుకోవాలని సూచించారు. ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులొస్తే ఎస్సారార్ కళాశాలలోని దోస్త్ డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలన్నారు. వైస్ ప్రి న్సిపాల్స్ పి.నితిన్, టి.రాజయ్య, టీజీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేందర్రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టి.శ్రీనివాస్ పాల్గొన్నారు. మహిళా కాలేజీలో ఉచిత రిజిస్ట్రేషన్లు నగరంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉచితంగా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసి, వెబ్ ఆప్షన్స్ పెడతామని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి తెలిపారు. కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని, విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వడగాలులు.. ఉక్కపోత
మానేరు వెలవెలగురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్/గోదావరిఖని: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనూ ఈనెల 16 నుంచి 22వరకు హీట్వేవ్స్ (వడగాలులు) కొనసాగుతాయని వాతా వరణశాఖ (ఐఎండీ) తెలిపింది. మొన్నటిదాకా 30 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలు 12వ తేదీ నుంచి 35 డిగ్రీలపైగా నమోదవడం మొదలైంది. వేసవి మొదలయ్యాక ఈ స్థాయిలో ఎండలు ముదరడం ఇదే తొలిసారి. 40 డిగ్రీలకుపైగా ఎండలు దంచుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగిలే ప్రమాదముందని ఐఎండీ హెచ్చరించింది. 16 నుంచి 22 తేదీ వరకు రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వెల్లడించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయట సంచారాన్ని వీలైనంత తగ్గించుకోవాలని సూచించింది. శిశువులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు మధ్యాహ్నం తరువాత అసలు బయటికి రాకూడదు. బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కూలీలు, వ్యవసాయం చేసేవారు, ట్రాఫిక్ పోలీసులు, సింగరేణి ఓపెన్కాస్టు ఉద్యోగులు అంతా అప్రమత్తంగా ఉండాలి.మండుతున్న కోల్బెల్ట్ రామగుండంలో సింగరేణి ఓసీపీలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రతకు కార్మికులు ఆగమాగమవుతున్నారు. రెండోషిఫ్టు కార్మికులు విధులకు గైర్హాజర్ క్రమంగా పెరుగుతోంది. ఒకరోజు డ్యూటీకి వస్తే రెండోరోజు జంకుతున్నారు. గతంలో మే నెలలో ఎండవేడి అధికంగా ఉండేది. ఈసారి ఏప్రి ల్ రెండోవారం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. మిగతా ప్రాంతాలతో పోల్చితే క్వారీల్లో కనీసం 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం క్వారీల్లో సుమారు 45డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మేలో ఓసీపీల్లో డ్యూటీలు చేయడం, భూగర్భగనుల్లోకి వెళ్లడం, మండుటెండలో ఇళ్లకు రావడం కష్టంగా ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో ఉదయం షిఫ్టు మధ్యాహ్నం 1గంట వరకు, రెండో షిఫ్టు సాయత్రం 4 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు కొనసాగించాలనే డిమాండ్ ఓసీపీ కార్మికుల నుంచి వస్తోంది. ఎండవేడిలో పనిచేసే కార్మికులకు చలవపందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. రెస్ట్హాళ్లు, క్యాంటీన్లు, ఆఫీస్ కార్యాలయాల్లో కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రంజన్ల ద్వారా చల్లటినీటిని అందిస్తున్నారు. షిఫ్టు కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను యాజమాన్యం అందిస్తోంది. -
నారీశక్తితో నవ భారతం
ర్యాలీ తీస్తున్న మహిళా మోర్చా నాయకులుకరీంనగర్: దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ, నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు అపురూప కానుక అందించి మోడీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తోందని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. నేడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్టీ మహిళా మోర్చా జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి మార్క్ఫెడ్ వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కొలగాని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత, ప్రభావతి, గాజ రమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి పాల్గొన్నారు. -
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
కరీంనగర్ కార్పొరేషన్: రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మేయర్ కొలగాని శ్రీనివాస్ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, ఐదుశాతం రాయితీ స్కీం, పన్నుల వసూళ్లు, మ్యూటేషన్లు, రివిజన్ పిటిషన్లు, అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్లపై ఫిర్యాదులు, పరిష్కారం, డబుల్ ఇంటి నంబర్ల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. డబుల్ ఇంటి నంబర్ల సమస్యను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ టాక్స్ వస్తున్న అసెస్మెంట్లను తనిఖీ చేసి వాటి హెచ్చు తగ్గులు సరిచేయాలన్నారు. రెవెన్యూ అధికారుల తీరు సరిగా లేదని ప్రజల నుండి చాలా ఫిర్యాదులు వచ్చాయని, పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఐదు శాతం రాయితీపై ప్రజలకు అవగాహన కల్పించి పన్ను వసూళ్లను పెంచాలని, పదిహేను రోజుల్లో లక్ష్యం చేరుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దీన్, వేణు మాధవ్ పాల్గొన్నారు. -
