breaking news
Karimnagar
-
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పున ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. -
ఆర్టీసీకి దసరా ధమాకా
కరీంనగర్: టీజీ ఆర్టీసీకి బతుకమ్మ, దసరా పండుగలు కాసుల వర్షం కురిపించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు పండక్కి ప్రత్యేక బస్సులు నడుపగా కరీంనగర్ రీజియన్కు 11రోజుల్లో 4,80,01,642 ఆదాయం సమకూరింది. కరీంనగర్–2 డిపో రూ.76,62,160తో మొదటిస్థానం, గోదావరిఖని డిపో రూ.73,78,376 ఆదాయంతో రెండోస్థానం, కరీంనగర్–1 డిపో రూ.48,24,323 ఆదాయంతో మూడోస్థానంలో ఉన్నాయి. హుస్నాబాద్ డిపో రూ.28,37,837 ఆదాయంతో చివరిస్థానంలో నిలిచింది. కరీంనగర్ రీజియన్ పరిధిలోని కరీంనగర్–1, కరీంనగర్–2, వేములవాడ, సిరిసిల్ల, జగిత్యాల, మంథని, గోదావరిఖని, కోరుట్ల, హుజూరాబాద్, మెట్పల్లి, హుస్నాబాద్ డిపోల నుంచి కరీంనగర్ మీదుగా హైదరాబాద్ జేబీఎస్, ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడిపింది. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా చార్జీలు వసూలు చేయమని ముందుగానే ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించారు. పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుంచి ఈనెల 5వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం, ఉపాధి అవసరాల కోసం దూర ప్రాంతాల్లో ఉన్న వారు సొంతూళ్లకు రావడం ఆర్టీసీకి కలిసొచ్చింది. కరీంనగర్ రీజియన్ అధికారులు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో మకాం వేసి బస్సుల రాకపోకలను పర్యవేక్షించారు. సమష్టి కృషితోనే ఈసారి ప్రత్యేక సర్వీసులు నడిపినా సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రయాణాలు జరిగాయి. బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులతో తిరిగి సంస్థకు అధిక ఆదాయం రావడం సంతోషించదగ్గ విషయం. 11 రోజుల్లో రెగ్యులర్గా రోజువారీగా వచ్చే ఆదాయం కాకుండా అదనంగా నడిపిన ప్రత్యేక బస్సులతో రూ.4.80 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకరావడానికి అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీలోనే ప్రయాణించాలి. – రాజు, ఆర్టీసీ ఆర్ఎం సెప్టెంబర్ 27 నుంచి ఈనెల 6వ తేదీ వరకు రీజియన్ పరిధిలో వచ్చిన ఆదాయం డిపో బస్సులు ఆదాయం మహాలక్ష్మి మొత్తం (రూ.లక్షల్లో) ప్రయాణికులు ప్రయాణికులు గోదావరిఖని 260 73,78,376 45,445 71,142 హుస్నాబాద్ 100 28,37,837 17,479 27,362 హుజూరాబాద్ 110 31,21,621 19,227 30,099 కరీంనగర్–1 170 48,24,323 29,714 46,516 కరీంనగర్–2 270 76,62,160 47,192 73,878 మంథని 120 35,87,338 20,974 33,288 జగిత్యాల 140 40,73,725 25,302 39,507 కోరుట్ల 120 34,05,404 20,974 32,835 మెట్పల్లి 140 39,72,972 24,470 38,307 సిరిసిల్ల 130 36,89,188 22,722 35,571 వేములవాడ 120 34,48,698 21,732 34,613 రీజియన్ మొత్తం 1,680 4,80,01,642 2,95,232 4,63,119 11 రోజుల్లో రూ.4.80 కోట్ల ఆదాయం -
పండుగ లక్కీడ్రా విజేతలు వీరే
విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ 11డిపోల పరిధిలో నిర్వహించిన లక్కీడ్రాను బుధవారం కరీంనగర్ బస్స్టేషన్ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తీశారు. కరీంనగర్కు చెందిన ఈ.రమేశ్ మొదటి బహుమతి రూ.25వేలు, గోదావరిఖనికి చెందిన వి.సదానందం రెండో బహుమతిగా రూ.15వేలు, జగిత్యాలకు చెందిన కె.నాగరాజు మూడోబహుమతిగా రూ.10వేలు గెలుచుకున్నారు. కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు, డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, 1,2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్, బస్స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశం, అకౌంట్స్ ఆఫీసర్ శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
24 గంటలు.. 20 ఆపరేషన్లు
వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలో 24 గంటల్లో 20 వివిధ రకాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్య తెలిపారు. సాధారణ కాన్పులు 4, ఆపరేషన్లు 9, కంటి ఆపరేషన్లు 4, జనరల్ సర్జరీలు 2, ఆర్థో ఆఫరేషన్ ఒకటి చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులు సంధ్య, సోని, మాధవి, సుభాషిణి, చారీ, రమణ, అనిల్కుమార్, రాజశ్రీ, తిరుపతి, రవీందర్, రత్నమాల, నర్సింగ్ ఆఫీసర్స్ ఝాన్సీ, జ్యోతి, అనసూయతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.ఎక్స్లో కేంద్ర మంత్రి అభినందనలువైద్యసేవలు అందించడంలె నిబద్ధతతో పనిచేస్తున్న వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఎక్స్ వేదికగా అభినందించారు. డాక్టర్లు, సిబ్బంది అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ పెంచలయ్యకు, వైద్యసిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.వైద్యులకు ప్రభుత్వ విప్ ఆది అభినందనలువేములవాడ ఏరియా ఆస్పత్రి వైద్యులు 24 గంటల్లో 20 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించారు. ఆధునిక వైద్యసేవలతోపాటు శుభ్రత, రోగి సేవ ధోరణిలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. వైద్యులు, సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. -
ఆలస్యంగా వచ్చారు.. రంగు డబ్బా తీసుకురండి
వేములవాడఅర్బన్: దసరా సెలవులు ముగిసిన తర్వాత విద్యాసంస్థలు శనివారం పునర్ప్రారంభమయ్యాయి. ఈక్రమంలోనే పలువురు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో కళాశాల అధ్యాపకులు వారికి ఫైన్ వేశారు. పట్టణంలోని రెండో బైపాస్ రోడ్డులోని బాలికల గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థులు ఆలస్యంగా బుధవారం రావడంతో ఒక్కొక్కరికి ఒక్కో రంగుడబ్బా కొని అప్పగించాలని హుకూం జారీ చేశారు. దూరం నుంచి వచ్చామని తమ వద్ద డబ్బులు లేవని చెప్పినా అధ్యాపకులు వినిపించుకోకపోవడంతో వారు ఇబ్బంది పడ్డారు. ఈ విషయంపై కళాశాల వైస్ప్రిన్సిపాల్ అనురాధను ‘సాక్షి’ వివరణ కోరగా కళాశాల ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా విద్యార్థులకు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్నందునా వారిలో క్రమశిక్షణ పెంచాలని తాము రంగుడబ్బాలు తీసుకురావాలని ఫైన్గా వేసినట్లు తెలిపారు. విద్యార్థులు కొనుగోలు చేసి తెచ్చిన రంగు డబ్బాలతోనే కళాశాల, పాఠశాల ఆవరణలో పెయింటింగ్ వేయిస్తామని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కోసమేనంటున్న గురుకుల అధ్యాపకులు -
కాంగ్రెస్ మోసాలను ఎండగడుతాం
సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లో ఎండగడుతామని, 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చలేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఎనిమిది హామీలతో కూడిన కాంగ్రెస్ బాకీ కార్డులను బుధవారం ఆవిష్కరించారు. 2023లో ఎన్నికల ముందు అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రతీ మహిళకూ రూ.2500 ఇస్తామని ఇవ్వలేదని, ఇలా ఒక్కో మహిళకు 22 నెలలుగా రూ.55 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు. వృద్ధులకు పెన్షన్ను రూ.4 వేలు ఇస్తామని రూ.44వేలు బాకీ పడ్డారని, దివ్యాంగులకు రూ.44వేలు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం, రైతు భరోసాగా ప్రతీ రైతుకు రూ.2లక్షలు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినిలకు స్కూటీ, విద్యాభరోసా కార్డులు బాకీ పడ్డారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ బాకీకార్డులను ఇంటింటికీ తీసుకెళ్లి వివరించాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్దాల ప్రచారం చేశారని, వేములవాడ రాజన్న ఆలయాన్ని మూసివేయొద్దని కోరారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడ్డారని, అన్ని వర్గాల వారు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారన్నారు. కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు, వైస్చైర్మన్ దేవరకొండ తిరుపతి, టెస్కో మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, పార్టీ నాయకులు ఏనుగు మనోహర్రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్, సిద్ధం వేణు, గజభీంకార్ రాజన్న, పబ్బతి విజయేందర్రెడ్డి, జక్కుల నాగరాజు, ‘సెస్’ డైరెక్టర్లు దార్నం లక్ష్మీనారాయణ, శ్రీనివాస్రావు, నారాయణరావు, హరిచరణ్రావు తదితరులు పాల్గొన్నారు. బాకీ కార్డులతో ఇంటింటికీ వెళ్తాం ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ -
నడకతో మేలు
నేను ఉద్యోగ విరమణ పొంది ఐదేళ్లవుతంది. రోజూ 30 నిమిషా లపాటు నడుస్త. మరో 30 నిమిషాలపాటు వ్యాయామం చేస్త. చాలాఆరోగ్యంగా ఉంటున్నా. ప్రాంతాలు వేరైనా అందరం కలిసి ప్లాంట్లో పనిచేశాం. ఒకేప్రాంతంలో ఉంటున్నాం. మాకు మేమే స్నేహితులం. – కొమ్ము గోపాల్ ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఇంతకుముందు విద్యుత్ ఉత్పత్తిలో అందరం కలిసి పనిచేసేవాళ్లం. ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందాం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం వాకింగ్లో కలుస్తూ అందరం కలిసిమెలసి ఉంటున్నాం. బాధలు, సంతోషాలు పంచుకుంటూ ఆనందంగా ఉంటున్నాం. – పురుషోత్తం నాలుగేళ్ల క్రితం రిటైర్డ్ అయిన. ఉద్యోగం చేసే సమయంలో కొందరం మిత్రులం కలిసి కృష్ణానగర్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నాం. ఇప్పుడు అక్కడే ఉంటున్నాం. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తున్నాం. నాకు యోగా అంటే చాలాఇష్టం. నేను సాధన చేస్తూనే మిత్రులకు నేర్పిస్తున్నా. – రాజయ్య -
ఆనందం.. ఆహ్లాదం.. ఆరోగ్యం..
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తిలో సుదీర్ఘకాలం భాగస్వాములై ఉద్యోగ విరమణ పొందిన పలువురు ఉద్యోగులు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. రోజూ సూర్యోదయానికి ముందే స్థానిక ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీ మైదానానికి కాలినడకన చేరుకుంటున్నారు. వ్యాయామం, యోగా, ధ్యానం సాధన చేస్తూ, ఆసనాలు వేస్తున్నారు. మనశ్శాంతి, ఆహ్లాదం కోసం కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సూర్యాస్తమయానికి ముందే మళ్లీ అందరూ మైదానం చేరుకుని సాధన చేస్తున్నారు. రోజూ వ్యాయామం.. యోగా సాధన సుఖదుఃఖాలు పంచుకుంటున్న వైనం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆదర్శం -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): బీటెక్ చదివినా వార్షిక పరీక్షలో ఫెయిలయ్యాడు.. కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయం చేసినా కలిసిరాక అప్పుల పాలయ్యాడు.. మనస్తాపం చెందిన గోప గోని అజయ్కుమార్(26) గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన అజయ్కుమార్ హైదరాబాద్లో బీటెక్ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. పంటల పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. మరికొంత మద్యం తాగేందుకు వెచ్చించాడు. వ్యవసాయం కలిసిరాకపోవడం, అప్పులు తీర్చే దారిలేక, బీటెక్ కూడా ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఈనెల 4న పొలం వద్ద గడ్డిమందు తాగాడు. తాను గడ్డిమందు తాగి విషయాన్ని తన ఫ్రెండ్స్కు ఫోన్ ద్వారా చేరవేశాడు. వారి సమాచారంతో తల్లిదండ్రులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఈనెల 7న రాత్రి మృతి చెందాడు. తండ్రి సదయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. మద్యానికి బానిసై..మానకొండూర్: మానకొండూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామానికి చెందిన సాయిని మహిపాల్(35) మద్యానికి బానిసై బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. మహిపాల్కు పదేళ్ల క్రితం వివాహమైంది. భార్యతో గొడవలతో ఐదేళ్లక్రితం విడాకులయ్యాయి. ఒంటరిగా ఉంటున్న మహిపాల్ మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి కనకమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని నారాయణపూర్కు చెందిన కూడలి పర్శరాములు(35) బుధవారం గుండెపోటుతో మృతిచెందాడు. పర్శరాములు గ్రామంలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. గ్రామంలోనే కూలీ పనిచేస్తుండగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కడు పేదరికం అనుభవిస్తున్న పర్శరాములు మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. ప్రభుత్వం పర్శరాములు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుడికి భార్య వినోద, కుమారుడు రిత్విక్ ఉన్నారు. మల్లాపూర్: మండలంలోని వాల్గొండ తండాకు చెందిన లకావత్ రమేశ్ (45) దుబాయిలోని షార్జాలో బుధవారం వేకువజామున మూడు గంటలకు గుండెపోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రమేశ్ ఉపాధి కోసం ఏడాది క్రితం దుబాయి వెళ్లాడు. షార్జాలోని ఓ కంపనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిర్వర్తించి తన గదిలో నిద్రిస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు ఇక్కడి కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. రమేశ్కు భార్య పద్మ, కుమార్తె వసంత, కుమారుడు హర్షిత్ ఉన్నారు. శవాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ఆయన కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సంజయ్కుమార్ను కోరారు. హుజూరాబాద్: మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తెలిపారు. మున్సిపల్ పారిశుధ్య సూపర్వైజర్ తూముల కుమారస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు. ఎస్సారెస్పీ కాలువలో మృతదేహం లభ్యం హుజూరాబాద్ మండలం ఇప్పలనర్సింగాపూర్ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్లో ఓ గుర్తు తెలియని మృతదేహం బుధవారం కొట్టుకొచ్చింది. మృతదేహాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతుడి వయస్సు 40ఏళ్లు ఉంటుందని గుర్తించారు. మృతుడు రెండు రోజుల క్రితం కాలువలో పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యనా.? లేక మరేదైనా కారణాలా అని తెలియాల్సి ఉంది. ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతి గంగాధర: వృద్ధదంపతులిద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. భర్త చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై వంశీకృష్ణ వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో గజ్జెల శంకరయ్య(75)– లక్ష్మి(70) దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఎవరూ లేరు. మంగళవారం ఇద్దరూ ఇంట్లో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గ్రామస్తులు గమనించారు. వెంటనే పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. కరీంనగర్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శంకరయ్య బుధవారం చనిపోయాడు. లక్ష్మి చికిత్స పొందుతోంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
గంగ స్నానానికి వచ్చేదెట్లా..
● బస్సుల రద్దుతో ప్రయాణం ప్రయాస ● రద్దయిన సిరిసిల్ల, బెల్లంపల్లి బస్సు సర్వీసులు ● నిలిచిపోయిన సిరిసిల్ల, గర్శకుర్తి, కరీంనగర్ రూట్ సర్వీస్ ● బస్సులను పునరుద్ధరించాలని విన్నపంబోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు అంతంతే. అందులోనూ ఇటీవల మూడు బస్సు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణ కష్టాలు మరింత పెరిగాయి. సిరిసిల్ల డిపో నుంచి వయా బోయినపల్లి, గంగా ధర, జగిత్యాల, ధర్మపురి మీదుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వరకు రోజు ఉదయం రెండు బస్సులు నడిచేవి. ఇవే రెండు బస్సులు తిరిగి సాయంత్రం మళ్లీ ఇదే రూట్లో సిరిసిల్లకు చేరుకునేవి. ఇందులో ఒక బస్సు ఉదయం 7 గంటలకు, మరో బస్సు ఉదయం 9 గంటలకు బోయినపల్లికి చేరుకునేవి. కరీంనగర్–1 డిపో నుంచి వయా కురిక్యాల, గర్శకుర్తి, విలాసాగర్, బోయినపల్లి మీదుగా వేములవాడ సిరిసిల్ల వెళ్లేది. గర్శకుర్తి, సిరిసిల్ల బస్సు ఉదయం వచ్చేది. ఈ బస్సు సైతం కొద్ది రోజులుగా నిలిచిపోయింది. బెల్లంపల్లి బస్సు రాక గంగస్నానానికి ఇక్కట్లు సిరిసిల్ల, బెల్లంపల్లి, కరీంనగర్– సిరిసిల్ల మూడు ఆర్టీసీ బస్సుల రాకపోకలు బంద్ కావడంతో ఈ బస్సుల ఆధారంగా ప్రయాణించే వారు ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల–బెల్లంపల్లి బస్సుతో మండలంలోని పలు గ్రామాల ప్రజలు ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లే వారు. ఎక్కువ మంది భక్తులు గంగ(గోదావరి నది) స్నానానికి ఈ బస్సులోనే వెళ్లేవారు. బోయినపల్లిలో బస్సు ఎక్కితే ధర్మపురిలోనే దిగేవారు. ఈ బస్సు ఇప్పుడు నిలిచిపోవడంతో ధర్మపురికి వెళ్లే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్–సిరిసిల్ల బస్సు గర్శకుర్తి మీదుగా వెళ్లడంతో పలువురు నేతకార్మికులు, ఇతర వ్యాపారులు ఈ బస్సులో వెళ్లి ముడిసరుకులు తెచ్చుకునేవారు. ఈ బస్సు రద్దు కావడంతో ఈ రూట్లోని ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బోయినపల్లి మండలానికి గంగాధర–వేములవాడ రింగ్ బస్సు నడిచేది. అది కూడా రావడం లేదు. ఆర్టీసీ అధికారులు స్పందించి సిరిసిల్ల–బెల్లంపల్లి, కరీంనగర్–సిరిసిల్ల బస్సులు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉద్యోగుల ఐక్యతే అభివృద్ధికి బాట
తిమ్మాపూర్: ఉద్యోగుల ఐక్యతే అభివృద్ధికి దోహదం చేస్తుందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ మధుసూదన్న్ రావు స్పష్టం చేశారు. ఎల్ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ అతిథి గృహంలో బుధవారం మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పర్మినెంట్ ప్రమోషన్లు రావడం ఉద్యోగుల్లో ఉత్సాహం నింపిందని పేర్కొన్నారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది దసరా పండుగను ఉద్యోగులు అంత సంతోషంగా జరుపుకోలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చిన్నచూపు కనిపిస్తోందన్నారు. మరో ఈఎన్సీ సురేందర్రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఇరిగేషన్శాఖకు మొదటి బహుమతి రావడం సంతోషకరం అన్నారు. ఎస్ఈ సుమతిదేవి, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, మన్నె సరిత, తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షుడు పోలు కిషన్, కార్యదర్శి అంబటి నాగరాజు, కోశాధికారి అశోక్ పాల్గొన్నారు. -
బియ్యం.. నో స్టాక్
కరీంనగర్రూరల్: రేషన్ బియ్యం స్టాక్ను డీలర్లకు పంపిణీ చేయడంలో జాప్యమేర్పడుతోంది. గోదాం ఇన్చార్జికి రవాణా కాంట్రాక్టర్కు నడుమ నెలకొన్న విబేధాలతో కరీంనగర్రూరల్మండల రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నప్పటికీ సగం దుకాణాలకు మాత్రమే బియ్యం సరఫరా చేశారు. మిగితా దుకాణాలకు బియ్యం కేటాయించకపోవడంతో లబ్ధిదారులు దుకాణాలు చుట్టూ తిరుగుతున్నారు. జిల్లావ్యాప్తంగా 3,13,138 రేషన్కార్డులు, 9,33,267 మంది లబ్ధిదారులున్నారు. ప్రతినెల 566 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతోంది. కరీంనగర్ మండల స్టాక్ పాయింట్ నుంచి అక్టోబరు నెలకు 5,011 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ దుకాణాలకు రవాణా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 2,768 టన్నులను మాత్రమే పంపించారు. కరీంనగర్ మండలంలో నగునూరు, ఎలబోతారం, వల్లంపహాడ్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మందులపల్లి, చేగుర్తి, చెర్లభూత్కూర్, బొమ్మకల్ తదితర గ్రామాలకు బియ్యం రాకపోవడంతో డీలర్లు దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోదాం అధికారులు తమకు అనుకూలంగా ఉన్న డీలర్లకు మాత్రమే బియ్యం స్టాక్ కేటాయిస్తున్నారు. మండల డీలర్లకు స్టాక్ లేదంటూ రోజుల తరబడి తిప్పుకుంటున్నారని పలువురు డీలర్లు ఆరోపిస్తున్నారు. ఉదయం 9గంటలకు గోదాంకు వెళ్లి మధ్యాహ్నం 2గంటల వరకు ఎదురు చూసినప్పటికీ స్టాక్ లేదంటూ తిప్పి పంపుతున్నారని ఆవేదనవ్యక్తం చేశారు. -
ఆలయ భూముల సమస్య పరిష్కరించాలి
కరీంనగర్ కల్చరల్: దేవాదాయశాఖ భూ సమస్యలు పరిష్కరించాలని, 2014నుంచి ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఆడిట్ వివరాలు, నివేదికలు పూర్తి చేయాలని ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ సూచించారు. కరీంనగర్లోని దేవాదాయశాఖ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆలయ భూముల సమస్యలు, సీసీఎల్ఎ భూముల రిజిస్ట్రేషన్లు, భూముల డిజిటలైజేషన్, కొత్త ఆలయాల రిజిస్ట్రేషన్లు, బంగారం, వెండి స్వీకరణ, అప్పగింతల నివేదిక ఎప్పటికప్పుడు తనకు అందజేయాలని అన్నారు. ఇన్స్పెక్టర్ టూర్ డైరీ గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. అధికారులు పారదర్శకంగా భక్తులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. -
పారిశుధ్యం మెరుగు పర్చాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరవ్యాప్తంగా పారిశుధ్యాన్ని మరింత మెరుగు పర్చాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించా రు. బుధవారం నగరంలోని 34వ డివిజన్ గోదాంగడ్డలో పారిశుధ్య పనులు పరిశీలించారు. జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఆయా డివిజన్లలో కార్మికులతో పారిశుధ్య పనులు చేయించాలని సూచించారు. ఇంటింటికీ స్వచ్ఛ ఆటోలు తప్పనిసరిగా వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. గార్బెజ్ పా యింట్ల వద్ద చెత్త పడవేయకుండా పర్యవేక్షించాలన్నారు. గోదాంగడ్డ హనుమాన్ ఆలయం వద్ద గోడ శిథిలమైనందున, నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. కరీంనగర్రూరల్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులు పంపిణీ చే స్తోందని డీఎంహెచ్వో వెంకటరమణ అన్నా రు. కరీంనగర్ మండలం చామనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరు, రోగుల రిజిస్టర్లను పరిశీలించారు. ఎన్సీడీ క్లినిక్లో అసంక్రమిత వ్యాధుల రికార్డులను పరిశీలించి బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల వివరాల నమోదును తనిఖీ చేశారు. ప్రసూతిగదిలో అత్యవసర మందులను పరిశీలించారు. ప్రసూతి సంఖ్యను పెంచాలని వైద్యులకు సూచించారు. పీవో సనా, పీహెచ్సీ మనోహర్ పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను బుధవారం డీఆర్వో బి.వెంకటేశ్వర్లు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్ని కల సంఘం మార్గ నిర్ధేశం ప్రకారం ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలి పారు. గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గదులు, వీవీప్యాట్ గదుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ పార్టీల నేతలు మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి, బర్కత్ ఆలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని మార్కెటింగ్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ వి.శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీసీఐ కొనుగోళ్లలో కపస్ కిసాన్ యాప్, స్లాట్ బుకింగ్ సిస్టమ్, కౌలుదారు రైతు రిజిస్ట్రేషన్ వంటి కీలక అంశా ల గురించి వివరించారు. మార్కెటింగ్ రీజిన ల్ డిప్యూటీ డైరెక్టర్ వి.పద్మావతి, డీఎంవోలు షా బుద్దీన్, ప్రకాశ్, జిల్లా వ్యవసాయ అధికారులు భాగ్యలక్ష్మి, అఫ్జల్ బేగం, అంజని పాల్గొన్నారు. బల్దియాకు ఆర్టీఐ అవార్డుకరీంనగర్ కార్పొరేషన్: సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనపరిచినందుకు నగరపాలకసంస్థకు రాష్ట్రస్థాయిలో అవార్డు దక్కింది. తెలంగాణ సమాచార కమిషన్ బుధవారం రాష్ట్రస్థాయిలో అవార్డులు ప్రకటించింది. ఉత్తమ ప్రతిభ కనపరిచిన జిల్లా అవార్డు మూడు జిల్లాలకు రాగా, అందులో కరీంనగర్ జిల్లాకు చోటు దక్కింది. అలాగే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (ఏపీఐఓ)గా ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరపాలకసంస్థ డిప్యూటీ సిటీ ప్లానర్ బషీర్ అవార్డుకు ఎంపికయ్యారు. సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చే దరఖాస్తులను పరిష్కరించడంలో ముందుండడంతో డీసీపీ బషీర్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ వారం చివరలో బషీర్ అవార్డును అందుకోనున్నారు. -
సందర్శించి.. పాఠం చదివించి
కరీంనగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విద్యార్థులకు కఠిన అంశాలు, పాఠాలు నేర్పించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఉపాధ్యాయులకు సూచించారు. కరీంనగర్ మండలం నగునూరు జెడ్పీ, మండల పరిషత్ పాఠశాలలను బుధవారం సందర్శించారు. బుధవారం బోధనలో భాగంగా 10వ తరగతి విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ఇంగ్లిష్ పాఠాలు చదివించారు. అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అనంతరం తరగతి గదులు, వంటగది, విటమిన్ గార్డెన్ పరిశీలించారు. మధ్యాహ్న భో జనం నాణ్యతను తనీఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖానాలను సందర్శించారు. జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ప్రోగ్రాం అధికారి సనా, తహసీల్దార్ రాజేశ్, ఎంఈవో రవీందర్, ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరావు పాల్గొన్నారు. -
ముగిసిన ఫారెస్ట్ క్రీడా పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ ప్రాంతీయ క్రీడాపాఠశాల మైదానంలో రెండు రోజులుగా జరుగుతున్న అటవీశాఖ ఉద్యోగుల రీజినల్ క్రీడా పోటీలు బుధవారం ముగిశాయి. రాజ న్న జోన్లోని కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపే ట, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి 400మంది క్రీడాకారులు హాజరై ప్రతిభ చాటారు. అన్ని క్రీడలలో అధిక పాయింట్లు సాధించి సిద్దిపేట జిల్లా జోన్ ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. విజేతలకు కరీంనగర్ డీఎఫ్వో బాలామణి, కామారెడ్డి డీఎఫ్వో బోగాని నిఖిత, మెదక్ డీఎఫ్వో జోజి పతకాలు ప్రదానం చేశారు. ప్రతిభ చూపినవారిని వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. డీవైఎస్వో వి.శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఆరు బయట చెత్త వేస్తున్న, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నగరపాలకసంస్థ చర్యలు కొనసాగుతున్నాయి. నగరంలోని ఫారెస్ట్ ఆఫీసు సమీపంలోని పండ్ల దుకాణాలు, చికెన్సెంటర్ను నగరపాలకసంస్థ అధికారులు బుధవారం తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించకుండా చికెన్ విక్రయాలు చేస్తున్న చికెన్ సెంటర్ నిర్వాహకుడికి రూ.20 వేలు జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించని ఐదు పండ్ల దుకాణాలకు రూ.3 వేలు చొప్పున జరిమానా విధించారు. ప్రతి దుకాణదారుడు చెత్తబుట్టను వినియోగించాలని, పరిసరాల్లో చెత్తవేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి: విద్యుత్ లైన్లు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు 33/11 కేవీ రేకుర్తి సబ్స్టేషన్ పరిధిలోని రేకుర్తి, సీతారాంపూర్, జగి త్యాల రోడ్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
కొత్త పనులకు బ్రేక్
ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ కరీంనగర్ అర్బన్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్తగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు కొత్త పనులు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రారంభోత్సవాలకు ఆటంకం ఏర్పడటంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని ఆశించిన వారికి నిరీక్షణ తప్పేలా లేదు. ఇందిరమ్మ పథకం కింద ప్రభుత్వం పెద్ద సంఖ్యలో లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మొదటి, రెండో విడతల్లో దాదాపు అన్ని గ్రామాల్లో అర్హులను ఎంపిక చేశారు. పలువురు ఇప్పటికే ప్రారంభించగా రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. బిల్లులు కూడా మంజూరవుతున్నాయి. ఇళ్లు మంజూరైనా కొంతమంది ప్రారంభించేందుకు డబ్బులు లేక, వర్షాకాలం ఇంటి నిర్మాణ సామగ్రిని తరలించేందుకు తదితర ఇబ్బందులతో ప్రారంభించలేదు. వర్షాలు తగ్గిన వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం కింద కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడంతో పాటు నిధులు విడుదల చేయడానికి వీలు లేకుండా పోయింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు కొత్తగా ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించడం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరైన లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వివిధ కారణాలతో ఆలస్యం కాగా ఇందిరమ్మ పథకానికి ఎన్నికల కోడ్ మరో అడ్డంకిగా మారిందని వాపోతున్నారు. తాత్కాలిక నిలిపివేతతో భవన నిర్మాణ కార్మికులకు, సప్లయర్స్కు పని దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇందిరమ్మ పథకం వివరాలు దరఖాస్తుదారుల సంఖ్య: 2,04,504 మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు: 8,219 రద్దు చేసుకున్నవారు: 603 -
రోడ్లపైనే దందా
కరీంనగర్ కార్పొరేషన్: ఫుట్పాత్లు, రోడ్లపై దందా మళ్లీ మొదలైంది. నగరపాలకసంస్థ అధికారుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ,రోడ్లపై వ్యాపారాలు పూర్వస్థితికి వచ్చాయి. ఫుట్పాత్లు, రోడ్లపై వ్యాపారాలు చేయవద్దంటూ నగరపాలకసంస్థ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కట్టడి చేసిన కొద్దిరోజులకే గతంలో మాదిరిగానే ఫుట్పాత్లే కాదు, ఏకంగా రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేపడుతున్నారు. దుకాణాలకే ఫుట్పాత్లు స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని ప్రధాన రహదారులు, టవర్సర్కిల్ లాంటి ప్రాంతాలను అభివృద్ధి చేయడం తెలిసిందే. స్మార్ట్ సిటీ నిబంధనల్లో భాగంగా రోడ్డుకిరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. కానీ ఫుట్పాత్లు కేవలం ఆయా దుకాణదారుల కోసమే అన్నట్లుగా మారాయి. దుకాణదారులు తమ ముందున్న ఫుట్పాత్లపై వ్యాపార సామగ్రిని పెట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. కొంతమంది వ్యాపారులైతే ఫుట్పాత్లను ఆక్రమించి, శాశ్వత నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. రద్దీ, వాణిజ్య ప్రాంతాల్లో పాదచారుల కోసం ఫుట్పాత్లను ఏర్పాటు చేశారు. టవర్సర్కిల్తో పాటు, నగరంలోని ప్రధాన రహదారుల వెంట చాలాచోట్ల అసలు ఫుట్పాత్లే కనిపించవంటే అతిశయోక్తి కాదు. ట్రాఫిక్కు ఇక్కట్లు.. ఫుట్పాత్, రోడ్ల ఆక్రమణలతో నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు తీవ్రతరమవుతున్నాయి. నగరం విస్తరించడం, జనాభా పెరగడం, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగడంతో రద్దీ ఎక్కువైంది. రద్దీకి అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి. వీటికి తోడు ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి వ్యాపారాలతో వాహనాల రాకపోకలకు, కొన్నిచోట్ల నడిచేందుకు వీలు లేకుండా పోతోంది. టవర్సర్కిల్ లాంటి అత్యంత రద్దీ ప్రాంతంలోనైతే పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. స్పెషల్ డ్రైవ్ ఎఫెక్ట్ కొద్దిరోజులే... నగరంలో ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమణల తొలగింపు కోసం నగరపాలక సంస్థ ఇటీవల చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ప్రభావం కొద్దిరోజులు మాత్రమే కనిపిస్తోంది. అధికారులు హడావుడి చేసినన్ని రోజులు కూడా రోడ్లు, ఫుట్పాత్లు ఖాళీగా కనిపించడం లేదు. కొద్ది రోజులకే మళ్లీ యథాస్థానంలో తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఫుట్పాత్, రోడ్లు ఆక్రమణలు తొలగించాలని ఉన్నతాధికారులు చెబుతున్నా, రాజకీయ ఒత్తిళ్లు, కిందిస్థాయి ఉద్యోగుల అలసత్వం, కుమ్మక్కు తదితర కారణాలతో ఆచరణకు పూర్తిస్థాయిలో నోచుకోవడం లేదనే విమర్శలున్నాయి.నగరంలోని కరీంనగర్, మంచిర్యాల మెయిన్రోడ్డులో ఆదర్శనగర్ ప్రాంతం వద్ద పరిస్థితి ఇది. ఇటీవల నగరపాలకసంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి నిర్వహిస్తున్న వ్యా పారాలను డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. కానీ కొద్దిరోజులు సాఫీగా కనిపించిన ఈ రోడ్డు, తొందరలోనే పూర్వస్థితికి చేరింది. షరా మామూలు గానే మళ్లీ ఫుట్పాత్లే కాదు, రోడ్డుపైకి చొచ్చుకువచ్చి మరీ తమ దందా సాగిస్తున్నారు. -
విలువలు నేర్పిన మహర్షి
వాతావరణం జిల్లాలో ఆకాశం మేఘావృతమవుతుంది. వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది.రామాయణం రచించిన వాల్మీకి సత్యం, ధర్మం, న్యాయం, సేవా వంటి విలువలను సమాజానికి చాటి చెప్పారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, డీఆర్వో బి.వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాశ్, ఏవో సుధాకర్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. – కరీంనగర్ కల్చరల్ -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
కరీంనగర్స్పోర్ట్స్: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రియాంక వర్గీస్ సూచించారు. కరీంనగర్ సిటీ ప్రాంతీయ క్రీడాపాఠశాల మైదానంలో చేపట్టిన అటవీశాఖ ఉద్యోగుల రీజినల్ క్రీడా పోటీలను మంగళవారం ఆమె ప్రారంభించారు. యూనిఫాం సేవలకు మార్చ్ఫాస్ట్ ముఖ్యమన్నారు. క్రీడలు ఉద్యోగులకు ఆటవిడుపుగా పనిచేస్తాయని, పూర్తిసామర్థ్యంతో విధులు నిర్వర్తించేందుకు ఉపయోగపడతాయన్నారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతకుముందు కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులు అతిథులకు క్రీడా వందనం సమర్పించారు. వాలీబాల్, క్రికెట్, అథ్లెటిక్స్, చెస్, క్యారమ్స్ తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, మెదక్ ఎఫ్ఆర్వోలు బాలమని, జోజి, డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పుడు బండి.. తరువాత నువ్వే..
