Karimnagar
-
మధుర జ్ఞాపకాల బాల్యం
ఎక్కడ చూసినా అదే ఎవరి చేతిలోనైన అదే ఏది చేసిన అదే మంచి చెడుకు అదే విచ్చలవిడిగా అదే ఎవరి చేతిలోనైనా అదే అదే ఓ ప్రపంచంగా మారిపోయింది అది లేని మనుజుడు లేడు అది లేని ఇల్లు లేదు ఏమి చేయాలన్న దానితోనే కష్ట సుఖాలు దానితోటి పిల్లల చేతుల్లో అదే పెద్దల వద్ద అదే భోజనం చేసేటప్పుడు అదే నిద్రించేటప్పుడు అదే పసిపిల్లలను లాలిస్తుంది పిల్లలు ఏడిస్తే అదిస్తే బుజ్జగిస్తుంది పెద్దలకి లోకం అదే చిన్నలకు అమ్మ అదే దానితోనీ ఉపయోగం కన్న అది చేసే కీడే ఎక్కువ దానితో అనారోగ్యం వస్తుంది అదే అందరికీ మంచి స్నేహం అది లేకుంటే ఏడుస్తారు పిల్లలు దానితో వస్తుంది కళ్ల రోగం అది లేకుంటే పడుకోరు అది లేకుంటే తినరు పిల్లలు. అందరితో మాట్లాడాలన్న అదే ఎవరిని కలవాలన్న అదే అది లేకుంటే పరువుపోతుందని ముసలి వాళ్లు కూడా కొంటున్నారు నియంత్రించాలి ఈ చరవాణి వినియోగం తగ్గించాలి ఈ సెల్ఫోన్ ప్రపంచంఎన్.శ్రీకర్ ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
అడవి పల్లెలో ఆటల వేడుక
● సమ్మర్ క్యాంపులతో వీర్నపల్లికి నూతనోత్సాహం ● ఫోన్లకు దూరంగా.. మైదానంలో చిరుతల్లా.. ● శిబిరంలో ఉత్సాహంగా చిన్నారులువీర్నపల్లి పాఠశాలలో సమ్మర్ క్యాంపులో విద్యార్థులువీర్నపల్లి(సిరిసిల్ల): కల్లోలిత ప్రాంతంగా ముద్రపడ్డ రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పుడు పోలీసుల బూట్లచప్పుళ్లు.. నక్సలైట్ల పాటలతో మారుమోగిన అటవీ పల్లెల్లో క్రీడా కుసుమాలు విరబూస్తున్నాయి. వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘క్రికెట్ సమ్మర్ క్యాంపు’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సెల్ఫోన్లకే పరిమితమవుతున్న నేటితరం పిల్లలకు ఆటపాటల ద్వారా ఉజ్వల భవిష్యత్ను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది.ఆరోగ్యమే మహాభాగ్యంఆటలను అలవాటు చేస్తున్నాంక్రికెట్ అంటే ఇష్టం మెలకువలు నేర్పిస్తున్న సీనియర్లు ఈ శిక్షణ శిబిరంలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు ముగ్గురు కోచ్లను ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. గత నెల రోజులుగా పిల్లలకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో మెలకువలు నేర్పిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ శిక్షణ ఇస్తున్నారు. క్రీడల్లో నైపుణ్యం పెంచడంతోపాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలను నూరిపోస్తున్నారు. క్రీడలే కాకుండా మత్తు పదార్థాలైన మద్యపానం, ధూమపానం, డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోచ్లు, సర్పంచ్ జ్యోత్స్న పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.ఫోన్లకు బ్రేక్.. గ్రౌండ్లో జోష్ వేసవి సెలవులొచ్చాయంటే చాలు.. పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు బానిసవుతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని స్థానిక మేధావులు, పాలకవర్గం నిర్ణయానికొచ్చింది. సెలవుల్లో పిల్లలను ఫోన్ల నుంచి గ్రౌండ్ వైపు మళ్లించాలని సంకల్పించారు. ఇటీవల పలు చోట్ల పిల్లలు ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు వారిని కదిలించాయి. దీంతో పిల్లలకు రక్షణతో కూడిన ఉల్లాసాన్ని అందించేలా ఈ సమ్మర్ క్యాంపును ప్రారంభించారు. -
బాధను దిగమింగి వెలుగులు పంచారు
కోల్సిటీ(రామగుండం): ఇంటిపెద్దను కోల్పోవడం ఆ కుటంబానికి తీరని విషాదమే. అలాంటి సమయంలో సాధారణంగా ఎవరూ ఆలోచించలేని నిర్ణయాన్ని ఆ మూడు కుటుంబాలు తీసుకున్నాయి. తమ బాధను దిగమింగుకుని మరొకరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేత్రదానానికి అంగీకరించాయి. ఫలితంగా ముగ్గురి కార్నియాలు ఆరుగురికి చూపు ప్రసాదించే అవకాశాన్ని కల్పించాయి. ‘మనవారు లేరు... కానీ వారి కళ్లతో ఇంకొందరు ఈ ప్రపంచాన్ని చూడాలి’ అనే ఆలోచనతో వారు చేసిన నేత్రదానం మానవత్వానికి అద్దం పడుతోంది. వివరాల్లోలు.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సంతోష్నగర్కు చెందిన ఎ.రాయమల్లు(55), ఎల్బీనగర్కు చెందిన ఎం.రవీందర్(45), రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన పి.సారయ్యగౌడ్(55) వేర్వేరు కారణాలతో వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఆ మూడు కుటుంబాలు దుఃఖంలో మునిగిపోయాయి. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు, ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ సిబ్బంది వారిని కలిసి నేత్రదానం ప్రాధాన్యాన్ని వివరించారు. వారు గొప్ప మనసుతో మృతుల నేత్రాలను దానం చేయడానికి అంగీకరించారు. మృతుల కార్నియాలు సేకరించిన ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సకాలంలో హైదరాబాద్కు తరలించారు. సర్పంచ్ కొండ మంజుల – శ్రీనివాస్, సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, కార్యదర్శి లింగమూర్తి, ప్రతినిధులు సానా రామకష్ణారెడ్డి, నూక రమేశ్, మారెల్లి రాజిరెడ్డి, లగిశెట్టి చంద్రమౌళి, నల్లవెల్లి శంకర్, కేఎస్ వాసు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఎల్లప్ప, సారయ్య, రాజేంద్రకుమార్, కజాంపురం రాజేందర్, పి.మల్లికార్జున్, ప్రమోద్కుమార్రెడ్డి తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను తీవ్రంగా కలిచివేస్తాయని వారు వివరించారు. కౌలు రైతు ఆత్మహత్య యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామానికి చెందిన కౌలురైతు పొన్నం సారయ్యగౌడ్(55) శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సారయ్యగౌడ్ తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమితోపాటు రైతుల నుంచి మూడేకరాలు కౌలుకు తీసుకొన్నాడు. పెట్టుబడి కోసం దాదాపు రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు పండకపోవడం, అప్పులు తీర్చేదారిలేకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు పొన్నం కిశోర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు అడిషనల్ సీఐ లింగమూర్తి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. కౌలురైతు కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ కొండ మంజుల, గ్రామస్తులు కోరారు. రవీందర్(ఫైల్) రాయమల్లు(ఫైల్) ఒకేరోజు ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు నేత్రాలు దానం చేసిన కుటుంబాలు -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
ఏసీబీకి చిక్కిన సర్వేయర్
సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల స ర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. మూడెకరాల భూమి కొ లిచేందుకు రూ. 25వేలు డిమాండ్ చేసి, రూ.10వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డాడు. ఏసీబీ అధి కారుల వివరాల ప్రకారం.. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతుకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి రెవెన్యూ శివారులో వ్యవసాయ భూమి ఉంది. మూడు ఎకరాల భూమి విషయంలో ఇతరులతో వివాదం ఏర్పడగా.. సర్వే చేయాలని గత నెల 17న సైదాపూర్ మండల సర్వేయర్ ఎక్కలదేవి కుమారస్వామికి దరఖాస్తు చేసుకున్నాడు. కుమారస్వామి రూ.25 వేలు డిమాండ్ చేశాడు. గత నెల 23న రూ.5వేలు బాధితుడు ఫోన్పే చేశాడు. ఈనెల 2న కుమారస్వామికి ప్రైవేటు సహాయకుడిగా ఉన్న విహీత్రెడ్డి ద్వారా రూ.10వేలు ఇచ్చాడు. మిగతా రూ.10 వేలు ఇస్తేనే సర్వే చేస్తాననడంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం సోమారం చౌరస్తా వద్ద కుమారస్వామి రూ.10 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్, సీఐలు పున్నం చందర్, ప్రేమ్కుమార్ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సొమ్ము స్వాధీనం చేసుకొని, తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత రికార్డులు సీజ్ చేశారు. కుమారస్వామితో పాటు అతని ప్రైవేటు సహాయకులు రాజేశ్, విహీత్రెడ్డిలను అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబరు 1064, 9440446106 నంబర్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. మూడు ఎకరాలు కొలిచేందుకు రూ.25 వేలు డిమాండ్ రూ.10 వేలు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు -
గురువు గొప్పతనం
క్షీరము నిచ్చేది ధేనువు జ్ఞానము నిచ్చేది గురువు దేవ గురువు బృహస్పతి గురుదేవుడెప్పుడూ సరస్వతే!! అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు నడిపించేది గురువు మంచి మనిషిగా తీర్చిదిద్దేది గురువు మంచిని బోధించేది గురువు గురువు లేని విద్య గుడ్డి విద్య!! విజ్ఞానం పంచేది గురువు తన విద్యను దారపోసేది గురువు ప్రపంచంలో అన్నిటికీ రెండు కొమ్ములే ఉంటే మూడు కొమ్ములు ఉన్నవాడు గురువు!! గు=1 రు =2 వు =3దేవులపల్లి రమేశ్ నంగునూర్, సిద్దిపేట జిల్లా -
రేపటి పౌరులు
పిల్లల్లారా! బడి పిల్లల్లారా!! భారత భావి పౌరుల్లారా!! మీరే రేపటి భారతదేశ పాలకులు మీరే రేపటి భారత దేశ రక్షకులు గొప్ప గొప్ప చదువులెన్నో చదవాలి మీ మేధస్సుతో భరతభూమి వెలగాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలలు నిజం చేయ ప్రతినబూనాలి తల్లిదండ్రుల గురువుపెద్దలను గౌరవించాలి వినయ విధేయత సంస్కారంతో మెలగాలి పదుగురిలో మీ గొప్పతనం పరిమళించాలి ఎదుగుతూనే మీరంతా ఒదిగి ఒదిగి ఉండాలి సత్యం ధర్మం సమతా మమతా మరవద్దు నీతి నిజాయితీ సేవా నిరతిని విడవద్దు మంచితనం మానవత్వం విడవకండి బీదసాదలను ఆదరించడం మరవకండి కులమతాలు మీ మనసుకు అంటకూడదు కలనైనా చెడు యోచన చేయకూడదు మల్లెలాగ మీ అందరి మనసులుండాలి భరతమాత మీ ప్రతిభచూసి పొంగిపోవాలిబూర దేవానందం కవి, రచయిత సిరిసిల్ల -
మధుర జ్ఞాపకాల బాల్యం
అప్పుడు మా బాల్యం ఆకాశమంత స్వేచ్ఛ ఇప్పుడు పిల్లల ప్రపంచం మొబైల్లో బంధం. అప్పుడు చెట్ల నీడలో ఆటల సందడి ఇప్పుడు స్క్రీన్ వెలుగులో ఒంటరి ప్రయాణం. అప్పుడు గిల్లి, కబడ్డీ, ఖోఖోల సందడి ఇప్పుడు వీడియో గేమ్స్లో విజయాల వేట. అప్పుడు తాతయ్య కథలు, అమ్మమ్మ పాటలు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా మాటలు. అప్పుడు స్నేహం అంటే హృదయాల కలయిక, ఇప్పుడు స్నేహం అంటే ఫాలోవర్స్ లెక్క. అప్పుడు మట్టి వాసనలో పెరిగిన బాల్యం ఇప్పుడు ఏసీ గదుల్లో బందీ అయిన జీవితం. అప్పుడు చిన్న బొమ్మలోనే పెద్ద ఆనందం ఇప్పుడు ఎన్నో వస్తువులున్నా కనిపించని సంతోషం. కాలం మారింది, ప్రపంచం మారింది, సాంకేతికతతో జీవితం ముందుకు సాగింది. కానీ... మిస్ అవుతున్నాం ఆ పల్లె గాలిని మిస్ అవుతున్నాం ఆ స్నేహాల తీపిని. మిస్ అవుతున్నాం చెట్టు నీడలో నవ్వులను మిస్ అవుతున్నాం అమ్మమ్మ కథల మధుర జ్ఞాపకాలను. అప్పుడు బాల్యం ఒక అందమైన జ్ఞాపకం నేటి బాల్యం ఒక కొత్త ప్రపంచం. రెండింటిలోనూ మంచితనం ఉన్నా ఆ పాత రోజుల మాధుర్యం మాత్రం మరువలేనిది! దూపాటి హరిప్రసాద్ షాపూర్నగర్, హైదరాబాద్ -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
సైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెరుకపల్లి గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం(29)అనే గొర్రెల కాపరి గురువారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందినట్లు ఎస్సై స్వాతి తెలిపారు. శ్రీశైలం శుక్రవారం ఎండలో గొర్రెలు కాస్తుండగా నీరసంగా ఉందని తండ్రి తిరుపతికి ఫోన్లో తెలిపాడు. ఇంటికి తీసుకురాగానే సొమ్మసిల్లిపోయాడు. చికిత్స కోసం 108కు ఫోన్ చేశారు. 108సిబ్బంది వచ్చి చూసి శ్రీశైలం అప్పటికే మృతి చెందాడని తెలిపారు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. లారీ ఢీకొని మహిళ..వెల్గటూర్: లారీ ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. చర్లపల్లి గ్రామానికి చెందిన మీసా మునిలత (34) పని నిమిత్తం రాజారాంపల్లి గ్రామానికి వెళ్లి వివేకానంద చౌరస్తా సమీపంలో రోడ్డు దాటుతుండగా జగిత్యాల నుంచి బసంత్నగర్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ కొమురయ్య అజాగ్రతగా, అతివేగంగా నడిపి మహిళ పై నుంచి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో మునిలత తీవ్రంగా గాయపడగా, అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): కూతుళ్ల పెళ్లిళ్లకు చే సిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన ఓ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెంకు చెందిన ఆవునూరి దేవానందం(60) గు రువారం రాత్రి పాలు పోసేందుకు పాలకేంద్రానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరకపోవడంతో భార్య భూదేవిక, కుమారుడు భానోదయ్ వెదికారు. అయినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం గ్రామశివారులోని వారి పొలంలో దేవానందం చెట్టు కు ఉరివేసుకుని కనిపించాడు. ఇటీవల ముగ్గురు కూతుళ్ల వివాహాలకు రూ.25లక్షల వరకు అప్పు చేశాడు. అప్పు తీర్చే మార్గం కనిపించక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. వెన్గుమట్లలో వృద్ధుడు.. గొల్లపల్లి: మండలంలోని వెన్గుమట్ల గ్రామానికి చెందిన ఐతేనేని పోచయ్య (70) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. నాలుగేళ్లుగా మానసిక, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పోచయ్య శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో తన ఇంటి ముందున్న రేకుల షెడ్డుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్
కరీంనగర్ క్రైం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని జిల్లా జడ్జి శివకుమార్ అన్నారు. కోర్టు ఆవరణలో శుక్రవారం పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఎస్.శివకుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి నైతిక బాధ్యత అన్నారు. ఇందుకోసం కోసం అందరూ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, జనరల్ సెక్రటరీ సీహెచ్.కిరణ్ కుమార్, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్, అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ జి.శ్రీనివాస్ పాల్గొన్నారు. న్యాయవాదుల సహకార సంఘం ఏర్పాటు కరీంనగర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల పరస్పర సహకార సంఘం కార్యాలయాన్ని జిల్లా జడ్జి ఎస్.శివకుమార్ శుక్రవారం ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ కుమార్ ఆధ్వర్యంలో కోర్టు భవన సముదాయంలో అడ్వకేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేశారు. త్వరలోనే సొసైటీ పూర్తిస్థాయిలో న్యాయవాదులకు అందుబాటులోకి వస్తుందని లక్ష్మణ్ తెలిపారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శివకుమార్, బొడ్ల గీతారాణి, కార్యదర్శి సుంకె దేవకిషన్, ట్రెజరర్ బొజ్జ స్వామి పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
కరీంనగర్ అర్బన్: ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ డీర్పార్క్లో కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌస్ఆలంతో కలిసి మొ క్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ గతేడాది సిద్దిపేట జిల్లాలో అటెండర్ నుంచి కలెక్టర్ వరకు దాదాపు 11వేల మంది ఒకేసారి మొక్కలు నాటార ని గుర్తుచేశారు. జిల్లాలోనూ తదనుగుణంగా కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో కరివేపా కు, మునగ, జామ మొక్కలు నాటాలని కోరారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ క్షితిజ, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డీఎఫ్వో సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రతీ గింజ కొంటా.. ఆందోళన వద్దు జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిపై కలెక్టర్ చిత్రా మిశ్రా, సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో ఫోన్లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని, మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
ఫోన్ వాడితే గుర్తొచ్చేది రాజీవ్గాంధీయే
కరీంనగర్ కార్పొరేషన్: ఫోన్ వాడినా...ల్యాప్ టాప్ వాడినా రాజీవ్ గాంధీ గుర్తుకు వస్తారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మాజీ ప్రధా ని రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లనే సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవం సాధ్యపడిందన్నారు. నగరంలోని రాజీవ్ చౌక్లో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్ల 20ఏళ్ల ముందే దేశంలోకి కంప్యూటర్ వచ్చిందన్నారు. ఆయన నాటిన బీజాలతోనే 15ఏళ్ల ముందే సెల్ఫోన్లు వచ్చాయని తెలిపారు. రాజీవ్ గాంధీని కలిసే మహాభాగ్యం, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అదృష్టం తమకు కలిగాయన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జెన్జీకి గుర్తింపు ఇచ్చింది రాజీవ్ గాంధీయేనన్నారు. రేవంత్, మహేశ్గౌడ్ జోడెద్దుల మాదిరిగా మళ్లీ కాంగ్రెస్ను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువస్తారన్నారు. అనంతరం మొదటగా రాజీవ్గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కటకం మృత్యుంజయం, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మంద నగేశ్ను సన్మానించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, పీసీసీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, వొడితెల ప్రణవ్, ఆరెపల్లి మోహన్ పాల్గొన్నారు. ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్ష్ ప్రారంభం సుడా నిధులు రూ.79 లక్షలతో ఆధునీకరించిన ఐడీఎస్ఎంటీ షాపింగ్ కాంప్లెక్స్ను మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. సుడా నిధులు రూ.1.28 కోట్లతో నిర్మించనున్న నైట్ఫుడ్ కోర్టు కాంప్లెక్స్కు శంకుస్థాపన చేశారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. -
సేవకులు కావలెను!
శనివారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2026‘రాజన్న’కుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజన్న ఆలయంలో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో సిబ్బంది కొర త పనిభారానికి కారణమవుతోంది. కనీసం వారాంతంలో సెలవు దొరికే అవకాశం కూడా కొన్నిసార్లు దక్కకపోవడం ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయంలో క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం మొత్తం 320 రెగ్యులర్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 185 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 135 పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతున్నట్లు తెలుస్తోంది. అర్చకుల విభాగంలోనే సుమారు 35 పోస్టులు ఖాళీగా ఉండగా, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (ఎల్జీఎస్) విభాగంలో దాదాపు 60 పోస్టులు భర్తీ కాలేదు. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్ విభాగాల్లో 10 పోస్టులు, డ్రైవర్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఔట్ సోర్సింగ్లోనూ ఇదేతీరు ఇక ఔట్సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదని అంటున్నారు. మొత్తం 290 ఔట్సోర్సింగ్ పోస్టులకు గాను ప్రస్తుతం 250 మంది మాత్రమే పనిచేస్తుండగా, మరో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. ఈ పరిస్థితుల్లో భక్తులకు సేవలు అందించడమే కాకుండా, నిత్య కై ంకర్యాలు, పరిపాలనా కార్యక్రమాలను నిర్వహించడం సవాలుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు. మరోవైపు ఉద్యోగ విరమణ పొందిన ఒక ఏఈవోను అకౌంట్స్ అధికారిగా కొనసాగిస్తుండగా, సంవత్సరాలుగా ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం రెగ్యులరైజేషన్ లేదా పదోన్నతుల విషయంలో స్పష్టత లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు వారానికి ఒక రోజు సెలవు కూడా తీసుకోలేని పరిస్థితి నెలకొన్నదని, అనేక మంది నిరంతర విధుల వల్ల మానసిక, శారీరక ఒత్తిడికి గురవుతున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలవులు మంజూరు చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ జీవితంపై కూడా ప్రభావితం పడుతోందని వారు పేర్కొంటున్నారు. రాజన్న ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయకపోతే భవిష్యత్తులో ఆలయ సేవల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం, దేవాదాయశాఖ అధికారులు వెంటనే స్పందించి ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత -
కాసులిస్తేనే కొలత..!
‘భూమి సర్వే చేసేందుకు రూ.10వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి ఏసీబీకి పట్టుబడ్డాడు. తన భూమిని సర్వే చేయాలని సుంచు మహేందర్ సర్వేయర్ను సంప్రదిస్తే రూ.25వేలు డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించాడు. తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా సర్వేయర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు’. గంగాధరకు చెందిన రాజిరెడ్డి తన భూమి సర్వే కోసం 5నెలల క్రితం దరఖాస్తు చేశాడు. నేటికి కొలత కాకపోగా కార్యాలయాల చుట్టూ తిరగడం, నిరాశగా వెనుదిరగడం తంతుగా మారుతోంది. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. జిల్లాలో వందల మందిది ఇదే పరిస్థితి.కరీంనగర్ అర్బన్: పెరుగుతున్న భూముల విలువ సర్వేయర్లకు కాసులు కురిపిస్తోంది. హద్దు పంచాయితీలు పెరుగుతుండగా, సర్వేయర్లే సమస్యలు సృష్టిస్తున్న ఘటనలు అనేకం. శుక్రవారం సైదాపూర్ సర్వేయర్ కుమారస్వామి పట్టుబడటం అందుకు మచ్చుతునక కాగా హెచ్చు సర్వేయర్లది ఇదే దారని స్పష్టమవుతోంది. ఒకప్పుడు సోదర భావంతో ఉన్న చుట్టుపక్కల రైతులు ఇప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. హద్దుల గొడవ తేల్చాల్సిన సర్వే లాండ్ రికార్డులశాఖ మామూళ్లకే పెద్దపీట వేస్తుండటం గమనార్హం. కొలత ఎప్పుడయ్యేనో..? జిల్లాలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలుండగా భూ సర్వే ఆర్జీల సంఖ్య తగ్గకపోవడం విడ్డూరం. పలువురు సర్వేయర్లు మామూళ్లు ఇచ్చినవారికే ప్రాధాన్యతనిస్తుండగా ఎవరెక్కువ ఇస్తే వారి హద్దులనే నిర్ణయిస్తున్నారన్న విమర్శలు కోకొల్లలు. కరీంనగర్ అర్బన్, వీణవంక మండలాలకు ఇన్చార్జి సర్వేయర్లు ఉండగా మిగతా మండలాలకు సర్వేయర్లు ఉన్నా అర్జీలు వందల్లో పేరుకుపోవడం పనితీరుకు తార్కాణం. గతంలో సగం మంది పోటీ పరీక్షల కోసం దీర్ఘకాల సెలవులో వెళ్లగా తిరిగి విధుల్లో చేరారు. యుద్ధప్రతిపాదికన సర్వే చేయాల్సిన సర్వేయర్లు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండడంతో జిల్లావ్యాప్తంగా 300కు పైగా అర్జీలు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. బేరం కుదిరితేనే కొలత జిల్లాలోని పలువురి సర్వేయర్ల తీరు విమర్శలకు తావిస్తోంది. రూపాయి లంచం లేకుండా హద్దులు నిర్ణయించాల్సి ఉండగా కాసుల బేరంతో కాలయాపన చేస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బార్లలో రేట్లు మాట్లాడుకోవడం బేరం కుదిరితేనే కొలత వేయడం జరుగుతోందని రైతులు వాపోతున్నారు. ఇక కారులో వస్తే ఒక రకం, ఇతర వాహనంలో వస్తే మరో రకం ఫీజు కాగా.. కోరిన భోజనం సమకూర్చాల్సిందే. సర్వేయర్కు తోడుగా వచ్చేవారికి లంచం ఇవ్వాల్సిందే. లేదంటే టీపాన్ సరిగా లేదని సర్వేను వాయిదా వేస్తున్నారు. ఇక కార్యాలయంలో టీపాన్, నక్షా, తదితర అవసరాలుంటే డబ్బులతో ముడిపెడుతుండటం విడ్డూరం. ఈ విషయంలో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కరవయ్యాయి. డీజీపీఎస్ ఇస్తేనే సత్వర సేవ జిల్లాలో ఏడు మాత్రమే డీజీపీఎస్లున్నాయి. మరో రెండు పైలట్ సర్వేలో వినియోగిస్తున్నారు. గొలుసు ద్వారా భూముల కొలతలు వేస్తే నలుగురు వ్యక్తులు, సహాయకులుగా మరొకరు వ్యవహరించాల్సి ఉంటుంది. వీరందరిని రైతే సమకూర్చుకోవాలి. దీనికి స్వస్తి పలికి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ (ఈటీఎస్) మిషన్ను అందుబాటులోకి తెచ్చారు. మరింత స్పష్టతకు డీజీపీఎస్ పరికరం వినియోగిస్తున్నారు. అయితే సర్వే త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఎవరికి రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని సర్వేలాండ్ రికార్డుశాఖ ఏడీ కిషన్రావు వివరించారు. -
గజం రూ.63,000.. అడుగు రూ.4,000
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను భారీగా సవరించడంతో ఆస్తుల కొనుగోలు, విక్రయించేవారిపై అదనపు భారం పడనుంది. శుక్రవారం నుంచి కొత్త మార్కెట్ ధరలు అమల్లోకి రాగా.. జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో భూముల విలువను 50శాతం నుంచి 100శాతం వరకు పెంచగా, కీలక ప్రాంతాల్లో రెట్టింపు పెరగడం గమనార్హం. నగరంలోని టవర్ సర్కిల్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు గజానికి గరిష్టంగా రూ.31,500 ఉండగా రూ.63,000 వరకు పెంచారు. మెయిన్ సెంటర్లయిన ప్రకాశం గంజ్, మదీనా కంప్లెక్, జాఫ్రీ రోడ్డు, రాజీవ్చౌక్తో పాటు మెయిన్ రోడ్డు పక్కనున్న ప్రాంతాల్లో ధరలు డబు ల్ చేసేశారు. అపార్టుమెంట్లకు రూ.4000 వరకు పెంచారు. కార్పొరేషన్లో విలీనమైన వల్లంపహాడ్లో గజానికి అతి తక్కువగా రూ.2,600 కాగా.. దుర్శేడ్లో గజానికి రూ.3,700గా నిర్ణయించారు. దుర్శేడ్, బొమ్మకల్, ఆరెపల్లి, వల్లంపహాడ్ వంటి ప్రాంతాల్లో అపార్ట్మెంట్ విలువను గజానికి రూ.1,800గా నిర్ణయించారు. కరీంనగర్–జగిత్యాల, కరీంనగర్–మంచిర్యాల, కరీంనగర్– హైదరాబాద్ వంటి ప్రధాన రహదారుల వెంట ఉన్న భూములకు భారీగా విలువలు పెంచారు. కొనుగోలుదారులపై అదనపు భారం భూముల మార్కెట్ విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్ఫర్ డ్యూటీలు పెరగనున్నాయి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తప్పదని రియల్ఎస్టేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త ధరలు అమల్లోకి వస్తాయని ముందుగానే తెలిసిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీ పెరిగింది. పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని భావించిన కొనుగోలుదారులు, విక్రేతలు కార్యాలయాలకు తరలివచ్చారు. దీంతో అనేక చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్నా.. శుక్రవారం జరిగిన రిజిస్ట్రేషన్లకు అదనపు ఫీజు చెల్లించారు. కాగా.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈనెల 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు 44 రిజిస్ట్రేషన్లు జరిగితే, 5వ తేదీన మార్కెట్ ధరలు పెరిగిన తర్వాత 24 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు సమాచారం. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: పట్టణంలోని ధనరేకుల రాజేశ్ (37) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై సుధీర్రావు తెలిపారు. రాజేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. అప్పు చెల్లించలేని పరిస్థితి ఉండటంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశ్కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. లత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భార్యను హింసించిన వ్యక్తి అరెస్ట్జగిత్యాలరూరల్: కట్టుకున్న భార్యను హింసించడంతోపాటు ఆమె హత్యాయత్నం చేసిన బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన నేరెళ్ల నరేశ్ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు. నరేశ్కు బుగ్గారం మండలం మద్దునూర్కు చెందిన యువతితో 13ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. కొద్దికాలంగా భార్యను కొడుతూ, తిడుతూ ఇబ్బందులకు గురిచేయగా.. ఫిబ్రవరిలో బీర్పూర్ పోలీస్స్టేషన్లో నరేశ్పై గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. అయినప్పటికీ తీరు మార్చుకోని నరేశ్ బుధవారం అర్ధరాత్రి భార్యను క్రికెట్ బ్యాట్తో కొడుతూ.. మెడకు చున్నీ బిగించి హత్యాయత్నం చేయగా పిల్లలు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పేకాట రాయుళ్లు..జగిత్యాలక్రైం: జగిత్యాలలోని గోవిందుపల్లి, హౌసింగ్బోర్డుకాలనీలోని రెండిళ్లలో వేర్వేరుగా పేకాట ఆడుతుండగా పట్టణ ఎస్సై సుప్రియ, సీసీఎస్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. గోవింద్పల్లిలో ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.57 వేలు స్వాధీనం చేసుకున్నారు. హౌసింగ్బోర్డు కాలనీలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6300 స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
దంచికొట్టిన వాన
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్క్రైం/కరీంనగర్ అర్బన్: నగరంలో వర్షం దంచికొట్టింది. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలివానతో బీభత్సం సృష్టించింది. తీవ్ర ఎండవేడితో ఇబ్బంది పడుతున్న నగరవాసులకు వర్షం కాస్త ఉపశమనమిచ్చింది. వర్షానికి ప్రధాన రహదారులు, రోడ్లు, వీధులు జలమయం అయ్యాయి. కేబుల్ బ్రిడ్జి చౌరస్తా చెరువును తలపించింది ఆదర్శనగర్ మెయిన్రోడ్డు పూర్తిగా జలమయమైంది. కార్పొరేటర్, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ పరిస్థితిని స్వయంగా పరిశీలించి, వరదనీటిని డ్రైనేజీల్లోకి మళ్లింపజేశారు. హుస్సేనిపుర, కట్టరాంపూర్, కోతిరాంపూర్, ముకరంపుర తదితర ప్రాంతాల్లో వరదనీరు రోడ్లపై ప్రవహించింది. కట్టరాంపూర్లో డ్రైనేజీ నిర్మాణాన్ని సగంలోనే వదిలివేయడంతో మురుగ వీధుల్లో ప్రవహించింది. ఇండ్లల్లోకి రాకుండా ఆ ప్రాంతవాసులు శ్రమించాల్సి వచ్చింది. పోచమ్మవాడలో భారీ చెట్లు పడిపోయి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. కట్టరాంపూర్లో చెట్టు విరిగి కారుపై పడింది. ముకరంపురలో నాలాను డిప్యూటీ మే యర్ యాదగిరి సునీల్రావు స్వయంగా పరిశీలించారు. గాలివానకు ప్రధాన రహదారులపై ఉన్న హోర్డింగ్ల్లోని ఫ్లెక్సీలు చిరిగి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారాయి. జలసంద్రంగా జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ వర్షానికి జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ జలయయమైంది. కార్యాలయ ప్రాంగణం నీటమునిగి పోగా, రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు నిలిచి, ద్విచక్ర వాహనాలు, ఆటోలు మునిగిపోయాయి. వాహనాలను బయటకు తీసేందుకు శ్రమించాల్సి వచ్చింది. హుజూరాబాద్లో 5.8 సెం.మీల వర్షంతొలకరి జల్లులు జిల్లాను పలకరించడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. గురువారం సాయంత్రం అత్యధికంగా హుజూరాబాద్లో 5.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మానకొండూరులో 4.2, కరీంనగర్లో 4, వీణవంకలో 3.3, సైదాపూర్లో 2.1, జమ్మికుంటలో 1.6 సెం.మీ వర్షపాతం నమోదైంది.ఆదర్శనగర్లో రోడ్డు జలమయంరిజిస్ట్రేషన్ కార్యాలయంలో..కట్టరాంపూర్లో కారుపై పడిన చెట్టుహోర్డింగ్కు ప్రమాదకరంగా వేలాడుతున్న ఫ్లెక్సీకట్టరాంపూర్లో ఇళ్లమధ్య మురుగు వరద -
సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన
కొత్తపల్లి(కరీంనగర్): సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. డివిజన్ల వారీగా ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి వార్డు సభల్లో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. డివిజన్లలో పరిశుభ్రత చాలా ముఖ్యమని, స్వచ్ఛ కరీంనగర్ నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజల కార్యాచరణలో భాగంగా కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గురువారం రేకుర్తిలోని ఓ ఫంక్షన్ హాల్లో 14,15,16,17,18,19,20, 21,22,23,24, 25,46, 47, 48 (చింతకుంట, కొత్తపల్లి, రేకుర్తి, సీతారాంపూర్, మల్కాపూర్, విద్యానగర్, పద్మనగర్, రాంనగర్ ప్రాంతాలు)డివిజన్లకు నిర్వహించిన ప్రత్యేక వార్డుల సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చెత్తను 4 పద్ధతుల్లో వేరు చేసి కార్మికులకు అందించాలని, డివిజన్లలోని ఆరోగ్య కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. నగరంలో జరుగుతున్న పెన్షన్ మ్యాపింగ్లో ఆన్లైన్ ఫొటో ఐడెంటిఫికేషన్ కేవైసీ తప్పక చేయించుకోవాలన్నారు. డివిజన్లలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి తొలగించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులపై ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు, నగరంలోని డంపుయార్డు ప్రక్షాళన కోసం అర్బన్ చాలెంజ్ ఫండ్ స్కీంలో రూ.80 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందిరమ్మ నివాస గృహాల పథకంలో మొదటి విడతలో 1300 మంజూరుకాగా, రెండో విడత మంజూరయ్యే 2 వేల ఇండ్ల కోసం ముందస్తు ప్రణాళిక చేశామన్నారు. డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు మాట్లాడుతూ డివిజన్ల వారిగా ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. కార్పొరేటర్లు సుధగోని మాధవి, పర్వతం మల్లేశం గంట శ్రీనివాస్, వాసాల రమేశ్, వరాల నర్సింగం, ఒంటెల సత్యనారాయణరెడ్డి, కాంతాల జగన్ రెడ్డి, అదనపు కమిషనర్లు ఆయాజ్, సువార్త, డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణు పాల్గొన్నారు. -
వ్యాయామ వృత్తి విద్య కోర్సులకు తగ్గుతున్న క్రేజ్
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో నాలుగు రోజుల పాటు జరిగిన రాష్ట్ర వ్యాయామ విద్యా ప్రవేశ శారీరక దారుఢ్య (టీజీపీఈసెట్ 2026) పరీక్షలు ముగిశాయి. ఈ పరీక్షల హాజరుశాతం, సీట్ల లభ్యతను పరిశీలిస్తే వ్యాయామ ఉపాధ్యాయ కోర్సులకు క్రేజ్ పడిపోతోందని స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లే ఖాళీగా ఉన్న పీఈటీ పోస్టుల భర్తీతో పాటు ప్రతి పాఠశాలలో పీఈటీ ఉండేలా చేయాలని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గైర్హాజరుల పరంపర ఈ ఏడాది బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు 3,362 మంది దరఖాస్తు చేసుకోగా 2,435మంది (72.42 శాతం) పరీక్షలకు హాజరయ్యారు. 927 మంది అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలకు రాకపోవడం గమనార్హం. బీపీఈడీ కోర్సుకు మొత్తం 2,386 మంది దరఖాస్తు చేయగా 1,788 మంది హాజరయ్యారు. 598 మంది గైర్హాజరయ్యారు. డీపీఈడీ కోర్సుకు 976 మంది దరఖాస్తు చేయగా 647 మంది హాజరయ్యారు. 329 మంది గైర్హాజరయ్యారు. బీపీఈడీ సీటుకు 1.15 మంది, డీపీఈడీ సీటుకు 2.16 మంది పోటీ ప్రతివంద మందిలో 87 మందికి బీపీఈడీ సీటు ఖాయం కావడం విశేషం. బీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 1,788 మంది కాగా, సీట్లు 1,560 ఉన్నాయి. ప్రతి సీటుకు కేవలం 1.15 మంది మాత్రమే పోటీ పడుతున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో క్వాలిఫై అయితే చాలు సీటు ఖాయమనే పరిస్థితి కనిపిస్తోంది. డీపీఈడీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు 647 మంది కాగా, సీట్లు 300 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సీట్లు హాజరైన అభ్యర్థులలో 46.37 శాతం మందికి సరిపోతాయి. ప్రతి సీటుకు 2.16 మంది పోటీ పడుతున్నారు. వ్యాయామ విద్యపై క్రేజ్ తగ్గడానికి అభ్యర్థుల లోపం కాదు, రాష్ట్రంలో నెలకొన్న విద్యా, క్రీడా విధానాలే కారణమని నిపుణులు తేల్చి చెబుతున్నారు స్కూళ్లలో పీఈటీ పోస్టుల కొరత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీఈటీ పో స్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,800 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పినా యువతలో నమ్మ కం కలుగలేదు. తెలంగాణలో ఒకవైపు యూత్ అండ్ స్పోర్ట్స్ పాలసీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి చర్చలు జరుగుతున్నా పీఈటీ కోర్సులకు ప్రాధాన్యత లేకపోవడం విడ్డూరం.కోర్సు అభ్యర్థులు హాజరైనవారు గైర్హాజరు బీపీఈడీ 2,386 1,788 598 డీపీఈడీ 976 647 329 కోర్సు కళాశాలలు అందుబాటులో ఉన్న సీట్లు బీపీఈడీ 15 1,560 డీపీఈడీ 03 300 బీపీఈడీలో హాజరైన 87 శాతం మందికి సీటు వచ్చే అవకాశం -
కనిపించని గాయం
మనసులో మిగిలిన మాటలే కనిపించని గాయాలవుతాయి నవ్వుల వెనుక దాగిన బాధ నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తుంది ఎవరూ చూడని ఆ వేదన హృదయంలో అలలై ఎగసిపడుతుంది ఒక మాట గుచ్చినప్పుడు గుండె లోతుల్లో ముద్రపడుతుంది కాలం గడిచినా కొన్ని జ్ఞాపకాలు గాయాన్ని మళ్లీ మేల్కొలుపుతాయి బయటకు బలంగా కనిపించినా లోపల మనసు విరిగిపోతుంది ఆత్మీయుల నిర్లక్ష్యం ఆ గాయానికి మరింత నొప్పి ఇస్తుంది ఆశలు చినిగిన ప్రతిసారి మనసు మౌనంగా రోదిస్తుంది కన్నీటి చుక్కలకే తెలుసు ఆ బాధ ఎంత లోతైనదో చెప్పలేని క్షణాలన్నీ గుండెలో గుహలై నిలిచిపోతాయి అయినా జీవితం ముందుకు నడుస్తుంది కొత్త వెలుగులను వెతుకుతూ కనిపించని గాయాలకూ ఒక రోజు మాన్పు అనే ఉదయం వస్తుంది ఆశ అనే చిన్న దీపమే మనసుకు మళ్లీ బలం ఇస్తుంది – నక్క శ్రీకర్ ఊరు: ఊటూరు మానకొండూర్ కరీంనగర్ -
పునాది లేని చోట శిఖరాలు ఎలా సాధ్యం..?
