breaking news
Karimnagar
-
మిసెస్ చికాగోగా తెలుగమ్మాయి.. ఎవరీ సౌమ్య?
ధర్మపురి: ఈనెల 12న న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్స్ ప్యాలెస్లో నిర్వహించిన విశ్మసుందరి అందాల పోటీల్లో మిసెస్ చికాగో యూనివర్స్–2026 టైటిల్ గెలుచుకున్న సౌమ్య స్వస్థలం జగిత్యాల జిల్లా ధర్మపురి. ధర్మపురికి చెందిన వొజ్జల మోహన్, సావిత్రి దంపతుల కూతురు సౌమ్య.. 2025 మే 4న మిసెస్ భారత్ ఇల్లినాయిస్ అందాల పోటీల్లో విజయం సాధించారు. తాజాగా మిసెస్ చికాగో యూనివర్స్ను గెలుచుకోవడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 1985 జనవరి 22న జన్మించిన సౌమ్య బెంగళూర్, నాగాపూర్, ముంబయి, దహను నగరాల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ధర్మపురికి చెంది.. అమెరికాలో స్థిరపడిన బొజ్జ వాసుతో వివాహమైంది. అనంతరం మిల్వాకి యూనివర్సిటీ నుంచి బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పొందారు. ప్రస్తుతం ఆమె ఓ బహూళజాతి సంస్థలో వెబ్ డిజైనర్గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, కొరియోగ్రఫీపై ఉన్న మక్కువతో ఇల్లినాయిస్లోని చికాగోలో వస్త్రం బై సౌమ్య అనే ఫ్యాషన్ బోటిక్ను స్థాపించారు. 2025లో న్యూయార్క్లో ఫ్యాషన్ వీక్ డిజైనర్గా అడుగుపెట్టబోతున్నారు. వృత్తిపరమైన బాధ్యతలతోపాటు సామాజిక కార్యకర్తగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. గృహహింస బాధితులకు సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సౌమ్య తాజాగా ఈ ఏడాది మార్చిలో ధర్మపురికి వచ్చి వెళ్లారు. కుటుంబం ప్రోత్సాహంతో..విశ్వసుందరి పోటీల్లో టైటిల్ గెలుచుకోవడంలో తల్లిదండ్రులు, భర్త సహాయం బాగుంది. ప్రతిభ, అంకిత భావం, కృషి, పట్టుదలతోనే ఈ స్థాయికి ఎదిగాను. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తా. -
పట్టపగలు వివాహిత దారుణ హత్య
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్లో ఆదివారం పూసల రమాదేవి(35) దారుణ హత్యకు గురైంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా రెడ్డికాలనీకి చెందిన రమాదేవిని .. పన్నూర్ గ్రామపంచాయతీ పరిధిలోని వకీల్పల్లి ప్లాట్స్కాలనీలో నివాసం ఉండే పూసల కృపాకర్ సుమారు 13 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వీరికి ఒక కుమారుడు జాన్సన్, కుమార్తెలు జోషిత(9), జ్యోత్స్న ఉన్నారు. ఏడాదిగా వీరి మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. అప్పటినుంచి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. రమాదేవి ఆదివారం కృపాకర్ ఇంటికి చేరుకుంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో రమాదేవిపై కృపాకర్ దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శ్రీనివాస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య అనంతరం కృపాకర్, అతడి తల్లిదండ్రులు పరారయ్యారు. అయితే, తల్లిదండ్రులు మంథని పోలీసుస్టేషన్లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కృపాకర్ కోసం ఆరా తీస్తున్నారు. కుటుంబ కలహాలే హత్యకు కారణామని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై వివరించారు. పంచాయితీయే ప్రాణం తీసిందా? ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్న రమాదేవి ఆదివారం అత్తగారింటికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. సెంటినరికాలనీకి చెందిన ఒకమతపెద్ద ద్వారా కృపాకర్ రాయబరం చేయడంతో రమాదేవిని అక్కడకు వచి్చందని, మతపెద్ద సమక్షంలో పంచాయితీ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత రమాదేవి వకీల్పల్లి ప్లాట్స్కాలనీకి చేరుగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈక్రమంలోన అత్తగారింటి ఎదుట రోడ్డుపై విగతజీవిగా పడిపోయిందని స్థానికులు కంటతడి పెట్టారు. క్షణికావేశంలో భార్యను చంపండంతో ముగ్గురు పిల్లలు రోడ్డున పడ్డారని ఆవేదన చెందారు. కుటుంబ కలహాలు పచ్చనికాపురంలో చిచ్చుపెట్టడంతో పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
ఉత్సాహంగా రోలార్ స్కేటింగ్ పోటీలు
కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్రూరల్: కరీంనగర్ జిల్లా రోలార్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఉ మ్మడి జిల్లాస్థాయి రోలార్ స్కేటింగ్ పోటీలకు విశేష స్పందన వచ్చింది. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి.నరేందర్రెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడలతో విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. అలాగే బొమ్మకల్లోని బిర్లా ఇంటర్నేషనల్ స్కూల్లో రోడ్ ఈవెంట్ స్టేట్ సెలక్షన్ పోటీలు నిర్వహించారు. స్కేటింగ్ బాధ్యులు విజయభాస్కర్, గట్టు అనిల్కుమార్గౌడ్, డి.వీరన్న, కృష్ణమూర్తిగౌడ్, సాయినరహరి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు స్పందన
కరీంనగర్స్పోర్ట్స్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీలకు విశేష స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి సుమారు 150 మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. అంతకుముందు తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఈ నెల 25 నుంచి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలంలో జరిగే రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కబడ్డీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఎల్లయ్యగౌడ్, సీహెచ్.మల్లేశ్, ప్రధాన కార్యదర్శి బుర్ర మల్లేశ్గౌడ్, పెటా కార్యదర్శి ఆడెపు శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు మాధవరెడ్డి, నరేశ్, తదితరులు పాల్గొన్నారు. -
అక్రమంగా ఎరువుల బస్తాల తరలింపు
మానకొండూర్: మండలకేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు రైతులకు అందించాల్సిన ఎరువుల బస్తాలను అక్రమంగా వ్యాన్లో తరలిస్తూ పట్టుబడ్డారు. స్థానికులు అందించిన స మాచారంతో మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్రెడ్డి మానకొండూర్కు చేరుకుని ఎరువుబస్తాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. వ్యాన్లో 50 యూరియా, ఇతర ఎరువుల బస్తాలు ఉన్నట్లు తెలిపారు. వాటిని పరకాల నడికుడకు తరలిస్తున్నట్లు వివరించారు. అక్రమంగా ఎరువులు తరలిస్తున్న వారిపై 6 ఏ కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. అలాగే గ్రోమోర్ సెంటర్లో సుమారు రూ.20 లక్షల వివిధ రకాల ఎరువుల బస్తాలు ఉండగా, వాటి రిజిస్టర్, లేబుళ్లు సరిగా లేక సీజ్ చేశామని వ్యవసాయాధికారి వెల్లడించారు. పట్టుకున్న అధికారులు -
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతారం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. డాక్ బంగ్లా అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అనంతారం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సేద తీరేవారు. డాక్బంగ్లా మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. -
తల్వార్తో జన్మదిన వేడుకలు..
● యువకుడిపై కేసు నమోదు జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని వాణినగర్కు చెందిన కోరుకంటి సాయికృష్ణ అనే వ్యక్తి రోడ్డుపై.. జనావాసాల మధ్య తల్వార్ను పట్టుకుని మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం సాయికృష్ణ శనివారం రాత్రి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తల్వార్ చేతపట్టుకుని మిత్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద సాయికృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. -
వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలి
కరీంనగర్: పవర్లూమ్ కార్మికులకు వర్కర్ టు ఓనర్ పథకం అమలు చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో జరిగిన యూనియన్ 11వ మహాసభల్లో పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, సంక్షేమ పథకాల అమలులో మొండి చేయి చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పునూటి శ్రీనివాస్ మాట్లాడుతూ, పవర్లూమ్ కార్మిక సమస్యలు పరిష్కరించుకునేందుకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మారంపల్లి నాగభూషణం, ఉపాధ్యక్షులు గుడికందుల సత్యం, శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి ఉప్పునూటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు ఎలిగేటి కృష్ణహరి, సామల శంకర్, కోశాధికారి దూడం గంగాధర్, జిల్లా కమిటీ సభ్యులు వడ్నాల వెంకటేశం, దూస నరసింగం, చిట్యాల సత్యనారాయణ, గుండేటి మల్లేశం, శ్రీనివాస్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాయికల్ శివాలయంలో చోరీరాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహి (1724–1748) కాలంలో అమీన్ఖాన్ ఈ కోట ఖిలేదార్గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎలగందుల ఖిలా -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● ఫేస్బుక్లో పోస్టుపై పోలీసులు కొట్టారని మనస్తాపం ● సెల్ఫీ వీడియోతో ఎలుకల మందు తాగిన వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తమ ఊరికి బస్సు కావాలంటూ ఓ యువకుడు పెట్టిన పోస్టు అ తని ఆత్మహత్యాయత్నానికి దా రి తీసింది. అకారణంగా తన ను పోలీసులు చావబాదారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఎలుకల మందు తాగాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం హిమ్మత్నగర్కు చెందిన బండారి శ్రీనివాస్ అనే యువకుడు తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై నాచుపల్లి శ్రీనివాస్ అనే మరో వ్యక్తి ఫోన్ చేసి దూషించాడు. శనివారం ఉదయం మల్యాల పోలీసులు శ్రీనివాస్ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్కడ ఎస్సై నరేశ్ తనను దుర్భాషలాడుతూ రోజంతా చితకబాదారని, అందుకే తాను మనస్తాపంతో ఎలుకల మందు తాగుతున్నానను అంటూ శ్రీనివాస్ వీడియోలో పేర్కొన్నాడు. తన చావుకు ఎస్సై నరేశ్, మరో కాంగ్రెస్ నేత కారణమని స్పష్టం చేశాడు. గతంలో తాను ఇదే విషయమై ఎన్ని పోస్టులు పెట్టినా ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని, పైగా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వాపోయాడు. ఎలుకల మందు తాగిన అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వీడియో ఆన్లైన్లో వైరల్గా మారింది. ఆదివారం వన్టౌన్ సమీపంలోని ఓ హోటల్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. -
ప్రాజెక్టుల ల్యాండ్మార్క్ మిడ్మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్మార్క్లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్స్లూయిస్ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు. -
బతుకమ్మకు బల్దియా ఏర్పాట్లు
కరీంనగర్కార్పొరేషన్: నగరంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలకసంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం పనులు చేపట్టేందుకు ఇప్పటికే రూ.1 కోటి 50 లక్షలతో టెండర్ పిలిచింది. నగరంతో పాటు,ఇటీవల విలీనమైన కొత్తపల్లి పట్టణం, మల్కాపూర్, లక్ష్మిపూర్, చింతకుంట, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాల్లోనూ బతుకమ్మ ఏర్పాట్ల కోసం పనులను టెండర్లో పొందుపరిచారు. రూ.1 కోటి 50 లక్షలతో 35 పనులకు టెండర్ పిలిచారు. 35 పనుల్లో 28 సివిల్ వర్క్స్ కాగా, ఏడు ఎలక్ట్రికల్ వర్క్స్. ఈ నెల 23న టెండర్ ఓపెన్ చేయనుండగా, సద్దుల బతుకమ్మ నాటి వరకు ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంది. నగరవ్యాప్తంగా బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో రోడ్లపై గుంతలను డస్ట్తో పూడ్చడం, రోడ్లను చదును చేయడంతో పాటు లైట్లు అమర్చాల్సి ఉంటుంది. అలాగే నిమజ్జనపాయింట్లైన ఎల్ఎండీ కట్ట, వేదభవన్, కేబుల్ బ్రిడ్జి, కిసాన్నగర్, రేకుర్తి, చింతకుంట, కొత్తపల్లి, బొమ్మకల్, గోపాల్పూర్, దుర్శేడ్ తదితర ప్రాంతాల్లో చెట్లు, పొదలను తొలగించడం, చదును చేయడంతో పాటు లైట్లు ఏర్పాటు చేయనున్నారు. -
తారు పోయింది.. బురద మిగిలింది
చొప్పదండి: చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి రాగంపేట వెళ్లే రోడ్డు బురదమయమైంది. ఆర్నకొండ నుంచి రామడుగు మండలం గోపాల్రావుపేట వరకు గతంలో తారురోడ్డు వేశారు. రోడ్డుపై గుంతలు పడి తారు లేచిపోయింది. ప్రయాణికులు, రైతులకు ఇబ్బందికరంగా మారింది. కొన్ని నెలల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచన మేరకు మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేశ్ ఈ రోడ్డుపై ఎర్రమట్టి పోయించి గుంతలు పూడ్చారు. వర్షాకాలంలో మట్టికొట్టుకుపోయింది. రోడ్డంతా బురదమయమైంది. ఎస్సారెస్పీ ఉప కాలువల ద్వారా వచ్చే నీరు రోడ్డుపైకి చేరడంతో రోడ్డుపై కాలుమోపే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి రోడ్డువేసి, బురద బాధనుంచి గట్టెక్కించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సాదా సీదాకు లైన్ క్లియర్
ఈ సారైనా రికార్డుకు చేరేనా..? దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందం గతంలో జరిగిన అర్జీల పరిశీలన అద్దం పట్టింది. జిల్లాలో కరీంనగర్ అర్బన్తో పాటు తిమ్మాపూర్, హుజూరాబాద్, చిగురుమామిడి తదితర మండలాల్లో సర్వేనంబర్ల వారీగా 87,084 దరఖాస్తులు రాగా 70వేలకు పైగా అర్జీలను తిరస్కరించారు. అయితే సాదాబైనామా దరఖాస్తులకు 1994 వరకు చట్టబద్ధత కల్పించారు. దివంగత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేతిరాత కాగితాలకు గుర్తింపు లభించగా తిరిగి రెండున్నర దశాబ్దాల అనంతరం గత ప్రభుత్వం రెండుసార్లు సదావకాశాన్ని కల్పించింది. కాగా, అప్పటి నుంచి పంట రుణాలకు నోచుకోక.. కొనుగోలు చేసిన భూమిని అమ్ముకోలేక నానా ఇక్కట్లు పడుతున్న రైతులు యంత్రాంగం కరుణ కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే రైతులకు పట్టాలు పంపిణీ చేసి రుణాలిప్పించాల్సి ఉండగా పర్యవేక్షణ లేమితో నత్తనడకన సాగుతోంది. వచ్చిన అర్జీలపై మోకాపై విచారణతో పాటు చుట్టుపక్కల రైతులను విచారించి సదరు దరఖాస్తులకు విముక్తి కల్పించాలి. నిబంధనల సడలింపు.. పునఃపరిశీలన సాదాబైనామాల అర్జీలకు అవకాశమిచ్చిన తొలిసా రి వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఆర్డీవో లను బాధ్యులను చేసింది. ప్రతీ దరఖాస్తును సద రు అధికారి పరిశీలించిన తదుపరి పట్టా జారీ చే యాలని పేర్కొంది. గతంలో జరిగిన పరిశీలన ప్ర క్రియ వేగంగా లేకపోవడంతో ఆర్డీవోల నుంచి త ప్పించింది. వేల దరఖాస్తులను సదరు అధికారి పరి శీలించడం అసాధ్యమని భావించిన ప్రభుత్వం తహసీల్దార్లకే పూర్తిస్థాయి బాధ్యతలప్పగించింది. రైతులు ఆన్లైన్లో ఫారం 10 ద్వారా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సాదాబైనామా విక్రయాన్ని క్రమబద్ధీకరించేందుకు తహసీల్దార్లు 13బీ ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1బీలో నమోదు చే సి రైతులకు పట్టాదారు పాసుపుస్తకం అందించాల్సి ఉంటుంది. విక్రయదారులకు నోటీసులు జారీ చేయడం, వాంగ్మూలం నమోదులో వీరి పాత్ర కీలకం. ఇందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తుండగా తమ వేలిముద్రలు వేసి రైతులకు హక్కు పత్రాన్ని జారీ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో ఎక్కడ పొరపాటు జరిగినా తహసీల్దార్లదే బాధ్యత. కరీంనగర్ అర్బన్: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. సాదాబైనామాపై భూములు కొనుగోలు చేసి పట్టా కోసం నిరీక్షిస్తున్న రైతులెందరో. ప్రభుత్వాలు మారినా పట్టాలు చేతికందకపోగా మోకాను కాపాడుకునేందుకు పడినపాట్లు ఎన్నెన్నో. కాగా రైతులైనా రైతుకాని రైతులుగా మిగిలిన వారికి ఇక రికార్డుపరంగా భద్రత లభించనుంది. సాదాబైనామా కాగితాలపై భూములు కొన్న రైతులకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో భూ రికార్డుల నవీకరణ క్రమంలో అవకాశం కల్పించగా మరోసారి పచ్చజెండా ఊపింది. 2014 జూన్ 2లోపు కాగితంపై భూములు కొనుగోలు చేసిన వారికి పట్టాదారు పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించారు.గతంలో జిల్లాలో వచ్చిన అర్జీలు 10,456కరీంనగర్ రెవెన్యూ డివిజన్లో 5,694 హుజూరాబాద్ డివిజన్లో 4,762ఎవరికి వర్తింపు : 2014కు ముందు లావాదేవీలకు అర్హులు: చిన్న, సన్నకారు రైతులుజీపీవోలకే పరిశీలన బాధ్యతలు?తాజాగా గ్రామ పాలన అధికారుల (జీపీవో) వ్యవస్థ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాదాబైనామా దరఖాస్తులను వీరే పరిశీలించనున్నట్లు సమాచారం. గతంలో గిర్దావర్లే పరిశీలన బాధ్యతలు మోశారు. జిల్లాలోని 16 మండలాల్లో తహసీల్ కార్యాలయాల్లో ఒకరిద్దరు మాత్రమే ఉండగా వేల సంఖ్యలో వచ్చి న అర్జీలను పరిశీలించడంలో విఫలమయ్యారనే ఆరోపణలున్నాయి. పలు అర్జీల్లో కాగితాలు సరైనవే అయినా భూ యజమానులు మరణించడం, వారి వారసులు అభ్యంతరం తెలుపడంతో ప్రక్రియకు విఘాతం కలిగింది. మరి ఈ సారైనా ఆటంకాలను అధిగమించి అర్హులకు పట్టాలు జారీ చేసేనా.. వేచిచూడాల్సిందే. -
ఇక ఠంఛన్గా..
