breaking news
Karimnagar
-
ఛీ.. వీడేం టీచర్.. టెన్త్ నుంచి వేధింపులు.. పెళ్లి తర్వాత..
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో చదివే బా లికను వేధించి, లోబర్చుకొని శారీరకంగా వాడుకున్న ఇంగ్లిష్ టీచర్ సాతూరి మధుకర్(52)కు 17 ఏళ్ల కారాగార శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తూ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి సునీత తీర్పు చెప్పారు. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉండే మధుకర్ 2013లో కాల్వశ్రీరాంపూర్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్గా పని చేశాడు. ఆ సమయంలో 10వ తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, బలవంతంగా లో బర్చుకున్నాడు. రాత్రి క్లాస్ల పేరిట స్కూల్కు పిలిచి స్టాఫ్ రూమ్లో చాలాసార్లు శారీరకంగా అనుభవించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మానాన్నను చంపేస్తానని బెదిరించాడు. తర్వాత బాలిక హనుమకొండలో డిగ్రీ చదువుతున్న సమయంలో మధుకర్ అక్కడి కూడా వెళ్లి ఆమెను భయపెట్టి శారీరకంగా వాడుకున్నాడు. ఆమెకు తెలియకుండా ఫొటోలు, వీడియోలు తీశాడు. తాను పిలిచినప్పుడల్లా రాకుంటే ఫొటోలు, వీడియోలు అందరికీ పంపిస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెకు పెళ్లయినా వదిలిపెట్టలేదు. ఆమె భర్తకు ఫోన్లో ఫొటోలు, వీడియోలు పంపించాడు. అవి చూసిన ఆమె భర్త విడాకులు ఇచ్చాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎస్కే జానీపాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాదం రమేశ్ సాక్షులను ప్రవేశపెట్టి తన వాదనలు వినిపించి నేరాన్ని రుజువు చేయడంలో కీలకపాత్ర పోషించారు. జడ్జి సునీత సాక్ష్యాధారాలు పరిశీలించి నిందితుడికి కఠిన కారాగార శిక్ష, జరిమానా విధించారు. -
కొడుకును చూసేందుకు వచ్చి గుండెపోటుతో మృతి
వేములవాడఅర్బన్: రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో చదువుతున్న కుమారుడు సుశాంత్ను చూసేందుకు వచ్చిన తల్లి చందన(32) గుండెపోటుతో మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు. జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన చందన–నరేశ్ దంపతుల కుమారుడు సుశాంత్ను వారం క్రితం రాజన్న ఆలయ అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్పించారు. సుశాంత్ను చూడటానికి గురువారం తల్లిదండ్రులు వచ్చారు. అనంతరం చందన పై అంతస్తులో ఉన్న వాష్రూమ్కు వెళ్లి అక్కడే కుప్ప కూలిపోయింది. గమనించిన సిబ్బంది సమాచారంతో వెంటనే చేరుకున్న ఉపాధ్యాయుడు ఆమెకు సీపీఆర్ చేశారు. అక్కడికొచ్చిన ఆర్బీఎస్కే వైద్యుల సైతం ప్రాథమిక చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అనంతరం 108 వాహనంలో వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. వేములవాడ సంస్కృత పాఠశాలలో ఘటన -
అమ్మవారికి పుదీన మాల
విద్యానగర్(కరీంనగర్): నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాఢమా సం శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు గురువారం అమ్మవారిని పుదీనా మాలలతో అలంకరించారు. విశేష హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు● మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూర్: నియోజకవర్గంలో అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలోని కరీంనగర్–వరంగల్ రహదారిపై మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా రసమయి మాట్లాడుతూ, నియోజకవర్గంలో 48వేల మంది దరఖాస్తు చేసుకుంటే 2 వేల మందికి మంజూరు చేశారని, డబ్బు, కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు. అర్హులకు ఇళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఇళ్ల మంజూరు విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ మండలకేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాను అడ్డుకోవడానికి కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో హాజరై పల్లెమీద చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. వారిని అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరిగింది. కార్యకర్తలను అదుపులోకి తీసుకుని హుజూరాబాద్, కేశవపట్నం పోలీస్ స్టేషన్లకు తరలించారు. క్షయ నిర్మూలన అందరి బాధ్యతకరీంనగర్టౌన్: క్షయ నివారణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా టీబీ అధికారి డాక్టర్ రవీందర్రెడ్డి అన్నారు. క్షయ నివారణ విభాగం, టీబీ అలర్ట్ ఇండియా– ఇంపాక్ట్ ఇండియా ప్రాజెక్ట్ సహకారంతో గురువారం కరీంనగర్ మండలం పరిషత్ కార్యాలయంలో టీబీ చాంపియన్స్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షయతో బాధపడేవారు తగు జాగ్రత్తలు వహించడం వల్ల ఇతరులకు వ్యాధి సంక్రమించకుండా ఉంటుందని సూచించారు. ప్రభుత్వం ఈ వ్యాధికి ఉచిత వైద్యం అందిస్తుందని లక్షణాలు ఉన్నవారు అశ్రద్ధ వహించకుండా వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. డాక్టర్ సురేందర్, డాక్టర్ సాయి ప్రసాద్, ఎల్లయ్య, వనిత, శ్రీను, రాజబోస్, పారిజాతం రాజేందర్, అనిల్, ఆశా వర్కర్స్ పాల్గొన్నారు. ఆఫీసర్లను కలవాలంటే టైం పాటించాల్సిందే..కరీంనగర్ అర్బన్: కలెక్టరేట్లో ప్రధాన విభాగ అధికారులను కలవాలంటే సమయాన్ని అనుసరించాల్సిందే. రాజకీయ, ఇతర వ్యక్తులు కార్యాలయాల్లోనే తచ్చాడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పనివేళల్లో మద్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే అధికారులు, సిబ్బందిని కలవచ్చని బోర్డును ఏర్పాటు చేశారు. -
స్వచ్ఛత పాటిస్తే ర్యాంకు
● 20 గ్రామాల్లో కేంద్ర బృందం పరిశీలన ● నేడు కలెక్టరేట్లో అవగాహన కరీంనగర్రూరల్: గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ ఏడాదికిగాను వచ్చేనెల మొదటి వారంలో కేంద్ర బృందం పర్యటించనుంది. నాలుగు రకాలుగా గ్రామాల పారిశుధ్య అంశాలు కేంద్ర బృందం సభ్యులు సేకరించి జిల్లాల వారీగా స్వచ్ఛత స్థాయిని అంచనావేస్తారు. గణాంకాలు, నాణ్యత ఆధారంగా జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి ర్యాకులు ప్రకటిస్తారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో పంచాయతీ కార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులకు అవగాహన ఏర్పాటు చేశారు. మార్కుల ఆధారంగా పురస్కారం.. గ్రామాల్లో చెత్తసేకరణ, వ్యర్థాల నిర్వహణ, కంపోస్టు షెడ్లలో సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడుగుంతల నిర్మాణం, ప్లాస్టిక్ నియంత్రణ, పచ్చదనం, పరిశుభ్రత, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర బృందం పరిగణనలోకి తీసుకుంటుంది. నాలుగు అంశాలకుగాను 1000 మార్కులు కేటాయిస్తుంది. సేవా స్థాయిపురోగతికి 240 మార్కులు, ప్లాంట్ల పరిశీలనకు 120, నేరుగా పరిశీలనకు 540, పౌరుల అభిప్రాయాలకు 100 మార్కులు వేస్తారు. మెరుగైన ర్యాంకు సాధిస్తే పురస్కారాలకు ఎంపిక చేస్తారు. జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలుండగా కేంద్ర బృందం 20 గ్రామాలను ఎంపిక చేసి సర్వే చేయనుంది. అధికారులకు ఎలాంటి సమాచారం లేకుండానే ఆయా గ్రామాల్లో సర్వే చేస్తారు. గ్రామంలో 16 ఇళ్లను సందర్శించి ఇంటి యజమానుల అభిప్రాయాలను సేకరిస్తారు. 20 గ్రామాల్లో నెలరోజుల పాటు సర్వే నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. దీని ఆధారంగా స్కోర్, ర్యాంకును ప్రకటిస్తారు. జిల్లాకు మెరుగైన ర్యాంకు రావాలనే ఉద్దేశంతో కలెక్టరేట్లో పంచాయతీకార్యదర్శులు, స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధులు, క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎస్బీఎం జిల్లా కోఆర్డినేటర్ రమేశ్ తెలిపారు. -
తండ్రిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. శవమైన తనయుడు
చందుర్తి(వేములవాడ): అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రికి వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి తీసుకెళ్లిన తనయుడు శవమై ఇంటికి రావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలకు చెందిన సంఘని లక్ష్మీరాజం ఐదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. పదిహేను రోజుల క్రితం లక్ష్మీరాజం కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో కొడుకు తిరుపతి కరీంనగర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కాలుకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఇన్ఫెక్షన్ కాలు పై భాగానికి పోయిందని తెలపడంతో కొడుకు తిరుపతి మనోవేదనకు గురయ్యాడు. ఆదివారం ఉదయం బాత్రూమ్కు వెళ్లిన తిరుపతి అక్కడే పడిపోవడంతో తలకు తీవ్రంగా గాయమైంది. తలలోని నరాలు చిట్లిపోయాయని, వెంటనే ఆపరేషన్ చేశారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్పై ఉన్న తిరుపతి గురువారం మృతిచెందాడు. తిరుపతికి భార్య రజిత, ఆరేళ్ల కుమారుడు గణేశ్ ఉన్నారు. మమ్మల్ని చూసుకునే దిక్కెవరూ కొడుకా.. పోషించే కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ కుటుంబం జీర్ణించుకోలేకపోతుంది. అయ్యను దవాఖానాకు తీసుకుపోయి నువ్వే ప్రాణాలు పోగొట్టుకుంటివా బిడ్డా.. అంటూ ఆ తల్లి లింగవ్వ రోదనలు స్థానికులను కలచివేశాయి. తండ్రి ఆరేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న కంటికి రెప్పలా చూసుకుంటివి బిడ్డా.. మాకిప్పుడు ఎవరూ దిక్కంటూ గుండెలవిసేలా రోదించింది. మల్యాలలో మిన్నంటిన రోదనలు -
పిల్లలు బడిబాట
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ఎన్రోల్మెంట్ ● అత్యధిక విద్యార్థుల నమోదుతో జగిత్యాల టాప్ ● తక్కువ నమోదుతో సిరిసిల్ల లాస్ట్ ● గతేడాది కన్నా పెరిగిన విద్యార్థుల నమోదుసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రభుత్వం, విద్యాశాఖాధికారులు, ఉపాధ్యాయులు చేసిన ప్రచారం ఫలించింది. 2024–25 విద్యా సంవత్సరం కన్నా ఈసారి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విద్యార్థుల ఎన్రోల్మెంట్లో పురోగతి కనిపించింది. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో పెరుగుదల నమోదవడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. జగిత్యాల 39శాతం పెరుగుదలతో తొలిస్థానంలో నిలవగా కరీంనగర్ 32శాతంతో రెండోస్థానం దక్కించుకుంది. ఇక పెద్దపల్లి 19శాతంతో మూడోస్థానంలో నిలవగా సిరిసిల్ల 10శాతంతో నాలుగోస్థానం దక్కించుకుంది. ఈ పురోగతిలో జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులు, ఎంఈవో, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కృషి ఉంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల సిబ్బంది తమ పరిధిలో విద్యార్థులను ప్రభుత్వపాఠశాలలో చేర్చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించడం కలిసొచ్చింది. చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంతఖర్చులు వెచ్చించి మరీ ప్లెక్సీలు, పోస్టర్లు, రీల్స్, వీడియోలు, సోషల్ మీడియా ద్వారా విరివిగా ప్రచారం చేశారు. ఆ ప్రయత్నాల ఫలితాలే ఈ ఏడాది విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగేలా చేశాయి. అగ్రభాగాన జగిత్యాల.. ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జగిత్యాల అగ్రభాగన నిలవడం వెనక పలు కారణాలు ఉన్నాయి. భౌగోళిక విస్తీర్ణంలో జగిత్యాల పెద్దది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలు, విద్యార్థుల సంఖ్య అధికంగా ఉండటం, గ్రామీణ జనాభా అధికంగా ఉండటం వంటి అంశాలు కలిసి వచ్చాయి. కలెక్టర్, డీఈవో, ఎంఈవోలు క్రమశిక్షణతో పనిచేయడం ఎన్రోల్మెంట్ పెరుగుదలకు దోహదం చేసింది. ఇక మిగిలిన జిల్లాలు విస్తీర్ణం, జనాభా పరంగా చిన్నవి కావడంతో ఎన్రోల్మెంట్లోనూ జగిత్యాల తరువాత స్థానంలో నిలిచాయి. కరీంనగర్తోపాటు సిరిసిల్లకు ఇన్చార్జిగా ఉండే డీఈవోను ఇటీవల వివాదాస్పద ప్రవర్తనతో ఉన్నతాధికారులు తప్పించారు. అనంతరం కామారెడ్డి డీఈవోకు సిరిసిల్ల అదనపు బాధ్యతలు ఇచ్చినా.. ఆయన విధుల్లో చేరలేదు. దీంతో జెడ్పీ సీఈవోకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. టీచర్ల విషయంలో పర్యవేక్షణ కొరవడి ఎన్రోల్మెంట్లో కాస్త వెనకబడింది. రాజన్నసిరిసిల్ల చిన్న జిల్లా కావడం, విస్తీర్ణపరంగా, జనాభాపరంగా చిన్నది కావడం కూడా కారణాలే.ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల వివరాలు జిల్లా గతేడాది ఈ ఏడాది పెరుగుదల (శాతం) జగిత్యాల 3,690 5,147 39కరీంనగర్ 4,831 6,393 32పెద్దపల్లి 3,612 4,295 19సిరిసిల్ల 6,280 6,901 10 తల్లిదండ్రులను ఒప్పించాంబాలల బలోపేతం కోసం బడిబాటలో ప్రతీ ఇంటి తలుపుతట్టి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాం. ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశాం. నాణ్యమైన భోజనం, ప్రత్యేక తరగతుల గురించి వివరించాం. ఖర్చుల భారం తగ్గడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. – కె.రాము, డీఈవో, జగిత్యాల -
లాభాలు వస్తాయని నమ్మించి.. రూ.7లక్షలకు టోకరా
సిరిసిల్లక్రైం: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశ చూపి ఏకంగా రూ.7లక్షలు దండుకున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్లను జిల్లా పోలీసులు గురువారం కటకటాలకు పంపారు. ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపిన వివరాలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగర్ జిల్లా పిల్లోనా మండలం సీపూర్కు చెందిన కపిల్శర్మ, అదే ప్రాంతంలోని ఇస్మాయిల్పూర్కు చెందిన పంకజీ కౌశిక్ ఇద్దరు కలిసి సైబర్నేరాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఓ వెబ్ అప్లికేషన్ లింక్ను రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేశ్కు 2024, డిసెంబర్ 8న పంపారు. ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టబడి పెడితే అధి క లాభాలు వస్తాయని నమ్మించి రూ.2500 పెట్టుబడిగా పెట్టించారు. మరుసటి రోజు అదనంగా డబ్బులు వచ్చాయి. దీన్ని నమ్మిన రమేశ్ విడతల వారీగా రూ.7లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేశాడు. రెండు రోజుల తర్వాత ఆ డబ్బులు విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. తర్వాత ఆ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో తను మోసపోయినట్లు గ్రహించిన రమేశ్ చందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైం ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారం, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ మహేశ్ నిందితుల కోసం గాలించారు. ఈక్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అదుపులోకి తీసుకున్నారు. వెబ్లింక్తో మోసానికి పాల్పడ్డ అంతర్రాష్ట్ర సైబర్ ముఠా రాజస్థాన్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్ బీ గీతే -
ఆర్టీసీ టోల్ బాదుడు!
● టికెట్పై 20శాతం చార్జీల పెంపు ● స్టూడెంట్ బస్పాస్ చార్జీలు 50శాతం పెంపు ● హైదరాబాద్ మార్గంలో రూ.20 నుంచి రూ.30 వరకు అదనంకరీంనగర్: తెలంగాణ ఆర్టీసీ చడీచప్పుడు లేకుండా సాధారణ ప్రయాణికులతో పాటు స్టూడెంట్ బస్పాస్ చార్జీలను భారీగా పెంచింది. స్టూడెంట్ బస్పాస్ కనిష్టధర నెలకు రూ.400 ఉండగా 50శాతం మేర పెంచి రూ.600గా నిర్ణయించింది. ప్రయాణించే మార్గంలో ఎన్ని టోల్గేట్లు ఉంటే టికెట్పై అన్ని పది రూపాయల చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల నుంచి ఎక్కువ బస్సులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటాయి. కరీంనగర్ ప్రధాన బస్స్టేషన్ నుంచి హైదరాబాద్కు 8వేల నుంచి పదివేల వరకు ప్రయాణిస్తుంటారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో రేణిగుంట, దుద్దెడ టోల్ప్లాజాలు ఉండగా టికెట్పై రూ.20 నుంచి రూ.30 అదనంగా వసూలు చేస్తున్నారు. 50శాతం పెరిగిన బస్పాస్ చార్జీలు సాధారణ ప్రజలతో పాటు విద్యార్థుల బస్పాస్ ధరలను సైతం పెంచింది. తాజా పెంపుతో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. నెలవారీ స్టూడెంట్ బస్పాస్ చార్జీలు గతంలో రూ.400 ఉండగా దానిని రూ.600లకు, మూడు నెలల కాలానికి రూ.1200 నుంచి రూ.1800కు పెంచారు. దీంతో కరీంనగర్ రీజియన్ పరిధిలో దాదాపు 80 వేల నుంచి లక్ష మంది విద్యార్థులపై ప్రభావం పడుతోంది. టోల్ ధరలతో సంబంధం లేకుండా విద్యార్థుల బస్పాస్లకు సైతం ధరలు పెంచిన యాజమాన్యం కార్డు ముద్రణకు రూ.50 అదనంగా వసూలు చేస్తోంది. ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరో రకంగా... పల్లె వెలుగు బస్సుల్లో ఐదు కిలోమీటర్లకు ఒక స్టేజీ చొప్పన నిర్ణయించి చార్జీలు వసూలు చేస్తారు. ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రం మొత్తం కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకుంటారు. తాజాగా చేపట్టిన కిలోమీటర్ల సర్దుబాటుతో పలు మార్గాల్లో చార్జీలు పెరిగాయి. గతంలో చిల్లర సమస్య పేరుతో బస్సు చార్జీలను రౌండప్ చేయగా తాజాగా కిలో మీటర్ల సర్దుబాటు చేయడం పలు విమర్శలకు తావిస్తోంది. దీని వల్ల ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది.కరీంనగర్ నుంచి జేబీఎస్కు బస్సు పాతచార్జీ పెరిగిన (రూ.ల్లో) తర్వాత(రూ.ల్లో) రాజధాని 390 410 సూపర్లగ్జరీ(ఈవీ) 350 390 సూపర్లగ్జరీ 310 330 ఎక్స్ప్రెస్ 230 260 ఎక్స్ప్రెస్(ఈవీ) 240 270 గరుడ ప్లస్ 370 390 డీలక్స్ 260 280 -
జీప్యాట్లో విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్క్రైం: జాతీయ స్థాయిలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించిన జీప్యాట్ (గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్)లో శాతవాహన ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఎస్.సాయి మనిదీప్, ిసీహెచ్ చక్రధర్, బి.మాధురి, ఎన్.శిరీష, ఎ.నిత్యారెడ్డి, ఎం.అరుణ్, డి.పండరీనాథ్, సానియా, జి.సుగంధిక, ఎ.వర్ష ప్రతిభ చాటినట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీశైలం తెలిపారు. వారిని వీసీ ఉమేశ్కుమార్, రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్ అభినందించారు. ఓఎస్డీ హరి కా ంత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వై.కిశోర్, విభాగా ధిపతి అర్చన, అధ్యాపకులు భాగ్యలక్ష్మి, అనిల్కుమార్, క్రాంతిరాజు,జె.అశ్విని పాల్గొన్నారు. జేసీబీతో పని పేరిట మోసం సిరిసిల్లక్రైం: జేసీబీతో భూమి చదును చేసే పనులు ఉన్నాయంటూ నమ్మబలికి డబ్బులు గుంజుతున్న ఇద్దరిని తంగళ్లపల్లి పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా బాలాపూర్కు చెందిన గోల్కొండ చందుకుమార్, చింతపట్టి జిల్లాలోని పలువురు జేసీబీ యజమానులకు ఫోన్ చేశారు. వేములవాడ సమీపంలోని అగ్రహారంలో కొత్తగా వెంచర్ వేస్తున్నారని.. అందులో చెట్లను చదును చేయడానికి జేసీబీ కావాలని కోరారు. ఎంట్రీ ఫీజు కోసం రూ.9 వేలు ఇవ్వాల్సి ఉంటుందని నమ్మబలికారు. డబ్బులు పంపిన వారు పని కోసం ఫోన్చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసు లకు ఫిర్యాదు చేశారు. వీరి బాధితులు ముస్తాబాద్ మండలం ఆవునూరులో ఇద్దరు, ఎల్లారెడ్డిపేటలో ఒకరు ఉన్నట్లు తెలిపారు. -
మత్తు పదార్థాలకు బానిస కావద్దు
● కలెక్టర్ పమేలా సత్పతి కొత్తపల్లి/కరీంనగర్ క్రైం: యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి వైద్య కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. వైద్య, ఇంజినీరింగ్ విద్యార్థులు కొందరు మత్తు పదార్థాల బారిన పడుతుండటం బాధాకరమన్నారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిరోధానికి డ్రగ్ డిటెక్షన్ కిట్లను ఉపయోగించి తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కళాశాలస్థాయిలో విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాల బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ పాఠశాలస్థాయిలో విద్యార్థులు మత్తుకు బానిసకావడం దారుణమన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాను ఉక్కుపాదంతో అణిచివేయాలన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, డీఎంహెచ్వో వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. పోలీసుల ఆధ్వర్యంలోమాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీ గౌస్ఆలం ఆధ్యరంలో గురువారం నగరంలో రెండు కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ పమేలా సత్పతి ప్రారంభించారు. అనంతరం కమిషనరేట్ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
నృసింహుడి హుండీ ఆదాయం రూ.71.53 లక్షలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి వారికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.71,53,190 సమకూరినట్లు ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. మార్చి 21 నుంచి ఈనెల 26 వరకు (98 రోజులు) వచ్చిన ఆదాయాన్ని లెక్కించగా నగదుతోపాటు 68 గ్రాములు మిశ్రమ బంగారం, 7.400 కిలోల మిశ్రమ వెండి, 32 విదేశీనోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రజ, ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, స్వచ్ఛంద సేవకులు, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, అర్చకులు తదితరులున్నారు. ఆల్ ఇండియా సెమ్స్ ఒలింపియాడ్లో ప్రతిభసప్తగిరికాలనీ(కరీంనగర్): సెమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ నేషనల్ సెమ్స్ మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో మానేరు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ప్రతిభకనబర్చి ఆల్ ఇండియా, స్టేట్ లెవల్ ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. ఎన్.రక్షిత ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు, కె.మహిత ఆల్ ఇండియా 4, స్టేట్ లెవల్లో పి.మహిధర్, ఆత్రేయులు 2, మహిత 3, మహి చౌదరి 7 పరీక్షిత్ సారధి, అభిగ్నలు 10వ ర్యాంకులతో పాటు పలువురు విద్యార్థులు జోనల్ ర్యాంకులు సాధించారని తెలిపారు. గురువారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతా రెడ్డి, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, కో ఆర్డినేటర్లు, ఇన్చార్జి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అడవికి ఆపద
సిరిసిల్ల: జిల్లాలో అటవీ భూములు కబ్జాకు గురవుతున్నా.. ఆఫీస్ల్లోనే అటవీశాఖ అధికారులు రెస్ట్ తీసుకుంటున్నారు. రికార్డుల్లోనే అడవిని రక్షిస్తున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్–2023 ప్రకారం 251 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2020లో 22.50 శాతం ఉన్న పచ్చదనం ఏకంగా 20.45 శాతానికి పడిపోయినట్లు అటవీశాఖ గణాంకాలే చెబుతున్నాయి. ప్రభుత్వం పోడుభూములకు పట్టాలు ఇస్తుందనే నమ్మకంతో అటవీ శివారు పల్లెల్లో పోడు పేరిట ఫారెస్ట్ను పాడుచేసే పనులు చేస్తున్నారు. ఇందుకు క్షేత్రస్థాయిలో పనిచేసే అటవీశాఖ అధికారులు, సిబ్బంది అండగా నిలుస్తున్నారు. ఎకరానికి రూ.50వేల నుంచి రూ.1.50 లక్షల వరకు దండుకుంటూ అక్రమార్కులకు అధికారులే అండగా నిలుస్తున్నారు. అటవీ భూములను ఆక్రమించడం, సాగుచేయడం నేరమని తెలిసినా కొందరు గొడ్డళ్లు, ట్రాక్టర్లతో అడవికి ఎసరుపెడుతూనే ఉన్నారు. కొత్తపేట, మల్యాల, సనుగుల, రామారావుపల్లి, గోవిందరావుపల్లి, వట్టిమల్ల, గర్జనపల్లి, రంగంపేట శివా రుల్లో సుమారు 251 ఎకరాల్లోని జంగల్ను నరికేశారు. మార్కెట్లో ఆ భూముల విలువ రూ.37.65 కోట్ల మేరకు ఉంటుంది. కళ్లు తెరవకుంటే.. జిల్లా అధికారులు కళ్లు తెరవకుంటే పచ్చని అడవి ఆక్రమణల పాలై పర్యావరణ సమతుల్యత లోపిస్తుంది. పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఏటా రూ.కోట్లు వెచ్చించి హరితహారం చేపడుతున్నా నాటే మొక్కల కంటే నరికేస్తున్న చెట్ల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆర్థికంగా ఉన్న వారు ఇప్పటికే ఎకరాల కొద్ది భూములను ఆక్రమించి.. పోడు పేరిట అడవులకు కీడు చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి, వాస్తవాలను గుర్తించి చర్యలు తీసుకుంటే భవిష్యత్లో అటవీ భూములకు రక్షణ కల్పించినట్లు అవుతుంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో పోడుపట్టాలు అటవీ భూముల ఆక్రమణలు ఎలా ఉన్నా.. కొత్తగా అడవికి ఆపద రాకుండా రక్షించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉంది. స్పందించని అటవీశాఖ అధికారులు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలపై జిల్లా ఇన్చార్జి డీఎఫ్వోను ఫోన్లో ‘సాక్షి’ సంప్రదించగా స్పందించలేదు. కొత్తగా సాగులోకి వచ్చిన అటవీభూముల వివరాలపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆమె ఫోన్ ఎత్తలేదు. ఏది ఏమైనా జిల్లాలో అటవీ భూముల ఆక్రమణలు నిరాటంకంగా సాగుతున్నాయి.అటవీ స్వరూపం..(అటవీ శాఖ గణాంకాలు) గ్రామాలు: 260అటవీ సమీప గ్రామాలు: 64అటవీ విస్తీర్ణం : 390.85 చదరపు కిలోమీటర్లు మధ్యస్థ దట్టమైన అటవీ ప్రాంతం : 113.26 చదరపు కిలోమీటర్లు బహిరంగ అటవీ ప్రాంతం : 185.07 చదరపు కిలోమీటర్లు పోడు అటవీ ప్రాంతం : 15.32 చదరపు కిలోమీటర్లు అడవి కాని అటవీ ప్రాంతం : 76.06 చదరపు కిలోమీటర్లు అడవుల్లో నీటి వనరులు : 1.14 చదరపు కిలోమీటర్లు పచ్చదనం శాతం : 20.45ఉండాల్సిన పచ్చదనం: 33 శాతం ఇది రాజన్నసిరిసిల్ల జిల్లాలోని చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు 2015లో నిర్మించిన చెక్డ్యాం. ఈ చెక్డ్యామ్లో నీరు నిల్వ ఉండి.. వన్యప్రాణులకు దాహార్తి తీర్చుతుంది. ఈ చెక్డ్యామ్ పక్కనే ఓ పది ఎకరాలు మైదానంగా అటవీభూమి ఉంది. చెక్డ్యామ్లో నీరు ఉంటే.. ఆ భూమి సాగులోకి రాదు. దీంతో స్థానికుడు ఒకరు చెక్డ్యామ్లో ఇసుక నిండిన భాగాన్ని తవ్వేశాడు. తన ట్రాక్టర్తోనే కోర (కయ్య) కొట్టాడు. గతేడాది కురిసిన వర్షాలకు చెక్డ్యామ్ తెగిపోయింది. నీరు నిల్వ లేకుండా పోయింది. ప్రజాధనం వరదపాలైంది. చెట్లు.. చెక్డ్యామ్లను కూల్చివేస్తూ.. అటవీ భూమికబ్జా ఫారెస్ట్ ప్లాంటేషన్నే దున్నేశారు ఆఫీస్లు దాటని ఫా‘రెస్ట్’ అధికారులు ఈ ఏడాది కొత్తగా 251 ఎకరాల్లో ఫారెస్ట్ ఆక్రమణలు పోడు భూములకు పట్టాల ఆశతో చెట్లను కొట్టేస్తున్నారు ఆ భూమి విలువ రూ.37.65 కోట్లపై మాటే ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడిఇది కొత్తపేట శివారులోనే చెక్డ్యామ్ను కూల్చివేసిన ప్రదేశం. చెక్డ్యామ్ లేకుండా పోవడంతో పది ఎకరాల ఫారెస్ట్ భూమి సాగులోకి వచ్చింది. ట్రాక్టర్ ఉండడంతో ఇటీవల అటవీ భూమిని దున్నేసి పత్తివిత్తనాలు పెట్టాడు. అటవీ భూమిలోనే గుట్టుగా బోరు వేశాడు. నీరు బాగానే పడింది. దూరంగా ఉన్న విద్యుత్ స్తంభం నుంచి వైర్లు లాగి మోటారు పెట్టాడు. సదరు చెక్డ్యామ్ కూల్చిన కొత్తపేట వ్యక్తి పది ఎకరాల ఆసామి అయ్యాడు. ఆ భూమి విలువ ఇప్పుడు మార్కెట్లో రూ.కోటిన్నర. ఇది వీర్నపల్లి మండలం గర్జనపల్లి గిరిజనతండా శివారులో ఇటీవల ఇలా చెట్లను తొలగిస్తున్నారు. ఆ తొలగించిన చెట్ల కొమ్మలు అక్కడే ఎండిపోయిన తరువాత వంట చెరుకుగా వాడుతున్నారు. మరో ఏడాది ఆ భూమిని దున్నుకుని పంటను సాగు చేసుకునేందుకు వీలుగా వా డుకుంటున్నారు. సహజసిద్ధంగా అడవి లో ఎదుగుతున్న చెట్లను ఇలా కొట్టేశారు. వీరంతా వీర్నపల్లి మండలం రంగంపేట వాసులు. హరితహారంలో భాగంగా అటవీశాఖ అధికారులు మొక్కులు నాటేందుకు బుధవారం వెళ్లగా ఆ భూములు తమవి అంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. గిరిజనులకు పోడుపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం వెనకబడిన వర్గాలకు చెందిన తమకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏళ్లుగా ఆ భూముల్లో పంటలు పండిస్తున్నామని, ఇప్పుడు మొక్కలు నాటితే తమకు బతుకుదెరువు లేదని వాదించారు. ప్రస్తుతం 132 ఎకరాల్లో అటవీశాఖ మొక్కలు నాటకుండా రైతులు పంట వేయకుండా అలాగే ఉంది.. ఇవి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటనలో వెల్లడైన వాస్తవాలు. -
ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
వేములవాడరూరల్: ఆర్థిక ఇబ్బందులతో బీటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్లకు చెందిన వాణి–లింగయ్యలకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి ఫ్యాన్లు రిపేర్ చేస్తుండగా, తల్లి గ్రామంలోనే గాజులషాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె చేని వైష్ణవి(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. 15 రోజుల క్రితం ఇంటికొచ్చింది. పలు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంట్లోకి దూసుకెళ్లిన కారు ● తప్పిన పెను ప్రమాదం ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో సిరిసిల్ల బైపాస్ నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. కామారెడ్డికి చెందిన ఇద్దరు వేములవాడ నుంచి సిరిసిల్ల బైపాస్ మీదుగా కారులో వెళ్తున్నారు. వెంకటాపూర్ వద్ద కుడివైపు మళ్లకుండా ఎదురుగా వెళ్లి వాగుమడి రాజయ్య ఇంటిని ఢీకొట్టారు. ఆ సమయంలో ఇంట్లో టీవీ చూస్తున్న ఇద్దరు చిన్నారులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అప్పటికే గ్రామస్తులు గుమిగూడారు. కారు డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. దీంతో కారును అక్కడే వదిలేసి ఇద్దరు పరారయ్యారు. కారులో బీరు బాటిళ్లు, బిర్యాని పొట్లాలు ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నారని చెప్పారు. కారును పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. అనారోగ్యంతో కవయిత్రి మృతిధర్మపురి: హరిహరామృతం భక్తి గీతాల పుస్తకాన్ని రాసిన కవయిత్రి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. ధర్మపురికి చెందిన కవయిత్రి బుగ్గారపు సులోచన (85) కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె రాసిన హరిహరామృతం పుస్తకాన్ని ఆమె కోరిక మేరకుబమూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆవిష్కరించారు. సులోచన భర్త గతంలోనే మరణించారు. వారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆమె కటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట అయ్యోరి రాజేష్, ఆకుల రాజేష్, సంగి శేఖర్, ఆసిఫ్ తదితరులు ఉన్నారు. -
భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య
తిమ్మాపూర్(మానకొండూర్): భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మనస్తాపం చెందిన ఓ మహిళ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రేణికుంటలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇందిరానగర్కు చెందిన రొడ్డ విజయకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కూతురు మమత(27)ను 2018లో రేణికుంటకు చెందిన రాజమల్లుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు కొడుకులు. పెళ్లి సమయంలో రూ.2 లక్షల కట్నం ఒప్పుకుని రూ.30 వేలు ముట్టజెప్పారు. రూ.లక్ష కళ్యాణలక్ష్మి వచ్చిన తర్వాత ఇచ్చారు. మరో రూ.70 వేలకు గడువు కోరి.. తర్వాత బంగారం ముట్టజెప్పారు. అయితే రాజమల్లు అదనంగా రూ.2 లక్షల కట్నం డిమాండ్ చేయడంతో గొడవలు జరుగుతున్నాయి. కొన్నిరోజులుగా రాజమల్లు రోజూ మద్యం తాగివచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. కట్నం తేకుంటే ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరించాడు. ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం మమతకు తెలియడంతో మనస్తాపం చెందింది. సోమవారం అర్ధరాత్రి క్రిమిసంహారక మందు తాగింది. ఈ విషయాన్ని మమత కొడుకు అమ్మమ్మ విజయకు ఫోన్ చేసి చెప్పాడు. ఆమె రేణికుంటకు వెళ్లగా మమత అపస్మారక స్థితిలో కనిపించింది. వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.అత్తింటి వేధింపులతో..ఫెర్టిలైజర్సిటీ: పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 39వ డివిజన్ ప్రగతినగర్కు చెందిన పెసరు అనిత (27) క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎన్టీపీసీ ఎస్సై టి.ఉదయ్ కిరణ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సీఎం సారూ మాకేది రుణమాఫీ
మల్లాపూర్(కోరుట్ల): ‘అయ్యా సీఎం సారు.. మాకేది రుణమాఫీ.. కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం పాపం చేశాం..’ అంటూ రుణమాఫీ కాని రైతులు తమ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటలో బుధవారం జరిగింది. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ, రుణమాఫీ పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. ఒక్క మొగిలిపేటలోనే 276మంది రైతులకు మాఫీ వర్తించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ గోడును ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వీరికి మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు సంఘీభావం ప్రకటించారు. రుణమాఫీ కాని రైతులు పార్టీలకతీతంగా ఉద్యమించేందుకు ముందుకు రావాలన్నారు. మూడునెలల క్రితం రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించి ప్రజావాణిలో అర్జీలు సమర్పించామని, అయినా రైతులకు న్యాయం జరగకపోవడం శోచనీయమన్నారు. ప్యాక్స్ వైస్ చైర్మన్ దూలురి సుధాకర్రెడ్డి, నాయకులు దండవేని వెంకట్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
గుప్తనిధులు.. లంకె బిందెలు
● పూజల పేరిట ఘరానా మోసాలు ● రూ.లక్షలు దండుకుంటున్న మోసగాళ్లు ● నమ్మి మోసపోవద్దంటున్న పోలీసులుకరీంనగర్క్రైం: ‘మీ ఇంట్లో గుప్తనిధులు ఉన్నాయి... పలానా చోట లంకె బిందెలు ఉన్నాయి. వెలికితీస్తే కోటేశ్వరులు అవుతారు. ఇందుకోసం ముందుగా ప్రత్యేక పూజలు చేయాలి. ఆ పూజా సామగ్రికి కొంత ఖర్చవుతుందని మొదటగా మభ్యపెట్టి.. తరువాత రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. దొంగబాబాల ముసుగులో గ్రామాల్లో సంచరిస్తూ.. గుప్తనిధులు, లంకెబిందెలు, మంత్రాలు, తాయెత్తులు, వాస్తుదోశాలు, గ్రహపీడ పూజల పేరిట ప్రజలను నట్టేటముంచుతున్నారు. బాధితు ల ఫిర్యాదుతో పోలీసులు నిఘా పెట్టి మోసగాళ్లను కటకటాలకు పంపిస్తున్నారు. జిల్లాలో ఇటీవల ఇలాంటి ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. పరిస్థితులను ఆసరా చేసుకుని.. దొంగబాబాలు, స్వామీజీలు అనారోగ్య సమస్యలు, అప్పులు, పరిస్థితి బాగా లేనివారిని లక్ష్యంగా చేసుకుని పరిచయం చేసుకుంటారు. వారి వద్దకు వెళ్లి.. ఇలా జరగడానికి కారణాలు చెబుతూ ప్రత్యేక పూజలు చేస్తే పరిస్థితుల మారి అద్భుతాలు చూస్తారంటూ ఆశ చూపుతారు. ఇటీవల కొత్తపల్లి మండల పరిధికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ పరిస్థితులను ఆసరా చేసుకుని, వారి ఇంటి పక్కన క్వింటాల్ వరకు బంగారు కడ్డీ ఉందని, దానిని బయటకు తీసి పూజలు చేస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మించారు. పూజల పేరిట అతని నుంచి విడతల రూ.15 లక్షలకు పైగా వసూలు చేశారు. చివరికి మోసపోయానని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్టు చేశారు. గతంలోనూ వీరు జనగామ జిల్లాకు చెందిన ఓ మహిళను పూజల పేరుతో మోసం చేసి రూ.10లక్షలకు పైగా వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. క్షుద్ర.. గ్రహపూజల పేరుతో కరీంనగర్తో పాటు చుట్టుపక్కల పట్టణాల్లో, గ్రామాల్లో దొంగస్వాములు, బాబాలు చెప్పిన మాటలు వింటూ పూజల పేరిట ఇల్లు గుల్ల చేసుకున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంటివాస్తు, గ్రహచారం బాగోలేదని ప్రత్యేక పూజలు చేయాలంటూ అమాయకుల వద్ద రూ.లక్షల్లో దోచుకుంటున్నారు. నగరంలో చాలామంది పూజల పేరిట పేరుగాంచారని, వారికి కలిస్తే రూ.లక్షల్లో సమర్పించుకోవాల్సిందేనన్న ఆరోపణలున్నాయి. పోలీసులు ఇలాంటివారిపై నిఘా పెంచాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.పూజలపేరిట మోసంచేస్తే చర్యలు గుప్తనిధులు, మంత్రాలు, పూజల పేరితో అమాయక ప్రజలను మోసంచేస్తే నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మి మోసపోవద్దని ఉన్నతాధికారుల ఆదేశాలతో అవగాహన కల్పిస్తున్నాం. ఇటీవల కొత్తపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో స్వామీజీల పేరుతో ఓ వ్యక్తిని మోసం చేసిన ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించాం. – నిరంజన్రెడ్డి, కరీంనగర్ రూరల్ సీఐ -
స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలల్లో నాల్గో తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎంపిక పోటీల్లో భాగంగా బుధవారం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు మొదలయ్యాయి. పోటీలను జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి వి శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. క్రీడాకారుల ఉజ్వల భవిష్యత్కు క్రీడాపాఠశాలలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. జిల్లాలోని 16 మండలాల నుంచి సుమారు 70 మంది విద్యార్థులు హాజరయ్యారని, పోటీలకు హాజరైన విద్యార్థుల ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లై?్యంగ్ స్టార్ట్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, 800 మీటర్ల రన్నింగ్, షటిల్ రన్, మెడిసన్ బాల్త్రో, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలీటీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్లు నిర్వహించారు. ఎంపిక పోటీల్లో ఎస్జీఎఫ్ కార్యదర్శి వేణుగోపాల్, మండల కార్యదర్శులు అంతటి శంకరయ్య, గిన్నె లక్ష్మణ్, బాబు శ్రీనివాస్, రొండి నర్సయ్య, బాబు శ్రీనివాస్, కొమురోజు కృష్ణ, కనకం సమ్మయ్య, దత్తాత్రి, సత్యనారాయణ, పి శ్రీనివాస్, ఆడేపు శ్రీనివాస్, కోచ్లు కిష్టయ్య, పవన్, సాయిరాం, మల్లిక, శ్యామ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ రోడ్డెక్కిన ఔట్సోర్సింగ్ సిబ్బంది
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో పనిచేసిన ఔట్సోర్సింగ్ సిబ్బంది రెండో సారి బుధవారం నిరసనకు దిగారు. విధుల్లోకి తీసుకోవాలన్న గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులను సైతం ప్రిన్సిపాల్ బేఖాతర్ చేస్తున్నారని పేర్కొంటూ గేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. వీరికి గిరిజన సంఘాల నాయకులు అజ్మీరా తిరుపతినాయక్, అజ్మీరా రాజునాయక్, ప్రభునాయక్, గుగులోత్ సురేష్నాయక్, భూక్య గజన్లాల్ మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ సస్పెన్షన్కు గురైన ప్రిన్సిపాల్ మంజిత్ కొనసాగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది శ్రీనివాస్, అశోక్, జగన్, నిర్మల, సుజాత, బాలు మాట్లాడుతూ.. ఇన్చార్జి ప్రిన్సిపాల్ రామ్సూరత్యాదవ్ తమను స్కూల్కు రమ్మని చెప్పి తాను రాకపోవడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యను పట్టించుకోవడం లేదన్నారు. తిరిగి విధుల్లోకి తీసుకోకుంటే పాఠశాల ముందు ఆత్మహత్యలకు పాల్పడతామని హెచ్చరించారు. కొనసాగుతున్న సస్పెండైన ప్రిన్సిపాల్ గురుకులాల సెక్రటరీ ఉత్తర్వులు బేఖాతర్ -
అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తేనే కిందకు దిగుత!