మనం 2036 ఒలింపిక్స్లో పతకాలు సాధించాలని కలలు కంటున్నాం. కానీ ఒలింపియన్లను తయారు చేసే ప్రాథమిక కేంద్రాలైన పాఠశాలల్లోనే పీఈటీలు లేకపోవడం దారుణం. పాఠశాల స్థాయిలోనే ప్రతిభను గుర్తించకపోతే అంతర్జాతీయ స్థాయి అథ్లెట్లు ఎలా వస్తారు. బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు పూర్వ వైభవం రావాలంటే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలి. – దూడం రమేశ్, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత క్రీడలకు పెద్దపీట వేస్తామన్నారు. క్షేత్రస్థాయిలో స్కూళ్లలో పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్ డీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు రాకపోవడం వల్లే విద్యార్థులు బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల వైపు రావడానికి భయపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, మోడల్, గురుకుల పాఠశాలల్లో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. – కంకటి అనూప్ కుమార్, కరీంనగర్ జిల్లా ప్రైవేట్ పీఈటీల సంఘం ప్రతినిధి -
ఆరోగ్య ప్రదాయిని
యోగాకరీంనగర్స్పోర్ట్స్: సంస్కృత పదం యుజ్ నుంచి పుట్టిన యోగా గురించిన ప్రస్తావనలు ఋగ్వేదంలోనే ఉన్నాయి. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో పతంజలి మహర్షి 196 సూత్రాలతో యోగా సూత్రాలు గ్రంథాన్ని అందించి యోగాను ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చారు. అందుకే ఆయన్ను యోగా పితామహుడు అంటారు. ఆ తర్వాత స్వామి వివేకానంద చికాగో ప్రసంగం ద్వారా దీనిని ప్రపంచానికి పరిచయం చేయగా.. నేడు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా మన యోగా విశ్వవ్యాప్తమైంది. ప్రయోజనాలు.. నిత్యం క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే కనీసం అరగంటపాటు ఆసనాలు, ప్రాణాయామం చేస్తే శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తపోటు అదుపులోకి వచ్చి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు, ఎముకలను దృఢంగా మార్చి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది, దీర్ఘకాలిక నడుము నొప్పి, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మానసిక కోణంలో చూస్తే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసి మనస్సుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా నిద్రలేమి సమస్యను నివారిస్తుంది. విద్యార్థులు, యువతలో మెదడు పనితీరును చురుగ్గా మార్చి మానసిక ఏకాగ్రత, మేధస్సు, జ్ఞాపకశక్తిని విపరీతంగా పెంచుతుంది. శ్వాస క్రియల(ప్రాణాయామం) ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి శరీరంలో రోగ నిరోధకశక్తి పెంపొంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. కరీంనగర్లో యోగా ప్రస్థానం ప్రస్తుతం మన కరీంనగర్ జిల్లాలో కూడా యోగా ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. యోగా రాష్ట్ర పోటీల్లో దశాబ్దకాలానికి పైగా జరుగుతున్న రాష్ట్ర పోటీల్లో జిల్లా జట్టే చాంపియన్. నగరంలోని ఉద్యానవనాలు, సామాజిక కేంద్రాల్లో వయసుతో నిమిత్తం లేకుండా వందలాది మంది ఉదయాన్నే యోగాసనాలతో తమ రోజును ప్రారంభిస్తుండడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలి వైపు అడుగులు వేస్తూ.. యోగాను ఒక ప్రజాఉద్యమంగా మారుస్తుండడం శుభపరిణామం కరీంనగర్ జనజీవనంలో నూతన చైతన్యం విశ్వ వేదికపై మన యోగా ఏకాగ్రత.. మేధస్సు.. సంపూర్ణ ఆరోగ్యం భారతీయ సంస్కృతి ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా సాధన. నేడు శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక దివ్య ఔషధంగా మారి గ్లోబల్ వేదికపై జగద్గురువుగా నిలిచింది. నిత్యం యోగా చేస్తే మానసిక ఏకాగ్రత పెరగడమే కాకుండా.. మేధస్సు వికసించి ఒత్తిడి లేని ప్రశాంత జీవనం సాధ్యమవుతుంది. కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా అంతర్గత ప్రశాంతతకు యోగా ఎంతగానో తోడ్పడుతుంది. -
మేము గీసిన బొమ్మలు
పేరు: చిందం విహాన్ తరగతి: యూకేజీ గ్రామం: అలుగునూర్, కరీంనగర్ పేరు: బెల్లంకొండ సహస్త్ర రెడ్డి తరగతి: 7వ తరగతి గ్రామం: నాగారం, మంథని జిల్లా: పెద్దపల్లి -
ప్రతీ ఇంటికి యోగా
ఈ రోజుల్లో వయసుతో నిమిత్తం లేకుండా ప్రతీ ఒక్కరు ఒత్తిడి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కరీంనగర్ జిల్లా యోగా అసోసియేషన్ ద్వారా మేము ప్రతీ ఇంటికి యోగాను తీసుకెళ్లాలని సంకల్పించాం. ప్రతీ ఒక్కరు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలి. కరీంనగర్ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 ఏళ్లుగా ఎందరో జాతీయ, అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారు చేయడం మాకు గర్వకారణం. – నాగిరెడ్డి సిద్దారెడ్డి, యోగా సంఘం జిల్లా అధ్యక్షులు యోగా అనేది అంతర్గత శక్తిని మేల్కొలిపే సాధనం. శరీరానికే కాదు.. మనస్సుకు కూడా వ్యాయామం. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు యోగా ఎంతో అవసరం. వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతత పెరుగుతాయి. సరైన పద్ధతిలో నిత్యం ప్రాణాయామం, ధ్యానం చేస్తే ఒత్తిడి దూరమై సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. – మల్లిక, యోగా కోచ్ -
బాలల కథ : అక్షర సేద్యం
రామాపురంలో సోమయ్య అనే మధ్య తరగతి రైతు ఉన్నాడు. అతని కుమారుడు రాజు అదే ఊరిలో ఏడోతరగతి చదువుచున్నాడు. రాజుకు చదువు అంటే చాలా ఇష్టం. శ్రద్ధగా చదువుకుని, ఏదైనా ఉద్యోగం సాధించాలని ఆశ. సోమయ్య కు మూడు ఎకరాల పొలం ఉంది. రాజుని తనతో పాటు పొలం పనులకు తీసుకెళ్లి, ఇద్దరం పనిచేస్తూ మరో మూడు ఎకరాల పొలం కొనుగోలు చేసి ఊరిలో మంచి రైతు గా పేరు సంపాదించి, పెద్ద ఇల్లు నిర్మించుకోవాలని సోమయ్య ఆలోచన. చదువుపై ఉన్న మమకారంతో రాజు పొలం పనులు చేయడానికి ఇష్టపడలేదు. అతన్ని ఎలాగైనా చదువు మాన్పించాలని సోమయ్య ప్రయత్నాలు చేసాడు. చదువుకోవాలనే పట్టుదలను రాజు వదిలిపెట్టలేదు.సోమయ్య కూడా పంతం వీడలేదు. తోటి విద్యార్థులు బడికి వెళ్తుంటే రాజు మనసు గాయపడింది.అమ్మానాన్నలను ఒప్పించడానికి అన్నాహారాలు మాని నిరాహారదీక్ష చేసాడు . తల్లి దండ్రుల మనసు కరిగింది కాని ఒక షరతు పెట్టారు. శ్రీప్రతి రోజూ ఉదయం రెండు గంటలు పొలం పనులు చేయాలి. సాయంత్రం ఇంటి పనులు చేయాలి.సెలవు రోజుల్లో సేద్యపు పనులు చేయాలిశ్రీ. ఇదే మంచి అవకాశమనుకుని రాజు పొలం పనులు చేసుకుంటూ, కష్ట పడి చదవడం మొదలెట్టాడు.పరీక్షల సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా,చదువు పై ఉన్న మక్కువతో సంతోషంగా స్వీకరించాడు. తన తోటి పిల్లలు సెలవు రోజుల్లో సరదా ఆటలు ఆడుతున్నా,తను బాధపడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. రాజు చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించాడు. నీతి: సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధ్యమే.. – దుర్గమ్ భైతి రామునిపట్ల, సిద్దిపేట జిల్లా -
బ్యాటరీ దొంగల అరెస్ట్
జగిత్యాలక్రైం: గ్రామాల్లో ఇంటర్నెట్ కోసం టీ–ఫైబర్ అనుబంధ సంస్థ శాటిలైట్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన బ్యాటరీలు, యూపీఎస్లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. గురువారం రూరల్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. రూరల్ మండలం ధర్మా రం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి, హన్మాజీపేట, అనంతారం, గుట్రాజ్పల్లి, అంతర్గాంతోపాటు గొల్లపల్లి మండలాల్లో టీ ఫైబర్ పరికరాలను లక్ష్యంగా చేసుకుని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బండ అంజయ్య, మండలి రవి, చేవెల్ల నరేశ్ 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లను దొంగిలించారు. వీటి విలువ సుమారు రూ.4.52 లక్షలు ఉంటుంది. దొంగిలించిన బ్యాటరీలను విక్రయించేందుకు గురువారం వెళ్లూ.. రూరల్ ఎస్సై ఉమాసాగర్ ధరూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చేపట్టిన వాహనాల తనిఖీలో పట్టుబడ్డారు. నిందితుల నుంచి 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలింపు 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు స్వాధీనం -
తేలు బుద్ధి
అడవిలో ఒకతేలు ఆకలితో పడుకున్నది కదలలేక మెదలలేక కన్నీరును ఒలుకుతుండే అది చూసిన ఓ కోడి ఆహారం దొరికిందని పరుగు పరుగున అచటి కొచ్చి ముక్కుతోని పొడవ చూసే ప్రాణ భయంతో తేలు కోడి బావ కోడి బావ ఒక్కమాట చెబుతాను ఆలకించుమని కోరే నాకు ఆరోగ్యం బాగులేదు ఆహారం అసలు దొరకలేదు నాతో స్నేహంగా ఉండి చూడు హాని చేయబోను ఎవరికెపుడు తేలు మాట నమ్మి కోడి తన ఇంటికి తీసుకెళ్లి ఆహారం తెచ్చి ఇచ్చి ఆతిథ్యం మంచి గిచ్చి చెలిమి తోడ వుండమంటూ సలహాలను మెండు గిచ్చే తనకు దోస్తు దొరికాడని సంబరపడి పోయే కోడి పొద్దు పొద్దు గాలనే కొక్కోర కో అంటూ లేచి తన పిల్లలను చూడ మంటూ బయటకు పోయే తల్లి కోడి బలం పుంజుకున్న తేలు కపట బుద్ధి దాచుకుంటూ కత్తెర చేతులు చాచి కస్సు బుస్సుమని లేచే అమ్మదోస్తు ఈ తేలని ప్రేమగ దరి చేరినాయి పిల్ల కోళ్లు తన తోక కొండి లేపి మరీ చిటుకు చిటుకున కుట్టే తేలు లబో దిబోమంటూ బుజ్జి బుజ్జి పిల్ల కోళ్లు తల్లి చెంతకు పరుగు తీసి బోరుమంటూ ఏడ్వసాగే తేలు బుద్ధి తెలుసుకున్న తల్లికోడి కోపంతో రయ్యిన ఉరుకురికి వచ్చి తెలుపైన ఎగిరి దూకే తన ముక్కుతో తేలును ముక్కలు ముక్కలుగ చీల్చి స్నేహ ద్రోహి దేహాన్ని కసితీరా ఆరగించే... ఎప్పుడైనా ఈ జగాన బుద్ధిలేని ప్రబుద్ధులతో జాగ్రత్తగా మెదలమంటూ తల్లికోడి హితము చెప్పే..! డా.కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత ఖమ్మం జిల్లా -
నేడు కరీంనగర్కు పీసీసీ చీఫ్ మహేశ్
● మంత్రులతో కలిసి రాజీవ్గాంధీ విగ్రహావిష్కరణ కరీంనగర్ కార్పొరేషన్: ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్ శుక్రవారం కరీంనగర్ రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. సుడా నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన పాల్గొంటారన్నారు. నగరంలోని రాజీవ్చౌక్లో నూతనంగా ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని, ఆధునీకరించిన ఐడీఎస్ఎంటీ భవనాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఐడీఎస్ఎంటీ భవన పక్కనే నిర్మించనున్న ఫుడ్కోర్టుకు శంకుస్థాపన చేస్తారన్నారు. మహేశ్కుమార్గౌడ్తో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్లు పాల్గొంటారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకంచిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లికి చెందిన మహిళా కానిస్టేబుల్ గాడిపెల్లి శ్రీలత ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించారు. 2026– 27 పోలీస్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా హర్యానాలో గత నెల 26,27 తేదీల్లో నిర్వహించిన వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ పోటీల్లో కాంస్యం సాధించా రు. అనంతరం డీజీపీ సీవీఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీ శ్రీలతను అభినందించారు. శ్రీలత ప్రస్తుతం రామగుండం కమిషనరేట్ పరిధిలోని కమాన్పూర్లో విధులు నిర్వహిస్తున్నారు. -
పొగాకు రహిత జిల్లాగా మార్చాలి
కరీంనగర్: పొగాకు నియంత్రణ చట్టం (కా ట్పా–2003)ను సమర్థవంతంగా అమలు చేసి ‘టొబాకో ఫ్రీ జిల్లా’గా మార్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. కాట్పా చట్టంలోని కీలక నిబంధనలు, బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం, పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై ఆంక్షలు, మైనర్లకు విక్రయాల నిషేధం, విద్యాసంస్థల 100 గజాల పరిధిలో అమ్మకాల నిషేధం, ఆరోగ్య హెచ్చరికల ముద్రణ వంటి అంశాలను వివరించారు. ప్రతి నెల టాస్క్ఫోర్స్ డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విప్లవశ్రీ, ఎన్సీడీ కోఆర్డినేటర్ పోచయ్య పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: బడిబాట కార్యక్రమాన్ని జిల్లాలో ఉద్యమంలా నిర్వహించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డీఈవో ప్రశాంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో మాట్లాడు తూ బడిబయట ఉన్న పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో నమోదు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమ య్యే నాటికి అవసర మైన సౌకర్యాలు కల్పించాలని ఎంఈవోలకు సూచించారు. డీఆర్డీవో గీత, డీపీవో జగదీశ్వర్, డీడబ్ల్యూవో సరస్వతి, జెడ్పీ సీఈవో పవన్ కుమార్ పాల్గొన్నారు. బడిబాట పోస్టర్ ఆవిష్కరణ సప్తగిరికాలనీ(కరీంనగర్): మంకమ్మతోటలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ధన్గర్వాడీలో డీఈవో ప్రశాంత్ రెడ్డి బడిబాట వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రధానోపాధ్యాయురా లు ప్రమోద, జిల్లా సైన్స్ అధికారి జైుపాల్రెడ్డి, ఉపాధ్యాయులు మాగంటి శ్రీనివాస్, జ్యోతి, రాజేశ్, శ్రీధర్రెడ్డి, సాయి పాల్గొన్నారు. కరీంనగర్ టౌన్: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారి (ఎన్హెచ్–563) విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజలను పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారని చొప్పదండి మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. గురువారం కరీంనగర్లో మాట్లాడుతూ 2016–19 కాలంలోనే అప్పటి సీఎం కేసీఆర్, ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కృషితో ఎన్హెచ్–563 మంజూరైందన్న విషయాన్ని గుర్తు చేశారు. 2019లోనే కేంద్రం ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టును ఇప్పుడు కొత్తగా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినట్లుగా ప్రచారం చేయ డం ప్రజలను మోసం చేయడమే అన్నారు. టీఆర్ఎస్ హయాంలోనే 60 శాతానికి పైగా భూసేకరణ పూర్తయిందని, మిగిలిన 40 శాతం భూసేకరణ పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తీగలగుట్టపల్లి వద్ద నాలుగేళ్లుగా ఆర్వోబీ నిర్మాణం పూర్తి కాలేదని, కొండగట్టు అభివృద్ధికి ఒక్క రూపాయి నిఽ దులు తేలేదని విమర్శించారు. పొన్నం అనిల్కుమార్, ఏనుగు రవీందర్రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: గురువారం రాత్రి జిల్లాలో కురిసిన వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ చిత్రామిశ్రా తెలి పారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో కొంత ధాన్యం తడిసిందని అన్నా రు. జిల్లాలో ఏర్పాటు చేసిన 317 కేంద్రాల్లో ఇప్పటివరకు 261 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన కేంద్రాల్లో ఉన్న సుమారు 9,500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తామని వెల్లడించారు. కరీంనగర్ అర్బన్: కరీంనగర్ ఆర్డీవోగా ఎం.షర్మిలను నియమిస్తూ సీసీఎల్ఏ కమిషనర్ లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆమె హెచ్ఎండీఏ పని చేశా రు. తాజాగా ప్రభుత్వం కరీంనగర్ ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బన్నీ వేసవి యాత్ర–25
‘చిప్స్ వద్దు – నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు ముద్దు’ ఇంటి బయట బండి: బన్నీ, రామ్ చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ. తాతయ్య వాళ్లని దగ్గరకు పిలిచాడు. చుక్క, స్వప్న కూడా వచ్చారు. ‘రోజూ చిప్స్ తింటే పొట్ట నొప్పి, దగ్గు వస్తుంది. బలం ఉండదు’ అన్నాడు తాతయ్య. జేబులో నుంచి నువ్వుల ముద్ద, బెల్లం లడ్డు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చాడు. స్వప్న కొరికింది: ‘అబ్బా తాతయ్య , ఇది చాలా తియ్యగా ఉంది.’ తాతయ్య చెప్పాడు: ‘నువ్వులు ఎముకలకు బలం. బెల్లం రక్తానికి మంచిది. జలుబు రాదు.’ చుక్క అడిగింది: ‘మరి చిప్స్లో ఏముంది?’ తాతయ్య నవ్వాడు: ‘ఉప్పు, నూనె, జబ్బు.’ రామ్ అన్నాడు: ‘ఇక చిప్స్ వద్దు. నానమ్మతో లడ్డు చేయించుకుంటాను.’ తాతయ్య: ‘మన పాత తిండే మనకు మెడిసిన్. ప్యాకెట్ ఫుడ్ కాదు.’ బన్నీ అరిచాడు: ‘చిప్స్ బై బై, నువ్వుల ముద్ద హాయ్ హాయ్!’ పిల్లలకి మాట : ప్యాకెట్ తిండి రుచి కొద్దిసేపు. నానమ్మ చేతి లడ్డు జీవితాంతం ఆరోగ్యం. డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
గాలి ఓ మా చిరుగాలి
గాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మళ్లీ నీవు లేక ప్రాణం ఉండదులే మళ్లీ చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్లీ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ -
తెలుగు అంకెల దండ
1=1 ఒకటి 10¹ = 10 పది 10² = 100 వంద 10³ = 1000 వేయి 104 = 10000 పదివేలు 105 = 100000 లక్ష 106 = 1000000 పది లక్షలు 107 = 10000000 కోటి 108 = 100000000 పది కోట్లు 109 = 1000000000 వంద కోట్లు 1010 = 10000000000 అర్భుదం 10¹¹ = 100000000000 న్యర్భుదం 10¹² = 1000000000000 ఖర్వం 10¹³ = 10000000000000 మహా ఖర్వం 1014 = 100000000000000 పద్మం 1015 = 1000000000000000 మహాపద్మం 1016 = 10000000000000000 క్షోని 1017 = 100000000000000000 మహాక్షోనీ 1018 = 1000000000000000000 శంఖం 1019 = 10000000000000000000 మహా శంఖం 1020 = 100000000000000000000 క్షితి 10²¹ = 1000000000000000000000 మహా క్షితి 10²² = 10000000000000000000000 క్షోభం 10²³ = 100000000000000000000000 మహాక్షోభం ఇలా సున్నాలు చేర్చుతూ పోతే 1024 = నిధి 1025 = మహానిధి 1026 = పరకం 1027 = పరార్థం 1028 = అనంతం 1029 = సాగరం 1030 = అవ్యయం 10³¹ = అమృతం 10³² = ఆచింత్యం 10³³ = అమేయం 1034 = భూరి 1035 = మహాభూరి 10366 = పద్మం 1037 = మహాపద్మం 1038 = ఖర్వం 1039 = మహాఖర్వం 1040= శంఖంఇలా పేర్లు ఉన్నాయి.ఒక సారి రాసి గుర్తుంచుకోండి పిల్లలు.గడప రఘుపతిరావు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు. గ్రా: మర్రిగడ్డ, మండలం: చందుర్తి, జిల్లా: రాజన్న సిరిసిల్ల, 9963499282 -
సొంతింటి కల.. నెరవేర్చేలా..