జిల్లాను రోల్ మోడల్గా నిలపండి
కరీంనగర్ అర్బన్: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ఈ నెల16న మండలస్థాయిలో జరిగే సమావేశాల నేపథ్యంలో బుధవారం జిల్లాస్థాయి అధికారులతో పాటు ఎంపీడీవోలు, ఎంఈఓలు, ఎంపీవోలతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు. రైతు భరోసా, రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, మహిళలకు రుణాలు, కార్పొరేషన్ల ద్వారా అందించిన రుణాలు, మహాలక్ష్మి పథకం, సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలపై ప్రత్యేకంగా వివరించాలన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రోడ్డు భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములుగా చేయాలని, ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీవో జగదీశ్వర్, ఇన్చార్జి సీపీవో రామ్ దత్తారెడ్డి, డీఎంహెచ్వో వెంకటరమణ, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, డీఎస్ వో నర్సింగరావు, డీఆర్డీవో శ్రీధర్, సంక్షేమ అధికా రి సరస్వతి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నారీ.. మోగాలి విజయభేరి
● నారీ శక్తి వందన్ అదినియమ్పై మహిళామణుల హర్షం విద్యానగర్(కరీంనగర్): లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33శాతం సీట్ల రిజర్వేషన్ కోసం 2023లో నారీశక్తి వందన్ అదినియమ్ (మహిళా రిజర్వేషన్ బిల్లు 2023) బిల్లు తీసుకురాగా ఈ బిల్లును ఉభయ సభలతో పాటు, రాష్ట్రపతి అమోదించారు. బిల్లు రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత అమల్లోకి రానున్నది. 2029 లోక్సభ, శాసనసభల ఎన్నికలను మహిళా రిజర్వేషన్లతో నిర్వహించడానికి మహిళా రిజర్వేషన్ల చట్టంతో ముడిపడిన సవరణ బిల్లుపై ఈనెల 16 నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానున్న నేపథ్యంలో బిల్లుపై పలువురు నారీమణుల అభిప్రాయాలు. దేశ జనాభాల్లో సగం ఉన్న మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ అన్న అంశం దశాబ్దాల కాలం నుంచి చర్చలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం 33శాతం మహిళ రిజర్వేషన్ చట్టం వచ్చినప్పటికి అమలులోకి రావడానికి సవరణ చట్టాన్ని తీసుకురావడంతో మహిళల రాజకీయ భాగస్వామ్యం పెరుగుతుంది. – బొమ్మ జయశ్రీ, ప్రకృతి పర్యావరణ సంస్థ, కరీంనగర్ -
ఇందిరమ్మకు దళితబంధు బ్రేక్
కరీంనగర్రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలోని నిబంధనలు నిరుపేదలకు శాపంగా మారాయి. స్వయం ఉపాధికోసం కొనుగోలు చేసిన కారు, జేసీబీ, ఫోర్ వీలర్లు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు అడ్డంకిగా మారాయి. కుటుంబానికి కారు ఉందనే కారణంతో లబ్ధిదారులకు మంజూరైన ఇళ్లను అధికారులు రద్దు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశామని గృహనిర్మాణ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు ఉన్నవారికి మంజూరైన ఇండ్లను హోల్డ్లో పెట్టినట్లు వివరించారు. దళితబంధు లబ్ధిదారులకు ఇళ్లు లేవు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళితబంధు పథకం అమలు చేసింది. కరీంనగర్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా తాహెర్కొండాపూర్, నల్లగుంటపల్లి గ్రామాలను ఎంపిక చేశారు. తాహెర్కొండాపూర్లో 29, నల్లగుంటపల్లిలో 37 యూనిట్లు మంజూరు చేసి, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. లబ్ధిదారులు స్వయం ఉపాధి కోసం కార్లు, జేసీబీలు, ట్రాక్టర్లు తదితర వాహనాలు కొనుగోలు చేశారు. ప్రస్తుతం కొందరు లబ్ధిదారులు వాహనాలను విక్రయించగా, మరికొందరు వాటితో జీవనోపాధి పొందుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది నుంచి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కోసం రెండు గ్రామాల్లోని దళితులు ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించిన అధికారులు కుటుంబాల పేరిట కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలుండటంతో మంజూరైన ఇళ్లను రద్దు చేశారు. దళితబంధు పథకంలో జీవనోపాధి కోసం వాహనాలు కొనుగోలు చేశామని, ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్తోపాటు పలువురు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయింది. శిఽథిలావస్థకు చేరి, కూలిపోయిన ఇండ్లల్లో నివాసముంటున్నామని, ప్రభుత్వం నిబంధనలను సడలించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టాలని దళితబంధు లబ్ధిదారులు కోరుతున్నారు. -
ఆగుతూ.. సాగుతూ..