కొత్తపల్లి(కరీంనగర్): రోడ్డును కబ్జా చేసి చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్చేస్తూ కరీంనగర్ నగరపాలక సంస్థ సీతారాంపూర్ (21వ డివిజన్) పరిధిలోని టీచర్స్ కాలనీలో బుధవారం వెంకటేశ్వర్రావు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ని రసన తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాలు.. 30 ఏళ్ల క్రితం సీతారాంపూర్లోని 13వ సర్వేనంబర్ భూమిలో 126 ప్లాట్లతో టీచర్స్కాలనీగా లే అవుట్ చేయగా, కాలనీ అధ్యక్షుడి సహకారంతో 128 ప్లాట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును ఆక్రమించారని ఆరోపించాడు. 2015లో డీపీవోకు ఫి ర్యాదు చేయగా అప్పటి కార్యదర్శిని నివేదిక ఇవ్వాలని ఆదేశించారని, తర్వాత మున్సిపల్లో విలీనం కావడంతో కమిషనర్కు విన్నవించగా.. అప్పుడు ని ర్మిస్తున్న రేకుల షెడ్డును కూల్చివేసారని పేర్కొన్నా రు. మళ్లీ ఇప్పుడు మున్సిపల్ అనుమతి ఉందని ని ర్మాణాలు చేపడుతుంటే మూడుసార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకో కుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని, కాలనీలోని పలువురి ఆందోళన చూడలేక ట్యాంక్ ఎక్కానని, టీచర్స్ కాలనీ లే అవుట్ భూములపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకొని, రోడ్డు ఆక్రమణ తొలగించాలని విన్నవించారు. కాగా మున్సిపల్ అధికారులు, పోలీసులు బాధితుడిని కిందకు దింపేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కొన్ని గంటల పాటు జరిగిన హైడ్రామాకు మున్సిపల్ అధికారుల హామీతో తెరపడింది. -
బిర్యాని కోసం వెళ్లి.. మృత్యు ఒడికి
పెగడపల్లి(ధర్మపురి): మండలంలోని నర్సింహునిపేటలో మంగళవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో గాయపడిన భోగ సత్యనారాయణ (30) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ సత్యనారాయణ, తాటిపాముల భాస్కర్, తాటిపాములు మధూకర్, కొత్తూరి నవీన్ నలుగురు స్నేహితులు. మంగళవారం సాయంత్రం మద్యం సేవించారు. బిర్యాని తినేందుకుని రామడుగు మండలం గోపాల్రావుపేటకు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పెగడపల్లికి వస్తున్న క్రమంలో నర్సింహునిపేటలో ఆర్అండ్బీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద ముందుగా వెళ్తున్న ద్విచక్రవాహనాదారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుకాల వస్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొట్టగా నలుగురూ కిందపడిపోయారు. ఈప్రమాదంలో సత్యనారాయణ తీవ్రంగా గాయపడగా భాస్కర్, నవీన్, మధూకర్కు స్వల్ప గాయాలయాయ్యయి. చికిత్స నిమిత్తం వీరిని 108 వాహనంలో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున మృతి చెందాడు. మృతుడి తల్లి వజ్రవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు -
పొలం నుంచి మట్టి వద్దన్నందుకు దాడి
వెల్గటూర్: తన పొలం నుంచి మట్టి తరలింపు వద్దన్నందుకు కర్రలతో దాడి చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా మట్టి తరలించడమే కాకుండా అధికారులకు సమాచారం ఇచ్చాడన్న అనుమానంతో దాడికి తెగబడ్డారు. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన వేముల గురువయ్య, అతని కుమారులు మహేశ్, ప్రశాంత్ మంగళవారం పైడిపెల్లి శివారులోని చెరువు నుంచి ఎనగందుల రమేశ్ పొలం మీదుగా జేసీబీ సహాయంతో మట్టిని అక్రమంగా తరలించారు. తన పొలం నుంచి ట్రాక్టర్లు నడిపితే పొలం పాడవుతుందని రమేశ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఈ విషయమై మాట్లాడుదాం రమ్మని రమేశ్ను పిలిచి గురువయ్యతోపాటు ఆయన కుమారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు గురువయ్య, మహేశ్, ప్రశాంత్పై కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్సై శ్రీధర్రెడ్డి తెలిపారు. -
కేన్సర్ రాసిన మరణశాసనం
చందుర్తి(వేములవాడ): బ్లడ్ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళ మరణం తప్పదని మనోవేదనకు గురై బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో బుధవారం తీరని విషాదం నింపింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కొలుకుల లక్ష్మి (55) కొద్ది రోజులుగా బ్లడ్ కేన్సర్తో బాధపడుతోంది. ఇటీవలే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కీమోథెరపీ చేసేందుకు కూడా శరీరం సహకరించదని వైద్యులు ఇంటికి పంపించారు. అప్పటి నుంచి లక్ష్మి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. కాగా, మంగళవారం ఓ మహిళ కేన్సర్తో మృతిచెందినట్లు తెలుసుకొని లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం వేకువజామున ఇంట్లో అందరూ నిద్రిస్తుండగా బయటకు వెళ్లిపోయి గ్రామశివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు దేవేంద్ర, కవిత, కుమారుడు తిరుమల్ ఉన్నారు. కొడుకు గల్ఫ్లో ఉండగా, కోడలు ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ వివరించారు. మరణం తప్పదని బావిలో దూకి మహిళ బలవన్మరణం -
మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ?
వేములవాడ: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేరును ఓటర్ జాబితా నుంచి తొలగించేందుకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేసినట్లు తెలిసింది. ఈమేరకు పట్టణంలోని బైపాస్రోడ్డులో గల రమేశ్బాబు నివాసానికి బుధవారం నోటీసు అంటించడంతోపాటు ఆయన అడ్రస్పై రిజిస్టర్డ్ పోస్టు చేసినట్లు సమాచారం. రమేశ్బాబు జర్మనీ పౌరుడేనని హైకోర్టు నిర్ధారించడంతో ఓటర్ జాబితా నుంచి ఫామ్–7 ప్రకారం పేరును తొలగిస్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. ఓటర్ జాబితా నుంచి పేరు తొలగింపుపై అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకే ఎన్నికల ఓటర్ జాబితా నుంచి పేరు తొలగిస్తూ నోటీసులు జారీచేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడిస్తున్నారు. సురక్షితంగా గమ్యం చేర్చాలివిద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ పరిధిలో 35 మంది డ్రైవర్లను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి బుధవారం వివిధ డిపోలకు కేటాయించినట్లు రీజనల్ మేనేజర్ బి.రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీలో పనిచేయడం వల్ల ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. మద్యం, సెల్ఫోన్ డ్రైవింగ్కు దూరంగా ఉండి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి, పర్సనల్ ఇన్చార్జి ఆఫీసర్ బి.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. కపిల్ విద్యావారధికి స్పందనజమ్మికుంటరూరల్(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2024–25 సంవత్సరం 10వ తరగతిలో విద్యార్థిని గిరవేన స్పందన ఉత్తమ మార్కులతో మండల టాపర్గా ర్యాంకు సాధించింది. ఇటీవల కపిల్ చిట్ఫండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్లో మంచి మార్కులు సాధించి కపిల్ విద్యావారధికి ఎంపికై ంది. విద్యార్థిని ఎంత వరకు చదివితే ఆ కోర్సులకు సంబంధించిన ఫీజులు మొత్తం కపిల్ చిట్ఫండ్సంస్థ చెల్లిస్తుంది. ఈ సందర్భంగా ఎంఈవో హేమలత, హెచ్ఎం సమ్మయ్య, అమ్మ ఆదర్శ కమిటీ చైర్ పర్సన్ బండారి రజిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళపెల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఖాతాదారుల సొమ్ము స్వాహా.. చందుర్తి(వేములవాడ): పోస్టాఫీస్లో ఖాతాదారుల సొమ్ము స్వాహా చేసిన పోస్ట్మాస్టర్ను పోలీసులు అ రెస్ట్ చేశారు. సీఐ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించా రు. చందుర్తి మండలం మల్యాల తపాలాశాఖ కా ర్యాలయంలో అసిస్టెంట్ పోస్ట్మాస్టర్గా పని చేస్తు న్న ఎండీ షరీఫ్ ఖాతాదారుల సొమ్ము రూ.50,600 స్వాహా చేశాడని జగిత్యాల వెస్ట్ సబ్డివిజన్ తపాలాశాఖ అధికారి ఎండీ సఫీయొద్దీన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఖాతానంబర్ల ఆధారంగా విచారణ చేపట్టి రూ.50,600 పక్కదారి పట్టినట్లు గుర్తించారు. షరీఫ్ను అరెస్టు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు సీఐ వివరించారు. సమావేశంలో చందుర్తి ఎస్సై రమేశ్, కానిస్టేబుల్స్ చైతన్య, కిషన్ ఉన్నారు. -
పారమిత విద్యార్థుల ప్రతిభ
కరీంనగర్: నగరంలోని జ్యోతినగర్ పారమిత ఎక్స్ఫ్లోరికా ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 6వ తరగతి విద్యార్థులు ఇటీవల ప్రకటించిన కేంబ్రిడ్జ్ ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. ప్రైమరీ చెక్ పాయింట్ ఫలితాల్లో అంతర్జాతీయ స్థాయిలో సగటు 33వ స్థానం సాధించారు. విద్యార్థులందరూ ప్రతీ సబ్జెక్టులో 95శాతం కంటే ఎక్కువ స్కోర్ సాధించారని ప్రిన్సిపాల్ శర్మిష్ఠ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డా. ప్రసాద్రావు మాట్లాడుతూ, ఈ విజయంతో కరీంనగర్ విద్యార్థుల ప్రతిభ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిందని ప్రశంసించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. పాఠశాల డైరెక్టర్స్ ప్రసూన, రశ్శిత, అనూకర్రావు, వినోద్రావు, రమణ, వీయూఎం ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం శ్రీహనుమాన్ ఆలయం ఎదుట సిరిసిల్ల – వేములవాడ ప్రధాన రహదారిలో గూడ్స్ ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని యువకుడు ఒంటెద్దు శేఖర్(21) బుధవారం మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. కామారెడ్డి జిల్లా బస్వాపూర్కు చెందిన శేఖర్ మూడేళ్లుగా నందికమాన్ వద్ద పెట్రోల్బంక్లో పనిచేస్తున్నాడు. అగ్రహారంలో టిఫిన్ కోసం వెళ్లి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో హనుమాన్ ఆలయం ఎదుట ఫ్లిప్కార్డు గూడ్స్ఆటో యూ టర్న్ చేస్తుండగా బైక్ ఢీకొట్టడంతో శేఖర్ అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని ఒకరు..రాయికల్: రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన కన్నవేణి సంజీవ్ (42) బ్లేడ్ ట్రాక్టర్ ఢీకొట్టడంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. సంజీవ్ తన ద్విచక్రవాహనంపై వస్తాపూర్కు వెళ్తుండగా గ్రామ శివారులోని పెట్రోల్ బంక్ వద్ద ట్రాక్టర్ ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్లో జగిత్యాల తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 780 క్వింటాళ్ల బియ్యం స్వాధీనంజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లులో మంగళవారం దాడులు చేసిన సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు సుమారు 780 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ బియ్యాన్ని బుధవారం మెట్పల్లిలోని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. బియ్యాన్ని నిల్వ చేసిన మిల్లు యజమాని కొండ లక్ష్మణ్తోపాటు 30 క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్లో తరలించేందుకు సిద్ధమైన మంచాల అంజయ్యపైన సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ ఉమాపతి ఫిర్యాదు మేరకు 6ఏతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్రెడ్డి తెలిపారు. అధిక డబ్బుకు ఆశపడి..● రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న వ్యక్తి యైటింక్లయిన్కాలనీ(రామగుండం): ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి రూ.1.30 లక్షలు పోగొట్టుకున్న ఘటనపై బుధవారం గోదావరిఖని టూటౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఉద్యోగి. ఈనెల 4న తన సెల్ఫోన్కు టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని వచ్చిన మెస్సేజ్ను నమ్మాడు. మొదట రూ.1,000 పెట్టుబడి పెట్టగా రూ.1,200, రెండోసారి రూ.3,000 గానూ రూ.4,500 వచ్చాయి. ఈ నెల 21న మెస్సేజ్ రావడంతో దశల వారీగా రూ.1,30,880 పెట్టుబడి పెట్టాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో తనకు మెస్సేజ్ పంపిన నంబర్కు ఫోన్ చేయగా, మరో రూ.2 లక్షలు వేస్తే రూ.4 లక్షలు వస్తాయని చెప్పారు. బాధితుడికి అనుమానం వచ్చి 1930కు ఫోన్ చేసి వివరాలు తెలుపగా, సైబర్క్రైం జరిగినట్లు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చినుకు రాలక.. మొలక రాక
చిగురుమామిడి: కార్తెలు కరుగుతున్నా.. చినుకు రాలడం లేదు. కాలం గడుస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదు. ముందస్తు వర్షాలతో సంబరపడ్డ రైతులను మొగులు వెక్కిరిస్తోంది. వేసిన విత్తనం భూమిలోనే మాడిపోతోంది. రైతులు విత్తనాలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చిగురుమామిడి మండలంలో రోహిణికార్తెకు ముందే పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేశారు. అప్పుడు కురిసిన తేలికపాటి వర్షాలకు 50శాతం వరకు విత్తనాలు మొలకెత్తాయి. కొద్దిరోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు, మొలకలు మాడిపోతున్నాయి. మండలంలోని ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి, సుందరగిరి, కొండాపూర్, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, చిగురుమామిడి, ఓగులాపూర్, పీచుపల్లితో పాటు పలు గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. పంటను కాపాడుకునేందుకు కొన్ని గ్రామాల్లో రైతులు ట్యాంకర్ల ద్వారా, మరికొన్ని గ్రామాల్లో కూలీల సహాయంతో నీరు అందిస్తున్నారు. ఇంకొన్ని గ్రామాల్లో స్ప్రింక్లర్ల సాయంతో నీటితడులు పెడుతున్నారు. -
ప్రజాస్వామ్యానికి సంకెళ్లు
కరీంనగర్టౌన్: స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడూ మరిచిపోలేని రోజు 1975 జూన్ 25 అని, అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిందని, ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాటు దేశ ప్రజలకు శాపమైందని మహా రాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. జిల్లా బీజేపీశాఖ ఆధ్వర్యంలో బుధవా రం స్థానిక ఈఎన్ గార్డెన్స్లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హా జరైన ఆయన మాట్లాడుతూ ఎమర్జెన్సీ అంటే నిర్బంధపు పిడికిలిలో కొన్ని తరాలవరకూ విని పించే మనోరోదన ఉందని తెలిపారు. ప్రధానంగా ఎమర్జెన్సీ కాలంలో మీడియాపై ఇందిరా స ర్కారు, ఆమె తనయుడు సంజయ్ గాంధీ ఉక్కుపాదం మోపారని అన్నారు. బీజేపీ నాయకులు కొప్పు భాష, వై.సునీల్ రావు, డి.శంకర్, బాస సత్యనారాయణ, కన్నెబోయిన ఓదెలు, గుగ్గిలపు రమేశ్, ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, బోయినపల్లి ప్రవీణ్రావు,తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. సోమయ్యను పరామర్శించిన సాగర్జీఎమర్జెన్సీలో విద్యాసాగర్రావుతో పాటు జైలుకు వెళ్లిన సోమయ్యను నగరంలోని మెహెర్నగర్లోని తన ఇంటికి వెళ్లి సాగర్జీ పరామర్శించారు. విద్యాసాగర్రావు రచించిన ‘ఉనికి’ అనే పుస్తకాన్ని సోమయ్యకు బహుకరించారు. అధికారం కోసం ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీ మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు -
కరీంనగర్లో మినీ డంప్యార్డులు
కరీంనగర్లోని వివిధ కాలనీల్లోని ఖాళీ స్థలాలు మినీ డంప్యార్డ్లను తలపిస్తున్నాయి. రోడ్లవెంట చెత్తకుప్పలు గుట్టలుగా పేరు కుపోయాయి. వీధులు, పరిసరాల్లో చెత్తాచెదారం కనిపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో జనావాసాల నడుమ మురికికూపాలు ఏర్పడుతున్నాయి. స్వచ్ఛ ఆటోలు, డంపర్బిన్లు ఉన్నప్పటికీ.. రోడ్లు, పరిసర ప్రాంతాల్లో చెత్త వేస్తున్నారు. పారిశుధ్య నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కార్మికుల్లో పట్టింపు లేకుండా పోయింది. తమకు కేటాయించిన డివిజన్లలో పారిశుధ్య పనులు చేపట్టాల్సిన కార్మికులు, హాజరు తరువాత కనిపించకుండా పోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వాళ్లకు జరిమానా విధిస్తున్నాం’. అని బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ వివరించారు. -
పనితీరు మార్చుకోవాలి
● పారిశుధ్యంలో మార్పు రావాలి ● అక్రమ నిర్మాణాలు అరికట్టాలి ● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ కార్పొరేషన్: ‘ప్రత్యేకాధికారిగా నేను మొదట్లో చెప్పిన ఆదేశాలను ఇప్పటివరకు పట్టించుకున్నట్లు లేరు. గతంలో ఇచ్చిన టాస్క్లు ఏవీ పూర్తి చేయలేదు. పనితీరు మార్చుకోవాలి. విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు’.. అంటూ కలెక్టర్, నగరపాలకసంస్థ ప్రత్యేక అధికారి పమేలా సత్పతి అధికారులను హెచ్చరించారు. బుధవారం నగరపాలకసంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్, రెవెన్యూ, శానిటేషన్ విభాగాలకు గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలైనట్లుగా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సెక్షన్లవారీగా పరిష్కరించాలని, ప్రజావాణిలో టౌన్ప్లానింగ్లోని అన్నిస్థాయిల అధికారులు పాల్గొనాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను, కోర్టు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని, వాటిని అరికట్టాలన్నారు. పారిశుధ్యంలో మార్పులు తీసుకురావాలని, డీ సిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. గార్బెజ్ పాయింట్లను, ప్రజా మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వర్షాకాలం వ్యాధుల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నగరవ్యాప్తంగా వీధిదీపాలు వెలిగేలా చూడాలన్నారు. రెవెన్యూ అధికారులు పెండింగ్లో ఉన్న 9500 ట్రేడ్ లైసెన్స్లను నెలరోజుల్లో పూర్తి చేయాలన్నారు. విలీన గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. కమిషనర్ ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ మ్యుటేషన్లు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ప్రకటనలపై పన్నులను వసూలు చేయాలని అన్నారు. రోడ్లపైకి నిర్మాణాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మోహియొద్దిన్, ఈఈలు సంజీవ్, యాదగిరి పాల్గొన్నారు. -
జింక్ కార్నర్ ప్రారంభం
కరీంనగర్టౌన్: స్టాప్ డయేరియా కార్యక్రమంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో బుధవారం మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్)లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్ను డీఎంహెచ్వో వెంకటరమణ ప్రారంభించారు. చిన్నపిల్లల వార్డును పరిశీలించి పిల్లల అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. వారికి అందుతున్న చికిత్సలపై ఆ రా తీశారు. ఆర్బీఎస్కే కార్యక్రమంలో నడుస్తున్న డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో పోషకాహార పునరావాసకేంద్రాన్ని సందర్శించి, సిబ్బంది హాజ రు పట్టిక, రికార్డులను పరిశీలించారు. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిదా, పిల్లల వైద్యులు కల్యాణి, పవిత్ర, సరస్వతి పాల్గొన్నారు. ‘ఎమ్మెల్యే గంగులను విమర్శిస్తే సహించం’ కరీంనగర్: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను విమర్శించే నైతిక అర్హత మాజీ మేయర్ సునీల్రావుకు లేదని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ స్పష్టం చేశారు. బుధవారం మీసేవ కార్యాలయంలో మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో అంటకాగుతూ పదవులు పొంది అక్రమ సంపాదన, అడ్డగోలు అవినీతికి పాల్పడిన సునీల్రావుకు బీఆర్ఎస్ను, గంగులను విమర్శించే అర్హత లేదన్నారు. మేయర్గా ఉన్నన్ని రోజులు కేంద్ర మంత్రి బండి సంజయ్పై అనేక విమర్శలు చేసిన సునీల్రావు నేడు పొగుడుతుండడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో లబ్ధిపొందేందుకేనని ఆరోపించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు కార్పొరేటర్గా కమలాకర్ ప్రజల మన్ననలు పొంది వేల కోట్ల నిధులతో కరీంనగర్ రూపురేఖలను మార్చారన్నారు. దరఖాస్తులు ఆహ్వానం కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వ మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాల కరీంనగర్ బాయ్స్–3లో జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నిషియన్–2, చొప్పదండి గర్ల్స్–1లో పీజీటీ ఉర్దూ–1(మహిళ అభ్యర్థుల)ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి ల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి పవన్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. జూనియర్ లెక్చరర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అభ్యర్థికి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బీటెక్ అర్హత ఉండాలని, ఎలక్ట్రికల్లో ఏఎంఐఈ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా గుర్తింపు పొందిన అర్హ త ఉండాలని, పీజీటీ ఉర్దూ కోరకు సంబంధిత సబ్జెక్టుతో పీజీ ఉన్న మహిళా అభ్యర్థులు బీఈ డీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మైనారిటీస్ సంక్షేమ కార్యాలయంలో ఈనెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని పేర్కొన్నారు. వివరాలకు 08782957085 నంబర్ను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. పవర్ కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ అభివృద్ధి పనులు చేపడుతున్నందున గురువారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్, విద్యారణ్యపురి, మాణికేశ్వర్నగర్, హుస్సేనిపుర, నాకా చౌరస్తా, గాంధీచౌరస్తా, డీసీఎంఎస్, సాహెత్పురా ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివా స్గౌడ్ తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి 3.30 గంటల వరకు రేకుర్తి ఫీడర్ పరిధిలోని రేకుర్తి, రేకుర్తి పాతవాడ, సాసలెహ్నగర్, విజయపురికాలనీలో సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు పేర్కొన్నారు. -
● రేషన్ పంపిణీకి మరో నాలుగు రోజులే సమయం ● జిల్లావ్యాప్తంగా అందించింది 80శాతమే ● అక్కడక్కడా స్టాక్ కొరత.. దుకాణాల మూసివేత
కరీంనగర్ అర్బన్: రేషన్ పంపిణీ గడువు పెంపు ఉన్నట్టా.. లేనట్టా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు వరకు రేషన్ పంపిణీ చేయాలని ఆదేశాలుండగా ఇంకా బియ్యం రవాణా జరుగుతోంది. చాలామంది కార్డుదారులకు బియ్యం అందకపోగా పడిగాపులు అనివార్యమయ్యాయి. ఒకటో తేదీన పంపిణీ కావాల్సిన బియ్యం ఆలస్యంగా ప్రారంభం కాగా.. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుండటంతో కార్డుదారులు నానాపాట్లు పడుతున్నారు. యూనిట్కు 18 కిలోలు కావడం.. మూవ్మెంట్ సకాలంలో జరిగినా రేషన్ దుకాణాల్లో సరిపడా స్థలం లేకపోవడంతో మళ్లీ మళ్లీ మూవ్మెంట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ రేషన్ దుకాణాలకు బియ్యం చేర్చుతుండగా పంపిణీ గడువు తేదీ మరో నాలుగు రోజులే ఉంది. పెంపు ఉంటుందా.. ఉండదా అన్నది స్పష్టత లేదు. జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా ఇప్పటివరకు 80శాతం వరకు పంపిణీ అయినట్లు సమాచారం. ఒక్కో దుకాణంలో పావు వంతుకు పైగా రేషన్ తీసుకోని కార్డుదారులున్నారని సమాచారం. కిక్కిరిసిపోతున్న రేషన్ దుకాణాలు.. జిల్లాలో 2.90 లక్షల కార్డుదారులుండగా 8 లక్షలకు పైగా యూనిట్లున్నాయి. అత్యధికంగా కరీంనగర్ పాయింట్ నుంచి 278 దుకాణాలుండగా మిగతా దుకాణాలు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి పరిధిలో ఉన్నాయి. జిల్లామొత్తంగా 200కు పైగా రేషన్ దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం రాకపోవడం గమనార్హం. హుజూరాబాద్, చిగురుమామిడి, గన్నేరువరం, చొప్పదండి, రామడుగు, గంగాధర, సైదాపూర్ ప్రాంతాల్లోని అత్యధిక దుకాణాలు బియ్యం కోసం నిరీక్షిస్తున్నాయి. ఎంఎల్ఎస్ సామర్థ్యాన్ని బట్టి లారీలు లేకపోవడం మూవ్మెంట్ ఆలస్యానికి కారణం. ఒక్కోలారీలో వాటి మోడల్ను బట్టి 155 నుంచి 300 క్వింటాళ్లు సరఫరా చేస్తున్నారు. గడువు పెంపు ఉంటుందా? ప్రతీనెలా ఒకటి నుంచి 15 వరకు రేషన్ పంపిణీ చేస్తుంటారు. ఈసారి మూడు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తుండగా ఒక్కో కార్డుదారుకు సుమారు 20–30 నిమిషాలు పడుతోంది. ఈ లెక్కన రోజుకు 25 నుంచి 30 మందికి మాత్రమే పంపిణీ జరుగుతోంది. ఇక సిగ్నల్ సమస్య ఉంటే మరింత సంఖ్య తగ్గుతోంది. మూడు నెలల బియ్యం ఇస్తుండటంతో జూలై మొదటివారం వరకు గడువు పొడిగిస్తేనే పంపిణీ పూర్తయ్యే అవకాశఽముంది. ఎలాగూ జూలై, ఆగష్టు నెలలో రేషన్ పంపిణీ ఉండదు. ఇక ఒక్కోకార్డుదారు అరక్వింటాల్ నుంచి క్వింటాల్ వరకు బియ్యం తీసుకుంటున్నారు. దీంతో సదరు బియ్యాన్ని రవాణా చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రేషన్ దుకాణం వద్ద లబ్ధిదారులుబియ్యం పంపిణీ తీరిలా ప్రతి నెలా కేటాయించే బియ్యం: 52,768 క్వింటాళ్లు మూడు నెలలకు కేటాయించిన బియ్యం: 1,58,304 క్వింటాళ్లు ఇప్పటివరకు పంపిణీ చేసిన బియ్యం: 1.15 లక్షల క్వింటాళ్లు (సుమారు) జిల్లాలో గ్రామాలు: 313మొత్తం జనాభా: 10,09,234రేషన్ కార్డులు: 2,90,399యూనిట్లు: 8,79,472రేషన్ దుకాణాలు: 566 -
వర్షాకాలం.. వ్యాధుల భయం
● జిల్లాలోని పట్టణాల్లో మినీ డంప్యార్డులను తలపిస్తున్న ఓపెన్ప్లాట్లు ● కాలనీల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ● స్వైర విహారం చేస్తున్న పందులు, కుక్కలు ● విజృంభిస్తున్న దోమలు ● పొంచి ఉన్న సీజనల్ వ్యాధులుకరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్టౌన్/జమ్మికుంట/చొప్పదండి: వర్షాకాలం ప్రారంభమైంది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పు, పారిశుధ్యం, ఆహారం, తదితర కారణాలతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల బెడద పెరుగుతోంది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు పెరిగితే సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, విషజ్వరాలు, డయేరియా ప్రబలే ప్రమాదం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిస్తుంటాయి. ప్రజలు ఈ విషయమై ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. జిల్లాలో నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లు మినీ డంప్యార్డులను తలపిస్తున్నాయి. మున్సిపల్, వైద్యఆరోగ్యశాఖ అధికారులు సంయుక్తంగా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయా పట్టణ ప్రజలు కోరుతున్నారు.కరీంనగర్లోని హుస్సేనిపుర 9వ వీధిలో పరిస్థితి ఇది. అర్బన్ హెల్త్ సెంటర్కు సమీపంలో ఉన్న ఈ వీధిలోని ఓ ఖాళీ స్థలంలో చెత్తచెదారం వేస్తుండడంతో మినీ డంప్యార్డ్లా మారింది. ముళ్లచెట్లు, పొదలు విపరీతంగా పెరిగాయి. ఇక్కడే ప్లాస్టిక్కవర్లు, చెత్తాచెదారం పడేస్తున్నారు. రోజుల తరబడి చెత్తాచెదారం అలానే ఉండడంతో ఈ ప్రాంత వాసులు రోగాలబారిన పడే ప్రమాదం ఉంది.ఇది జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు వీరు. ప్రస్తుతం ఓపీ, ఐపీ కేసులు మామూలుగానే ఉన్నాయి. ఇంకా సీజనల్ వ్యాధులు ప్రారంభం కాకపోవడంతో జ్వర బాధితులు పెద్దగా ఆసుపత్రికి రావడం లేదు. గత జ్వరాల సీజన్లో 1000కి పైగా ఓపీ కేసులు, ప్రతిరోజు 150కి పైగా ఐపీ కేసులు ఉండేవి. ప్రస్తుతం ఓపీ 450, ఐపీ 50కి మించడం లేదు. -
నన్ను క్షమించండి.. నాదే తప్పు!
● నా చావుకు ఎవరూ బాధ్యులు కారు ● వేములవాడలో వివాహిత ఆత్మహత్య వేములవాడ: ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి.. నాదే తప్పు.. ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన వేములవాడలో చర్చనీయాంశమైంది. స్థానికుల తెలిపిన వివరాలు.. పట్టణంలోని గాంధీనగర్లో గంప మంజుల (58) అనే వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి భర్త ప్రసాద్, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులకు వివాహాలు జరిగాయి. వృత్తిరీత్యా ఒకరు కరీంనగర్, మరొకరు హైదరాబాదులో ఉంటుండగా ప్రసాద్– మంజుల దంపతులు మాత్రమే వేములవాడలో ఉంటున్నారు. అయితే తన చావుకు ఎవరూ బాధ్యులు కారు, తప్పంతా నాదే, ఏమండీ నన్ను క్షమించండి అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికులను కంటతడి పెట్టించింది. మంగళవారం పోలీసుల శవపంచనామ అనంతరం పోస్టుమార్టం నిర్వహించి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. -
అధికారుల దృష్టికి రైల్వే సమస్యలు
రామగుండం: దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్ నిలయంలో మంగళవారం డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డీఆర్యూసీసీ) ప్రతినిధులో డీఆర్ఎం, డీఆర్యూసీసీ చైర్మన్ భరతేష్కుమార్జైన్ సమావేశం నిర్వహించారు. రామగుండం నుంచి డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ హాజరై పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా నాగపూర్–కాజీపేట ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఈనెల 27వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు సమాధానమిచ్చారు. రైలు నంబరు 17035/36 అజ్నీ– కాజీపేట (కాజీపేట–బల్హర్షా ఎక్స్ప్రెస్) రైలు సమయం మార్చి భద్రాచలం లేదంటే సికింద్రాబాద్ వరకు పొడిగించాలని, చైన్నె–అహ్మదాబాద్ నవజీవన్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, చైన్నె–జైపూర్ రైలుకు రామగుండంలో హాల్టింగ్ కల్పించాలని, ఎల్సీ నంరు 49 రామగుండం–రాఘవపూర్ స్టేషన్ల మధ్య కుందనపల్లి వద్ద మూడు రైల్వేగేట్ల వద్ద వంతెన నిర్మించాలని కోరారు. అధికారులు సమాధానమిస్తూ, వంతెన నిర్మాణ ప్రక్రియ టెండరు ప్రక్రియలో ఉందన్నారు. డీఆర్యూసీసీ కార్యదర్శి, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సఫాలీ, ఏడీఆర్ఎం గోపాలకృష్ణ తదితరులున్నారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
చొప్పదండి: ఈ నెల 25 నుంచి ఉత్తరాంచల్లోని హరిద్వార్లో జరుగనున్న జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థిని ఏ.సౌమ్య ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ కొమురోజు కృష్ణ తెలిపారు. ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున 42కేజీల వ్యక్తిగత కేటగిరీలో పాల్గొని ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించగా జాతీయస్థాయికి ఎంపికై ందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైద్యుల రాజిరెడ్డి, జిల్లా తైక్వాండో అసోషియేషన్ కార్యదర్శి శ్రీగాధ సంతోష్ అభినందించారు. ఉచిత శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోవాలికరీంనగర్: ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ షెడ్యూల్ కులాల స్టడీ సర్కిల్ బంజారాహిల్స్ హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ (సీఎస్ఏటీ–2025–26)కు నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వినీతానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వ కృషి అభినందనీయంకొత్తపల్లి(కరీంనగర్): వి ద్యారంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కృషి హర్షనీయమని అల్ఫో ర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల, శాతవాహన విశ్వవిద్యాలయంలో లా కోర్సును ప్రవేశపెట్టినందుకు సీఎం రేవంత్రెడ్డి, అందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు కట్టుబడటం అభినంనీయమన్నారు. -
పిల్లలు..‘యోగా’ విద్యలో పిడుగులు
● రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రతిభ సిరిసిల్లకల్చరల్: ప్రపంచానికి సనాతన భారతదేశం అందించిన అపురూప విద్య యోగాభ్యాసం. మనసును, శరీరాన్ని ఏకం చేసిన ఈ విద్యా విధానం ఇప్పుడు ప్రపంచదేశాల ప్రజలను ఏకం చేసింది. దీర్ఘకాలిక వ్యాధుల నివారణ చేస్తూ దేహదారుఢ్యాన్ని అందించే యోగా విద్యను ప్రస్తుతం పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా సాధన చేస్తూ తమ ప్రతిభను పలు వేదికలపై చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వారిలో కొందరి సంక్షిప్త పరిచయం..ఐదు సార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని రెండు బంగారు, రెండు రజత పతకాలు సాధించింది. పంజాబ్, హర్యానాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో పాల్గొనడం తనకు ఎక్కడాలేని ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించింది అని చెప్తోంది. యోగాపై ఏర్పడిన ఆసక్తితో తిరుపతిలో బీఎస్సీ యోగా సైన్స్ అధ్యయనం చేస్తోంది. నుదుటిపై దీపం ధరించి యోగాసనాలు వేయగలిగిన దేశంలోని ముగ్గురిలో ఒకరు సృజన. దీంతో రాష్ట్ర స్థాయిలో మంచి ఖ్యాతి దక్కించుకుంది. యోగా సాధనతో ఏర్పడిన శరీర దారుఢ్యంతో సైన్యంలో చేరాలనేది తన దీర్ఘకాల కోరిక. అస్సాం, మహారాష్ట్రలో జరిగిన రెండు జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్నాడు. బంగారు పతకం సాధించి అప్పటి కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్చే ప్రత్యేకంగా సత్కరించబడ్డాడు. మారుమూల పల్లెటూరి నుంచి జాతీయస్థాయిలో పతకాలు సాధించడంతో సొంతూరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వ్యవసాయ విద్యను అధ్యయనం చేసి సాగులో తన ఊరి రైతులకు ఉపయోగపడాలనుకుంటున్నాడు. అలాగే యోగాను విస్తృతం చేసి అందరి ఆరోగ్యం మెరుగుపడడంలో తన పాత్ర పోషిస్తానంటున్నాడు.సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో పదో తరగతి చదువుతున్న స్వర్గం విష్ణుప్రసాద్ మూడో తరగతి నుంచే యోగా సాధనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇప్పటికీ జిల్లా స్థాయిలో 20 చోట్ల పాల్గొని 18 విజయాలు అందుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో మరో 20 సార్లు పోటీ పడి 8 సార్లు విజయాలు సొంతం చేసుకున్నాడు. అలాగే రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రశంసలు అందుకున్నాడు. పంజాబ్, రాజస్థాన్లో జరిగిన పోటీల్లో నిర్వాహకుల ప్రశంసలు అందుకున్నాడు. వెల్దండి సృజన బీఎస్సీ యోగా స్వర్గం విష్ణుప్రసాద్ పసుల ప్రణయ్, బస్వాపూర్ -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● కిలో వెండి.. రూ.30 వేల నగదు అపహరణ రత్నాపూర్లో..మల్లాపూర్: మల్లాపూర్ మండలం రత్నాపూర్కు చెందిన పిప్పెర రమేశ్ ఇంట్లో చొరబడిన దొంగలు రెండు తులాల బంగారం, రూ.13,000 ఎత్తుకెళ్లినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఇంటికి తాళం వేసి ఉద్యోగి రీత్యా బెంగళూర్ వెళ్లగా దొంగలు చొరబడ్డారు. మంథని: వరుస దొంగతనాలు పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళ పోలీసుల గస్తీ ఉన్నా దొంగతనాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం ధర్మారం గ్రామంలో కందుకూరి లక్ష్మికి చెందిన రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆ ఘటన మరువక ముందే మంథనిలో మంగళవారం మరోచోరీ వెలుగుచూసింది. దొంతులవాడకు చెందిన ఐరన్ హార్డ్వేర్ వ్యాపారి ఇల్లందుల వెంకటేశ్వర్లు తన కుమారుడిని కళాశాలలో చేర్పించేందుకు ఆదివారం హైదరాబాద్ వెళ్లారు. ఇంటికి తాళం వేసిన అతడి భార్య స్థానికంగానే బంధువుల ఇంటికి వెళ్లింది. సోమవారం రాత్రి ఊరునుంచి తిరిగివచ్చిన వెంకటేశ్వర్లు.. ఇంట్లోకి వెళ్లి చూడగా గదుల తలుపులు తెరిచి ఉన్నాయి. ప్రధాన గదికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. బీరువాలు తెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగినట్లుగా నిర్ధారించుకున్నాక బీరువాలో పరిశీలించగా రూ.30 వేల నగదు, పూజాగదిలోని సుమారు కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. అలాగే టీవీ, ల్యాప్ట్యాప్, ట్యాబ్ను దొంగలు ఎత్తుకెళ్లారు. తులసీగద్దె సమీపంలోని ఇనుప గడ్డపారను తీసుకెళ్లి తాళాలు పగుల గొట్టినట్లు తెలుస్తోంది. బురదతో నడిచిన కాలిముద్రలు కనిపించాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. క్ల్యూస్ టీం ఆధారాలు సేకరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేశారంటే దొంగలముఠా సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రైస్మిల్లుపై విజిలెన్స్ అధికారుల దాడులు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ శివారులోని హనుమాన్సాయి రైస్మిల్లుపై మంగళవారం ఉదయం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రిటైర్డ్ ఓఎస్డీ అంజయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. మిల్లులో నిల్వ ఉంచిన సుమారు 400 క్వింటాళ్ల అనుమానిత రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. తమకు అన్ని అనుమతులున్నాయంటూ మిల్లు యజమాని ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లై గోదాంకు తరలించారు. దాడుల్లో డీఎస్వో జితేందర్రెడ్డి, డీఎం జితేంద్రప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ వసంతకుమార్, అసిస్టెంట్ డీఎం శ్రీననాయక్, డీటీలు ఉమాపతి, విష్ణు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు స్వామి, రాజేందర్రావు, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
పచ్చని చెట్లపై గొడ్డలి వేటు
వన సంపద కరువై పర్యావరణం ప్రమాదంలో పడుతుండగా దుకాణదారుల వికృత చేష్టలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం హరితహారం పేరుతో మొక్కలను నాటిస్తుండగా దుకాణాల పేర్లు కనిపించడం లేదని, గిరాకీ దెబ్బతింటుందని కొందరు వ్యాపారులు పచ్చని చెట్లను నరికేస్తున్నారు. నగరంలోని కలెక్టరేట్ దారితో పాటు మంకమ్మతోట, భగత్నగర్, కట్టరాంపూర్ తదితర దారుల్లో ఇదే పరిస్థితి. బల్దియా అధికారులు కఠిన చర్యలు చేపట్టాలని సిటీ ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
సీసీలపై చర్యలేవి?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ కలెక్టరేట్లో సంచలనం రేపుతోన్న సీసీల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. వీరిపై ఎన్ని కథనాలు.. ఎన్ని ఫిర్యాదులు వచ్చినా.. కలెక్టరేట్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై నగరవాసులు మండిపడుతున్నారు. దీంతో నగరానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేశారు. కరీంనగర్లో సీసీల కారణంగా పరిపాలన పక్కదారి పడుతున్న విషయాన్ని కలెక్టర్ కార్యాలయం గుర్తించని వైనంపై ఆవేదన వ్యక్తంచేస్తూ డీవోపీటీని సంప్రదించారు. కలెక్టర్ కార్యాలయం స్పందించకుంటే.. తాను లోకాయుక్తను సైతం ఆశ్రయించేందుకు సిద్ధమేనని ‘సాక్షి’కి స్పష్టంచేశారు. ఇదే సమయంలో కలెక్టరేట్లో సీసీల వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు ‘ఎక్స్’ వేదికగా ఇది వరకే ఫిర్యాదు వెళ్లింది. మరోవై పు సీసీలు లోలోన హైరానా పడుతున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. మొద్దునిద్రలో కలెక్టరేట్.. సీసీల వ్యవహారంపై ఇంత చర్చ నడుస్తున్నా.. దశాబ్దాలుగా పాతుకుపోయిన సీసీలను తప్పించేందుకు కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది అంతుచిక్కడం లేదు. ఇదే విషయమై వివరణ కోరేందుకు కలెక్టర్ పమేలా సత్పతిని ఫోన్లో సంప్రదించగా.. ఆమె అందుబాటులోకి రాలేదు. మీడియా కథనాలపై సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టరేట్లు వెంటనే స్పందిస్తాయి. సంబంధిత అధి కారులు, విభాగాలపై కొరడా ఝుళిపిస్తాయి. కానీ.. కరీంనగర్లో ఇవేమీ ఉండవంటే అతిశయోక్తి కాదు. పలు విభాగాల్లో అవినీతి అంటూ వార్తలు వచ్చినా.. క్రమశిక్షణ చర్యల కింద కనీసం ఇంతవరకూ ఎవరినీ సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు. ఇటీవల మయన్మార్లో సైబర్ ముఠా చేతిలో చిక్కుకు న్న భారతీయుల స్థితిగతులపై ‘సాక్షి’లో వార్తలు రాగానే.. కేంద్రం స్పందించింది. మిలటరీ ఆపరేష న్ నిర్వహించి మరీ భారతీయులను కాపాడింది. ప్రత్యేకంగా రెండు విమానాలు పంపి వారిని స్వదేశానికి తీసుకువచ్చింది. గతంలోనూ కంబోడియాలో చిక్కుకున్న వారిని ఇలాగే మీడియా కథనాల ద్వారా తెలుసుకుని కేంద్రమే కాపాడింది. ఉమ్మడి జిల్లాలో కలెక్టరేట్లు, హైదరాబాద్లోని సచివాల యం, సీఎం కార్యాలయం, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల సమస్యలు, అవినీతి వ్యవహా రాలపై వెంటనే స్పందిస్తున్నాయి. కానీ..కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ఇందుకు మినహాయింపు అన్న విమర్శలను మూటగట్టుకుంటుంది.కదలరు.. వదలరు వారి అక్రమాలపై డీవోపీటీ, బండి సంజయ్కు ఫిర్యాదుల వెల్లువ ప్రజావాణిలో తమపై ఫిర్యాదుతో మల్లగుల్లాలు ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ సీసీల మనుషులు సమస్యలపై వెంటనే స్పందిస్తున్న సచివాలయం, ఇతర జిల్లాలు, కేంద్రం కానీ.. మొద్దునిద్రలో కరీంనగర్ కలెక్టరేట్ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ సీసీల మనుషులే.. కారుణ్య నియామకం ద్వారా సీసీలుగా చేరిన వీరంతా ముఠాగా ఏర్పడ్డారు. దశాబ్దాలుగా అక్కడే పాతుకపోయి.. బదిలీ అంటే కరీంనగర్ కలెక్టరేట్లో సెక్షన్ మారడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఐఏఎస్ అధికారులు కూడా వీరికి అనుకూలంగా వ్యహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నా.. ఇప్పటివరకూ వీరిపై ఏ చర్యలు తీసుకోకపోవడంపై జిల్లాపౌరులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ఈ సీసీలు కేవలం కలెక్టరేట్ వ్యవహారాలకే పరిమితం కాలేదు. తమపై ప్రభుత్వానికి ఏ నివేదిక వెళ్తుందో తెలుసుకునేందుకు ఏసీబీ, ఇంటెలిజెన్స్లోనూ కొందరిని తమకు అనుకూలంగా మార్చుకున్నారంటే వీరి తెలివితేటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలా ఏ విభాగం నుంచి వీరికి, వీరి అనుచరులకు ప్రతికూల నివేదికలు, ఫిర్యాదులు వచ్చినా..వాటిని కలెక్టర్ల కంట పడకుండా బుట్టదాఖలు చేస్తున్నారు. జిల్లాలో ఎలాంటి అక్రమ వ్యాపారమైనా... విద్య, వైద్యం, వాణిజ్యం, టెండర్లు ఇలా విషయం ఏదైనా ‘సీసీ ఆశీస్సులు ఉంటే చాలు పనవుద్ది’ అన్న ధీమా అక్రమార్కుల్లో పెరిగిపోవడానికి కారణం వీరి అండదండలే. -
ఇక ఫేస్ రికగ్నేషన్