సాక్షి పెద్దపల్లి: పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. వివిధ కారణాలతో అప్పుడు పదుల సంఖ్యలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపలేదు. వాటిని రద్దు చేసేందుకు అధికారులు ప్రభుత్వానికి సిఫారసు చేశారు. రద్దుచేసిన వాటిని మిగతా పేదలకు కేటాయించేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికితోడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ప్రతీ నియోజకవర్గానికి మరోరెండు వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ నిర్ణయించింది.అర్హులైన లబ్ధిదారుల ఎంపికతోపాటు పనులు ప్రారంభమైన నాటినుంచి ఇటు ప్రజాప్రతినిధులు, అటు అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఇళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం మొదలైన స్వల్పవ్యవధిలోనే నిధులు మంజూరై, గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం. దీనికితోడు ఇప్పటికే నిర్మాణాలు పూర్తయి, పంపిణీకి సిద్ధంగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను సైతం పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూమ్ ఇళ్లను పూర్తిచేసి, విద్యుత్, మంచినీటి, డ్రైనేజీ, రోడ్లు వంటి వసతులు కల్పించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన వాటిల్లో అనర్హులు ఉంటే తొలగించి, అర్హులకు కేటాయించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అనేకఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల కల ఫలించనుంది.జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 10,779 6,452 10,860 7,826 నిర్మాణదశలోనివి 9,320 2,066 7,740 5,585 పూర్తయినవి 1,459 1,012 1,247 2,241 జిల్లా కరీంనగర్ పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల మంజూరైనవి 9,021 3,394 8,360 6,886 పంపిణీ చేసినవి 4,129 1,630 5,292 3,610 పంపిణీకి సిద్ధంగా ఉన్నవి 4,892 245 2,449 250 -
పిల్లల మేధస్సుకు పునాది.. అబాకస్
కరీంనగర్కల్చరల్: కాలిక్యులేటర్లు, కంప్యూటర్లు లేని యుగంలో ప్రపంచానికి లెక్కల దారి చూపిన అద్భుత పరికరం అబాకస్. చిన్నచిన్న గుళికలను కదిలిస్తూ పెద్దపెద్ద గణిత సమస్యలను క్షణాల్లో పరిష్కరించే ఈ పురాతన సాధనం నేటికీ తన ప్రాధాన్యం కోల్పోలేదు. ముఖ్యంగా పిల్లల్లో గణిత నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, వేగవంతమైన ఆలోచనాశక్తిని అభివృద్ధి చేయడంలో అబాకస్ కీలక పాత్ర పోషిస్తోంది. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లెక్కల పరికరం ఆధునిక విద్యాప్రపంచంలోనూ విశేష ఆదరణ పొందుతోంది. బాలభవన్లో చిన్నారులు అబాకస్లో శిక్షణ తీసుకుంటూ.. సులువుగా లెక్కులు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. అబాకస్ నిర్మాణం అబాకస్ సాధారణంగా ఒక చట్రంలో(ఫ్రేమ్) ఉండే కడ్డీలు, వాటిపై కదిలే ముత్యాల్లాంటి గుళికలతో తయారవుతుంది. ప్రతీ కడ్డీ ఒక స్థాన విలువను సూచిస్తుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు గుళికలను కదిలించడం ద్వారా లెక్కలు చేస్తారు. అబాకస్ సుమారు 2000 సంవత్సరాల కంటే పాతది. చైనా, జపాన్, రోమ్ ప్రాంతాల్లో ఉపయోగించారు. జపాన్లో ఉపయోగించే అబాకస్ను సోరోబన్ అంటారు. అబాకస్ విశిష్టత వేగంగా లెక్కలు చేయగలగడం, కాలిక్యులేటర్ లేకుండా పెద్ద లెక్కల్ని కూడా త్వరగా చేయొచ్చు. పిల్లల మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఏకాగ్రత మెరుగవుతుంది. గణితంపై భయం తగ్గుతుంది. వేగంగా ఆలోచించే సామర్థ్యం పెరుగుతుంది. మానసిక లెక్కలు కొంతకాలం సాధన తర్వాత పిల్లలు అబాకస్ను ఊహలో చూసుకుంటూ మెంటల్ మ్యాథ్స్ చేయగలుగుతారు. చేతి, మెదడు సమన్వయంతో గుళికలను కదిలించడం వల్ల చేతి కదలికలు మెదడు పని కలిసి మెరుగుపడతాయి. ● సులభంగా లెక్కల సాధన ● మెదుడుకు చురుకుదనం.. జ్ఞాపకశక్తి పెరుగుదల బాలభవన్లో ఆరేళ్లుగా క్లాసికల్ డాన్స్, మ్యూజిక్ నేర్చుకుంటున్నా. గతేడాది నుంచి అబాకస్ నేర్చుకుంటున్నా. ముందుకన్నా ఫాస్ట్గా లెక్కలు చేయగలుగుతున్నా. దీనివల్ల మైండ్ షార్ప్ అవుతుంది. – వనజాక్షి, రాంనగర్ గణితంలో మెళకువలతో ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తున్నా. అబాకస్తో ఏకాగ్రత కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంతో కష్టమనిపించేది. అబాకస్ శిక్షణతో సులువైంది. – నిర్వాణ, హనుమాన్నగర్ -
తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
చొప్పదండి: తాళంవేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేస్తున్న దొంగలతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొంతకాలంగా పట్టణంలో వరుస చోరీలు జరుగుతుండగా... తాళం వేసిన ఇండ్లలోనే చోరీలు జరుగుతున్నాయి. తాజాగా విశ్రాంత ఉపాధ్యాయుడు రాజేశం కుటుంబ సభ్యులతో తిరుమల దర్శనానికి వెళ్ళి రాగా చోరీ ఘటన చోటు చేసుకుంది. నలుగురు సభ్యుల ముఠా చోరీకి పాల్పడినట్లు స్థానికంగా సీసీ కెమరాల్లో కనిపిస్తోంది. పోలీసుల ఉనికిని గమనిస్తు దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం. ముఖానికి గుడ్డ కట్టుకొని, నెత్తిన టోపీ పెట్టుకొని చోరీ అనంతరం దర్జాగా నడుచుకుంటు వెళ్ళినట్లు సీపీ పుటేజీల్లో కనిపిస్తోంది. పగటి పూట రెక్కీ నిర్వహిస్తూనే రాత్రి పూట చోరీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పైగా సీసీ కెమరాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకుంటు నంబర్ లేని వాహనంపై దొంగలు సంచరిస్తు ఫోన్లలో మాట్లాడటం గమనార్హం. కాగా చోరీ ఘటనను సీరియస్గా తీసుకున్నామని, పలు క్లూల ఆధారంగా దొంగలను ట్రేస్ చేసే పనిలో ఉన్నామని ఎస్ఐ నరేశ్ రెడ్డి తెలిపారు. -
ముగిసిన టీజీపీఈసెట్
● బీపీఈడీకి 1,788, డీపీఈడీకి 648 మంది అభ్యర్థులు హాజరు ● ఎండను సైతం లెక్క చేయకుండా హాజరైన అభ్యర్థులు ● 6న ఫలితాలు కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీజీపీఈసెట్)–2026 శారీరక, నైపుణ్య పరీక్షలు 4 రోజుల నుంచి కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ మైదానంలో జరుగుతుండగా.. బుధవారంతో ముగిశాయి. శాతవాహన విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సౌజన్యంతో నిర్వహించిన శారీరక, నైపుణ్య పరీక్షల్లో భాగంగా బీపీఈడీ కోర్సుకు 1,788 మంది, డీపీఈడీ కోర్సుకు 648 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 100, 400(మహిళలు), 800(పురుషులు) రన్నింగ్, షాట్పుట్, లాంగ్జంప్, హైజంప్తోపాటు 11 క్రీడల్లో అభ్యర్థులు ఎంచుకున్న వాటిలో పరీక్షలను నిర్వహించారు. జాతీయస్థాయిలో రాణించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి వాటికి వచ్చే మార్కులను సైతం నిర్వాహకులు కేటాయించారు. భగభగ మండుతున్న ఎండను సైతం లెక్క చేయకుండా 4 రోజుల్లో 2,436 మంది హాజరవడం విశేషం. జూన్ 6న ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీజీపీఈసెట్–2026 చైర్మన్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్, కన్వీనర్ రాజేశ్కుమార్ తెలిపారు. ఆత్మవిశ్వాసంతో గెలుపు ప్రస్తుత పోటీ ప్రపంచంలో అభ్యర్థులందరూ క్రమశిక్షణతో శారీరక నైపుణ్య పరీక్షలను ఎదుర్కోవాలని, ఆత్మవిశ్వాసమే అభ్యర్థులను గెలుపు తీరాలను చేరుస్తుందని యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ఉమేశ్కుమార్ అన్నారు. అభ్యర్థులను పరిచయం చేసుకొని టీజీపీఈసెట్ నైపుణ్య పరీక్షలను ప్రారంభించారు. కన్వీనర్ రాజేశ్కుమార్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు అన్ని వసతులతో పరీక్షలు నిర్వహించామన్నారు. బీపీఈడీ కోర్సుకు 2,386 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,788 మంది హాజరయ్యారన్నారు. డీపీఈడీ కోర్సుకు 976 మందికి గాను 648 మంది హాజరయ్యారని తెలిపారు. రిజిస్ట్రార్ సతీశ్కుమార్, ఓఎస్డీ హరికాంత్, జాఫర్, నజీముద్దీన్ మునవర్, శ్రీధర్రావు, శాతవాహన పీడీ విజయ్కుమార్, వివిధ విశ్వవిద్యాలయ వ్యాయామ అధికారులు పాల్గొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర –24
‘టీవీ వద్దు.. ఫోన్ వద్దు.. కథల పుస్తకాలు చదువుదాం’ఆదివారం పొద్దున్నే బన్నీ టీవీ ఆన్ చేశాడు.రామ్ ఫోన్లో గేమ్ పెట్టాడు. చుక్క, స్వప్న కూడా వాళ్ళ పక్కన కూర్చుని స్క్రీన్కే చూస్తున్నారు. తాతయ్య వచ్చి కరెంట్ స్విచ్ ఆఫ్ చేశాడు. ‘ఇవాళ కరెంట్ కట్’ అని నవ్వాడు. ‘బోర్ కొడుతుంది తాతయ్య’ అని చుక్క ముఖం చిట్లించింది. తాతయ్య అలమారలో నుంచి ఒక పాత సంచి తీశాడు. నిండా కథల పుస్తకాలు. ‘తెనాలి రామ, పంచతంత్రం, చందమామ – ఇవి చదివితే బుర్రకు బూస్ట్ఙ్ అన్నాడు. స్వప్న ఒక పుస్తకం తీసి చదివింది. ‘అరె, ఇది బాగుంది’ అని నవ్వింది. రామ్, బన్నీ కూడా ఒక్కో పుస్తకం తీసుకున్నారు. గది అంతా నిశ్శబ్దం అయింది. తాతయ్య చెప్పాడు: ‘టీవీ, ఫోన్ కళ్ళకు నొప్పి. పుస్తకం మెదడుకు పదును.’ చుక్క లేచి అంది: ‘ తాతయ్యా ... రోజూ అరగంట కథలు చదువుతాం.’ పిల్లలకి మాట: స్క్రీన్ చూస్తే సమయం పోతుంది. పుస్తకం చదివితే జ్ఞానం పెరుగుతుంది.డాక్టర్ కోట లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
పిల్లల విద్య
పుస్తకం చేతిలో ఉంటే భవిష్యత్తు వెలుగులో ఉంటుంది. అక్షరం నేర్చిన చిన్నారి ఆకాశాన్ని తాకే విజేత అవుతాడు. విద్య అనే అమూల్య ధనం ఎవ్వరూ దోచుకోలేరు ఎన్నడూ. గురువు చూపిన మార్గంలో, జ్ఞాన దీపం వెలిగించాలి. నేటి చదువు రేపటి బలం దేశానికి అది గొప్ప సంపద. ప్రతి బిడ్డ చదువుకోవాలి ప్రతీ కల నిజం కావాలి. విద్యతో ఎదిగి ఉన్నత శిఖరాలు చేరి భారత మాతకు కీర్తి తేవాలి. – పిల్లల విద్యే ప్రకాశవంతమైన భవిష్యత్తుకు పునాది – దూపాటి హరిప్రసాద్ షాపూర్ నగర్, హైదరాబాద్. -
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026
ఏమో.. తెలియదు సార్!సుబోధ్సింగ్ నెట్వర్క్లో లాయర్లు కూడా ఉన్నారు. అతడిని రాష్ట్రానికి తరలించాలని కరీంనగర్ పోలీసులు వేసిన ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారంట్ను సవాలు చేస్తూ సుబోద్ లాయర్లు అడుగడుగునా అడ్డుపడ్డారు. మొత్త ఆరు కోర్టుల్లో అతడిని లాయర్లు తమ వాదనలతో పోలీసులకు చుక్కలు చూపించారు. అయినప్పటికీ పోలీసులు చూపిన ఆధారాలకు న్యాయస్థానాలు సమ్మతించి సుబోధ్సింగ్ను అప్పగించడం అనివార్యంగా మారింది. సుబోధ్ను తరలించడంలో సీపీ గౌస్ ఆలం అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. న్యాయనిపుణులు, బిహార్కు చెందిన పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను సంప్రదిస్తూ.. పోలీసులకు ఎప్పటికపుడు సూచనలు చేశారు. బిహార్లో గడ్డాలు పెంచుకుని.. మాసినబట్టలతో పోలీసులు పూర్తిగా ఆహార్యం మార్చుకుని సంచరించారు. పలువురు అధికారులు సుబోధ్ తరలింపునకు అనేక అడ్డుపుల్లలు వేశారు. సుబోధ్ తరలింపునకు మార్గం సుగమం అయిన తరువాత అతడిని విమానాశ్రయానికి తరలించడం పోలీసులకు సవాలుగా మారింది. దారి వెంట అతడి అనుచరులు దాడిచేస్తారన్న సమాచారంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురావాల్సి వచ్చింది. అతడికి బేడీలు వేయకుండా విమానం ఎక్కించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. మే 28న సుబోధ్ని తరలిస్తున్నారన్న సమాచారం ముందుగా ఏవియేషన్ అధికారులకు తెలిపి వారి సాయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రయాణికులకంటే ముందే సుబోధ్కు బేడీలు తీసివేసి విమానం ఎక్కించారు. అతడికి ఎస్క్రా్ట్గా సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న కూర్చున్నారు. విమానం శంషాబాద్లో దిగాక సీపీ గౌస్ ఆలంతో సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.సుబోధ్ను బిహార్ నుంచి తీసుకొస్తున్న సీఐ తిరుమల్, ఎస్సై రాజన్న (ఫైల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు మాస్టర్మైండ్ సుబోధ్ సింగ్ కస్టడీలో నోరు మెదపడం లేదు. మే 3వ తేదీన కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన సుబోధ్ గ్యాంగ్.. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి పరారైన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన పోలీసులు ఈ కేసులో సూత్రధారి సుబోధ్సింగ్గా తేల్చారు. దేశవ్యాప్తంగా బంగారం దుకాణాల్లో ఆరితేరిన సుబోధ్ ముఠాసభ్యులు ఇప్పటివరకు బిహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో దోపిడీ చేశారు. ఈ గ్యాంగ్కు దక్షిణాదిన ఇదే తొలినేరం కావడం గమనార్హం. మే 28న బిహార్ నుంచి సుబోధ్ను తెలంగాణకు తీసుకొచ్చిన పోలీసులు అదే రోజురాత్రి కరీంనగర్కు తరలించారు. బుధవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి కస్టడీకి తరలించిన పోలీసులు వేసిన పలు పశ్నలకు సుబోధ్ మౌనం వహించినట్లు సమాచారం. అదే సమయంలో తన పాత కేసులకు సంబంధించి విషయాలను మాత్రం వెల్లడించినట్లు తెలిసింది. పోలీసు కస్టడీలో సుబోధ్సింగ్ ఏమాత్రం బెరుకు లేకుండా నవ్వుతూ సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం పలు సాంకేతిక వివరాలు అతని ముందుంచి ప్రశ్నించినట్లు తెలిసింది. సుబోద్తో పాటు రఘునాథ్ కర్మాకర్, రావేశ్కుమార్లను కలిపి విచారించారు. ఇప్పటికే పోలీసులు పట్టుకున్న మరో నిందితుడు మేహతాబ్(సిమ్ కార్డులు సరఫరా చేసిన వ్యక్తి)ని కస్టడీకి దూరంగా ఉంచారు.వాస్తవానికి దోపిడీ జరిగిన విధానం పోలీసులకు సవాల్గా మారింది. అయినప్పటికీ కరీంనగర్ పోలీసులు కేసును తక్కువ వ్యవధిలో ఛేదించారు. ఇప్పటికే బంగారం దేశందాటి నేపాల్కు వెళ్లినా సరే దోపిడీలో పాల్గొన్న దాదాపు అందరి వివరాలు సేకరించగలిగారు. ఇటీవల పోలీసులు పట్టుకొచ్చిన రఘునాథ్ కర్మాకర్, రావిశ్కుమార్, మెహతాబ్ఖాన్ను అరెస్టు చేయగలిగారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా సుబోధ్ సింగ్ను మాస్టర్మైండ్గా తేల్చిన పోలీసులు అతని కోసం ఇటీవల బిహార్ వెళ్లారు. అక్కడ సుబోధ్ కోసం న్యాయపోరాటమే చేయాల్సి వచ్చింది. -
శరీర అవయవాల పేర్లతో పొడుపు కథలు
1. పొద్దస్తమానం పనిచేస్తూనే ఉండే బానిస నోరు అనే భూస్వామి వద్ద వెట్టి చేస్తోంది ఆయన ఇంట్లోకి ఎన్నెన్ని తెచ్చి పడేసినా నోరు మెదపక దంచి, మెత్తగా నూరుతుంది. 2. మనిషి జాతకమే నాదగ్గరుందని పోసుకోలు కబుర్లు చెప్తుంది ప్రమాణ సాక్షిగా నిజమే చెప్తున్నానంటూ మాటిమాటికీ ఓట్లు వేస్తుంది. 3. పిడికెడంత చిన్న ఇల్లు దాన్లో నాలుగు గదులు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు. 4. పటిష్టమైన భద్రత మధ్య ప్రధానమైన అవయవం అందరితో పని చేయిస్తూ అన్నీ చూసుకునే పెద్దబాస్ ముడతల శరీరమే గానీ మహా తెలివిమంతురాలు 5. ఎంతసేపూ మనం మాట్లాడితే వినటమే గానీ తాను నోరిప్పి ఒక్కమాటా మాట్లాడదుఅంతేగాదు ఒట్టి నగల పిచ్చిది కూడా లోలాకులు, రింగులు, జూకాలు, కమ్మలు అంటూ రకరకాలు సింగారించుకుంటుంది. 6. ప్రాణవాయువును పీల్చుకుంటుంది కార్బన్ డైయాకై ్సడ్ను వదుల్తుంది వాసనలను చక్కగా చెపుతుంది దుమ్ము ధూళిని అడ్డుకుంటుంది. 7. మాటలైతే మాట్లాడుతుంది గానీ తిండి మాత్రం తనంత తాను తినదు కలిపి ముద్దలు పెడితేనే తింటుంది. ఇంత గారాబమైతే ఎలాగమ్మా! 8. శరీరం రాజులా మీద ఎక్కి కూర్చుంటే సేవకుల్లా ఇవి మోసుకుంటూ తిరుగుతాయి. ముల్లు గుచ్చుకున్నా, ఎదుర్రాయి కొట్టుకున్నా బాధలు, నొప్పులు, కన్నీళ్లు, రక్తాలు వీటికే– కందేపి రాణీప్రసాద్ రచయిత్రి, సిరిసిల్ల జిల్లా: రాజన్నసిరిసిల్ల జవాబులు: 1.జీర్ణాశయం, 2.అరచేయి, 3.గుండె, 4.మెదడు, 5.చెవి, 6.ముక్కు, 7.నోరు, 8.కాళ్ళు -
96 శాతం ధాన్యం కొనుగోళ్లు పూర్తి
కరీంనగర్ అర్బన్: జిల్లాలోని ధాన్యం సేకరణ ప్రక్రియ 96 శాతం పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి రాగా 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయగా రైతులకు రూ.628 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 236 కేంద్రాలను అధికారులు మూసివేశారని, ఈ నెల 6వ తేదీలోగా మిగిలిన 81 కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తంగా మరో మూడు రోజుల్లో యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నూరు శాతం పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో, మానకొండూర్ నియోజకవర్గంలోని మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నూరుశాతం పూర్తి కావడంతో అన్ని కొనుగోలు కేంద్రాలను మూసి వేసినట్లు వివరించారు. చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కొనుగోలు ప్రక్రియ మూడు రోజుల్లో ముగియనుందని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం నుంచి 3,16,926 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని, 95 శాతం తరలింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో కేవలం 13,139 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, ఈ ప్రక్రియ మరో మూడు రోజుల్లో పూర్తవుతుందని వివరించారు. ‘ప్రజాపాలన’ పకడ్బందీగా నిర్వహించాలి.. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 4, 6, 8, 10 తేదీల్లో జరగనున్న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే వనమహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, బౌండరీలు ఉన్న ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్ రెడ్డి, డీఆర్వో జె.స్వామి, సీపీవో రామ్దత్తరెడ్డి, డీపీవో జగదీశ్వర్, ఇన్చార్జి సీఈవో పవన్ కుమార్, డీఈవో ప్రశాంత్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఆర్డీఓ గీత, మెప్మా పీడీ స్వరూపరాణి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. -
నాన్న కోరిక
అనగనగా ఒక ఊరిలో కనకయ్య మల్లమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక కొడుకు ఆ కొడుకు పేరు నారాయణ. అతడు పదవ తరగతి చదువుతున్నాడు. కానీ చదువును ఆశ్రద్ద చేసేవాడు. కానీ వాళ్ళ నాన్నకు మాత్రం నారాయణను బాగా చదివించాలనే కోరిక ఉండేది. ఒకరోజు కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు నారాయణ కనకయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్లు పరీక్షించి ఏమీ కాదు అని చెప్పి కొన్ని మందులు ఇచ్చి పంపారు. కానీ.. కొద్ది రోజుల తర్వాత మళ్లీ కనకయ్యకు గుండెపోటు వచ్చింది. అప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. దానికి రూ. 30 లక్షలు ఖర్చు అవుతాయని చెప్పడం జరిగింది. కానీ.. వాళ్ల దగ్గర అంత డబ్బు లేకపోవడంతో డబ్బు ఏర్పాటుకు చాలా మందిని అడిగారు. కానీ.. ఈలోగ కనకయ్యకు మళ్లీ గుండెపోటు వచ్చి మరణించాడు. అప్పుడు నారాయణ చాలా బాధపడ్డాడు తన వద్ద డబ్బు ఉంటే తన తండ్రిని బతికించుకునే వాడిని అని చాలా ఏడ్చాడు. నాలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకూడదు అని అనుకున్నాడు. అప్పటి నుండి వాళ్ల అమ్మ చెప్పినట్టు విని బాగా చదివాడు. పదవ తరగతి లో జిల్లా మొదటి స్థానం సాధించాడు. అతని ప్రతిభను చూసి ఒక మంచి కాలేజ్ వాళ్లు నారాయణకు ఉచితంగా విద్యను అందించడానికి ముందుకు వచ్చారు. ఆ తరువాత నారాయణ బాగా చదివి డాక్టర్ అయ్యాడు. నారాయణ వాళ్ల నాన్న కోరుకున్నది జరిగినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషపడింది. నారాయణ ఒక ఆసుపత్రిని నిర్మించి అందరికీ ఉచితంగా వైద్యం చేశాడు. – హాసిని తరగతి: 7వ తరగతి పాఠశాల: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గ్రామం: చింతకుంట, కరీంనగర్ దుర్గం భైతి, ప్రభుత్వ ఉపాధ్యాయులు, రామునిపట్ల, సిద్దిపేట జిల్లాగాలి గాలి ఓ చిరుగాలి పవనాలుగా నీవిక తేలి నీవస్తావులే మా ఇంటికి నచ్చావులే మా కంటికి ! నీ వల్లే మాకు ఊపిరి ఉంది నీవు లేకుంటే కలుగు ఇబ్బంది మమ్ము అంటిపెట్టుకొని ఉంటావు అవునా కాదా ఇక ఏమంటావు ? నీ సమాధానం ఇక ఏదైనా నీవు లేకుండా పోదు పొద్దైనా ఓ గాలితల్లి మా చిరుగాలి మల్లి నీవు లేక ప్రాణం ఉండదులే మళ్ళి చెట్లు ఊగితే నీ ఉనికి తెలుసు అట్లనే చేయకు నీవిక అలుసు బొగ్గు పులుసు గాలి నీలో ఉంది దానితో మాకు కలుగు ఇబ్బంది ! గాలి తల్లి మా చిరుగాలి మల్లి మమ్ము విడిచి ఉండకు నీ వెళ్లి నీవు లేకుండా ఉండదు ఏ గల్లి నీవు వస్తేనే బాగుంటుంది మళ్ళీ ! గాలి తల్లి ఓ చిరుగాలి మల్లి హోరుగాలితో చేయకు లొల్లి చల్లగా తగిలితే కలుగు హాయి మెల్లెగ మది ఉప్పొంగు నోయి ! – గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత గ్రామం: కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా గాలి ఓ మా చిరుగాలిమన ఊరు మన బడి మనదే ఈ జీవితం అక్షర జ్ఞానం పొంది అవుదాం ఉన్నతం ఒకే మాట ఓకే పాట ఒకటే మన బడిబాట అమ్మ నాన్న కలలు కన్న అక్షరాల పూల తోట చక్కని క్రమశిక్షణతో చదువుకుని ఎదుగుదాము ఆచార్యుల మాట విని అవనికి వెలుగవుదాము ఆట పాటలు కంప్యూటర్ అవలీలగా నేర్చుకుని అన్ని రంగాల్లో మనమే ముందడుగులు వేద్దాము విలువైన విషయాలతో విజ్ఞాన విద్యనందుకుని విశ్వసేవ పథాన మనం వీరత్వం చూపుదాము వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించారా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సప్ నెం: 8500786474 ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు..పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా... -
ఎల్ఎండీకి వచ్చిన సీపీ
తిమ్మాపూర్: మండలంలోని దిగువమానేరు జలాశయం పరిశీలనకు కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌస్ ఆలం బుధవారం అకస్మాతుగా వచ్చారు. దాదాపు రెండు గంటల పాటు డ్యామ్ను వివిధ భాగాల్లో కలయతిరిగారు. డ్యామ్ కట్టపై నుంచి నీటి ప్రవాహం ఉన్నంతవరకు నడుచుకుంటూ లోపలికి వెళ్లిన సీపీ, నీటి విడుదల, నీటి నిలువను సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఏవైనా ప్రమాదాలు ఉంటాయా, నీటి కొరత ఎలా ఉంటుందనే అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. మట్టి తరలింపు పరిశీలన.. మానేరు రివర్ ఫ్రంట్ పనుల కోసం తరలిస్తున్న మట్టి లారీల వివరాలు సీపీ తెలుసుకున్నారు. ఈ వాహనాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్యామ్లో తిరగడం స్థానికులు, అధికారులలో ఆశ్చర్యం కలిగించింది. మట్టి మాఫియా ఏమైనా ఉందా అని కూడా ఆరా తీసినట్లు సమాచారం. అదేవిధంగా సాయంత్రం వేళలో డ్యామ్ కట్టపై పెట్రోలింగ్ మరింత పెంచాలని డ్యామ్ పరిసరాలకు విద్యార్థులు పిల్లలు రాకుండా చర్యలు తీసుకోవాలని తిమ్మాపూర్ సీఐ రమేశ్, ఎస్ఐ అన్వర్లకు సూచించారు. -
అభివృద్ధిలో ఆదర్శం
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్: అభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలుస్తోందని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాల ఫలితంగానే తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. 2014 జూన్ 2న సాకారమైన స్వప్నం నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తోందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్–2047’ దిశానిర్దేశక పత్రాన్ని రూపొందించిందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సంపద సృష్టి, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యాలని వివరించారు. జిల్లాలో ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ విజయవంతంగా అమలవుతోందని, వేలాది ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం చేపట్టినట్లు వివరించారు. -
ఇక పూర్వ ప్రాథమిక విద్య
కరీంనగర్రూరల్/గన్నేరువరం: రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన పూర్వప్రాథమిక విద్యకు స్పందన లభించింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి మరికొన్ని పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసింది. జిల్లాలో 58 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మంజూరు అయ్యాయి. కరీంనగర్ మండలంలో చెర్లభూత్కూర్, నగునూరు, దుర్శేడ్ ప్రాథమిక పాఠశాలలున్నాయి. గన్నేరువరం మండలంలో ఖాసీంపేట, మైలారం, గన్నేరువరం పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాల్లలో ఈ నెల12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మండల విధ్యాధికారులు తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేరడం లేదు. ఇంగ్లిష్ మీడియం లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముందుకు రావడం లేదు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆరు సంవత్సరాలు నిండిన విద్యార్ధులను ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించేవారు. ప్రస్తుతం నాలుగేళ్లు నిండిన చిన్నారుల కోసం యూకేజీ తరగతిని ప్రారంభించనున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఆర్థికభారం తప్పుతుంది. పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించే పాఠశాలల్లో సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసింది. ఒక్కో పాఠశాలకు రూ.1.70లక్షలు కేటాయించారు. తరగతి గదుల గోడలకు రంగులు, బొమ్మలకు రూ.50వేలు, బెంచీలు, ఇతర సామగ్రికి రూ.50వేలు, క్రీడాసామాగ్రికి రూ.50వేలు, స్టేషనరీ, యూనిఫామ్స్, బూట్లు, బెల్టులకు రూ.20వేల చొప్పున ఖర్చు చేస్తారు. -
అమరులకు నివాళి
పరేడ్ గ్రౌండ్లో ఆవిర్భావ వేడుకల్లో జెండావిష్కరణ అనంరతం మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు, సుడా, గ్రంఽథాలయ చైర్మన్లు, అధికారులతో కలిసి మంత్రి అమరవీరులస్తూపం వద్దకు వెళ్లారు. అక్కడ తెలంగాణ అమరవీరులకు నివాళి అర్పించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ చిత్రామిశ్రా, సీపీ గౌస్ ఆలం, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నెరవేర్చిన సోనియాగాంధీ
కరీంనగర్ కార్పొరేషన్: తెలంగాణ ప్రజల ఆకా ంక్షను గుర్తించి, కరీంనగర్లో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక రాష్ట్ర కలను సోనియాగాంధీ నిజం చేశారని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశం, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోర్టులో..కరీంనగర్క్రైం: జిల్లా కోర్టు ఆవరణలో ఏసీబీ న్యాయమూర్తి, ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి నామ సంతోష్ కుమార్ జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సీహెచ్.కుమార్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్కట్ చేశారు. న్యాయమూర్తి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర మర్చిపోలేనిదని అన్నారు. అదనపు జిల్లా జడ్జి నీరజ, మేజిస్ట్రేట్లు సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. పరిపాలన కార్యాలయం వద్ద అడిషనల్ డీసీపీ (అడ్మిన్) వెంకటరమణ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. -
డీలర్లే రైతులకు వారధులు
కరీంనగర్ అర్బన్: విత్తనాలు, ఎరువుల కోసం వచ్చిన రైతుకు ఇన్పుట్ డీలర్లు సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇన్పుట్ డీలర్లకు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై డిప్లొమా కోర్సు శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం జిల్లా కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఎక్కువగా డీలర్లని నమ్ముతారని, అందువల్ల డీలర్లకు సరైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకుగాను ఈ శిక్షణ కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు విక్రయించాలని, వాతావరణ అంచనాలను పరిస్థితులను వివరించాలని తెలిపారు. అనంతరం 36మందికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, ఆత్మ పీడీ చత్రునాయక్ తదితరులుల పాల్గొన్నారు. ఖేత్ బచావో అభియాన్ ప్రారంభం ఖేత్ బచావో అభియాన్ పోస్టర్ను కలెక్టర్ చిత్రామిశ్రా ఆవిష్కరించారు. ఈ నెల1 నుండి 30 వరకు వ్యవసాయ శాఖ అధికారులు నేల ఆరోగ్య పరిరక్షణ కాంపెయిన్ను నిర్వహించనున్నారు. 4 నుంచి గ్రామ, వార్డు సభలు ఈ నెల 4నుంచి జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్లలో సభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా అధికారులను ఆదేశించారు. 4, 6, 8, 10వ తేదీల్లో సభలను నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. -
కలెక్టర్ మేడం.. దండం పెడుతున్నా..
‘నా పేరు మీస వరుణ్ వర్మ. నేను మానకొండూర్లో 7వ తరగతి చదువుతున్న. కరీంనగర్– వరంగల్ జాతీయ రహదారి పూర్తవుతుండగా మా గ్రామ స్టేజీ వద్ద కెనాల్ ఉండటంతో ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఎడమ పక్కన సర్వీస్ రోడ్డు నిర్మాణం చేయకపోవడం వల్ల పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. మాకే కాదు ప్రజలందరికీ తీవ్ర ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ మేడమ్.. మీకు దండం పెడుతున్నా సర్వీస్ రోడ్డుతో పాటు బస్టాప్ ఏర్పాటు చేస్తేనే మా చదువులు సాగుతాయి.. లేకుంటే అంతే’కరీంనగర్ అర్బన్/మానకొండూర్: సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల పూర్తిగా గ్రామానికే రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లకార్డు లతో సోమవారం కలెక్టరేట్కు భారీగా తరలిరాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు కలెక్టరేట్లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. తమ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి వెలిబుచ్చిన కష్టం అందరినీ ఆలోచింపజేసింది. అనంతరం కలెక్టర్ చిత్రామిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. -
మోస్ట్ వాంటెడ్ ధూమ్ ఖాలీద్ అరెస్ట్
కరీంనగర్రూరల్: దశాబ్ధకాలంగా తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తుడిని కరీంనగర్రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లాలో మోస్ట్ వాంటెడ్ అయిన మహ్మద్ అబ్దుల్ వాజిద్ అలియాస్ ధూమ్ ఖాలీద్ పదేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు. గతంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఖాలీద్పై దాడిచేయగా రెండు కాళ్లు పోయాయి. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయగా బెయిల్పై బయటకు వచ్చి మహరాష్ట్ర పారిపోయి, నేరాలు కొనసాగించాడు. నాగపూర్, నాందేడ్, చంద్రపూర్, బల్లార్షా తదితర ప్రాంతాల్లో గ్యాంగులను ఏర్పాటు చేసుకున్నాడు. బిక్షగాడి వేషధారణలో దర్గాల వద్ద షెల్టర్ తీసుకుంటూ వాహనాల్లో తిరుగుతూ నేరాలకు పాల్పడేవాడు. హైదరాబాద్లో పలు నేరాలకు పాల్పడిన ధూమ్ ఖాలీద్పై కరీంనగర్రూరల్ పోలీస్స్టేషన్లో 5 కేసులు, వన్టౌన్లో 2, టుటౌన్లో 1 కేసు నమోదు కాగా నాందేడ్, నాగపూర్, బల్లార్షా, చంద్రపూర్లోనూ కేసులున్నాయి. కరీంనగర్లోని పలు స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదైన ఖాలీద్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచాలని, అతని కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. అతడి గురించి ఆరా తీస్తే చనిపోయాడని తెలిసింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని మేడిపల్లిలో ఉంటున్నట్లు పక్కా సమాచారం అందింది. ఆరు మాసాలుగా కరీంనగర్లో ఉంటున్న అతని భార్యను చంపాలని ప్రయత్నిస్తున్న ఖాలీద్ సోమవారం కరీంనగర్కు వచ్చాడనే సమాచారంతో కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరిచారు. -
వేడుకలకు పరేడ్ మైదానం ముస్తాబు
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పరేడ్ మైదానం ముస్తాబైంది. సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంగళవారం పతాకావిష్కరణ చేయనున్నారు. ఉదయం 8గంటలకు పతాకావిష్కరణ జరగనుండగా 8.02గంటలకు రాష్ట్ర గీతాలాపన, 8.07గంటలకు గౌరవ వందన స్వీకారం, 8.15గంటలకు మంత్రి సందేశం, 8.25గంటలకు అమరవీరుల కుటుంబాలను సన్మానించనుండగా 8.35గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం 9గంటలకు పోలీస్ మెడల్స్ పంపిణీ, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఉత్తర్వుల పంపిణీ చేయనుండగా 9.30గంటలకు వివిధ శాఖల స్టాల్స్ను మంత్రి పరిశీలించనున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి దిశగా దూసుకెళ్తోంది. ఒకప్పుడు ఉన్నత విద్య, వైద్య సేవల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడిన ఈ ప్రాంతం నేడు విద్యా,వైద్య రంగాల్లో స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిమిత స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలుండగా, ప్రస్తుతం కొత్తజిల్లాల వారీగా ఆధునిక వైద్యసేవలు, మెడికల్ కాలేజీలు, మాతాశిశు ఆరోగ్యకేంద్రాలు, గురుకుల విద్యాసంస్థలు, కార్పొరేట్ ఇంజినీరింగ్ కాలేజీలు, డిజిటల్ విద్యావసతులు అందుబాటులోకి వచ్చాయి. నీటిపారుదల, సాగు రంగంలో వచ్చిన కీలకమార్పులతో ప్రజలకు ఆర్థిక స్థిరత్వం కలిగి, తలసరి ఆదాయం మెరుగుపడింది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లా విద్యారంగంలో మంచిస్థాయిలో ఉన్నప్పటికీ, ఉన్నత విద్య, వృత్తివిద్య, వైద్య విద్యలో అవకాశాలు పరిమితంగా ఉండేవి. ప్రభుత్వ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలే ఆధారంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ, జూనియర్ కాలేజీల కొరత స్పష్టంగా ఉండేది. స్వరాష్ట్రంలో కొత్త జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, గురుకుల, రెసిడెన్షియల్, పాలిటెక్నిక్ కాలేజీలు విస్తరించాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యలో అభివృద్ధి జరిగింది. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్కు రూ.2,821 కోట్లు మంజూరయ్యాయి. సిది పేట వరకు 75 కిలో మీటర్లు రైల్వేలైన్ పూర్తయి రైలు నడుస్తోంది. మానేరు రివర్ ఫ్రంట్ మంజూరైంది. దీనికి రూ. 610 కోట్లు నిధులు కేటాయించారు. నదిపై 3 కిలో మీటర్ల మేర ఎంఆర్ఎఫ్ను ఏర్పాటు చేసేందుకు కొంత మేర సైడ్వాల్స్ ఏర్పాటు చేశారు. మానేరు నదిపై తీగల వంతెనకు రూ. 224 కోట్ల నిధులు మంజూరయ్యాయి. దేశంలోనే రెండో తీగల వంతెనగా కరీంనగర్కు ఐకాన్గా నిలిచింది. స్మార్ట్ సిటీగా దేశంలోని వంద నగరాలతో పాటు కరీంనగర్ను అభివృద్ధి చేశారు. కేంద్రం రూ.845 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో నగరంలో రోడ్లు, డ్రెయినేజీలు, పార్కులు, కమాండ్కంట్రోల్ సెంటర్ వంటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కరీంనగర్కు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. దీనికి రూ. 200 కోట్లు నిధులుమంజూరయ్యాయి. మానేరు డ్యాం సమీపంలో ఐటీ టవర్ ఏ ర్పాటు చేశారు. దీనికి రూ. 25 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ గెస్ట్హౌజ్ను పాత భవనంస్థానంలో అధునాతనంగా మార్చారు. దీనికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశారు. పరిపాలన సౌలభ్యం కోసం పాత భవనంస్థానంలో కొత్త కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేశారు. దీనికి రూ.45 కోట్లు మంజూరుచేశారు. నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో రూ.400 కోట్లతో రామగుండం మెడికల్ కాలేజీ, జిల్లా ఆసుపత్రి అప్గ్రేడ్, పెద్దపల్లి, మంథనిలో కొత్తగా మాతశిశుఆరోగ్య కేంద్రాలు, కొత్త కలెక్టరేట్, రామగుండం కమిషనరేట్, మహిళ, సైబర్ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి బస్డిపో, బైపాస్ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి, పార్వతి బరాజ్లు, నంది పంపుహౌజ్, గాయిత్రీ పంపుహౌజ్, మిడ్మానేరులతో ఉమ్మడి జిల్లాలో సాగునీరుకు డోకాలేకుండా పోయింది. వేములవాడలో సుమారు 166కోట్లతో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారు. మూలవాగు బ్రిడ్జి నుంచి వేములవాడ దేవస్థానం వరకు రూ.45 కోట్లతో రోడ్డు విస్తరణ పనులు సాగుతున్నాయి. సిరిసిల్ల టెక్స్టైల్ పరిశ్రమకు మద్దతుగా యారాన్ డిపో(నూలు) ఏర్పాటు, జిల్లాలో 11వేలకు పైగా పాత పవర్లూమ్లను ఆధునీకరించారు. 126చేనేత సహకార సంఘాలు, 1600 చిన్న పవర్లూమ్ యూనిట్లకు ప్రోత్సాహం, టెక్స్టైల్ పార్కు, గార్మెంట్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ పరిసరాల అభివృద్ధికి సుమారు రూ.76 కోట్లు, అన్నప్రసాద భవన నిర్మాణానికి రూ.35 కోట్లు పైగా నిధుల కేటాయించారు. వీటీడీఏ ఏర్పాటుతో వేములవాడ సరికొత్తగా రూపుదిద్దుకోనుంది. జగిత్యాలలో మెడికల్ కాలేజీ ఏర్పాటు, పా రామెడికల్ విద్యా అవకాశాలు పెరిగాయి. నేషనల్ హైవే–563 విస్తరణ పనులు, రాళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయ్యాయి. బసంత్నగర్ ఎయిర్పోర్టు, రామగుండం–మణుగూర్ను కలిపే కోల్కారిడార్, ఈఎస్ఐ ఆసుపత్రి, పత్తిపాక రిజర్వాయర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తదితర దీర్ఘకాలిక ప్రాజెక్టులు స్వరాష్ట్రంలో సైతం నెరవేరకపోవడంపై ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: ప్రణాళికాబద్ధంగా నగరంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరంలోని 1వ డివిజన్ ఆరెపల్లిలో రూ.10 లక్షలతో చేపట్టనున్న సీసీ డ్రైన్ పనులకు శంకుస్థాపన చేశారు. 19వ డివిజన్ రేకుర్తిలో రూ.10 లక్షల సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు బారి అపర్ణ జితేందర్, సుధగోని మాధవి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ సిటీ: హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్వహించిన భారత్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం సస్టైనబుల్ క్యాంపస్ ఇంపాక్ట్ సమ్మిట్ అవార్డ్స్–2026లో నగరంలోని ఎస్సారార్ కళాశాల ప్ర తిష్టాత్మక గోల్డ్ సస్టైనబుల్ క్యాంపస్ అవార్డు గెలుచుకుంది. కళాశాల వృక్షశాస్త్ర విభాగా ధిపతి తిరుకోవెల శ్రీనివాస్ స్వీకరించారు. కళా శాలలో పర్యావరణ పరిరక్షణ, హరితహారం, సీడ్బాల్ ఉద్యమం, జీవవైవిధ్య పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పచ్చదనం అభివద్ధి వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ తెలిపారు. కరీంనగర్ టౌన్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా బదిలీపై వచ్చిన ప్రశాంత్ రెడ్డి సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) స్వీకరించారు. భువనగిరి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ప్రశాంత్రెడ్డి విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరిస్తూ డీఈవో హోదాలో అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానా జీ వాకడే నుంచి డీఈవో ఫుల్ అడిషనల్ చార్జ్ ను స్వీకరించారు. కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్.ప్రశాంత్రెడ్డిని తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీజీహెచ్ఎంఏ) జిల్లా అధ్యక్షుడు పోలా డి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి, రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొనసాగుతున్న పీఈసెట్ ప్రవేశ పరీక్షలుకరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీపీఈసెట్)– 2026 ఉత్సాహంగా సాగుతోంది. సోమవారం నాటికి పురుష అభ్యర్థులకు శారీరక పరీక్షలు ముగిశాయి. నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు జరుగనున్నాయి. మంగళవారం 656 మందికి ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఉద యం పరీక్షలు తీరును శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్ కుమార్ పరీశీలించారు. సోమవారం పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించినట్లు టీజీపీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ తెలిపారు. బీపీఈడీ కోర్సుకు 701 దరఖాస్తులు రాగా.. 529 మంది ప్రవేశ పరీక్షలో పాల్గొన్నారని, 172 మంది పరీక్షకు గైర్హాజరయ్యారని తెలిపారు. డిప్లొమా వ్యాయామ విద్యలో 306 మంది దరఖాస్తు చేసుకోగా 211 మంది పరీక్షలకు హాజరవుగా 95 మంది గైర్హాజరయ్యారని తెలిపారు సర్టిఫికెట్ల పరిశీలనసప్తగిరికాలనీ(కరీంనగర్): తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడుత ధ్రువపత్రాల పరిశీలన సోమవారంతో ముగిసింది. చివరి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 363 మంది సర్టిఫికెట్లు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్ శోభారా ణి తెలిపారు. మొత్తంగా 1,282 మంది ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్నట్లు పేర్కొన్నారు. ధ్రువపత్రాల పరిశీలన చేసుకున్న వారు తప్పనిసరిగా ఇంటర్నెట్లో ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసుకోవాలని, జూన్ 3 చివరి తేదీ అని, సీట్ల కేటా యింపు 6న ఉంటుందన్నారు. వెబ్సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, స్వీయ నివేదన 6 నుంచి 9వరకు, కళాశాలలో రిపోర్టింగ్ జూన్ 8, 9 తేదీల్లో చేయాలన్నారు. జూన్ 8నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని తెలిపారు. -
బాలల గణపతి
శుభ వినాయక నమో నమామి మొదటి పూజలు నీకే స్వామి నిన్ను మ్రొక్కిన తొలగు విఘ్నములు నీ చూపు సోకిన మంచి శకునములు పిల్లల మంతా నిన్ను కొలిచెదము విద్యా బుద్ధులు చక్కగ నొసగుము తల్లి దండ్రులను పూజించావట మాకు చూపుమా ఆ చక్కని బాట నీ చల్లని కరుణ మాపై చూపుము మా అజ్ఞానాన్ని రూపుమాపుము నీ రూపం మాకు ఎంతో ఇష్టం మా పిల్లలకు నీవే ప్రియదైవం నిత్యము నిన్నే కొలుచెదము నీ పూజలు చేసి మురిసెదము – బూర దేవానందం కవి, రచయిత, సిరిసిల్ల -
8 బంతులు.. 24 పరుగులు
విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క్రికెట్ ఆడుతున్నా. రాష్ట్రస్థాయి క్రికెట్లో చివరి మ్యాచ్లో అవకాశం వచ్చింది. 8 బంతుల్లో 24 పరుగులు చేశాను. మంచి బ్యాట్స్మెన్ కావాలన్నదే లక్ష్యం. సిరిసిల్లలో కోచ్లు బాగానే శిక్షణ ఇస్తున్నారు. మౌలిక వసతులున్న క్రికెట్ మైదానాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి. – చేర్ల దీపక్, ఇంటర్ సెకండియర్ మహిళా క్రికెటర్ దీప్తిశర్మ అంటే ఇష్టం. అమ్మానాన్న క్రికెట్పై నాకున్న ఇష్టానికి ప్రాధాన్యమిచ్చి శిక్షణ ఇప్పిస్తున్నారు. మా ఇద్దరు కోచ్లు మెలకువలు నేర్పుతున్నారు. వేసవి సెలవుల్లో క్రికెట్ శిబిరాన్ని వినియోగించుకుంటున్నా. జాతీయస్థాయి పోటీల్లో రాణించి జీవితంలో డాక్టర్గా స్థిరపడాలన్నదే లక్ష్యం. – మోర హిమాని, 5వతరగతి -
క్రమశిక్షణ అలవడుతుంది
పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని ప్రోత్సహిస్తే వారిలో ఫిట్నెస్ పెరుగుతుంది. ఆటగాళ్లుగా క్రీడాస్ఫూర్తి పెరిగి చదువుల్లోనూ రాణిస్తారు. క్రమశిక్షణ గల జీవితాన్ని అలవాటు చేసుకుంటారు. క్రికెట్ నేర్చుకుంటున్న పిల్లల్లో ఆన్లైన్ గేమ్స్, ఫోన్ ఫోబియా తగ్గిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడాసక్తిని గమనించి వారికి సరైన శిక్షణ ఇప్పించాలి. జిల్లాలో చాలామంది క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించారు. – దొబ్బల ప్రేమ్కుమార్, ఫిట్నెస్ కోచ్ -
యువతను ఉపాధి వైపు మళ్లించాలి
● మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు తిమ్మాపూర్(మానకొండూర్): యువతను ఉపాధి వైపు మళ్లించాలని మాజీ గవర్నర్ విద్యాసాగర్రావు అన్నారు. స్వావలంబన, స్వపరిపాలన దిశగా రాష్ట్రం అడుగులు వేయాలని సూచించారు. ఆదివారం మహాత్మానగర్ పంచాయతీ పరిధి శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్– 2026 శిబిరం ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత దేశానికి బలమని, యువశక్తిని సరైన దిశలో నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహిస్తామని సీఎం చెప్పినా, ఆ మాటలు కార్యరూపం దాల్చడం లేదని విమర్శించారు. ప్రతీ మండలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేస్తే యువత చెడుమార్గాలకు దూరంగా ఉంటారని, సృజనాత్మక రంగాల వైపు మొగ్గు చూపుతారని అభిప్రాయపడ్డారు. చిన్న, మధ్య తరహా ఎంటర్ప్రైజెస్ను ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అ వకాశాలు సృష్టించాలని సూచించారు. రాయికల్లో జీఎంఆర్ సహకారంతో ఎలక్ట్రీషియన్ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయాన్ని ఉదాహరణగా చెప్పి, ఇలాంటి మోడల్స్ను మ రిన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని కోరారు. తెలుగుభాషను కాపాడుకోవాలి తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని విద్యాసాగర్రావు పేర్కొన్నారు. యునెస్కో ఆదేశాల మేరకు ఫిబ్రవరి 21వ తేదీని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. పంప కవి తెలుగు సాహిత్యానికి ఆదికవిగా ప్రసిద్ధి చెందారని, ఆయన విగ్రహాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కలిసి హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఆవిష్కరించాలని సూచించారు. ఇది తెలుగుభాష గౌరవానికి గొప్ప నిదర్శనమవుతుందని అభిప్రాయపడ్డారు. నగరపాలక సంస్థ ఈఈ, డీఈ బదిలీకరీంనగర్కార్పొరేషన్: నగరపాలక సంస్థ ఈఈ, డీఈ బదిలీ అయ్యారు. ఈఈ సంజయ్కుమార్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు, డీఈ అరుణకుమార్ కోరుట్ల మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఎవరిని నియమించలేదు. -
రామకృష్ణకు ఆచార్య కళా ప్రపూర్ణ అవార్డు
కరీంనగర్సిటీ: ప్రముఖ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణకు ఆచార్య కళా ప్రపూర్ణ అవార్డు వరించింది. ఆదివారం నెల్లూరులో జరిగిన అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక, బ్రాహ్మణ ఘోష సభలో అఖిల భారత బ్రాహ్మణ ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు సాయికుమార్ తదితరులు అవార్డు ప్రదానం చేశారు. సాహిత్య, సాంస్కృతిక, సామాజిక, విద్యారంగాల్లో రామకృష్ణ చేసిన విశేష కృషికి పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. రామకృష్ణ రచనలు ఇంగ్లిష్, హిందీ భాషల్లో అనువాదం కావడం, నేపాల్ నుంచి మాతృభాషా రత్న అవార్డు స్వీకరించడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కడారు సురేందర్రెడ్డి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ నితిన్పాఠక్, టి.రాజయ్య, పరీక్షల నియంత్రణ అధికారి వృక్ష శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ తిరుకోవెల శ్రీనివాస్, స్టాప్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ మల్లారం శ్రీనివాస్రెడ్డి, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం.సత్యప్రకాష్, గణితశాస్త్ర విభాగాధిపతి మధురాజేశ్, తెలుగు విభాగ అధిపతి డాక్టర్ బూర్ల చంద్రశేఖర్, హిందీ విభాగ అధిపతి డాక్టర్ కొమురారెడ్డి, కరుణాకర్, శంకరయ్య, సతీశ్కుమార్, సోమ నర్సయ్య, రాపర్తి శ్రీనివాస్, అన్ని విభాగాల అధ్యాపకులు, సిబ్బంది రామకృష్ణకు అభినందనలు తెలిపారు. -
గర్భిణుల్లో ధైర్యం పెంచేందుకు..