మల్లాపూర్: పంచాయ తీ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్ కలిసొచ్చిందని పోటీకి సిద్ధమవుతున్న ఓ వ్యక్తి బైక్ను ధ్వంసం చేసి ‘ఇప్పుడు బండి.. తరువాత నువ్వే..’ అంటూ అగంతకులు బెదిరింపులకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లిలో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బాధితుడి కథనం ప్రకారం గ్రామానికి చెందిన అండెం చిన్నగంగారాం, చిన్నమ్మ కుమారుడు రాజేశ్ స్థానికంగా కాంట్రాక్టు పద్ధతిన కారోబార్గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లో గుండంపల్లిని ఎస్సీ జనరల్కు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రాజేశ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఈ క్రమంలో ఈనెల 4న రాజేశ్ పొలానికి వెళ్లాడు. బైక్ను పార్కింగ్ చేసి పనులు చేస్తుండగా.. దుండుగులు రాజేశ్ బైక్ను రాళ్లతో ధ్వంసం చేశారు. ఓ పేపర్ ముక్కపై ‘ఇప్పుడు బండి.. తరువాత నువ్వే.. నువ్వు నిలబడురా..’ అని రాసిపెట్టి వెళ్లారు. విషయాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులకు తెలపగా వారంతా భయాందోళన చెందుతున్నారు. భయంతోనే రాజేశ్ అస్వస్థతకు గురయ్యాడు. రాయికల్లో చికిత్స తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే ఇప్పటివరకు బాధితుడి నుంచి ఫిర్యాదు అందలేదని ఎస్సై పేర్కొన్నారు. బైక్ను ధ్వంసం చేసి పేపర్పై రాసిన అగంతకులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమవుతున్న వ్యక్తికి బెదిరింపు జగిత్యాల జిల్లా మల్లాపూర్లో కలకలం -
జరిమానా.. సన్మానం
రోడ్డుపై చెత్త పడేసిన వ్యక్తికి మంగళవారం బల్దియా అధికారులు జరిమానా విధించారు. అనంతరం సన్మానించారు. కరీంనగర్ సిటీలోని గీతాభవన్ పక్కవీధిలో రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తిని పారిశుద్ధ్య విభాగం అధికారులు గుర్తించి ముందుగా రూ.500 జరిమానా విధించారు. తర్వాత పూలదండతో సత్కరించి, మరోసారి రోడ్డుపై చెత్త పడవేయరాదని కౌన్సెలింగ్ నిర్వహించారు. కరీంనగర్ను గార్బెజ్ ఫ్రీసిటీ (చెత్త రహిత నగరం)గా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు నగరపాలకసంస్థ పర్యావరణ ఇంజినీర్ స్వామి తెలిపారు. సీసీటీవీల ద్వారా పరిశీలించి చెత్త పడవేస్తున్న వారిని గుర్తించి, జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. – కరీంనగర్ కార్పొరేషన్ -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
వెల్గటూర్: మండలకేంద్రంలో ఈనెల 2న ఏడోనంబర్ రాష్ట్ర రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న బోగ మల్లన్న (42)ను గుర్తు తెలియని వ్యక్తి బైక్తో ఢీకొట్టిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మల్లన్నను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. జమ్మికుంట(హుజూరాబాద్): ప్రమాదవశాత్తు రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. మండలంలోని శాయంపేట గ్రామానికి చెందిన పంజాల సాగర్(45) కిరాణంతో పాటు, హార్వెస్టర్ నడిపిస్తాడు. మంగళవారం వరి కోసేందుకు ధర్మారం సమీపంలోని పొలం చూసేందుకు వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. మృతుడికి భార్య మంజుల, కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఎల్లారెడ్డిపేట: మండలంలోని బండలింగంపల్ల్లికి చెందిన బాల్రాజ్ నర్సాగౌడ్, కావ్య దంపతులపై భూవివాదంలో దాడి చేసిన వ్యక్తిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. బండలింగంపల్లి శివారులో దంపతులు ఇద్దరు తమ వరిపొలం కోసి వడ్లను ఐకేపీ సెంటర్ వద్ద ఆరబోశారు. ఈక్రమంలో అక్కడికి వచ్చిన గ్రామానికి చెందిన బాల్రాజ్ నరేశ్ వారి భూమిలో తనకు వాటా ఉందని, మళ్లీ భూమి దున్నవద్దంటూ బెదిరింపులకు గురిచేశాడు. అంతేకాకుండా వారిపై బండరాయితో దాడి చేశారు. బాధితురాలు కావ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రాపెల్లి గీత ఇంట్లోకి మంగళవారం ఉదయం అక్రమంగా ప్రవేశించి, డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరాలు. గీతకు అవసరమైన ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆమె భర్త కృష్ణకాంత్కు పరిచయస్తులైన సిరిసిల్లకు చెందిన కుసుమ గణేశ్, గాజుల మల్లేశంను సంప్రదించారు. రూ.30వేలు ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తామని నమ్మబలికి ముందస్తుగా రూ.7వేలు వసూలు చేశారు. అయినా సర్టిఫికెట్ ఇవ్వకపోగా, మిగతా డబ్బుల కోసం మంగళవారం ఇంటికొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారు. భయబ్రాంతులకు గురైన గీత పక్కింటి వారిని పిలువగా పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చొప్పదండి: వచ్చే విద్యా సంవత్సరంలో చొప్పదండి పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో తొమ్మిది, పదకొండు తరుగతుల్లో మిగులు సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు గడువు తేదీని ఈనెల 21 వరకు పెంచినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వివరాల కోసం నవోదయ వైబైసెట్ను సంప్రదించాలన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని కరీంనగర్ వైద్య కళాశాలలో పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ కళావాల ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పారా మెడికల్ బోర్డు కార్యదర్శి నోటిఫికేషన్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికి రెండేళ్ల కోర్సులైన డిప్లమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ (డీఎంఐటీ), డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్ (డీఏఎన్ఎస్)లో చేరడానికి ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. బైపీసీలో సరిపడా విద్యార్థులు లేని సందర్భంలో ఎంపీసీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు తమ దరఖాస్తులను బుధవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు కొత్తపల్లిలోని వైద్య కళాశాలలో సమర్పించాలని సూచించారు. నోటిఫికేషన్ వివరాల కోసం కళాశాల వెబ్సైట్ https://www.gmcknr.com లేదా తెలంగాణ పారా మెడికల్ బోర్డు వెబ్సైట్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోరారు. పాలకుర్తి(రామగుండం): రామగుండం ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ పరిధిలోని 24 మద్యం దుకాణాలకు 2025–27 సంవత్సరానికి ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ సీఐ మంగమ్మ తెలిపారు. వీటిలో 4 వైన్స్షాప్లు(గెజిట్ సంఖ్య 43, 45, 47, 57) గౌడ కులస్తులకు, 3 (గెజిట్ సంఖ్య 38, 39, 42) ఎస్సీలకు రిజర్వు చేశారన్నారు. ఇప్పటివరకు 2(గెజిట్ నెంబర్ 44, 56) వైన్స్షాప్లకు దరఖాస్తులు వచ్చిన ట్లు సీఐ వివరించారు. దరఖాస్తుల దాఖలుకు ఈనె 18వ తేదీ వరకు గడువు ఉందన్నారు. -
కరీంనగర్ కవిత్వ వారసత్వాన్ని కొనసాగించాలి
కరీంనగర్ కల్చరల్: క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం వరకు కరీంనగర్ సాహిత్య వారసత్వం ఘనమైందని, దానిని కొనసాగించాల్సిన బాధ్యత నేటి తరం కవులకు ఉందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమెల భాస్కర్ అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి జరిగిన 150వ ఎన్నిల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమంలో మాట్లాడారు. ఆధునికత అవసరమే గాని మన చరిత్రను తెలుసుకోకుండా వట్టి ఆధునికత వెంట వెళ్లడం సమాజానికి మంచిది కాదన్నారు. సభ ప్రారంభంలో ఆదివాసీ వీరుడు కొమరం భీమ్, నిస్వార్ధ ఐఏఎస్ అధికారి శంకరన్లకు నివాళి అర్పించింది. సమకాలీన సమస్యలపై కవిత గానం చేశారు. తెరవే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, శంకరయ్య, సంతోశ్ బాబు, సీఎస్ రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పక్కదారి!
మంథని: రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కూడా పక్కదారి పడుతోంది. పేదలు మినహా మధ్యతరగతి, ఉన్నతవర్గాలు తెల్లకార్డు ద్వారా వచ్చే సన్నబియాన్ని తిరిగి రేషన్ డీలర్లకే అప్పగిస్తున్నట్లు సమాచారం. దొడ్డు బియ్యం పంపిణీ చేసిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10కు చెల్లించే రేషన్డీలర్లు.. సన్నబియ్యం కేజీకి రూ.12 నుంచి రూ.15వరకు కార్డుదారులకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. డీలర్ల ద్వారా సేకరించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమార్కులు మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పెరిగిన రవాణా సన్నబియ్యం బహిరంగ మార్కెట్లో కేజీకి రూ.50 నుంచి రూ.90 ధర పలుకుతోంది. దీంతో రేషన్ సన్నబియ్యానికి డిమాండ్ పెరిగింది. మంథని, గోదావరిఖని, పెద్దపల్లి సమీప ప్రాంతాల నుంచి సబ్సిడీ బియ్యం సేకరించి మహారాష్ట్రలోని సిరొంచ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దొడ్డు బియ్యానికి బదులు సన్నబియ్యం అందుబాటులోకి రావడంతో అక్రమ రవాణా అధికమైంది. ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. చాలామంది రేషన్కార్డుదారులు సబ్సిడి బియ్యమే తింటున్నట్లు అధికారులు, ప్రజల్ని స్మగ్లర్లు నమ్మించారు. కానీ, పేదలు మినహా, మధ్య తరగతి, ఉన్నత వర్గాలు జైశ్రీరాం బియ్యాన్ని తింటున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సన్నబియ్యాన్ని ఆయా ప్రాంతాల నుంచి సేకరించి.. నిల్వ ఉంచి.. ఆ తర్వాత మినీవ్యాన్లు, లారీల్లో తరలిస్తున్నారు. జాడలేని నిఘా.. అక్రమ దందాలకు వారధులుగా మారిన బ్యారేజీ, వంతెనల వద్ద నిఘా లేక అక్రమార్కులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. మంథని మండలం సిరిపురం సమీపంలోని పార్వతీ బ్యారేజీ మీదుగా మంచిర్యాల జిల్లా దాటి ప్రొఫెసర్జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సరస్వతీ బ్యారేజీ, వంతెన అటు తర్వాత దామెరకుంట, కాళేశ్వరం, అంతర్ రాష్ట్ర వంతెన దాటి మహారాష్ట్రలోకి రేషన్బియ్యం చేర్చుతున్నట్లు సమాచారం. అధికారుల ఉదాసీనతే కారణమా? సన్నబియ్యం పక్కదారి పట్టిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెప్పారు. కానీ, జిల్లాలో చాలాచోట్ల సబ్సిడీ బియ్యం పట్టుబడితే 6ఏ కేసుతో సరిపెడుతున్నారు. పట్టుబడిన బియ్యం ఎక్కడివి? ఎవరినుంచి రేషన్ డీలర్కు చేరాయి, వ్యాపారి ఎవరనే కోణంలో అధికారులు దృష్టి సా రించడం లేదనే విమర్శులున్నాయి. మూలాల్లోకి వె ళ్లకపోవడంతో వ్యాపారులు దందా ఆపడం లేదు. ఒకటిట్రెండు సార్లు పట్టుబడితే పీడీ యాక్టు నమోదుకు అవకాశం ఉన్నా.. ఆ దిశగా చర్యలు తీసుకోవ డం లేదు. కొంతమంది వ్యాపారులు బినామీల పే రిట వినియోగిస్తూ కేసులు లేకుండా జాగ్రత్తలు తీ సుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి సన్నబియ్యం అక్రమ దందాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు. కార్డుదారుల నుంచి సేకరిస్తున్న రేషన్ డీలర్లు కేజీకి రూ.10 నుంచి రూ.15 చెల్లిస్తున్న వైనం పేదలు మినహా మధ్య తరగతి, ఉన్నతవర్గాల విక్రయాలు మహారాష్ట్రకు పెరిగిన రవాణా -
వరి కోతకు వానగండం
ముస్తాబాద్(సిరిసిల్ల): అన్నదాతలను వానలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు చినుకు రాలక.. శ్రీదేవుడా వానమ్మను ఇవ్వుశ్రీ అంటూ మొర పెట్టుకున్న రైతులు.. ఇప్పుడు వద్దంటే వానలంటూ ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండిస్తున్న పంటలకు వాన గండంగా మారింది. రోజూ కురుస్తున్న వానలతో కోతకు వచ్చిన పంటను తీసుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్నదాతలు ఎక్కువగా వరిపంట సాగుచేశారు. ఈనేపథ్యంలో కొన్ని చోట్ల పంట కోతకు రాగా, పక్షం రోజుల క్రితమే నీరు పెట్టడం మానేశారు. కాగా, నాలుగురోజుకో తుపాను రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంట చేతికచ్చే వరకు దినదిన గండంగానే వెళ్లదీస్తున్నారు. దిగబడుతున్న హార్వెస్టర్లు ఉమ్మడి జిల్లాలో వరి పంటే అధికంగా సాగుచేస్తున్నారు. కాగా నెల రోజులుగా కురుస్తున్న వానలతో పొలాల్లో నీరు నిలిచి ఉంది. ఇటీవల కురిసిన గాలివానకు పలుచోట్ల వందలాది ఎకరాల్లో వరి నేలవాలింది. దానిని హార్వెస్టు చేయడం గగనంగా మారింది. ఒకప్పుడు కూలీలతో పంటల కోతలు అయ్యేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పొలాల్లో నీరు నిలిచి ఉండడంతో కోతలకు వెళ్లిన హార్వెస్టర్లు దిగబడిపోతున్నాయి. గంటల తరబడి వాటిని బయటకు తీయడం ఇబ్బందిగా మారింది. పొలంలో హార్వెస్టరు దిగబడిన రైతులకే నష్టం. టైర్ల హార్వెస్టర్కు గంటకు రూ.2 వేలు అవుతున్నాయి. అదే చైన్ హార్వెస్టర్ సమయం ప్రకారం ఒక గంటకు రూ.3వేలు వసూలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వందలాది హార్వెస్టర్లు పంట కోతలకు సిద్ధంగా ఉనన్న వానలతో వాటి ధరలు ఆకాశన్నంటాయి. గత సీజన్లో గంటకు రూ.2 వేలు చార్జ్ చేసిన నిర్వాహకులు ఇప్పుడు రూ.3వేలు వసూలు చేయడం రైతులకు భారంగా మారింది. అన్నదాతను వెంటాడుతున్న వర్షాలు పంటపొలాల్లో దిగబడుతున్న హార్వెస్టర్లు వరికోతలకు పెరిగిన ధరలు -
పోలంపల్లి యువకుడి దారుణ హత్య?
తిమ్మాపూర్: మండలంలోని పోలంపల్లి గ్రామానికి చెందిన గడ్డం మహేందర్ ప్రస్తుతం తన తల్లితో నుస్తులాపూర్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండటంతో భార్య తన పుట్టిల్లు అయిన సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం తిప్పారి గ్రామంలో తన పిల్లలతో కలిసి జీవిస్తోంది. దసరా పండుగ సందర్భంగా మహేందర్ తన పిల్లలను చూసుకోవడానికి తిప్పారి గ్రామానికి వెళ్లాడు. ఆ తర్వాత అదే గ్రామంలో ఒకలోయలో అనుమానాస్పదంగా శవమై కనిపించాడు. స్థానికులు కుకునూరు పోలీస్లకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరిపారు. అయితే, తన అత్తగారింటి వద్ద భార్య, బావమరుదులు కలిసి మహేందర్ను వేధించి, దారుణంగా కొట్టి, కాళ్లకు తువ్వాలతో కట్టి వాగులో పడేసినట్లు పోలీసుల విచారణలో మృతుడి కుటుంబసభ్యులు చెప్పినట్లు తేలింది. ఈ మేరకు మహేందర్ భార్యతోపాటు బావమరుదులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై, సీఐ తెలిపారు. అంత్యక్రియలకు కావలసిన డబ్బులు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేశ్ చొరవతో పోలంపల్లి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. భార్య, బావమరుదుల వేధింపులే కారణమని కేసు -
మంటలు!
మంత్రులు మాటలుఉమ్మడి జిల్లా నుంచి శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంత్రులుగా ఉన్నారు. ఇంతకాలం శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వర్గాలమధ్య ఆదిపత్యపోరు నడిచినా.. అది ఏనాడూ బయటపడలేదు. ఇద్దరికీ ఆహ్వానం ఉన్నా.. కలిసి పాల్గొన్న అధికారిక కార్యక్రమాలు తక్కువే. కరీంనగర్ జిల్లా కేంద్రంపై రాజకీయ పట్టుకోసం ఇటు పొన్నం వర్గం, అటు శ్రీధర్బాబు వర్గం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. శాతవాహన వర్సిటీలో జరిగిన ఓ ప్రారంభోత్సవం సందర్భంగా వీసీ వ్యవహరించిన తీరు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్యదూరం పెంచినట్లు సమాచారం. ఇటీవల ఎస్సీ కోటా నిధులతో నిర్మించ తలపెట్టిన ఓ హాస్టల్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పొన్నం ప్రభాకర్ను పిలిచేందుకు వీసీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి వీసీకి ఫోన్చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి నిధులు? ఎవరు ప్రారంభోత్సవం చేస్తారు? అని గట్టిగా నిలదీశారు. ఈ విషయం పొన్నం వర్గం చెవినపడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తమను చిన్నచూపు చూస్తున్నారని లక్ష్మణ్ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గతంలో వర్సిటీలో జరిగిన కార్యక్రమాలకు మంత్రి అడ్లూరికి షార్ట్నోటీస్లో ఆహ్వానం పంపడంపైనా లక్ష్మణ్ వర్గం వీసీపై గుర్రుగా ఉంది. ఆ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఓ నాయకుడిని పొగిడే క్రమంలో ‘బుల్లెట్ దిగిందా? లేదా’ అంటూ వీసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే కాన్వొకేషన్ కార్యక్రమానికి రాజకీయ నాయకులను పిలవవద్దని తొలుత అనుకున్నా.. వీసీ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు కనిపించడం లేదని సిబ్బంది అంటున్నారు.సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతున్నాయి. జాతిని, తనను కించపరిచారంటూ ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ వీడియో విడుదల చేయడం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. తన జాతిలో పుట్టడం తప్పా? అని ప్రశ్నించారు. 24 గంటల్లో తనకు, తన జాతికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి అల్టిమేటం జారీచేయడంతో పాత కరీంనగర్ రాజకీయాలు వేడెక్కాయి. వాస్తవానికి ఆదివారం జూబ్లీహిల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘మనకు టైం అంటే తెలుసు.. వాడొక దున్నపోతు వాడికేం తెలుసు’ అంటూ అన్న మాటలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీనిని బీఆర్ఎస్ సోషల్ మీడియా విపరీతంగా వైరల్ చేసింది. దీనిపై పొన్నం ప్రభాకర్ ఆఫీసు నుంచి వెంటనే ఖండన కూడా వెలువడింది. మంగళవారం మంత్రి అడ్లూరి నేరుగా వీడియో విడుదల చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.. ఈ విషయమై మంత్రి అడ్లూరిని ‘సాక్షి’ పలకరించగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు అసలు ఊహించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత అయినా ఆయన కనీసం ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వకపోవడం నన్ను మరింత బాధించింది. పక్కన మరో మంత్రి వివేక్కూడా ఉన్నారు. ఆయన కూడా మౌనం వహించడం దురదృష్టకరం. ఈ జాతిలో జన్మించడం నా తప్పా? 24 గంటల్లో నాకు, నా జాతికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి. నిజాయతీ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా ఈ విషయాన్ని మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశాను. అగ్రనాయకత్వం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నా. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై మినిస్టర్ లక్ష్మణ్ ఫైర్ -
చదువులు ఎట్ల?
చదువులు ఎట్ల? అని బెస్ట్ అవెలబుల్ స్కూల్ విద్యార్థులు, పేరెంట్స్ కదం తొక్కారు. ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు రెండేళ్లుగా స్కూల్ ట్యూషన్, హాస్టల్ ఫీజు చెల్లించకపోవడంతో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవెలబుల్ స్కూల్ పేరెంట్స్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల అజయ్ మాట్లాడారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి వేల కోట్లు కేటాయిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాలు విద్యార్థుల చదువులకు రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడం రాజ్యాంగ హక్కులను హరించడమేనన్నారు. – కరీంనగర్ -
కిరాణా షాపులో చోరీ
వెల్గటూర్: మండలకేంద్రంలో తాళం వేసిన ఓ కిరా ణాషాపులో సోమవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం బాలాజీ కిరాణషాపు యజమానికి ఎప్పటిలాగే తాళం వేసి ఇంటికెళ్లాడు. సుమారు రెండు గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు షాప్ వెనుక డోర్ తాళం పగులగొట్టి కౌంటర్లో ఉన్న రూ.15వేలు ఎత్తుకెళ్లారు. చోరీ చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. యజమాని ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
పత్తిరైతు పరేషాన్
● అధిక వర్షాలతో దెబ్బతిన్న తెల్లబంగారం ● ముసురు ప్రభావంతో నిలవని పూత, పిందె ● చేలల్లో పదనతో చీడపీడల ఉధృతి ● ఆకుముడతతో ఎర్రబారుతున్న మొక్కలు సాక్షిప్రతినిధి, కరీంనగర్: డంప్యార్డ్లో చెత్తను తగ్గించే బయోమైనింగ్ పనుల్లో అలసత్వం వహిస్తున్న సంబంధిత ఏజెన్సీకి బల్దియా రూ.3.25 లక్షలు జరిమానా విధించింది. ‘బయోమైనింగ్ దుబారా’ పేరిట మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నగరపాలకసంస్థ అధికారులు స్పందించారు. ప్రణాళిక ప్రకారం పనులు జరుగుతున్నా, ఏజెన్సీలో నిధుల కొరత కారణంగా పనులు పూర్తిస్థాయిలో కాలేదని ఎస్ఈ రాజ్కుమార్ తెలిపారు. ఒప్పందం మేరకు పనులు చేయడంలో అలసత్వం జరుగుతున్నందున, ఏజెన్సీకి జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అలాగే నిధుల వినియోగం మార్చిలోపు జరగాల్సి ఉండడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్ పిలిచామన్నారు. ప్రస్తుత ఏజెన్సీ గడువు కూడా త్వరలో ముగుస్తున్నందున పనులు త్వరిగతిన చేపట్టాల్సి ఉండడంతో టెండర్ పిలిచినట్లు వివరించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, పనులు నిలిచిపోయాయన్నారు. డంప్యార్డ్లో ప్రస్తుతం 3 లక్షల మెట్రిక్టన్నుల వ్యర్థాలు నిలువ ఉన్నాయన్నారు. ప్రతీరోజు ట్రాక్టర్ల ద్వారా వ్యర్థాలు చేరుతున్నాయని, డంపింగ్ చేయడానికి కూడా ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందుకే వ్యర్థాలను తగ్గించడానికి బయోమైనింగ్ ప్రక్రియ ద్వారా రూ.2 కోట్లకు టెండర్ పిలిచినినట్లు వివరించారు. విద్యాబోధనలో ఆధునిక సాంకేతికత కొత్తపల్లి(కరీంనగర్): ప్రధానమంత్రి స్కూల్స్ ఆఫ్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ యోజన) పథకం కింద ఎంపికై న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆధునిక, డిజిటల్ టెక్నాలజీ, అత్యాధునిక మౌలిక వసతులతో నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా విద్యాధికారి శ్రీరామ్ మొండయ్య అన్నారు. పీఎం శ్రీ యోజన కింద కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంజూరైన అగ్మెంటెడ్ రియాలిటీ(ఏఆర్), వర్చువల్ రియాలిటీ(వీఆర్) టెక్నాలజీ సైన్స్ ల్యాబ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. డీఈవో మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. చరిత్ర, జీవ, భౌతికశాస్త్రాల్లో నూతన ప్రయోగాలు, ల్యాబ్ అనుకరణలు, వర్చువల్ టూల్స్ ద్వారా విద్యార్థులు చక్కగా పాఠాలు అభ్యసిస్తారని తెలిపారు. జ్ఞానసాధనలో గతంకన్నా అధిక ఆసక్తి చూపుతారని అరన్నారు. 3–డీ ప్రొజెక్షన్లు, ఇంటరాక్టివ్ హ్యాండ్సన్ అనుభవాలు విద్యా ప్రపంచాన్ని మరింత ఆకర్షణీయంగా, ప్రయోజనకరంగా మారుస్తాయని డీఈవో వివరించారు. జిల్లా సైన్స్ ఆఫీసర్ జయపాల్రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయుడు కన్నం రమేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.బకాయిలు ఇచ్చే వరకు ఉద్యమంకరీంనగర్: పెన్షనర్ల బకాయిలు ఇచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా) ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టంచేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోహెడ చంద్రమౌళి, సుంకిశాల ప్రభాకర్రావు మాట్లాడారు. ఏడాదిన్నరగా ఉద్యోగ విరమణ చేసిన వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందలేదన్నారు. బకాయిలు రాక పిల్లల పెళ్లిల్ల్లు చేయలేక.. ఇల్లు కట్టుకోలేక అనారోగ్యంతో బాధపడుతున్నామన్నారు. నిరసనలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వర చారి, ఎం. భారతి, కోశాధికారి కనపర్తి దివాకర్, జిల్లా కమిటీ సభ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎస్.ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి కె. భోగేశ్వర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె. దేవదాసు, సిద్దిపేట జిల్లా బాధ్యులు కిషన్ నాయక్, రాములు, జగిత్యాల జిల్లా నుంచి ఎం.రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా నుంచి మల్లారపు పురుషోత్తం, పెద్దపల్లి జిల్లా నుంచి సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు.సాక్షి,పెద్దపల్లి: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కురిసిన వానలు పత్తి రైతులను దెబ్బతీశాయి. సీజన్ ఆరంభంలో వర్షాభావం, ఆ తర్వాత ఎడతెరపిలేని వర్షాలు అన్నదాతను తెల్లబోయేలా చేశాయి. ముఖ్యంగా సెప్టెంబర్లో కురిసిన భారీవర్షాలకు పత్తి పంట ఎర్రబారింది. ప్రస్తుతం పూత, కాయ, దూదితో కళకళాడాల్సిన చేన్లు.. ఎక్కడా చూసినా తెగళ్లతో ఎర్రబారి కనిపిస్తున్నాయి. వాతావరణంలో మార్పులు, తేమశాతం అధికం కావడంతో చేలలో పదను తగ్గడం లేదు. వర్షపునీరు నిలిచి పత్తికాయలు రాలిపోవడమే కాకుండా మొక్కలు మురిగిపోతున్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నిరకాలుగా అనుకూలిస్తే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేదని, కానీ, అధిక వర్షాలతో 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.35వేల వరకు పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదంటున్నారు. రాలుతున్న కాత, పూత భారీవర్షాలు, ముసురుతో చేలల్లో ఇంకా పదను తగ్గడం లేదు. ఫలితంగా రసం పీల్చే పురుగులు, పచ్చ, తెల్లదోమ, నల్లితో ఆకుముడుత, పండాకు, ఎండాకు వంటి తెగుళ్ల వ్యాప్తి అధికమైంది. పత్తి పూత, పిందె రాలిపోతుండటంతోపాటు కాయలు ఎర్రబారుతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదని అన్నదాతలు వాపోతున్నారు. సీజన్ ఆరంభంతోనే కష్టాలు.. పత్తి విత్తనాలు నాటే దశనుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సీజన్ మొదట్లో వరణుడు ముఖం చాటేశాడు. విత్తిన విత్తనాలు భూమిలోనే కలిసిపోయాయి. రెండోసారి కొన్నిచోట్ల మళ్లీ విత్తనాలు వేశారు. ఎరువులు, పురుగులమందులు, కలుపుతీతకు భారీపెట్టుబడి పెట్టారు. తీరా పంట చేతికొస్తున్న దశలో భారీ వర్షాలు దెబ్బతీశాయి. -
ఐక్యరాజ్య సమితి సమావేశానికి పెద్దపల్లి ఎంపీ
గోదావరిఖని/రామగుండం: పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణకు అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ఆయనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం ఆయన అమెరికాకు బయలుదేరి తరలివెళ్లారు. ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యే ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు మనదేశానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలకు అవకాశం దక్కింది. ఇందులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఉండడం గమనార్హం. ఉత్తరాఖండ్కు చెందిన కుమారి షెల్జా కూడా ఐక్యరాజ్య సమితి సమావేశానికి హాజరవుతారు. కాగా పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికై న వంశీకృష్ణకు ఏకంగా ప్రపంచ దేశాల ప్రతినిధులతో కలిసి ఐక్యరాజ్య సమితిలో సమావేశమయ్యే అవకాశం రావడం విశేషం. ఆయన అభిమానులు పి.మల్లికార్జున్, డీఆర్యూసీసీ ప్రతినిధి అనుమాస శ్రీనివాస్ ఎంపీని అభినందించారు. వివిధ దేశాల అవృద్ధి, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి అవకాశాల పెంపు తదితర అంశాలపై ఐక్యరాజ్య సమితి చర్చించనున్నట్లు ఎంపీ వివరించారు.పోలీసుల తనిఖీల భయంతో..గోదావరిఖని: పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారనే భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్రవాహనంపై నుంచిపడి యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానిక బాపూజీనగర్కు చెందిన అజయ్ మంగళవారం ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. పోలీసులు తనిఖీ చేస్తున్నారని గమనించి వాహనాన్ని వేగంగా వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలో మరో వాహనాన్ని ఢీకిని కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు రెఫర్ చేశారు. -
ఏసీబీకి చిక్కిన డ్రగ్స్ శాఖ అధికారులు
కరీంనగర్క్రైం/కరీంనగర్టౌన్: కరీంనగర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం అధికారులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుల నుంచి రూ.20 వేలు లంచంగా తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వార్షిక తనిఖీల్లో భాగంగా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఓ ప్రైవేట్ ఫార్మసీకి వెళ్లాల్సి ఉంది. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ మరియాల శ్రీనివాసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ భరద్వాజ్ ప్రైవేట్ అసిస్టెంట్ అయిన పుల్లూరి రాము ద్వారా రూ.20 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఫార్మసీ నిర్వాహకులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో నిఘా వేశారు. ఫార్మసీ నిర్వాహకుల నుంచి ప్రైవేట్ అసిస్టెంట్ రాము రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శ్రీనివాసులు, కార్తీక్ భరద్వాజ్తోపాటు రాముపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఫార్మసీ తనిఖీకి లంచం డిమాండ్ రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టివేత -
స్థానికంలో కాసుల గోల
గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడటంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. నగదు ప్రవాహంపై దృష్టి సారించారు. రూ.50వేల కన్నా ఎక్కువ వెంట తీసుకెళ్తే కచ్చితమైన ఆధారాలు చూపించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. లేకుంటే సీజ్ చేస్తామంటున్నారు. ఇదేక్రమంలో ఈనెల 4న రామగుండం పోలీస్ కమిషనరేట్ కోటపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు పారుపల్లి చెక్పోస్టు వద్ద రూ.1.90లక్షలను సీజ్ చేశారు. మహారాష్ట్రలో ఎన్నికలు లేకపోవడంతో కోడ్ విషయం తెలియక కారులో ఓ వ్యక్తి నగదు తీసుకెళ్తున్నాడు. రూ.50వేల కన్నా ఎక్కువ తీసుకెళ్తుండడంతో సీజ్ చేశారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో చాలాజరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆందోళన.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం, వెండి, ఇతర విలువైన ఆభరణాల కొనుగోలు కోసం పెద్దమొత్తంలో నగదు అవసరం ఉంటుంది. పది గ్రాముల బంగారం కొనుగోలు చేయాలన్నా కనీసం రూ.1.20లక్షలు అవసరం అవుతోంది. ఈక్రమంలో నగదు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. కొంతమంది ఆన్లైన్ లా వాదేవీల ద్వారా కొనుగోలు చేస్తున్నా.. చాలామంది నగదు రూపేణా లావాదేవీలు జరుపుతున్నారు. ఈక్రమంలో పోలీసులు అధిక డబ్బులు తీసుకెళ్తున్నారని సీజ్ చేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఎన్నికలకు సంబంధించిన డబ్బులు చాపకింద నీరులా వెళ్తాయని, ఎన్నికల కమిషన్ అతి నిబంధనలతో తాము ఇబ్బందిపడాల్సి వస్తోందన సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రాందీ షాపుల టెండర్లు.. రాష్ట్రప్రభుత్వం బ్రాందీషాపుల టెండర్లను ప్రారంభించింది. రెండేళ్ల కాలపరిమితికి ఒక్కోషాపు వేలంలో పాల్గొనేందుకు రూ.3లక్షలు చెల్లించి డీడీ తీయాలని సూచించింది. దీంతో చాలామంది టెండర్లలో పాల్గొనేందుకు నగదు వెంట తీసుకెళ్లడం సహజం. స్థానిక ఎన్నికల కోడ్ కూసిన క్రమంలో తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో పట్టణాల్లో మినహాయించి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ఈనిబంధన ఉండాలని కోరుతున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు మంచిర్యాల జిల్లా: నగదు రూ.4.48లక్షలు లిక్కర్ 146లీటర్లు(రూ.65వేలు) పెద్దపల్లి జిల్లా: లిక్కర్ 48లీటర్లు(రూ.17వేలు) గంజాయి 5కిలోలు(రూ.1.25లక్షలు) పీడీఎస్రైస్ క్వింటాల్ చెక్పోస్టులు: మంచిర్యాల జిల్లా: పారుపల్లి(అంతర్రాష్ట్ర), ఇందన్పల్లి, ఇందారం, తాండూర్, గూడెం పెద్దపల్లి జిల్లా: దుబ్బపల్లి, గుంపుల, ఎక్లాస్పూర్, గోదావరి బ్రిడ్జి పెళ్లిళ్ల సీజన్.. బ్రాందీ షాపుల టెండర్లు రూ.50వేలకుపైగా ఉంటే సీజ్ చేస్తున్న పోలీసులు ఎన్నికల నిబంధనల మేరకు వ్యవహరిస్తాం. నిబంధనలు అతిక్రమించి రూ.50వేలకుపైగా వెంట తీసుకెళ్తే అందుకు తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే రూ.50వేల కన్నా ఎక్కువ ఉన్నసొమ్మును సీజ్ చేస్తాం. జిల్లా సరిహద్దులతోపాటు అంతర్ రాష్ట్ర సరిహద్దు అయిన కోటపల్లి మండలం శివారులోని మహారాష్ట్ర బ్రిడ్జి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశాం. నగదు, మద్యం రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నాం. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సింగరేణి రెస్క్యూ శిక్షణ
గోదావరిఖని: నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులకు సింగరేణి యాజమాన్యం సోమవారం శిక్షణ ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని 10వ బెటాలియన్కు చెందిన మొదటి బ్యాచ్కు శిక్షణ ఇస్తున్నారు. భూగర్భగనుల్లో ప్రమాదాలు జరిగిన సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఒక్కో బ్యాచ్కు 14రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకున్న సింగరేణి రెస్క్యూ ద్వారా ఎన్డీఆర్ఎఫ్కు శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్డీఆర్ఎఫ్, మినిస్టరీ ఆఫ్ హోం ఎఫైర్స్, డీజీఎంఎస్, సింగరేణి సంస్థ కలిపి ఈనిర్ణయం తీసుకున్నాయి. శ్రీశైలం ఎస్ఎల్బీసీ సంఘటన సమయంలో సింగరేణి రెస్క్యూ బృందాల పనితీరు దేశవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేయాలనే ఆలోచనతో ఈశిక్షణకు అంకురార్పన జరిపారు. మొదటి బ్యాచ్లో 30మంది సభ్యులు ఉంటారని, ఈ బెటాలియన్లో 18 బ్యాచ్లు ఉంటాయని అసిస్టెంట్ కమాండర్ కె.కిరణ్కుమార్ తెలిపారు. ఈశిక్షణను ఆర్జీ–2 జీఎం బండి వెంకటయ్య, ఏరియా సేఫ్టీ జీఎం మధుసూదన్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, సూపరింటెండెంట్ రాజేందర్రెడ్డి ప్రారంభించారు. 14రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ కొనసాగనుంది. మొదటి బ్యాచ్కు శిక్షణ ప్రారంభం -
స్థానికం.. సందిగ్ధం!