● మండల పరిషత్ ఉద్యోగులకు అమలు ● త్వరలో ప్రారంభించేందుకు చర్యలు కరీంనగర్రూరల్: మండల, జిల్లా పరిషత్తు అధికారులకు ఇకనుంచి ముఖగుర్తింపుతోనే హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిసంస్థ డైరెక్టర్ రవీందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16నుంచి అన్ని మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరును అమలు చేయాలని ఆదేశించారు. గతంలో ఆయా కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు విధానం అమలులో ఉండగా పరికరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో మూలనపడింది. ప్రస్తుతం ఆఫ్లైన్ విధానంలో ఉద్యోగులు హాజరు రిజిస్టర్లో పేర్లు రాస్తుండగా కొందరు విధులకు ఆలస్యంగా వచ్చినప్పటికి సమయానికి వచ్చినట్లుగా హాజరు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని 15 మండల, ఒక జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారులు తప్పనిసరిగా ముఖగుర్తింపుతోనే హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తిస్థాయిలో సేవలు ముఖహాజరు విధానంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు పక్కాగా అమలవుతాయి. పథకాల అమలులో మండలస్థాయి అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. గతేడాదితో మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. మండలస్థాయిలో ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్, పీఆర్,హౌజింగ్బోర్డు ఏఈలు, ఈజీఎస్ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితర ఉద్యోగులు సేవలందిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుండటంతో సమయపాలన పాటించకపోవడంతో సకాలంలో ప్రజలకు సేవలందడంలేదు. ముఖగుర్తింపు హాజరుతో ఉద్యోగులు సమయపాలన పాటించడంతో అర్హులందరు సంక్షేమ పథకాలను సకాలంలో అవకాశముంది. ఉద్యోగుల వివరాల సేకరణ ముఖగుర్తింపు హాజరు విధానంకోసం మండల, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ముఖగుర్తింపు పరికరంలో ఉద్యోగులు రెండుపర్యాయాలు హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఉదయం కార్యాలయానికి వచ్చినపుడు, తిరిగి సమయం ముగియగానే ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి హాజరు నమోదు చేయాల్సి ఉంది. హాజరు యంత్రానికి జీపీఎస్ను లింక్చేయడంతో ఉద్యోగుల నమోదైన రోజువారీ హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల వివరాలను మాత్రమే సేకరిస్తున్నామని, ఇంకా హాజరు యంత్రాలు కార్యాలయాలకు రాలేదని మండల, జెడ్పీ అధికారులు తెలిపారు. -
రైతు వేదికలకు డబ్బులు
● విడుదల చేసిన వ్యవసాయ శాఖసాక్షిప్రతినిధి,కరీంనగర్: రైతు భరోసా నిధులు వి డుదల సందర్భంగా రైతు వేదికల వద్ద సంబరాల కోసం ఎట్టకేలకు నిధులు విడుదలయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా ప్రారంభం, ముగింపు సందర్భంగా రైతు వేదికల వద్ద సీఎంతో ముఖాముఖి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతీ రైతు వేదికకు 200 మంది రైతులను తరలించాలని ఏఈవోలకు టార్గెట్లు విధించింది. ఇటీవల జరిగిన కార్యక్రమానికి రైతులను తరలించడం, వారికి టీ, స్నాక్స్ ఖర్చులను భరించడం వంటి పనులు ఏఈవోలే చూసుకున్నారు. తాజాగా ముగింపు వేడుకులకు సైతం ఏఈవోలు నిర్వహించాలని చెప్పడంతో వారంతా తలలు పట్టుకున్నారు. గత వేడుక డబ్బులే రాకపోగా, మరోసారి చేతి నుంచి డబ్బులు ఎలా పెట్టుకోవాలో తెలియక సతమతమయ్యారు. ఈ విషయాన్ని మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘అన్నదాతా.. రైతువేదికకు రావా?’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. మంగళవారం మధ్యాహ్నం అన్ని రైతు వేదికల వద్ద సంబరాలు నిర్వహించేందుకు ఏఈవోలకు కావాల్సిన నిధులు విడుదల చేసింది. -
కలెక్టర్ సాక్షిగా కరెంట్ కట్
కరీంనగర్రూరల్: దుర్శేడ్ రైతువేదికలో మంగళవారం జరిగిన రైతు భరోసా సంబురాల్లో భాగంగా సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్కు కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా గాలివాన రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాన్ఫరెన్స్కు అంతరాయం ఏర్పడింది. అధికారులు వెంటనే ఇన్వర్టర్ సాయంతో వీడియో కాన్ఫరెన్స్ను కొనసాగించినప్పటికి ఫ్లాన్లు తిరగకపోవడం, లైట్లు వెలగకపోవడంతో కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురయ్యారు. అప్రమత్తమైన ఎస్ఈ రమేశ్బాబు, డీఈ రాజం, ఏడీఈ రఘు, ఏఈ అనిల్కుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ సిబ్బంది దుర్శేడ్ సబ్స్టేషన్లో 130 కేవీలైన్లో ఏర్పడిన సాంకేతికలోపాన్ని గుర్తించి సమస్యను పరిష్కరించారు. దుర్శేడ్, గోపాల్పూర్, గుంటూరుపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి రైతువేదికకు పునరుద్ధరించారు. అనంతరం సీఎం ప్రసంగాన్ని కలెక్టర్ పమేలా సత్పతితోపాటు డీఏవో భాగ్యలక్ష్మి, ఏడీఏ రణధీర్, ఎఈవో పైడితల్లి, దుర్శేడ్ సింగిల్విండో చైర్మన్ తోట తిరుపతి, మాజీ ఉపసర్పంచు సుంకిశాల సంపత్రావు, రైతులు వీక్షించారు. సాంకేతిక సమస్య.. శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన రైతు భరోసా వేడుకలు, సీఎం రేవంత్రెడ్డి ప్రసంగం వీక్షణకు సాంకేతిక సమస్య ఏర్పడింది. కార్యక్రమం జరుగుండగా కొంతసేపు టీవీస్క్రీన్ పని చేయలేదు. ఏఈవోలు మరో టీవీ ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లోపంతో రైతులెవరూ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఖాళీకుర్చీలు దర్శనం ఇచ్చాయి. తహసీల్దార్ సురేఖ, ట్రాన్స్కో ఏఈ సంపత్రెడ్డి, ఇద్దరు ఏఈవోలు, కాంగ్రెస్ నాయకుడు బండారి తిరుపతి, బీఆర్ఎస్ నాయకులు గొడిశాల తిరుపతి, పార్థసారథి, మరో నలుగురు కార్యక్రమాన్ని తిలకించారు.● దుర్శేడ్ రైతు వేదికలో సీఎం వీడియో కాన్ఫరెన్స్కు అంతరాయం -
టౌన్ ప్లానింగ్ ఫిర్యాదులకు స్పెషల్ డెస్క్
● నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్కార్పొరేషన్: పట్టణ ప్రణాళిక విభాగానికి (టౌన్ప్లానింగ్) సంబంధించిన ఫిర్యాదుల కోసం కార్యాలయంలో స్పెషల్ డెస్క్ను ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. మంగళవారం టౌన్ప్లానింగ్ విభాగం అధికారులతో తన చాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టౌన్ప్లానింగ్కు సంబంధించి ప్రతిరోజు వచ్చే ఫిర్యాదుల కోసం స్పెషల్ డెస్క్ను ఏర్పాటు చేయాలన్నారు.వచ్చిన ఫిర్యాదులకు నంబర్లు వేసి రికార్డు పాటించాలన్నారు. నగరంలో ఆక్రమణలపై దృష్టి పెట్టాలన్నారు. డీఆర్ఎఫ్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎక్కడ ఆక్రమణలు ఉన్నా తొలగించాలన్నారు. అనుమతి లేని నిర్మాణాల డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి షోకాజు ఇవ్వాలన్నారు. గతంలో షోకాజు నోటీసులు జారీ చేసిన వాటి పై వెంటనేచర్యలు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ అనుమతులు పెండింగ్లో పెట్టొద్దని, నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్నకేసులను మూడు రోజుల్లో పరిష్కరించాలన్నారు. రోజుల కొద్ది ఫ్లెక్సీలను ఉంచొద్దని, వాటిని తొలగించాలని అన్నారు. డీసీపీ బషీరొద్దిన్, ఏసీపీలు శ్రీధర్, వేణుమాధవ్, టీపీఎస్ సంధ్య, రాజ్కుమార్, తేజస్విని పాల్గొన్నారు. డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి చర్యలు నగరంలోని డంప్యార్డ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. నగరంలోని జ్యోతిబాపూలేపార్క్ను, మంచిర్యాల చౌరస్తా, ఆదర్శనగర్లో పారిశుధ్య పనులను మంగళవారం తనిఖీ చేశారు. పరిసరాల్లో చెత్త వేసిన మెడికల్ షాప్ల నిర్వాహకులకు జరిమానా విధించాలని ఆదేశించారు. డంప్యార్డ్ కోసం మల్కాపూర్, చింతకుంట ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించారు. చింతకుంట, మల్కాపూర్ డంప్యార్డ్లను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. సర్వే పూర్తి చేసి డంప్యార్డ్ విస్తీర్ణ వివరాలు అందించంతో పాటు, హద్దులు నిర్ణయించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడవేస్తే జరిమానా విధించాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు. -
సెల్ఫోన్ వెలుగులో అంత్యక్రియలు
కరీంనగర్ కార్పొరేషన్: నగరశివారులోని కేబుల్ బ్రిడ్జి వైకుంఠధామంలో రాత్రి వేళ లైట్లు వెలగడం లేదు. ఫలితంగా చీకట్లో అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నెల 23న నగరానికి చెందిన శశికళ, సత్యనారాయణ అనే వ్యక్తులు మృతి చెందగా, వారి అంత్యక్రియలను బంధువులు కేబుల్ బ్రిడ్జి సమీపంలోని వైకుంఠధామంలో నిర్వహించారు. వైకుంఠధామంలో లైట్లు లేకపోవడంతో సెల్ఫోన్ టార్చి వెలుగుల్లో అంత్యక్రియలు నిర్వహించాల్సి వచ్చింది. స్మార్ట్సిటీ నిధులతో అన్ని హంగులతో నిర్మించిన శ్మశాన వాటికలో కనీసం లైట్లు వెలగకపోవడం నిర్వహణ లోపాన్ని చూపుతోందని మాజీ కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహాన్ సింగ్ అన్నారు. వైకుంఠధామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని నగరపాలకసంస్థ కమిషనర్ను కోరారు.● కేబుల్ బ్రిడ్జి వైకుంఠధామంలో చీకట్లు -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కరీంనగర్క్రైం: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలకు అనుగుణంగా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ మంగళవారం నగరంలోని స్వధార్ హోమ్, శిశుగృహ, బాలసదన్ను సందర్శించారు. విద్యార్థి దశలో చెడు అలవాట్లకు లోను కావద్దన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు. ఎలాంటి న్యాయపరమైన సేవలు అవసరమైనా సంప్రదించాలని నిర్వాహకులను ఆదేశించారు. స్వధార్హోమ్లో పండ్లు పంపిణీ చేశారు. లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ పాల్గొన్నారు.మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపుఇల్లందకుంట: ఇల్లందకుంట జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించారు. ఈ నెల 24న ‘మధ్యాహ్న భోజనం నాసిరకం’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనానికి తహసీల్దార్ రాణి స్పందించారు. మంగళవారం జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాట్లాడారు. గతంలోనూ ఇలాంటి ఘటనపై మధ్యాహ్న భోజన కార్మికులను హెచ్చరించినా.. తీరు మార్చుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మధ్యాహ్న భోజన కార్మికులను తొలగించి, కొత్తవారిని నియమించాలని ఎంఈవో రాములునాయక్కు సూచించారు. అంతకుముందు సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు రాము, రత్నాకర్, విద్యార్థి సంఘం నాయకులు అనిల్, కౌశిక్ పాఠశాలను సందర్శించారు. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బాధ్యతగా విధులు నిర్వహించాలిజమ్మికుంట: పోలీసులు బాధ్యతగా విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని టౌన్ పోలీస్స్టేషన్ను మంగళవారం తనిఖీ చేశారు. ఏసీపీ మాధవి, టౌన్ సీఐ ఎస్.రామకృష్ణ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సోలార్ సిస్టంతో ఏర్పాటు చేసిన 14సీసీ కెమెరాలు ప్రారంభించారు. రికార్డులు, సీసీటీఎన్ఎస్, కేసుల వివరాలను పరిశీలించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు.రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలిహుజూరాబాద్: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా పెట్టాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లను సందర్శించారు. పెండింగ్ కేసుల విచారణ వేగవంతం చేయాలన్నారు. ఏసీపీ మాధవి, సీఐలు కరుణాకర్, పి.వెంకట్ ఉన్నారు.పునర్విభజన జీవో జారీ● సోషల్ మీడియాలో చక్కర్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని 66 డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన తుది ఉత్తర్వును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నగరంలోని 60 డివిజన్లను 66కు పెంచడంతో చేపట్టిన పునర్విభజన ప్రక్రియ ఈ నెల 21వ తేదీతో ముగియడం తెలిసిందే. అదేరోజు ఫైనల్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉండగా జాప్యం చోటుచేసుకుంది. నోటిఫికేషన్పై మాజీ కార్పొరేటర్లు, ఆశావహులు ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 144, తేదీ 21, 06, 2025 ఉత్తర్వు ప్రతి మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. కాని జీవో ప్రతితో పాటు రావాల్సిన 66 డివిజన్ల వివరాలు లేకపోవడం అయోమయానికి దారితీసింది. అధికారులు సైతం తమకు 66 డివిజన్ల జాబితా అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం. -
మధ్యాహ్న భోజనం.. నాసిరకం
ఇల్లందకుంట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుల సంగతి పక్కన పెడితే మధ్యాహ్న కారం, మెతుకులతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. స్థానిక జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం సరిగా పెట్టలేదు. ఎర్రటి కారంతో అన్నం కలుపుకుని తిన్న విద్యార్థులు.. విషయాన్ని తమ తల్లిదండ్రులు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజనం వండి వడ్డించడంతో విఫలమైన హైస్కూల్ హెడ్మాస్టర్తోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రాణిని సంప్రదించగా.. నాణ్యమైన భోజనం అందించే విషయంలో రాజీపడే ప్రసక్తేలేదన్నారు. నాణ్యత లోపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎంఈవో రాములు నాయక్ని వివరణ అడగగా.. కారం, మెతుకుల విషయం తన దృష్టికి రాలేదన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో..
ఉన్నత, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ స్పోర్ట్స్ స్కూల్లో దొరుకుతుంది. ఎన్ఎస్ఎన్ఐఎస్ చేసిన కోచ్ల ద్వారా శిక్షణ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. అత్యుత్తమ శిక్షణనిస్తారు. క్రీడాకారులు వీటిలో ప్రవేశాలు పొందితే ఉన్నతంగా ఎదగడంతోపాటు దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా ఎదుగుతారు. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి ఏర్పాట్లు పూర్తి జిల్లాస్థాయి క్రీడాపాఠశాలల ఎంపిక పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈనెల 25, 26ల్లో రెండు రోజులపాటు ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నాం. ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, కోచ్ల సహకారంతో విజయవంతంగా మండలస్థాయి ఎంపిక పోటీలు పూర్తి చేశాం. అదే స్ఫూర్తితో జిల్లాస్థాయి పోటీలను కూడా పూర్తి చేస్తాం. – శ్రీనివాస్గౌడ్, డీవైఎస్వో, కరీంనగర్ మేటి క్రీడాకారులను.. రాష్ట్రంలో మేటి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా స్పోర్ట్స్ పాఠశాలలు ముందుకు సాగుతున్నాయి. క్రీడల్లో ఆసక్తి ఉన్నవారికి సువర్ణావకాశం. కేవలం క్రీడలకు అత్యంత ప్రాధాన్యముంటుంది. దేశ భక్తి పెంపొందుతుంది. దేశానికి పతకం సాధించాలన్న తపన, దేశ పతాకం ప్రపంచ వేదికల్లో రెపరెపలాడించాలన్న లక్ష్యాలతో ముందుకెళ్తారు. – అజ్మీరా రాందాస్, డీవైఎస్వో, రాజన్న సిరిసిల్ల -
అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్
● కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్కరీంనగర్టౌన్: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కొనియాడారు. ఒకే దేశం.. ఒకే జెండా.. ఒకే రాజ్యాంగం ఉండాలని పరితపించడమే కాకుండా 370 ఆర్టికల్ రద్దు కోసం బలిదానమయ్యారన్నారు. తన జీవిత సర్వస్వం సిద్ధాంతానికే అంకితం చేయడమే కాకుండా.. ఆ సిద్ధాంతం కోసం అధికార పదవులను కూడా త్యజించిన మహనీయుడు శ్యామాప్రసాద్ అని స్మరించుకున్నారు. సోమవారం శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా బండి సంజయ్ కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. అంతకుముందు తన మాతృమూర్తితో కలిసి మొక్కను నాటారు. దేశం కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలని జనసంఘ్ కార్యకర్తలను పిలుపునివ్వడమే కాకుండా కార్యకర్తలకు తుపాకీలిచ్చి పాకిస్తాన్పై యుద్ధం చేయడానికి పంపిన వీరుడుగా చర్రితలో నిలిచాడన్నారు. దేశ ప్రజలంతా మోదీ సర్కార్కు అండగా నిలిచి భారత్ను విశ్వగురు స్థానంలో నిలపాలనే లక్ష్యంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, మాజీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, కొలగాని శ్రీనివాస్, నాయకులు హాజరయ్యారు. -
అన్నదాతా.. రైతు వేదికకు రావా?
● కర్షకులను బతిమాలుకుంటున్న ఏఈవోలు ● సీఎం కార్యక్రమం కోసం ఏఈవోలకు టార్గెట్లు ● ప్రతీ ఆర్వీకి 200 మంది రైతులను తరలించాలని ఆదేశాలు ● ఉమ్మడి జిల్లాలో 50 వేలకుపైగా రైతుల తరలింపు ● రైతులకు ఇచ్చే టీ, స్నాక్స్ డబ్బులు మాత్రం ఇవ్వరట ● మొన్నటి కార్యక్రమానికి పెట్టిన డబ్బులే రాలేదుసాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: రైతు వేదికల్లో ముఖ్యమంత్రితో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంతో ఏఈవో (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్)లు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం కార్యక్రమానికి రైతు వేదిక(ఆర్వీ)ల వద్దకు రైతులను తరలించాలని జిల్లా వ్యవసాయాధికారులు టార్గెట్లు విధించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ప్రతీ ఆర్వీలో కనీసం 200 మందికి తగ్గకుండా రైతులను తరలించాలని ఆదేశాల్లో స్పష్టం చేయడంతో ఏఈవోలు ఇప్పుడు అదే పనిలో తలమునకలయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మెజారిటీ రైతులు సుముఖంగా లేరు. ప్రస్తుతం చాలా చోట్ల వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎంతో జరిగే ముఖాముఖిలో తప్పకుండా రైతుభరోసా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 50 వేలమంది రైతులకు ఏఈవోలు ఫోన్లు చేసి కార్యక్రమానికి రావాల్సిందిగా బతిమాలుతున్నారు. మొన్నామధ్య రైతుభరోసా ప్రారంభం సందర్భంగా కూడా రైతులతో ముఖ్యమంత్రితో ఇలాంటి కార్యక్రమాన్నే నిర్వహించారు. అప్పుడు ప్రతీ ఏఈవోలకు నిర్వహణ ఖర్చుల కింద రూ. 5 వేలు చెల్లిస్తామని చెప్పారు. దీంతో ఆ కార్యక్రమంలో హాజరైన ప్రతీ రైతుకు టీ, స్నాక్స్ను ఏఈవోలే అందించారు. ఇందుకోసం వారే చేతి నుంచి డబ్బులు పెట్టుకున్నారు. ఆ డబ్బులు ఎపుడు వస్తాయా? అని ఎదురుచూస్తుంటే.. తీరా మరోసారి అలాంటి కార్యక్రమమే నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చేసేది లేక మళ్లీ రైతులకు ఫోన్లు చేస్తూ.. చేతి చమురు వదిలించేందుకు సిద్ధమవుతున్నారు. ఏఈవోలపై పనిభారం.. వాస్తవానికి ప్రతీ రైతు వేదికలో ఒకే ఒక ఏఈవో ఉంటారు. రైతులకు సంబంధించిన ప్రతీ విషయం వీరే చేసుకోవాలి. పంటలకు సంబంధించి ఎప్పటికపుడు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం. సాగులో సమస్యలు తలెత్తితే పరిష్కరించడం. పీఎం కిసాన్ యోజనకు సంబంధించి కేవైసీ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, రైతు విశిష్ట సంఖ్య నమోదు చేయడం, పంటల నమోదు చేయడం, రైతుబంధు, రైతు బీమా నమోదు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మట్టి నమూనాల సేకరణ తదితర పనులు ఉంటాయి. ఇవి కాకుండా రైతు వేదిక నిర్వహణ బాధ్యతలు కూడా చూసుకుంటారు. వీరు తప్ప మరే ఇతర సిబ్బంది లేకపోవడంతో వీరే ఉదయం వచ్చి రైతు వేదికను ఊడ్చుకోవాలి, కార్యక్రమాలు జరిగినపుడు కుర్చీలు వేయడం, వారికి టీ స్నాక్స్.. కూడా వీరే అందించాల్సి వస్తోంది. అధికారిక కార్యక్రమాలు జరిగినపుడు వచ్చిన వారంతా మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. తరువాత డబ్బులు ఇచ్చి వాటిని శుభ్రం చేయించుకోవాల్సి వస్తోంది. మొత్తానికి ఏఈవోలు నిర్వహించే ప్రతీ అధికారిక కార్యక్రమం ఇంట్లో చేసే శుభకార్యంలా ప్రతీది దగ్గరుండి చూసుకోవాల్సిన స్థితి. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డిని వివరణ కోరగా.. ఏఈవోలకు రైతుల తరలింపు విషయంలో ఎలాంటి టార్గెట్ విధించలేదని, వారే స్వచ్ఛందంగా వస్తున్నారని సమర్థించుకున్నారు.జిల్లా రైతు వేదికలు ఏఈవోలు కరీంనగర్ 75 71 జగిత్యాల 52 71 పెద్దపల్లి 54 52 సిరిసిల్ల 57 53రైతు వేదికల్లో ఇబ్బందులివీ! చాలాచోట్ల తాగునీరు సదుపాయం లేదు కుర్చీలు వేసే సిబ్బంది లేరు టీ, స్నాక్స్ ఇచ్చే దిక్కు లేదు మరుగుదొడ్లు శుభ్రం చేసే వారు లేరు వేదికకు కనీసం ఊడ్చే సిబ్బంది లేరు టెక్నికల్ ఎక్విప్మెంట్కు డబ్బులు రావు, నిర్వహణకు సిబ్బంది లేరు.. -
ఆహ్లాదం.. ఆరోగ్యం
● కనువిందు చేస్తున్న అటవీ ప్రాంతం ● అడవుల రక్షణకు అధికారుల చర్యలు ● సేదతీరుతున్న పర్యావరణ ప్రియులు మంథని: వేసవి ముగిసింది. తొలకరి పలకరించింది. అడవులు ఆకుపచ్చదనం సంతరించుకున్నాయి. నిన్నామొన్నటి వరకు మోడువారిన చెట్లు చిగురిస్తున్నాయి. చిగురించిన ఆకులతో పచ్చదనం కనువిందు చేస్తోంది. తూర్పు అటవీ ప్రాంతమైన మంథని నియోజవకర్గంలోని అడవులు ఆహ్లాదం పంచుతున్నాయి. పర్యావరణ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంథని నుంచి మహదేవపూర్ వరకు.. మంథని మండలం ఎక్లాస్పూర్ శివారు మొదలు అటవీ ప్రాంతంలో మహదేవ్పూర్ మండలం బూర్గుగూడెం వరకు సుమారు 120 కి.మీ. మేర అడవి విస్తరించి ఉంది. రామగిరి, కమాన్పూర్ మండలాలు మినహా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు, పెద్దపల్లి, రామగిరి మండలాల్లో సైతం అడవులు విస్తరించి ఉన్నాయి. ఒకప్పుడు అంతరించిపోయిన అడవులకు హరితహరం పేరిట ప్రభుత్వాలు మొక్కలు నాటుతూ జీవం పోశాయి. ప్రస్తుతం పచ్చదనం ఉట్టిపడుతుండగా అటువైపు వెళ్లే వాహనదారులు పచ్చని చెట్లఒడిలో సేద తీరుతున్నారు. స్మగ్లర్ల గొడ్డలి వేటుకు దూరంగా.. ఒకప్పుడు దట్టమైన అడవులపై స్మగ్లర్ల గొడ్డలి వేటు పడటంతో పెద్దచెట్లు అంతరించిపోయాయి. కలప అక్రమ రవాణా చేస్తూ అడవులను నాశనం చేశారు. దీంతో ఎటుచూసినా పచ్చదనం ఉట్టిపడే అడవులు కానరాకుండా పోయాయి. కానీ ప్రస్తుతం అడవులు మళ్లీ పచ్చదనంతో కనువిందు చేస్తున్నాయి. అడవుల రక్షణకు పటిష్ట చర్యలు.. గత ప్రభుత్వాలు అడవుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాయి. ఇటు ఫారెస్ట్, అటు పోలీసులు సంయుక్తంగా అడవుల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. కలప స్మగ్లర్ల అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు వంటచెరుకును కూడా తీసుకుపోకుండా కందకాలు తవ్వారు. అడవిలో అడుగుపెట్టకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో అడవులు మళ్లీ చిగురించాయి. హరితహారం పేరుతో అడవుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించడంతో అడవులకు పూర్వవైభవం వచ్చినట్లయ్యింది. కనువిందు చేస్తున్న పచ్చదనం.. తూర్పు అడవుల్లో చిగురించిన పచ్చని ఆకులు, చెట్లు కనువిందు చేస్తున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు కాళేశ్వరం, మేడారం, నాగులమ్మలాంటి ఆలయాలను దర్శించుకునేందుకు వెళ్తూ అటవీ ప్రాంతాల్లోని పచ్చని చెట్లకింద సేద తీరుతున్నారు. కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణ అనుభూతిని పొందుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. చెట్ల నీడన సేదదీరుతూ ఆటాపాటనతో ఎంజాయ్ చేస్తున్నారు. -
ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడి మృతి
కరీంనగర్రూరల్: చొప్పదండి మండలం వెదురుగట్టకు చెందిన విష్ణువర్థన్(29) బహుదూర్ఖాన్పేట శివారులో ద్విచక్ర అదుపు తప్పి కింద పడడంతో మృతి చెందాడు. కరీంనగర్రూరల్ సీఐ ఏ.నిరంజన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నగునూర్లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న విష్ణువర్ధన్ సోమవారం వెదురుగట్ట నుంచి ప్రతిమ ఆసుపత్రికి వస్తుండగా మార్గ మధ్యలోని బహుదూర్ఖాన్పేట వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి సమీపంలోని చెట్టుకు ఢీకొంది. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి పర్శరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..హుజూరాబాద్: పట్టణానికి చెందిన ఓ న్యూస్ పేపర్ రిపోర్టర్ చిర్ర సుదర్శన్గౌడ్ (55) ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి హాజ రై తిరిగి వస్తుండగా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్ గ్రామ శివారులో బైక్ అదు పు తప్పడంతో కందకంలో పడి మృతి చెందా డని. మృతుడి కుటుంబానికి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రూ.పదివేలు అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, చంద్రశేఖర్, హుజూరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు కా యిత రాములు, జర్నలిస్టులు పరామర్శించారు. 27న పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు విద్యానగర్(కరీంనగర్): ఆర్టీసీ కరీంనగర్ 1డిపో నుంచి ఈనెల 27న వన్ డే టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ విజయమాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో చిలుకూరు బాలాజీ, అనంత పద్మనాభ స్వామి, ఏడుపాయల దేవాలయం, అనంతగిరి హిల్స్ను సందర్శించేందుకు సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని అన్నారు. 27న ఉదయం 4గంటలకు కరీంనగర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9గంటలకు తిరిగి కరీంనగర్కు చేరుకుంటుందని, పెద్దలకు రూ.1.430. పిల్లలకు రూ.900 టికెట్ ఉంటుందని తెలిపారు. గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్కు సమ్మె నోటీసుకొత్తపల్లి: జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీరాములపల్లి శివారులోని జిల్లా గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రణీతరావు, భాషకు సోమవారం సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కో శాధికారి గీట్ల ముకుందరెడ్డి, జి.రాజేశం పలు డిమా ండ్లతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. నాలు గు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అసంఘటిత రంగ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులందరికీ జాతీయస్థాయిలో కనీస వేతనం నెలకు రూ.26వేలుగా నిర్ణయించాలని, హైకోర్టు ఆర్డర్ ప్రకారం గ్రా నైట్ కార్మికులకు వర్తించే స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఆపరేషన్ కనీస వేతనాల జీవో ఎంఎస్ నంబర్ 23 ఫైనల్ విజిట్ ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమానమైన పనికి సమాన వేతనం అమలు చేయాలని తదితర 20 డిమాండ్లను పరిష్కరించాలని సమ్మె నోటీసు అందించారు. -
సీసీలు అంటేనే.. కలెక్టర్ల కళ్లలో కారం!
● కొత్తపల్లిలో ఓ భూమిని అప్పటి కలెక్టర్ కర్ణన్ డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగం చేసి రూ.12 కోట్ల భూమి చేతులు మారేలా చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఏకంగా కలెక్టర్కు తెలియకుండా జరిగిన ఈ విషయంపై ఒకరిద్దరు కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకున్నా.. అసలు నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అప్పటి కలెక్టర్ సీసీని భూ రికార్డులు మార్చిన తహసీల్దార్ స్థానంలోకి పంపినా.. ఆయన రెండు వారాలకు మించి ఉండలేకపోయారు. వెంటనే తిరిగి కలెక్టరేట్లోని తన పాత సీసీ స్థానంలోకి వచ్చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ● సర్ఫరాజ్ కలెక్టర్గా ఉన్న సమయంలో కిసాన్నగర్లో కరీంనగర్కు చెందిన ఓ తహసీల్దార్ భూమిని మరో తహసీల్దార్ ఇతరుల పరం చేశాడు. అందులో ప్రస్తుతం కలెక్టరేట్లో సీసీలుగా ఉంటున్న ఇద్దరు తహసీల్దార్ ర్యాంకు ఆఫీసర్లు కీలకంగా ఉన్నారు. వీరిలో ఓ తహసీల్దార్ ఆరుగుంటలు భూమి, మరో తహసీల్దార్ మూడు గుంటల భూమి బహుమతి కింద పొందారు. ఈ విషయంపై విజిలెన్స్ విచారణ జరిపినా.. నివేదికను కలెక్టర్ సీసీ సాయంతో తొక్కిపెట్టారన్న విమర్శలున్నాయి. ● సదరు సీసీలు తమ ఇంట్లో వాళ్లకు కూడా స ర్కారు, కాంట్రాక్ట్ జాబులు పెట్టించుకోవడం విశేషం. ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగంలో చేరి, కలెక్టర్ల కళ్లల్లో కారం కొడుతున్న వీరు.. ఏకంగా ఇపుడు కుటుంబ సభ్యులకు కూడా అడ్డదారిలో కొలువులు పెట్టించుకుంటున్న తీరు చూసి కలెక్టరేట్ సిబ్బంది విస్తుపోతున్నారు. ఒక సీసీ తన భార్యకు శాశ్వత ఉద్యోగం పెట్టించుకోగా, మరో ఇద్దరు సీసీలు కాంట్రాక్ట్ జాబ్ పెట్టించుకున్నారు. వీరి దందాకు ఉన్నతాధికారుల వద్ద కేవలం వీరు ప్రదర్శించే స్వామిభక్తి మాత్రమే పెట్టుబడి కావడం విశేషం. ● కలెక్టరేట్లో సీసీల విషయంలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని, రెండు దశాబ్దాలుగా సీసీలుగా కలెక్టరేట్లో పాతుకుపోయిన వారిని బదిలీ చేయాలని కోరు తూ జమ్మికుంటకు చెందిన ప్రముఖ సా మాజిక ఉద్యమకారు డు సిలివేరు శ్రీకాంత్ సోమవారం ప్రజవాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన సాక్షితో మాట్లాడు తూ.. మంగళవారం సచివాలయంలో సీఎస్ను కూడా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ కలెక్టరేట్లో సీసీల లీలలు తవ్వినా కొద్దీ వెలుగుచూస్తున్నాయి. కారుణ్య నియామకం కోటాలో చేరిన వీరు కలెక్టరేట్లో పాగా వేయడం కాదు, పాతుకుపోయారు. జిల్లాకు ఎంతమంది కలెక్టర్లు వచ్చినా వీరిని బదిలీ చేసే సాహసం ఏ ఐఏఎస్ అధికారి చేయకపోవడం గమనార్హం. వీరి మేనేజింగ్ స్కిల్స్ ముందు రాజకీయ నాయకులు కూడా దిగదిడుపంటే కలెక్టరేట్లో వీరి పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. పదోన్నతులు వచ్చినా, ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకుపోవడానికి కారణాలు అవినీతి, అక్రమాలు. ఐఏఎస్లకు సీసీలుగా వ్యవహరిస్తూ.. వీరు జిల్లాను వీరి పిడికిల్లో బంధిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. వీరు తహసీల్దార్ ర్యాంకులో ఉండి.. సీసీలుగా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడుతూ.. ఐఏఎస్ల కళ్లల్లో కారం కొడుతున్నారు. కనీసం ఆ అక్రమాలు బయటికి వస్తే..సదరు ఐఏఎస్ అధికారులు వీరిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నకు నేటికీ సమాధానం దొరకడం లేదు. సీసీలపై ఇంటెలిజెన్స్ నివేదిక.. సాక్షిలో కలెక్టరేట్లో సీసీలు వారి అక్రమాలపై ప్రచురితమవుతున్న వరుస కథనాలపై ఇంతకాలం మొద్దునిద్ర పోయిన ఇంటెలిజెన్స్ విభాగం ఎట్టకేలకు కదిలింది. కలెక్టర్ పేషీలో ఎవరెవరు? గతంలో ఏయే అక్రమాలకు పాల్పడ్డారు? వాటిని కలెక్టర్లు చూడకుండా ఎవరు తొక్కిపెట్టారు? వీరిని బదిలీ కాకుండా ఆపడంలో కలెక్టర్ల పాత్ర ఎంతవరకు? అన్న విషయాలపై కూపీ లాగుతున్నారు. ఈసారి లభ్యమయ్యే ఆధారాలతో ఉన్నతాధికారులకు కరీంనగర్ కలెక్టరేట్ తతంగం గురించి వివరంగా నివేదిక రూపొందించనున్నారని సమాచారం.కదలరు.. వదలరు విలువైన భూముల రికార్డులు తారుమారు కర్ణన్, సర్ఫరాజ్ సమయంలో రికార్డులు మార్చినా చర్యలేవి? కారుణ్య నియామకాల్లో వచ్చి కలెక్టరేట్లో పాగా స్వామిభక్తి ప్రదర్శించి భార్యలకు సర్కారు కొలువులు సీసీలను బదిలీ చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు -
1.86 లక్షల మంది రైతులు.. రూ.201 కోట్లు
కరీంనగర్ అర్బన్: రైతు భరోసా సాయం ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరుతుండగా ఇప్పటివరకు 1,86,952 మందికి సాయమందగా మొత్తం రూ.201కోట్లు ఖాతాలకు చేరాయి. జిల్లాలో మొత్తం రైతులు 2,10,904 రైతులు కాగా రూ.211.90 కోట్లు వానాకాలం రైతు భరోసాగా ప్రభుత్వం కేటాయించింది. వారం రోజుల వ్యవధిలో తొలుత రెండెకరాలు, మూడెకరాలు, నాలుగు ఎకరాలు, ఐదు ఎకరాలు ప్రామాణికంగా తీసుకోగా సోమవారం వరకు తొమ్మిది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా చేరింది. ఎకరాన రూ.6 వేల చొప్పున ఈ నెల 16న 1,24,727 మంది రైతులకు రూ.65.79 కోట్లు, 17న 27,307 మందికి రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు, 21న 5,684 మంది రైతులకు రూ.19.36 కోట్లు, 23న 3,284 మంది రైతులకు గానూ రూ.17.11 కోట్లు ఖాతాలకు చేరాయి. విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులకు గానూ వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. కాగా.. మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డి రైతు భరోసా, సన్నబియ్యం బోనస్ లబ్ధిదారులను ఉద్దేశించి రైతునేస్తం కార్యక్రమంలో వీసీ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని 45 రైతు వేదికల్లో రైతులు హాజరు కావాలని కోరారు. ఖైదీల యోగ క్షేమాలు తెలుసుకున్న జడ్జికరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలును సోమవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.వెంకటేశ్తో కలిసి సందర్శించారు. ఖైదీల యోగ క్షేమాలు, భోజన వసతులు, న్యాయసేవా, ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్, ఆసుపత్రి, ములాఖత్, ఫోన్, లైబ్రరీ, వంటశాల, ఇండస్ట్రీలలో పనితీరు పరిశీలించారు. కొత్త చట్టాలు వివరించారు. మహిళా జైలును కూడా సందర్శించి కేసుల వివరాలు, బాగోగులు, సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. లాయర్లను పెట్టుకునే స్థోమత లేనివారికి ప్రభుత్వం తరఫున లాయర్లను నియమిస్తామని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ విజయ డేని జైలర్లు పి.శ్రీనివాస్, బి.రమేశ్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరంపై విషం కక్కడంలో చంద్రబాబు హస్తం కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విషం కక్కడంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హస్తం ఉందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో మాట్లాడారు. తెలంగాణ గోదావరి నీళ్లను తరలించుకుని బనకచర్ల ప్రాజెక్టును నిర్మించుకునే కుయుక్తులో భాగంగా కేంద్ర మంత్రి సంజయ్ను వాడుకుంటూ కాళేశ్వరంపై విషం కక్కిస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీళ్లను సముద్రంలో కలవనీయకుండా అడ్డుకునేందుకు గతంలో ఏ ప్రభుత్వం కృషి చేయలేదన్నారు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా కేవలం కేసీఆర్పై విమర్శలు, దూషణలు, ఆరోపణలే పనిగా పెట్టుకుని పబ్బం గడుపుకుంటున్న కేంద్ర మంత్రి వైఖరిపై ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. ఫోన్ట్యాపింగ్ విషయంలో దమ్ముంటే సిట్కు హాజరు కావొద్దని సవాల్ చేశారు. కేంద్ర మంర్రి సంజయ్ కరీంనగర్లో కూర్చుని కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముగ్గురు మంత్రులు, బండి సంజయ్ను ప్రజలు బహిష్కరించాలన్నారు. చల్ల హరిశంకర్, పొన్నం అనిల్గౌడ్, షౌకత్ అలీ, యాదగిరి పాల్గొన్నారు. -
యువత మత్తుకు దూరంగా ఉండాలి
కరీంనగర్క్రైం: యువత మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో పయనించి లక్ష్యాలకు చేరుకోవాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ వ్యాప్తంగా పోలీసులు ఈనెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం–అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 20 నుంచి 26 తేదీ వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సిరిసిల్ల బైపాస్ రోడ్డులో గల కమిషనరేట్ ట్రైనింగ్ సెంటర్ (సీటీసీ)లో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీటీసీ వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్ , సీసీఆర్బీ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్పెక్టర్లు సంతోష్కుమార్, సరిలాల్, శ్రీనివాస్, తిరుపతి, శ్రీనివాస్లు పాల్గొన్నారు.● సీపీ గౌస్ ఆలం -
మహిళలు గర్వపడేలా చీరలుండాలి
సిరిసిల్ల: రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులు ఆత్మగౌరవంతో కట్టుకునేలా సిరిసిల్ల నేతన్నలు నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల ఏఎంసీ గోదాంలో సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరల బట్ట సేకరణకు శ్రీకారం చుట్టారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నేతన్నలు, రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గతంలో కంటే మెరుగైన ఆర్డర్లను ఇచ్చామని, సకాలంలో వస్త్రాన్ని ఉత్పత్తి చేసి సిరిసిల్ల పేరు నిలబెట్టాలన్నారు. వేములవాడలో రూ.50కోట్లతో నూలుడిపోను ఏర్పాటు చేసి 90 శాతం అరువుపై అందిస్తున్నామని తెలిపారు. చేనేత కార్మికుల రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేశామని పేర్కొన్నారు. నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. ఇప్పటి వరకు 65 లక్షల మీటర్లు తయారు చేశారని, జూన్ నెలాఖరులోగా 50 శాతం పూర్తి చేయాలని సూచించారు. రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి వేములవాడ రాజన్న ఆలయాన్ని రూ.150కోట్లతో నాలుగు ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. ఇప్పటికే రూ.47.98కోట్లు కలెక్టర్ ఖాతాలో ఉన్నాయని, సిరిసిల్లలో పద్మశాలీ భవన్ను రూ.5కోట్లు, సిరిసిల్ల సంఘాల నుంచి మరో రూ.3కోట్లు సేకరించి రూ.8 కోట్లతో నిర్మిస్తామని, మార్కండేయ ఆలయాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కలెక్టర్ సందీప్కుమార్ ఝా మాట్లాడుతూ చీరల ఆర్డర్ను సకాలంలో పూర్తి చేయాలని, జూన్ నెలాఖరు నాటికి సగం ఆర్డర్ పూర్తి చేయాలని సూచించారు. సేకరణ పూర్తికాగానే ఉత్పత్తి చేసిన బట్టకు బిల్లులు అందుతాయని వెల్లడించారు. కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కె.కె.మహేందర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, చేనేత, జౌళి శాఖ జేడీ ఎన్.వెంకటేశ్వర్రావు, ఏడీ రాఘవరావు, డీడీ రవీందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, కాంగ్రెస్ నాయకులు ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, కాముని వనిత, కల్లూరి చందన, వస్త్రోత్పత్తిదారులు ఆడెపు భాస్కర్, గోవిందు రవి, మంచె శ్రీనివాస్, కార్మిక నాయకులు మూషం రమేశ్, కోడం రమణ, మాజీ కౌన్సిలర్లు, జౌళిశాఖ అధికారులు పాల్గొన్నారు. ఆత్మగౌరవంతో వాటిని కట్టుకోవాలి రాష్ట్రమంతటికి సిరిసిల్ల చీరలు సకాలంలో ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలి రూ.150 కోట్లతో రాజన్న ఆలయ అభివృద్ధి సిరిసిల్లలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ -
విన్నపాలు వినవలె
● ప్రజావాణిలో బాధితుల మొర ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్ పమేలా సత్పతిమొత్తం అర్జీలు: 263 మునిసిపల్ కార్పొరేషన్: 62 డీపీవో: 14 ఆర్డీవో కరీంనగర్: 11 మానకొండూర్ తహసీల్దార్: 09 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 09 తిమ్మాపూర్ తహసీల్దార్: 08 ఎంపీడీవో హుజూరాబాద్: 07కరీంనగర్ అర్బన్: విన్నపాలు వినవలె..నంటూ కలెక్టరేట్ బాట పట్టారు బాధితులు. జిల్లా నలుములల నుంచి ప్రజలు అర్జీలతో ఆశగా ఉన్నతాధికారులను ఆశ్రయించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి వినతులు వెల్లువలా రాగా.. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల అర్జీలు రాగా వ్యక్తిగత సమస్యలను ఏకరవు పెట్టారు.వృద్ధాశ్రమ భవనానికి అనుమతి ఇప్పించండి 2003 నుంచి అనాథ వృద్దులకు సేవ చేస్తున్నాం. స్థలం కోసం 2015లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తే అప్పటి ఎంపీ వినోద్కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు బొమ్మకల్ శివారులోని 128 సర్వేనంబర్లో స్థలం కేటాయించారు. దాతల సహకారంతో అనాథ వృద్ధాశ్రమ భవనం నిర్మాణం జరుగుతోంది. కానీ.. అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇప్పించడంతో పాటు కలెక్టర్ నిధుల నుంచి నిధులు కేటాయించాలి. – సి.వీరమాధవ్, వీబీ ఫౌండేషన్, కరీంనగర్ -
ఎడ్ల నాగలికి భలే గిరాకీ
● పసుపు విత్తనానికి రోజుకు రూ.3,500 కిరాయి ● ప్రతి గ్రామంలో ఐదారు జతల కాడెద్దులే దిక్కు జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయంలో ట్రాక్టర్లు, ఆధునిక యంత్రాలు రావడంతో కాడెద్దులు కనుమరుగయ్యాయి. గ్రామానికి కేవలం ఐదారు జతల కాడెడ్లు మాత్రమే ఉన్నాయి. విత్తనాలు వేసే సమయంలో వాటికి భలే డిమాండ్ పెరిగింది. పసుపు వంటి విత్తనం వేసేందుకు కాడెడ్లతో వచ్చే రైతుకు రూ.3,500 నుంచి రూ.4వేల వరకు చెల్లించాల్సి వస్తోందంటే గ్రామాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోషణ భారమై.. ఒకప్పుడు గ్రామాల్లో ప్రతి రైతుకు కనీసం నాలుగైదు కాడెడ్లు ఉండేవి. జత కాడెడ్లు లేని రైతులు ఉండేవారు కాదంటే అతిశయోక్తికాదు. సాగులో ట్రాక్టర్ల రాకతో ప్రతి పనికీ యంత్రాలనే వినియోగిస్తున్నారు. చిన్న గ్రామంలోనూ సుమారు 20 నుంచి 30 ట్రాక్టర్లు వచ్చాయి. దీంతో కాడెడ్లను పోషించే స్థోమత రైతులకున్నా.. వాటికి నీరు పెట్టడం, మేత వేయడం వంటి పనులు చేయలేక అమ్ముకుంటున్నారు. నాలుగైదు ఎకరాలు ఉన్న రైతు కూడా ట్రాక్టర్ కొంటున్నాడు. కాడెడ్లకు గిరాకీ వాస్తవానికి విత్తనం వేసేందుకు కాడెడ్లు తప్పనిసరి. గతంలో ఇరుగుపొరుగు రైతులు అదలుబదలు రూపంలో విత్తనాలు వేసుకునేవారు. ప్రస్తుతం ఆ విధానం మారింది. కాడెడ్ల నాగలితో విత్తనం వేస్తే బాగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. దీంతో పసుపు విత్తనం వేసేందుకు రైతులు కాడెడ్లపైనే ఆధారపడుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎడ్లనాగలితో వెళ్తే రూ.3,500 ఇస్తున్నారు. కొందరు రైతులు విత్తనం వేశాక అమ్ముకుంటున్నారు. కాడెడ్ల జతకు రూ.80వేల నుంచి రూ.90వేల వరకు ఉంది. పసుపు వేసేందుకు.. వ్యవసాయంలో ట్రాక్టర్లతోనే అన్ని పనులు చేస్తున్నారు. ఆధునిక యంత్రాల రాకతో నాకున్న ఎడ్లను అమ్మిన. ఇప్పుడు పసుపు విత్తనం వేసేందుకు రూ.3,500 ఇస్తున్నాం. వారంముందే ఎడ్ల నాగలి మనిషికి అడ్వాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా గ్రామాల్లో రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. – గడ్డం గంగారెడ్డి, చల్గల్ ఎడ్లు దొరికే పరిస్థితి లేదు ఎడ్ల నాగలితో విత్తనం వేస్తేనే బాగా మొలకెత్తుతుంది. ఇందుకోసం ఎడ్లు కొందామన్నా.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు. ఒక్కో జతకు రూ.80వేల పలుకుతోంది. విత్తనం వేసే వారంముందే ఎడ్ల నాగలిని కిరాయి తీసుకుంటున్నాం. మిగతా పనులు చేయడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తాను. – రాంకిషన్, వెల్దుర్తి -
ఎంపిక పోటీలకు వేళాయె!