ప్రసవం అంటే చాలా మందిలో భయం ఉంటుంది. నొప్పి ఎలా ఉంటుంది. డెలివరీ ఎలా జరుగుతుంది. బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనే ఆందోళనలు సహజం. కానీ, ఈ భయం కొన్నిసార్లు బీపీ పెరగడానికి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. యోగాలోని ధ్యానం, శ్వాసాభ్యాసాలు గర్భిణుల్లో ప్రశాంతతను పెంచుతాయి. తమ శరీరంపై విశ్వాసం పెరుగుతుంది. ప్రసవాన్ని ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలం వస్తుంది. – అక్షయ, యోగా శిక్షకురాలు జీవితంలో భాగం చేసుకోవాలి గర్భిణులు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసంతో గడపాలంటే యోగాను జీవితంలో భాగం చేసుకోవాలి. ఆహారం, విశ్రాంతి, సానుకూల ఆలోచనలు, తగిన వ్యాయామం.. ఇవన్నీ కలిసి తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందులో యోగా ఒక సహజమైన, సురక్షితమైన మార్గంగా నిలుస్తోంది. – డాక్టర్ నవీన, ఆర్ఎంవో -
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న అభ్యర్థులు పోటీలను ప్రారంభిస్తున్న చైర్మన్ బాలకిష్టారెడ్డి, వీసీ ఉమేశ్కుమార్, తదితరులుకరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీపీఈసెట్) 2026 శారీరక, నైపుణ్య పరీక్షలను ఆదివారం కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, వీసీ ఉమేశ్కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం మనదేశం యువభారత్గా ఉందని, క్రీడలతో మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని పేర్కొన్నారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. వీసీ మాట్లాడుతూ, వ్యాయామ విద్యకు చాలా ప్రాధాన్యత పెరిగిందన్నారు. ప్రవేశ పరీక్షలో అభ్యర్థులు శక్తిమేరకు ప్రయత్నం చేసి తెలంగాణ పీఈసెట్కు అర్హత సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం 100 మీటర్ల రన్నింగ్ను ప్రారంభించారు. పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్, పాలమూరు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి లక్ష్మీకాంత రాథోడ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్, వర్సిటీ రిజిస్ట్రార్ సతీశ్కుమార్, హరికాంత్, నజీముద్దీన్ మునవర్, ప్రభాకర్రెడ్డి, దీప్లా, జగన్, సుధాకర్రావు, సునీల్కుమార్, దిలీప్, పీడీ విజయ్కుమార్ పాల్గొన్నారు. తొలి రోజు 721 మందికి పరీక్షలు ప్రవేశ పరీక్షలో భాగంగా తొలిరోజు బీపీఈడీకి 712 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 531 మంది హాజరయ్యారు. డీపీఈడీకి 285 మంది దరఖాస్తు చేసుకోగా 190 మంది హాజరైనట్లు పీఈసెట్ కన్వీనర్ రాజేశ్కుమార్ తెలిపారు. శారీరిక సామర్థ్య పరీక్షల్లో భాగంగా పురుషులకు 100, 800 మీటర్ల పరుగు, షాట్ పుట్, లాంగ్ జంప్, హై జంప్ పోటీలతో పాటు 11 క్రీడల్లో ఎంచుకున్న ఒక క్రీడలో పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. -
విలీనమే ముద్దు.. ఎన్నికలు వద్దు
కరీంనగర్టౌన్: ‘విలీనమే ముద్దు.. ఎన్నికలు వద్దు’ అనే నినాదంతో ఆదివారం ఆర్టీసీ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్– 1 డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్మికులందరినీ ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఈనెల 2న ఆర్టీసీ అపాయింట్మెంట్ తేదీ ప్రకటించాలని కోరారు. లేకుంటే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉద్యమం చేసేందుకు అందరం సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ జి.మనోహర్, రాష్ట్ర నాయకుడు ఎస్.వెంకటేశ్వర్లు, జేఏసీ కన్వీనర్ ఎస్.భుజేందర్, కేకే రెడ్డి, జి.మల్లయ్య, ఎన్ఎంరెడ్డి, జంపన్న తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు యోగా విధానాలు
బాల్ ఎక్సర్సైజ్ : ప్రత్యేక యోగా బాల్తో చేసే వ్యాయామాలు నడుము, వెన్ను భాగాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. పెల్విక్ ప్రాంతం సడలించి ప్రసవానికి శరీరాన్ని సిద్ధం చేస్తాయి. స్క్వాడ్ ఎక్సర్సైజ్ : స్క్వాడ్ వ్యాయామం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి. శరీరానికి సమతుల్యత పెరుగుతుంది. ప్రసవ సమయంలో ఉపయోగపడే కండరాలకు శక్తి అందుతుంది. హిప్ రొటేషన్ : నడుము భాగాన్ని సాఫీగా కదిలించే ఈ వ్యాయామం కండరాల గట్టిదనాన్ని తగ్గించి సౌకర్యాన్ని కలిగిస్తుంది. డక్వాక్ : ఇది కాళ్ల భాగాలకు బలం అందించడంలో ఉపయోగపడుతుంది. శరీర చురుకుదనం పెరుగుతుంది. ప్రాణాయామం : శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామం గర్భిణులకు అత్యంత ప్రయోజనకరం. ఆందోళన తగ్గి, మెదడుకు తగిన ఆక్సిజన్ అందుతుంది. తల్లి శ్వాస సక్రమంగా ఉండటం బిడ్డ ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. చక్కీచలాసన్, మలాసన్ : ఈ ఆసనాలు కడుపు, నడుము, పెల్విక్ ప్రాంతాల్లో రక్తప్రసరణ మెరుగుపరచడంలో దోహదపడతాయి. క్యాట్ అండ్ కౌపోజ్ : గర్భిణుల్లో ఎక్కువగా కనిపించే వెన్నునొప్పిని తగ్గించడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. శరీరానికి సౌలభ్యం పెరుగుతుంది. -
మార్క్ఫెడ్లో డీసీఎంఎస్ విలీనం
కరీంనగర్ అర్బన్: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘాలను(డీసీఎంఎస్) మార్క్ఫెడ్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, గంగాధర డీసీఎంస్లలో ఏడాది పొడవునా అన్నదాతకు మెరుగైన సేవలందనున్నాయి. ప్రస్తుతం డీసీఎంఎస్లు సీజనల్గా మాత్రమే సేవలందిస్తుండగా మిగిలిన రోజుల్లో ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి వెళ్తున్నారు. రాబడి లేక వేతనాలూ ఆలస్యంగా వస్తుండగా కార్యాలయాల నిర్వహణకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలోని అన్ని డీసీఎంఎస్లు నష్టాల్లోనే ఉండగా అరకొర ఆదాయమే. మార్క్ఫెడ్లో విలీనం చేయాలని నిర్ణయించడం శుభపరిణామమని వ్యవసాయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. విలువైన ఆస్తులు.. రూ.వంద కోట్లపైనే జిల్లాలోని 4 డీసీఎంఎస్లకు కలిపి రూ.వంద కోట్లకు పైగా ఆస్తులున్నాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా పేరున్న కరీంనగర్ డీసీఎంఎస్కు 5ఎకరాల స్థలం ఉంది. మార్కెట్ ఏరియాలో ఉండటంతో గోదాంలు, వ్యాపార దుకాణాల సముదాయం, పరిపాలన భవనం ఉంది. వాటి విలువ రూ.వంద కోట్లకు పైగా ఉంటుంది. ఒకప్పడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులకు విశేష సేవలందించిన డీసీఎంఎస్ ప్రస్తుతం కునారిల్లే దశకు చేరింది. కేవలం సీజన్లో ధాన్యం సేకరణ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఎరువులు, విత్తనాల విక్రయాలు ఆగిపోయాయి. రూ. కోట్ల విలువైన దుకాణాలు, ఖాళీ స్థలాలున్నాయి. కార్యకలపాలు విస్తృతం మార్క్ఫెడ్ ప్రస్తుతం ఏడాది పొడవునా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇందుకోసం జిల్లాలోని డీసీఎంఎస్లను వినియోగించుకోనుంది. మార్క్ఫెడ్కు ఎరువుల బఫర్, పప్పుధాన్యాలు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలను ఇక మార్క్ఫెడ్ నిర్వహించనుంది. ఆస్తులు.. అప్పుల బదలాయింపు రాష్ట్ర ప్రభుత్వం డీసీఎంఎస్లను మార్క్ఫెడ్లో విలీనం చేయడానికి ముందు ఆస్తులు, అప్పులను పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని మార్క్ఫెడ్కు బదిలీ చేస్తారు. ఆర్థిక, సహకారశాఖ, మార్క్ఫెడ్ల మధ్య విలీన ప్రక్రియ పూర్తి కాగానే ప్రభుత్వం జీవో ఇవ్వనుంది. డీసీఎంఎస్ల్లో పనిచేసే ఉద్యోగులంతా మార్క్ఫెడ్కు బదిలీ అవుతారు. ఇప్పటి వరకు జిల్లా పరిధిలో మాత్రమే పనిచేసిన ఉద్యోగులు విలీన ప్రక్రియ అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గోదాంలు, కార్యాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదోన్నతులు, సీనియారిటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, మార్క్ ఫెడ్ ఉద్యోగులకు వర్తించే ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పింఛన్లు వర్తిస్తాయి. ప్రభుత్వం మార్క్ఫెడ్లో విలీనం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని, ఉద్యోగులు ప్రతి నెలా వేతనాలకు ఎదురు చూడాల్సిన పని ఉండదని డీసీఎంఎస్ అధికారులు చెబుతున్నారు. ఏడాది పాటు పని ఉండనుండగా విలీన ప్రక్రియతో రైతులకు మెరుగైన సేవలు అందుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
తల్లి ఆరోగ్యానికి యోగం
ప్రయోజనాలు గర్భధారణ సమయంలో మహిళ శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. బరువు పెరగడం, హార్మోన్ల మార్పులు, వెన్నునొప్పి, కాళ్ల నొప్పులు, శ్వాస సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని నియంత్రించడంలో యోగా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రసవ సమయంలో శరీరం సులభంగా సహకరిస్తుంది. నిద్రలేమి, ఆందోళన తగ్గుతాయి. బీపీ, పిట్స్ వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుంది. జీవనశైలిపై అవగాహన యోగా శిక్షణలో కేవలం ఆసనాలకే పరిమితం కాకుండా గర్భిణుల జీవనశైలిపై కూడా ప్రత్యేక దష్టి పెడుతున్నారు. గర్భిణులు ఎలా కూర్చోవాలి? ఎలా పడుకోవాలి? రోజువారీ పనులు తదితర అంశాలపై మోటివేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు. చాలామంది గర్భిణులు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం, సరైన నిద్ర లేకపోవడం, వ్యాయామం పూర్తిగా మానేయడం, అనవసర భయాలతో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. సరైన అవగాహనతో ఇవి తగ్గించుకోవచ్చు. -
తుది దశకు కౌన్సెలింగ్
సప్తగిరికాలనీ(కరీంనగర్): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్–ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న ధ్రువపత్రాల పరిశీలన తుది దశకు చేరుకుంది. కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ కేంద్రంలో జరుగుతున్న కౌన్సెలింగ్లో భాగంగా ఆదివారం స్లాట్ బుక్ చేసుకున్న 282 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను అధికారులు పరిశీలించినట్లు ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. విద్యార్థులు తమకు కేటాయించిన స్లాట్ సమయానికి హాజరై కౌన్సెలింగ్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఈవోగా ప్రశాంత్రెడ్డికరీంనగర్టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల బదిలీల్లో కరీంనగర్ డీఈవోగా ప్రశాంత్రెడ్డిని కేటాయించారు. ఇంతకముందు డీఈవోగా అదనపు కలెక్టర్కు బాధ్యతలు అప్పగించారు. అలాగే ఏడీగా విధులు నిర్వహిస్తున్న మాధవిని ఆదిలాబాద్ డీఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. డిగ్రీ కోర్సులను బలోపేతం చేయాలికరీంనగర్సిటీ: డిగ్రీ కోర్సులను బలోపేతం చేసేందుకు నూతన ఒరవడికి శ్రీకారం చుటాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి అన్నారు. ఆదివారం శాతవాహన యూనివర్సిటీ ఆడిటోరియంలో డిగ్రీలో కొత్త సిలబస్, కోర్సుల రూపకల్పన అంశంపై రిజిస్ట్రార్ సతీశ్కుమార్ అధ్యక్షతన జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రస్తుతం మేలైన విద్య అభ్యసించేందుకు కొత్త సిలబస్, నూతన పాఠ్యంశాలను తయారు చేసుకోవాలని, రానున్న విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామని, అవి ప్రత్యేకంగా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి దోహద పడతాయన్నారు. నౌకారంగం, విమానయాన, ఆరోగ్యరంగాల్లో ఉపాధి అవకాశాలను ఈ కొత్త పాఠ్యాంశాల సాయంతో సొంతంగా సృష్టించుకోవచ్చని తెలిపారు. వీసీ ఉమేశ్కుమార్ మాట్లాడుతూ, జిల్లా డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం బాధ్యులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, సోషల్, ట్రైబల్, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అధ్యాపకులు, డాక్టర్ సురేశ్కుమార్, డీన్ సీడీసీ డాక్టర్ జాఫర్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమాకాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు. విధుల్లో బాధ్యతగా వ్యవహరించాలికరీంనగర్టౌన్: తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పి.లక్ష్మణ్రావు మాట్లాడుతూ.. ప్రధానోపాధ్యాయులందరూ విధుల్లో బాధ్యతతో వ్యవహరించడంతో పాటు సర్వీస్ రూల్స్పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారంలో నిబంధనలపై అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. నోటీస్, లెటర్ మధ్య ఉన్న తేడాను గుర్తించి తగిన విధంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలను గౌరవప్రదంగా, నిబంధనల ప్రకారం పరిష్కరించుకోవాలని కోరారు. అలాగే వివిధ రకాల శిక్షలు, వాటి ప్రభావాలపై వివరించారు. సాఽ ద్యమైనంత వరకు పాఠశాల స్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూ టీ ఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి, పి.సత్యనారాయణ, మనోహర్, ప్రతాప్రెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, భగవంతయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: కరీంనగర్లో విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు 11 కేవీ వేంకటేశ్వర ఫీడర్ పరిధిలోని చందా ఆసుపత్రి, బీజేపీ కార్యాలయం, కెమిస్ట్ భవన్, శివ థియేటర్, వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలి
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పా ఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలకు స్పందన వచ్చింది. సుమారు 60 మంది బాలబాలికలు హాజరయ్యారు. అంతకుముందు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ రాజగోపాల్చారి హాజరై రన్నింగ్ పోటీలను ప్రారంభించారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర పోటీల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించా రు. కాగా జిల్లాస్థాయిలో రాణించిన క్రీడాకారులను ఈ నెల 11 నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జిల్లా కార్యదర్శి సుమన్ కళ్యాణ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతి ఐక్యత–దేశ భద్రత!
ఈ పవిత్ర భారతదేశం నా దేశం నే పుట్టి పెరిగిన నా జన్మ ప్రదేశం అందిస్తుంది ఇది ఓ శుభ సందేశం బంధిస్తుంది మనలను ఆ ఆదేశం! స్పందిద్దాం భారతీయులకు అందిద్దాం విందిద్దాం మన ఐక్యతను చిందిద్దాం మన దేశ భద్రత మనందరకు ముఖ్యం అప్పుడే మనందరకు కలుగు సౌఖ్యం ! కలసికట్టుగా మనమంతా ఇక ఉందాం అలసినట్టున్న బలం పుంజుకుందాం దేశ భద్రతకు మనం కట్టుబడి ఉందాం దేశ ఐక్యతయే ఘనం పెట్టుబడి అందాం ! పరాయి ముష్కరుల పెంచి పోషిస్తున్న తురాయి ఎగిరేసి మనల ద్వేషిస్తున్న చైనా పాకిస్తానులకు చెప్పాలిక బుద్ధి అంతర్జాతీయ వేదికపై మనం బల్ల గుద్ది ! మన దేశ భద్రత మనందరి బాధ్యత ఘన సైనికులకే ఉంది ఆ యోగ్యత అయినా మనందరం పాలు పంచుకుందాం స్వయానా సరిహద్దు వివాదం తెంచుకుందాం ! ప్రజలందరకు కంటినిండా నిద్రించే భరోసానిద్దాం సైనిక రక్షణ వ్యవస్థను చక్కదిద్దు ధిలాసా చిందిద్దాం భరతజాతి సమైక్యతను పటిష్టం చేసేద్దాం భరతఖండం భద్రతను పరిపుష్టం గావిద్దాం! గుర్రాల లక్ష్మారెడ్డి – కవి, రచయిత – కల్వకుర్తి, నాగర్కర్నూల్ జిల్లా -
బన్నీ వేసవి యాత్ర –22 లేత ముంజకాయల పండుగ
ఎండాకాలం మధ్యాహ్నం. తాతయ్య వచ్చాడు. చేతిలో దాసరి రఘు గౌడ్ గారు ఇచ్చిన లేత ముంజకాయల గెల. పైన తడి గుడ్డ కప్పి తెచ్చాడు. వాకిట్లో ఆడుకుంటున్న బన్నీ, వాడి స్నేహితులు పరుగున వచ్చారు. ‘తాతయ్య... మాకు కూడా’ అని చుట్టూ మూగారు. తాతయ్య నవ్వుతూ కత్తి తెచ్చి ఒక్కొక్కటిగా కోశాడు. లోపల తెల్లని జిగేలు మంచులా మెరుస్తున్నాయి. బన్నీకి మొదట ఇచ్చాడు. తర్వాత రామ్కి, చుక్కకి, స్వప్నకి ఇచ్చాడు. అందరి అరచేతుల్లో చల్లటి ముంజ జిగురు నిండింది. ఒక్క ముక్క నోట్లో వేసుకుంటే దాహం తీరింది. వేడి తగ్గింది. పిల్లల మొహాల్లో తియ్యటి నవ్వులు విరిశాయి. తాతయ్య వాళ్ళ ఆనందం చూసి మురిసిపోయాడు. ‘తినండి, ఇంకా ఉన్నాయి’ అన్నాడు. ఆ రోజు ముంజకాయలు కాదు, తాతయ్య ప్రేమే అందరికీ పంచాడు. పిల్లలకి మాట: లేత ముంజకాయల రుచి మమతలకు సురుచి గౌడన్నలకు అభివందనం – డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని జిల్లా: పెద్దపల్లి -
బాల్యపు ఊసుల ఉయ్యాల
నాన్నను పట్టుకు తిరిగిన లోగిలి అమ్మను తాకితే తీరిన ఆకలి బుడి బుడి అడుగుల జాబిలి విహార యాత్రపు జాలీ జాలీ నా మదిలో బాల్యపు రంగుల హోలీ సోపతి గాళ్లతో గోలీలాట.. భూపతి గానితో జలకాలాట.. సీతాపతితో జాతర పాట.. యాకుబ్ తోటలో కోతి కొమ్మచ్చీ జేకే వాడలో కాల్ చిచ్చి ముచ్చీ బాల్యపు ఊసుల ఉయ్యాలా..! సొంటి తెచ్చినా కంట్లో మంట చంటి తెచ్చినా ఇంట్లో తంట గద్యం చదవక కోదండాలు పద్యం చదవక అరదండాలు బాల్యం నేర్పిన గుణ పాఠాలు.. అయ్యోరిచ్చిన ఐదు పైసలు పూజారిచ్చిన పూత రేకులు ఇసుకలో కట్టిన పిచ్చుక గూళ్లూ కాగితప్పడవల వర్షపు నీళ్లూ మరచిపోనివీ మరలి రానివీ.. బాల్యం ఇచ్చిన బహుమతులు చెరువులో పట్టిన చేప పిల్లలు చేతిలో కాలిన అగ్గి పుల్లలు బడి మానేసి చూసిన చిత్రం బిర బిర గీసిన నల్లని ఛత్రం గిర గిర తిరిగిన రంగుల రాట్నం బిర బిర ఉరికిన హంగుల పట్నం ఇంకా ఇంకా గుర్తున్నాయి. ఇంపుగ మదిలో దాగున్నాయి! డాక్టర్ కటుకోఝ్వల రమేశ్ కవి, రచయిత జిల్లా: ఖమ్మం -
పొడుపు కథలు
01. గోధుమ వన్నె దేహం సోగ కన్నుల విత్తనం తింటే నోటికి జిగట 02.అమ్మాయి పేరున్న పండు సింధూరంలా మెరిసే పండు సిట్రన్ జాతి తినే పండు 03. పండ్లన్నింటికీ రారాజు రుచిని తూచలేదు తరాజు 04. ఒళ్లంతా ముళ్లుంటాయి నెత్తి మీద ఆకులుంటాయి పులుపు తీపి రుచులుంటాయి 05. కాటుక రంగు పిల్లల్ని కడుపుపున దాచుకున్న (మోస్తున్న) మిసిమి దేహపు అమ్మ 06. బాలిక నామం పెట్టుకున్నది దేహమంతా కన్నులు కలది విత్తుల చుట్టూ కండ కలిగినది ! 07. ఎండాకాలంలో ఎర్రని రసాలు నేలన పాకే తీగాలకే కాయలు దీని పొట్ట నిండా నీటి నిల్వలు 08. రంగేమో మేలిమి బంగారం రుచేమో మధురాతి మధురం పిల్లేమో ముదురు నీటి టెంక ఫలం 09. ఒళ్లంతా పసుపు పూసుకున్న ముత్తైదువ పూజలకూ వ్రతాలకూ ముందుండే ముత్తైదువ 10. ఈ పండును రోజూ తింటే డాక్టరు వద్దకు వెళ్ళే పని లేదు ఈ చెట్టు కింద కూర్చుంటేనే భూమ్యాకర్షణ తెలిసింది ! 11. సపోటా వుర్ల గడ్డలతో పోలికలు అడ్డుకోతలో సూర్యకిరణాల చిత్రాలు తింటే బీపీ, ఎల్ డీఎల్ ల తగ్గుదల 12. గుత్తులు గుత్తులుగా పండ్లు కానీ ద్రాక్ష గుత్తులు కాదు మెత్తని జెల్లీ లాంటి కండలు కానీ తాటి ముంజలు కాదు 13. ఉసిరిలా కాండానికి కాస్తాయి ద్రాక్షలా గుత్తులుగా కాస్తాయి చైనా దేశంలో అధికంగా కాస్తాయి 14. ఎరుపు తెలుపులలో ఉంటుంది చలి కాలంలో ఎక్కువ కాస్తుంది దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది 15. పైన సన్నగా కింద లావుగా నీటి చుక్క వలే బుడగగా వగరు తీపి పులుపు కలగలుపుగా 16. ఆకుపచ్చని గుండ్రని బంతులు గర్భాన దాచి పెట్టుకున్న ముత్యాలు రసం పిండామంటే గ్లాసులు 17. పొట్ట నిండా రత్నాల రాసులు పెట్టి కనపడకుండా ఎర్రని తోలు కప్పారు 18. కాయలన్నింటిలో చాలా పెద్దది పసిమి ఛాయ పిల్లలు కలది ఘాటైన సువాసన కలది చిటారు కొమ్మన కాస్తుంది 19. ఇల్లేమో ముళ్లకంప పళ్ళేమో డ్రూప్ జాతి రుచేమో తీపి పులుపు రంగేమో ముదురు ఎరుపు 20. చూపుకు మేలిమి దేహాలు పొట్ట విప్పితే పురుగులు చెట్టు కాండానికి గుత్తులు జావాబు: 01.సపోటా, 02.కమలా కాయ, 03.మామిడి, 04.అనాసకాయ, 05.బొప్పాయి, 06. సీతాఫలం, 07.పుచ్చ కాయ, 08.మామిడి, 09.అరటి కాయ, 10.యాపిల్, 11.కివి, 12. లిచి, 13.మల్బరీ, 14. జామ, 15.పియర్, 16. బత్తాయి, 17.దానిమ్మ, 18. పనస కాయ, 19. రేగి పండు, 20. మేడి పండుడాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
ప్రోత్సాహం లభించింది
మా ఊరులో ఇలాంటి అవకాశాలు తక్కువ. ఇక్కడ చదువుతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ ఇస్తున్నరు. పెద్దయ్యాక నేను ఏం కావాలనే నా లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుంది. – రక్షిత, కుక్కలగూడూరు అందరి ముందు మాట్లాడాలంటే భయపడేదాన్ని. ప్రతిరోజూ ప్రసంగాలు, గ్రూప్ డిస్కషన్స్తో ధైర్యంగా మాట్లాడుతున్న. నా మీద నాకు నమ్మకం బాగా పెరిగింది. – సాహితి, గాంధీపార్కు పాఠశాల మా స్కూల్లో కంప్యూటర్లను దగ్గరగా చూసే అవకాశం తక్కువ. ఇక్కడ కంప్యూటర్ ప్రాథమిక అంశాలు నేర్పిస్తున్నరు. ఇంజినీర్ కావాలనే ఆసక్తి మరింత పెరిగింది. – అక్షర, మేడిపల్లి -
నెమ్మదిగా ప్రాణాలు తీసే విషం పొగాకు
కరీంనగర్: పొగాకు వాడకం కేవలం ఒక చెడు అలవాటు మాత్రమే కాదని, అది నెమ్మదిగా మనిషి ఆరోగ్యాన్ని కబళించే ప్రమాదకర విషమని వైద్యులు హెచ్చరించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో కార్డియాలజిస్టు డాక్టర్ అనీష్ పబ్బ, జనరల్ ఫిజీషియన్లు డాక్టర్ నాగరాజు, డాక్టర్ లోకేశ్ మాట్లాడారు. పొగాకు వినియోగం నేరుగా గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. బీడీ, సిగరెట్, గుట్కా వంటి అలవాట్లు రక్తనాళాలను దెబ్బతీసి గుండెపోటు, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తాయని వివరించారు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి పొగ తాగితే.. దాని ప్రభావం కుటుంబ సభ్యులపై కూడా తీవ్రంగా పడుతుందని హెచ్చరించారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, అబ్దుల్ వకీల్, సూపరింటెండెంట్ డా క్టర్ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. ● రూ.15లక్షల ఆస్తి నష్టం కరీంనగర్క్రైం: కరీంనగర్లోని తిరుమలనగర్లో ఉన్న తిరుమల థియేటర్లో శుక్రవారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా థియేటర్ మొత్తం మంటలు వ్యాప్తి చెందడంతో సుమారు 200 సీట్లు, పాల్సీలింగ్, ఫ్లయ్వుడ్ స్క్రీన్, సౌండ్ సిస్టం, క్యాబిన్లు, ప్రొజెక్టర్ గది కాలిపోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. డివిజన్ ఫైర్ అధికారి శ్రీనివాస్రెడ్డితోపాటు ఫైర్ అధికారులు థియేటర్ మేనేజింగ్ పార్ట్నర్ ఎం.మల్లేశం వద్ద వివరాలు తీసుకొని విచారణ జరుపుతున్నారు. సుమారు రూ.15లక్షల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. థియేటర్లో కరెంటు సరఫరా లేదు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు ఫైర్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త అనుభవాలు
ఊళ్లనుంచి చి వచ్చిన విద్యార్థినులతో కలిసి ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. యోగా, క్రీడలు, పాటలు, నృత్యాలు నేర్చుకుంటున్నం. ప్రతీరోజు కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. సంతోషంగా ఉంది. – సహస్ర, నర్రాశాలపల్లె బాలికలు విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఎన్టీపీసీ శిక్షణ ఇస్తోంది. గ్రామీణ విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇది దోహదపడుతుంది. – చందన్కుమార్ సామంత, ఈడీ, ఎన్టీపీసీ బాలికలకు పాఠ్యాంశాలతోపాటు ఆరోగ్యం, పరిశుభ్రత, యోగా, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తున్నాం. తద్వారా బాలికల్లో కొత్త ఆలోచనలు, ఉన్నత లక్ష్యాలు ఏర్పడుతున్నాయి. – సాగర్ రంజన్ సాహూ, ఏజీఎం(హెచ్ఆర్), ఎన్టీపీసీ -
చదువు.. చైతన్యం.. సాధికారత
జ్యోతినగర్: భారతావనికి వెలుగులు ప్రసరింపజేస్తున్న ఎన్టీపీసీ తమ పరిధిలోని ప్రజల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభావిత, పునరావాస ప్రాంతాలు అంతర్గాం, పాలకుర్తి, రామగుండం, కమాన్పూర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలకు బాలికా సాధికారత మిషన్–2026 ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ ఇస్తోంది. కేంద్ర ప్రభుత్వ బేటీ బచావో.. బేటీ పడావోకు అనుగుణంగా ఎన్టీపీసీ నడుచుకుంటోంది. ఇందుకోసం రామగుండం ప్రాజెక్టులోని శ్రీచైతన్య కళాశాల భవనంలో బాలికా సాధికారత అంశంపై 10 నుంచి 12 ఏళ్ల వయసు లోపు ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తిచేసిన 140 మంది బాలికలను శిక్షణకు ఎంపిక చేసింది. వీరికి 28 రోజుల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇస్తోంది. ● కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. ● బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడం ● వ్యక్తిగత ఆరోగ్యం, శారీరిక సమస్యలు, ఇంటర్నెట్, సైబర్ నేరాలు, భవిష్యత్ గురించి గొప్ప కలలు, ఆలోచనలు కలిగింపజేయడం. ● జీవితంలో సమున్నత లక్ష్యాలు చేరుకోవాలనే ఆలోచన, తపన కల్పించడం ● పాఠ్యాంశాల్లో శిక్షణ ● సరళమైన తెలుగు, ఆంగ్ల భాషపై పట్టు, యోగా, గణితశాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు, మెలకువలు, పర్యావరణశాస్త్రం, ఆత్మరక్షణ, క్రీడలు, కంప్యూటర్స్ వినియోగం, పౌష్టికాహారంతో ఉపయోగాలు, 5ఎస్ విధానాలు ● శిక్షణ ఇచ్చే అంశాలు ● అగ్నిమాపక భద్రతా చర్యలు, సివిల్ సర్వీసెస్ ● కంప్యూటర్స్, ఇంటర్నెట్, మొబైల్స్ ఆధారంగా జరిగే సైబర్ నేరాలపై అవగాహన ● సామూహిక చర్చలు ● సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకరంగం ● మార్షల్ ఆర్ట్స్లో ప్రత్యేక శిక్షణ ● యోగా ● శిక్షణ సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ● వసతి గృహం వద్ద 24 గంటలు మహిళా సెక్యూరిటీ గార్డులతో రక్షణ ● ప్రత్యేకంగా శిక్షణ పొందిన మహిళా వార్డెన్లు ● కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ ● సీసీ కెమెరాలతో నిఘా బాలికా సాధికారతే దేశాభివృద్ధికి పునాది బాలికల కోసం ఎన్టీపీసీ వినూత్న కార్యక్రమం 140 మంది విద్యార్థినులకు వేసవి శిక్షణ శిబిరం -
నేటి నుంచి తెలంగాణ పీఈసెట్
కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026(టీజీపీఈసెట్) శారీ రక, నైపుణ్య పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి తర ఫున శాతవాహన విశ్వవిద్యాలయం ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 2 సంవత్సరాల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు జరగనున్నాయి. జూన్ 3 వరకు శారీరక పరీక్షలు జరగనుండగా.. జూన్ 6న ఫలితాలను వెల్లడించనున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు జరగనున్న ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి, సెక్రటరీ ఆచార్య శ్రీరామ్ వెంకటేశ్, శాతవాహన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య ఉమేశ్కుమార్ హాజరు కానున్నారు. ఆదివారం 993 మంది పురుష అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ రాజేశ్కుమార్ తెలిపారు. మొత్తం 500 మార్కులు శారీరక పరీక్షలకు మొత్తం 500 మార్కులుంటాయి. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(400 మార్కులు). అందరికీ తప్పనిసరి అయిన 4 అథ్లెటిక్స్ ఈవెంట్లు ఉంటాయి. ప్రతీ ఈవెంట్కు 100 మార్కులుంటాయి. స్కిల్ ఎఫిషియెన్సీ టెస్ట్ 100 మార్కులుంటాయి. ప్రభుత్వం ఆమోదించిన ఆటల్లో అభ్యర్థి తనకు నచ్చిన ఏదైనా ఒక ఆటను ఎంచుకొని అందులో తమ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలి. అభ్యర్థులు ర్యాంకు సాధించడానికి మొత్తం మార్కుల్లో కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేవు. అభ్యర్థులకు సూచనలు ● అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్ను చూపించాలి. ● హాల్ టికెట్లో ఉన్న మీ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ● స్పోర్ట్స్, ఎన్సీసీ సర్టిఫికెట్లకు అదనపు ఇన్సెంటివ్ మార్కులు పొందడానికి, అభ్యర్థులు తమ అత్యున్నత క్రీడా ప్రతిభ, ఎన్సీసీకి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను పరీక్ష సమయంలో వెరిఫికేషన్ కోసం చూపించాలి. ● క్రీడాపత్రాల గెజిటెడ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలను హాల్ టికెట్ జిరాక్స్ కాపీతో కలిపి పరీక్ష సమయంలో సమర్పించాలి. ● హాల్ టికెట్ను అభ్యర్థి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ● కేటాయించిన తేదీన అభ్యర్థికి ఏదైనా ఇతర పరీక్ష ఉన్నా.. లేదా సరైన బలమైన కారణం వల్ల హాజరు కాలేకపోయినా.. వారికి మిగిలిన పరీక్ష తేదీల్లో ఏదో ఒకరోజు అవకాశం కల్పిస్తారు. ● గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, ఇతర శారీరక సమస్యలతో బాధపడేవారిని శారీరక సామర్థ్య పరీక్షలకు అనుమతించరు. స్కిల్ టెస్ట్ పరికరాలు అభ్యర్థులు ఎంచుకున్న క్రీడానైపుణ్య పరీక్షకు సంబంధించిన సొంత క్రీడా పరికరాలను వెంట తెచ్చుకోవాలి. హాల్ టికెట్లో కేటాయించిన రిపోర్టింగ్ సమయం కంటే కనీసం ఒక గంట ముందుగానే శాతవాహన యూనివర్సిటీ క్యాంపస్ పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ప్రారంభించనున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలక్రిష్టారెడ్డి తొలిరోజు 993 మంది పురుష అభ్యర్థులకు స్కిల్ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన శాతవాహన యూనివర్సిటీ తెలంగాణ ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల ప్రకారం బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శక పద్ధతిలో నిర్వహిస్తాం. అభ్యర్థులు నిర్దిష్ట సమయానికి చేరుకోవాలి. ప్రతిభ, శారీరక సామర్థ్యం ఆధారంగానే మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, హాల్ టికెట్లతో ఒక గంట ముందే మైదానానికి చేరుకొని పరీక్షల నిర్వహణకు సహకరించాలి. – రాజేశ్కుమార్, కన్వీనర్, టీజీపీఈసెట్–2026 -
అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
మార్కుల కాగితాలు ఇంటర్వ్యూ గేటు వరకే నడిపిస్తాయి, మీలోని ప్రాక్టికల్ నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగాన్ని సాధించి పెడతాయి. నేటి ఆధునిక పరిశ్రమలకు పుస్తకాల పురుగులు కాదు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించే సృజనాత్మక ఆలోచనలు ఉన్నవారే అత్యవసరం. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ను, ని రంతర అభ్యాసన తత్వాన్ని ఆయుధాలుగా మార్చుకుని ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి దూసుకుపోవచ్చు. ర్యాంకులు రాలేదని నిరాశ పడకుండా, మీలోని విశిష్ట ప్రతిభకు పదును పెడితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. – వై. తిరుపతిరావు, ఉపాధి కల్పనాధికారి, కరీంనగర్ -
మంత్రి శ్రీధర్బాబు జన్మదిన వేడుకలు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదినోత్సవాన్ని కాంగ్రెస్ శ్రేణులు శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఇందిరా చౌక్లో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కేక్కట్ చేశారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో వీర దేవేందర్ ఆధ్వర్యంలో కేక్కట్ చేసి, వాకర్స్కు రాగి జవా పంపిణీ చేశారు. అంబేద్కర్ స్టేడియంలో గుడిపాటి రమణ రెడ్డి ఆధ్వర్యంలో, పాలిటెక్నిక్ వెటర్నరీ కళాశాల మైదానంలో వాకర్స్, జీడీ రమేశ్ ఆధ్వర్యంలో కోర్ట్ సర్కిల్లో కేక్ కట్ చేశారు. కరీముల్లాషా దర్గాలో మైనారిటీలు పూల చదర్ సమర్పించారు. నాగుల సతీశ్ ఆధ్వర్యంలో కమాన్ వద్ద అన్నదానం చేశారు. హౌసింగ్ బోర్డుకాలనీలోని వీరబ్రహ్మేంద్ర వృద్ధులాశ్రమంలో నారోజు రాకేశ్ అన్నదానం నిర్వహించారు. కురుమవాడలో కర్రె పావని ఆహార ప్యాకెట్లు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ పాల్గొన్నారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం44.0 /29.0ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 20267కిక్కిరిసిన నృసింహుని సన్నిధిధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం అధికమాసం జ్యేష్ఠ శుద్ధ చతుర్ధశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివార్లను దర్శించుకున్నారు. కొండగట్టులో భక్తుల రద్దీమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. -
పొగ.. ఆరోగ్యానికి సెగ
కరీంనగర్: యుక్త వయసులో సరదా కోసం మొదలు పెట్టే ధూమపానం చివరకు ప్రాణాలను హరి స్తోంది. సిగరేట్, బీడీ, తంబాకు వాడే అలవాటు వ్యసనంగా మారి మనిషిని బానిసను చేస్తోంది. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల మోజులో పడి యువత భవిష్యత్ను అంధకారం చేసుకుంటోంది. కేన్సర్ బాధితుల్లో 40శాతం మంది పొగతాగటం, పొగాకు ఉత్పత్తులు వాడటం ద్వారానే మరణిస్తున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. మే 31న పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా కథనం.. ఆకర్షితులవుతున్న యువత యుక్తవయసులో సిగరేట్కు యువత ఆకర్షితులవుతున్నారు. పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ ఉంటుంది. అందువల్ల వ్యసనం నుంచి త్వరగా బయటపడలేకపోతున్నారు. పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ధూమపానం వల్ల పురుషులు, సీ్త్రలల్లో సంతానోత్పత్తి సమస్యలు వస్తున్నాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో ప్రతి లక్ష మంది జనాభాకు 65 కేన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ఇది రాష్ట్ర సగటు (52 కేసులు) కన్నా చాలా ఎక్కువ. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద జిల్లాలో నిరంతరం ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం చేపట్టిన ‘100 రోజుల టీబీ ముక్త్ అభియాన్’ ప్రచారంలో కరీంనగర్తో పాటు పరిసర 9 జిల్లాల్లో వేల సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూశాయి. జిల్లాలోని వయోజన పురుష జనాభాలో దాదాపు 20శాతం నుంచి 25శాతం మంది ఏదో ఒక రూపంలో ధూమపానం (సిగరెట్లు, బీడీలు) లేదా పొగాకు ఉత్పత్తులను వాడుతున్నారు. -
ఇతర రాష్ట్రాలవారి వివరాలు తప్పనిసరి
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉంటున్న నేపాలీ, ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. శనివారం కమిషనరేట్ కేంద్రంలో పోలీస్స్టేషన్ల పనితీరు, డిజిటల్ రికార్డుల నిర్వహణ, క్షేత్రస్థాయి భద్రతా చర్యలపై వీసీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరీంనగర్ పరిధిలో దాదాపు 1000 మంది వరకు నేపాలీలు పనిచేస్తున్నారని, 169 మంది వివరాలే నమోదయ్యాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి కూలీలుగా, కార్మికులుగా పనిచేస్తున్న వారి వివరాలు సంబంధిత పోలీస్స్టేషన్లలో రికార్డు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో కేసుల పరిశోధన, ట్రాకింగ్, రికార్డుల పరిశీలన సీసీటీఎన్ఎస్ పైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. అసాంఘిక శక్తులు, రౌడీ, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మాల్ఖానాలోని ప్రతి వస్తువు రికార్డుల్లో స్పష్టంగా నమోదు కావాలని ఆదేశించారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్జీ, సీఐ సరిలాల్, కమ్యూనికేషన్ సీఐ ప్రవీణ్ పాల్గొన్నారు. -
కేన్సర్ల ముప్పు
సిగరేట్, బీడీ, చుట్టా, జర్దా, గుట్కా, తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రజలు బానిసలై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వీటి బారిన పడిన వారికి తల, మెడ, నోరు, ఊపిరితిత్తులు, రక్త, మూత్రపిండాలు, ఫ్లీహము, పేగు, మూత్రసంచి, గర్భాశయ కేన్సర్లు వస్తున్నాయి. పక్షవాతం, అంధత్వము, చిగురువాపు, గుండె వ్యాధులు, నిమ్ము, ఆయాసం, రక్తనాళాలు గట్టిపడటం, సంతానోత్పత్తి తగ్గిపోవడం, ఎముకలు బలహీనపడుట వంటి దీర్ఘకాలిక వ్యాధులతో శరీరంలోని ప్రతి అవయవం దెబ్బతింటోంది. పొగాకు ఉత్పత్తులు వాడి ప్రజలు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సిగరేట్లు కాల్చడమే కాదు.. ఆ పొగను పీల్చినా ప్రమాదమే. పొగాకు రహిత సమాజానికి అందరూ సహకరించాలి. – డాక్టర్ లోకేశ్, జనరల్ ఫిజీషియన్ -
త్వరలో డంప్యార్డ్ ప్రక్షాళన
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్ను త్వరలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలి పారు. శనివారం డంప్యార్డ్ను సందర్శించి, బయోమైనింగ్ ప్రక్రియను, మంటలు, పొగలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బయోమైనింగ్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. డంప్ యార్డ్లో వ్యర్థాల వల్ల అంతర్గతంగా వాయువులతో మంటలుపుట్టి వెలువడుతున్న పొగను అదుపుచేయాలన్నారు. వ్యర్థాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. డంప్ యార్డు ద్వారా స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బయోమైనింగ్ ప్రక్రియ వేగవంతం చేశామని అన్నారు. బయోమైనింగ్ను వేగవంతం చేయాలి డంప్యార్డ్ల్లో బయోమైనింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీడీఎంఏ శ్రీదేవి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి కమిషనర్లతో వీసీలో మాట్లాడారు. నగరపాలకసంస్థ కార్యాలయం నుంచి కమిషనర్ ప్రఫుల్దేశాయ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కరీంనగర్ డంప్యార్డ్లో కొనసాగుతున్న బయోమైనింగ్ ప్రక్రియ పురోగతి, ప్లాస్టిక్ ఇతర ఘన వ్యర్థాలను అధునాతన యంత్రాల ద్వారా వేరు చేస్తున్న విధానం తదితర అంశాలను కమిషనర్ వివరించారు. -
పనులకు టెండర్ రీకాల్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో యూఐడీఎఫ్ టెండర్లకు బాలారిష్టలు తప్పడం లేదు. గతంలో ఒకసారి రద్దు అయి, మళ్లీ టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన సమయంలో సింగిల్ టెండర్ల కారణంగా 71 పనులను శనివారం రీకాల్ చేశారు. సింగిల్ టెండర్ దాఖలు కావడంతో రీకాల్ చేసి ఆ పనులకు మళ్లీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తొలి నుంచి వివాదమే. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లతో నగరంలో చేపడుతున్న పనులకు సంబంధించి గతంలో ఒక సారి టెండర్ పిలిచారు. విలీన ప్రాంతాలు ప్రాధాన్యంగా టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు. ఇదే సమయంలో నగరపాలకసంస్థ ఎన్నికలు రావడం, కొత్త పాలకవర్గం ఏర్పడింది. అభివృద్ధిని నగరవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో కొత్త పాలకవర్గం ఆ టెండర్లను రద్దు చేసింది. విలీన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూనే, నగరంలోని అన్ని డివిజన్లకు పనులు పెడుతూ మరోసారి కొత్తగా టెండర్ పిలిచింది. నగరవ్యాప్తంగా పనులు జరగనుండడంతో అన్ని పార్టీల కార్పొరేటర్లు పాత టెండర్లు రద్దు చేసి కొత్త పనులను ఆమోదించారు. ఇటీవల రూ.50 కోట్లతో 87 పనులకు టెండర్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక పనులు మొదలు పెట్టడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో 69 పనులకు సింగిల్టెండర్ దాఖలైందనే వివాదం మొదలైంది. అధికార పార్టీకి చెందిన ఓ నేత సింగిల్టెండర్లపై ఫిర్యాదు చేయడంతో, ఆ టెండర్లను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. మొత్తంగా 87 పనులకు గాను సింగిల్ టెండర్లు దాఖలైన 71 పనులకు సంబంధించిన టెండర్ రద్దు చేసి రీకాల్ చేసినట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఈ పనులకు మళ్లీ టెండర్లు నిర్వహిస్తున్నామని, నిర్ణీత వ్యవధిలో ఓపెన్ చేస్తామన్నారు. కాగా యూఐడీఎఫ్ రూ.50 కోట్ల పనులకు ఎప్పుడు మోక్షం కలుగుతుందో, పనులు ఎప్పుడు మొదలవుతాయో అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. -
డీఆర్వోగా స్వామి బాధ్యతల స్వీకరణ
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా జే.స్వామి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనకు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న జే.స్వామికి ప్రభుత్వం ఇటీవల పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్గౌడ్, గడ్డం సుధాకర్, ఎన్.రాజేశ్, తహసీన్, కె.లక్ష్మణ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రతిభ చూపు!
మార్గం వెతుకు..బహుళ నైపుణ్యాలు ఎప్పుడైనా పనికొస్తాయి. బంగారు బాటవేస్తాయి. సాధన చేస్తే ఏదైనా సులభమే. అభ్యాసమే ఏదో ఒకనైపుణ్య సాధనకు మందు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ప్రతిభ.. ఆలోచన.. ఆచరణతో ముందుకెళ్తే భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలపై పట్టు పెంచుకుంటే భవిష్యత్ బాగుంటుంది. దూసుకెళ్తున్న ఐటీ.. తోటి వారితో పోటీ.. వీటన్నింటిని నెగ్గుకు రావాలంటే పట్టుదల ముఖ్యం. –కరీంనగర్ స్పోర్ట్స్/హుజూరాబాద్: ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తిచేసిన వారుభావ వ్యక్తీకరణతో విజయం విద్యార్హత, మార్కులకు తోడు ఉద్యోగ ఇంటర్వ్యూల్లో భావవ్యక్తీకరణ అంశాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. తెలిసిన అంశాన్ని, చేసిన ప్రయోగాన్ని స్పష్టంగా చెప్పగలగడం.. భాష నైపుణ్యంతో వివరించగలగడం.. అవతలి వ్యక్తులను ఆకట్టుకుంటాయి. వీటిని నేర్పడానికి శిక్షణ కేంద్రాలూ ఉంటాయి. వాటిలో చేరి సాధన చేయవచ్చు. ట్రైనింగ్తో ముందుకు.. సమయం విలువను గుర్తిస్తే ఇంజినీరింగ్, మెడిసిన్ దేనిలోనైనా సీటు తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంటర్లో చేరిన విద్యార్థులు, ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైవారు ఆ దిశగా కసరత్తు చేయాలి. లక్ష్యం.. గుర్తుంచుకోవాలి.. మెహందీ డిజైన్, వంటలతో వ్యాపారం, అల్లికలు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వంటి కోర్సులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు. లక్ష్యంతో నేర్చుకుంటే ఆర్థికంగా ఎదిగేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వచ్చినా గట్టెక్కవచ్చు. ఈ కోర్సులకు ప్రభుత్వ పరంగా శిక్షణ కేంద్రాలు గురుకులాల్లో, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో పేద విద్యార్థులకు వెసులుబాటు ఉంటుంది. ఎలాంటి శిక్షణ లేకుండా సొంతంగా చదివి ర్యాంకుతో సీటు పొందిన వారి స్పూర్తిని అంది పుచ్చుకోవాలి. సమయం వృథా.. జీవితాంతం వ్యథ పుస్తకాలతో పనేమీ లేదని ఫోన్లు, టీవీలతో ఎంజాయ్ చేద్దామనుకుంటే మాత్రం భవితను ముంచి వేసుకున్నట్లే. వేళాపాళా లేకుండా కాలక్షేపం చేస్తే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొత్త విద్యాసంవత్సరంలో ఏ కోర్సులో చేరితే భవిష్యత్ బాగుంటుందో ఇంటర్నెట్లో పరిశీలించవచ్చు. ప్రణాళికతో ఉండాలి. విద్యాసంబంధ అంశాలు ఉచిత పుస్తకాలు, పాఠాలు అందుబాటులో ఉంటాయి. సద్వినియోగం చేసుకోవాలి.నైపుణ్యాలు పెంచుకునేందుకు పట్టుదల పెంచుకోవాలి. ప్రాధాన్యం ఇవ్వాలి. సమయం దొరికినప్పుడల్లా ఆయా సమావేశాలు, నైపుణ్య కేంద్రాలు, లైబ్రరీలను సందర్శించాలి. అకడమిక్ చదువులే కాకుండా నృత్యం, సంగీతం, చిత్రలేఖనం లాంటివాటిపై పట్టుసాధించాలి. ఎంఎస్ ఆఫీస్, జావా, పైథాన్, సీప్లస్ వంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులు నేటితరానికి ఎంతో ఉపయోగం. వీటిలో రాణిస్తే ఉపాధికి కొదువ ఉండదు. ఎప్పుడు సమయం దొరికినా వాటిపై పట్టుసాధించాలి. భవిష్యత్తుపై భరోసా పెంచుకోవాలి. నిర్మాణరంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఎలక్ట్రికల్ పనుల వృత్తికి డిమాండ్ ఉంటోంది. ఇవి నేర్చుకుంటే కొత్తగా నిర్మిస్తున్న భవనాలకు వైరింగ్, స్విచ్ బోర్డులు, ఎలక్ట్రిక్ ఉపకరణాల బిగింపు పనులు తెలిసిన వారికి చేతినిండా పని, కడుపు నిండా తిండి అన్నట్టుగా సంపాదించుకోవచ్చు 1,968పరీక్ష రాసినవారుఉత్తీర్ణత సాధించిన వారు3,35311,96114,9432,5624,3385,7963,762రాజన్న సిరిసిల్లపెద్దపల్లికరీంనగర్జగిత్యాల -
పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది
కరీంనగర్: పొగాకు ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుందని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఆవరణంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులైన సిగరెట్, బీడీ, తంబాకు, గుట్కా, కై నీ, జర్ద వినియోగించడం ద్వారా నోరు, గొంతు, ఊపిరితిత్తులు, ఆహార నాళం తదితర అవయవాలకు కేన్సర్ సోకుతుందని అన్నారు. డాక్టర్లు విప్లవ శ్రీ, సుధా, ఉమాశ్రీ, రవీందర్రెడ్డి, సన, సాజిద, శ్రీనివాస్, రాజగో పాల్, కై క, పోచయ్య, స్వామి పాల్గొన్నారు. వైద్యుల పాత్ర కీలకం చిన్నపిల్లల్లో టీబీ లక్షణాలను గుర్తించి వ్యాధి తీవ్రతను తగ్గించడంలో వైద్యుల పాత్ర కీలకమని డీఎంహెచ్వో వెంకటరమణ అన్నారు. వైదారోగ్యశాఖ సమావేశ మందిరంలో శనివారం టీబీ అలర్ట్ ఇండియా, స్టేట్ టీబీ సెల్ తెలంగాణ, సాథీ సంస్థల సహకారంతో చిన్నారుల్లో క్షయవ్యాధి (టీబీ) కేసులను ముందస్తుగాా గుర్తించడం, సమయానుకూలంగా చికిత్స అందించడం, వ్యాధి వ్యాప్తిని నివారించడంపై జిల్లాస్థాయి క్యాచ్– అఫ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి వైద్యాధికారి తమ పరిధిలోని అనుమానిత కేసులను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, తగిన చికిత్స అందించాలన్నారు. టీబీ కంట్రోల్ ఆఫీసర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్క్రైం: జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.రాణి ఆదేశాల మేరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయసేవా అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు ఏ.కిరణ్ కుమార్, పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాశ్ రెడ్డి అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం, విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయం నేరమని వివరించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎం.రవికుమార్, రిసోర్స్ పర్స న్లు ఏ.సంతోష్కుమార్, అశోక్ పాల్గొన్నారు. చొప్పదండి: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను జాతీయస్థాయిలో మరో అవార్డు వరించింది. టోఫీ స్కూల్ చాలెంజ్– టువర్డ్స్ టొబాకో ఫ్రీ జనరేషన్– 2025 పోటీల్లో పాఠశాల జాతీయస్థాయిలో కన్సోలేషన్ బహుమతి సాధించింది. పొగాకు రహిత సమాజ నిర్మాణం, యువతలో ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పొగాకు విని యోగం వల్ల కలిగే దుష్పరిమాణాలపై చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా అనేక పాఠశాలలు ఈ పోటీలో పాల్గొన్నాయి. విద్యార్థుల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, పోస్టర్ ప్రదర్శనలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలను బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విశేషంగా నిర్వహించడంతో ఈ అవార్డు వరించింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పాఠశాలకు చెందిన ప్రదాన ఉపాధ్యాయులు జంగం శ్రీనివాస్, ఉపాధ్యాయులు యామ తిరుపతి అవార్డు స్వీకరించారు. కొత్తపల్లి: విద్యుత్ స్తంభాల మార్పిడి పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.మంకమ్మతోట ఫీడర్ పరిధిలోని శ్రీరామ బుక్స్టాల్, బోదిసత్వా స్కూల్ ప్రాంతాలు, ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు 11 కె.వీ.ఐబీ ఫీడర్ పరిధిలోని ఐబీ చౌరస్తా, సర్కస్ మైదానం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
ఇది.. మా అడ్డా
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026కరీంనగర్ కలెక్టరేట్.. వివిధశాఖల ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అర్జీదారులు, ప్రజలతో బిజీగా ఉంటుంది. వందల సంఖ్యలో ఉద్యోగులు, సందర్శకులు వస్తుంటారు. ప్రజలు, ఉద్యోగులే కాదు.. కలెక్టరేట్ కొద్దిరోజులుగా కుక్కలు, కోతులకు ఆవాసంగా మారుతోంది. కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద పదుల సంఖ్యలో కుక్కలు సేదతీరుతుండగా.. సమీపంలో వానర దండు తిష్ట వేసుకుని కూర్చుంటోంది. వాటిని చూసిన కలెక్టరేట్కు వచ్చే ఉద్యోగులు, ప్రజలు భయాందోళనకు గురవుతుండగా.. ‘ఏయ్ బిడ్డా.. ఇది మా అడ్డా..’ అన్నట్లు దారికి అడ్డంగా దర్జాగా సేదతీరుతున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
బ్యాంకు నుంచే చేయూత
కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు లబ్ధిదారుల కు చేరేలా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్యాంకుల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి అధికారులకు తదనుగుణ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గ్రామాల్లో తపాలాశాఖ ద్వారా అందజేస్తున్నారు. గతానికి చెల్లుచీటి గతంలో లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా చెల్లించేందుకు వ్యక్తిగత ఖాతాలు తెరిపించారు. పింఛన్ల పంపిణీ సమయంలో బ్యాంకుల్లో రద్దీతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెనక్కి తగ్గారు. దీంతో నేటి వరకు తపాలాశాఖ ద్వారానే సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో బ్యాంకు ఖాతాలులేని వారికి మళ్లీ వ్యక్తిగత ఖాతాలు తెరిపించాల్సిన అవసరం ఏర్పడింది. బ్యాంకుల ద్వారా ఎలా అందజేస్తారన్న విషయమై ఇంకా స్పష్టత లేదు.జిల్లాలో చేయూత లబ్ధిదారులు: 1,23,041 వృద్ధాప్య: 48,918, వితంతు: 34,229 దివ్యాంగులు: 20,702 గీతకార్మికులు: 3,767 చేనేత కార్మికులు: 2,817 ఒంటరి మహిళలు: 3,271, బీడీ కార్మికులు: 9,937 -
పోలీసుల ముందు జాగ్రత్త..
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉండటంతో పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఉభయవర్గాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ వివాదం పెద్దది కాకుండా చూస్తున్నారు. శుక్రవారం ఉదయమే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నాయకుడు ముకేశ్ను అదుపులోకి తీసుకున్నారు. శనివారం చర్చకు సవాలు విసిరిన బీజేపీ నాయకులను కూడా హౌస్ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ– కాంగ్రెస్ మధ్య పోరు.. ప్రెస్మీట్లు, ఆరోపణలు, పోస్టర్లకే పరిమితం కాకుండా సోషల్మీడియాకూ పాకింది. సోషల్మీడియాలో రెండు పార్టీల కార్యకర్తలు ఇష్టానుసారంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పోస్టులపైనా ఇంటెలిజెన్స్ నిఘా పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎంపీ– ఎమ్మెల్యే వర్గీయుల మధ్య వర్గపోరు జగిత్యాల జిల్లా రాజకీయాలను అమాంతం వేడెక్కించాయి. -
బీఆర్ఎస్, బీజేపోళ్లకు ఏఎంసీ డైరెక్టర్ పదవులు
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్, బీజేపీ వాళ్లకు కరీంనగర్ ఏఎంసీ డైరెక్టర్ పదవులు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుదగోని లక్ష్మీనారాయణగౌడ్ ఏఐసీసీ ఇన్చార్జీ మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని గాంధీభవన్కు కరీంనగర్, తిమ్మాపూర్ నాయకులతో కలిసిన వెళ్లిన ఆయన మీనాక్షి నటరాజన్ను కలిశారు. ఏఎంసీ చైర్మన్గా తనను నియమించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిపాదించినా పట్టించుకోకుండా తనకు అన్యాయం చేశారని ఆమెకు వివరించారు. ఏఎంసీ నియామకాల్లో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి వెలిచాల రాజేందర్రావును తొలగించాలని కోరారు. -
సుభోద్సింగ్ కస్టడీకి కోర్టులో పిటిషన్
కరీంనగర్క్రైం: నగరంలోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకి పాల్పడిన కేసులో సూత్రధారి అయిన సుభోద్సింగ్ కస్టడీకి పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. బిహార్ రాష్ట్రంలోని పూర్ణియా జైలు నుంచి పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసుతో పాటు ఇతర కేసుల్లోనూ నిందితుడిగా ఉన్న సుభో ద్సింగ్ కస్టడీ కోసం ఆరు కోర్టుల్లో పీటీ వారెంట్లకు అనుమతులు పొందినట్లు పేర్కొన్నారు. సుభోద్సింగ్తో పాటు ప్రత్యేక పోలీసు బృందం గురువారం రాత్రి కరీంనగర్కు చేరుకుందని, అర్ధరాత్రి మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించామన్నారు. కేసును మరింత లో తుగా విచారించేందుకు నిందితుడిని వారం రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కరీంనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కస్టడీ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా పడినట్లు తెలిసింది. -
ఎంఆర్ఎఫ్ పనులపై విజి‘లెన్స్’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లా కేంద్రం పరిధిలోని మానేరు డ్యాం గేట్ల కింది భాగంలో మూడు కిలోమీటర్ల పొడవున ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) అభివృద్ధి పనులపై రాష్ట్ర ఇంజినీరింగ్ విజిలెన్స్ అధికారులు శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. నిర్మాణాల నాణ్యత, సాంకేతిక ప్రమాణాలు, పనుల అమలు వంటి అంశాలపై దృష్టి సారించారు. సాంకేతిక అంశాలను పక్కనబెట్టి చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం, గతంలో భారీ వర్షాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ పరిస్థితులను పరిశీలించారు. కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు, పనుల రూపకల్పన, అమలు విధానం, నాణ్యతా ప్రమాణాలపై ఆరా తీశారు. శాంపిల్స్ సేకరణ తనిఖీల్లో భాగంగా అధికారులు కాంక్రీట్, మట్టి, నిర్మాణ సామగ్రికి సంబంధించిన శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమి త్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిసింది. ల్యాబ్ నివేదికలు వచ్చిన అనంతరం పనుల నాణ్యతపై పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణాల్లో నాణ్యత లోపాలు లేదా సాంకేతిక ప్రమాణాల ఉల్లంఘనలు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఐకానిక్గా ఎంఆర్ఎఫ్... కరీంనగర్కు ఐకానిక్గా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం రూ.615 కోట్ల వ్యయంతో ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి పనులు ప్రారంభించింది. కరీంనగర్ నగర అభివృద్ధిలో కీలకంగా భావిస్తున్న నేపథ్యంలో పనుల నాణ్యతపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. ఇటీవల చెక్ డ్యామ్ వరదనీటికి కొట్టుకుపోవడం, కొన్ని నిర్మాణాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ తనిఖీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అధికారులు సమగ్ర నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. -
బడిబాట సమర్థవంతంగా నిర్వహించాలి
కరీంనగర్ టౌన్: బడిబాట కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను పెంచాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విభాగాల ఉన్నతాధికారులతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించి, అడ్మిషన్లు పెంచాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలల్లో చేరేలా చూడాలన్నారు. వర్షాకాలా న్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాల భవనాలకు అవసరమైన మరమ్మతు చేయించాలన్నారు. ఎక్కువ మంది విద్యార్థులుండే పాఠశాలలు, హాస్టళ్లలో సిబ్బంది, ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలన్నారు. కామన్ డైట్ మెనూకు అవసరమైన సరుకుల టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాల ని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫాం, పుస్తకాలు సకాలంలో అందించా లన్నారు. ఎస్సీ సంక్షేమశాఖ డీడీ తిరుపతి రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకా శ్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఆర్సీవో అంజలి, విద్యాశాఖ ఏడీ మాధవి, కోఆర్డి నేటర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్తో అప్రమత్తంగా ఉండాలికరీంనగర్ కార్పొరేషన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) విషయంలో అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పీసీసీ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. సంఘటనా సృజన్ అభియాన్లో భాగంగా శుక్రవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో కరీంనగర్, చొప్పదండి ని యోజకవర్గాల ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎస్ఐఆర్ విషయంలో ప్రతి బూత్ నుంచి కనీసం ఐదుగురు పార్టీ సభ్యులు బాధ్య త తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటర్లను కాపాడుకునే విధంగా ఓటర్ మ్యాపింగ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ బీఎల్ఏలు ఎస్ఐఆర్ను పరిశీలించాలని సూచించారు. బీఆర్ఎస్ సోషల్మీడియా ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కాంగ్రెస్పై విషప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలే స్టార్ క్యాంపెనియర్లుగా పనిచేస్తూ వాస్తవాలు తెలియచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ తక్కువైందని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకొంటున్నారన్నారు. చిన్న చిన్న బేధాలు ఉంటే సరిదిద్దుకోవాలని, బీజేపీ, బీఆర్ఎస్లపై యుద్ధం చేయాలన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే కార్పొరేషన్ పరిధిలో బీఎల్ఏ– 2ల నియామకం పూర్తయిందని తెలిపారు. పీసీసీ ప్రతినిధి చంద్రశేఖర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఎండీ. తాజ్, పులి ఆంజనేయులు గౌడ్, కర్ర సత్య ప్రసన్నరెడ్డి పాల్గొన్నారు.జమ్మికుంట: మండలంలోని బిజిగిరి షరీఫ్ దర్గాలో సంథల్ షరీఫ్ ఉత్సవాన్ని శుక్రవారం వేకువజామున ఘనంగా నిర్వహించారు. మొల్లపల్లి, పెద్ద బిజిగిరిషరీఫ్ గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు మేళతాళాల మధ్య సంథల్ షరీఫ్ను దర్గాకు తీసుకొచ్చి హజ్రత్ సయ్య ద్ ఇంకుషావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అజ్మత్షావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యద్ అక్బర్షావలి రహమతుల్లా అలై, హజ్రత్ సయ్యత్ ముర్తుజాషావలి సమాధులకు అలంకరింపజేశారు. ముస్లిం మత గురువు మౌలాన యాసీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా ముజఫర్లు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన చాదర్లను సమాధులకు సమర్పించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వొడితల ప్రణవ్ చాదర్లు సమర్పించారు. ఏసీపీ మాధవి, టౌన్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దర్గా మతవల్లి మహమ్మత్ అక్బర్ అలీ, దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. -
పోస్టర్ వార్!