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులకు మంచిరోజులు రానున్నాయి. నెలల తరబడి పెండింగ్లో ఉంటున్న మధ్యాహ్న భోజ న బిల్లులు, గౌరవ వేతనాలు ప్రతినెలా పదోతేదీలోపు నిర్వాహకుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 10వ తేదీలోపు మధ్యాహ్న భోజనం బిల్లులతో పాటు కూరగాయల డబ్బులు గ్రీన్చానల్ ద్వారా చెల్లింపునకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. నూతన విధానంతో ట్రెజరీ నుంచి బిల్లులు అందించనున్నారు. ఇందు కోసం ఎండీఎం యాప్ను అభివృద్ధి చేశారు. నూతన విధానంతో ప్రతి నెలాఖరులో పాఠశాలల వారీగా బిల్లులు యాప్ ద్వారా చెల్లిస్తారు. వాటికి ప్రధానోపాధ్యాయుడు ఆమోదం తెలపగానే ఎంఈవో అంగీకరిస్తే ట్రెజరీ ద్వారా నేరుగా బదిలీ అవుతుంది. నెలవారీగా బిల్లులు చెల్లిస్తే జిల్లాలో వేలాది మంది వంట కార్మికుల సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకు బిల్లుల చెల్లింపులో జాప్యంతో వంట కార్మికులు అప్పులు తీసుకొచ్చి కాలం వెళ్లదీస్తున్నారు. బిల్లులు ఇవ్వాలని సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కొత్త విధానం లోటుపాట్లు లేకుండా పట్టాలెక్కితే ఈ కష్టాలకు అడ్డుకట్ట పడినట్లే.జిల్లాలో పాఠశాలలు 651విద్యార్థులు 49,754కుకింగ్ కం హెల్పర్లు 1,134 -
కమిషనరేట్లో జాతీయ లోక్ అదాలత్ విజయవంతం
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో జరిగిన జాతీయ లోక్అదాలత్ విజయవంతంగా ముగిసిందని పోలీసు కమిషనర్ గౌస్ ఆలం ప్రకటనలో తెలిపారు. లోక్ అదాలత్లో మొత్తం 3,130 కేసులు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితుల ఖాతాల్లో నిలిపివేసిన రూ.25,79,883 కోర్టు సమక్షంలో తిరిగి ఇప్పించడం జరిగిందన్నారు. లోక్ అదాలత్ నిర్వహణలో సహకరించిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. రజితరెడ్డి నియామకం రద్దు చేయాలికరీంనగర్కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలి నియామకం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. ఆదివారం నగరంలోని డీసీసీ కా ర్యాలయం గేట్ ఎదుట ధర్నా చేశారు. మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా వెన్నం రజితరెడ్డి నియామకాన్ని రద్దు చేయాలని, సీనియర్లకు అ వకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. త మకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. వారికి సభ్యత్వమే లేదు: రజితరెడ్డి తనకు పదవి రావడం పట్ల ఆందోళన చేస్తున్నవారికి మహిళా కాంగ్రెస్లో సభ్యత్వం కూడా లేదని మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజితరెడ్డి విమర్శించారు. వారంతా సిటీ కాంగ్రెస్కు చెందిన వారని, మహిళా కాంగ్రెస్లో సభ్యులు కారని పేర్కొన్నారు. తాను నగరంలో 219 సభ్యత్వాలు నమోదు చేస్తేనే మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, తనకు నగర అధ్యక్షురాలుగా అవకాశం కల్పించారని తెలిపారు. తన పదవిపై రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. బందోబస్తు మధ్య యూరియా పంపిణీశంకరపట్నం(మానకొండూర్): మండలంలోని తాడికల్ సహకార సంఘంలో ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియా పంపిణీ చేశారు. తాడికల్ సంఘానికి 660, మెట్పల్లి సంఘానికి 340 బస్తాల యూరియా వచ్చింది. దీంతో కేంద్రాల వద్దకు రైతులు తరలిరాగా పోలీసు పహారా మధ్య ఏఈవోలు కీర్తన, స్రవంతి టోకెన్లు జారీ చేశారు. సంఘాల సీఈవోలు సదయ్య, వీరస్వామి, వేణుమాధవ్, సిబ్బంది యూరియా పంపిణీ చేశారు. పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు కొనసాగుతున్నందున సోమవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్– 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. 11 కేవీ అల్కాపురి ఫీడర్ పరిధిలో అల్కాపురికాలనీ, వోక్స్ వేగన్ షోరూం లేన్, నాగుల ఎల్లమ్మ ఆలయం, శ్మశానవాటిక, వాటర్ ట్యాంక్, గిద్దె పెరుమాండ్ల ఆలయం ప్రాంతాలు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ రాంచంద్రాపూర్ ఫీడర్ పరిధిలోని సప్తగిరికాలనీ, కొత్త పీహెచ్సీ సెంటర్, సప్తగిరి హిల్స్ రోడ్ నంబర్ 3,4,5, జానకివీధి రోడ్నంబర్ 1,2,3, ఏఓస్కాలనీ రోడ్నంబర్ 1,2,3,4, రామచంద్రాపూర్ రోడ్ నంబర్ 10,13,16,18,20, బైపాస్ రోడ్ హెచ్పీ గ్యాస్ గోదాం, వెంకటాద్రికాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
కరీంనగర్ ప్రజల అభిమానం మరువలేనిది
కరీంనగర్కల్చరల్: ఆధ్యాత్మిక కరీంనగర్లో ఏడుకొండల వాడి సినిమాలో నటించడం అదృష్టంగా ఉందని సినీ నటులు శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్ అన్నారు. ఇక్కడే సినిమా పేరును ‘ఎడుకొండల వాడ వెంకటరమణ.. గోవిందా గోవిందా’ అని ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. కె.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో జిల్లా కేంద్రానికి చెందిన చందు నిర్మిస్తున్న చిత్రం నటులు ఆదివారం నగరంలోని ఓ హోటల్లో ‘సాక్షి’తో చిట్చాట్లో మాట్లాడారు.. శనివారం రాత్రి 3 గంటల వరకు జరిగిన షూటింగ్ చూసేందుకు అభిమానులు అక్కడే ఉండడం చూస్తుంటే కరీంనగర్ ప్రజలకు మాపై అభిమానం గొప్పదని అర్థమైంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, సినారె, కాళోజీ లాంటి గొప్ప సాహితీవేత్తలు పుట్టిన గడ్డపై షూటింగ్ చేయడాన్ని జీవితంలో మర్చిపోలేము. ఇక్కడి మానేరుడ్యాం అందాలు, చల్లగా పలకరించే పైరగాలి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఇంతటి సాధారణ ప్రదేశాలు హైదరాబాద్లో దొరకవు. ప్రఖ్యాతిగాంచిన రామాలయం, వేంకటేశ్వర, శివాలయాలు ఆధ్యాత్మికతకు ఆనవాళ్లుగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు కుటుంబసభ్యులతో వస్తుంటాం. మద్రాస్ తర్వాత షూటింగ్ అడ్డాగా హైదరాబాద్ మారినట్లు, కరీంనగర్లో జరిగిన అభివృద్ధి, సహజ ప్రకృతి వనరులతో సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది. మరో ఐదురోజులు ఇక్కడ షూటింగ్ జరగనుండగా ప్రముఖ పాత్రలు పోషిస్తున్న అలీ, సునీల్లు ఇక్కడికి రావడంతో సందడి నెలకొననుంది. మా చిత్రం పూర్తయిన తర్వాత జిల్లా కేంద్రంలో ఉన్న లొకేషన్లు అందరికీ తెలిసి ఇక్కడ ఎక్కువ సినిమాల నిర్మాణం జరిగే అవకాశం ఉంది. ఈ సినిమాను దీపావళి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. మంచి కథతో దర్శకులు వస్తే తెలంగాణ చరిత్రకారుల బయోగ్రఫీలో నటించేందుకు సిద్ధం. హైదరాబాద్లో షూటింగ్ లొకేషన్కు వెళ్లాలంటే 2 గంటల సమయం పడుతుంది. అదే సమయంలో కరీంనగర్ వచ్చి షూటింగ్ చేయవచ్చు. హైదరాబాద్లో షూటింగ్ ప్రొడక్షన్ ఖర్చుతో పోలిస్తే కరీంనగర్లో తక్కువ. -
ఆయుధాల ప్రదర్శన
ఆయుధాలను పరిశీలిస్తున్న ఎన్సీసీ కెడెట్లుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని 9వ తెలంగాణ బెటాలియన్ ఎన్సీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం ఎన్సీసీ కెడెట్లకు పీటీసీ సహకారంతో ఆయుధాల ప్రదర్శన నిర్వహించినట్లు కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఏకే జయంత తెలిపారు. ఈ సందర్భంగా కెడెట్లకు 0.22 రైఫిల్, 7.62 ఎంఎం రైఫిల్, 303 రైఫిల్, ఏకే 47 పనిచేయు విధానం, వివిధ భాగాల గురించి క్లుప్తంగా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ ఎం.పిచ్చయ్య, సీహెచ్ మల్లికార్జున్, ఎల్.మహేశ్, జె.శ్రీకాంత్, పీటీసీ స్టాఫ్, ఎన్సీసీ అధికారులు కెప్టెన్ రేల్ల సంజీవ్, త్రివేణి, ఉదయశ్రీ, శ్రీనివాస్, ప్రశాంత్ పాల్గొన్నారు. -
రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలి
కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీలు రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని రిటైర్డు ఐఏఎస్ అధికారి చిరంజీవులు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పద్మశాలీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ రాజ్యాధికార సభలో పాల్గొని మాట్లాడారు. గడపగడపకు బీసీల భావాజాలాన్ని తీసుకెళ్లి, 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం ఆపవద్దని సూచించారు. 75 ఏళ్లుగా బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, ఇకనైనా మేల్కొని హక్కులు సాధించుకునే వరకు రాజీలేని పోరుకు సిద్ధం కావాలన్నారు. బీసీలలో చైతన్యం నింపేందుకు ఇప్పటికే తాను పలు పుస్తకాలు, వ్యాసాలు రాసినట్లు చెప్పారు. ఈ చైతన్యాన్ని మరింత విస్తృతంగా గ్రామ గ్రామాన తీసుకెళ్లి బీసీల బలాన్ని కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం 9వ షెడ్యూల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. చొప్పదండి మాజీ జెడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సభలో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఉరుమల్ల విశ్వం, ప్రసన్న హరికృష్ణ, చామకూర రాజు, అవ్వారి వేణుకుమార్, బైరి శేఖర్, పొన్నం దేవరాజుగౌడ్, సరోజ, సబ్బని వెంకట్, అయిలి వెంకన్న, కీర్తి లత, వాసాల రమేశ్, లింగం యాదవ్, కొమురయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు
● తొలగించిన రెవెన్యూ సిబ్బంది చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి శివారులోని పాంబండ వద్ద సర్వే నంబర్ 840, 841లో కొందరు దళితులు ఆదివారం అక్రమంగా గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ రమేశ్ గుడిసెలు తొలగించాలని ఆదేశించినా, దళితులు వినకపోవడంతో రెవెన్యూ సిబ్బంది తొలగించారు. కాగా గతంలో గ్రామపంచాయతీ నుంచి తమకు పట్టాలు జారీ చేశారని తహసీల్దార్కు దళితులు విన్నవించగా, గ్రామపంచాయతీ వారు ఇచ్చిన పట్టాలు చెల్లవని తహసీల్దార్ పేర్కొన్నారు. కాగా కొందరు ప్రజాప్రతినిధుల అండదండలతోనే జర్నలిస్టులకు చెందాల్సిన భూముల్లో గుడిసెలు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ స్థలంలో చిగురుమామిడి జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సతీశ్కుమార్, తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్కు లేఖ రాశారు. తక్షణమే చర్యలు చేపట్టాలని తహసీల్దార్కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాగా మంత్రి సిఫారసు చేసి ఐదు నెలలు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యంతో జర్నలిస్టులకు చెందాల్సిన భూమి వివాదాస్పదంగా మారిందని పలువురు వాపోతున్నారు. -
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీశ్ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్, బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను సీసీఎస్ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల ఆశచూపి.. అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. బెదిరింపులు... బ్లాక్మెయిల్ మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు. ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే? మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ మాటలు నమ్మి నూనావత్ భాస్కర్ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ త్రీటౌన్లో గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ (5) కింద కట్ల సతీశ్పై కేసు నమోదు చేశారు. ఇది నాన్బెయిలబుల్. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 సెక్షన్ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తిపై పీడీయాక్ట్
జగిత్యాలక్రైం: శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపడుతున్నామని జగిత్యాల ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. జగిత్యాల పోలీస్స్టేషన్ పరిధిలోని విద్యానగర్కు చెందిన బండి అలియాస్ తరాల శ్రీకాంత్ తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో గతంలో రౌడీషీట్ ఓపెన్ చేసి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. కానీ, అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పీడియాక్ట్ నమోదు చేసి ఉత్తర్వుల కాపీని నిందితుడికి కరీంనగర్ జైల్లో అందజేయడంతో పాటు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందన్నారు. నిందితుడిపై గతంలో హత్యలు, హత్యాయత్నాలు, దొంగతనాలు, బెదిరింపులకు పాల్పడిన 20 కేసులు నమోదయ్యాయని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీయాక్ట్ తో పాటు, అవసరమైతే నగర బహిష్కరణ కూడా అమలు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ, పునరావృత నేరాలను అరికట్టేందుకు పోలీస్శాఖ కృషి చేస్తుందన్నారు. పీడీయాక్ట్ అమలుచేయడంలో కీలక పాత్ర పోషించిన జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, పట్టణసీఐ కరుణాకర్ను ఎస్పీ అభినందించారు. -
సారూ.. ఒక్కబస్తా ఇవ్వరూ