కరీంనగర్స్పోర్ట్స్: రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ క్రీడాపాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 4వతరగతిలో ప్రవేశాలకు గాను ఎంపిక పోటీల ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి అంకం మండలస్థాయి పోటీలను ముగించుకొని జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మండలస్థాయిలో ఎంపికై న విద్యార్థులు జిల్లాస్థాయి ఎంపిక పోటీలకు హాజరు కానున్నారు. సికింద్రాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో స్పోర్ట్స్ పాఠశాలలున్నాయి. జిల్లాస్థాయిలో శారీరక, సామర్థ్యానికి సంబంధించిన వాటితోపాటు పలు వాటిల్లో పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయిలో టాప్ 20లో నిలిచిన బాలబాలికలను రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా క్రీడాశాఖల అధికారులు ఎంపిక చేయనున్నారు. జిల్లాస్థాయి పోటీల వివరాలు ఈనెల 25, 26ల్లో కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో, 26న పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఐటీఐ కళాశాల మైదానంలో, 26న జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో, 26న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజీవ్నగర్ మినీ స్టేడియంలో జరగనున్నాయి. రేపటి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్రీడా పోటీలు టాప్ 20లో నిలిచిన బాలబాలికలు రాష్ట్రస్థాయి ఎంపిక పోటీలకు అర్హత సన్నాహాలు చేస్తున్న జిల్లా క్రీడాశాఖలు జిల్లాస్థాయిలో విద్యార్థులకు నిర్వహించే శారీరక సామర్థ్య పరీక్షలు – ఎత్తు – బరువు – 30 మీటర్ల పైలయింగ్ స్టార్ట్ – స్టాండింగ్ బ్రాడ్ జంప్ – 800 మీటర్ల రన్నింగ్ – 6.10 మీటర్ల షటిల్ రన్ – మెడిసన్ బాల్ త్రో(కిలో బరువు) – వర్టికల్ జంప్ – ఫ్లెక్సిబిలిటీ టెస్ట్ అండ్ మెడికల్ పరీక్షలు సువర్ణావకాశం క్రీడాకారులుగా ఎదగాలనుకునేవారికి స్పోర్ట్స్ పాఠశాలలు సువర్ణావకాశం. తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలల్లో చదివి అంతర్జాతీయస్థాయితోపాటు ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్లో పాల్గొని సత్తా చాటిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రీడలతోపాటు విద్యపై కూడా శ్రద్ధ చూపుతారు. – వేల్పుల సురేందర్, పెటా సంఘం అధ్యక్షుడు, పెద్దపల్లి -
డీపీఆర్ తయారీలో అగ్రగామి
సింగరేణి పాలిటెక్నిక్లో ప్రవేశాలు యైటింక్లయిన్కాలనీ(రామగుండం): మంచిర్యాల జిల్లా సీసీసీ– నస్పూర్లోని సింగరేణి పాలిటెక్నిక్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సోమవారం తెలిపారు. కళాశాలలో మొత్తం 300 సీట్లు భర్తీచేస్తామన్నారు. సివిల్, కంప్యూటర్స్, ఎలిక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మైని ంగ్ కోర్సుల్లో 60 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, పాలిసెట్–2025లో ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఇందులో 150 సీట్లు సింగరేణి ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లలకు కేటాయించామన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈనెల 28 నుంచి జూలై 3వ తేదీ వరకు సింగరేణి వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మిగిలిన సీట్లను కన్వీనర్ కోటా కింద ఇతరులకు కేటాయిస్తామని, వీరు తెలంగాణ ప్రభుత్వ ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా ఈనెల 24నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని వివరించారు. ఇతర వివరాల కోసం 90102 22161, 87901 12515, 94911 44168 ఫోన్నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. రామగుండం: వ్యాప్కోస్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మరోసారి చర్చకు వచ్చిన పేరు. జీవితకాలం ముగిసిన మేడిపల్లి ఓపెన్కాస్టు గనిలో సింగరేణి 500 మెగావాట్ల సామర్థ్యం గల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అంతేకాదు.. ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) తయారీ బాధ్యతలను వ్యాప్కోస్కు అప్పగించడం చర్చనీయాంశం కావడానికి కారణమైంది. ప్రఖ్యాతిగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర నివేదిక(డీపీఆర్)తయారీలోనూ నిర్దేశిత గడువులోగా అత్యధిక కచ్చితత్వంతో ఈ సంస్థ ప్రత్యేకత చాటుకుంది. డ్యాంలు, పంపుహౌస్లు డిజైన్ చేసి అప్పగించడంలోనూ సత్తా నిరూపించుకుంది. మేడిపల్లి ఓసీపీలో చేపట్టిన పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మాణానికి జియాలాజికల్, జియో టెక్నికల్, హైడ్రాలజీ, సివిల్, ఉత్పత్తి సామర్థ్యం, మెకానికల్, ఎలక్ట్రికల్, పర్యావరణ, పవర్ డిస్ట్రిబ్యూషన్, రక్షణ తదితర అంశాలపై డీపీఆర్ ఇవ్వాలని సింగరేణి వ్యాప్కోస్ను కోరింది. వ్యాప్కోస్ అంటే.. వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ను చిన్నగా వ్యాప్కోస్గా పిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నీటి వనరులు, విద్యుత్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ అధ్యయన రంగాల్లో సేవలు అందించే ఒక ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ఇది. దీనిని 1969లో స్థాపించారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. వ్యాప్కోస్కు మినీరత్న సంస్థగా గుర్తింపు వచ్చింది. దేశ, విదేశాల్లో చేపట్టే ప్రాజెక్టులకు సాంకేతిక సలహాలు, ఇంజనీరింగ్ సేవలు అందిచడంలో దిట్ట. ఐఎస్వో 9001:2015 సర్టిఫికేషన్ కలిగిన సంస్థగా, గుణాత్మక సేవలకు నిదర్శనంగా పేరుంది. దేశ, విదేశాల్లో కీలకపాత్ర.. ● అఫ్ఘనిస్తాన్ హెరాత్ ప్రావిన్స్లోని సల్మాడ్యామ్ జలవిద్యుత్ ఆనకట్టను వ్యాప్కోస్ డిజైన్ చేసింది. ● భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరాకు జలజీవన్ మిషన్, మిషన్ భగీరథ ప్రాజెక్టులూ డిజైన్ చేసింది. ● ఉత్తరప్రదేశ్లోని నమామి గంగానది సంరక్షణ, కాలుష్య నియంత్రణ, ల్యాండ్ స్కేపింగ్ డిజైన్ చేసింది. విద్యుత్ రంగంలోనూ.. ● రువాండాలోని ఎగైజన్ జలవిద్యుత్ పవర్ ప్రాజెక్టు (బురుండి) డిజైన్ ● రామగుండం మేడిపల్లి ఓపెన్కాస్టు తరహాలో నిర్మించే పంప్డ్ స్టోరేజీ విధానానికి గతంలోనే 600 మెగావాట్ల సామర్థ్యం గల అప్పర్ ఇంద్రావతి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీగా సేవలు అందిస్తోంది. ● భూటాన్లోని మంగ్దేచు జలవిద్యుత్ ప్రాజెక్టుకు డిజైన్ సాంకేతిక సలహాదారుగా వ్యవహ రించింది. ● స్వచ్ఛభారత్ మిషన్, రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ కింద గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. మౌలిక సదుపాయాల్లో.. ● ఫిజీదేశంలో రెండు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సాంకేతిక సలహా సేవలు అందిస్తోంది. ● అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీ మిషన్ పథకంలో భాగంగా నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్ల రూపకల్పన డిజైన్ చేసింది. ● మనదేశంలోని ఓడరేవులు, హార్బర్లు, ఇన్ల్యాండ్ వాటర్ వేస్ అభివృద్ధికి డిజైన్, కన్సల్టెన్సీ సేవలు అందించింది. ● ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద గ్రామీణ రోడ్ల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తోంది. ప్రాజెక్టు రూపకల్పనలో అనుసరించే విధానం.. ● ప్రాజెక్టు ఆర్థిక, సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయడం, హైడ్రాలిక్ డిజైన్, వ్యయ అంచనా, డ్రాయింగ్ తయారీ, భౌగోళిక, హైడ్రాలజీ అధ్యయనాలతో క్షేత్ర సర్వేలు, ప్రాజెక్టు రూపకల్పన నుంచి అమలు, నిర్వహణ వరకు సమగ్ర సేవలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. వ్యాప్కోస్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో సేవలను అందిస్తోంది. ముఖ్యంగా అంగోలా, బంగ్లాదేశ్, భూటాన్, కంబోడియా, ఇథియోపియా, ఫిజీ, మంగోలియా, నేపాల్, రువాండా, శ్రీలంక, ఉగాండా, జింబాబ్వే తదితర 30 దేశాల్లో వ్యాప్కోస్ సేవలు అందించడం మనదేశానికి గర్వకారణమని అంటున్నారు. దేశ, విదేశాల్లోనూ ప్రత్యేక గుర్తింపు మినీరత్న హోదా సాధించిన ‘వ్యాప్కోస్’ -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు యోగేశ్వరి
కరీంనగర్స్పోర్ట్స్: నల్గొండ జిల్లా నకీరేకల్లో ఈనెల 4 నుంచి 6 వరకు జరిగిన జూనియర్స్ గర్ల్స్ హ్యాండ్బాల్ స్టేట్ లెవెల్ చాంపియన్షిప్ పోటీల్లో కరీంనగర్ జట్టు తరఫున ఎం.యోగేశ్వరి ప్రతిభ కనబర్చింది. ఈనెల 18 నుంచి జూలై 22 వరకు బిహార్ జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ హెచ్ఎఫ్ఐ పోటీలకు తెలంగాణ జట్టు తరుపున ఎంపికై నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్యామల పవన్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఉమ్మడి కరీంనగర్ హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వరరావు, బాసరవేణి లక్ష్మణ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లర్ గుంతలో పడి వ్యక్తి మృతిగంగాధర(చొప్పదండి): ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి పిల్లర్ గుంతలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. చిగురుమామిడి మండల కేంద్రానికి చెందిన చెరుకు వెంకటయ్య (71) గర్శకుర్తిలో పూజా కార్యక్రమానికి వచ్చాడు. ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో గ్రామ శివారులోని పెట్రోల్ బంకు సమీపంలో వాహనం అదుపుతప్పి ఇంటి పిల్లర్ గుంతలో పడడంతో తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు.. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్ గ్రామంలో ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని అనవేని కనుకయ్య(70)మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. తాడికల్ మా ర్కండేయ కాలనీకి చెందిన కనుకయ్య కిరాణ దుకాణంలో సామగ్రి కొనుక్కుని నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. సమీపంలోని రైస్మిల్లులో సీసీ పుటేజీలను పరిశీలించగా, అంబాల్పూర్ నుంచి తాడికల్ వెళ్తున్న కారు ఢీకొన్నట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని హుజూరాబాద్ మార్చురీకి తరలించారు. హోటళ్లలో వన్యప్రాణుల మాంసం?వేములవాడరూరల్: ఎండ వేడికి అడవిలో ఉన్న వన్యప్రాణులు దాహం కోసం గ్రామీణ ప్రాంతాలకు తరలివస్తున్నాయి. దీనిని ఆసరా చేసుకున్న కొంత మంది వేటగాళ్లు వన్యప్రాణులను చంపి మాంసం విక్రయిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వేములవాడ మండలంలోని హన్మాజిపేట, నాంపల్లి, వట్టెంల తదితర గ్రామాల్లో వేటగాళ్లు వన్యప్రాణుల మాంసాన్ని హోటల్ యజమానులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సదరు మాంసాన్ని హోటల్ యజమానులు మద్యం ప్రియులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి వన్యప్రాణులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కరీంనగర్కు మెహరాజ్ మృతదేహంకరీంనగర్క్రైం: కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన మెహరాజ్(46) ఈ నెల 16న షార్జాలో మృతిచెందగా అతడి మృతదేహాన్ని ఆదివారం నగరానికి తీసుకొచ్చారు. మెహరాజ్ ఎనిమిదేళ్లుగా షార్జాలో అల్ఖైరిన్ పాఠశాలలో పాఠాలు బోధించేవాడు. అతడి కుటుంబ సభ్యులు షార్జాకు వెళ్లి వారి బంధువుల సాయంతో మృతదేహాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. -
సేవామూర్తులు
ప్రజా సేవే పరమార్థంగా పలువురు స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సోమవారం ప్రజాసేవ దినం సందర్భంగా కథనం. దివ్యాంగుల సేవలో.. జమ్మికుంట(హుజూరాబాద్): మున్సిపల్ పరిధిలోని మారుతీనగర్లో మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలను మానసిక దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 50 మంది విద్యార్థులతో పాఠశాల కొనసాగుతుంది. 1995లో ఐదుగురు దివ్యాంగ పిల్లలతో పాఠశాల ప్రారంభమై మానసిక దివ్యాంగ సేవా సంస్థగా రూపాంతరం చెందింది. 1997లో అప్పటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ బీఆర్ మీనా రెండెకరాల ప్రభుత్వ స్థలం కేటాయించగా, దాతల సాయంతో స్కూల్ నిర్మాణం జరిగింది. సంతృప్తినిచ్చింది నా ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో వారి పనులు వారు చేసుకునేలా శిక్షణ, విద్యాబుద్ధులు నేర్పించాలనే సంకల్పంతో 1995లో నా సొంత ఇంట్లో పాఠశాల ప్రారంభించా. తర్వాత ప్రత్యేక పాఠశాల ఏర్పాటుతో 185 మంది వరకు విద్యాబుద్ధులు, శిక్షణ అందించగా ఉపాధితోపాటు వారి పనులు వారి ఇంటి వద్ద చేసుకుంటూ తల్లిదండ్రులకు చేదోడుగా ఉండడం సంతోషం కలిగించింది. దివ్యాంగులకు విద్య అందించడంతోపాటు సేవ చేయడం సంతృప్తినిచ్చింది. ప్రస్తుతం దాతల సాయంతో పాఠశాల నిర్వహిస్తున్నం. ప్రభుత్వం గ్రాంట్ మంజూరు చేస్తే దివ్యాంగులకు మెరుగైన శిక్షణతో వారి భవిషత్తుకు బాటలు పడుతాచి. – బచ్చిరాములు, దివ్యాంగ పేరెంట్స్ సంఘం అధ్యక్షుడు, జమ్మికుంట -
ఠాణాలో వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): తంగళ్లపల్లి పోలీస్స్టేషన్లో ఓ వీఆర్ఏ పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎస్సై రామ్మోహన్ తెలిపిన వివరాలు.. మండలంలోని చీర్లవంచకు చెందిన వేల్పుల సత్తవ్వ భర్త బలరాం 15 ఏళ్ల క్రితం తన తమ్ముళ్లు వేల్పుల కృష్ణ, వేల్పుల బాలకిషన్తో కలిసి సర్వేనంబర్ 586లో 7 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులో రో డ్డుకు 1.10 ఎకరాలు పోగా మిగతా భూమిని సమానంగా పంచుకున్నారు. ఐదేళ్ల క్రితం బలరాం మరణించగా వీఆర్ఏగా పనిచేస్తున్న అతడి తమ్ముడు వేల్పుల కృష్ణ మొత్తం భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. తనకు అనుకూలంగా హద్దురాళ్లను మార్చుకున్నాడు. 20 రోజుల క్రితం సత్తవ్వను ఆమె భూమిలోకి వెళ్లకుండా అడ్డుకోవడంతోపాటు చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో సత్తవ్వ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కృష్ణపై కేసు నమోదైంది. కాగా ఆదివారం మధ్యాహ్నం 12.35 గంటలకు కృష్ణ పురుగులమందుతో పోలీస్స్టేషన్కు వచ్చాడు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పురుగులమందు తాగాడు. వెంటనే అతడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనపై ఎస్సై రామ్మోహన్ను వివరణ కోరగా, చట్టప్రకారమే కేసు నమోదు చేశామన్నారు. వేధింపులకు పాల్పడ్డామనడం అవాస్తవమని స్పష్టం చేశారు. న్యాయం చేయండి : వీఆర్ఏ బాధితులు వీఆర్ఏ కృష్ణ నుంచి తమ భూమిని ఇప్పించాలని బాధితులైన అతడి బంధువులు వేల్పుల సత్తవ్వ, అ నిల్కుమార్, రవీందర్ కోరారు. ఆదివారం మీడి యా ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. కృష్ణ రె వెన్యూశాఖలో పనిచేస్తుండగా తన పలుకుబడిని ఉ పయోగించి సర్వే నంబర్ 586లో రెండు గుంటల భూమికిగాను రెండెకరాల భూమి మ్యుటేషన్ చే యించుకున్నాడని ఆరోపించారు. గతంలో రవీందర్పై హత్యాయత్నానికి పాల్పడగా కేసు నమోదై, ఏ డేళ్ల జైలుశిక్ష కూడా పడిందన్నారు. కానీ, అప్పీల్కు వెళ్లి బెయిల్పై బయట తిరుగుతున్నాడని తెలిపా రు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టి తమ కు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. -
న్యాయవాద శిక్షణకు ఊతం
● ఉపకార వేతనం, గ్రాంట్ అందజేయనున్న ప్రభుత్వం ● ఎస్సీలకు సదావకాశం ● 36 నెలలపాటు నెలకు రూ.3వేల చొప్పున చెల్లింపు ● బార్ కౌన్సిల్ అడ్మిషన్ ఫీజు సైతం.. కరీంనగర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో మూడు సంవత్సరాల శిక్షణ పొందేందుకు ఎంపిక చేసిన లా–పట్టుభద్రులు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ ఎంతో దోహదపడుతుంది. ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు ఆర్థిక సహకారమందించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్సు పూర్తి చేయడమే కాకుండా.. కేసులు ఎలా వాదించాలి.. దానికి సంబంధించిన పత్రాలను ఎలా సిద్ధం చేయాలి.. పేషీల అనుశీలన.. న్యాయమూర్తి తీర్పు ప్రతి గురించి తెలుసుకోవడం ఇవన్నీ న్యాయవాద వృత్తిలో భాగాలే. వీటి గురించి సమగ్రంగా తెలుసుకోవాలంటే జూనియర్లు సీనియర్ న్యాయవాదుల వద్ద శిక్షణ పొందడం తప్పనిసరి. తద్వారా పట్టు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఇలా శిక్షణ పొందడం కొంత ఖర్చుతో కూడుకున్న పని. ప్రభుత్వం ఎస్సీ కులాలకు చెందిన న్యాయవాదులకు తగిన స్లయిఫండ్, గ్రాంట్ను అందిస్తోంది. ఇటీవల ఈ మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తద్వారా న్యాయవాదులు తగిన శిక్షణ పొందేందుకు దోహదపడుతుంది. న్యాయవాద వృత్తి చేపట్టే వారి సంఖ్య ఇటీవల క్రమంగా పెరుగుతోంది. ఇంటర్ తర్వాత ఐదేళ్లు, డిగ్రీ తర్వాత మూడేళ్ల కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేకత కోసం ఎల్ఎల్ఎం కోర్సును అభ్యసిస్తారు. ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారు న్యాయవాద వృత్తిలో రాణించాలంటే సీనియర్ల వద్ద శిక్షణ తప్పనిసరి. కొన్ని నెలలపాటు వారి వద్ద సెక్షన్లు, కేసులు, వాటి పూర్వాపరాలు, బెయిల్ మంజూరు, శిక్ష, జరిమానాలు ఇలా అన్ని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు వీలు కలుగుతుంది. పెరిగిన సహకారం న్యాయవాది వృత్తిలోకి అడుగుపెట్టిన వారు సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు ఖర్చవుతుంది. పుస్తకాలు, నల్ల కోటు, కంప్యూటర్ తదితర వాటిని కొనుగోలు చేయాల్సిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఆర్థిక సహకారమందించాలని నిర్ణయించి కొన్నేళ్లుగా ఆ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈక్రమంలో ఇచ్చే గ్రాంట్, ఉపకార వేతనాన్ని పెంచారు. గత సంవత్సరం వరకు ప్రతి నెలా రూ.వెయ్యి ఉపకార వేతనాన్ని 36 నెలలపాటు అందజేసేవారు. దీనికితోడు వన్ టైం గ్రాంట్ పేరిట రూ.6వేలు చెల్లించేవారు. ఇటీవల ఉపకార వేతనాన్ని రూ.వెయ్యి నుంచి రూ.3వేలకు పెంచారు. వన్టైం గ్రాంటును ఏకంగా రూ.50వేలకు పెంచారు. దీనికితోడు బార్ కౌన్సిల్ నిర్ణయించిన రూ.585 అడ్మిషన్ ఫీజును సైతం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ చెల్లిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ప్రభుత్వమందిస్తున్న ఉపకార వేతనం, గ్రాంట్ కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు అర్హులు. ఇందుకు గాను షెడ్యూల్డ్ కులాలకు చెందిన న్యాయవాదులు.. సీనియర్ల వద్ద శిక్షణ పొందేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ రోడ్డులో గల అంబేడ్కర్ భవన్లోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ కార్యాలయంలో జూలై 31 లోగా దరఖాస్తు చేసుకో వాలి. వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుంది. కమిటీలో జిల్లా జడ్జి, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సభ్యులుగా ఉంటారు. మూడు సంవత్సరాలు సర్వీసు పైబడిన జూనియర్ న్యాయవాదులను సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 10న అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1 జూలై 2025 నాటికి 23 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సుండి, సంవత్సర ఆదాయం రూ.2లక్షలకు మించొద్దు. కులం, ఆదాయం, గ్రాడ్యుయేషన్ లా సర్టిఫికెట్లు, బార్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలతో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికై న వారి ఖాతాల్లో ట్రెజరీ ద్వారా డబ్బులు అందజేయనున్నారు. -
పసుపు పంటతో ఆదాయం
పసుపు ఇంటి పంట. జిల్లాలో ప్రతీ రైతు కనీసం ఎకరం నుంచి నాలుగెకరాల వరకు సాగు చేస్తారు. నేను 3 ఎకరాల్లో సాగు చేశా. ప్రస్తుతం రైతుల వద్ద లేనప్పుడు క్వింటాల్ ధర రూ.16 వేలకు చేరింది. పసుపు బోర్డు ఏర్పాటైనందున, ఈ ఏడాదైనా ధర వస్తుందనే ఆశతో పంట సాగు చేస్తున్నాం. – సత్యంరెడ్డి, ముత్యంపేట, మల్లాపూర్ ఇక్కడి భూములు అనుకూలం పసుపు పంటకు జిల్లాలోని ఎర్రనేలలు అనుకూలం. సాగులోనే కాకుండా దిగుబడి తీయడంలోనూ జిల్లా రైతులదే పైచేయి. ఇటీవల పంట వేసేందుకు, తవ్వేందుకు యంత్రాలు, సాగు నీరు, ఎరువుల కోసం డ్రిప్ ఉపయోగిస్తున్నారు. పెరుగుతున్న ధరలు మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. – శ్యాంప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, జగిత్యాల -
కోటిలింగాలలో పురాతన నాణేలు లభ్యం
వెల్గటూర్(ధర్మపురి): శాతవాహనుల తొలి రాజధానిగా ప్రసిద్ధి చెందిన కోటిలింగాలలో పురాతన నాణేలు లక్ష్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం కోటిలింగాల గోదావరిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారునికి గోదావరి తీరంలో 1911 సంవత్సరానికి చెందిన ఓవైపు విక్టోరియా మహారాణి ఫొటోతో, మరోవైపు రాజు గుర్రాన్ని తోలుతున్న ఫొటోతో ఉన్న సుమారు 22 నాణేలు లభ్యమయ్యాయి. వాటిని చూసి ఆశ్చర్యపోయిన మత్స్యకారుడు మాజీ సర్పంచ్ ముత్తయ్యకు తెలుపగా ఆదివారం విషయం వెలుగుచూసింది. కోటిలింగాల గ్రామంలో గతంలో జరిపిన తవ్వకాలలో శాతవాహనులకు సంబంధించిన అనేక నాణేలు, చారిత్రక అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటి ప్రభుత్వం తవ్వకాలను మధ్యలో ఆపేయడంతో చాలా వరకు కోటిలింగాల చరిత్ర మరుగున పడిపోయింది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కోటిలింగాలలో తవ్వకాలు చేపడితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన చారిత్రక అవశేషాలు బయటపడతాయని, కోటిలింగాల గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చరిత్రకారులు చెబుతున్నారు. -
పసుపు వైపే రైతన్న చూపు
జగిత్యాలఅగ్రికల్చర్: పసుపు పంటకు ఓ వైపు ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడం, మరో వైపు వ్యాపారులు సిండికేట్గా మారి బహిరంగ మార్కెట్లో రేటు తగ్గించినా, పసుపు సాగుపై జిల్లా రైతుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. ఏయేటికాయేడు ధర వస్తుందిలే అనే ఆశతో సాగు చేస్తున్నారు. అలాగే, పసుపు క్వింటాల్కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలంటూ రైతులు ఏటా పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే, రైతుల వద్ద ఉన్న పసుపు వ్యాపారుల చేతుల్లోకి పోయిన తర్వాత క్వింటాల్కు రూ.16–17 వేల వరకు ధర పలకడంతో, మళ్లీ అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. దీనికి తోడు నిజమాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుతో ధరల్లో కదలిక వస్తుందనే ఆశతో ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. ఇంటి పంటగా భావించి.. పసుపు పంటకు ధర ఉన్నా, లేకున్నా ఇంటి పంటగా భావించి జిల్లాలో పలువురు రైతులు కనీసం ఎకరం నుంచి ఐదెకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇక్కడి రైతులను ఆర్థికంగా స్థితిమంతులను చేసింది కూడా పసుపు పంటే కావడం విశేషం. అనుకూలమైన ఎర్ర నేలలు, డ్రిప్ ద్వారా సాగునీరు, రసాయన ఎరువులు అందించే వెసులుబాటు ఉండటంతో రైతులు పంట వైపు ఆసక్తి చూసుతున్నారు. ఇక్కడి రైతులు అధిక దిగుబడి ఇచ్చే గుంటూర్, ఆర్మూర్, కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉండే సుగుణ, సుదర్శన్ వంటి రకాలు సాగు చేస్తున్నారు. ఇటీవల కొందరు అభ్యుదయ రైతులు కుర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే కేరళ రకాలను కూడా సాగు చేస్తున్నారు. అయితే, పలువురు రైతులు విత్తనాన్ని కొనుగోలు చేయకుండా, గతేడాది పంట నుంచి నాణ్యమైన విత్తనాన్ని సేకరించుకుని వేస్తుంటారు. పెరిగిన సాగు ఖర్చు పసుపు ఏడాది పంట. దాదాపు 9–10 నెలల పాటు భూమిలోనే ఉంటుంది. పంటకాలంలో అన్నీ ఖర్చులు కలుపుకుని ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల ఖర్చు వస్తుంది. ఎకరాకు ఒక లారీ కోడి ఎరువు(దాదాపు రూ.25 వేలు) వేస్తారు. రెండుమూడు సార్లు దున్నడానికి రూ.5 వేలు, విత్తనం వేసేటప్పుడు రూ.5 వేలు, రసాయన ఎరువులు రూ.8 వేలు, మూడుసార్లు కలుపు తీసేందుకు కూలీల ఖర్చు రూ.5 వేలు, తవ్వకం సమయంలో రూ.40 వేలు, ఉడకబెట్టి, ఆరబెట్టేందుకు రూ.6 వేలు, విత్తనాల ఖర్చు రూ.15 వేలు.. ఇలా అన్నీ కలుపుకుంటే రూ.లక్ష వరకు దాటుతుంది. మార్కెట్కు తరలించేందుకు రవాణా, అడ్తి, కమీషన్, క్యాష్ కటింగ్ వంటి చార్జీలు లెక్కలోకి తీసుకుంటే మరింత ఖర్చు వస్తుంది. ధరలు పెరుగుతాయనే ఆశతో.. ఒకప్పుడు పసుపు ధరలు బంగారంతో పోటీ పడ్డాయి. రెండేళ్ల నుంచి పసుపు ధరలు కొంత మేర ఆశాజనకంగా ఉన్నాయి. క్వింటాల్కు రూ.10–12 వేల ధరలు పలుకుతున్నాయి. ఇటీవల క్వింటాల్కు రూ.16 వేల వరకు పలకడంతో రైతులు ఉత్సాహంగా సాగుకు ఉపక్రమిస్తున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కావడం, అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగి రానున్న రోజుల్లో ఎగుమతులు పెరుగుతాయనే ఆశతో జిల్లాలోని మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, జగిత్యాల రూరల్, కోరుట్ల, కథలాపూర్, రాయికల్, మేడిపల్లి మండలాల్లో అత్యధికంగా సాగు చేస్తున్నారు. ధర ఉన్నా.. లేకున్నా జగిత్యాల జిల్లాలో 40 వేల ఎకరాల్లో సాగు పెరుగుతున్న పసుపు ధరలతో రైతుల్లో ఆశలు -
జాతరలో ఇరువర్గాల ఘర్షణ
మెట్పల్లి(కోరుట్ల): పట్టణంలోని మఠంవాడలో ఆదివారం జరిగిన పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల సందర్భంగా రెండువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. ఉత్సవాలు జరుగుతున్న సమయంలో జక్కం రమేశ్, జక్కం పెద్దరాజం, జక్కం నడ్పిరాజం, జక్కం పవన్, జక్కం శేఖర్, జక్కం రాములుకు.. యామ రాజయ్య, యామ రంజిత్, యామ ప్రకాశ్, యామ మారుతి, యామ గంగాధర్తో గొడవ జరిగింది. ఈ క్రమంలోనే పరస్పరం దాడి చేసుకున్నారు. ఇందులో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం ఇరు వర్గాలు పోలీస్స్టేషన్కు వెళ్లి అక్కడ కూడా గొడవపడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎస్యూలో అలరించిన క్రీడా వార్షికోత్సవం
కరీంనగర్క్రైం: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీలో వార్షిక క్రీడా దినోత్సవం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ ఉమేశ్కుమార్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు ఆటల్లోనూ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. వందేమాతరం శ్రీనివాస్, మధుప్రియలు హాజరై విద్యార్థులను ఆటపాటల్లో ఆనందపరిచారు. విద్యార్థులు హుషారుగా నృత్యాలు చేసి వేదికను హోరెత్తించారు. విశిష్ట అతిథి ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పీజీ తర్వాత ఉద్యోగాన్ని సాధించే విధంగా లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిధి కిరణ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయ విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో విజేతలకు బహుమతులు అందించారు. -
బీటీఆర్ ఫౌండేషన్తో పేదలకు సాయం
ఇల్లంతకుంట(మానకొండూర్): పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు బీ టీఆర్ ఫౌండేషన్ బాధ్యులు. ఇ ల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బెంద్రం తిరుపతిరెడ్డి 2020లో స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. సంస్థ పేరిట ఇప్పటి వరకు ఎవరి నుంచి విరాళాలు సేకరించలేదని, తన సొంత పొల ం 7 ఎకరాలు అమ్మి పేదలకు సాయం చేస్తున్నట్టు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. కరోనా సమయంలో 505 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.2 వేల చొప్పున 12 రకాల ఆహార వస్తువులు అందించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు (దాదా పు 965) 50 కిలోల చొప్పున బియ్యం అందజేశారు. 520 మంది ఆడపిల్లల వివాహానికి రెండు టే కు మంచాల చొప్పున అందజేశారు. ఐదేళ్ల నుంచి వి నాయక మండపాలకు ధూప దీప నైవేద్య ఖర్చులకు గాను మండలంలోని ప్రతి మండపానికి రూ. 5వేలు అందజేస్తున్నారు. 2010 నుంచి వేసవిలో ఇల్లంతకుంట బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ఏ ర్పాటు చేసి ప్రయాణికుల దప్పిక తీరుస్తున్నారు. అ ంతేకాకుండా మండలంలోని విద్యార్థులకు బస్సు పాసులు అందించడంలో సాయం చేస్తుంటారు. ఇ లా మండలంలోని పేదలకు తిరుపతిరెడ్డి సహాయ సహకారాలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి సహకరిస్తాం
కరీంనగర్కల్చరల్:కరీంనగర్లో ఇస్కాన్ మందిర నిర్మాణానికి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ సహకరిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమా ర్ పేర్కొన్నారు. జూలై 5న నిర్వహించే జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. కరీంనగర్ ఇస్కాన్శాఖ పక్షాన జరుగుతున్న 4వ రథయాత్రను విజయవంతం చేయాలని సూచించారు. కరీంనగర్ పురవీధుల్లో 4వ జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా సాగాల ని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నా రు. జగన్నాథ రథయాత్ర పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. తాను కూడా తప్పకుండా రథయాత్రలో పాల్గొంటానని తెలిపారు. ఇస్కాన్ కరీంనగర్శాఖ నిర్వాహకులు ప్రభు నరహరిదాస్, కన్నకృష్ణ, ఎల్ రాజభాస్కర్రెడ్డి, తుమ్మల రమేశ్రెడ్డి, కెప్టెన్ బుర్ర మధుసూదన్రెడ్డి, కొమురవెల్లి వెంకటేశం, పోరెడ్డి శ్రీహరిరెడ్డి, గోపాల్రెడ్డి పాల్గొన్నారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి కరీంనగర్: నగరపాలక సంస్థలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి, పారదర్శకంగా డివిజన్ల ఏర్పాటు ప్రక్రియను కొనసాగించాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలో మాట్లాడుతూ కార్పొరేషన్లో 5వేల ఓట్లు కలిగిన డి విజన్లకు మాత్రమే రూపకల్ప చేయాలని జీవో269ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, డివిజన్ల ఏర్పాటు, ఓట్లు మార్పులు, చేర్పులకు ఎంపీ ఓవైసీ, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య ఈనెల 16న హైదరాబాద్లో చర్చలు జరిగా యని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకముందే ఇలాంటి చర్చలు జరిపి జీవో 12ను ఉల్లంఘించే అవకాశం ఉందన్నా రు. కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ పారదర్శకంగా డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, పెండ్యాల మహేశ్కుమార్, కెంసారం తిరుపతి, తుల భాస్కర్రావు పాల్గొన్నారు. ‘మీ అభ్యంతరాలు ఆమోదించాం’ ● బల్దియా వ్యక్తిగత లేఖలు కరీంనగర్ కార్పొరేషన్: డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి నగర పాలకసంస్థ సమాధానాలు పంపిస్తోంది. వ్యక్తిగతంగా వారు తెలిపిన అభ్యంతరా లు, పరిష్కరించడాన్ని తెలియజేస్తూ లేఖలు అందిస్తోంది. నగరంలోని 66 డివిజన్ల పునర్విభజన సందర్భంగా జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్పై ఈ నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడం తెలి సిందే. పది డివిజన్లు మినహా 56 డివిజన్ల నుంచి 242 అభ్యంతరాలు వచ్చాయి. ఈ అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిజమైనవని తేలితే వాటిని పరిష్కరించారు. మిగతా వాటిని తిరస్కరించారు. 16వ తేదీతో అభ్యంతరాల పరిశీలన ముగియగా, తుది జాబితాను 20వ తేదీ ప్రభుత్వానికి పంపించడం తెలిసిందే. ఆ తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారికి సమాధానాలు పంపించే ప్రక్రియను నగరపాలకసంస్థ అధికారులు చేపట్టారు. డివిజన్ల హద్దులు, ఇంటి నంబర్లపై వ్యక్తంచేసిన అభ్యంతరాలను ఆమోదిస్తే, ‘మీ అభ్యంతరాలు ఆమోదించామని’, తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియచేస్తూ సమాధానాన్ని లేఖ రూపంలో వ్యక్తిగతంగా అందజేస్తున్నారు. ఉపాధ్యాయులకు పర్యవేక్షణ సరికాదు కరీంనగర్: ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అవాల నరహరి, చకినాల రాంమోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తి రోగమన చర్య అన్నారు. ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యాప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనాలోచితమన్నారు. -
‘ఫీజు నియంత్రణ’ ఏది?
● ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల వసూళ్లపై చర్యలు శూన్యం ● కానరాని గవర్నింగ్ బాడీ ● చోద్యం చూస్తున్న విద్యాశాఖకరీంనగర్: పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ చట్టం అమలుకు నోచుకోవడం లేదు.చట్టం తమ చుట్టమన్నట్లుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తు న్నాయి. వీరికి రాజకీయ, ధన బలం ఉండడంతో.. ఫీజు నియంత్రణపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేయడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ఏం చెబుతోంది.. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి విద్యార్థికి విద్యనందించాలి. పాఠశాల స్థాయిలో ఫీజు నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు అందినకాడికి దో చుకుంటున్నాయి. అధిక ఫీజులు వసూలు చేస్తు న్నా వీటివైపు ఏ ఒక్కరూ కన్నెత్తి చూడకపోవడం పేద విద్యార్థులకు శాపంగా మారుతోంది. ఊసే లేని గవర్నింగ్ బాడీ ట్రస్టు పేరుతో పాఠశాలను ఏర్పాటు చేస్తేనే ఆ విద్యాసంస్థకు ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. అలా ఏర్పాటైన పాఠశాలకు తప్పనిసరిగా గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేయాలి. ట్రస్టు చైర్మన్, కరస్పాండెంట్, హెచ్ఎం, టీచర్, పేరెంట్తో గవర్నింగ్ బాడీని నియమించి.. ఏయే తరగతులకు ఎంత ఫీజు తీసుకోవాలి.. అర్హత మేరకు ఉపాధ్యాయులకు జీతం ఎంత చెల్లించాలనే నిర్ణయం తీసుకోవాలి. ఒక్క కరీంనగర్లోనే ప్రైవేట్, కార్పొరేట్ కలిపి దాదాపు 200 వరకు పాఠశాలలున్నాయి. కొన్ని పాఠశాలల్లో పేపర్పై మాత్రమే గవర్నింగ్ బాడీని చూపించి.. మిగిలిన పనులను యాజమాన్యమే చక్కదిద్దుకుంటోంది. కానరాని ఫీజు పట్టిక ప్రతి పాఠశాలలో తరగతివారీగా ఫీజు వివరాల ను నోటీసు బోర్డులో ఉంచాలి. ఉపాధ్యాయుల అర్హత వివరాలను పొందుపరచాలి. చాలా పాఠశాలల్లో ఫీజు పట్టికను ఏర్పాటు చేయడం లేదు. ఫీజు నియంత్రణ అంశంపై సాధారణ ప్రజలకు తెలియకపోవడం సాధారణం. అయితే విద్యావంతులైన అధికారులకు ఫీజు నియంత్రణ చట్టంపై కొంత వరకై నా అవగాహన ఉంటుంది. అయినా వారు నోరు మెదపకపోవడంపై సర్వ త్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ధారాదత్తం చేయడానికే.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, జూనియర్ కళా శాలల్లో అత్యధిక భాగం రాజకీయ నాయకులు, ప్రముఖులవే కావడంతో ఫీజు నియంత్రణ చట్ట మున్నా అమలు చేయడం లేదంటూ విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. అధికారులు సైతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. గుర్తింపు లేకున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. -
ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకం
● చింతకుంటలో సర్వాయి పాపన్న విగ్రహావిష్కరణలో మంత్రి పొన్నంకొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ స్థలాల్లో ఈత, తాటి చెట్ల పెంపకానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని, ప్రభుత్వ స్థలాలు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకురావాలని బీసీ సంక్షేమం, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. చింతకుంటలో ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద కల్లు గీత కార్మిక సొసైటీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 40 లక్షల తాటి, ఈత మొక్కలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వనమహోత్సవంలో భాగంగా ఈ మొక్కలను ఈ ఏడాది నాటాలని సూచించారు. చింతకుంటలో కల్లు కంపౌండ్ నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. గోల్కొండను పాలించిన మొట్టమొదటి తెలంగాణ రాజు పాపన్నగౌడ్ అని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ భావితరాలకు స్ఫూర్తిదాయంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, సర్వాయి పాపన్న గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి పరుశరాంగౌడ్, జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, పొన్నం సత్యనారా యణ గౌడ్. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల స్వామిగౌడ్, నాయకులు పెరుమాండ్ల రామస్వామి గౌడ్, పిల్లి మహేశ్గౌడ్, బొమ్మ ఈశ్వర్ గౌడ్ పాల్గొన్నారు. -
సమగ్ర అభివృద్ధికి బాటలు వేద్దాం
● పథకాల అమలులో పారదర్శకత పాటించాలి ● కష్టకాలంలోనూ పథకాలు అమలు చేస్తున్నాం ● విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ● జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ● మూడు శాఖలపై నాలుగు గంటలపాటు సమీక్షకరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమగ్ర అభివృద్ధికి బాసటగా నిలవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో వ్యవసాయం, విద్య, హౌసింగ్ శాఖలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబుతో కలిసి నాలుగు గంటలపాటు సమీక్షించారు. వర్షాభావ పరిస్థితులు, క్రాప్ బుకింగ్, సాగు వివరాలు, విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుభరోసా, ఆయిల్ పాం సాగు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, గ్రౌండింగ్తీరును ఆయా జిల్లాల కలెక్టర్లు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్త పరిస్థితులను సరిచేస్తూ.. పాలన సాగిస్తున్నామని, ఎక్కడా ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. జూలై వరకు అవసరమైన విత్తనాలు, ఎరువుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అవసరమైన మేరకే యూరి యా వాడాలన్నారు. ఆయిల్పాం సాగుపై మరింత శ్రద్ధ చూపి జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని మించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, విద్యాశాఖ అధికారులు శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయించాలన్నారు. ● రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిరుపేదలందరికీ ఇందిర మ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యేల దృష్టిలో ఉన్న నిరుపేదల జాబితాను కలెక్టర్లకు అందిస్తే ఇందిరమ్మ కమిటీలో చర్చించి పార్టీలకతీతంగా మంజూరు చేస్తామన్నారు. కూరగాయ ల సాగు విస్తరించాలని, కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ● మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేస్తున్నందుకు మంత్రి తుమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు ఆయిల్ పాం సాగువైపు దృష్టి సారించాలన్నారు. క్యాష్ క్రాప్స్, హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలన్నారు. ● వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని, రైతుభరోసా ఖాతాల్లో జమ అవుతోందని తెలిపారు. వేములవాడలో సూరమ్మ ప్రాజెక్టు, శ్రీపాద నారాయణపురం ప్రాజెక్టుల భూ సేకరణ నిధులు విడుదల చేయాలని కోరారు. ● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలన్నారు. తాను 48 ఎకరాల్లో ఆయిల్ పాం సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఆయిల్ పాం ప్రాసెస్ యూనిట్ను చిగురుమామిడిలో ఏర్పాటు చే యాలని కోరారు. కరీంనగర్లో గతంలో సీఎం స్పెషల్ ఫండ్ కింద రూ.350 కోట్లతో 120రోడ్ల పనులు ప్రారంభించామని, వాటిని పూర్తి చేయి ంచాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి డైనమిక్ లైటింగ్ వ్యవస్థ పనితీరు పర్యవేక్షించాలన్నారు. ● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ జగిత్యాల ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పిస్తున్నామని, పంటకు ధర పెంచేలా చూడాలని అన్నారు. ● కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో ఎమ్మెల్యేల జాబితాను పరిగణనలోకి తీసుకోవాలని కోరా రు. మెట్పల్లి హైస్కూల్ శిథిలావస్థలో ఉందని, పక్కనే జూనియర్ కళాశాల భవనం 80శాతం పూర్తయిందని, దానిని పూర్తి చేసి స్కూల్ పిల్లలను ఆ భవనానికి తరలించాలని అన్నారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాల పనులు పూర్తిచేయాలని కోరారు. ● పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ వ్యవసాయంపై గ్రామాల్లో సదస్సులు పెట్టి రైతులకు సలహాలు, సూచనలను శాస్త్రవేత్తల ద్వారా ఇప్పించామన్నారు. పంట మార్పిడిపై ప్రచారం చేయాల్సిన అవస రం ఉందన్నారు. ఐదేళ్లుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట తగ్గిపోతోందని, వరి, మొక్కజొన్న సాగు పెరుగుతోందని అన్నారు. ● రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఎత్తిపోతలు పూర్తి చేయడంతో అంతర్గాం, పాలకుర్తి మండలాలకు తొలిసారి సాగునీరు వచ్చిందని, గతం కంటే రెండింతల పంట పండుతోందని తెలిపారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, కేశోరాం సిమెంట్ వంటి సంస్థల డీఎంఎఫ్టీ నిధులు జిల్లాకు రావడం లేదని అన్నారు. ● మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం, సామాన్య, గణితం వంటి విద్యా ప్రమాణాలు పెంచేలా చూడాలన్నారు. వృత్తి విద్యా కోర్సుల ద్వారా యువతను ప్రయోజకులను చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటును స్వాగతించారు. ● చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ చొప్పదండి ప్రాంతంలోని చేనేత కార్మికుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, గంగాధర మండలానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. ● సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల కలెక్టర్లు పమేలా సత్పతి, కోయ శ్రీహర్ష, సందీప్ కుమార్ ఝా, సత్య ప్రసాద్, రాష్ట్ర మినిమం వేజ్బోర్డు సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్, కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల గ్రంథాలయ సంస్థ చైర్మన్లు సత్తు మల్లేశం, కేడం లింగమూర్తి, నాగుల సత్యనారాయణ, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.అకడమిక్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపనకరీంనగర్క్రైం: కరీంనగర్లోని మానేరు డ్యాం సమీపంలో ఉన్న శాతవాహన ఫార్మసీ కళాశాలలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ నిర్మాణానికి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో నాణ్యత ప్రమాణాలు పెంచుతామని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ శాతవాహన విశ్వవిద్యాలయ అభివృద్ధికి అన్నివిధాల సహకరిస్తామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ పీఎం ఉష నిధులను ఈ అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి కేటాయించినట్లు తెలి పారు. ఇందులో 60శాతం కేంద్ర ప్రభుత్వం, 40శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. వీసీ ఉమేశ్కుమార్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో సదుపాయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. -
అర్హులా.. అనర్హులా!
● చేయూత పింఛన్లపై సామాజిక తనిఖీ ● త్వరలో ఫేస్ రికగ్నైజేషన్తో పింఛన్లు కరీంనగర్ అర్బన్: చేయూత(ఆసరా) పింఛన్లపై సామాజిక తనిఖీలు (సోషల్ ఆడిట్) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధి హామీ పనులకు ఎలాగైతే ఆడిట్ చేయిస్తున్నారో అదే తరహాలో పింఛన్లను ఆడిట్ చేయించనున్నారు. అనేక మంది అనర్హులకు పింఛన్లు వస్తున్నాయనే ఆరోపణలున్నాయి. జిల్లాలో గతేడాది 212మంది సర్వీస్ పింఛన్తో పాటు చేయూత(ఆసరా) పింఛన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. దీంతో అధికారులు చేయూత పింఛన్లను రద్దు చేశారు. అనేక మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి నివేదిక అందడంతో ఆడిట్ చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం. సామాజిక తనిఖీలతో అక్రమాలు బహిర్గతం జిల్లాలో 1.23లక్షల మంది వివిధ పింఛన్లు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీ ప్రాంతాల వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టాఫీసు ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, నడవలేనివారు, బయోమెట్రిక్ కోసం వేలిముద్రలు నమోదు కానివారికి ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శి వేలిముద్రలతో పింఛన్లు డ్రా చేస్తున్నారు. ఈ పింఛన్లు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అని ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. పింఛన్లపై ఆడిట్ నిర్వహిస్తే అనర్హుల గుట్టు రట్టవుతుందని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు సైతం పింఛన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హుల పేర్లు తొలగిస్తే ప్రభుత్వానికి ఖర్చు తగ్గడంతో పాటు మరికొందరు అర్హులకు కొత్తగా పింఛన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆధార్కార్డులో మార్పులతో అనర్హులు ఆసరా పింఛన్ పొందుతున్న వారిలో కొందరు ఆధార్కార్డుల్లో వయసును దిద్దించారు. తమకు ఎక్కువ వయస్సు ఉందని అధికారులను నమ్మించి పింఛన్లు పొందారు. అనర్హులు పింఛన్లు పొందుతున్నారంటూ గతంలోనే కలెక్టర్కు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ వ్యవహారంలో కొందరు నేతలు సిఫార్సు చేసిన వారికి అధికారులు ఎలాంటి విచారణ లేకుండానే పింఛన్లు మంజూరు చేసినట్లు సర్వత్రా ఆరోపణలు వినిపించాయి. లబ్ధిదారులు మృతిచెందిన వెంటనే వారికి పింఛన్ నిలిపివేయాలి. కాని పట్టణాల్లో లబ్ధిదారుడు మృతి చెందిన తర్వాత మూడునాలుగు నెలల పాటు పింఛన్లు వారి ఖాతాల్లో జమవుతున్నాయి. కరీంనగర్, హుజూరాబాద్ కేంద్రానికి సమీపంలో ఉండే గ్రామంలో పలువురు మహిళలు ఒంటరి మహిళ పేరిట పింఛన్లు తీసుకుంటున్నారు. వాస్తవానికి వీరు వివాహమైనవారే. భర్తతో విడిపోయి తల్లిదండ్రుల ఇంటి వద్దే ఉండడంతో మానవత్వంతో వీరికి ఒంటరి మహిళల కోటాలో పింఛన్లు మంజూరు చేశారు. ఆ తర్వాత వీరు మళ్లీ వారి భర్తల ఇళ్లకు వెళ్లిపోయారు. కానీ ప్రతీ నెల పుట్టింటికి వచ్చి పింఛన్ తీసుకుంటున్నారు. ఇలా అనేక మంది అనర్హులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. ముఖ ధ్రువీకరణతో పింఛన్లు త్వరలో ‘ముఖ చిత్రం ధ్రువీకరణ’ విధానం తీసుకరావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే అధికారులకు, ఉద్యోగులకు సెర్ప్ అధికారులు అవగాహన కల్పించారు. మరికొందరు వేలిముద్రలు, ఐరిష్ రాని వృద్ధుల పింఛన్లను ఆయా గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు తన వేలు ముద్రలు వేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడంతో అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. ఇలాంటి అక్రమాలు అరికట్టడానికి ప్రభుత్వం మొబైల్ ఫోన్ తరహా యంతాల్లో ఫెషియల్ అథంటిఫికేషన్కు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి ముఖం చిత్రం స్కానింగ్ ద్వారా లబ్ధిదారుల పింఛన్ డబ్బులను బ్యాంకు ఖాతాల్లో వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.జిల్లాలో లబ్ధిదారులు : 1,23,641 వృద్ధాప్య పింఛన్దారులు : 48,918వితంతు : 34,229దివ్యాంగులు : 20,702గీత కార్మికార్మికులు : 3,767చేనేత : 2,817ఒంటరి మహిళలు : 3,271బీడీ కార్మికులు : 9,937 -
అలా చేస్తే.. కేంద్రం ఇజ్జత్ పోయేది: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందేనని.. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ ప్రభుత్వం రక్షణ కవచంలా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క స్కాంలో కూడా కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణా ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.‘‘కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా మారింది. నిజాయితీగా పదకొండేళ్ల నుంచి పాలన చేస్తోన్న మోదీ నుంచి అమిత్ షా అందరూ అదే చెప్పారు. కాళేశ్వరం అవినీతి, అక్రమాలతో కూడిన ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన అధికారులే వందల కోట్లు సంపాదించుకున్నారు. ఈ అవినీతిపై విచారణను రేవంత్ సర్కార్ అధికారులకే పరిమితం చేయొద్దు. సీడబ్ల్యూసీ 1986 నుంచి 2013 వరకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉన్నదంటే.. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నీటి లభ్యత ఎందుకు కనిపించలేదు..?’’ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు.‘‘ఈ రిపోర్ట్ ప్రకారం ప్రాజెక్టు కడితే 38 వేల కోట్లలో ప్రాజెక్టు కడితే.. ఇవాళ లక్షా 20 వేల కోట్లు అయ్యేవా?. జాతీయ హోదా ఇస్తే కేంద్రం ఇజ్జత్ పోయేది. ఇంకా సిగ్గు లేకుండా జాతీయ హోదా అడుగుతున్నారు. ఎన్డీఎస్ఏ తాగి కూర్చున్న కమిటీ కాదు.. చట్టబద్ధంగా ఏర్పడిన కమిటీ. క్యాబినెట్లో ఎప్పుడు పెట్టారు?. ఎప్పుడు సబ్ కమిటీ నివేదిక ఇచ్చింది?. ఎప్పుడు ప్రాజెక్ట్ ప్రారంభించారో రేవంత్ ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదు..?. కాళేశ్వరం లేకున్నా ఇవాళ పంట దిగుబడి ఎందుకు పెరిగిందో బీఆర్ఎస్ చెప్పాలి. రేవంత్ సర్కార్ వచ్చాక వారు విచారణ చేయరు.. సీబీఐకి అప్పగించరు’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
లెక్చరర్లు లేరు.. చదువులెట్లా?
● జూనియర్ కళాశాలల్లో వెక్కిరిస్తున్న ఖాళీలు ● కానరాని ఫిజికల్ డైరెక్టర్లుకరీంనగర్: సకల వసతులు కల్పించి విద్యార్థులను ఆకర్షించేలా ప్రభుత్వం కృషి చేస్తున్నా.. సరిపడా బోధన, బోధనేతర సిబ్బంది లేక ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వెలవెలబోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా తెరచుకు న్న ప్రభుత్వ కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ప్రభుత్వ కళాశాలల్లో పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రవేశాలు పొందుతారు. బడుగు విద్యార్థుల బాగోగులే తమ లక్ష్యమని గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరించకపోవడాన్ని చూస్తుంటే విద్యావ్యవస్థపై ఎంతటి ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ కళాశాలలుండగా.. పది కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా వెక్కిరిస్తున్నాయి. జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో మాత్రమే ఒకే ఒక్క ఫిజికల్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తున్నాడు. మిగతా పది మంది ఫిజికల్ డైరెక్టర్లు లేకపోవడం చూస్తుంటే వ్యాయామ విద్యపై ఎంతటి మక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లతో కళాశాలల్లో తరగతులు బోధిస్తున్న ప్రభుత్వం.. గత విద్యాసంవత్సరంలో వారినే ఎక్కడికక్కడ రెగ్యులరైజ్ చేయడంతో బోధన సిబ్బంది కొరత కొంత తీరినట్లయింది. లైబ్రేరియన్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్ల నియమాక ప్రక్రియకు సంబంధించి గత విద్యాసంవత్సరంలో కొన్ని పోస్టులు భర్తీ కాగా.. మరికొన్ని పోస్టులు ఖాళీలుగానే వెక్కిరిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా సీనియర్ అసిస్టెంట్ పోస్టులు మరో ఐదు ఖాళీలుగానే ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సబ్జెక్టులవారీగా లెక్చరర్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం ప్రైవేట్ కళాశాలల్లో చదివేందుకే మొగ్గు చూపుతుండడం గమనార్హం. కళాశాలలు ప్రారంభమవుతుండడంతో.. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఆన్లైన్లో కొనసాగుతోంది. మరో వారం రోజుల్లో మొదటి విడత ప్రక్రియ ముగియనుంది. మున్ముందు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కళాశాలల్లో లెక్చరర్లు లేకపోవడంతో పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొంది. ఇకనైనా ఇంటర్ విద్యావ్యవస్థపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని పలువురు విద్యాభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పరిధిలోని అంశం జిల్లాలో 11 జూనియర్ కళాశాలలున్నాయి. నేటి నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 15 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 19 మంది గెస్ట్ లెక్చరర్లు, పది మంది ఫిజికల్ డైరెక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బోధనేతర సిబ్బంది పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నియామకాలకు సంబంధించిన ప్రక్రియ ఇంటర్మీడియట్ విద్యామండలి, ప్రభుత్వ పరిధిలోని అంశం. ప్రస్తుతం బోధనకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటాం. – గంగాధర్, డీఐఈవోసవతి తల్లి ప్రేమ తగదు ప్రభుత్వ విద్యావ్యవస్థపై పాలకులకు పట్టింపు లేదు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైమరీ, ఇంటర్, ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా చేసిన పాలకుల వైఖరిని ఎండగట్టేందుకు విద్యార్థి లోకం ఏకం కావాల్సిన అవసరముంది. ఇకనైనా ప్రభుత్వం విద్యావ్యవస్థపై సవతి తల్లి ప్రేమను విడనాడాలి. కీలకమైన ఇంటర్ బోధనపై ప్రభుత్వం దృష్టి సారించాలి. – మచ్చ రమేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శిఇంటర్ కళాశాలల్లో ఖాళీలిలా.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు: 11 కాంట్రాక్ట్ లెక్చరర్లు: 15 గెస్ట్ లెక్చరర్లు: 19, ఫిజికల్ డైరెక్టర్లు: 10 -
న్యాయం చేయండి
మంథని: పోలీసులకు భయపడి తన కుమారుడు ఆత్మాహత్యకు యత్నించి ఇప్పుడు అచేతనా స్థితిలోకి వెళ్లాడని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం, స్థానికులతో కలిసి శనివారం పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో ధర్నాకు దిగింది. అచేతనా స్థితిలో తన కుమారుడిని అంబులెన్స్లో ఉంచి ఆవేదన వ్యక్తం చేశారు. యువకుడి తల్లి శీలం రాజేశ్వరి కథనం ప్రకారం.. మంథని పట్టణంలోని శ్రీపాదకాలనీకి చెందిన తన కుమారుడు రాజ్కుమార్ ఎంగేజ్మెంట్కు వెళ్లి ఇంటికి వస్తుండగా వడ్లకల్లం వద్ద ఇద్దరు దోస్తులు మాట్లాడుకొని ఒకరినొకరు చిన్నగా కొట్టుకున్నారు. మరుసటి రోజు 30 మంది దాకా వచ్చి కేసు పెట్టారు. దీంతో రాజ్కుమార్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కొట్టడంతో మనస్తాంపం చెందాడు. తన కుమారుడిని అన్యాయంగా పోలీస్స్టేషన్ తీసుకెళ్లారని, కొంతమంది ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతూ పోలీసులు కొట్టారని ఆమె వివరించింది. ఈ క్రమంలో అవమానంతో మనదపడుతూ స్నానానికి వెళ్లి బాత్రూంలేనే ఉరివేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతున్నాడు. అయినా, ఇంకా కోలుకోలేదు. దీంతో రాజ్కుమార్ను అంబులెన్స్ లోనే తల్లిదండ్రులు, బంధువులు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు తీసుకొచ్చారు. మంథని ఎస్సై, కానిస్టేబుల్, స్థానిక మాజీ కౌన్సిలర్, ప్రజాప్రతినిధులు, మరికొందరు హమాలీ కార్మికులపై చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాధితులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పారు. అచేతనా స్థితిలోని కుమారుడితో ధర్నా పోలీసులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ -
చట్టాలు తెలియక కటకటాల్లోకి..
సిరిసిల్ల: బతుకుదెరువు కోసం ఉన్న ఊరిని, కన్నవారిని, కట్టుకున్న భార్యను వదిలి గల్ఫ్ దేశం వెళ్తే.. అక్కడి చట్టాలు తెలియక జైలుపాలైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన నక్క బాలనర్సు సౌదీ అరేబియాలో జైలుపాలయ్యాడు. తన భర్తను విడిపించాలని కోరుతూ అతని భార్య దేవేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించింది. సౌదీ చట్టాలపై అవగాహన లేకపోవడంతో మూడున్నర ఏళ్ల జైలుశిక్ష పడింది. ప్రస్తుతం రియాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న జైలుపాలైన బాలనర్సుకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ద్వారా న్యాయ సహాయం అందించి, క్షమాభిక్ష ఇప్పించాలని అతని భార్య నక్క దేవేంద్ర హైదరాబాద్ ప్రజాభవన్లోని ‘ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, సెలవుపై సౌదీ నుంచి వచ్చిన సామాజిక సేవకులు ఆసాని రాజిరెడ్డి, మహ్మద్ నవీద్లతో కలిసి సీఎం ప్రజావాణి ఇన్చార్జి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్ను కలిసి గోడు వినిపించారు. ఇంటి డ్రైవర్ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా బాలనర్సు తన అరబ్ యజమాని పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లేవాడని తెలిపింది. పిల్లలతో స్నేహపూర్వక ప్రవర్తనను యజమాని అపార్థం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థానిక ఆచార వ్యవహారాలు, సున్నితత్వం తెలియకపోవడంతో అపోహలకు దారితీసి జైలుపాలయ్యాడని ఆమె తెలిపారు. వెంటనే స్పందించిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి దివ్యదేవారాజన్, రాష్ట్ర ఎన్నారై విభాగం ఐఏఎస్ అధికారి సీహెచ్ శివలింగయ్యతో మాట్లాడారు. రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తూ, సౌదీ అధికారుల వద్దకు క్షమాభిక్ష అభ్యర్థనను పంపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గల్ఫ్ బాటలో జైలుపాలైన బాలనర్సు విడుదల కోసం అతని కుటుంబం నిరీక్షిస్తోంది. సౌదీ జైలులో మండెపల్లివాసి విడుదల చేయాలని ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన వలసజీవి భార్య మూడున్నరేళ్ల జైలుశిక్ష క్షమాభిక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ సహాయం కోరిన కుటుంబం స్పందించిన ఐఏఎస్ అధికారిణి దివ్యదేవరాజన్ -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకు గాయాలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ ఆఫీస్ ఎదుట శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏతోపాటు మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. వీఆర్ఏ పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు. మండల కేంద్రానికి చెందిన బాధ పెద్దరాములు తహసీల్దార్ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేస్తున్నారు. శనివారం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. రాజన్నపేటకు చెందిన తిమోతి అనే యువకుడు బైక్పై వేగంగా వస్తూ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రాములు కుడికాలు విరిగింది. తిమోతి స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాములను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నంది కిషన్, బండారి బాల్రెడ్డి, బాధ రమేశ్ పరామర్శించారు. తహసీల్దార్ సుజాత రాములును పరామర్శించి, పరిస్థితి గురించి తెలుసుకున్నారు. రెవెన్యూశాఖ తరఫున తక్షణసాయంగా రూ.20వేలు ఆర్ఐ శ్రావణ్మార్ రాములు కుటుంబానికి అందజేశారు. పరిస్థితి విషమం -
జీతం.. సతమతం
కరీంనగర్ అర్బన్: పాడి పరిశ్రమ వృద్ధిలో కీలక పాత్ర పోషించే గోపాలమిత్రలు వేతనాలు అందక మదనపడుతున్నారు. గౌరవ వేతనంతో సేవలందిస్తుండగా 9నెలలుగా సదరు వేతనం లేక ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 9నెలల గౌరవ వేతనం రాకపోవడంతో అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పశు సంపద అభివృద్ధి కోసం గ్రామాల్లో విస్తృతంగా సేవలందిస్తున్నా సక్రమంగా వేతనాలు రాక సతమతమవుతున్నారు. ఆర్ఎంపీల్లా గోపాలమిత్రలు 2000 సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ (డిస్ట్రిక్ లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ (డీఎల్డీఏ)) ద్వారా గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేశారు. జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంతో పాటు పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స అందిస్తున్నారు. నట్టల నివారణ మందులు, వాక్సినేషన్, బీమా చేయడం పశువైద్యుల సూచనల మేరకు అన్ని రకాల వైద్య సేవలను అందిస్తున్నారు. వేతనంలో 40 చొప్పున కట్ ఆయా మండలాల్లో ఉన్న గోపాలమిత్ర సిబ్బంది నెలకు 80నుంచి 120 పశువులకు కృత్రిమ గర్భధారణ (నేమన్) చేయాలి. దీనికి గోపాలమిత్ర సిబ్బంది రూ.40 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది. ప్రతి నెలా నిర్ధేశించిన లక్ష్యాన్ని గోపాలమిత్రలు పూర్తి చేయాల్సిందే. లేదంటే నెల జీతంలో కోత తప్పదు. ఒక్కో పశువుకు రూ.40 చొప్పున వారి వేతనం నుంచి కట్ చేస్తారు. ఒక్కోనెల అనుకున్న లక్ష్యం పూర్తి చేయకపోవడంతో ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం కనీసం రెండు వేలు కూడా రావడం లేదని గోపాలమిత్రలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారం జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ(డీఎల్డీఏ) ద్వారా పశు సంవర్థకశాఖలో ఉమ్మడి జిల్లాలో 135 మంది గోపాలమిత్ర సిబ్బంది పని చేస్తున్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం రూ.11,050 చొప్పున గౌరవవేతనం అందిస్తోంది. చాలీచాలనీ వేతనం కూడా ప్రతినెలా అందడం లేదు. జిల్లాలో ఇప్పటికే గోపాలమిత్రలకు ఏడు నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం అందించాల్సిన పారితోషికం సైతం రాలేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు గోపాలమిత్ర సిబ్బంది వాపోతున్నారు. గోపాలమిత్రలకు 9నెలలుగా అందని వేతనం కృత్రిమ గర్భధారణ లక్ష్యం పూర్తికాకుంటే జీతంలో కోత -
తూకంలో తేడాపై రోడ్డెక్కిన రైతులు
సిరిసిల్లఅర్బన్: ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో తేడాపై ఇల్లంతకుంట మండలానికి చెందిన రైతులు శనివారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని ముస్కానిపేట, గాలిపల్లి, చిన్నకేసన్నపల్లి, పత్తికుంటపల్లి, తాళ్లపల్లి గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ ఐకేపీ ద్వారా విక్రయించిన సన్ఫ్లవర్ పంట తూకంలో వచ్చిన క్వింటాళ్లు మార్క్ఫెడ్ తీసుకున్న తూకానికి తేడా వస్తుందన్నారు. ఒక్కో రైతుకు మూడు క్వింటాళ్ల వరకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ సందీప్కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి డీఆర్డీవో శేషాద్రిని పిలిపించి తూకంలో తేడాలపై విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం రైతులు డీఆర్డీవోకు వివరాలతో కూడిన వినతిపత్రం అందించారు. సుధాకర్రెడ్డి, ఐదు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీవోకు వినతిపత్రం -
ఉత్సాహంగా యోగా
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్క్రైం: జిల్లావ్యాప్తంగా యోగాడేను ఉత్సాహంగా జరుపుకున్నారు. వివిధ రకాల యోగాసనాలు వేసి ఆరోగ్యసూత్రాలను వివరించారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో పతంజలి యోగా సమితి, భారత్ స్వామిమాన్ ట్రస్ట్, యువభారత్, ఆయూష్ డిపార్ట్మెంట్లు సంయుక్తంగా నిర్వహించిన యోగాడేలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వై.సునీల్ రావు, గుగ్గిళ్లపు రమేశ్, డీఎంహెచ్వో వెంకటరమణ, యువభారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్ పాల్గొన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ, యోగా అసోసియేషన్ సంయుక్తంగా ప్రాంతీయ క్రీడా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగాలో జాతీయస్థాయిలో రాణించిన వారిని సత్కరించారు. రాష్ట్ర యోగా అసోసియేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు తుమ్మల రమేశ్ రెడ్డి పాల్గొన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే మైదానంలో వికాస తరంగణి, ప్రజ్ఞ వికాస్ ఆధ్వర్యంలో, పరేడ్గ్రౌండ్లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్, పోలీసులు పాల్గొన్నారు. -
ప్రమాదాలకు నిలయంగా రేకుర్తి వంతెన
కొత్తపల్లి(కరీంనగర్): రేకుర్తిలోని వంతెనపై తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం మధ్యాహ్నం ఓ షిఫ్ట్కారు వంతెనపెకి దూసుకెళ్లింది. అదుపుతప్పి వాగులో పడితే పెద్ద ప్రమాదమే జరిగుండేది. ఇలాంటి ప్రమాదాలు నిత్యం చోటుచేసుకుంటున్నా వంతెనకు రక్షణ చర్యలపై దృష్టి సారించడం లేదు. సంబంధిత అధికారులు స్పందించి వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పురాతన వంతెన కరీంనగర్ శివారు రేకుర్తిలోని పురాతన వంతెన ప్రమాదాలకు నిలయంగా మారింది. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై గల వంతెన సైడ్బర్మ్స్ శిథిలావస్థకు చేరి ప్రమాదాలు చోటుచేసుకుంటన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిని కలిపే ఈ వంతెనకు మరమ్మత్తులు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు. ఈ ప్రధాన రహదారిపై గల పాత వంతెన మీదుగా జగిత్యాల వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రయాణిస్తుంటాయి. నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. దీంతో తరచూ రేకుర్తి వంతెన సమీపంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో గతంలో పలువురు చనిపోగా.. మరికొంతమంది గాయాల బారిన పడి బయటపడ్డారు. అయితే ఇరుకుగా ఉన్న వంతెన గోడలు దెబ్బతినడం..ఇరువైపుల రక్షణగా ఏర్పాటు చేసిన సైడ్బర్మ్స్ను వాహనాలు ఢీకొడుతుండటంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. -
గరుడ జంక్షన్పై కమిషనర్ ఆరా
సాక్షి ప్రతినిధి,కరీంనగర్: నగరంలోని పద్మనగర్ (గరుడ) జంక్షన్ పనులపై నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆరా తీశారు. రూ.కోటి జంక్షన్ పనులకు అదనంగా, టెండర్ లేకుండానే రూ.80 లక్షల పనులు కేటాయించడం, పనుల్లోనూ అక్రమాలకు ప్రయత్నిస్తుండడంపై ఈ నెల 19వ తేదీన ‘సాక్షి’లో వచ్చిన ‘స్మార్ట్ పన్నాగం’ కథనానికి ఆయన స్పందించారు. శనివారం పద్మనగర్లో జంక్షన్ పనులను కమిషనర్ సందర్శించారు. జంక్షన్ మ్యాప్ను పరిశీలించారు. ఎం–15, ఎం–30 డిజైన్లలో ఏ డిజైన్తో పనులు చేస్తున్నారంటూ అధికారులను ప్రశ్నించారు. పనుల ఒప్పందం, నిబంధనలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు, నాణ్య తను పాటించాలని ఆదేశించారు. ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు లచ్చిరెడ్డి, అయూబ్ఖాన్ ఉన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి కరీంనగర్కార్పొరేషన్: నగరం పరిశుభ్రంగా ఉండేలాచర్యలు తీసుకోవాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి ఆదేశించారు. పరిసరాల్లో చెత్త కనిపించకుండా చూడాలని, ప్రతి స్వచ్ఛ ఆటో డీఆర్సీ సెంటర్లకు రావాలన్నారు. శనివారం నగరంలోని పలు డివిజన్లలో పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. ఎస్ఆర్ఆర్ కళాశాల రిజర్వాయర్ పరిధిలోని డీఆర్సీ సెంటర్ను సందర్శించారు. డ్రై రిసోర్స్ కలెక్షన్కు సంబంధించిన రిజిస్టర్ను తనిఖీచేశారు. నగరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలన్నారు. తడి చెత్తను కంపోస్టు కేంద్రాలకు, పొడి చెత్తను డీఆర్సీ కేంద్రాలకు తరలించాలన్నారు. నర్సరీల్లో పెంచే మొక్కలు ఎండి పోకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు.● పద్మనగర్లో పనులు పరిశీలన -
రాగి తీగ దొంగల అరెస్ట్
మెట్పల్లి: ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ను ఎత్తుకెళ్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలను మెట్పల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. మోతె సాయి(22), పల్లపు మల్లేశం(32) ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కలిసి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్ల నుంచి రాగి తీగ, ఆయిల్ అపహరించి అమ్ముతూ వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు పక్కా సమాచారంతో ఇద్దరిని పట్టుకొని వారి నుంచి వంద కిలోల రాగి వైరు, ద్విచక్రవాహనం, చోరీలకు ఉపయోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇద్దరి అరెస్ట్ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కొత్తపల్లిలో రెండు లారీల ఢీ ● ఓ డ్రైవర్కు విరిగిన కాలు.. మరో డ్రైవర్, క్లీనర్కు గాయాలు కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలో శనివారం వేకువజామున రెండు లారీలు ఢీకొన్నాయి. కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారి కొత్తపల్లి చెరువు స మీపంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్లు నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు వెల్లడించారు. స్థానికులు, బ్లూకోల్ట్స్ పోలీసుల వివరాల మేరకు.. నిజామాబాద్లో రైస్మిల్లు సా మగ్రి ఖాళీ చేసి కరీంనగర్ వైపు వస్తున్న లారీ ఖ మ్మం నుంచి గ్రానైట్ లోడ్తో గంగాధర వైపు వెళ్తు న్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ముందు భాగాలు దెబ్బతిన్నాయి. గ్రానైట్ లోడ్తో ఉన్న లారీ కొత్తపల్లి చెరువులో పడిపోయింది. ఓ లారీ డ్రైవర్ పురుషోత్తంరెడ్డి, క్లీనర్లు లారీ నుంచి బయట పడగా తలకు గాయాలయ్యాయి. లారీ యజమాని సూచనల మేరకు హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజస్థాన్ రిజిస్ట్రేషన్ గల డ్రైవర్ భన్సీలాల్కు గాయాలు అధికంగా కావడంతో పాటు కాలు విరిగడంతో కరీంనగర్లోని ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కొత్తపల్లి పోలీసులు లారీలను పోలీస్స్టేషన్కు తరలించారు. -
తుదిదశకు కేబుల్ బ్రిడ్జి విచారణ!
కరీంనగర్: కరీంనగర్లోని మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెన పనుల్లో నాణ్యత లోపించిందని, రూ.కోట్ల దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చేపట్టిన విచారణ తుదిదశకు చేరుకుంది. నెలాఖరులోగా తీగల బ్రిడ్జి పనులపై నివేదిక అందజేయనున్నట్లు సమాచారం. మానేరువాగుపై నిర్మించిన తీగల వంతెనకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొదటగా రూ.80కోట్లు కేటాయించగా, అప్రోచ్ రోడ్లతో కలిపి రూ.224 కోట్ల వ్యయంతో పనులు పూర్తి చేశారు. వంతెనను ప్రారంభించిన నాలుగు నెలల్లోనే తారు దెబ్బతినడం, డిజిటల్ లైట్లు వెలగకపోవడంపై సామాజిక కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిరాద్యులు చేశారు. ప్రభుత్వం తీగల వంతెనకు నిధుల కేటాయింపు, పనులు జరిగిన తీరు, నాణ్యత ప్రామాణాలపై విజిలెన్స్ విచారణ చేపట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్స్పోర్స్మెంట్ రోడ్లు, భవనాలశాఖ విభాగం డీఎస్పీ ఎం.శ్రీనివాస్రావు ఆధ్వర్యంలోని బృందం పనుల నాణ్యతను పరిశీలించారు. విచారణ ఏడాది పాటు కొనసాగిందని, నివేదిక తుదిదశకు చేరుకుందని, నెలాఖరులోగా తుది నివేదిక అందజేసేందుకు సిద్ధం అయినట్లు అధికార వర్గాల వెల్లడించాయి. విజిలెన్స్ విచారణ హర్షణీయం విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్లోని మానేరువాగుపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో నిర్మించిన తీగల వంతెన పనుల నాణ్యత, అవినీతిపై విజిలెన్స్ విచారణ చేపట్టడం హర్షణీయమని సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, సహాయ కార్యదర్శులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లో శనివారం మాట్లాడుతూ.. సీపీఐ చేసిన పోరాటల ఫలితంగా ప్రభుత్వం స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశించిదన్నారు. తీగల వంతెన నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన కాంట్రాక్టర్, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
అప్పులబాధతో నేతకార్మికుడి ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: ప్రమాదంలో కాలువిరగడంతో పని చేయలేక.. అప్పులు తీర్చే మార్గం కనిపించక సిరిసిల్లలో నేతకార్మికుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్కు చెందిన నేతకార్మికుడు వలస రమేశ్(48) పవర్లూమ్స్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం రమేశ్ కాలుకు దెబ్బతగిలి పనికి దురయ్యాడు. సరైన ఉపాధి లేక.. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు రూ.5లక్షలు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో స్థానిక కార్గిల్లేక్లో శనివారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య లావణ్య, కుమారులు సాయిచరణ్, సచిన్ ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
సగం సీట్లు ఖాళీ
● గంభీరావుపేటలో ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల హాస్టల్ ● పాఠశాల విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం ● రెండింటిలోనూ వంద చొప్పున సీట్లు ● అడ్మిషన్ల కోసం ప్రచారబాటలో అధికారులు గంభీరావుపేట(సిరిసిల్ల): విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టళ్లలో సగం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. అధికారుల ప్రచారం చేసినా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సగంలోపే సీట్లు భర్తీ అవుతున్నాయి. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల కోసం గంభీరావుపేట మండల కేంద్రంలో రెండు వసతి గృహాలను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఎస్సీ బాలుర వసతి గృహం. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థినుల కోసం మరో హాస్టల్ ఏర్పాటు చేశారు. రెండు హాస్టళ్లలో వంద సీట్ల చొప్పున కేటాయించారు. సగం సీట్లు ఖాళీ ప్రస్తుతానికి రెండు హాస్టళ్లలో సగం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దాదాపు 50 విద్యార్థుల్లోపే ఉన్నారు. గతేడాది పొడవునా ఆ సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని రకాల వసతులు ఉన్నా వసతిగృహంలో సీట్లు ఎందుకు ఖాళీగా ఉంటున్నాయో చర్చిస్తూ.. విద్యార్థుల సంఖ్య పెంచాలనే ఉద్దేశంతో అధికారులు వసతిగృహంలో చేరాలని, చేర్పించాలని ప్రచారం చేస్తున్నారు. ఇటు కళాశాల అధ్యాపకులతో.. అటు పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి ప్రచారబాటలో పాల్గొంటున్నారు. వసతిగృహాల్లో కల్పిస్తున్న సదుపాయాలపై తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఇతర మండలాలకు చెందిన విద్యార్థులకు సైతం ప్రవేశాలు కల్పించడం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వసతిగృహానికి కేటాయించిన వందసీట్లలో ఎస్సీలకు 75 శాతం, బీసీలకు 12, ఎస్టీలకు 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తున్నారు. రెండు హాస్టళ్లలోనూ ప్రస్తుతం సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. హాస్టళ్లలో పౌష్టికాహారం విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలతోపాటు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారు. ఉదయం 7 గంటలకు రాగిజావ, పాలు ఇస్తారు. అనంతరం గంట తర్వాత బ్రేక్ఫాస్ట్లో భాగంగా ఉప్మా, పులిహోర, కిచిడి, చపాతి, పూరీ, ఇడ్లి, జీర రైస్, టమాట అన్నం.. ఇలా రోజుకో రకంగా ఇస్తారు. మధ్యాహ్నం పాఠశాలలో భోజనం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు స్నాక్స్ కింద పల్లీపట్టీలు, అటుకులు, బిస్కెట్స్, శనగలు, బబ్బర్లు, స్వీట్స్తోపాటు ప్రతి ఆదివారం మధ్యాహ్నం చికెన్రైస్, గుడ్డు ప్రత్యేకంగా అందిస్తారు. వారంలో రెండు రోజులు గుడ్డుతోపాటు అరటిపళ్లు, ఇతర పళ్లు విద్యార్థులకు అందించనున్నారు. అవగాహన కల్పిస్తున్నాం గంభీరావుపేటలోని కళాశాల, పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన ఎస్సీ బాలుర, బాలికల వసతిగృహాల్లో అడ్మిషన్ల కోసం ప్రచారం నిర్వహిస్తున్నాం. వసతిగృహాల్లో ఉండి చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పుడిప్పుడే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. వంద సీట్లు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. గంభీరావుపేట మండలంతోపాటు చుట్టుపక్కల మండలాల్లోనూ విద్యార్థుల తల్లిదండ్రులకు హాస్టల్ ప్రత్యేకతలను, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. – భూదేవి, వసతిగృహాల సంక్షేమాధికారి, గంభీరావుపేట -
నిందితులకు శిక్ష పడేలా పని చేయాలి
కరీంనగర్క్రైం: వివిధ కేసుల్లో సాక్షులను సకా లంలో కోర్టులో హాజరుపరిచి నిందితులకు శిక్ష పడే విధంగా కోర్టుడ్యూటీ ఆఫీసర్లు (సీడీవో) లు విధులు నిర్వహించాలని సీపీ గౌస్ ఆలం సూచించారు. కమిషనరేట్ పరిధిలోని సీడీవోలతో శనివారం సమీక్ష నిర్వహించారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులపై సమగ్రంగా ఆరా తీశారు. డీడీ, ఈ–పెట్టీ కేసుల పెండింగ్పై చర్చించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ విజయ్కుమార్, ఇన్స్పెక్టర్లు సరిలాల్, సంతోష్కుమార్ పాల్గొన్నారు. ‘కౌశిక్రెడ్డిపై కేసు సరికాదు’ కరీంనగర్: హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై ప్ర భుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు నమోదు చేయడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ. రామకృష్ణరావు పేర్కొన్నారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. శంషాబాద్ విమానాశ్రయంలో ఎమెల్యే కౌశిక్రెడ్డిని అరెస్టు చేసి వరంగల్ సుబేదారి పోలీస్స్టేషన్కు తరలించడాన్ని ఖండించారు. సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నించినందుకు కౌశిక్రెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ తీరు మార్చుకోకపోతే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి బండి సంజయ్ రేవంత్రెడ్డితో కుమ్ముకై బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టేలా చేస్తున్నారని ఆరోపించారు. బల్దియా కమిషనర్ను కలిసిన టీఎన్జీవోలు కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన ప్రఫుల్ దేశాయ్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ డీడీగా బాధ్యతలు చేపట్టిన రంజిత చికిలేను తెలంగాణ నాన్గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ ఆధ్వర్యంలో శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి, కార్యదర్శి సంగెం లక్ష్మణ్రావు, టీజీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు మడిపల్లి కాళిచరణ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహాస్వామి పాల్గొన్నారు. అవకతవకలు జరగొద్దు ఇల్లందకుంట: జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదని గ్రామీణ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి శ్రీధర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో 4వ విడత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ నిర్వహించారు. డీఆర్డీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆడిట్ నిర్వహించారు. మండలంలోని 18గ్రామాల్లో 2024–2025 సంవత్సరానికి గాను రూ.3.82కోట్ల పనులు జరిగాయన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు రికార్డు మెయింటెనెన్స్, మస్టర్ రోల్లో పేర్లు రాయకపోవడం, రికార్డుల విషయంలో పొరపాట్లు జరిగాయాని గుర్తించారు. రికార్డుల్లో పొరపాట్లకు తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. విజిలెన్స్ అధికారి వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనివాస్, ప్రదీప్ ఎంపీడీవో పుల్లయ్య, ఏపీవో రవికుమార్ పాల్గొన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక విద్యానగర్: జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో 2025–26 విద్యాసంవత్సరంలో 1వతరగతి(నాన్ రెసిడెన్షియల్), 5వతరగతి(రెసిడెన్షి యల్)లో ఎస్సీ విద్యార్థుల ప్రవేశాలను ఈనెల 25న ఉదయం 11 గంటలకు కరీంనగర్ కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు షెడ్యూల్డ్ కూలాల అభివృద్ధిశాఖ ఉప సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు. -
దోమల నివారణ అందరి బాధ్యత
కరీంనగర్టౌన్: దోమల నివారణ అందరి బాధ్యత అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఉమాశ్రీ ఆధ్వర్యంలో శనివారం విద్యానగర్ పట్టణ ఆరోగ్యకేంద్రం పరిధిలోని తెలంగాణ బధిరుల పాఠశాలలో దోమల మందు స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో దోమలు వృద్ధి చెందకుండా దోమ లార్వా నిర్మూలనకు తీసుకోవలసిన చర్యల గురించి, ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రైడే పాటించడం గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. విద్యానగర్ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎన్సీడీ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుమన్ పాల్గొన్నారు. -
‘సిరిసిల్ల అడ్డగా ఫోన్ ట్యాపింగ్.. ప్రభాకర్ రావు కారణంగానే అరెస్ట్ అయ్యా’
సాక్షి, కరీంనగర్: హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్. ప్రభాకర్ రావు చాలామంది సంసారాలు నాశనం చేశారు.. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారు అని ప్రశ్నించారు.ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా సిట్ నోటీసులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘అందరికంటే ఎక్కువ ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేసింది నేనే. హైదరాబాదు, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు అనేక మంది ఉసురు పోసుకున్నారు. జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పజెప్పాలి. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్కి ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదు?. ఫోన్ ట్యాపింగ్కు కారణం కేసీఆర్, కేటీఆరే. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ అయ్యింది.ప్రభాకర్ రావు సీఎంవో ఆఫీసుని అడ్డాగా చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆయనకు రాచమర్యాదలు చేయడం బంద్ చేయండి. అందరి జీవితాలు నాశనం చేసిందే ప్రభాకర్ రావు. నన్ను పేపర్ లీక్ అయ్యిందని ప్రభాకర్ రావు అదేశాల మేరకే అరెస్టు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణను సర్వనాశనం చేసిందే కేసీఆర్ ఫ్యామిలీ. ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చే ముందు కేటీఆర్ అమెరికా ఎందుకు పోయారు?. కేటీఆర్ అమెరికా పోయి ప్రభాకర్ రావుతో మాట్లాడిన తర్వాతనే ఆయన ఇండియాకు వచ్చాడు. నాకు సిట్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. విచారణకు హాజరవుతాను’ అని స్పష్టం చేశారు. -
యోగానందం
● నిత్య సాధనతో ఆరోగ్యం ● ఉమ్మడి జిల్లాలో పెరిగిన అవగాహన ● ఆరోగ్యంగా జీవిస్తున్న జనం ● నేడు ప్రపంచ యోగా దినోత్సవం సిరిసిల్లటౌన్: ఆరోగ్యమే మహా భాగ్యమంటూ జిల్లా ప్రజలు యోగా సాధన చేస్తున్నారు. శారీరకంగా ధృడంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే ఉద్దేశంతో ఆరో గ్యంపై దృష్టి పెడుతున్నారు. ఈక్రమంలోనే వయసుతో సంబంధం లేకుండా నిత్యం యోగా సాధన చేస్తూ చలాకీగా జీవిస్తున్నారు. విధుల్లో ఒత్తిడి..మానసిక..శారీరక శ్రమను తట్టుకునేందుకు అందరిబాట యోగానే మారింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యోగా సాధనతో కలిగే ప్రయోజనాలు, సాధకుల అభిప్రాయాలు... -
రీఫండ్ పెండింగ్ రూ.30కోట్లు !
