breaking news
Karimnagar
-
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. -
అభీష్టం.. అభ్యుదయం.. అజరామరం!
ఒక్కొక్కరిది ఒక్కో విధానం. కొందరు వృత్తిని నమ్మకుంటూనే ప్రజాసేవకోసం నడుంబిగించారు. ఇంకొందరు నచ్చిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. మరికొందరు ఆపదలో మేమున్నామంటూ బయలు దేరుతున్నారు. పలువురు అన్నితామై లాస్ట్ జర్నీ పూర్తిచేస్తున్నారు. ఎవరు ఏ రకంగా ముందుకెళ్తున్నా.. ఈ తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్... పేదలు మృతిచెందితే వారి దహన సంస్కారాలకు బాధిత కుటుంబ సభు్ుయ్ల నానా అవస్థలు పడుతున్నారు. నా తాత, తండ్రి పేరు నిలబెట్టాలన్న ఉద్దేశంతో వారి జ్ఞాపకార్థం వైకుంఠయాత్ర రథాలను ఏర్పాటు చేశా. ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు నా వంతు సాయం అందిస్తున్న. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో ఉంటున్నా సొంతగడ్డను మర్చిపోకుండా మరిన్ని సేవలు అందిస్తా. – డాక్టర్ మంచాల జ్ఞానేందర్ కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం కనగర్తి గ్రామానికి చెందిన మంచాల జ్ఞానేందర్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు. అతడి తాత మంచాల రాజేశం స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రజాకవిగా సిరిసిల్ల ప్రాంతంలో సుపరిచుతులు. జ్ఞానేందర్ తాత, తండ్రి శంకరయ్య జ్ఞాపకార్థం 2013లో ‘మంచాల శంకరయ్యగుప్తా చారిటబుల్ ట్రస్ట్’ ఏర్పాటు చేసి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉచిత స్వర్గలోక యాత్ర వాహనాన్ని ఏర్పాటు చేశాడు. తర్వాత సిరిసిల్ల ప్రాంతంలో మరో వాహనం ఏర్పాటు చేసి, రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా తన సేవలను ప్రారంభించారు. ఎవరైనా పేదలు మృతిచెందినా ఇదే వాహనంపై అంతిమయాత్ర చేస్తారు. వీటితో పాటు బాడీఫ్రీజర్ కూడా ఉచితంగా అందిస్తున్నారు. పైగా బాధితులు అత్యంత పేదలని తెలిస్తే 50 మందికి సరిపడా భోజనం కూడా పంపిస్తారు. ఇలా ఇప్పటి వరకు సిరిసిల్ల, హైదరాబాద్, నిజామాబాద్లో సుమారు 21,280 పేద కుటుంబాలకు చెందిన మృతదేహాలను తరలించడానికి వాహనాలను ఏర్పాటు చేశారు. అలాగే వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చుతున్నాడు. కాలనీల్లో వాటర్ట్యాంకర్లతో నీటి సరఫరా, వినాయక చవితికి మట్టి విగ్రహాల పంపిణీ, అనాథలు, వృద్ధులకు దుస్తులు పంపిణీ తదితర కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా చేపడుతున్నారు. ఇతడి సేవలను గుర్తించి అమెరికాలోని కాలిఫోర్నియా యునైఎడ్ థియోలాజికల్ యూనివర్సిటీ వారు 2016లో డాక్టరేట్ ప్రదానం చేశారు. 2018లో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జ్ఞానేందర్కు ఉత్తమ సేవా పురస్కారాన్ని కలెక్టర్ అందించారు. 2017లో మహానటి సావిత్రి సేవా పురస్కారం అందుకున్నారు. ఉత్తమ సామాజిక సేవకుడిగా గిన్నిస్బుక్లోకి ఎక్కారు. జ్యోతినగర్(రామగుండం): ‘మాయమైపోతున్నడమ్మా..మనిషన్న వాడు’ అని తన సెల్ ఫోన్కు కాలర్ ట్యూన్ పెట్టుకుని పేదల ఆఖరి మజిలీకి మడిపల్లి మల్లేశన్న ఆప్తుడిగా నిలిచాడు. గోదావరిఖని ప్రాంతానికి చెందిన మల్లేశ్ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి కరోనా సమయంలో రామగుండం నియోజకవర్గ ప్రాంతంలోని 20 వేల మంది పేదలకు నిత్యవసర సరుకులు అందించి ఔదార్యాన్ని చాటుకున్నారు. అలాగే నిరుపేదలు మృతి చెందితే వారి ఆఖరి మజిలీకి పాడెకట్టెలు, బాధిత కుటుంబాలకు భోజనం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 600 మందికి పైగా మృతిచెందిన పేదలకు పాడెకట్టెలు అందించి తన నిస్వార్థ సేవలను కొనసాగిస్తున్నాడు. అనాథ శవాల అంత్యక్రియలు చేయడంలోనే ముందు వరుసలో నిలిచి సేవలు అందిస్తున్నాడు. జ్ఞానేందర్ ఏర్పాటు చేసిన స్వర్గలోకయాత్ర రథం కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ సర్పంచ్గా ఎన్నికై న ముదాం రవి చాలా ఏళ్లుగా ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తున్నారు. సర్పంచ్గా గెలిచినప్పటి నుంచి ఉదయం వేళ గ్రామంలోని వాడల్లో తిరిగి ప్రజలకు అందుబాటులో ఉంటారు. తర్వాత ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తారు. ప్రజలకు సేవ చేయాలని సర్పంచ్గా బరిలో ఉండి గెలిచానని, ఉపాధిపరంగా ఎలక్ట్రికల్ షాపులో ఉండి విక్రయాలు జరిపితేనే సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు. గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. -
నిరంతరాయ విద్యుత్కు ట్రాన్స్ఫార్మర్లు
కొత్తపల్లి: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరాకు నూతనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగానే శనివారం కరీంనగర్ టౌన్–1 సబ్ డివిజన్లోని టౌన్–3 సెక్షన్లో రెండు 160 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, టౌన్–1లో 160 కే.వీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు, టౌన్–8 సెక్షన్లో 160 కే.వీ ట్రాన్స్ఫార్మర్ను, టౌన్–2 సబ్ డివిజన్లోని టౌన్ 2 సెక్షన్లో మూడు 160 కె.వీ., టౌన్–4లో ఐదు 160 కె.వీ. టౌన్–7లో 100 కె.వీ., టౌన్–9 సెక్షన్లో రెండు 160 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు, కరీంనగర్ రూరల్ సబ్ డివిజన్ తీగలగుట్టపల్లి సెక్షన్లో మూడు 160 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు, నాలుగు 100 కె.వీ. ట్రాన్స్ఫార్మర్లు శనివారం డివిజనల్ ఇంజినీర్ జంపాల రాజంతో కలిసి ఆయన చార్జ్ చేశారు. -
ఓటు ఇక్కడ.. బూత్ అక్కడ
ఒక్క డివిజన్లోనే 66 పోలింగ్ బూత్ల ఓట్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ రూపొందించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల పునర్విభజన జాబితా, ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటినంబర్లు, పోలింగ్ బూత్ల ప్రకారం 66 డివిజన్ల ఓటర్ల జాబితాను రూపొందించినట్లుఽ అధి కారులు చెబుతున్నారు. ముసాయిదా జాబితాను పరిశీలిస్తే ఆ పద్ధతి కనిపించడం లేదు. 66 డివిజన్ల జాబితాలను చూస్తే, ఎక్కడా ఒక ఇంటినంబర్ ఓట్లు ఒకేచోట కనిపించడం లేదు. ఇంటినంబర్కు సంబంధించిన ఒక ఓటు ఒక పేజీలో, మరో ఓటు మరో పేజీలో, ఇంకో ఓటు ఎక్కడో కనిపిస్తున్నాయి. దీంతో తమ ఓట్లు మొత్తం తమ ఇంట్లో ఉన్నాయో లేవో తెలియని గందరగోళ పరిస్థితిలో ఓటర్లు తలలు పట్టుకొంటున్నారు. పోలింగ్బూత్ల వారీగా ఓటర్ల వివరాలను తీసుకొని, సంబంధిత డివిజన్లో జతపరచారని చెబుతున్నా, వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సాధారణంగా ఏ డివిజన్లోనైనా నాలుగు నుంచి ఆరు పోలింగ్ బూత్లు ఉంటాయి. కొన్ని డివిజన్లలో తొమ్మిది ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఒక్కో డివిజన్లో 30 నుంచి 66 పోలింగ్ బూత్లు కూడా ఉండడం గమనార్హం. నగరపాలకసంస్థ 47వ డివిజన్లో అసెంబ్లీ ఎన్నికల వారిగా చూస్తే తొమ్మిది పోలింగ్ బూత్లు ఉండాలి. కాని ఈ డివిజన్లో ఏకంగా 66 పోలింగ్ బూత్లకు సం బంధించిన ఓట్లు ఉన్నాయంటే, జాబితా ఎంత గందరగోళంగా ఉందో ఊహించొచ్చు. ఈ డివిజన్లో కొన్ని పోలింగ్ బూత్ల నుంచి ఒక్క ఓటు మాత్రమే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దాదాపు అన్ని డివిజన్లలో పోలింగ్ బూత్ల సంఖ్య గతానికి భిన్నంగా అధికసంఖ్యలో ఉన్నాయి. 64వ డివిజన్ ముకరంపురలో పొందుపరిచిన ఓటు పోలింగ్బూత్ మాత్రం కమాన్ సమీపంలోని షాషామహాల్ వద్ద చూపిస్తోంది. దీనితో ఆ ఓటరు ముకరంపురలో ఓటు వేయాలా, షాషామహల్లో ఓటు వేయాలో తెలియని విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒకటి, రెండు కాకుండా వేలాది ఓట్లు ఈ రకంగానే ఉండడంతో, వీటిని సరిచేస్తారా, అలానే వదిలేస్తారో అనే సందేహం సర్వత్రా వ్యక్తమవుతోంది. ముసాయిదా జాబితాను ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తే తప్ప, జాబితా గాడినపడే అవకాశం లేదు. -
ప్రజల నాడీ గుర్తించిన బొమ్మెన సర్పంచ్
కథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామసర్పంచ్ చిందం సుధాకర్ ఆర్ఎంపీగా ప్రజలకు సేవలందిస్తున్నారు. సర్పంచ్గా సేవలందించాలని రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచారు. ఆర్ఎంపీగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వైద్య సాయం అందించానని, ఆ సేవలను గుర్తించి ప్రజలు నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. సర్పంచ్గా గెలిచినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు చేస్తూ.. తన వృత్తి ఆర్ఎంపీగా పనిచేస్తుంటే సంతోషంగా ఉంటుందన్నారు. – సుధాకర్, సర్పంచ్, బొమ్మెన -
చిన్నారికి ‘ఊపిరి’పోయండి
ముస్తాబాద్(సిరిసిల్ల): కూతురు పుట్టడంతో మహాలక్ష్మీ వచ్చిందని వారు సంతోషపడ్డారు. కానీ ఆ సంతోషం చిన్నారి అనారోగ్య సమస్యతో ఆవిరైంది. ఐదేళ్ల చిన్నారి అంతుచిక్కని ఊపిరితిత్తుల వ్యాధికి గురై ఆస్పత్రిలో అచేతనంగా పడి ఉంది. ఆర్థికంగా అంతంతే ఉన్న ఆ కుటుంబ ఆర్థిక సాయం చేయాలని దాతలను వేడుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన సూర రాజశేఖర్, రమ్య దంపతుల కూతురు వైష్ణిక(5) ఊపిరితిత్తుల వ్యాధికి గురైంది. కూలీ పనులు చేసుకునే వీరికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు వైష్ణికను రెండు నెలల క్రితం బడిలో చేర్పించారు. ఆడుతూ పాడుతూ ఉన్న వైష్ణిక అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఊపిరి ఆడడం లేదంటూ పడిపోయింది. దీంతో తల్లిదండ్రులు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకిందని, కుడివైపు ఊపిరితిత్తులకు బ్రోంకోగ్రామ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. రూ.5లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలపడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అంతా పెద్ద మొత్తం ఎక్కడి నుంచి తెచ్చేదని ఆవేదన చెందుతున్నారు. మానవతావాదులు, ప్రభుత్వమే తమ చిన్నారిని కాపాడాలని వేడుకుంటున్నారు. చిన్నారి బాలికకు అండగా నిలిచేదాతలు 95153 67957లో సంప్రదించాలని కోరుతున్నారు. అంతుచిక్కని వ్యాధితో అచేతనస్థితి ఆర్థిక సాయం చేయాలని తల్లిదండ్రుల వేడుకోలు -
అనాథలకు ఆపన్నహస్తం
రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. -
కలెక్టర్ గారు.. ఇలాగేనా జాబితా
కరీంనగర్ కార్పొరేషన్: కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్న నగరపాలకసంస్థ ఓటర్ల ముసాయిదా జాబితా ఇంత అస్తవ్యస్తంగా తయారు చేయడమేమిటని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ప్రశ్నించారు. ఎంత ముసాయిదా జాబితా అయినా ఇంత అధ్వానంగా ఎప్పుడు లేదని మండిపడ్డారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. అసలు ఏ విధానాన్ని అనుసరించి ఓటర్ల జాబితా రూపొందించారో అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. నగరంలోనే అత్యధిక ఓట్లున్న 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలో 1200 ఓట్లు వేరే ప్రాంతానివి చేర్చారన్నారు. మొగిలిపాలం, ఇల్లంతకుంట, బెజ్జంకి, బొమ్మకల్ ఓట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 64వ డివిజన్ ముకరంపురలో 4,514 ఓట్లకు గాను 722 ఓట్లు డివిజన్కు సంబంధం లేనివన్నారు. ఇంత దారుణంగా ఎప్పుడు ముసాయిదా జాబితా కూడా లేదన్నారు. ఓట్లు తారుమారు వల్ల రిజర్వేషన్లు కూడా మారిపోతాయన్నారు. ఈ జాబితాతోనే ఎన్నికలు వెళ్తారో కలెక్టర్ చెప్పాలన్నారు. మొత్తం తప్పులు సరిచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై నిషేధం
కరీంనగర్క్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై ఉన్న నిషేధాజ్ఞలు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు, బహిరంగంగా మద్యం సేవిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. డీజేలు, డ్రోన్ల వినియోగంపై 31 వరకు నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంబంధిత ఏసీపీలు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఆదాయం పెంచుకోవాలికరీంనగర్రూరల్: గ్రామ పంచాయతీ ఆదా యం పెంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్ అన్నారు. శనివారం కరీంనగర్ మండలం నగునూరు జీపీ కార్యాలయాన్ని డీపీవో జగదీశ్, తహసీల్దార్ రాజేశ్ సందర్శించారు. గ్రామ పంచాయతీ ఆదాయ వివరాలను డీపీవో అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీపీవో, తహసీల్దార్ను సర్పంచ్ సాయిల్ల శ్రావణి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు సన్మానించారు. ఎంపీడీవో సంజీవరావు, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, కార్యదర్శి లచ్చయ్య, ఆర్ఐ కనకరాజు, ఉపసర్పంచ్ బోనగిరి హన్మంతరావు, వార్డు సభ్యులు దామరపల్లి దామోదర్ రెడ్డి, అర్జున్, సుమన్, మహేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 22న గురుకులం ప్రవేశ పరీక్షవిద్యానగర్(కరీంనగర్): సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2026–27 విద్య సంవత్సరానికిగాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశం కోసం వచ్చేనెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని కరీంనగర్ జిల్లా సమన్వయ అధికారి ఎ.లక్ష్మి తెలిపారు. పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తిగల విద్యార్థులు కులం, ఆధార్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో ఈనెల 21 వరకు ఆన్లైన్లో రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె సూచించారు. ఎస్యూ రిజిస్ట్రార్గా సతీశ్ కుమార్సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పెద్దపల్లి సతీశ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వీసీ ఉమేశ్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం రిజిస్ట్రార్గా ఉన్న జాస్తి రవికుమార్ వన్ ఇయర్ లీన్ పీరియడ్పై కొనసాగారు. లీన్ పీరియడ్ పూర్తి కావడంతో తిరిగి ఉస్మానియా వర్సిటికి వెళ్లారు. సతీశ్కుమార్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ విభాగం అధిపతిగా, పరీక్షల విభాగం కాన్ఫిడెన్షియల్ కంట్రోలర్గా కొనసాగారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీఎఫ్వో ఫీడర్ పరిధిలోని డీఎఫ్వో చౌరస్తా, సీఎంఆర్ షాపింగ్మాల్, న్యూ అపెక్స్ హాస్పిటల్, సవరన్ స్ట్రీట్, హజ్మత్పుర ప్రాంతాలతో పాటు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కె.వీ.అంబేడ్కర్నగర్ ఫీడర్ పరిధిలోని అంబేద్కర్నగర్, శివాజీనగర్, కిసాన్నగర్, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
గ్రామానికి సర్పంచ్ పండ్ల తోటల వ్యాపారం
ఇల్లంతకుంట(మానకొండూర్): తమ ప్రాంతంలో దొరికే పండ్ల తోటలను కాంట్రాక్ట్ పట్టి వాటిని ఇతర రాష్ట్రాలకు అమ్ముతుంటాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం చిక్కుడువానిపల్లె గ్రామ సర్పంచ్ చింతమడక కళ్యాణ్. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇతడికి 4 ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంతో పాటు పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. మామిడి, బత్తాయి తోటలు కాయలుగా ఉన్నప్పుడు గంపగుత్తగా పట్టుకొని పండ్లుగా మారిన తర్వాత వాటిని బొంబయి, నాగపూర్, ఢిల్లీ, హైదరాబాద్.. ఎక్కడ ఎక్కువ రేటు పలికితే అక్కడికి తీసుకెళ్లి అమ్ముతానని కళ్యాణ్ తెలిపారు. – చింతమడక కళ్యాణ్, సర్పంచ్, చిక్కుడువాని పల్లె -
అనాథ శవాలకు అన్నీ తానై..
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట పట్టణా నికి చెందిన రాచమల్ల శేఖర్ ‘సర్వ్ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ పేరిట సమాజ సేవ చేస్తున్నారు. ఈయన అంబులెన్స్ సర్వీస్ నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాడు. కోవిడ్ సమయంలో రోగులను అంబులెన్స్లో ఆస్పత్రులకు తరలించారు. ఆ సమయంలో హైదరాబాద్ గాంధీ, నిమ్స్ వంటి ఆసుపత్రుల్లో కోవిడ్తో మృతిచెందిన వారిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో శేఖర్కు అనాథ శవాలకు అంత్యక్రియలు చేయాలని ఆలోచన వచ్చింది. 2020లో సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు రైల్వే, సివిల్ పోలీసులు సమాచారం అందిస్తే మృతదేహాలను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్, ఆలయాల వద్ద యాచకులకు దుప్పట్ల పంపిణీ, ఉచిత భోజనం అందిస్తున్నారు. ఇతడితో పాటు చందా సంతోష్, రామకృష్ణ సహాయకులుగా వ్యవహరిస్తూ సమాజ సేవ చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు చనిపోయినప్పుడు పోలీసులు సమాచారం అందించేవారు. మృతదేహాలను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చురీలో పెట్టెవాన్ని. గుర్తు తెలియని మృతులకు సంబంధించి ఎవరూ రాకుంటే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారు 90 అనాథ శవాలకు అంత్యక్రియలు చేశాను. – రాచమల్ల శేఖర్, సర్వ్ పీపుల్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్, జమ్మికుంట -
తెల్లారితే గల్ఫ్ పయనం.. అంతలోనే గుండెపోటు
రాయికల్: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి. కుటుంబంలో విషాదం -
వరి.. రైతన్నకు సిరి
కరీంనగర్ అర్బన్: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మిల్లులకు చేరింది. వానాకాలం సీజన్కు గానూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా ఎన్నడూ లేని విధంగా సేకరణ జరిగింది. ప్రాజెక్టులకు నీరు చేరడం, చెరువులు, కుంటలు కళకళలాడటం ఇది ఐదోసారి. ఈ క్రమంలో దిగుబడి గణనీయంగా పెరిగిందని గణాంకాలు చాటుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో ఉభయ గోదావరి జిల్లాలతో పోటీపడిన ఉమ్మడి కరీంనగర్ తాజాగా వానాకాలం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే టాప్–3లో నిలిచింది. యుద్ధప్రతిపాదికన కొనుగోళ్లు జరిగా యి. ఎప్పటికప్పుడు రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు. అక్టోబర్ చివర్లో కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. గత డిసెంబర్ 15వరకు వరకు రైతుల నుంచి సేకరణ చేశామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీకాంత్రెడ్డి వివరించారు. 82187 మంది రైతులు.. 3.32లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో మొత్తం 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐకేపీ, ప్యాక్స్, డీసీఎంఎస్, మెప్మా, హాకాలు కొనుగోళ్లు నిర్వహించాయి. 82187మంది రైతులు కేంద్రాల్లో విక్రయించారు. అధికారులు 3.32లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో రైతుల వివరాలను నమోదు చేసి, వారి ఖాతాలకు నగదును చేర్చారు. ఇతర జిల్లాల నుంచి ధాన్యం జిల్లాలో ధాన్యం దిగుబడులు ముంచెత్తగా రైస్ మిల్లులు నిండిపోయాయి. మూతబడిన మిల్లులు కూడా తెరచుకోవడం మిల్లుల ప్రాధాన్యతను చాటుతోంది. పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో మిల్లులు ధాన్యంతో నిండిపోవడంతో కరీంనగర్ జిల్లాలోని మిల్లులకు కేటాయించారు. దీంతో పాటు ఇతర జిల్లాల ధాన్యం కరీంనగర్ మిల్లులకు తరలిస్తున్నారు. కరీంనగర్, జమ్మికుంట, మానకొండూర్, తిమ్మాపూర్, చొప్పదండి, గంగాధర, శంకరపట్నం, హుజూరాబాద్, గన్నేరువరం, చిగురుమామిడి తదితర ప్రాంతాల్లో రైస్మిల్లులున్నాయి. లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాకు కేటాయించినట్లు సమాచారం. నిర్మల్, ఖమ్మం, మంచిర్యాల, వరంగల్ అర్బన్, జగిత్యాల జిల్లాల నుంచి సైతం ఇక్కడికి ధాన్యం తరలించారు.జిల్లాలో మొత్తం కొనుగోలు కేంద్రాలు: 322 కొనుగోళ్ల అంచనా: 3,01,880మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది: 3,32,809 మొత్తం రైతులు: 82,187 మొత్తం ధాన్యం విలువ: రూ.788.73కోట్లుగత యాసంగిలో సన్న రకాలకు బోనస్ పడకపోగా 61వేల వేలమంది రైతులు నిరీక్షిస్తున్నారు. సుమారు రూ.50కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉన్నప్పటికీ.. నేటికీ స్పష్టత లేదు. కేవలం వానాకాలం సీజన్ బోనస్ మాత్రమే రైతుల ఖాతాకు చేరుతోంది. అదీ కూడా పక్షం, నెల రోజులకు పడుతుండగా కొందరి ఖాతాలో జమకాలేదని సమాచారం. -
బ్రెయిలీ లిపితోనే చదువు
బ్రెయిలీ లిపి లేకుంటే మాలాంటి వారి పరిస్థితి వేరేలా ఉండేది. బ్రెయిలీ లిపితో చదువుకొని జ్ఞానాన్ని పొందుతున్నాం. మా స్కూల్లో బ్రెయిలీ లిపి నేర్చుకున్న టీచర్లు తెలుగు, ఇంగ్లిష్ భాషలను బ్రెయిలీ లిపిలో సులభంగా అర్థమయ్యేలా నేర్పిస్తున్నారు. – ఎ.నిత్య, 3వ తరగతి చిన్నప్పటి నుంచి నాకు చూపు లేదు. అయినా కళ్లు లేవని బాధ లేదు. బ్రెయిలీ లిపితో చదువుకున్న నుంచి అందరిలాగే పుస్తకాల్లోని పాఠాలను స్పర్శతో చదువుతున్నా. మాది అంధుల పాఠశాలే అయినా.. విద్యతోపాటు సంగీతం, పాటలు, ఆటలు నేర్పిస్తున్నారు. – వి.దుర్గ, 2వ తరగతి బ్రెయిలీ లిపిలోనే పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నా. మంచి మార్కులు తెచ్చుకుంటా. మా టీచర్లు అండగా ఉంటున్నారు. బోర్డు ఎగ్జామ్లో స్క్రయిబ్ సిస్టమ్ ఉంటుంది. నేను చెబుతుంటే 9వతరగతి చదివేవారు నా ఎగ్జామ్ రాస్తారు. – జి.సాయిరాం, 10వ తరగతి -
అజరామరం!
అభీష్టం..అభ్యుదయం..● వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తిలో ప్రతిభ చాటుతూ.. ● కుటుంబ బాధ్యతలు మోస్తూ.. సమాజసేవలో తరిస్తూ.. ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ఇష్టమైన పనిచేయడం సాధారణం.. ఆ పనినే విభిన్నంగా చేయడం అభీష్టం. అభీష్టాలను సమాజానికి ఉపయోగపడేలా చేయడం అభ్యుద యం. అంతటి అభ్యుదయ భావాలతో సమాజంలోని అవసరార్ధులు.. అన్నార్థులు.. అనాథలను ఆదుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిని కొనసాగిస్తూనే ప్రవృత్తిగా సేవ చేస్తున్నారు. బతుకుదెరువు వెతుకుతూనే.. గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. కొందరు అన్నార్థుల ఆకలి తీరుస్తుండగా.. మరికొందరు అనాథశవాలకు అంత్యక్రియలు చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ఇలాంటి వారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఏ మూలకు వెళ్లినా కనిపిస్తారు. ఇలాంటి వారిపై ఈ వారం సండే స్పెషల్. రామడుగు(చొప్పదండి): అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ, వారికి కొడుకులా వ్యవహరిస్తూ మంచికట్ల శ్రీనివాస్ ఇప్పటి వరకు దాదాపు 11 మందికి అన్నీ తానై దహన సంస్కారాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా బొమ్మకల్కు చెందిన శ్రీనివాస్ ఐదేళ్లుగా రామడుగు మండలం వెలిచాల గ్రామ పరిధిలో స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆశ్రమంలో ఎవరైనా ఆశ్రయం పొంది అనారోగ్యంతో మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు సమాచారమిస్తారు. ఎవరూ స్పందించకుంటే తానే మృతదేహాన్ని వెలిచాల గ్రామ వైకుంఠధామానికి తీసుకెళ్లి అంతిమసంస్కారాలు చేస్తారు. ఆశ్రమంలో ప్రస్తుతం 35 మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.రామగుండం: జీవనశైలిలో మార్పు చేసుకుంటేనే ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటుందని పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అంటున్నారు. పదిహేనేళ్లుగా పూర్తిగా భోజనం మానేసి ఉదయం వ్యాయామంతో జీవన విధానాన్ని ఆరంభించడం అలవాటుగా మారిందని తెలిపారు. రోజూ ఆహారంగా అంబలి, రాగిజావ, మొక్కజొన్న గటుక, మొలకెత్తిన పెసర్లు, చిరుధాన్యాలు తీసుకుంటానని, తద్వారా చురుగ్గా ఉండి మానసిక ప్రశాంతత పొందగలుగుతాం అని వివరించారు. తాను నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగే క్రమంలో వాహనంలో క్యారెట్, కీరదోస తదితరాలను తీసుకుంటానని, దీంతో మానసిక ఒత్తిడిని అధిగమిస్తూ నిత్య యవ్వనంగా ఉన్నట్లు అనిపిస్తుందని, అదే తన ఆరోగ్య రహస్యమని వివరించారు. -
చీకటి నుంచి వెలుగులోకి..
● అంధులకు ఆసరాగా బ్రెయిలీ లిపి ● ఆరు చుక్కలతో సమస్త విజ్ఞానం ● నేడు ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం కరీంనగర్: వారంతా అంధులు. పుట్టుకతోనే కొందరు, ప్రమాదవశాత్తు మరికొందరు చూపు పోగొట్టుకున్నారు. అయితే కళ్లు లేవని కలత చెందకుండా కేవలం స్పర్శ, శబ్దం, వాసన ఆధారంగానే వారు అన్ని పనులు సమర్థంగా చేసుకుంటున్నారు. నేత్రాలను కోల్పోయినా.. తమ జ్ఞాన నేత్రానికి పదును పెడుతూ విద్యలో ప్రతిభ కనబరుస్తున్నారు. చీకట్లో అక్షరాల విత్తనాలను అందిపుచ్చుకునే సమర్థత సాధిస్తున్నారు. నైరాశ్యపు మేఘాలను చీల్చుకొని హృదయాల్లో ఆత్మవిశ్వాసం నింపుకొని అక్షరాలను నేర్చుకుంటూ చీకటి ప్రపంచపు వెలుగు రేఖలుగా నిలుస్తున్నారు. బ్రెయిలీ లిపి అనే మనోనేత్రం ద్వారా ఆరు చుక్కల లిపితో తమ జీవితాల్లో వెలుగులు నింపుకుంటున్నారు. బ్రెయిలీ లిపి అంధుల పాలిట ఆశాకిరణంగా మారింది. లూయిస్ బ్రెయిలీ జయంతి పురస్కరించుకొని ఏటా జనవరి 4న ప్రపంచ బ్రెయిలీ లిపి దినోత్సవం జరుపుకుంటున్నారు. అంచెలంచెలుగా.. సాధారణంగా చదువుకోవాలంటే పుస్తకాలు తప్పనిసరి. కానీ అంధులు చూడలేరు కాబట్టి వారికి స్పర్శతో చదువు చెప్పే విధానం కావాలి. దీనికోసం స్పెయిన్కు చెందిన ఫ్రాన్సిస్కో లూకాస్ 16వ శతాబ్దంలో చెక్క మీద ఎత్తుగా ఉబ్బి ఉండే అక్షరాలను చెక్కే పద్ధతిని రూపొందించాడు. అనంతరం పారథస్ అనే అంధుడైన సంగీతజ్ఞుడు, అతడి మిత్రుడు హెయిలీ కలిసి పేపర్ మీద ఎత్తుగా ప్రింట్ చేసే విధానం కనుగొన్నారు. అయితే అంధులకు లిపిని కనుగొన్న ఘనత మాత్రం బ్రెయిలీకి దక్కింది. ఆరు చుక్కలతో లిపి పారిస్ సమీపంలోని కూపేవ్రేలో 1809 జనవరి 4న లూయిస్ బ్రెయిలీ జన్మించారు. బ్రెయిలీ చిన్న వయసులోనే చూపు కోల్పోయాడు. అక్షరం, సంఖ్య సూచించడానికి ఆరు చుక్కలను ఉపయోగించి స్పర్శ ద్వారా గుర్తించేలా కోడ్ కనుగొన్నారు. ప్రస్తుతం బ్రెయిలీ కోడ్ ద్వారా గణితం, సంగీతం, కంప్యూటర్ ప్రోగ్రాం చదవడం, రాయడం చేయొచ్చు. అన్ని భాషలకు ఆరు చుక్కలే ఆధారం. కుడి పక్కన 1, 2, 3 చుక్కలు, ఎడమ వైపున 4, 5, 6 చుక్కలుంటాయి. ఈ ఆరు చుక్కల్లోనే ఒక్కో అక్షరానికి ఒక్కో నంబర్ ఉంటుంది. అంధులు ఆ నంబర్లను గుర్తుపెట్టుకొని మనో నేత్రంతో చదువుతూ విద్యనభ్యసిస్తున్నారు. తెలంగాణలో 2 పాఠశాలలు కరీంనగర్, మహబూబ్నగర్లో వికలాంగుల శాఖ ద్వారా ప్రభుత్వం అంధుల పాఠశాలలను నెలకొల్పింది. కరీంనగర్ అంధుల పాఠశాలలో వివిధ జిల్లాలకు చెందిన 80 మంది విద్యార్థులుండగా.. ఇందులో 48 మంది బాలురు, 32 మంది బాలికలున్నారు. వీరంతా 1 నుంచి 10వతరగతి వరకు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి విద్యనందించేందుకు 25 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. నాకు పుట్టుకతోనే అంధత్వం. మాది మహబూబ్నగర్. అక్కడే అంధుల పాఠశాలలో బ్రెయిలీ లిపిలో విద్యాభ్యాసం చేశాను. డిగ్రీ అనంతరం టీచర్ శిక్షణ పొంది కరీంనగర్లో ఉపాధ్యాయుడిగా 3 నెలల క్రితం జాయిన్ అయ్యాను. ఇదంతా బ్రెయిలీ లిపి చలవే. బ్రెయిలీ లిపి లేకపోతే అంధులకు భవిష్యత్తు లేదు. – డి.భాస్కర్, ఉపాధ్యాయుడు -
ఇయ్యాల సీపీఐ వందేళ్ల సంబరం
కరీంనగర్టౌన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ఆదివారం కరీంనగర్లో భారీ ర్యాలీ, బహిరంగ సభను రెవెన్యూ గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, అతిథులుగా సీపీఐ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాస్రావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేన శంకర్ హాజరవుతున్నారని పేర్కొన్నారు. -
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన చెన్ని బాలరాజ్ బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి అక్కడే అనారోగ్యంతో మృతి చెందాడు. బాలరాజ్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ను కలిసి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని కోరారు. కేటీఆర్ స్పందించి మృతదేహం సగ్రామానికి రావడానికి కృషి చేశారు. బాలరాజ్ మృతదేహం శనివారం ఇంటికి చేరగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సర్పంచ్ ఎలగందుల నర్సింహులు, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ పందిళ్ల నాగరాణి పరామర్శించారు. జూలపల్లి: కుమ్మరికుంటలో శనివారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దొడ్ల స్వామి(53) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ సనత్కుమార్ కథనం ప్రకారం.. కుమ్మరికుంట గ్రామానికి చెందిన దొడ్ల స్వామి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్నా నయం కాక మానసికంగా బాధతుండేవాడు. శనివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వచ్చి ఇంట్లోనే ఉండగా.. భార్య భాగ్య వ్యవసాయ పనులకు వెళ్లింది. కుమార్తె మధ్యాహ్నం ఇంట్లో నిద్రపోగా.. ఇంటి ముందున్న రేకుల షెడ్డులో స్వామి పైపునకు చీరతో ఉరేసుకున్నాడు. గమనించిన అతడి కుమార్తె చుట్టుపక్కల వారిని పిలిచింది. కిందికి దించి చూడగా మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ధర్మారం: కొత్తూరు పరిధిలో 4 కరెంట్ మోటార్ల కాపర్ వైరుతోపాటు మోటార్ బాడీలను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన తాళ్ల రాజేశంగౌడ్, పెనుగొండ అంజయ్య, కొమ్మ బాలయ్య, రేషవేని స్వామికి సంబంధించిన వరి పొలాలు గ్రామ శివారులోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్నాయి. ఈ రైతుల పొలాలు పక్కపక్కనే ఉంటాయి. ఈ పొలాలకు రోడ్డు సౌకర్యం కూడా ఉండడంతో.. రాత్రివేళ దొంగలు మోటార్ సైకిళ్లపై వచ్చి కరెంట్ మోటార్లో ఉన్న కాపర్ వైరుతోపాటు బాడీలను ఎత్తుకుపోయారని భావిస్తున్నారు. శనివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన వారికి మోటార్ కనిపించకపోవడంతో లబోదిబోమంటున్నారు. ● రూ.20వేల చొప్పున వసూలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చేతబడి చేశారని, నయం చేస్తానని ఓ వ్యక్తిటోకరా వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాంసానిపల్లె, చుట్టుపక్కల గ్రామాల్లో అయ్యప్పమాల వేసుకున్న వ్యక్తి బిక్షాటన చేస్తూ ఇళ్లలోకి వెళ్లి ‘అమ్మా మీ ఇంటికి అరిష్టం తలిగిందని, చేతబడి చేశారని, తొలగించాలి’ అని మాయమాటలతో నమ్మిస్తూ రూ. 10వేల చొప్పున వసూలు చేసుకున్నట్లు సమాచారం. తనది కాల్వశ్రీరాంపూర్ అని తన ఫోన్ నంబర్కు ఫోన్ పే చేయాలని సదరు వ్యక్తి పలువురికి నంబర్ ఇచ్చాడు. నాంసానిపల్లె గ్రా మానికి చెందిన రాజు అనే బాధితుడి నుంచి నగదు రూ.10వేలు, పోన్ పే ద్వారా రూ.10వేలు తీసుకోగా, శనివారం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మోసం చేసిన వ్యక్తిని త్వరలో పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై రమేశ్ తెలిపారు. గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన తమ్మనవేని సౌజన్య అనే బాలింత శనివారం మృతిచెందింది. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన సౌజన్యను అనారోగ్య సమస్యలతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. -
ఉడాయిస్తున్న మేసీ్త్రలు !