శంకరపట్నం/తిమ్మాపూర్: జిల్లాలో అన్నదాతలకు యూరియా గోస తప్పడం లేదు. తెల్లవారకముందే రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శంకరపట్నం మండలం మెట్టుపల్లి సహకార సంఘం పరిధిలోని కొత్తగట్టు గోదాంకు లారీలో 450 బస్తాల యూరియా వచ్చింది. కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాలతో పాటు సైదాపూర్ మండలానికి చెందిన రైతులు శనివారం వేకువజామున్నే బారులు తీరారు. కౌలు రైతులు యజమాని పాసుపుస్తకం జిరాక్స్లు ఇచ్చారు. సంబంధిత వ్యక్తి వస్తేనే యూరియా ఇస్తామని ఏఈవోలు తిరుపతి, కీర్తన చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తిమ్మాపూర్ మండలం పోరండ్ల సొసైటీ ఆధ్వర్యంలో మన్నెంపల్లి అమ్మకాల కేంద్రం వద్ద ఉదయాన్నే రైతులు బారులు తీరారు. సరిపడని బస్తాలు లేక వెనుదిరిగారు. నుస్తలాపూర్ సొసైటీ వద్ద రైతులు ఉదయం నుంచే క్యూ కట్టారు. -
లోక్ అదాలత్లో 3,194 కేసులు పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ కరీంనగర్క్రైం: లోక్ అదాలత్లో రాజీద్వారా కేసుల సత్వర పరిష్కారం పొందవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శివకుమార్ సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీ య లోక్అదాలత్ నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన జడ్జి ఎస్.శివకుమార్ మాట్లాడు తూ.. రాజీ ద్వారా ఇరు పార్టీల వారు తమ కేసులు పరిష్కరించుకుంటే ఇరువురు సంతో షంగా ఉంటారన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 3,194 కేసులు పరిష్కరించబడ్డాయని సివిల్ కేసులు71, క్రిమినల్ కేసులు 3,123, బ్యాంక్, బీఎస్ఎన్ఎల్ కేసులు 109తో పాటు ట్రాఫిక్ చలాన్ కేసులు 74,651 పరిష్కరించినట్లు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు మాట్లాడుతూ న్యాయమూర్తులు, పోలీసు అధికారుల సహకారంతో ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించబడుతున్నాయని తెలిపారు. సీసీఆర్బీ ఏసీపీ శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు. 20 ఎకరాలు.. రూ.60 కోట్లుసాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లా రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల దురాక్రమణపై మరోసారి ఉక్కుపాదం మోపారు. జిల్లాలో ల్యాండ్ మాఫియాపై కొరడా ఝుళిపించే క్రమంలో వేములవాడ మండలం నాంపల్లి శివారులో సుమారు రూ.60కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని శనివారం స్వాధీనం చేసుకున్నారు. గ్రామ శివారులోని సర్వేనంబర్లు 485, 486, 487లో సుమారు 20 ఎకరాల భూమి జిల్లా కేంద్రం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు ఆధీనంలో ఉన్నాయి. వీటిపై ఫిర్యాదు అందుకున్న జిల్లా రెవెన్యూ అధికారులు సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందని విచారణలో తేల్చారు. దీంతో రెవెన్యూ అధికారులు సదరు స్థలాలను ప్రభుత్వానికి స్వాధీనం పరిచారు. రూ.60కోట్ల విలువైన స్థలాలు తిరిగి ప్రభుత్వపరం కావడం రాజకీయంగా, స్థానికంగా చర్చనీయాంశమైంది. కరీంనగర్స్పోర్ట్స్: నల్గొండ జిల్లాలో ఆదివారం నుంచి జరగనున్న 12వ సీనియర్స్ యోగాసన చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్సింగ్ సూచించారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో యోగా క్రీడాకారులతో మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, యోగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కన్నకృష్ణ, కార్యదర్శి నాగిరెడ్డి సిధారెడ్డి, కోచ్లు కిష్టయ్య, రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనందకిషోర్, తిరుపతి అభినందించారు. కరీంనగర్టౌన్: భారత విదేశాంగ మంత్రిత్వశాఖ రీజినల్ పాస్పోర్టు ఆఫీస్ ఆధ్వర్యంలో కరీంనగర్ కమాన్రోడ్డులోని ఫార్చూన్మాల్ మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ఈనెల 15న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రటరీ కె.జె.శ్రీనివాస్, హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు ఆఫీసర్ జె.స్నేహజ తెలిపారు. ఇప్పటి వరకు రూరల్ పోలీస్స్టేషన్ సమీపంలోని మున్సిపల్ భవనంలో పాస్పోర్టు లఘుసేవా కేంద్రం కొనసాగగా, ఇక నుంచి నూతన భవనంలో పూర్తిస్థాయి సేవలు అందించనుందని వెల్లడించారు. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, ఎల్.రమణ, చిన్నమైల్ అంజిరెడ్డి, మల్క కొమురయ్య, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. -
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎములాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) ఆధ్వర్యంలో ప్రధాన ఆలయ విస్తరణ, అన్నదాన సత్రం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. మూలవాగు నుంచి ప్రధాన ఆలయం వరకు బ్రిడ్జి, రహదారి విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆగమ శాస్త్రానుసారంగా పనులు చేపడుతూ భక్తులకు అన్ని వసతులు కల్పంచనున్నారు. రోడ్డు విస్తరణకు మార్గం సుగమం వేములవాడలో ఎన్నో దశాబ్దాల కల నెరవేరనున్నది. మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఇప్పుడున్న 40ఫీట్ల రోడ్డును 80ఫీట్లకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.47.86 కోట్లు మంజూరు చేసింది. వీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చొరవతో రోడ్డు విస్తరణలో ఇండ్లు, స్థలాలు కోల్పోతున్న నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కులు అందించి, కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టారు. రూ.6.56 కోట్లతో బ్రిడ్జి పనులు మొదలయ్యాయి. వంతెన పూర్తయితే భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఆకర్షణీయంగా మహా మండపం, గోపురాలు మొదటి దశలోనే రూ.111 కోట్లతో మహా మండ పం, నిత్య కల్యాణ మండపం, ధర్మగుండం పునరుద్ధరణ, కొత్త రాజ గోపురాలు ఆకర్షణీయంగా నిర్మించేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గుడి చెరువు ఘాట్ అభివృద్ధి, బండ్ సుందరీకరణ, మల్టీ లెవెల్ పార్కింగ్, వాహనాల కోసం విస్తృత స్థలాలు అభివృద్ధి కానున్నాయి. షాపింగ్ కాంప్లెక్సులు, హెల్ప్డెస్క్, సాంస్కృతిక వేదికలు ఏర్పాటు కానున్నాయి. ఆలయం వద్ద రూ.25కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. రూ.35.25 కోట్లతో అన్నదాన సత్ర భవనం నిర్మా ణం జరుగుతోంది. ఒకేసారి వెయ్యి మంది భోజనం చేసే డైనింగ్ హాల్, 600మందికి వెయిటింగ్ హాల్, లడ్డూ తయారీ కేంద్రం, ఆధునిక వంటశాలలు ఏర్పాటు కానున్నాయి. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా పాత కట్టడాల కూల్చివేత, కొత్త నిర్మాణాలకు స్థలం సిద్ధం చేస్తున్నారు. రూ.150 కోట్ల వ్యయంతో రహదారుల విస్తరణ, రూ.3.40 కోట్లతో భూసేకరణ, ప్రహరీ నిర్మించనున్నారు. భీమేశ్వర ఆలయంలో పనులు.. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ పనులు రూ.10కోట్ల నిధులతో సాగుతున్నాయి. రూ.12కోట్ల నిధులతో చేపట్టిన గుడి చెరువు పనులు తుదిదశకు చేరుకున్నాయి. రాజన్న ప్రధాన ఆలయంలో స్వామి వారికి నిత్య పూజలు యథావిధిగా కొనసాగుతాయి. భీమేశ్వర ఆలయంలో రూ.3.44 కోట్లతో కల్యాణ మండపం, హోమ, వ్రత మండపం, షెడ్ నిర్మాణం, క్యూ లైన్లు, సీసీ ఫ్లోరింగ్ పనులు కొనసాగుతున్నాయి. రాజన్న కోడెల సంరక్షణపై ప్రత్యేక దృష్టి రాజన్న కోడెల సంరక్షణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గోశాలలో సీసీ ఫ్లోరింగ్, షెడ్లు నిర్మింపజేశారు. ఇతర పారిశుధ్య పనులు నిత్యం చేయిస్తున్నారు. సన్నకారు రైతులకు రెండు వేల కోడెలు అందించారు. కోడెల ఆరోగ్య సంరక్షణకు వైద్యసిబ్బందిని నియమించారు. గోశాలలోని జీవాలకు అందించేందుకు 40ఎకరాల ప్రభుత్వ భూమిలో పచ్చగడ్డి పెంచేందుకు చర్యలు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వీటీడీఏ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వ లక్ష్యం ప్రకారం గడువులోగా పనులు పూర్తి చేసేందుకు ముందుకు సాగుతున్నాం. ఆలయ విస్తరణ, రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి సహకరిస్తున్న వేములవాడ ప్రజలకు ధన్యవాదాలు. – సందీప్ కుమార్ ఝా వీటీడీఏ వైస్ చైర్మన్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తోంది. శృంగేరి పీఠాధిపతులు, వాస్తు పండితులు, ప్రముఖుల సలహాలు, సూచనలు మేరకు ఆలయాన్ని విస్తరిస్తున్నాం. భక్తులకు సులభంగా.. వేగంగా దర్శనం కల్పిస్తాం. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు. – ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
గంగాధర(చొప్పదండి): మండల కేంద్రానికి చెందిన తాళ్ల కార్తీక్ (19) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. కార్తీక్ కొంతకాలంగా మద్యానికి బానిసై తరుచూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గతంలో గొడవపడి ఒకసారి డిష్ వైర్తో ఆత్మహత్యాయత్నం చేయగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించారు. శుక్రవారం కార్తీక్ పుట్టినరోజు కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో కేక్కట్ చేశాడు. తర్వాత అతిగా మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. రాత్రి అందరూ ఇంట్లో నిద్రపోయారు. శనివారం వేకువజామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి కార్తీక్ గదిలో విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చొప్పదండి సీఐ ప్రదీప్కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్రావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి..ధర్మపురి: గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపెల్లి మండలం రుద్రాపూర్కు చెందిన దుర్గం జీవన్ (23) శనివారం రాత్రి రాయపట్నం రూట్లోని మోరోల్లవాగు సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈక్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. జీవన్ మూడురోజుల క్రితం ఇంట్లో గొడవ జరుగగా ధర్మపురికి వచ్చినట్లు అతడి బంధువుల ద్వారా తెలిసిందని ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. ఢీకొట్టిన వాహనం దొరకలేదని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. చికిత్సపొందుతూ ఒకరు.. శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని గ ద్దపాక గ్రామానికి చెందిన నిమ్మరాజు రాజు(55) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాలు.. రాజు ఈనెల 9న రాత్రి సమయంలో నిద్రమత్తులో నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు ఇంటిలోని ప్లోరింగ్పై పడడంతో తలకు తీవ్రగాయమైంది. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మహిళా కాంగ్రెస్లో పదవుల పంచాయితీ
కరీంనగర్ కార్పొరేషన్: మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలి నియామకం ఆ పార్టీలో పంచాయితీకి కారణమైంది. నగర అధ్యక్షురాలిగా వెన్నం రజితారెడ్డిని నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత ఈ నెల 9వ తేదీన ఆదేశాలు జారీ చేశారు. శనివారం డీసీసీ కార్యాలయంలో జరిగిన సిటీ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమవేశంలో నగర అధ్యక్షురాలు నియామకాన్ని బహిరంగంగా ప్రకటించగా, పలువురు మహిళానాయకురాళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకు పదవి ఎలా ఇస్తారంటూ సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్ను నిలదీశారు. సమావేశం ముగిసిన అనంతరం కూడా సుడా చైర్మన్ వాహనానికి అడ్డుగా బైఠాయించి నిరసన తెలిపారు. చివరకు అది పార్టీ తీసుకున్న నిర్ణయమని సర్ది చెప్పి నరేందర్రెడ్డి వెళ్లిపోయారు. ‘వెలిచాల’ అభినందన మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలుగా నియామకమైన రజితరెడ్డిని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు అభినందించారు. నగరంలోని ప్రజాకార్యాలయంలో రాజేందర్రావును రజిత మర్యాదపూర్వకంగా కలిశారు. రజితను ఆయన శాలువతో సత్కరించారు. నాయకులు ఆకుల నర్సయ్య, కోటగిరి భూమాగౌడ్, ఆకుల ఉదయ్, వేల్పుల వెంకటేష్పటేల్, బట్టు హరికృష్ణ పాల్గొన్నారు. -
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కిడ్నీ సమస్యతో ఓ యువకుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. ఆర్థికసాయం కోసం అతడి తల్లిదండ్రులు అర్జిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గూల్ల సమ్మక్క– సదయ్య దంపతుల ఏకై క కుమారుడు రాహుల్(26) కిడ్నీ వ్యాధితో ఆరునెలలుగా బాధపడుతున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి చెందిన ఆ తల్లిదండ్రులు ఉన్న ఎకరం అమ్మి ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. బంధువుల వద్ద రూ.20 లక్షల వరకు అప్పు తెచ్చి ఖర్చు చేశారు. పూర్తిగా నయం కావాలంటే మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని, ఇకపై ఖర్చు పెట్టే స్థోమత లేదని వాపోతున్నారు. సహృదయులు తమ కుమారుడి చికిత్స కోసం ఆర్థికసాయం అందించి పుత్రభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు. ఆర్థికసాయం చేసే దాతలు 97041 87229 ఫోన్నంబర్కు పంపించాలని కోరారు. -
భార్యవెంటే భర్త..