● ప్లాట్ల రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా రీఫండ్ కాని డబ్బులు ● రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3వేల వరకు బాధితులు ● ఐదేళ్లుగా పెండింగ్లోనే కరీంనగర్క్రైం: ప్లాట్లు, భూములు, ఆస్తులు ఇతరత్రా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు చలాన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వివిధ కారణాలతో రద్దయిన వారికి రీఫండ్ కావడం లేదు. గత ఐదేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల మంది రూ.30 కోట్ల డబ్బును స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించగా పలు కారణాలతో రద్దయి తిరిగి చలాన్ ఫీజు రీఫండ్ కావాలని సుమారు ఐదేళ్లనుంచి ఎదురుచూస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నా నేటికీ రాకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఐదేళ్ల నుంచి ఎదురుచూపులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కలుపుకొని సుమారుగా 3వేల మంది బాధితులకు రూ.30 కోట్ల వరకు రీఫండ్ మొత్తం రావాల్సి ఉంది. రూ.10 నుండి 30 వేల వరకు చిన్న మొత్తాలు ఉన్నవారు రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే కొంతమందికి వస్తున్నట్లు సమాచారం. కానీ అంతకంటే ఎక్కువగా ఉన్న వారు సుమారుగా ఐదేళ్లనుంచి వేచి చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా తమ చేతిలో ఏమి లేదంటూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చేతులెత్తేయడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. తాము చెల్లించిన రిజిస్ట్రేషన్ చలాన్ డబ్బులు వస్తాయా.. రావా అని ఆవేదన చెందుతున్నారు. ట్రెజరీ శాఖలో రిజెక్ట్ రిజిస్ట్రేషన్ శాఖలో చలాన్ డబ్బులు మొత్తం ప్రభుత్వ అకౌంట్లో జమచేస్తారు. రీఫండ్ రావాలంటే ఫైనాన్స్, ట్రెజరీ శాఖ నుంచి విడుదల కావాల్సి ఉంటుంది. ఆయా ఫైల్స్కు చెందిన ఏడాది కాలం పెండింగ్లో పెట్టిన ట్రెజరీ శాఖ అధికారులు బాధితులకు రీఫండ్ చేసేందుకు తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదన్న నెపంతో రీఫండ్ ఫైల్స్ అని రిజెక్ట్ చేయడం బాధితులకు కలవరపాటుకు గురిచేస్తోంది. పెద్ద మొత్తాల్లో ఉన్నవారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, పెద్ద స్థాయిలో పైరవీలు చేసిన వారికి మాత్రమే వస్తున్నాయని చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ నుంచి తాము చలాన్ రూపంలో చెల్లించిన డబ్బు రీఫండ్ అయ్యేలా చూడాలని కోరుతున్నారు. -
దేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయం
● ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి కరీంనగర్ కార్పొరేషన్: దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ సాధించిన విజయమని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి అన్నారు. రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరించేందుకు భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఎన్ఎస్యూఐ మాజీ ఉపాధ్యక్షుడు ఎండీ ఇమ్రా ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరాచౌక్ నుంచి సీవీఆర్ఎన్ రోడ్ మీదుగా అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. కులగణన చేపట్టిన నేపథ్యంలో రాహుల్, సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...దేశవ్యాప్త కులగణన కోసం రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం మెడలు వంచారన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేపట్టడం చరిత్రాత్మకమన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ఖర్గే చేపట్టిన సంవిధాన్ బచావో కార్యక్రమంలో భాగంగా వైట్ టీషర్ట్ మూమెంట్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్, నగర అధ్యక్షుడు ఉప్పరి విశాల్ పాల్గొన్నారు. -
లారీ.. బారులుతీరి..
ఒకటి కాదు రెండు కాదు.. ఒకదాని వెంట మరొకటి.. వందల కొద్దీ లారీలు రైలు బోగీలను తలపిస్తూ రహదారిపై బారులు తీరాయి. లోడింగ్ ఇసుక కోసం కిలోమీటర్ల మేర నిలిచిన లారీలను చూస్తూ వచ్చిపోయే ప్రయాణికులు రైలు డబ్బాలను తలపిస్తున్నాయంటూ చమత్కరించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్ పల్లి వద్ద ఇసుక క్వారీ కొనసాగుతోంది. ఆన్లైన్లో డీడీలు కట్టి ఇసుక లోడింగ్ కోసం వచ్చిన లారీలు ఇలా రహదారిపై క్యూలో నిలపడం ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. కాగా, పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక లారీలతో తిప్పలు పడుతున్నామని రాత్రి వేళల్లో ప్రమాదాలు జరిగిన సందర్భాలు లేకపోలేదని వాపోతున్నారు రహదారి వెంట ఉన్న గ్రామాలవాసులు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
టీచర్ నుంచి రాష్ట్ర జట్టు కోచ్ వరకు..
శంకరపట్నం: వెంకటేశ్వర్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్కాకుల కోటేశ్వర్రావు 15 ఏళ్లుగా యోగాలో శిక్షణ ఇస్తున్నారు. బాబా రాందేవ్ వద్ద హరిద్వార్లో శిక్షణ పొందారు. యోగాతో ఏకాగ్రత పెరుగుతుందని, ధ్యానంతో మనసు ఉత్తేజపరుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జట్టుకు కోచ్గా శిక్షణ ఇవ్వడంతో తిరువనంతపురం, హిమాచల్ప్రదేశ్లో జరిగిన పోటీల్లో పతకాలు సాధించారు. సిరిసిల్లకల్చరల్: సిరిసిల్లకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉప్పల శ్రీనివాస్ జీవన ప్రయాణమే యోగగా మారింది. ఆదియోగి నిత్య యోగ సాధనాలయం పేరిట శిక్షణసంస్థను నెలకొల్పి ఇప్పటికే వందలాది శిబిరాలను ఏర్పాటు చేశారు. చాలా మంది యోగా సాధకులను తయారు చేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని భావించి మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. శ్రీనివాస్.. జీవనయోగం -
ముగిసిన బడిబాట
కరీంనగర్: ఈ విద్యా సంవత్సరంలో ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు నిర్వహించిన ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిచ్చింది. కలెక్టర్, ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రవేశాలు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఎంఈ వోలు మూతపడిన ఎనిమిది పాఠశాలలను తెరిపించడం విశేషం. శుక్రవారం వరకు 4,521 మంది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తీసుకున్నారు. కొత్తగా 4,521 మంది చేరిక బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు, మహిళ సంఘాలను భాగస్వాములను చేశారు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అంగన్వాడీ కేంద్రాల నుంచి 1,790 మంది, ప్రైవేట్పాఠశాలల నుంచి 1,330, నేరుగా ఆయా తరగతుల్లో ప్రవేశం పొందినవారు 1,401మంది మొత్తంగా 4,521 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4521 మంది ప్రవేశాలు పొందారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఉపాధ్యాయులు ఆంగ్లంలో బోధించేలా సర్వం సిద్ధం చేశాం. తొలిరోజే పాఠ్యపుస్తకాలు, దుస్తులు, నోట్బుక్స్, వర్క్బుక్స్ 96 శాతం పంపిణీ చేశాం. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో పెరిగిన ప్రవేశాలు 4,521 మంది చేరిక తెరుచుకున్న ఎనిమిది పాఠశాలలుబడిబాటలో పంపిణీ చేసిన పుస్తకాలు, దుస్తులు పాఠ్యపుస్తకాలు 3,05,520 దుస్తులు 39,098 వర్క్బుక్స్ 40,838 నోట్బుక్స్ 2,23,183విద్యార్థుల నమోదు ఇలా 1వ తరగతిలో చేరిన విద్యార్థులు 1,719 2 నుంచి 10వ తరగతి వరకు చేరినవారు 1,401 ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరినవారు 1,330 -
సీసీల ముందు అంతా.. అయ్యా ఎస్లే!
● అక్రమాలకు ఆలవాలంగా సీసీలు ● ఐఏఎస్లను కీలుబొమ్మలుగా మార్చారన్న విమర్శలు ● భూరికార్డులు మార్చిన ఘనత కూడా వీరికే ● క్రిమినల్ కేసులున్నా.. అంటి పెట్టుకుంటున్న కలెక్టరేట్ కార్యాలయం ● జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. అభయమిచ్చేది వీరే!సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: వారు క్యాంప్ క్లర్కులే.. హోదా చిన్నదే.. అయితేనేం.. వారి ముందు ఎవరైనా సరే.. అయ్యా..ఎస్! అంటూ మోకరిల్లాల్సిందే. వీరి వద్ద ఏం మాయ ఉందో ఏమో తెలియదు కానీ... ఉన్నత చదువులు చదువుకున్న ఆఫీసర్లు కూడా వారి చేతిలో కీలుబొమ్మలుగా మారిన వైనం ఇంకెక్కడా లేకపోవడం గమనార్హం. వీరు భూరికార్డులను మార్చినా, శ్మశాన వాటికలను మింగేసేవారికి అండగా నిలబడ్డా, చివరికి తోటి తహసీల్దార్ భూమిని సైతం ఇతరులకు మ్యుటేషన్ చేసే ఘనులు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. జిల్లాలో ఎక్కడ ఏం స్కాం వెలుగుచూసినా.. ఇక్కడ ఐఏఎస్ల కంటే ముందు వీరి వద్దకే అంతా వస్తారు.. అక్కడే వీరు చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఐఏఎస్ల టేబుళ్లపై ఏ ఫైల్ ఉండాలి? వారు ఏ ఫైల్ చూడాలి? ఎవరిని కలవాలి? ఎవరిని కలవద్దు? అన్న విషయాల్లో వీరి నిర్ణయమే ఫైనల్. అందుకే, ఎన్ని అవినీతి కేసులు, కుంభకోణాలు వెలుగుచూసినా.. కరీంనగర్ జిల్లాలో ఐఏఎస్ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేకపోవడానికి సీసీలే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి గాథలు ఇన్నిన్ని కాదయా? ఉద్యోగ నిబంధనలు, బదిలీలు, ఎన్నికల కోడ్ తదితరాలు వర్తించవు. ఎందుకంటే ఉన్నతాధికారులు వీరి జేబులో ఉన్నారన్న నమ్మకమే ఇక్కడ అక్రమాలకు ఎదురులేకుండా పోతుందన్న విమర్శలు ఉన్నాయి. వీరిలో అందరి కంటే సీనియర్ తహసీల్దార్ ర్యాంకులో ఓ సీసీ ఉన్నారు. ఆయన 2009 నుంచి ఇక్కడే కొనసాగుతున్నారు. ఆర్ఐ ర్యాంకులో సీసీగా వచ్చిన ఈయన ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో సీసీగా పనిచేస్తున్నారు. తహసీల్దార్గా పదోన్నతి వచ్చిన సమయంలో జిల్లాలో ఎక్కడా ఖాళీ లేదు. దీంతో ఆయన పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చింది. ఆలోచించాడు.. చక్రం తిప్పి కరీంనగర్ డీఆర్డీఏకు ఫారిన్ సర్వీస్ కింద వచ్చారు. తరువాత మరోసారి స్కెచ్ వేసి కలెక్టరేట్లో హెచ్–విభాగానికి సూపరింటెండెంట్గా ఉన్న తహసీల్దార్ను బలవంతంగా అక్కడ నుంచి డీఆర్డీఏకు పంపారు. ఇక తాను వెళ్లి ఆ పోస్టులో పాగా వేశారు. ఒకసారి కొత్తపల్లికి తహసీల్దార్గా వ్యవహరించిన ఓ వ్యక్తి.. కిసాన్ నగర్లోని తోటి తహసీల్దార్ భూమిని ఇతరులకు మ్యుటేషన్ చేశాడు. అతనిపై విజిలెన్స్ విచారణ జరిపి క్రిమినల్ చర్యలకు సిఫారసు చేసింది. అయితే... అపుడు ఈ సీనియర్మోస్ట్ సీసీ రంగంలోకి దిగి కలెక్టర్ కళ్లకు గంతలు కట్టారు. విజిలెన్స్ విచారణను తొక్కిపెట్టి సదరు తహసీల్దార్ను కాపాడుకున్నాడు.● కరీంనగర్లో ఇలాంటి సీసీలంతా ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరికి తహసీల్దార్ హోదాలో ఉన్న ఓ రాజగురువు తోడున్నారు. ఎవరు ఎక్కడ పనిచేయాలో ఇతను నిర్ణయిస్తాడు. జిల్లాలో ఏ స్కాం వెలుగుచూసినా.. ఇతన్ని సంప్రదిస్తే చాలు.. విచారణ లేకుండా నింది తులందరినీ కాపాడే బాధ్యత ఇతనే భుజాల కెత్తుకుంటాడు. ఈయన శశాంక కలెక్టర్గా ఉన్న సమయంలో ఇదే రాజగురువు ఓ వివా దంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. బొమ్మకల్లోని ఏడెకరాల భూమిని అక్రమంగా ఇతరులకు విరాసత్ చేయడంతో ఆగ్రహించిన కలెక్టర్ సదరు రాజగురువును పక్కనబెట్టా రు. ఇటీవల నకిలీ ఫ్యామిలీ లీగర్హెయిర్ సర్టిఫికెట్ కేసులో ఇతనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదైంది. కానీ...ఇతను అరెస్టు కా కుండా ఉన్నతాధికారులు కాపాడుతున్నార న్న విమర్శలు రావడం దారుణమని సాక్షా త్తూ.. కలెక్టరేట్ సిబ్బందే వాపోతున్నారు. ● హెల్త్ నుంచి రెవెన్యూకు, రెవెన్యూ నుంచి ఇపుడు మున్సిపాలిటీకి ఇష్టం వచ్చినట్లు ఫారిన్ సర్వీసులకు ఇట్టే వెళ్తున్న మరో సీసీ కథలు ఇన్నీఅన్నీకావు. మాతృశాఖ అయిన డీఎంహెచ్వోలో సీసీగా ఉన్న సమయంలో కరీంనగర్లోని ప్రైవేటు నర్సింగ్ హోంల నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారన్న కారణంతో అప్పటి డీఎంహెచ్వో అతన్ని వావిలాల పీహెచ్సీకి బదిలీ చేశారు. అయినా...మనోడు అక్కడ విధులు నిర్వర్తించకుండా తిరిగి రాజగురువు సాయంతో తిరిగి కలెక్టరేట్లో ఓ అడిషనల్ కలెక్టర్ వద్ద సీసీగా మకాం వేశాడు. ఇపుడు అడిషనల్ కలెక్టర్ బల్దియాకు వెళ్లడంతో అతనితోపాటు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకోవడం విశేషం. ఇతని మీద గతంలో ఏసీబీ నిఘా పెట్టిన విషయం తెలిసిందే. ● ఇక బల్దియాలో కొందరు సీసీలు రెండాకులు ఎక్కువే చదివారు. ఇక్కడ పనిచేసే వారు ఔట్ సోర్సింగ్ అయినా.. మున్సిపల్ కమిషనర్లను జేబులో ఉంచుకున్నామని కలరింగ్ ఇస్తున్నారు. ఆ ధైర్యంతో కార్పొరేషన్లో శాశ్వత సిబ్బందిని, సీనియర్ ఇంజినీర్లను అందరి ముందే పేర్లు పెట్టి పిలవడం, ‘నువ్వు’ అని సంబోధించడం వీరికి ఉన్నతాధికారులు ఇచ్చిన స్వేచ్ఛకు నిదర్శనం. బల్దియాలో విధులు నిర్వర్తిస్తున్న పలువురు మహిళలను పలు రకాలుగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నా.. వీరిపైనా ఎలాంటి చర్యలు ఉండకపోవడం గమనార్హం. ● మొత్తానికి కరీంనగర్ జిల్లా పరిపాలనకు పార్టీలతో, ప్రభుత్వాలతో పనిలేదని.. ఇక్కడ ఏం స్కాం జరిగినా.. నిందితులు సీసీలను ఆశ్రయిస్తే చాలు.. వారే చూసుకుంటారు అన్న ప్రచారం ఉంది. అసలు సీసీల మీదే క్రిమినల్ చర్యలున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు.. ఇక బయట వారు స్కాంలకు పాల్పడితే మాత్రం ఎలా పట్టించుకుంటారు? అన్న ప్రచారంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.కదలరు.. వదలరు -
రేపు జిల్లాకు ఇన్చార్జి మంత్రి ‘తుమ్మల’
సాక్షిప్రతినిధి,కరీంనగర్: జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం జిల్లాకు రానున్నారు. ఇన్చార్జి మంత్రిగా గతంలో ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డి స్థానంలో తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నియామకం కావడం తెలిసిందే. మొదటిసారి ఆయన జిల్లాకు రానున్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.డీజిల్ లేక నిలిచిన ట్యాంకర్లుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో డీజిల్ లేకపోవడంతో ట్యాంకర్లు నిలిచిపోయా యి. గత డీజిల్ బకాయిలు రూ.5.50 లక్షలు చెల్లించకపోవడంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు నగరపాలకసంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన వాహనాలకు డీజిల్ పోయడం నిలిపివేసినట్లు సమాచారం. దీంతో శుక్రవారం ఆయా రిజర్వాయర్లలోని వాహనాలు కదలలేదు. గత నెల రోజులుగా డీజిల్ లేక వాహనాలు నిలిచిపోవడం ఇది రెండోసారి. డీజిల్ లేక వాహనాల సేవలు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు డీజిల్ వ్యవహారంపై దృష్టి సారించాల్సి ఉంది. 1.77లక్షల మంది రైతులు.. రూ.165 కోట్లుకరీంనగర్ అర్బన్: రైతు భరోసా రైతుల ఖాతాకు చేరుతోంది. జిల్లాలో 2,10,904 మంది రైతులకు గాను ప్రభుత్వం ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.211.90 కోట్లు కేటాయించింది. ఈనెల 16న 1,24,727 లబ్ధిదారులకు రూ.65.79కోట్లు, 17న 27307 లబ్ధిదారులకు రూ.40.25 కోట్లు, 19న 15,995 మంది రైతులకు రూ.32.91 కోట్లు, 20న 9,955 మంది రైతులకు రూ.26.39 కోట్లు మొత్తం 1,77,984 మందికి రూ.165.35 కోట్లు జమయ్యాయని డీఏవో భాగ్యలక్ష్మి వివరించారు. నేడు కళా భారతిలో సంగీత దినోత్సవం కరీంనగర్ కల్చరల్: ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ప్రవీణ్ సల్వాజీ మ్యూజికల్ గ్రూప్, సల్వాజి ఈవెంట్స్, కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి సంగీత దినోత్సవ వేడుక, కీర్తి ఘటించిన స్వర్గీయ కళాకారుల పేరిట స్మారక పురస్కారాల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకుడు సల్వాజి ప్రవీణ్ ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉమ్మడి 10 జిల్లాల నుంచి కళాకారులు హాజరవుతారని, సంగీత విభావరి, నత్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సినిమా, జానపద పాటలు పాడే కళాకారులకు వాయిద్య సహకారం కల్పిస్తామన్నారు. రేపు శాతవాహనలో వార్షిక క్రీడా దినోత్సవంకరీంనగర్స్పోర్ట్స్: శాతవాహన విశ్వవిద్యాలయంలో ఈ నెల 22న విశ్వవిద్యాలయ వార్షిక, క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైస్చాన్స్లర్ ఆచార్య ఉమేశ్ కుమార్ తెలిపారు. ప్రతీ సంవత్సరం వార్షిక క్రీడా దినోత్సవ సందర్భంగా బోధన సిబ్బంది, విద్యార్థులకు క్రీడా పోటీలతో పాటు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, త్రో బాల్, లాంగ్ జంప్, హైజంప్, అథ్లెటిక్స్, షటి ల్, క్రికెట్, చెస్, క్యారం, టేబుల్ టెన్నీస్ వ్యాసరచన, వకృత్వ పోటీలు ఉంటాయన్నారు. -
సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి
● జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణకరీంనగర్టౌన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ సూచించారు. శుక్రవారం బుట్టి రాజారామ్ కాలనీ ఆరోగ్యకేంద్రంలో మహిళా హెల్త్ క్యాంపు పరిశీలించి అక్కడికి వచ్చిన మహిళలతో మాట్లాడారు. హాజరు పట్టిక, రికార్డులను తనిఖీ చేసి, ల్యాబోరేటరీ, ఫార్మసీ స్టోర్స్లో మందుల నిల్వలు పరిశీలించారు. ఎన్సీడీ క్లినిక్లోని అధిక రక్తపోటు, డయాబెటిస్ రోగులను పరీక్షిస్తున్న విధానాన్ని వివరాలను, మందుల వివరాల నమోదు రికార్డులను పర్యవేక్షించారు. ఆరెపల్లి బస్తీ దవాఖానా సందర్శించి హాజరు పట్టిక, ఎన్సిడీ రికార్డులు, ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. సనజ వేరియా, లావణ్య, రవళి పాల్గొన్నారు. -
– వివరాలు 8లోu
ఆస్తమా, బీపీ పోయాయి కరీంనగర్స్పోర్ట్స్: సర్వరోగ నివారణి యోగా అనే దానికి నేనే నిదర్శనం. యోగాసనాలు చేయకముందు బీపీ, ఆస్తమాతో బాధపడ్డాను. ఇక్కడ డేకేర్ సెంటర్కు వచ్చినప్పటి నుంచి అన్ని నయమయ్యాయి. ఇప్పుడు చాలా చురుకుగా ఉండగలుగుతున్నాను. – కె.అరుణ , కరీంనగర్యోగాతో నయమైంది కరీంనగర్స్పోర్ట్స్: 2013 నుంచి 2016 వరకు అనారోగ్యంతో బాధపడ్డాను. యోగా చేయాలని పలువురు చెప్పడంతో ప్రతీ రోజు సాధన చేస్తున్నాను. ప్రస్తుతం ఎలాంటి రోగాలు లేకుండా చాలా సంతోషంగా గడుపుతున్నాను. – కె.వందన, కరీంనగర్ -
మందుపాతరల గణేశ్
● లెంకలగడ్డ బ్లాస్టింగ్ దేశవ్యాప్తంగా సంచలనం ● శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధిగా బాధ్యతలు ● మూడు దశాబ్దాలకుపైగా ఏకే 47తోనే చెలిమి మంథని: గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో నక్సల్బరి విత్తనాలు మొలకెత్తిన తొలినాళ్లలో వరంగల్ రాడికల్ యువజన సంఘం ఉద్యమాల నుంచి అడవిబాట పట్టిన గాజర్ల రవి ఉ రఫ్ గణేశ్ చిన్నవయసులోనే పలు విధ్వంసాలు సృష్టించి కేంద్ర కమిటీ మన్ననలు పొందారు. దేశంలోనే సంచలనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి ఉర్ఫ్ గణేశ్ 1992లో అజ్ఞాతంలోకి వెళ్లారు. 1993లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల పరిధిలోని మహాదేవపూర్, ఏటూరునాగారం పీపుల్స్వార్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యమాన్ని బలోపేతం చేస్తూనే వర్గ శత్రు నిర్మాలనకు ప్రాధాన్యతనిచ్చారు. 1994 శాసనసభ ఎన్నికల టైంలో మంథని నియోజకవర్గంలోని మహాదేవపూర్ మండలం లెంకలగడ్డ వద్ద శక్తివంతమైన బాంబులు అమర్చి 9 మంది పోలీస్ఽ అఽధికారులను హతమార్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఘటనలో ఐపీఎస్ ఐజీ స్థాయి అధికారి సాహితోపాటు ఐదుగురు పంజాబ్ కమాండోలు, మహాదేవపూర్ ఎస్ఐ వెంకటస్వామి సహా తొమ్మిది మంది మరణించారు. అప్పటి నుంచి సాహి లెంకలగడ్డ బ్లాస్టింగ్లో మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం అయింది. కీలకనేతగా ఎదిగిన గాజర్ల లెంకలగడ్డ బాంబు బ్లాస్టింగ్ అనంతరం గణేశ్ అప్పటి పీపుల్స్వార్ పార్టీలో అత్యంత కీలకనేతగా ఏదిగారు. మందుపాతరలు పేల్చడం, ఏకే–47లో వినియోగించడంలో గణేశ్కు మరొకరు సాటిలేరు అనే ప్రచారం ఉండేది. గణేశ్ తెగువను, సమర్థవంగా అమలు చేసే వ్యూహాలను పసిగట్టిన అప్పటి పీపుల్స్వార్ పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలు ఆయనను రాష్ట్ర సభ్యుడిగా నియమిస్తూ ఉత్తర తెలంగాణ వ్యవహారాలను అప్పగించింది. ఆ తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మహాముత్తారం మండలం కనుకునూర్కు రీపోలింగ్కు బందోబస్తుకు వెళ్తున్న పోలీ్స్ సిబ్బందిపై దొబ్బలపాడు కల్వర్టు వద్ద బాంబు బ్లాస్టింగ్ చేసిన ఘటనలో 10 మంది పోలీసులు మృత్యువాత పడ్డారు. భూపాలపల్లి సమీపంలోని బాంబుల గడ్డ వద్ద పేల్చివేత వంటి సంఘటన కూడా అప్పట్లో సంచనల సృష్టించింది. 2002లో మహాదేవపూర్ పోలీస్స్టేషన్ను పేల్చడానికి బస్సును బాంబుగా అమర్చి సరికొత్త వ్యూహంతో సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత ఏవోబీ అంధ్రా–ఒడిశా బార్డర్కు కార్యదర్శిగా నియమించారు. ఇలాంటి ఎన్నో సంఽఘటనల్లో గణేశ్ పాత్ర ఉండేది. ఆ తర్వాత పార్టీ నాయకత్వం ఆయనను కేకేడబ్ల్యూ(కరీంగర్, ఖమ్మ, వరంగల్) కార్యదర్శిగా నియమించింది. కొన్ని సంవత్సరాలు తర్వాత రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ముఖ్యమంత్రిగా వైస్ రాజశేఖరరెడ్డి ఉన్న సమయంలో ప్రభుత్వంతో జరిగిన శాంతిచర్చల్లో పీపుల్స్వార్ పార్టీ ప్రతినిధుల బృందంలో గణేశ్ చర్చల ప్రతినిఽధిగా పాల్గొన్నారు. మూడు దశాబ్దాలకుపైగా ఏకే–47 మహాదేవపూర్ ఏరియా కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఏకే47 తుపాకీతోనే ఆయన స్నేహం కొనసాగింది. అనేక హింసాత్మక సంఘటనలకు పాల్పడిన గణేశ్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కంటిమీద కునుకులేకుండా చేరారు. ఆంధ్రా, ఒడిషా సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో గణేశ్ చనిపోయినప్పుడు ఏకే–47తోనే కనిపించాడని ఆయనతోపాటు పనిచేసిన మాజీ మిలిటెంట్లు కొందరు చర్చించుకుంటున్నట్లు సమాచారం. -
చూస్తే చిల్లరే.. కోట్లలో దోపిడీ
కరీంనగర్ అర్బన్: కోడి కూర .. ఈ పేరు వింటేనే నోరూరుతోంది. సుట్టమొచ్చినా.. సంతోష వేడుకై నా.. విషాదమైనా ముక్కలు ఉడకాల్సిందే. జిల్లాలో వీటి వినియోగం ఎక్కువ. ఽనిత్యం 40 వేల క్వింటాళ్ల చికెన్ అమ్ముడుపోతుండగా.. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు కాసుల పంటే. పేరుకు పేపర్ రేటని చెబుతూ వీలైనంత మేర దండుకుంటున్నారు. పేపర్ ధర ఒకటైతే విక్రయించేది మాత్రం కిలోకు రూ.40 అదనం. ఇదేంటంటే మేమింతే..నన్న ఈసడింపు సమాధానం. జిల్లాలో నిత్యం రూ.4.20 కోట్ల వ్యాపారం సాగుతుండగా అదనంగా రూ.1.20 కోట్లు దోచుకుంటున్నారు. ఈ లెక్కన నెలకు రూ.36 కోట్ల మేర వినియోగదారులను పిండేస్తుండగా నియంత్రించే వారే లేకపోవడంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. చికెన్ సెంటర్లు.. దళారులకే లాభం కోళ్ల పరిశ్రమ స్వయం ఉపాధిగా వెలుగొందుతుండగా దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అఽధికారం లేదు. హెచరీస్, కోళ్ల ఫారం యజమానులు, ట్రేడర్స్, చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఇలా వినియోగదారులకు చికెన్ చేరుతుండగా యజమానుల పరిస్థితి అటుంచితే ట్రేడర్లు, చికెన్ సెంటర్ల నిర్వాహకులే ధరలను శాసిస్తున్నారు. సొమ్మొకొడది సోకొకరిదన్నట్లు గంటల వ్యవధిలోనే లాభాలు గడిస్తున్నారు ట్రేడర్లు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు పుట్టుకొస్తుండగా.. చికెన్ సెంటర్లు ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. జిల్లాలో సుమారు 10 వేలకు పైగా చికెన్ సెంటర్లు ఉండగా ట్రేడర్లు సుమారు 500లకు పైగా ఉన్నారు. కోళ్ల ఫారం యజమానుల నుంచి ఆన్లైన్ సీఎమ్మార్ ధరల ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. ఉదాహరణకు కిలో కోడి ధర రూ.90 ఉంటే మైనస్ 5, మైనస్ 10కి తక్కువగా కొనుగోలు చేస్తూ చికెన్ సెంటర్ నిర్వాహకులకు రూ.90కి అదనంగా రూ.5, 10కి ఎక్కువగా రవాణా పేరుతో విక్రయిస్తున్నారు. అంటే కిలో కోడికి రవాణా ఖర్చులు పోనూ రూ.15కు అదనంగా విక్రయిస్తున్నారు. ఒక ట్రాలీ ఆటో జాలీలో 300–800ల వరకు కోళ్లను సరఫరా చేస్తారు. ఒక కోడి యావరేజ్గా 2.300 కిలోలున్నా.. రూ.30 వేల వరకు ఆర్జిస్తున్నారు. ఇదిలా ఉంటే చికెన్ సెంటర్ల నిర్వాహకులు ట్రేడర్ సరఫరా చేసిన ధరకు రూ.5–10కి ఎక్కువ విక్రయించాలి. కానీ.. ఆచరణలో రూ.30–40వరకు ఎక్కువకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పుట్టగొడుగుల్లా ట్రేడర్లు జిల్లాలో పౌల్ట్రీఫాంల నుంచి కోళ్లను కొనుగోలు చేసి చికెన్ సెంటర్లకు సరఫరా చేసేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. దీంతోనే ఎక్కువ లాభం ఉండటం.. మైనస్ మంత్రాన్ని జపించడంతో అనతికాలంలో లక్షలు వెనకేస్తున్నారు. ఈ జాబితాలో కోళ్ల ఫారం యజమానులు చేరిపోతున్నారు. ఫారం ద్వారా వచ్చే ఆదాయం కంటే సరఫరా చేస్తే వచ్చే ఆదాయం ఎక్కువగా ఉండగా అదీ రెండు, మూడు రోజుల్లోనే వస్తుండటంతో ఈ వ్యాపారం వైపే మొగ్గుచూపుతున్నారు. పాపం.. కోళ్ల ఫారం యజమానులు ట్రేడర్లు, చికెన్ సెంటర్ నిర్వాహకులు, హెచరీస్లు వీలైనంత సంపాదిస్తుంటే కోళ్ల ఫారం యజమానులది దారుణ పరిస్థితి. రోజుల వ్యవధిలోనే వారంతా లాభాలు గణనీయంగా పొందుతుంటే పిల్లల నుంచి కోళ్ల వరకు రూపాంతరం చెందే వరకు శ్రమించే యజమానులకు మాత్రం మిగిలేది చిన్నమొత్తమే. జిల్లాలో సుమారు 4 వేల వరకు కోళ్ల ఫారాలున్నాయి. హెచరీస్లు కోడి పిల్లలను కోళ్ల ఫాం యజమానులకు సరఫరా చేస్తుండగా 40–45 రోజులకు పెంచి వాటిని సంరక్షించడం చేసే ప్రక్రియ. ఇక దాణా సరఫరా చేసే కంపెనీలు బస్తాలపై ఎలాంటి ముద్రణలు చేయడం లేదు. కేవలం కంపెనీ పేరు మాత్రమే ఉంటుండగా దాణాలో వాడే ముడి పదార్థాలను పేర్కొనడం లేదు. ధర ఉండటం లేదు. కంపెనీని నమ్ముకుని దాణా వేయడమే. ఈ లోపు ఏదైనా వైరస్ వచ్చినా.. మొటలిటీ(మరణించడం) జరిగినా రైతు పైనే భారం. ఇవన్నీ తట్టుకుని కోళ్లను విక్రయించే సమయానికి ట్రేడర్ల దోపిడీ అధికమవుతోంది. దీంతో చేసేదీలేక మైనస్లకు విక్రయిస్తూ పెట్టిన పెట్టుబడిలో పావు వంతు కూడా లాభం పొందడం లేదు. కోళ్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి ఆశించిన ప్రయోజనం లేదని ఫారం యజమానులు వాపోతున్నారు. పౌల్ట్రీ మీట్ ఫెడరేషనే మార్గం కోళ్ల పరిశ్రమపై ఒకప్పుడు ప్రభుత్వ పర్యవేక్షణ ఉండేది. ఫారం యజమానులు నష్టపోయినా, ఏవైనా విపత్తులు సంభవించినా అరకొర సాయమందేది. దీనికి తోడు ప్రభుత్వ రాయితీలుండేవి. ప్రభుత్వ కనుసన్నలో 1985 వరకు పౌల్ట్రీ మీట్ ఫెడరేషన్ ఉండేది. కాలక్రమేణ ఫెడరేషన్ కనుమరుగైంది. నిరుద్యోగ యువతకు ఇదో చక్కని అవకాశమే కానీ... సంస్కరణలు అవసరమన్నది యజమానుల వాదన. కాగా... కోళ్ల పరిశ్రమ స్వయం ప్రతిపత్తి గల ప్రైవేట్ రంగం. వీటి ధరలపై మాకెలాంటి అధికారం లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు, ప్రొత్సాహకాలు లేవని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. ధరలు ఇష్టారాజ్యం.. నియంత్రణ పూజ్యం వినియోగదారులను దోచుకుంటున్న చికెన్ సెంటర్లు దళారులదే రాజ్యం.. పేరుకే పేపర్ రేట్ కానీ అదనమే కోళ్ల ఫారం యజమానులకు అంతంతేకరీంనగర్ రాంనగర్కు చెందిన శ్రీధర్రావు బంధువులు వచ్చారని చికెన్ కొందామని మార్కెట్కు వెళ్లాడు. పేపర్ ధర(ఆన్లైన్ సీఎమ్మార్) ప్రకారం జనరల్ కిలో కోడి ధర రూ.91 ఉండగా కిలో కోడి ధర రూ.120కి విక్రయించారు. పేపర్ రేట్ కదా ఇదేంటంటే గిట్టుబాటు కాదని సమాధానం. పట్టణంలోనే ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో మరీ దారుణం. ఇది ఒక్క శ్రీధర్ పరిస్థితే కాదు.. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చికెన్ కొనుగోలు చేసే సగటు వినియోగదారుని పరిస్థితి. గురువారం ధరలిలా ఫారం దగ్గర కిలో కోడి రూ.91 చికెన్ సెంటర్లో కిలో కోడి రూ.113 స్కిన్తో రూ.164 స్కిన్లెస్ రూ.186 -
కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి
జ్యోతినగర్(రామగుండం): పరిశ్రమల్లో విధులు నిర్వహించే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీంపాషా డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ రామగుండం పర్మినెంట్ టౌన్షిప్ యూనియన్ కార్యాలయంలో జులై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికవర్గం విజయవంతం చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న యాజమాన్యాలకు సమ్మె నోటీసు అందించనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ సంఘాల ఆధ్వర్యంలో జులై9న దేశవ్యాప్తంగా 13వ సారి జరగనున్న సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు భూమల్ల చందర్, నాంసాని శంకర్, చిలుక శంకర్, రెడపాక లక్ష్మణ్, నాగభూషణం, గీట్ల లక్ష్మారెడ్డి, బొద్దున రాజేశం, ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు ఆరెపల్లి రాజేశ్వర్, వేముల కృష్ణయ్య పాల్గొన్నారు. స్వగ్రామానికి మృతదేహంపెగడపల్లి: ఉపాధి కోసం దుబాయి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఓ వలసజీవి మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది. మండలంలోని బతికపల్లికి చెందిన పూడూరి లచ్చన్న (46) జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. తాను పని చేస్తున్న కంపెనీలో సరైన వేతనం లభించక కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో మనస్తాపానికి గురైన లచ్చన్న వారంక్రితం తాను ఉంటున్న గదిలో ఉరేసుకున్నాడు. గల్ఫ్ స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు గుండెల్లి నరసింహ, ఎన్ఆర్ఐ పాలసీ అడ్వైజరీ కమిటీ ఉపాధ్యక్షుడు మంద బీంరెడ్డి సహకారంతో ఆయన మృతదేహం ఇంటికి చేరింది. విగతజీవిగా వచ్చిన లచ్చన్నను చూసిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. లచ్చన్నకు భార్య లత, ఇద్దరు కుమారులున్నారు. -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్
యువకుడి మృతి.. డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లో డ్రైవర్కు 219 పాయింట్లుతంగళ్లపల్లి(సిరిసిల్ల): మద్యం మత్తులో కారును నడిపి ఓ నిండు జీవితాన్ని బలితీసుకున్నాడు. ప్రమాదం చేసిందే కాకుండా కావాలంటే పదేళ్లు జైలుకు పోతా.. నన్ను ఏమి చేయలేరంటూ వాహనదారులపై చిందులు వేశాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు. వేములవాడ మండలం చింతలఠాణా ఆర్అండ్ఆర్ గ్రామానికి చెందిన కుర్మ నరేశ్(38) బైక్పై గురువారం జక్కాపూర్ వెళ్తున్నాడు. ఈక్రమంలోనే నేరెళ్ల శివారులో సిద్దిపేట నుంచి తంగళ్లపల్లి వైపు కారు అతివేగంగా రాంగ్రూట్లో వచ్చి ఢీకొట్టింది. దీంతో నరేశ్ తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉండి ప్రశ్నించిన వాహనదారులపైకి చిందులు వేశాడు. పదేళ్లు జైలుకు పోతానంటూ వాగ్వాదానికి దిగాడు. కారు డ్రైవింగ్ చేసిన యువకుడికి బ్రీత్ అనలేజర్ టెస్టు నిర్వహించగా 219 పాయింట్లు వచ్చింది. మృతుడి అన్న కుర్మ రాజేశం ఫిర్యాదుతో తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుమాల గురుకులం ప్రిన్సిపాల్ సస్పెన్షన్
● మరిమడ్ల ప్రిన్సిపాల్కు బాధ్యతలు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గిరిజన గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ మంజిత్ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం తాత్కాళికంగా కోనరావుపేట మండలం మరిమడ్ల గురుకులం ప్రిన్సిపాల్ రాము సూరత్యాదవ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. విధులపై నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఆర్డర్ల అమలులో బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడంతోనే వేటు పడింది. పాఠశాలలో పనిచేస్తున్న నలుగురు జౌట్సోర్సింగ్ ఉద్యోగులను మూడు రోజుల క్రితం విధుల నుంచి తొలగించడం.. గురుకులాల ఉన్నతాధికారులు ఇచ్చిన ఆర్డర్ను పట్టించుకోకుండా వ్యవహరించడాన్ని సీరియస్గా పరిగణిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి గత 20 ఏళ్లుగా గురుకులంలో పనిచేస్తున్న నలుగురు జౌట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు భూక్య గజన్లాల్ డిమాండ్ చేశారు. నాయకులు మాలోత్ కిరణ్నాయక్, గుగులోత్ రవినాయక్ ఉన్నారు. -
విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహణ
కరీంనగర్కల్చరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని వికాస తరంగిణి, ప్రజ్ఞావికాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ మహాత్మ జ్యోతిరావు పూలే సర్కస్ గ్రౌండ్లో శనివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు త్రిదండి రామానుజ జీయర్ స్వామివారి మంగళశాసనా లతో దేవనాథ రామానుజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో యోగా విశిష్టత తెలిపేలా యోగా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ప్రజ్ఞావికాస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, వికాస తరంగిణి జోనల్ అధ్యక్షుడు గౌతంరావు తెలిపారు. గురువా రం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతీరోజు విద్యార్థులకు యోగా నేర్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, విద్యార్థులకు విలువలతో కూడిన విద్య,కుటుంబ విలువలు, కుటుంబ ప్రాముఖ్యత అర్థమయ్యే విధంగా తెలియజేస్తామన్నారు. సమావేశంలో వికాస తరంగణి, ప్రజ్ఞా వికాస్ ఆధ్వర్యంలో యాద కిషన్, సిరికొండ వెంకటేశం, రవీందర్ రావు, ప్రభాకర్ రావు, కర్ణాకర్రావు, జగన్నాథరావు, ప్రతాప్రెడ్డి తదితరులు ఉన్నారు. -
బొమ్మకల్ పంచాయతీ భవనం విక్రయం!