పొలిటికల్తారాస్థాయికి ఎంపీ– ఎమ్మెల్యే వైరంసాక్షిప్రతినిధి, కరీంనగర్: జగిత్యాలలో ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. దీనికి కొనసాగింపుగా.. మాజీ మున్సిపల్ చైర్పర్సన్, బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే భోగ శ్రావణి వర్గం కూడా ఎమ్మెల్యేతో రాజకీయంగా తాడోపేడో తేల్చుకుంటామంటూ మాటల కత్తులు నూరుతున్నారు. ఇంతవరకూ మాటలకు, మైకులకే పరిమితమైన వీరి సవాళ్లు– ప్రతి సవాళ్లు పోస్టర్ల రూపంలో గోడల మీదకు ఎక్కాయి. బీజేపీ– కాంగ్రెస్ పార్టీలు ‘మీరు అవినీతి పరులంటే మీరే అవినీతి పరులు’ అంటూ పరస్పరం నిందించుకోవడం తీవ్రరూపం దాల్చింది. కేంద్రీయ విద్యాలయం భూకేటాయింపు విషయంలో మొదలైన విమర్శల పర్వం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. -
బావిలో పడి బాలుడు ..
బుగ్గారం: బావిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన బుగ్గారం మ ండలం చిన్నాపూర్లో చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఒర్సు శ్రీనివాస్ గొర్లను మేపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తన రెండో కుమారుడు శివకుమార్ (11)ను పరుమాల మహేశ్తో కలిపి గొర్రెల వద్దకు పంపించాడు. రెండు గంటల సమయంలో మహేశ్ ఫోన్ చేసి శివ కుమార్ కనిపించడం లేదని శ్రీనివాస్కు సమాచారం అందించాడు. శ్రీనివాస్ వెళ్లి వెదుకుతుండగా.. వ్యవసాయ బావి లో బాలుడి చెప్పులు కనిపించాయి. గ్రామస్తుల సహాయంతో బావిలో వెదకగా శవం కనిపించింది. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఉండవచ్చని మహేశ్ తెలిపాడు. తన కుమారుడి మృతిపై మహేశ్పై అనుమానం ఉందని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మానసిక వికలాంగుడి మృతి జూలపల్లి: మండలంలోని తేలుకుంటలో ఓ మానసిక వికలాంగ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై సనత్కుమార్ వివరా లు.. తేలుకుంటకు చెందిన పంగ లక్ష్మీరాజంకు ముగ్గురు పిల్లలు. చిన్నవాడైన పంగ సాయికృష్ణ(8) మానసిక వికలాంగుడు. గురువారం ఉదయం ఇంటి సమీపంలో గల బావి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సాయంత్రం వరకు కొడుకు ఇంటికి రాక పోవడంతో తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేసి, అనుమానంతో బావిలో కొక్కెంతో వెతకగా బాలుడి మృతదేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
బన్నీ వేసవి యాత్ర –20 ట్రాఫిక్ సిగ్నల్ అవగాహన
అంగడి(సంత) నుంచి వస్తూ రోడ్డు దాటలేక పిల్లలు అయోమయంగా నిలబడ్డారు. తాతయ్య: ‘ఏంట్రా ఆగిపోయారు?’ బన్నీ అన్నాడు.. ‘తాతయ్యా, కార్లు,బస్సులు ఆగకుండా వస్తున్నాయి. ఎలా దాటాలి?’ తాతయ్య సిగ్నల్ చూపిస్తూ ‘అదిగో, ఆ మూడు రంగుల లైట్లే మనకు దారి చూపిస్తాయి’ అన్నాడు. రామ్ అడిగాడు.. ‘ఎరుపు వెలిగితే ఏంటి తాతయ్యా?’ ‘ఎరుపు అంటే ఆగుము. వాహనాలు ఆగిపోతాయి. అప్పుడే మనం జీబ్రా క్రాసింగ్లో దాటాలి’ అన్నాడు తాతయ్య. చుక్క వెంటనే ‘మరి పసుపు రంగు?’ అని అడిగింది. ‘పసుపు అంటే తయారుగా ఉండు. నడవడానికి రెడీ అవ్వు, కానీ ఇంకా దాటొద్దు’ అని చెప్పాడు. స్వప్న ‘ఆకుపచ్చ వెలిగితే వాహనాలు వెళ్తాయి కదా? మనం ఆగాలి’ అంది. తాతయ్య మెచ్చుకుంటూ ‘భలే చెప్పావు. నియమం పాటిస్తే ప్రమాదం ఉండదు. ఎప్పుడూ సిగ్నల్ చూసే దాటండి’ అని అందరినీ రోడ్డు దాటించాడు. పిల్లలకి మాట : రోడ్డు నిబంధనలు పాటించాలి. సురక్షితంగా గమ్యాన్ని చేరాలి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లిసరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, సానుకూల ఆలోచనలు మనిషిని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచుతాయి. ఇలాంటి జీవనశైలి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్కు సన్మార్గం వేస్తుంది. కానీ మత్తుపదార్థాల వైపు మొగ్గితే జీవితమే నాశనమవుతుంది. మత్తు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుందనిపించినా.. క్రమంగా ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాలను, చదువును, కెరీర్ను నాశనం చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి కారణాలతో యువత మత్తుకు బానిసవుతున్నారు. ఒక్కసారి బానిసైతే బయటపడడం చాలా కష్టం. అందుకే ‘మత్తుకు నో.. జీవితానికి ఎస్’ అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యమే నిజ మైన సంపద అని గ్రహించి, ప్రతి ఒక్కరూ ఆరో గ్యకరమైన జీవనాన్ని ఎంచుకోవాలి. అప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదుగుతాం. పేరు : బైరి అభినయ్, 10వ తరగతి, సువిధ్య ఉన్నత పాఠశాల , కరీంనగర్ స్టాప్ డ్రగ్స్కోనరావుపేట(వేములవాడ): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కోనరావుపేటలోని సన్రైజ్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న ప్రచారం చేశారు. కోచ్ మంగళగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై డ్రాయింగ్ వేసి.. తైక్వాండో స్టైల్లో బాలికలు పోస్టర్ పట్టుకొని ప్రచారం చేశారు. ‘డ్రగ్స్ వద్దని చెప్పు.. యువత మేలుకో డ్రగ్స్ను వదులుకో.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం.. పొగ తాగుట హానికరం..’ వంటి అర్థాలు వచ్చేలా చిత్రాలు గీశారు. -
పువ్వుల పేర్లతో పొడుపు కథలు
1. అమెరికాకు చెందిన పువ్వు విషపూరితమైన పువ్వు స్పాడిక్స్ ఉన్న పుష్పగుచ్ఛం ఆరేసి కుటుంబ పువ్వు 2. పువ్వులన్నీ సువాసన ఇస్తాయి కానీ ఈ పువ్వు వస్త్రాలనిస్తుంది 3. ఈ పువ్వు జడలో పెట్టుకోలేము ఈ పువ్వు కాశ్మీరులో ఉంటుంది ఈ పువ్వు తినడానికి వాడతాము 4. ఆకుల రంగులో ఉండే పువ్వు ఘాటైన సెంటు కొట్టుకునే పువ్వు 5. బురదలో ఉన్న స్వచ్ఛంగా ఉంటుంది గుండ్రని ఆకులతో నీటిలో ఉంటుంది నెలంబోనేసి కుటుంబంలో ఉంటుంది 6. భారతదేశంలోనే అరుదైన పుష్పం పుష్కరానికోసారి పూసే పువ్వు పశ్చిమ కనుమలలో పెరిగే పుష్పం 7. నైట్క్వీన్ బిరుదు కలిగిన పువ్వు ధనికమైనదని పేరు కలిగిన పువ్వు మెక్సికో దేశపు కాక్టస్ జాతి పువ్వు 8. లేత నారింజ రంగులో డిస్క్ పువ్వు వీల్పిన్ కుషన్ అనే పేరున్న పువ్వు అంతరించి పోతున్న దక్షిణాఫ్రికా పువ్వు 9. లిల్లీ పూలకు అక్కలు వసంతంలో పూచే పువ్వులు ఆకర్షణీయమైన రంగులు అత్యంత విలువైన పువ్వులు 10. ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం పోస్టల్స్టాంప్ ఉన్న పుష్పం ఆస్టరేసి కుటుంబ పుష్పం 11. టెన్నిస్ బంతుల్లాంటి పువ్వులు హరిప్రియ పేరు గల పువ్వులు సుగంధ ద్రవ్యాలలో వాడే పువ్వులు 12. భూమ్మీదే అరుదైన పువ్వు ప్రేమ అభిరుచి కలగలసిన పువ్వు యూకే, న్యూజిలాండ్ల్లోని పువ్వు 13. కరేబియాన్ దీవులు, దక్షిణ అమెరికా పువ్వు రేకులు ఔషధంగా ఉపయోగించే పువ్వు ఫాబేసి కుటుంబానికి చెందిన పువ్వు పగడపు రత్నం అనే బిరుదు గల పువ్వు 14. దుర్వాసన కలిగిన పువ్వు శవం పువ్వని పేరున్న పువ్వు మలేషియా, థాయ్లాండ్ల పువ్వు ప్రపంచంలోనే అతి పెద్ద పువ్వు 15. సుమత్రా ద్వీపానికి చెందిన పువ్వు కుళ్లిన చేప వాసన కలిగిన పువ్వు ఆరేసి కుటుంబానికి చెందిన పువ్వు 16. వుల్ఫియా గ్లోబోసా శాసీ్త్రయ నామం ప్రపంచంలోనే అత్యంత చిన్న పుష్పం ప్రాకాశవంతమైన ఆకుపచ్చ రంగు పుష్పం 17. పాముపడగ ఆకారంలో ఉండే పువ్వు పేరులో శాంతిని పెట్టుకున్న పువ్వు శ్రీస్పాతి ఫిలమ్శ్రీ పేరున్న శ్రీఆరేసిశ్రీ పువ్వు 18. తెల్లగా దెయ్యంలా ఉండే పువ్వు ఆకులు, కాండం లేకుండా ఉన్న పువ్వు అంతరించి పోతున్న ఆర్కిడెని పువ్వు 19. పుష్పించే అరుదైన పుదీనా జాతి పువ్వు తీవ్రమైన ప్రమాదంలో ఉన్న పువ్వు క్లేలెన్సులు అనే పేరు గల పువ్వు 20. మధ్య అమెరికాకు చెందిన పువ్వు అంతరించిపోయే దశలో ఉన్న పువ్వు గాలిమొక్కలుగా పేరు పొందిన పువ్వు బలం, అనుకూలతల మిళిత పువ్వు 21. పాపారేసి కుటుంబానికి చెందిన పువ్వు ఆసియన్ బ్లీడింగ్ హార్ట్ అని పేరున్న పువ్వు కొండల్లో రాతి పగుళ్లలో పెరిగే పువ్వు 22. హిమాలయ ప్రాంతపు అరుదైన పువ్వు మెకోనోప్సిన్ ఆక్యులేటా శాసీ్త్రయ నామం నీలపురంగు రెక్కలు పసుపు కేసరాల పుష్పం 23. ఆడపిల్లల చెప్పును పోలి ఉండే పువ్వు భారతీయపు అరుదైన సున్నితమైన పువ్వు అంతరిస్తున్న కారణంగా రక్షింపబడే పువ్వు 24. రసవంతమైన పుష్పించే మొక్క రంగులతో అలంకార మొక్క కళ్లు మిరుమిట్లు గొలిపే మొక్క 25. ఇంద్రధనస్సు వర్గాలతో పూలు ఎక్కువసేపు వాడిపోని పూలు రాముంటిక్ ఫ్లవరోగా పేరున్న పూలు అదృష్టం, సామరస్యాలకు చిహ్నాలు జావాబులు:1.ఆంధూరియా, 2.పత్తి పువ్వు, 3.కుంకుమ పువ్వు, 4.సంపెంగ పువ్వు, 5.తామర పువ్వు, 6.నీలకురించి, 7.కడుపుల్ పువ్వు, 8.కధారిన్ పువ్వు, 9.తులిప్ పూలు, 10. బ్రహ్మకమలం, 11.కదంబ పూలు, 12.మిడిల్ మిస్ట్ రెడ్ పువ్వు, 13.చిలక ముక్కు పువ్వు, 14.రఫ్లీషియా, 15.టైటాన్ ఆరమ్ కారియన్ పువ్వు (అమారో ఫాలాస్ టైటానియమ్), 16.వాటర్ మీల్ పువ్వు, 17.్చీపస్ లిల్లీ, 18.ఘోస్ట్ ఆర్కిడ్, 19.అకాంతోమింతాం ఇలిసిఫోలియా (శాన్ డియాగో ధోర్న్ మింట్), 20.టిల్లాడ్సియా, 21.లాంప్రో కాప్నోస్ పువ్వు, 22.హిమాలయన్ బ్లూపాపి, 23.లేడిస్ స్లిప్పర్ ఆర్కిడ్డాక్టర్ కందేపి రాణిప్రసాద్ మేనేజింగ్ డైరెక్టర్, సృజన్ చిల్డ్రన్స్ హాస్పిటల్, సిరిసిల్ల -
రోజూ నేర్చుకుంటున్నాం
వేసవిలో ఇంటి వద్దే ఉంటూ ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. – పొందుర్తి భువన్ ఎండాకాలం సెలవుల్లో ఎండల్లో తిరగకుండా సరదాగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. నిత్యం డ్యాన్స్లో శిక్షణ తీసుకోవడం సంతోషంగా ఉంది. – వర్షిణి సెలవుల్లో సెల్ఫోన్లు చూసేందుకు కూడా టైం దొరకడం లేదు. ఉదయం, సాయంత్రం డ్యాన్స్ నేర్చుకుంటున్నాం. ఇది మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా మంది మమ్మల్ని అభినందిస్తున్నారు . – నేహాశ్రీ -
కరీంనగర్కు సుభోద్సింగ్!
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో సూత్రధారి, అంతర్ రాష్ట్ర గ్యాంగ్ హ్యాండ్లర్, ‘ది గోల్డెన్ థీప్’ సుభోద్సింగ్ను కరీంనగ ర్ పోలీసులు గురువారం రాత్రి స్థానిక కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకొచ్చినట్లు సమాచారం. బిహార్ జైలులో ఖైదీగా ఉన్న సుభోద్సింగ్ను పీటీ వారెంట్పై కరీంనగర్ కోర్టుకు తరలించి, కస్టడీ తీసుకునేందుకు సిద్ధమైన్లు తెలిసింది. నగరంలోని పీఎంజే జువెల్లరీస్లో దోపిడీకీ మూడు నెలల నుంచి రెక్కీ నిర్వహించిన సుభోధ్సింగ్ ముఠాకు చెందిన నలుగురు సభ్యులు పక్కాగా ప్లాన్ వేసి ధర్మపురి లాడ్జీలో మకాం వేశారు. అంతకంటే ముందు మహరాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి తుపాకులు తీసుకొచ్చి ధర్మపురిలో పెట్టుకున్నారు. అక్కడి నుండి వచ్చి కరీంనగర్లోని పీఎంజే జువెల్లరీస్లో ఈ నెల 3వ తేదీన ఉదయం 11 గంటలకు రూ.82.02 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ చేశారు. జువెల్లరీస్ సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం బైక్లపై పలు గ్రామాల గుండా కాలువలు, గ్రామీణ రోడ్ల మీదుగా ధర్మపురికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోదావరి నది దాటి మంచిర్యాల మీదుగా రైలులో పరారయ్యాయు. అక్కడి నుంచి పారిపోయి ముఠా సభ్యులకు బంగారం చేరవేశారు. వారు దానిని నేపాల్ తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. బృందాలుగా ఏర్పడిన కరీంనగర్ పోలీసులు బిహార్, పశ్చిమబెంగాల్తో పాటు వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు, సిబ్బంది సాయంతో నిందితులు బెంగాల్కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగిరాసింగ్, బిహార్కు చెందిన రావిష్కుమార్ అలియాస్ ప్రద్యుమన్, నిందితులకు సిమ్కార్డులు సరఫరా చేసిన బెంగాల్కు చెందిన మెహతాబ్ఖాన్ అలియాస్ మహబూబ్ఖాన్లను గుర్తించి ఈనెల 14న అరెస్టు చేసి కరీంనగర్ తీసుకొచ్చారు. ఈ దోపిడీ కేసులో కీలక సూత్రధారి అయిన సుభోద్సింగ్తో పాటు మిగితా నిందితులు పరారీలో ఉండగా, బిహార్ జైళ్లో ఉన్న సుభోద్సింగ్ను పీటీ వారెంట్పై కరీంనగర్ పోలీసులు తీసుకొచ్చినట్లు తెలిసింది. కోర్టు అనుమతిస్తే కస్టడీకీ తీసుకొని దోపిడీ సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు. పీటీ వారెంట్పై బిహార్ జైలు నుంచి ‘పీఎంజే’ దోపిడీ సూత్రధారి తరలింపు -
వడదెబ్బతో వ్యక్తి..
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో అప్పల రాజయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాజయ్య బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతకగా గురువారం గుంటూరుపల్లి గ్రామ శివారులో పొలంలో వడదెబ్బతో మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అప్పల కొమురమ్మ ఎల్కలపల్లి గ్రామ వార్డు సభ్యురాలు. కొడుకు అనిల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. జీడీనగర్లో వృద్ధుడు.. పాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామానికి చెందిన గండికోట మల్లయ్య(82) గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. తీవ్ర ఎండల ధాటికి అస్వస్థతకు గురైన మల్లయ్య అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
అనుమానాస్పదంగా యువకుడు..
కరీంనగర్ క్రైం: నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందాడు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సప్తగిరికాలనీకి చెందిన తులసి సురేశ్(36) మంకమ్మతోటలో పాత లేబర్ అడ్డా వద్ద ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి సెంటర్కు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో సురేశ్ తల్లి భాగ్యమ్మ పలుమార్లు ఫోన్ చేసింది. అతని బంధువులు, స్నేహితులకు కూడా ఫోన్ చేసినా సురేశ్ లిఫ్ట్ చేయలేదు. రాత్రంతా ఫోన్ తీయకపోవడంతో గురువారం వేకువజామున సురేశ్ సోదరి లక్ష్మి అతని స్నేహితుడికి ఫోన్ చేసి షాప్ వద్దకు వెళ్లి చూడమని చెప్పింది. అతను వెళ్లి స్థానికుల సాయంతో షట్టర్ తీసి చూడగా.. లోపల ఫ్యాన్కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సురేశ్ మృతికి వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
స్టెప్పేస్తే మాస్
● డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు ● రాచర్లబొప్పాపూర్లో సందడిగా వేసవి శిక్షణ శిబిరం ● జానపదం, కోలాటం, క్లాసికల్ డ్యాన్స్లో ట్రెయినింగ్ ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థినులు స్టెప్పు వేస్తే ఓ స్టైల్.. అడుగు వేస్తే ఓ రిథమ్... మొత్తానికి వేసవి శిక్షణ శిబిరాలు నృత్యశిక్షణతో కళకళలాడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత 15 రోజులుగా కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో ఆకట్టుకుంటుంది. భువన ఆర్ట్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ పొందుర్తి ఉమేశ్ మార్గదర్శనంలో విద్యార్థినులు సెమీ క్లాసికల్, జానపదం, భక్తికోలాటం, జడకొప్పులు.. వెస్టర్న్ వంటి నృత్యాలు నేర్చుకుంటున్నారు. సరదాగా సెలవులు మండుతున్న వేసవిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య కళలో శిక్షణ పొందుతున్నారు. రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ట్రెయినింగ్ క్యాంపునకు విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత పెంపొందడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో దాదాపు 150 మంది విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రశంసపత్రాలు అందించి, అభినందించారు. హ్యాండ్రైటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, డ్యాన్స్ అంశాల్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు. నేను దాదాపు 26 ఏళ్లుగా పిల్లలకు నృత్య శిక్షణ ఇస్తున్నా. భువన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాలాంటి కళాకారులకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మందిని కళాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం దక్కుతుంది. – పొందుర్తి ఉమేశ్, భువన ఆర్ట్స్ అకాడమీ, డ్యాన్స్ మాస్టర్ -
తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం కాట్నపల్లికి చెందిన గీతకార్మికుడు వీరగోని బక్కయ్య(49) గురువారం తాటిచెట్టు పైనుంచి ప డి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. బక్కయ్య రోజువారీ కార్యక్రమంలో భాగంగా తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోకు జారడంతో కిందపడ్డాడు. తీవ్రగాయాలు కాగా స్థానికులు 108లో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అ ప్పటికే మృతి చెందినట్లు తెలి పారు. మృతుడి భార్య ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బక్కయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అదుకోవాలని సర్పంచ్ ఓగుల పూజ, గౌడ సంఘం అధ్యక్షుడు పోచమల్లు కోరారు. -
ఉపాధి కోర్సులు.. భవితకు వెలుగులు
కరీంనగర్సిటీ: ప్రస్తుత ఏఐ జనరేషన్లో విద్యార్థులు ఉపాధి లభించే కోర్సులనే ఎంపిక చేసుకుంటున్నారు. తక్కువ వ్యవధిలో జీవితంలో స్థిరపడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్న డిగ్రీ విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సాధిస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరిధి లో 18 ప్రభుత్వ డిగ్రీ, పీజీ, 3 అటానమస్, 55 ప్రైవేటు కాలేజీలున్నాయి. పలు కళాశాలల్లో ఉపాధి కోర్సులు ప్రారంభమయ్యాయి. యువత త్వరగా ఉద్యోగాలు సాధించే విధంగా ఎస్సారార్, మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాలలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఉపాధి కోర్సులు ప్రవేశపెట్టారు. ఇంటర్ ఫలితాలు వెలువడడంతో డిగ్రీ కళాశాలలో చేరిన మొదటి ఏడాది నుంచే ఉపాధి కల్పించే దిశగా ఏఈడీపీ (అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రాం) అమలు చేస్తున్నారు. ఆయా కోర్సులకు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. -
శుక్రవారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2026
భక్తిశ్రద్ధలతో బక్రీద్కరీంనగర్కల్చరల్: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను జిల్లావ్యాప్తంగా ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రేకుర్తి సాలెహ్నగర్, కళాభారతి వద్ద, కొత్తపల్లి, చింతకుంట, బైపాస్రోడ్డులో ఉన్న ఈద్గాలు, గ్రామాల్లోని దర్గాల వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. మత గురువులు సందేశమిచ్చారు. సాలెహ్నగర్ ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో సీపీ గౌస్ ఆలం పాల్గొన్నారు. ఈద్గా వద్ద విధుల్లో ఉన్న ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ విజయ్కుమార్, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ఎస్సారార్ కళాశాల నుంచి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. నగరపాలక సంస్థ, విద్యుత్, వైద్యశాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
నగరంపై పోలీసు నిఘా
కరీంనగర్క్రైం: నగరంపై పోలీసులు నిఘా పెంచారు. ఇటీవల జరిగిన పీఎంజే బంగారు దుకాణం చోరీ తరువాత మరింత అప్రమత్తం అయ్యారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. నిరంతర నాకాబందీలు నిర్వహిస్తూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. కరీంనగర్లో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతే లక్ష్యంగా సీపీ గౌస్ ఆలం స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల జరిగిన దోపిడీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే బంగారు దుకాణాలు, లాడ్జీలు, హోటళ్ల నిర్వాహకులతో సమావేశమై సలహాలు సూచనలు ఇచ్చారు. నేరుగా వ్యాపార సముదాయాలను తనిఖీ చేస్తూ వద్ద భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, ఎమర్జెన్సీ సదుపాయాలపై నిర్వాహకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతీ సముదాయంలో సీసీ కెమెరాలు పనిచేసేలా చూడాలని, విజువల్స్ స్పష్టంగా ఉండటంతో పాటు బ్యాకప్ నిల్వ ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. భద్రతా ప్రమాణాల్లో నిర్లక్ష్యం వహించే వ్యాపార సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. బంగారు దుకాణాలపై.. జిల్లావ్యాప్తంగా 50కి పైగా జువెల్లరీ షోరూంలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పీఎంజే జువెల్లరీ దొంగతనం నేపథ్యంలో అన్ని జువెల్లరీస్ నిర్వాహకులను పోలీసులు అప్రమత్తం చేశారు. దుకాణాల్లో తప్పనిసరిగా అర్హత కలిగిన భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని ఆదేశించారు. దుకాణం ప్రవేశ ద్వారాల వద్ద డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, వినియోగదారుల తనిఖీలకి హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు షోరూంల్లో ఎమర్జెన్సీ అలారం ఏర్పాటు చేసి, నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు జిల్లావ్యాప్తంగా 100 వరకు, కరీంనగర్ సిటీలో 50కి పైగా హోటళ్లు, లాడ్జీలు ఉన్నాయి. పీఎంజే దొంగలు లాడ్జీల్లో ఉంటూ రెక్కీ నిర్వహించిన నేపథ్యంలో ఇకపై ప్రతీ హోటల్, లాడ్జీపై పోలీసు నిఘా తప్పనిసరిగా ఉంటుందని సీపీ నిర్వాహకులను హెచ్చరించారు. ఇటీవల నగరంలోని హోటళ్లు, లాడ్జీల నిర్వాహకులతో సమావేశమై బసచేసే వారి వివరాల సేకరణలో నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. గదులు అద్దెకు ఇచ్చే ముందు ఆధార్, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, ఫోన్ నంబర్లు ధృవీకరించాలని ఆదేశించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. సీపీ స్వయంగా లాడ్జీలు తనిఖీ చేస్తూ రిజిష్టర్లు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. పెరిగిన గస్తీ.. నాకాబందీ నగరంలో పోలీసులు గస్తీ పెంచారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. అర్ధరాత్రి సైతం వాహన తనిఖీలు చేపడుతూ అనుమానితుల గురించి ఆరా తీస్తున్నారు. ప్రతీ పోలీసు స్టేషన్ పరిధిలో ఏకకాలంలో నాకాబందీ నిర్వహిస్తూ వాహన ధ్రువీకరణ పత్రాలు పరిశీలిస్తున్నారు. నిబంధనలు పాటించనివారికి జరిమానాలు విధిస్తున్నారు. నేరాల్లో పాల్పడేవారు ఎక్కువ శాతం దొంగిలించిన, నంబర్ ప్లేట్ లేని వాహనాలు వాడుతున్న నేపథ్యంలో అలాంటి వాహనాలను స్టేషన్కు తరలించి, విచారణ చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై కొరడా ఝులిపిస్తున్నారు. కార్గో సెంటర్లు, ట్రాన్స్పోర్టు కార్యాలయాలు, పాన్షాపుల్లో, బస్టాండ్లో జాగిలాలతో తనిఖీలు చేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన నాఖాబందీలో 1,479 వాహనాలు తనిఖీ చేశారు. 48 డ్రంకెన్డ్రైవ్ కేసులు నమోదు చేశారు. నంబర్ ప్లేట్ సరిగ్గా లేని 60 వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 115మందికి చలానా విధించారు. -
జనగణన.. బడిబాట
బాడిబాటలో ఉపాధ్యాయులుజనగణనలో ఉపాధ్యాయులుకరీంనగర్టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలనే లక్ష్యంతో ఓ వైపు బాడిబాట కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జనగణన త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యం మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయులను అయోమయానికి గురి చేస్తోంది. బడిబాట, జనగణన, టీచర్ ట్రెనింగ్ షెడ్యూల్ నెలరోజుల్లోనే ఉండడంతో ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 14 నుంచి జూన్ 19 వరకు ‘బడిబాట’ నిర్వహించేలా విద్యాశాఖ ప్రణాళికలను రూపొందించింది. 95 శాతం మంది ఉపాధ్యాయులు జనగణన విధుల్లో నిమగ్నమై ఉండడంతో పాటు ఎండల తీవ్రతతో ‘బడిబాట’ తూతూమంత్రంగానే కొనసాగుతోంది. బడిబాట షెడ్యూల్ ఇదీ.. విద్యా వారోత్సవాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 651 ప్రభుత్వపాఠశాల్లో 5వేల మందికి తగ్గకుండా విద్యార్థులను చేర్పించాలనే లక్ష్యంతో ఈ నెల 14 నుంచి బడిబాట ప్రారంభమైంది. జూన్ 19 వరకు కొనసాగనుంది. ఇప్పటి వరకు వివిధ కార్యక్రమాలు కొనసాగగా.. ఈనెల 28న యువత, స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. జూన్ 3న గ్రామసభ, 4న అవగాహన ర్యాలీ, 5న ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించాలి. 6న బడి బయట పిల్లలను గుర్తించాలి. 8 నుంచి 10 వరకు ఇంటింటి ప్రచారం, 12న వెల్కమ్డే (అమ్మ మాట పాఠశాల), 15న సామూహిక అక్షరాభ్యాసం, 16న ఎఫ్ఎల్ఎన్డే, 17న గర్ల్ చైల్డ్, ఇనూసీవ్ ఎడ్యుకేషన్ డే, 18న డిజిటల్ అవేర్నెస్ డే, 19న స్పోర్ట్స్డేతో బడిబాట ముగియనుంది.జిల్లాలోని ఉపాధ్యాయులు జూన్ 9వ తేదీ వరకు జనగణన విధులు నిర్వహించనున్నారు. ఈ సమయంలోనూ బడిబాట ఏర్పాటు చేయడంతో అయోమయం నెలకొంది. 95శాతం మంది జనగణన విధుల్లో పాల్గొంటుండగా, మిగిలిన 5శాతం మందిని అదనంగా అదే విధులకు కేటాయించారు. ఇటు జనగణన, అటు బడిబాటలో ఏకకాలంలో ఎలా పాల్గొనాలో అర్థంకాక ఉపాధ్యాయులు తల పట్టుకుంటున్నారు. ఒకే సమయంలో రెండు విధులు నిర్వహించమంటే ఉపాధ్యాయుల నుంచి ఎలాంటి ఆక్షేపణలు ఎదురవుతాయోనని హెడ్మాస్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లలో ఆదర్శంగా నిలవండి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపుపై అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో కే.మహేశ్వర్, పౌరసరఫరాల శాఖ, రైస్ మిల్లర్లతో సమీక్ష నిర్వహించారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే 115 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయ్యిందని, మిగతా కేంద్రాలోనూ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోళ్ల నిర్వహణలో జిల్లా రా ష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు, సివిల్ సప్లై డీఎం రజనీకాంత్, జిల్లా సహకార అధికారి రామానుజాచార్యులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యం కొంటాంకరీంనగర్ అర్బన్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ చిత్రామిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు స్వీకరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సుమారు 600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు వెల్లడించారు. కరీంనగర్ పాక్స్లో 600 క్వింటాళ్లు, గంగాధర పాక్స్లో 1200 క్వింటాళ్లు, లక్ష్మీదేవిపల్లిలో 400 క్వింటాళ్లు, చెర్లపల్లి(ఎన్)లో 400 క్వింటాళ్లు, ర్యాలపల్లిలో 320 క్వింటాళ్లు, కొండయ్యపల్లిలో 200 క్వింటాళ్లు, వెంకటాయిపల్లిలో 160 క్వింటాళ్లు, మంగపేటలో 120 క్వింటాళ్లు, మధురానగర్లో 40 క్వింటాళ్లు, నర్సింహులపల్లిలో 240 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. చొప్పదండి పాక్స్లో 800 క్వింటాళ్లు, రామడుగు మండలంలోని తిర్మలాపూర్లో 1230 క్వింటాళ్లు, గన్నేరువరం మండలంలో 290 క్వింటాళ్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 2.67లక్షల మెట్రిక్ టన్నుల ధా న్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రూ.488.52 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. కలెక్టరేట్ ఏవోగా నరేందర్కరీంనగర్ అర్బన్: సాధారణ బదిలీల్లో భాగంగా పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ చిత్రామిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ ఈ.నరేందర్ను కలెక్టరేట్ ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా నియమించారు. కలెక్టరేట్ ఏవోగా ఉన్న గడ్డం సుధాకర్ను జమ్మికుంట తహసీల్దార్గా బదిలీ చేశారు. సీ సూపరింటెండెంట్ ఎన్.రాజేశ్ను కరీంనగర్ అర్బన్ తహసీల్దార్గా, హెచ్ సూపరింటెండెంట్ టి.మాధవిని సీ సూపరింటెండెంట్గా నియమించారు. డిప్యూటేషన్పై విధులు నిర్వహిస్తున్న గందె లక్ష్మినర్సింహరావు కరీంనగర్ రూరల్కు కేటాయించారు. గంగాధర, గన్నేరు వరం తహసీల్దార్లు ఎ.రజిత, కోడం కనకయ్య లను అదేస్థానంలో నియమించారు. కరీంనగర్ ఆర్డీవో కార్యాలయ డీఏవో వి.రఘుపతిని అక్కడే రిటైయిన్ చేశారు. నేడో, రేపో మరిన్ని బదిలీలు ఉంటాయని సమాచారం. -
చిన్నారిపై కుక్కల దాడి
కోల్సిటీ: పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో కుక్కల దాడులకు అడ్డుకట్ట పడడం లేదు. బుధవారం గోదావరిఖని లక్ష్మీనగర్లోని బోళ్ల బజార్లో బాలిక(8)పై కుక్కలు దాడి చేసి కరిచాయి. శునకాలు మీదపడి దాడిచేసి గాయపరుస్తుంటే, కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా – మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడుపై కుక్కలు దాడి చేసిన ఘటన జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు. వడదెబ్బతో కూలి మృతివేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లికి చెందిన పాటి తిరుపతి(59) బుధవారం వడదెబ్బతో మృతిచెందినట్లు ఎస్ఐ వెంకట్రాజం తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్గా, ఇతర పనులు చేసుకుంటున్న తిరుపతి బుధవారం గ్రామంలో ఓ మహిళ మృతిచెందగా ట్రాక్టర్లో కట్టెలు తీసుకెళ్లి అంత్యక్రియలు ముగిసే వరకు అక్కడే ఉన్నాడు. అనంతరం ట్రాక్టర్లో ధాన్యాన్ని కేంద్రానికి తీసుకెళ్లి ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే తల తిప్పుతుందని కుటుంబసభ్యులకు చెప్పగానే వెంటనే ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందాడు. మృతుడి భార్య లలిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒక కొడుకు ఉన్నాడు. -
అమ్మ కూచి పిల్లలం !
అమ్మ కూచి పిల్లలం ఉమ్మకోరు మల్లెలం వెన్నతిన్న వారలం చిన్నగున్న పోరలం! వెచ్చనైన ఆ తల్లి ఒడి మచ్చికై న మా తొల్లి బడి ఆ తల్లి ఒడిలో శయనిస్తం మా తొల్లి బడిలో విహరిస్తం అమ్మ చంక నెక్కుతాం నాన్న చేతికి చిక్కుతాం అమ్మ ఇచ్చు ముద్దులు నాన్న చెప్పు సుద్దులు ! వెండి గిన్నె నాన్న తెచ్చు వండి బువ్వ అమ్మ ఇచ్చు తియ్యగా మేము తింటాం హాయిగా ఇక ఆడుకుంటాం ! క్రమశిక్షణతో పొందుగుంటం అక్షర శిక్షణను అందుకుంటం గుడి గంటను కుద్దుగా వింటాం బడిబాటను ముద్దుగా కంటాం ! – గుర్రాల లక్ష్మారెడ్డి, కవి రచయిత కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా -
బాల గేయం..!