జగిత్యాలక్రైం: నిండునూరేళ్లూ కలిసి ఉంటామని బాస చేసిన ఆ దంపతులు మరణంలోనూ కలిసేపోయారు. ఒకేరోజు గంటల వ్యవధిలో మరణించడం.. ఒకే చేతిలో ఇద్దరి మృతదేహాలను పేర్చి.. ఒకేచోట అంత్యక్రియలు పూర్తిచేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అనంతారం గ్రామానికి చెందిన సత్రపు రాజనర్సు (85), సత్రపు లక్ష్మీ (80) భార్యాభర్తలు. వీరికి రమేశ్ కుమారుడు. రాజనర్సు 20 ఏళ్ల క్రితం వెదురుబొంగులు తీసుకొచ్చేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ అడవిపంది దాడిచేయడంతో బండపైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతడి వెన్నుపూస విరిగి అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యాడు. అతడి బాగోగులను భార్య లక్ష్మీ, కొడుకు రమేశ్ చూసుకుంటున్నారు. లక్ష్మీ వారం రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందింది. విషయాన్ని కొడుకు రమేశ్ తండ్రికి చెప్పడంతో.. అతడు తీవ్రంగా రోదించాడు. కొద్దిసేపటికే గుండెపోటుతో మృతిచెందాడు. దంపతులిద్దరూ ఒకేరోజు మృతిచెందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోధనలు మిన్నంటాయి. ఇద్దరికి వేర్వేరుగా పాడె కట్టి ఒకేచితిలో పెట్టి అంత్యక్రియలు పూర్తి చేశారు. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులు ఒకేరోజు మృతిచెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకేరోజు భార్యాభర్తల మృతి అనారోగ్యంతో భార్య, గుండెపోటుతో భర్త జగిత్యాల జిల్లా అనంతారంలో విషాదం -
నవోదయలో దరఖాస్తులకు ఆహ్వానం
చొప్పదండి: చొప్పదండి జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ, పదకొండవ తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8వ తరుగతి చదువుతున్న వారు తొమ్మిదో తరగతిలో మిగులు సీట్లకు, పదో తరగతి చదువుతున్న వారు 11వ తరగతిలో మిగులు సీట్లకు అర్హులని తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 23 లోగా ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎల్ఎండీలో వింత చేపతిమ్మాపూర్(మానకొండూర్): మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన మత్స్యకారుడు బోళ్ల భూమయ్య చేపలు పట్టేందుకు శనివారం ఉదయం ఎల్ఎండీ రిజర్వాయర్కు వెళ్లాడు. ఈ క్రమంలో వలలు తీస్తుండగా ఎర్రరంగులో ఉన్న వైరెటీ చేప భారీ సైజులో కనిపించడంతో పైకి తీసి గమనించాడు. ఇప్పటివరకు ఎల్ఎండీ రిజర్వాయర్లో ఇలాంటి చేప పడలేదని మత్స్యకారులు తెలిపారు. ఇది ఉత్తరప్రదేశ్కు చెందిన చేపగా పలువురు చెబుతున్నారు. వైరెటీ చేపను చుట్టుపక్కల గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు. సైబర్ వల నుంచి తప్పించుకున్న మహిళహుజూరాబాద్: సైబర్ నేరగాళ్ల వల నుంచి ఓ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. హుజూరాబాద్ పట్టణానికి చెందిన సుస్రత్ అనే మహిళలకు గుర్తు తెలియని ఫోన్ నంబర్ నుంచి కాల్ చేసి ‘మీ కూతురు తీవ్రమైన కేసులో ఇరుక్కుంది, ఆమె ప్రస్తుతం పోలీస్ కస్టడిలో ఉంది’ అని నమ్మించారు. కేసు పరిష్కారం కోసం తక్షణం రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సైబర్ నేరగాళ్లు ఒత్తిడి చేసినా సుస్రత్ మానసికంగా కుంగిపోకుండా తన కూతురు క్షేమంగా ఉందో లేదో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె వెంటనే తన కూతురు చదువుతున్న కళాశాలకు వెళ్లగా, అక్కడ క్లాసులో క్షేమంగా, సంతోషంగా ఉండడం చూసి ఊపిరి పీల్చుకుంది. ఫోన్కాల్ మోసపూరితమని గ్రహించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా తెలివితేటలతో వ్యవహరించిన మహిళను సీఐ కరుణాకర్ అభినందించారు. -
హాజరుశాతం పెరిగింది
ఎఫ్ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్ఎం ప్రసారాలు చేస్తున్నాం. – రాజ్కుమార్, ప్రిన్సిపాల్ఎఫ్ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది. – శ్రీనిధి, 9వ తరగతిరేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి. – జ్యోత్స్న, 9వ తరగతి -
ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. తహసీల్దార్ అరెస్టు
జగిత్యాలక్రైం: ప్రభుత్వ మహిళా ఉద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసి న జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీ ల్దార్ రవీందర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ వివరాల ప్రకా రం.. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతనితో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సప్లో అసభ్యకరంగా సందేశాలు పంపాడు. ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని జగిత్యాలకు చెందిన ఓ తహసీల్దార్ మధ్యవర్తిత్వం వహించాడు. సదరు మహిళా ఉద్యోగి ఒప్పుకోకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడిఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్షాపు యజ మాని బ్లాక్లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాజీయే.. రాజమార్గం
కరీంనగర్క్రైం: కోర్టుల్లో కేసులుంటే ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమని అందరికీ తెలిసిన విషయమే. వివిధ కేసుల్లో కక్షిదారులు సంవత్సరాలుగా తిరుగుతున్న వారు అనేకమంది ఉన్నారు. ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో సామరస్యంగా కేసు పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు వేదికలుగా మారుతున్నాయి. న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే లోక్ అదాలత్లలో ఇరువర్గాల కక్షిదారుల సమ్మతితో రాజీ చేయదగిన కేసులను ముందస్తుగా గుర్తించారు. జాతీయ, రాష్ట్ర న్యాయసేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ(డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ బెంచ్లు ఏర్పాటు చేయబడ్డాయి. శనివారం కోర్టుల్లో లోక్ అదాలత్ సందర్భంగా కేసులను పరిష్కరించనున్నారు. లోక్ అదాలత్లో రాజీ పడితే దీనిపై అప్పిల్కు వెళ్లరాదు. ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది. 2,740 కేసులు.. లోక్ అదాలత్లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ కేసులు, కుటుంబ సంబంధాలు, మోటార్ వాహనాల కేసులు, చెక్ బౌన్స్, బ్యాంకు, చిట్ఫండ్, వినియోగదారుల ఫోరం కేసులతోపాటు వివిధ కేసులు పరిష్కరించనున్నారు. ఇందులో భాగంగా 2,525 క్రిమినల్ కేసులు, 215 సివిల్ కేసులు గుర్తించారు. ఆయా కేసుల్లో కక్షిదారులను గుర్తించి వారికి ఇప్పటికే నోటీసులు పంపించారు. న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో లోక్ అదాలత్కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. కొన్ని రోజుల నుంచే పోలీసులు క్రిమినల్ కేసుల్లో రాజీ చేయదగిన వాటిని గుర్తించి వారికి సమాచారమందించి లోక్ అదాలత్ వేదికకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో వివిధ రాజీ చేయదగిన కేసులను గుర్తించాం. కోర్టులో కేసులు పెండింగ్లో ఉంటే కక్షిదారులకు మానసికంగా, ఆర్థికంగా నష్టం జరగడంతోపాటు సమయం వృథా అవుతుంది. రాజీ కుదర్చుకొని కేసులు పరిష్కరించుకుంటే ఇరువర్గాల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది. కేసులు లోక్ అదాలత్లో రాజీ కుదర్చుకుంటే ఇరువర్గాలు విజయం సాధించినట్లే. – కె.వెంకటేశ్, న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి -
మళ్లీ దంచికొట్టిన వాన
చిగురుమామిడి/సైదాపూర్/శంకరపట్నం: వాన మళ్లీ దంచి కొట్టింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి హుజూరాబాద్, చిగురుమామిడి, శంకరపట్నం, సైదాపూర్ మండలాలు అతలాకుతలమయ్యాయి. చిగురుమామిడి మండలంలోని మోయతుమ్మెద వాగు పొంగి పొర్లుతోంది. దీంతో ఇందుర్తి–కోహెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంగోజిపేట చెరువు మత్తడి పారడంతో ఇందుర్తి–గాగిరెడ్డిపల్లి గ్రామాల రోడ్డు మూసివేశారు. ఇందుర్తి, సుందరగిరి ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో వర్షపు నీరుచేరాయి. చిన్న ముల్కనూర్, పీచుపల్లి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల మధ్య ఉన్న కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోయతుమ్మేద వాగుపై నిర్మించిన చెక్డ్యాంపై నీరు భారీగా ప్రవహిస్తోంది. శుక్రవారం చిగురుమామిడి తహసీల్దార్ ఎం.రమేశ్, ఎంపీడీవో మధుసూధన్, ఇరిగేషన్శాఖ అధికారులు పర్యటించి వర్షం.. నష్టం.. ఇబ్బందుల వివరాలు సేకరించారు. శంకరపట్నం మండలం అంబలాపూర్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల్లో పొలాలు నీటమునిగాయి. కేశవపట్నం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. చెర్లపల్లి–కేశవపట్నం గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపూర్ మండలం సోమారంలో ఆదర్శ పాఠశాల చుట్టూ వర్షపు నీరు నిలిచాయి. హాస్టల్ విద్యార్థులు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. పోల్కమ్మ చెరువు మత్తడి దూకుతోంది. గర్రెపల్లిలో చేలలో నీరుచేరింది. న్యాల చెరువు మత్తడి పోస్తోంది. నేలకల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. మండలంలో 149.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులువెల్లడించారు. -
ఉద్యోగిపై లైంగిక వేధింపులు.. తహసీల్దార్ అరెస్టు
జగిత్యాలక్రైం: ప్రభుత్వ మహిళా ఉ ద్యోగిని లైంగిక వేధింపులకు గురిచేసి న జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీ ల్దార్ రవీందర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ వివరాల ప్రకా రం.. పెగడపల్లి తహసీల్దార్ రవీందర్ జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే విధులు నిర్వహించాడు. ఆ సమయంలో అతనితో కలిసి పనిచేసిన ఓ మహిళా ఉద్యోగికి వాట్సప్లో అసభ్యకరంగా సందేశాలు పంపాడు. ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. తనను లైంగికంగా వేధించాడని బాధిత మహిళ శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని జగిత్యాలకు చెందిన ఓ తహసీల్దార్ మధ్యవర్తిత్వం వహించాడు. సదరు మహిళా ఉద్యోగి ఒప్పుకోకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
130 మంది మందుబాబులకు జరిమానా
● డ్రంకెన్డ్రైవ్లో పట్టుబడ్డ యువత వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్స్టేషన్ పరిధి లో 14 రోజులుగా నిర్వహించిన డ్రంకెన్డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 130 మంది మందుబాబు లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 70 మంది ద్విచక వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు, 30 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, 30 మంది టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ వేములవాడ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఠాణా ఆవరణలో వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేపించారు. అదుపుతప్పి బోల్తాపడిన ఆటో శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపా రు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆరుగురు ఆటోలో తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బంధువుల సంవత్సరికానికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నలుగురు మహిళలకు గాయాలు కాగా మరో ఆటోలో చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. -
పేట్రేగిపోతున్న సైబర్మోసగాళ్లు
గోదావరిఖని: ప్రపంచం సెల్ఫోన్ గుప్పిట్లోకి వచ్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్షాపింగ్, ఆన్లైన్ టూరిజం, ఆన్లైన్ గేమింగ్.. ఇలా ఒక్కటేమిటి ప్రతీది సెల్ఫోన్ ద్వారానే జరుగుతోంది. సెల్ఫోన్ ఎంత సౌకర్యంగా ఉందో, అప్రమత్తంగా లేకుంటే అదేస్థాయిలో మోసపోయే ప్రమాదమూ ఉంది. రోజుకో తీరులో సైబర్మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సెల్ఫోన్ లేకుంటే క్షణం కూడా గడవని ఈరోజుల్లో.. ఇదే సెల్ఫోన్ ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేనివారు. డబ్బు అత్యవసరం ఉన్నవారిని టార్గెట్ చేసుకొంటున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం సైబర్గాళ్ల వలలో చిక్కుతున్నారు. కొద్దిరోజులుగా బాధితులు పోలీస్కు ఫిర్యాదు చేయడం అధికంగా అవుతోంది. అపరిచిత కాల్స్కు స్పందిస్తే.. అపరిచిత కాల్స్కు స్పందించినా, గుర్తుతెలియని లింక్స్ క్లిక్ చేసినా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్లే. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్చేసి ఆధార్ అప్డేట్ చేయాలి.. లింక్ పంపిస్తున్నామంటూ ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియోకాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి న్యూడ్గా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి మరీ డబ్బులు గుంజుతారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి నేరాల్లో కొన్నింటిపైనే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు పరువు పోతుందనో, ఇరుగుపొరుగువారిలో చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరికీ చెప్పకుండా లోలోపల మదనపడుతున్నారు. ఏపీకే ఫైళ్లు పంపి ఇలా.. ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) పైళ్లను వాట్సప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్చేసి ఓకే అని క్లిక్ చేసేవారి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. ఈ విషయం తెలియనివారు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా సొమ్ము పంపితే వెంటనే సైబర్ నేరగాళ్లు పిన్ నంబర్ తెలుసుకొని నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన ఫోన్ డివైస్ డిస్ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీంతో నేరగాళ్లు ఆ ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. దీంతో తమకు తెలిసిన వ్యక్తి నుంచే మేసేజ్ వచ్చిందని భావించిన ఇతరులు ఆఏపీకే ఫైళ్లలింక్ను ఓపెన్ చేయటంతో ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ రివార్డ్స్, పెళ్లికార్డులు, బర్త్డే ఇన్విటేషన్ తదితర లింక్ల పేరిట పంపుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు లాగేస్తున్నారు. జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్.. జాబబ్ పేరుతో ఆన్లైన్లో డబ్బులు పంపించమని చాలామందిని మోసం చేస్తున్నారు. ఇలాగే స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆన్లైన్లో లాభాలు చూపిస్తూ పెద్దమొత్తంలో పెట్టిబడి పెట్టిన తర్వాత చేతులెత్తేస్తున్నారు. కొందరికి ఓటీపీ పంపి దాన్ని చెప్పమని ఆ తర్వాత ఖాతా ఖాళీ చేస్తున్నారు. మీ ఆధార్కార్డ్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని వెంటనే డిటేల్స్ చెప్పాలని ఒత్తిడి చేసి ఆ తర్వాత సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త పంథాలో ఆన్లైన్ మోసాలు చలాన్ల పేరుతో గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ ఓపెన్చేస్తే ఖాతాలోంచి మాయమవుతున్న డబ్బు బలవుతున్న సామాన్యులు, అమాయకులు రెండేళ్లలో జరిగిన సైబర్ మోసాలు ఏడాది ఫిర్యాదులు నష్టం(రూ.లలో) రికవరీ(రూ.లలో) 2024 1,406 3,91,20,408 11,02,566 2025 1,206 2,75,00,542 22,35,689 అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తతతోనే ఆన్లైన్మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రధానంగా ఏపీకే ఫైల్స్ పంపి వాటిని ఓపెన్ చేస్తే ఉన్న సొమ్మంతా మాయం చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని లింక్లు పంపించి ఆ తర్వాత సొమ్ము రాబట్టి మోసం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీలాభాలు ఇస్తామని, లాభాలను ఆన్లైన్లోనే చూపించి పెద్దమొత్తంలో నొక్కేస్తున్నారు. దీనిపై పోలీసుశాఖ అవగాహన కల్పిస్తోంది. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా సమీప పోలీస్స్టేషన్లో సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
అంగన్వాడీల్లో ఆటపాటలతో బోధన