కరీంనగర్రూరల్: కరీంనగర్ కార్పొరేషన్లో విలీనమైన బొమ్మకల్కు చెందిన గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వివాదాస్పదంగా మారాయి. గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను వార్డు మాజీ సభ్యులు కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీగా ఉన్నపుడు సర్వే నంబరు–17లోని స్థలాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్లాట్లుగా చేసి విక్రయించింది. లేఅవుట్ నిబంధనల ప్రకారం గ్రామ పంచాయతీకి విడిచిపెట్టిన మూడు గుంటల స్థలంలో 2023 సంవత్సరంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి అప్పటి మంత్రి గంగుల కమలాకర్ భూమిపూజ చేశారు. మూడు అంతస్తుల్లో భవన నిర్మాణపు పనులను స్థానిక నాయకుడికి అప్పగించారు. పంచాయతీ నిధులు రూ.2,12,000తో విద్యుత్ మీటర్, బోరు వేసి విద్యుత్ మోటారు బిగించారు. స్లాబ్ వేసేందుకు కాంట్రాక్టర్కు పంచాయతీ నిధులు రూ.8లక్షలు చెల్లించారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 26 జనవరి 2024 సంవత్సరంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఆరు నెలల క్రితం బొమ్మకల్ గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేయడంతో భవన నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పంచాయతీకి కేటాయించిన స్థలాన్ని జీపీకి రిజిస్ట్రేషన్ చేయలేదనే కారణంతో కొందరు మాజీ ప్రజాప్రతినిధులు భవనాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. సదరు రియల్టర్లతో కుమ్మక్కయి చేస్తున్న ప్రయత్నాలు బొమ్మకల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్రమత్తమైన వార్డు మాజీ సభ్యులు గూడ తిరుపతిరెడ్డి, వరాల శ్రీనివాస్, తోట కిరణ్కుమార్, గాదె శ్రీనివాస్ గురువారం మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ను కలిసి పంచాయతీ భవనం విక్రయించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై ఫిర్యాదు చేశారు. భవనాన్ని స్వాధీనం చేసుకొని వార్డు కార్యాలయంగా ఏర్పాటు చేయాలని కోరగా.. విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటానని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. మాజీ ప్రజాప్రతినిధులతో కుమ్మక్కయి ప్రయత్నిస్తున్న రియల్టర్లు మున్సిపల్ కమిషనర్కు వార్డు మాజీ సభ్యుల ఫిర్యాదు -
మద్యంమత్తులో బైక్కు నిప్పు
మల్యాల: మండలంలోని రాజారం శివారులో మద్యం మత్తులో ఓ యువకుడు తన బైక్కు నిప్పుపెట్టాడు. దీంతో అది పూర్తిగా కాలిపోయింది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధి టీఆర్నగర్కు చెందిన సలీం గురువారం సాయంత్రం రాజారం శివారులో తన ద్విచక్రవాహనాన్ని నిలిపాడు. మద్యం మత్తులో దానికి నిప్పు పెట్టాడు. స్థానికుల సమాచారంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు నర్సింగరావు సంఘటనాస్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. హత్య కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలుజగిత్యాలజోన్: మద్యం మత్తులో జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసిన కేసులో ఇద్దరికి ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి. రత్న పద్మావతి గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. రాయికల్ మండలం ధర్మాజిపేటకు చెందిన సావన్వెల్లి రాజుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. ఇద్దరు కూతుళ్లకు పెళ్లయ్యింది. కొడుకు శేఖర్ వ్యవసాయంతోపాటు గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవాడు. అదే గ్రామానికి చెందిన రాస రాజేశం, బలిజే నాగ భూషణంతో పరిచయం ఏర్పడింది. వారితో కలిసి కూలీ పనులకు వెళ్తూ.. వచ్చిన డబ్బులతో అందరూ కలిసి జల్సా చేసేవారు. 22 మార్చి 2022న శేఖర్ ఇంటి వద్ద ఉండగా.. సాయంత్రం 4 గంటల సమయంలో బలిజే నాగభూషణం వచ్చి శేఖర్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెళ్లాడు. రాత్రి అయినా శేఖర్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. ఆయన కోసం వెదుకుతుండగా మరుసటి రోజు గ్రామ శివారులో శేఖర్ శవమై కనిపించాడు. మృతుడి తల్లి రాజు రాయికల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై పి.కిరణ్కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ వై.కృష్ణ కుమార్ కేసును దర్యాప్తు చేశారు. మద్యం మత్తులో జరిగిన గొడవలో రాస రాజేశం, బలిజె నాగ భూషణం శేఖర్ను హత్య చేసినట్లు తేల్చారు. నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం. కిరణ్కుమార్, కె. నరేశ్ కోర్టులో సాక్ష్యాలను ప్రవేశపెట్టగా రాజేశం, నాగభూషణంకు ఏడేళ్ల చొప్పున జైలు, రూ.3వేల చొప్పున జరిమానా విధించారు. ప్రమాదవశాత్తు బావిలో పడి గొర్రెల కాపరి మృతిధర్మారం: ధర్మారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందిన పెద్ది మల్లయ్య గురువారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరణించినట్లు ధర్మారం ఎస్సై శీలం లక్ష్మణ్ తెలిపారు. గొర్రెల కాపలాకు వెళ్లిన మల్లయ్య మంచినీరు తాగేందుకు బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మరణించాడు. మృతుని భార్య పెద్ది పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
పెళ్లింట విషాదం
● నెల రోజులు గడవకుండానే నవవరుడి మృతి ● చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న కుటుంబం వేములవాడ: పెళ్లయి నెల రోజులు గడవకముందే నవవరుడి మృతి ఆ ఇంట్లో విషాదం నింపింది. మద్యం మత్తులో ఉన్న కరీంనగర్ శివారులోని రేకుర్తికి చెందిన వ్యక్తి అజాగ్రత్తగా.. అతివేగంగా కారుతో ఢీకొట్టడంతో వేములవాడకు చెందిన పండరీనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మే 23న పండరీనాథ్(25) వివాహమైంది. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో కలిసి ఓ వేడుకకు హాజరైన పండరీనాథ్ అంతలోనే చనిపోయాడని తెలియడంతో వారి రోదనలు మిన్నంటాయి. మద్యం మత్తులో ఉన్న కారుడ్రైవర్ అప్పటికే రెండు చోట్ల ప్రమాదాలు చేసినట్లు తెలిసింది. పెళ్లయిన 25 రోజులకే మృతి మే నెలలో పెళ్లితో కళకళలాడిన ఇల్లు గురువారం శోకసంద్రంగా మారింది. ఇటీవల పెళ్లి బంధానికి తాలూకు వేడుకలు, ఫోటోలు ఇంకా ఇంటి గోడలపై వేలాడుతుండగానే.. అదే ఇంట్లో అంత్యక్రియల ఏర్పాట్లు మొదలయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. తాత, నానమ్మ, తల్లి, తండ్రిని ఓదార్చే బంధువులు కన్నీరు ఆపులేకపోయారు. నెల రోజుల్లోనే భర్తను కోల్పోయిన వధువు నిలువునా కూలిపోయింది. ఆమె రోదనలకు అంతులేకుండా పోయింది. -
మానేరు రివర్ఫ్రంట్ పనులపై విచారణ జరపాలి
కరీంనగర్: నగరంలోని మానేరు రివర్ ఫ్రంట్ పనుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి వినతిపత్రం అందించారు. మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వం రూ. 500 కోట్లు మంజూరు చేసిందని, అందులో టూరిజం శాఖ రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ రూ. 100 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని తెలిపారు. పనులు పూర్తికాకుండానే బిల్లులు చెల్లించారన్నారు. చెక్ డ్యాములు నిర్మిస్తే వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోయాయని, ఐదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆయన సీఎంకు వివరించారు. -
‘డిగ్రీ’ డౌన్!
● తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య ● శాతవాహనలో సగం సీట్లు ఖాళీ ● ఇప్పటి వరకు 10,265 సీట్ల భర్తీ ● ఇంజినీరింగ్, మెడిసిన్, వివిధ కోర్సులపై ఆసక్తి ● ప్లేస్మెంట్లు లేకపోవడమే కారణమంటున్న విద్యావేత్తలుకరీంనగర్క్రైం: డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇంటర్ పూర్తికాగానే చాలామందికి డిగ్రీ కన్నా ఇంజినీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీతో పాటు వివిధ కోర్సులపై ఆసక్తి పెరుగుతోంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో సీట్ల భర్తీ తగ్గుతోందని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇతర కోర్సులపై ఆసక్తి ఉండడంతో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన డిగ్రీ కోర్సుల తర్వాత విదేశాలకు వెళ్తున్నవారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు రెండు దశల్లో దోస్త్ ద్వారా సీట్లు కేటాయింపు ప్రక్రియ జరిగినప్పటికీ శాతవాహనలో 10,265 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఏటేటా తగ్గుతున్న వైనం ఏటా డిగ్రీలో చేరే వారి సంఖ్య తగ్గుతూ వ్తోంది. 2025–26లో ఇప్పటి వరకు రెండు దశలు పూర్తికాగా ఇప్పటి వరకు 10,265 సీట్లు మాత్రమే కేటాయింబడ్డాయి. మొదటి దశలో 5,931 సీట్లు కేటాయించబడగా ఇందులో 4,334 సీట్లు మాత్రమే విద్యార్థులు కన్ఫార్మ్ చేసుకున్నారు. రెండోదశలో 4,334 సీట్లు కేటాయించారు. రెండో దశలో సీటు పొందిన వారు బుధవారం వరకు మాత్రమే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లు ఖరారు చేసుకోవాల్సి ఉందని శాతవాహన ప్రవేశాల విభాగం ప్రకటించింది. కనిపించని ప్లేస్మెంట్లు కోర్సులు పూర్తయ్యాక ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవకాశాలు ఎక్కువగా లేకపోవడంతోనే డిగ్రీ కోర్సుల్లో ఎక్కువగా విద్యార్థులు చేరడం లేదనే చర్చ సాగుతోంది. వివిధ రంగాల్లో ప్రైవేటు కంపెనీలు ఎక్కువగా ప్రొఫెషనల్ కోర్సులు, ఇంజినీరింగ్ చేసిన వారినే నియమించుకోవడంతో డిగ్రీవాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయని తెలుస్తోంది. డిగ్రీ కళాశాలల్లో సైతం కోర్సులు పూర్తయ్యాక ప్లేస్మెంట్ సరిగా రావడంలేదని స్పష్టమవుతోంది. దోస్త్ మూడోదశ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు కొనసాగుతుండగా గురువారం గడువు ఉంది. మూడోదశ సీట్ల కేటాయింపు 23వ తేదీన జరగనుంది. డిగ్రీలో సాంప్రదాయ కోర్సులు కాకుండా పెద్ద ఎత్తున మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్తకోర్సులు వచ్చినప్పటికీ డిగ్రీలో చేరే సంఖ్య పెరగడం లేదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలు ప్రభుత్వ కళాశాలలు: 13 ప్రభుత్వ ఆటానమస్: 02 ప్రైవేటు ఎయిడెడ్: 02 ప్రైవేటు ఆన్ ఎయిడెడ్: 58 సోషల్ వెల్ఫేర్: 03 ట్రైబల్ వెల్ఫేర్: 02 బీసీ వెల్ఫేర్: 03శాతవాహనలో మొత్తం సీట్లు: 36,060 విద్యా సంవత్సరం సీట్ల భర్తీ 2022–23 20,218 2023–24 16,419 2024–25 16,500 2025–26 10,265 (రెండుదశలు పూర్తయ్యాక) -
ఏసీబీ దూకుడు..!
● వరుస కేసులతో హడలెత్తిస్తున్న అనిశా ● సుప్తావస్త వీడి దాడులు మొదలుపెట్టిన వైనం ● ఏసీబీ డీజీ అక్షింతలతో చురుగ్గా కేసుల నమోదు ● కాళేశ్వరం ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా నిఘా ● రెండు నెలలుగా ఏసీబీకి పెరిగిన ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: అవినీతి నిరోధక శాఖ నిద్రలేచింది. ఇంతకాలం సుప్తావస్థలో ఉన్న డిపార్ట్మెంట్.. ఏసీబీ డీ జీగా విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టాక చురుగ్గా కదులుతోంది. ఇటీవల కాళేశ్వరం ఇంజినీర్ నూనె శ్రీధర్ ఇంటిపై దాడులు చేసి రూ.100 కోట్ల వరకు ఆస్తులు గుర్తించి తన మార్క్ చాటుకుంది. తాజాగా కరీంనగర్ జెడ్పీ కార్యాలయంలోనూ బిల్లుల కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు దాడులతో ఏసీబీ తిరిగి పూర్వపు తరహాలో దాడులు చేస్తోందన్న సంకేతాలు ఇచ్చింది. వాస్తవానికి మూడేళ్లుగా కరీంనగర్ ఏసీబీ విభాగంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎలాంటి కేసులు నమోదు కాకున్నా.. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడం తెలిసిందే. అదే సమయంలో స్థానికంగా కరీంనగర్ బల్దియా, రెవెన్యూ విభాగాల్లో అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా.. సదరెం వంటి స్కాంల విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. ఏసీబీ పెద్దగా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్ల నుంచి క్లర్కుల దాకా ఎవరినీ వదలడం లేదు. ఏసీబీ డీజీ రాకతో.. 2020, 2021లో కరోనా కారణంగా దూకుడు తగ్గిందనుకున్నా.. 2022, 2023, 2024లో చరుకుదనం తగ్గడంలో ఆంతర్యం ఏమిటో అర్థంకాలేదు. గతేడాది ఏసీబీ డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి విజయ్కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరీంనగర్ ఏసీబీలో కాస్త కదలిక వచ్చింది. 2024 నవంబరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ (పీవోపీ) సందర్భంగా కరీంనగర్కు వచ్చిన విజయ్కుమార్.. ఇక్కడి ఏసీబీ అధికారులతో సమావేశమయ్యారు. ఆ సందర్భంలో ఏసీబీ నమోదు చేసిన కేసులు చూసి కంగుతిన్నారని సమాచారం. అసలేం చేస్తున్నారు..? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవినీతి లేనేలేదా..? అని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అప్పటికపుడు నిద్రలేచిన అధికారులు వేట మొదలుపెట్టారు. అప్పటి నుంచి కేసుల విషయంలో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇరిగేషన్ శాఖ ఇంజినీర్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసే పలువురు ఇంజినీర్లు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఇటీవల ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో వారి ఆస్తుల జాబితా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు సమాచారం.రెవెన్యూ విభాగంలోనే అధికం 2019 నుంచి 2025 వరకు ఏసీబీ నమోదు చేసిన కేసుల్లో ఎప్పటిలాగే రెవెన్యూ విభాగం ముందు వరసలో ఉంది. ఏటా నమోదయ్యే కేసుల్లో ఈ శాఖకు సంబంధించినవే ఉండటం గమనార్హం. 2019లో ఆరు, 2022లో ఆరు, 2023లో నాలుగు, 2024లో ఐదు, 2025లో మూడు కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 2020, 2021లో కరోనాతో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. ఫలితంగా రెవెన్యూకు సంబంధించి ఆ రెండేళ్లలో ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. ప్రస్తుతం సిబ్బంది కొరత వేధిస్తున్నా.. కేసుల వేటలో వేగం పెంచడం శుభపరిణామం.ఫిర్యాదులు పెరిగాయిరెండు నెలలుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఫిర్యాదులు పెరిగాయి. కేసులు విషయంలో దూకుడుగా ఉన్నాం. 1064 టోల్ఫ్రీ నంబరు, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్ వేదికగా బాధితులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరికీ డబ్బులు చెల్లించాల్సి న అవసరం లేదు. అధికారులు లంచం అడిగితే వెంటనే మా ఫోన్ నంబర్ 91543 88954కు ఫిర్యాదు చేయండి. – విజయ్కుమార్, ఏసీబీ డీఎస్పీ -
పొంచి ఉన్న ప్రమాదం
● నగరంలో వేలాడుతున్న విద్యుత్ తీగలు ● రక్షణ లేని ట్రాన్స్ఫార్మర్లు.. తేలిన విద్యుత్ వైర్లువిద్యుత్ ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్న టీజీఎన్పీడీసీఎల్ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఓ వైపు ప్రమాదాలు జరుగుతున్నా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. అసలే వర్షాకాలం.. విద్యుత్షాక్లకు ఆస్కారం ఉండే సమయం.. ఈ క్రమంలో వినియోగదారులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన సంబంధితశాఖ అధికారులు నగరంలోని పలు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్వైర్ల పర్యవేక్షణను గాలికి వదిలేశారు. రక్షణ చర్యలు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ప్రజలు ఎప్పుడు ప్రమాదాల బారిన పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికై నా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
‘ప్రైవేటు’ దోపిడీ
కరీంనగర్: జిల్లాకేంద్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో నియంత్రణ లేని ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అడ్మిషన్, మెయింటనెన్స్, స్పెషల్ ఫీజులంటూ నిలు వుదోపిడీ చేస్తున్నారు. పుస్తకాలు, నోట్బుక్లతో పాటు పాఠశాలపేర్లతో ఉన్న బ్యాగులు సైతం విక్రయిస్తున్నారు. ఒక్కో వస్తువుకు పదింతల ధ రలు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు అవుతున్నా తనిఖీలు చేయడం లేదు. పుస్తకాల ధరలకు రెక్కలు బయట దుకాణాల్లో పుస్తకం ధర రూ.20 ఉంటే పాఠశాలలో రూ.25 నుంచి రూ.35వరకు తీసుకుంటున్నారు. మరికొన్ని పాఠశాలల్లో రూ.40 కన్నా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఒకటో తరగతి 16 టెక్ట్స్బుక్స్, 14 నోట్బుక్స్కు కలిపి రూ.6300కు పైగా వసూలు చేస్తున్నారు. రెండో తరగతి 14 టెక్ట్స్బుక్స్కు, 21 నోట్బుక్స్కు రూ.6,500, మూడో తరగతి 12 టెక్ట్స్బుక్స్, 22 నోట్బుక్స్కు కలిపి 6,700 తీసుకుంటున్నారు. వీటికి తోడు పెన్నులు, పెన్సిళ్లు, కవర్లు అంటూ రెట్టింపు ధరలకు అంటగడుతున్నారు. ఆకాశంలో బ్యాగుల ధరలు కళ్లు చెదిరే డిజైన్లు, రంగులతో చాలా రకాల బ్యా గులు అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లల బ్యాగులు దాదాపు రూ.300 నుంచి దాదాపు రూ.700వరకు పలుకుతున్నాయి. మోడల్ను బట్టి రూ.1000 వరకు చెబుతున్నారు. కొందరు తమ పాఠశాలల పేర్లతో స్కూళ్లలోనే బ్యాగులు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఉచితంగా పబ్లిసిటీ పొందుతున్నారు. ఇది చట్టప్రకారం నిషేధమైనప్పటికీ విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పలు పాఠశాలలు తప్పనిసరిగా బ్రాండెడ్ షూ కొనుగోలు చేయాలని చెప్పడంతో ఒక్కోజత రూ.750 వరకు పలుకుతోంది. యూనిఫాంలు అటువైపుగానే జిల్లాకేంద్రంలో వందల సంఖ్యలో పాఠశాలలు వీదికొకటి ఏర్పడ్డాయి. యాజమాన్యం సూచించిన యూనిఫాంలనే విద్యార్థులు విధిగా ధరించాలి. ఇక్కడా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారు. తాము చెప్పిన షాపులోనే తమ పాఠశాల యూనిఫాం తీసుకోవాలని హుకూం జారీ చేస్తున్నారు. దీంతో ఆయా దుకాణాల యాజమాన్యాలు సైతం ధరలు పెంచి విక్రయిస్తుండగా.. పాఠశాల నిర్వాహకులు కమీషన్ దండుకుంటూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ పెడుతున్నారు. ప్రస్తుతం పాఠశాల యూనిఫాం జతకు రూ.1,200 నుంచి రూ.1,500 పలుకుతోంది. ప్రైవేటు స్కూళ్లలో నిబంధనలకు నీళ్లు పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు అక్కడే కొనుగోలు చుక్కలు చూపుతున్న ధరలు బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు పట్టించుకోని విద్యాశాఖ అధికారులుచర్యలు తప్పవు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు. పాఠ్యపుస్తకాలు, తదితర వస్తువులు అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధం. ఫీజుల విషయంలో ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా వ్యవహరించాల్సిందే. త్వరలోనే పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తాం. ఏ పాఠశాలలోను పుస్తకాలు, నోట్బుక్స్ అమ్మడానికి వీలులేదు. అలాంటివి జరిగితే చర్యలు తప్పవు. – శ్రీరామ్ మొండయ్య, డీఈవో -
గ్రామసభ సందర్శన
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో బుధవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభను అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవో మహేశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీకిరణ్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభా రతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతులు సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా మంచి స్పందన వస్తోందని, శాశ్వతంగా భూములు పట్టాచేయడంతో పాటు వాస్తవిక సర్వే, పహణీలో నమో దు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తామూ నివాసం ఉంటున్న గుడిసెలకు పట్టాలు లేవని, పట్టాలు ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని మాస్టిన్ కులస్తులు ఫిర్యాదు చేశారు. గ్రామసభలో 154 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ రమేశ్ తెలిపారు. డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు కరీంనగర్ కార్పొరేషన్: ‘డంప్యార్డ్ తరలిస్తేనే ఓటు వేస్తాం’.. అంటూ నగరంలోని అలకాపురికాలనీ వాసులు వినూత్న నిరసన తెలిపారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని డిమాండ్తో బుధవారం కాలనీలో మహిళలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మ హిళలు మాట్లాడుతూ డంప్యార్డ్తో తాము సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు పాలకులు పరిష్కా రం చూపించడం లేదని ఆవేదన చెందారు. డంప్యార్డ్ ఎత్తివేయాలని జేఏసీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నా, అధికారులు పట్టించుకో వడం లేదన్నారు. డంప్యార్డ్ సమస్య పరిష్కరించే వరకు ఆందోళనను ఉధృతం చేస్తామని, అవసరమైన రాబోయే నగరపాలకసంస్థ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. యోగాతో జాతీయ సమైక్యత కరీంనగర్స్పోర్ట్స్: యోగా చేయడం ద్వారా జాతీయ సమైక్యత వెల్లివిరుస్తుందని డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. పతంజలి యోగా సమితి, ఆయుష్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన యోగావాక్ను జెండా ఊపి ప్రారంభించారు. యోగాడేను ఈనెల 21న ప్రపంచమంతా నిర్వహిస్తున్న వేళ కరీంనగర్లో పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టాలన్నారు. యువ భారత్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల రమేశ్, ఆయుష్ డీపీఎం ప్రవీణ్, నోడల్ ఆఫీసర్ యష్రుత్ సుల్తానా, డిప్యూటీ నోడల్ ఆఫీసర్ శేఖర్, పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మి నారాయణ, భారత్ స్వాభిమాన్ బాధ్యులు కొండా లక్ష్మణ్ పాల్గొన్నారు. సమ్మె జయప్రదం చేయండి సప్తగిరికాలనీ(కరీంనగర్): శతాబ్దకాలంగా భా రత కార్మికవర్గం అనేక త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి, వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీన్ని నిరసిస్తూ జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు గీట్ల ముకుంద రెడ్డి పిలుపునిచ్చారు. సీఐటీయూ అనుబంధ తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం బుధవార సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. జనగామ రాజమల్లు, కవంపల్లి రవి, ఎర్రోళ్ల రాజయ్య, ముక్కెర బుజ్జమ్మ, కత్తెరపాక లత, జేరిపోతుల మల్లేశం పాల్గొన్నారు. 24 మందికి ఏఎస్సైలుగా పదోన్నతి కరీంనగర్క్రైం: రాజన్న సిరిసిల్ల జోన్ పరిధిలో పనిచేస్తున్న 24 హెడ్కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా పదోన్నతి పొందిన వారిలో కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీసులు ఉన్నారు. -
ఒలింపియాడ్లో పారమిత విద్యార్థుల ప్రతిభ
కొత్తపల్లి(కరీంనగర్): పద్మనగర్లోని పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల జరిగిన ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్(ఐటీవో) రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి పలు స్థానాలను కై వసం చేసుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు గోపీకృష్ణ తెలిపారు. గణితంలో కె.అగస్త్య విశ్రుత్(9వతరగతి) రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు, నగదు బహుమతి గెలుపొందగా, జి.ఆరుష్రెడ్డి(6వ), సాయిరిశిత్.జె(8వ) ప్రశంసాపత్రాలు, మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ సాధించినట్లు చెప్పారు. విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్లు రశ్మిత, ప్రసూన, అనూకర్రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, వినోద్రావు, టీఎస్వీ రమణ, హన్మంతరావు అభినందించారు. కోఆర్డినేటర్లు రాము, నాగరాజు, గణిత ఉపాధ్యాయులు వీరలక్ష్మి, ప్రదీప్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతు ఆలోచన అదిరింది
ధర్మపురి: ఎడ్ల నాగలితో వ్యవసాయం దూరమైంది. ఆధునిక యంత్రాలు, ట్రాక్టర్లు వచ్చాయి. అయితే పంటల్లో కలుపుతీసేందుకు కొన్ని యంత్రాలు వచ్చినా.. వాటి ధర సామాన్య రైతులకు అందకుండా ఉంది. కూలీలతో కలుపు తీయిస్తే ఖర్చు మోపెడవుతోంది. ఈ క్రమంలో ఖర్చును ఆదా చేసుకునేందుకు ఓ రైతు సైకిల్ ద్వారా కలుపు తీస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ధర్మపురి మండలం బుద్దేశ్పల్లెకు చెందిన మహ్మద్ సలీంకు రెండెకరాల భూమి ఉంది. అందులో వివిధ రకాల కూరగాయలు పండిస్తుంటాడు. ట్రాక్టర్, ఎడ్లనాగళ్లతో సాగు చేయగా.. ఎకరాన రూ. పదివేలు ఖర్చు రావడంతో పాత సైకిల్కు వెనుక చక్రం తీసి.. దాని స్థానంలో కలుపు మొక్కలు తొలగిపోయేలా పట్టి అమర్చాడు. హ్యాండిల్ ద్వారా సైకిల్ను నెట్టుకుంటూ వెళ్తుంటే కలుపు మొక్కలు తొలగిపోతున్నాయి. నాగలి వంటి మరో పరికరాన్ని బిగించి విత్తనాలు వేసేందుకు సాళ్లు కూడా పడుతున్నాడు. ఈ విధానం ద్వారా పని తొందరగా అవ్వడమే కాకుండా.. ఖర్చు కూడా ఆదా అవుతోందని అంటున్నాడు రైతు మహ్మద్ సలీం. వ్యవసాయంలో ఆదా కోసం సైకిల్తో వ్యవసాయం ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న సలీం -
ప్రపంచ అగ్రదేశంగా భారత్
జగిత్యాలటౌన్: పదకొండేళ్ల నరేంద్రమోదీ పాలనలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా అవతరించిందని బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకొచ్చి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే నాలుగో ఆర్థికశక్తిగా అవతరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు దేశ భద్రత విషయంలో మోదీ రాజీలేని పాలన సాగిస్తున్నారని కొనియాడారు. దేశం వైపు కన్నెత్తి చూసేందుకు శత్రుదేశాలు సాహసం చేయలేని విధంగా అజేయశక్తిగా తీర్చిదిద్దిన ఘనత మోదీదన్నారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మోదీ పాలనపై రూపొందించిన 11సాల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు రాగిళ్ల సత్యనారాయణ, కస్తూరి సత్యం, మరిపెల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్రెడ్డి -
కొడుకు చితికి నిప్పు పెట్టిన తల్లి
ధర్మపురి: కుటుంబ పెద్ద అనారోగ్యంతో మూడేళ్ల క్రితం మృతి చెందాడు. కుటుంబ భారమంతా తల్లిపై పడింది. ఆమె కష్టాలు చూడలేక ఒక్కగానొక్క కుమారుడు ఇంటికి పెద్ద దిక్కుగా మారాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు రెండు నెలల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఆ యువకుడిని విధి వక్రీకరించింది. ఇటీవల ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే మృతిచెందాడు. అతడి మృతదేహం స్వగ్రామం రాగా.. తల్లి హృదయం తల్లడిల్లింది. తనకు తలకొరివి పెట్టాల్సిన కుమారుడికి ఆమె నిప్పు పెట్టింది. ఈ విషాధ ఘటన ధర్మపురిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యశోద, పెద్దన్న దంపతులకు కుమారుడు సిద్దార్థ (19), కూతురు సంతానం. సిద్దార్థ చిన్నతనంలోనే పెద్దన్న మరణించాడు. కుటుంబాన్ని పోషించేందుకు రెండు నెలల క్రితం ఎడారి దేశం వెళ్లాడు. ఏసీ కంపెనీలో టెక్నీషియన్గా పని నేర్చుకుంటున్నాడు. వారం క్రితం ఓ బిల్డింగ్లో పనులు చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి స్నేహితులు అతడిని అక్కడి ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సిద్దార్థ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. తలకొరివి పెట్టిన తల్లి కొడుకు చితికి తల్లి యశోధ తలకొరివి పెట్టడం అందరినీ కలిచివేసింది. మూడేళ్ల క్రితం భర్త..ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో ఆమె రోదనలకు అంతులేకుండాపోయింది. ఎవరికోసం బతకాలె బిడ్డా అంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లిన యువకుడు వెళ్లిన రెండు నెలలకే గుండెపోటుతో మృతి శవాన్ని చూసి తల్లడిల్లిన తల్లి హృదయం -
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్టు
కరీంనగర్క్రైం: గంజాయి తరలిస్తున్న ఇద్దరిని కరీంనగర్ వన్టౌన్ పోలీసులు బస్టాండు వద్ద బుధవారం పట్టుకున్నారు. వారి నుంచి 1.80 కిలలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల ప్రకారం తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కొంటు అనిల్కుమార్(19), సుభాశ్నగర్కు చెందిన నీర్ల వంశీకృష్ణ(25) గంజాయికి అలవాటు పడ్డారు. అరకులో గంజాయి తక్కువకు వస్తుందని అక్కడికి వెళ్లారు. రూ.5వేలు పెట్టి కొనుగోలు చేశారు. కరీంనగర్లో గంజాయి తాగే అలవాటు ఉన్నవారికి అమ్మితే డబ్బు సంపాదించొచ్చని భావించారు. రైల్లో వరంగల్ వరకు తెచ్చారు. బస్సులో కరీంనగర్ తీసుకొచ్చారు. పక్కా సమాచారంతో బస్టాండ్ ఔట్గేటు వద్ద వన్టౌన్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. నిందితులు పోలీసులను చూపి పారిపోయే ప్రయత్నం చేశారు. ఇద్దరిని పట్టుకుని 1.80 కిలోల గంజాయి స్వాఽధీనం చేసుకున్నారు. ఎస్సైలు రాజన్న, శేఖర్, భాస్కర్రెడ్డి, సిబ్బందిని సీపీ అభినందించారు. -
కారును ఢీకొన్న వ్యాన్: ఇద్దరికి గాయాలు
మల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు దిగువ కొండగట్టు వద్ద కారును డీసీఎం వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బిరుదుల సాయికిరణ్ బుధవారం మల్యాలకు చెందిన మ్యాక గంగోత్రిని పూడురులోని వారి బంధువుల ఇంట్లో దించేందుకు కారులో వెళ్తున్నాడు. ముత్యంపేట శివారులో జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై జగిత్యాల వైపు వెళ్తున్న డీసీఎం వ్యాను వేగంగా వచ్చి కారును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న సాయికిరణ్, గంగోత్రి తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది బాధితులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సాయికిరణ్ తల్లి పద్మ ఫిర్యాదు మేరకు డీసీఎం వ్యాను డ్రైవర్ జితేంద్రపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కుంటయ్యకు కన్నీటి వీడ్కోలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ ఆస్పత్రి బుధవారం ఉదయం జనసంద్రమైంది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కరికవేని కుంటయ్య(48) ఆత్మహత్య ఉదంతం నేపథ్యంలో జిల్లాలోని బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లకు తరలివచ్చాయి. కుంటయ్య మృతదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదా ర్చారు. అన్ని విధాలా పార్టీ ఆదుకుంటుందని భరో సా ఇచ్చారు. కుంటయ్య ఆత్మహత్యకు కారణమైన వారికి ఎవ్వరనీ వదిలిపెట్టమని, న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన గులా బీ నాయకుడిని కోల్పోయామని, హైదరాబాద్ వర కు నాకు అండగా వచ్చిన కుంటయ్య ఇలా ఆత్మహత్యకు పాల్పడడం ఎంతో బాధ వేసిందని బరువెక్కి న గుండెలతో కేటీఆర్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, చొప్పదండి మాజీ ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నా యకులు ఏనుగు మనోహర్రెడ్డి, న్యా లకొండ రాఘవరెడ్డి, మాట్ల మధు, కోడి అంతయ్య తదితర నాయకులతో ఆస్పత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పోలీసు బందోబస్తు సిరిసిల్ల ఆస్పత్రి వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. శవపంచనామా పూర్తి చేసినా కేటీఆర్ వ చ్చేంత వరకు పోస్టుమార్టం చేయలేదు. బీఆర్ఎస్ శ్రేణులతో ఆస్పత్రి నిండిపోవడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. టౌన్ సీఐ కృష్ణ, రూరల్ సీఐ మొగిలి, ఎస్బీ సీఐ రవికుమార్, ఇ ంటలిజెన్స్ సీఐ వెంకటేశ్, ఎస్సైలు రామ్మోహన్, శ్రీ నివాస్రావు, సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
‘అల్ఫోర్స్’ విద్యార్థినులకు హార్విన్ టెక్నాలజీస్లో ఉద్యోగాలు
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సూర్యనగర్లోని అల్ఫోర్స్ మహిళా డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు ఈ నెల 15న జరిగిన హైదరాబాద్ హార్విన్ టెక్నాలజీస్ కంపెనీ ఇంటర్వ్యూలో 19 వంది బిజినెస్ డెవలప్మెంట్ ప్రాసెస్ అసోసియేట్గా ఎంపికై నట్లు కరస్పాండెంట్ వి.రవీందర్రెడ్డి తెలిపారు. సుమారు 38 మంది విద్యార్థులు హాజరుకాగా.. 19మంది ఎంపికవ్వడం సంతోషదాయకమన్నారు. తృతీయ సంవత్సరం పరీక్షల తరువాత కూడా ప్లేస్మెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులను కళాశాల ప్రాంగణంలో బుధవారం రవీందర్రెడ్డి పుష్పగుచ్ఛాలతో అభినందించి నియామక పత్రాలు అందజేసారు. కంపెనీ ప్రతినిధులు వివేక్, రామకృష్ణ, వైష్ణవి పాల్గొన్నారు. -
మద్యం మత్తులో కారు డ్రైవింగ్.. ఇద్దరు మృతి
వేములవాడఅర్బన్: మద్యం మత్తులో కారు డ్రైవర్ రెండు ద్విచక్రవాహనాలను ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వేములవాడ మండలం కరీంనగర్– సిరిసిల్ల ప్రధాన రహదారిలోని రుద్రవరం స్టేజీ వద్ద బుధవారం రాత్రి కారు, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో దర్శి (35) అనే వ్యక్తి మృతిచెందాడు. మృతుడు గుంటూరుకు చెందిన వ్యక్తి. బతుకుదెరువు కోసం రుద్రవరం వద్ద కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఇతడికి భార్య, పిల్లలు ఉన్నారు. అలాగే అదే కారు ఆగకుండా కరీంనగర్ వైపు అతివేగంగా వెళ్లి ఆరెపల్లి స్టేజీ వద్ద వేములవాడ పట్టణం సుబ్రహ్మణ్యనగర్కు చెందిన మల్యాల పండరీనాథ్ (25) ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనం వెనుక ఉన్న చందుకు తీవ్రగాయాలయ్యాయి. కాగా, కారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా వాహనాలను ఢీకొనడంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉండగా, స్థానికులు 108లో వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాలను వేములవాడ టౌన్ ఎస్సై వెంకట్రాజం పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. 133.8 కిలోల గంజాయి దహనం కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని వివిధ గంజాయి కేసుల్లో సీజ్ చేసిన 133.8 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం దహనం చేశా రు. కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సమక్షంలో డ్రగ్ డి స్పోజల్ కమిటీ ఆధ్వర్యలో బుధవారం మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లిలో దహనం చేశా రు. ఏసీపీలు వేణుగోపాల్, విజయ్కుమార్, ఇన్స్పె క్టర్లు పుల్లయ్య, సంజీవ్, రజినీకాంత్ పాల్గొన్నారు. జాతీయ అర్చరీ పోటీల్లో వెండి పతకంవిద్యానగర్(కరీంనగర్): ఉత్తరాఖండ్లో ఈనెల 13 నుంచి 15 వరకు జరిగిన జాతీయస్థాయి అర్చరీ పోటీల్లో కరీంనగర్ ఆర్టీసీ జోనల్ వర్క్షాప్లో మెకానిక్గా పని చేస్తున్న కూన కిషన్ 50 మీటర్ల పోటీల్లో వెండి పతకం సాధించారు.ఈ సందర్భంగా కిషన్ను బుధవారం వర్క్షాప్ మేనేజర్ ప్రణీత్, అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ల శ్రీనివాసరావు, సురేందర్ అభినందించారు. -
మృత్యుముంగిట మూడేళ్ల బాబు
సిరిసిల్ల: మూడేళ్ల బాబు మృత్యువుతో పోరాడుతున్నాడు. వైద్యం చేయిస్తే బతికేందుకు అవకాశం ఉంది. సిరిసిల్ల పట్టణం బీవైనగర్కు చెందిన గూడూరి శేఖర్–సంజన దంపతుల మూడేళ్ల కొడుకు మనీశ్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో స్థానిక ఆస్పత్రిలో చూపించారు. జాండీస్ వల్ల లివర్ పూర్తిగా చెడిపోయిందని, ఆరోగ్య పరిస్థితి విషమించిందని డాక్టర్లు నిర్ధారించారు. హైదరాబాదులోని ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. మనీశ్కు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్స అవసరమని, ఆపరేషన్కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. బాలుడి తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ప్రైవేటు వర్కర్ కావడంతో అంత పెద్ద మొత్తంలో వైద్య ఖర్చులు భరించలేని ఆ తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో దిక్కులు చూస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి రూ.4 లక్షల వరకు ఆస్పత్రిలో చెల్లించారు. ఇంకా రూ.21 లక్షలు ఆపరేషన్కు అవసరం ఉంది. ప్రభుత్వ అధికారులు, నాయకులు, స్వచ్చంధ సంస్థలు, దాతలు స్పందిస్తేనే ఆ పసిహృదయం ఊపిరి నిలుస్తుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు స్పందించి మనీశ్ వైద్యానికి ఆర్థికసాయం అందించాలని ఆ పేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేయాలనుకునేవారు మనీశ్ తండ్రి శేఖర్ను 94411 61257 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు రూ.25 లక్షలు అవసరం చేతిలో డబ్బు లేక నిస్సహాయ స్థితిలో తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకోలు -
సకాలంలో విత్తుకోవడమే మేలు
కరీంనగర్ అర్బన్: సాగులోనూ విత్తన దశ కీలకం కాగా విత్తే సమయం కూడ అత్యంత కీలకమని కరీంనగర్ వ్యవసాయ పరిఽశోధన స్థానం హెడ్డీన్, ప్రధాన శాస్త్రవేత్త డా.జి.మంజులత వివరించారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురవడంతో అన్నదాతలు పొలంబాట పడుతున్నారు. వరి నారు పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులు పత్తి విత్తనాన్ని నాటుతున్నారు.. విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వానాకాలం సీజన్లో ఏ పంటలు సాగు చేసుకుంటే మంచిది. సాగులో అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలు, చేపట్టాల్సిన విధి విధానాలపై మంజులత వివరించారు. పత్తి, వరి, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న రైతులకు పలు సూచనలు చేశారు. వాతావరణ కేంద్రం అధికారుల అంచనా ప్రకారం ఈసారి వానాకాలం సీజన్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముంది. అందుకనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే పంటల సాగును ఎంపిక చేసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించవచ్చన్నారు. వివిధ రకాల ఎంపికే కీలకం -
తెలంగాణ పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణలో పోలీసులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అన్యాయం జరిగిందని.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెడతారా? అని ప్రశ్నించారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్..‘ఆత్మహత్య చేసుకున్న బీఆర్ఎస్ ఎంపీటీసీ కుంటయ్య పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల అంకుశాపూర్ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని రకాలుగా ఆదుకుంటామని కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం, కేటీఆర్ మాట్లాడుతూ..‘నేను ఏసీబీ విచారణలో ఉంటే నాకు ధైర్యం చెప్పాడు.. కానీ ఏమైందో తెలియదు రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. వారి ఇద్దరు పిల్లల చదువులు, పెళ్లిలు, వారికి ఉన్న అన్ని సమస్యలు నేను చూసుకుంటాను. వారికి మాట ఇస్తున్నా.ఇదే సమయంలో పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయి. అన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా మేము దిగజారి ప్రవర్తించలేదు’ అని చెప్పుకొచ్చారు.పోలీసు అధికారులకు కేటీఆర్ వార్నింగ్ పోలీసు స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయిఅన్యాయం జరిగిందని మా ఎంపీటీసీ ఫిర్యాదు చేస్తే తిరిగి అతనిపైనే కంప్లైంట్ నమోదు చేశారు 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ నాయకుల లాగా దిగజారి ప్రవర్తించలేదు https://t.co/cWfIkw3qnJ pic.twitter.com/h9xWgRtlG6— Telugu Scribe (@TeluguScribe) June 18, 2025 -
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి.సీఆర్ఎస్ డేటా ప్రకారం..2021లో నమోదైన జనన మరణాలను పరిశీలి స్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి.పురుషుల్లోనే మరణాలు అధికండేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారి లో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75›శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
స్మార్ట్ పన్నాగం!