ఇతను ఎకిలిపురం రవి. ఇంటి నిర్మాణం కోసం మేసీ్త్రతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సగం పనులు చేసిన మేసీ్త్ర తర్వాత ఉడాయించాడు. అయితే అప్పటికే చేసిన పని కంటే రూ.3లక్షలు అదనంగా వసూలు చేసుకున్నాడు. చేసేదేమి లేక మరో మేసీ్త్రతో మిగతా పనులు చేయించుకున్నాడు. దీంతో అదనంగా రూ.7లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇతను రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దేశవేని పెద్దగంగారం. కొత్తగా ఇల్లు నిర్మించుకునేందుకు ఓ మేసీ్త్ర వద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. మేసీ్త్ర మొదట కొన్ని డబ్బులు తీసుకొని పనులు ప్రారంభించాడు. అంతలోనే మరో రూ.5లక్షలు వరకు మేసీ్త్ర వసూలు చేసుకున్నాడు. డబ్బులు ముట్టిన తర్వాత పనులు చేయకుండా ఉడాయించాడు. మేసీ్త్రకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో మోసపోయనాని గ్రహించిన గంగారం మరో మేసీ్త్రకి మిగిలిన పనుల కాంట్రాక్ట్ ఇచ్చాడు. దీంతో అదనంగా రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుంది. -
కేన్సర్ బాధతో మహిళ ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన ముప్పు రాజమ్మ(53) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శేఖర్రెడ్డి తెలిపారు. రాజమ్మ కొన్నేళ్లుగా కేన్సర్తో బాధపడుతోంది. వ్యాధినయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందింది. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కొడుకు కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడు..ఇల్లందకుంట: మండలంలోని భోగంపాడు గ్రామానికి చెందిన రత్న నేతాజీ(24) వివాహం కావడంలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నేతాజీ కొద్ది రోజులుగా వివాహం కావడం లేదని బాధ పడుతున్నాడు. గత నెల 30వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు 108లో హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చనిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ క్రాంతికుమార్ తెలిపారు. అనారోగ్యం భరించలేక వృద్ధుడు..బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లికి చెందిన కూస ఓజయ్య(67) అనారోగ్యం సమస్యలు భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. గత మూడేళ్లుగా ఓజయ్య తీవ్రమైన వెన్ను, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్నా తగ్గలేదు. ఈక్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తన భవనంలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగొద్దని మందలించినందుకు కళాకారుడు.. జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్లో ఒగ్గు కళాకారుడు భూమల్ల ఐలయ్య(55)మద్యం మత్తులో ఇంట్లోని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. ఐలయ్య వ్యవసాయంతోపాటు ఒగ్గు కళలతో మల్లన్న దేవుని పట్నాలు వేసి బతుకుతున్నాడు. రెండురోజుల క్రితం తన ఇంట్లోనే మల్లన్న పట్నాలు వేసుకున్నారు. గురువారం సాయంత్రం మద్యం తాగి గొడవ చేస్తుండగా.. పండుగపూట మద్యం ఎందుకు తాగావని కుటుంబ సభ్యులు మందలించారు. మనస్తాపం చెందిన ఐలయ్య రాత్రి పురుగుల మందు తాగిండు. కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రధాన ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పశు వైద్యసేవలు వినియోగించుకోవాలి
కరీంనగర్రూరల్: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశువైద్యసేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి కోరారు. శుక్రవారం కరీంనగర్ మండలం తాహెర్కొండాపూర్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పాడి పశువుల పెంపకంతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం 18ఆవులు, 26 గేదెలకు వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మినరల్ మిక్చర్ ప్యాకెట్లు అందించారు. సర్పంచ్ ఆకుల గిరి, ఉపసర్పంచ్ ఆకుల లావణ్య, పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకులు వినోద్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): రైతులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్శాఖ అధికారులు ‘పొలంబాట’ ద్వారా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి, సమస్యలు పరిష్కరిస్తున్నారని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. కరీంనగర్ సర్కిల్లో ఇప్పటి వరకు 1,055 పొలంబాట కార్యక్రమాలు నిర్వహించినట్లు, ఇందులో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 572 వంగిన స్తంభాలను సరిచేశామని, 2,650 చోట్ల లూజ్ లైన్లను (వేలాడుతున్న వైర్లు) బిగించామన్నారు. అదేవిధంగా 1,343 మధ్య స్తంభాలను ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ కాకుండా ఉండేందుకు సరైన ఎర్తింగ్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. మోటార్లకు కెపాసిటర్లు అమర్చుకోవడం వల్ల మోటార్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండటమే కాకుండా నీళ్ల ప్రెషర్ మెరుగ్గా ఉంటుందని రైతులకు సూచించారు. విద్యుత్ ఇబ్బందులు తలెత్తితే వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.అందుబాటులో యూరియాకరీంనగర్ అర్బన్: జిల్లాలో 3,393 మెట్రిక్ టన్నుల యూరియాను వివిధ సొసైటీల్లో అందుబాటులో ఉంచినట్లు ఇన్చార్జి కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. 2,616 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని వివరించారు. సాగు విస్తీర్ణం, రైతుల అవసరాల క్రమంలో సరిపడా యూరియాను తెప్పిస్తామని ప్రకటనలో తెలిపారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. క్వింటాల్ పత్తి రూ.7,400జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. శుక్రవారం మార్కెట్కు 110 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,300, కనిష్ట ధర రూ.6,900కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: రేకుర్తిలో విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేకుర్తి, సమ్మక్క గద్దెలు, బుడిగ జంగాల కాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. సర్వే లాండ్ ఏడీగా కిషన్రావుకరీంనగర్ అర్బన్: భూ కొలతలు, రికార్డులశాఖ ఏడీగా కిషన్రావు బాధ్యతలు చేపట్టారు. ఏడీగా వ్యవహరించిన ప్రభాకర్ను ఆదిలాబా ద్కు బదిలీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23మంది ఏడీలను బదిలీ చేయగా కరీంనగర్ ఏడీ ప్రభా కర్కు బదిలీ అనివార్యమైంది. కాగా కిషన్రావు మహబూబ్నగర్ ఏడీగా వ్యవహరించారు. -
టీచర్లలో టెట్ టెన్షన్!
కరీంనగర్టౌన్: ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో టెట్ టెన్షన్ నెలకొంది. శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ఇన్నాళ్లు పుస్తకాలతో కుస్తీ పట్టారు. జిల్లాలోని ఎనిమిది కేంద్రాల్లో ఆన్లైన్లో టెట్ పరీక్షలు జరగనున్నాయి. పేపర్–1, పేపర్–2 పరీక్షకు హాజరయ్యేవారికి ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. సెలవు పెట్టి.. కోచింగ్ తీసుకుని.. నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం డీఎస్సీ పరీక్ష రాస్తున్న అభ్యర్థులతోపాటు దేశవ్యాప్తంగా 2012లోపు నియామకమైన టీచర్లంతా టెట్లో అర్హత సాధించాలని గతేడాది సెప్టెంబర్లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు రెండేళ్ల వెసులుబాటు ఇచ్చింది. అర్హత సాధించకపోతే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఉద్యోగ విరమణకు ఐదేళ్ల కన్నా తక్కువ సర్వీసు ఉన్నవారికి మినహాయింపునిచ్చింది. ఈ తీర్పుతో ఇన్సర్వీస్ టీచర్లలో ఆందోళన నెలకొంది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ), తెలుగు, హిందీ భాషా పండిత కోర్సులు చేసి, డీఎస్సీలో ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తమకు టెట్ నిబంధన పెట్టడమేంటని సర్వీస్లోఉన్న ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును పాటించాల్సి ఉండటంతో పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 651 పాఠశాలలున్నాయి. వీటిలో 2,780 మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2010 తర్వాత డీఎస్సీ ద్వారా నియామకమైన 393 మంది టెట్ అర్హత సాధించిన వారున్నారు. మిగితా 2,391మందిలో ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంది. ఈ లెక్కన 2334 మంది టెట్ ఉత్తీర్ణులు కావల్సి ఉంటుంది. వీరితో పాటు జిల్లాలో నిరుద్యోగులు 15వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 16,393 మంది టెట్ రాయనున్నారు. పరీక్షల కోసం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు మూడు నెలలుగా కుస్తీ పడుతున్నారు. కొందరు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. లీజర్, భోజన విరామ సమయాల్లో చదువుకున్నారు. మరికొందరు సెలవుపెట్టి కోచింగ్ తీసుకున్నారు. పిల్లలు, బంధువులతో సందేహాల నివృత్తి ఇన్సర్వీస్ టీచర్లలో చాలామంది 20ఏళ్ల క్రితం ఉద్యోగాల్లో చేరినవారున్నారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొంది పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. వీరంతా టెట్–2 అర్హత సాధించాల్సి ఉండటంతో సందేహాలను నివత్తి చేసుకునేందుకు కొంతమంది పిల్లలు, బంధువులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్ష వేళ.. బోధన ఎలా? టెట్ రాసేందుకు చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు ఫీజు కట్టారు. కొంతమంది వచ్చే విడతలో చెల్లించి రాయాలని చూస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. టెట్ పరీక్ష రోజున ఉపాధ్యాయులందరూ స్కూల్ను విడిచి వెళ్లే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రధానంగా ఇద్దరు, ముగ్గురు టీచర్లున్న ప్రాథమిక పాఠశాలల్లో, ఉర్దూ, హిందీ, మరాఠీ లాంటి మైనర్ మీడియం స్కూళ్లలో పని చేసే టీచర్లు పరీక్షకు హాజరైతే పిల్లలు ఖాళీగా కూర్చోవాల్సి వస్తుందని ఉపాధ్యాయ సంఘాలనాయకులు వాపోతున్నారు. -
● స్క్రీన్షాట్స్తో డబ్బులు పంపామని బుకాయింపు
బ్యాంకుకు వచ్చి.. రోడ్డు ప్రమాదానికి గురై..కోరుట్ల రూరల్: మండలంలోని గుంలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుగ్గారపు వెంకటరాజం (77) అనే వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన వెంకటరాజం బ్యాంక్ పని నిమిత్తం శుక్రవారం ఉదయం ద్విచక్రవాహనంపై కోరుట్లకు వచ్చాడు. పని ముగించుకొని సాయంత్రం తిరిగి దమ్మన్నపేటకు వెళ్తుండగా గుంలాపూర్ ఎక్స్రోడ్డు వద్ద జగిత్యాల వైపు నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో వెంకటరాజం అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. కారు అతివేగం అజాగ్రత్తగా నడపటంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి భార్య బుగ్గారపు రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు. రెచ్చిపోతున్న సైబర్ మోసగాళ్లు ఎల్లారెడ్డిపేట: పొరపాటుగా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయని.. తిరిగి తమకు పంపించాలని ఎల్లారెడ్డిపేట మండలంలోని పలువురికి సైబర్మోసగాళ్లు వాట్సాప్లో కాల్చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు పంపించినట్లు స్క్రీన్షాట్స్ పంపి నమ్మించేందుకు యత్నించారు. డబ్బులు తమకు రాలేవని చెప్పినా వినిపించుకోకుండా మళ్లీ..మళ్లీ స్క్రీన్షాట్స్ పంపుతూ డబ్బులు పంపాలని ఒత్తిడి తెచ్చినట్లు వారు చెప్పారు. అప్రమత్తమై బ్యాలెన్స్ చెక్ చేసుకొని డబ్బులు జమకాలేదని నిర్ధారించుకున్నట్లు వారు వివరించారు. -
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కరీంనగర్రోడ్లో గల శాంసంగ్ షోరూం సమీపంలో డిసెంబర్ 31 సాయంత్రం జరిగిన కొలగాని అంజయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. గోవిందుపల్లికి చెందిన కొలగాని అంజయ్య వద్ద చిట్టీ వేసి డబ్బులు తీసుకొని డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న బాసోజి శ్రీనివాస్ను అంజయ్య చిట్టీ డబ్బులు అడిగినందుకు పథకం ప్రకారం శ్రీనివాస్, అతని కుమారుడు వేణుచారిలు కలిసి డిసెంబర్ 31న కరీంనగర్రోడ్లోని శాంసంగ్ షోరూం ప్లాజా వద్దకు అంజయ్యను పిలిపించి దాడి చేసినట్లు తెలిపారు. దీంతో అంజయ్యను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడని అన్నారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరిపై కేసు నమోదు చేసి శుక్రవారం లింగంపేట శివారులో వారిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సర్కారు బడిలో చదువు.. చక్కని కొలువు
జూలపల్లి/కాల్వశ్రీరాంపూర్: ప్రైవేట్ బడులు, కళాశాలల్లో చదివితేనే ఉన్నతంగా ఎదుగుతామనే చాలామంది భావనను పటాపంచలు చేశారు.. మంచిభవిష్యత్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నారు.. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నారు.. పట్టుదలతో చదివారు.. కఠోరంగా శ్రమించారు.. సర్కారు బడిలో చదివి ఉన్నత లక్ష్యం సాధించారు.. ఉద్యోగంలోనూ ప్రత్యేకత చాటుకుని పదోన్నతి పొందారు జూలపల్లి, కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్లు బదావత్ వనజ, పుల్లూరి జగదీశ్వర్రావు.. ఈ సందర్భంగా కథనం.. పేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపురం గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన బనావత్ దశరథ్ నాయక్ – లలిత దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముడో కూతురు వనజ. గ్రామంలోనే ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు దండేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఐటీడీఏ సహకారంతో క రీంనగర్లో డిగ్రీ(కేయూలో ఓపెన్) ఉస్మానియా రెగ్యులర్ గా పీజీ పూర్తిచేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్లో తర్ఫీదు పొందా రు. 2022 –24 వరకు యూపీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. గ్రూప్–4లో తొలిప్రయత్నంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటులో ఉద్యోగం సాధించించారు. ఆర్నెల్లకే లెక్చరర్గా ఉద్యోగం సాధించారు. లెక్చరర్గా ఉద్యోగం చేస్తూనే గ్రూప్– 2 పరీక్ష రాసి కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించారు వనజ. అంతటితో ఆగకుండా పట్టుదలతో గ్రూప్–1 పరీక్షరాసి 504.5 మార్కులు సాధించారు. రాష్ట్రంలో 38వ ర్యాంక్తో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. సీఎం నుంచి ఇటీవల ఉద్యోగ నియామకపత్రం అందుకున్నారు. వనజను మనజిల్లాకు నియమించారు. -
ఆర్ఎఫ్సీఎల్లో 5.87లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్ కర్మాగారం ప్లాంట్ సామర్ధ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నులు. ఇందులో యూరియా 2,200 మెట్రిక్ టన్నులు. తెలంగాణతోపాటు ఆరు రాష్ట్రాలకు యూరియా సరఫరా చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నులను ఉత్పత్తి చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ లక్ష్యం విధించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. వార్షిక మరమ్మతులు, సాంకేతిక కారణంగా సూమారు 84 రోజులు ప్లాంటును షట్డౌన్ చేశారు. మరమ్మతుల అనంతరం 28 సెప్టెంబర్ 2025 నుంచి 30 డిసెంబర్ 2025 వరకు ప్రతీనెల 92 శాతం యూరియా ఉత్పత్తి చేశారు. 2025–26ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 30వ తేదీ నాటికి 5.87లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేశారు. ఇక్కడ తయారు చేసిన యూరియాలో 48 శాతం తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తున్నారు. ఊపందుకున్న యాసంగి పనులు తెలంగాణ రాష్ట్రలో యాసంగి(రబీ) పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా యూరియా ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రికి వినతిపత్రం అందించారు. 100 శాతం యూరియాను తెలంగాణకే కేటాయించాలని పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో 3,26,574.03 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేశారు. యూరియా కేటాయింపులు ఇలా.. తెలంగాణ : 1,35,036.78 మెట్రిక్ టన్నులు ఆంధ్రప్రదేశ్ : 81,066.23 మెట్రిక్ టన్నులు కర్ణాటక : 47,223.74 మెట్రిక్ టన్నులు తమిళనాడు : 31,406.55 మెట్రిక్ టన్నులు మధ్యప్రదేశ్ : 16,171 మెట్రిక్ టన్నులు -
ఓటర్లు ఎక్కడెక్కడో!
‘డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరంలోని 7వ డివిజన్ పరిధిలోని హౌసింగ్బోర్డుకాలనీ, సదాశివపల్లిలో కలిపి 5,207 ఓట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ముసాయిదాలో 7వ డివిజన్ ఓటర్ల సంఖ్య నగరంలోనే అత్యధికంగా 6,846కు చేరింది. కొత్తగా ఓట్లు నమోదు చేయ డం సాధారణమే అయినా, ఏకంగా 1279 ఓట్లు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. సీతారాంపూర్, కశ్మీర్గడ్డ, షాషామహల్, బొమ్మకల్ ఓట్లు ఈ డివిజన్లో భారీగా నమోదయ్యాయి.’ ‘నగరంలోని 64వ డివిజన్ ముకరంపురలో స్థానిక ఓట్ల కన్నా, ఇతర డివిజన్ ఓటర్లు అధికంగా ఉన్నారు. వరుస క్రమంలో 400 ఓట్లను పరిశీలిస్తే కనీసం 300 ఓట్లలో తమ డివిజన్కు సంబంధం లేనివారు ఉన్నారంటూ స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 2,3 డివి జన్లకు సంబంధించిన దాదాపు వేయి ఓట్లు, 28వ డివిజన్లో నమోదయ్యాయని స్థానికులు వాపోతున్నారు’.కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ప్రచురించిన ఓటర్ల ముసాయిదా గందరగోళంగా మారింది. ఇంటినంబర్లతో డివిజన్లవారీగా రూపొందించినట్లు చెబుతున్న ఓటర్ల జాబితాలో వందలాది పేర్లు ఇంటినంబర్లు లేకుండా ఉండడం సందేహాలకు కారణమవుతోంది. డివిజన్ల పునర్విభజన సందర్భంగా ప్రకటించిన ఓట్లసంఖ్యకు తాజా జాబితాకు పొంతనలేకపోవడం, అసాధారణంగా ఓట్లు పెరగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాబితాపై అభ్యంతరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కాగా, ఈ నెల 6వ తేదీ వరకు కొనసాగనుంది. ఎక్కడెక్కడో నగరంలో ప్రకటించిన 66 డివిజన్లవారి ఓటర్ల ముసాయిదా జాబితా గందరగోళాన్ని సృష్టిస్తోంది. డివిజన్ల పునర్విభజన సందర్భంగా ఇంటినంబర్ల వారిగా ఓటర్ల వివరాలు, అసెంబ్లీ నియోజకవర్గ వారిగా ఓటర్ల జాబితా వివరాల ఆధారంగా డివిజన్ల ముసాయిదా ఓటర్ల జాబితాను రూపొందించారు. ఇంటినంబర్లను పరిశీలించి, సంబంధిత డివిజన్లో పొందపరిచినట్లు చెబుతున్నప్పటికి, చాలా మంది ఓటర్లకు సంబంధించి ఇంటినంబర్లు లేకపోవడంతో ఎలా డివిజన్కు కేటాయించారనేది తెలియడం లేదు. అసలు ఆ ఓటర్లు తమ డివిజన్కు సంబంధించిన వాళ్లే కాదంటూ ఆయా డివిజన్ల సీనియర్ నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఓటరు జాబితాలోని పోలింగ్ బూత్ల వారిగా ఓటర్లను ఆయా డివిజన్లలో చేర్చినట్లు అధికారులు అంటున్నారు. ఉన్న ఓట్లను తొలగించే అధికారం లేకపోవడంతో, ఓట్లను అన్ని డివిజన్లలో సర్దుబాటు చేయడంతో ఈ సమస్యలు తలెత్తినట్లు సమాచారం. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్లో నమోదు కావడం, జాబితాలో ఇంటినంబర్లు వరుససంఖ్యలో లేకపోవడంతో గందరగోళం మరింతగా పెరిగిపోయింది. సీతారాంపూర్, కాశ్మీర్గడ్డ, చింతకుంట, బొమ్మకల్ తదితర ప్రాంతాల ఓట్లు ఎక్కువగా ఇతర డివిజన్లో కనిపిస్తున్నాయి. పెరిగిన ఐదు వేల ఓట్లు గత ఏడాది జూన్లో డివిజన్ల పునర్విభజన సందర్భంగా నగరపాలకసంస్థలో 3,35,592 ఓట్లు ఉన్నట్లుగా డివిజన్లవారీగా అధికారులు జాబితాను ప్రకటించారు. తాజా జాబితాలో 66 డివిజన్లలో 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఆరు నెలల కాలంలో 5,183 ఓట్లు పెరగగా, అందులో కేవలం 7వ డివిజన్లోనే 1,279 ఓట్లు పెరగడం గమనార్హం 3,5,6 తదితర డివిజన్లలో మాత్రం పునర్విభజన సమయంలో కన్నా ఓట్లు తక్కువయ్యాయి. 6వ తేదీ వరకు అభ్యంతరాలు 66 డివిజన్ల ఓటర్ల జాబితాను శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. ఆయా డివిజన్లకు చెందిన మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు, నాయకులు, ఓటర్లు వచ్చి జాబితాలను పరిశీలించారు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు స్వీకరించేందుకు కార్యాలయంలో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. మొదటి రోజు నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 6వ తేదీలోగా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. -
ఆపరేషన్ టైగర్!
కరీంనగర్రూరల్/చొప్పదండి: జిల్లాను పెద్దపులి వణికిస్తోంది. కరీంనగర్ రూరల్, చొప్పదండి మండలాల్లో సంచరిస్తోందని గత ఐదు రోజులుగా వస్తున్న వార్తలు.. కనిపిస్తోన్న పాదగుర్తులు గ్రామీణ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బహుదూర్ఖాన్పేట, రుక్మాపూర్, జూబ్లీనగర్, ఆర్నకొండతో పాటు పెద్దపల్లి జిల్లా సుల్తానాపూర్ ప్రాంతాల్లో పెద్దపులి పాదగుర్తులను అటవీ అధికారులు గుర్తించారు. పులిదాడిలో బహుదూర్ఖాన్పేటలో ఆవు, జూబ్లీనగర్లో గేదె మృతి చెందినట్లు పశువైద్యులు నిర్ధారించడంతో అప్రమత్తమైన అటవీ అధికారులు ‘ఆపరేషన్ టైగర్’ మొదలు పెట్టారు. ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు... పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు కరీంనగర్ జిల్లాలో మూడు, పెద్దపల్లి జిల్లాలో మూడు ప్రత్యేకబృందాలను ఏర్పాటు చేశారు. వీరు పెద్దపులి జాడ, పాదముద్రలను గుర్తిస్తారు. శనివారం ఓ బృందం సిద్దిపేట జిల్లా నుంచి, మరో బృందం కవ్వాల్ రిజర్వు ఫారెస్ట్ నుంచి వస్తోంది. హడలెత్తిసున్న వాట్సాప్ గ్రూపులు కరీంనగర్రూరల్, చొప్పదండి మండలాల ప్రజలను పెద్దపులి భయం వెంటాడుతోంది. ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో గురువారం ఎలబోతారం, జూబ్లీనగర్, బహుదూర్ఖాన్పేట, మొగ్ధుంపూర్, ఇరుకుల్ల, ఆర్నకొండ తదితర గ్రామాల్లో పులి సంచరించిదనే ఫొటోలు, సమాచారంతో భయాందోళన నెలకొంది. శుక్రవారం జూబ్లీనగర్లో బోగొండ రాయుడుకు చెందిన గేదె పులి దాడిలో చనిపోయిందని, మాల గుట్ట ప్రాంతంలో పులి అడుగులున్నాయనే స్ధానికుల సమాచారంతో అటవీ అధికారులు పరిశీలించారు. పాదముద్రలు గుర్తించి, నాలుగైదు రోజుల క్రితం గుట్టప్రాంతంలో పులి సంచరించినట్లు ధృవీకరించారు. పులిదాడిలోనే గేదే మృతిచెందిందని పశువైద్యులు రామకృష్ణ, జ్యోత్స్యలు నిర్ధారించారు. గతనెల 28న గేదైపె దాడి చేసిన పులి జూబ్లీనగర్ నుంచి ఫకీర్పేట మీదుగా రుక్మాపూర్కు వెళ్లిందని, అక్కడి నుంచి బహుదూర్ఖాన్పేట, సుల్తాన్పూర్వైపు వెళ్లినట్లుగా భావిస్తున్నారు. ఆర్నకొండ శివారులో పులి అడుగులు? చొప్పదండి మండలం ఆర్నకొండ శివారులో పులి సంచరించినట్లు ఆనవాళ్లు వెలుగు చూశాయి. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు నుంచి జూబ్లీనగర్, రుక్మాపూర్ మీదుగా వెదురుగట్ట శివారుకు, అక్కడి వనం ద్వారా ఆర్నకొండ శివారులోని గుట్టల వద్దకు వెళ్లి పెద్దపల్లి జిల్లాలో ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పెద్దపులి సంచరించిన రుక్మాపూర్, బహుదూర్ఖాన్పేట, జూబ్లీనగర్, ఆర్నకొండ, సుల్తాన్పూర్ గ్రామాలతోపాటు సమీప ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. డీఎఫ్వో బాలమణి ఆదేశాలతో ఆయా గ్రామాల్లో సర్పంచులు దండోరా వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పులిభయంతో శుక్రవారం రాత్రి నుంచి నగునూరు– మొగ్ధుంపూర్ రహదారి, వెదురుగట్ట– బహుదూర్ఖాన్పేట, సుల్తాన్పూర్ రహదారుల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోషల్ మీడియాలో పులి గురించిన వదంతులు, ఫొటోలతో తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని చొప్పదండి ఎస్సై నరేశ్ రెడ్డి హెచ్చరించారు. -
ఎన్గల్ శివారులో చిరుత సంచారం
● భయాందోళనలో రైతులు చందుర్తి(వేములవాడ): మండలంలోని ఎన్గల్ శివారులోని లింబాద్రి ఒర్రె, శ్మశానవాటిక సమీపంంలో శుక్రవారం చిరుత పాదముద్రలను స్థానికులు గుర్తించారు. రెండు రోజుల క్రితం వేములవాడరూరల్ మండలం హన్మాజీపేట శివారులోని రైస్మిల్లు ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా వేములవాడరూరల్, చందుర్తి మండలాల సరిహద్దు ఎన్గల్ గ్రామంలో ప్రవేశించిందని గురువారం నుంచే ప్రచారం జరుగుతోంది. కాగా శుక్రవారం చిరుత పాదముద్రలను గుర్తించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. -
సకాలంలో రుణాలివ్వండి
కరీంనగర్ అర్బన్: రైతుల అవసరాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ లక్ష్మి కిరణ్ ఆదేశించారు. 2026–27కు గాను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఖరారుపై శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేడీసీసీబీ ఆధ్వర్యంలో కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించిన జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను బ్యాంకర్లు నిర్ణయించాలని సూచించారు. పంటల సాగులో ఖర్చులు పెరిగిన దృష్ట్యా గతేడాది కన్నా సేల్ ఆఫ్ ఫైనాన్స్ను కొంతవరకు పెంచాలని అభిప్రాయపడ్డారు. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు గోధుమలు, కూరగాయలు, తృణధాన్యాలు, జొన్న, రాగులు పంటలకు అధిక రుణ పరిమితిని కల్పించాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారులు తమ అభిప్రాయాలను వెల్లడించగా, రైతులకు రుణాల మంజూరు, ఫైనాన్సింగ్ విధానం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయా పంటలకు సంబంధించి పంటల సాగులో పెట్టుబడులు, ఆదాయంతో పాటు వివిధ అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందులో 20 మంది రైతులు పాల్గొని సేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచే అంశంపై అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ రావు కరీంనగర్ ఎల్డిఎం ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, పెద్దపల్లి, సిరిసిల్ల జగిత్యాల జిల్లాల నాబార్డ్ అధికారులు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులు, కేడీసీసీబీ అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ -
శనివారం శ్రీ 3 శ్రీ జనవరి శ్రీ 2026
మేడారంలో ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీలు గౌస్ఆలం, సన్ప్రీత్సింగ్, అంబర్ కిశోర్ ఝా, ఎస్పీలుమానకొండూర్ మండలం శ్రీనివాస్నగర్– జగ్గయ్యపల్లి గ్రామాల మధ్య గోదావరి నీటి పైప్లైన్ లీకై నీరు భారీ ఎత్తులో ఎగిసిపడింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ ప్రధాన పైప్లైన్ మానేరు వాగు సమీపంలో లీకేజీకి గురైంది. నీటి ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో పైపునుంచి నీరు ఎగిసిపడి, ఫౌంటేన్ను తలపించింది. నీటి ప్రవాహానికి సమీపంలోని వ్యవసాయ భూములు వరదతో నిండిపోయాయి. విద్యుత్ తీగలు ఉండటంతో అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. స్థానికుల సమాచారంతో సంబంధిత అఽధికారులు అక్కడికి చేరుకుని పైప్లైన్కు మరమ్మతు చేశారు. –మానకొండూర్రూరల్ ఎగిసిపడ్డ నీళ్లు -
కల్వర్టుపై ఆధార్కార్డుల కుప్ప
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లి శివారులోని కల్వర్టుపై ఆధార్కార్డుల కుప్పలు కలకలం రేపుతున్నాయి. దాదాపు 20కి పైగా ఆధార్కార్డులు కుప్పలుగా పడి ఉండడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా వ్యాపారులు యూరియా ఎరువుల బస్తాల కోసం తీసుకొని.. పని పూర్తికాగానే పడేసి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైన దొంగలు ఎత్తుకొచ్చి పడేసి ఉండవచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ సంఘటన స్థలంలో సుద్దాల దేవరాజు, రామడుగు పోశవ్వ, రామిడి సంజీవ్, తుమ్మల రమ్య, కటకం దేవరాజు తదితర పేర్లు ఉన్న ఆధార్కార్డులు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేపడితేనే ఎక్కడి నుంచి వచ్చాయనే విషయం తేలనుంది. -
సబ్ రిజిస్ట్రార్కు బెదిరింపులు
తిమ్మాపూర్: గ్రామ పంచాయతీ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఓ టీవీ చానెల్(సాక్షి కాదు) రిపోర్టర్తో కలిసి ఇద్దరు తిమ్మాపూర్ సబ్ రిజిస్ట్రార్ను బెదిరించారు. లేకుంటే ఏసీబీకి పట్టిస్తామని కార్యాలయంలో డబ్బులు వెదజల్లి హంగామా చేశారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిమ్మాపూర్ పంచాయతీ పరిధిలోని 6–96/4 నంబర్ గల ఇంటిని ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్ చేయాలని కసాడి కొమురయ్య, ఉప్పు రవీదర్, ఎడ్ల జోగిరెడ్డి తిమ్మాపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ కె.నిరంజన్ పై శుక్రవారం ఒత్తిడి తెచ్చారు. కుదరదని చెప్పడంతో ముగ్గురూ కార్యాలయంలో హంగామా చేశారు. డబ్బులు వెదజల్లుతూ, ఏసీబీకి పట్టిస్తామని భయపెట్టారు. దీంతో కపాడి కొమురయ్య, ఉప్పు రవీందర్, ఎడ్ల జోగిరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సబ్ రిజిస్ట్రార్ కె.నిరంజన్ ఎల్ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు ఫిర్యాదు -
ఆశావహుల సందడి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో 15 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం నగరపాలక సంస్థలు కాగా.. మిగిలినవి పురపాలికలు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు కసరత్తు ప్రారంభించడంతో మున్సిపాలిటీలలో ఎన్నికల జోష్ కనిపిస్తోంది. ఆశావహుల సందడితో పట్టణాలు, నగరాల్లో రాజకీయ సందడి నెలకొంది. నిన్నటివరకు పల్లెపోరు కారణంగా పట్టణాల్లో మౌనంగా ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు రంగంలోకి దిగారు. బల్దియాల పరిధిలో ప్లెక్సీలు వెలుస్తుండటంతో ఎన్నికల హడావుడి మొదలైనట్లే అనిపిస్తోంది. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డు, డివిజన్లోనూ తానే అభ్యర్థిని అన్నట్టు ఆశావహుల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా శుభాకాంక్షల బ్యానర్లు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏకాదశి, కొత్త ఏడాది, సంక్రాంతి వంటి పండుగలను వేదికగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆశావహులు పోటీపడుతున్నారు. శుభాకాంక్షలతో పాటు పరిచయం పెంచుకోవడం అనే వ్యూహంతో ఇంటింటికీ తిరుగుతూ నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు పంచుతూ.. తమ ఉనికిని గుర్తు చేస్తున్నారు. ఇది కేవలం పండుగల శుభాకాంక్షలు మాత్రమే కాకుండా.. రాబోయే ఎన్నికలకు రిహార్సల్లా మారింది. పార్టీలకు ప్రతిష్టాత్మకం ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆటుపోట్లను చవిచూసిన పార్టీలు.. మున్సిపల్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాయి. అధికార కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బల్దియాల్లో పాగా వేసేందుకు ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే పక్కాప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి జోష్ మీదున్న అధికార కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికలపైనా ధీమాగా ఉంది. గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ కూడా మున్సిపాలిటీల్లో తామేం తక్కువ కాదన్నట్లు వ్యూహాలకు పదును పెడుతోంది. ఇక బీజేపీ పంచాయతీ ఎన్నికలో ఊహించిన దానికన్నా ఎక్కువ బలం పెంచుకుని మున్సిపాలిటీలపై కన్నేసింది. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆశావహుల గల్లీ బాట ఆయా పార్టీల్లో టికెట్లు ఆశించి.. పోటీ చేసే ఆశావహులు గల్లీల బాట పట్టారు. ఉదయం ఆలయ దర్శనాలు.. మధ్యాహ్నం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం.. సాయంత్రం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు. ఇదే రోజువారీ షెడ్యూల్గా మారింది. ప్రజల సమస్యలు వింటూ.. చిన్నచిన్న హామీలు ఇస్తూ తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడేలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. పార్టీ పెద్దల కంట్లో పడేందుకు చేస్తున్న తాపత్రయం మరోస్థాయికి చేరుతోంది. జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే దానిపై ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు ప్రజల్లో బలం చూపించాలి. మరోవైపు పార్టీ హైకమాండ్కు నమ్మకం కలిగించాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించేందుకు వారు విశేషంగా శ్రమిస్తున్నారు. కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో ముందుండగా.. మరికొందరు సేవా కార్యక్రమాలతో ప్రత్యేకతను చాటుకుంటున్నారు.బల్దియా వార్డులు జనాభా ఎస్టీ ఎస్సీ కరీంనగర్ 66 3,28,870 5,999 36,902 (కార్పొరేషన్) రామగుండం 60 2,37,636 4,278 50,744 (కార్పొరేషన్) ధర్మపురి 15 17,423 200 2,079 జగిత్యాల 50 83,168 547 5,229 కోరుట్ల 33 69,479 342 6,467 మెట్పల్లి 26 54,042 504 5,819 రాయికల్ 12 15,308 179 1,766 చొప్పదండి 14 16,459 205 3,062 హుజూరాబాద్ 30 34,555 309 6,326 జమ్మికుంట 30 39,476 286 7,623 మంథని 13 18,282 208 2,513 పెద్దపల్లి 36 50,762 312 4,527 సుల్తానాబాద్ 15 19,772 309 2,561 సిరిసిల్ల 39 92,091 104 6,346 వేములవాడ 28 43,620 453 6,545ప్రభుత్వపరంగా ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా కీలకంగా మారాయి. కరీంనగర్, రామగుండం కమిషనరేట్లతోపాటు జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లోని పురపాలికల ఎన్నికలపై ప్రజల అభిప్రాయం, స్థానిక సమస్యలు, అధికార పార్టీపై ఉన్న సంతృప్తి.. లేదా అసంతృప్తి వంటి అంశాలను సేకరించేందుకు యంత్రాంగం రంగంలోకి దిగింది. తొలి విడత సర్వే పూర్తయ్యిందని, రెండో విడతకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక, వ్యూహాల రూపకల్పన చేయనున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఆయా పార్టీలు ప్రైవేటు సర్వేలు చేయిస్తున్నాయి. కొన్ని సర్వే సంస్థలతో వార్డులు, డివిజన్లలో సర్వేలు చురుకుగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. రాజకీయంగా మాత్రం వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఆశావహుల సందడి, పార్టీ వ్యూహాలు, ప్రభుత్వ సర్వేలు.. ఇవన్నీ చూస్తుంటే ఎన్నికల సమరం మొదలైనట్టే అనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. -
నగర ఓట్లు 3,40,775
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఓటర్ల లెక్కతేలింది. నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగరంలోని 66 డివిజన్లకు సంబంధించి ముసాయిదా జాబితాను గురువారం రాత్రి నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్ విడుదల చేసి, కార్యాలయంలోని నోటీసు బోర్డుపై స్వయంగా అంటించారు. పునర్విభజన ఆధారంగా.. నగరంలోని డివిజన్ల పునర్విభజన ఆధారంగా పోలింగ్ బూత్ల ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించారు. గతంలో 60 డివిజన్లతో ఉన్న నగరపాలకసంస్థలో బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు, కొత్తపల్లి మున్సిపాల్టీని విలీనం చేయడం తెలిసిందే. గ్రామాలు, మున్సిపాల్టీ విలీనంతో 66 డివిజన్లుగా పునర్విభజించారు. మున్సిపల్ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్ల జాబితా సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నగరంలో గత డిసెంబర్ 30 నుంచి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రారంభించారు. మూడురోజుల కసరత్తు అనంతరం 66 డివిజన్ల ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురించారు. ఈ జాబితాపై అభ్యంతరాలను కూడా స్వీకరించనున్నారు. జాబితాలపై ఈ నెల 5న నగరపాలకసంస్థ స్థాయిలో, 6న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి, 10న తుది జాబితా ప్రకటించనున్నారు. మహిళలే కాస్త ఎక్కువ నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 3,40,775 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,69,763 కాగా, మహిళలు 1,70,969 మంది ఉన్నారు. పురుషుల కన్నా 1,206 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. డివిజన్ల వారీగా చూస్తే అత్యధికంగా 7వ డివిజన్ హౌసింగ్ బోర్డ్డు కాలనీ, సదాశివపల్లిలో 6,486 ఓట్లు ఉండగా, తక్కువగా 14వ డివిజన్లో 4,210 ఓట్లు ఉన్నాయి. రాత్రి వరకు కుస్తీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణలో పట్టణ ప్రణాళిక అధికారులు రాత్రి వరకు కుస్తీ పట్టారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం గురువారం ముసాయిదా జాబితా ప్రకటించాల్సి ఉంది. సాయంత్రానికి జాబితాను నోటీసు బోర్డుపై అంటిస్తారనే సమాచారంతో మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు పెద్ద సంఖ్యలో బల్దియా కార్యాలయానికి చేరుకున్నారు. కానీ, గంటల కొద్ది వేచి చూసినా జాబితా విడుదల కాలేదు. రాత్రి 7 గంటలకు కమిషనర్ నోటీసు బోర్డుపై జాబితాను అంటించగా, రాత్రి 9 గంటలకు వరకు నోటీసుబోర్డు నుంచి ఆ కాగితం కూడా మాయమైంది. చివరకు రాత్రి 11 గంటలకు డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు.పురుషులు 1,69,763, సీ్త్రలు 1,70,969 ఇతరులు 43, మొత్తం 3,40,775బల్దియాలో న్యూ ఇయర్ వేడుకలునగరపాలకసంస్థ కార్యాలయంలో గురువారం నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు నిర్వహించారు. కమిషనర్ ప్రపుల్దేశాయ్ కేక్కట్ చేసి స్వీట్లు పంపిణి చేశారు. ఈ సందర్భంగా నగర ప్రజలకు కమిషనర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కమిషనర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ కమిషనర్లు ఖాదర్ మొహియొద్దిన్, వేణుమాధవ్, ఎస్ఈ రాజ్కుమార్, డీసీపీ బషీర్, ఏసీపీలు వేణు, శ్రీధర్, డీఈలు వెంకటేశ్వర్లు, ఓంప్రకాష్, లచ్చిరెడ్డి, ఆర్వోలు భూమానందం తదితరులు పాల్గొన్నారు. కాగా కాంట్రాక్టర్ల సంక్షేమ సంఘం నాయకులు కమిషనర్కు శుభాకాంక్షలు తెలిపారు. -
281 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
కరీంనగర్క్రైం: నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో 281 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసి వారి వాహనాలు సీజ్ చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ వ్యాప్తంగా సరైన ధ్రువపత్రాలు లేని 224 వాహనాలను సీజ్ చేశారు. ఈ చలాన్ల రూపంలో 1,267 వాహనాలకు రూ.6.24 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల భద్రత కోసం వేకువజాము వరకు పనిచేసిన పోలీసు సిబ్బందికి సీపీ అభినందనలు తెలిపారు. కేక్కట్ చేసిన సీపీ నూతన సంవత్సరం సందర్భంగా కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ ఆలం కేక్ కట్ చేసి అందిరికీ శుభాకాంక్షలు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రమాద రహితమే లక్ష్యం కావాలితిమ్మాపూర్(మానకొండూర్): ప్రమాదరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే డ్రైవర్ల లక్ష్యం కావాలని కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ (డీటీసీ) పురుషోత్తం అన్నారు. ఈనెల 1 నుంచి 31 వరకు నిర్వహించనున్న జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను గురువారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, దరఖాస్తుదారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటిని నియంత్రించేందుకు రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరిమితికి మించి వ్యక్తులను రవాణా చేయొద్దని, హెల్మెట్, లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలను నడపవద్దని సూచించారు. జిల్లాలో వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐలు స్రవంతి, హరిత, ఏవో అశోక్ తదితరులు పాల్గొన్నారు.అంకితభావంతో పనిచేయాలికొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సంస్థకు మంచి గుర్తింపు తీసుకురావాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం విద్యుత్ ఉద్యోగులు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, వివిధ యూనియన్ల ప్రతినిధులు ఎస్ఈకి శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయాలను వినియోగించుకోవాలికరీంనగర్కల్చరల్: విజ్ఞాన సముపార్జనకు గ్రంథాలయాలు ఎంతో ఉపకరిస్తాయని, వాటని ప్రతిఒక్కరూ వినియోగించుకుని మేధావులుగా ఎదగాలని గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం పిలుపునిచ్చారు. గురువారం కరీంనగర్ రెవెన్యూక్లబ్ను సందర్శించి మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు అవసరమైన పుస్తకాలు, దినపత్రికలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. జిల్లావ్యాప్తంగా గ్రంథాలయాలను విస్తరించేందుకు ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మొసం అంజయ్య, క్లబ్ అధ్యక్షుడు విజయ్, ఏవో సుధాకర్ తదితరులున్నారు. -
హ్యాపీ న్యూ ఇయర్ మేడమ్
కరీంనగర్అర్బన్: కొత్త సంవత్సరం సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ డా.అశ్విని తానాజీ వాకడేకు శుభా కాంక్షలు వెల్లువెత్తాయి. ఉద్యోగ సంఘాల నేతలు పుష్పగుచ్ఛాలు అందజేశారు. టీఎన్జీవోల భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి ఉ ద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్తో పాటు మున్సిపల్ క మిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, కలెక్టరేట్ ఏవో సుధాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంగెం లక్ష్మణరావు, కిరణ్కుమార్రెడ్డి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్రెడ్డి, సర్దార్ హర్మిందర్సింగ్, గంగారపు రమేశ్, ఒంటెల రవీందర్రెడ్డి, నల్ల వెంకటరెడ్డి, విజయ్, మారుపాక రాజేశ్భరద్వాజ్, వాస్తవిక్గౌడ్, శ్రీమాన్రెడ్డి, ఇరుమల్ల శారద, సబిత, సునీత, హరిప్రియ, శైలజ, స్వర్ణలత, సుస్మిత, మన్మిట్, రాజేశ్వరరావు, అక్బర్, అస్గర్, శంషాద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోట రామస్వామి, శంకర్ టీఎన్జీవో నాయకులు కామ సతీష్, గిరిధర్రావు, పట్టం శ్రీనివాస్, బోనాల రవి, నారాయణ, జీవన్రెడ్డి, సాయి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పరస్పరం అలాయ్ బలాయ్తో ఆత్మీయతను పంచుకున్నారు. -
రూ.26.4 కోట్లు తాగేశారు!