కొత్తపల్లి/రామడుగు: చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన మంచి విద్యాబోధన అందిస్తున్నట్లు, తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలను పంపించాలని కలక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీలో ఐసీడీఎస్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రీ స్కూల్ మేళా, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, గంగాధర ఐసీడీఎస్ అధికారి నర్సింగరాణి, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరి, సూపర్వైజర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సాయం చేసే స్థాయికి ఎదగాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పట్టుదలతో చదివి పది మందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. కొత్తపల్లి మండలం ఎలగందుల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్యారియాన్ లెదర్ హౌస్ యజమాని హుస్సేన్, సూపర్వైజర్ మేడి నగేశ్ సహకారంతో శుక్రవారం ఏర్పాటు చేసిన బ్యాగుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలకు పంపిణీ చేసిన గోడ గడియారాల్లో సూచించిన 12 అంశాలను తెలిపే విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్లానింగ్ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఈవో ఆనందం, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో నరసింహారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటకు చెందిన మెట్టు శ్రీనివాస్(50)సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శరీరం కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతుని కుటుంబసభ్యులు హైదరాబాద్లో ఉంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మిస్తుండడంతో శ్రీనివాస్ స్వగ్రామం గంభీరావుపేటలో ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యబోయినపల్లి (చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ముకుంద అనిల్ (22 ) ఏడాదిగా ఒంటరిగా ఉంటూ కిరాణషాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఇనుప పైపుకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోక్సో కేసులో పదేళ్ల జైలు పెద్దపల్లిరూరల్: ఓ బాలికపై అఘాయిత్యం చేసిన కేసులో మందల రవికి పదేళ్ల కఠిన కారగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శుక్రవారం తీర్పునిచ్చారని సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. 2017 జనవరి 21న పాల పాకెట్ తీసుకొచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన తన కూతురు చాలాసేపటి వరకు ఇంటికి రాలేదు. ఎదురుగా వెళ్లిన ఆమెను ఇంటివద్ద దిగబెడతానని నమ్మించి రవి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీస్స్టేషన్లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్హెచ్వో శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పూర్వాపరాలపై విచారణ జరిపి వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రవికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అలాగే లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. ఉరేసుకుని యువకుడు మృతివెల్గటూర్: నాలుగేళ్ల క్రితమే తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, అదే అనారోగ్యం కొడుకునూ బాధించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి కడుపు కోత మిగిల్చాడు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంగ శరత్కుమార్(23) గ్రామంలో హార్వెస్టర్ నడిపిస్తుంటాడు. కొంతకాలంగా ఛాతినొప్పితో బాధపడుతున్నారు. పలుమార్లు హాస్పిటల్కు వెళ్లినా సమస్య తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా రోదించింది. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. గంజాయి విక్రేతల రిమాండ్వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మండలంలో ని గర్జనపల్లికి చెందిన భరత్, దినేశ్ వీర్నపల్లిలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై వేముల లక్ష్మణ్ అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు. -
ఫీజు పోరు
శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని, విద్యాశాఖకు మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు మాట్లాడారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 8,700 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. నిరసనలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేశ్, కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విగ్నేష్, నగర కార్యదర్శి చిప్ప యోగేశ్, భామండ్ల నందు, జోనల్ ఇన్చార్జీలు ఆకాష్, హరీష్, ప్రశాంత్, సుధీర్ సింగ్, అశ్విని, అభినయ్, పావని, అక్షయ, అక్షిత, విష్ణు, నాగరాజు, స్ఫూర్తి, గాయత్రి, వంశీ, చరణ్ పాల్గొన్నారు. – కరీంనగర్ -
ఎస్జీఎఫ్ షెడ్యూల్ ఖరారు
15 నుంచి జిల్లాస్థాయిలో ప్రారంభం కానున్న పోటీలు కరీంనగర్స్పోర్ట్స్: పాఠశాలల క్రీడాసమాఖ్య క్రీడాసందడి మొదలైంది. మండల, జోన్స్థాయిలో పోటీలు అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా మైదానాలు విద్యార్థులు, క్రీడాకారులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి పోటీలు జాతరలను సైతం మైమరపింపజేసేలా జరుగుతుండడం విశేషం. ఈనెల 14 వరకు అన్ని మండలాల్లో క్రీడాపోటీలు ముగియనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పాఠశాలల క్రీడాసమాఖ్యల కార్యదర్శులు క్రీడల నిర్వహణపై ఇటీవల సమావేశమయ్యారు. ఏ జిల్లాలో ఏఏ క్రీడల్లో పోటీలను నిర్వహించాలో, జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో నేరుగా పోటీలను నిర్వహించే క్రీడలపై ఓ కొలిక్కి వచ్చారు. ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడల్లో మొదటగా జిల్లాలో పోటీలను నిర్వహించి.. తదనంతరం ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. మిగిలిన క్రీడల్లో నేరుగా ఉమ్మడి జిల్లా పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగే క్రీడల జాబితాను ఎస్జీఎఫ్ కార్యదర్శులు వేణుగోపాల్(కరీంనగర్), లక్ష్మణ్(పెద్దపల్లి), శ్రీనివాస్(రాజన్న సిరిసిల్ల), చక్రాధర్(జగిత్యాల) ప్రకటించారు. అండర్–14, 17.. పాఠశాల స్థాయిలో అండర్–14, 17 బాలబాలికల విభాగాల్లో జరగనున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు ఆగస్టు చివరి వారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నేటికి కూడా పలు మండలాల్లో మండలస్థాయి పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించడానికి ఎస్జీఎఫ్ కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15న కరీంనగర్లో అండర్–17 వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం కానుండగా.. మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లాస్థాయి పోటీలు పలు క్రీడల్లో జరగనున్నాయి. జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, కరాటే అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు ● కరీంనగర్ జిల్లాలో అథ్లెటిక్స్, అర్చరీ, బేస్బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కళారియపటు, కురాష్, మల్లాకంబ్, మోడరన్ పెంటాథ్ల్లాన్, నెట్బాల్, రగ్బీ, సెపక్ తక్రా, షూటింగ్, స్కేటింగ్, సాఫ్ట్బాల్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, యోగాసనా(అండర్–14, 17). ● పెద్దపల్లి జిల్లాలో స్విమ్మింగ్, టెన్నిస్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, కరాటే(అండర్–14, 17), క్రికెట్, కబడ్డీ, వాలీబాల్(అండర్–14). ● జగిత్యాల జిల్లాలో తైకై ్వండో, బాస్కెట్బాల్, చెస్, ఖోఖో(అండర్–14, 17). ● రాజన్న సిరిసిల్ల జిల్లాలో హ్యాండ్బాల్(అండర్–14, 17), వాలీబాల్, క్రికెట్, కబడ్డీ(అండర్–17).వర్షాలతో అంతరాయం జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో వర్షాలు భారీస్థాయిలో పడడంతో పోటీలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే మండలస్థాయి పోటీలు పూర్తి కావస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ మొదటివారంలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తాం. ఉమ్మడి జిల్లా పోటీలకు కూడా సిద్ధంగా ఉన్నాం. – చక్రధర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, జగిత్యాల -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడి ఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్షాపు యజ మాని బ్లాక్లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదెల: తహసీల్దార్తో గోడు వెల్లబోసుకుంటున్న రైతులుసిరిసిల్లలో యూరియా కోసం వచ్చిన తల్లీకూతుళ్లు పడిగె మణెమ్మ, రమ్య సిరిసిల్లలో క్యూలైన్లో కుటుంబ సభ్యులు ఓదెలలో తహసీల్ ఆఫీస్ ముట్టడి -
4.098 కిలోల గంజాయి స్వాధీనం
● కారు, మొబైల్ఫోన్ స్వాధీనం ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వెల్లడి ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి గ్రామ శివారులో 4.098 కేజీల గంజాయి స్వాధీనం చేసు కున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పొత్కపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా ఓ కారు వచ్చిందన్నారు. అందులో తనిఖీ చేయగా.. కంసాని అరుణ్ వద్ద 4.098 కేజీల ఎండు గంజాయి లభిందని పేర్కొన్నారు. దాని విలువ సుమారు రూ.2.04 లక్షలు ఉంటుందని వివరించారు. కారుతోపాటు మొబైల్ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వివరించారు. ఇదే కేసులో నిందితులు ఇల్లెందుకు చెందిన బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాశ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైతోపాటు ఏఎస్సై రత్నాకర్, కానిస్టేబుళ్లు రాజుయాదవ్, హరీశ్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేశ్ను అభినందించారు. ఎన్టీపీసీ స్టేజ్–2కు పర్యావరణ అనుమతులు జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీలో చేపట్టిన 2,400 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండోదశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. సుమారు ఎనిమిది నెలల క్రితం ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పర్యావరణ క్లియరెన్స్ కోసం గత ఆగస్టు 26న ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం పర్యావరణ అనుమతులను జారీ చేస్తూ భారత ప్రభుత్వ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విభాగం అనుమతి జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం –2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ను తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఒకటో దశ ప్రాజెక్టు నిర్మించింది. రెండోదశలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను నిర్మించనున్నారు. -
రాజన్నా శరణు..శరణు
సినీనటుడు చిన్నకు స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులురాజన్నను దర్శించుకుంటున్న భక్తులు వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె పోశారు. స్వామి వారికి అత్యంత ప్రీతపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఈ–టికెట్ విధానం ప్రఽవేశపెట్టారు. దీంతో రోజుకో కలర్తో కూడిన ప్రింట్ అవుట్తో కోడె టికెట్లు అందజేస్తున్నారు. రూ.200 కోడె టికెట్కు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నారు. సినిమా నటుడు చిన్న స్వామి వారిని దర్శించుకున్నారు. -
రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్స
కరీంనగర్టౌన్: నగరంలోని రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్తో కలిసి ఆపరేషన్ వివరాలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అజయ్ అనే బాలుడికి పుట్టినప్పటి నుంచి గుండెకు రంద్రం ఉందని తెలిపారు. ఆయాసం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గుండెదడ, బరువైన పనులు చేయలేక బాధపడుతున్నాడని వివరించారు. రెనే ఆస్పత్రికి వచ్చిన తర్వాత అతడికి మల్టీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) చేసినట్లు తెలిపారు. ఛాతి భాగంలో పూర్తిగా చీరకుండ, పక్కటెముకల మధ్యలో చిన్న గాటు పెట్టి ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఈ ఆపరేషన్ కరీంనగర్లోని రెనే ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలుమార్పిడి శస్త్రచికిత్స వైద్యసేవలు తమ ఆస్పత్రిలో అక్టోబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్డియాలజీ డాక్టర్ దినకర్, చిన్నపిల్లల గుండె వైద్యుడు రాజావిజయేందర్రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి
పాఠశాలల క్రీడలకు పూర్వ వైభ వం వచ్చింది. కరో నా అనంతరం ఈ సంవత్సరం జరుగుతున్న పో టీలకు పెద్దసంఖ్యలో క్రీడాకా రులు హాజరవడం శుభపరిణా మం. ఆయా జిల్లాల ఎస్జీఎఫ్ కా ర్యదర్శులు ఉత్తమమైన, పటిష్టమైన ఉమ్మడి జిల్లా జట్టును ఎంపి క చేసి రాష్ట్ర పోటీలకు పంపించాలి. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజేతగా నిలవాలి 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు విజేతగా నిలవాలి. ఎస్జీఎఫ్ క్రీడల్లో నంబర్వన్గా ఎదగాలి. జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలకు ఒలింపిక్ సంఘం సహాయ, సహకారాలందిస్తాం. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఘనంగా నిర్వహించాలి. – గసిరెడ్డి జనార్దన్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి మంచి స్పందన.. కరీంనగర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న. క్రీడలకు తలమానికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో క్రీడలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మండలస్థాయి పోటీలకు మంచి స్పందన వచ్చింది. జిల్లాస్థాయి పోటీలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తాం. – బి.వేణుగోపాల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, కరీంనగర్ ఘనంగా నిర్వహిస్తాం పెద్దపల్లి జిల్లాలో జరగనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలస్థాయి, మండల జోన్స్థాయి పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లాస్థాయి పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తాం. – కనుకుంట్ల లక్ష్మణ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి -
రెండెకరాల్లో సరుగుడు
నేను రెండెకరాల్లో సరుగుడు మొక్కలు నాటాను. మా ఊరిలో 30ఎకరాల వరకు ఈ మొక్కలే నాటారు. పేపర్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇతర పంటలతో పోల్చితే ఎలాంటి కష్టమూ లేకుండా సరుగుడుతో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. – సురకంటి సతీశ్, తొంబరావుపేట, మేడిపల్లి(మం) ఇతర పంటలను సాగుచేస్తే ఖర్చు ఎక్కువ. ఆదాయం కూడా తక్కువగా వస్తుంది. నేను మూడు ఎకరాల్లో సరుగుడు సాగు చేస్తున్నాను. కొద్దిరోజుల్లో కటింగ్కు రానుంది. ఈ పంటకు కూలీల బెడద లేదు. కోతుల ఇబ్బంది లేదు. ఆదాయం మిగులే. – బోడ మల్లారెడ్డి, పోరుమల్ల, మేడిపల్లి(మం) పేపర్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. స్థానికంగా ఉన్న రైతులకు ప్రోత్సాహకాలతో పాటు ఏ రేటు చెల్లిస్తామనేది ముందే రైతులకు చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నాం. జిల్లా రైతులు ఏక పంటగా, అంతరపంటగా సాగు చేస్తున్నారు. – సతీశ్, పీల్డ్ ఆఫీసర్ -
అప్పుల బాధతో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
రామడుగు: రియల్ ఎస్టేట్ వ్యాపారం కలిసిరాకపోవడంతో అప్పుల పాలై కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామానికి చెందిన బత్తిని తిరుపతిగౌడ్ (45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మోతె గ్రామానికి చెందిన బత్తిని తిరుపతిగౌడ్ భార్య మనోజాతో కలిసి కరీంనగర్లో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోయి అప్పులపాలయ్యాడు. అప్పు ఎలా తీర్చాలని మదనపడుతుండేవాడు. గురువారం మోతెలోని ఇంటికి వెళ్లి వస్తానని భార్యతో చెప్పి వెళ్లాడు. కాసేపటికి మనోజా ఫోన్చేస్తే స్పందించలేదు. ఇంటి పక్కనుండే మెరుగు శంకరయ్యకు ఫోన్ చేసి వెళ్లి చూడమని కోరింది. అతను వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాడు. పగులగొట్టి చూడగా.. పురుగుల మందుతాగి, ఉరేసుకుని చనిపోయి ఉన్నాడు. మనోజా ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కె.రాజు తెలిపారు.చైన్స్నాచింగ్ దొంగల కోసం గాలింపుజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్లకు చెందిన గొల్లపల్లి వెంకమ్మ మెడలోంచి బుధవారం గుర్తుతెలియని దొంగలు బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన విషయం తెల్సిందే. నిందితుల చిత్రాలు సీసీపుటేజీల్లో రికార్డు కావడంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. -
కోతిని తప్పించబోయి..