ఉరుకుల పరుగుల ఓ ఉడుతా... ఊయల ఊపుత వచ్చి ఊగమ్మా..! గెంతులు గెంతే ఓ కోతి కొబ్బరి కుడకలు ఇస్తా కొరుక్కు తినవమ్మా..! భౌ భౌ అరుపుల ఓ బేబీ నీకు భోజనం పెడతా భోంచేయమ్మా..! మ్యావ్..మ్యావ్ మీసాల ఓ పిల్లి కూన తియ్యటి పాలు పోస్తా తాగి పోవమ్మా..! మే.. మే నెలల ఓ బుజ్జీ మేకా మా తోటకు పోదాం చక చక రారా...! కావ్..కావ్ కూతల ఓ నల్ల కాకీ కుండడు నీళ్లిస్త కూచోవమ్మా...! కూ.. కూ పాటల ఓ కోకిలమ్మా కొండపల్లి బొమ్మిస్తా ఆడుకోవమ్మా..! చిట్టి చిట్టి పలుకుల ఓ చిలకమ్మా నీకు జాంపండిస్తా మాటాడమ్మా..! ఆటల పాటల ఓ నేస్తాలూ అలుగక నాతో రావాలి కబుర్ల పండుగ చేయాలి..! చిలిపి చేష్టల ఓ చిన్నారి... చీకు చింతలూ వదలాలి చిందులు వేస్తూ నవ్వాలి..!! – డాక్టర్ కటుకోఝ్వల రమేశ్, కవి, రచయిత, ఖమ్మం జిల్లా -
ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: ఎంఆర్ లినాక్తో కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో బ్రెస్ట్, ఊపిరితిత్తులు, నోటి, సర్వైకల్ కేన్సర్లు అధికంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేన్సర్ చికిత్సలో రేడియోథెరపీ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది ట్యూమర్ కణాలను నాశనం చేయడమే కాకుండా రోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. దేశంలో తొలిసారిగా యశోద హాస్పిటల్స్లో ఎలెక్టా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఎంఆర్– లినాక్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏఐ ఆధారిత అడాప్టివ్ ట్రీట్మెంట్ ప్లానింగ్, తక్కువ దుష్ప్రభావాలు, అధిక మోతాదులో రేడియేషన్ను సురక్షితంగా అందించే సామర్థ్యం ఈ సాంకేతికత ప్రత్యేకతలని తెలిపారు. ప్రోస్టేట్, సర్వైకల్, ప్యాంక్రియాటిక్, రెక్టల్ కేన్సర్లు, బ్రెయిన్ ట్యూమర్ల చికిత్సలో ఎంఆర్– లినాక్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యశోద రేడియేషన్ ఆంకాలజిస్ట్ భరత్ చంద్ర -
రోడ్డు ప్రమాదంలో ఉప సర్పంచ్ మృతి
సుల్తానాబాద్రూరల్/పెద్దపల్లి/ఓదెల: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులోని రాజీవ్ రహదారిపై బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టగా ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి((39) మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కోట నిరంజన్రెడ్డి, నాంసానిపల్లెకు చెందిన పోతగంటి రాజు కలిసి ద్విచక్ర వాహనంపై కరీంనగర్కు పనినిమిత్తం వెళ్తున్నాడు. ఈక్రమంలో కాట్నపల్లి శివారులో వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ముందు టైర్ ఎక్కగా నిరంజన్రెడ్డి మృతి చెందాడు. రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. పోలీసుల అదుపులో లారీ డ్రైవర్ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యులను విప్ విజయరమణరావు పరామర్శించారు. ఉప సర్పంచ్ మృతితో ఆయన స్వగ్రామం మడకలో విషాదం అలముకుంది. -
డేంజర్ హోర్డింగ్స్!
కరీంనగర్ కార్పొరేషన్: హోర్డింగ్లు.. బోర్డులు.. ఫ్లెక్సీల రూపంలో నగరంలో ప్రమాద ఘంటికలు మొగుతున్నాయి. వేసవి ముగింపు దశలో వచ్చే ఈదురుగాలులు, వర్షాలతో సిటీ ప్రజలకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ముందస్తు హెచ్చరికగా ఒక్క గాలివానకే హోర్డింగ్లు.. సైన్బోర్డులు కూలిపోగా, అధికారులు మేల్కొనకపోతే రానున్న రోజులు నగరవాసులను కలవరపెట్టడం ఖాయం. ఇష్టారీతిన హోర్డింగ్స్... నగరం శరవేగంగా విస్తరిస్తోంది. సమీప పంచాయతీలు విలీనం కావడంతో విస్తీర్ణం పెరిగింది. వ్యాపార, వాణిజ్య పరంగా పురోగతి సాధిస్తోంది. ఇక్కడ విద్య, వైద్యం, వస్త్ర వ్యాపార రంగాలు అధికం. దీంతో సహజంగానే హోర్డింగ్స్, బోర్డులకు నగరంలో అధిక డిమాండ్ ఏర్పడింది. వ్యాపార ప్రకటనల కోసం హోర్డింగ్స్ను ఏర్పాటు చేసేందుకు స్థానికులతో పాటు, బహుళ సంస్థలు పోటీపడుతున్నాయి. హోర్డింగ్స్ ఏర్పాటులో కనీస నిబంధనలు పాటించడం లేదు. పాత భవనాలపైన, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తుండడం ఇప్పుడు సమస్యగా మారింది. పట్టని నిబంధనలు నగరపాలకసంస్థకు ఆదాయం పెంచే హోర్డింగ్స్ ఏర్పాటుకు అనుమతులు ఇస్తున్నా, నిబంధనలు పాటించకపోవడం సమస్యగా మారింది. నగరంలో భారీ హోర్డింగ్స్ చాలా ఉన్నా కొన్ని మాత్రమే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. తెలంగాణచౌక్, టవర్సర్కిల్, బస్స్టేషన్ తదితర వాణిజ్యప్రాంతా ల్లో పాత భవనాలపైనా భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వర్షాకాలం ఈదురుగాలులు, భారీ వర్షాలకు ఆ భవనాలు తట్టుకోలేక హోర్డింగ్స్ కూలి పోయే అవకాశం ఉంది. కొన్ని హోర్డింగ్స్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేస్తున్నారు. ఇవి మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. గీతాభవన్ చౌరస్తాలోని పాత భవంతిపై ఉన్న హోర్డింగ్ ఒక్క గాలివానకే కూలిపోవడం తెలిసిందే. పార్క్లు, పాఠశాలలు, ప్రార్థనా మందిరాల్లో ఏర్పాటు చేయొద్దని నిబంధనలు ఉన్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటీ ముట్టనట్లుగా పట్టణ ప్రణాళిక హోర్డింగ్స్, యూనిపోల్స్, కాంటిలివర్స్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, పర్యవేక్షించాల్సిన పట్టణ ప్రణాళిక అధికారులు పట్టకుండా వ్యవహరిస్తున్నారు. సామర్థ్యం లేని పాత భవనాలు, పార్క్లు, పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విమర్శలు పెరిగినప్పుడు కాలనీల్లో ఏర్పాటు చేసిన పోల్స్,హోర్డింగ్స్ తొలగించి చేతులు దులుపుకొంటున్నారు. ఇందులోనూ పెద్ద సంస్థల హోర్డింగ్స్ జోలికి వెళ్లరనే విమర్శలున్నాయి. వీటన్నింటికీ రూ.లక్షలు చేతులు మారడమే కారణమనే ఆరోపణలున్నాయి. ఫ్లెక్సీలతో ప్రమాదం వ్యాపార, ప్రచార, రాజకీయ ప్రకటనలకు ఉపయోగించే ఫ్లెక్సీలు నగరవాసుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. రహదారులతో పాటు, అంతర్గత రోడ్లు, చివరకు వీధుల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గాలివానకు ఫ్లెక్సీలు చిరిగిపోయి రోడ్లపై వెళ్తున్న వాహనాలపై, సమీప నివాసితులపై పడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. భారీ హోర్డింగ్స్కు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు ఒక్క గాలివానకు చీలికలు, పేలికలుగా మారి కొట్టుకుపోవడం, సమీప రోడ్లు, ఇండ్లపై పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బల్దియా సిబ్బంది, కొన్ని మాత్రమే తొలగించడం, మరికొన్నింటిని రోజుల తరబడి వదిలివేస్తుండడం వివాదాస్పదంగా మారుతోంది. ముందస్తు హెచ్చరిక మంగళవారం రాత్రి కురిసిన గాలి వానకు గీతాభవన్ పక్క భవనంపై ఉన్న హోర్డింగ్ కూలిపోయింది. సిమెంట్ దిమ్మెలతో సహా లేచిపోయింది. సమీపంలో ఉన్న ఓ వైన్షాప్ భారీ నేమ్ బోర్డు పడిపోయింది. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో నగరవాసులు ఏ మేరకు ప్రమాదంలో ఉన్నారో చెప్పేందుకు ప్రకృతి చేసిన హెచ్చరికగా పలువురు అభివర్ణిస్తున్నారు. నగరపాలకసంస్థ అధికారులు మేల్కొని చర్యలు చేపడితేనే, నగరవాసులు వర్షాకాల ప్రమాదాలను తప్పించుకోగలుగుతారు.ముకరంపురలో విద్యుత్వైర్లను ఆనుకుని ఉన్న హోర్డింగ్ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద పాతభవనంపై హోర్డింగ్ఆర్టీసీ బస్టాండు వద్ద చిరిగిన ఫ్లెక్సీలతో హోర్డింగ్గీతభవన్ పక్కన కూలిన హోర్డింగ్బస్టాండు సమీపంలో...నగరంలో హోర్డింగ్స్ వివరాలు హోర్డింగ్స్ 239కాంటిలివర్స్ 133యూనిపోల్స్ 04అనుమతి లేక గతంలో తొలగింపు 230 -
శిక్షణతో ఆత్మవిశ్వాసం
ప్రతిరోజు వచ్చి గణితంలో చిట్కాలు నేర్చుకున్నా. కంప్యూటర్ పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ఎలా రాస్తే హ్యాండ్రైటింగ్ బాగుంటుందో ఉపాధ్యాయులు నేర్పించారు. ఇలాంటి శిక్షణ ఇంకొద్ది రోజులు ఉంటే ఉంటే బాగుండేది. అరాధ్యాయా, 8వ తరగతి శిక్షణ ఎంతో ఉల్లాసంగా అనిపించింది. మళ్లీ వచ్చే వేసవిలో కూడా ఇలాగే శిక్షణ ఇవ్వాలి. చెస్, అబాకస్ నేర్చుకున్నాను. నా తోటి విద్యార్థులతో ఆడుతూపాడుతూ అన్ని అంశాల్లో శిక్షణ తీసుకోవడం బాగుంది. మంచిమంచి విషయాలు చెప్పారు. – సాయిహర్ష, ఆరో తరగతి ప్రతి వేసవిలో ఇలాంటి సమ్మర్క్యాంపులు నిర్వహిస్తే విద్యార్థులకు నైపుణ్యం పెరుగుతుంది. నేను తెలుగు హ్యాండ్రైటింగ్, కంప్యూటర్ విద్య, క్యారం, చెస్ మొదలైనవి నేర్చుకున్నాను. మంచిగా అనిపించింది. నాతోపాటు విద్యార్థులను తీసుకెళ్లా. – మండలోజి అనన్య, 9వ తరగతివేసవి కాలంలో వివిధ రకాల్లో శిక్షణ విద్యార్థులకు ఇవ్వడం వలన వారిలోని ప్రతిభను వెలికి తీయవచ్చు. ఈ శిక్షణతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జ్ఞానం కూడా పెరుగుతుంది. స్కూల్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. – రాజన్న, పీఎంశ్రీ పాఠశాల హెచ్ఎంఇబ్రహీంపట్నం: పరీక్షలు ముగియగానే వేసవిలో ఎండలో తిరగకుండా.. చెరువులు, కుంటలు, కాలువల వైపు వెళ్లకుండా విద్యార్థులకు వేసవిశిక్షణ శిబిరాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని పీఎంశ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసి అందులోని 100 మంది ఆరో తరగతి నుంచి 9వ తరగతి పిల్లలకు ఈనెల 11 నుంచి 25 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల దాకా ప్రతిరోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో భాగంగా వారికి ఉచితంగా అల్పాహారం అందించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా లైవ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్, స్టోరీ టెల్లింగ్, కుట్లు, అల్లికలు, భాష ఉత్సవాలు, క్విజ్ పోటీలు, స్థానిక సంప్రదాయ ఆటల పోటీలు, కంప్యూటర్ పరిజ్ఞానం, చెస్, క్యారంలో తర్ఫీదు ఇచ్చారు. పిల్లలు కూడా ఉల్లాసంగా గడిపారు. మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో ఇలాంటి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
సమన్వయంతో అభివృద్ధి చేస్తాం
చొప్పదండి: కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో చూస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మండలంలోని ఆర్నకొండ నుంచి మల్యాల ఎక్స్ రోడ్డు వరకు రూ.50 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతో నిర్మించనున్న తారురోడ్డు పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ త్వరలోనే కరీంనగర్–జగిత్యాల హైవే పనులు చేపడతామని తెలిపారు. పార్లమెంటు నియోజకవర్గానికి రూ.20 వేల కోట్ల నిధులను తీసుకువచ్చామని, రూ.7 వేల కోట్లు రహదారులకే ఖర్చు చేస్తున్నామని, అందులో రూ.2,500 కోట్లు వరంగల్, జగిత్యాల రహదారికి వెచ్చిస్తున్నామని తెలిపారు. గన్నేరువరం నుంచి కరీంనగర్ రావడానికి రూ.79 కోట్లతో మానేరు డ్యాంపై వంతెన నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు వెళ్లడానికి భక్తులకు సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత కరీంనగర్రూరల్: గ్రామాలను రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం కరీంనగర్ మండలం ఇరుకుల్లలో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో రూ.20లక్షలతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించారు. బీరప్పగుడి అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుర్ర రమేశ్గౌడ్, ఉపసర్పంచ్ కాశిపాక రాకేశ్, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు
కరీంనగర్అర్బన్/కరీంనగర్కల్చరల్/రామడుగు: జూన్ రెండో తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. పోలీస్ పరేడ్గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు ప్రొటోకాల్ పక్కాగా పాటించాలన్నారు. వేడుకల నిర్వహణపై కలెక్టరేట్లో బుఽ దవారం సమీక్షించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆవిర్భావ వేడుకల్లో ప్రతి బింబించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. బక్రీద్ ప్రశాంతంగా జరుపుకోవాలి జిల్లాలో గురువారం బక్రీద్ను ప్రశాంత వాతా వరణంలో జరుపుకోవాలని కలెక్టర్ చిత్రామి శ్రా సూచించారు. స్లాటర్ హౌస్ల వద్ద అధికా రులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఆవులు, దూడల వధ నిషేధమని, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ప్రత్యేక బందోబస్తు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్ష వరంగల్– కరీంనగర్ జాతీయ రహదారి 563 నిర్మాణంలో సమస్యలు పరిష్కరిస్తూ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను, ఆర్డీవోను ఆదేశించారు. ఈదులగట్టెపల్లి వద్ద సర్వీస్ రోడ్డు సాధ్యసాధ్యాలను పరిశీలించాలని, గట్టుదుద్దెనపల్లి వద్ద డ్రైనేజీ నిర్మాణం, భూ సేకరణ తదితర అంశాలపై చర్చించారు. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయండి తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఉన్న రాజీవ్ స్వగృహ అంగారిక టౌన్షిప్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ పనులు వేగవంతం చేయాలన్నారు. రామడుగు మండలంలోని వన్నారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి కరీంనగర్రూరల్: అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ మండలం నగునూరు, చేగుర్తి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం పరిశీలించారు. నగునూరులో ధాన్యం తీసుకొచ్చి నెలరోజులవున్నా కాంటా పెట్టడంలేదని పలువురు రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. సివిల్సప్లై అధికారులను అక్కడికి పిలిపించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. చేగుర్తిలో రాత్రి వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అధికారులు, రైసుమిల్లర్లతో మాట్లాడి తడిసి ధాన్యం కాంటా పెట్టించి రైసుమిల్లుకు పంపించారు. కరీంనగర్, దుర్శేడ్ సొసైటీల చైర్మన్లు పి.శ్యాంసుందర్రెడ్డి, టి.తిరుపతి పాల్గొన్నారు. పారిశుధ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు కరీంనగర్ కార్పొరేషన్: పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం వహించొద్దనిన నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో పారిశుధ్య విభాగం సూపర్వైజర్లు,శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు. పారిశుధ్య పనులపై ఇన్స్పెక్టర్లు, జవాన్లు, సూపర్ వైజర్లు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. బక్రీద్ పండుగకు ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రైనేజీలు పొంగకుండా, రోడ్లపై నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 105 ఇందిరమ్మ గృహ ప్రవేశాలు... నగరంలో 105 ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తి చేసుకొని, గృహప్రవేశాలు అయ్యాయని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. బుధవారం గృహనిర్మాణ శాఖ కార్యదర్శి గౌతం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కమిషనర్ పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిదిలో మొత్తం 524 ఇందిరమ్మ ఇండ్లు స్లాబ్ పూర్తి చేస్కోని చివరి దశలో ఉన్నాయని తెలిపారు. -
కరెంట్ సరఫరాకు ప్రతిబంధకాలు
కొత్తపల్లి: బలమైన గాలుల ధాటికి హోర్డింగ్లు, చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడుతుండటంతో విద్యుత్ లైన్లు తెగిపడి సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్స్ గాలులకు ఊగిపడి విద్యుత్ తీగలపై పడటంతో షార్ట్సర్క్యూట్లు సంభవించడంతో పాటు విద్యుత్ తీగలు తెగుతున్నాయి. విద్యుత్ సిబ్బంది రాత్రింబవళ్లు మరమ్మతు పనులు చేపడుతున్నప్పటికీ వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెంబడి హోర్డింగ్లతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో గాలిదుమారానికి హోర్డింగ్లు విద్యుత్ తీగలపై ఒరుగుతున్నాయి. విద్యుత్ తీగలపై పడ్డ ఫ్లెక్సీలను తొలగించడం విద్యుత్ సిబ్బందికి కష్టంగా మారుతోంది. -
సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు!
తెలంగాణ చౌరస్తానగరంలోని బస్టాండు చౌరస్తాకోర్టు చౌరస్తాసాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని అత్యంత రద్దీ కూడళ్లలో మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్వోబీ) నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నగరాన్ని ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భారీస్థాయిలో నిధులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు పాదచారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టారు. నగరంలోని మూడు రద్దీ ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని బల్దియా అధికారులతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అత్యధిక రద్దీ ప్రాంతాల్లో కోర్టు, బస్టాండ్, తెలంగాణ చౌరస్తాలు నగరంలో రద్దీ కూడళ్లుగా మారాయి. రోజుకు వేల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు ఈ కూడళ్లు దాటుతున్నారు. పెరుగుతున్న వాహన రద్దీతో రోడ్లు దాటడం పాదాచారులకు ప్రమాదకరంగా మారుతోంది. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీ రద్దీ సమయాల్లో వాహనాల వేగం తగ్గకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, ప్రాథమిక సర్వే చేపట్టాలని మంత్రి బండి సంజయ్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. స్మార్ట్సిటీలో ప్రతిపాదించినా కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా వచ్చినప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అమలుకు నోచుకోలేదు. నిధుల కొరత, స్థల సమస్యలు, సాంకేతిక అడ్డంకులతో ప్రతిపాదనలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఈసారి కేంద్ర మంత్రి ప్రత్యేక ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అమలవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నగరాభివృద్ధికి కేంద్రం నుంచి అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రూ.840 కోట్లు మంజూరు కాగా డ్రైనేజీ, రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, వీధి దీపాలు, పార్కులు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభమైంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణంతో నగర రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఆ మూడు ప్రాంతాలే కీలకం తెలంగాణ చౌరస్తా, కోర్టు చౌరస్తాలు రోజంతా ట్రాఫిక్తో కిక్కిరిసిపోతుంటాయి. బస్టాండ్ చౌరస్తా అయితే జిల్లా నలుమూలల నుంచి వచ్చే బస్సులు, ఆటోలు, ప్రైవేట్ వాహనాలతో కిక్కిరిసిపోతుంది. ఈ పరిస్థితుల్లో పాదాచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా ట్రాఫిక్ సమస్య తప్పనుంది. అధికారులు ప్రతి పాదిస్తున్న నమూనాల్లో ఆధునిక డిజైన్తో పాటు ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తే విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు భద్రంగా రోడ్లు దాటేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.నగర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం వందల కోట్ల నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. మెట్రో సిటీలకు ధీటుగా సదుపాయాల కల్పనకు మరిన్ని నిధులు కేంద్రం నుంచి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా నగరాభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా. – బండి సంజయ్కుమార్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నగరాభివృద్ధే లక్ష్యం -
మద్యం తాగొచ్చి వేధింపులు..
రామడుగు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను భార్య రోకలి బండతో మోది హత్య చేసింది. ఈ ఘటన రామడుగు మండలం కొక్కెరకుంట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొక్కెరకుంట గ్రామానికి చెందిన వేముండ్ల రాజయ్య(70) కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎకరం వ్యవసాయ భూమి విక్రయించాడు. వచ్చిన డబ్బులతో నిత్యం తాగివచ్చి భార్య వేముండ్ల కనుకమ్మ, కొడుకు శేఖర్తో గొడవ పడుతున్నాడు. మంగళవారం రాత్రి సైతం మద్యం తాగి వచ్చాడు. భార్యతో గొడవ పడి నిద్రపోయాడు. రాజయ్య పడుకున్న తరువాత కనుకమ్మ ఇంట్లో ఉన్న రోకలి బండతో తల, చాతి, మోకాళ్లపై మోది చంపేసింది. కూతురు నంగి సుజాత బుధవారం ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై రాజు తెలిపారు. భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య రామడుగు మండలం కొక్కెరకుంటలో ఘటన -
మేము గీసిన చిత్రం
సముద్రజీవుల పేర్లతో పొడుపు కథలు ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు హారిక (25) అనే వివాహిత భర్తతో గొడవపడి క్షణికావేశంలో మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపారు. రంగసాయిపల్లి గ్రామానికి చెందిన హారికను రెండు సంవత్సరాల క్రితం మల్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు శరత్ రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె మానసికస్థితి సరిగా లేక తల్లిదండ్రులను తరచూ డబ్బులు ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేసేదని, భర్తతోనూ డబ్బుల విషయంపై గొడవపడేదని ఎస్సై పేర్కొన్నారు. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని తండ్రి గుడ్ల రాజయ్య ఫిర్యాదు చేశాడు. మృత్యువే గెలిచిందిరూ.10లక్షలు వెచ్చించినా దక్కని ప్రాణం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): నెల రోజులుగా చేస్తున్న జీవన్మరణ పోరాటంలో ఆ యువరైతు చివరికి ఓడిపోయాడు. రూ.10లక్షలు వెచ్చించి చికిత్స అందించినా ప్రాణాలు నిలువలేదు. కుటుంబానికి పెద్ద దికై ్కనా రైతు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన రైతు ముత్యాల బాపురెడ్డి(43) నెల రోజుల క్రితం పక్షవాతానికి గురయ్యాడు. మొదట కరీంనగర్లోని ఓ ప్రైవేట్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెదడులో రక్తం గడ్డ కట్టిందని వైద్యులు అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. మెదడుకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని కోమాలోనే 20 రోజులపాటు చికిత్స పొందుతున్న క్రమంలోనే పరిస్థితి విషమించి బుధవారం మరణించాడు. మృతునికి భార్య మానస, ఇద్దరు కుమారులు తరుణ్, వరుణ్ ఉన్నారు. -
గాలివాన బీభత్సం
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్రూరల్/గన్నేరువరం: జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజామున వరకు గాలివాన బీభత్సం సృష్టించింది. వర్షానికి కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోయింది. మానకొండూర్, గన్నేరువరం, గంగాధర, కరీంనగర్ రూరల్ మండలాల పరిధిలో తీవ్రనష్టం వాటిల్లింది. కరీంనగర్ పరిధిలోని బొమ్మకల్, గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో ఇళ్లు కూలగా.. బాధితులు బోరున విలపించారు. మానకొండూర్ మండలం వెల్ది– లక్ష్మిపూర్ గ్రామాల మధ్య చెట్లు కూలాయి. విద్యుత్ తీగలు తెడిపడ్డాయి. గంగాధరలో ధాన్యం తడిచింది. అకాల వర్షంతో కరీంనగర్ సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు ఎస్ఈ ఆర్.రవీందర్ తెలిపారు. -
బన్నీ వేసవి యాత్ర –19 / సులువైన గణితం
సాయంత్రం తాతయ్య అరుగు మీద కూర్చుని ‘రండి పిల్లలూ, లెక్కలు చేద్దాం’ అని పిలిచాడు. బన్నీ దగ్గర 5 చింతగింజలు ఉన్నాయి. తాతయ్య ఇంకో 3 ఇచ్చాడు. తాతయ్య: ‘బన్నీ, ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 5 + 3 = ?’ బన్నీ లెక్కపెట్టి ‘8 ఉన్నాయి తాతయ్యా’ అన్నాడు. “ Very good!’ అన్నాడు తాతయ్య. స్వప్న దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి. రామ్కి 4 ఇచ్చింది. తాతయ్య: ‘స్వప్న, నీ దగ్గర ఇప్పుడు ఎన్ని మిగిలాయి? 10 – 4 = ?’ స్వప్న: ‘6 బిస్కెట్లు మిగిలాయి’ అంది. రామ్ దగ్గర 7 పెన్సిల్స్ ఉన్నాయి. చుక్కకి 2 ఇచ్చాడు. మళ్లీ తాతయ్య 5 ఇచ్చాడు. తాతయ్య: ‘రామ్, ఇప్పుడు లెక్క చెప్పు. 7 – 2 + 5 = ?’ రామ్ ఆలోచించి ‘10 పెన్సిల్స్’ అన్నాడు. తాతయ్య మెచ్చుకుని ‘లెక్కలు ఇలా రోజూ చేస్తే తేలిక’ అన్నాడు. పిల్లలకి మాట : చిన్న చిన్నగా లెక్కలు చేస్తూ ఉంటే జీవితంలో సమస్యలను పరిష్కరించడం తెలుస్తుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
తెలంగాణలో ఈడీ అధికారుల దాడులు.. ఏకకాలంలో 8 చోట్ల..
హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో ఎనిమిది చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. జీఎస్టీ ఎగ్గొట్టి రూ.కోట్లు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి.కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ, ఏజెన్సీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల నకిలీ ఇన్ వాయిస్లతో గ్రానైట్ తరలించిన కేసులో తనఖీలు చేస్తున్నారు. ఇప్పటికే ఓ గ్రానైట్ వ్యాపారిని జీఎస్టీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జీఎస్టీ ఎగ్గొట్టేందుకు నకిలీ బిల్లులతో వంద కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ తరలించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మరింత దుమారం రేగుతోంది. -
రైలు ఇంజిన్లో ఏసీలు బిగించాలి
రామగుండం: రైలింజన్లో ఏసీలు బిగించాలని కోరుతూ మంగళవారం రామగుండంలోని క్రూలాబీ ఎదుట లోకోపైలట్లు నిరసన వ్యక్తం చేశారు. అధిక ఉష్ణోగ్రతలతో రైలింజన్లో 55 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటున్నాయని, ఏసీలు లేకుంటే పనిచేయలేమని, తమ వెంట తీసుకెళ్లిన ఆహారం చెడిపోతుందని, రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం ఏసీలు బిగించాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో లోకో రన్నింగ్ స్టాఫ్ రామగుండం బ్రాంచ్ సెక్రటరీ సీహెచ్.రవి, కమిటీ మెంబర్లు వేణుగోపాల్, సంజీవ్, సహాయ లోకో పైలట్లు వినోద్, శ్రీనివాస్, అనిష్ సూరజ్, గన్ శ్యాం, రవి, ప్రశాంత్తో పాటు లోకో పైలట్లు పాల్గొన్నారు. -
ఇటు ఎండ.. అటు జ్వరం!
‘కరీంనగర్కు చెందిన మహేశ్ ప్రైవేటు మార్కెటింగ్ ఉద్యోగి. ఉద్యోగరీత్యా నిత్యం 100 కిలోమీటర్లకు పైగా బైక్పై తిరగాల్సి ఉంటుంది. వారం రోజుల క్రితం ఎండ దెబ్బతో డీహైడ్రేషన్కు గురయ్యాడు. జ్వరంతో ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా..అడ్మిట్ చేసుకుని, నాలుగు రోజులు చికిత్స అందించారు. మహేశ్ కోలుకుని డిశ్చార్జి కాగా.. తనకు వచ్చే నెల జీతం కన్నా... ఆస్పత్రి ఫీజు తడిసి మోపెడయ్యింది’. కరీంనగర్ రూరల్ మండలానికి చెందిన హరీశ్ మార్కెట్లో హమాలీ కార్మికుడు. ఎండలో పనిచేయడం కారణంగా అస్వస్థతకు గురయ్యాడు. తల తిరగడం.. ఒళ్లు నొప్పులు, జ్వరం, చర్మ సమస్యలతో బాధ పడుతూ.. సమీపంలోని డాక్టర్ను సంప్రదించాడు. ఎండదెబ్బ తాకిందని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పగా.. వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఎడ్ల బండ్లే నయమిక..
కరీంనగర్ కార్పొరేషన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రయాణం చేసేందుకు ఎడ్ల బండ్లే దిక్కవుతున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మంకమ్మతోటలోని తన నివాసం నుంచి బస్స్టేషన్ ఎదురుగా ఉన్న సుడా కార్యాలయం వరకు ఎడ్ల బండిపై ప్రయాణించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్లో పాయిజన్ ఇచ్చినట్టు రోజు రోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులు గుండటి శ్రీనివాస్ రెడ్డి, పిట్టల రవీందర్, సుదర్శన్, శ్రీధర్ రెడ్డి, పటేల్ శ్రీనివాస్రెడ్డి, కాంపెల్లి కీర్తి కుమార్, గడమల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. -
మాట నిలబెట్టుకున్నా..
కరీంనగర్ కార్పొరేషన్ : ‘నగర ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నా.. వందరోజుల్లో రూ.840 కోట్లు తీసుకొచ్చా.. స్మార్ట్సిటీ నిధులు రూ.70 కోట్లు.. యూఐడీఎఫ్ నిధులు రూ.50 కోట్లు వచ్చాయి.. రూ.277 కోట్లతో అమృత్ పనులు సాగుతున్నా యి.. మరిన్ని నిధులు తెస్తా.. నగర రూపురేఖలు మారుస్తా.. రాష్ట్రంలోనే కరీంనగర్ను మోడల్ కార్పొరేషన్గా మారుస్తా’నంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో రూ.1.39 కోట్లతో రెండోఅంతస్తులో భవన నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. వీటితోపాటు కార్మిక ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ, షెడ్ల మరమ్మ తు పనులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్ పదవిని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తానంటూ ఇచ్చిన మాటను వంద రోజుల్లోనే నిలబెట్టుకున్నానని తెలిపారు. యూసీ ఎఫ్లో కరీంనగర్ కార్పొరేషన్కు రూ.840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్టులకే కేంద్రం ఆమోదం తెలి పిందని, అందులో కరీంనగర్ ఉండటం అందరికీ గర్వకారణమన్నారు. సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టపడి పనిచేసిన కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, అధికారులను అభినందించారు. డంప్యార్డ్ కోసం రూ.80 కోట్లు కేటాయించామని, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం విఫలం ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కొనుగోలు పైసలన్నీ కేంద్రమే ఇస్తున్నప్పటికీ, వడ్ల్లు కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేందుకే రైతు గోస బీజేపీ భరోసా పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టినట్లు తెలి పారు. ధాన్యం కొనుగోలు పైసలు కేంద్రానివా.. రాష్ట్రానివా.. సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేయర్ కొలగాని శ్రీని వాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్రావు పాల్గొన్నారు. -
ప్రజా పాలన అంటే ఇదేనా?