సాక్షి పెద్దపల్లి: ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎ న్నికల షెడ్యూల్ విడుదల చేసినా.. ఆశావహుల్లో ఉ త్కంఠ తొలగడంలేదు. రిజర్వేషన్లు ప్రకటించినా.. అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కలిసోచ్చిన వారు ప్రచారం చేసుకోవాలో వద్దో తెలియక డైలామాలో పడిపోయారు. రిజర్వేషన్ కలిసిరాని వారు కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందనే ధీమాలో ఉన్నారు. రోజులు లెక్కబెట్టుకుంటున్నారు.. సోమవారం బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నమోదైన పిటిషన్ను సుప్రీంకోర్టు కోట్టివేసినా.. ఈనెల 8న హైకోర్టు తీర్పుకోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర సర్వోన్నత కోర్టుతీర్పు కోసం రోజులు లెక్కబెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఖరారైన స్థానాల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్న వారికి రిజర్వేషన్లు చెల్లుబాటవుతాయా? హైకోర్టు.. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేస్తుందా? అనే విషయంపైనే చర్చించుకోవడం కనిపిస్తోంది. హైకోర్టు తీర్పుపైనే అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్పై ఈనెల 8న హైకోర్టు విచారణ జరుపనుంది. షెడ్యూల్ విడుదల తర్వాత కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవు. కానీ.. ప్రభత్వుం బీసీలకు రిజర్వేషన్లు పెంచింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపే పలువురు కోర్టును ఆశ్రయించారు. అయితే, షెడ్యూల్ ప్రకటించినా.. తాము పిటిషన్పై విచారణ చేపడతామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, పెంచిన రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? లేక అభ్యంతరం చెబుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.పొలిటికల్ సీన్ఒకవేళ బీసీ రిజర్వేషన్ల పెంపు గతంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని హైకోర్టు అభిప్రాయపడితే.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఖరారు చేసేందుకు ప్రభుత్వం కొత్తగా జీవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం విడుదల చేసిన షెడ్యూల్ను రద్దు చేసి, కొత్తది ప్రకటించక తప్పదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అప్పుడు గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు 23 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 9 శాతం రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించాలి. అప్పుడు ఎస్సీ, ఎస్టీల స్థానాల సంఖ్య మారకపోయినా, బీసీల స్థానాలు తగ్గి జనరల్ స్థానాలు పెరగనున్నాయి. దీంతో జనరల్ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు ఇంకా అవకాశం ఉందనే భావనలో ఉన్నారు. -
వేములవాడలో కొండచిలువ
వేములవాడ పట్టణ శివారులోని మూలవాగు తీరంలో ధోబీఘాట్ వద్ద 9 ఫీట్ల పొడవు ఉన్న కొండచిలువ సోమవారం కనిపించింది. దీన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ట్రాఫిక్ ఎస్సై రాజు అక్కడికి చేరుకుని పాములు పట్టే జగదీశ్కు సమాచారం ఇవ్వడంతో అతను వచ్చి కొండచిలువను పట్టుకొని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. – వేములవాడకరీంనగర్కు ఒడిశా పోలీసులుకరీంనగర్క్రైం: సైబర్ క్రైం కేసులో ఒడిశా రాష్ట్రానికి చెందిన పోలీసులు సోమవారం కరీంనగర్కు వచ్చినట్లు తెలిసింది. కరీంనగర్ టూటౌన్ పరిధికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి పాత్ర ఉందని భావించి అతను ఉంటున్న విద్యానగర్ ప్రాంతంలో దర్యాప్తు చేశారు. సైబర్ నేరస్తులు సామాన్యులకు కొంతడబ్బు ఇచ్చి వారి పేర్లపై ఖాతాలు తెరుస్తుండటంతో ఇలాంటి నేరంతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న పోలీసులు అతడిని అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
యువకుడిపై దాడి
సిరిసిల్లక్రైం: రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం వెంకంపే ట ప్రాంతంలో సోమవారం పాతపగలతో జరిగిన దాడి ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాలు. వెంకంపేటకు చెందిన రాజశేఖర్పై అదే పట్టణానికి చెందిన హరికృష్ణ, విగ్నేశ్, నరేశ్లు కర్రలతో దాడి చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దాడి చేయగా అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకుండా విచక్షణారహితంగా కర్రలతో కొట్టారు. తల పై గాయాలతో రక్తస్రావమైన రాజశేఖర్ వెంటనే హాస్పిటల్లో చికిత్స పొంది, స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ దాడితో బాధితుని ఉండే ఏరియాలో నివసించే వారు భయాందోళన చెందుతున్నారు. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రకృతి బంతులు
కరీంనగర్క్రైం: పర్యావరణ పరిరక్షణకు మేము సై తం అంటున్నారు కరీంనగర్ జైలు అధికారులు. వ ర్షాలకు ఖాళీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలనే ఆలోచనతో సీడ్ బాల్స్ తయారీ చేపట్టారు. కరీంనగర్ జైలు ఆధ్వర్యంలో ఖైదీలతో సీడ్ బాల్స్ తయారు చేసి వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. రకరకాల విత్తనాలతో విత్తన బంతుల తయారు చేసి విసరడం ద్వారా కొండలు, గుట్టల ప్రాంతాల్లో మరిన్ని చెట్లు పెంచాలని భావిస్తున్నారు. నాణ్యమైన ఎర్ర మట్టితో.. సీడ్ బాల్స్ వల్ల పెరిగే మొక్కలను ప్రత్యేకంగా నాటి నీరు పోయాల్సిన అవసరం ఉండదు. వర్షాకాలంలో కొండలు, గుట్ట ప్రాంతాల్లో సీడ్బాల్స్ విసరడం వల్ల వాటంతట అవే పెరుగుతాయి. జైళ్ల డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా జైలులో వేప, చింత, కానుగ, అల్లనేరడి వంటి విత్తనాలతో 50 మంది ఖైదీలు 15 వేల సీడ్బాల్స్ తయారు చేశారు. ఇందుకోసం చొప్పదండి ప్రాంతం నుంచి నాణ్యమైన ఎర్రమట్టిని తెప్పించారు. విత్తనాలు సేకరించి ఆరబెట్టి, ఎర్రమట్టికి జీవామృతం, వర్మీ కంపోస్టును కలిపి సీడ్బాల్స్ తయారు చేసి భద్రపర్చారు. కరీంనగర్, హుజూరాబాద్ జైళ్ల పరిధిలో విత్తన బంతులను చల్లారు. గతంలో కరీంనగర్ జైలు తరఫున 3.5 లక్షల వరకు సీడ్ బాల్స్ తయారు చేశారు. -
వ్యర్థాల ప్రాసెస్కే కొత్త టెండరు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:నగరశివారులో డంప్యార్డ్ వ్యర్థాల ప్రాసెస్ కోసం బల్దియా టెండర్ పిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 నిధుల కింద ఈ టెండరును పిలిచారు. 2022లో ఇదే డంప్యార్డ్లో వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు రూ.16.50 కోట్లతో టెండరు అప్పగించిన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి టెండరు పిలవడంలో ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు. పాత కాంట్రాక్టర్ గడువు ఇంకా మిగిలి ఉండగానే.. మరో కాంట్రాక్టర్ టెండరు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీనిని సమర్థించుకునేందుకు బల్దియా అధికారులు కొత్తరాగం అందుకుంటున్నారు. పాత కాంట్రాక్టర్ చేయాల్సిన పని ఇంకా మిగిలి ఉందని, ఈలోగా మరింత చెత్త పేరుకుపోయింది కాబట్టి కొత్త టెండరు పిలిచామని వివరణ ఇస్తున్నారు. ఇదంతా కేవలం నగరంలో ఎంత చెత్త ఉత్పత్తి అవుతుంది? అన్న విషయంలో అధికారులకు అవగాహన లేకనే నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.ఏం జరిగిందంటే?నగరంలోని డంప్యార్డ్లో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసేందుకు నాల్గో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో బయోమైనింగ్ అనే స్మార్ట్ సిటీ ప్రక్రియకు బీ జం పడింది. ఇందులో ప్లాస్టిక్, సేంద్రియ వ్యర్థాలను వేరు చేసేందుకు మెట్రిక్ టన్నుకు రూ.570 చొ ప్పున స్కాడా (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అకైవజేషన్) విధానం సాయంతో చెల్లించేందుకు కరీంనగర్ కార్పొరేషన్ సిద్ధమైంది. ఇందుకోసం రూ.16.50 కోట్ల స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా ని ధులు కేటాయించి హర్షితా ఇన్ఫ్రా కంపెనీ సిరి కన్స్ట్రక్షన్స్ అండ్ డీఎం సొల్యూషన్స్తో కలిసి సంయుక్త భాగస్వాములుగా ఏర్పడ్డారు. వీరే టెండరు దక్కించుకుని 2022, మే 22న స్మార్ట్సిటీ ప్రాజెక్టుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా టెండరు దక్కించుకున్న కంపెనీలు కరీంనగర్లోని ఆటోనగర్లో ఉన్న డంప్యార్డ్లో గత 20 ఏళ్లలో తొమ్మిది ఎకరాల్లో 9 నుంచి 10 మీటర్ల ఎత్తున పేరుకుపోయి ఉన్న 0.2 మిలియన్ మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించాల్సి ఉంది. కానీ, 2022లో టెండరు దక్కించుకున్న కంపెనీకి 2 లక్షల మెట్రిక్ టన్నులు ప్రాసెస్ చేసేందుకు టెండరు ఇచ్చామని బల్దియా అధికారులు చెబుతుండడం గమనార్హం. ప్రస్తుతం ఇక్కడ కొన్నినెలలుగా బయోమైనింగ్ పనులు నిలిచిపోయాయి. అధికారులు మాత్రం దీనిపై స్పందిస్తూ.. వర్షాకాలంలో మినహాయింపు ఉంటుందని చెబుతుండడం కొసమెరుపు.బయోమైనింగ్ కోసం పాత టెండరు కేవలం 2 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెస్ చేసేందుకు అప్పగించాం. దాన్ని ఈ ఏడాది డిసెంబరు వరకు పొడిగించాం. వాస్తవానికి అక్కడ 4 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగయ్యాయి. ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక తాజాగా పిలిచిన రూ.2 కోట్ల టెండరు అదనంగా మరో 20 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసేందుకు పిలిచాం. వర్షాకాలం కాబట్టి పాత కాంట్రాక్టర్కు పనులు చేయడం వీలు కావడం లేదు. – ఓం ప్రకాశ్, డీఈవ్యర్థాలను తరలించే వాహనాల బరువును కొలిచేందుకు సర్వర్ కనెక్టివిటీతో కూడిన కాంటాసీసీటీవీ, ఆటోమేటెడ్ నంబరుప్లేట్ రికగ్నిషన్ కెమెరా, స్క్రీనింగ్ సిస్టమ్అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ, వరద నీరు సాఫీగా వెళ్లేందుకు తాత్కాలిక డ్రెయినేజీల నిర్మాణందుర్వాసన, పొగను నివారించే వ్యవస్థతాత్కాలిక షెడ్ నిర్మాణంవ్యర్థాల తీవ్రత తగ్గించే ప్లాంట్స్కాడా విధానం.. (సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అకైవజేషన్ ) ఈ విధానంలో వాహనాలను ఆర్ఎఫ్ఐడీ ద్వారా రాకపోకలు, తూకాలను సులువుగా గుర్తించాలి.నిబంధనల ప్రకారం అక్కడ పై సదుపాయాలన్నీ పక్కాగా ఉండాలి. కానీ.. అవన్నీ అరకొరగా ఉండడం కొసమెరుపు. -
జిల్లా ఆస్పత్రిలో న్యాయ సహాయ కేంద్రం
కరీంనగర్క్రైం/ కరీంనగర్టౌన్: మాదకద్రవ్యాలపై అవగాహన, వెల్నెస్ నావిగేషన్ పథకంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సోమవారం న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వెంకటేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, మాదకద్రవ్యాల బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి న్యాయసహాయమైనా అందించేందుకు జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. కేంద్రంలో ఒక న్యాయవాదిని, పారా లీగల్ వలంటీర్ను నియమించినట్టు పేర్కొన్నారు. మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిస కావొద్దని ఆసుపత్రికి వచ్చిన రోగులకు సూచించారు. ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి వీరారెడ్డి, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేశ్, మానసిక రోగుల విభాగ అధిపతి అజయ్కుమార్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.రేపు, ఎల్లుండి నల్లా బంద్కరీంనగర్ కార్పొరేషన్: ఫిల్టర్బెడ్లో మరమ్మతు పనులు జరుగుతున్నందున ఈనెల 8, 9 తేదీల్లో నగరంలో తాగునీటి సరఫరా ఉండదని నగరపాలకసంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్కుమార్ తెలిపారు. నగర పరిధిలోని అన్ని డివిజన్లలో ఈ రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు. నగరవాసులు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.క్వింటాల్ పత్తి రూ.6,500జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో సోమవారం క్వింటాల్ పత్తి రూ. 6,500 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.దరఖాస్తులకు నేడు చివరి తేదీచొప్పదండి: 2026–27 విద్యా సంవత్సరానికి గాను పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో తొమ్మిదో తరగతి, పదకొండవ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు మంగళవారం సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి కోరారు. గత నెలలో దరఖాస్తు గడువు తేదీ ముగిసినా ఈనెల 7 వరకు గడువు పెంచడం జరిగిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్నవారు తొమ్మిదో తరగతిలో, పదో తరగతి చదువుతున్నవారు పదకొండవ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నవోదయ విద్యాలయంలో సీబీఎస్ఈ విధానంలో విద్య కొనసాగుతుందని, దరఖాస్తులను నవోదయ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో పంపించవచ్చని వివరించారు.సిటీలో నేడు కరెంట్ కట్కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ల సరిదిద్దే పనులు చేపడుతున్నందున మంగళవారం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్కండేయనగర్, ప్రగతినగర్, లారెల్ స్కూల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఇరుకుల్ల, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్, తాహెర్కొండాపూర్, బహద్దూర్ఖాన్పేట, దుబ్బపల్లి, చామన్పల్లి, చేగుర్తి, నల్లగుంటపల్లి వ్యవసాయ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు వివరించారు.మద్యం దుకాణాలకు 42 దరఖాస్తులుకరీంనగర్క్రైం: జిల్లాలోని వైన్స్లకు దుకాణాలకు 42 దరఖాస్తులు వచ్చినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. సోమవారం ఒక్కరోజే 41 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. -
‘అడవిలో అన్నలు’ సిరిసిల్లలో కలిశారు!
సిరిసిల్ల: సిరిసిల్లకు వచ్చిన మంత్రి సీతక్కను అప్పటి అన్నలు కలిశారు. ములుగు జిల్లాకు చెందిన ధనసరి అనసూర్య ఉరఫ్ సీతక్క 1985–92 ప్రాంతంలో సీపీఐ(ఎంఎల్) జనశక్తిలో దళనేతగా పనిచేశారు. అనంతరం ఆమె జనజీవన స్రవంతిలో కలిశారు. రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం మంత్రిగా పనిచేస్తున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సోమవారం సిరిసిల్లకు వచ్చిన మంత్రిని జనశక్తి మాజీ నక్సల్స్ కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన బుర్ర మల్లేశంగౌడ్ ఉరఫ్ కుమారన్న, ఇదే మండలంలోని మల్కపేటకు చెందిన బుట్టం చంద్రయ్య ఉరఫ్ సోమన్న కలిశారు. గతంలో సీతక్కతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది ఇలాఉంటే 1989లో గ్రెనేడ్పేలి సోమన్న చేయి నుజ్జునుజ్జయ్యింది. అనంతరం వ్యక్తిగత కారణాలతో 1995లో ఆయన జనజీవన స్రవంతిలో కలిశారు. మరో నాయకుడు కుమారన్న వరంగల్ జిల్లాలోనే ఎక్కువ కాలం పనిచేశారు. 1989లో జనజీవన స్రవంతిలో కలిశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ముష్టిపల్లి సర్పంచ్, ఉపసర్పంచగా పనిచేశారు. -
ప్రభుత్వం ఆదుకోవాలి
మరో పదిహేను రోజుల్లో వరి పంట కోతకు వస్తుంది. ఈ సమయంలో భారీ వర్షాలు పడుతున్నయి. నాకున్న మూడెకరాల్లో ఏసిన పంటకు నష్టం జరిగింది. పంట నష్టపోయిన మాలాంటి రైతులను ప్రభుత్వమే ఆర్థికంగా ఆదుకోవాలి. – భూసారపు శ్రీనివాస్, రైతు, కోనరావుపేట నాకున్న మూడెకరాల్లో ఈ సారి పత్తి పంట ఏసిన. ఏకరాపై రూ. 30వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. పత్తి పంట కాయ దశకు వచ్చింది. ఏకధాటి వానలతో వైరస్ సోకిందట. కాయలు నల్లగా, ఆకులు ఎర్రగా మారినయి. – ఉప్పుల అనిత, రైతు, గూడెం వాతావరణంలో వస్తున్న మార్పులు, భారీవర్షాలతోనే తెగుళ్లు ఆశిస్తున్నాయి. వాటి నివారణకు వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే పురుగు మందులు వాడాలి. ఇందుకోసం స్థానిక ఏఈవోలను తప్పకుండా సంప్రదించాలి. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి -
పంటలకు తెగుళ్ల బెడద
సుల్తానాబాద్/జూలపల్లి/ఓదెల(పెద్దపల్లి): కొద్దిరోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో వరి, పత్తి పంటలకు తెగుళ్లు ఆశిస్తున్నాయి. వర్షాకాలం ఆరంభంలో ఆలస్యంగా కురిసిన వానులు.. ఇప్పుడు సీజన్ చివరిదశకు వచ్చినా భారీవర్షాలు కురుస్తుండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. వీటికితోడు వాతావరణంలో ఆకస్మిక మార్పులతోనూ వరి, పత్తి పంటలకు వివిధ తెగుళ్లు ఆశిస్తున్నాయి. మరో నెలరోజుల్లో పంటలు చేతికి వస్తాయి. ఈ క్రమంలో తెగుళ్లు ఆశించడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీవర్షాలతో వరి పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. గింజదశలోని పంటను ఆశించడంతో దిగుబడి తగ్గుతుందని, అంతేకాకుండా తాలు అధికంగా ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతలను ముంచిన భారీ వర్షాలు జూలపల్లి మండలంలోని కోనరావుపేట, నాగులపల్లె, కల్లెంరెడ్డిపల్లె, తెలుకుంట తదితర గ్రామాల్లోని వరిపంట కోతదశకు చేరింది. గింజగట్టిపడక ముందే ఏకధాటివానలతో తాలుగా మారే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగులపల్లె, తెలుకుంట, కల్లెంరెడ్డిపల్లెలో వర్షం ధాటికి దాదాపు 30 ఎకరాల్లో వరిపైరు నేలవాలిందని, గింజలు పనికిరాకుండా పోయానని వాపోతున్నారు. తెల్లబంగారానికి తెగులు.. ఓదెల మండలంలోని వివిధ గ్రామాల్లో పత్తి పంటకు తెగులు సోకింది. మచ్చతెగుళ్లతో పంట దెబ్బతింటోదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓదెల మండలంలోని 22 గ్రామాల్లో సుమారు 4 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారని అధికారుల అంచనా. ఇందుర్తిలో 250 ఎకరాలు, పొత్కపల్లిలో వెయ్యి , శాన గొండలో 500, గుంపులలో 350, ఓదెలలో 570, కొమిరలో 320, కొలనూర్లో 200, మడకలో దాదాపు 250 ఎకరాల్లో పత్తి సాగైందని, కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటకు నల్లమచ్చలు వస్తున్నాయని, మొక్కలు కుళ్లిపోతున్నాయని అన్నదాతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికి వచ్చే దశలో ఉందని, ఈ సమయంలో కాయలు, బుగ్గలు నల్లగా మారడంతో దిగుబడి తగ్గుతుందని, పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు.. చేను జాలువారి మొక్కలన్నీ ఎర్రబారుతున్నాయని అంటున్నారు. కొద్దిరోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతోనే పత్తి పంటకు తెగులు సోకుతోంది. మొక్కలు, ఆకులు, కాయలపై నల్లమచ్చలు ఏర్పడుతున్నాయి. తెగుళ్ల నివారణ కోసం అన్నదాతలు రైతువేదికలో ఏఈవోలను తక్షణమే సంప్రదించాలి. – రామకృష్ణ, ఏఈవో, కొలనూర్, ఓదెల -
మంత్రి పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాలి
కరీంనగర్: ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను అసభ్యపదజాలంతో దూషించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ డిమాండ్ చేశారు. సోమవారం సంఘ కార్యాలయంలో మాట్లాడారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మంత్రి వివేక్తో ‘దున్నపోతుగానికి టైం తెలియదు ఏమి తెలియదు’ అని అడ్లూరిని అవమానించేలా పొన్నం అహంకారంగా మాట్లాడడం సరికాదన్నారు. 24 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు. ఈ నెల 8న జిల్లావ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం చేస్తామని, 9న పొన్నం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఒక దళిత మంత్రిని అవమానించేలా మాట్లాడినప్పుడు మంత్రి వివేక్ కనీసం స్పందించలేదంటే ఆయనకు దళిత పదం బతుకుదెరువు కోసమే తప్ప దళిత జాతి భవిష్యత్తు కోసం ఏమీ ఉపయోగపడరని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొమురయ్య, నవీన్, శంకర్, అంజయ్య, రాజన్న, వరలక్ష్మి, బాబు, సంపత్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో పొత్తు ఉండదు
విద్యానగర్(కరీంనగర్): ఎంఐఎం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి యాసర్ ఆర్ఫాత్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కరీంనగర్లోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. కరీంనగర్ అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ సుబహాన్, నాయకులు బర్కత్ అలీ, హాఫిజ్ యూసుఫ్, ఖమరొద్దీన్, ఆతిన, ఖాజా, ఇబ్రహీం, మాజీ కార్పొరేటర్లు అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, ఆరిఫ్ అహ్మద్, మాజిద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్ ఈఎంఐ కట్టలేక వ్యక్తి మృతి
కరీంనగర్ జిల్లా: శంకరపట్నం మండలం ముత్తారం గ్రామానికి చెందిన సుమంత్ (24) అనే వ్యక్తి మద్యం మైకంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. MGM ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.సుమంత్ మద్యానికి బానిసై, తన బైక్ EMI కట్టలేక చనిపోయాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. -
ఉన్నత విద్యకు ‘అంబేడ్కర్ విద్యానిధి’
కరీంనగర్: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఓ వరంగా మారింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి 210 మంది విద్యార్థులకే సాయం అందించింది. ఇటీవల ప్రభుత్వం ఏటా 500 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. అభ్యర్థులు చదివే కోర్సు ఫీజులను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. తెలంగాణ ఈ– పాస్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థి వివరాలను పూరించి సంబంధిత ధ్రువపత్రాలను జేపీజీ ఫార్మాట్లో జతపర్చాలి. రాష్ట్రస్థాయిలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ప్రిన్సిపాల్ కార్యదర్శి ఆధ్వర్యంలోని కమిటీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపడుతుంది. జీఆర్ఈ/జీమ్యాట్లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికై న వారికి విదేశీ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ప్రవేశ లేఖ ఆధారంగా రూ.20 లక్షల వరకు ఆర్థిక స్యాం అందజేస్తారు. కోర్సులో చేరిన వారు మొదటి సంవత్సరం నుంచి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినట్లు ఽధ్రువపత్రాలు పంపిస్తేనే ఫీజుకు సంబంధించిన సాయం విడుదల చేస్తారు. అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించకపోతే సాయం నిలిచిపోతుంది. అర్హులు ఎవరంటే..? కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. జీఆర్ఈ/జీమ్యాట్లో అర్హత మార్కులు సాధించాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులో ప్రతిభ కనబరచాలి. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థి మాత్రమే అర్హులు. నవంబర్ 19 వరకే దరఖాస్తు గడువు. ఆమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో చదువుకోవచ్చు. కావాల్సిన ధ్రువపత్రాలు... పాస్పోర్టు సైజ్ఫొటో. బోనాఫైడ్ సర్టిఫికెట్. ఆధార్, రేషన్ కార్డు. స్థానికత ఽధ్రువపత్రం. పదో తరగతి మెమో. చివరి కోర్సు మార్కుల మెమో. బదిలీ సర్టిఫికెట్. జీఆర్ఈ/జీమ్యాట్/ ఇతర స్కోర్కార్డు. బ్యాంకు ఖాతా పుస్తకం. విదేశీ విశ్వవిద్యాలయ ప్రవేశ లేఖ. పాస్పోర్టు కాపీ. దళిత విద్యార్థుల ఉన్నత చదువులకు చక్కటి అవకాశం రూ.20లక్షల వరకు రుణం పొందే అవకాశం పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యం -
గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించిన ఎమ్మెల్యే
మెట్పల్లి: మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏలేటి శ్రీధర్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం మండలం కోమటికొండాపూర్కు చెందిన శ్రీధర్ తన ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం మెట్పల్లి వచ్చాడు. తిరిగి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో సమీపంలోని హోటల్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి టీ తాగుతున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గమనించి వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీధర్ను పరీక్షించి తర్వాత ఆటోలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందించారు. వ్యక్తి ఆత్మహత్యముస్తాబాద్(సిరిసిల్ల): ఉపాధి కరువై.. మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అనిల్కుమార్ తెలిపిన వివరాలు. గంభీరావుపేట మండలం ముచ్చర్లకు చెందిన కోల సతీశ్(39) ఇంట్లో ఆదివారం చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లివచ్చిన సతీశ్కు స్వగ్రామంలో సరైన పని లభించలేదు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో భార్య జ్యోతి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుల బాధతో దర్జీ..సిరిసిల్ల క్రైం: వృత్తి కలిసిరాక.. కుటుంబ పోషణకు చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురైన సిరిసిల్లకు చెందిన దర్జీ స్వర్గం రమేశ్ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. జిల్లా కేంద్రంలోని బీవైనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్న రమేశ్ చాలా ఏళ్లు టైలర్ పనిచేశాడు. కాలక్రమంలో బట్టలు కుట్టించుకునేవారు తక్కువయ్యారు. దీనికితోడు కుటుంబ పోషణకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేక సొంతింటిని అమ్మేసి అత్తగారి ఇంటి వద్ద భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఇప్పటికే రూ.20లక్షలు అప్పు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదివారం తెల్ల్లవారు జామున ఇంట్లో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య సంధ్య బీడీ కార్మికురాలు కాగా వీరికి కూతురు నిహారిక(13), కొడుకు మదన్(11) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిఖని(రామగుండం): స్థానిక మార్కండేయకాలనీకి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి గంట వెంకటేశ్వర్రెడ్డి(85) ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని వన్టౌన్ ఎస్సై రమేశ్ కథనం ప్రకారం.. వెంకటేశ్వర్రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ సింగరేణి ఆసుపత్రిలో రెగ్యులర్గా చికిత్స చేయించుకుంటున్నాడు. ఆదివారం వేకువజామున కడుపులో నొప్పి వస్తోందని కుమారునికి చెప్పగా, అతను బట్టలు మార్చుకుని వస్తానని ఇంట్లోకి వెళ్లిన సమయంలో వెంకటేశ్వర్రెడ్డి భవనం పైకి ఎక్కి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు శ్రీనివాస్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని ఉప్పరిపేటకు చెందిన మానుక మహేశ్ (46) అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. మహేశ్ కొద్దికాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దే ఉంటున్నాడు. మరోవైపు ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై ఈనెల 3న ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కుటుంబసభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేశ్ భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దాచుకున్న డబ్బు ఇవ్వరా?
కరీంనగర్: ఇలాంటి సమస్యలు ఏ ఒక్కరిద్దరివో కావు 20 నెలలుగా పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేక, పెద్ద చదువులు చదివించలేక అనారోగ్యానికి చికిత్స చేయించుకోలేక, చేతిలో చిల్లిగవ్వలేక బాధ పడుతున్నారు. దాచుకున్న డబ్బు ఒక్కొక్కరికి రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు రావాల్సి ఉన్నా.. చేతిలో చిల్లిగవ్వ లేక రిటైర్డు ఉద్యోగులు ఆందోళన బాటకు సిద్ధం అవుతున్నారు. 20 నెలలుగా ఎదురుచూపులు 30ఏళ్లకు పైగా ప్రభుత్వ ఉద్యోగం చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. సర్వీసులో ఉన్నంత కాలం వివిధ రూపాల్లో ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్ముతో పాటు జీపీఎఫ్, పీఎఫ్ సమయానికి అందకపోవడంతో ఆందోళనబాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. కొద్ది నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సంవత్సరం సమయం ఇస్తే రిటైర్డు ఉద్యోగులందరి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 7న ఉమ్మడి జిల్లాలోని కలెక్టరేట్ల వద్ద ఆందోళన, ఈనెల రెండోవారంలో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా)ఉమ్మడి జిల్లాశాఖ కార్యవర్గాన్ని ఏర్పర్చుకుని కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. రెండుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఉద్యమ కార్యాచరణ రూపొందించుకున్నారు. మాటలు నీటిమూటలేనా గత ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రిటైర్డు ఉద్యోగులకు పదవీవిరమణ రోజే బెనిఫిట్స్ అందజేసి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దించాలని పలు వేదికల మీద మాట్లాడిన మాటలు నీటిమూటలేనా అంటూ రిటైర్డు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2024 మార్చి నెల నుంచి ఇప్పటి వరకు రిటైర్డు అయినటువంటి ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమిటేషన్, ఈఎల్స్, అఫ్ పే లీవ్, సరెండర్ లీవ్స్, జీపీఎఫ్, డీఎస్జీ ఎల్ఐసీ, జీఐఎస్, పీఆర్సీ ఎరియర్స్, సర్వీసులో ఉన్నప్పుడు చేసుకున్నటువంటి సరెండర్ లీవ్స్, తదితర బిల్లులు మొత్తం జీపీఎఫ్ ఆధారంగా ఒక్కొక్కరికి దాదాపు రూ.35 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు రావాల్సి ఉంది. 20నెలలుగా ఏ ఒక్కరికి ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదలలో ప్రభుత్వం జాప్యం చేయడంతో కొంత మంది రిటైర్డు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. ఎనిమిది వారాల్లో బెనిఫిట్స్ చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు. రిటైర్డు ఉద్యోగుల ఆందోళన బాట ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట ధర్నా రెండోవారంలో ‘చలో హైదరాబాద్’ -
మానసిక వేదనే
మూడు దశాబ్దాల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవి విరమణ పొందితే బెనిఫిట్స్ అందకుండా నిర్లక్ష్యం చేయడం ప్రభుత్వానికి తగదు. 20 నెలలుగా రిటైర్డు ఉద్యోగులు బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంట్లో పిల్ల పాపలతో హాయిగా ఉండాల్సిన సమయంలో కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం తగదు. మానసిక వేదనకు గురై కొందరు ఆసుపత్రుల పాలు మరికొందరు అకాలమరణం చెందుతున్నారు. బెనిఫిట్స్ సాధనకు ఈనెల 7న కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు తరలిరావాలి. – కోహెడ చంద్రమౌళి, రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు(రేవా) -
ఆబ్కారీ అస్తవ్యస్తం !
● ‘వేములవాడ పట్టణానికి సమీపంలో ఒకరు దాదాపు రూ.2లక్షల విలువ చేసే బ్రాండెడ్ లిక్కర్ను కల్తీ చేసి విక్రయించాడు. మద్యం రుచిలో తేడా రావడంతో మందుబాబుల ఫిర్యాదుతో ఆబ్కారీశాఖ అధికారులు నకిలీ లిక్కర్ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకుని కటకటాలకు పంపారు.’ ● ‘రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో ఉన్న ఆబ్కారీ వాహనంలో పదుల సంఖ్యలో మద్యం బాటిల్స్ ఉన్నాయి. వాటిని దసరా ముందు రోజు బయటకు పంపడానికి కొందరు ఎకై ్సజ్ ఉద్యోగులతో ఓ అధికారి ప్లాన్ చేశారు. ఇది కాస్త బయటకు తెలిసి వీడియో తీయడానికి పలువురు ప్రయత్నించగా.. వెంటనే ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీజ్చేసిన బాటిల్స్ అయితే వాటి వివరాలను ఆబ్కారీ అధికారులు ఎందుకు బహిర్గతం చేయలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.’ సిరిసిల్ల క్రైం: జిల్లాలో ఆబ్కారీశాఖ పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అధికారుల కొరత ఉండడంతో పర్యవేక్షణ కరువైంది. ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కరువై జిల్లాలో నకిలీ మద్యం విక్రయాలు, గుడుంబా వ్యాపారాలు జోరందుకున్నాయి. సిరిసిల్ల సర్కిల్ సీఐ లేకపోవడంతో ఆ విధులను ఎల్లారెడ్డిపేట ఎకై ్సజ్ సీఐకి అప్పగించారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. ● అధికారుల కొరతతో.. ఆబ్కారీ శాఖలో సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వేములవాడ సర్కిళ్లు ఉన్నాయి. సిరిసిల్ల సర్కిల్కు సీఐ లేకపోవడంతో ఎల్లారెడ్డిపేట సీఐ రెండు సర్కిళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా తండాలు, గ్రామాల్లో బెల్ట్షాపులు, గుడుంబా తయారీ నియంత్రణపై పట్టు కోల్పోయారు. ఒక్కో ఊరికి ఐదేసి బెల్ట్షాపులు నడుస్తున్నా పర్యవేక్షణ కరువైంది. ● హడావుడి..యథాతథం ఆబ్కారీ విభాగంపై విమర్శలు రాగానే తండాల పరిశీలనలు, బెల్లం పానకం ధ్వంసం, నాటుసారా పాత్రలు స్వాధీనం చేసుకుంటూ హల్చల్ చేస్తున్నారు. కానీ కొద్ది రోజులకే మళ్లీ యథాతథ స్థితికి చేరుకుంటున్నాయి. ఒకటి, రెండు ఫొటోలు తీసి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ● ఆబ్కారీ జీపులో మద్యం బాటిల్స్ దసరా పండుగ ముందు రోజు ఆబ్కారీశాఖ వాహనంలో మద్యం బాటిల్స్ కనిపించడం కలకలం రేపింది. వాటిని సీజ్ చేసిన బాటిల్స్ అని అధికారులు చెబుతున్నా వాస్తవం అది కాదనే ప్రచారం జరుగుతోంది. పండుగ కోసం కావాలనే జిల్లాలోని పలు వైన్షాపుల వద్ద వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ● కలెక్టరేట్ సెల్లార్లో బాటిల్స్ నిల్వ! ఆబ్కారీ అధికారి తన జీపులో పెట్టి నేరుగా కలెక్టరేట్ సెల్లార్లో దాచినట్లు సమాచారం. విషయం మీడియాకు తెలియడంతో ఆ అధికారి వాహనాన్ని అధిక వేగంతో అక్కడి నుంచి తరలించారన్న వీడియోలు వైరల్గా మారాయి. సీజ్ చేసిన బాటిల్స్ అయితే అవి శాఖ కార్యాలయంలో ఉండాలి. నిర్ణీతకాలం తర్వాత ధ్వంసం చేయాలి. కానీ ప్రస్తుత అధికారులు వాటిని రీసేల్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతటి ఆరోపణలపై విచారణ జరిపే అధికారి లేకపోవడంతో అవినీతి మూలాలు బలపడుతున్నాయి. అసలు వాహనంలో మద్యం బాటిల్స్ ఎక్కడివనే కోణంలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కొందరు చేసిన తప్పుకి ఆబ్కారీశాఖలో అందరిపై ఆరోపణలు బాధ కలిగిస్తున్నట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అరకొరగా అధికారులు కొరవడుతున్న పర్యవేక్షణ మొన్న నకిలీ మద్యం తయారీ దందా ఎకై ్సజ్ వాహనంలోనే మందుబాటిల్స్ సీజ్ చేసిన బాటిల్స్ రీ సేల్? విచారణ చేపట్టాలని డిమాండ్ -
సెల్ పాయింట్లో అగ్నిప్రమాదం
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా సమీపంలోగల సెల్ పాయింట్లో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన సెల్పాయింట్ యజమాని శ్రావణ్ శనివారం షాపునకు తాళం వేసి వెళ్లాడు. ఉదయం షాపు నుంచి పొగలు వస్తున్నాయని స్థానికులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని షాపు యజమాని శ్రావణ్ తెలిపారు. ఘటనలో సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక శాఖాధికారి తెలిపారు. రూ.2లక్షల ఆస్తినష్టం -
కోర్టు ఆదేశాలు అమలు చేయాలి
రిటైర్డు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందజేయాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన ఆదేశాలు, కోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలి. ఎనిమిది వారాల్లో రిటైర్డు ఉద్యోగులకు బెనిఫిట్స్ అందజేయాలని హైకోర్టు హెచ్చరించిన ఏడాది గడుస్తున్న ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరం. రిటైర్డు ఉద్యోగులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదు. తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపులను వేగవంతం చేయాలి. – సుంకెశీల ప్రభాకర్రావు, రిటైర్డు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్(రేవా) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
వరుణుడి ప్రకోపం.. రైతన్నకు నష్టం
చొప్పదండి/చిగురుమామిడి/మానకొండూర్/గంగాధర: జిల్లాలో ఆదివారం గాలివాన కురియడంతో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చొప్పదండి మండలం గుమ్లాపూర్, చిట్యాలపల్లి, చొప్పదండి తదితర ప్రాంతాల్లో వరి నేల కొరిగింది. చిగురుమామిడి మండలం పీచుపల్లి, చిన్నముల్కనూర్, రా మంచ, ముదిమానిక్యం, చిగురుమామిడిలో కోతకొచ్చిన వరిపంట నేలవాలడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మానకొండూర్ మండలంలోని మద్దికుంట, కెల్లెడ, దేవంపల్లి, కొండపల్కల, గంగిపల్లి, పచ్చునూర్ గ్రామాల్లో వరిపంట నేలకొరిగి, ధాన్యం రాలిపోయింది. వరుసగా వర్షాలు పడితే పంట చేతికందుతుందోలేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగాధర మండలంలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. పంటనష్టంపై సర్వే నిర్వహించి, రైతులకు పరిహారం ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. -
టార్గెట్.. గార్బెజ్ ఫ్రీ సిటీ
కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ను చెత్త రహిత నగరంగా మార్చే దిశగా నగరపాలకసంస్థ అడుగులు వేస్తోంది. గార్బెజ్ ఫ్రీ సిటీగా ర్యాంక్ సాధిస్తేనే 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చే అవకాశమున్నందున చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతీ ఇంటినుంచి నుంచి చెత్తను సేకరించి ఆటోల్లో తరలిస్తుండగా, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్లు ప్రధాన సమస్యగా మారాయి. దీంతో ఆ పాయింట్లు తొలగించి, వందశాతం చెత్త సేకరణకు నిర్ణయించింది. రోడ్లపై చెత్త పడవేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్లో గుర్తించి, ఇంటికే జరిమానా రశీదు పంపించే ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. గార్బెజ్ పాయింట్లే ప్రధాన సమస్య నగరంలో గతంలో ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్లు ఇప్పుడు ప్రధాన సమస్యగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త కనిపించడానికి ఈ పాయింట్లే కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే ఇండ్లు, వ్యాపార వాణిజ్య సంస్థల నుంచి స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు చెత్తను సేకరించి డంప్యార్డ్కు తరలిస్తున్నాయి. ఇందుకోసం యూజర్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు యూజర్ చార్జీలు తప్పించుకునేందుకు చెత్తను తీసుకొచ్చి గార్బెజ్ పాయింట్ల వద్ద పడేస్తున్నారు. కొన్ని చోట్ల జంతు వ్యర్థాలు కూడా వేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు ఇటీవల నగరపాలకసంస్థ ఆయా పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. వీటిని నగరపాలకసంస్థ కార్యాలయంలో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసింది. అక్కడి నుంచి గార్బెజ్ పాయింట్ల వద్ద చెత్త పడవేస్తున్న వాహనాలను గుర్తించి, వారికి జరిమానా విధిస్తున్నారు. వాహనాల నంబర్ల ఆధారంగా ఇండ్లకే జరిమానా రశీదులు పంపిస్తున్నారు. రిక్షాల సమయంలో కలెక్షన్ పాయింట్లు ఒకప్పుడు స్వచ్ఛ ఆటోలు లేని సమయంలో, రిక్షాలు ఉన్నప్పుడు ఈ గార్బెజ్ పాయింట్లు (సెకండరీ కలెక్షన్ పాయింట్లు) ఏర్పాటు చేశారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను రిక్షాలు ఆ కలెక్షన్ పాయింట్ల వద్ద వేస్తే అక్కడి నుంచి ఇతర వాహనాల ద్వారా డంప్యార్డ్కు తరలించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నగరంలోని 66 డివిజన్లకు గాను 120కి పైగా స్వచ్ఛ ఆటోలు ఇంటింటికి తిరిగి చెత్తను సేకరించి, డంప్యార్డ్కు తరలిస్తున్నాయి. దీంతో గార్బెజ్ పాయింట్ల అవసరం లేకుండా పోయింది. యూజర్చార్జీలు ఎగవేసే వ్యాపారులకు మాత్రమే ఈ గార్బెజ్ పాయింట్లు ఉపయోగపడుతున్నాయి.36 పాయింట్లు ఎత్తివేత నగరంలో సమస్యగా మారిన చెత్త కలెక్షన్ పా యింట్లను నగరపాలకసంస్థ ఎత్తివేస్తోంది. బస్ స్టేషన్, అంబేడ్కర్ స్టేడియం, కశ్మీర్గడ్డ, వావి లాలపల్లి, పాతమున్సిపల్ గెస్ట్హౌస్, సుభా ష్నగర్ ఎస్సీ హాస్టల్, ఆదర్శనగర్, కూరగాయ ల మార్కెట్, ఎన్ఎన్ గార్డెన్, రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్, హౌసింగ్బోర్డుకాలనీ, ప్రవిష్ట, చైతన్యపురి, శాతవాహన యూనివర్సిటీ, శివ థియేటర్, రాంనగర్, పద్మనగర్ తదితర 36 చోట్ల ఉన్న గార్బెజ్ పాయింట్లను తొలగిస్తున్నారు. అక్కడ చెత్త పడవేయకుండా ఫెన్సింగ్ నిర్మించారు. స్వచ్ఛతకు గుర్తుగా పూలకుండీలు ఏర్పా టు చేశారు. గార్బెజ్ పాయింట్లు ఎత్తివేస్తుండడంతో, రోడ్లపై వెళ్లే వాళ్ల కోసం టూ బిన్స్ను ఉపయోగిస్తున్నారు. తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు రెండు రకాల డబ్బాలను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. చెత్త వేస్తే చిత్తే చెత్త వేస్తే కఠిన చర్యలు కలెక్షన్ పాయింట్లు, రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గార్బెజ్ పాయింట్ల వద్ద చెత్తను వేస్తే కమాండ్ కంట్రోల్ ద్వారా గుర్తించి జరిమానా విధిస్తాం. స్వచ్ఛ ఆటోలకు మాత్రమే తడి, పొడి చెత్తగా అందించాలి. చెత్త రహిత నగరంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలి. – ప్రఫుల్దేశాయ్, నగరపాలకసంస్థ కమిషనర్ రోడ్లపై చెత్త పడవేసే వారిపై నగరపాలకసంస్థ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు చూసీ చూడనట్లుగా ఉన్నా, ఇకనుంచి ఆ పరిస్థితి ఉండదని హెచ్చరిస్తోంది. నగరంలోని కీలక ప్రాంతాల్లోని 16 గార్బెజ్ పాయింట్ల వద్ద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. కమాండ్ కంట్రోల్ ద్వారా ఉదయం 5 గంటల నుంచి 16 గార్బెజ్ పాయింట్లను పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం ప్రతి రోజు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్, ఒక జవాన్ కమాండ్ కంట్రోల్లో ఉండనున్నారు. ఎక్కడ చెత్త వేసినట్లు కనిపించినా, వారిని గుర్తించి జరిమానా విధిస్తున్నారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో పడవేస్తున్న చెత్తను ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్మికులు తొలగించాలని నగరవాసులు కోరుతున్నారు. -
నేడు ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: ఎన్నికల కోడ్ క్రమంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని వెల్లడించారు. కోడ్ ముగిసిన అనంతరం కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. దొంగ ఓట్లతోనే అధికారంలోకి బీజేపీ కరీంనగర్ కార్పొరేషన్: దేశవ్యాప్తంగా నమోదు చేసుకున్న దొంగ ఓట్లతోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆరోపించారు. ఓటుచోరీపై ఆదివారం నగరంలోని ఇందిరాచౌక్ వద్ద 64వ డివిజన్ నుంచి సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుచోరీని అరికట్టడానికి ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్నారు. ఇందులో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ నెల 17వ తేదీ లోగా నగరంలోని అన్ని డివిజన్లలో సంతకాల సేకరణ చేయాలన్నారు. 64వ డివిజన్ కాంగ్రెస్ బాధ్యుడు పెద్దిగారి తిరుపతి ఆధ్వర్యంలో డివిజన్ వాసులు పి.పద్మ,కోమలత, మనీషా,ఆరిఫ్,వెన్నెల,సోహెల్, శివాని తదితరులు పత్రాలపై సంతకాలు చేశారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి రహ్మత్ హుస్సేన్, కొరివి అరుణ్ కుమార్, వెన్న రాజమల్లయ్య, శ్రీనివాస్, అబ్దుల్ రహమాన్, అహ్మద్ అలీ, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ.చాంద్, దండి రవీందర్, కుర్ర పోచయ్య పాల్గొన్నారు. -
ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్
కరీంనగర్ టౌన్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం కరీంనగర్లో పథ సంచాలన్ నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు. టీటీడీ కల్యాణమండపంలో జరిగి న సమావేశానికి తెలంగాణ ప్రాంత కార్యవాహ్ కాచం రమేశ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వయం సేవకులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ను మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925న విజయదశమి రోజున ప్రారంభించారని తెలిపారు. ఈ విజయదశమికి 100ఏళ్లు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఆర్ఎస్ఎస్ పుట్టిందే మాతభూమి సేవకోసమన్నారు. హైందవాన్ని ఒక మతంగా కాక ఒక జీవన విధానంగా మార్చిందన్నారు. సంఘం నిర్వహించే శాఖపద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణాన్ని చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రముఖులు, స్వయం సేవకులు పాల్గొన్నారు. -
కాలువ కాదు రోడ్డే!