● అదుపు తప్పిన ద్విచక్రవాహనం ● అక్కడికక్కడే ఐకేపీ సీసీ దుర్మరణం పెగడపల్లి: కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడి ఐకేపీ ఉద్యోగి మృతి చెందిన సంఘటన పెగడపల్లి మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్కుమార్ కథనం ప్రకారం.. పెగడపల్లి ఐకేపీ (సెర్ప్)లో మండలంలోని నామాపూర్కు చెందిన కొత్తూరి రవికుమార్(53) సీసీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా నందగిరి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా కోతి అడ్డు రావడంతో బైక్ అదుపు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. రవికుమార్కు భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు. ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామానికి చెందిన గుండేటి మల్లేశం (43) గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలు.. మల్లేశం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఇంటి వద్ద ఉన్న పాడిపశువు కోసం పచ్చిగడ్డి కోసేందుకు గ్రామ శివారులోని బత్తుల రాజమల్లయ్య పొలం వద్దకు వెళ్లాడు. పొలం గెట్లపై గడ్డి కోస్తుండగా, సమీపంలోని వ్యవసాయ బావి వద్ద పచ్చిగడ్డి ఎక్కువగా కనిపించడంతో మల్లేశం బావి ఒడ్డున గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. ఈత రాకపోవడంతో మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రామగుండం: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 6న గోదావరిఖని వంతెనపై విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు రామగుండం అక్బర్నగర్కు చెందిన నారకట్ల రాజేశ్(25) నదిలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పోలీసులు బృందాలుగా డ్రోన్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టగా, యువకుడి మృతదేహాన్ని బుధవారం రాత్రి చెన్నూర్ సమీపంలోని సోమనపల్లి గోదావరినది ఒడ్డున పోలీసులు గుర్తించారు. మృతదేహం కుళ్లి పోయి ఉండడంతో కొన్ని ఆనవాళ్ల ఆధారంగా గుర్తించారు. గురువారం కుటుంబసభ్యులు దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ సమయంలో మృతుడి తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘కొడుకా నీవు మాకు చెప్పకుండానే గంగమ్మ ఒడికి చేరినవా.. మేమిద్దరం ఎవరి కోసం బతకాలిరా’ అంటూ గుండెలు బాధుకుంటూ రోదించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గోదావరిఖని టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
దోస్త్..లాస్ట్ చాన్స్
సప్తగిరికాలనీ(కరీంనగర్): డిగ్రీలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పొందేందుకు ప్రభుత్వం విద్యార్థులకు మరోసారి అవకాశం కల్పించింది. చివరి విడతగా గురువారం ఉన్నత విద్యామండలి షెడ్యూల్ను విడుదల చేసింది. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) చివరి అవకాశంగా స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్ను సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటివరకు డిగ్రీలో అడ్మిషన్ తీసుకోని వారు వెంటనే అడ్మిషన్ తీసుకోవాలని పేర్కొన్నారు. స్పాట్లో అన్ని కళాశాలలకు అవకాశం కల్పించారు. దోస్త్ స్పాట్ అడ్మిషన్స్ షెడ్యూల్ను ఆయా కళాశాలలు నేడు నోటీస్ బోర్డులో ఉంచనున్నారు. ఏయే కోర్సుల్లో ఖాళీలున్నాయో పొందుపర్చనున్నారు. దోస్ట్ పోర్టల్లో కూడా ఖాళీలు పొందపర్చనున్నట్లు సమాచారం. 15, 16న అడ్మిషన్స్ దోస్త్ చివరి అవకాశంలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు స్పాట్ అడ్మిషన్ కోసం సంబంధిత కళాశాలలో రిపోర్టు చేయాలి. ముందుగా విద్యార్థులు దోస్ట్ పోర్టల్లో రూ.425 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వచ్చిన రిజిస్ట్రేషన్ ఫాంను కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ లోకల్ విద్యార్థులకు ఈనెల 15, 16తేదీల్లో జరుగనుంది. అదే విధంగా స్పాట్ అడ్మిషన్లో భర్తీ కానీ సీట్లకు ఈనెల 18, 19 తేదీల్లో వన్ టైం స్పెషల్ స్పాట్ అడ్మిషన్ రౌండ్లో అడ్మిషన్ పొందొచ్చు. ఇదే తేదీల్లో నాన్ లోకల్ విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. ఇది వరకే కళాశాలల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు స్పాట్ అవకాశం ఉండదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అందించాల్సిన సర్టిఫికెట్లు.. ఒరిజినల్ ఎస్సెస్సీ, ఇంటర్ మెమో, టీసీ, 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయం, నివాసం, బ్రిడ్జి కోర్సు సర్టిఫికెట్ (వర్తించు విద్యార్థులకు) సర్టిఫికెట్లతో దోస్త్ పోర్టల్లో చేసుకున్న రిజిస్ట్రేషన్తో పాటు జిరాక్స్ కాపీలను కళాశాలలో అందించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో దోస్త్ అధికారులు కోర్సు ప్రకారం నిర్ణయించిన రోస్టర్, మెరిట్ ఆధారంగా వివిధ కోర్సుల్లో ఖాళీలు భర్తీ చేయనున్నారు. నో రీయిబర్స్మెంట్.. స్పాట్ అడ్మిషన్లో ప్రవేశం పొందే విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా ఫీజు రీయిబర్స్మెంట్ వర్తించదు. విద్యార్థులే ఏటా కళాశాల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిగ్రీ ప్రవేశాల కోసం చివరి విడతగా షెడ్యూల్ విడుదల 15, 16న అడ్మిషన్లు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు చివరి అవకాశం. అడ్మిషన్ తీసుకోని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. – డాక్టర్ కలువకుంట్ల రామకృష్ణ, ఎస్సారార్ కళాశాల ప్రిన్సిపాల్ -
ఒగ్గు కళాకారుడి మృతి
హుజూరాబాద్రూరల్: మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ఒగ్గు కళాకారుడు చెవుల రాజు(40) గుండెపోటుతో మృతి చెందాడు. గురువారం ఉదయం ఇంటి వద్ద రాజుకు ఒకసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు 108అంబులెన్స్లో హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. గత 15 ఏళ్లుగా రాజు ఒగ్గు కథలకు ప్రాణం పోశాడని, ఆయన కళా ప్రదర్శనలతో ఈ ప్రాంతంలో గొప్ప గుర్తింపు పొందారని పలువురు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం గోధూర్కు చెందిన బూరం దేవదాస్ (50) ఎలకల మందు తాగి చికిత్సపొందుతూ గురువారం మృతిచెందినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. దేవదాస్ రెండు నెలల క్రితం గల్ఫ్ నుంచి వచ్చాడు. తిరిగి వెళ్తానని ఇంట్లో చెప్పగా.. పిల్లలకు పెళ్లికాలేదని, వారి పెళ్లి అయ్యాక వెళ్లాలని భార్య రాజమణి వారించింది. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. మనస్తాపానికి గురైన దేవదాస్ ఈనెల 9న ఎలుకల నివారణ మందు తాగాడు. కుటుంబసభ్యులు చికిత్సనిమిత్తం మెట్పల్లికి.. అక్కడి నుంచి నిజామాబాద్ తరలించారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు. సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన వంగ స్వరూప(47) ఆత్మహత్యకు యత్నించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. వంగ మల్లయ్య–స్వరూప దంపతులకు ఇద్దరు కూతుర్లు, కొడుకు సంతానం కాగా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. కూతుర్ల పెళ్లికి అప్పులు అయ్యాయి. ఆరునెలల క్రితం మల్లయ్య తాటిచెట్టు పై నుంచి ప్రమాదవశాస్తు కింద పడగా గాయాలు కావడంతో పని చేసే స్థితిలో లేడు. దీంతో స్వరూప అప్పులు ఎలా తీర్చాలని మానసికంగా కృంగిపోయేది. ఈ క్రమంలో ఈ నెల 8న పురుగులమందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి, మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొంతుదూ గురువారం మృతిచెందింది. మృతురాలి కూతురు రమ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మంచంపైనుంచి పడి వ్యక్తి..జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని కొత్తబస్టాండ్ సమీపంలో ఓ దుకాణం వాచ్మన్గా పనిచేస్తున్న ఎండీ.సాహెబ్ హుస్సేన్ (69) ఈనెల 7న మంచంపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన సాహెబ్ హుస్సేన్ వాచ్మన్గా పనిచేస్తున్నాడు. మంచంపై నుంచి కిందపడగా తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే షాపు యజమాని జగిత్యాల ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. హుస్సేన్ కుమారుడు మొయినోద్దీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై సుప్రియ తెలిపారు. -
సాగు భిన్నం.. ఆదాయం ఘనం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల వ్యవసాయాధారిత జిల్లా. ఇక్కడి రైతులు ఆదాయం రాని పంటలను ఎప్పటికప్పుడు తొలగించి ఆదాయం సమకూర్చే పంటలు సాగు చేస్తుంటారు. ఇప్పటివరకు మామిడి పెట్టింది పేరుగా ఉన్న జిల్లా రైతులు.. కొత్త పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. నాలుగైదేళ్లుగా మామిడిలో సరైన దిగుబడి రాకపోవడంతో మూడేళ్లలోనే ఆదాయం వచ్చే.. కాగితం తయారీకి ఉపయోగించే నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచుతున్నారు. కొందరు రైతులు ఏక పంటగా సాగు చేస్తుండగా.. మరికొందరు అంతరపంటగా పామాయిల్ సాగు చేస్తున్నారు. ● రైతులను ప్రోత్సహించాలని.. జిల్లాకు సమీపంలోనే సిర్పూర్కాగజ్నగర్లో పేపర్ మిల్లు ఉంది. ఆ మిల్లు నుంచి రోజుకు 400 టన్నుల పేపర్ బయటకు వస్తుంది. దీనికి రోజుకు వెయ్యి టన్నులు (దాదాపు 60 నుంచి 70 లారీలు) కర్ర అవసరం. పొరుగు రాష్ట్రాల నుండి 50లారీల వరకు కర్ర వస్తే.. రాష్ట్రం నుంచి కేవలం 10 నుంచి 15 లారీల కర్ర మాత్రమే వస్తోంది. పేపర్ మిల్లు రవాణా భారాన్ని తగ్గించుకోవడంతోపాటు గ్రామాల్లోనూ పేపర్ తయారీకి ఉపయోగించే కర్రను సాగు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం రైతులకు భారీగా సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఒక్కో మొక్క ఖరీదు రూ.11 ఉంటే రైతులకు సరుగుడు మొక్కను రూ.4, నీలగిరి రూ.4.50, సుబాబుల్ రూ.మూడు చొప్పున అందిస్తున్నారు. ● కంపెనీతో ఒప్పందాలు చేసుకుంటున్న రైతులు నీలగిరి, సుబాబుల్, సరుగుడు మొక్కలను పెంచే రైతులు సిర్పూర్ కాగజ్నగర్లోని పేపర్ మిల్లుతో రేటు ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం టన్నుకు రూ.5వేలు (కంపెనీ కటింగ్ చేస్తే), రూ.7 వేలు(కటింగ్ చేసుకుని తీసుకెళ్తే) చెల్లిస్తున్నారు. మొక్క నాటిన మూడేళ్ల తర్వాత చెట్లను కట్ చేస్తామని, ఆ సమయంలో ధర ఎంతుంటే అంత చెల్లిస్తామని ఒప్పందాలు చేసుకుంటున్నారు. కంపెనీ రేటు నచ్చకపోతే ఇతరులకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు. మూడేళ్ల పాటు సర్వీస్ ఇచ్చినందుకు.. సబ్సిడీపై మొక్కలు సరఫరా చేసినందుకు కొంత సర్వీస్ చార్జీ వసూలు చేస్తారు. ● జిల్లాలో వెయ్యి ఎకరాల్లో సాగు జిల్లాలో ఎక్కువగా సరుగుడు మొక్కలను సాగు చేస్తున్నారు. మేడిపల్లి మండలం కట్లకుంట, తొంబరావుపేట, పోరుమల్ల, సారంగాపూర్, బీర్పూర్, మల్లాపూర్ వంటి గోదావరి తీర ప్రాంత రైతులు ఎక్కువగా ముందుకొస్తున్నారు. ఒక్కోచెట్టు 20 నుంచి 30 ఫీట్లు పెరగడమే కాకుండా.. ఎకరాకు 50 నుంచి 60 టన్నుల కర్ర వస్తుంది. ఈ లెక్కన ఎకరాకు రూ.2.50 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరుగుడు చెట్లను మూడేళ్ల తర్వాత కటింగ్ చేసుకుని ఇతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంది. నీలగిరి, సుబాబుల్ ఒక్కసారి నాటితే 3 నుంచి 4 సార్లు కటింగ్ వస్తుంది. వీటికి ఎలాంటి ఎరువులూ వేయాల్సిన అవసరం లేదు. పైగా నీరు పెద్దగా అవసరం ఉండదు. జగిత్యాల జిల్లాలో నీలగిరి, సరుగుడు, సుబాబుల్ సాగు జిల్లాలో వెయ్యి ఎకరాల్లో .. పేపర్ మిల్లుతో ఒప్పందాలు -
విద్యాకేంద్రంగా మంథని
● ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారం ● మంత్రి శ్రీధర్బాబుమంథని: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మంథనిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేలా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. మంథని మున్సిపాలిటీలో రూ.80 లక్షలతో నిర్మించనున్న నూతన ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు కేంద్రానికి గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీపీఎస్ బాలికల పాఠశాలలో టీచ్ ఫర్ చేంజ్ (మంచు లక్ష్మి ఫౌండేషన్) ఆధ్వర్యంలో డిజిటల్ తరగతులు ప్రారంభించారు. అలాగే మంత్రి క్యాంపు కార్యాలయంలో 205 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. పార్చూన్ రామ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80 మంది పేద విద్యార్థులకు రూ.15 వేల విలువ చేసే పుస్తకాలు, ఇతర వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేదలకు నాణ్యమైన విద్య అందాలని టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సేవలు అందిస్తున్న మంచు లక్ష్మి, ఇతర ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో 6 ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లు ప్రజలను పట్టించుకోని బీఆర్ఎస్ నాయకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి ఆస్కారం లేదని, లంచం ఇస్తే వారి ఇళ్లు రద్దు చేసి, తీసుకున్న వారిపై చర్యలుంటాయని పేర్కొన్నారు. పాఠశాలల్లో పిల్లలకు మొరుగైనన బోధన అందించేందుకు సహకరిస్తున్న సంస్థకు కలెక్టర్ కోయ శ్రీహర్శ అభినందనలు తెలిపారు. ప్రేవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే తమవంతు సాయం అందిస్తున్నట్లు టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఫౌండర్ ప్రముఖ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 51 తరగతి గదుల్లో డిజిటల్ సౌకర్యాలు కల్పించామన్నారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీఈవో మాధవి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, ఆర్డీవో సురేశ్ తదితరులు ఉన్నారు. -
కరెంట్ కనెక్షన్ పేరిట నిలువు దోపిడీ