కరీంనగర్ టౌన్: ధాన్యం కొనుగోళ్లపై ప్రశ్నించిన ఆర్టీసీ హైర్బస్ డ్రైవర్ అశోక్ను విధుల నుంచి తొలగించడాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గుంగుల కమలాకర్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జీవన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. డ్రైవర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆర్ఎం రాజుకు వినతిపత్రం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డ్రైవర్ను విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే ఆర్ఎం ఆఫీస్ను ముట్టడిస్తామన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతోందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి, పార్టీ సభ్యత్వ నమోదు కరీంనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కొండూరి రవీందర్రావు అన్నారు. మంగళవారం కరీంనగర్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
98వేల ఇళ్లలో జనగణన పూర్తి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు హెచ్టీ 11 కేవీ, 33 కేవీ ఆపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు ‘సింగిల్ విండో’ వ్యవస్థ దోహదపడుతుందని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.రవీందర్ తెలిపారు. హెచ్టీ సర్వీసుల ప్రక్రియను సరళీకృతం చేయడంలో భాగంగా కార్పొరేట్, సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ‘హెచ్టీ మానిటర్ సెల్’ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విధానంలో దరఖాస్తుల పర్యవేక్షణ బాధ్యతలను అధికారులకు విభజించినట్లు పేర్కొన్నారు. సర్కిల్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) అధికారి 11 కేవీ వోల్టేజ్ దరఖాస్తులను, కార్పొరేట్ కార్యాలయంలోని ఏడీఈ (కమర్షియల్) అధికారి 33 కేవీ, ఆపై వోల్టేజ్ దరఖాస్తులను పర్యవేక్షిస్తారన్నారు. టీజీ ఐపాస్ పరిధిలోకి రాని హెచ్టీ దరఖాస్తుదారులు మొదట టీజీఎన్పీడీసీఎల్ అధికారిక పోర్టల్లో అవసరమైన పత్రాలతో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు పూర్తికాగానే ఒక ప్రత్యేక అప్లికేషన్ నంబర్ కేటాయించబడుతుందని, వెంటనే సంబంధిత సర్కిల్ కార్యాలయాల డాష్బోర్డ్లోని వెళ్లగానే, సంబంధిత అధికారి పర్యవేక్షించి వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన, ఎస్టిమేట్లకు పంపించడం జరుగుతుందన్నారు. 11 కే..వీ., 33 కె.వీ.వోల్టేజ్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ఫీజిబిలిటీ ఉన్న పక్షంలో రెండు రోజుల్లోనే పోర్టల్లో అప్లోడ్ చేస్తారన్నారు. ఒకవేళ సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల సాధ్యపడకపోతే, ఆ వివరాలను దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుందన్నారు. -
అదనపు కమిషనర్ను సస్పెండ్ చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: అదనపు కమిషనర్ సువార్తను సస్పెండ్ చేయాలని కార్మికులు బల్దియా ఎదుట ధర్నా చేపట్టారు. బీఆర్టీయూ, సీఐటీయూఽ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాస్రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎడ్ల రమేశ్ మాట్లాడుతూ శానిటేషన్ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న అదనపు కమిషనర్ సువార్త నిబంధనలకు విరుద్ధంగా కార్మికులతో తన ఇంట్లో పనులు చేయించుకొంటోందని ఆరోపించారు. కార్మికులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోందని, దొంగతనం నెపం మోపి పోలీసులకి అప్పగించి థర్డ్ డిగ్రీ పెట్టించిన సువార్తను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ ఇండ్లల్లో కార్మికులతో పనులు చేయించుకొనే విధానానికి ముగింపు పలకాలన్నారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్కు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు గడ్డం సంపత్, జనగాం రాజమల్లు, పొన్నం లింగయ్య, కవ్వంపెల్లి రవి, పారునంది ఎల్లయ్య, మాతంగి లక్ష్మణ్, దాంపెల్లి రాయమల్లు, మాతంగి స్వామి, మాతంగి లక్ష్మణ్, భద్ర కంటి రవి పాల్గొన్నారు. -
అతనికింత పురుగుల మందు పోసి.. నేనింతా తాగుతా
చందుర్తి(వేములవాడ): బిల్లుల చెల్లింపులో ఉపాధి హామీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ట్రాక్టర్ యజమాని మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. బాధితుడి కథనం ప్రకారం.. మండలంలోని లింగంపేటకు చెందిన లాండే సంతోష్ ఉపాధి పథకంలో భాగంగా 2025 ఏప్రిల్లో గ్రామ శివారులో చేపట్టిన పనులకు తన ట్రాక్టర్తో సుమారు 200 ట్రిప్పుల మట్టిని తరలించాడు. సదరు డబ్బులను ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఇస్తానని చెబితే ట్రాక్టర్ నడిపించానని వాపోయాడు. ఏడాదిగా బిల్లులు చెల్లించుకుండా ‘నీ ట్రాక్టర్తో మట్టి తరలించినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా’.. అంటూ టెక్నికల్ అసిస్టెంట్ దురుసుగా మాట్లాడారని తెలిపాడు. ఉపాధి హామీ అధికారుల నిర్లక్ష్యంతో విసిగిపోయిన సంతోష్ ఉదయం 11 గంటలకు పురుగుల మందు డబ్బాతో మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నాడు. టెక్నికల్ అసిస్టెంట్ నాగరాజు ఎక్కడున్నడంటూ ఆవేశంతో ఊగిపోతూ ‘అతనికింత పురుగుల మందు పోసి.. నేనింతా తాగుతా’ అంటూ ఉపాధి హామీ కార్యాలయంలో అటూ ఇటూ తిరగుతుండగా, పోలీసులు అక్కడికి చేరుకుని పురుగులమందు డబ్బా తీసుకునేందుకు యత్నించారు. అధికారులందరూ రావాలంటూ, తన బిల్లు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలంటూ బాధితుడు పట్టుబట్టాడు. ఎంపీడీవో రాధ అక్కడికి చేరుకుని కార్యాలయానికి వస్తే మాట్లాడి బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రేపు బిల్లు ఇవ్వకుంటే టెక్నికల్ అసిస్టెంట్కు పురుగుల మందు తాగించి, తాను తాగి చనిపోతానంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. చేసిన పనికి బిల్లులు చెల్లించడం లేదని.. పురుగులమందు డబ్బాతో ట్రాక్టర్ యజమాని ఆందోళన -
లిఫ్ట్లో ఇరుక్కున్నడీఆర్డీఏ ఏపీడీ
సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్లో మంగళవారం విధులకు హాజరయ్యేందుకు డీఆర్డీఏ ఏపీడీ నర్సింహులు కలెక్టరేట్లోని లిఫ్ట్ ఎక్కారు. పై అంతస్తులో ఉన్న తమ కార్యాలయానికి వెళ్లేందుకు లిఫ్ట్లోని బటన్ నొక్కగా మధ్యలోకి వెళ్లిన తర్వాత సాంకేతిక కారాణాల వల్ల లిఫ్ట్ ఆగిపోయింది. ఆయన తన తోటి ఉద్యోగులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఉద్యోగులు వెంటనే లిప్ట్ ఆఫరేటర్లకు సమాచారం అందించగా వారు వచ్చి లిఫ్ట్ నుంచి బయటకు తీశారు. అప్పటికే గంటన్నర అవుతుందని ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడ్డానని నర్సింహులు లిఫ్ట్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బకు ఇద్దరు మృతిహుజూరాబాద్రూరల్/గంగాధర: హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామ ంలో నీరటి రమేశ్ వడదెబ్బతో మృతిచెందాడు. రెండు రోజులుగా పనుల నిమిత్తం ఎండలో బాగా తిరగడం వల్ల మంగళవారం అస్వస్థకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. అలాగే గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామానికి చెందిన అర్కుల నర్సయ్య (58) వడదెబ్బతో మంగళవారం మృతి చెందాడు. నర్సయ్య మండలంలోని గర్శకుర్తిలో బంధువు చనిపోగా సోమవారం దహన సంస్కారాలకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం వాంతులు, విరేచనాలు అయ్యాయి. మంగళవారం ఉదయం అపస్మారక స్థితిలోకి వెళ్లగా కుటుంబ సభ్యులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఆర్టీసీ కండక్టర్పై పోక్సో కేసుకోరుట్లరూరల్: పట్టణానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ శేఖర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. ఆయన కథనం ప్రకారం చందుర్తి మండలకేంద్రానికి చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని 2016నుంచి సఖ్యతగా ఉంటున్నాడు. తాజాగా పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు వారం క్రితం వేములవాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. శేఖర్ కోరుట్లకు చెందిన వ్యక్తి కావడంతో కేసును కోరుట్ల పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఇక్కడి పోలీసులు విచారణ జరిపి శేఖర్ను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి.. రిమాండ్కు తరలించినట్టు ఎస్సై తెలిపారు. గంటన్నర తర్వాత బయటకు.. -
దారికాచి కత్తితో దాడి!
ఇల్లందకుంట: దారి విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో తండ్రి దారుణ హత్యకు గురికాగా... కొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో నందికొండ రాజు, చల్లూరి చంటి వరుసకు బావ, బావమర్దులు. వీరి మధ్య కొన్ని రోజులుగా ఇంటికి వెళ్లే దారి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నందికొండ రాజు కొడుకు నిశాంత్ను తీసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ పొలం వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ కాపుకాసిన చల్లూరి చంటి ట్రాక్టర్పై వస్తున్న నందికొండ రాజు (40), అతని కొడుకు (16) నిశాంత్పై కత్తితో విచక్షణ రహితంగా దాడిచేశాడు. దీంతో రాజు అక్కడికక్కడే మృతి చెందగా, నిశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు నిశాంత్ను జమ్మికుంటలోని ఓ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన జమ్మికుంట రూరల్ సీఐ వెంకట్, ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు చంటిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చంటి తలపై కూడా గాయాలు ఉండడంతో ఆయనను వరంగల్ ఎంజీఎంకు తరలించినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రి మృతి.. కొడుక్కు తీవ్రగాయాలు పాతర్లపల్లిలో ఉద్రిక్తత -
బన్నీ వేసవి యాత్ర –18 విజ్ఞాన ప్రశ్నలు – తాతయ్య సమాధానాలు
బన్నీ: తాతయ్యా, ఆకాశం నీలంగా ఎందుకు కనిపిస్తుంది? తాతయ్య: సూర్యకాంతిలో నీలం రంగు ఎక్కువగా చెదిరిపోతుంది బాబూ. అందుకే ఆకాశం నీలంగా కనిపిస్తుంది. రామ్: తాతయ్యా, వాన ఎలా వస్తుంది? తాతయ్య: సముద్రంలో నీరు ఆవిరై మేఘమవుతుంది. ఆ మేఘాలు చల్లబడితే వానగా కురుస్తుంది. చుక్క : తాతయ్యా, చెట్లు మనకు ఎందుకు ఉపయోగం? తాతయ్య: చెట్లు మనకు గాలి ఇస్తాయి, నీడ ఇస్తాయి, పండ్లు ఇస్తాయి. అవి భూమికి ఊపిరితిత్తుల లాంటివి. స్వప్న: తాతయ్యా, చంద్రుడి మీద మనిషి నడిచాడా? తాతయ్య: నడిచాడమ్మా. 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదట చంద్రుడి మీద కాలు పెట్టాడు. బన్నీ: తాతయ్యా, రాత్రిపూట నక్షత్రాలు ఎందుకు మెరుస్తాయి? తాతయ్య: అవి చాలా దూరంలో ఉన్న సూర్యుళ్ల లాంటివి. వాటి కాంతి మన దగ్గరకు వచ్చేటప్పటికి మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. రామ్: తాతయ్యా, మన గుండె ఎందుకు కొట్టుకుంటుంది? తాతయ్య: గుండె రక్తాన్ని శరీరం అంతా పంపుతుంది. అది ఆగకుండా పని చేస్తేనే మనం బతుకుతాం. చుక్క: తాతయ్యా, విమానం గాల్లో ఎలా ఎగురుతుంది? తాతయ్య: విమానం రెక్కల నిర్మాణం , ఇంజన్ స్పీడ్ వల్ల గాలి దాన్ని పైకి లేపుతుంది తల్లీ. స్వప్న: తాతయ్యా, భూమి గుండ్రంగా ఉందని ఎలా తెలుసు? తాతయ్య: ఓడ దూరంగా వెళ్తే ముందు పై భాగం కనిపించకుండా పోతుంది. అలాగే ఉపగ్రహ ఫోటోల్లో కూడా గుండ్రంగా కనిపిస్తుంది. బన్నీ: తాతయ్యా, సబ్బుతో కడిగితే మురికి ఎలా పోతుంది? తాతయ్య: సబ్బు నూనె, మురికిని నీటిలో కరిగేలా చేస్తుంది. అందుకే నీళ్లతో కడిగితే పోతుంది. అందరూ: తాతయ్యా, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? తాతయ్య: పుస్తకాలు చదివితే, పెద్దవాళ్ళు చెబితే, ప్రశ్నలు అడిగితే అన్నీ తెలుస్తాయి. మీరు కూడా అడగడం మానకండి! పిల్లలకి మాట: ప్రశ్నతో మేధో వికాసం పెంపొందుతుంది. ప్రశ్న, సమాధానాలతోనే సమూల మార్పులు జరుగుతాయి. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు గ్రామం: కాకర్లపల్లి, మంథని, జిల్లా: పెద్దపల్లి -
చిన్ని పాపలు
చిన్ని పాపల మది దేవుడు ఉండే గుడి చిట్టి పాపల పలుకు అమృతపు చినుకు బుడిబుడి అడుగులు వేశారంటే భూమాత పులకించేను ముద్దు ముద్దుగా పలికారంటే అమ్మనాన్న మురిసేను మల్లెపువ్వులా నవ్వారంటే రాతి గుండెలే కరిగేను చందమామలా చుశారంటే మదిలో వెన్నెల కురిసేను కల్లాకపటం ఎరుగనివారు ఎవ్వరినైనా మురిపిస్తారు కులమతాలు తెలియనివారు అందరి మనసులు దోచేస్తారు బూర దేవానందం కవి, రచయిత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా -
ట్రాలీపూల్
గంభీరావుపేట(సిరిసిల్ల): అవసరాలే మనిషిని అన్వేషణ వైపు మళ్లిస్తాయి అంటారు. ఈ రైతును చూస్తే నిజమే అనిపిస్తుంది. అసలే ఎండాకాలం.. విద్యాసంస్థలకు సెలవులు ఉండడంతో పిల్లలు ఈత కోసం వాగులు, వంకలకు పోవడం ఇష్టం లేక ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తన ట్రాక్టర్ ట్రాలీని స్విమ్మింగ్పూల్గా మార్చేశాడు. రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతు తిరుపతిరెడ్డి తన ట్రాక్టర్ ట్రాలీని ఈతకొట్టేందుకు అనువుగా మార్చాడు. ట్రాలీలో ప్లాస్టిక్ కవర్ వేసి వ్యవసాయ పంపు ద్వారా నీళ్లు నింపాడు. ఇప్పుడు అది ట్రాలీ స్విమ్మింగ్ పూల్ అంటూ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. -
గోదావరి పుష్కరాలకు సమాయత్తం
కాళేశ్వరం: వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 6 వరకు జరగనున్న గోదావరి నది పుష్కరాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సమాయత్తం అవుతోందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మేఘా విశ్రాంతి భవనంలో మంగళవారం ఆయన.. భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ సరస్వతి ఆది, అంత్య పుష్కరాల సందర్భంగా భక్తులకు కల్పించిన సౌకర్యాలను పీపీటీ ద్వారా వివరించారు. అనంతరం కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్ల నిధులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ఎదురైన లోటుపాట్లను గుర్తించి, గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విద్యుత్ సరఫరా, వీఐపీ, వీవీఐపీల పర్యటనల ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లాల వారీగా ఇప్పటినుంచే సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ములుగు, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల కలెక్టర్లు బొర్కడే హేమంత్ సహదేవరావు, కుమార్ దీపక్, సత్య ప్రసాద్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల అదనపు కలెక్టర్లు బుజంగరావు, వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కాటారం ఆర్డిఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు కాళేశ్వరంలో గోదావరి పుష్కరాలపై పరీవాహక ప్రాంతాల కలెక్టర్లతో సమీక్ష -
ఆరోగ్యానికి వాలీబాల్
● పెరుగుతున్న ఆదరణ ● 1920లో దేశంలో పరిచయం ● 1964లో ఒలింపిక్స్లో చోటుకరీంనగర్స్పోర్ట్స్: వాలీబాల్ ఆరోగ్యానికి మానసికోల్లాసాన్ని ఇస్తుంది. వాలీబాల్ ఆడడం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. దినదినాభివృద్ధి చెందిన ఈ క్రీడ ఒలింపిక్స్లో చోటు సంపాదించింది. అమెరికాలో పుట్టి.. వాలీబాల్ అమెరికాలోని హాల్యోకిలో పుట్టింది. వాలీబాల్ను గతంలో మింటోనెట్టి అని పిలిచేవారు. 1947లో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఈ ఆటను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. 1964 పారీస్ఒలింపిక్లో క్రీడను చేర్చారు. మన దేశంలో 1920లో వాలీబాల్ను పరిచయం చేశారు. జట్టు వివరాలు ఒక్కో జట్టుకు ఆరుగురు క్రీడాకారులు ఉంటారు. ఇరు జట్లు కలిపి 12 మంది ఆడుతారు. జట్టు సభ్యుల్లో ఒక్కరి డ్రెస్ కోడ్వేరుగా ఉంటుంది. ఆ సభ్యుడు లిబిరోగా వ్యవహరిస్తారు. ఆటాడే సమయంలో బాల్డెడ్ అయినప్పుడు, లిబిరో ఆటలోకి రావచ్చు, తిరిగి వెళ్లవచ్చు. లిబిరో స్ట్రైకింగ్ చేయరాదు. ఆట పద్ధతి ఒక బుస్టర్, ఐదుగురు స్ట్రైకర్లు అంటే 1:5 పద్ధతి, ఇద్దరు బూస్టర్లు, నలుగురు స్ట్రైకర్లు అంటే 2:4 పద్ధతి, ఒక స్ట్రైకర్, ఒక ఆల్రౌండర్, నలుగురు స్ట్రైకర్లు, ఒక లిబిరో ఉంటారు. పాయింట్లు, రౌండ్ల వివరాలు... జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఐదు రౌండ్లు ఆడాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్కి 25 పాయింట్లు ఉంటాయి. ఒక రౌండ్లో గేమ్ ముగియాలంటే ఇరు జట్ల మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసం ఉండాలి. చివరి రౌండ్లో ఒక పాయింట్ తేడాతో విజేతలను ప్రకటిస్తారు. ఆట సమయంలో క్రీడాకారులు క్లాక్ వైజ్ రోటేషన్ పద్థతిలో ఆడాల్సి ఉంటుంది. ఇంకా వీటిలో జంప్ సర్వీస్, పుల్వాలీ, స్పిన్, టెన్నిస్, డబుల్ హ్యాండ్ బ్లాక్, షూటింగ్, స్మాసింగ్, ఫ్లెసింగ్ ఉంటాయి. కోర్టు వివరాలు కోర్టు పొడవు 18 మీటర్లు, వెడల్పు 9 మీటర్లు. అటాక్లైన్ 3 మీటర్లు, సర్వీస్ లైన్లు రెండు వైపుల 15 సెం.మీ, పోల్ ఎత్తు 2.5 మీటర్లు, పోల్కి పోల్కి మధ్య వ్యత్యాసం 11 మీటర్లు, నెట్పొడవు 9 మీటర్లు, నెట్ ఎత్తు పురుషుల విభాగా నికి 2.40 మీటర్లు, చతురస్రారం 10 సెంటీమీటర్లు, బాల్ బరువు 270 గ్రాములు. -
ఈతకు వెళ్లి ఇద్దరి దుర్మరణం
ధర్మపురి: వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఓ యువకుడు ఈతకు వెళ్లి వ్యవసాయ బావిలో మునిగి చనిపోయిన ఘటన మండలంలోని కొరండ్లపల్లెలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని తిమ్మాపూర్కు చెందిన లింగం గౌరయ్య, లక్ష్మి దంపతుల కొడుకు అక్షయ్(22) వారం క్రితం కొరండ్లపల్లెలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం ఓ వ్యవసాయ బావిలో ఈత కొట్టేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. బావిలోకి దిగిన అక్షయ్కు అదే సమయంలో ఫిట్స్ రావడంతో నీటిలోనే మునిగిపోయాడు. సాయంత్రం శవమై తేలాడు. అక్షయ్ మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఎస్సై మహేశ్ ఆధ్వర్యంలో పోలీసుల సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈత నేర్చుకునేందుకు వెళ్లి .. చందుర్తి(వేములవాడ): ఈతకు వెళ్లిన చోటు నుంచి బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన యువకుడు బావి పడి మృతిచెందిన సంఘటన చందుర్తి మండలం మల్యాలలో ఆదివారం తీరని విషాదం నింపింది. మల్యాలకు చెందిన మల్యా ల లక్ష్మి–శ్రీనివాస్ దంపతుల మూడో కొడుకు అజయ్(21) హైదరాబాద్లో బీటేక్ సెకండియర్ పూర్తి చేశాడు. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చాడు. స్నేహితులతో కలిసి బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఇదే సమయంలో బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. గంట గడిచినా రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు చుట్టుపక్కల గాలించారు. సమీపంలోని వ్యవసాయబావి వద్ద అజయ్ ఈత నేర్చుకునేందుకు వీపునకు కట్టుకున్న క్యాన్(డబ్బా) ఒడ్డుపై పడి ఉండడంతో ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఉంటాడని అనుమానించారు. ఈ విషయాన్ని అజయ్ కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు తెలపడంతో భారీ సంఖ్యలో గ్రామస్తులు చేరుకున్నారు. గత ఈతగాళ్లను పిలిపించి దాదాపు నాలుగు గంటలు గాలించడంతో మృతదేహం లభించింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. -
తరతరాలు?
తరతరాలుగా సాగుతున్న మాయాజాలం ఆ జాదుగర్ ఎవరో గాని విద్యార్థుల ప్రతిభను బాగానే మాయంజేత్తండు. అప్పట్లో దోతిపంచ ఈడీ, అంగి ప్యాంటు ఏత్తేసాలు సర్కార్ కొలువు అచ్చేది, కానీ..! ఈయ్యాల సర్కార్ కొలువు కావాలంటే మన ముందు తరాలలో అంగి ప్యాంట్ తొడిగిన వాళ్లుంటే సాలు. అక్షరాలతో పనక్కర్లే, వేలిముద్రైన పర్లే, అన్నట్టుగా మాయం జేత్తండు ఆ జాధుగర్ ఎవరో గాని? – కొలిపాక ప్రతిభ, ఎంఏ (తెలుగు) గ్రామం: అన్నారం కరీంనగర్ (జిల్లా) -
ఆధునిక సాంకేతికతతో ఆర్థోస్కోపీ
కరీంనగర్: వైద్యరంగంలో అత్యాధునిక సాంకేతికతతో నిర్వహించే ఆర్థోపెడిక్ ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీ ప్రదర్శనకు కరీంనగర్ వేదికై ంది. ఇండియన్ ఆర్థోస్కోపిక్ సొసైటీ జాయింట్ ప్రెజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆదివారం ఓ హోటల్లో సదస్సు నిర్వహించారు. రెనె ఆస్పత్రి లైవ్ శస్త్ర చికిత్సకు వేదికైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్థోపెడిక్ నిపుణులు లైవ్ శస్త్రచికిత్సల్లో పాలుపంచుకున్నారు. శస్త్రచికిత్సలను సీఎంఈ ప్రోగ్రాం ద్వారా లైవ్టెలికాస్ట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్స్, పీజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు. వైద్యులు సాయి వీర్ల, నితిన్కుమార్ బెజ్జంకి, పూర్ణచంద్ర తేజస్వి, రమాకాంత్ రాజగోపాల్ కృష్ణన్, సుఖేష్ రావు శస్త్ర చికిత్స నిర్వహించారు. ఆర్గనైజింగ్ చైర్మన్ బంగారు స్వామి మాట్లాడుతూ.. గతంలో ఇలాంటి శస్త్రచికిత్సలు ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో మాత్రమే జరిగేవని, నేటి వైద్య విద్యార్థులకు కరీంనగర్ వంటి కేంద్రాల్లో కూడా అంతర్జాతీయ స్థాయి వైద్యసదస్సులు నిర్వహించడం ద్వారా మంచి జ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం దొరికిందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామ్ కుమార్రెడ్డి, సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి, ఆర్థోస్కోపిక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ జైప్రసాద్ పెద్ది, శ్రీధర్ గంగవరపు, మునీష్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైదానంలో చిరుతలు
● ఆటల్లో శిక్షణ.. భవితకు రక్షణ ● ఉత్సాహంగా వేసవి శిబిరాలు ● కరాటే, కబడ్డీ, క్రికెట్లో ట్రెయినింగ్ జిల్లాలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలు సందడిగా మారాయి. భవిష్యత్లో క్రీడాకారులుగా తయారయ్యేందుకు ఇది చక్కటి అవకాశం. శిక్షణ సమయంలో విద్యార్థులకు క్రీడలపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఒక్కో విభాగంలో 30 నుంచి 40 మంది పిల్లలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరాలు జూన్ 6 వరకు కొనసాగుతాయి. – ఎ.రాందాస్, జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి ప్రతీ రోజు స్టేడియానికి వెళ్తున్నాను. వాలీబాల్ ఇష్టం. కోచ్లు మంచి మెలకువలు నేర్పుతున్నారు. – తులసీకృష్ణ, సిరిసిల్ల కరాటే అంటే ఇష్టం. గత మూడేళ్లుగా కరాటేలో శిక్షణ తీసుకుంటున్నాను. వేసవి సెలవుల్లో ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా కరాటేలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నాను. – లాస్యప్రియ, రాజీవ్నగర్ నాకు కబడ్డీ ఇష్టం. మినీస్టేడియంలో ఉంటూ మెలకువలు నేర్చుకుంటున్నాను. కోచ్లు మంచిగా శిక్షణ ఇస్తున్నారు. నేను ముస్తాబాద్ గురుకులంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాను. – రాంచరణ్, ఇల్లంతకుంట క్రికెట్ అంటే చాలా ఇష్టం. కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాను. క్రీడల్లో రాణిస్తే భవిష్యత్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని కోచ్లు తెలిపారు. అందుకే ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. – బన్నీ, కొండాపూర్ -
భర్త వెంటే భార్య..
● మరణంలో వీడని బంధం ● కలిసి నడిచారు.. కలిసేపోయారు ధర్మపురి: వారు కలిసి జీవితం పంచుకున్నారు. చివరకు కలిసే ఈ లోకా న్ని వీడారు. భర్త మరణించిన రోజే భార్య కూడా మృతిచెందిన ఘటన ధర్మపురి మండలం దోనూర్లో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం రాజయ్య, సాయ మ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు సంతానం. రాజయ్య వ్యవసాయం చేస్తుండేవాడు. వృద్ధాప్యం దరి చేరడం.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటివద్దనే ఉంటున్నాడు. పెద్ద కుమారుడు ముంబయిలో ఉంటున్నాడు. ప్రస్తుతం దంపతులిద్దరూ చిన్న కుమారుడి వద్ద ఉంటున్నారు. శనివారం ఉదయం వరకు బాగానే ఉన్న రాజయ్య (83) శనివారం ఎండవేడి తట్టుకోలేక అస్వస్థతకు గురై మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యులు రాజయ్యకు అంత్యక్రియలు పూర్తి చేసి బంధువులందరూ ఎక్కడివారక్కడ వెళ్లిపోయారు. ఈ క్రమంలో సాయమ్మ (80) రాత్రి భోజనం చేసిన అనంతరం ఛాతిలో నొప్పి వస్తోందంటూ కుప్పకూలిపోయింది. ఆదివారం ఉదయం బంధువులందరూ వచ్చి రాజయ్య చితిపక్కనే సాయమ్మకు అంత్యక్రియలు పూర్తిచేశారు. కలకాలం కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు చివరకు కలిసే కానరాని లోకాలకు వెళ్లడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
హత్యా.. ఆత్మహత్యా?
కరీంనగర్, మానకొండూర్: డబ్బు తీసుకొని వెళ్లిన యువకుడు విగతజీవిగా కనిపించిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీ శివారులోని మానేరు డ్యాం సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి కథనం ప్రకారం.. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధి సదాశివపల్లికి చెందిన జార్తి కనకలక్ష్మి భర్త సంపత్ గతంలో చనిపోయాడు.కనకలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కొడుకు శ్రీనిధ్, కూతురును చదివిస్తోంది. శ్రీనిధ్ ఇటీవలే ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో దాచిన రూ.48,000 కనిపించలేదు.అలాగే తన తల్లి మొబైల్ నుంచి శ్రీనిధ్ తన అకౌంట్కు రూ.33 వేలు బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఫోన్ చేసినా ఎత్తలేదు. సాయంత్రం స్విచ్చాఫ్ అయింది. రాత్రి 10.30 గంటలకు శ్రీనిధ్ స్నేహితుడు వికాస్ ఫోన్ చేసి అతని గురించి అడిగాడు. స్నేహితులను విచారించగా వారు కూడా చూడలేదని చెప్పారు.ఆదివారం శవమై..ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనిధ్ స్నేహితులు వీక్, ప్రణయ్ ఇంటికి వచ్చి అతని గురించి అడిగి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువు కౌటం సంపత్, కనకలక్ష్మికి ఫోన్ చేసి రామకృష్ణకాలనీ శివారులో శ్రీనిధ్ ఉరేసుకున్నట్లు ఉందని తెలిపా డు.బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనిధ్ చేతులు అదే తాడుతో కట్టి ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. -
ఉత్తమ శిక్షణ.. ప్రతిభకు పదును
కరీంనగర్స్పోర్ట్స్: గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి, వారికి అంతర్జాతీయ స్థాయి వేదికను కల్పించడమే ధ్వేయంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేసింది. ప్రతిభ ఉండి సరైన వనరులు లేక ఆగిపోయే క్రీడాకారుల కలలకు ప్రాణం పోయడమే లక్ష్యంగా ఏర్పాటైన ఖేలో ఇండియా క్రీడా కేంద్రాలు ఉమ్మడి జిల్లాలో ఉత్సాహంగా నడుస్తున్నాయి. క్రీడాకారుల కలలకు రెక్కలు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఖేలో ఇండియా సెంటర్లు గ్రామీణ ప్రాంత క్రీడాకారుల కలలకు రెక్కలు తొడుగుతూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కరీంనగర్లో జూడో, సిరిసిల్లలో కబడ్డీ, జగిత్యాలలో బాక్సింగ్, సుల్తానాబాద్లో ఖోఖో క్రీడల్లో అత్యున్నత స్థాయి శిక్షణను అందిస్తూ ప్రతిభకు పదును పెడుతున్నాయి. రోజూ ఉదయం, సాయంత్రం వేళ నిష్ణాతులైన శిక్షకుల పర్యవేక్షణలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తున్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్నవారు సంబంధిత సెంటర్లను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. లక్ష్యం.. ఒలింపిక్ పతకం ఈ కేంద్రాల అంతిమ లక్ష్యం దేశాన్ని ఒలింపిక్ మెడల్స్ పట్టికలో అగ్రస్థానంలో నిలపడం. కింది స్థాయి నుంచే పటిష్టమైన క్రీడా వ్యవస్థను నిర్మించడం ద్వారా, భవిష్యత్తులో స్థిరమైన విజయాలను సాధించేలా ప్రణాళికలు రూపొందించారు. ఆడుదాం.. గెలుద్దాం అనే నినాదంతో యువతను క్రీడల వైపు మళ్లించి, వారిని ఆరోగ్యవంతమైన, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. మట్టిలో మాణిక్యాలకు వేదికలుగా ఖేలో ఇండియా కేంద్రాలు అంతర్జాతీయ ప్రమాణాలు, సౌకర్యాలతో తర్ఫీదు ఉమ్మడి జిల్లాలో నాలుగు సెంటర్లు ఉమ్మడి జిల్లాలో సెంటర్లు ఇలా.. కరీంనగర్ క్రీడ: జూడో వేదిక: ప్రాంతీయ క్రీడా పాఠశాల, కరీంనగర్ కోచ్: కె.శ్యామ్ సెల్: 99084 02447 –––––––––––––––––––––––– జగిత్యాల క్రీడ: బాక్సింగ్ వేదిక: వివేకానంద మినీ స్టేడియం, జగిత్యాల కోచ్: నల్ల నవీన్ సెల్: 81792 68462 –––––––––––––––––––––––– సిరిసిల్ల క్రీడ: కబడ్డీ వేదిక: చెన్నమనేని వెంకటరావు సర్దేశాయి మినీ స్టేడియం, సిరిసిల్ల కోచ్: నగర్ల ప్రశాంత్ సెల్: 99595 56017 –––––––––––––––––––––––– పెద్దపల్లి క్రీడ: ఖోఖో వేదిక: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సుల్తానాబాద్ కోచ్: గెల్లు మధుకర్ సెల్: 79950 78488 -
చార్ధామ్ యాత్రలో వేములవాడ వాసి మృతి
వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఆకుల నరేశ్ ఉరఫ్ దుబాయ్ నరేశ్(56) చార్ధామ్ యాత్రలో అస్వస్థతకు గురై ఆదివారం మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. వేములవాడలోని చెక్కపల్లిరోడ్డుకు చెందిన ఆకుల నరేశ్ కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ముషీరాబాద్లో భార్య, ఇద్దరు కూతుళ్లతో కలిసి ఉంటున్నారు. ఇటీవల పెద్ద కూతురు పెళ్లి చేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఆయన భార్య ఇటీవల స్వదేశం రావడంతో కుటుంబంతో కలిసి నాలుగు రోజుల క్రితం చార్ధామ్ యాత్రకు వెళ్లారు. ఆదివారం ఉదయం కేదారినాథ్ సమీపంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ఛాపర్ అంబులెన్స్లో తరలించే లోపే మరణించారు. నరేశ్ మృతదేహాన్ని హైదరాబాద్కు తీసుకురానున్నారు. పట్టణంలోని ఆయన ఇంటిలో విషాద చాయలు అలుముకున్నాయి. -
జూడోపై ఆసక్తి
కరీంనగర్ సెంటర్లో జూడో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల్లో అద్భుతమైన టాలెంట్ ఉంది. ఉచిత శిక్షణ, నాణ్యమైన వసతులు ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిన వారు కూడా ఎలాంటి భయం లేకుండా క్రీడల్లోకి వస్తున్నారు. గతేడాది చాలా మంది క్రీడాకారులు జాతీయ పోటీల్లో సత్తా చాటారు. సీఎం కప్ పోటీల్లో కూడా పతకాలు సాధించారు. – కె.శ్యామ్, జూడో కోచ్ కరీంనగర్ ఖేలో ఇండియా సెంటర్లో మ్యాట్పై కబడ్డీ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్రీడాకారులు ఫిట్నెస్ మాత్రమే కాకుండా, టీమ్ వర్క్, వ్యూహాలను నేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో ప్రో కబడ్డీ వంటి పెద్ద వేదికలపై మెరుస్తారనే నమ్మకం ఉంది. – నగర్ల ప్రశాంత్, కబడ్డీ కోచ్, సిరిసిల్ల -
ఇంటి వెలుగులు
చిన్నారి పాపలం చిరునవ్వు దివ్వెలం ఇంటిలో వెలుగులం కంటిలో పాపలం అమ్మ ఒడి మాకుగుడి నాన్న మది మా ప్రేమనిధి ఇద్దరి మాటలు వింటాము చక్కగ బడికి వెళతాము బడిలో పాఠం నేర్చుకొని బంగరు బాటన పయనిస్తాము పెద్దల దీవెన లందుకొని విద్యలో విజయం సాధిస్తాము – బూర దేవానందం, సిరిసిల్లటౌన్ -
బన్నీ వేసవి యాత్ర –16 గుడ్ టచ్ బ్యాడ్ టచ్
సాయంత్రం బన్నీ, స్వప్న, రామ్, చుక్క తాతయ్య దగ్గర కూర్చున్నారు. తాతయ్య అన్నాడు: ‘మీ శరీరం మీది. మీ అనుమతి లేకుండా ఎవరూ ముట్టుకోకూడదు.’ ‘అమ్మ కౌగిలి , నాన్న ముద్దు, స్నేహితుల కరచాలనం – ఇవి గుడ్ టచ్. మనకు సంతోషంగా ఉంటుంది’ అని చెప్పాడు. ‘బ్యాడ్ టచ్ అంటే? మనకు భయం, బాధ, సిగ్గు కలిగితే అది బ్యాడ్ టచ్’ అని వివరించాడు. రామ్ అడిగాడు: ‘అలా జరిగితే ఏం చేయాలి తాతయ్యా?’ తాతయ్య 3 టిప్స్ చెప్పాడు: 1. గట్టిగా ‘వద్దు’ అని అరవాలి. 2. అక్కడి నుంచి పరిగెత్తాలి. 3. వెంటనే నమ్మకమైన పెద్దవాళ్లకు చెప్పాలి. చుక్క: అమ్మకు చెప్తాను. టీచర్కి చెప్తాను. స్వప్న అడిగింది: ‘తెలిసిన వాళ్లయితే?’ తాతయ్య అన్నాడు: ‘ఎవరైనా సరే, నీకు నచ్చకపోతే వద్దు అనే.’ చెప్పాలి. తాతయ్య గట్టిగా చెప్పాడు: ‘తప్పు మీది కాదు. ధైర్యంగా చెప్తేనే మనం జాగ్రత్తగా ఉంటాము.’ బన్నీ అందరికీ చెప్పాడు: ‘మన శరీరం. మన నియంత్రణ. గుడ్ టచ్ పర్వాలేదు. బ్యాడ్ టచ్ చేయనివ్వకూడదు.’ పిల్లలకి మాట: భయం వద్దు. మౌనం వద్దు. ‘వద్దు’ అని గట్టిగా చెప్పాలి. విషయం అమ్మకు, టీచర్కు చెప్పడమే అసలైన ధైర్యం. కోట లక్ష్మణ్, ఎస్జీటీ ఎంపీపీఎస్, కాకర్లపల్లి మండలం : మంథని జిల్లా : పెద్దపల్లి -
మేము గీసిన బొమ్మలు
నైలా ఖలీల్ 6వ తరగతి అల్ఫోన్స్ హైస్కూల్ నల్గొండ నాగప్రతిజ్ఞ 6వ తరగతి మహాత్మాజ్యోతిబాపూలే రాంపూర్ హుజూరాబాద్ కరీంనగర్ (జిల్లా) తంగళ్లపల్లి రుత్విక్ 7వ తరగతి ప్రగతి విద్యాలయం హైస్కూల్ కోరుట్ల జగిత్యాల (జిల్లా) జే.శెశ్వితశ్రీ 2వ తరగతి నడ్డివారి గూడెం నల్గొండ జోయా నాజ్ కాకతీయ హైస్కూల్ కరీంనగర్ జక్కం తనుశ్రీ 4వ తరగతి సూర్య ఆక్స్ఫర్డ్ స్కూల్ గణేశ్నగర్ సిరిసిల్ల