కరీంనగర్క్రైం: నూతన సంవత్సరం పేరిట మద్యం ప్రియులు తెగతాగేశారు. వేడుకల సందర్భంగా రూ.26.4 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. జిల్లావ్యాప్తంగా కరీంనగర్ టౌన్లో 21, రూరల్లో 24, తిమ్మాపూర్ సర్కిల్ 14, హుజురాబాద్ సర్కిల్ 17, జమ్మికుంట సర్కిల్లో 16 మద్యం దుకాణాలు ఉన్నాయి. దీంతో పాటు 33 బార్లు ఉండగా వీటన్నింటిలో కలిపి కొత్త సంవత్సరం సందర్భంగా సుమారు రూ.26.4 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. 36,440 కాటన్ల మద్యం, 38,661 కాటన్ల బీర్లు కేవలం నయా జోష్లోనే మద్యం ప్రియులు తాగేశారు. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినా తగిన జాగ్రత్తలు తీసుకొని మరి కుమ్మేయడంతో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. -
శరవేగంగా సమీకృత కలెక్టరేట్
కరీంనగర్అర్బన్: నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప లుమార్లు గడువు మీద గడువు పొడిగించిన కలెక్టర్ తాజాగా సంక్రాంతికి ప్రారంభించేందుకు సన్నాహా లు చేస్తున్నారు. యుద్ధప్రతిపాదికన కారిడార్, కార్యాలయాల్లో ఫర్నీచర్, తదితర పనులు చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పక్కా సమాచారం. ఈ క్రమంలో దాదాపు 80శాతం పనులు పూర్తవగా మరో 12 రోజుల్లో కార్యాలయ సముదాయం అందుబాటులోకి రానుంది. ఆగుతూ.. సాగిన పనులు వాస్తవానికి నూతన కలెక్టరేట్ 2022 డిసెంబర్లోగా అందుబాటులోకి రావాల్సి ఉండగా ప్రభుత్వం మారడంతో పనులు మందగించి బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగింది. రాష్ట్రమంతటా దాదాపు అన్ని కలెక్టరేట్లు కొత్త కార్యాలయాల సముదాయాల్లో సేవలందిస్తుండగా కరీంనగర్ కలెక్టరేట్ మాత్రమే పాత భవనంలో సేవలందిస్తోంది. క్యాంపు కార్యాలయాలు పాతవాటినే వినియోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గత ప్రభుత్వం నూతన కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. 2021లో అప్పటి బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రూ.51కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 2022 డిసెంబర్లోగా పనులు పూర్తవ్వాల్సి ఉండగా గుత్తేదారు నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపం వెరసి నూతన భవనం అందని ద్రాక్షగా మారింది. తప్పనున్న అద్దెల భారం ఏడాదిలోగా నిర్మాణ పనులు పూర్తవుతాయని భావించగా ఏళ్ల తరబడి జాప్యం జరగడం అద్దెల భారం తప్పడం లేదు. మొత్తం 43 శాఖలు కలెక్టరేట్లోనే విధులు నిర్వహించగా నాలుగైదు శాఖలు అద్దె భవనాల్లో ఉండేవి. కాగా కలెక్టరేట్ సగ భాగం కూల్చివేతతో 15 విభాగాల వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో అద్దె భవనాల్లో సేవలందిస్తున్నాయి. సదరు విభాగాలకు ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దె భారం పడుతుండగా నిర్మాణం సాగదీస్తుండటంతో అదనపు భారం తప్పడం లేదు. నూతన కార్యాలయాలు అందుబాటులోకి వస్తుండగా రూ.లక్షల అద్దెల భారం తప్పనుంది. కూల్చివేత లేనట్టే 2016 అక్టోబర్కు ముందు ఉమ్మడి జిల్లాకేంద్రంగా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి ప్రాంతాలకు ఇక్కడి నుంచే పరిపాలన సాగేది. జిల్లాల విభజనతో నూతన జిల్లాల్లో కలెక్టర్ల నిర్మాణాలు పూర్తవగా కరీంనగర్లో మాత్రం ఇంకా అసంపూర్తే. అయితే లక్షన్నర చదరపు అడుగులు ఉండాలన్న ఆదేశాల క్రమంలో హెలిప్యాడ్ స్థలాన్ని కలెక్టరేట్ కోసమే సేకరించారు. హెలిప్యాడ్ స్థలం 8ఎకరాల వరకు ఉండడం 18 ఎకరాలకు పైగా ప్రస్తుత కలెక్టరేట్ ఉందని అధికారుల అంచనా. కాగా కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి 2018 మే లో రూ.51కోట్లు మంజూరు చేశారు. ఇంజినీరింగ్ విభాగం నిపుణులు మరికొంతకాలం భవన నాణ్యతకు ఢోకా లేదని నివేదించడంతో అప్పుడు బ్రేక్ పడింది. క్రమేణా ప్రభుత్వం, యంత్రాంగం సమాలోచనల క్రమంలో 2021లో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే 1981లో అప్పటి కలెక్టర్ శర్మ హయాంలో ప్రస్తుత కలెక్టరేట్ నిర్మాణం జరగగా 12ఏళ్ల క్రితం కెమికల్ కోటింగ్తో మరమ్మతులు చేశారు. అయినా ఊరుపులు, పెచ్చులూడటం జరుగుతూనే ఉంది. పాత కలెక్టరేట్ను సగభాగమే కూల్చివేసి నిర్మాణ పనులు తుది దశకు చేరగా మిగతా సగ భాగం కలెక్టరేట్ను అలాగే కొనసాగించనున్నట్లు సమాచారం. -
రుక్మాపూర్లోనూ పులి అడుగులు
చొప్పదండి: జిల్లాలో హాట్ టాపిక్గా మారిన పులి సంచారం మండలంలోని రుక్మాపూర్కు చేరింది. రుక్మాపూర్ శివారులోని పొలం గట్లపై పులి సంచరించిన ఆనవాళ్లను స్థానిక రైతులు బుధవారం గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ షౌకత్ హుస్సేన్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పులి అడుగులను సేకరించారు. రుక్మాపూర్ నుంచే పయనం..! రుక్మాపూర్ శివారు నుంచే పులి వెదురుగట్ట వైపు వెళ్లిందని ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితమే ఈ గ్రామంలో సంచరించినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. పులి అడుగులు రుక్మాపూర్లో తూర్పు వైపు ఉండడంతో అది వెదురుగట్ట శివారుకు వెళ్లి ఉంటుందని చెబుతున్నారు. వెదురుగట్ట, బహుద్దూర్ఖాన్పేట నుంచి పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ గ్రామం మీదుగా ఆ జిల్లాలో ప్రవేశించిందని అనుమానాలు బలపడుతున్నాయి. కాగా, రుక్మాపూర్ నుంచి కరీంనగర్ పట్టణం వైపు పులి వెళ్లి ఉండవచ్చని అనుమానించినా, దాని అడుగుల గుర్తుల ప్రకారం పెద్దపల్లి జిల్లాకు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. పెద్దపల్లి డీఎఫ్వో శివయ్య ఈ మేరకు మండలంలో పర్యటించి పులి అడుగులు ఎటువైపు పడ్డాయని పరిశీలించారు. అయితే పులి సంచరిస్తున్నట్లు అనుమానాలు నిజమవడంతో రైతులు ఉదయం, సాయంత్రం వేళల్లో జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు. ఉదయం 7 గంటల వరకు, సాయంత్రం 5 గంటల తర్వాత వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లరాదని, ఒక వేళ వెళ్తే గుంపుగా వెళ్లడమే మంచిదని సూచించారు. ఇక్కడి నుంచే వెదురుగట్ట శివారుకు.. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లాకు వెళ్లినట్లు భావిస్తున్న అధికారులు -
పులి కనిపించిందని పుకార్లు
మండలంలోని రుక్మాపూర్, కాట్నపల్లి గ్రా మాల మధ్య పులి కని పించిందని ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది. కారులో వెళ్లేవారు ఫోన్లో బందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రుక్మాపూర్లో డప్పు చాటింపు కూడా చేయించడం గమనార్హం. అటవీశాఖ అధికారులు ఓ వైపు పెద్దపల్లి జిల్లాకు పులి వెళ్లినట్లు అనుమానిస్తుండగా, గ్రామాల్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. పులి ఆనవాళ్లు కనిపిస్తున్నా, అది ఎక్కడ సంచరిస్తోందో పూర్తి సమాచారం వస్తే గానీ ఈ పుకార్లకు పుల్స్టాప్ పడే అవకాశం లేదు. -
పొరపాట్లు లేకుండా మ్యాపింగ్ చేయాలి
కరీంనగర్ కార్పొరేషన్: ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ఈ మ్యాపింగ్ చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. బుధవారం బల్దియా కార్యాలయంలోని సమావేశ మందిరంలో 66 డివిజన్లకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ ఆన్లైన్ ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ పోర్టల్లో ఓటర్ల డేటాను పొందుపరుస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఇచ్చిన డేటాలో డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ల ప్రకారం పొందుపరచాలని సూచించారు. ప్రతీ ఓటర్ డేటాను ఒకటికి రెండుసార్లు పరిశీలించి, ఈ మ్యాపింగ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్, టౌన్ప్లానింగ్ ఏసీపీలు వేణు, శ్రీధర్, టీపీఎస్లు తేజస్విని, సంధ్య తదితరులు ఉన్నారు. నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్ -
రికార్డులన్నీ సమర్పించాలి
చిగురుమామిడి(హుస్నాబాద్): పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు చేపట్టిన పనులకు సంబంధించి పూర్తిస్థాయి రికార్డులు ఇవ్వనందున డీఆర్డీవో శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేదికలో 16వ విడత ఈజీఎస్, సామాజిక ప్రజావేదిక సదస్సును ఎంపీడీవో విజయ్కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ, వచ్చే సోషల్ ఆడిట్లోపు పంచాయతీరాజ్ విభాగానికి సంబంధించి పనుల రికార్డులు మొత్తం సబ్మిట్ చేయాలని ఆదేశించారు. రూ.46,039 వేల విలువగల పనుల ప్రొసీజర్ ల్యాప్స్ అయ్యాయని, ఇలాంటివి పునరావృతం కావొద్దన్నారు. అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ వెంకటేశ్వర్రెడ్డి, అంబుడ్స్మెన్ లక్ష్మీనారాయణ, ఎస్ఆర్పీ తిరుపతి పాల్గొన్నారు. -
పోలీసులకు సేవా పతకాలు
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే శౌర్య, మహోన్నత, ఉత్తమ, కఠిన సేవ, సేవా పతకాలను అధికారికంగా ప్రకటించింది. విధి నిర్వహణలో అత్యంత ప్రతిభ, అంకితభావం, అసమానమైన సేవలందించిన అధికారులకు గౌరవం దక్కింది. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్కు చెందిన పలువురు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది పెద్ద సంఖ్యలో పతకాలు సాధించి కమిషనరేట్ కీర్తిని చాటారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావుకు మహోన్నత సేవా పతకాలు వచ్చాయి. ఉత్తమ సేవా పతకాలు వచ్చినవారిలో సీటీసీ ఎస్సై, ఎస్బీ ఎస్సై ఎస్.శ్రీనివాస్, సీసీఆర్బీ హెడ్కానిస్టేబుల్ ఇ.చుక్కారెడ్డి ఉన్నారు. కఠిన సేవాపతకాలు వచ్చినవారిలో హుజురాబాద్ టౌన్ సీఐ టి.కరుణాకర్, ఎస్బీ సీఐ వి.శ్రీనివాస్, వన్టౌన్ ఎస్సై ఎ.సత్యనారాయణ, ఏఎస్సైలు ఖాజాజమాలుద్దీన్, సయ్యద్పాషా, టి.మనోజ్కుమార్, ఆర్.సమ్మయ్య, ఎన్.దామోదరచారి, గోలాడ సదయ్య, ఎండీ అంకుషావలి, హెడ్కానిస్టేబుళ్లు పి.శ్రీనివాస్, పి.చంద్రమౌళి, పి.శ్రీరాములు, బి.అంజయ్య, ఇ.తిరుపతి, ఎండీ ఖాజాఅజీముద్దీన్, టి.కై లాస్సింగ్, బి.రవీందర్రెడ్డి, సీహెచ్ ఆంజనేయులు, ఎస్.రామచందర్, ఎం.మల్లయ్య, ఎండీ సుల్తాన్ సలావుద్దీన్ ఉన్నారు. కానిస్టేబుళ్లలో పి.కొమురయ్య, బి.సత్యనారాయణ, జి.అంజయ్య, కె.లింగారెడ్డి పతకాలు సాధించారు. పతకాలు సాధించిన అందరినీ సీపీ గౌస్ ఆలం అభినందించారు. ఎస్.శ్రీనివాస్ ఎస్సై వెంకటరమణ, అద నపు డీసీపీ (అడ్మిన్) భీంరావు, అదనపు డీసీపీ (ఏఆర్) -
రోడ్డు ప్రమాదంలో కోమాలోకి కూలి
బోయినపల్లి(చొప్పదండి): మండలకేంద్రానికి చెందిన బొడ్డు పర్శరాములు రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లడంతో వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు. అతడిది పేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బు లేక దాతల సాయం కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. పర్శరాములు సుతారి పని చేసేవాడు. భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కొడుకు పుట్టుకతో దివ్యాంగుడు. రెండురోజుల క్రితం పర్శరాములు అతని భార్య బైక్పై కరీంనగర్ నుంచి ఇంటికి వెళ్తుండగా, బావుపేట వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరూ కిందపడ్డారు. పర్శరాములు తలకు తీవ్రగాయం కావడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా మెదడులో బోన్స్ విరిగి రక్తస్రావం కావడంతో ఆపరేషన్ చేశారు. రెండు రోజులకే రూ. 2 లక్షలు అయ్యాయి. బాధితుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. చికిత్సకు రూ.8 లక్షల వరకు డబ్బు కావాలి. బోయినపల్లి గ్రామ యువకులు వాట్సప్ గ్రూప్లో పెట్టిన పోస్టుకు స్పందించి పలువురు దాతలు సుమారు రూ.50 వేల వరకు సాయం చేశారు. సాయం చేసే దాతలు 94416 13675, 89191 85545 నంబర్లలో సంప్రదించాలని బాధితులు కోరారు. రూ.8 లక్షల మేర ఆస్పత్రి ఖర్చులు ఆదుకోవాలని కోరుతున్న కుటుంబీకులు -
ముక్కోటి మొక్కులు
ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తున్న మార్కెట్రోడ్డు స్వామివారుమహాశక్తి ఆలయంలో కేంద్రమంత్రి సంజయ్ పూజలుముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివ, కేశవ నామస్మరణలతో మార్మోగాయి. ఉత్తరద్వారం ద్వారా స్వామివార్లు దర్శనమిచ్చారు. నగరంలోని మార్కెట్రోడ్డు వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి శేషవాహనం అలంకరణ చేయగా, ఉదయం 3 గంటల నుంచే భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారు. జిల్లా జడ్జి శివకుమార్, దేవాదాశాఖ సహాయ కమిషనర్ సుప్రియ, కాంగ్రెస్ నగర అర్బన్ అధ్యక్షుడు అంజన్కుమార్ పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్, ఈవో కె.సుధాకర్ పాల్గొన్నారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. – కరీంనగర్కల్చరల్ మంకమ్మతోటలో భక్తుల క్యూహారతి తీసుకుంటున్న భక్తులు -
కొత్తవార్డులు ఏర్పాటు కాలేదట
● సమాచారం ఇవ్వలేక అధికారుల తప్పులు సాక్షి ప్రతినిధి,కరీంనగర్: నగరంలో కొత్తగా వార్డులు ఏర్పాటు కాలేదట. సమాచార హక్కుచట్టం ద్వారా సామాజిక కార్యకర్త అడిగిన సమాచారానికి నగరపాలకసంస్థ అధికారులు ఇచ్చిన సమాధానం ఇది. నగరంలో కొత్తగా ఏర్పడిన 52వ డివిజన్ పరిధిలోని అధికారిక ఇంటినంబర్ల వివరాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త అన్నెమల్ల సురేశ్ ఈ ఏడాది సెప్టెంబర్లో ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. సీడీఎంఏ వెబ్సైట్ను చూసుకోవాలని అధికా రులు సమాధానం ఇచ్చారు. దీనిపై సురేశ్ అప్పీల్కు వెళ్లగా, అసలు కొత్తగా వార్డులే ఏ ర్పాటు కాలేదని సమాధానమిచ్చారు. నగరంలోని 60 డివిజన్లను 66 డివిజన్లుగా పునర్విభజన చేస్తూ జూన్ 21వ తేదీన, జీఓ నంబరు 144 ఉత్తర్వులు జారీ చేయడం తెలిసిందే. అధికారులు నిర్లక్ష్యపు సమాధానంతో పాటు, అసలు సమాచారమే తప్పుగా ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్టీఐ ద్వారా అడిగిన సమాచారం నగరపాలకసంస్థ అధికారులు ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని సామాజిక కార్యకర్త అన్నెమల్ల సురేశ్ విమర్శించారు. వెబ్సైట్లో ఉన్న సమాచారం అధికారికంగా ధృవీకరించబడిన రికార్డు కాదని, ప్రాపర్టీ టాక్స్, అసెస్మెంట్ రిజిస్టర్ ఆధారంగా ఉన్న అధికారిక ఇంటి నంబర్ల వివరాలే కావాలని తాను స్పష్టంగా కోరానన్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో తాను ఫస్ట్ అప్పీల్ (ఎఫ్ఏఏ) దాఖలు చేయగా, మున్సిపల్కార్పొరేషన్లో కొత్త డివిజన్లు ఏర్పాటు చేయలేదని సమాధానం ఇచ్చారన్నారు. ఓ వైపు 66 డివిజన్లుగా పునర్విభజించి, మరో వైపు అసలు డివిజన్ల పునర్విభజనే లేదని సమాధానం ఇవ్వడం నగరపాలకసంస్థ పనితీరును తెలియజేస్తోందన్నారు.వేగంగా నేరాల దర్యాప్తుకరీంనగర్క్రైం: పోక్సో చట్టం కింద నమోదైన, మహిళలకు చెందిన నేరాల కేసుల్లో దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. మంగళవారం కమిషనరేట్లో నిర్వహించిన నేర సమీక్షలో పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చే ఆన్లైన్ ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ఎన్డీపీఎస్ కేసులు, ఇసుక అక్రమ రవాణా, పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్పై కఠినంగా వ్యవహరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు ముమ్మరం చేయాలని, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సక్రమంగా నిర్వహించాలని సూచించారు. డిసెంబర్ 31న జరిగే వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజావాణికి దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్, అదనపు డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు శ్రీనివాస్, మాధవి, విజయకుమార్, వెంకటస్వామి, సతీశ్కుమార్ పాల్గొన్నారు. నల్లా సర్వే పూర్తి చేయాలికరీంనగర్ కార్పొరేషన్: నగరంలో చేపట్టిన నల్లా కనెక్షన్ల సర్వేను జనవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, వార్డు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. జనవరి 10వ తేదీ లోగా అసెస్మెంట్ నంబర్ ప్రకారం వార్డు అధికారులు ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్ సర్వే పూర్తి చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న నల్లా కనెక్షన్ కమర్షియలా? రెసిడెన్షియల్ నల్లానా అనేది పరిశీలించాలన్నారు. అక్రమ నల్లా కనెక్షన్లను తనిఖీ చేయడంతో పాటు నల్లా కనెక్షన్ సైజ్, నల్లా బిల్లుల బకాయిలతో పాటు ఇచ్చిన 26 కాలమ్స్ ఫార్మాట్లో వివరాలను సేకరించాలన్నారు. నల్లా కనెక్షన్కు మాన్యువల్ బుక్లేకున్నా, ఆన్ లైన్ ట్యాన్ నంబర్ లేకున్నా అక్రమ నల్లాగా గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. రెసిడెన్షియల్ నల్లా పొంది కమర్షియల్గా వాడినా, ట్యాప్ సైజ్ ఎక్కువగా ఉన్నా గుర్తించి నోటీసులు జారీ చేయాలన్నారు. ఆస్తి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్పీడీసీఎల్ కమర్షియల్ మీటర్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్లు, ఖాధర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, సహాయ కమిషనర్ దిలీప్, ఎస్ఈ రాజ్కుమార్, ఏసీపీ వేణు పాల్గొన్నారు. -
మున్సిపల్ కసరత్తు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నగరపాలకసంస్థలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ మొదలైంది. నగరంలోని 66 డివి జన్లకు సంబంధించిన ఓటర్ల జాబితాను పోలింగ్ బూత్ల ప్రకారం రూపొందించే పనిలో నగరపాలకసంస్థ అధికారులు నిమగ్నమయ్యారు. జనవరి 1వ తేదీన డివిజన్లవారీగా ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇవ్వాల్సి ఉండడంతో, పెద్దసంఖ్యలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సవరణకు కుస్తీ పడుతున్నారు. ప్రక్రియ వేగవంతం సర్పంచ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి పెట్టడం తెలిసిందే. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల, పోలింగ్బూత్ల తయారీ ప్రక్రియను ప్రారంభించింది. ఓటర్ల జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం కొత్త సంవత్సరం 1వ తేదీన డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ను ప్రచురించాల్సి ఉంది. గడువుకు కేవలం రెండు రోజులే సమయం ఉండడంతో, నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు డ్రాఫ్ట్ రూపొందించేందుకు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మంగళవారం తమ పని ప్రారంభించారు. డీలిమిటేషన్, ఓటర్ల జాబితా ఆధారంగా నగరపాలకసంస్థ పరిధి విస్తరించడం, ఆరు గ్రామాలు, ఒక మున్సిపాలిటీ విలీనం కావడంతో నగరంలోని పాత డివిజన్లు మారిపోవడం తెలిసిందే. అప్పటికే ఉన్న 60 డివిజన్ల విలీనం అనంతరం 66 డివిజన్లుగా పునర్విభజించారు. దీంతో అన్ని డివిజన్ల సరిహద్దులు మారాయి. కొత్తగా పునర్విభజించిన 66 డివిజన్లకు అనుగుణంగా పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ల జాబితాను, ఈ– మ్యాపింగ్ 1వ తేదీలోగా రూపొందించనున్నారు. ఎన్నికల సంఘం తయారు చేసిన ఓటర్ల జాబితాను, పునర్విభజన జాబితాను ఆధారంగా తీసుకొని కొత్తగా డివిజన్లవారీగా ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. ఎన్నికల సంఘం ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లు, ఇంటినంబర్ల ఆధారంగా, పునర్విభజన డివిజన్లలో ఉన్న ఇంటినంబర్లు, పేర్లతో సరిపోల్చుకొని, పోలింగ్బూత్ల వారీగా 66 డివిజన్ల ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. 1వ తేదీన ప్రచురించే ఓటర్ల డ్రాఫ్ట్పై అభ్యంతరాలు, పరిష్కారం అనంతరం జనవరి 10వ తేదీన డివిజన్లవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. డివిజన్లవారీగా జాబితా సిద్ధం చేయాలి డివిజన్లవారీగా పోలింగ్బూత్ల ప్రకారం ఓటర్ల జాబితాను రూపొందించాలని నగర పాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. మంగళవారం నగరపాలకసంస్థ సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై పలు సూచనలు చేశారు. ఇచ్చిన ఓటరు జాబితా, డీలిమిటేషన్ డివిజన్ల ప్రకారం కొత్త ఓటర్ల జాబితా మ్యాపింగ్ చేయాలన్నారు. -
బుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బాబోయ్ బెబ్బులికరీంనగర్రూరల్/చొప్పదండి: జిల్లాలో పెద్దపులి సంచరిస్తోందనే ప్రచారంతో గ్రామీణ ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం ఉదయం 9గంటలకు కరీంనగర్రూరల్ మండలం బహుదూర్ఖాన్పేట, చొప్పదండి మండలం వెదురుగట్ట శివారు ప్రాంతాల్లో పులి అడుగులు కన్పించాయనే రైతుల సమాచారంతో అటవీ, పోలీస్శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు. జిల్లా అటవీ అధికారి బాలమణి, రేంజ్ అధికారులు షౌకత్ హుస్సేన్, షౌకత్ అలీ ఆధ్వర్యంలో రైతులు గుర్రం వెంకట్రెడ్డి, చొక్కారెడ్డి పొలం ఒడ్డుపై ఉన్న అడుగులను పరిశీలించి, పులి పాదాలుగా నిర్ధారించారు. పొలం సమీపంలోని మొక్కజొన్న చేనులో పులి ఉందనే రైతుల సమాచారంతో డ్రోన్ కెమెరాలతో పరిశీ లించగా.. ఆనవాళ్లు కన్పించలేదు. పులిరాకను పరిశీలించేందుకు అటవీ,పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎఫ్వో బాలమణి తెలిపారు. పులి సంచరిస్తున్న దృష్ట్యా రెండు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చొప్పదండి ఎస్సై నరేశ్రెడ్డి సూచించారు. కాగా.. ఈ విషయమై కేంద్రమంత్రి సంజయ్ డీఎఫ్వోను ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడ కుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని..
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): పుట్టెడు దుఃఖంలో ఉన్న జర్నలిస్టులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ తన తండ్రి రాయలింగు(72) నేత్రాలు దానం చేసి మానవత్వం చాటుకున్నారు. గోదావరిఖని శాలపల్లికి చెందిన కుమారస్వామి నివాసంలో సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు ద్వారా నేత్రాలు సేకరించారు. దీనిద్వారా మరో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నిండనున్నాయి. ఇందుకు సహకరించిన మృతుడి భార్య లక్ష్మి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు. ప్రతినిధులు బాబర్ సలీం పాషా, గడ్డం శ్యామ్కుమార్, రాజ్కుమార్, పందిళ్ల శ్యామ్సుందర్, పెద్దపల్లి సత్యం, దుబ్బల శేఖర్, సాగర్, బైరం సతీశ్, జక్కం సత్యనారాయణ, సంపత్కుమార్, ఎండీ రహీం, వెంగళ బాపుపద్మ, కృష్ణవేణి, భూమళ్ల చందర్, రవి పాల్గొన్నారు. విషాదంలోనూ తండ్రి నేత్రాలు దానం మానవత్వం చాటుకున్నన జర్నలిస్ట్లు -
చివరికి నీరందేనా?