కరీంనగర్ కార్పొరేషన్: నగరాన్ని మరోసారి వరద ముంచెత్తింది. ఆదివారం కొద్దిసేపు కురిసిన గట్టివర్షానికి ప్రధాన రహదారులు కాలువలను తలపించాయి. కాలనీలు జలమయమయ్యాయి. రాంనగర్ వద్ద కరీంనగర్– సిరిసిల్ల రహదారి మునిగింది. రహదారిపై గంటల పాటు వరద వెళ్లడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఆర్టీసీ వర్క్షాప్, మంచిర్యాల చౌరస్తా సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డ్రైనేజీ వ్య వస్థ సక్రమంగా లేకపోవడంతో ఇక్కడ చిన్న వర్షానికే రోడ్లపైకి వరద వస్తోంది. ఇండ్లల్లోకి వరద బుర ద చేరుతోంది. నగరపాలకసంస్థ అధికారులు ఇప్పటికై నా డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి, వరదనీరు డ్రైనేజీ ద్వారా సులువుగా వెళ్లేలా చేయాలని కోరుతున్నారు. -
ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
కరీంనగర్: ప్రభుత్వం గీత కార్మికులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ అన్నారు. ఆదివారం నగరంలోని సీఐటీ యూ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగిన కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సమావేశంలో పాల్గొ ని మాట్లాడుతూ.. గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి, మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. ఎక్స్గ్రేషియా బాధితులే స్వయంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేస్తున్నా కనికరం చూపడం లేదన్నారు. కాటమయ్య రక్షణ కవచాల పంపిణీ ఏడాది గడిచినా ఇరవై వేలు మించలేదన్నారు. పెన్షన్ రూ.4వేలకు, ఎక్స్గ్రేషియా రూ.10 లక్షలకు, మద్యంషాప్ టెండర్లలో రిజ ర్వేషన్ 25శాతానికి పెంచాలని డిమాండ్ చేశా రు. అనంతరం కల్లుగీత కార్మిక సంఘంలో చేరి న వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.వెంకటనర్సయ్య, సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేశ్, జగి త్యాల జిల్లా కన్వీనర్ రమేశ్ పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానేఇల్లందకుంట/జమ్మికుంట: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నా రు. ఇల్లందకుంటలో ఆదివారం ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇల్లందకుంట బీఆర్ఎస్కు మొదటి నుంచి కంచుకోటనే అన్నారు. రూ. వందలకోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో హుజూరా బాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీల నామినేషన్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఒక్కో గ్రామం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి ఒకే అభ్యర్థిని సూచించి, మంచి మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కాగా.. జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో ఆదివారం నిర్వహించతలపెట్టి న బీఆర్ఎస్ సమావేశం వాయిదా పడింది. వర్షం కారణంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తక్కువ సంఖ్యలో హాజరుకాగా ఎమ్మె ల్యే కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం మరోమారు ఏర్పాటు చేసుకుందామని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కలెక్టరేట్లో దసరా పూజలుకరీంనగర్ అర్బన్: కలెక్టరేట్లో ఆదివారం మైసమ్మ పూజ నిర్వహించారు. ప్రతీ దసరా పండక్కి నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో మైసమ్మ పూజ నిర్వహిస్తారు. దసరా రోజున గాంధీ జయంతి కావడంతో ఆదివారం నిర్వహించినట్లు నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి వివరించారు. ఉమ్మడి జిల్లా కార్యదర్శి శంకరయ్య, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రమేశ్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కె అరుణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు జీవన్, నగర అధ్యకుడు ఎం.శ్రీనివాస్, హుజురాబాద్ తాలూక అధ్యక్షుడు కె రమేశ్, సహాధ్యక్షుడు కె సోమయ్య, కోశాధికారి లక్ష్మీరాజం, ఉపాధ్యక్షులు రాజలింగం, ఎం. అశోక్ పాల్గొన్నారు. -
పత్తి రైతుకు శఠగోపం
కరీంనగర్ అర్బన్: తెల్లబంగారం పండించే రైతుకు కేంద్ర ప్రభుత్వం శరగోపం పెట్టింది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీని ప్రభావం మద్దతు ధరపైనా పడనుంది. జిల్లావ్యాప్తంగా 45వేల ఎకరాల్లో పత్తి సాగవుతుండగా మద్దతు ధర దక్కక సాగు విస్తీర్ణం పడిపోతోంది. దిగుమతి సుంకం ఎత్తివేతతో నష్టం దేశంలో పంట చేతికి అందే కీలక సమయానికి పత్తి దిగుమతిపై ఉన్న 11శాతం సుంకాన్ని తగ్గించడంతో స్పిన్నింగ్ మిల్లులు విదేశాల నుంచి పంట దిగుమతితోపాటు నిల్వ చేసుకునే అవకాశం కల్పించింది. మొదట సుమారు 40 రోజులపాటు సెప్టెంబర్ 30 వరకు దిగుమతి సుంకం ఎత్తివేసిన కేంద్రం.. తర్వాత డిసెంబర్ 31 వరకు పొడిగించింది. మిల్లర్ల ఒత్తిడి మేరకే కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పంట దిగుమతులు చేసుకునేలా సుంకం భారాన్ని తగ్గించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత సీజన్లో ధరపై కచ్చితంగా తీవ్ర ప్రభావం ఉంటుందని పత్తి రైతులు భావిస్తున్నారు. ఆందోళనలో రైతాంగం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రైతులు, రైతు సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర కన్నా వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోనూ నాణ్యత సాకుగా మద్దతు ధరకు అటు, ఇటుగా రైతులు విక్రయించుకుంటున్నారు. పెట్టుబడి తెచ్చుకుని వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి మరింత దీనంగా ఉంటోంది. అడ్తి వ్యాపారి చెప్పిన ధరకే పంటను విక్రయించుకోవాల్సిన దుస్థితి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ధర మరింత తగ్గిపోతుందేమోననే ఆవేదన రైతుల్లో కనిపిస్తోంది. యేటా తగ్గుతున్న సాగు జిల్లాలో పత్తిసాగు ఏటా తగ్గుతోంది. 2010లో 90వేల ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 45వేల ఎకరాలకు చేరింది. 2012లో 85వేలు, 2014లో 73వేలు, 2018లో 65వేలు, 2020లో 58వేలు, 2024లో 50వేల ఎకరాల్లో పత్తి సాగవగా ఏటా సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుతోంది. 2010– 2025 గణాంకాలను పరిశీలిస్తే దాదాపు సగానికి పైగా సాగు తగ్గింది. పెట్టుబడులు ఎక్కువవుతుండటం, మద్దతు ధర దక్కకపోవడంతో సాగుకు స్వస్తి పలుకుతున్నారు. ఒక్కో ఎకరం సాగు ఖర్చు సుమారు రూ.35వేల నుంచి రూ.50వేల వరకు అవుతోంది. సొంత భూమి ఉన్న రైతుల ఖర్చు రూ.30వేలకు పైగానే ఉంటోంది. కౌలు రైతులు రూ.50 వేలకు పైగానే పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. దిగుబడి సగటున 6క్వింటాళ్లు ఉంటే.. పొట్టి రకం రూ.46 వేలు, పొడుగు రకం రూ.48 వేల మధ్య ఆదాయం లభిస్తోంది. ఈ లెక్కన రైతుకు నష్టమే తప్ప లాభాలు కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు పంట కొనాల్సి ఉన్నా.. రైతు చేతికి పంట అందే సమయానికి ఏదో ఒక సమస్య వెంటాడుతోంది. తేమ శాతాన్ని సాకుగా చూపుతుండడంతో తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. దిగుమతి సుంకం ఎత్తివేయడం వల్ల పత్తి రైతులు క్వింటాకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు నష్టపోవచ్చని రైతు సంఘం నాయకులు అంచనా వేస్తున్నారు.జిల్లా సాగు విస్తీర్ణం: 3.30 లక్షల ఎకరాలు పత్తి సాగు విస్తీర్ణం: 45,000 ఎకరాలు దిగుబడి అంచనా: 2.70 లక్షల క్వింటాళ్లు ఎకరాకు దిగుబడి అంచనా: 6 క్వింటాళ్లు -
యువతి ప్రేమకథ విషాదాంతం
గద్వాల జిల్లా: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో అందరి నీ ఎదిరించింది. పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకు వచ్చింది. రెండు నెలలుగా ఆ యువకుడి ఇంట్లోనే మకాం వేసింది. చివరికి విషపు గుళికలను తీసుకొని తనువు చాలించింది. కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన ప్రియాంక (32), జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లె గ్రామా నికి చెందిన రఘునాథ్గౌడ్ను ప్రేమించింది. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం రఘునాథ్గౌడ్కు కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో రెండు నెలల కిందట తనను పెళ్లి చేసుకోవాలని ప్రియాంక చిన్నోనిపల్లె గ్రామానికి వచ్చి రఘునాథ్గౌడ్ను కోరింది. అయితే రఘునాథ్ గౌడ్, అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి తనను పెళ్లి చేసుకోవాల్సిందేనని ఒత్తిడి తీసుకువచ్చింది. ఆమె వారి ఇంట్లోనే మకాం వేయడంతో రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు ఇల్లు వదిలి వెళ్లిపోయారు. కాగా, అప్పట్లోనే ప్రియాంక నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా గ్రామస్తులు ఆమెను వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణా పాయం తప్పింది. అనంతరం ప్రియాంక రఘునా థ్గౌడ్తోపాటు కుటుంబ సభ్యులపై గట్టు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా జూలైలో కేసు నమోదు చేశారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుగా సెక్షన్ మార్పు చేసి, రఘునాథ్ను రిమాండ్కు తరలించగా ఇటీవలే బెయిల్పై విడుదల అయ్యాడు.మరోసారి ఆత్మహత్యాయత్నం.. ఈ క్రమంలో ప్రియాంక శుక్రవారం గుళికల మందు తీసుకున్నట్లు పోలీసు లకు సమాచారం అందింది. దీంతో పోలీసులు హుటాహు టిన చిన్నోనిపల్లె గ్రామానికి చేరుకొని చికిత్స నిమిత్తం ఆమెను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం ఆమె మృతిచెందింది. ఇదిలా ఉండగా రఘునాథ్గౌడ్, అతని కుటుంబ సభ్యులు తమ కూతురుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపినట్లుగా ఆమె తల్లి దండ్రులు ఆస్పత్రి వద్ద ఆరోపించారు. రఘునాథ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై ప్రియాంక తల్లి పోలీసులకు ఫి ర్యాదు చేశారు. కాగా, ప్రియాంక మృతికి కారణమైన రఘు నాథ్గౌడ్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ప్రియాంక ఆత్మహత్య ఘటనకు సంబంధించి 22 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లేశ్ వెల్లడించారు. మరో పక్క దళిత యువతి మృతికి కారణమైన రఘునాథ్గౌడ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా, కుల సంఘాల నాయకులు ఆస్పత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. -
రుద్రంగిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన
రుద్రంగి(వేములవాడ): మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సీఎం, ప్రభుత్వ విప్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రంగిలో శనివారం విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యాడపు వెంకటేశ్, మండలాధ్యక్షుడు కర్ణవత్తుల వేణుకుమార్ మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఫ్లెక్సీలను తొలగించలేదన్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్, కాషాయ జెండాలను తొలగించిన అధికారులు కాంగ్రెస్ నాయకులు పెట్టిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. రుద్రంగి మండల మాజీ అధ్యక్షుడు పడాల గణేశ్, బోయిని రాజు, పెద్ది శ్రావణ్, తదితురులు పాల్గొన్నారు. సీఎం, ప్రభుత్వ విప్ ఫొటోలతో ఫ్లెక్సీలు చోద్యం చూస్తున్న అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
రామగుండం: స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని క్రషర్నగర్కాలనీలో విద్యుదాఘాతానికి గురై చికిత్స పొందుతున్న గణేశ్ శనివారం మృతి చెందాడు. గతనెల 29న రాత్రి 132 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలకు కొక్కేలు తగిలించి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న క్రమంలో కరెంట్వైర్ తెగిపడి స్థానిక యువకులు గణేశ్, శివకుమార్, నరేశ్ ఉరఫ్ నర్సింహులు తీవ్రగాయాల పాలైన విషయం విదితమే. వీరిని తొలుత కరీంనగర్ ఆ తర్వాత హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గణేశ్ మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి తెలియరాలేదు. -
మొక్కజొన్నలు కొంటరా..? కొనరా..?
● నిన్నటి వరకు క్వింటాల్కు రూ.మూడువేలు ● రైతుల చేతికి రాగానే రూ.రెండు వేల లోపే జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో వరి తర్వాత ప్రధానమైన పంట మొక్కజొన్న. ఏటా మార్క్ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనే ప్రభుత్వం.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 35 వేల ఎకరాల్లో పంట ప్రస్తుత సీజన్లో 35వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు 25 క్వింటాళ్ల చొప్పున 8.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉన్నా.. వర్షాలు అధికంగా కురవడంతో 40శాతం వరకు దెబ్బతింది. ఈ లెక్కన 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావిస్తున్నారు. నిన్నటివరకు క్వింటాల్కు రూ.మూడువేలు.. మొక్కజొన్నలకు మద్దతు ధర క్వింటాల్కు రూ.2400. నిన్నటివరకు మార్కెట్లో రూ.మూడు వేలు పలికింది. రైతుల చేతికి అందుతున్న ప్రస్తుత తరుణంలో రూ.రెండు వేల నుంచి రూ.2100కు చేరింది. పూర్తిస్థాయిలో చేతికందితే వ్యాపారులు ధర మరింత తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో త్వరగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్న డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. ప్రతిరోజు వర్షాలు కురుస్తుండటంతో మొక్కజొన్నలు మొలకలు వస్తున్నాయి. కేంద్రాలు లేకపోవడంతో వ్యాపారులు తక్కువ రేటు పెడుతున్నారు. రాజిరెడ్డి, శ్రీరాములపల్లె, గొల్లపల్లి మండలం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే వ్యాపారులు చెప్పిందే ధరగా మారుతుంది. ఓపెన్ రేటు, ప్రభుత్వ ధరకు సమానంగా లేదు. కేంద్రాలు లేకపోతే వ్యాపారులది ఆడింది ఆటా, పాడింది పాటగా మారుతుంది. – గోపిడి శ్రీనివాస్ రెడ్డి, మల్లాపూర్ -
చదువుకునేందుకు లండన్ వెళ్లి..
మేడిపల్లి: ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు. రెండేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసమని లండన్ వెళ్లిన ఆయన శుక్రవారం అర్ధరాత్రి చాతిలో నొప్పిగా ఉందని రూమ్మెట్స్కు చెప్పాడు. వెంటనే అపస్మారక స్థితికి చేరాడు. స్నేహితులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మేడిపల్లి మండల అధ్యక్షుడు ఏనుగు రమేశ్ రెడ్డి పెద్ద కొడుకు. లండన్ నుంచి స్నేహితులు జరిగిన విషయాన్ని ఫోన్ ద్వారా రమేశ్రెడ్డికి చేరవేయగా.. కన్నీటి పర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న విప్ ఆది శ్రీనివాస్ రమేశ్ రెడ్డిని ఓదార్చారు. శవాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని అధికారులకు సూచించారు. గుండెపోటుతో దమ్మన్నపేట వాసి మృతి -
అన్నపూర్ణకు జలకళ.. అన్నదాతకు భరోసా
ఇల్లంతకుంట(మానకొండూర్): మెట్టప్రాంతం ఇల్లంతకుంట మండలంలో మిడ్మానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల నిర్మాణంతో అనంతారం ప్రాజెక్టు పరిధిలోని భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. మిడ్మానేరు, అన్నపూర్ణ, ప్రాజెక్టులు లేని సమయంలో ఇల్లంతకుంట మండలంలో వివిధ గ్రామాల్లో సాగు, తాగునీటి కొరత ఉండేది. భూగర్భ జలాలు అట్టడుగుస్థాయిలో ఉండేవి. ఖరీఫ్, రబీలో వేసిన పంటలు చేతికొస్తాయో.. లేదోనని రైతుల్లో బెంగ ఉండేది. ఈ రెండు ప్రాజెక్టులు లేకముందు మండలంలో బీడు భూములుగా ఉండేవి. ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన తర్వాత నీటిలభ్యత స్థాయి పెరిగింది. అన్నపూర్ణ జలాశయం నీటి సామర్థ్యం 3.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.37 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అనంతారం ప్రాజెక్టు నెల రోజులుగా మత్తడి పారుతుంది. ఈ ప్రాజెక్టు కింద 800 ఎకరాల ఆయకట్టు ఉంది. అన్నపూర్ణ జలాశయం కింద ఇల్లంతకుంట మండలంలో 15వేల ఎకరాల ఆయకట్టు ఉంది. మిడ్మానేరు, అన్నపూర్ణ జలాశయం అనంతారం ప్రాజెక్టులు నిండుకుండలా ఉండడంతో దిగువన ఉన్న వ్యవసాయ బోరు బావులలో నీటి నిలువలు సమృద్ధిగా ఉన్నాయి. రబీ సీజన్లో ఫిబ్రవరిలో అన్నపూర్ణ జలాశయం ఓవర్ఫ్లో గేట్స్ ఎత్తి అనంతారం ప్రాజెక్టు మత్తడి పడేలా చేసినట్టుంటే మండలంలోని బిక్కవాగు పరివాహక ప్రాంత భూముల్లో రెండు పంటలకు ఢోకా లేదని రైతులు అంటున్నారు. బిక్కవాగుపై నిర్మించిన అనంతారం ప్రాజెక్టు మత్తడి పడితే బిక్కవాగు పరివాహక ప్రాంతం అనంతారం, ఇల్లంతకుంట, రహీంఖాన్పేట, వంతడ్పుల, నర్సక్కపేట, గాలిపల్లి, జవారిపేట మీదుగా ప్రవహిస్తూ మానేరు వాగులో కలుస్తుంది. అన్నపూర్ణ, అనంతారం ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఖరీఫ్, రబీ రెండు పంటలకు ఢోకా లేదని మండల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిడ్మానేరు కుడికాలువ ద్వారా నీటిని వదిలితే వల్లంపట్ల, కందికట్కూరు, వంతడ్పుల, నర్సక్కపేట, గాలిపల్లి రైతులకు లబ్ధి చేకూరుతుంది. అన్నపూర్ణ, అనంతారం, మిడ్మానేరు ప్రాజెక్టులతో ఇల్లంతకుంట మండలం సస్యశ్యామలంగా మారింది. అనంతారం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఖరీఫ్, రబీ పంటలకు ఢోకా లేదు అన్నపూర్ణ జలాశయం, అనంతారం ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా ఉంది. ఖరీఫ్, రబీ పంటలకు ఢోకా లేదు. ఫిబ్రవరిలో ఒకసారి అన్నపూర్ణ జలాశయం గేట్లు వదిలితే అనంతారం ప్రాజెక్టు మత్తడి పడుతుంది. ప్రాజెక్టులైనప్పటి నుంచి సాగునీరు మంచిగా ఉంటుంది. – ఈదుల వెంకటరెడ్డి, ఇల్లంతకుంట బిక్కవాగు పారితే బావుల్లో నీటినిల్వలు పెరుగుతాయి. ఈ సంవత్సరం రెండు పంటలు పండుతాయి. అన్నపూర్ణ, అనంతారం ప్రాజెక్టుల్లో నీరు మెండుగా ఉంది. ఫిబ్రవరిలో అనంతారం మత్తడి పడేలా చూడాలి. – తాడూరి దేవయ్య, నర్సక్కపేట -
ఆమె కళ్లు సజీవం
ఇల్లందకుంట: మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన యాద సరస్వతి(42) శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయింది. సదాశయఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు మచ్చగిరి నరహరి సరస్వతి కుటుంబసభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించారు. పుట్టెడు దుఃఖంలోనూ కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను దానం చేయాలని నిర్ణయించారు. వరంగల్ ఎల్వీప్రసాద్ హాస్పిటల్ టెక్నీషియన్ లక్ష్మణ్ నేత్రాలను సేకరించి, హైదరాబాద్లోని ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్కు తరలించారు. సరస్వతి భర్త యాద వీరన్న, అతని కుటుంబసభ్యులకు సదాశయ ఫౌండేషన్ తరఫున అభినందన పత్రం అందజేశారు. సారంగాపూర్: అనారోగ్యంతో బాధపడుతూ బీర్పూర్కు చెందిన మాటేటి చంద్రశేఖర్ (40) ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజు కథనం ప్రకారం చంద్రశేఖర్ గ్రామంలో మీసేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్లుగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. మందులు వాడినా నయం కాలేదు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 3న తన పొలం వద్ద గడ్డి మందు తాగాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జగిత్యాల.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. చంద్రశేఖర్ భార్య వసంత ఫిర్యాదు మెరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాయికల్: మండలంలోని ఒడ్డెలింగాపూర్లో శనివారం రాత్రి బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుండగా అనుపురం వెంకటేశ్, కిషోర్ అదే గ్రామానికి చెందిన బోదాసు సతీశ్ను కత్తితో కడుపులో పొడిచారు. స్ధానికులు గమనించి 108 వాహనంలో సతీశ్ను జగిత్యాల ఏరియా అసుపత్రికి తరలించారు. వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. తంగళ్లపల్లి(సిరిసిల్ల): కారును బైక్ ఢీకొట్టి ఒకరికి గాయాలైన ఘటన మండల కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల వైపు నుంచి సిద్దిపేట వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న కోడం లక్ష్మణ్(21)కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రున్ని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యానగర్(కరీంనగర్): బతుకమ్మ, దసరా పండుగ తరువాత కరీంనగర్ బస్స్టేషన్ నుంచి జేబీఎస్, ఇతర ప్రాంతాలకు తిరుగు ప్రయాణం రద్దీని శనివారం కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్, రీజినల్ మేనేజర్ బి.రాజు పర్యవేక్షించారు. ప్రయాణికులకు తగి నన్ని బస్సులు అందుబాటులో ఉంచాలని బస్స్టేషన్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఎల్.మల్లేశంకు సూచించారు. రీజియన్ డిప్యూటీ మేనేజర్(అపరేషన్స్) ఎస్.భూపతిరెడ్డి పాల్గొన్నారు. -
బాధితులను కాపాడే ‘కమ్ అలాంగ్’
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఆపదలో చిక్కిన వారిని కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సరికొత్త యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. శ్రీకమ్అలాంగ్శ్రీ అనే ఈ యంత్రాన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు ఇటీవల పంపింది. ఈ యంత్రం వినియోగించే విధానంపై డీఎఫ్వో (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్) శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఫైర్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. పొరపాటున ఎవరైనా బావుల్లో, గోతుల్లో, డ్రైనేజీల్లో, కాలువల్లో పడినపుడు.. మంటల్లో చిక్కుకున్నపుడు ఈ యంత్రం ద్వారా అగ్నిమాపక సిబ్బంది తొలుత లోపలికి దిగుతారు. అనంతరం బాధితులను తాడుకు కట్టి హైడ్రాలిక్ విధానంలో పైకి లాగి రక్షిస్తారు. -
అన్నపై తమ్ముళ్ల హత్యాయత్నం
మానకొండూర్: సొంత అన్నపై తమ్ముళ్లు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని వన్నారం పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సీఐ బి.సంజీవ్ వివరాల ప్రకారం.. కొత్తపల్లికి చెందిన బోయిని కొమురయ్య, తన తమ్ముళ్లు ఆంజనేయులు, లక్ష్మణ్కు మధ్య గత కొన్ని నెలలుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇటీవల బోయిని కొమురయ్య భార్య లక్ష్మీని ఆంజనేయులు దూషించడంతో పోలీస్స్టేషన్లో కేసు పెట్టింది. శనివారం వేకువజామున కొమురయ్య పొలం వద్దకు వెళ్తుండగా ఆంజనేయులు, లక్ష్మణ్ ఇనుపసిల్లాతో గుచ్చి హత్యాయత్నానికి యత్నించారు. కొమురయ్య అరుపులు విన్న భార్య, స్థానికులు ఘటన స్థలానికి వెళ్లడంతో లక్ష్మణ్, ఆంజనేయులు పారిపోయారు. క్షతగాత్రుడిని 108 వాహనంలో కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. లారీ దొంగతనం.. నాలుగు నెలల జైలుకొత్తపల్లి(కరీంనగర్): లారీ దొంగతనం కేసులో నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. పోలీసుల కథనం ప్రకారం.. బావుపేటలో నివాసముండే ఉత్తరప్రదేశ్కు చెందిన సయ్యద్ అలీ జనవరి 29వ తేదీన పిల్లల రాజుకు చెందిన లారీని దొంగలించాడు. దర్యాప్తు చేపట్టిన కొత్తపల్లి పోలీసులు లారీని స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేశారు. సాక్షుల వాంగ్మూలాలను కోర్టులో సమర్పించడం ద్వారా నేరం రుజువైంది. కోర్టు సయ్యద్ అలీకి నాలుగు నెలల జైలు శిక్ష, రూ.300 జరిమానా విధించింది. ఈ కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషి చేసిన అప్పటి కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్, ఎస్సై సాంబమూర్తి, కోర్టు కానిస్టేబుల్ మౌనికను సీపీ గౌస్ఆలం అభినందించారు. -
పింఛన్ ఇప్పించండి మహాప్రభో..
వేములవాడరూరల్: ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడు తనకు పింఛన్ ఇప్పించాలని మూడేళ్లుగా అధికారులు, నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు. రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబం పింఛన్ కోసం ఎదురుచూస్తుంది. అనుకోని పరిస్థితుల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. ఇది ఇన్ఫెక్షన్గా మారి వైద్యులు కాలును తొలగించారు. మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఆయనకు ఎలక్ట్రికల్ వాహనాన్ని ఇచ్చింది. కానీ పింఛన్ రావడం లేదు. వేములవాడరూరల్ మండలంలోని ఫాజుల్నగర్కు చెందిన దుర్గపు నారాయణకు పదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. కాలుకు ఇన్ఫెక్షన్ కావడంతో మూడేళ్ల క్రితం తొలగించారు. అప్పటి నుంచి పనిచేసుకునే పరిస్థితి లేదు. పింఛన్ ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నా ఎవరూ స్పందించడం లేదు. గ్రామంలో చిన్న టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి త నకు పింఛన్ మంజూరు చేయాలని కోరుతున్నాడు. -
తాగునీటి సరఫరాను పర్యవేక్షించాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి సరఫరాను సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరపాలకసంస్థ కార్యాలయంలో ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అప్పగించిన ప్రాంతాల్లో తాగునీటి సరఫరాను ఇంజినీరింగ్ అధి కారులు లైన్మెన్లు, ఫిట్టర్లతో కలిసి నిత్యం తనిఖీ చేయాలన్నారు. తాగునీటి సరఫరా జరుగుతున్న సమయంలో పర్యవేక్షిస్తేనే సమస్యలుంటే తెలుస్తాయని అన్నారు. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేసి, లీకేజీలను సరిచేయాలని సూచించారు. నగరంలో స్మార్ట్సిటీ, వివిధ గ్రాంట్ల ద్వారా చేపట్టిన పెండింగ్లో ఉన్న పనులను వేగవంతం చేయాలన్నారు. పనులు టైమ్లైన్, టెండర్ ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈలు ఓం ప్రకాశ్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
వీణవంక/తిమ్మాపూర్: ఇసుక లోడింగ్లో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే ప్రజా అవసరాలకు రవాణా చేయాలని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీ ఎండీసీ) మేనేజింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. శనివారం పీవో వినయ్తో కలిసి జిల్లాలోని వీణవంక మండలం కొండపాక బ్లాక్–1, బ్లాక్– 2 ఇసుక క్వారీలను ఆకస్మికంగా సందర్శించారు. క్వారీల్లో ఇసుక లోడింగ్ ప్రక్రియను, నిల్వలను పరిశీలించారు. ఇసుక రవాణా పత్రాలను, డిజిటల్ ట్రాకింగ్ విధానాన్ని తనిఖీ చేశారు. ఇసుక రవాణాలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను పాటించాలని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపాలని హెచ్చరించారు. అంతకుముందు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎల్ఎండీ పూడిక తీత పనులను పరిశీలించారు. అన్ని అనుమతులతో పని చేయాలని ఎమోట్ డ్రెడ్గింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి సూచించారు. ఇసుక రీచ్ను విధిగా తనిఖీ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు. కరీంనగర్ మైనింగ్ ఏజీ వెంకటేశ్వర్లు, పెద్దపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ రాజు, ఇరిగేషన్ ఎస్ఈ పెద్ది సురేశ్, తిమ్మాపూర్ తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
సెల్యూట్ 108
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దసరా అంటేనే తెలంగాణలో పెద్ద పండగ. ఆ రోజున పిల్లాపాప అంతా వేడుకల్లో మునిగి తేలు తుంటారు. కానీ.. 108 సిబ్బంది మాత్రం ఎలాంటి పండుగ చేసుకోకుండా ప్రజల ప్రాణాలు కాపా డి మరోసారి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఎక్కడ నుంచి అత్యవసర పరిస్థితి ఉందని ఫోన్ వచ్చినా ఆ రోజంతా సేవలందిస్తూ.. 108 ప్రాధాన్యం మరోసారి లోకానికి చూపించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 పథ కం నేటికీ నిరంతరాయంగా ప్రజల ప్రా ణాలను కాపాడుతూనే ఉంది. దసరా రోజున సై తం ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వహించిన ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్) ఏకంగా 209 అత్యవసర కేసులు స్వీకరించారు. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే 108 సిబ్బంది పండగ రోజు కూడా సెలవు లేకుండా విధులు నిర్వహించి పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు కాపాడారు. 209 కేసులు.. 150 మంది ప్రాణాలు దసరా పండుగ రోజు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో మునుపెన్నడూ లేని విధంగా 209 కేసుల్లో 150 మంది బాధితులను కాపాడారు. 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్స్ (ఈఎంటీ)53, పైలెట్లు 53మంది పండుగ రోజు కూడా విశ్రమించకుండా మూడు షిఫ్టులలో విధులు నిర్వహించారు. తీవ్రంగా గాయపడిన వారిని కూడా ప్రాణనష్టం జరగకుండా ఆసుపత్రికి చేర్చేవరకు వైద్య సేవలు అందించారు. లిక్కర్ సేల్స్ పెరగడం ఈ ఏడాది దసరా పండుగ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో మద్యం ముందస్తు కొనుగోళ్లు విపరీతంగా జరిగాయి. గతేడాది దసరా సమయంలో వారం రోజుల్లో జరిగిన సేల్స్ ఈ ఏడాది మూడు రోజులలోనే మించిపోయాయి. దీంతో మద్యం మత్తులో వాహనాల నడిపి ప్రమాదాలకు గురైన వారి సంఖ్య ఎక్కువగా పెరిగింది. అయినప్పటికీ నిర్విరామ విధులతో 108 సిబ్బంది క్షతగాత్రులను కాపాడడంలో నిమగ్నమయ్యారు. సెల్యూట్ 108 అంటూ ప్రజల నుంచి అభినందనలు పొందారు. -
మత్తు పదార్థాల అనర్థాలపై విస్త్తృత ప్రచారం
కరీంనగర్: నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరు వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తూ, మత్తు పదార్థాల అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శనివారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అక్టోబర్ నెలాఖరు వరకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి డ్రగ్స్తో కలిగే అనర్థాలను వివరించాలని సూచించారు. పోలీస్, ఎకై ్సజ్, డీఆర్డీవో, మెప్మా, విద్య, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, తదితరశాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యులను చేయాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, మెడికల్ కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. మాదకద్రవ్య వ్యతిరేక సందేశంపై వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలన్నారు. మారథాన్ నిర్వహించాలన్నారు. అనంతరం నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞకు సంబంధించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్వైకే కో– ఆర్డినేటర్ రాంబాబు, నాకార్డ్ విభాగం సీఐ పుల్ల య్య, డీసీపీవో ఫర్వీన్, సీడీపీవో సబిత, విద్యాశాఖ కో– ఆర్డినేటర్ ఆంజనేయులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, ఎస్సై పాషా, నషా ముక్త్ భారత్ కమిటీ మెంబర్లు కేశవరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. -
ఒక్కచాన్స్ ప్లీజ్!