● ఆలస్యమవుతున్న అమృత్భారత్ పనులు ● పెద్దపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో పెరగని వేగం ● ఇప్పుడిప్పుడే మొదలవుతున్న లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ను అన్నివిధాలా అభివృద్ధి చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్భారత్ పథకం అమలు చేస్తోంది. కానీ, పనుల్లో వేగం లేక ఆగుతూ.. సాగుతున్నాయి. పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణించాలనుకునే వారికి కష్టాలు తప్పడం లేదు. తాత్కాలిక షెడ్డులోనే టికెట్ కౌంటర్ తాత్కాలిక షెడ్డులో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. పనుల్లో వేగం పెంచాలని డీఆర్యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ స్థానిక నాయకులతో కలిసి రైల్వేశాఖకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్తున్నా వేగం పుంజుకోవడం లేదు. రైల్వేస్టేషన్ ముఖద్వారం నిర్మాణం పురోగతిలో ఉంది. లిఫ్ట్ పనులు ఇప్పుడే మొదలవుతున్నాయి. ఎస్కలేటర్ నిర్మాణం ప్రారంభించాల్సి ఉంది. పురోగతిలో భారీషెడ్డు పెద్దపల్లి ప్రాంతంలోని గిడ్డంగుల్లో నిల్వకోసం, ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు బియ్యం, ఇతర సామగ్రి తరలించే సమయంలో ఎండ, వానలతో ఇబ్బంది లేకుండా భారీ షెడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిపనులు పురోగతిలో ఉన్నాయి. భారీషెడ్ రైల్వేస్టేషన్కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోందని పలువురు పేర్కొంటున్నారు. అనుకూలంగా పెద్దపల్లి జిల్లా ప్రజానీకంతోపాటు పొరుగు జిల్లాలనుంచి బస్సు రూట్లలో వచ్చి రైళ్లలో ప్రయాణించే వారికి పెద్దపల్లి రైల్వేస్టేషన్ ఎంతో అనువుగా ఉంది. రైల్వేస్టేషన్కు సమీపంలోనే బస్స్టేషన్ ఉండడంతో ప్రయాణికులు రైలు ప్రయాణంవైపే మొగ్గు చూపుతున్నారు. పెద్దపల్లి–కరీంనగర్ మార్గం ద్వారా దూర, సుదూర ప్రాంతాలకు నడిచే రైళ్లకోసం బైపాస్ మార్గం అందుబాటులోకి రానుండడం, పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు అవసరమైన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించే అవకాశాలున్నాయి. పెద్దపల్లి ప్రాంతంలో రైల్వే శాఖ చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పెద్దపల్లి–కూనారం రైలువంతెన పనులు ఏళ్లకేళ్లుగా సాగుతుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయాన్ని రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లా. వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రయాణికులు, ప్రజల ఇబ్బందులను దూరం చేయాలి. – నారాయణ్దాస్ తివారీ, డీఆర్యూసీసీ సభ్యుడు, పెద్దపల్లి -
అటు చెట్లు.. ఇటు గుంతలు
మంథని: ఆర్ అండ్ బీ అధికారుల అలసత్వంతో పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాన రహదారులపై ప్రమాదకర గుంతలను పూడ్చటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అంతేగాకుండా దారివెంట ఉన్న ప్రమాదకర చెట్లను తొలగించడంలోనూ అదేధోరణి అవలంబిస్తున్నారు. ఇందుకు పెద్దపల్లి జిల్లా మంథని–గోదావరిఖని రహదారిలోని మల్లేపల్లి శివారులో భారీ గుంత ఏర్పడి రోజులు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దారి మధ్యలో చాలాచోట్ల గుంతలు ఉన్నా పూడ్చకుండా నిర్లక్ష్యం వహించడం వాహనదారుల్లో ఆగ్రహం తెప్పిస్తోంది. మల్లేపల్లి శివారులో ఏర్పడిన గుంతను గతంలో మంథని పోలీసులు మొరం పోయించి పూడ్చివేయించారు. ఈ మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. దీంతో కొద్దిరోజులకే గుంత మళ్లీ పెద్దగా ఏర్పడింది. చాలా రోజులుగా దారి మధ్యలో గుంత ఉంటున్నా అధికారులు పూడ్చడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు దారి మధ్యలోని గుంత వాహనదారులకు దగ్గరగా వచ్చేవరకూ కనిపించడం లేదు. రాత్రివేళలో గుంతలోపడి అనేక వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. గుంతలో పడిన వాహనాలు దెబ్బతింటున్నాయి. దారి వెంట వచ్చే వాహనదారులు ఆదమరిస్తే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిత్యం వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే గోదావరిఖని–మంథని– కాటారం దారిలో పెద్దగుంతలు ఏర్పడుతున్నా సంబంధిత శాఖ పూడ్చడంతో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ప్రమాదకరంగా చెట్లు.. పెద్దపల్లి జిల్లాలోని అనేక రహదారులపై ప్రమాదకరంగా చెట్లు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కాటారం ప్రధాన రహదారిలో అడవిసోమన్పల్లిలో సమీపంలో రోడ్డుపై ఎండిపోయిన భారీ చెట్లు ప్రమదకరంగా ఉన్నాయి. చాలారోజులుగా ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహారిస్తున్నారు. ఏక్షణంలోనైనా చెట్లు పడిపోయే పరిస్థితి ఉంది. ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకోని అధికారుల తీరుపై వాహనదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముత్తారం దారిలో సైతం చెట్టు ప్రమాదకర స్థితిలో చాలారోజుల నుంచి ఉన్నా తొలగించడం లేదు. ఇలా చాలాచోట్ల చెట్లు రోడ్డుపై ప్రమాదకంగా ఉన్నాయి. అధికారులు ఇప్పటికై నా స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు. అడవిసోమన్పల్లి శివారులో ప్రమాదకరంగా ఉన్న చెట్టు గోదావరిఖని – మంఽథని మధ్య పెద్దగుంత ప్రమాదకరంగా రహదారులు పట్టించుకోని ఆర్అండ్బీ అధికారులు -
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
రామడుగు: కరీంనగర్కు చెందిన ఓ వృద్ధురాలు రామడుగు మండలం వెదిర శివారులో ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాల ప్రకారం కరీంనగర్కు చెందిన కానసగొట్టు భారతి(75) కరీంనగర్ నుంచి ఆటోలో వచ్చింది. రామడుగు మండలం వెదిర శివారులో దిగింది. తన వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒంటిపై పోసుకుని నిప్పటించుకుంది. రోడ్డు వెంట వెళ్తున్నవారు గమనించి మంటలు ఆర్పివేశారు. వెదిర సర్పంచ్ శనిగరపు అంజన్కుమార్, ఎస్సై కె.రాజు ఆటోలో కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సమస్యతోనే ఆత్మహత్యకు యత్నించిందని, పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఎస్సై వివరించారు. -
ఆర్ఎఫ్సీఎల్లో 8.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి
ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ఎరువులు రసాయనాల శాఖ 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించింది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 01 ఏప్రిల్ 2025 నుంచి 31 మార్చి 2026 వరకు 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. ఇక్కడి యూరియా తెలంగాణతోపాటు 7 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. లక్ష్యానికి దూరంగా.. కర్మాగారంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సాధించాల్సి ఉండగా 8,57,237.85 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. కర్మాగారంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో తక్కువగా ఉత్పత్తి చేశారు. దీనితో ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. యుద్ధంతో గ్యాస్ కోత.. మరింత తగ్గిన ఉత్పత్తి పశ్చిమాసియాలో యుద్ధంతో గ్యాస్ సరఫరా తగ్గింది. కర్మాగారంలో 45 శాతం మేర యూరియా ఉత్పత్తి చేస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో సుమారు 78 రోజులపాటు కర్మాగారంలో వార్షిక మరమ్మతులు, సాంకేతిక సమస్యలతో షట్డౌన్ చేశారు. దీంతో కర్మాగారంపై ఆర్థిక భారం పడింది. సుమారు రూ.200 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కర్మాగారంలోని హెచ్టీఆర్ మరమ్మతులు చేసేందుకు తరలించారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్యాస్ కొరత, సాంకేతిక సమస్యలు అధిగమించి పూర్తిస్థాయిలో ఉత్పత్తి సాధించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. వార్షిక మరమ్మతులతో తగ్గిన ఉత్పత్తి 2025–26లో యూరియా కేటాయింపు(మెట్రిక్ టన్నుల్లో) రాష్ట్రం కేటాయింపులు తెలంగాణ 381318.30 ఆంధ్రప్రదేశ్ 182146.86 కర్ణాటక 150629.76 మహారాష్ట్ర 27724.23 ఛత్తీస్గఢ్ 19196.82 తమిళనాడు 66843 మధ్యప్రదేశ్ 29378.88