మానకొండూర్: ఎల్ఎండీ ఆయకట్టు భూములకు నేటినుంచి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల చేయనున్నారు. బుధవారం ఉదయం 11గంటలకు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అధికారులు స్విచ్ఆన్ చేసి నీటిని విడుదల చేయనున్నా రు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియడంతో ఎల్ఎండీ నిండుకుండగా మారింది. ఆయకట్టు పరిధిలోని చెరువు, కుంటలు కూడా నీటితో కళకళలాడుతున్నాయి. వరి కోతల నాటికి ప్రాజెక్టు సాగునీరు సరిపపోకపోతే మిడ్మానేరు ద్వారా అందిస్తామని, యాసంగిలో ఆ పరిస్థితి రాకపోవచ్చని ఎస్సారెస్పీ అధికారులు వెల్లడించారు. ఆయకట్టు పరిధిలో వరినాట్లు జోరందుకోగా.. స్టేజ్–1, స్టేజ్–2 కింద 9.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. అక్కడక్కడ ఉపకాలువల నిర్వహణ లేకపోవడంతో చివరి వరకు సాగునీరు అందడం కష్టమేనని రైతులు అంటున్నారు. వారబందీ పద్ధతిలో సాగునీరు ఎల్ఎండీ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు చివరి భూముల వరకు వారబందీ పద్ధతిలో రెండు స్టేజ్ల్లో సాగునీరు అందించనున్నారు. 146 కిలోమీటర్ నుంచి 284 కిలో మీటరు వరకూ స్టేజ్–1గా, 284 కిలో మీటరు నుంచి 340 కిలో మీటరు వరకు స్టేజీ–2గా విభజించారు. ఈ రెండు స్టేజ్ల పరిధిలో 9.40 లక్షల ఎకరాలు సాగవుతోంది. స్టేజీ–1కు 7రోజుల పాటు, స్టేజ్–2 పరిధిలో ఎనిమిది రోజులపాటు సాగునీరు విడుదల చేయనున్నారు. అధ్వానంగా ఉపకాలువలు కాకతీయ కాలువ పరిధిలోని ఉపకాలువలు ఆధ్వానంగా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో పాటు అక్కడక్కడ కూలిపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతుందో లేదోనని ఆనుమానం వ్యక్తం చేస్తున్నారు. యేటా ఉపాధిహామీ ద్వారా కాలువల్లోని చెత్తను తొలగించినా.. కొద్దిరోజులకే యథాస్థితికి చేరుతోందని చెబుతున్నారు. ఉపకాలువల్లో తుంగ, చెట్లు పెరిగి సాగునీరు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడుతోంది. మానకొండూర్ పరిధిలోని డీబీఎం– 2 సదాశివపల్లి రైస్మిల్లుల వద్ద వద్ద సిల్ట్ పేరుకుపోయి, సాగునీరు యేటా రోడ్డుపై పారుతోంది. మానకొండూర్లోని డీబీఎం–3 వద్ద కాలువకు గండిపడే ప్రమాదముంది. డీబీఎం–6 పరిధిలోని 4 ఎల్ ఉప కాలువ ఊటూరు నుంచి ఇప్పలపల్లికి వెళ్లే ఉపకాలువలో చెత్తపేరుకుపోవడంతో గండ్లు పడుతున్నాయి. గట్టుదుద్దెనపల్లి శివారులోని డీబీఎం–9 ఉపకాలువ పరిస్థితి కూడా అదే. పేరుకుపోయిన కాలువలపై అధికారులు దృష్టిపెట్టి, ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.మానకొండూర్ డీబీఎం–3 వద్ద కూలిన కల్వర్టుసిల్ట్ట్తో నిండిఉన్న డీబీఎం–3 ఉపకాలువకాకతీయ కాలువ(ఫైల్) -
నూతన వేడుకలకు అంతా సిద్ధం
● బేకరీల్లో కేక్లు, రెస్టారెంట్లలో స్పెషల్ ఆఫర్లు ● ఈవెంట్ల నిర్వాహకుల ప్రత్యేక ఏర్పాట్లు ● అర్ధరాత్రి 12 వరకు మద్యం దుకాణాలు ● సంబరాలు గాడి తప్పకుండా పోలీసుల నిఘాకరీంనగర్క్రైం/కరీంనగర్ కల్చరల్/విద్యానగర్: జిల్లాలో న్యూఇయర్ జోష్ మొదలైంది. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026 ఏడాదికి ఘనస్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది చివరి రోజును ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రైవేటు ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేయగా.. శివారులోని రిసార్టుల్లో వేడుకల్లో పాల్గొనేవారికి ప్రత్యేక ఆఫర్లు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం ముమ్మరం చేశారు. బేకరీల్లో వివి ధ డిజైన్లలో కేకులు సిద్ధం అవుతుండగా.. రెస్టారెంట్లు.. ఫుడ్కోర్టులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ.. వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలపై నిఘా తీవ్రతరం చేశారు. సందడే.. సందడి 2025కు బైబై చెప్పి.. 2026కు స్వాగతం పలికేందుకు కరీంనగర్వాసులు సిద్ధం అవుతున్నారు. 31 నైట్ సంబరాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే ప్రైవేటు కార్యక్రమానికి పలువురు యూట్యూబ్స్టార్లు, కమెడియన్లు రానున్నట్లు సమాచారం. నగరంలోని ఆయా కాలనీవాసులు బాంక్వేట్హాల్స్ సైతం బుక్ చేసుకుంటున్నారు. కాలనీ కమ్యూనిటీ హాల్స్, గ్రౌండ్లలో చిన్నారులు, మహిళలు సురక్షితంగా వేడుకల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు రిస్టార్టులు, ఫామ్హౌస్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడి నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. బేకరీలు, హోటళ్ల, రెస్టారెంట్లలోనూ ఆఫర్లు ఆహ్వానిస్తున్నాయి. వన్ప్లస్ వన్, 30శాతం నుంచి 50శాతం డిస్కౌంట్, కాంబో ఆఫర్లతో ప్రచారం ముమ్మరం చేశారు. సెల్ఫీపాయింట్లు, ఫుడ్స్టాళ్లను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు అమ్మకాలు సాగించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
పొలంలోనే కుప్పకూలిన రైతు
ఇల్లంతకుంట(మానకొండూర్): పొలం పనులు చేస్తూనే రైతు గుండెపోటుతో బురదలో కుప్పకూలిపోయి మృతిచెందగా, 11 ఏళ్ల కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది. వివరాలు.. ఇల్లంతకుంట మండలం తెనుగువారిపల్లె గ్రామానికి చెందిన రైతు దుర్మిట్ల సుధాకర్ (40) మంగళవారం ఉదయం వరినాటు వేసేందుకు బిహార్ కూలీలను పొలం వద్దకు ఆటోలో తీసుకెళ్లాడు. పొలంలో దిగి పనులు చేస్తున్న క్రమంలో సుధాకర్ బురదలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. మృతుడికి ముగ్గురు అమ్మాయిలే సంతానం. అందరూ చిన్న వయసు పిల్లలే. పెద్ద కూతురు కృతిక తండ్రి చితికి అగ్గిపెట్టడం చూసి స్థానికులు కన్నీరుపెట్టారు. గుండెపోటుతో మృతి తండ్రి చితికి నిప్పు పెట్టిన చిన్నారి -
నవ్వుతూ జీవిద్దాం.. నవశకానికి నాంది పలుకుదాం
● దురలవాట్లకు గుడ్బై చెబుదాం.. నిరంతర విద్యార్థిగా మారుదాం ● సెల్ వినియోగానికి కొంత సెలవు ఇద్దాం.. సైకిల్పై సవారీ చేద్దాం ● గుడ్బై.. 2025.. వెల్కం– 2026బోయినపల్లి(చొప్పదండి): కాలగమనంలో మరో సంవత్సరం కరిగి పోయింది. ఉరకలెత్తించే 2026 వచ్చేస్తోంది. గడిచిన సంవత్సరంలో ఏం చేశాము. కొత్త సంవత్సరంలో ఒత్తిడి లేని జీవన విధానాన్ని ఎలా కై వసం చేసుకుందాం అనే ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది.. కాలం మారింది.. మనమూ మారాల్సిన అవరం ఉంది.. కాలంతో పోటీ పడి పరుగులు తీసే కంప్యూటర్ యుగం.. వేళాపాల లేని ఆహారపు అలవాట్లతో గతంలో కన్నా శరీర బరువు పెరిగింది. ఎప్పటి నుంచో యోగా క్లాసులు, వాకింగ్, జిమ్కు వెళ్లాలనే ఆలోచన. నూతన సంవత్సరం వచ్చిన ప్రతీ సారి.. ఇక నుంచి క్రమం తప్పకుండా వెళ్లాలని నిర్ణయించుకోవడం. తర్వాత ఏవో కారణాలతో వాయిదా పడడం పరిపాటే. ఈ కొత్త సంవత్సరంలో అలా జరుగకుండా కొత్తగా ఆలోచిద్దాం. బీ పాజిటివ్.. థింక్ పాజిటివ్ పాలసీతో విజయాలు సాధించేందుకు నడుం బిగిద్దాం. ఈ విషయాన్ని గుర్తెరిగి మెదలితే మనకిక 2026లో అన్నీ విజయాలే.. -
వలపు వల పన్ని..!
కోరుట్ల: అమ్మాయిని ఎర వేసి..ఊరించి వలపు వల పన్ని కాసులు రాబట్టాలని చూసిన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మూడురోజుల క్రితం జరిగిన ఈ ఘటన మెట్పల్లిలో కలకలం రేపింది. వివరాలు.. మెట్పల్లి మండలం బండలింగాపూర్కు చెందిన రియల్టర్ కొంతకాలంగా మెట్పల్లి పట్టణంలోని గోల్హనుమాన్ సమీపంలో నివాసముంటున్నాడు. మూడు నెలల క్రితం ఓ మహిళ ఇతడిని ఫోన్ ద్వారా పరిచయం చేసుకుంది. సదరు అమ్మా యి తరచూ ఫోన్ కాల్ చేస్తూ వలపు వల వేసి ఊరించేది. గత ఆదివారం మనం కలుద్దామని చెప్పి మెట్పల్లిలోని ఓ అపార్ట్మెంట్లోని ఇంటికి రమ్మంది. వలపన్నారు.. హానీ ట్రాప్ను గుర్తించలేకపోయిన రియల్టర్ ఆ మహిళ చెప్పిన ఇంటికి వెళ్లి ఆమె అపార్ట్మెంట్ రూంలోకి వెళ్లగానే సదరు రియల్టర్ ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోను హానీ ట్రాప్ ముఠా సభ్యలు గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించారు. అనంతరం నలుగురు వ్యక్తులు ఆ గదిలోకి వెళ్లి ఎవరు మీరు, ఏలా వచ్చారు, మహిళతో ఇక్కడ ఏం చేస్తున్నారని రియల్టర్ను బెదిరించారు. దీంతో బిత్తరపోయిన రియల్టర్ ఆ మహిళ పిలిస్తేనే వచ్చానని చెప్పినా వినకుండా తాము తీసిన వీడియోలు బయటపెడతామంటూ కాసుల బేరం పెట్టారు. దీంతో రియల్టర్ గత్యంతరం లేక రూ.7 లక్షలు చెల్లిస్తానని చెప్పి బతిమిలాడుకుని బయటపడ్డాడు. తర్వాత తనను వలపువల వేసి హానీ ట్రాప్లో ఇరికించారని గుర్తించిన రియల్టర్ మెట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆరుగురిపై కేసు.. రియల్టర్ను హానీ ట్రాప్లో ఇరికించి బ్లాక్మెయిల్కు దిగిన ముఠా సభ్యులు బల్మూరి స్వప్న, కోరుట్ల రాజ్కుమార్, విలేకరిగా చెప్పుకున్న పులి అరుణ్, బట్టు రాజశేఖర్, సుంకెటి వినోద్, మాగిని దేవనర్సయ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నిందితుల్లో రాజ్కుమార్ అనే వ్యక్తి ఓ జాతీయ పార్టీకి చెందిన నేతకు అనుచరుడన్న అంశం ప్రచారంలోకి వచ్చింది. కాసుల కోసం బెదిరింపులు మెట్పల్లిలో హానీ ట్రాప్ పోలీసులను ఆశ్రయించిన బాధితుడు నిందితుడికి పోలిటికల్ లింకులు..? -
ఇసుక ట్రాక్టర్ కింద పడి యువకుడి మృతి
కోనరావుపేట/రుద్రంగి: రాత్రిపూట అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ట్రాక్టర్పై నుంచి పడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. రుద్రంగి మండలం డేగావత్ తండాకు చెందిన వినోద్ తన ట్రాక్టర్లో రాత్రిపూట అక్రమంగా ఇసుక రవాణా చేయడానికి చింతామణితండాకు చెందిన గుగులోత్ గంగాధర్(22)ను సోమవారం రాత్రి ఇసుక నింపేందుకు తీసుకెళ్లాడు. డేగావత్ తండానుంచి సమీపంలో ఉన్న కోనరావుపేట మండలం మరిమడ్ల శివారులోని జాలాగుకుంట వద్దకు వచ్చి ఇసుక నింపుకుని వెళ్తున్నారు. వినోద్ తన ట్రాక్టర్ను మైనర్ బాలుడు అయిన డేగావత్ చరణ్కు ఇచ్చి డ్రైవింగ్ చేయమన్నాడు. గంగాధర్ ట్రాక్టర్ ఇంజన్, ట్రాలి మధ్య నిలబడి ఉన్నాడు. అటవీశాఖ అధికారులు వెంబడిస్తున్నారని భావించి చరణ్ ట్రాక్టర్ను వేగంగా పోనిచ్చాడు. మరిమడ్ల ఏకలవ్య పాఠశాల దాటిన తర్వాత ట్రాక్టర్ నుంచి గంగాధర్ కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్కు సమాచారం అందించగా అంబులెన్స్ చేరుకునే సరికే గంగాధర్ మృతిచెందాడు. మృతుడి తండ్రి సుకునా ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రశాంత్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కేసీఆర్ను కలిసిన ‘కొండూరి’
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్గా కొండూరి రవీందర్రావు 20 ఏళ్లు సుదీర్ఘ కాలం సేవలందిస్తూ సహకార రంగాన్ని సంస్కరించారని మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు అభినందించారు. హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో మంగళవారం రవీందర్రావు మర్యాద పూర్వకంగా కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, సహకార రంగంలో రవీందర్రావు అందించిన సుదీర్ఘ సేవలు, అమలు చేసిన సంస్కరణలు, కరీంనగర్ డీసీసీబీని ఆదర్శ సంస్థగా నిలిపిన తీరును కేసీఆర్ కొనియాడారు. సహకార రంగానికి ఆయన చేసిన సేవలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు. సెబి రీసెర్చ్ అనలిస్ట్ పరీక్షలో అర్హతకొత్తపల్లి: భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మక సెబి రీసెర్చ్ అనలిస్ట్ పరీక్షలో చింతకుంట శివారులోని ఎస్ఆర్ఎం పీజీ కళాశాల ఎంబీఏ హెచ్వోడీ ఎండీ.ఖ్వాజా మొయినొద్దీన్ అర్హత పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సి.వెంకటేశ్వర్ రావు తెలిపారు. స్టాక్ మార్కెట్లో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ వంటి పెట్టుబడులపై విశ్లేషణ చేయడం, సలహాలు ఇచ్చే వ్యక్తిని రీసెర్చ్ అనలిస్టు అంటారన్నారు. అలాంటి సెబి (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆప్ ఇండియా) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 1,780 సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్లలో మొయినొద్దీన్ ఉండటం గర్వంగా ఉందన్నారు. ఎన్ఐఎస్ఎం నిర్వహించిన ఈ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన ఆయన్ను కళాశాల చైర్మన్ ఎం.తిరుపతి రెడ్డి అభినందించారు. -
గుండెపోటుతో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడి మృతి
● చదువు చెప్పిన పాఠశాలలోనే ఘటన ● వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడిలోకి.. రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు ఏనుగు రాజిరెడ్డి (65) తాను చదువు చెప్పిన పాఠశాలలోనే వాకింగ్ చేస్తుండగా గుండెపోటుకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి పాఠశాల ఆవరణలో వాకింగ్ చేసేందుకు మంగళవారం వెళ్లాడు. ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి కుప్పకూలడంతో తోటి వాకర్స్ వెంటనే సీపీఆర్ చేశారు. అయినప్పటికీ పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజిరెడ్డికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, పూర్వ విద్యార్థులు సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో జర్నలిస్టు.. సిరిసిల్లటౌన్: సీనియర్ జర్నలిస్టు అనారోగ్యంతో మృతిచెందిన ఘటన మంగళవారం సిరిసిల్లలో జరి గింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్నగర్కు చెందిన గడ్డం నాగరాజు(44) దశాబ్దంన్నర కాలంగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆర్నెళ్లక్రితం అనారోగ్యానికి గురికాగా చికిత్స పొందాడు. వారం క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అవగా.. చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయాడు. మృతుడికి భా ర్య స్వరూప, ఇద్దరు కుమారులు హరిహరణ్, హర్షవర్దన్ ఉన్నారు. నాగరాజు మృతిపై సిరిసిల్ల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఆకుల జయంత్కుమార్, ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, ఉపాధ్యక్షుడు బొడ్డు పర్శరాములు, సీనియర్ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. ఉరేసుకొని రైతు ఆత్మహత్యమానకొండూర్: మానకొండూర్ మండలం గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన గొర్రెంకల చిన్న ఎల్లయ్య (55) అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. మానికి చెందిన చిన్న ఎల్లయ్య సాగునీటి కోసం గతేడాది వ్యవసాయ పొలం వద్ద బావిని తవ్వించాడు. అందులో బండ రావడం, బోరువేసినా నీరు రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య ఈనెల 29న పొలం పనులకు వెళ్తున్నానని చెప్పి, తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించగా పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాలు కొట్టెస్తారనే భయంతో వ్యక్తి.. ముస్తాబాద్(సిరిసిల్ల ): డయాబెటిస్తో కాలుకు ఇన్ఫెక్షన్ సోకగా, ఆందోళనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్తాబాద్ ఏఎస్సై అబ్దుల్ఘనీ కథనం మేరకు.. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లికి చెందిన పారిపెల్లి సాయిలు(62) మంగళవారం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు. కాలుకు పుండు కావడంతో అది పొందుతున్నాడు. కాలు ఇన్ఫెక్షన్తో గాయం తీవ్రమైంది. దీంతో కాలు తీసేస్తారనే భయంతో సాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. నలుగురు దొంగల పట్టివేతమేడిపల్లి: కొన్ని రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని మంగళవారం పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో అనుమానాస్పదంగా కొందరు తిరుగుతున్నట్లు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో వారిని పట్టుకున్నారు. వారిని విచారణ చేపట్టగా ఇటీవల మండలకేంద్రంలోని మహాలక్ష్మి మొబైల్ షాప్లో తొమ్మిది సెల్ఫోన్లు, కోరుట్లలో మోటార్ సైకిల్ దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
రెండు లారీలు ఢీ.. డ్రైవర్లకు గాయాలు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల బస్టాండ్ వద్ద రాజీవ్ రహదారిపై మంగళవారం రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నుంచి సిమెంట్ లోడుతో గోదావరిఖని వైపు వెళ్తున్న లారీ మార్గమధ్యంలోని కన్నాల బస్టాండ్ సమీపంలో గల భారత్ పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోగా బైక్పై వెళ్తున్న దంపతులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అడ్డుగా వచ్చారు. వారిని తప్పించబోయిన డ్రైవర్.. లారీని రహదారికి అవతలికి మళ్లించాడు. అదే సమయంలో బూడిదలోడుతో పెద్దపల్లి వైపు వెళ్త్ను టిప్పర్.. సిమెంట్ లారీని ఢీకొట్టి సమీపంలోని బస్టాండ్తో పాటు ఓ షాన్షాపును ఢీకొట్టింది. దీంతో లారీల ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యాయి. లారీ డ్రైవర్లు తీగల మహేశ్, దాసరి కిష్టయ్యకు గాయాలు కాగా బసంత్నగర్ ఎస్సై శ్రీధర్ వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. ప్రమాదంతో ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. హెచ్కేఆర్ టోల్ప్లాజా క్రేన్, జేసీబీల సాయంతో లారీలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈఘటనలో కన్నాల బొడగుట్టపల్లిలోని బొడ్డుపల్లి నర్సయ్యకు చెందిన షాపు ధ్వంసమైంది. ప్రమాద సమయంలో స్థానిక బస్టాండ్లో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, షాపు కూడా మూసి ఉండటంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గంజాయి సరఫరా.. కాపర్ చోరీ
చొప్పదండి: పట్టణంలోని గుమ్లాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఇద్దరు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరు ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైరు చోరీ చేసేవారని విచారణలో తేలింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్కుమార్ చొప్పదండి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఎస్సై నరేశ్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేస్తుండగా 1.150 కిలోల గంజాయితో చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ మహేశ్, చొప్పదండికి చెందిన రాంటెంకి శివప్రసాద్ పట్టుబడ్డారు. వీరిని పోలీసులు తమదైన శైలిలో విచారించగా జూలపల్లికి చెందిన నెరుమట్ల అజయ్తో కలిసి మహారాష్ట్రలోని చంద్రాపూర్ నుంచి గంజాయి తీసుకువచ్చి చొప్పదండి ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు తేలింది. జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్రూరల్, తిమ్మాపూర్, రామడుగు, గంగాధర పోలీస్స్టేషన్ల పరిధిలో ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేస్తూ, వాటి లోని కాపర్ను చొప్పదండిలోని స్క్రాప్ రిసీవర్ యజమాని మల్లేశంకు విక్రయించారు. కరీంనగర్ టూటౌన్ పరిధి శర్మనగర్లో బైక్ చోరీ చేసి ఆర్నకొండకు చెందిన శేఖర్కు అమ్మినట్లు ఒప్పుకోగా బైక్, గంజాయి 12.58 కిలోల కాపర్ను రికవరీ చేశారు. రాంటెంకి శివప్రసాద్పై వేములవాడ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్ చోరీ, హౌస్ బ్రేకింగ్ కేసు, చొప్పదండి పరిధిలో కాపర్ చోరీ, మహేశ్పై కాపర్ చోరీ కేసులు ఉన్నాయని తెలిపారు. పరారీలో ఉన్న అజయ్పై వివిధ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నట్లు తెలిసిందన్నారు. కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ ప్రదీప్కుమార్, ఎస్సై, కానిస్టేబుళ్లను అభినందించారు. కాగా నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఇళ్లలోనే జరుపుకోవాలని, రోడ్లపైకి వచ్చి యువకులు ఎలాంటి ఆటంకాలు సృష్టించవద్దని కోరారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు -
సీఎం సహాయ నిధితో పేదలకు లబ్ధి
● సుడా చైర్మన్ నరేందర్రెడ్డి కరీంనగర్కార్పొరేషన్: సీఎం సహాయనిధితో పేదలకు లబ్ధి చేకూరుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని సుడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందిపడిన ప్రజలకు సీఎం సహాయ నిధి ద్వారా చేయూతనందించామని తెలిపారు. అలాగే కార్యాలయంలో మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయ్యిందన్నారు. వివిధ అవసరాల కోసం ప్రజలు హెల్ప్డెస్క్ను వినియోగించుకోవాలని కోరారు. గుండాటి శ్రీనివాస్రెడ్డి, షబానా మహమ్మద్, సయ్యద్ ఖలీల్, మాసూమ్ఖాన్, ముల్కలా యోనా, జాఫర్, నదీమ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరంపర.. అర్జీల జాతర
కరీంనగర్ అర్బన్: ‘ప్రజావాణి’ జన జాతరను మరిపించింది. ఎన్నికల కోడ్ కారణంగా కొద్దిరోజులుగా కార్యక్రమం లేకపోగా సోమవారం ప్రారంభించిన విషయం విదితమే. జిల్లా నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు దరఖాస్తులు స్వీకరించారు. 379 మంది తమ సమస్యలు విన్నవించారని కలెక్టరేట్ ఏవో సుధాకర్ వివరించారు. ఇన్నాళ్లు ప్రజలు ఉన్నతాధికారులను కలిసే అవకాశం లేకపోవడమే అర్జీలు పెరగడానికి కారణమని స్పష్టమవుతోంది. మండల అధికారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణలోపం వెరసి సమస్యలు పేరుకుపోయాయి. ప్రజావాణి ఎపుడెపుడు ప్రారంభమవుతుందని నిరీక్షించిన ప్రజలు ఇక కలెక్టరేట్ బాట పడుతున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లకు అర్జీలు అందజేశారు. మొత్తం అర్జీలు: 379 మున్సిపల్ కార్పొరేషన్: 74 హౌసింగ్: 67, ఆర్డీవో కరీంనగర్: 18 శంకరపట్నం తహసీల్దార్: 13 తిమ్మాపూర్ తహసీల్దార్: 12 -
జాతీయస్థాయి చెకుముకి పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్ విద్యార్థులు కరీంనగర్ పద్మనగర్లోని ఓ పాఠశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెక్ముకి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి తెలిపారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో పాఠశాలకు చెందిన కే ఓం కార్తికేయ (10వ తరగతి), ఎస్.రీషాల్ (9వ తరగతి), ఓ.శివస్మరణ్రెడ్డి (8వ తరగతి) రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నారు. సోమవారం విద్యార్థులకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయస్థాయిలో సత్తాచాటాలని ఆకాంక్షించారు. పాఠశాలలో నిపుణులైన వైజ్ఞానిక శాస్త్ర ఉపాధ్యాయులచే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహించే పోటీలకు ఎంపిక చేస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం
కరీంనగర్టౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి, పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు శనిగారపు రజనీకాంత్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం స్థానిక తెలంగాణ చౌక్ నుంచి మహాత్మ జ్యోతిరావు పూలే గ్రౌండ్ వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా సమానమైన విద్యను అందించేందుకు ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ఆసంపల్లి వినయ్ సాగర్, గట్టు ఆకాష్, రాకేశ్, సందేశ్, మానస, సంజన, సన్నీ, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు. -
సెలవులో కలెక్టర్
కరీంనగర్ అర్బన్: కలెక్టర్ పమేలా సత్పతి సెలవులో వెళ్లారు. వ్యక్తిగత కారణాల క్రమంలో జనవరి 4వరకు సెలవులో ఉంటారు. ఇన్చార్జి కలెక్టర్గా అదనపు కలెక్టర్ డా.అశ్విని తానాజీ వాకడే వ్యవహరించనున్నారు. కరీంనగర్ కార్పొరేషన్: పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పీడీ జి.స్వరూపారాణి స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆమె మున్సిపల్ కమిషనర్ గ్రేడ్–1 హోదాలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15 మంది గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్లకు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి కల్పిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో జిల్లా నుంచి ప్రస్తుతం మెప్మా పీడీ స్వరూపారాణితో పాటు, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండీ అయాజ్ కూడా ఉన్నారు. గంగాధర(చొప్పదండి): మండలంలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గ్రామంలో కొత్తగా నల్లా కనెక్షన్ కావల్సిన వారు ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుందని, ఆడపిల్ల పుడితే ఆమె పేరుమీద రూ.2,016 డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. సోమవారం సర్పంచు కడారి రేణుక అధ్యక్షతన పాలకవర్గం సమావేశమై రెండు నిర్ణయాలపై తీర్మానం చేశారు. దీంతో గ్రామస్తులు పాలకవర్గాన్ని అభినందించారు. కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ నూతన సాంకేతిక మార్పులు చేపడుతోందని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అత్యవసర మరమ్మతులు (మెయింటెనెన్స్) చేపట్టినప్పుడు కరెంట్ సరఫరాకు ఆటంకం కలగకుండా ‘ఇంటర్ లింక్ లైన్’ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. సబ్స్టేషన్ లేదా లైనులో సమస్య ఏర్పడితే ఇంటర్ లింకింగ్ ద్వారా 33/11 కేవీ సబ్స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్స్టేషన్కు, 33 కేవీ లైన్ నుంచి మరో 33 కేవీ లైన్కు అనుసంధానించి అంతరాయం లేకుండా విద్యుత్ స రఫరా చేయొచ్చని వివరించారు. కరీంనగర్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్స్టేషన్ల (96), 33 కేవీ లైన్ల(94)లో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను పూర్తి చేసినట్లు వివరించారు. మిగి లిన 2 సబ్స్టేషన్లు, లైన్ల పనులకు కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. సైన్స్ సైనికులుగా మారాలి కరీంనగర్టౌన్: జనవిజ్ఞాన వేదిక రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థులు బాల్య దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకొని సైన్సు సైనికులుగా మారాలన్నారు. చెకుముకి రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ కె.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ పరీక్షలో ప్రైవేటు కంటే ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు పది మార్కులు ఎక్కువ రావడం విశేషం అని, విజ్ఞానానికి ఆర్థిక ఎల్లలు లేవని నిరూపించబడిందన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చెలిమేల రాజేశ్వర్ మాట్లాడుతూ, పిల్లల్లో వైజ్ఞానిక భావాలను పెంపొందించడానికి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. సైన్స్ కమ్యూనికేటర్ వీఎస్ఎన్ మూర్తి, పారమిత పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్కుమార్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, అల్ఫోర్స్ స్కూల్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలవగా, జెడ్పీ బాలికల పాఠశాల మంథనికి చెందిన విక్రాంత్, మణిచరణ్, శుశ్రుత రెండోస్థానం పొందారు. రాజన్న సిరిసిల్లకు చెందిన రంగినేని ట్రస్ట్ స్కూల్ రగుడు విద్యార్థులు శివమణి, భారత్, సిద్ధార్థ ప్రత్యేక కన్సోలేషన్ బహుమతి పొందారు. -
తండ్రి అంత్యక్రియలు చేసిన కూతురు
జమ్మికుంట(హుజూరాబాద్): పిల్లలు లేకపోవడంతో దత్తత తీసుకున్న కూతురు పెంచుకున్న మమకారాన్ని పంచింది. తండ్రికి అంత్యక్రియలు చేయడం కాలనీవాసులను కంటతడి పెట్టించింది. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి 22వ వార్డు అంబేడ్కర్కాలనీకి చెందిన ఇల్లందుల భద్రయ్య, కృప దంపతులు. భద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. పెంచుకున్న కూతురు రమ అన్నీ తానై తండ్రి ఆలనాపాలన చూసింది. కొడుకు లేని లోటు తీర్చే బాధ్యతలు స్వీకరించింది. సోమవారం భద్రయ్య మృతిచెందడంతో అంత్యక్రియలు చేసింది. పెంచుకున్న మమకారంతో తండ్రి రుణం తీర్చుకుంది. -
ప్రాణం తీసిన భూపంచాయితీ
● కనగర్తిలో ఒకరు మృతి ఓదెల(పెద్దపల్లి): భూ పంచాయితీ ఓ రైతు ప్రాణం తీసింది. ఈఘటన పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కనగర్తి గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య)ను ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పొలం వద్ద పిడిగుద్దులు గుద్ది, కాళ్లతో తన్ని బురదలో తొక్కి చంపేశాడు. పొత్కపల్లి ఎస్సై రమేశ్, మృతుడి కూతురు వొడ్నాల లావణ్య కథనం ప్రకారం.. కనగర్తిలో ఒంటరిగా ఉంటున్న రాజయ్య వ్యవసాయం చేస్తూ బతుకుతున్నాడు. ఇదే గ్రామానికి చెందిన ఆది రాజయ్య భూమి ఆయన పొలాన్ని ఆనుకొని ఉంది. ఇద్దరి భూముల మధ్య గెట్టు(ఒడ్డు) విషయంలో పలుమార్లు గొడవలు, కులపెద్ద మనుషుల సమక్షంలోనూ పంచాయతీలు జరిగాయి. సోమవారం ఉదయం ఆది రాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) కూలీలతో పొలంలో పనులు చేయిస్తున్నాడు. ఈక్రమంలో ఒడ్డు వద్దగల హద్దు రాయిని రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) పీకేశాడు. దానిని ఎందుకు పీకేశావని ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) అడిగాడు. దీంతో ఆదిరాజయ్య(సన్నాఫ్ మల్లయ్య) చేతులతో పిడిగుద్దులు గుద్దాడు. కాళ్లతో తన్ని బురదలో తొక్కాడు. దీంతో బురదలో బొర్లపడి ముక్కు మూసుకుపోయి ఊపిరి ఆడక ఆది రాజయ్య(సన్నాఫ్ ఐలయ్య) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కూతురు వొడ్నాల లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనా స్థలాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి, ఏసీపీ కృష్ణ, పొత్కపల్లి, సుల్తానాబాద్ ఎస్సైలు రమేశ్, చంద్రకుమార్ పరిశీలించారు. పాత గొడవలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రిని చంపేశారని మృతుడి కుతుళ్లు బోరున విలపించారు. వరి నాట్ల సమయంలో రైతు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇక.. పుర వేఢీ!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పాలకవర్గాల పదవీకాలం ముగిసి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న బల్దియాల్లో ఎన్నికల నగరా మోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఓటరు జాబితా సవరణకు కార్యాచరణ చేపట్టింది. మంగళవారం నుంచి వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేసి, జనవరి 1న పట్టణ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 5న ఆయా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. -
కరీంనగర్
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 20257క్వింటాల్ పత్తి రూ.7,450జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఇన్చార్జి కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు కొనసాగుతున్నందున మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలో కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్–2 ఏడీఈ లావణ్య తెలిపారు. -
గుండెపోటుతో రిమాండ్ ఖైదీ మృతి
జగిత్యాలక్రైం: జగిత్యాల సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నిర్మల్ జిల్లాకు చెందిన కోత్వల్ కృష్ణ (43) గుండెపోటుతో మృతిచెందాడు. కృష్ణ జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్కు చెందిన ఎక్కల్దేవి కృష్ణ వద్ద రూ.70వేలు తీసుకున్నాడు. అనంతరం రెండు ఫోన్నంబర్ల ద్వారా కృష్ణ సెల్ఫోన్కు ఫోన్పే చేయించాడు. ఆ రెండు నంబర్లు సైబర్క్రైంకు సంబంధించినవి కావడంతో ఎక్కల్దేవి కృష్ణ బ్యాంక్ ఖాతా ఫ్రీజ్ అయ్యింది. బాధితుడు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు నవంబర్ 3న కోత్వల్ కృష్ణను అరెస్ట్ చేసి జగిత్యాల స్పెషల్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో కృష్ణ సోమవారం ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని జైలు సిబ్బందికి తెలపడంతో జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఎస్కార్ట్ సిబ్బందితో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఆయన మృతివార్తను సబ్జైలర్ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులకు తెలిపారు. ఆర్డీవో మదుసూదన్, రెండో అదనపు జుడిషియల్ మేజీస్ట్రేట్ నిఖిష ఆస్పత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. జైలు సూపరింటెండెంట్ మొగిలేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో తీవ్రంగా రోధించారు. కృష్ణపై సూర్యపేట, ములుగు, కొత్తగూడెం, హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్లో పలు కేసులు నమోదై ఉన్నాయి. నిర్మల్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు ఉంది. మొత్తంగా అతడిపై సుమారు 50 కేసుల వరకు ఉన్నట్లు సమాచారం. మృతునిది నిర్మల్ జిల్లా కేంద్రం విచారణ చేపట్టిన ఆర్డీవో మధుసూదన్ కేసు నమోదు చేసిన పట్టణ సీఐ కరుణాకర్ -
బ్లాక్ స్పాట్ల వద్దే ప్రమాదాలు
● నామమాత్రంగా సూచిక బోర్డులు ● అతివేగంతో దూసుకెళ్తున్న వాహనాలు గోదావరిఖని: గతేడాదితో పోల్చితే ఈఏడాది రోడ్డు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఆర్ అండ్ బీ, ఎకై ్సజ్, హైవే ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలిసి గ్రామ రోడ్డు భద్రత కమిటీ సభ్యులు తనిఖీలు చేశారు. మంచిర్యాల జోన్లోని వెంపల్లి – ముల్కల వంతెన, గుడిపేట వంతెన, పెద్దపల్లి జోన్లోని గోదావరిఖని బీ –గెస్ట్ హౌస్ పరిసరాల్లోనూ తనిఖీలు చేసి ప్రమాదా ప్రాంతాలు గుర్తించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించినా.. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 131 మంది మృతి చెందగా, 221మందికి తీవ్ర, 301 మందికి స్వల్పగాయాలయ్యాయి. ఈఏడాది 334 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 126 సంఘటనల్లో 137మంది మృతి చెందారు. 338 మందికి గాయాలయ్యాయి. రాజీవ్రహదారి వెంట బ్లాక్స్పాట్లను గుర్తించినా ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదు. దీంతోనే బ్లాక్స్పాట్ల వద్దే ప్రమాదాలు పెరిగాయి. ప్రధానంగా భారీవాహనాలు ఢీకొట్టడడంతో ద్విచక్రవాహనదారులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు శాశ్వత అంగవైకల్యానికి గురయ్యారు. ప్రమాదాల నియంత్రణకు రోడ్డు సేఫ్టీ విభాగాన్ని ట్రాఫిక్కు అప్పగించగా.. బ్లాక్స్పాట్ల వద్ద సూచికల బోర్డులు ఏర్పాటు చేశారు. పలు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదాలు కొంతతగ్గినా.. ఇప్పుడు సూచిక బోర్డులు లేక ప్రమాదాలు మళ్లీ పెరిగాయి. డ్రంక్ అండ్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి డ్రంక్ అండ్ డ్రైవ్పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మద్యం తాగి వాహనం నడుపుతూ తొలిసారి దొరికిన వారికి జరిమానా విధించి వదిలేశారు. రెండోసారి పట్టుబడ్డవారికి భారీ జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించారు. ఇలా గతేడాది 6,725 పట్టుపడగా, అందులో 3,352 మంది నుంచి రూ.44.14లక్షల జరిమానా వసూలు చేశారు. ఈఏడాది 9,678 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా.. రూ.96.45లక్షలు జరిమానా విధించారు. రోడ్డు నిబంధనల అతిక్రమణ, నిర్లక్ష్యపు డ్రైవింగ్తోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ డ్రైవ్ కోసం అవగాహన కల్పిస్తున్నాం. – శ్రీనివాస్, ఏసీపీ, ట్రాఫిక్, రామగుండం నాలుగేళ్లలో రోడ్డు ప్రమాదాలు, మృతులు, గాయపడినవారు ఏడాది మృతులు తీవ్రగాయాలు గాయాలు 2022 128 44 296 2023 112 64 303 2024 131 221 301 2025 137 170 338 -
ఎన్నికలతో ముగిసి..