● టెండరు లేకుండా రూ.80 లక్షల పనుల కేటాయింపు ● పద్మనగర్ ‘గరుడ జంక్షన్’ నిర్మాణ పనుల్లో చోద్యం ● నిబంధనలకు తిలోదకాలిచ్చినా పట్టని ఉన్నతాధికారులుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రభుత్వాలు మారినా స్మార్ట్ సిటీ పనుల్లో అవకతవకలు, అక్రమాలు మాత్రం ఆగడం లేదు.అంచనాలు ఇష్టారీతిన పెంచడం, నిబంధనలకు విరుద్ధంగా పనులు అప్పగించడం, నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడం సర్వసాధారణంగా మారింది. నగరంలో కొనసాగుతున్న పద్మనగర్ జంక్షన్ పనులు మరోసారి ఈ విషయాన్ని చాటుతున్నాయి. స్మార్ట్సిటీలో భాగంగా నగరంలోని పద్మనగర్ జంక్షన్ నిర్మాణాన్ని రూ.కోటి అంచనాతో చేపట్టారు. టీటీడీ నిర్మించనున్న శ్రీవేంకటేశ్వర దేవాలయానికి సమీపంలోని జంక్షన్ కావడంతో గరుడ జంక్షన్గా నామకరణంగా చేశారు. జంక్షన్ స్థలం ఇరుకుగా ఉండటం.. సిరిసిల్ల రూట్ నుంచి బైపాస్ మీదుగా నిత్యం భారీగ్రానైట్ లారీలు వెళ్తుండడంతో, ఈ జంక్షన్కు ఉన్న స్థలం సరిపోలేదు. దీంతో రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని (బుల్సెమెన్ స్థలం) తీసుకుని కొత్తగా గోడను నిర్మిస్తున్నారు. ఇక్కడ రిటెయిన్వాల్, రోడ్డు, లైటింగ్కు గాను అదనంగా రూ. 80 లక్షలు కేటాయించారు. సాధారణంగా ముందుగా నిర్ణయించిన అంచనాలకు పనులు పదిశాతం పెరిగితే, సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీకే అప్పగిస్తారు. అంచనాలు అంతకుమించితే.. టెండర్ తప్పనిసరి. కానీ..ఇక్కడ 80 శాతం నిధులు అవసరమైనప్పటికీ.. అధికారులకు టెండరు పిలవాలన్న ఆలోచన రాకపోవడం విశేషం. పనుల్లోనూ గోల్మాల్ విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పద్మనగర్ జంక్షన్ పనుల్లోనూ అక్రమాలు చోటుచేసుకొంటున్నట్లు సమాచారం. జరుగుతున్న పనులకు, బిల్లులకు పొంతన కుదరడం లేదు. పనులు కొనసాగుతుండగానే రన్నింగ్ బిల్లులు ఇవ్వడం సహహజమే అయినా, ఇక్కడే అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న రిటెయిన్ వాల్ నిర్మాణ పనుల్లో ఎం–15 గ్రేడ్ డిజైన్తో నిర్మాణం జరుగుతుండగా, బిల్లుల్లో మాత్రం ఎం–30 గ్రేడ్ డిజైన్తో నిర్మిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. భారీ భవంతులకు సైతం ఎం–25 గ్రేడ్ డిజైనే వాడుతారు. అలాంటిది రీటెయినింగ్ వాల్కు ఎం–30 గ్రేడ్ డిజైన్ వాడుతున్నామని నమోదు చేయడంలో ఆంతర్యం ఏంటో అధికారులకే తెలియాలి.ఆది నుంచీ వివాదాస్పదమే... స్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన జంక్షన్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రూ.70 లక్షలతో పూర్తయ్యే తెలంగాణచౌక్ జంక్షన్ను రూ.1.30 కోటికి పెంచారంటూ అప్పట్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లే ఫిర్యాదు చేశారు. అలాగే గాంధీ జంక్షన్లోనూ అంచనాలు పెంచి బిల్లులు తీసుకోవడాన్ని ‘సాక్షి’అప్పట్లో వెలికితీయడంతో, ఆ సమయంలో ఇన్చార్జి కమిషనర్గా ఉన్న ప్రస్తుత కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సదరు కన్స్ట్రక్షన్ కంపెనీ నుంచి రూ.81,450 డబ్బులు రికవరీ చేయడం సంచలనం సృష్టించింది. స్మార్ట్సిటీ పనులకు సాంకేతిక సహకారం అందించే ప్రాజెక్ట్ మేనేజింగ్ కన్సల్టెన్సీ (పీఎంసీ) పనులు పర్యవేక్షించిన ఆర్వీ కన్సల్టెన్సీ ముఖ్యప్రతినిధి సందీప్కుమార్ను సంప్రదించగా.. ఈ పనులకు తాము కేవలం సాంకేతిక సహకారం మాత్రమే అందించామని, టెండరు దాఖలు విషయాన్ని కమిషనర్ చూసుకుంటారని సమాధానమిచ్చారు. స్మార్ట్సిటీతో తమ ఒప్పందం ఇటీవల ముగిసిందని స్పష్టంచేశారు. -
పారిశుధ్య కార్మికులకు బాసట
● సఫాయి సురక్షా అమలు ● బీమా సౌకర్యంతో పాటు వైద్యపరీక్షలుకరీంనగర్ రూరల్: విధి నిర్వహణలో సరైన రక్షణ చర్యలు పాటించకపోవడంతో పారిశుధ్య కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో గత ఆర్నేళ్ల నుంచి కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. యూనిసెఫ్ ఆధ్వర్యంలో సఫాయి సురక్షా అమలుకు చర్యలు చేపట్టింది. జిల్లాలో 318 గ్రామపంచాయతీలతో పాటు కరీంనగర్ కార్పొరేషన్, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 2,692 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి పీఎఫ్, ఈఎస్ఐ కల్పించేందుకు వివరాలు సేకరించారు. ఆరోగ్య రక్షణకు హెల్త్కార్డులు జారీ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రితోపాటు సంబంధిత ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రతీ ఆరునెలలకోసారి ఉచితంగా వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశమిచ్చారు. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందులు పొందే సౌకర్యముంది. 1,332మంది కార్మికులకు ప్రధానమంత్రి సురక్ష బీమాయోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, పోస్టల్ ఇన్సూరెన్స్ పథకాల ద్వారా ఒక్కో కార్మికుడికి రూ.10 లక్షల వరకు బీమా చేయించారు. కార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేశారు. చేతులకు గ్లౌజ్లు, కాళ్లకు బూట్లు, తల హెల్మెట్లు అందించారు. కార్మికుల రక్షణకు చర్యలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల ఆరోగ్యరక్షణ, భద్రతపై దృష్టి పెట్టాం. కార్మికుల ఆరోగ్య వివరాలు పొందు పరిచి హెల్త్కార్డులను జారీ చేయడం జరిగింది. ప్రతి కార్మికుడికి బీమా సౌకర్యంతో కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించాం. – కిషన్స్వామి, యూనిసెఫ్ జిల్లా కో– ఆర్డినేటర్జిల్లాలో పారిశుధ్య కార్మికులు 318 గ్రామపంచాయతీల్లో: 1,313 కరీంనగర్ కార్పొరేషన్: 1,117 హుజురాబాద్ మున్సిపాలిటీ: 120 జమ్మికుంట మున్సిపాలిటీ: 102 చొప్పదండి మున్సిపాలిటీ: 40 -
లీకులతో లీడర్ల పరేషాన్
● నేడు సీడీఎంఏ వద్దకు జాబితాకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డివిజన్ల పునర్వి భజన తుది జాబితా బుధవారం సీడీఎంఏకు చేరనుంది. కలెక్టర్ ఆమోదం తరువాత సీడీఎంఏకు పంపించేందుకు అధికారులు సన్నహాలు చేస్తున్నా రు. మార్గదర్శకాలకు అనుగుణంగా పునర్విభజన సాగుతుందా లేదా అనేది ఆరా తీసేందుకు మంగళవారం హైదరాబాద్లో సీడీఎంఏ నిర్వహించిన సమావేశానికి బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్ సహా పట్టణ ప్రణాళిక అధికారులు హాజరయ్యారు. నిబంధనలకు అనుగుణంగా రూపొందించిన పునర్విభజన తుది జాబితాను ప్రదర్శించారు. నేడు సీడీఎంఏ వద్దకు డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చివరి అంఖానికి చేరుకుంది. షెడ్యూల్ ప్రకారం 17, 18 తేదీల్లో కలెక్టర్ పరిశీలన, ఆమోదం తరువాత 19వ తేదీన సీడీఎంఏకు జాబితాను పంపించాల్సి ఉంది. కలెక్టర్ పమేలా సత్పతి శస్త్ర చికిత్స చేసుకోవడంతో బుధవారం ఉదయం ఆమె జాబితాను పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే నిబంధనలకు అనుగుణంగా తుది జాబితాను రూపొందించగా, జాబితాలోని మార్గదర్శకాలను సీడీఎంఏకు సైతం వివరించారు. దీంతో పెద్దగా మార్పు లేకుండానే జిల్లా కలెక్టర్ ఆమోదించే అవకాశం ఉంది. బుధవారం రాత్రి వరకు జాబితాను సీడీఎంఏకు పంపించనున్నారు. హైదరాబాద్కు కమిషనర్ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా డివిజన్ల పునర్విభజన జరుగుతుందా లేదా అనేది పరిశీలించేందుకు సీడీఎంఏ మంగళవారం హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పునర్విభజన చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులను రావాలని ఆదేశించింది. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, పట్టణప్రణాళిక విభాగం అధికారులు కరీంనగర్ నుంచి హాజరయ్యారు.అంతా ఉత్కంఠ డివిజన్ల పునర్విభజన తుది జాబితా సిద్ధం కావడంతో, మాజీకార్పొరేటర్లు, ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. తమ డివిజన్లు ఎలా ఉన్నా యో అంటూ ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కొంతమంది అధికారులు డివిజన్ల పునర్విభజనపై లీకులు ఇవ్వడం గందరగోళానికి దారితీసింది. లీకుల సమాచారం మేరకు తాము అనుకున్న రీతిలో కాలేదని తెలిసిన కొంతమంది నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచారు. తమ పార్టీ పెద్దలతో ఫోన్లు చేయించారు. దీంతో లీకులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. -
మెడికవర్లో అరుదైన శస్త్రచికిత్స
కరీంనగర్టౌన్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణ్కుమార్ అనే యువకుడికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు ఆసుపత్రి సర్జికల్ గ్యాస్ట్రో డాక్టర్ దిలీప్రెడ్డి, జనరల్ సర్జన్ డాక్టర్ వారిస్ ఉస్మాని(తాహా) తెలిపారు. ఆసుపత్రిలో మంగళవారం మాట్లాడుతూ.. శ్రీకరీంనగర్కు చెందిన శ్రావణ్కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్తే కన్నుపై దెబ్బ తగిలిందని కుట్లు వేశారు. కడుపులో తీవ్ర గాయమై, రక్తం లీక్ అవుతుందని తెలపడంతో పలు ఆస్పత్రులకు తీసుకెళ్తే తమతో కాదన్నారు. చివరకు ప్రాణాపాయస్థితిలో మెడికవర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శ్రావణ్కుమార్కు సీటీస్కాన్ చేయడంతో కడుపులో బ్లంట్ ఇంజ్యూరీ అబ్డామెన్ (తీవ్ర రక్తస్రావం) అవుతున్నట్లు గుర్తించాం. బైక్ హ్యాండిల్ కడుపులో బలంగా గుచ్చుకోవడంతో రక్తస్రావంతో పాటు లివర్, ఫ్రాంకియాస్, స్ల్పీన్ దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసి లివర్కు చికిత్స చేశాం. తప్పని పరిస్థితుల్లో ఫ్రాంకియాస్ కొంతభాగం, స్ల్పీన్ (ఫ్లీహం) మొత్తం తొలగించడం జరిగిందనిశ్రీ అని వెల్లడించారు. ప్రస్తుతం శ్రావణ్కుమార్ ఆరోగ్య పరిస్థితి బాగుందని తెలిపారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్ పాల్గొన్నారు. -
ఆధార్ నవీకరణకు మరో ఏడాది పెంపు
కరీంనగర్ అర్బన్: ఆధార్ కార్డుల నవీకరణకు కేంద్రం మరో ఏడాది వరకు గడువు పొడిగించింది. 2026 జూన్ 30 వరకు ఆధార్ కార్డులను నవీకరించుకోవడానికి అవకాశమిచ్చింది. ఆ తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తే కార్డు సస్పెండ్ చేస్తారు. ఒకసారి ఆధార్ కార్డు సస్పెండైతే దానిని పునరుద్ధరించుకోవడానికి వివిధ ధ్రువపత్రాలు పెట్టి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కార్డుల నవీకరణకు కొందరు ఉత్సాహం చూపుతుండగా అవగాహన లేనివారు మాత్రం దూరంగా ఉంటున్నారు. మరికొందరు మొబైల్ లో శ్రీమై ఆధార్శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని వివరాలను నవీకరించుకుంటున్నారు. అన్నింటికీ ఆధారం పదేళ్ల క్రితం కార్డులు పొందినవారందరూ నవీకరించుకోవాలని యూఐడీఐ నుంచి కార్డుదారులకు మొబైల్కు సంక్షిప్త సందేశాలు అందుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2011– 12మధ్య ప్రాంతంలో 9 లక్షల మంది ఆధార్ కార్డులు తీయించారు. అప్పుడు ఊరూరా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఆధార్ నమోదు చేయించారు. పదేళ్ల చెల్లుబాటు అయ్యేలా నిబంధనలు విధించారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ ను నవీకరించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆధార్ కార్డు అన్నిటికీ కీలకంగా మారింది. బ్యాంకు ఖాతాలు తెరవడం, విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, సీఎం ఆర్థికసాయం, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు కూడా ఆధార్ ను తప్పనిసరి చేశారు. ఆధార్ అప్ డేట్ లేకుంటే కొందరికి రేషన్, పింఛన్లు కూడా ఆగిపోతున్నాయి. ఆధార్ కార్డులు తీసుకున్నప్పటికీ కొందరు అప్డేట్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే రెండు మార్లు గడువు పొడిగించిన కేంద్రం మరో ఏడాది వరకు ఆధార్ నవీకరణ గడువు పెంచింది. ఏమేం కావాలంటే.. ఆధార్కార్డు నవీకరణకు ఏదైనా ప్రభుత్వ గుర్తింపుపత్రం తీసుకెళ్లాలి. చదువుకున్నవారు పదోతరగతి మార్కుల మెమో తీసుకెళ్తే సరి. ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, మ్యారేజ్ సర్టిఫికెట్ వెంట తీసుకెళ్తే ఆధార్ నవీకరణ పూర్తి చేసుకోవచ్చు. జిల్లాలో పాత జనాభా లెక్కల ప్రకారం 10 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పుడు మరో లక్ష వరకు జనాభా పెరిగే అవకాశం ఉంది. వీరికి అనుగుణంగా ఆధార్ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉంది. ● పదేళ్లకోసారి అప్డేట్ తప్పనిసరి -
విధుల నుంచి అన్యాయంగా తొలగించారు
● గురుకులం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నిరసన ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం దుమాల ఏకలవ్య గురుకులం ఆశ్రమ పాఠశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడంతో మంగళవారం పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగారు. పర్మినెంట్ ఉద్యోగులు రావడంతో తమను విధుల నుంచి తొలగించడంతో రోడ్డునపడ్డామని ల్యాబ్ అసిస్టెంట్ నిర్మల, కుకింగ్ మాస్టర్ బాలు, ఏఎన్ఎం సుజాత, మరోకరు ఆవేదన వ్యక్తం చేశారు. తమను తొలగించడాన్ని నిరసిస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. 20 ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా పని చేస్తున్న తమను అన్యాయంగా తొలగించారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ పాఠశాలల్లో పని చేస్తున్న 73 మందిని తొలగించగా, అందులో వీరు కూడా ఉన్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించారని గిరిజన గురుకులం నాన్ టీచింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా పూల్సింగ్ అన్నారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఆందోళన చేస్తున్న వారికి గిరిజన సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమాకాంత్ అక్కడికి వెళ్లి పాఠశాల ప్రిన్సిపాల్, ఔట్సోర్సింగ్ సిబ్బందితో మాట్లాడి శాంతింపజేశారు. ఈ సందర్భంగా ఔట్సోర్సింగ్ సిబ్బంది మాట్లాడుతూ, పాఠశాలలో 20ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా తాము విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. ఉన్నఫలంగా తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డునపడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని కోరారు. -
బండమీది బడి.. చదువుల ఒడి
● ఈ బడిలో చదివి ఉన్నతస్థానాల్లో నిలిచిన పలువురు ● ఎంతో మందికి ఉజ్వల భవిష్యత్తు ఇచ్చిన రుద్రంగి పాఠశాలరుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలోని బండమీది బడిగా ప్రఖ్యాతి పొందిన రుద్రంగి జెడ్పీ హైస్కూల్కు బహుచరిత్ర ఉంది. సుమారు 70 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉజ్వల భవిష్యత్తును పొందారు. ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తూ బండమీది బడి చదువుల ఒడిగా విలసిల్లుతుంది. ప్రస్తుత ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బండమీది బడిలోనే హైస్కూల్ విద్యను అభ్యసించారు. అలాగే ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అంబటి నర్సయ్య, హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయిన రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు ఈ బడిలో విద్యను అభ్యసించినవారే. ఉన్నత స్థానాల్లో మరికొందరు.. హన్మాజీపేట గ్రామానికి చెందిన గడ్డం జలపతిరెడ్డి రాష్ట్ర ఎస్టీవోగా చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చందన చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్గా ప్రస్తుతం హైదరాబాద్లో చేస్తున్నారు. దేశవేని శంకర్ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా చేస్తుండగా, రుద్రంగికి చెందిన కత్తి మల్లయ్య ఆడిటర్గా పనిచేశారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఉప్పులూటి గోవిందరావు అసిస్టెంట్ ఇంజినీర్గా, చందుర్తి మండల కేంద్రనికి చెందిన దామోదర్ వరంగల్లో ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారు. రుద్రంగికి చెందిన ఆకుల రవి ఇటీవల స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించారు. వెంకటేశం బ్యాంకు మేనేజర్గా చేసి ఉద్యోగ విరమణ పొందారు. రుద్రంగికి చెందిన మర్రిపల్లి చక్రవర్తి సేఫ్టీ కన్సల్టెంట్గా చేస్తున్నారు. ఇంకా ఎంతో మంది రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. చదివిన బడిలోనే టీచర్గా.. బండమీది బడిలో ఉన్నత విద్యను అభ్యసించిన రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గడప వేణుకుమార్ చదివిన బడిలోనే టీచర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. చదివిన బడిలోనే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే అవకాశం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.రుద్రంగి బడిలో నాణ్యమైన విద్య రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. తల్లిదండ్రులు తమ పిల్లలను రుద్రంగి జెడ్పీ హైస్కూల్లో చేర్పించాలి. – సమ్మిరెడ్డి, హెచ్ఎం, రుద్రంగి జెడ్పీ హైస్కూల్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి రుద్రంగికి చెందిన ఓలిమినేని నిరంజన్రావు రుద్రంగి బండమీది బడి విద్యార్థి. ఇక్కడ ఓనమాలు నేర్చిన ఆయన ఉన్నత చదువులు చదివి హైకోర్టు జడ్జిగా చేసి రిటైర్డ్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు.ఏసీపీగా నర్సయ్య బండమీద బడి విద్యార్థి పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రానికే చెందిన అంబటి నర్సయ్య తన ప్రాథమిక, ఉన్నత, ఇంటర్, పోస్టు గ్రాడ్యుయేషన్ చదువులు అంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే కొనసాగించి పోలీస్ శాఖలో ఎస్సైగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ప్రస్తుతం వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఏసీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రుద్రంగి హైస్కూల్ విద్యార్థి ప్రభుత్వ విప్గా.. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రుద్రంగి. రుద్రంగి బండ మీది బడిలోనే తన హైస్కూల్ విద్యను అభ్యసించారు. చదువుకున్న బడితో పాటు నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే అవకాశం లభించడం ఎంతో గర్వ కారణంగా ఉందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని, విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చేరి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలవాలని కోరారు. -
పేదల రక్తం తాగుతున్న బీజేపీ సర్కార్
● కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు సిరిసిల్లటౌన్: పెంచిన నిత్యవసరాల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మొగిలి సునీతారావు డిమాండ్ చేశారు. ధరలు తగ్గించాలంటూ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా నేతలతో ధర్నా చేపట్టి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరుపేదల నడ్డి విరిచేలా నిత్యవసర సరుకుల ధరలు పెంచడం సమంజసం కాదన్నారు. బీజేపీ పాలనలో సంక్షేమం కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని లేకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతకుముందు జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్.. కార్యక్రమం సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి నేతన్న విగ్రహం వరకు వందలాది మహిళా కార్యకర్తలతో ర్యాలీ తీశారు. సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. సిరిసిల్లలో డబుల్బెడ్ రూం లబ్ధిదారుల వద్దకు వెళ్లి భూమి పూజ నిర్వహించారు. రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం జరిగిందని, మహిళలకోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, సీనియర్ నాయకురాలు మడుపు శ్రీదేవి, జనరల్ సెక్రటరీ కోడం అరుణ, రోజా, సరిత, బ్లాక్ ప్రెసిడెంట్ రమాదేవి, టౌన్ ప్రెసిడెంట్ స్వరూప, ముసుకు పద్మ, రుక్మిణి, లహరి, హారిక, వనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యసేవలు భేష్
కరీంనగర్టౌన్: ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వైద్యసేవలు వినియోగించుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ ప్రభుత్వాసుప త్రిలో ఎండోస్కోపీ నేషల్ సర్జరీ, సెప్టో ప్లాస్టిక్టినీ దిగ్విజయంగా వైద్యుల బృందం పూర్తి చేయగా, మంగళవారం కలెక్టర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆ ధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారని, తానే స్వయంగా చూసి ఇష్టంతో సర్జరీ చేయించుకున్నానని తెలిపారు. సూపరింటెండెంట్ వీరారెడ్డి నేతృత్వంలోని వైద్యుల బృందం కలెక్టర్కు పుష్పగుచ్ఛం అందజేశారు. వైద్యు ల బృందానికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
వర్షాకాలం.. కరెంట్తో పైలం
● విద్యుత్తో అప్రమత్తత, జాగ్రత్త తప్పనిసరి ● అత్యవసర, అంతరాలుంటే 1912 టోల్ఫ్రీని సంప్రదించండి ● కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబుకొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు/ రైతులు వర్షాకాలంలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. విద్యుత్ అంతరాయం జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని పేర్కొన్నారు. మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడా రు. వినియోగదారులకు పలు సూచలు ఇచ్చారు. తడిసిన ఉపకరణాలను తాకొద్దు వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాల స్టేవైరు/సపోర్టు వైరు, తడిచిన విద్యుత్ ఉపకరణాలను తాకొద్దు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను ముట్టుకోవద్దు. అలాంటివి గమనిస్తే విద్యుత్ సిబ్బందికి తెలియజేస్తే సరిచేస్తారు. అనుమతిలేని వ్వక్తులు/వినియోగదారులు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లకు ఫ్యూజులు మార్చడం, సర్వీసు వైర్లు, వీధి దీపాలను సరి చేయడం కారణంగా విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కావున జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ దండేలు వాడాలి బట్టలు ఆరవేసే జీఐ దండెం వైర్లపై నుంచి విద్యుత్ వైర్లు వెల్లడంతో విద్యుత్ వైర్లలో ఇన్సులేషన్ సరిగ్గా లేకపోవడం షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కనుక ప్లాస్టిక్ దండేలు ఉపయోగించాలి. ఇంటి ఎదుట రేకులకు విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంది. విద్యుత్ సరఫరా వైర్లను ఎట్టి పరిస్థితుల్లో దండేలకు, రేకులకు తగలనివ్వకూడదు. రైతులు జాగ్రత్త రైతులు వ్యవసాయ పంపుసెట్లను వినియోగించినప్పుడు కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్ విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. కరెంటు మోటార్లను కాని, పైపులను కాని, ఫుట్ వాల్వులను ఏమరపాటుతో తాకకూడదు. పంపుసెట్లను, స్టార్టర్లను విధిగా ఎర్త్ చేయించుకోవాలి. సొంత కరెంట్ పనులు చేసుకొని ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు. పశువులను మేతకు తీసుకువెళ్లినప్పుడు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త వహించాలి. పొలంలో విద్యుత్ కంచెలు వేయడం సైతం చట్టవ్యతిరేకం.తెలిసినవారితో మరమ్మతు చేయించాలి ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనధికారంగా ఫ్యూజులు మార్చడం, రిపేరుచేయడం, ఏబీ స్విచ్లు ఆపరేట్ చేయడం, కాలిన తీగలను సరిచేయడం ప్రమాదకరం. మోటారు రిపేరు తెలిసిన వారి చేతనే మరమ్మతు చేయించుకోవాలి. వ్యవసాయ మోటార్లకు, గృహాలలో అతుకులు లేని సర్వీసు వైరు ఉపయోగించాలి. ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే ఆ వ్యక్తిని ముట్టుకోరాదు. షాక్కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని (కర్ర, ప్లాస్టిక్ లాంటి) వస్తువులను వాడాలి. విద్యుత్ లైన్ల కింద పందిరిలు వేసి జెండా గద్దెలు కట్టి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. కరెంటు లైన్ల క్రింద పందిర్లు వేయరాదు. గ్రామీణ వినియోగదారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బంది లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ఇన్స్పెక్టర్, సబ్ ఇంజినీర్, సెక్షన్ ఆఫీసర్ను సంప్రదించి వారిసేవలను పొందాలి. -
అల్ఫోర్స్ ఇ– టెక్నో విద్యార్థినికి గిన్నీస్బుక్లో చోటు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో 5వ తరగతి చదువుతున్న బుక్క దీత్య శ్రీగిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్శ్రీలో చోటు సాధించినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో సుమారు 2,400 మందికి పైగా కళాకారులతో కలిసి పాల్గొని ప్రతిష్ఠాత్మక గిన్నీస్బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు కై వసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. విద్యార్థినిని మంగళవారం స్థానిక పాఠశాలలో ప్రశంసాపత్రాన్ని అందజేసి అభినందించారు. అపోలో రీచ్లో నూతనంగా గ్యాస్ట్రో, లివర్ చికిత్సలుకరీంనగర్టౌన్: నగరంలోని అపోలో రీచ్ హాస్పిటల్లో నూతనంగా గ్యాస్ట్రోఎంటరాలజీ, లివర్ డిసీజ్ విభాగం ఏర్పాటు చేసినట్లు ఏవో డాక్టర్ నాగసతీశ్, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. అత్యాధునిక ఎండోస్కోపీ పరికరాలతో జీర్ణ, ప్రేగు, లివర్ సంబంధిత రోగాలకు సమగ్ర చికిత్సలను అందించనున్నట్లు తెలిపారు. ఇజ్రాయిల్లో జగిత్యాల వాసి మృతిజగిత్యాలక్రైం: జగిత్యాలలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవిగౌడ్ (45) ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో గుండెపోటుతో మరణించాడు. మంగళవారం జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి రవిగౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇజ్రాయిల్ దేశంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించేందుకు జాప్యం జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే సంజయ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో మాట్లాడి మృతదేహాన్ని స్వదేశానికి తెప్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్షాక్తో యువకుడు..జగిత్యాలక్రైం(సారంగాపూర్): సారంగాపూర్ మండలం పోతారంలో కొత్త ఇంట్లో వైరింగ్ చేస్తుండగా నా రపాక బల్తగిరి (25) విద్యుత్షాక్ తగిలి మృతిచెందా డు. బీర్పూర్ మండలం ఇందిరనగర్కు చెందిన నారపాక బల్తగిరి ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సా రంగాపూర్ మండలం పోతారానికి చెందిన బై రి రమేశ్ ఇంట్లో విద్యుత్ వైరింగ్ చేస్తుండగా ప్ర మాదవశాత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సారంగాపూ ర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్ధర్మపురి: తనకు దొరికిన తులం బంగారం చైన్ను పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ధర్మపురికి చెందిన నూగూరి నగేష్ ఆటో డ్రైవర్. మంగళవారం స్థానిక బస్టాండ్ సమీపంలో అతడికి తులం బంగారు చైన్ దొరికింది. దానిని ధర్మపురి పోలీస్స్టేషన్కు వెళ్లి సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై ఉదయ్కుమార్కు అందించాడు. అప్పటికే గొలుసు పోయిందని బాధితులు వెదుకుతుండగా వారిని విచారణ చేపట్టిన పోలీసులు వారికి అప్పగించారు. నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్ నగేష్ను శాలువాతో సన్మానించారు. -
పీపీలతో సీపీ సమావేశం
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీపీ గౌస్ఆలం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్లో పోలీసు అధికారుల సమన్వయంతో 3,478 కేసులు పరిష్కరించినందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అభినందించారు. కోర్టులో పెండింగ్ కేసులను పరిష్కరించడంలో పోలీ సుల సమన్వయ లోపముంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, సీసీఆర్బీ ఏసీపీ జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు రాములు, గౌరు రాజిరెడ్డి, కుమారస్వామి, ఝాన్సీ, ఏపీపీలు గాయత్రి, వీరాస్వామి, రంజిత్ కుమార్, సీఐ సంతోష్కుమార్ పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారులకు శిక్షణకరీంనగర్ అర్బన్: బూత్ లెవెల్ ఆఫీసర్ల ఎంపిక, అర్హతలు, నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆన్లైన్ శిక్షణ ఇచ్చింది. బీఎల్వోల ఎంపికలో అనుసరించాల్సిన విధానం, ఉండాల్సిన అర్హతలు, వారు నిర్వర్తించవలసిన విధులు, ఓటర్లకు ఏ విధంగా సహకరించాలనే అంశాలపై ఎలక్షన్ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వచ్చే నెల 2న బూత్ లెవెల్ ఆఫీసర్లకు జిల్లాల వారీగా ఈఆర్వోల ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించనున్నారు. కరీంనగర్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు పాల్గొన్నారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలి కరీంనగర్టౌన్: వర్షాకాలం నేపథ్యంలో దోమలు పుట్టకుండా, కుట్టకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. డీఎంహెచ్వో కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక, పట్టణ ఆరోగ్యకేంద్రం వైద్యాధికారులకు ఎంఎల్హెచ్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, దోమల నిర్మూలనకు పంచాయతీరాజ్, మున్సిపల్శాఖతో కలిసి ప్రజారోగ్యం మెరుగుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 16 తేదీ నుంచి జూలై 31వరకు 45 రోజులపాటు ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమం జిల్లాలో జరుగుతుందన్నారు. పిల్లలకు విరేచనాలు సోకినట్లయితే వోఆర్ఎస్, జింక్ మాత్రలు అందించాలన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ సుధా, రవీందర్ రెడ్డి, ఉమాశ్రీ, సాజిద, చందు, సనజవేరియా, విప్లవ శ్రీ, రాజ గోపాల్, స్వామి, కై క పాల్గొన్నారు. కొర్రమీను చేపల పెంపకంపై శిక్షణ కరీంనగర్ అర్బన్: కొర్ర మీను చేపల పెంపకంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ ప్రారంభమైంది. కొర్రమీను హెచరీ యాజమాన్యం, పెంపకం పద్ధతులపై మూడు రోజుల పాటు శిక్షణ జరగనుండగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ హాజరై పలు సూచనలు చేశారు. చేప పిల్లల ఉత్పత్తి, నూతన పద్ధతిలో చేపల పెంపకంపై అవగాహన కల్పించారు. మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ మురళీకష్ణ, ఎన్ఎఫ్డీబీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దీప, సీఐబీఐ సీనియర్ సైంటిస్ట్ రాజేశ్, నాబార్డ్ ఇన్చార్జి అర్పిత, నాబార్డ్ ఏజీఎం జయప్రకాశ్, జిల్లా మత్స్యశాఖ అధికారి భారతి, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్టల రవీందర్ పాల్గొన్నారు. -
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
● 2021లో జననాల కన్నా మరణాలు అధికం ● ఆ మరణాల్లో పురుషులే ఎక్కువ ● మృతులంతా 65 ఏళ్ల నుంచి 69 ఏళ్ల వారే ● ఐరాస ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ డేటాలో వెల్లడి ● 2022లో తిరిగి పుంజుకున్న జననాలుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ప్రపంచదేశాలను గడగడలాడించిన కోవిడ్ మహమ్మారి మిగిల్చిన విషాదాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నిలువుదోపిడీ చేసి వేలాది మందిని బలితీసుకున్న ఆ వైరస్ వదలిన ఆనవాళ్లు ఇప్పట్లో చెరిగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన పాపులేషన్ రిపోర్ట్ సమర్పించిన ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ (సీఆర్ఎస్) డేటా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో జననాల కన్నా అత్యధిక మరణాలు చోటు చేసుకున్న 49 జిల్లాల్లో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటి. కోవిడ్ అనంతరం ప్రజల ఆరోగ్యాలు, జీవనశైలిలో మార్పులు రావడం, సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించడంతో ఆ ఏడాది మరణాలు అధికంగా సంభవించాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2021లో నమోదైన జనన మరణాలను పరిశీలి స్తే, 5,130 మరణాలకు 5,028 జననాలు చోటు చేసుకున్నాయి. ఆ మరణాలు కేవలం సిరిసిల్ల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఆ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,34,425 మరణాలు రికార్డయ్యాయి. అందులో 1,35,725 మంది పురుషులు, 98,700 మంది మహిళలు ఉన్నారు. ఈ గణాంకాల ప్రకారం.. మహిళల కన్నా పురుషులు 40శాతం అధికంగా మరణించారు. ఆ ఏడాది చోటు చేసుకున్న మరణాల్లో పట్టణ ప్రాంతాల్లో 61,553 పురుషులు, 46,674 మంది మహిళలు మరణించగా.. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో 1,06,327 మరణాలు సంభవించాయి. పురుషుల్లోనే మరణాలు అధికం డేటా ప్రకారం 65 నుంచి 69 ఏళ్ల వయసు వారి లో మరణాల రేటు అధికంగా ఉంది. ఈ వయసులో ఉన్న వారిలో 85,945 మరణాలు రికార్డయ్యాయి. ఇక 70 ఏళ్ల పైబడిన వారిలో 51,516 మరణాలు నమోదయ్యాయి. 55 నుంచి 64 ఏళ్ల 42,349 మంది మరణాలు, 45– 54 వయసు గ్రూపులో 12,184 మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ స్థాయిలో మరణాలు చోటు చేసుకోవడానికి కోవిడ్ ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో జీవన విధానంలో మార్పులు, బీపీ, హైపర్ టెన్షన్, గుండె సంబంధిత వ్యాధులు కూడా వీరి మరణాలకు కారణమై ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ మరణాల రికార్డులో ముందంజలో ఉంది. 75శాతం మేరకు మరణాలు అప్పటికప్పుడే రిపోర్టు అవుతున్నాయి. మిగిలినవి తరువాత రిపోర్టు అవుతున్నాయి. సీఆర్ఎస్ డేటా ప్రకారం.. 2022లో రాజన్న సిరిసిల్లలో 3,220 మరణాలు నమోదవగా, 7647 జననాలు నమోదయ్యాయి. ఏడాది తరువాత కోవిడ్ ప్రభావం తగ్గిపోవడంతో మరణాలు కూడా తగ్గుముఖం పట్టి ఉంటాయని భావిస్తున్నారు. -
సంగీతమే ఆయన ప్రాణం
● రాణిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ● మూడుసార్లు బంగారు పతకాలు ● 26 ఏళ్లుగా కచేరీలుజగిత్యాలరూరల్: అతడికి చిన్నప్పటి నుంచే చదువుతోపాటు సంగీతం అంటే ఎంతో ఇష్టం. తన సంగీతంతో జాతీయ, రాష్ట్రస్థాయిలో పలువురి మన్ననలు పొంది అవార్డులు కూడా అందుకున్నారు. ధర్మపురికి చెందిన గుండి జగదీశ్వర్శర్మ మేడిపల్లి మండలం వల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రేడియో, టీవీ గాయకుడిగా పలు సంగీత కచేరీలు నిర్వహిస్తూ మన్ననలు పొందారు. పలు టీవీ సీరియల్స్కు సంగీతం అందించారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి, మాదవపెద్ది సురేశ్, ఆర్పీ పట్నాయక్తో కలిసి పలు సంగీత కచేరీల్లో పాల్గొన్నారు. 26ఏళ్లలో 1,596 కచేరీలు నిర్వహించారు. ఇందులో 120 బెస్ట్ సింగర్ అవార్డులు అందుకున్నారు. దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం పేరున మూడుసార్లు, గంటసాల పేరున రెండుసార్లు అవార్డులు అందుకున్నారు. ఆయన సంగీత సేవలకు ఢిల్లీ యూనివర్సిటీ డాక్టరేట్ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అందించింది. ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి శతకం, వినాయక భక్తి గీతాలు, రాముని భక్తిగీతాలు, ఆంజనేయస్వామి భక్తి గీతాలు పాడి తన సంగీతాన్ని పలువురికి వినిపించారు. -
ఏసీబీకి చిక్కిన జెడ్పీ అధికారులు
కరీంనగర్క్రైం: జిల్లా పరిషత్లో అద్దె వాహనాలకు బిల్లు చెల్లింపు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. జిల్లా పరిషత్లో ఓ వ్యక్తి తన వాహనాన్ని అద్దెకు పెట్టాడు. 10నెలలు బిల్లు ఇవ్వాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితం 4నెలల బిల్లు చెల్లించారు. మిగితా 6 నెలల బిల్లు ఇవ్వాలంటే రూ.8వేల లంచం ఇవ్వాలని పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్లో డబ్బులు తీసుకుంటుండగా ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
బహ్రెయిన్లో 9 మంది అరెస్ట్
● సాయం కోసం ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశం వెళ్లిన కార్మికులు చేయని తప్పునకు అక్కడ శిక్ష అనుభవిస్తున్నారు. బహ్రెయిన్లో ఆల్ మోయ్యాద్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ కార్మికులను ఇంధనం దుర్వినియోగం కేసులో ఇటీవల అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన బొమ్మడి సుదర్శన్ బహ్రెయిన్లో డ్రైవర్గా పనిచేస్తాడు. ఆయనతోపాటు మరో 8 మందిని ఈనెల 4న అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి న్యాయ సహాయం అందించాలని సుదర్శన్ కుమారుడు నితిన్ మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లోని ప్రవాసి ప్రజావాణిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిళ్ల రవిగౌడ్, నంగి దేవేందర్రెడ్డి, బొజ్జ అమరేందర్రెడ్డితో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టైఫండ్ చెల్లించాలికరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరులోని ప్రతిమ మెడికల్ కళాశాల హౌజ్సర్జన్లు స్టైఫండ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం ప్రతి హౌజ్సర్జన్కు నెలకు రూ.25వేల స్టైఫండ్ చెల్లిస్తోందన్నారు. కళాశాల యాజమాన్యం ఎవరికీ స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆరోపించారు. స్టైఫండ్ చెల్లించేవరకు ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని తెలిపారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం34.0 /26.0బుధవారం శ్రీ 18 శ్రీ జూన్ శ్రీ 20257బాధ్యతల స్వీకరణకరీంనగర్ అర్బన్: జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా డాక్టర్ అశ్విని తానాజీ వాకడె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, ఏవో సుధాకర్ స్వాగతం పలికారు.క్వింటాల్ పత్తి రూ.7,400 జమ్మికుంట: స్థానిక మార్కెట్లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,400 పలికింది. మార్కెట్కు 42 క్వింటాళ్ల పత్తిని రైతులు తెచ్చారు. కార్యదర్శులు మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
గంగాధర(చొప్పదండి): మండలంలోని వెంకటాయిపల్లి గ్రామంలో ఈనెల 8న చోరీకి పాల్పడిన నిందితుడిని సోమవారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, గంగాధర ఎస్సై వంశీకృష్ణ పేర్కొన్నారు. గంగాధర పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. వెంకటాయిపల్లికి చెందిన ఉప్పుగండ్ల గంగారెడ్డి ఈనెల 8న ఇంటికి తాళం వేసి తాగునీరు తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 13న ఇరువురు నిందితులను అదుపులోకి తీసుకొని 20 తులాల బంగారం స్వాధీనం చేసుకోగా, సోమవారం చందుర్తి మండలం రామరావుపల్లికి చెందిన పిట్టల అరవింద్ను అదుపులోకి తీసుకొని 3 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ, ఎస్సై పేర్కొన్నారు. పోగొట్టుకున్న పుస్తెలతాడు అప్పగింతమల్యాల: మండలంలోని ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం కోసం వెళ్లి పుస్తెలతాడు పోగొట్టుకున్న మహిళకు పోలీసులు తిరిగి అప్పగించారు. ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన సుజాత ఈనెల 15న కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చింది. ఈ క్రమంలో పుస్తెలతాడును పోగొట్టుకుంది. ఆ తాడు భక్తులకు దొరకడంతో వారు ఏఎస్సై శ్రీనివాస్కు అప్పగించారు. ఆయన మైక్లో అనౌన్స్ చేయగా.. సుజాత పోలీసులను సంప్రదించింది. దీంతో సోమవారం ఏఎస్సై రమణారెడ్డి మహిళ వివరాలు, ఆధార్కార్డు ఆధారంగా పరిశీలించి పుస్తెలతాడు అప్పగించారు. ఏఎస్సై, పోలీసులు అంజయ్య, తిరుపతి, రమేశ్కు సుజాత కృతజ్ఞతలు తెలిపింది. -
విద్యుదాఘాతానికి గురైన ట్రాన్స్కో తాత్కాలిక ఉద్యోగి
ఇబ్రహీంపట్నం: బర్థీపూర్ గ్రామంలో ట్రాన్స్కోలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగి సాంబరి హరీశ్ ఈనెల 12న విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్తంభంపై నుంచి పడి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. బర్థీపూర్ గ్రామంలో విద్యుత్ అంతరాయం కలగగా.. లైన్మెన్ రాజు సెలవులో ఉండడంతో మరమ్మతు చేసేందుకు లైన్ ఇన్స్పెక్టర్ ఫ్రాంక్లిన్ తాత్కాలిక ఉద్యోగులు హరీశ్, శ్రీకాంత్లను తీసుకెళ్లారు. స్తంభంపైకి ఎక్కి చూడాలని లైన్ ఇన్స్స్పెక్టర్ సూచించగా.. హరీశ్ పైకి ఎక్కి మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతంతో కింద పడిపోయాడు. ఏఈ సతీశ్ వచ్చి పరిశీలించి హరీశ్ను మెట్పల్లి ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని రేనె ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు. హరీశ్ కుటుంబం పేద కుటుంబం కావడంతో వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్తోమత లేదు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి సాయమందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 85008 56881 ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు దాతల సాయం కోసం ఎదురుచూపులు -
పిల్లలు పుట్టడం లేదని వివాహిత ఆత్మహత్య
సైదాపూర్(హుస్నాబాద్): మండలంలోని ఆకునూర్లో ఓ వివాహిత పిల్లలు పుట్టడం లేదని ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొడిపెల్లి లక్ష్మి–కిషన్ దంపతుల కూతురు తేజస్విని(26)ని నాలుగేళ్ల క్రితం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్కు చెందిన జెల్ల సతీశ్కు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయి నాలుగేళ్లు కావస్తున్నా సంతానం కలగడం లేదని తేజస్విని మనోవేదనకు గురై ఈ నెల 13న ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగింది. చికిత్స కోసం జమ్మికుంట ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. షార్జాలో కరీంనగర్ వాసి మృతికరీంనగర్క్రైం: షార్జాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న కరీంనగర్లోని కశ్మీర్గడ్డకు చెందిన ఖాజా మెహరాజ్(46) మృతిచెందాడు. 8 ఏళ్లుగా షార్జాలో ఉంటూ అల్ఖైరిన్ బాయ్స్ పాఠశాలలో ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం అతడి కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవడంతో అక్కడే ఉన్న వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా అతను ఉండే నివాసం తలుపుతీసి చూడగా మృతిచెంది ఉన్నాడు. కాగా గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. షార్జాలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇండియాకు తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నట్లు తెలిసింది. దాడి ఘటనలో 9 మంది రిమాండ్సిరిసిల్లక్రైం: భూవివాదాన్ని దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడ్డ సంఘటనలో తొమ్మిది మందిని రిమాండ్కు తరలించినట్లు సిరిసిల్ల సీఐ కృష్ణ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటకు చెందిన కొలగాని అంజయ్య, అతని అన్న కొడుకులు కొలగాని నాగరాజు, కొలకాని శ్రీనివాస్ మధ్య భూవివాదం ఉంది. ఈ నేపథ్యంలో అంజయ్య కుటుంబంపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు కొలగాని శ్రీనివాస్, కొలగాని నాగరాజు, కొలగాని మంగవ్వ, కొలగాని మమత, కొలగాని యెల్లవ్వ, వేముల పెద్దభూమయ్య, వేముల నాగరాజు, వేముల ప్రశాంత్, వేముల అలియాస్ గుండు మల్లేశంను రిమాండ్ చేశారు.