● టికెట్ల కోసం ఆశావహుల ఆరాటం ● నేతల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు ● అభ్యర్థిత్వం ఖరారు కోసం యత్నాలు ● జిల్లాలో వేడెక్కిన స్థానిక సమరం‘ఎప్పట్నుంచో పార్టీని పట్టుకొని తిరుగుతున్న.. రాకరాక రిజర్వేషన్ సౌకర్యం కలిసొచ్చింది.. మన పార్టే అధికారంలో ఉంది.. టికెట్ ఖరారు చేస్తే నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికవుత.. ప్లీజ్.. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అన్నా’ అంటూ ఆశావహులు కొందరు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అన్నా.. ఒకేఒక్క చాన్స్ ఇవ్వండని, కచ్చితంగా గెలిచి చూపెడతామని నిత్యం నేతల ఇళ్లచుట్టూ తిరుగుతూ ప్రాధేయపడుతున్నారు.సాక్షి పెద్దపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పల్లెల్లో రాజకీయ సందడి నెలకొంది. కలిసొచ్చిన రిజర్వేషన్లతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. తొలుత ప్రాదేశిక ఎన్నికలు జరగనుండగా.. వీటిని పార్టీ సింబల్తో నిర్వహించనున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేతలను ప్రసన్నం చేసుకునేందుకు.. అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించేవా రు మాజీ ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రు. బీజేపీ టికెట్లు ఖరారు చేసుకునేందుకు మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ సీనియర్లతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం ప్రధాన పార్టీలు స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలను అత్యధికంగా గెలుచుకోవాలని కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఇందుకోసం ఆచీతూచీ వ్యవహరిస్తున్నాయి. ప్రతీ స్థానం నుంచి రెండు, మూడు పేర్లతో కూడిన జాబితా తీసుకుని ప్రజాదరణ ఉన్నవారిని ఎంపిక చేసేలా కసరత్తు చేస్తున్నాయి. బలాలు, బలహీనతలు, సామాజికవర్గాల మద్దతు, ఖర్చు భరించేస్థాయి, పరపతి గలవారు?.. ఇలా అన్ని కోణాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఆరా తీస్తున్నాయి. వీటన్నింటినీ క్రోడీకరించి వడపోత తర్వాతే అభ్యర్థిని ఎంపిక చేయాలని అన్ని పార్టీల నేతలు లక్ష్యంగా నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ అంశంపై హైకోర్టు తీర్పు అనంతరం అభ్యర్థుల ప్రకటన చేయాలని, అప్పటివరకు ఎవరికీ భరోసా ఇవ్వొద్దనే భావనలో ఉన్నారు. కమిటీలతో ఎంపిక రాష్ట్రంలో అధికారం, జిల్లాలోని అన్ని అసెంబ్లీల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. స్థానిక ఎన్నికల్లోనూ అన్నిస్థానాల్లో హస్తం పాగా వేసేలా కాంగ్రెస్ నేతలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, జిల్లాలో క్లీన్స్వీప్ చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రంలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ముగ్గురు చొప్పున ఆశావహులను ప్రతిపాదించి జిల్లా ఇన్చార్జి మంత్రికి నివేదించేలా జిల్లా కాంగ్రెస్ కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. పీసీసీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పార్టీ ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకొని గెలిచే అవకాశం ఉన్నవారినే ప్రతిపాదించేలా ముందుకు సాగుతున్నారు. కమలంలో గెలిచే వారికే టికెట్లు.. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని, దీనిని ఆసరాగా చేసుకుని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) యోచిస్తోంది. మెజార్టీ స్థానాల్లో పాగావేసి కమలం సత్తా చా టాలని ఉవ్విళ్లూరుతోంది. కమలం పార్టీలో నెలకొ న్న గ్రూపులు, వర్గాలకు తావులేకుండా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని జిల్లా పార్టీ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో నేతలు నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాభిమా నం చూరగొన్నామని, ఇదే ఊపుతో అత్యధిక స్థానా లు కై వసం చేసుకోవాలని కారు పార్టీ నేతలు భావిస్తున్నారు. బీఆర్ఎస్ అసెంబ్లీ ఇన్చార్జీలు, మాజీ ఎ మ్మెల్యేలే బీ–ఫారాలు ఇవ్వనున్న నేపథ్యంలో.. ఆ శావహలు వారిచుట్టే తిరుగుతున్నారు. కోర్టు తీర్పు అనంతరమే పేర్లు ప్రకటించాలని భావిస్తున్నారు. మొత్తంగా ప్రధాన పార్టీలు ఆశావాహుల బలాబలాలపై క్షేత్రస్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకుంటుండం.. ఆశావహులు నేతలను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నం కావడం రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. -
సమన్వయంతో పనిచేస్తే మనదే విజయం
హుజూరాబాద్: కార్యకర్తలందరూ సమన్వయ ంతో ముందుకు సాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. హుజూరాబాద్, వీణవంకలో శనివారం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌశిక్రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రైతులను గుండెల్లో పెట్టుకొని కాపాడుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గుండెలపై తన్నిందన్నారు. ప్రభుత్వం అసమర్థతతో యూరియా కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గంలో తట్టెడు మట్టి పోయలేదన్నారు. కల్వల ప్రాజెక్టు నాలుగు మండలాలకు తాగు,సాగు నీరు అందిస్తుందని, వర్షాలకు కట్ట తెగిపోయి రెండేళ్లు గడిచినా మరమ్మతు చేపించడం లేదన్నారు. ప్రాజెక్టును మినీ ఎల్ఎండీగా చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. హుజూరా బాద్ బీఆర్ఎస్ అడ్డా అని, నియోజకవర్గంలో అన్నిస్థానాల్లో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. వీణవంక మండలం వల్బాపూర్కు చెందిన పలువరు కామిడి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరగా కౌశిక్రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు ఎడవెల్లి కొండల్రెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, పరిపాటి రవీందర్రెడ్డి, బాలకిషన్రావు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగన్నేరువరం: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సన్నద్ధం కావాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శనివా రం గన్నేరువరంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా గంగాడి కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండేళ్లుగా గ్రామాల్లో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడాఏం లేదన్నారు. ఇరు పార్టీలు ప్రజా విశ్వా సం కోల్పోయాయని ఎద్దేవా చేశారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, చంద్రారెడ్డి, అజయ్వర్మ, రామచంద్రం, జగన్రెడ్డి, శంకర్, బాలరాజు, రాము, హరీశ్, అనంతరెడ్డి, బలరాంరెడ్డి, చంద్రయ్య, రాజశేఖర్, వినయ్, శ్రీనివాస్రెడ్డి, లింగయ్య, నరసింహస్వామి, సురేందర్, కిషన్, సురేందర్రెడ్డి, జగన్, లక్ష్మయ్య, గంగయ్య పాల్గొన్నారు. కోర్టులో కేసు ఉండగా స్థానిక ఎన్నికలా? తిమ్మాపూర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. దీనిపై కోర్టులో కేసు ఉన్నందున స్పష్టత కరువైందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్లో శనివారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లపై ఎలాంటి స్పష్టత లేకుండా ఎన్నికలకు వెళ్తోందని విమర్శించారు. ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పినా, ఎన్నికల ప్రకటన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరని, పార్టీ పేరు చెప్తేనే భయపడి పారిపోతున్నారని అన్నారు. ‘ఊరంతా ఒకదిక్కు ఐతే.. మానకొండూర్ ఒకదిక్కు’ అని అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిని ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’లాగా ఉన్నావని ఎద్దేవా చేశారు. రాంలీలా మైదానాన్ని అందంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని, అందరిని కలుపుకుపోయి రాంలీలాను ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈసారి రాంలీలా కమిటీకి సంబంధం లేకుండా చిన్న ఎమ్మెల్యే, పెద్ద ఎమ్మెల్యే వసూలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకష్ణారావు, కేతిరెడ్డి దేవేందర్రెడ్డి, రావుల రమేశ్, ఉల్లెంగుల ఏకానందం, శేఖర్గౌడ్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. -
జ్ఞాపకాలు పదిలం
సైదాపూర్: పల్లెల్లో పలువురు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి మధుర జ్ఞాపకాలను పదిలంగా ఉంచుతున్నారు. సాధారణంగా గ్రామాల్లో పలువురు మహాత్ముల విగ్రహాలు కనిపిస్తాయి. కానీ.. సైదాపూర్ మండలంలోని సోమారం, గర్రెపల్లి, వెన్కెపల్లి, సైదాపూర్, ఘనపూర్, సర్వాయిపేట, గొల్లగూడెం, ఆకునూర్, వెంకటేశ్వర్లపల్లి తదితర గ్రామాల్లో పలు కుటుంబాలు వారి వ్యవసాయ క్షేత్రాలు, రోడ్డు వైపు స్థలాల్లో చనిపోయిన వారి కుటుంబీకుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వెన్కెపల్లిలోని మొలంగూర్ రోడ్డులో గడ్డం రాందాసు, శ్యామల జ్ఞాపకార్థం వారి కుమారులు పది గుంటల భూమిని కేటాయించారు. రాందాసు 1953లో, శ్యామల 2006లో మృతిచెందారు. తల్లిదండ్రులిద్దరి జ్ఞాపకార్థం సమాధిని గుడిగా నిర్మించారు. విగ్రహాలు నెలకొల్పారు. తర్వాత కోటి నామాల స్తూపం నిర్మించారు. వీరి పెద్ద కుమారుడు గడ్డం వెంకటయ్య మృతిచెందగా ఆయన విగ్రహాన్ని తల్లిదండ్రుల చెంతనే ఏర్పాటు చేశారు. సోమారంలో వీరగోని ఎల్లయ్య యుక్త వయస్సులో ఉన్నప్పుడు చిరుతల రామాయణంలో సీత వేషం(పాత్ర) వేయడంతో ఆయన సీత ఎల్లయ్యగా పిలువబడ్డాడు. క్రమంగా సన్యాసం పుచ్చుకొని తట్టుస్వామి అయ్యాడు. కొత్తగట్టు పెద్దగుట్ట మీద గుడి నిర్మించాడు. సోమారంలో సత్రం ఏర్పాటు చేశాడు. ఆయన మృతికి చిహ్నంగా అతడి తమ్ముని కుమారుడు రమేశ్ సోమారం చౌరస్తాలో విగ్రహం నిర్మించాడు. ఇలా చనిపోయిన మృతుల జ్ఞాపకాలను విగ్రహాలతో పదిలంగా ఉంచుతున్నారు. -
‘గడ్డం’ బ్రదర్స్ దూరం.. దూరం!
మంచిర్యాల జిల్లా: దసరా వేడుకల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గురువారం రాత్రి ఆసక్తికర, ఆశ్చర్యకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. విజయదశమి వేడుకల్లో భాగంగా సింగరేణి తిలక్ స్టేడియంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రావణాసుర వధ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్తో పాటు ఆయన సోదరుడు స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాత్రి 7.15గంటల ప్రాంతంలో మంత్రి వివేక్ స్టేడియంకు రాగా.. ఎమ్మెల్యే వినోద్ పాల్గొనకపోవడం సభికులను ఆశ్చర్యానికి గురి చేసింది. కొంతసేపటి తర్వాత మంత్రి వివేక్ తన ప్రసంగం ముగించి 7.35గంటలకు మందమర్రిలో నిర్వహించే రాంలీల కార్యక్రమానికి హాజరు కావాలంటూ సభికులకు దసరా శుభాకాంక్షలు తెలియజేసి వేదిక దిగి వెళ్లిపోయారు. మంత్రి వెళ్లిపోయిన విషయాన్ని కొందరు సమాచారం ఇవ్వడంతో అరగంట తేడాతో ఆయన సోదరుడు వినోద్ మైదానానికి చేరుకున్నారు. అప్పటివరకు బాలికల సాంస్కృతిక కార్యక్రమాలతో సభికులు కదలకుండా చూశారు. తమ్ముడు హాజరైన కార్య క్రమానికి అందుబాటులో ఉండి కూడా ఎమ్మెల్యే హాజరు కాకపోగా.. క్యాంపు కార్యాలయానికి వెళ్లి అన్నను తమ్ముడు కలువకపోవడం సభికులు, పుర ప్రజలను విస్మయానికి గురి చేసింది. ఈ సంఘటన తోబుట్టువుల మధ్య నెలకొన్న అసమ్మతికి నిదర్శనమని పలువురు పేర్కొనడం గమనార్హం. ఇద్దరి మధ్య ఎందుకు పొరపొచ్చాలు వచ్చాయో తెలియ దు కానీ ముఖ్య అతిథులుగా హాజరు కావాలి్సన వినోద్, వివేక్ దూరం దూరంగా ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వీరి తీరుపై పురప్రజలు పలు రకాలుగా చర్చించుకోవడం వినిపించింది. ఈ ఘటన కాంగ్రెస్ శ్రేణులను కూడా గందరగోళానికి గురి చేసి చర్చనీయాంశంగా మారింది. -
దసరా తర్వాతే పెద్దబతుకమ్మ
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంతోపాటు చాలా మండలాల్లో దసరా తర్వాత మహిళలు సద్దుల బతుకమ్మ ఆడడం ఆనవాయితీగా వస్తోంది. ఓ వైపు భైంసాలో మహాలయ అమావాస్య మరుసటి రోజు సద్దుల బతుకమ్మ ఆడడం ప్రత్యేకత కాగా.. నిర్మల్ ప్రాంతంలో పండుగ తర్వాత సద్దుల సందడి కొనసాగుతూ ఉండడం ఇక్కడి స్పెషల్. పూలను పూ జించే ఈ పండుగలో ఇక్కడ కాగితంతో బతుకమ్మలను చేయడం మరో ప్రత్యేకత. దసరా సెలవులు పూర్తవుతున్నా.. చాలామంది యువతులు, విద్యార్థినులు సద్దుల బతుకమ్మ కోసం ఆగడం విశేషం.పౌర్ణమి దాకా ఆటపాటలే...తెలంగాణ వ్యాప్తంగా దసరాకు ముందే బతుకమ్మ పండుగ ముగుస్తుంది. కానీ.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లా మాత్రం ఎన్నో ప్రత్యేకతలను చాటుకుంటోంది. ఒక్కో గ్రామంలో ఒక్కోరోజు పండుగలా సద్దులబతుకమ్మను తీసుకెళ్తుంటారు. నిర్మల్ ప్రాంతంలో దసరా తర్వాత మొదలయ్యే సద్దుల బతుకమ్మల సందడి ఒక్కో ఊళ్లో ఒక్కోరోజు ఉంటుంది. ఈ రోజు(శనివారం) నుంచి ఇలా పౌర్ణమి వరకు రోజూ బతుకమ్మల ఆటపాటలు సాగుతూనే ఉంటాయి. ప్రతీసాయంత్రం గ్రామాలతో పాటు జిల్లాకేంద్రంలోనూ పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కాగితంతో బతుకమ్మ..జిల్లాలో బతుకమ్మకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎక్కడా లేనివిధంగా ఇక్కడ రంగురంగుల కాగితాలతో బతుకమ్మలను తయారు చేస్తారు. పూలను పూజించే ప్రకృతి పండుగలతో ఇలా కాగితాలతో బతుకమ్మలను చేసి ఆడడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తుంటారు. గతంలో కరువు పరిస్థితులు ఉన్నప్పుడు నిమజ్జనానికి నీళ్లు లేకపోవడం, అలాగే పువ్వులు లభించకపోవడం తదితర కారణాలతో కాగితపు బతుకమ్మలతో ఆడడం ప్రారంభమై ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.మనదిక్కు పండుగైనంకనే..‘ఓ.. నా చిన్నప్పటి సంది సూస్తున్న. కరీంనగర్, వరంగల్ దిక్కు దసరా పండుక్కు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతరు. మనక్కడ మాత్రం పండుగైనంకనే ఆడుతం. ముందటి సంది బొడ్డెమ్మ పండుగ అట్లనే అస్తున్నది..’ అని నిర్మల్కు చెందిన 80ఏళ్ల రాం ముత్తమ్మ చెబుతోంది.మానాయి ఉన్నందునే...కరీంనగర్, వరంగల్ వైపు దసరాకు ముందురోజే సద్దుల బతుకమ్మ ఆడుతారు. కానీ.. మాదిక్కు మానాయి(మహర్నవమి) పెద్దపండుగగా చేసుకుంటాం. ఆ రోజు ఇంట్లో నుంచి పసుపుకుంకుమలు, మంగళహారతి సహా ఏ వస్తువునూ బయటకు తీసుకెళ్లం. అందుకే సద్దుల బతుకమ్మను దసరా తర్వాతనే చేసుకుంటాం.–ఏనుగుల విమల, నిర్మల్బతుకమ్మ కోసమే...దసరా పండుగంటే చాలా ఇష్టం. అందులోనూ బతుకమ్మ అంటే ఇంకా ఇష్టం. రోజూ అమ్మవాళ్లతో కలిసి పాడుతూ ఆడుతూ నేర్చుకుంటాం. ఇక దసరా తర్వాత సద్దుల బతుకమ్మ కోసమే హైదరాబాద్ వెళ్లకుండా నిర్మల్లోనే ఉంటా.– అనన్య, సాఫ్ట్వేర్ ఇంజినీర్, నిర్మల్ -
లోకల్ కిక్కు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దసరా అంటేనే మందు, మటన్తో దావత్ చేసుకోవడం. పండక్కి మద్యం ప్రియులు ఫుల్లుగా తాగేశారు. జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు 42,251 లిక్కర్ బాక్సులు, 80,170 బాక్సుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ దాదాపు రూ.46.37కోట్లు ఉంటుంది. గతేడాది దసరాకు రూ.32కోట్లు మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే సుమా రు రూ.13కోట్ల పైచిలుకు అదనంగా సేల్స్ అయినట్లు ఎకై ్సజ్ అధికారులు చెప్పుతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే రికార్డుస్థాయిలో రూ.46.37 కోట్ల విక్రయాలు జరిగాయి. గత దశాబ్దకాలంలో మద్యం విక్రయాలు ఈస్థాయిలో జరగడం రికార్డేనని లిక్కర్ వ్యాపారులు వ్యాఖ్యానిస్తున్నారు. విక్రయాలకు కారణం విక్రయాలు పెరగడానికి ప్రధాన కారణాలు గాంధీజయంతి రోజున దసరా రావడటం. దీంతో చాలా మంది ముందస్తుగానే అవసరానికి మించి లిక్కర్ను కొనిపెట్టుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్లు ఖరారుకావడంతో బరిలో నిలిచే అభ్యర్థులు పండుగ సందర్భంగా పలు పల్లెల్లో లిక్కర్ను సరఫరా చేశారు. కుల సంఘాల వారీగా తమ కు అనుకూలమైన వారికి మద్యం బాటిళ్లు పంపిణీ చేసి మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేయటం సైతం సేల్స్ పెరిగేందుకు దోహదం చేశాయి. పెరిగిన మాంసం అమ్మకాలు గాంధీజయంతి రోజున దసరా రావడంతో చాలా గ్రామాల్లో ముందు రోజునే మటన్ కొని పెట్టుకున్నారు. మరికొన్ని చోట్ల దసరా పండుగ రోజు ఉద యం 4గంటలలోపే మటన్ విక్రయాలు జరిపారు. ఈ ఏడాది మాంసం విక్రయాలు గతం కన్నా ఎక్కువగానే జరిగినట్లు మటన్షాపు నిర్వాహకులు చెప్పుతున్నారు. మిగితా రోజులతో పోలిస్తే దసరా రోజున జిల్లావ్యాప్తంగా రూ.కోటికి పైనే మాంసం విక్రయించినట్లు సమాచారం. నూతన వాహనాల కొనుగోళ్లు సైతం గతంతో పోలిస్తే భారీగా పెరిగా యి. పండుగ పూట కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారితో టూవీలర్, ఫోర్ వీలర్స్ షోరూంలు కళకళలాడాయి. శుక్రవారం సైతం మద్యం దుకాణా లు, మటన్, చికెన్ సెంటర్ల వద్ద సందడి కనిపించింది. లిక్కర్ బిజినెస్ మరింత పెరిగే అవకాశముంది. -
రాంలీలా.. గోలగోల
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దసరా సందర్భంగా నగరంలోని మార్క్ఫెడ్ మైదానంలో నిర్వహించిన రాంలీలా బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. గురువారం రాత్రి మైదా నంలో ఏర్పాటు చేసిన శమీపూజకు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు పడాల రా హుల్ తదితరులతో కలిసి హాజరయ్యారు. శమీ పూజ జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు ‘జై గంగుల.. జైజై గంగుల’ అంటూ నినాదాలు చేశారు. ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు సైతం ‘జై పొన్నం.. జైజై పొన్నం’ అనడంతో కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. నినాదాలు చేస్తున్న వారి ని పోలీసులు వారించారు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో రాజకీయాలకు తావు లేదని, నేతల అనుకూల నినాదాలు అవసరం లేదని మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. శమిపూజ అనంతరం కార్యక్రమాన్ని సుడా చైర్మన్ కొనసాగిస్తారని చెప్పి పొన్నం అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అక్కడకు చేరుకొన్నారు. రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై గంగుల అంటే తొక్కుతారా: పోలీసులపై గంగుల ఫైర్ ‘జై గంగుల అంటే తొక్కుతా అన్నవ్ కదా...తొక్కు మరి..చంపుతవా చంపు’ అంటూ గంగుల కమలాకర్ పోలీసులపై ఫైర్ అయ్యారు. రాజకీయ నినాదాలు చేస్తుంటే వారించామని పోలీసులు చెప్పగా, జై పొన్నం..జై గంగుల...అంటున్నరు...ఇందులో పార్టీలేడున్నయని ఆగ్రహించారు. గవర్నమెంట్ పర్మినెంట్ ఉంటదా... మినిస్టర్ పర్మినెంట్ ఉంటడాఅంటూ మండిపడ్డారు. -
అన్నిస్థానాలు గెలవాలి
సాక్షి ప్రతినిది, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను గెలవాలని కాంగ్రెస్ నేతలు పిలుపుని చ్చారు. శుక్రవారం ఉమ్మ డి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులంతా గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో స్థానిక సంస్థల అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించారు. విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావుతోపాటు ప్రణవ్బాబు, వెలిచా ల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కేకే మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక ఇలా అభ్యర్థుల ఎంపికపై కూలంకుశంగా చర్చ జరిగింది. ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకే అప్పగించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులే స్థానికంగా బలాల ఆధారంగా ఎంపిక చేసుకునే వీలు కల్పించారు. జెడ్పీటీసీల విషయంలోనూ డీసీసీ అధ్యక్షులు నలుగురు అభ్యర్థులను ఎంపిక చేసి పీసీసీ అధ్యక్షుడికి పంపుతారు. అధిష్టానం రహస్యంగా సర్వే నిర్వహించి, నలుగురిలో ఒకరి పేరు ను ఖరారు చేస్తారు. అభ్యర్థుల జాబితాను మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. కోర్టు తీర్పు.. సంజయ్ జాబితాపై చర్చ స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయంపైనా చర్చించారు. రిజర్వేషన్లకు అన్నిపార్టీలు తమ సానుకూలత వ్యక్తం చేశాయని, కోర్టు తీర్పు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తీర్పు ప్రతికూలంగా వస్తే.. ఎలా వ్యవహరించాలో కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ సమావేశానికి హాజరై తాను సిద్ధం చేసిన జాబితాను అందజేసినట్లు తెలిసింది. జగి త్యాలలో ఎమ్మెల్యే సంజయ్ మాజీ మంత్రి జీవన్రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. సంజయ్ చేరికను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న జీవన్రెడ్డి.. తన వర్గీయులకు ఎలాగైనా టికెట్ ఇప్పించుకోవాలన్న పంతంతో ఉన్నారు. వీరి విషయంలో ఎవరి జాబితా ఖరారు చేస్తారన్న విషయం అధిష్టానానికి చూసుకుంటుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి ‘సాక్షి’కి తెలిపారు. -
ఘనంగా సుందరేశ్వర దుర్గాభవానీల పట్టాభిషేకం
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ మండలం నగునూర్లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో శరన్నవరాత్రుల చివరి రోజైన ఽశుక్రవారం అమ్మవారు అర్ధనారేశ్వర అలంకరణలో నంది, సింహవాహనాలపై దర్శనమిచ్చారు. సుందరేశ్వరుల, దుర్గాభవానీల పట్టాభిషేకం, రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కుమార్, వై.సునీల్రావు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు అమ్మవారికి చీరసారె పెట్టి ఒడిబియ్యం పోశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగల లక్ష్మణ్, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 4 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
అంబికా.. సెలవికదేవీ శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా పలు చోట్ల నెలకొల్పిన దుర్గామాత విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు, భవానీ దీక్షాపరులు అమ్మవారి విగ్రహాలను వాహనాల్లో మానకొండూరు, మానేరు వాగు, కొత్తపల్లి, చింతకుంట, దుర్శేడ్, బొమ్మకల్ చెరువులకు తరలించారు. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో అ మ్మవారి నిమజ్జనం వైభవంగా జరిగింది. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. యువత ఉత్సాహంగా దాండియా ఆడిపాడారు. నగరంలోని విగ్రహాలు రాజీవ్ చౌక్, పోస్టాఫీస్ చౌరస్తా, టవర్, కమాన్ ద్వారా నిమజ్జనానికి తరలాయి. దారి పొడవునా భక్తులు అమ్మవారికి మంగళహారతులతో నీరాజనం పలికారు. – కరీంనగర్ కల్చరల్ -
శమీపూజ.. రాంలీల
జిల్లావ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాల్లో, పట్టణాల్లో పండుగ సందర్భంగా సందడి నెలకొంది. ఆలయాల్లో రద్దీ నెలకొనగా.. శమీపూజలు నిర్వహించారు. జమ్మి ఆకు ఇచ్చిపుచ్చుకుని దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సాయంత్రం రాంలీల వేడుకలు వైభవంగా సాగాయి. ఊరూరా రావణ సంహార కార్యక్రమం ఆకట్టుకుంది. కరీంనగర్లోని పలు ఆలయాల్లో శమీ, వాహన పూజలు, రామ్లీల కార్యక్రమాలతో సందడి నెలకొంది. చైతన్యపురిలో మహాశక్తి ఆలయంలో కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, కోతిరాంపూర్లోని గిద్దెపెరుమాండ్ల ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ శమీపూజల్లో పాల్గొన్నారు. మార్క్ఫెడ్ మైదానంలో జరిగిన రాంలీల కార్యక్రమంలో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు. మాజీ మేయర్ సునీల్రావు శమీ పూజల్లో పాల్గొన్నారు. రామడుగు మండలం వెదిరలో శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల రథయాత్ర వైభవంగా సాగింది. అనంతరం శమీపూజ నిర్వహించారు. – కరీంనగర్ కల్చరల్ -
జెడ్పీ పీఠాలపై కాషాయ జెండా ఎగరేస్తాం
● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్టౌన్: కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాలను బీజేపీ కై వసం చేసుకోబోతోందని, సర్వే నివేదికలు ఇదే విషయం తేటతెల్లం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్స్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మండలాధ్యక్షులు, జెడ్పీటీసీ ప్రభారీల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని, తాను సైతం ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. తాజామాజీ సర్పంచులు, రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులే ఈసారి కాంగ్రెస్ ను ఓడించబోతున్నారని, బీజేపీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాబోతున్నారన్నారు. అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపు విషయాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూసుకుంటుందని, ఇప్పటికే సర్వేలు చేయిస్తోందని తెలిపారు. సర్వే నివేదికలను బట్టి గెలుపే ప్రాతిపదికన టిక్కెట్లు వస్తాయని స్పష్టం చేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, మాజీ మేయర్లు సునీల్రావు, డి.శంకర్, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, కోమాల అంజనేయులు, వాసాల రమేశ్ పాల్గొన్నారు. అన్ని పార్టీలు కోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలికరీంనగర్ కార్పొరేషన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు అనుకూలంగా అన్ని రాజకీయ పార్టీలు కోర్టుకు అఫిడవిట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అసెంబ్లీలో బలహీనవర్గాల బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినందున, అదే విషయాన్ని కోర్టుకు కూడా చెప్పాలన్నారు. దసరా సందర్భంగా గురువారం కరీంనగర్లో మాట్లాడారు. గత ప్రభుత్వం 2018లో 50 శాతం పరిమితితో రిజర్వేషన్చట్టం తీసుకువచ్చిందన్నారు. తమ ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తూ ప్రత్యేక చట్టంచేసి గవర్నర్కు పంపించామని తెలిపారు. ఏ కారణం చేతనే గవర్నర్ దానిని ఆమోదించలేదన్నారు. అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఆమోదించిన అన్ని పార్టీలు, ఇదే అంశాన్ని కోర్టుకు తెలిపాలని సూచించారు. రాష్ట్రం నుంచి ఎనిమిది బీజేపీ ఎంపీలున్నారని బీసీ బిల్లు ఆమోదానికి కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై తాము ఎక్కడా నిరసన తెలపడం లేదంటున్నారన్నారు. ఒకవైపు అలుముకుంటూనే కడుపులో కత్తులు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, న్యాయపరమైన అంశాలపై ముందుకు వెళ్లిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ద్వారా దేశానికే తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నాయకులు వైద్యుల అంజన్కుమార్, పడిశెట్టి భూమయ్య పాల్గొన్నారు. -
బీజేపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్పై స్థానిక పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. గతంలో శామీర్పేట్లో హుజూరాబాద్ కేడర్తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై పార్టీలో ముఖ్య నాయకులపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్లో లోకల్ బీజేపీ లీడర్లతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వడం కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ మరో పార్టీ టికెట్ ఇప్పిస్తానని ఈటల హామీ ఎలా ఇస్తారంటూ మండిపడుతున్నారు. కొత్త నేతలు, పాత నాయకులంటూ ఈటల రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నిబంధనలు విస్మరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తన అనుచరులకు ఇతర పార్టీల నుంచైనా టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నారని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీనా? లేక ఈటల వ్యక్తిగత దుకాణమా? అని కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఈటల చర్యలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కరీంనగర్లో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్లో బీజేపీని బలహీనపరుస్తూ వ్యక్తిగత అనుచరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారని తెలిసింది. అంతర్గత విభేదాలు ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికలలో ఈటల విధానం పార్టీకి ముప్పు తెస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ఈటలను కట్టడి చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతుంది. స్థానిక సంస్థల్లో బలం పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. ఈటల మార్క్ రాజకీయాల కారణంగా ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలతో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఈటలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. -
కాలువ నీటిలో దిగి ఊపిరాడక రైతు మృతి
రామడుగు(చొప్పదండి): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు గడ్డం శ్రీనివాస్ (52) గ్రావిటి కాలువలో కరెంటు మోటారు మరమ్మతు కోసం నీటిలోకి దిగి ఊపిరి ఆడక మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రావిటి కాలువలో అమర్చుకున్న కరెంటు మోటారు ఆన్ చేయడానికి మంగళవారం మధ్యాహ్నం గడ్డం శ్రీనివాస్ వెళ్లాడు. ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు కరెంట్ మోటార్ వద్దకు వెళ్లి చూడగ, గట్టుపైన సెల్ఫోన్తో పాటు దుస్తులను గమనించారు. విద్యుత్ మోటారు పైపు విప్పి ఉండడంతో కాలువలో మునిగి ఉంటాడని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు గజ ఈతగాళ్లతో వెతికించారు. బుధవారం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య సరోజన ఫిర్యాదు మేరకు పైన కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో ఉద్యోగి మృతిహుజూరాబాద్: పండుగ వేళ ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. సబ్స్టేషన్లో విద్యుత్ షాక్తో ఉద్యోగి మృతిచెందిన ఘటన బుధవారం హుజూరాబాద్లో జరిగింది. మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన శంకర్రెడ్డి(40) బోర్నపల్లిలోని విద్యుత్తు సబ్స్టేషన్లో ఆర్టిజన్ గ్రేడ్–2 అసిస్టెంట్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. విద్యుత్తు మరమ్మతులలో భాగంగా స్తంభంపై ఎక్కిన క్రమంలో షార్ట్ సర్క్యూట్ అయింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరుపుతున్నారు. -
లిక్కర్ దందా
● దసరా రోజు బార్లు, వైన్స్లు బంద్ ● బ్లాక్లో అమ్మేందుకు సిద్ధమవుతున్న పలువురు వ్యాపారులుకరీంనగర్క్రైం: దసరా పండగ గాంధీ జయంతి రోజు రావడంతో జిల్లా వ్యాప్తంగా వైన్స్లు, బార్లు మూసివేయనున్నారు. ఈక్రమంలో దసరా రోజు అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపేందుకు బెల్ట్షాపులు, వివిధ ప్రైవేటు వ్యాపారులు సిద్ధపడుతున్నారు. దసరా రోజు మూసి ఉంటున్న నేపథ్యంలో పలువురు బ్లాక్లో కొంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలువురు వైన్స్లు, బార్ల యజమానులు, పనిచేసేవారు, బయటివారు బ్లాక్ దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్లోని కట్టరాంపూర్, బస్టాండ్ ప్రాంతం, భగత్నగర్, తిరుమల్నగర్, రాంగనర్, మంచిర్యాల చౌరస్తా, హౌజింగ్బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో బ్లాక్లో మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇక అల్గునూర్లో వైన్స్లను మించి బెల్ట్షాపులు అమ్మకాలు జరుపుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరీంనగర్లో వైన్స్లు మూసివేసిన సందర్భాల్లో రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అల్గునూర్ బెల్ట్షాపుల్లో మద్యం అమ్మకాలు బ్లాక్లో జరుగుతున్నాయని సమాచారం. ఈ బెల్ట్షాపులపై అల్గునూర్కు చెందిన ఒక వ్యక్తి పలుమార్లు పోలీసులకు, ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు సీపీకి ఫిర్యాదు చేయగా సదరు బెల్ట్షాపులను మూయించినట్లు తెలిసింది. కానీ, పండుగపూట పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టరని భావించి బ్లాక్దందాకు తిరిగి తెరలేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. 94 వైన్స్లు, 32 బార్లు గాంధీ జయంతి రోజు దసరా రావడంతో జిల్లావ్యాప్తంగా 94 వైన్స్లు, 32 బార్లు మూసివేయనున్నారు. దీంతో బ్లాక్ దందాకు తెరలేపి బుధవారం రాత్రి నుంచే మద్యాన్ని ప్రైవేట్ ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. బ్లాక్ దందాలో ఒక బీర్కు అదనంగా రూ.50 నుంచి రూ.100, లిక్కర్ విషయానికి వస్తే క్వాటర్కు రూ.50 , హాఫ్నకు రూ.100, ఫుల్బాటిల్పై రూ.200 వరకు, బ్రాండ్ను బట్టి పెద్ద బ్రాండ్లకు ఫుల్బాటిల్పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, దసరా సందర్భంగా చాలా మంది ముందస్తుగా మద్యం కొనుగోలు చేసినా సరిపోనివారు బ్లాక్లో కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారే లక్ష్యంగా బ్లాక్ దందా కొనసాగుతుంటుందని చర్చ జరుగుతోంది.దసరా రోజు గాంధీ జయంతి సందర్భంగా వైన్స్లు, బార్లు మూసి ఉంటాయి. పలువురు బ్లాక్ దందాకు తెరలేపే అవకాశాలుండడంతో వాటిని నియంత్రిస్తాం. ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నాం. వైన్స్లు మూసి ఉన్న సమయంలో బెల్ట్షాపులు, ప్రైవేటు దుకాణాల్లో మద్యం అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, కరీంనగర్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
● బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదు ● కేంద్ర నిధులతోనే గ్రామపంచాయతీల అభివృద్ధి ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావుకరీంనగర్టౌన్: రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో బీజేపీ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలైందన్నారు. ముందు జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేయడంతోపాటు ఏకగ్రీవంగా ఉన్న స్థానంలో బీ ఫామ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కేంద్ర నిధులను దారి మళ్లించిందన్నారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. తాజామాజీ సర్పంచులు పడిన యాతన అంతా.. ఇంతా కాదన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారని విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతుభరోసా ఇయ్యడం లేదని ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తోందని తెలిపారు. గ్రామాల్లో కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేకనే రెండేళ్లు జాప్యం చేసిందన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నాయకులు గౌతంరావు, ఎన్వీ సుభాష్, బొడిగె శోభ, యాదగిరి సునీల్రావు, రెడ్డవేన మధు, బాస సత్యనారాయణరావు, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్ టీ–20 మహిళల జట్టులో శ్రీవల్లి
కరీంనగర్స్పోర్ట్స్/ఇల్లంతకుంట(మానకొండూర్): హైదరాబాద్ మహిళల టీ–20 క్రికెట్ జట్టులో కరీంనగర్కు చెందిన క్రీడాకారిణి కట్ట శ్రీవల్లి చోటు సంపాదించింది. హైదరాబాద్ సీనియర్ మహిళల టీ–20 క్రికెట్ జట్టును క్రికెట్ సంఘం బాధ్యులు బుధవారం ప్రకటించారు. ఈనెల 8 నుంచి మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో బీసీసీఐ టీ20 టోర్నీ ప్రారంభంకానుంది. టోర్నమెంట్లో భాగంగా పాల్గొనే హైదరాబాద్ సీనియర్ మహిళల జట్టులో శ్రీవల్లి చోటు దక్కించుకుంది. శ్రీవల్లి ఎంపికపై కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగం రావుతోపాటు తల్లిదండ్రులు కట్ట ఉమా–లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. శ్రీవల్లి స్వస్థలం రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామం. -
బాలసదన్ త్వరగా పూర్తి చేయాలి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్కార్పొరేషన్: స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలోని క్రిస్టియన్ కాలనీలో నిర్మిస్తున్న బాలసదన్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బుధవారం నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి బాలసదన్ పనులను పరిశీలించారు. అలాగే నగరపాలకసంస్థ ఆధ్వర్యంలోని నర్సరీని సందర్శించారు. మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. రూ. కోటితో షెడ్ నగరపాలకసంస్థ వాహనాలు నిలిపి ఉంచేందుకు రూ.1 కోటితో షెడ్ నిర్మాణం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే ఉన్న సప్తగిరికాలనీ వాహనాల షెడ్కు అదనంగా, నగరంలోని 7వ డివిజన్ హౌసింగ్బోర్డుకాలనీలో షెడ్ నిర్మించేందుకు ప్రతిపాదించారు. ప్రతిపాదిత స్థలాన్ని కమిషనర్తో కలిసి పరిశీలించారు. అనంతరం విజయదశమి పండుగను పురస్కరించుకొని నగరపాలకసంస్థ వాహనాలకు కలెక్టర్, కమిషనర్ పూజలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజీవ్కుమార్, డీఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యానగర్(కరీంనగర్): విజయదశమి సందర్భంగా గురువారం కరీంనగర్ నగునూర్లోని పరివార సమేత శ్రీ దుర్గాభవానీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండర్ చైర్మన్ వంగళ లక్ష్మణ్ తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి వాహనపూజ, శ్రీచక్రపూజ, చతుషష్ట్యుపచార పూజ, 8.30 గంటలకు అమ్మవారికి విశేష హారతి, గంగా హారతి, సాయంత్రం 4గంటలకు జమ్మిపూజ, రాత్రి 7గంటలకు రాంలీల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పదోన్నతుల ‘పండుగ’కరీంనగర్ అర్బన్: ఏఈవోల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దసరా పండుగ పూట తీపి కబురు చెబుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మల్టీ జోన్–1 పరిధిలో 29మంది వ్యవసాయ విస్తరణ అధికారుల(ఏఈవో)కు వ్యవసాయ అధికారులుగా పదోన్నతి కల్పించింది. జిల్లాలో నలుగురికి పదోన్నతి లభించగా ఇతర జిల్లాలకు కేటాయించారు. జిల్లాలో పున్నం చందర్ (తిమ్మాపూర్), పైడితల్లి (దుర్షేడు), కీర్తికుమార్ (గునుకుల కొండాపూర్), తిరుపతి (మల్కాపూర్) ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారులుగా పదోన్నతి లభించింది. కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఏవోలకు అదనపు బాధ్యతలు తప్పడంలేదు. తాజాగా లభించిన పదోన్నతులతో ఖాళీ పోస్టులను భర్తీచేశారు. అయితే పదోన్నతి పొందిన వారికి సొంత జిల్లాలో బాధ్యతలు కాకుండా జోన్ పరిధిలో వరంగల్, జగిత్యాల జిల్లాలకు కేటాయించగా సిరిసిల్ల జిల్లా నుంచి సంతోష్ కుమార్ను, జగిత్యాల నుంచి ముత్యాల రమేష్ లను జిల్లాకు అలాట్మెంట్ చేయగా కొత్తపల్లి ఏవోగా సంతోష్ కుమార్, చిగురుమామిడి ఏవోగా రమేశ్ను నియమించారు. ఇదిలా ఉండగా ఒకటి, రెండు రోజుల్లో ఏవోల నుంచి ఏడీఏలుగా పదోన్నతి కల్పించనున్నట్లు సమాచారం. కరీంనగర్ సర్కిల్కు ర్యాంకులుకొత్తపల్లి(కరీంనగర్): టీజీఎన్పీడీసీఎల్ కంపెనీస్థాయిలో బుధవారం ప్రకటించిన వివిధ పారా మీటర్లలో కరీంనగర్ సర్కిల్కు ర్యాంకులు దక్కాయి. విద్యుత్ సంస్థ కంపెనీ స్థాయిలో కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబుకు రెండో ర్యాంకు, కరీంనగర్ టౌన్ డీఈ జంపాల రాజంకు రెండో ర్యాంకు, సబ్డివిజన్ టౌన్–1 ఏడీఈ (ఆపరేషన్) పంజాల శ్రీనివాస్గౌడ్కు మొదటి ర్యాంకు, సబ్ డివిజన్ టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్యకు 5వ ర్యాంకు, టౌన్–3 ఏఈ (ఆపరేషన్) వెంకటరమణయ్యకు 5వ ర్యాంకు, ఉమ్మడి కరీంనగర్ సర్కిల్లో హుజూరాబాద్ ఏడీఈ (ఆపరేషన్) పి.శ్రీనివాస్కు ఒకటో ర్యాంకు, టౌన్–8 ఏఈ (ఆపరేషన్) ఫసిఅహ్మద్కు ఒకటో ర్యాంకు లభించింది. అత్యున్నత ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన ర్యాంకుల పట్ల సహచర ఉద్యోగులు హర్షం వ్యక్తంచేశారు. -
అందరికి ప్లాన్-బి!
సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్లు యథావిధిగా అమలవుతాయా? లేదా కోర్టు తీర్పు ఆధారంగా మారతాయా? అన్న మీమాంస ప్రతీ రాజకీయ పార్టీని, పోటీ చేసే ఆశావహులను వేధిస్తోంది. అదే సమయంలో అందుకు తగ్గట్లుగా ఇటు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయాలు, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తదితర పార్టీలు, ఆయా పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు సిద్ధంగా వారి వారి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, పార్టీలు, ఆశావహులు ఎవరికి వారు ప్లాన్–బిని సిద్ధం చేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ ప్రణాళికలు స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికిప్పుడు అమలయ్యేది కాదు. దీనికి సవాలక్ష సాంకేతిక, రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవనున్నాయి. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అంతా 42 శాతంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. అదే సమయంలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే.. అప్పటికప్పుడు ఇబ్బంది పడకుండా 23శాతంతోనూ రిజర్వేషన్లతో మరో జాబితా ముందుస్తుగా తమ వద్ద ఉంచుకున్నారు. అదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వస్తున్న ప్రతిపాదనలను ఆయా పార్టీలు పక్కనబెడుతున్నాయి. వాస్తవానికి ప్రతీ పార్టీ ఇప్పటికే స్థానిక సంస్థల్లో 23 శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా తమ పార్టీ బలాబలాలపై సర్వేలు చేయించుకున్నాయి. అందుకే, కోర్టు తీర్పు ఆధారంగానే ప్లాన్–ఎ లేదా ప్లాన్–బిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో అభ్యర్థులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు తొందరపడకుండా.. ఖర్చు విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నా.. కొన్నేళ్లుగా పోటీ చేద్దామని పార్టీకి పనిచేస్తున్న అన్ని పార్టీల నాయకులంతా ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో విషయం కోర్టుకు వెళ్లడంతో 23 శాతంతోనే ఎన్నికలు జరుగుతాయని, తాము బరిలోనే ఉంటామని న్యాయస్థానంపై గంపెడాశలతో ఉన్నారు. అదే గనక వాస్తవరూపం దాల్చితే.. ఏకంగా 19 శాతం మేరకు బీసీ స్థానాలపై ప్రభావం చూపించనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో మార్పులు వాస్తవరూపం దాలిస్తే.. ఎస్సీ 15 శాతం, ఎస్టీ ఏడు శాతం రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక ఓసీ జనరల్, ఓసీ మహిళలకు 19 శాతం మేరకు అవకాశాలు పెరగనున్నాయి. జనరల్ కాబట్టి, ఈ వేదికలపై ఎవరైనా పోటీ పడేందుకు విస్తృత అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా కోర్టు తీర్పు కోసం ఇటు కలెక్టర్ కార్యాలయాలు, అటు రాజకీయ పార్టీలు, ఆశావహులు అంతా ప్లాన్–బితో బరిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు. -
చికిత్స పొందుతూ యువకుడు మృతి
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్లో విద్యుత్షాక్కు గురైన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. లింగంపల్లి రాజేశ్(22) గత నెల 28న ఇంటి వద్ద బట్టలు ఆరేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందాడు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. మహిళ ఆత్మహత్య చిగురుమామిడి: మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన నక్క లచ్చవ్వ (50) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలి పారు. పనినిమిత్తం వెళ్లొచ్చేసరికి కనిపించలేదని, బుధవారం ఉదయం ఉరేసుకొని కనిపించినట్లు లచ్చవ్వ భర్త కొంరయ్య పోలీసులకు తెలిపారు. కొంరయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయికృష్ణ పేర్కొన్నారు. -
ఆదరణ.. ఆలనా.. పాలనా
సిరిసిల్లఅర్బన్: బిడ్డ పుట్టగానే కంటికి రెప్పలా కాపాడుకుంటారు తల్లిదండ్రులు. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పిల్లలను ప్రయోజకుల్ని చేయాలని తపనపడుతుంటారు. తీరా పిల్లలు పెద్దయ్యాకా కన్నవారి ఆలనా పాలనా చూడకుండా ఎవరి దారి వారు చూసుకొని కన్నవారిని రోడ్డున పడేస్తారు. ఇలా నిరాదరణకు గురయ్యే వృద్ధుల కోసం సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో 2023లో ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయగా బాధితులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి. ఇందులో చేరిన వృద్ధులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారిలో మనోధైర్యాన్ని నింపుతూ వారి శేషజీవితం సంతోషంగా గడిపేందుకు తోడ్పడుతున్నారు. బుధవారం వృద్ధుల దినోత్సవం సందర్భంగా కథనం. తంగళ్లపల్లి మండలం మండెపల్లి, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమాల్లో మొత్తం 44 మంది ఉంటున్నారు. వీటిలో 26 మంది వృద్ధురాళ్లు, 18 మంది వృద్ధులు ఉన్నారు. వీరిలో కొందరు పిల్లలు పట్టించుకోకపోవడం వల్ల వచ్చినవారు, మరికొందరు కోడళ్లు సరిగా చూసుకోనివారు, భర్త పోరు భరించలేక, భార్య పోరు భరించలేక ఈ ఆశ్రమాల్లో ఉంటున్నారు. వీరి కోసం ప్రభుత్వం ఏటా రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తోంది. వృద్ధులు సంతోషంగా జీవించేందుకు ఖర్చుచేస్తారు. ప్రభుత్వం 70 శాతం, ఎన్జీవోస్ 30 శాతం నిధులు కేటాయిస్తారు. దీంతో ఆశ్రమాల్లోని వృద్ధులను సినిమాలు, ఆలయాల సందర్శన, పర్యాటక స్థలాలకు తీసుకెళ్లి వారిలో ఉన్న బాధ, ఓత్తిడిని తగ్గించి, వారు సంతోషంగా ఉండేలా కృషి చేస్తారు. ఏది ఏమైనా కనిపెంచిన తల్లిదండ్రులను రోడ్డున పడేయడం సరికాదని, చంటి పిల్లలాంటి తల్లిదండ్రులకు సపర్యలు చేసి వారి రుణం తీర్చుకోవాలని పలువురు కోరుతున్నారు. పండుటాకులకు అండగా వృద్ధాశ్రమాలు నేడు వృద్ధుల దినోత్సవం -
ఒకే గొడుగు కిందకు ఉపకార వేతనాలు
కరీంనగర్: కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలన్నీ ఒకే గొడుగు కిందకు చేరుస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయం తీసుకుంది. సంక్షేమశాఖల ద్వారా ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఇక నుంచి అన్నివర్గాల విద్యార్థులకు ఈపోర్టల్ సౌకర్యాన్ని ఉపయోగించుకునేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఉన్న నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్(ఎన్ఎస్పీ)ను ఇందుకు అనుకూలంగా మార్పు చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఉపకార వేతనాల కోసం ఇదే పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎన్ఎస్పీ డిజిటల్ ప్లాట్ఫాంగా పనిచేస్తూ విద్యార్థుల దరఖాస్తులను పరిశీలిస్తారు. వారికి మంజూరైన ఉపకార వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు. ఒకసారి విద్యార్థి తన వివరాలు నమోదు చేస్తే అన్ని రకాల స్కాలర్షిప్లకు అవకాశం ఉంటుంది. దరఖాస్తు సమయంలో విద్యార్హతలు, బ్యాంకు ఖాతా, ఆధార్, తదితర సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. వార్షిక ఆదాయం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, కేటగిరీల వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని డిజిటల్ రూపంలోనే పరిశీలించి ఉపకార వేతనాలు మంజూరు చేస్తారు. దరఖాస్తు ఇలా అధికారిక ఎన్ఎస్పీ పోర్టల్లో సైట్ ఓపెన్ చేసి వన్టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి పూర్తి వివరాల్లోకి వెళ్లాలి. కుల, ఆదా య ధ్రువపత్రాలు, విద్యార్హతలు, మెయిల్ ఐడీ, బ్యాంకు ఖాతా వంటివి నమోదు చేస్తూ వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్ఎస్పీలో కేంద్ర ప్రభుత్వం పలు రకాల ఉపకార వేత నాలు అందజేస్తోంది. ఒకటో తరగతి నుంచి పీజీ, పీహెచ్ వరకు చదివే అన్నివర్గాల విద్యార్థులకు ఈ పోర్టల్ ఉపయోగించాల్సి ఉంటుంది. ప్రీమెట్రిక్, పోస్టు మెట్రిక్, మెరిట్ కం మీన్స్ స్కాలర్షిప్ లు, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ (ఎస్సీ, ఎస్టీలకు), యూజీసీ, ఇషాన్, ఉదయ్, సింగిల్ గర్ల్ చైల్డ్, ఏఐసీటీఈ, సెంట్రల్ సెక్టార్ స్కీం ఆఫ్ స్కాలర్షిప్ తదితర వాటన్నింటికీ ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అక్టోబర్ 31 వరకు పోర్టల్ తెరిచి ఉంటుందని ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమశాఖ అధికారులు ధృవీకరించారు. ఒక విద్యార్థి ఒక్కసారి ఈపోర్టల్లో నమోదు చేస్తే శాశ్వతంగా నమోదై ఉంటుందని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్ తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఈ పోర్టల్ సౌకర్యం అక్టోబర్ 31 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు -
ఆపదలో ఆదుకునే రక్తదాతలు
బోయినపల్లి(చొప్పదండి): ఆపదలో పలువురికి రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బోయినపల్లి మండలానికి చెందిన పలువురు యువకులు. బోయినపల్లి, బూర్గుపల్లి, తడగొండ, గుండన్నపల్లి గ్రామాలకు చెందిన యువకులు కొన్నేళ్లుగా రక్తదానం చేస్తున్నారు. బుధవారం జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా కథనం. రక్తదానంలో ముందుండే యువత బోయినపల్లి, బూర్గుపల్లి, తడగొండ, గుండన్నపల్లి, కొదురుపాక, వరదవెల్లి గ్రామాలకు చెందిన యువకులు రక్తం అవరమైన వారి నుంచి ఎలాంటి సాయం తీసుకోకుండా రక్తదానం చేస్తున్నారు. ఒక్కొక్కరు 25 సార్లకుపైగా రక్తదానం చేసిన సందర్భాలు ఉన్నాయి. కొదురుపాకకు చెందిన నల్ల సతీశ్ 31 సార్లు, బూర్గుపల్లికి చెందిన పెరుక మహేశ్ 29, నలిమెల అరవింద్ 18, వడ్లకొండ వినయ్ 9, గుండన్నపల్లికి చెందిన నంది మహేశ్ 18, బోయినపల్లికి చెందిన శ్రీపతి సాగర్ 10, యాద ఆదిత్య 10, తడగొండకు చెందిన ఎర్ర గిరిధర్ 17 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. కొన్నేళ్లుగా బాధితులకు రక్తదానం చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న బోయినపల్లి మండల యువకులు నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం రక్తదానం చేయడం అలవాటుగా మారింది. ఎవరైనా రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే వెంటనే వెళ్లి ఇస్తాను. 12 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నా. సమయానికి రక్తం దొరక్క ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇప్పటి వరకు 30 సార్లు రక్తదానం చేశాను. – పెరుక మహేశ్, బూర్గుపల్లి సమాజంలో కొంత మందికి రక్తదానం చేస్తే అనారో గ్యాల బారిన పడుతామనే అపోహ ఉంది. ఈ అపోహను పోగొట్ట డానికే రక్తదానం చేస్తున్నా. మరి కొంతమంది యువకులు రక్తదానం చేసేలా వారికి నా వంతు అవగాహన కల్పిస్తున్నా. 24 సార్లు బ్లడ్ డొనేట్ చేశా. – నంది మహేశ్, గుండన్నపల్లి -
ఆధార్ సవరణలకు కొత్త చార్జీలు
జ్యోతినగర్(రామగుండం): యూనిక్ ఐడెంటీఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఇకనుంచి ఆధార్లో సవరణకు కొత్తచార్జీలు అమలు చేయనుంది. పెంచిన చార్జీలు బుధవారం నుంచి అమలులోకి వస్తాయి. కొత్త కార్డుల జారీ సేవలు ఉచితంగానే అందిస్తారు. కానీ, జారీచేసిన ఆధార్కార్డుల్లో అడ్రస్ మార్పు, వయసు సవరణ, వేలిముద్రల అప్డేట్ తదితర సేవలకు చార్జీలను విడతల వారీగా పెంచుతోంది. తొలివిడతలో పెంచిన చార్జీలు ఈనెల 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నారు. 17 ఏళ్ల వయసు దాటినవారు తమ ఆధార్లో వేలిముద్రలను అప్డేట్ చేసుకునేందుకు ప్రస్తుతం రూ.100 వసూలు చేస్తున్నారు. తాజాగా దీనిని రూ.125కు పెంచారు. అడ్రస్ మార్చుకునేందుకు ప్రస్తుతం రూ.50 వసూలు చేస్తుండగా తాజాగా రూ.75కు పెంచుతున్నారు. ఆధార్కార్డు కలర్ ప్రింట్ కోసం రూ.40 వసూలు చేస్తుండగా.. ఇకనుంచి మరింత పెంచుతారు. యూఐడీఐఏ ఆధార్ అప్డేట్లో కొత్త చార్జీలు నిర్ణయించింది. ఈనెల 1వ తేదీ నుంచి కొత్త చార్జీలు అమలులోకి వస్తాయి. ప్రజలు కొత్త చార్జీలను గమనించి ఆధార్ నిర్వాహకులకు సహకరించాలి. – పల్లె బాపు, మేనేజర్, మీసేవ, ఎఫ్సీఐ క్రాస్రోడ్డు నేటినుంచి అమలు -
కలిసే ‘పోయిన’ మామాఅల్లుళ్లు
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): చిన్నప్పట్నుంచి కలిసే ఉన్నారు.. పెరిగి పెద్దయ్యాక కూడా ఒకరిని విడిచి మరొకరుఉండేవారు కాదు.. మరణంలోనూ కలిసే పోయారు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని కాల్వశ్రీరాంపూర్ రోడ్డులో మంగళవారం వేకువజామున రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మామ ముత్యం రాకేశ్(31), ఆయన సొంత అక్కకొడుకు పూదరి రోహిత్ ఉరఫ్ అభి(21) దుర్మరణం చెందారు. బతుకమ్మ, దసరా పండుగల పూట జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. కుటుంసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్లోని గౌడవీధికి చెందిన ముత్యం రాజేశ్వరి–శంకరయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకొడుకు రాకేశ్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన సెక్యూరిటీగా పని చేస్తున్నాడు. ఇదేపట్టణంలోని సుభాష్నగర్లో నివాసం ఉంటున్న రాజేశ్ పెద్దఅక్క పూదరి స్వప్న–రమేశ్ దంపతుల చిన్న కొడుకు పూదరి రోహిత్ వయసు దాదాపు సమానంగా ఉంటుంది. దీంతో వారు చిన్నప్పట్నుంచి కలిసే ఉంటున్నారు. ఏ పని అయినా కలిసే చేస్తున్నారు. ఎక్కడికై నా కలిసే వెళ్తున్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లికి చెందిన పాపని ఆదర్శ్ వీరి స్నేహితుడు. సమీపంలోని సుద్దాల గ్రామానికి చెందిన మరో స్నేహితుడి వద్దకు వెళ్లిన ఆదర్శ్కు కడుపునొప్పి వచ్చింది. ఈ విషయాన్ని రాకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సోమవారం రాత్రి రాకేశ్, రోహిత్ కలిసి ద్విచక్ర వాహనంపై సుద్దాలకు వెళ్లారు. అక్కడ ఆదర్శ్ను వాహనంపై ఎక్కించుకున్నారు. రోహిత్ నడుపుతుండగా ఆదర్శ్ మధ్యలో, రాకేశ్ వెనకాల కూర్చుని సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి బయలుదేరారు. ఇదేసమయంలో సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన గసిగంటి రఘు సుల్తానాబాద్ నుంచి అల్లీపూర్ గ్రామానికి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. సుద్దాల శివారులోని ఇటుక బట్టి వద్దగల కాల్వశ్రీరాంపూర్ రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ఢీకొన్నాయి. దీంతో నలుగురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు 108 వాహనంలో సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం రాకేశ్, రోహిత్ను కరీంనగర్కు తరలిస్తుండగా ఇద్దరూ మార్గమధ్యంలోనే మృతి చెందారు. బతుకమ్మ, దసరా పండుగల పూట మామఅల్లుళ్లు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఆదర్శ్, రఘు తీవ్రగాయాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రాకేశ్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని సీఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబసభ్యులను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్ మంగళవారం పరామర్శించారు. శ్రద్ధాంజలి ఘటించిన వైద్యులు సుల్తానాబాద్(పెద్దపల్లి): కాగా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాకేశ్ మృతదేహంపై డీడీవో డాక్టర్ రమాదేవి, డాక్టర్లు మహేందర్, సతీశ్, పర్హత్, విశాల్, అనితరెడ్డి, హెడ్సిస్టర్ రాణి, సిబ్బంది పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. రాకేశ్, రోహిత మృతి సమాచారం అందుకున్న బంధువులు, స్థానికులు వివిధ పార్టీల నేతలు స్థానిక ఆస్పత్రికి భారీగా తరలివచ్చారు. బంధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్రగాయాలు పండుగపూట విషాదం -
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం .. కాపర్ చోరీ
ఫెర్టిలైజర్సిటీ(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధిలోని రామగుండం కార్పొరేషన్ 21వ డివిజన్ లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపం వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను దొంగలు ధ్వంసం చేశారు. అందులోని కాపర్వైర్ అపహఱించారు. ఈమేరకు రైతులు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశారు. వానరం దాడిలో మహిళకు గాయాలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మండలం కొమిర గ్రామంలో భారతిపై వానరం దాడిచేయడంతో గాయాలయ్యాయి. మంగళవారం ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా కోతులు అకస్మాత్తుగా దాడి చేశాయి. దీంతో మహిళ కాలికి గాయమైంది. స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంధ్రంలో డాక్టర్ షాబొద్దీన్ ఆమెకు వైద్యచికిత్స చేశారు. గొర్లు, మేకల దొంగల పట్టివేతరుద్రంగి(వేములవాడ): మూడు గొర్రెలు, ఒక మేకను దొంగిలించిన ఇద్దరిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. మంగళవారం ఉదయం రుద్రంగి పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ట్రాలీ ఆటో కథలాపూర్ నుంచి వేములవాడ వైపు వెళ్తుండగా పెట్రోలింగ్ సిబ్బందికి అనుమానం వచ్చి ఆపేందుకు ప్రయత్నించారు. దొంగలు ఆటోను ఆపకుండా పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆటోలో మూడు గొర్రెలు, ఒక చనిపోయిన మేక ఉంది. నిందితులు వేములవాడ న్యూ అర్బన్ కాలనీకి చెందిన డ్రైవర్ వేల్పుల సురేశ్, వావిలాల అంతగిరిని విచారించగా కోరుట్లలో గొర్రెలు, మేకను దొంగిలించి వేములవాడలో అమ్మడానికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
శ్రమించారు.. సాధించారు
కోల్సిటీ(రామగుండం): పట్టుదలతో చదివారు.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పక్కా ప్రణాళిక రూపొందిచుకున్నారు. ఇష్టపడి చదివారు.. గ్రూప్–2 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఒకరు డిప్యూటీ తహసీల్దార్గా, మరొకరు ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. వీరిద్దరూ ఇప్పటికే రామగుండం నగరపాలక సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వార్డు ఆఫీసర్కు గ్రూప్–2 జాబ్.. గోదావరిఖనిలోని గౌతమినగర్కు చెందిన ఆటోడ్రైవర్ ఆశాడపు రాంచందర్–పద్మ దంపతుల కుమారుడు రవివర్మ గ్రూప్–2 ఫలితాల్లో సత్తాచాటారు. డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థలో వార్డు ఆఫీర్గా విధులు నిర్వహిస్తున్నారు. బీటెక్ మెకానికల్ కోర్సు పూర్తిచేసిన రవివర్శ.. 2023లో రాసిన గ్రూప్–4లో వార్డు ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు గ్రూప్–2కు ప్రిపేర్ అయ్యారు. 2024 డిసెంబర్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇటీవల వెలువడిన ఫలితాల్లో సత్తాచాటారు. కుటుంబ సభ్యులు, బల్దియా ఉద్యోగులు, పలువురు అభినందించారు. ఎకై ్సజ్ ఎస్సైగా జూనియర్ అసిస్టెంట్ గోదావరిఖని పరశురాంనగర్కు చెందిన సింగరేణి ఉద్యగి సాగరపు శ్రీనివాస్–రమాదేవి దంపతుల కుమారుడు సాయి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. బీటెక్ మైనింగ్ కోర్సు పూర్తిచేసిన సాయి.. తొలత గ్రూప్–1, 2, 3, 4 వరకు వరుసగా పరీక్షలు రాశారు. గ్రూప్–4లో ఫలితాల్లో సత్తాచాటారు. ప్రస్తుతం రామగుండం నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 2024లో గ్రూప్–2 పరీక్ష రాసిన సాయి.. ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. ఎకై ్సజ్ ఎస్సైగా విధుల్లో చేరి గ్రూప్–1 ఉద్యోగ సాధనకు ప్రిపేర్ అవుతానని చెబుతున్న సాయి ప్రతిభను కుటుంబ సభ్యులతోపాటు పలువురు అభినందిస్తున్నారు. గ్రూప్–2 ఉద్యోగాలు సాధించిన యువకులు ఒకరు డిప్యూటీ తహసీల్దార్, మరొకరు ఎకై ్సజ్ ఎస్సై ఇప్పటికే బల్దియాలో పనిచేస్తున్న యువకులు -
విషజ్వరంతో చిన్నారి మృతి
● వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆందోళన జగిత్యాలక్రైం: విషజ్వరంతో ఆస్పత్రిలో చేరిన చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతిచెందిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం బాలపల్లి గ్రామానికి చెందిన గాలిపల్లి శ్రీధర్, అలేఖ్య దంపతులకు ఆరాధ్య (6), ఆదిత్య సంతానం. శ్రీధర్, అలేఖ్య దుబాయ్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ విజయ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. రెండు రోజుల క్రితం ఆరాధ్యకు విషజ్వరం రావడంతో విజయ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించింది. చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతిచెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. పట్టణ సీఐ కరుణాకర్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి బంధువులతో మాట్లాడి మృతదేహాన్ని బాలపల్లి గ్రామానికి తరలించారు. తల్లిదండ్రులు దుబాయ్ నుంచి బుధవారం ఉదయం స్వగ్రామానికి చేరుకోనున్నారు. వారు రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తారని గ్రామస్తులు తెలిపారు. వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని కంచర్ల గ్రామానికి చెందిన దేవోళ్ల హన్మంతు ఈ నెల 26న బహ్రెయిన్లో గుండెపోటుతో మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చే స్తోమత కుటుంబ సభ్యులకు లేకపోవడంతో స్థానిక నాయకులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కేటీఆర్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. వారి చొరవతో మంగళవారం స్వగ్రామానికి హన్మంతు మృతదేహాన్ని తీసుకొచ్చారు. చివరి చూపుకోసం బంధువులు, గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. గుండెపోటుతో వ్యక్తి మృతి కంచర్ల గ్రామానికి చెందిన దండుగుల చిన్న లస్మయ్య(54) సైతం కరీంనగర్లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. ఒకే రోజు వడ్డెరకాలనీలో ఇద్దరి అంత్యక్రియలు చేయడంతో కాలనీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. శంకరపట్నం: మండలంలోని ముత్తారం గ్రామంలోని రెండు ఆలయాల్లో చోరీ జరిగింది. సోమవారం రాత్రి దొంగలు మల్లికార్జునస్వామి, ఎల్లమ్మ ఆలయాల తాళాలను పగలగొట్టి విగ్రహాలపై ఉన్న ఆభరణాలు, హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగలు పడిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శేఖర్రెడ్డి ఆలయాలను పరిశీలించారు. సక్రమంగా వ్యాధి నిరోధక టీకాలు సుల్తానాబాద్(పెద్దపల్లి): పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని జిల్లా వైద్యాధికారి వాణిశ్రీ సూచించారు. స్థానిక యాదవనగర్ హెల్త్ సబ్సెంటర్ను మంగళవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల ఎదుగుదల కోసం పౌష్టికాహారం అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పరీక్షలు చేసి చికిత్స అందించాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీరాములు, సిబ్బంది ఉన్నారు. దాడి ఘటనలో ఇద్దరిపై కేసుతంగళ్లపల్లి: యువకుడిపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఇందిరమ్మకాలనీకి చెందిన మంగళపల్లి పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తన స్నేహితుడితో కలిసి బైక్పై వెళుతున్నాడు. కాగా అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్ ఆపి వేగంగా ఎందుకు వెళ్తున్నావు అంటూ దాడికి దిగి కర్రతో కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. పవన్ కళ్యాణ్ తండ్రి నాగరాజు ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ఎఫ్సీఐ క్రాస్రోడ్ రాజీవ్ రహదారిపై సోమవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రద్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన కొట్నూరి రవి కూలీ పనుల నిమిత్తం ఎన్టీపీసీ ప్రాంతానికి వచ్చి ఎఫ్సీఐ క్రాస్రోడ్ నుంచి మేడిపల్లి రోడ్కు వెళ్లేందుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ విద్యానగర్కు చెందిన విక్టర్ తన బైక్తో రవిని ఢీకొన్నాడు. తలకు బలమైన గాయం కాగా చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. -
దావత్ షురూ!