ఆటలతో మొదలై..పోలీస్ స్పోర్ట్స్ మీట్తో మొదలైన 2025.. ఎమ్మెల్సీ ఎన్నికలతో వేగం అందుకుని, పంచాయతీ ఎన్నికలతో ప్రశాంతంగా ముగిసింది. దక్షిణకాశీగా పిలిచే వేములవాడలో దర్శనాలు నిలిపివేయడం భక్తులకు తీవ్ర అసౌకర్యం కల్పించినా.. ఆలయాభివృద్ధి కోసం తప్పలేదు. సీబీఐ వామనరావు దంపతుల కేసు.. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ ప్రారంభించింది. క్రిప్టో కరెన్సీ పేరిట వెలుగుచూసిన రెండు కుంభకోణాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కుదిపేశాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ను ‘సిట్’ విచారించింది. – సాక్షి ప్రతినిధి, కరీంనగర్ -
జమ్మికుంట మున్సిపల్లో ఏసీబీ తనిఖీలు
జమ్మికుంట(హుజూరాబాద్): జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 12 మంది బృందంతో రికార్డులు పరిశీలించారు. మున్సిపల్లో 2025 సంవత్సరానికి సంబంధించిన అటెండెన్స్, లీవ్ రికార్డులు, ఇన్, అవుట్ వార్డు రిజిస్టర్, బిల్డింగ్ పర్మిషన్స్, ఎల్ఆర్ఎస్ తదితర రికార్డులు తనిఖీ చేశారు. కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సిబ్బంది వద్ద అనధికారికంగా ఉన్న రూ.41,170 నగదు స్వాధీనం చేసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగి శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం వద్ద ఫోన్ పే ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఫోన్ సీజ్ చేశారు. పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. -
నాడు తండ్రి.. నేడు తల్లి మృతి
జగిత్యాలక్రైం: ‘విధి ఆ చిన్నారుల పాలిట శాపంగా మారింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులిద్దరూ అనంతలోకాలకు వెళ్లిపోవడంతో ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం తలమాల గ్రామానికి చెందిన జ్యోతి 15 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపాల్ను ప్రేమవివాహం చేసుకుని కల్లెడకు వచ్చింది. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో గుడిసె వేసుకుని జీవిస్తున్నారు. వీరికి అంజలి (13), చిన్ని (6), మురళీ (5) సంతానం. గోపాల్ ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి జ్యోతి ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి కూడా చనిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పంచాయతీ సిబ్బందే జ్యోతి తల్లి సోంబాయి, తండ్రి భీమ్ ఆటోలో కల్లెడకు తీసుకొచ్చారు. అనంతరం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లో మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్, కారోబార్ సురేందర్ కలిసి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లి మృతదేహం వద్ద ముగ్గురు చిన్నారులు రోధనలు చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. తన అనేవారు లేని చిన్నారులను స్వచ్ఛంద సంస్థలైనా.. ప్రభుత్వమైనా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అనాథలైన ముగ్గురు చిన్నారులు -
తాళం వేస్తే టార్గెట్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసి ఊరెళ్లుతున్నారా.. అయితే మీ ఇల్లు దొంగలకు టార్గెట్ కానుంది. తిరిగొచ్చే సరికి ఇల్లు గుల్ల కావడం ఖాయం. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను పరిశీలిస్తే తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆచూకీ దొరకడం లేదు. వరుస సంఘటనలు ఎల్లారెడ్డిపేట మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. వరుస దొంగతనాలతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. తాజాగా రాచర్లగొల్లపల్లిలోని తాళం వేసిన ఉన్న రెండు ఇళ్లలోకి ప్రవేశించి నగదు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు. అంతకుముందు అల్మాస్పూర్లో మూడు ఇళ్లల్లో దొంగతనం చేశారు. పనిచేయని సీసీ కెమెరాలు జిల్లా వ్యాప్తంగా 257 గ్రామపంచాయతీలకు దాదాపు 65 శాతం గ్రామాల్లో స్థానికులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిర్వహణపై పట్టింపు లేక సగానికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. జిల్లాలో 1,225కు పైగా సీసీ కెమెరాలను గతంలో ఏర్పాటు చేశారు. అయితే ఇందులో వెయ్యికి పైగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఎన్నికై న గ్రామపంచాయతీల పాలకవర్గాలు సీసీ కెమెరాల నిర్వహణపై దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రల సేకరణలో పోలీసులు జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి వలస కార్మికుల రాక పెరిగింది. జిల్లాలో భవన నిర్మాణాల పనులు ముమ్మరం కావడం, వ్యవసాయ పనులు ఊపందుకోవడం, కోళ్లషెడ్లలో పనిచేసేందుకు బిహార్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి కార్మికులు వస్తున్నారు. వరుసగా దొంగతనాలు జరుగుతుండడంతో అపరిచిత వ్యక్తుల సంచారం పెరగడంతో వారిపై పోలీసులు నిఘా పెట్టారు. అంతేకాకుండా గత పదిహేను రోజులుగా జిల్లాలో జరుగుతున్న దొంగతనాల నేపథ్యంలో వలసకూలీల వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో వలసకూలీల వివరాలతో కూడిన జాబితాను తయారు చేయడమే కాకుండా వేలిముద్రలు సేకరిస్తున్నారు. దొంగతనాలు జరిగిన సందర్భాల్లో వలసకార్మికుల వేలిముద్రలతో పోల్చి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలోని వేముల కల్యాణి ఇంట్లోని బీరువా పరిస్థితి. ఈనెల 7న దొంగలు పడి బీరువాలోని విలువైన వస్తువులు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగల సమాచారం దొరకడం లేదు. 25 రోజులు గడుస్తున్నా దొంగల ఆచూకీ తెలియడం లేదు. ఇలా మండలంలో నెల రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. దొంగతనాల నేపథ్యంలో నిఘా తీవ్రం చేశాం. రాచర్లగొల్లపల్లిలో రెండు ఇండ్లల్లో జరిగిన దొంగతనంపై విచారణలో భాగంగా పలువురి వేలిముద్రలు సేకరించాం. పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడిన దొంగలను పట్టుకున్నాం. గ్రామాల్లో సీసీ కెమెరాలు పనిచేయక నిందితులు సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. – రాహుల్రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఎస్సై -
ముగిసిన ఎస్జీఎఫ్ కరాటే టోర్నీ
కోల్సిటీ(రామగుండం): నగరంలోని ఆర్సీవోఏ క్లబ్లో అండర్–17 చేపట్టిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి కరాటే టోర్నీ, ఎంపిక పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి సుమారు 240 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించారు. దాసరి మల్లేశ్ పర్యవేక్షించారు. ఇన్చార్జి డీఈవో హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కరాటే శ్రీనివాస్, వడ్డేపల్లి సురేశ్, పసునూటి శంకర్, మంధని నాగరాజు, పసునూటి చందు, శ్రావణ్ కుమార్, సుంకే రాజు, బండి పరమేశ్, పవన్, బోయపోతు రాము, అన్వేశ్ రిఫరీలుగా వ్యవహరించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోచ్, మేనేజర్లుగా ముక్తిశ్రీ, సునేహ సుల్తానా తదితరులు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు 13 మంది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 13 మంది క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో పుణెలో జరగనున్న జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ పోటీలకు 13 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. బంగారు పతకాలు సాధించినవారిలో సృష్టి టుమానే, శ్రీహర్ష, శ్రీవల్లి, పి.శ్రీజ, బి.సహస్త్ర, పి.సహస్త్ర, శ్రీరాజ్ విఘ్నేశ్, టి.జయసాయిచరణ్, ఆకాశ్, డి.శివహర్షవర్ధన్, డి.దేవాన్ష్ ఉన్నారు. ముగింపు కార్యక్రమంలో గోదావరిఖని ప్రెస్క్లబ్ అధ్యక్షుడు డి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం శ్యామ్కుమార్, కోశాధికారి రాజ్కుమార్, ఉపాధ్యక్షుడు కేఎస్ వాసు, రాష్ట్ర పేట అసోసియేషన్ ఉపాధ్యక్షులు కొమురోజు శ్రీనివాస్, శోభారాణి, జావిద్, విజయ్, ఖాజాభీ రమేశ్, కనకేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై మతిస్థిమితం లేని వ్యక్తి దాడి
● చికిత్స పొందుతూ మృతి జగిత్యాలక్రైం: మతిస్థితిమితం లేని ఓ వ్యక్తి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన జగిత్యాల రూరల్ మండలం హైదర్పల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ కథనం ప్రకారం.. హైదర్పల్లికి చెందిన వంగ రాజవ్వ (72) తన మనుమరాలు గోనెపల్లి మమతతో ఆదివారం మధ్యాహ్నం మాట్లాడుతోంది. అదే గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని గోనెపల్లి అనిల్ రాజవ్వను కర్రతో కొట్టాడు. తల, చాతిలో బలమైన గాయాలవడంతో స్థానికులు జగిత్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుమారుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతితంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతిచెందిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో సోమవారం విషాదం నింపింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. సారంపల్లికి చెందిన మహమ్మద్ హమీద్(47)కు సోమవారం చాతిలో మంటగా అనిపించింది. కుటుంబ సభ్యులు బద్దెనపల్లిలోని ఆర్ఎంపీ పర్శరాములు క్లినిక్కు తీసుకెళ్లగా రెండు ఇంజక్షన్లు ఇచ్చారు. దురదృష్టవశాత్తు ఇంజక్షన్ ఇచ్చిన ఐదు నిమిషాలకే హమీద్ స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయాడు. తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు హమీద్ను వెంటనే సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు హమీద్ అప్పటికే మరణించాడని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడికి భార్య షబేరా, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యంతో తన భర్త మరణించాడని మృతుని భార్య షబేరా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రాచారి తెలిపారు. హుజూరాబాద్రూరల్: మండలంలోని శాలపల్లె ఇంద్రనగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనవేని కనుకయ్య(74) మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన కనుకయ్య రోడ్డు దాటుతుండగా హుజూరాబాద్ నుంచి జమ్మికుంట వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి కుమారుడు సంపత్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. పెళ్లయిన రెండు నెలలకే..● రోడ్డుప్రమాదంలో ఒకరు దుర్మరణం కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం తక్కళ్లపెల్లి గ్రామానికి చెందిన కండ్లి లోకేశ్ (23) బైక్ అదుపుతప్పి కింద పడి మృతిచెందాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లోకేశ్కు కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన శ్వేతతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆదివారం రాత్రి బైక్పై భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్తున్నాడు. తక్కళ్లపెల్లి శివారులో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో లోకేశ్, శ్వేత తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో లోకేశ్ మృతిచెందాడు. వివాహమైన రెండు నెలలకే లోకేశ్ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం అదుపుతప్పి యువకుడు..రాయికల్: రాయికల్ మండలం భూపతిపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతలూరుకు చెందిన జటోతు భూమేశ్ (19) అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భూమేశ్ స్నేహితుడైన దినేశ్తో కలిసి ద్విచక్ర వాహనంపై రాయికల్ నుంచి చింతలూరు వైపు వెళ్తున్నారు. భూపతిపూర్ శివారులో వాహనం అదుపుతప్పి రేలింగ్కు ఢీకొనడంతో భూమేశ్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన దినేశ్ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో భూమేశ్ కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. -
భీమేశ్వరుడికి మొక్కులు
వేములవాడ: శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం భీమన్నను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ధర్మగుండం మూసివేయడంతో భక్తులు స్నానాలు చేసేందుకు ప్రత్యేక స్నానపు గదులను రాజేశ్వరపురం వసతి గదులు కూల్చివేసిన ప్రదేశంలో ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవమూర్తులు ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా ఫ్లైఓవర్ బ్రిడ్జీలను తాత్కాలికంగా తొలగించనున్నారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలను చేపట్టే పనులపై జాతర సమన్వయ కమిటీ సమావేశాన్ని మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించనున్నారు. -
ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలే!
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్కు చెందిన ఇట్టవేని తనోజ్ సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగాడు. తనోజ్ మాట్లాడుతూ పన్నెండేళ్ల క్రితం తల్లి మరణించిందని.. ఎవరూ లేరన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్ను కలిసి విన్నవించినా తనకు ఇల్లు మంజూరు కాలేదన్నారు. -
గోవుల గోపన్న అన్వేష్
మానవ శరీర సంపూర్ణ వికాసానికి ఆవు పాలే శ్రేష్టం. ఇదే సిద్ధాంతంతో గోవుల సంతాన ఉత్పత్తినే ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు. గోవులను కొనుగోలు చేసి సంరక్షిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో ఆవులను సంరక్షిస్తున్న తీరును సాంకేతిక పరిజ్నానం (గూగుల్, యూట్యూబ్)తో తెలుసుకుంటూ అవగాహన పొందాడు. గుజరాత్ రాష్ట్రం నుంచి ఆవులను కొనుగోలు చేయగా ప్రస్తుతం వారే ఇతని వద్ద కొనుగోలు చేయడం విశేషం. కర్నాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి లేగలను తీసుకెళుతున్నారు. కాగా 40 ఆవులు, 10 లేగదూడలుండగా ఆవు పాలతో పాటు నాణ్యమైన సంతానం తీస్తూ ఏటా రూ.8లక్షల ఆదాయం గడిస్తున్నారు. -
భగవద్గీత పారాయణం
కరీంనగర్కల్చరల్: గీతా భక్త సమాజం ఆధ్వర్యంలో వైశ్య భవన్లో ఆదివారం శ్రీ భగవద్గీత– లలిత సహస్రగళ స్త్రోత్ర పారాయణం వైభవంగా జరిగింది. మలయాళ సద్గురు మఠం శ్రీ గీతా మందిరం శ్రీవిష్ణు సేవానంద గిరిస్వామి, శ్రీ సంపూర్ణ నందగిరిస్వామి, ప్రముఖ జ్యోతిష్యవాస్తు ఆగమ శాస్త్ర పండితుడు నమిలకొండ రమణాచార్యస్వామి, పరబ్రహ్మానందగిరిస్వామీ, సత్యానందస్వామి, సనక సనానందస్వామి, చిదానంద గిరిస్వామి పారాయణం విశిష్టతను వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవద్గీత, లలిత సహస్ర గళ స్త్రోత్ర పారాయణం, భజనలు చేశారు. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా సత్యం మాట్లాడుతూ.. 1885లో స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి, 141 ఏళ్లు పూర్తయ్యాయని తెలిపారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అభివృద్ధి వైపు నడిపించిందన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, ఆరెపల్లి మోహన్, ఆకారపు భాస్కర్ రెడ్డి,ఎండీ.తాజ్, పత్తి మధుకర్రెడ్డి, మడుపు మోహన్, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, పులి ఆంజనేయులుగౌడ్ పాల్గొన్నారు. -
వానాకాలం లాస్
యాసంగి భేష్..కరీంనగర్ అర్బన్: ఈ ఏడాది అకాల వృష్టి అన్నదాతను నిండా ముంచింది. సకాలంలో కురవాల్సిన వర్షాలు అకాలంతో పాటు వరుసగా విరుచుకుపడటం ఆర్థికంగా కృంగదీసింది. నీట మునిగిన పంటలు.. విరిగిన పడిన చెట్లు సాక్షిగా నిలిస్తే మొత్తంగా 2025 సంవత్సరంలో రైతన్నకు యాసంగి దన్నుగా నిలవగా.. వానాకాలం సాగు కన్నీటిని మిగిల్చింది. యాసంగి సాగుకు రైతులు సిద్ధమవుతుండగా రానున్న సంవత్సరమైనా ఆశలకు జీవం పోస్తుందో చూడాలి. ఇక పత్తి రైతులకు ఏడాదిలో ఒకే పంట కాగా పెట్టిన పెట్టుబడులు రాని దుస్థితి. ఏటా రూ.1400కోట్ల విలువ గల పంట దిగుబడి రావాల్సి ఉండగా కేవలం రూ.700కోట్లకే పరిమితమవడం రైతు ఆర్థిక స్థితిని చాటుతోంది. మార్కెటింగ్ విషయంలో ఏ వస్తువైనా తయారీ కంపెనీ ధర నిర్ణయిస్తుండగా సాగులో మాత్రం దళారీ దయపై బతకాల్సిన దారుణ దుస్థితి. సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలిన యువత సాగురంగాన్నే ఆశ్రయిస్తున్నారు. అంచనాలు తలకిందులు జిల్లాలో 70శాతానికి పైగా ప్రజల జీవనాధారం వ్యవసాయమే. పత్తి, వరి ప్రధాన పంటలు కాగా ఏటా పత్తి సాగు తదుపరి ధాన్యం విస్తీర్ణముండేది. భారీవర్షాలతో జలాశయాలు నిండుకుండను తలపించడంతో ధాన్యమే ఎక్కువగా సాగు చేశారు. పత్తి జిల్లాలో 45,605 ఎకరాల్లో సాగు చేయగా ఎకరాన 10 క్వింటాళ్లు లెక్క కట్టిన 4,56,050 క్వింటాళ్ల దిగుబడి రావాలి. చాలా చోట్ల ఎకరాన 15 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. ఈ ఏడాది తెగుళ్లు ముప్పేట దాడి చేయడం, వరుస వర్షాలతో సగానికి తగ్గింది. వ్యవసాయ మార్కెట్లు, జిన్నింగ్ మిల్లుల్లో 1.60లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా ప్రైవేట్ వ్యాపారులు మరో 40వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారని సమాచారం. పత్తితో సరాసరి దిగుబడి వస్తే రైతుల కు రూ.364.84కోట్లు రావాల్సి ఉండగా ఎకరాన 5 క్వింటాళ్లతో రైతుకు వచ్చింది రూ.183కోట్లు. ధాన్యం మోదం..ఖేదం గత యాసంగిలో 2.30లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా ఎకరాన 40నుంచి 55 బస్తాల వరకు దిగుబడి పొందారు. వానాకాలంలో వరి సాగుకే అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. 2.70లక్షల ఎకరాల్లో సాగు కాగా దొడ్డురకం 6.75లక్షల టన్నులు వస్తుందని అంచనా వేయగా కొనుగోలు చేసింది 4.60లక్షల టన్నులు మాత్రమే. సన్నరకం 2,50,038 టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వేయగా కొనుగోలు చేసింది 68,278 టన్నులు కాగా దాదాపు సగానికి దిగుబడి పడిపోయింది. -
పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
గోదావరిఖనిటౌన్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయకాలనీలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లో 1999–2000 బ్యాచ్కు చెందిన పదోతరగతి విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత ఆదివారం కలుసుకున్నారు. ఇందుకు స్థానిక ఒక ఫంక్షన్ హాల్ వేదికై ంది. చిన్ననాటి తరగతి గది జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చదువు నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్కూల్ కరస్పాండెంట్ పొరండ్ల మధు, పూర్వ ఉపాధ్యాయులు మల్లికార్జున్రెడ్డి, కల్వల నాగరాజు, రమేశ్, తిరుపతి, రాజన్న, సునీల్, సత్యనారాయణ, పూర్వ విద్యార్థులు సుకాంత్, రవి, సతీశ్, రషీద్, రాజేశ్, శ్రీలతరెడ్డి, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ మేడ్చల్
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో 2 రోజులుగా కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. రాష్ట్ర ఓవరాల్ చాంపియన్షిప్ను మేడ్చల్ జిల్లా జట్టు కై వసం చేసుకోగా.. రన్నరప్ను రంగారెడ్డి జిల్లా జట్టు గెలుచుకుంది. సాయంత్రం విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్ ట్రోఫీలను ప్రదానం చేశారు. 18 జిల్లాల నుంచి సుమారు 900 మందికి పైగా 30 నుంచి 90 సంవత్సరాల వయస్సు వారు పోటీలకు హాజరైనట్లు తెలిపారు. రాష్ట్ర పోటీల్లో రాణించిన అథ్లెట్లను జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. వివేకానంద విద్యాసంస్థల అధినేత సౌగాని కొంరయ్య, కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ జోరు.. రన్నింగ్, త్రోస్, జంప్స్ విభాగాల్లో రాణించి ఎక్కువ పతకాలు కై వసం చేసుకున్న మేడ్చల్ జిల్లా జట్టు 581 పాయింట్లతో చాంపియన్గా నిలిచింది. రంగారెడ్డి జిల్లా జట్టు 252 పాయింట్లతో ద్వితీయ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మేడ్చల్ పురుషుల విభాగంలో 250, మహిళల విభాగంలో 331 పాయింట్లు సాధించింది. పతకాలు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గంగుల ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. పలువురు విజేతలకు బంగారు, రజత, కాంస్య పతకాలను ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వయస్సు తేడా లేకుండా ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మాస్టర్ల స్టెప్పులు.. పోటీలు ముగియడంతో.. వివిధ జిల్లాలకు చెందిన అథ్లెట్లు ఆడుతూ పాడుతూ అదిరేటి స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. గెలిచిన, ఓడినవారు అనే తేడా లేకుండా ఆరోగ్యానికి వ్యాయామం అవసరమన్న సంకేతంతో జానపద పాటలపై నృత్యాలు చేసిన తీరు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ద్వితీయ స్థానంలో రంగారెడ్డి ముగిసిన 12వ రాష్ట్రస్థాయి పోటీలు -
స్కూటీ డిక్కీలోని నగదు దొంగతనం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): స్కూటీ డిక్కీలో నుంచి రూ.99వేలను దొంగిలించిన అనుమానితుడి ఫొటోను ఆదివారం తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 11న జిల్లెల్ల గ్రామానికి చెందిన పబ్బతి ఎల్లారెడ్డి సిరిసిల్ల ఎస్బీఐ బ్యాంకు నుంచి రూ.99వేలు నగదు డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టుకొని వస్తూ మార్గమధ్యలో మెడికల్ షాపు వద్ద ఆగాడన్నారు. ఈ సమయంలో దొంగతనం జరిగిందని అన్నారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించి నల్ల రంగు చొక్కా ధరించిన ఒక వ్యక్తిని అనుమానితుడిగా గుర్తించామన్నారు. అతడికి సంబంధించిన సీసీ టీవీ ఫొటోను విడుదల చేశామని అన్నారు. ఎవరైనా గుర్తిస్తే వెంటనే సెల్ నంబర్ 8712656370కు సమాచారమందించాలని కోరారు. బంగారు గొలుసు అపహరణకథలాపూర్(కోరుట్ల): గంభీర్పూర్ గ్రామానికి చెందిన ఇదునూరి సౌమ్య అనే మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. ఉదయం సౌమ్య గంభీర్పూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు ఎక్కి రామడుగు మండలం వెదిర గ్రామానికి వెళ్తుండగా.. బస్సులో ఆమె మెడలో నుంచి దొంగలు బంగారు గొలుసు అపహరించారు. సౌమ్య బస్సు దిగిన తర్వాత గొలుసు కనిపించకపోవడంతో.. గ్రామంలోని బంధువులకు సమాచారమిచ్చారు. కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని మానేరు డ్యాం కట్టపై నిర్వహించిన 11వ జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు జిల్లావ్యాప్తంగా సుమారు 130 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్ 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలను నిర్వహించారు. అంతకుముందు ఈ పోటీలను వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శి భూషణ్సింగ్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు బాబు శ్రీనివాస్గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. క్రాస్ కంట్రీ అనే వ్యాయామం తెలియకుండానే ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. నైపుణ్యం కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ తెలిపారు. సుమన్, కళ్యాణ్, వ్యాయామ ఉపాధ్యాయులు ఎండీ అజాజ్, అహ్మద్, హరికిషన్, సమ్మయ్య, రమేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
తాగి నడిపితే వాహనాలు సీజ్
● 31న 44చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు కరీంనగర్క్రైం: నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 సాయంత్రం నుంచి జనవరి 1వ తేదీ వేకువజామున వరకు నగరంలోని 44చోట్ల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, మద్యం తాగి పట్టుబడితే వెంటనే వాహనం సీజ్ చేస్తామని సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో హెచ్చరించారు. నూతన సందర్భంగా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 31న రాత్రి కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ కట్ట, తీగల వంతెనపైకి వెళ్లడం నిషేధమని సూచించారు. డీజేల వినియోగంపై పూర్తి నిషేధం ఉందన్నారు.ఽ బహిరంగప్రదేశాల్లో టపాసులు పేల్చొద్దని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై సెక్షన్ 188 ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. నగర శివార్లలోని గెస్ట్హౌస్లు, ఫాంహౌస్లపై ప్రత్యేక నిఘా ఉంచామని. డ్రగ్స్ వాడకాన్ని గుర్తించేందుకు నార్కోటీంలు, శిక్షణ పొందిన జాగిలాలు, డ్రగ్ డిటెక్ట్కిట్లు సిద్ధం చేశామన్నారు. వేడుకల సమయంలో మహిళలను వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు షీటీం నిరంతరం పర్యవేక్షిస్తాయని, ముఖ్య ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్, పికెట్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కరీంనగర్కల్చరల్: కవులు, కళాకారులు, రచయితలు, మేధావుల కలయికతో కఫిసొ సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందుతుండం అభినందనీయమని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. ఆదివారం జరిగిన కరీంనగర్ ఫిలిం సొసైటీ సర్వసభ్య సమావేశానికి హాజరై మాట్లాడారు. మరో ఏడాదిలో స్వర్ణో త్సవాలు జరుపుకోబోతున్న కరీంనగర్ ఫిలిం సొసైటీ ప్రస్థానం చారిత్రకమైందన్నారు. 2026 ఏడాదికి కరీంనగర్ ఫిలిం సొసైటీ నూతన కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎనిమిదవసారి పొన్నం రవిచంద్ర, కార్యదర్శిగా లక్ష్మీ గౌతమ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యా రు. కోశాధికారిగా చెన్నా అనిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా కోల రామచంద్రారెడ్డి, సయ్యద్ ముజఫర్, జాయింట్ సెక్రటరీలుగా మాడిశెట్టి గోపాల్, కొమరవెల్లి వెంకటేశం, కార్యవర్గ సభ్యులుగా అన్నవరం దేవేందర్, గాజోజు నా గభూషణం, రాచకొండ చక్రధర్రావు, కందుకూరి అంజయ్య ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షురాలిగా కలెక్టర్ పమేలా సత్పతి, గౌరవసలహాదారులుగా నారదాసు లక్ష్మణ్ రావు, జీవీ శ్యాంప్రసాద్లాల్, మహేశ్ కొనసాగనున్నారు. కరీంనగర్ అర్బన్: ప్రజల సమస్యల పరిష్కా రం కోసం నిర్వహించే ప్రజావాణిని యథావిఽ దిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల కోడ్తో గత కొన్ని రోజులుగా ప్రజావాణిని రద్దు చేసిన విషయం విదితమే. సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు, జిల్లా ప్రజలు తమ సమస్యలను వివరించవచ్చని పేర్కొన్నారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కె.వీ.శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని వెంకటేశ్వరకాలనీ, కమాన్, విద్యానగర్, సాలంపుర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. -
నీటి సంఘం కోసం నిరీక్షణ
వీణవంక: చెరువుల అభివృద్ధి, నిర్వహణ, పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన నీటి సంఘాల ఎన్నికలు ఏళ్లకాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. పాలకవర్గం లేకపోవడంతో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. 2006లో ప్రధాన చెరువుల పరిధిలో నీటి సంఘం ఎన్నికలు నిర్వహించారు. చైర్మన్తో పాటు డైరెక్టర్లు ఉండగా వీరి పదవీకాలం 2008లో ముగిసింది. ఇందులో రైతులే చైర్మన్లుగా వ్యవహరించారు. చెరువుల పర్యవేక్షణ పకడ్బందీగా సాగింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీటి సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంద ఎకరాల ఆయకట్టు పైన ఉన్న చెరువులకు నీటి సంఘం ఎన్నికలు నిర్వహించేవారు. సంఘం బాధ్యులు చెరువులు కబ్జాకు గురికాకుండా చూసేవారు. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు పైన ఉన్న చెరువులు జిల్లావ్యాప్తంగా 150 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 1.10లక్షల ఎకరాల వ్యవసాయ భూములకు నీరు అందుతోంది. ఎదురుచూపులేనా? నీటి సంఘాలకు నోటిఫికేషన్ ఇచ్చి చైర్మన్, డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించేవారు. ఆయా చెరువుల కింద సాగుచేసే రైతులు ఓటుహక్కు ద్వారా పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు. ఎన్నికై న పాలకవర్గం ఆయా గ్రామాల పరిధిలోని చెరువుల అభివృద్ధి, పర్యవేక్షణ, చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకుంటారు. రైతులను సమన్వయ పరుస్తారు. చెరువు ఆక్రమణకు గురైతే పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. 2008 నుంచి ఇప్పటి వరకు పాలకవర్గం లేకపోవడంతో చోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే ఫిర్యాదులు జిల్లా కార్యాలయాలకు అందుతున్నాయి. సంఘాలతో చెరువుల అభివృద్ధి గత పభుత్వం చెరువుల పూడికతీత, అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా ‘మిషన్కాకతీయ’ పనులను చేపట్టింది. ఏళ్లుగా పేరుకుపోయిన పూడికను తొలగించారు. చెరువుల లోతు పెరిగింది. నీటి లభ్యతతో పాటు మత్స్యకారులకు చేపల పెంపకం ద్వారా ఉపాధి పెరిగింది. నీటి సంఘం పాలకవర్గం లేకపోవడంతో జిల్లాలోని చాలా గ్రామాల్లో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఇటీవల సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడంతో నీటి సంఘాల ఎన్నికలు ఉంటాయని రైతుల్లో చర్చ జరుగుతోంది. పాలకవర్గం ఏర్పడితే చెరువుల పర్యవేక్షణ, అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా నీటి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు. గతంలో నీటి సంఘాల సభ్యులు చెరువుల అభివృద్ధిని చూసుకునేవారు. చెరువు నీటిని పొదుపుగా వాడుకునే విధంగా ఏర్పాట్లు ఉండేవి. ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువులు అక్రమణలకు గురవుతున్నాయి. చెరువుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. నీటి సంఘం ఎన్నికలు ప్రభుత్వం త్వరగా నిర్వహించాలి. – నాగిడి సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షుడు, ఘన్ముక్కుల -
యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్
జగిత్యాలక్రైం: సమతతో ఇన్స్టాగ్రామ్లో సంధ్య ఐడీ పేరుతో స్నేహం చేసి.. మనది ఒకటే కులం.. నేను అబ్బాయినని పరిచయం చేసుకొని.. పెళ్లి కాలేదని నమ్మించి స్నేహం చేయడంతోపాటు ఆమె అక్కతో కూడా పరిచయం పెంచుకొని సమతకు వివాహం కాకుండా అడ్డు పడడంతో.. పథకం ప్రకారమే లక్ష్మీపూర్ గ్రామానికి రప్పించి యువకున్ని హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్గౌడ్(33) జగిత్యాల పట్టణంలోని శంకులపల్లి ప్రాంతానికి చెందిన బైరవేని సమతతో ఇన్స్టాగ్రామ్లో సంధ్య ఐడీ పేరుతో స్నేహం చేశాడు. తర్వాత అబ్బాయినని, ఒకటే కులమని, పెళ్లి కాలేదని నమ్మించాడు. సమతకు తెలియకుండా ఆమె సోదరి సంధ్య ఫోన్ను హ్యాక్ చేసి ఆమె మొబైల్ నంబరును లేడీస్ సారీస్ కలెక్షన్స్ అనే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశాడు. సంధ్యతో కూడా తరచూ మాట్లాడుతూ చాటింగ్ చేసేవాడు. అతడికి వివాహమైందని తెలిసి సమత దూరంగా ఉంటోంది. సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే విషయం తెలుసుకొని వివాహం చేసుకోవద్దని, తననే పెళ్లి చేసుకోవాలని, లేకుంటే నీ ఫొటోలు మార్ఫింగ్ చేసి పెళ్లి కొడుకుకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మీ అక్క సంధ్య కూడా నాతో ఫోన్లో మాట్లాడుతోందని, ఆమె ఫొటోలు, మీ కుటుంబ సభ్యుల ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. వెంటనే సమత అక్క సంధ్యకు జరిగిన విషయమంతా తెలిపింది. విషయాన్ని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మేనమామ నరేశ్కు తెలిపారు. నరేశ్, సంధ్య కుమారుడు రాజశేఖర్, అతడి ఇద్దరు మిత్రులతో కలిసి మహేందర్ను హత్య చేయాలని పథకం పన్నారు. సంధ్యతో మహేందర్కు ఫోన్ చేయించి లక్ష్మీపూర్ గ్రామానికి రావాలని పిలిపించారు. శుక్రవారం సంధ్యకు వాట్సాప్ మెసేజ్ ద్వారా శనివారం వస్తానని చెప్పాడు. మధ్యాహ్నం 3 గంటలకు మహేందర్ రాత్రి 10 లేదా 11 గంటలకు వస్తానని మెసేజ్ చేశాడు. సమతను వారి అమ్మమ్మ వారి ఇంట్లో ఉంచి నరేశ్కు చెందిన కారులో జగిత్యాల కొత్త బస్టాండ్కు వచ్చారు. వెనకాల స్కూటీపై సంధ్య కొడుకు రాజశేఖర్, అతడి స్నేహితులు వచ్చారు. సంధ్య కారులోంచి దిగి స్కూటీ తీసుకొని మహేందర్ రాగానే రాత్రి 10 గంటల సమయంలో కొత్త బస్టాండ్ నుంచి స్కూటీపై ఎక్కించుకొని లక్ష్మీపూర్కు బయల్దేరారు. వెనకాలే నరేశ్, రాజశేఖర్, అతడి ఇద్దరు స్నేహితులు స్కూటీని ఫాలో అవుతూ కారులో వచ్చారు. మహేందర్ ఇంట్లోకి చేరుకున్న కొద్దిసేపటికే నరేశ్, రాజశేఖర్, అతడి ఇద్దరు స్నేహితులు రావడం చూసి మహేందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సంధ్య గేటు వద్ద మహేందర్ను పట్టుకోగా.. నరేశ్, రాజశేఖర్, మరో ఇద్దరు కొట్టి బెదిరించి ఫోన్ లాక్కున్నారు. సంధ్య ఇంట్లో ఉన్న కారంపొడి మహేందర్పై చల్లింది. అప్పటికే గాయాలైన మహేందర్ కింద పడిపోయాడు. కర్రలు, ఇనుప రాడ్తో రాజశేఖర్, అతడి ఇద్దరు మిత్రులు దాడి చేశారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహేందర్ను జగిత్యాల ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను ఆదివారం లక్ష్మీపూర్ గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. లక్ష్మీపూర్కు చెందిన గర్వందుల సంధ్య, గర్వందుల రాజశేఖర్, గర్వందుల నరేశ్, శంకులపల్లికి చెందిన బైరవేని సమతను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. స్కోడా కారు, స్కూటీ, ఇనుప రాడ్, కర్ర, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసులో ఉన్న నలుగురిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ సుధాకర్, రూరల్ ఎస్సై ఉమాసాగర్ పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్లో స్నేహంతో పరిచయం అక్క, చెల్లెలిని ట్రాప్ చేసిన వైనం పథకం ప్రకారమే హత్య డీఎస్పీ రఘుచందర్ -
ఆలయంలోకి దూసుకెళ్లిన బోర్వెల్ వాహనం
సిరిసిల్ల అర్బన్: పట్టణ పరిధిలోని చంద్రంపేట చౌరస్తా వద్ద ఆదివారం ఓ బోర్వెల్ లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న హనుమాన్ దేవాలయంలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల ప్రకారం.. వేములవాడ నుంచి వస్తున్న గణేశ్ బోర్వెల్ వాహనం చంద్రంపేట చౌరస్తా వద్ద కోనరావుపేట వైపు వెళ్లే క్రమంలో అదుపుతప్పి ఆలయంలోకి దూసుకెళ్లింది. ఆలయ గోడ కూలిపోగా.. అక్కడే కంకులు అమ్ముకుంటున్న సూర పాపయ్య ప్రాణాపాయం నుంచి తప్పించుకొని స్వల్ప గాయాలకు గురయ్యాడు. వెంటనే స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ సీఐ కృష్ణ పరిశీలించారు. డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. -
బడి వంట.. ధరల మంట
జిల్లాలో పాఠశాలలు.. విద్యార్థుల వివరాలుకరీంనగర్టౌన్: కూరగాయల ధరలు కుతకుతలాడుతుండగా.. కోడిగుడ్డు కొండెక్కింది. పెరిగిన కూరగాయల ధరలతో సామాన్యులు సతమతం అవుతుండగా.. ప్రభుత్వ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వచ్చే బిల్లులు సరుకులకు సరిపోక.. ఇచ్చే వేతనాలతో ఇల్లు గడవక, పెరుగుతున్న ధరలతో అప్పు చేసి మరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్నామని వాపోతున్నారు. జిల్లాలో 607 పాఠశాలలు జిల్లాలో 607 పాఠశాలలు ఉన్నాయి. 36,127 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం స్వీకరిస్తున్నా రు. 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వం, 9,10 తరగతుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజనం అందిస్తున్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6.78, 6 నుంచి 10వ తరగతి వరకు రూ.10.17 చొప్పున మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులకు అందిస్తున్నారు. రూ.3000 చొప్పు న గౌరవ వేతనం ఇస్తున్నారు. కేంద్రం నుంచి అక్టోబర్, నవంబర్ బిల్లులు, వేతనాలు, రాష్ట్రం నుంచి జూలై నుంచి నవంబర్ బిల్లులు రావాల్సి ఉంది. 4నెలల కోడిగుడ్ల బిల్లులు బకాయి ఉన్నాయి. 80శాతం కోడిగుడ్డుకే వారంలో మూడు రోజులు కోడిగుడ్డు పెట్టాలనేది నిబంధన. ప్రస్తుతం మార్కెట్లో కోడిగుడ్డు ధర రూ.7.30 నుంచి రూ.8వరకు పలుకుతోంది. ప్రతి విద్యార్థికి అందిస్తున్న రూ.10.17లో 80శాతం కోడిగుడ్డుకే వెచ్చించాల్సి వస్తోంది. మిగిలిన డబ్బులతోనే పప్పుచారు లేదా కూర వండాలి. పెరిగిన ధరలతో మెనూ ప్రకారం ఎలా వడ్డించేదని నిర్వాహకులు వాపోతున్నారు. అప్పుల కుప్పలు.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే. ఏజెన్సీలకు సరైన వేతనాలు ఇవ్వకపోగా, బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో మధ్యాహ్న నిర్వాహకులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. రూ.3000 గౌరవ వేతనం కూడా సరిగ్గా అందడం లేదని అంటున్నారు. పెరిగిన ధరలతో మెనూ ఎలా అమలు చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై మండల నోడల్ అధికారులు, విద్యాశాఖ ఉన్నత అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.పాఠశాలలు సంఖ్య విద్యార్థులు ప్రాథమిక 387 12,593 ప్రాథమికోన్నత 63 2,034 ఉన్నత 157 21,500 మొత్తం 607 36,12725 ఏళ్లుగా మధ్యాహ్న భోజన నిర్వాహకురాలిగా పనిచేస్తున్న. గౌరవ వేతనం రూ.3వేలు ఇవ్వడం బాధాకరం. పెరిగిన ధరలతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలంటే అప్పుల పాలవుతున్నాం. బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం గుడ్డుకే రూ.7.50 పెట్టి వారంలో మూడు రోజులు పెడుతున్నాం. ఏనాటికై నా ఉద్యోగం ఉంటుందనే భరోసాతో పనిచేస్తున్నాం. ప్రభుత్వం గుర్తించాలి. – బుర్ర మంజుల, మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా అధ్యక్షురాలుమధ్యాహ్న భోజన నిర్వాహకులకు హైకోర్టు ఉత్వర్వుల ప్రకారం కనీస వేతనం రూ.17వేలు చెల్లించాలి. సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇంతకు ముందు విద్యార్థులకు ఇచ్చిన రేటు ఇస్తే గిట్టుబాటు కాదు. చేసిన కూలీ మాపైనే భారం పడుతోంది. ప్రస్తుతం అప్పుతెచ్చి విద్యార్థులకు వండి పెడుతున్నాం. – డి.బాబాయి, మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
డంప్యార్డ్ను తొలగించాలి
కరీంనగర్ కార్పొరేషన్: డంప్యార్డ్ను తొలగించి, ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తూ బాధితకాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. ఆదివారం ఉదయం ఆటోనగర్లోని డంప్యార్డ్ వద్ద పెద్దసంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డంప్యార్డ్ హటావో, కరీంనగర్ బచావో అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డంప్యార్డ్కు చెత్తను తీసుకువచ్చే ఆటోలు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అలకాపురికాలనీకి చెందిన దుంపేటి రాము మాట్లాడుతూ డంప్యార్డ్తో సమీపడివిజన్ల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డంప్యార్డ్లో మంటలు చెలరేగి, పొగలు వ్యాపించి శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారని ఆవేదన చెందారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. -
కబడ్డీ చాంపియన్లు సూర్యాపేట, హైదరాబాద్–2
మహిళల రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు మహిళల చాంపియన్షిప్ కై వసం చేసుకున్న హైదరాబాద్–2 జట్టు కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో 4 రోజలపాటు జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. పురుషుల విభాగంలో సూర్యాపేట జిల్లా జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకోగా.. మహిళల విభాగంలో హైదరాబాద్–2 జట్టు విజేతగా నిలిచింది. పురుషుల విభాగంలో రన్నర్గా జోగులాంబ గద్వాల్ జట్టు, తృతీయ స్థానాల్లో నిజామాబాద్, నాగర్ కర్నూల్ నిలిచాయి. మహిళల విభాగంలో రన్నర్గా రంగారెడ్డి జిల్లా జట్టు, తృతీయ స్థానాల్లో వరంగల్, ఖమ్మం జట్లు నిలిచాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా కబడ్డీ క్రీడాకారులకు రెండు ఆస్ట్రోటర్ఫ్ కోర్టులు ఇచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర పోటీలతో కబ్డడీకి మరింత క్రేజ్ వచ్చిందన్నారు. మహిళల జాతీయస్థాయి కబడ్డీ పోటీలు హైదరాబాద్లోని పటాన్చెరులో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరుగుతాయని రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి తెలిపారు, రాష్ట్ర కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ అమిత్కుమార్, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు. రన్నర్గా నిలిచిన జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి జిల్లాలు ముగిసిన 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ పోటీలు ట్రోఫీలు ప్రదానం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ -
బైక్ను నడుముకు కట్టుకొని.. బావిలో దూకి..
● పెగడపల్లిలో వ్యక్తి బలవన్మరణం పెగడపల్లి(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన బైక్ను తాడుతో నడముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిరణ్కుమార్ వివరాల ప్రకారం.. బండారు వెంకటేశం(50) కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం తన బైకుపై బయటకు వెళ్లిన వెంకటేశం.. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆదివారం కుంటుంబ సభ్యులు వెతికారు. గ్రామ శివారులోని దాసరి పాపయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద చెప్పులు, ఇతర వస్తువులు కనిపించాయి. బావిలో చూడగా.. బైక్తో సహా వెంకటేశం మృతదేహం లభించింది. మృతుడి భార్య గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. -
భీమన్న గుడిలో భక్తుల రద్దీ
వేములవాడ: భీమన్నను ఆదివారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈనెల 30న ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భీమేశ్వరాలయంలో 4 నుంచి 4.30 గంటల వరకు ఆలయ శుద్ధి, 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 5.45 గంటలకు పల్లకీసేవలపై ఉత్తరద్వార ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భీమన్న సేవలో భూపాలపల్లి ఎమ్మెల్యే వేములవాడ: భీమేశ్వరస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆదివారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి, కోడెమొక్కు చెల్లించుకున్నారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్కుమార్, పర్యవేక్షకులు రాజేందర్, జూనియర్ అసిస్టెంట్ కుమార్, నరాల రాజు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావుకు ప్రసాదాలు అందజేస్తున్న ఏఈవో అశోక్ -
మానేరు దాటి.. భూపాలపల్లిలోకి పెద్ద పులి
మంథనిరూరల్: రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లా మంథని అడవుల్లో సంచరించిన పెద్ద పులి.. ఆది వారం మానేరు నది దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం సాయంత్రం మంథని మండలం భట్టుపల్లి అటవీ ప్రాంతంలో పులి అడుగులు గుర్తించిన అటవీ శాఖ అధికారులు.. ఆదివారం తిరిగి గాలింపు చర్యలు చేపట్టారు. భట్టుపల్లి అటవీ ప్రాంతం నుంచి అడవిసోమన్పల్లి మానేరు నదిలో పులి అడుగుల కోసం అన్వేషణ చేపట్టారు. అయితే మానేరు తీర ప్రాంతంలో అడుగులు కన్పించకపోవడంతో అధికారులు అడవిలోనే మకాం వేసినట్లు భావించారు. కానీ ఆదివారం ఉదయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఓ ఎద్దుపై దాడి చేసినట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంథని, ముత్తారం మండలాల్లోని మానేరు తీర ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు 2 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లభించలేదు. అయితే ముత్తారం మండలం ఓడేడ్, అడవిశ్రీరాంపూర్ మానేరు నది మీదుగా చిట్యాల వైపు వెళ్లే అవకాశాలున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ గాలింపు చర్యల్లో ఎఫ్ఎస్వోలు నర్సయ్య, రహ్మతుల్లా హుస్సేన్, సోని కిరణ్, అఫ్జల్ అలీ, ఎఫ్బీవోలు ప్రదీప్, శ్రీకాంత్, రాంసింగ్, ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
గొల్లపల్లి(ధర్మపురి): అబ్బాపూర్లో రోడ్డు ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడపాక లింగయ్య(57), లచ్చవ్వ(49) గ్రామంలో మేసీ్త్ర పని చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం లచ్చవ్వ బంధువుల ఇంటికి హైదరాబాద్ వెళ్లేందుకు ఆదివారం ద్విచక్ర వాహనంపై దంపతులిద్దరూ కలిసి జగిత్యాల వెళ్తుండగా.. జగిత్యాల నుంచి గొల్లపల్లి వైపు అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన తవేరా వాహనం గొల్లపల్లి శివారులో బలంగా ఢీకొంది. లచ్చవ్వ అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్ర గాయాలపాలైన లింగయ్యను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ రాంనర్సింహారెడ్డి వివరాలు సేకరించారు. వీరికి వివాహమైన కొడుకు, కూతురున్నారు. కోడలు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. -
5లక్షల గొర్రెలకు నట్టలమందు
కరీంనగర్రూరల్: జిల్లాలోని 5.20లక్షల గొర్రెలు, మేకలకు ప్రభుత్వం ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తోందని జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి ఎన్.లింగారెడ్డి తెలిపారు. శనివారం కరీంనగర్ మండలం చేగుర్తిలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని 25 పశువైద్యశాలలు, 37 ఉపకేంద్రాల ద్వారా గొర్రెలు, మేకలకు నట్టల నివారణమందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేస్తున్న నట్టల నివారణ మందును గొర్రెపెంపకందారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా అడహక్ కమిటీ చైర్మన్ బాషవేణి మల్లేశం యాదవ్, సర్పంచ్ బాషవేణి సరోజన, ఉపసర్పంచ్ గాలిపల్లి రవీందర్, పశువైద్యులు జ్యోత్స్య, రామకృష్ణ, గట్టయ్య పాల్గొన్నారు. -
తగ్గిన నేరాలు..
ఆదివారం శ్రీ 28 శ్రీ డిసెంబర్ శ్రీ 2025జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 30నుంచి 60ఏళ్ల వయసులోనూ 20ఏళ్ల యువతలా పోటీల్లో పలువురు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 800 మీటర్ల రన్నింగ్కు క్లాప్ కొట్టారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. పలువురు ఆటల్లో రాణించి.. పతకాలు సాధించారు. – వివరాలు 8లోu తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి -
చలితో జాగ్రత్త..
కరీంనగర్: చలి గాలులు అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొద్దిరోజుల నుంచి విపరీతమైన చలి, పొగమంచు కారణంగా పట్టపగలు కూడా సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. శీతల గాలుల ప్రభావం, సమతుల్యత లేని వాతావరణం, కాలుష్యంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ వైద్యం, మందులు తదితర అంశాలపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణతో శనివారం ‘సాక్షి’ ఫోన్ఇన్ నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు అడిగిన ప్రశ్నలకు డీఎంహెచ్వో వివరంగా సమాధానం ఇచ్చారు. -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో శనివారం క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. పురుషుల విభాగంలో సూర్యపేట, జనగాం, నిజామాబాద్ జట్లు క్వార్టర్స్లో అడుగుపెట్టాయి. మహిళల విభాగంలో హైదరాబాద్ 2, రంగారెడ్డి జట్లు సెమీస్లో చేరగా ఆదివారం వరంగల్, గద్వాల్ జట్లు, కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయి. పోటీలను విప్ ఆది శ్రీనివాస్ క్రీడాకారులను పరిచయం చేసుకొని ప్రారంభించారు. కాగా స్టేడియంలో రాత్రి మంచు ఎక్కువగా కురవడంతో టెక్నీకల్ కమిటీ బాధ్యులు అనిల్కుమార్, శ్రీనివాస్ పోటీలను వాయిదా వేశారు. పురుషుల విభాగంలో హనుమకొండ– నల్గొండ, మేడ్చల్– రంగారెడ్డి జట్లు, మహిళల విభాగంలో గద్వాల్, వరంగల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లను ఆదివారం తిరిగి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో కరీంనగర్ పురుషుల జట్టు జనగాం జట్టుతో తలపడగా 51–21 స్కోర్తో ఓటమి చెందింది. మహిళల జట్టు సూర్యపేటపై 43–13 స్కోర్తో క్వార్టర్స్కు చేరింది. ఆదివారంతో పోటీలు ముగియనున్నట్లు సంఘం బాధ్యులు తెలిపారు. బహుమతి ప్రదానోత్సవ కా ర్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ హాజరుకానున్నట్లు పేర్కొన్నా రు. కబడ్డీ సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ అ మిత్కుమార్, మల్లేశ్గౌడ్, సీహెచ్ సంపత్రావు, ల క్ష్మీనారాయణ, ఎల్లాగౌడ్, మల్లేశం, మహేందర్రెడ్డి, రవీందర్, పోలీస్ అధికారులు భీంరావు, విజయ్కుమార్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మహిళల సెమీస్లో హైదరాబాద్– 2, రంగారెడ్డి జట్లు నేడు ముగింపు.. హాజరుకానున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ -
దైవదర్శనం చేసుకొని ఇంటికి వెళ్తుండగా..
మెట్పల్లిరూరల్(కోరుట్ల): దైవదర్శనం అనంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతిచెందారు. వారి కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మారుతినగర్ శివారులో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్(41), అతడి భార్య లావణ్య(35), పదిహేనేళ్ల కూతురు కీర్తి శనివారం కొండగట్టు అంజన్నస్వామి దర్శనానికి కారులో వచ్చారు. దర్శనం తర్వాత కుటుంబసభ్యులు సాయంత్రం సమయంలో తిరిగి ఇంటికి పయణమయ్యారు. ఈ క్రమంలో మెట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మారుతినగర్ శివారులోకి చేరుకునేసరికి ఎదురుగా వస్తున్న లారీ, వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొన్నాయి. దంపతులు తీవ్రగాయాలపాలై మృతిచెందారు. కీర్తి పరిస్థితి విషమంగా ఉండగా చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో మోహన్ మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు రెండుగంటల పాటు శ్రమించారు. ఘటన స్థలాన్ని మెట్పల్లి సీఐ అనిల్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకున్నారు. అనంతరం మోహన్–లావణ్య దంపతుల మృతదేహాలను మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మోహన్(ఫైల్) లావణ్య(ఫైల్) మెట్పల్లి మండలం మారుతినగర్లో లారీ–కారు ఢీ దంపతులు మృతి, కూతురు పరిస్థితి విషమం మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందినవారు -
కరీంనగర్ను నంబర్వన్స్థానంలో నిలుపుతాం
2026లో రాష్ట్రంలో కరీంనగర్ను నేరాల నియంత్రణలో మొదటిస్థానంలో నిలుపుతామని సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం కమిషనరేట్లో వార్షిక నేరాల నివేదిక–2025ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాది కన్నా ఈసారి క్రైంరేట్ తగ్గిందన్నారు. మిస్సింగ్ కేసులను లోతుగా విచారిస్తున్నామని, చాలా వరకు మిస్టరీ మర్డర్లుగా మారుతున్నాయని, నాణ్యమైన దర్యాప్తుతోనే కేసులను వేగంగా ఛేదిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్త పోలీస్ స్పోర్ట్స్మీట్, ఎమ్మెల్సీ, గ్రామపంచాయతీ ఎన్నికలు, వివిధ పండగలు, ర్యాలీల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామన్నారు. టాస్క్ఫోర్స్, ఎస్బీ, సీసీఎస్లకు నూతన భవనాలు కేటాయించామని, అన్ని పోలీసుస్టేషన్లు ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. షీలీడ్స్ ద్వారా మహిళ పోలీసులకు విధులు కేటాయించి, శిక్షణ ఇచ్చామన్నారు. సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్, సీసీ కెమెరాల ద్వారా చాలా వరకు నేరాలు స్వల్ప వ్యవధిలోనే ఛేదిస్తున్నామన్నారు. ట్రాఫిక్ విషయంలో ప్రతీరోజు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ కళాశాలలపై దృష్టిసారిస్తామన్నారు. రౌడీషీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేశామని హెచ్చరించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్కుమార్, మాధవి పాల్గొన్నారు. -
ఇదీ.. బాలానగర్కాలనీ
బాలానగర్లోని చర్చి బాలానగర్లోని విశాలమైన రోడ్లు వేములవాడరూరల్: తాటి కమ్మలు.. ఈత ఆకులు.. పూరి గుడిసెలు.. ఇది ఐదు దశాబ్దాల క్రితం బాలానగర్కాలనీలో పరిస్థితి. కానీ నేడు అధునాతన బంగ్లాలు.. కార్లు.. హైస్పీడ్ బైక్స్.. నేటి దృశ్యాలు. యాభై ఏళ్లలో వలసల ఊరు అద్భుతంగా అభివృద్ధి చెందింది. కష్టాన్ని నమ్ముకున్న పల్లెప్రజలు ఒక్కో రూపాయి కూడబెట్టి ఆర్థికంగా బలోపేతం అయ్యారు. నాడు తాటికమ్మల గుడిసెల్లో కాలం వెల్లదీసిన వారు.. నేడు జూబ్లిహిల్స్.. బంజారాహిల్స్లను తలదన్నేలా భవంతులు నిర్మించుకున్నారు. జీవనశైలిలోనూ మార్పులు వచ్చాయి. పిల్లలు ఉన్నత ఉద్యోగాలు చేస్తుండగా.. పెద్దలు వ్యవసాయాన్ని నమ్ముకొని ఊరిపట్టున ఉంటున్నారు. వలస ప్రజలతో ఏర్పడ్డ బాలానగర్కాలనీ ఉరఫ్ గుంటూరుపల్లి గురించి తెలుసుకుందాం. 1970లో మొదలైన వలసలు ఇప్పటి రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రాంతానికి 1970 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా నుంచి ఆరు కుటుంబాలు వలస వచ్చాయి. పత్తిపంటను ఈ ప్రాంతానికి వీరే పరిచయం చేశారు. ఆ సమయంలో వీరికి వేములవాడ శివారు ప్రాంతంలో మల్లయ్య అనే ఫాదర్ దాదాపు 15 ఎకరాలలో నివాసాలకు అవకాశం కల్పించారు. అలా మొదలైన బాలానగర్కాలనీ ఏర్పాటైంది. ఆరు కుటుంబాలతో మొదలైన కాలనీ నేడు 105 కుటుంబాలకు చేరింది. ప్రస్తుతం ఈ ఊరిలో 350 ఓటర్లతో 70 నివాసాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్నారు. గుంటూరు నుంచి వలస రావడంతో గుంటూరుకాలనీ అనే మరో పేరు కూడా ఉంది. మున్సిపాలిటీలో 15వ వార్డుగా గుర్తించారు. విశాలమైన ఇళ్లు నిర్మించుకున్నారు. ఒక్కో కుటుంబం ఇంటి కోసం 15 నుంచి 20 గుంటల స్థలాన్ని ఉంచుకుంటున్నారు. ఇందులోనే అన్ని సౌకర్యాలతో ఇళ్లను కట్టుకుంటున్నారు. కాలనీలో అన్ని సీసీరోడ్లు కనిపిస్తాయి. క్యాథలిక్ చర్చిని నిర్మించుకున్నారు. పంటల సాగులో ఆదర్శం బాలానగర్కాలనీ(గుంటురుకాలనీ) ప్రజలు పత్తి, పచ్చిమిచ్చి సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొన్నేళ్లుగా సరికొత్త పంటలు పండిస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు. అన్నింటికి ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. సీసీరోడ్లు, చర్చి, వాటర్ ట్యాంకు, ఇతర సౌకర్యాలు వారి సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్నారు. విదేశాల్లో ఉద్యోగాలు బాలానగర్ రైతులు తమ పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. 105 కుటుంబాల్లో దాదాపు 15 మంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 10 కుటుంబాల్లోని పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. రెడ్డి సొసైటీగా అభివృద్ధి బాలానగర్ రైతులంటేనే గతంలో గుంటూరు పల్లె అనేవారు. ప్రస్తుతం ఒకే మతానికి చెందిన వీరందరు రెడ్డి సొసైటీని ఏర్పాటు చేసుకుని వార్డులో ఒకరికొకరు తోడుగా నిలుస్తున్నారు. ఈ కమిటీకి ఇతర సొసైటీల నుంచి నిధులు తీసుకుని అభివృద్ధి చెందుతున్నారు. కలిసికట్టుగా ఉంటాం బాలానగర్ కాలనీలోని వాళ్లం ఒకే కుటుంబంగా కలిసి ఉంటాం. అందరం ఒక్క సామాజిక వర్గానికి చెందిన వాళ్లమే. ఎప్పుడూ గొడవలు పడము. ఎవరి ఇంట్లో ఆపద వచ్చినా అందరం ముందుంటాం. కష్టసుఖాల్లో కలిసి ఉంటాం. – మ్యాకల రాయపురెడ్డి, బాలానగర్కష్టపడి ఎదిగాం బాలానగర్ రైతులంటేనే గతంలో చిన్నచూపు చూసేవారు. అలాంటి కష్టకాలంలో మేము వ్యవసాయాన్ని నమ్ముకొని సొంతంగా ఎదిగాము. మా పిల్లలు కూడా మా కష్టాన్ని అర్థం చేసుకుని ఉన్నతస్థానంలో ఉండడం మాకెంతో సంతోషం. అందరం ఇప్పటికీ కలిసికట్టుగా ఉంటాం.– తుమ్మ ఎన్నారెడ్డి, బాలానగర్ గుంటూరు నుంచి వలసలు కష్టాన్ని నమ్ముకున్నారు పేదరికాన్ని జయించారు శ్రీమంతులకు కేరాఫ్ గుంటూరుపల్లి -
252 జీవోను సవరించాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నంబరు 252ను వెంటనే సవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో ఫీల్డ్ రిపోర్టర్లు, డెస్క్ జర్నలిస్టులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025 జర్నలిస్టుల మధ్య విభజన సృష్టిస్తున్నాయన్నారు. డెస్క్ జర్నలిస్టులకు పూర్తి అక్రిడిటేషన్ కార్డు ఇవ్వకుండా ‘మీడియా కార్డు’ పేరిట వేరుచేయడం అసంతృప్తికి కారణమవుతోందన్నారు. కొత్త జీవోలోని నిబంధనలు అస్పష్టంగా ఉండటం, చిన్న పత్రికలు, కేబుల్ చానళ్లు, ఫ్రీలాన్స్ జర్నలిస్టులపై కఠిన నియమాలు విధించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టుల మధ్య తేడా లేకుండా ఒకే విధంగా అక్రిడిటెడ్ జర్నలిస్టులుగా గుర్తించేలా జీవోను సవరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఆందోళనలో టీయూడబ్ల్యూజే హెచ్–143 జిల్లా అధ్యక్షుడు చెరుకు గోపాలకృష్ణ, నాయకులు ప్రకాశ్రావు, వేణుగోపాలరావు, జెర్రిపోతుల సంపత్, రామకృష్ణ, హృషికేష్, కొండల్రెడ్డి, యాదగిరి, డెస్క్ జర్నలిస్ట్లు సంపత్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష
కరీంనగర్క్రైం: తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఆదేశాల ప్రకారం.. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డి.శరత్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సమీక్ష సమావేశం శనివారం జిల్లా కోర్టు ఆవరణలో జరిగింది. శరత్ మాట్లాడుతూ ప్రాసిక్యూటర్లు విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలన్నారు. కేసుల విచారణ సమయంలో పూర్తి అవగాహనతో వెళ్లాలని సూచించారు. అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వేముల లక్ష్మీ ప్రసాద్ బెయిల్ పిటిషన్లతోపాటు కేసుల విచారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మల్యాల ప్రతాప్, రవీందర్, మంచికట్ల రాజేశం, సీహెచ్ రామకృష్ణ, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఆరెల్లి రాములు, కాసారం మల్లేశం, బిట్ల నర్సయ్య, ఝాన్సీ, పద్మజా పాల్గొన్నారు. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలుకరీంనగర్: కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతు కారణంగా ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. కోర్టు వెనుక భాగం ప్రాంతం, కెమిస్ట్భవన్ ఏరియా, వెంకటేశ్వర ఆలయం, శివథియేటర్ ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు. -
ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక
కొడిమ్యాల(చొప్పదండి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకటస్వామి స్మారక టీ– 20లో పాల్గొనే ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఎర్రోజు తక్షిల్ ఎంపికయ్యాడు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 26 వరకు కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జట్ల మధ్య నిర్వహించిన టోర్నమెంట్లో తక్షిల్ జగిత్యాల కెప్టెన్గా వ్యవహరించాడు. బ్యాటింగ్, బౌలింగ్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపికై న సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, కళాశాల స్పోర్ట్స్ ఇన్చార్జ్ భాస్కర్ అధ్యాపకులు అభినందించారు. న్యాయం చేయాలని ఆందోళనకరీంనగర్క్రైం: క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ కేసులో బాధితుడైన తమ కొడుకును కాపాడాలని కరీంనగర్లోని జ్యోతినగర్కు చెందిన వంగల స్వప్న, రమణ శనివారం కలెక్టరేట్ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని తమ కుమారుడి నమ్మించి రమేశ్తో పాటు మరికొంత మంది రూ.25 లక్షలు తీసుకుని మోసం చేశారన్నారు. ఈ విషయంలో మోసపోయిన తమ కుమారుడిని కూడా పోలీసులు జైలుకు పంపించారని తెలిపారు. రూ.11 లక్షలు చెల్లించాలని రమేశ్, పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. జీవన మార్గదర్శిని భగవద్గీతకరీంనగర్టౌన్: కరీంనగర్లోని కోట పబ్లిక్ స్కూల్, జూనియర్ కళాశాలల్లో శనివారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీత్రిదండి దేవనాథ రామానుజ జీయర్స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, టీఆర్ఎస్ఎంఏ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విద్యాసంస్థలను సందర్శించి కోటా కుటుంబానికి తమ ఆశీర్వాదాలు అందించారు. ఈసందర్భంగా రామానుజ జీయర్ స్వామి మాట్లాడుతూ, శ్రీభగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదని, జీవన మార్గదర్శి అని పేర్కొన్నారు. గీతలో చెప్పిన కర్మయోగం, భక్తియోగం, జ్ఞానయోగం విద్యార్థుల జీవితాలను సరైన దిశలో నడిపిస్తాయని, చదువుతో పాటు సంస్కారం ఎంతో అవసరం వివరించారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ, కోటా విద్యాసంస్థలు విద్యతో పాటు నైతిక విలువలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. చైర్మన్ డి.అంజిరెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులున్నారు. దూషించినవారిపై కేసుపెద్దపల్లిరూరల్: పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని దూషించినవారిపై కేసు నమోదైంది. రూరల్ ఎస్సై మల్లేశ్ తెలిపిన వివరాలు.. పెద్దపల్లి మండలం మారెడుగొండ పంచాయతీ సర్పంచ్ పదవికి సిరిసెట్టి కొమురయ్య పోటీ చేసి ఓడిపోయాడు. కాగా తనకు ఓటు వేయలేదని కొమురయ్యతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు గ్రామానికి చెందిన జక్కుల నాగమణిని ఇష్టారీతిన దూషించి, దాడి చేశారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై పేర్కొన్నారు. కూలీలపై తేనెటీగల దాడికోనరావుపేట(వేములవాడ): మండలంలోని రామన్నపేట గ్రామంలో శనివారం వ్యవసాయ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. గ్రామానికి చెందిన తడకమడ్ల అరవింద్, అతడి తల్లి సత్తమ్మ వరినాట్లు వేసేందుకు పొలం వద్దకు వెళ్లారు. వీరితోపాటు మరికొంత మంది కూలీలు ఉన్నారు. నాట్లు వేసేందుకు సిద్ధమవుతుండగా తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేయడంతో అరవింద్, సత్తమ్మ, వజ్రవ్వ, సుమన్, విక్రమ్ గాయపడ్డారు. బాధితులను 108 అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
ఒలింపిక్స్లో పతకాలు సాధించాలి
కరీంనగర్స్పోర్ట్స్: ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించేలా ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి 12వ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలపై సంపూర్ణ అవగాహన కలిగి, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవతో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించినట్లు చెప్పారు. రాబోయే ఒలింపిక్స్ మొదలు ప్రతీ ప్రపంచ క్రీడా వేదికలపై తెలంగాణ క్రీడాకారులు మువ్వన్నెల జెండా ఎగరవేయాలనేది ప్రభుత్వ ఆశయమన్నారు. కాగా, 30 ఏళ్ల నుంచి మొదలుకొని 90 ఏళ్ల వయస్సు వారికి పోటీలు నిర్వహించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు అంజన్కుమార్, అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దేవేందర్రెడ్డి, అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్గౌడ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, డాక్టర్ చాట్ల శ్రీధర్, నీలం లక్ష్మణ్, డి.లక్ష్మి, కిషన్రావు, శిరీష, శాట్స్ రిటైర్డ్ ఏడీలు నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య భారతాన్ని నిర్మిద్దాం: ఎంపీ ఈటల వయస్సు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో భాగస్వాములు కావాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. 800 మీటర్ల రన్నింగ్ను ప్రారంభించి మాట్లాడారు. ఆటలు ఆటవిడుపుగానే కాకుండా ఆరోగ్యకర జీవనానికి దోహదపడుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాల మొదలు కళాశాల అన్ని స్థాయిల్లో ప్రతిభావంతుల్ని గుర్తించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కవాతు పోటీల్లో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మాస్టర్ అథ్లెట్ల మార్చ్ఫాస్ట్ ఆకట్టుకుంది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగారెడ్డి జిల్లాకు ప్రథమ, ని జామాబాద్కు ద్వితీయ బహుమతులను మంత్రి పొ న్నం, విప్ ఆది, ఎమ్మెల్యే కవ్వంపల్లి అందజేశారు. బెస్ట్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ దివ్యారెడ్డి అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా బెస్ట్ ఇయర్ ఆఫ్ ది మాస్టర్ అథ్లెట్ అవార్డును బి.దివ్యారెడ్డి (మేడ్చల్)కి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి అందజేశారు. 45 ఏళ్ల వయస్సు విభాగంలో 800 మీటర్ల రన్నింగ్ను 3.33 నిమిషాల్లో చేరుకొని బంగారు పతకం సాధించింది. అలాగే కొన్నేళ్లుగా 100, 400, 800 మీటర్ల రన్నింగ్లో పాల్గొని బంగారు పతకాలు కై వసం చేసుకుంది. దీంతో అవార్డును ప్రదానం చేశారు. క్లాప్ కొట్టి పోటీలను ప్రారంభిస్తున్న ఎంపీ ఈటల రాజేందర్మాట్లాడుతున్న మంత్రి పొన్నం, చిత్రంలో విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే సత్యనారాయణ తదితరులు మంత్రి పొన్నం ప్రభాకర్ -
అంతరాల్లేని సమాజ నిర్మాణమే లక్ష్యం
కరీంనగర్టౌన్: భారతదేశ సంపదను దోచుకునే పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తుల ఆగడాలకు ఎప్పటికప్పుడు కళ్లెం వేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సీపీఐ ఆవిర్భవించి 100 ఏళ్ల సందర్భంగా శుక్రవారం కరీంనగర్లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు న్యాలపట్ల రాజు తదితరులు పాల్గొన్నారు. -
బొగ్గు బ్లాకులపై కార్మిక సంఘాల పోరు
● పీకే ఓసీపీ సింగరేణికే కేటాయించాలి ● ఉద్యమానికి సిద్ధమవుతున్న సంఘాలుగోదావరిఖని(రామగుండం): బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై కార్మిక సంఘాల పోరాటం ఉధృతమైంది. సింగరేణిలోని మణుగూరు ప్రకాశంఖని ఓసీ డిప్సైడ్ బ్లాక్ను టెండర్ ద్వారా కేటాయింపు బిడ్ ప్రకటించడంతో కార్మిక సంఘాలు తమ ఆందోళనను తీవ్రతరం చేశాయి. ప్రస్తుతం గనిలోని బొగ్గు నిల్వలు మరో ఆరేళ్లు మాత్రమే ఉండటం, పీకేఓసీ డిప్సైడ్ సింగరేణికి రాకపోతే ఏరియా మొత్తం మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఈక్రమంలో గుర్తింపు యూనియన్ ఏఐటీయూసీ, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీతో పాటు జాతీయ కార్మిక సంఘాలైన బీఎంఎస్, హెచ్ఎంఎస్, సీఐటీయూ యూనియన్లు ఆందోళనకు శ్రీకారం చుట్టాయి. ఈక్రమంలో ఈకోల్బ్లాక్కు రెండు సంస్థలు టెండర్లు వేశాయి. వీటిలో సింగరేణి సంస్థ, తెలంగాణా పవర్ జనరేషన్ కార్పొరేషన్ సంస్థలున్నాయి. కాగా, పీకేఓసీపీలో బొగ్గుపైన ఉన్న ఓబీ వెలికితీసి సింగరేణి సంస్థకే అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని, సింగరేణికే ఈఓసీపీని కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసారి బిడ్లో రెండు సంస్థలు టెండర్ వేయడంతో వేలంపాట ద్వారా కేటాయింపులను కేంద్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వేరేసంస్థలు వస్తే ఒప్పుకోం.. పీకేఓసీపీ గనిలో వేరే సంస్థలు టెండర్ దక్కించుకుంటే ఒక్క బొగ్గు పెళ్ల కూడా తీసేందుకు ఒప్పుకోబోమని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. మణుగూరు పీకేఓసీపీలో ఓబీ వెలికితీస్తే ఆ మట్టి పోసేందుకు స్థలం లేదని, అదే సింగరేణికి టెండర్ కేటాయిస్తే సొంత స్థలంలోనే ఓబీ మట్టి డంప్చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. అయినా వేరే సంస్థలు వస్తే తాము ఊరుకోబోమని దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నాయి. టెండర్ రాకుంటే మణుగూరుకు కష్టకాలమే.. పీకేఓసీపీ డిప్సైడ్ టెండర్ సింగరేణికి రాకుంటే మణుగూరు ఏరియాకు కష్టకాలమే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న బొగ్గు ఆరేళ్లవరకే ఉందని, టెండర్ దక్కకుంటే ఏరియాలో ఉత్పత్తి నిలిచి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం గని డిప్సైడ్లో 60మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. దీని వల్ల మరో 20ఏళ్ల భవిష్యత్ ఉంటుందని పేర్కొంటున్నారు. బొగ్గు వెలికి తీసేందుకు 800మిలియన్ క్యూబిక్మీటర్ల ఓబీ(ఓవర్బర్డెన్)ని వెలికితీయాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మణుగూరు ఏరియాకు కేంద్రం బిడ్ ప్రకటించిన పీకేఓసీ కీలకంగా మారనుంది. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిడ్వేలం పాటలో కేటాయిస్తుందా? లేక వేలం ఎక్కువ పాట పాడి సింగరేణి దక్కించుకుంటుందా అని చర్చ కొనసాగుతోంది. బొగ్గు నిల్వలు: 60మిలియన్ టన్నులు భవిష్యత్: మరో 20ఏళ్లు ఓబీ వెలికితీత: 800మిలియన్ క్యూబిక్మీటర్లు కార్మికులు: 800 మంది (సుమారు) -
పురుగుల మందుతాగి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామానికి చెందిన భా రతపు శేఖర్ (35) శుక్రవారం క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. తిప్పన్నపేటకు చెందిన శేఖర్ ఇటీవలే తన భార్యతో మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఇంట్లో పురుగుల మందుతాగగా, ఎవరూ గమనించలేదు. సాయంత్రం ఇంట్లో ఉన్న తల్లి లోపలికి వెళ్లి చూసేసరికి మృతిచెందాడు. పోలీ సులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించా రు. ఆత్మహత్యకు పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి మృతిమెట్పల్లి: పట్టణంలో ని బస్డిపో సమీపంలో అనుమానాస్పద స్థితిలో సుమారు 45 సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ కిరణ్కుమార్ తెలిపారు. నలుపు రంగు టీషర్టు, అలివ్ గ్రీన్ ప్యాంటు, పింక్ బ్లాక్ షూ ధరించి ఉన్నాడని, అతని వివరాలు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారమందించాలని ఎస్ఐ పేర్కొన్నారు. చికిత్స పొందుతూ కార్మికుని మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్క పేటకు చెందిన కార్మికుడు కర్రోళ్ల నర్సయ్య(70) చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు. నర్సయ్య అదే గ్రామానికి చెందిన జంగిటి దేవయ్య ట్రాక్టర్పై గడ్డికుప్పలు తరలించేందుకు గత నెల 28న కూలి పనికి వెళ్లాడు. ట్రాక్టర్ను డ్రైవర్ కొంచెం ముందుకు కదిలించగా.. పైన ఉన్న నర్సయ్య కిందపడి స్పృహ కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటి నుంచి చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందా డు. మృతుని కుమారుడు కర్రోళ్ల స్వామి ఫిర్యాదుతో జంగిటి దేవయ్య, సాగర్ల శ్రీనివాస్పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చిందు కళాకారుడు మృతిచొప్పదండి: కాట్నపల్లికి చెందిన చిందు కళాకారుడు గజ్జెల నగదరయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆదేశాల మేరకు కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్రెడ్డి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందించారు. పట్టణానికి చెందిన వేముల వెంకట్రాజం(70) మృతిచెందగా.. దహన సంస్కారాలకు ఆర్థిక సాయం చేయాలని చొప్పదండిలోని రామకృష్ణా సేవాసమితి సభ్యులను ఆశ్రయించారు. దాత ఆడెపు సహకారంతో రూ. 5వేల ఆర్థిక సాయం అందించారు. కొక్కుల క నకయ్య, పడకంటి కృష్ణ పాల్గొన్నారు. -
ఎములాడలో భక్తుల సంబురం
వేములవాడ: వరుస సెలవులు రావడంతో వేములవాడకు వస్తున్న భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. శుక్రవారం 50 వేల మంది భక్తులు భీమన్నను, బద్దిపోచమ్మను దర్శించుకున్నారు. భీమన్నకు కోడె.. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకున్నారు. ట్రాఫిక్ ఎస్సై రాజు నేతృత్వంలో ట్రాఫిక్ను నియంత్రించారు. వీఐపీ రద్దీ పెరగడంతో ప్రొటోకాల్ ఆఫీస్ బిజీగా మారింది. వీఐపీలకు రూ.500 కోడె టికెట్, రూ.300 టికెట్తో బ్రేక్ దర్శనాలకు అనుమతించారు. భక్తుల వద్ద డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్న ఏడుగురు ప్రైవేట్ వ్యక్తులను ఆలయ అధికారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ చేపట్టి ఏడుగురిని రిమాండ్కు తరలించనున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. -
అంజన్నకు నోటీసులు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో దేవాదాయ– అటవీశాఖల మధ్య సరిహద్దు వివాదం ఆలయ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోంది. కొండగట్టు మీది ప్రాంతం మాత్రమే గుడిదని, ఇటీవల తమ భూముల్లోకి చొచ్చుకువచ్చి దాదాపు ఆరున్నర ఎకరాల భూమిని దేవాదాయశాఖ ఆక్రమించిందని అటవీశాఖ ఆరోపిస్తోంది. ఆ ఆరున్నర ఎకరాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మార్కింగ్ చేయడంతో రెండుశాఖల మధ్య వివాదం మొదలైంది. ఈ ఆరున్నర ఎకరాల భూమి తమదంటే తమదని ఇరుశాఖలు పరస్పరం వాదించుకుంటున్నాయి. కొండగట్టు ఆలయాన్ని ఆనుకుని ఉన్న అటవీ భూములను ప్రత్యామ్నాయ భూముల కేటాయింపుతో తాము తీసుకునే అవకాశం ఉందని దేవాదాయశాఖ అధికారులు చెబుతుండగా.. అనుమతి లేకుండా తమ భూములు ఎలా తీసుకుంటారని అటవీ అధికారులు వాదిస్తున్నారు. మొత్తానికి అటవీశాఖ అధికారులు పెట్టిన కిరికికి కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారేలా కనిపిస్తోంది. వివాదం ఇదీ.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేవాదాయశాఖ కొన్ని అభివృద్ధి పనులు చేపట్టింది. గుడి ఉన్న గట్టు ప్రాంతం మినహా కింద ఉన్న భూములు తమకే చెందుతాయని అటవీశాఖ వాదన. గట్టు కింద భక్తుల కోసం 20 గదుల వసతి భవనం, ఈవో కార్యాలయ భవనం, వాహన పూజా మండపం తదితర భవనాలు దశాబ్దకాలం క్రితం నిర్మించారు. అవన్నీ తమ పరిధిలోకి వస్తాయని అటవీశాఖ అధికారులు నోటీసులు జారీ చేసి, మార్కింగ్ చేయడంతో విషయం వివాదంగా రూపుదాల్చింది. ఇది క్రమంగా రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. కొండగట్టు ఆలయ భూములు సంరక్షించాలని, భూములను ఆలయానికి అప్పగించాలని విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. వైజంక్షన్ వద్ద గేటు ఏర్పాటు సన్నాహాలతో.. కొండగట్టు ఆలయానికి వెళ్లే దారిలో ఘాట్రోడ్డు, జేఎన్టీయూ రోడ్డు కలిసే వైజంక్షన్ వద్ద అటవీశాఖ అధికారుల గేటు ఏర్పాటు సన్నాహాలు రెండు శాఖల మధ్య ఉద్రిక్తతలు పెంచేలా చేశాయి. రెండున్నరేళ్ల క్రితం కొండగట్టు పరిసరాల్లోని అటవీభూముల్లో అర్బన్ పార్కు ప్రతిపాదనలో భాగంగా వైంజక్షన్ వద్ద గేటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గేటు ఏర్పాటుతో వై జంక్షన్కు వాహనాల పార్కింగ్కు ఇబ్బందిగా మారుతుందని ఆలయ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామం రెండుశాఖల మధ్య దూరం పెంచింది. కొండగట్టు ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలు పార్కింగ్ చేసుకునేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడుతుండగా, వైజంక్షన్ సమీపంలో అటవీశాఖ గేటు ఏర్పాటు చేస్తే.. తాము వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఈవో శ్రీకాంత్ రావు కూడా ఆ భూములు ఆలయానికే చెందుతాయని స్పష్టంచేస్తున్నారు. ఆర్డీవో మధుసూదన్, డీఎఫ్వో రవికుమార్ సమక్షంలో అటవీశాఖ, దేవాదాయశాఖ, రెవెన్యూశాఖ ముకుమ్మడిగా హద్దుల ఏర్పాటు కోసం సర్వే చేపట్టారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రెవెన్యూ భూములు బదిలీ చేశాం. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అటవీశాఖ ప్రత్యామ్నాయంగా భూముల కేటాయింపు చేసుకునే అవకాశముంది. కలెక్టర్ ఆదేశాలతో కొండగట్టులో అటవీశాఖ, దేవాదాయశాఖ సరిహద్దుల వివాదం పరిష్కరించేందుకు సర్వే చేపట్టాం. అటవీశాఖ హద్దులు గుర్తించాం. – పులి మధుసూదన్, ఆర్డీవో, జగిత్యాల -
అమ్మను దొంగలెత్తుకెళ్లారమ్మా..