‘తమ్మీ.. మన కులపెద్ద మనుషులతో మాట్లాడు.. దసరాకు యాటను కొనిస్త.. మీ కులసంఘంలోని ప్రతీఇంటికి పోగు చేరేలా నువ్వే చూసుకో.. ముఖ్యమైనోళ్లు ఉంటే చెప్పు.. వారికి క్వార్టర్ మందు కూడా ఇద్దాం.. ఎన్నికలప్పుడు ఓటుకు పైసలు గూడా ఇచ్చుడే.. కానీ గంపగుత్తగా ఓట్లు నాకే పడాలే.. మల్లా ఎవరికీ మాటివ్వకు’ – ఓ గ్రామానికి చెందిన సర్పంచ్ స్థానం ఆశావహుడి ఆఫర్ ‘అన్నా.. పార్టీలో కొన్నేళ్లుగా కష్టపడి పనిచేస్తున్న.. అధికారంలో ఉన్నా, లేకున్నా పార్టీతోనే ఉన్న.. ఇప్పుడు రిజర్వేషన్ కలిసొచ్చింది.. ఎమ్మెల్యే కూడా నాకు టికెట్ కన్ఫర్మ్ చేసిండు.. ఎంతఖర్చయినా పర్లేదు పెడత.. నాకు ఫుల్సపోర్ట్ జేస్తే.. జెడ్పీటీసీగా గెలుస్త’ – ముఖ్య నేతలతో దావత్ ఇస్తూ ఓ జెడ్పీటీసీ ఆశావహుడి వేడుకోలుసాక్షి పెద్దపల్లి: ఎన్నికలు అంటే సుక్క.. దసరా అంటే ముక్క.. ఇప్పుడు ఈ రెండు పెద్దపండుగలు కలిసే వచ్చా యి. పైగా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. పండుగ సందర్భంగా ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఆశావహులు ప్రలో భాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కులపెద్దలు, నలుగురిని ప్రభావితం చేసే కార్యకర్తలను మద్యంతో దావత్లు షురూ చేశారు. దసరా సందర్భంగా ఓటర్లకు మటన్పోగులు పంచిపెడుతూ ఖుషీ చేసేందుకు గ్రౌండ్వర్క్ చేసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్థానిక ఎన్నికలు జరిగే పల్లెల్లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరికొందరు దసరా పండుగ రోజు రావణవధ కార్యక్రమాన్ని తమ సొంత డబ్బుతో భారీఎత్తున నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. మామూళ్లతో ముచ్చెముటలు తెలంగాణలో అతి పెద్దపండుగ దసరాకు నేతలు, ఊరులో పలుకుబడి కలిగినవారు తమ అనుచరులకు, తమ వద్ద పని చేసుకునేవారికి పండుగ సందర్భంగా ఎంతోకొంత దావత్ చేసుకునేందుకు డబ్బు లు ఇస్తుంటారు. కొన్నేళ్లుగా ఇది ఆనవాయితీగా వస్తోంది. పండుగ సమయంలోనే ఎన్నికలు రావడడంతో అడిగిన ప్రతీఒక్కరికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు తలలు పట్టుకుంటున్నారు. ఊళ్లకు లిక్కర్.. యథేచ్ఛగా బెల్ట్షాప్ల రన్ దసరా పండుగ రోజు వైన్స్షాప్లు మూసిఉంటాయి. ఆరోజు మహాత్మా గాంధీ జయంతి కావడంతో మాంసం, మద్యం విక్రయాలు ఉండవు. దీంతో తొలుత లిక్కర్ను పల్లెల్లోని బెల్ట్షాపులకు తరలిస్తుండగా, మరికొందరు నేతలు వైన్స్ షాప్లకు అడ్వాన్స్ చెల్లించి క్వార్టర్స్ను తమకు నమ్మకస్తుడైన లీడర్లకు చెందిన నివాసాలు, వ్యవసాయ పొలాల్లోకి డంప్ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కోడ్ అమల్లోకి వచ్చినా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లెల్లో బెల్ట్షాపులు 24గంటలపాటు తెరిచే ఉంటున్నాయి. ఎన్నికల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతాయనే ఆశతో బెల్ట్షాపు వ్యాపారులు భారీగా మద్యం డంప్ చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.ఆశావహులు తమ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఆయా రాజకీయ పార్టీల్లోని ఆశావహులు.. కులసంఘాల ఆధారంగా మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కులంలో ఉన్నఓట్ల ఆధారంగా యాటలను కోయించి, ఇంటింటికీ మటన్ పోగులు పంపించేలా ప్లాన్ చేస్తున్నారు. పండుగపూట మచ్చిక చేసుకోకపోతే ఎన్నికల్లో ఫలితం బెడిసి కొడుతుందని.. ఒకరినిచూసి మరొకరు మద్యం, మాసం పంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎన్నికలు జరుగుతాయో, వాయిదా పడుతాయో అనే సందిగ్ధంలో ఉన్నా.. అశావహులు ఖర్చుకు భయపడకుండా వర్గాల వారీగా ఓటర్లను ఆకట్టుకునేందుకు వెనకాడడంలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 60 జెడ్పీటీసీ, 646 ఎంపీటీసీలు, 1,226 పంచాయతీల్లో ఐదు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. -
చెక్పోస్టులు.. ముమ్మర తనిఖీలు
● స్థానిక సంస్థల ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతమైన వాతవరణంలో నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం ప్రకటించారు. మంగళవారం కరీంనగర్ కమిషనరేట్లో పోలీసు, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రత్యేకంగా ఎన్నికల సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఆరు అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని అ న్నారు. ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టాలని సూచించారు. రౌడీషీటర్లను రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేస్తామన్నారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేల కన్నా ఎక్కువ నగదు వెంట తీసుకెళ్తే సీజ్ చేస్తామని తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్కు ఎంపికై న పోలీసులకు ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున రాజకీయ అల్లర్లు జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న దసరా పండుగ సందర్భంగా రామ్లీలా మైదానాలు, దుర్గామాత నిమజ్జన కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతామని తెలిపారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్ని కల కోసం పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, పనులపై విస్తృతస్థాయిలో ప్రచారం చే యాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించాలన్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కరీంనగర్ కు వస్తున్నారని తెలిపారు. బాస సత్యనారాయణరావు, సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని ఫ్లెక్సీలు తొలగింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు, వ్యాపార ప్రకటనలపై నగరపాలకసంస్థ చర్యలకు పూనుకుంది. పండుగలు, వ్యాపార ప్రచారంతో పాటు వివిధ సందర్భాల్లో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీలు, బ్యానర్లు నగరంలో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు నిత్యం దర్శనమిస్తున్నాయి. నగరంలోని కూడళ్లు, ప్రధాన రోడ్లలోని మెయిడిన్ల మధ్య ఫ్లెక్సీలు,బ్యానర్లు ప్రతిరోజు కనిపిస్తున్నాయి. డివైడర్ల మధ్యలోని విద్యుత్ స్థంభాలకు కూడా ఫ్లెక్సీలు కడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ప్రత్యేక రోజుల్లో రోడ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనిపించడం లేదు. దీంతో నగరపాలకసంస్థ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కఠిన చర్యలు తప్పవు పరిశుభ్రత, ట్రాఫిక్, నగర సుందరీకరణను కాపాడేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయి తెలిపారు. జంక్షన్లు, చౌరస్తాలు, పబ్లిక్ ప్రదేశాల్లో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం నిషేధమన్నారు. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లను మంగళవారం నగరపాలకసంస్థ అధికారుల ఆధ్వర్యంలో డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగించారు. జంక్షన్లు, చౌరస్తాల్లో కట్టిన పలు వ్యాపారసంస్థలకు మొత్తంగా రూ.15 వేలు జరిమానా విధించారు. -
ముందే దసరా ‘కిక్కు’
కరీంనగర్క్రైం: దసరా అంటేనే సందడి ఉంటుంది. వివిధ ప్రాంతాలకు ఉపాధినిమిత్తం వెళ్లినవారు స్వ గ్రామాలకు వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులతో సంబురాలు చేసుకుంటారు. మద్యం, మాంసం లేని దసరాను ఊహించుకోలేం. ఈ సారి దసరా గాంధీ జయంతి రోజు రావడం , అక్టోబర్ 2న మ ద్యం, మాసం దుకాణాల బంద్ నేపథ్యంలో ముందుగానే కొనుగోలు చేసిపెట్టుకుంటున్నారు. కొంతమంది దసరా ముందు రోజు లేదా తర్వాత రోజే పండుగ జరుపుకోవాలని నిర్ణయించుకుంటున్నా రు. గత వారం రోజుల నుంచే వైన్స్లు పెద్దఎత్తున స్టాక్ కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లావ్యాప్తంగా 94 వైన్స్లు ఉన్నాయి. కరీంనగర్ అర్బన్లో 21, రూరల్ సర్కిల్లో 26, హుజూరాబాద్లో 17, జమ్మికుంట సర్కిల్లో 16, తిమ్మాపూర్ సర్కిల్లో 14 దుకాణాలున్నాయి. వైన్స్లకు దసరా పండక్కి పెద్దఎత్తున గిరాకీ ఉంటుంది. గాంధీ జయంతి కావడంతో గిరాకీ తగ్గే అవకాశాలున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. గత వారం రోజుల నుంచి రూ.9 కోట్ల విలువైన లిక్కర్, రూ.14 కోట్ల విలువైన బీర్లు మద్యం డిపోల నుంచి వైన్స్లకు వెళ్లి నట్లు తెలిసింది. పండక్కి సుమారు రూ.35 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతాయని అంచనా. -
మండలానికి ఒక ఆర్వో
సాక్షిప్రతినిధి, కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు, రెండు విడతల్లో గ్రామ పంచాయతీలకు( సర్పంచ్, వార్డు సభ్యులు)ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ప్రతీ మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్వోను నియమిస్తున్నామని, మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని అన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల, అంబేడ్కర్ స్టేడియం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్లు, స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, దరావత్తు వివరాలు, ఎన్నికల వ్యయం, నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను గురించి అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే వివరించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నాంపల్లి శ్రీనివాస్, బాస సత్యనారాయణ, వాసాల రమేశ్, సిరాజ్ హుస్సేన్, మడుపు మోహన్, సాతినేని శ్రీనివాస్, మిల్కూరి వాసుదేవరెడ్డి, కే.మణికంఠ రెడ్డి, సయ్యద్ బర్కత్ అలీ, కల్యాడపు ఆగయ్య, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. -
పురాణ నిధి యాప్ ఆవిష్కరణ
కరీంనగర్ కల్చరల్: దేవతా స్త్రోత్రాలతోపాటు పురాణ గాథలన్నీ సామాన్యులకు సైతం అర్థమయ్యేలా రూపొందించిన ‘పురాణ నిధి’ యాప్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పండితులు మంగళంపల్లి వేణుగోపాలశర్మ, పురాణం మహేశ్వరశర్మతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం సంజయ్ పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. దేవతలు, హిందూ శాస్త్రాలకు సంబంధించి సామాన్యుల్లో నెలకొన్న అనేక సందేహాలను ఈ యాప్ ద్వారా నివృత్తి చేస్తుండటం సంతోషించదగ్గ పరిణామమన్నారు. మార్క్ఫెడ్ ఎదుట బీఆర్ఎస్ నిరసనకరీంనగర్: జిల్లాకేంద్రంలోని రాంనగర్లో ఉన్న మార్క్ఫెడ్ మైదానంలో రాంలీలా కార్యక్రమం నిర్వహించకుండా గేటుకు తాళం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. హరిశంకర్ మాట్లాడుతూ.. 15ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇప్పుడు కాంగ్రెస్ కావాలని అడ్డుకోవా లని చూస్తోందన్నారు. ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమమని, దీన్ని జరిపే బాధ్యత గణేశ్ ఉత్సవకమిటీదని పేర్కొన్నారు. మార్క్ఫెడ్ డీఎంకు సుడా చైర్మన్తో పాటు మంత్రి ఫోన్ చేసి వేడుకలు జరపకుండా చూడాలని ఆదేశించినట్లు ఆరోపించారు. వందలాది మంది పోలీసులను మోహరించినా కార్యక్రమం జరుగుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు పొన్నం అనిల్ కుమార్, ఏనుగు రవీందర్రెడ్డి, రెడ్డవేణి మధు, తిరుపతి నాయక్, బోనాల శ్రీకాంత్ పాల్గొన్నారు. రాంలీలాపై బీఆర్ఎస్ రాద్ధాంతంకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మార్క్ఫెడ్ మైదానంలో నిర్వహించే రాంలీలా కార్యక్రమంపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తే ఊరుకోమని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హెచ్చరించారు. రాంలీలా జరగకుండా మార్క్ఫెడ్ మైదానానికి తాళం వేశారని, కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారంటూ బీఆర్ఎస్ ఆందోళనచేయడాన్ని తప్పుపట్టారు. దసరా పండుగ రోజు కూడా రాజకీయ లబ్ధికి బీఆర్ఎస్ నాయకులు పాకులాడుతున్నారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. రావణాసుర విగ్రహ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని మార్క్ఫెడ్ అధికారులు గేట్కు తాళం వేశారని తెలి పారు. ఇందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులను బాధ్యులను చేయడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించాల్సి ందేనని స్పష్టం చేశారు. రాంలీలా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు నగరపాలకసంస్థ తరపున మార్క్ఫెడ్ మైదానంలో ఏర్పాట్లు చేసేది తమ ప్రభుత్వమేనన్నారు. అందరం కలిసి ప్రోటోకాల్ పాటించి, రాంలీల కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్నారు. మరోసారి గులాబీ జెండా ఎగరవేస్తాం హుజూరాబాద్ : హుజూరాబాద్ గడ్డపై మరో సారి గులాబీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ 42శాతానికి పెంచడానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికిందన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామన్నా రు. రైతులకు కనీసం యూరియా అందించని ప్రభుత్వానికి స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. జర్నలిస్టులకు ఇచ్చిన భూమి ఎస్సారెీస్పీది కాదన్నారు. ఎన్నికల కోసం ఈనెల 4న వీణవంక, హుజూరాబాద్, 5న ఇల్లందకుంట, జమ్మికుంట, 6న కమలాపూర్ మండలాల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు పాల్గొన్నారు. -
నాలుగు దశల్లో స్థానిక పోరు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లా స్థానిక సమరానికి రంగం సిద్ధమైంది. 33 రోజుల సుదీర్ఘ ప్రక్రియకు జిల్లాలోని 15 మండలాలు వేదికవనున్నాయి. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి రెండుదశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తరువాత రెండు దశల్లో సర్పంచి, గ్రామ సభ్యులకు నిర్వహించనున్నారు. మొదటి విడతలో హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధి లోని (6మండలాలు) ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, శంకరపట్నం, వీణవంక, సైదాపూర్ మండలాల్లో, రెండో విడతలో కరీంనగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని (9 మండలాలు) చిగురుమామిడి, చొప్పదండి, గంగాధర, గన్నేరువరం, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, మానకొండూర్, రామడుగు, తిమ్మాపూర్ మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అక్టోబరు 9 నుంచి నామినేషన్ల ప్రక్రియ.. సెప్టెంబరు 29న మొదలైన ఎన్నికల ప్రకియ అక్టోబరు 31 వరకు మొత్తం 33 రోజుల పాటు జరగ నుంది. ఫలితాలు వెలువడే 31వ తేదీ వరకు ఎన్నిక ల కోడ్ అమలులో ఉండనుంది. అక్టోబరు 9న తొలివిడత, అక్టోబరు 13న రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలవనుండగా, అదే గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ అక్టోబరు 21న తొలివిడత, అక్టోబరు 25న రెండో విడత ప్రారంభం కానుంది. ఇక ఫలితాల విషయానికి వస్తే.. తొలివిడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఫలితాలు నవంబరు 11న, రెండో విడత అక్టోబరు16న వెలువడనున్నాయి. గ్రామపంచాయతీ ఎన్నికలలో నవంబరు 4న తొలి విడత ఫలితాలు, నవంబరు 8న రెండో విడత ఫలితాలు వెలువడనున్నాయి. -
చెత్త కుప్పల్లో ఫోర్టిఫైడ్ రైస్
వెల్గటూర్: ప్రజలకు బలవర్ధకమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ను గుర్తు తెలియని వ్యక్తులు మండలకేంద్రంలోని పెద్దవాగు పక్కన చెత్త కుప్పల్లో పడేసి వెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. సుమారు 50కి పైగా ఫోర్టిఫైడ్ రైస్ సంచులను పడేసి వెళ్లారు. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్లో ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ–12 పుష్కలంగా ఉంటాయి. ఇందుకోసం మిల్లర్లకు ఫోర్టిఫైడ్ రైస్ను ప్రభుత్వమే అందిస్తుంది. బియ్యాన్ని మూడు నెలలవరకు మాత్రమే నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయమై తహసీల్దార్ శేఖర్ను వివరణ కోరగా.. గడువు ముగిసిన బియ్యాన్ని ఎవరో మిల్లర్లు ఇక్కడ పడేసి ఉంటారని తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామని, బియ్యం బహిరంగ ప్రదేశంలో పడేయడం ద్వారా పశువులు, ఇతర జీవులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని, జేసీబీతో గుంత తవ్వి అందులో పూడ్చి పెట్టామని తెలిపారు. -
స్థానిక సమరానికి బీజేపీ సై
కరీంనగర్ టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి బీజేపీ సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన కరీంనగర్ పార్లమెంట్ ప్రజల కోసం, కాషాయ జెండాను నమ్ముకున్న కార్యకర్తలను గెలిపించడం కోసం ఢిల్లీ ఎన్నికల్లోనే కాదు గల్లీ ఎన్నికల్లోనూ కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లా పరిషత్ పీఠాలపై కాషా య జెండా ఎగరేసి తీరుతాం అని స్పష్టం చేశారు. పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న కార్యకర్తలకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ టిక్కెట్లు ఇస్తామని ప్రకటించా రు. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే సర్వే టీంలు ఒక దఫా సర్వే పూర్తి చేశాయని, రిజర్వేషన్లు ఖరా రైన నేపథ్యంలో సర్వే టీంలు రంగంలోకి దిగాయని అన్నారు. రిజర్వేషన్ల మూలంగా టిక్కెట్లు రాకపోయినా నిరాశ చెందవద్దని, ఇతరత్రా పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడాన్ని బీజేపీ పక్షాన స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. -
వేధించినందుకే యువకుడి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో ఈనెల 27న ఎదురుగట్ల సతీశ్ (28) హత్యకు గురైన విషయం తెల్సిందే. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని సతీశ్ వేధించినందుకే యువతి బంధువులు హత్య చేసినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. రూరల్ సీఐ కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. రేచపల్లికి సతీశ్ 20రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆమెను తన ప్రేమికురాలని, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోవద్దంటూ పోస్ట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ఆమె కుటుంబ సభ్యులు ఈనెల 27న రాత్రి 7.30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న సతీశ్ను బయటకు తీసుకొచ్చి కారంపొడి చల్లి కర్రలతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను అదే గ్రామానికి చెందిన నాంతారి వినాజీ, నాంతారి శాంత, జలగా గుర్తించామని, సోమవారం 10 గంటల ప్రాంతంలో రేచపల్లిలో వారిని పట్టుకుని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఓ మైనర్ పరారీలో ఉన్నాడని వివరించారు. నిందితుల నుంచి రక్తపు మరకల దుస్తులు, హత్యకు ఉపయోగించిన కర్రలు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన రూరల్ సీఐ సుధాకర్, సారంగాపూర్ ఎస్సై గీతను అభినందించారు. పరారీలో మైనర్ డీఎస్పీ రఘుచందర్ వెల్లడి -
పకడ్బందీగా ‘స్థానిక’ ఎన్నికలు
● పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు ● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్/కరీంనగర్ అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి వివిధశాఖల ఉన్నతాధికారులతో సమీక్షించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పూర్తి చేయాలన్నా రు. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబర్ 11 వరకు ప్రక్రియ పూర్తి కానుందని వివరించారు. జిల్లాలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు. నామినేషన్ నుంచి ఓటింగ్, ఫలితాల వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఆర్వో బి.వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈవో శ్రీనివాస్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్బాబు, డీపీవో జగదీశ్, జెడ్పీ డిప్యూటీ సీఈవో పవన్, కలెక్టరేట్ ఏవో సుధాకర్ పాల్గొన్నారు. బతుకమ్మ నిమజ్జనం పాయింట్ల పరిశీలనకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో సద్దుల బతుకమ్మ పండుగకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అన్నారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా నగరంలోని రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, మానేరు డ్యాం, మార్కండేయనగర్, గౌతమీనగర్, లేక్ పోలీస్స్టేషన్, వేదభవన్, గోపాల్పూర్ తదితర ప్రాంతాల్లోని బతుకమ్మ నిమజ్జనం పాయింట్లను తనిఖీ చేశారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద లైటింగ్, బారికేడింగ్, తాగు నీటి సౌకర్యం సదుపాయాలు కల్పించామని తెలిపారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. సద్దుల బతుకమ్మను నగరవాసులు ఘనంగా జరుపుకొన్నారని ఆయన తెలిపారు. కమిషనర్ వెంట ఎస్ఈ రాజ్కుమార్, ఈఈ యాదగిరి తదితరులు ఉన్నారు. రోడ్డుపై చెత్త.. హోటల్కు జరిమానాకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో డంపర్బిన్ల వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న హోటల్ నిర్వాహకులకు నగరపాలకసంస్థ అధికారులు సోమవా రం జరిమానా విధించారు. నగరంలోని పలు చోట్ల డంపర్బిన్లు, అండర్ బిన్ల వద్ద రోడ్లపై చెత్త వేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతం దుర్వాసన వెదజల్లుతోంది. యూజర్ చార్జీలు చెల్లించి, నగరపాలకసంస్థ వాహనాల్లో చెత్త వేయాల్సి ఉండగా, కొంతమంది వ్యాపారులు ఆటోల్లో చెత్త తీసుకువచ్చి డంపర్బిన్ల వద్ద రోడ్లపై పడవేస్తున్నారు. బస్స్టేషన్ వెనుకాల ఉన్న డంపర్బిన్ వద్ద రోడ్డుపై చెత్త వేస్తున్న లావిస్ మండి హోటల్కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు నగరపాలకసంస్థ వైద్యాధికారి సుమన్ తెలిపారు. జరిమానా రశీదును హోటల్ నిర్వాహకులకు అందించారు. కరీంనగర్రూరల్: కరీంనగర్ నియోజకవర్గంలో అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలి చాల రాజేందర్రావు అన్నారు. సోమవారం కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్రావుతో కలిసి మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ప్రభుత్వం క రీంనగర్ నియోజకవర్గానికి 4వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, అదనంగా మరో 4వేల ఇళ్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలిపారు. దసరా పండుగ అనంతరం ల బ్ధిదారులందరూ ఇంటి నిర్మాణాలు ప్రారంభించాలని సూచించారు. నాయకులు కూర నరేశ్రెడ్డి, బుర్ర స్వామి, నారా యణ, మడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
బతుకమ్మపై మాజీ సీఎం కేసీఆర్ పేరు
బీఆర్ఎస్ నాయకుడు, సెస్ మాజీ డైరెక్టర్ కుంబాల మల్లారెడ్డి బతుకమ్మపై రంగులతో మాజీ సీఎం కేసీఆర్ పేరును అద్ది అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన మల్లారెడ్డి– సుమలత దంపతులు బతుకమ్మను పేర్చి కేసీఆర్ పేరు వచ్చేలా తీర్చిదిద్ది అబ్బురపర్చారు. గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు బతుకమ్మను చూసి సంబరపడ్డారు. – ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) బతుకమ్మపై సీఎం కేసీఆర్ పేరుతో అభిమానం చాటుకున్న మల్లారెడ్డి -
అబుదాబిలో పూలపండుగ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అబుదిబిలోని తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఇండియా అండ్ సోషల్ కల్చర్ వేదికగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యలో ఉత్సవాలు నిర్వహించారు. యుఏఈలోని భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ కమ్యూనిటీ వెల్ఫేర్ కో ఆర్డినేషన్ జార్జీజార్జ్ ముఖ్య అథితిగా హాజరయ్యారు. ప్రతినిధులు జయచంద్రన్ నాయర్, షాజీ వీకే, సర్వోత్తమ్ శెట్టి, విజయ్ మానె, దివాకర్ ప్రసాద్, వినాయక్ అవాటె తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ కవి, గాయకుడు కోకిల నాగరాజు, యువగాయని సోని యాదర్ల బతుకమ్మ ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ఉత్సవ నిర్వాహకులు రాజా శ్రీనివాస్రావు, గంగారెడ్డి, వంశీ, సందీప్, గోపాల్, సతీశ్, పావని, అర్చన, దీప్తి, పద్మజ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
ఇందిరమ్మ లబ్ధిదారులకు ఉపాధి
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం బాసటగా నిలువాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇళ్లనిర్మాణాలకు ఉపాధి హామీ పథకా న్ని అనుసంధానించింది. జాబ్కార్డు ఉన్నవారికి 90 రోజులు పని కల్పించి అ వేతన డబ్బులు వారి ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదా రుకు జాబ్కార్డు ఉంటే రోజు కూలీ రూ.307కు గానూ గరిష్టంగా 90 రోజుల ఉపాధి పనులకు రూ.27,630 ఖాతాలో జమ చేస్తారు. స్వచ్ఛభారత్ కింద మరుగుదొడ్డి నిర్మించుకుంటే రూ.12వేలు అందించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు రాగా జిల్లాలో 542 మంది లబ్దిదారులకు జాబ్ కార్డులున్నట్లు తేలింది. వివిధ దశల్లో చేయూత జిల్లాలో 8,219 లబ్ధిదారులకు ప్రభుత్వం ఇందిర మ్మ ఇళ్లను మంజూరు చేసింది. 30శాతం మంది పనులు ప్రారంభించారు. జాబ్కార్డు ఉన్నవారికి ఉపాధి హామీ పఽథకం కింద ఇందిరమ్మ ఇల్లు పునాదిస్థాయి వరకు 40రోజులు, స్లాబ్ వేసేవరకు 50 పని దినాలు మొత్తం 90 రోజులు పనులు కల్పిస్తారు. వేతన చెల్లింపులకు నిర్మాణ పనుల్లో మూడుస్థాయిల్లో లబ్ధిదారు ఫొటోలను తీసుకుని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరిస్తే లబ్ధిదా రు ఖాతాలో వేతన డబ్బులు జమవుతాయి. -
అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడు మృతి
పెగడపల్లి: మండలంలోని నామాపూర్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) ఐలయ్య (38) చికిత్స పొదుతూ మృతి చెందాడు. ఈనెల 25న మల్యాలలో జరిగిన ఎన్నికల శిక్షణలో పాల్గొన్న ఆయన అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని చికిత్స నిమిత్తం జగిత్యాలలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఐలయ్యకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఐలయ్య మృతిపై తపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవయ్య, బోయినపల్లి ప్రసాద్రావు సానుభూతి తెలిపారు. ఐలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. పోతారంలో వివాహిత అదృశ్యంమల్యాల: మండలంలోని పోతారానికి చెందిన దాసరి లత అదృశ్యమైనట్లు ఆమె భర్త రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. రవీందర్ ఈనెల 25న మర్రిపల్లిలో ఉన్న తన కూతురు ఇంటికి కొడుకుతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపటికే ఆయన భార్య లత ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో రవీందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంథనిరూరల్: పట్టణంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్నుంచి అక్రమంగా తరలిస్తున్న యూరియాను అడవిసోమన్పల్లి చెక్పోస్ట్ వద్ద అధికారులు పట్టుకున్నారు. యూరియా అక్రమ రవాణాను నియంత్రించేందుకు అడవిసోమన్పల్లి వద్ద చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అయితే, సోమవారం ఓ మినీ వాహనంలో సుమారు 50 యూరియా బస్తాలు తరలిస్తుండగా సిబ్బంది తనిఖీ చేశారు. వాహనాన్ని అదుపులోకి తీసుకుని మంథనికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సదరు యజమానికి జరిమానా విధించారు. ఇందిరమ్మ చీరలు ఎక్కడ?● ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ● బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు జగిత్యాల: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి గద్దెనెక్కిన అనంతరం ప్రజలను విస్మరిస్తోందని, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని, రూ.800 బతుకమ్మ చీరలు ఎక్కడిచ్చారని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్రావు ప్రశ్నించారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ను తిట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రూ.4 వేల పెన్షన్, రైతులకు బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చి ఒక్కటీ సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఎక్కడ అని ప్రశ్నించారు. మాజీ కౌన్సిలర్ దేవేందర్నాయక్, ప్రధాన కార్యదర్శి ఆనందరావు, ఉపాధ్యక్షుడు వొల్లం మల్లేశం, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం తప్పదు మెట్పల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో భంగపాటు తప్పదని విద్యాసాగర్రావు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల నాయకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. ఐక్యంగా పని చేస్తే అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని పేర్కొన్నారు. -
విశ్వవిపణిలోకి సింగరేణి
గోదావరిఖని: దసరా పండగకు ముందే ప్రభుత్వం సింగరేణికి శుభవార్త చెప్పింది. ఫ్యూచర్ సిటీలో పదెకరాలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సభలో ప్రకటించడంతో ప్రపంచస్థాయి వ్యాపార విస్తరణకు మార్గం సుగమమైనట్లయ్యింది. అయితే, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తిచేస్తేనే స్థలం అప్పగిస్తామని సీఎం కండిషన్ పెట్టారు. ప్రపంచస్థాయి సంస్థలతో పోటీపడే అవకాశం సింగరేణికి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహారత్న కంపెనీలకు దీటుగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సింగరే ణి వరుస లాభాలతో మహారత్న కంపెనీలకు ధీటు గా ముందుకు సాగుతోంది. సుమారు 41వేల మంది పర్మినెంట్, మరో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులతో ఏటా 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. దీంతోపాటు సోలార్, థర్మల్ విద్యుత్ రంగాల్లోనూ దూసుకెళ్తోంది. రాబోయే రోజుల్లో వ్యాపారాలను మరింతగా విస్తరించేందుకు యోచిస్తోంది. ఇప్పటికే గోల్డ్, మెటల్ మైన్స్ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిఉంది. క్లిటికల్ మినరల్ పరిశోధనలోనూ ముందుకెళ్తోంది. రామ గుండం రీజియన్లోని మేడిపల్లి ఓసీపీలో హైడ్రోపవర్ ఉత్పత్తికి కూడా ప్రయోగ్మాకంగా సిద్ధమైంది. ఇతర రాష్ట్రాలకూ విస్తరణ.. సింగరేణి తెలంగాణతోపాటు పలురాష్ట్రాల్లో వ్యాపార విస్తరణ కొనసాగిస్తోంది. గోల్డ్, కాపర్ అన్వేషణ కోసం కర్నాటక రాష్ట్రంలోని దేవదుర్గలో పరిశోధనకు లైసెన్స్ పొందింది. ఒడిశా నైనీబ్లాక్లో భారీ ప్రాజెక్టు ప్రారంభించి బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. పదెకరాల్లో కార్పొరేట్ కార్యాలయం.. సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉంది. కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్లో ఉంది. వ్యాపార విస్తరణకు అనుగుణంగా కార్యాలయాన్ని కూడా విస్తరించేందుకు ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం స్థలం కేటాయించినట్లు తెలుస్తోంది. సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ కనెక్టివి కల్పించారు. నెట్జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ, వాణిజ్య, వసతి, పారిశ్రామిక, వినోదం ప్రాంతాలు అనుసంధానంగా ఫ్యూచర్ సిటీ ఉంటుంది. అందులో పదెకరాలు కేటాయించడం సింగరేణికి శుభసూచకమని నిపుణులు పేర్కొంటున్నారు. -
ఎకై ్సజ్ ఎస్సై నుంచి ఎంపీడీవో వరకు..
చిగురుమామిడి: కొండాపూర్ గ్రామానికి చెందిన బింగి సాయికీర్తన ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సీఎం రేవంత్రెడ్డి నుంచి నియామకపుపత్రం అందుకున్నారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె.. గ్రూపు– 2 ద్వారా ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. అంతటితో ఆగకుండా గ్రూప్–1 పరీక్ష రాసి ఎంపీడీవోగా ఎంపికయ్యారు. నిజామాబాద్లో బీడీఎస్ పూర్తిచేసి.. ఏడాదిపాట ప్రాక్టీస్ చేసినా సంతృప్తి చెందలేదలేదు. ఏడాదిపాటు ఆన్లైన్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాసి.. ఎంపీడీవో ఉద్యోగం సాధించారు. సాయికీర్తన తల్లిదండ్రులు సరోజన– సంపత్కు సాయికీర్తనకు ఒక తమ్ముడు ఉన్నాడు. -
ఇక సంగ్రామమే..
జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం జెడ్పీ చైర్మన్ కరీంనగర్ 03 00 06 06 15 బీసీ(జనరల్) సిరిసిల్ల 03 01 05 03 12 ఎస్సీ(జనరల్) జగిత్యాల 04 01 09 06 20 మహిళ(జనరల్) పెద్దపల్లి 06 03 00 04 13 మహిళ(జనరల్)సాక్షిప్రతినిధి, కరీంనగర్: సా్థనిక ఎన్నికలకు నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీతోపాటు గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. తొలుత రెండు దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. తదుపరి మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. వచ్చే నెల 9నుంచి నవంబర్ 11వరకు ఎన్నికల పక్రియ కొనసాగనుంది. 33 రోజుల పాటు కోడ్ అమల్లో ఉండనుంది. పల్లెల్లో రాజకీయ సందడి జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించగా, ఆశావహులు ఒక్కచాన్స్ ఇవ్వండంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంకు భిన్నంగా... ఎప్పుడైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చే శాక, పంచాయతీ ఎన్నికలు నిర్వహించేవారు. ఈసారి రెండు ఎన్నికలను కలిపి నిర్వహిస్తుండటంతో పోటీ చేసి ఓడిపోతే ఇంట్లోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆశావహులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 646 ఎంపీటీసీ, 60 ఎంపీపీ, 60 జెడ్పీటీసీలకు, 1,226 సర్పంచ్ స్థానాలకు, 5,968 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం సీట్ల ల్లో 50శాతం తగ్గకుండా మహిళలకు కేటాయించారు. ముగ్గురు పిల్లలుంటే అనర్హులే.. కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు 1994లో పంచాయతీరాజ్ చట్టంలో ఈ నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం ముగ్గురు పిల్ల లుంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. తాజాగా ప్రభుత్వం ఈ నిబంధన ఎత్తివేయాలని ఆలోచించినా పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 21(3)ని సవరించలేదు. దీంతో ముగ్గురు పిల్లలు నిబంధన యథాతథంగా ఉండనుంది. కోర్టులో ఉండడంతో.. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రామచంద్రపల్లి, కుర్మపల్లి గ్రామాల విషయం కోర్టు పరిధిలో ఉండగా రిజర్వేషన్ ప్రక్రియ చేపట్టలేదు. మరోవైపు జిల్లా రిజర్వేషన్ల ప్రక్రియ వివరాలు వెల్లడించేందుకు జిల్లా పంచాయతీ అధికారి, డీపీఆర్వో సుముఖత చూపలేదు.జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 03 00 06 06 15 సిరిసిల్ల 03 01 05 03 12 జగిత్యాల 04 01 08 07 20 పెద్దపల్లి 05 03 00 05 13జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం సిరిసిల్ల 53 30 101 76 260 జగిత్యాల 68 31 153 133 385 పెద్దపల్లి 54 06 110 93 263 కరీంనగర్ – – – – –జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మొత్తం కరీంనగర్ 39 00 73 58 170 సిరిసిల్ల 25 07 56 35 123 జగిత్యాల 26 07 52 41 126 పెద్దపల్లి 25 03 59 50 137 -
మొదటి ప్రయత్నంలోనే..
రాయికల్(జగిత్యాల): రాయికల్ పట్టణానికి చెందిన ఆర్మూర్ శివకుమార్ జీఏడీ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం సాధించాడు. స్థానికంగా పదో తరగతి, కరీంనగర్లో ఇంటర్, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదివాడు. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడంపై గ్రామస్తులు అభినందించారు. యైటింక్లయిన్కాలనీ(రామగుండం): యైటింక్లయిన్కా లనీకి చెందిన సింగరేణి కార్మికుడు వేణుగోపాల్రా వు కుమార్తె భావన గ్రూ ప్–2లో ఎంపీవో ఉద్యోగం సాధించింది. గ్రూప్–4లో సత్తాచాటి పెద్దపల్లి జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్గా అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తోంది. జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని విలా సాగర్ గ్రామానికి చెందిన కుడుతాల శ్రీరామ్ 203వ ర్యాంక్ సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యా డు. అలాగే పట్టణంలోని అ గ్నిమాపక కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామానికి చెందిన కొత్తరాజు సత్తాచాటి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రూపు–1 సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
ఆరు ఉద్యోగాల అశ్విని
సారంగాపూర్(జగిత్యాల): బీర్పూర్ మండలం తాళ్ళధర్మారం గ్రామానికి చెందిన శనిగారపు అశ్విని గ్రూప్– 2 ఫలితాల్లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. తల్లిదండ్రులు మల్లయ్య, లక్ష్మి. వ్యవసాయ కుటుంబం. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ తరగతి, తుంగూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదివింది. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్, ఉస్మానియాలో ఎంటెక్ చేసి, ప్రభుత్వ ఉద్యోగ సాధనకు ప్రణాళితో చదివింది. మొదట పంచాయతీ సెక్రటరీ, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, రైల్వే ఎస్సై, సివిల్ ఎస్సై ఉద్యోగాలు సాధించింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ట్రైనీ ఎస్సైగా శిక్షణ పొంది అక్కడే బాధ్యతలు చేపట్టింది. అనంతరం వరంగల్ సీఐడీ విభాగానికి బదిలీపై వెళ్లి గ్రూప్– 1కు ప్రిపేర్ అయ్యింది. ప్రస్తుతం గ్రూప్– 2లో ఎకై ్సజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా అశ్విని సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనతోనే తాను ఈ స్థాయికి చేరానని చెప్పింది. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
కరీంనగర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని ఆపార్టీ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగెల్లి లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీల పదవీకాలం ముగిసి దాదాపు 20 నెలలు అవుతుందని, దీంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కేంద్ర నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయన్నారు. జిల్లాలో అత్యధికంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు గెలుచుకునేందుకు ఇప్పటినుంచి అన్ని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
‘లయ’ తప్పుతోంది!
● వయస్సుతో సంబంధం లేకుండా.. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని గుండె జబ్బు ప్రస్తుతం వేధిస్తోంది. వాతావరణ కాలుష్యం, మారిన జీవనశైలి, ఒత్తిడితో కూడిన పని విధానం, సరైన నిద్రలేకపోవడం, ధూమపానం తదితరాలు దీనికి కారణభూతమవుతున్నాయి. జిల్లాలో గుండెపోటు రోగులు ఎక్కువవుతున్నారు. హృద్రోగ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా గుండెపోటుతో క్షణంలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇటీవల కాలంలో 20 ఏళ్లు నిండినవారికి సైతం గుండెపోటు వచ్చి మరణించడం కలకలం రేపుతోంది. చిన్నతనం నుంచే తగు జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. ● జిల్లాలో 3.5 లక్షల మంది హృద్రోగులు జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా జనాభాలో ఇది దాదాపు 15 శాతం కావడం ఆందోళన కలిగిస్తోంది. హృద్రోగ సమస్యలతో నిత్యం వెయ్యి మంది రోగులు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 15 మంది నిపుణులు రోగులకు సేవలందిస్తున్నారు. ● గోల్డెన్ హవర్ కీలకం ఛాతిలో నొప్పి వస్తే ఒక్కోసారి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వల్ల వచ్చిందా లేదా గుండెపోటా.. అనేది గుర్తించడం కష్టం. వీపు ప్రాంతం నుంచి భుజం మీదుగా ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు.. చెమటలు పట్టి శరీరం చల్లగా అయిపోతున్నట్లు ఉంటే దాన్ని గుండెపోటుగా భావించాలి. ఇలా నొప్పి వచ్చినప్పుడు మొదటి గంటలో వైద్యం అందిస్తే రోగి తక్షణమే కోలుకుంటారు. దీన్నే గోల్డెన్ హవర్ అంటారు. అయితే మొదటి గంటలో ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు యాస్ప్రిన్ మాత్రలతో కూడిన మూడు మాత్రల కిట్ నమిలి మింగాలి. ఇలా చేస్తే గుండె జబ్బు సగం తగ్గిపోతుంది. ఒక వేళ గుండెనొప్పి కాకపోయినా యాస్ప్రిన్ మాత్ర వేసుకున్నా నష్టం జరగదు. ఆస్పత్రికి వెళ్లాక పరీక్షలు చేసి చికిత్స ద్వారా ప్రాణాపాయాన్ని నివారించొచ్చు. ● ఆధునిక జీవన విధానమే కారణం గుండె వ్యాధులకు ప్రధాన కారణం ఆధునిక జీవన విధానమే. తగిన శారీరక శ్రమలేకపోవడం, జంక్ ఫుడ్స్, తగిన విశ్రాంతి తీసుకోకపోవడం, నిద్రలేమి, అతిగా ఆయిల్ ఫుడ్ తీసుకోవడం, ఊబకాయం, మ ధుమేహం నియంత్రణలో లేకపోవడం తదితరాలు దీనికి కారణమవుతున్నాయి. పర్యావరణం కాలు ష్యం, ధూమపానం కూడా ఓ కారణమవుతోంది. కరీంనగర్టౌన్: గుండెపోటు.. ఈ పదం వింటేనే ఎంతో మందికి వణుకు పుడుతోంది. ఇది పెద్దలకే వస్తుంది.. మనకేంటనే ధీమా చాలా మంది నడివయస్కులు, యువతలో ఉండేది. అయితే మారుతున్న జీవనశైలి, వ్యాయామం లేకపోవడం, ధూమపానం, ఒత్తిడితో కూడుకున్న పని వాతావరణం తదితర కారణాలతో దాదాపు అందరికీ ఈ ముప్పు ప్రస్తుతం పొంచి ఉంది. గుండె రక్తనాళాలు మూసుకుపోవడంతో హార్ట్ అటాక్కు గురై ఇట్టే కుప్పకూలి మృత్యువాతపడుతున్నారు. ఈ తరుణంలో హృద్రోగ సమస్యలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తోంది. జిల్లాలో పెరుగుతున్న హృద్రోగ బాధితులు యువతలోనూ తీవ్రమవుతున్న సమస్య చిన్నతనం నుంచే జాగ్రత్తలు అవసరం నేడు వరల్డ్ హార్ట్ డేగతానికి భిన్నంగా యువతలోనూ గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. జంక్ ఫుడ్స్, ధూమపానానికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 45 నిమిషాలు నడవాలి. 30 ఏళ్లు నిండినవారు ఏడాదికోసారైనా కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి. బీపీ, షుగర్ను అదుపులో ఉంచుకోవాలి. ఛాతిలో మంట, నొ ప్పి లాంటి సమస్యలుంటే దగ్గరలోని డాక్టర్ను సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. కనీసం ఏడు గంటలైనా నిద్రపోవాలి. – డాక్టర్ వాసుదేవరెడ్డి, కార్డియాలజిస్టు -
ఇంటర్వ్యూకి వెళ్లి అనంతలోకాలకు..
● రైలు ప్రమాదంలో యువకుడి దుర్మరణం వీణవంక(హుజూరాబాద్): ఇంటర్వ్యూ కోసం వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వీణవంక మండలకేంద్రానికి చెందిన గడ్డం సాయికృష్ణ(29)హైదరాబాద్లో సీఏ పూర్తి చేశాడు. రెండురోజుల క్రితం ఓ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం విశాఖపట్నం వెళ్లాడు. అక్కడి నుంచి ఓ ఫంక్షన్ కోసం శనివారం విజయనగరానికి రైలులో వెళ్తుండగా ప్రమాదవాశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబీకులకు రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారు. కాగా ఇంటర్వ్యూ వద్దని తల్లిదండ్రులు చెప్పినా జాబ్ కోసమని వెళ్లిన చయువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. కోతులను వెళ్లగొట్టబోయి వ్యక్తి..కోనరావుపేట(వేములవాడ): కోతులను వెళ్లగొట్టే క్రమంలో కిందపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన బొడ్డు రాజయ్య(60) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఇంటి వద్ద ఉండగా కోతుల గుంపు ఇంటిపైకి రావడంతో వాటిని వెళ్లగొట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా అవి మీదకి రావడంతో గట్టిగా కేకవేసి కుప్పకూలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. గ్రామంలో కొన్ని నెలలుగా కోతులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని, కోతుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఒకరి మృతికరీంనగర్క్రైం: కరీంనగర్లోని హుస్సేనిపురకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మృతిచెందాడు. త్రీటౌన్ పోలీసులె తెలిపిన వివరాల ప్రకారం.. హుస్సేనిపురకు చెందిన షేక్ ముజాయిద్ హుస్సెన్(52)కు భార్య మసేహా సుల్తానా, కూతురు, కొడుకున్నారు. రెగ్జిన్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 26వ తేదీన పెద్దపల్లిలో బంధువులు శుభకార్యానికి ముగ్గురు వెళ్లారు. షేక్ ముజాహిద్ హుస్సెన్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. 27వ తేదీన ఉదయం ఇంట్లోవాళ్లకు ఫోన్ చేసి మాట్లాడాడు. తరువాత ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆదివారం ఉదయం చూసేసరికి మృతిచెంది ఉన్నాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
నేడు సద్దుల బతుకమ్మ
కరీంనగర్కల్చరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బతుకమ్మ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. మహిళలంతా ఒక చోట చేరి ఆనందంగా గడిపే పండుగ. పెత్రమావాస్య నుంచి మొదలై దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. మహిళలంతా కలిసి బతుకమ్మను దగ్గరలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేస్తారు. సోమవారం సద్దుల బతుకమ్మ సందర్భంగా కథనం. పూలు.. పాటలు.. ప్రసాదం ప్రకృతిలో లభించే తంగేడు, గునుగు, కట్ల, గోరంట, గుమ్మడి, రుద్రాక్ష, మందార, గన్నేరు, సీతజడ పూలతో బతుకమ్మను పేర్చుతారు. తొమ్మిది రోజుల పాటు రోజుకో రకం ప్రసాదం తయారు చేస్తారు. చివరిరోజు ఆడిపాడిన తర్వాత బతుకమ్మను తీసుకొని చెరువు వద్దకు వెళ్లేటప్పుడు ప్రసాదంగా నువ్వులు, పల్లీలతో సత్తుపిండి, తులసీ దళాలు మొదలైనవి తీసుకెళ్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం ఒకరికొకరు సత్తుపిండితో పాటు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. బతుకమ్మ పండుగలో పూలకెంత ప్రాధాన్యం ఉందో పాటలకూ అంతే ఉంది. బతుకమ్మ పాటలన్నీ సరళమైన భాషతో, రాగయుక్తమైన శైలితో బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైనవి. వీటిలోని సాహిత్య విలువలు అమూల్యమైనవి. జానపద, చార్రితక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలు ఈ పాటల్లో ప్రధాన వస్తువులు. చివరి రోజు రెండు బతుకమ్మలు తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో సాగే వేడుకల్లో చివరి రోజు సద్దుల బతుకమ్మ నాడు మాత్రం రెండు బతుకమ్మలు పేరుస్తారు. ముఖ్యంగా మన ఇళ్లలో ఆడబిడ్డకు వివాహం చేసి, అత్తారింటికి సాగనంపినప్పడు తోడు పెళ్లి కూతురుగా మరొకరిని పంపిస్తాం. ఇదే సంప్రదాయాన్ని బతుకమ్మ పండుగలోనూ కొనసాగిస్తున్నారు. నిమజ్జనం రోజు పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా భావించి పూలతో అందంగా పేర్చి సాగనంపుతారు. -
దూలూర్ యువకుడి తీన్మార్
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం దూలూర్ గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ గ్రూప్స్ ఫలితాల్లో మూడుసార్లు సత్తాచాటాడు. గ్రూప్–2లో సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఇటీవల గ్రూప్–3 ఫలితాల్లో సత్తా చాటి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం గ్రూప్–4 ద్వారా ఎంపికై జగిత్యాలలోని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. శ్రీనివాస్ తండ్రి ఆకుల లక్ష్మీనర్సయ్య మేడిపెల్లి ఎంఈవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
కరీంనగర్ అర్బన్: జిల్లాలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందనే వాతావరణ శాఖ సూచనలు, జిల్లాలోని పలు చోట్ల సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్న సందర్భంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు గమనించి ప్రజావాణికి రావద్దని సూచించారు.నాలుగు జెడ్పీస్థానాలు మాదిగలకు కేటాయించాలి కరీంనగర్: ప్రభుత్వం స్థానిక సంస్థల రిజర్వేషన్లు ప్రకటించిన నేపథ్యంలో ఆరు జిల్లా పరిషత్ స్థానా ల్లో నాలుగు మాదిగ సామాజికవర్గానికి కేటాయించాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లాకేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్కపల్లి రాజేందర్ అధ్యకతన జరిగిన మాదిగ హక్కుల దండోరా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు పెరుమాండ్ల రామకృష్ణతో కలిసి మాట్లాడారు. మాదిగలకు వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు, నామినేట్ పదవుల్లో వాటా దక్కాలని కోరారు. మొండి చేయి చూపిస్తే ఆ పార్టీల ఓటమికి మాదిగ హక్కుల దండోరా పని చేస్తోందన్నారు. రాష్ట్ర మహిళా విభాగ సమన్వయకర్త అందేలా భవానిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎలుకటి జనార్దన్, ఖవంపల్లి రవి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేతరి రోజా రాణి, జిల్లా అధ్యక్షుడు మాట్ల రమేష్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మంతెన స్వామి, చిలుక రాజేశం, సప్పిపోచన్న, తాటిపల్లి బాపు పాల్గొన్నారు. -
బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు
కరీంనగర్ కార్పొరేషన్: సద్దుల బతుకమ్మకు నగరపాలకసంస్థ ఏర్పాట్లు పూర్తి చేసింది. పండుగకు ఇప్పటికే రూ.కోటి 50 లక్షలతో 32 పనులకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా, కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు. ఇంజినీరింగ్ అధికారులు డివిజన్లవారీగా పనులు పర్యవేక్షిస్తున్నారు. నగరంలోని ఎల్ఎండీ కట్ట, వేదభవన్, తీగలవంతెన, బొమ్మకల్, కిసాన్నగర్, రేకుర్తి, కొత్తపల్లి, చింతకుంట, దుర్శేడ్, గోపాల్పూర్, గౌతమినగర్ తదితర నిమజ్జన పాయింట్ల వద్ద ఏర్పాట్లు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థలాలను చదును చేయడంతో పాటు, వరుసగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు అధ్వానంగా మారడంతో, గుంతల్లో స్టోన్డస్ట్ పోస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద, బతుకమ్మ ఆడే ప్రధాన ప్రాంతాల్లో మాత్రమే డస్ట్ పోస్తుండడం, రోడ్లు మాత్రం అలానే ఉండడంపై నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిమజ్జనపాయింట్ల వద్ద లైటింగ్ ఏర్పాటు చేశారు. దసరా రోజు రాంలీలా జరిగే మైదానాల్లో వేదికలతో పాటు , భారీగా లైట్లు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్ నుంచి లైట్లు తెప్పించారు. రేకుర్తిలోని పెంటకమ్మ చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి పరిశీలించారు. -
ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్కు..
కరీంనగర్ అర్బన్: భూ భారతి ఆపరేటర్లకు ప్రభుత్వం తీపికబురు అందించింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లు ధరణి ఆపరేటర్లుగా వ్యవహరించిన వారంతా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహించారు. కలెక్టరేట్తో పాటు అన్ని తహసీల్దా ర్ కార్యాలయాల్లో ఒక్కో ఆపరేటర్ విధులు నిర్వహిస్తున్నారు. భూ క్రయ, విక్రయాల్లో స్లాట్ ప్రక్రి య అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వీరిదే కీలకపాత్ర. జిల్లాలో 16మంది ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ ఉండగా గతంలో ధరణి ఆపరేటర్లుగా పిలిచేవారు. ఏజెన్సీ ద్వారా రూ.12వేల జీతభత్యాలు ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి వచ్చేవి. ఉద్యోగానికి భద్రత లేని దుస్థితి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలను పెంచడంతో పాటు ఏజెన్సీ పర్యవేక్షణ నుంచి తొలగించింది. ఔట్ సోర్సింగ్ కాకుండా టీజీటీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. వేతనాన్ని రూ.28వేలకు పెంచగా కటింగ్లు పోనూ రూ.19వేల వరకు వచ్చే అవకాశముంది. ఇక ధరణి ఆపరేటర్ కాకుండా భూ భారతి ఎఫ్టీఎస్గా పిలవనున్నారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలోని 16మందికి భరోసా లభించింది. ప్రభు త్వ నిర్ణయంతో సదరు ఉద్యోగులు భూభారతి జిల్లా కో ఆర్డినేటర్ బొల్లం వెంకటరాజన్న నేతృత్వంలో ఆదివారం సంబరాలు నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్జతలు తెలిపారు. భూభారతి ఆపరేట ర్లు నరేశ్, వినయ్, విక్రమ్, ఆంజనేయులు, మౌని క, అజయ్, రాజశేఖర్, శ్వేత, వినయ్, శ్రీధర్, విక్ర మ్, కిరణ్, సాగర్, సత్యానందం, దేవేందర్, అనిల్కుమార్, రాము, జి.అనిల్కుమార్ పాల్గొన్నారు. -
గీత కార్మికుడి ఇంట ఎకై ్సజ్ ఎస్సై
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని పోతుగల్కు చెందిన బత్తిని అంజాగౌడ్, అండాలు రెండో కుమారుడు రఘు గ్రూప్–2లో 600 మార్కులకు 384 సాధించి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యాడు. తండ్రి గీత కార్మికుడు, తల్లి బీడీ కార్మికురాలు. ముస్తాబాద్లో పదో తరగతి, సిద్దిపేటలో ఇంటర్, కరీంనగర్లో బీటెక్ 2014లో పూర్తి చేశాడు. మొదట అటవీశాఖలో బీట్ ఆఫీసర్గా ఎంపికయ్యాడు. అనంతరం గ్రూప్–4, పంచాయతీ కార్యదర్శి, రైల్వేస్, కేంద్ర ప్రభుత్వ ఎస్ఎస్సీలాంటి ఉద్యోగాలు సాధించాడు. వీఆర్వో జాబ్ ఎంచుకుని ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టరేట్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. -
‘అమృత్ భారత్’ ఇక రెగ్యులర్
రామగుండం: ఉత్తర భారత్ నుంచి వచ్చే వల స కార్మికుల కోసం దక్షిణ మధ్య రైల్వే అమృత్భారత్ గతంలో ప్రత్యేక రైలు(05293/94)ను ప్రారంభించింది. ముజాఫర్పూర్ – చర్లపల్లి మధ్య ప్రస్తుతం ఈ రైలు రాకపోకలు సాగిస్తోంది. అక్టోబర్ 14 నుంచి దీన్ని రెగ్యులర్గా నడిపిస్తారు. 14న ముజాఫర్పూర్లో ప్రారంభమై మరుసటి రోజు చర్లపల్లికి చేరుకుంటుంది. అక్టోబర్ 16న చర్లపల్లిలో ప్రారంభమై మరుసటిరోజు ముజాఫర్పూర్ చేరుకుంటుంది. కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్ పూర్కాగజ్నగర్లో ఆగుతుంది. దీనికి 22 బోగీలుంటాయి. 11 అన్ రిజర్వుడు, 8 స్లీపర్, 2 ఎస్ఎల్ఆర్, ఒక లగేజీ కోచ్లు ఉంటాయి. పుష్పుల్ మోడ్ ఆపరేటింగ్ విధానంతో రాకపోకలు సాగిస్తుంటుంది. పల్లెల్లో ‘స్థానిక’ ముచ్చట్లుమానకొండూర్: జిల్లాలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. శనివా రం రాత్రి వరకు రిజర్వేషన్లు వెలువరించగా ఎక్కడెక్కడ ఏఏ రిజర్వేషన్లు వచ్చాయి..? ఏ ఎన్నికలు ముందుగా జరుగుతాయనే చర్చ జోరుగా సాగుతోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డుమెంబర్ రిజర్వేషన్లు ఒకేసారి ప్రకటించడంతో ఏ ఎన్నికలు మొదట వస్తాయోనని ఆశావహులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 8న కోర్టు తీర్పు ఏ విధంగా రాబో తుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రజల గుండెల్లో సాహిత్యం కరీంనగర్ కల్చరల్: తెలంగాణ భాష నేపథ్యంలో రూపొందించే ఏ సాహిత్య ప్రక్రియ అయినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోతుందని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి అన్నారు. ఆదివారం నగరంలోని భగవతి పాఠశాలలో జాతీయ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో అనంతోజు పద్మశ్రీ రచించిన ‘బతుకమ్మ పాటల పల్లకి’ గ్రంథావిష్కరణ సభలో మాట్లాడారు. సాహితీవేత్త గండ్ర లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బతుకమ్మపై వేల పాటలు ఉన్నాయ ని, ఇప్పటికీ ఎంతోమంది కొత్తగా రచిస్తూనే ఉన్నారని కొనియాడారు. జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్, బి.రమణారావు, సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శి కొత్త అనిల్ కుమార్, కేఎస్.అనంతాచార్య, అనంతోజు చంద్రమోహన్ పాల్గొన్నారు. కవి ఆచరణవాది కావాలికరీంనగర్ కల్చరల్: కవి ఆచరణవాదిగా సమాజానికి ఆదర్శంగా నిలబడాలని ప్రముఖ వైద్యుడు రఘురామన్ సూచించారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లాశాఖ ఆధ్యర్యంలో ఫిల్మ్భవన్లో ఆదివారం కవి పిన్నంశెట్టి కిషన్ కవితా సంపుటి ‘నల్ల పద్యం’పుస్తక పరిచయసభలో మాట్లాడారు. కవి తన రచనకు జీవితానికి అభేదం పాటేస్తేనే సాహిత్యం సమాజానికి ప్రయోజనకరం అన్నారు. అన్నవరం దేవేందర్ మాట్లాడుతూ 80వ దశకంలోని సిరిసిల్ల, జగిత్యాల ఆరాట, పోరాటా ల నేపథ్యంలో కవిగా ఎదిగిన కిషన్ కలంలో వేడి తగ్గలేదని పేర్కొన్నారు. తెరవే జిల్లా అధ్యక్షుడు సీవీ.కుమార్, బొల్లం బాలకృష్ణ, డి.అఖిల్ కుమార్, కందుకూరు అంజయ్య, నరాల వెంకటేశం పాల్గొన్నారు. హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్కొత్తపల్లి: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ సామల కిరణ్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా కొత్తపల్లిశాఖ ఆధ్వర్యంలో జయగార్డెన్స్లో విజయదశమి ఉత్సవం జరి గింది. గుండేటి విశ్వనాఽథం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలను స్వాగతించాలని కోరారు. -
వాన.. అన్నదాత హైరానా
సద్దుల సందడిటవర్ సర్కిల్ ప్రాంతంలో..నేటి సద్దుల పండుగకు మహిళలు సిద్ధమయ్యారు. బతుకమ్మ పేర్చేందుకు అవసరమైన పూలతో కరీంనగర్లోని ప్రధాన మార్కెట్ ఆదివారం కళకళలాడింది. పూల కొనుగోళ్లతో డైలీ మార్కెట్, టవర్ సర్కిల్, కలెక్టర్ క్యాంపు ఆఫీస్, వాటర్ ట్యాంక్ ప్రాంతాలు సందడిగా మారాయి. పూలధరలు ఆకాశాన్ని అంటాయి. బంతి కిలో రూ.100 నుంచి 120 పలికింది. పట్టుగుచ్చు కట్టకు రూ.50, గునుగు రూ.10కి కట్ట చొప్పున విక్రయించారు. తంగేడు తక్కువ రాగా.. రూ.100కు విక్రయించారు. జనాల రద్దీతో మార్కెట్ ప్రాంతం ట్రాఫిక్ వలయంలో చిక్కుకుంది. పోలీసులు ఆటోలు, ఇతర పెద్ద వాహనాలు లోనికి వెళ్లకుండా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో వన్వే ఏర్పాటుచేయడంతో ద్విచక్రవాహనదారులు ఇబ్బంది పడ్డారు. మార్కెట్, గంజ్, టవర్, పోస్టాఫీస్, మదీనా కాంప్లెక్స్ అడుగుతీసి అడుగేసేందుకు కూడా వీలు లేకుండా పోయింది. – విద్యానగర్(కరీంనగర్)/సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్కరీంనగర్ అర్బన్: వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెలలో 28రోజులు గడువగా 13 రోజులు వర్షం పడటం.. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదవడం సాగురంగాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. తెరిపినిచ్చిందుకున్న వాన మళ్లీ పంటదశలో విరుచుకుపడుతుండటంతో మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు తయారైంది రైతుల పరిస్థితి. గత సీజన్లో అరకొర దిగుబడులతో ఇబ్బంది పడ్డ రైతులను ఈ సీజన్లో అతివృష్టి గుబులు రేపుతోంది. నల్లరేగడి నేలల్లోని వరి మినహా ఇతర పంటలు ఎర్రబడగా నేలలోకి దిగే పరిస్థితే లేదు. ఎర్రనేలలో పైరు ఎర్రబడటంతో పాటు ఎదుగుదల లేకపోవడం ఆన్నదాతలను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఎన్నడూలేని విధంగా సెప్టెంబర్లో ఈ స్థాయిలో వర్షం కురవడం 30 ఏళ్లలో ఇదే తొలిసారని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతాల్లోనే అధికం ఒకప్పుడు మెట్ట ప్రాంతాలైనా గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు నేడు సాగునీటితో కళకళలాడుతున్నాయి. గతంలో కరవు మండలాలుగా ప్రకటించిన దాఖలాలుండగా ఈ మూడు మండలాలు సదరు జాబితాలో ఉండేవి. ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ పనులతో పాటు చెట్లను వృద్ధి చేయడంతో నేడా పరిస్థితి మారిపోయింది. ఈ నెలలో ఇప్పటివరకు చిగురుమామిడి, సైదాపూర్, మానకొండూర్ మండలాల్లో అదనానికి మించి వర్షపాతం నమోదైంది. తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో అదనపు వర్షపాతం నమోదవగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. పత్తి, వరి, ఆరుతడి పంటలకు నష్టం తెల్లబంగారాన్ని పండించే రైతులకు ఈ సారి గడ్డురోజులేనని స్పష్టమవుతోంది. తెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పంటపై తెగుళ్లు దాడి చేయనుండగా పైరు ఎదుగుదలపై ప్రభావం పడుతోంది. జిల్లాలో రెండే ప్రధాన పంటలు కాగా కొన్ని చోట్ల పత్తి తీత దశలో ఉండగా హెచ్చు ప్రాంతాల్లో కాయ పగిలే దశలో ఉంది. పత్తికి అత్యధిక ధర ఉండటంతో చాలామంది రైతులు పత్తికే మొగ్గుచూపారు. జిల్లాలో వ్యవసాయశాఖ అంచనాకు మించి పత్తిని సాగు చేసినట్లు సమాచారం. ఈ నెల 24 సాయంత్రం నుంచి వర్షం కురుస్తుండగా పత్తి మొక్కల ఎదుగుదలకు అవరోధంగా మారాయి. చెలక, నల్లరేగడి భూముల్లో మొక్కలు ఎర్రబడ్డాయి. గడ్డి విపరీతంగా పెరిగిపోవడం, మొక్కలకు వేరు తెగులు, పూత, కాత రాలిపోవడం వంటి తెగుళ్లు ఉధృతమయ్యాయి. సాగైన పంటలో 45శాతం వరకు తెగుళ్లు వ్యాప్తి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. అరుతడి పంటలైన కంది, మొక్కజొన్న, పెసర, మినుము పంటలకు ప్రతికూల పరిస్థితే. ఈ క్రమంలో తెగుళ్లు సోకుతుండగా నీటిలోనే పంట ఉండటంతో ఎర్రబడుతుండగా వీడని వాన నీడలా నష్టం చేస్తోంది. కందికి పచ్చపురుగు సోకగా మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఉన్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక ప్రధాన పంట వరి ఎర్రబారుతుండగా నియంత్రించేందుకు అదనపు శ్రమ, వ్యయం చేస్తున్నారు. కూరగాయలపై ప్రభావం రోజూ వర్షం కురుస్తుండటంతో కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానంగా టమాట కుళ్లిపోతోంది. పంట ఎదుగుదల లేకపోగా టమాట రంగు మారుతోంది. తీగజాతి కూరగాయలు కాత నిలిచిపోగా ఎక్కువ నీటి నిల్వతో జీవం కోల్పోతుందని రైతులు వాపోతున్నారు. ఇక పాడి గేదెల పెంపకందారులు వాటిని సంరక్షించేందుకు నానాపాట్లు పడుతున్నారు. గత సెప్టెంబర్లో కురిసిన వర్షం: 8 రోజులు నమోదైన వర్షపాతం: 162.6 మిల్లిమీటర్లు ఈ నెలలో(27 వరకు) కురిసిన వర్షం: 13 రోజులు నమోదైన వర్షపాతం: 275.8 మి.మీలు సాధారణం: 151.6 మి.మీలు నెల కురిసిన వర్షం కురవాల్సింది వర్షపాతం జూన్ 99.3 124.3 లోటు వర్షం జూలై 272.7 237.7 సాధారణం ఆగస్టు 283.5 203.6 అదనపు వర్షం సెప్టెంబర్ 275.8 151.6 అదనానికి మించి -
మహిళలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి
కరీంనగర్: రాష్ట్ర మహిళలకు బతుకమ్మ పండుగకు చీరలు ఇవ్వని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని తెలంగాణచౌక్లో బీఆర్ఎస్ నగరశాఖ ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ ఆడుతూ వినూత్న నిరసన చేపట్టారు. అనిల్ కుమార్గౌడ్, గందె మాధవి, ఎడ్ల సరిత, గుగ్గిళ్ల జయశ్రీ, నక్క పద్మ, నందెల్లి రమాదేవి, మర్రి భావన, తాటి ప్రభావతి, వాల రమణారావు, కంసాల శ్రీనివాస్, కుర్ర తిరుపతి, మహేశ్, శ్రీకాంత్, రాములు, ఏవీ రమణ, ఐలేందర్యాదవ్ పాల్గొన్నారు. -
ఎస్సీ కోటాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్
ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్కు చెందిన చుంచు జితేందర్ గ్రూప్–2లో ఎస్సీ కోటలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్ సాధించి సబ్రిజిస్ట్రార్గా ఎంపికయ్యాడు. చుంచు మల్లయ్య, సునంద దంపతుల కుమారుడు జితేందర్ టీజీపీఎస్సీలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. టౌన్ప్లానింగ్లో అధికారిగా కూడా ఎంపికయ్యాడు. చొప్పదండి నవోదయలో పదో తరగతి, ఉస్మానియా యూనివర్సిటీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. కేంద్ర ప్రభుత్వ సీజీఎల్ సాధించిన జితేందర్ ప్రస్తుతం సివిల్ సర్వీసెస్లో మెయిన్స్ పూర్తి చేశాడు. త్వరలో ఫలితాలు రానున్నాయి. -
ఆటోట్రాలీ ఢీకొని బాలుడు మృతి
ముత్తారం(మంథని): ముత్తారంలోని కాసార్లగడ్డకు చెందిన తిరునహరి శ్రీనివాస్, మంజుల వికలాంగ దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు ఆటోట్రాలీ ఢీకొని మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శ్రీనివాస్, మంజుల దంపతులు పొట్టకూటి కోసం కాసార్లగడ్డలో టీ స్టాల్ నడిపిస్తున్నారు. ఆదివారం టీ స్టాల్లో తల్లిదండ్రులు ఉండగా, బయట ఆడుకుంటున్న వీరి కుమారుడు ఆయూష్ సిదార్థ్ను ఆటోట్రాలీ రివర్స్ తీస్తుండగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు తెలిపారు. కాగా, ప్రమాదం జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు అందలేదని ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు. -
తల్లిదండ్రుల సహకారంతో..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలకేంద్రానికి చెందిన మూటపల్లి తిరుపతి– భారతి దంపతుల కూతురు దివ్యశ్రీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2లో నాయబ్ తహసీల్దార్ ఉద్యోగం సాధించింది. ప్రాథమిక విద్య ధర్మారంలో, పదో తరగతి వరకు నవోదయ, ఇంటర్ కరీంనగర్, బీటెక్ సీబీఐటీలో చదివింది. గ్రూప్– 4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించి కరీంనగర్లో, ప్రస్తుతం ధర్మారం తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తుంది. తల్లిదండ్రుల సహకారంతోనే ఉద్యోగం సాధించినట్లు దివ్యశ్రీ చెప్పింది. -
సాగు నుంచి ఉద్యోగాల వైపు..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తల్లిదండ్రులతోపాటు వ్యవసాయం చేస్తూ మూడు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు మహేశ్. ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్నగర్కు చెందిన సిర్రం మల్లవ్వ–అంజయ్య దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు మహేశ్ గ్రూప్–2లో రాష్ట్ర సచివాలయంలో సెక్షన్ అధికారిగా ఎంపికయ్యాడు. గతంలో పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తూనే గ్రూప్–4 రాసి జూనియర్ అసిస్టెంట్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం పదోన్నతి పొంది వేములవాడ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతోనే మూడు ఉద్యోగాలు సాధించినట్లు మహేశ్ తెలిపాడు. -
నక్సలైట్గా మారేందుకు అవకాశం ఇవ్వండి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు. -
జగిత్యాల డిప్యూటీ కలెక్టర్గా అనంతపల్లివాసి
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లికి చెందిన కన్నం కళాప్రపూర్ణజ్యోతి–రమేశ్ల కూతురు కన్నం హరిణి గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. కరీంనగర్లోని నివసించే రమేశ్, కళాప్రపూర్ణజ్యోతి దంపతులు ఉపాధ్యాయులు. వీరిరి రెండో కూతురు హరిణి రాష్ట్రస్థాయిలో 55వ ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్గా జగిత్యాల జిల్లాకు నియమితులయ్యారు. ఉపాధ్యాయ దంపతుల మరో కూతురు అఖిల మెడిసిన్ తృతీయ సంవత్సరం చదువుతుంది. అబ్బాయి బాలాజీ బీబీఏ చదువుతున్నారు. -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సులు
మంథనిరూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శనివారం రెండు ఆర్టీసీ బస్సులు అదుపుతప్పాయి. ఒక ఘటనలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టినా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరోఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి. వివరాలు.. మంథని మండలం వెంకటాపూర్ ఎక్స్రోడ్డు సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. మంథని మండలం ఆరెంద గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నక్రమంలో వెంకటాపూర్ సమీపంలోని రహదారిపై ఏర్పడిన గుంతలో పడగా పట్టీలు విరిగి అదుపుతప్పింది. దీంతో పక్కకు దూసుకుపోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. బస్సులో 36మంది ప్రయాణికులు ఉండగా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను మరో బస్సులో మంథనికి తరలించారు. కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన బస్సు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): కాట్నపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శనివారం ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరు గొర్రెలు మృత్యువాతపడ్డాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కాట్నపల్లి గ్రామానికి చెందిన రాజయ్య రోడ్డు పక్క నుంచి గొర్రెలను తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో కరీంనగర్ నుంచి గోదావరిఖని వైపుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. దీంతో ఆరు గొర్రెలు మృత్యువాత పడగా, మరోరెండు గాయాలపాలయ్యాయి. మృతిచెందిన వాటి విలువ సుమారు రూ.1లక్ష వరకు ఉంటుందని బాధితుడు తెలిపాడు. వెంకటాపూర్లో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బస్సు సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు కాట్నపల్లిలో గొర్రెల మందపై దూసుకెళ్లిన వైనం ఆరు గొర్రెలు మృత్యువాత.. గాయపడిన మరోరెండు -
ఇంటర్ ఎస్జీఎఫ్లో గందరగోళం
కరీంనగర్స్పోర్ట్స్: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఏటా పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. సుమారు 60కి పైగా క్రీడాంశాల్లో పోటీలుంటాయి. అండర్–19 కళాశాలలస్థాయి పోటీల నిర్వహణకు జిల్లా ఇంటర్ విద్యాశాఖ ఎస్జీఎఫ్ కళాశాల కార్యదర్శిని నియమించడం ఆనవాయితీ. కానీ మూడేళ్లకాలంలో ఇంటర్ విద్యాశాఖ విచిత్ర ధోరణిలో అవలంబిస్తోంది. కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లను కాదని పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లకు అండర్–19 బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. 2025–26 విద్యాసంవత్సరంలో గడిచిన నెల వ్యవధిలో ఇంటర్ విద్యాశాఖ అధికారి గంగాధర్ అండర్–19లో ఇద్దరు కార్యదర్శులను అనూప్రెడ్డి(కొడిమ్యాల మోడల్ స్కూల్ పీడీ), మధు జాన్సన్ (ఆర్ట్స్ కళాశాల పీడీ)లను నియమించి, తరువాత తొలగించారు. తాజాగా పాఠశాలల అండర్–14,17 కార్యదర్శి వేణుగోపాల్కు అండర్–19 బాధ్యతలు అప్పగించారు. 2023– 24లో ఇలా.. ఇంటర్ విద్యాశాఖ తొలిసారిగా 2023–24 ఏడాదికి అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శిగా అప్పటి పాఠశాల ల ఎస్జీఎఫ్ కార్యదర్శిని నియమించింది. పలు కారణాలతో అండర్–14,17 బాధ్యతల నుంచి తప్పించారు. దీంతో ఇంటర్ విద్యాశాఖ అధికారి సైతం అ ండర్–19 బాధ్యతలనుంచి తప్పించారు. 2025– 26 విద్యాసంవత్సరానికి గాను అండర్ 14,17 కార్యదర్శికి అండర్–19 బాధ్యతలు అప్పగించారు. మాకివ్వండని మొరపెట్టుకున్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలలో ఒకరు, గురుకుల కళాశాలల్లో 10మందికిపైగా పీడీలుగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న సీనీయర్ పీడీని కార్యదర్శిగా నియమించాలి. ఒక్కరే ఉండడంతో అతనికే బాధ్యతలిచ్చారు. 2025–26 విద్యాసంవత్సరానికి గానూ క్రీడాపోటీల నిర్వహణకు ఔట్ సోర్సింగ్ పీడీగా పనిచేస్తున్న అనూప్రెడ్డిని ఇంటర్ విద్యాధికారి నియమించారు. దీంతో గురుకుల కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్ పీడీలు అండర్–19 బాధ్యతలను తమకివ్వాలని డీఐఈవో గంగాధర్కు వినతిపత్రం ఇచ్చారు. దీంతో అనూప్రెడ్డి స్థానంలో మధుజాన్సన్ను నియమించారు. మధుజాన్సన్కు పక్కనపెట్టి వేణుగోపాల్ను నియమించారు. సంగారెడ్డి, జనగాంతో పాటు పలుజిల్లాల్లో అండర్–19 ఎస్జీఎఫ్ కార్యదర్శులుగా గురుకుల కళాశాల పీడీలు కొనసాగుతుండగా కరీంనగర్లో గురుకుల కళాశాలల పీడీలను పక్కన పెట్టడంపై పలువురు క్రీడారంగ బాధ్యులు ఆందోళనకు గురైయ్యారు. ఉమ్మడి జిల్లాలోని తమను కాదని పాఠశాల కార్యదర్శికి క్రీడాపోటీల నిర్వహణను అప్పగించడంలో అంతర్యమేంటోనని పలువురు పీడీలు అనుకుంటున్నారు. దీనివల్ల అండర్–19 క్రీడల్లో కళాశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్రం తిప్పుతున్న కార్యాలయ సిబ్బంది? కళాశాల పీడీని కాదని పాఠశాల పీడీలకు అండర్–19 బాధ్యతలు అప్పజెప్పడంలో ఇంటర్ విద్యాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి చక్రం తిప్పుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2023–24, 2025–26 విద్యా సంవత్సరాల్లో పాఠశాల కార్యదర్శికి, ఔట్సోర్సింగ్ పీడీకి కార్యదర్శిగా నియమించడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కార్యదర్శులను మార్చిన వైనం కొత్తగా పాఠశాలల కార్యదర్శికి అండర్– 19 బాధ్యతలు పక్క జిల్లాల్లో ఒక రూల్... కరీంనగర్లో మరో రూల్ ఎస్జీఎఫ్ క్రీడల్లో ఇంటర్ విద్యార్థులు నష్టపోతారంటున్న పీడీలు -
రేబిస్.. ప్రాణాంతకం
● కుక్కకాటుపై నిర్లక్ష్యం వద్దు ● అవగాహన, అప్రమత్తత అవసరం ● ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా టీకాలు ● నేడు రేబిస్ నివారణ దినోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారానికి చెందిన ముత్తు బోయిన సందీప్(25) తండ్రిని నెలన్నర క్రితం పెంపుడు కుక్క కరిచింది. ఆయనకు చికిత్స చేయించాడు. దూరంగా వదిలేసేందుకు ఓ సంచిలో పెట్టుకుని వెళ్తుండగా కుక్క కాలిగోటితో గీరింది. వైద్యం చేయించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో నరాల బలహీనతతోపాటు రేబిస్ లక్షణాలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా సందీప్ను పరీక్షించిన వైద్యులు.. రేబిస్ సోకినట్లు నిర్ధారించారు. చికిత్స చేస్తుండగానే ఈనెల 23న సందీప్ మృతి చెందాడు. సకాలంలో వైద్యం తీసుకుంటే యువకుడు బతికేవాడని డాక్టర్లు తెలిపారు. కోల్సిటీ(రామగుండం): విశ్వాసం ప్రదర్శించడంలో కుక్కకు మించిన ప్రాణి మరోటిలేదంటారు. అందుకే కొందరు వాటిని ఇంటికి రక్షణగా, మరికొందరు తోడుగా ఉంటుందని పెంచుకుంటున్నారు. వీటితోపాటు వీధికుక్కలు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సంచరిస్తూ దొరికిన ఆహారం తింటూ బతుకుతున్నాయి. కొన్నిసార్లు తమకు ప్రమాదం తెస్తున్నారని భావించి మనుషులను కరుస్తుంటాయి. ఈ కాటుతో రేబిస్ సోకి ఒక్కోసారి ప్రాణాపాయం తెస్తోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నివారణకు ఉపయోగించే, ఉచితంగా లభించే ఏఆర్వీ టీకాలు ఉన్నా కొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. నాటు వైద్యం వైపు మొగ్గుచూపుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. లూయీస్ ప్యాక్చర్ అనే ప్రముఖ శాస్త్రవేత్త రేబీస్ నివారణకు వ్యాక్సిన్ కనుగొన్నారు. ప్రజలకు రేబిస్పై అవగాహన కల్పించడానికి, లూయీస్ ప్యాక్చర్ జ్ఞాపకార్థం ఏటా సెప్టెంబర్ 28న వరల్డ్ రేబిస్ డేగా నిర్వహిస్తున్నారు. కుక్కలతో భద్రం.. రేబిస్తో బాధపడే కుక్కలు పుండ్లు, గాయం ఉన్నచోట నాకినా, కొరికినా మనుషులకు వ్యాధి సోకుతుంది. రేబిస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదకరమైన వ్యాధి. ముఖ్యంగా కుక్కలు, కోతులు, పెంపుడు జంతువులు మనుషులను కరవడం, గీకడం ద్వారా రేబిస్ వ్యాపిస్తుంది. కరిచిన నాలుగైదు రోజుల తర్వాత వ్యాధి బహిర్గతమవుతుంది. అయితే కుక్క ఎక్కడ కరిచింది? ఎంతో లోతు గాయమైంది. వైరస్ శరీరంలోకి ఎంతమేరకు ప్రవేశించిందనే దానిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వైరస్ కండరాల్లోంచి నరాల ద్వారా మెదడులోకి వెళ్తుంది. కణాల సముదాయంలోకి, ఎముకలు, గ్రంథుల్లోకి వెళ్లి లాలాజలంలో ప్రవేశిస్తుంది. స్కిన్ బయాప్సీ, లాలాజలం ద్వారా వైరస్ను నిర్ధారిస్తారు. లక్షణాలు ఇలా ఉంటాయి.. తలనొప్పి, ఒళ్లునొప్పులు, గొంతునొప్పి, సాధారణ జ్వరం ఉంటాయి. దీంతోపాటు కుక్క కరిచిన ప్రాంతంలో నొప్పి పెరుగుతుంది. ఈ లక్షణాల తర్వాత వైరస్ మెదడును తీవ్రమైన ఉద్వేగాలకు లోనయ్యేలా చేస్తుంది. దీంతో గాలికి భయపడతారు. నీళ్లను చూసినా వణికిపోతారు. గొంతులోని కండరాలు బిగుసుకుపోతాయి. ఈ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. క్షణాలను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు. జాగ్రత్తలు తప్పనిసరి కుక్కకాటుకు గురైన వారు తప్పనిసరిగా వెంటనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్(ఏఆర్వీ) వేయించుకోవాలి. వీరికి మొదటి, మూడు, ఏడో, 14వ, 28వ రోజుల్లో వ్యాక్సిన్ వేస్తారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించి మొదడు వరకు చేరకుండా అడ్డుకోవడానికి అవసరమైన వారికి పీఈపీ టీకాలను కూడా వేస్తారు. కుక్కే కాదు.. పంది, పందికొక్కులు, కోతులు, గాడిదలు, గుర్రాలు, గబ్బిలాలు, ఎలుకలు, పిల్లులు వంటివి కరిచినా ఏఆర్వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కుక్క కరిచిన వెంటనే గాయాన్ని శుభ్రంగా కడిగి, సకాంలో చికిత్స తీసుకోవాలి. -
నక్సలైట్గా మారేందుకు అవకాశం ఇవ్వండి
సిరిసిల్లక్రైం: అధికారుల తీరుతో పదేళ్లుగా తనకు అన్యాయం జరుగుతోందని, తనలాంటి బాధితులకు న్యాయం చేసేలా నక్సలైట్గా మారేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితుడు చల్లా బాలరాజు కోరారు. ఈమేరకు శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతేకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బాధితుడు బాలరాజు మాట్లాడుతూ రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో స్థలం కోల్పోయానని తెలిపాడు. అధికారులు తనకు పదేళ్లుగా నష్టపరిహారం చెల్లించకుండా దరఖాస్తులు, పరిశీలన అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు మిగతా వారికి నష్టపరిహారం, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరారు. తమకు న్యాయం చేయాలని ఇప్పటికే కలెక్టర్, ఆర్డీవో కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేసినా.. ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పటి వరకు కలెక్టర్గా పనిచేసిన సందీప్కుమార్ ఝా నిర్వాసితుల సమస్యలపై అవహేళన చేస్తూ ఇబ్బందులకు గురిచేశారన్నారు. కలెక్టర్, ఉన్నతస్థాయి అధికారులపై కేసు నమోదు తమ పరిధిలో లేదని ఎస్పీ తెలిపినట్లు చెప్పారు. జిల్లాకు కొత్తగా రానున్న కలెక్టర్ రెవెన్యూ విభాగంలోని చట్టపరిధిలో చర్యలు తీసుకుంటారని ఎస్పీ సూచించారని తెలిపారు. ఎస్పీని కలిసిన వారిలో ఇనుకొండ లక్ష్మి, మంజుల, తిరుపతి, ఉపేందర్ ఉన్నారు. అన్యాయం చేసిన అధికారులపై కేసు నమోదు చేయండి మిడ్మానేరు బాధితుడు చెల్లా బాలరాజు సిరిసిల్ల ఎస్పీ మహేశ్ బి గీతేకు వినతి -
ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ
వేములవాడ: ప్రకృతి రక్షణే ప్రజల రక్షణ అని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారని.. ప్రకృతి క్షేమంగా ఉంటేనే ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారని.. ఆడబిడ్డలు క్షేమంగా ఉంటేనే బతుకమ్మ క్షేమంగా ఉంటుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క పేర్కొన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలకు మాజీ సర్పంచ్ నరాల సత్తమ్మపోచెట్టి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మూలవాగులోని బతుకమ్మ తెప్ప వద్దకు చేరుకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ప్రకృతి క్షేమంగా ఉంటే... ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు ఆడబిడ్డలు క్షేమంగా ఉంటే... బతుకమ్మ క్షేమంగా ఉంటుంది అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైర్పర్సన్ విమలక్క వేములవాడలో బతుకమ్మ వేడుకలకు హాజరు -
సీసీఎల్ డైరెక్టర్ సింగరేణి వారసుడు
గోదావరిఖని: సింగరేణి సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన అధికారి తనయుడు అనూప్ అంజూరా సెంట్రల్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్గా ఎంపికయ్యారు. శనివారం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనూప్ అంజూరాను సీసీఎల్ టెక్నికల్ డైరెక్టర్గా ప్రత్యేక కమిటీ రికమండ్ చేసింది. సింగరేణి ఆర్జీ–2 ఏరియాలోని జీడీకే–9వగనిలో ఏజెంట్గా, కొత్తగూడెం ఏరియా జీఎంగా పనిచేసి రిటైర్ అయిన సీఎల్ అంజూర ఈప్రాంత వాసులకు సుపరిచితులు. ఆయన తనయుడు అనూప్అంజూరా గోదావరిఖనిలోని యైటింక్లయిన్కాలనీ సింగరేణి పాఠశాల, గోదావరిఖని సెయింట్ క్లెయిర్ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. -
లలితాదేవిగా అమ్మవారు
కరీంనగర్ కల్చరల్/ విద్యానగర్(కరీంనగర్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాశక్తి ఆలయంలో లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గాజులతో అలంకరణ చేశారు. లలితాసహాస్త్రనామ పారాయణం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ మండలం నగునూర్లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆరోరోజు శనివారం దుర్గాభవానీ అమ్మవారు ఇంద్రాణీ అలంకరణలో గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారికి గాజులతో అలంకరణహంస వాహనంపై దుర్గాభవానీ అమ్మవారు