ముప్పిరితోటలో కొమురయ్య ఇంటి ఎదుట ఆవు కనిపించట్లేదని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తల్లి లేక లేగదూడ ఏమి తినడం లేదని ‘సాక్షి’కి తెలుపుతున్న కొమురయ్య అమ్మ ఎప్పుడొస్తుందోనని ఆ మూగజీవి తల్లిఆవు కోసం ఎదురుచూస్తుంటే, యజమాని గుండె తరుక్కుపోతోంది. నెలరోజులైనా ఆవు జాడ కానరాలేదని, మీ అమ్మను ఎవరో ఎత్తుకెళ్లారమ్మా అని అరిచి చెప్పాలని ఉన్నా.. ఆ లేగదూడతో చెప్పలేక కుమిలిపోతున్నాడు. ఊరూ..వాడా.. చుట్టుపక్కల గ్రామాలన్నీ వెతికినా ఫలితం లేక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపాడు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని చెవుల కొమురయ్య తన ఆవును గత నెల 28న రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారంటూ ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం ‘సాక్షి’కి కనిపించింది. తల్లి ఆవుకోసం గాలింపు ఒకవైపు, దూడ ఆరాటం మరోవైపు వెరసి కొమురయ్య దంపతులు నిద్రలేమి రాత్రులు గడుపుతూ, ఆవు దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
అత్తింటి వేధింపులు తాళలేక..
ముత్తారం: ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్కు చెందిన పాండవుల అంజలి(21) ఐదు నెలల గర్భిణి శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. పాండవుల స్వా మి–భాగ్యలక్ష్మి దంపతుల పెద్ద కూతురు అంజలికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లంపల్లికి చెందిన బండి వెంకటేశ్తో 8నెలల క్రి తం వివాహమైంది. కొంతకాలం సజావుగా సాగిన వీరి కాపురంలో అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. భర్త, అత్త, మామల వేధింపులు తాళలేక అడవిశ్రీరాంపూర్లోని పుట్టింటికి వ చ్చింది. పెళ్లికి ముందు ఒప్పందం ప్రకారం క ట్నకానుకలు చెల్లించినా మళ్లీ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మనస్తాపం చెందిన అంజలి ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ మడుత రమేశ్, మంథని సీఐ రాజు పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు. ఉరేసుకొని గర్భిణి ఆత్మహత్య -
ధర్మపురిని నాశనం చేసింది బీఆర్ఎస్సే
కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్–2 పేరుతో 1,020 ఎకరాల రైతుల భూములు లాక్కొని, గిరిజనులు, ఒడ్డెర జాతి ప్రజలను బెదిరించి ధర్మపురి నియోజకవర్గాన్ని నాశనం చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కరీంనగర్ ఆర్అండ్బీ అతిథిగృహంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డితో కలిసి మాట్లాడారు. 2016లో జీవో నంబరు 71 ప్రకారం ప్రారంభించిన ప్రాజెక్టును ఆరేళ్లపాటు కొనసాగించి, పూర్తి చేయకుండానే అంచనాలను రూ.66కోట్ల నుంచి రూ.136 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అప్పటి కాంట్రాక్టర్తో చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఇదేనా బీఆర్ఎస్ పాలకుల అభివృద్ధి మోడల్ అని ప్రశ్నించారు. ధర్మపురిని సస్యశ్యామలం చేస్తామని నాటి సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయని, 146 గ్రామాలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అప్పుడు ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ ఒక్కసారి కూడా ఈ అంశంపై ప్రశ్నించలేదని విమర్శించారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేవలం ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నానని అన్నారు. 80 మంది విద్యార్థులను పొలాస అగ్రికల్చర్ కాలేజీకి పంపించి, రూ.7 కోట్ల బకాయిలను ముఖ్యమంత్రి నాయకత్వంలో చెల్లించామని తెలిపారు. తను రాజీనామా చేయాలా వద్దా అనేది నిర్ణయించేది ధర్మపురి ప్రజలేనని... బీఆర్ఎస్ నేతలు కాదని స్పష్టం చేశారు. మరో మూడు సంవత్సరాల్లో తాను ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. -
రూటు మార్చిన టైగర్
మంథనిరూరల్: వారం పది రోజులుగా రామగుండం ఓసీపీ ప్రాంతంలో మకాం వేసి రెండు రోజుల క్రితం గోదావరినది దాటిన పెద్దపులి శుక్రవారం తిరిగి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి గోదావరినది దాటిన పులి మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు వ చ్చింది. అక్కడి నుంచి మూసివేసిన మేడిపల్లి ఓసీపీ డంప్ 1లో మకాం వేసింది. పది రోజుల పాటు ఆ ప్రాంతంలోనే సంచరించగా అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించి సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఓసీపీ ప్రాంతాలు సేఫ్గా భావించని పులి తిరిగి మంచిర్యాల ఇందా రం మీదుగా ఫారెస్ట్లోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధి కారులు గుర్తించారు. వారం పది రోజుల పాటు పు లి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు గోదావరి నది దాటి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరిగి శుక్రవా రం పులి నది దాటిందన్న సమచారం తెలుసుకున్న సెక్షన్ ఆఫీసర్ అఫ్జల్ అలీ, బీట్ ఆఫీసర్లు ప్రదీప్, రాంసింగ్లు గాలింపు చర్యలు చేపట్టగా మంథని మండలం ఆరెంద ఖాన్సాయిపేట ప్రాంతం నుంచి నది దాటినట్లు అధికారులు గుర్తించారు. శివ్వారం మీదుగా ఎల్ మడుగు దాటి ఇవతలి వైపు వచ్చిన ట్లు అడుగులను గుర్తించారు. సాయంత్రం వరకు ఎటు వైపు వెళ్లిందోనని ఫారెస్ట్ అధికారులు గాలించగా ఆరెంద, ఖాన్సాయిపేట, భట్టుపల్లి అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పెద్దపులి గో దావరినది దాటి ఇవతలి వైపు వచ్చిందనే ప్రచారం జరుగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో అటవీ శాఖ అధికారులు సైతం ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అడవిలోకి వెళ్లవద్దని, పులికి హాని కలిగించే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నారు. ఆరెంద వైపు వచ్చినట్లు ఆనవాళ్లు గోదావరితీరంలో అడుగుల గుర్తింపు గాలింపు చర్యల్లో అటవీ అధికారులు -
బెల్ట్షాపులు మూసివేయండి
● బూర్గుపల్లి పాలకవర్గానికి గ్రామస్తుల వినతి బోయినపల్లి(చొప్పదండి): గ్రామంలో బెల్ట్షాపులు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామస్తులు శుక్రవారం గ్రామ సర్పంచ్ పెంచాల సౌమ్యకు వినతిపత్రం అందించారు. గ్రామంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. సాయంత్రం అయ్యిందంటే మహిళలు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మందుబాబుల ఆగడాలతో మహిళలు భయాందోళన చెందుతున్నారన్నారన్నారు. ఈ పరిస్థితి పోవాలంటే గ్రామంలో బెల్ట్షాపులు మూసివేయాలని కోరారు. అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి ● రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి తిమ్మాపూర్: ధూప దీప నైవేద్య అర్చుకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటాద్రిస్వామి కోరారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమావేశంలో మాట్లాడారు. హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవశర్మ మాట్లాడుతూ డీడీఏ అర్చకుల వేతనం రూ.35వేలకు పెంచాలని, ప్రతీ నెల 5లోపు వేతనం ఇవ్వాలని, అర్చక సంక్షేమ పథకాల అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ శ్రీరంగం గోపి కృష్ణమాచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవర్జుల ప్రసాద్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి, వెగ్గళం సంతోష్, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు మాధవాచార్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆకవరం మఠం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దగ్గు.. జలుబు.. జ్వరం
ఓపీ ఎక్కువ.. ఐపీ తక్కువ ● ఆసుపత్రులకు బాధితుల వరుస ● చలి ప్రభావమే అంటున్న డాక్టర్లు చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట చలి, పొద్దంతా ఎండ అన్నట్లు వాతావరణంలో విచిత్రమైన మార్పులు జరుగుతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులతో వ్యాధులు పంజా విసురుతున్నాయి. జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో తిప్పలు పడుతున్నారు. రెండు, మూడు రోజులు సొంత చికిత్సకే పరిమితమై తగ్గకపోవడంతో ఆసుపత్రుల బాట పడుతున్నారు.కరీంనగర్: 2 వారాలుగా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ ప్రధానాసుపత్రి వైద్యులు చెబుతున్నారు. అన్సీజన్ లాగే ఉన్నా.. ప్రతిరోజు 700 నుంచి 900 వరకు ఔట్ పేషెంట్లు ఆసుపత్రికి వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో 50 శాతం జలుబుతో కూడిన దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారే ఉంటున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇందులో కూడా పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాసుపత్రిలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పిల్లల ఆసుపత్రులతోపాటు జనరల్ ఫిజీషియన్ల వద్ద పేషెంట్లు వరుస కడుతున్నారు. ఇబ్బంది పెడుతోంది.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లాలో జ్వరాలు సాధారణ స్థితిలోనే ఉంటున్నాయని ప్రభుత్వాసుపత్రి జనరల్ ఫిజీషియన్ వైద్యులు చెబుతున్నారు. జలుబుతో కూడిన దగ్గు, జ్వరాల కేసులే ఎక్కువగా వస్తున్నాయని, ఒకటి, రెండు రోజుల్లోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. జీజీహెచ్లో ఓపీ మాత్రమే ఎక్కువగా ఉండడం, ఐపీ చాలా తక్కువగా ఉండడమే ఇందుకు నిదర్శనం. అయితే స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని, ఇతరులకు వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉంటే ఈ వ్యాధులు సమాజం నుంచి దూరమవుతాయని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. చలి తీవ్రతతో చిన్నారుల్లో దగ్గు, జలుబు సమస్యలు తలెత్తుతున్నాయి. సంబంధిత బాధితులే ఓపీకి ఎక్కువగా వస్తున్నారు. చిన్నారులతోపాటు వృద్ధులు, గర్భిణులు జ్వరాల బారిన పడుతున్నారు. ప్రమాదకర పరిస్థితి ఏ ఒక్కరిలో లేకపోయినా.. ఈ వ్యాధులు వారంపాటు ఇబ్బంది కలిగిస్తున్నాయి. పిల్లలను చల్ల గాలికి తిప్పొద్దు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరగొద్దు. పాఠశాల, ఇతర పనులకు బయటకు వెళ్లేవారు ఉన్ని దుస్తులు ధరిస్తూ గాలి వెళ్లకుండా చెవులు, ముక్కు, నోటిని కప్పి ఉంచాలి. – డాక్టర్ నవీన, జీజీహెచ్ ఆర్ఎంవో -
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో ఉపాధి లేక గల్ఫ్ దేశానికి వెళ్లిన వలస జీవి అక్కడే గుండెపోటుతో మృతిచెందగా.. 20 రోజులకు శుక్రవారం మృతదేహం వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు రవి(45) రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఈనెల 6న పనిచేస్తుండగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రవి మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని తెప్పించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. దాదాపు 20 రోజుల తర్వాత రవి మృతదేహం స్వగ్రామానికి చేరింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ తదితరులు నివాళి అర్పించారు. మృతునికి భార్య మంజుల, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గుంటపల్లిచెరువుతండాలో విషాదం -
● ఘల్ ఘల్.. వెన్నుపూస ఝల్ ఝల్
కరీంనగర్ సిటీ రోడ్లపై ఈ మధ్య ప్రయాణించారా? మీ వాహనం నుంచి ఘల్ ఘల్ శబ్దం.. మీ వెన్నుపూజ నుంచి ఝల్ఝల్ నొప్పిని గమనించారా? అవును ఇటీవల నగరంలోని ప్రయాణిస్తున్న ప్రతీ వాహనదారుడి నుంచి ఇదే మాట వినిపిస్తోంది. నగరంలోని చౌరస్తాలు.. మూల మాలుపుల వద్ద ఇటీవల ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వేగాన్ని నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన రంబుల్ స్ట్రిప్స్ పరిమితికి మించి ఎత్తుగా ఉండడంతో బండి డ్యామేజ్, ఒళ్లుహూనం అవుతోందని వాహనదారులు చెబుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
ప్రకృతి సోయగం
విరబూసిన మోదుగుచెట్టు భట్టుపల్లి సమీపంలో రంగురంగు ఆకులతో చెట్టుమంథనిరూరల్: ప్రకృతిలో కాలానికనుకుణంగా చెట్లు తమ సహజతత్వాన్ని చాటుతుంటాయి. ఒక్కో చెట్టు ఒక్కో కాలంలో చోటు చేసుకునే మార్పులు కనువిందు చేస్తుంటాయి. కొన్ని చెట్లు విరగబూసి ఆకర్షణగా నిలిస్తే, మరికొన్ని చెట్లు సీజన్ మార్పుతో చూపరులను ఆకట్టుకుంటాయి. మంథని మండలం భట్టుపల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై ఓ చెట్టు ఇలా పసుపు, ఆకుపచ్చ ఆకులతో కనువిందు చేస్తోంది. అలాగే మండలంలోని గోపాల్పూర్లోని అటవీ ప్రాంతంలో మోదుగు చెట్టు ఇలా విరగబూసి చూపరులను ఆకట్టుకుంటోంది. -
ఘాట్రోడ్డుపై అదుపుతప్పిన ఆటో
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డు వెంట వెళ్తున్న ఆటో బోల్తాపడి నలుగురు గాయపడిన సంఘటన మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టులో చోటుచేసుకుంది. గోదావరిఖని చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు శుక్రవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఘాట్రోడ్డు వెంట వెళ్తుండగా, ఆటో అదుపుతప్పి, గతంలో బస్సు ప్రమాదం జరిగిన స్థలంలో ఏర్పాటు చేసిన సేఫ్టీవాల్ను ఢీకొని బోల్తాపడింది. ఘటనలో సరస్వతి, హేమంత్ తీవ్రంగా, విద్యాధర్ శ్రీధర్, కిరణ్మయి స్వల్పంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి బ్లూకోల్ట్స్ సిబ్బంది సురేశ్, అంజన్న చేరుకొని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి తీవ్ర, ఇద్దరికి స్పల్ప గాయాలు -
కబడ్డీ.. కబడ్డీ.. హోరాహోరీ
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ లీగ్ దశ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రెండోరోజు శుక్రవారం రాత్రి వరకు లీగ్దశలో సగానికి పైగా మ్యాచ్లు ముగిశాయి. ఉదయం, రాత్రి జరిగిన పలు మ్యాచ్లను రాష్ట్ర, జిల్లా కబడ్డీ సంఘం బాధ్యులతో పాటు పలు జిల్లాల క్రీడాశాఖ అధికారులు, క్రీడా సంఘాల బాధ్యులు ప్రారంభించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సీహెచ్.అమిత్ కుమార్, బుర్ర మల్లేశ్ గౌడ్, రాష్ట్ర కబడ్డీ సంఘ ఉపాధ్యకుడు సీహెచ్.సంపత్రావు, మల్లేశ్, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, కరుణాకర్, బాబు శ్రీనివాస్, కృష్ణ, అంతడ్పుల శ్రీనివాస్, యూనిస్పాషా పాల్గొన్నారు. దూసుకెళ్తున్న కరీంనగర్ జట్లు రాష్ట్రస్థాయి సీనియర్స్ పోటీల్లో భాగంగా కరీంనగర్ పురుషుల, మహిళల జట్లు ఆడిన రెండు మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసుకుని దూసుకెళ్తున్నాయి. పురుషుల జిల్లా జట్టు కామారెడ్డిపై 68–20, సిద్దిపేటపై 50–33 భారీ స్కోర్తో విజయాలు నమోదు చేసింది. మహిళల జట్టు నిర్మల్పై 36–10, వికారాబాద్పై 59–18 భారీ స్కోర్తో విజయాలు సాధించింది.ఉత్కంఠగా సాగుతున్న రాష్ట్రస్థాయి పోటీలు కరీంనగర్ జట్లకు రెండేసి విజయాలు -
శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని, అందుకు చెకుముకి సంబరాలు, సైన్స్ ఫెయిర్ దోహదం చేస్తాయని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పద్మనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెకుముఖి పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ ప్రతీ అంశాన్ని శాసీ్త్రయ కోణంలో ఆలోచించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్, చెకుముకి సంబరాలు వంటివి ఉపకరిస్తాయన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గణితం, సైన్స్ సబ్జెక్టులపై దృష్టి పెట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సైన్స్ ప్రయోగశాలలను తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. తాను గతంలో సైంటిస్ట్గా పని చేశానని గుర్తు చేశారు. జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు చెలిమెల రాజేశ్వర్, జేవీవీ రాష్ట్ర కార్యదర్శి పి.మనీంద్రం, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ మోహన్రావు, నిమ్స్ మాజీ డైరెక్టర్ ప్రసాదరావు, చక్రపాణి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ అధికారి జయపాల్రెడ్డి, విద్యాశాఖ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, జేవీవీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మారెడ్డి, నాయకులు ఆనంద్కుమార్, వెంకటేశ్వరరావు, రామచంద్రయ్య, శ్రీకాంత్, వరప్రసాద్, అందే సత్యం, సీహెచ్ రామరాజు, ఆర్.వెంకటేశ్వరరావు, ఎన్.దేవేందర్, గంగారాం, శంకర్, రమేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
స్వల్పంగా పెరిగిన రైల్వేచార్జీలు
రామగుండం: భారత రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే చార్జీలను స్వల్పంగా పెంచింది. 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటర్కు పైసా చొప్పున టికెట్ ధర పెంచుతూ శుక్రవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఆరు నెలల క్రితమే స్వల్పంగా పెంచిన చార్జీల నేపథ్యంలో ఆర్డినరీ, నాన్ ఏసీ 215 కిలోమీటర్లపై ప్రయాణించే వారిపై కిలోమీటరుకు పైసా, మెయిల్/ఎక్స్ప్రెస్ రైళ్లలో కిలోమీటర్కు రెండు పైసల పెంచుతున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో, వందేభారత్, హంసఫర్, తేజస్, అమృత్భారత్ తదితర రైళ్లతో పాటు ప్రీమియం రైళ్లకు పెంపు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. కాగా లోకల్ రైళ్లు, నెలసరి సీజన్ టికెట్లు, రిజర్వేషన్ ఫీజు, సూపర్ఫాస్ట్ సర్చార్జీ, సీఎస్టీ తదితర చార్జీలులు యథాతథంగా కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. రామగుండం–సికింద్రాబాద్కు పెంపు వర్తింపు రామగుండం నుంచి సికింద్రాబాద్కు 224 కిలోమీటర్లు దూరం ఉండడంతో చార్జీల పెంపు వర్తించనుంది. ఫలితంగా నిన్నటి నుంచి భాగ్యనగర్, ఇంటర్సిటీ రైళ్లకు రామగుండం నుంచి సికింద్రాబాద్కు రూ.90 ఉండగా పెంచిన చార్జీతో రూ.95 అయింది. సూపర్ఫాస్ట్ చార్జీ రూ.110కి చేరింది. కాగా పెద్దపల్లి–సికింద్రాబాద్కు మధ్య దూరం 207 కిలోమీటర్లు ఉండడంతో చార్జీల పెంపు వర్తించకపోవడం గమనార్హం. శుక్రవారం నుంచి అమలు -
ఇయ్యాల కొత్త సర్పంచులకు సన్మానం
● హాజరు కానున్న ముగ్గురు మంత్రులు కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు శనివారం సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశానికి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ హాజరవుతారని వివరించారు. పంటలకు లాభసాటి ధర చెల్లించాలికరీంనగర్: రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర రాని కారణంగా చాలామంది వ్యవసాయాన్ని వదిలి ఇతర వృత్తులు, జీవనోపాధి వైపు పరుగెడుతున్నారని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్రావు అన్నారు. కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 3 రోజులపాటు నిర్వహించిన కిసాన్ గ్రామీణ మేళా శుక్రవారం ముగిసింది. రైతులు పెద్ద సంఖ్యలో హాజరై మేళాలో ఏర్పాటు చేసిన స్టాళ్లు తిలకించారు. మెషినరీ, మందులు, విత్తనాలపై అవగాహన పెంచుకున్నారు. ప్రముఖ రైతు నాయకుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. అధిక క్రిమిసంహారక ఎరువుల వాడకంతో భూసారం తగ్గిపోతుందన్నారు. ప్రముఖ రైతు నాయకుడు నరసింహనాయుడు మాట్లాడుతూ.. రైతులు సంఘటితమై ఉద్యమించనిదే ప్రభుత్వాలు దిగి రావని అన్నారు. కేవీకే శాస్త్రవేత్త వేణుగోపాల్, ప్రముఖ వైద్యులు బీఎన్ రావు, రైతు నాయకులు మల్లారెడ్డి, నేలమడుగు శంకరయ్య, ఏపీవోల అధ్యక్షులు, ఉత్తర తెలంగాణకు సంబంధించిన పలువురు రైతులు, రైతు నాయకులు పాల్గొన్నారు. 31న మా‘నీరు’ విడుదలతిమ్మాపూర్: యాసంగి పంటల కోసం కరీంనగర్ దిగువ మానేరు జలాశయం నుంచి ఈనెల 31న నీటిని విడుదల చేయనున్నట్లు ఎస్సారెస్పీ ఎస్ఈ పి.రమేశ్ తెలిపారు. ఉదయం 11 గంటలకు కాకతీయకాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తామని వివరించారు. నీటి పారుదల శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. జోన్–1 (కి.మీ. 146.00 నుంచి 284.00)కు 7 రోజులు, జోన్–2 (కి.మీ. 284.09 నుంచి 340.00)కు 8 రోజులు వారాబందీ పద్ధతిలో నీరు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టు రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వీర్ బాల్ దివస్ చరిత్ర స్ఫూర్తిదాయకంకరీంనగర్టౌన్: పదవ సిక్కుల గురువు గురు గోవింద్ సింగ్జి యువ కుమారుల అసాధారణ ధైర్యం, త్యాగాన్ని స్మరించుకుంటూ వారి వీరత్వానికి నివాళిగా ఏటా డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ను నిర్వహిస్తామని, ఈ దివస్ చరిత్ర, ప్రాముఖ్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వీర్ బాల్ దివస్ నిర్వహించారు. దివస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ సర్దార్ బల్వీర్సింగ్, బీజేపీ శ్రేణులు కరీంనగర్లోని టవర్ సర్కిల్ నుంచి సిక్కువాడిలోని గురుద్వార వరకు నగర కీర్తన యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి యాత్రను ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ గురుద్వార అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్సింగ్, కార్యదర్శి సర్దార్ యస్పాల్సింగ్, కమిటీ సభ్యులు రవీందర్ పాల్సింగ్, మంజిత్సింగ్, జస్పాల్సింగ్, రణధీర్సింగ్, సురేందర్ పాల్సింగ్, స్వరణ్సింగ్, భూపేందర్సింగ్, బీజేపీ నాయకులు కన్న సాయిని మల్లేశం, కోలగని శ్రీనివాస్, దురిశెట్టి అనూప్, సతీశ్, కటకం లోకేశ్, బొంతల కళ్యాణ్ చంద్ర, నాంపల్లి శ్రీనివాస్ తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ నేటి నుంచి
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో శని, ఆదివారాల్లో రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీధర్, నీలం లక్ష్మణ్ తెలిపారు. శుక్రవారం పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను వారు స్టేడియంలో పర్యవేక్షించారు. పోటీలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. 2014లో కరీంనగర్ వేదికగా తొలిసారి రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించామని, తిరిగి 11 సంవత్సరాల అనంతరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్త్ ఈజ్ వెల్త్ నినాదంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి సుమారు 1,200 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని, వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామని అన్నారు. 35 నుంచి 100 మధ్య వయస్సున్న మాస్టర్ అథ్లెట్స్ ఈ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. రన్నింగ్, త్రోస్, జంప్స్ లాంటి 48 అంశాల్లో పోటీలు జరుగుతాయని అన్నారు. ప్రతిభ చాటిన అథ్లెట్స్ను రాజస్థాన్ రాష్ట్రంలోని ఆజ్మీరాలో జరిగే జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. -
కబడ్డీ ప్రారంభం
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ వేదికగా కబడ్డీ కూత షురూ అయ్యింది. 72వ రాష్ట్రస్థాయి సీనియర్స్ పురుషుల, మహిళల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు గురువారం రాత్రి అంబేడ్కర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యా యి. వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతా కాలను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆయా జిల్లాల బృందాల మార్చ్పాస్ట్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తొలిమ్యాచ్ పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య హోరాహోరీగా జరిగింది. 8లోu -
మత్స్యసాగు వైపు దృష్టి సారించాలి
కరీంనగర్: గ్రామీణ ప్రజల ఆర్థిక అభివృద్ధితోనే దేశ ఆర్థికవృద్ధి సాధ్యపడుతుందని కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్రావు అన్నారు. కరీంనగర్లో నిర్వహిస్తున్న ‘కిసాన్ గ్రామీణ మేళా’ గురువారం రెండోరోజు కొనసాగింది. కిసాన్ జాగరణ్ అధ్యక్షుడు, మేళా నిర్వాహకుడు సుగుణాకర్రావు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ, మిడ్ మానేరు, ఎగువ మానేరు, కాళేశ్వరంతో వాటర్జంక్షన్గా మారిందన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు వరిసాగుకే పరిమితం కాకుండా, చేపలు, రొయ్యల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఎల్.జలపతిరావు మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పంట మార్పిడి విధానాలు అనుసరించాలన్నారు. ప్రముఖ వ్యవసాయ నిపుణుడు వెంకటేశ్వర్లు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారమార్గాలపై వివరించారు. ఆయన రచించిన పుస్తకాన్ని ఆవి ష్కరించి రైతులకు అంకితమిచ్చారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. గొర్రెల పెంపకందారుల రాష్ట్ర ఫెడరేషన్ మాజీ చైర్మన్ రాజయ్యయాదవ్, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రభాకర్రావు, కరీంనగర్ డైరీ జనరల్ మేనేజర్ శంకర్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రతీ హిందువు భగవద్గీత పఠించాలి
చొప్పదండి: ప్రతి హిందువు భగవద్గీత పఠించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయార్ స్వామి పేర్కొన్నారు. చొప్పదండిలోని జ్ఞాన సరస్వతి ఆలయాన్ని గురువారం సందర్శించి ప్రచనాలు అందించారు. శ్రీవేంకటేశ్వర మణికంఠ ఆలయంలో పూజలు జరిపారు. ప్రతి హిందువు భగవద్గీతను నేర్చుకోవాలని, 700 శ్లోకాల్లో ప్రతిరోజు రెండు శ్లోకాలు నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుందన్నారు. వికాస తరంగిణీ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గుర్రం నీరజ, ఇప్పనపల్లి విజయలక్ష్మి, పుల్యాల లక్ష్మారెడ్డి, గుర్రం ఆనందరెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, తిప్పర్తి శ్రీనివాస్, జగన్మోహన్ పాల్గొన్నారు. కరీంనగర్లో పర్యటనరామానుజ దేవనాఽథ జీయర్ స్వామి కరీంనగర్లోని వావిలాలపల్లిలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో లక్ష్మీపూజ నిర్వహించారు. తిరుమలనగర్లో వికాస తరంగిణి యూని ట్ను ప్రారంభించారు. సప్తగిరికాలనీ కోదండ రామాలయాన్ని సందర్శించారు. కరీంనగర్కల్చరల్: అణుబాంబు కన్నా కవి త్వం బలమైందని ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రచయితల సంఘం ఏటా అందిస్తున్న కాళోజీ పురస్కారాల వేడుకను గురువారం ఫిలింభవన్లో నిర్వహించారు. కొత్త అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 2024 ఏడాదికి గాను సిద్దిపేటకు చెందిన పప్పుల రాజిరెడ్డికి, 2025కు బోధన్కు చెందిన మొగిలి స్వామిరాజుకు పెద్దింటి అశోక్ కుమార్ చేతుల మీదుగా పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో దోహదపడే కవులపాత్రకు పురస్కారాలే అసలైన గుర్తింపు అన్నారు. పిడికెడు అక్షరాలే సమాజాన్ని నడిపిస్తాయన్నారు. కవులు సుదర్శనం వేణు, గుండేటి రాజు, కాండూరి వెంకటేశ్వర్లు, అన్నాడి గజేందర్రెడ్డి, స్తంభంకాడి గంగాధర్, దొమ్మటి శంకర్ ప్రసాద్, నీలగిరి అనిత, బొమ్మకంటి కిషన్, గంగుల శ్రీకర్, సునీత, కాసు మహేందర్ రాజు, గందె పరశురాములు,, రేగులపాటి విజయలక్ష్మి, సుగుణ, కూకట్ల తిరుపతి పాల్గొన్నారు. అర్చక చైతన్య యాత్రను విజయవంతం చేయాలి కరీంనగర్కల్చరల్: ఽదూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్లోని తాపాల నరసింహస్వామి ఆలయంలో జరిగే అర్చక చైతన్య యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తిరునగరి వెంకటాద్రి స్వామి ఒక ప్రకటనలో కోరారు. ఉమ్మడి జిల్లా అర్చకులతో సదస్సు జరిగిన అనంతరం దేవాదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయానికి యాత్రగా వెళ్లి కమిషనర్కు తీర్మానాలతో కూడిన వినతిపత్రం సమర్పిస్తామని పేర్కొన్నారు. -
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
సీఎస్ఐ క్యాథడ్రల్ చర్చిలో గీతాలు ఆలపిస్తున్న క్యారల్స్ బృందంసీఎస్ఐ సెంటనరీ వెస్లీచర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో క్రిస్టియన్లుకరీంనగర్కల్చరల్: జిల్లావ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను క్రిస్టియన్లు ఘనంగా జరుపుకున్నారు. గురువారం ఉదయం నూతన వస్త్రాలు ధరించి చర్చికి వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైబిల్ పఠించారు. ప్రత్యేక గీతాలాపనలు చేశారు. మతపెద్దలు దైవ సందేశాన్ని అందించారు. కరీంనగర్లోని సీఎస్ఐ (వెస్ట్) క్యాథడ్రల్ చర్చి, సీఎస్ఐ సెంటినరీ వెస్లీ, సెయింట్ మార్క్చర్చితో పాటు వివిధప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు కిటకిటలాడాయి. పోలీసు కమిషనరేట్ ఎదురుగా ఉన్న సీఎస్ఐ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ పాల్ కొమ్మాలు సందేశం ఇచ్చారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్లు మధుమోహన్, పాస్టరేట్ సెక్రటరీ జీబీ. సంజయ్కుమార్, ట్రెజరర్లు ముల్కల సంజయ్, ఎర్ర జాకబ్ పాల్గొన్నారు. క్రిస్టియన్ కాలనీలోని సీఎస్ఐ సెంటినరీవెస్లీ చర్చిలో ఫాస్టరేట్ చైర్మన్ ఎస్.జాన్ ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. అసిస్టెంట్ ప్రెస్బిటర్ రెవ ఎం.పింటు, సెక్రటరీ సి.సంజయ్కుమార్, ట్రెజరర్ సి.నారాయణ పాల్గొన్నారు. -
కేన్సర్పై టీకాస్త్రం
● యుక్త వయసు బాలికలకు హెచ్పీవీ టీకాలు ● ఏర్పాట్లలో నిమగ్నమైన వైద్య ఆరోగ్యశాఖ ● జిల్లాలో 11వేల మంది అర్హులుగా గుర్తింపు ● ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తి ● ఆరోగ్య మహిళ ద్వారా జిల్లాలో మూడేళ్లలో 2.81 లక్షల మందికి స్క్రీనింగ్కరీంనగర్: మహిళలు ఇటీవల ఎక్కువగా కేన్సర్ బారిన పడుతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా గుర్తించిన ప్రభుత్వం పరీక్షలు నిర్వహించి అవసరం అయినవారికి చికిత్స అందిస్తోంది. రొమ్ము, సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) కేన్సర్ ఎక్కువగా వస్తోందని గుర్తించింది. యుక్త వయసులోని వారూ దీని బారిన పడుతున్నారు. కేన్సర్ మహమ్మారిని సమూలంగా నిరోధించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుక్త వయస్సు (14–15 సంవత్సరాలు మధ్య) గల బాలికలకు టీకాలు ఉచితంగా వేయాలని సంకల్పించాయి. ఈ వయసు బాలికలకు హర్మోన్ల మార్పులు జరిగే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకి కేన్సర్కు దారితీసే ప్రమాదముంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోకపోతే గర్భాశయ ముఖ ద్వార కేన్సర్ బారిన పడే అవకాశం ఉంది. దీన్ని నిలువరించేందుకు హ్యూమన్ పాపిల్లో మా వైరస్ (హెచ్పీవీ) టీకాలు వేయాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. జనవరిలో టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు వైద్య శాఖాధికారులు పేర్కొంటున్నారు.బాలికల గుర్తింపు ప్రక్రియ జిల్లాలోని హైస్కూళ్లు, వసతి గృహాల్లో నమోదై ఉన్న 14–15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలను గుర్తించడంతో పాటు ఇంటింటి సర్వే చేపట్టి టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం బాలికల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 11 వేల మంది వరకు 14నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు ఉంటారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. వీరికి హెచ్పీవీ టీకాలు వేయడం ద్వారా కేన్సర్ మహమ్మారి నుంచి రక్షించే అవకాశముంది. ఇప్పటికే జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులకు కేంద్ర బృందం హెచ్పీవీ టీకాలపై సూచనలు ఇచ్చింది. మెడికల్ ఆఫీసర్లకు అవగాహన జిల్లాలో త్వరలో నిర్వహించే హెచ్పీవీ (కేన్సర్ నిరోధక) టీకాల నిర్వహణకు ఈనెల 10న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్వో ఆధ్వర్యంలో మెడికల్ ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. టీకాలు వేసే కార్యక్రమంపై పూర్తిస్థాయిలో వివరించారు. వీరంతా తిరిగి మండలస్థాయిలో సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బందికి అవగాహన కల్పించనున్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరిలో ప్రారంభమైన తేదీ నుంచి 90 రోజులలో పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.హెచ్పీవీ టీకాలు 2026 జనవరిలో జిల్లాకు చేరే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో టీకాల కార్యక్రమం ప్రారంభించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హెచ్పీవీ టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ టీకాలు వేసిన మాదిరిగానే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో టీకాలు వేసే కార్యక్రమం చేపడతాం. – డాక్టర్ సాజిదాఅతహరి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐవో)గర్భాశయ, రొమ్ము, నోటి కేన్సర్, రుతుస్రావ ఇబ్బందులు, బరువు, థైరాయిడ్, లైంగిక వ్యాధులు, బీపీ, మధుమేహం, రక్తహీనత వంటి పరీక్షలు చేస్తున్నాం. జిల్లాలోని 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు అవసరమైన చికిత్సలు అందిస్తున్నాం. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారిరాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి మంగళవారం మహిళా వైద్యాధికారులు, సిబ్బంది మహిళలకు పరీక్షలు చేస్తూ అవసరమైన చికిత్సలు అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్లి శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినులకు, మహిళా పోలీసులకు వైద్య పరీక్షలు చేశారు. రొమ్ము, గర్భాశయ, నోటి కేన్సర్ల గుర్తింపుతోపాటు మూత్ర పిండాల పరీక్షలు, రుతుస్రావ ఇబ్బందులు, లైంగికంగా వచ్చే సమస్యలు, వంధ్యత్వ సమస్యలు, బరువు, థైరాయిడ్, బీపీ, మధుమేహం (షుగర్), అయోడిన్ లోపం, రక్తహీనత పరీక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 2,81,000 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించగా, 89 మందికి గర్భాశయ కేన్సర్, 109 మందికి బ్రెస్ట్కేన్సర్, 101 మందికి ఓరల్ కేన్సర్ నిర్ధారణ అయింది. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. -
డ్యూటీకి డుమ్మా.. పీహెచ్సీకి తాళం
మానకొండూర్ రూరల్: అత్యవసర సేవల విభాగాల్లో ఒకటైన వైద్య, ఆరోగ్యశాఖను నిర్లక్ష్యం వెంటాడుతోంది. కలెక్టర్, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి క్షేత్రస్థాయిలో సందర్శిస్తూ.. సమీక్షిస్తున్నా వైద్యులు, సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు. పండుగ రోజైనా రోగులకు అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది గైర్హాజరు కావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి, పీహెచ్సీకి తాళం వేసిన ఘటన మానకొండూర్ మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. వెల్ది పీహెచ్సీ లక్ష్మీపూర్లో కొనసాగుతోంది. గురువారం క్రిస్మస్ పండుగ కావడంతో వైద్యాధికారి సాయిప్రసాద్ ఓ మేల్ స్టాఫ్నర్సుకు విధులు కేటాయించారు. అతను ఉదయం 9గంటలకు విధులకు హాజరుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12దాటినా రాలేదు. దీంతో చికిత్స కోసం వచ్చిన 20మంది వరకు రోగులు మధ్యాహ్నం వరకు ఎదురుచూసి వెళ్లిపోయారు. విషయం తెలిసిన సర్పంచ్ ఎడ్ల సత్యనారాయణ, ఉపసర్పంచ్ రాపాక ప్రవీణ్, గ్రామస్తులు పీహెచ్సీ ఎదుట నిరసన వ్యక్తం చేసి, గేటుకు తాళంవేశారు. మూడు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. మెడికల్ ఆఫీసర్ అక్కడికి చేరుకుని ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఈ విషయమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి, గైర్హాజరైన వ్యక్తిపై చర్యలకు సిఫారసు చేస్తామని మెడికల్ ఆఫీసర్ వివరించారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
జగిత్యాలక్రైం: రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడిన జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన బుర్ర శ్రీనివాస్ (53) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన శ్రీనివాస్ తన మేనకోడలు మానసను బైక్పై ఎక్కించుకుని చొప్పదండి వైపు వెళ్తున్నాడు. మార్గంమధ్యలో జాబితాపూర్ శివారు బీబీరాజ్పల్లి సమీపంలోకి చేరగానే.. తన ముందు వెళ్తున్న వాహనదారుడు దొనకొండ రాజయ్య సడెన్ బ్రేక్ వేయడంతో శ్రీనివాస్ ఢీకొని కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేదు. శ్రీనివాస్ కూతురు బుర్ర శిరీష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గుండెపోటుతో రైతు..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు మొడుసు మద్దుల భగవంతరెడ్డి(58) గురువారం పొలం పనులు చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. అమెరికాలో ఉన్న కుమారుడు హరీష్రెడ్డి రాక కోసం మృతదేహన్ని ఫ్రీజర్లో ఉంచారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రెండు నెలల వ్యవధిలో ఎల్లారెడ్డిపేట మండలంలో ఐదుగురు అన్నదాతలు గుండె సంబంధిత వ్యాధులతో మృతి చెందడం కలకలం రేపుతోంది. స్థానికులు తెలిపిన వివరాలు. వ్యవసాయ పనులు చేసే భగవంతరెడ్డి ఒక రోజు ముందు నుంచి చాతిలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఆస్పత్రికి వెళ్దామని చెప్పి పొలానికి మందు పిచికారీ చేసేందుకు వెళ్లాడు. అక్కడే తీవ్ర నొప్పి రావడంతో వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. భగవంతరెడ్డికి భార్య మణెమ్మ, కుమారుడు హరీశ్రెడ్డి, కూతురు అనిత ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి తదితరులు పరామర్శించారు. బ్యాటరీ దొంగల అరెస్ట్చొప్పదండి: మండలంలోని గ్రామాల్లో వాహనాల నుంచి బ్యాటరీల చోరీ చేస్తున్న ముఠాను చొప్పదండి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ మహేశ్ జల్సాలకు అలవాటు పడి, దొంగతనాలు చేసి జైలుకెళ్లి వచ్చాడు. అక్కడ తిమ్మాపూర్ మండలం నల్లగొండకు చెందిన నిషాని నరేశ్ పరిచయం అయ్యాడు. నరేశ్ డబ్బు అవసరం ఉందని మహేశ్ను కోరగా, స్కూటీతో రావాలని సూచించాడు. స్కూటీపై ఇద్దరూ చొప్పదండి మండలంలో వాహనాల బ్యాటరీలు దొంగతనం చేస్తూ వచ్చారు. గుమ్లాపూర్, కాట్నపల్లి, ఆర్నకొండ గ్రామాల్లో అయిదు బ్యాటరీలు దొంగలించి చొప్పదండిలోని అనుమాండ్ల మల్లేశంకు విక్రయించారు. భూపాలపట్నం రోడ్డులో నిలిపి ఉన్న లారీల్లో అయిదు బ్యాటరీల దొంగిలించడానికి ప్రయత్నించారు. లారీ డ్రైవర్ చాకచక్యంగా ఇద్దరిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై నరేశ్రెడ్డి కేసు నమోదు చేశారు. ప్రమాదవశాత్తు కారు దగ్ధంమల్లాపూర్: నిర్మల్ జిల్లా ఆడెల్లి పోచమ్మను దర్శించుకునేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు దగ్ధమైన సంఘటన మల్లాపూర్ మండలకేంద్రం శివారులో గురువారం వేకువజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన సంజీవ్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో ఆడెల్లి పోచమ్మ ఆలయానికి బయల్దేరారు. మండలంలోని పాతదాంరాజుపల్లిమార్గంలో 61వ జాతీయ రహదారిపై నుంచి వెళ్తుండగా.. కారు ఇంజిన్లోంచి పొగలు రావడంతో సంజీవ్ అప్రమత్తమై కుటుంబసభ్యులందరిని కారులోంచి కిందకి దింపా డు. ఇంజిన్లో మంటలు చేలరేగి కారు పూర్తి గా దగ్ధమైంది. డ్రైవర్ సహా మిగిలిన వారందరూ క్షేమంగా ఉన్నారు. మల్లాపూర్ పోలీసులు ఘటనస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. -
ఐదుతరాల అను‘బంధం’
మంథని: ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకరమవుతున్న తరుణంలో ఆదర్శమైన అపురూప సన్నివేశం ఆవిష్కృతమైంది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్లోని కొండాపూర్లో ఓ హాల్లో కలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 200 మంది ఒకే వేదికపై ఆనందం పంచుకున్నారు. ఆరునెలల శిశువులు మొదలు 80 ఏళ్ల వృద్ధులు ఐదుతరాల వారు ఈ అపురూప సన్నివేశంలో పాలుపంచుకున్నారు. నాటి కష్టాలను తలుచుకుంటూ నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. చిన్నారుల ఆటాపాటలతో సంతోషంగా గడిపారు. -
ముగింపు దశకు కొనుగోళ్లు ..
రాజన్నసిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరాయి. ఇప్పటికే చాలా సెంటర్లు మూసివేశారు. ఐదారు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవుతాయి. వడ్లు అమ్మిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా డబ్బులు జమవుతున్నాయి. గతంలో డిఫాల్ట్ ఉన్న మిల్లులకు ఈసారి వడ్లను ఇవ్వలేదు. బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన మిల్లులకే వడ్లను అందించాం. ప్రారంభంలో వర్షాలతో కొంత ఇబ్బంది ఎదురైనా.. ధాన్యం కొనుగోళ్లు సాఫీగా ముగించాము. – బంధం చంద్రప్రకాశ్, డీసీఎస్వో, రాజన్న సిరిసిల్ల -
ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు మృతి
మంథనిరూరల్: రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం భట్టుపల్లి శివారులో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో మంథని మండలం సూరయ్యపల్లికి చెందిన పిడుగు రాజ్కుమార్(33), 8వ కాలనీకి చెందిన రాంశెట్టి కిష్టయ్య(39) అక్కడికక్కడే మృతిచెందారు. మంథని ఎస్సై–2 సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజ్కుమార్ అతడి స్నేహితుడు కిష్టయ్య ద్విచక్రవాహనంపై మేడారం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో భట్టుపల్లి శివారులోని మైసమ్మ గుడి వద్ద ఎలాంటి సూచికలు లేకుండా రోడ్డుపై నిలిపిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మంథని పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బర్కత్ లేని వానాకాలం
సిరిసిల్ల: వానాకాలం సీజన్లో వరికి పెద్దగా చీడపీడలు ఆశించలేవు. అలాగని చెప్పుకోతగ్గ స్థాయిలో పంట దిగుబడి కూడా రాలేదు. ఎకరానికి గరిష్టంగా 30 క్వింటాళ్ల వడ్లు రావాల్సి ఉండగా 16 నుంచి 25 క్వింటాళ్ల మేరకే దిగుబడి వచ్చింది. వ్యవసాయాన్ని ముందుచూపుతో చేసే ఆదర్శ రైతులకు సైతం 30 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈ పంట సీజన్లో వరికి దోమపోటు, సుడిదోమ, మెడవిరుపు వంటివి సోకలేదు. కానీ అకాల వర్షాలు.. అతి వర్షాలు.. పంట పొట్టదశలో ఉండగా కురిసిన వర్షాలతో దిగుబడి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. గతేడాది వానాకాలంలో 1,74,176 ఎకరాల్లో వరి పంట వేయగా.. ఇంతకుమించి దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 1,84,860 ఎకరాల్లో వరి పంట వేసినా దిగుబడి డీలా పడ్డది. జిల్లాలో పంట దిగుబడి అంచనా 3,69,720 మెట్రిక్ టన్నులు కాగా.. ఇప్పటి వరకు 2,65,620 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరో 50వేల మెట్రిక్ టన్నులను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేసినా.. గత ఏడాది మేరకు దిగుబడి రాలేదు. ఈసారి మెజార్టీ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలపై ఆధారపడ్డారు. సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఇలా -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
● నెలరోజుల్లో తల్లీకొడుకుల మృతిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్కు చెందిన వంగల శ్రీనివాస్రెడ్డి(42) గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన తల్లి వంగల సుశీల నెల రోజుల క్రితం గుండెపోటుతో మరణించింది. తల్లి మొదటి మాసం పెట్టడానికి రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. శుక్రవారం తల్లికి మొదటి నెల కార్యక్రమాలు పూర్తి చేశాడు. తల్లి మరణంతో కుంగిపోయిన శ్రీనివాస్రెడ్డి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకోవడంతో అప్పుల పాలైనట్లు తెలిపారు. అప్పులు తీర్చడానికి పెద్ద ఉద్యోగం లేకపోవడం, మరోవైపు తనకు అండగా ఉన్న తల్లి మరణించడంతో మనోధైర్యం కోల్పోయి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో తల్లి, కొడుకు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య అర్చన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. -
చాలా ఇబ్బంది పడ్డాం
గురుకుల సొసైటీ పరిధిలో ఉన్నప్పుడు వ్యవసాయ చదువు పూర్తవుతుందనే భావన ఉండేది కాదు. ఇప్పుడు వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో చేర్చడంతో మంచి ప్రొఫెసర్లు వచ్చారు. నాణ్యమైన విద్య భోదిస్తున్నారు. – ఎస్.రోష్న, మంచిర్యాల ల్యాబ్లు ఉండేవి కావు గురుకులం సొసైటీ వ్యవసా య కళాశాలలో ల్యాబ్లు పెద్దగా ఉండేవి కావు. పొలా స కళాశాలలో చక్కటి తరగతి గదులు, డిజిటల్ ల్యాబ్లు, ఆధునాతన లైబ్రరీ ఉన్నాయి. దీంతో వ్యవసాయ విద్యపై మరింత ఆసక్తి పెరిగింది. – డి.స్వప్న, హైదరాబాద్ కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి గురుకులం వ్యవసాయ కళాశాల నుంచి పొలాస కళాశాలకు వచ్చిన తర్వాత కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. విద్యార్థినులందరం 80 శాతం ఉంటాం. విద్యతోపాటు ఇతర క్రీడా, సాంస్కృతిక రంగాలపై శిక్షణ ఇస్తున్నారు. – జి. పల్లవి, ములుగు -
‘గురుకులం సొసైటీ’కి పుల్స్టాప్
● విద్యార్థులందరూ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోకి ● కేవలం విద్యార్థుల ఖర్చులు భరిస్తున్న గురుకుల సొసైటీలుజగిత్యాలఅగ్రికల్చర్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల శాఖ ద్వారా ఎస్సీ, బీసీ విద్యార్థినిలకు గురుకులం సొసైటీ కింద వ్యవసాయ విద్య అందించేందుకు మహిళా వ్యవసాయ కళాశాలకు శ్రీకారం చుట్టింది. ఈ పద్ధతి రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ కళాశాలలు ఏర్పాటు చేసింది. ఇందులో ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ ద్వారా కోరుట్లలో ఒకటి, బీసీ వెల్ఫే సొసైటీ ద్వారా కరీంనగర్లో మరొకటి ఏర్పాటు చేశారు. వ్యవసాయ కోర్సులో చేరిన విద్యార్థినులకు వసతులు కల్పించలేక సొసైటీలు చేతులెత్తేశాయి. దీంతో విద్యార్థినులు, ధర్నాలు, ఆందోళనలు చేయడంతో ప్రభుత్వ ఒత్తిడి మేరకు నిబంధనలు సవరించి సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సొసైటీ కింద ఉన్న విద్యార్థినులకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకి మార్చారు. కోరుట్ల విద్యార్థులు పొలాస కళాశాలకు సోషల్ వెల్ఫేర్ గురుకులం సొసైటీ కింద 2023–24లో ఏర్పాటు చేసిన వ్యవసాయ కళాశాలను కోరుట్లలో ఏర్పాటు చేయగా.. 83 మంది చేరారు. అడ్మిషన్లు తీసుకున్నప్పటికీ టీచింగ్ స్టాఫ్ లేదు. ల్యాబ్లు లేవు. ప్రాక్టీకల్స్ లేవు. ఎలా ముందుకెళ్లాలో తెలియదు. పాఠాలు బోధించేందుకు, విద్యార్థినులు ఉండేందుకు సరైన వసతులు లేక అద్దెభవనాల్లో నెట్టుకుంటూ వచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్ స్టాఫ్ను నియమించారు. ఇంత చేసినా జాతీయస్థాయిలో ఉండే ఐకార్ సంస్థ గుర్తించలేదు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారడంతో వారిని పొలాస కళాశాలకు తరలించారు. కరీంనగర్ మొదటి ఏడాది విద్యార్థినుల తరలింపు బీసీ గురుకులం సొసైటీ ఆధ్వర్యంలో కరీంనగర్లో 2021లో మహిళా వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేయగా ప్రస్తుతం 360 మంది చదువుతున్నారు. ఇక్కడ కూడా చదువు, వసతుల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఇటీవల బీసీ సంక్షేమ శాఖ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చేర్చేందుకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే మొదటి ఏడాది విద్యార్థులను రాష్ట్రంలోని ఏడు కళాశాలల్లో 10 నుంచి 15 మందిని కేటాయించారు. రెండు, మూడో ఏడాది విద్యార్థులను త్వరలో సిరిసిల్ల, వరంగల్ వంటి ఇతర కళాశాలలకు తరలించనున్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు నిబంధనలు కఠినంగా ఉండటంతో సవరించే బాధ్యతలను ప్రభుత్వం వర్సిటీ వైస్ చాన్స్లర్ జానయ్యకు అప్పగించింది. ఆయన గురుకులం సొసైటీ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ వ్యవసాయ వర్సిటీ బోర్డు మెంబర్లు, ఫ్యాకల్టీ, అకడమిక్ కౌన్సిల్తో చర్చించి సామాజిక కోణంలో ఆలోచించి, విద్యార్థినుల భవిష్యత్ దెబ్బతినకుండా వ్యవసాయ కళాశాలల్లో కలపాలని నిర్ణయించారు. -
స్పోర్ట్స్ క్యాపిటల్గా కరీంనగర్ ఎదగాలి
● రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్బాబు ● అట్టహాసంగా సీనియర్స్ కబడ్డీ పోటీలు ప్రారంభంకరీంనగర్స్పోర్ట్స్: క్రీడల్లో కరీంనగర్ జిల్లా తెలంగాణలో స్పోర్ట్స్ కాపిటల్గా ఎదగాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో జరిగిన 72వ రాష్ట్రస్థాయి సీనీయర్స్ పురుషులు, మహిళల కబడ్డీ చాంపియన్షిప్ పోటీ ల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన మానకొండూర్ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఒలింపిక్, రాష్ట్ర, జిల్లా కబడ్డీ క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ చేయగా.. వారు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేసిందన్నారు. 2036లో జరగనున్న ఒలింపిక్స్లో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించే దిశగా క్రీడాపాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. నిఖత్ జరీన్ లాంటి ఎందరో క్రీడాకారులకు ప్రోత్సాహాన్నిచ్చి క్రీడల్లో ఆసక్తిని మరింత పెంచేలా ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కాసాని వీరేశం, మహేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు సీహెచ్ సంపత్రావు, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అమిత్కుమార్ మాట్లాడుతూ.. 33 జిల్లాల నుంచి 952 మంది క్రీడాకారులు, 200 మంది రెఫరీలు, కోచ్లు, మేనేజర్లు, సంఘం బాధ్యులు హాజరైనట్లు చెప్పారు. 28 మంది పురుషులు, మహిళా క్రీడాకారులను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ శాసన సభ్యుడు ఆరెపల్లి మోహన్, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, అంతర్జాతీయ క్రీడాకారులు శ్రీనివాస్రెడ్డి, గంగాధరి మల్లేశ్, కబడ్డీ సంఘం చీఫ్ ప్యాట్రన్ ఇ.ప్రసాద్రావు, జిల్లా కబడ్డీ సంఘం కార్యదర్శి మల్లేశ్గౌడ్, డీవైఎస్వోలు శ్రీనివాస్గౌడ్, సురేశ్, రాష్ట్ర, జిల్లాల కబడ్డీ సంఘం బాధ్యులు, కోచ్లు, మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు. పోటీలను ప్రారంభించిన మంత్రి సీనియర్స్ పోటీల్లో భాగంగా పురుషుల విభాగంలో కరీంనగర్, ఖమ్మం జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ క్రీడాకారులను మంత్రి పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు. మహిళల పోటీలను సైతం ప్రారంభించారు. పారమిత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ పోటీల సందర్భంగా రూపకల్పన చేసిన అల్బమ్లు ఆకట్టుకున్నాయి. -
హత్యనా.. ఆత్మహత్యనా..?
● గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ● మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశ్గా నిర్ధారణరాయికల్: రాయికల్ పట్టణంలోని చెరువులో రెండు రోజుల క్రితం కనిపించిన మృతదేహం మల్లాపూర్ మండలం వాల్గొండ గ్రామానికి చెందిన కుర్ర మల్లేశ్ (22)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వాల్గొండకు చెందిన కుర్ర మల్లేశం చిన్నతనంలోనే తల్లి నర్సు, తండ్రి పోచయ్య చనిపోయారు. మల్లేశ్ తన అక్క నవ్యతో కలిసి పనులు చేసుకుంటున్నాడు. నవ్యకు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అప్పటినుంచి మల్లేశ్ రాయికల్లో ఓ కాంట్రాక్టర్ వద్ద రోడ్డు పనులు చూసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. ఈనెల 11న పంచాయతీ ఎన్నికల్లో వాల్గొండలో ఓటు హక్కు వినియోగించుకుని అక్క వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో నవ్య రాయికల్ వచ్చింది. దీంతో మల్లేశ్ తిరిగి కాంట్రాక్టర్ వద్దకు వెళ్లినట్లు నవ్య భావించింది. మల్లేశ్ చెరువులో శవమై కనిపించడంతో బోరున విలపించింది. తన తమ్ముడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరో హత్య చేసి ఉంటారని నవ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు మల్లేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా..? హత్యకు గురయ్యాడా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రెండు ఆలయాల్లో చోరీ
ధర్మపురి: ధర్మపురి పట్టణంలోని పురాతన ఆలయాలైన అక్కపల్లి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీలక్ష్మినృసింహాస్వామి ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి.. తాళాలు పగులగొట్టి.. విగ్రహాలపై ఉన్న వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో పట్టెనామాలు, కోరమీసాలు, రాజరాజేశ్వర స్వామి ఆలయం శివలింగానికి ఉన్న రెండు కిలోల వెండిపానవట్టం, అమ్మవారికి అలంకరించిన 80 గ్రాముల వెండి ముక్కుపుడక తొడుగు ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే గురువారం ఉదయం ఐదు గంటలకు పూజారి ప్రవీణ్కుమార్ ఆలయానికి చేరుకోగా.. తాళం పగులగొట్టి కనిపించింది. లోపలికి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్ చేరుకుని ఆలయాల్లో పరిశీలించారు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో క్లూస్టీం చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల పుటేజీని పరిశీలిస్తున్నారు. ఈఓ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పురుగుల మందు తాగించి, గొంతు నులిమి..
సైదాపూర్: ఓ పెళ్లయిన యువకుడు తమ కూతురు వెంటపడుతున్నాడని... ఎక్కడ అతడితో ప్రేమలో పడితే కుటుంబ పరువు పోతుందని భావించిన తల్లిదండ్రులు తమ పేగుబంధాన్ని తుంచుకున్నారు. కూతురుకు బలవంతంగా పురుగుల మందు తాగించి, చావకపోవడంతో గొంతు నులిమి చంపేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించగా.. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గత నెల 14న కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో చోటు చేసుకుంది. గురువారం హుజూరాబాద్ ఏసీపీ మాధవి నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శివరాంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రాజు, లావణ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు డిగ్రీ చదువుతోంది. చిన్న కూతురు(16) మండలంలోని ఓ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. బాలికను అదే గ్రామానికి చెందిన పోలు అనిల్(27) కొంతకాలంగా ప్రేమపేరిట వేధిస్తున్నాడు. అనిల్కు అప్పటికే వివాహమైందని, అతనితో మాట్లాడొద్దని తన కూతురును రాజు పలుమార్లు మందలించాడు. అయినప్పటికీ ఆ యువకుడు తరచూ ఇంటికి వస్తూ, బాలికతో మాట్లాడుతుండడంతో తల్లిదండ్రులు ఆవేశానికి గురయ్యారు. చిన్న కూతురు వ్యవహారంతో తమ పరువుపోతోందని భావించారు.ఈ క్రమంలోనే కూతురును చంపాలని నిర్ణయించుకున్నారు. విష పురుగు కుట్టిందని.. ఆత్మహత్య చేసుకుందని..నవంబర్ 14న రాత్రి కుటుంబసభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు. రాజు, లావణ్య బాలికను వేరే గదిలోకి తీసుకెళ్లారు. మొదట బలవంతంగా పురుగుల మందు నోట్లో పోశారు. చావకపోవడంతో రాజు తన కూతురు గొంతు నులిమి చంపేశాడు. మరునాడు ఉదయం 4గంటలకు కూతురు నిద్ర లేవడం లేదని, నోట్లోంచి నురగలు వచ్చాయని, ఏదైనా విషపురుగు కుట్టవచ్చని తండ్రి గ్రామస్తులకు చెప్పుకుంటూ రోదించాడు. తన కూతురు థైరాయిడ్, ఇతర అనారోగ్య కారణాలతో బాధపడుతోందని, పురుగుల మందు తాగి చనిపోయి ఉంటుందని నవంబర్ 15న పోలీసుస్టేషన్కు వెళ్లి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. బాలికను అదే గ్రామానికి చెందిన అనిల్ ప్రేమపేరుతో వేధించాడని, ఈ విషయమై బాలిక ఇంట్లో గొడవలు జరిగినట్లు తెలుసుకున్నారు. దీంతో రాజు, లావణ్యను పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. పెళ్లయిన వ్యక్తికి తమ కూతురు దగ్గరైతే.. తమ పరువు పోతుందని భావించి, తామే తమ కూతురును చంపేశామని ఒప్పుకున్నారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ చేశామని ఏసీపీ తెలిపారు. ప్రేమ వ్యవహారాల్లో కన్న పిల్లలను చంపుకోవద్దని, ఆడ పిల్లలను ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయని అన్నారు. ఈ సమావేశంలో హుజూరాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, ఎస్ఐ తిరుపతి, ఏఎస్ఐ తిరుపతి పాల్గొన్నారు. -
పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని..
కరీంనగర్: సైదాపూర్ మండలం శివరాంపల్లిలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న.. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించిందని, పదవ తరగతి చదివే విద్యార్థినిని బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి తల్లిదండ్రులే హత్య చేశారు. ఆ తరువాత కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన గత నెల 14న జరిగింది. పోలీసుల విచారణ అనంతరం తల్లిదండ్రులే హత్య చేశారని నిర్థారించారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు హుజూరాబాద్ ఏసీపీ మాధవి వెల్లడించారు. -
పతుల పెత్తనానికి చెక్
కరీంనగర్రూరల్: గ్రామపంచాయతీ పరిపాలన వ్యవహారాల్లో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచులుగా సతుల విధుల్లో పతులతో పాటు కుటుంబసభ్యులు జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలిచ్చింది. గ్రామాల్లో గెలిచిన మహిళా సర్పంచులకు బదులుగా భర్తలు, కొడుకులు, కుటుంబసభ్యులు అధికారం చెలాయించడం సర్వసాధారణంగా మారింది. ఈ నెల 22న జరిగిన పంచాయతీ పాలకవర్గం ప్రమాణస్వీకారంలో సైతం కొన్ని గ్రామాల్లో భార్యలకు బదులుగా భర్తలు ప్రమాణం చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బుధవారం మెమో నంబరు–3,292 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామపంచాయతీతో పాటు మండల పరిషత్, జెడ్పీలకు సైతం ఈ ఉత్వర్వులు వర్తింపచేయాలని సూచించింది. స్థ్ధానికసంస్థల్లో సగం సీట్లు మహిళలకే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. జిల్లాలో 316 సర్పంచు స్థానాలకు మహిళలకు 158, మొత్తం 2,946 వార్డు స్థానాలకు 1,483 కేటాయించారు. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 80 సర్పంచ్ స్థానాలు కేటాయిస్తే మహిళలకు 40స్థానాలు, బీసీలకు 73 స్థానాలిస్తే 37, మిగితా 163 జనరల్ స్థానాల్లో 81 మహిళలకు కేటాయించారు. జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎ న్నికల్లో సర్పంచులు, వార్డుసభ్యులు కలిపి 1,641 మంది మహిళలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. జనరల్ స్ధానాల్లో సైతం మహిళలు పోటీచేసి సర్పంచులు, వార్డుసభ్యులుగా గెలుపొందారు. ఆచరణలో అమలయ్యేనా? మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబసభ్యుల పెత్తనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వులను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకాలేదు. గత పాలకవర్గంలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా ప్రజాప్రతినిధులస్థానంలో భర్తలు పాలన సాగించిన ఎన్నో సంఘటనలు వెలుగుచూశాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సైతం భార్యలకు బదులుగా భర్తలకే ప్రాధాన్యత ఇవ్వడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. కరీంనగర్రూరల్ మండలంలోని ఓ పంచాయతీలో మహిళా సర్పంచ్కు బదులుగా భర్త అధికారం చెలాయించడంతోపాటు వేధింపులు భరించలేక కార్యదర్శులు బదిలీపై వెళ్లాల్సిన పరిస్థితులేర్పడ్డాయి. ప్రభుత్వం ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వుతో మార్పు వస్తుందా అని పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల మార్కు కనిపిస్తుందని అంటున్నారు. -
రైళ్ల వేగం మరింత పెంపు
● రైలుపట్టాల కింద సిమెంట్ స్లీపర్లు ● పాత సిమెంట్ స్లీపర్ల తొలగింపు ● కాజీపేట – బల్హార్షా సెక్షన్ల మధ్య పనులు ఓదెల(పెద్దపల్లి): కాజీపేట బల్హార్షా సెక్షన్ల మధ్య రైళ్లవేగం మరింత పెంచేందుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, పొత్కపల్లి, ఓదెల, కొలనూర్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి వరకు రైలుపట్టాల కింద కొత్త సిమెంట్ స్లీపర్లు అమర్చుతున్నారు. ప్రస్తుతం మూడోలైన్ అందుబాటులోకి రావడంతో ఒకేమార్గంలో రెండు రైళ్లు అప్ అండ్ డౌన్ చేస్తున్నాయి. కాలం చెల్లిన సిమెంట్ స్లీపర్లను తొలగించి రైలు వేగాన్ని తట్టుకునేలా గేజ్పెంచిన ఆధునిక సిమెంట్ స్లీపర్లు వేస్తున్నారు. ఒక్కో రైలు వేగం గంటకు 110 కి.మీ. ఉందని, దానిని గంటకు 130 కి.మీ. వరకు పెంచేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. మూడోలైన్తో గూడ్సురైళ్ల వేగం కూడా పెంచనున్నారు. ఒక రైలు వెనకాల మరోరైలు వెళ్లేందుకు వీలుగా ఆటోమెటిక్ సిగ్నల్స్ సిస్టం ప్రారంభించారు. -
గ్రామాల్లో పెద్దన్న పాత్ర పోషించాలి
కొత్తపల్లి(కరీంనగర్): గ్రామాల్లో సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు ప్రజలతో సఖ్యతగా మెదులుతూ పెద్దన్న పాత్ర పోషించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీజెపీ సర్పంచ్లు గెలిచిన 108 గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కరీంనగర్ సూర్యనగర్లోని శుభం గార్డెన్స్లో బీజేపీ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికై న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతకుముందు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ బీజేపీ గెలిచిన గ్రామాల్లో మొదటి ప్రాధాన్యంగా ఊరికో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానన్నారు. పీహెచ్సీలకు అవసరమైన వైద్య పరికరాలు అందిస్తానన్నారు. సర్కారు స్కూళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇతర సర్పంచ్లకు ఆదర్శంగా బీజేపీ సర్పంచులు వ్యవహరించాలని పిలుపునిచ్చారు. పార్టీ గుర్తుతో ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్కు ఒక్కసీటు వచ్చే పరిస్థితి లేదని తెలిసే, గెలిచిన వాళ్లంతా కాంగ్రెసోళ్లేనని గంప కింద కమ్మేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ బలపర్చిన అభ్యర్థులంతా గెలిపించుకునేందుకు పార్లమెంట్కు వెళ్లకుండా అమిత్షా నుంచి అనుమతి తీసుకుని కరీంనగర్లో మకాం వేశానని, కొంత మంది కార్యకర్తలు పోటీ చేయాలంటే నామినేషన్ వేయడానికి కూడా పైసల్లేని పరిస్థితుల్లో 500 పంచాయతీల్లో పోటీ చేసి బీజేపీ ఉనికి చాటిందన్నారు. కరీంనగర్ ఇన్చార్జి డాక్టర్ మనోహర్ రెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మోహన్రెడ్డి పాల్గొన్నారు.