● మూడేళ్లుగా రైతుల నుంచి డబ్బులు వసూలు ● కాంట్రాక్టు ఉద్యోగి నిర్వాకం ● విచారణ చేపట్టిన అధికారులు వెల్గటూర్: వ్యవసాయ మోటార్లకు కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తానని చెప్పి వెల్గటూర్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలోని ఓ కాంట్రాక్టు ఉద్యోగి రూ.లక్షల్లో దోచుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని జగదేవుపేటకు చెందిన నరేశ్ కాంట్రాక్టు పద్ధతిన అన్మ్యాన్డ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గ్రామంలోని రైతుల వ్యవసాయానికి కనెక్షన్ కోసం డీడీలు అవసరమైన సమయంలో వారిని ఏమార్చి వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. దీనిపై ఇటీవల కొందరు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం ఉన్నతాధికారులు పంచాయితీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. మూడేళ్లుగా ఈ తంతు జరుగుతున్నా ఉన్నతాధికారులు అతడిపై చర్యలు తీసుకోవడంలేదని, మండల స్థాయి అధికారుల అండతోనే ఈ అక్రమాలు చేశాడని రైతులు ఆరోపించారు. ఏఎల్ఎం, జేఎల్ఎం, లైన్మన్ అన్నీతానై రైతులను బెదిరిస్తున్నాడని, రైతులెవరైనా ఫిర్యాదు చేస్తే వారి కనెక్షన్ కట్ చేసేవాడని రైతులు అధికారులకు వివరించారు. ఈ విషయమై వెల్గటూర్ ఏఈని వివరణ కోరగా.. తమ గ్రామస్తుడే కావడంతో రైతులు ఆయనకే డబ్బులు ఇచ్చారని, తాను రైతులకు అవగాహన కల్పించినా వినలేదని, డబ్బుల విషయాన్ని ఎప్పుడూ తన దృష్టికి తీసుకురాలేదని అన్నారు. ఇంత పెద్దమొత్తంలో అవినీతి జరిగిందని తెలిసి తానూ ఆశ్చర్యపోయానని తెలిపారు. బాధిత రైతులకు న్యాయం చేస్తామని, నరేశ్పై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
ఉపాధి కూలీలకు కేవైసీ
● యాప్లో ముఖ గుర్తింపు ప్రక్రియ ● పైలట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక కరీంనగర్రూరల్: ఉపాధిహామీ పథకం కూలీలు ఈకేవైసీ నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కూలీలు తమ ఆధార్కార్డులను జాబ్కార్డులతో కేవైసీ చేసుకుంటేనే అక్టోబరు 1నుంచి ఉపాధి పనులు కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కరీంనగర్, హన్మకొండ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. సోమవారం నుంచి గ్రామాల్లో కూలీల కేవైసీ ప్రక్రియను ఉపాధిహామీ అధికారులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 2,59,795 ఉపాధిహామీ జాబ్కార్డులుండగా పనిచేసే కూలీలు 1,25,710 మంది ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం ఎన్ఆర్ఈజీఏస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం యాప్ను ప్రవేశపెట్టింది. ఉపాధికూలీ ఆధార్, ఉపాధికార్డు వివరాలను నమోదు చేసి కూలీ ముఖగుర్తింపు ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో కూలీలు తమ ఆధార్, జాబ్కార్డులతో ఉపాధిహామీ సిబ్బందిని కలిస్తే ఈకేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆధార్కార్డును కూలీలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకుని ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ చేయించుకోని కూలీలకు పనికల్పించడం ఇకనుంచి వీలుకాదు. కూలీలకు ఈకేవైసీ విధానంపై అధికారులు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కొత్త విధానంతో పనుల్లో పారదర్శకత పెరుగుతుందని, ఒక జాబ్కార్డుపై మరొకరు పనిచేసే అవకాశం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కేవైసీ తప్పనిసరి ఉపాధిహామీ కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. – శ్రీధర్, డీఆర్డీవో, కరీంనగర్ -
పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి
గోదావరిఖని: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయ డం అన్యాయం. ఎవరో అన్నది రాస్తే.. దాన్ని పత్రికకు ఆపాదించి ఎడిటర్పై కేసు పెట్టడం సరికాదు.ఏపీలో మీడియాను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. – రాజ్ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం ఏపీలో పత్రికా స్వేచ్ఛపై దాడిచేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారు. సాక్షి ఎడిటర్ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం. పత్రికల్లో వచ్చిన వార్తల్లో ఏదైన తప్పు ఉంటే వివరణ కోరాలే తప్ప ఇలా అక్రమ కేసులు పెట్టి బెదిరించడం సరికాదు. – కోరుకంటి చందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పెద్దపల్లి నిరంకుశత్వమే..సాక్షి పత్రికలో వచ్చిన వార్తల విషయంలో ఎడిటర్పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ఏపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం. రాజకీయ నాయకుల విమర్శలను ప్రచురిస్తే కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛను హరించడమే. – కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సుడా చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపేఅన్ని పత్రికలమాదిరిగానే సాక్షిలో అమరావతి పేరిట పొన్నూరును ముంచేశారనే వార్త వచ్చింది. దీనిపై పోలీసులు సాక్షి ఎడిటర్పై కేసు పెట్టడం ఏంటి?కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగించడమే. ప్రచురించిన వార్తలపై అభ్యంతరాలుంటే.. ప్రభుత్వాలు ఖండించడం, రిజాయిండర్లు జారీ చేసే వీలుంది. – పంజాల శ్రీనివాస్, సీపీఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్ప్రజాస్వామ్యానికి మచ్చసాక్షిపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారు. కేవలం వ్యతిరేఖ వార్తలు రాసారన్న కారణంతో ఎడిటర్, పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన ప్రభుత్వమే పత్రికల గొంతు నొక్కడం అన్యాయం. ప్రెస్ మీట్ వార్త ప్రచురించిన సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం సిగ్గు చేటు. – మణికంఠరెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడుఏపీలో కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆయా రాజకీయ పార్టీల నాయకులు మండిపడ్డారు. ప్రతికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుచుకుంటోందన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డితో పాటు విలేకరులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
మెటా నిందితుల అరెస్టు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజుపై ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్లాండ్లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం.దుబాయ్లో ఆస్తులుమెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరి స్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు.మెటాలో మరో కేసుమెటా వ్యవహారంలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో సూత్రదారుల్లో ఒకరిగా భావిస్తున్న సతీశ్ పై గురువారం కేసు నమోదు అయ్యింది. అధిక లాభాలు వస్తాయని ఆశ పెట్టి తమను రూ.11 లక్షల వరకు మోసం చేసాడని బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సదరు వ్యక్తిని రెండు రోజుల్లో అరెస్టు చేస్తారని సమాచారం.సీపీకి లీగల్ నోటీసులు, సీఐలకు దమ్కీలుమెటా నిర్వాహకుల్లో కొందరు పాత నేరస్తులు కావడంతో పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. భారీగా లంచాలు ఎరవేసి ఇంతకాలం తమపై కేసులు కాకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఫిర్యాదుదారులనే పోలీసుల చేత బెదిరింపులకు గురిచేయించారు. కరీంనగర్ సీపీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. తమపై ఫిర్యాదు చేసిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు నడిపిస్తున్నారు. వీరు అంతటితో ఆగలేదు. తమ యాప్లో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐలు డబ్బులు అడుగుతుంటే దమ్కీలు ఇస్తుండటం గమనార్హం. విదేశీ యాత్ర సమయంలో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, విదేశాల్లో మీరు రహస్యంగా దేశ విద్రోహ శక్తులతో సమావేశం అయ్యారని, వ్యభిచారం చేసి డిపార్ట్మెంట్ రహస్యాలు అమ్ముకున్నారని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేసి ఉద్యోగాలు పోగొడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.కోట్లాది డబ్బు విదేశాలకు తరలిపోయిన నేపథ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేస్తేనే వీరి ఆస్తుల చిట్టాలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. -
స్మృతివనం ఏర్పాటు చేయాలి
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కరీంనగర్: తెలంగా ణ రైతాంగ సాయు ధ పోరాటంలో అ సువులు బాసిన అ మరవీరుల కోసం హైదరాబాద్లో స్మృతివనం ఏర్పా టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశాడు. ఈనెల 11 నుంచి 17వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా సమితి ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం నిర్వహించారు. కోతిరాంపూర్ బైపాస్లోని బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్తో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. బైక్ర్యాలీతో మార్కెట్ రోడ్డులో ఉన్న అనభేరి ప్రభాకర్ రావు విగ్రహం వద్దకు చేరుకుని పూలమాల వేశారు. బీజేపీ నేతలు తెలంగాణ విమోచన దినమంటూ, కాంగ్రెస్ వాళ్లు సమైఖ్యత దినోత్సవమంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అది ముమ్మాటికీ తెలంగాణ విలీన దినోత్సవమేనన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవా లను జయప్రదం చే యాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అందె స్వామి, పోనగంటి కేదారి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్య డ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్రెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య తదితరు లు పాల్గొన్నారు. -
ఆగని అమృత్ భారత్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలో సేవలు ప్రారంభం ప్రస్తుతం బిహార్లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది. హాల్టింగ్ ఇవ్వాలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు. – ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం -
రిలీవింగ్ ఆర్డర్ కోసం నిరీక్షణ
కరీంనగర్ అర్బన్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా ఉంది జీపీవోల పరిస్థితి. ఈ నెల 5న గ్రామ పాలన అధికారు(జీపీవో)లను ని యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నియామకపత్రాలిచ్చిన విషయం విదితమే. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండాల్సిన జీపీవోలు మునుపటిశాఖలు(మునిసిపల్, మిషన్ భగీరథ) రిలీవింగ్ అర్డర్ ఇవ్వకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తవగా పోస్టింగ్ ఇచ్చారు. రిలీవింగ్ అర్డర్ అందకపోవడంతో నాలుగు రోజులైనా విధుల్లో చేరలేదు. ఇతర నియోజకవర్గాల్లో నియామకం జిల్లాలో 187మంది జీపీవోలను నియమించారు. 210 రెవెన్యూ గ్రామాలుండగా 255 క్లస్టర్లు అవసరమని అధికారులు నివేదించారు. ఈ నెల 8న కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ కౌన్సెలింగ్ నిర్వహించగా నిబంధనల క్రమంలో పోస్టింగ్ కల్పించారు. దివ్యాంగులు, వితంతువులు, స్పౌజ్ కేసులకు మొదటి ప్రాధాన్యతనివ్వగా తదుపరి ర్యాంకు వారీగా ఆప్షన్లు తీసుకోగా సొంత మండలం, నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గంలో పోస్టింగ్ కల్పించారు. 145 వాస్తవ క్లస్టర్లు కాగా 255 క్లస్టర్లు రికై ్వర్మెంట్గా చూపారు. అయిదేళ్ల నిరీక్షణకు తెర 2020 సెప్టెంబర్లో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో సదరు ఉద్యోగులను జిల్లాలో సర్దుబాటు చేయగా మిగిలిన వారికి ఇతర జిల్లాల్లో పోస్టింగ్ కల్పించారు. 18మంది సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబానికి దూరమై భూపాలపల్లి, హన్మకొండ, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఉన్నతాధికారులకు, మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా సొంత జిల్లాకు రావడం అందని ద్రాక్షగా మారింది. ఈ క్రమంలో జీపీవోల నియామకం వారిలో సంతోషాన్ని నింపింది. రిలీవింగ్ అర్డర్ త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.జిల్లాలో మొత్తం గ్రామాలు: 318 రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజురాబాద్) రెవెన్యూ క్లస్టర్లు: 255, రెవెన్యూ గ్రామాలు: 210, జీపీవోలు: 187 -
దాబా క్లోజ్!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్టీపర్పస్ పార్క్లోని దాబా ఎట్టకేలకు మూతపడింది. మూడ్రోజులుగా జరుగుతున్న నాటకీయపరిణామాల నడుమ నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. ‘గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో మల్టీపర్పస్పార్క్లో లీజు ఒప్పంద ఉల్లంఘనలపై ఎస్ఈ రాజ్కుమార్ నేతత్వంలోని కమిటీ విచారణ పూర్తి చేసి గురువారం కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి రిపోర్ట్ అందించారు. లీజు ఒప్పందాన్ని మీరి టికెట్ రేట్లు ఇష్టారీతిన పెంచడం, పార్కింగ్ ఫీజు వసూలు చేయడం, వాకింగ్ ట్రాక్ను దుర్వినియోగం చేయడంతో పాటు అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడం లాంటి ఉల్లంఘనలు జరిగాయని కమిటీ నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నివేదిక ఆధారంగా నిర్వాహకులకు బల్దియా నోటీసు జారీ చేసింది. ఆ నోటీసుకు నిర్వాహకుల నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే మరోసారి లీజు ఒప్పంద నిబంధనలు ఉల్లంఘిస్తే లీజు ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు నిర్వాహకులకు సంకేతాలు పంపించారు. లీజు ఒప్పందం మేరకు క్యాంటిన్ను నడిపించుకోవడానికి అంగీకరించిన అధికారులు, దాబా జోలికి వెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
యూరియా కొరతకు కేంద్రమే కారణం
సైదాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. యూరియా తయారీ, రాష్ట్రాలకు పంపిణీ చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే అన్నారు. గురువారం జిల్లాలోని సైదాపూర్ మండలంలో పర్యటించారు. నల్లరామయ్యపల్లి, ఎగ్లాస్పూర్లో గ్రామ పంచాయతీ భవనం, ఆకునూర్, వెంకటేశ్వర్లపల్లి, బూడిదపల్లిలో ఓపెన్జిమ్లను ప్రారంభించారు. ఆకునూర్ కేజీబీవీ పాఠశాలలో డార్మెంటరీ హాల్, డ్రైనేజీ, బూడిదపల్లిలో అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నల్లరామయ్యపల్లి, ఆకునూర్, బూడిదపల్లిలో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు సామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. రాష్ట్రాని చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉండికూడా తెలంగాణకు యూరియా కొరత లేకుండా చూడడం లేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. యూరియా కొరత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది లంచం ఇవ్వందే ఏ పని చేయడంలేదని, ఆర్ఐ సతీశ్ డబ్బులు ఇవ్వకుంటే ఏ పని చేయడం లేదని బొమ్మకల్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆర్డీవో రమేశ్, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
క్వింటాల్ పత్తి రూ. 7,450
క్వింటాల్ పత్తి రూ. 7,450జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో గురువారం క్వింటాల్ పత్తి రూ. 7,450 పలికింది. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పర్యవేక్షించారు.క్యూలో చెప్పులు.. అవే తిప్పలుగన్నేరువరం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇన్నాళ్లు సొసైటీల ద్వారా యూరియా పంపిణీ చేసిన అధికారులు గురువారం రైతు వేదికల నుంచి అందించారు. అయినా అవస్థలు తప్పడం లేదు. యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టారు. కాసింపేట రైతు వేదికలో కాసింపేట, పారువెల్ల మైలారం సాంబయ్యపల్లి రైతులకు 230 బస్తాలు, మాదా పూర్ రైతువేదికలో మాదాపూర్, హన్మాజిపల్లి, గోపాల్పూర్ రైతులకు 230 బస్తాల చొప్పున అందించారు. వందల సంఖ్యలో రైతులు రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేపట్టారు. కాగా.. కాసింపేటకు చెందిన బండి శ్రీనివాస్ గౌడ్, బండి ఎల్లవ్వకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు శివారులో వ్యవసా య భూమి ఉంది. ఆధార్ కార్డు కాసింపేటలో ఉంది. ఆధార్ కార్డు ఇక్కడ, భూమి అక్కడ ఉండడంతో యూరియా ఇవ్వడం లేదని అన్నారు.ఇన్చార్జి డీఈవోగా శ్రీరాం మొండయ్యకరీంనగర్: ఇన్చార్జి డీఈ వోగా డైట్ ప్రిన్సి పాల్ శ్రీరాం మొండయ్యను నియమిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఈవో చైతన్యజైనీ నెల రోజుల పాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఎల్ఎండీ కాలనీలోని డైట్ ప్రిన్సిపాల్ శ్రీరాం మొండయ్యను ఇన్చార్జిగా నియమించారు.ఉద్యోగ సంఘాల గుర్తింపు రాష్ట్ర జేఏసీ విజయంకరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 185 ద్వారా సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను పునఃసంస్థాపించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం స్థానిక టీఎన్జీవో భవన్లో మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా పని చేస్తూ, సంక్షేమ పథకాల అమలులో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఈ విజయం సాధించడంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్, ముజీబ్ కృషి ప్రశంసనీయమని కొనియాడారు. నాయకులు మడిపల్లి కాళీచరణ్, అరవింద్ రెడ్డి, సంగెం లక్ష్మణరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కోట రామస్వామి హర్షం వ్యక్తం చేశారు. -
మగువల మనసు దోచేలా బతుకమ్మ చీరలు
కరీంనగర్ అర్బన్: బతుకమ్మ పండుగకు చీరలొస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా.. ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా.. గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తాజాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతి వలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కను ల విందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కో లాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే.. బతుకమ్మకు అత్యంత ప్రా ధాన్యమిస్తూ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది.వివిధ రకాల డిజైన్లుగతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు. బంగారు, వెండి జరి అంచు చీరలు, చెక్స్ డిజైన్లు ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. అయితే చీరల పంపిణీ ఎపుడన్నది ఇంకా సందిగ్ధమే. ఈనెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా.. ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉంది.నేడో, రేపో రానున్న చీరలుగతంలో రెవెన్యూ డివిజన్లవారీగా చీరలను వేరు చేసి మండలాలవారీగా సరఫరా చేయగా.. అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారివారి జాబితా ప్రకారం చీరలను తీసుకొని పంపిణీ చేశారు. 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు గతంలో చీరలను పంపిణీ చే యగా.. జిల్లాలో 2.72లక్షల కార్డుదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపి ణీ జరగగా.. తాజాగా జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన స్వయం సహా యక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. నేడో, రేపో కలెక్టరేట్కు చీరలు రా నుండగా.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరనున్నాయి. వచ్చేవారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా.. రెండో విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో విభాగ అధికారులు వివరించారు. -
జిల్లా ఓటర్లు 5,07,531
కరీంనగర్: జిల్లాలోని 15 మండలాల్లో 170 ఎంపీటీసీ స్థానాలు, 15 జెడ్పీటీసీ స్థానాల పరిధిలోని ఓటర్ల తుదిజాబితాను బుధవారం రాత్రి జెడ్పీ సీఈవో శ్రీనివాస్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఆయా గ్రామాల్లోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లోని ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శించారు. జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రదర్శించింది. జిల్లా యంత్రాంగం ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం జిల్లాలో 5,07,531 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళ ఓటర్లు 2,60, 388 కాగా పురుష ఓటర్లు 2,47, 131, ఇతరులు 12 మంది ఉన్నారు. 934 పోలీసు స్టేషన్ల వారీగా జాబితాను వెల్లడించారు. ఇందులో 500లోపు జనాభా ఉన్న గ్రామాల్లో 343 పోలింగ్ కేంద్రాలు, 501 నుంచి 700 వరకు జనాభా ఉన్న గ్రామాల్లో 591 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేశారు. ఈనెల 6న ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను మండల పరిషత్లో ప్రదర్శించారు. ఈనెల 8న జిల్లాస్థాయి, మండలస్థాయిల్లో రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. 8,9 వ తేదీల్లో అభ్యంతరాలపై దరఖాస్తుల స్వీకరించి సమస్యలు పరిష్కరించి బుధవారం రాత్రి తుది జాబితా ప్రకటించారు. -
గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయండి
ధర్మపురి: రానున్న గోదావరి పుష్కరాలకు ప్రణాళిక సిద్ధం చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. గోదావరిలోగల పుష్కరఘాట్లను బుధవారం దేవాదాయశాఖ కమిషనర్ శైలజారామయ్యర్తో కలిసి పరిశీలించారు. 2027లో జరిగే గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు రానున్నందున సరిపడా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల పనులపై ప్రణాళిక సిద్ధం చేసి త్వరగా పంపించాలని అన్నారు. గోదావరిలో గతంలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లతో పాటు మరికొని ఘాట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలన చేసి ముందుకుసాగాలన్నారు. మంగళిగడ్డ, సంతోషిమాత, సోమవిహార్ పుష్కర్ఘాట్లతోపాటు గడ్డ హన్మాండ్ల ఆలయం వద్ద పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావ్ తదితరులున్నారు. కిడ్నాపర్ల అరెస్ట్కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని మైత్రీ హోటల్ సమీపంలో కిడ్నాపర్లను బుధవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో బిల్ల కోటేశ్వర్ తెలిపారు. సీఐ వివరాల మేరకు.. నిష్ఠూరి యశ్వంత్(ఛత్తీస్గఢ్)కు రెండేళ్ల క్రితం నల్లపాటి నరేశ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో గ్రానైట్కు సంబంధించిన వ్యాపారం చేసేందుకు ఒరిస్సాకు చెందిన వ్యక్తిని యశ్వంత్ పరిచయం చేశాడు. దీంతో రూ.3లక్షలు ఒరిస్సాకు చెందిన వ్యక్తికి మధు ఇచ్చాడు. అతడు ఆ డబ్బులు ఎంతకు తిరిగి ఇవ్వకపోగా.. మధ్యవర్తిగా ఉన్న నువ్వే ఇవ్వాలని యశ్వంత్పై ఒత్తిడి తెచ్చాడు. కరీంనగర్కు వస్తున్నానని అక్కడ మాట్లాడుకుందామని చెప్పాడు. అనుకున్నట్లే ఈనెల 7న కరీంనగర్కు వచ్చిన యశ్వంత్ను భోజనం చేసుకుంటూ మాట్లాడుకుందాం రమ్మని కొత్తపల్లికి నరేశ్ పిలిచాడు. దీంతో యశ్వంత్, ముద్దుల మధు(భద్రాచలం) కొత్తపల్లికి రాగా.. వారిని నల్లపాటి నరేశ్తోపాటు మరో నలుగురు గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ కిడ్నాప్ చేసి హైదరాబాద్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి మధు, ఖమ్మం వెళ్లే క్రమంలో యశ్వంత్ తప్పించుకున్నారు. కిడ్నాప్తో భయపడ్డ యశ్వంత్, మధు కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని యశ్వంత్ అల్లుడు కొత్తపల్లి పోలీసులకు సమాచారమివ్వగా.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కిడ్నాప్కు పాల్పడ్డ నల్లపాటి నరేశ్, గుడిమల్ల సివిల్, తునికిపాటి శేఖర్, ఆలకుంట ఉపేందర్, ఆలకుంట అశోక్ అనే నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 2 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారంలో ఉన్న మరికొంతమందిని కూడా పట్టుకుంటామని సీఐ కోటేశ్వర్ పేర్కొన్నారు. 48 గంటల్లో కేసును ఛేదించి నేరస్తులను అదుపులోకి తీసుకున్న ఇన్స్పెక్టర్ కోటేశ్వర్, ఎస్సైలు సాంబమూర్తి, సంజీవ్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
కరీంనగర్: ప్రభుత్వ బడుల నిర్వహణకు నిధులు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఆదర్శ పాఠశాలతో పాటు కస్తూరిబాగాంధీ విద్యాలయాలు, గిరిజన సంక్షేమ పాఠశాలలకు కంపోజిట్ స్కూల్ గ్రాంట్, స్పోర్ట్స్ గ్రాంట్ మంజూరు చేశారు. పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, స్వచ్ఛత, ఇతరత్రా పనులకు నిధులు వినియోగించుకునేందుకు అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లో త్వరలో జమకానున్నాయి. మార్గదర్శకాలకు అనుగుణంగా అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానంతో ఈ నిధులు వినియోగించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నిధులను సద్వినియోగం చేసి యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ)లను సమర్పించాలి. నిధుల వినియోగంపై ఆడిట్ ఉంటుంది. ఇలా ఖర్చు పెట్టాలి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు సంయుక్తంగా వారి పేరున ఉన్న జాయింట్ ఖాతాలో నిధులు జమవుతాయి. కమిటీ తీర్మానం మేరకు చాక్పీస్లు, తెల్లకాగితాలు, రిజిస్టర్లు తదితర స్టేషనరీ సామగ్రి, పరీక్షల నిర్వహణ, జాతీయ పండగల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, కేయాన్, టీవీ మరమ్మతులు, కొనుగోలు, కేబుల్, ఇంటర్నెట్ చార్జీలు, డిజిటల్ తరగతుల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాల చిన్నచిన్న మరమ్మతులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల్లో 10 శాతం పాఠశాల ఆవరణలో స్వచ్ఛత కార్యక్రమానికి విధిగా ఖర్చు చేయాలన్న నిబంధన ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ నిమిత్తం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన ఈ నిధులు విడుదల చేస్తారు. గతంలో ఎన్ఎస్ఏ, ఆర్ఎంఎస్ఏ నిధులు వేర్వేరుగా వచ్చేవి. ఈ రెండింటినీ కలిపి సమగ్రశిక్షగా మార్చి విలీనం చేశారు. సమగ్ర శిక్ష నుంచే నిధులు కేటాయిస్తున్నారు. 1–30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31–100 మందికి రూ.25 వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి వెయ్యి మందికి రూ.75 వేలు, వెయ్యికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.లక్ష నిధులు మంజూరు చేశారు. వీటిలో తొలివిడతగా 50 శాతం నిధులు విడుదల చేస్తూ అమ్మ ఆదర్శ కమిటీ ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. కాగా, కొన్ని నెలలుగా పాఠశాలల ఆవరణ శుభ్రం చేయించడం, శానిటైజేషన్, ఇతర వాటికి గతంలో ఇచ్చిన నిధులు సరిపోక కొందరు ప్రధానోపాధ్యాయులు సొంతంగా ఖర్చు చేశారు. ఎట్టకేలకు స్కూల్ గ్రాంట్ నిర్వహణ నిధులు విడుదల కావడంతో ప్రధానోపాధ్యాయుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. కనీస వసతుల కల్పన, స్వచ్ఛతపై దృష్టి అమ్మ ఆదర్శ కమిటీ తీర్మానాలతో వినియోగం ఉమ్మడి జిల్లాకు రూ.5.32 కోట్లు జిల్లాల వారీగా విడుదలైన నిధులు జిల్లా పాఠశాలలు నిధులు కరీంనగర్ 542 1,25,95,000 జగిత్యాల 677 1,81,75,000 పెద్దపల్లి 450 1,03,01000 రాజన్నసిరిసిల్ల 446 1,22,02000 మొత్తం 2,115 5,32,73,000 -
దివ్యాంగుల సంక్షేమానికి కృషి
తిమ్మాపూర్: దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఎల్ఎండీ కాలనీలోని స్వాతంత్ర సమర యోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మానసిక వికలాంగుల పాఠశాలలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి సిద్దిపేట శాఖ నేత్ర వైద్య శిబిరం బుధవారం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దివ్యాంగుల జీవన ప్రమాణాలను ఉన్నతం చేయడంతోపాటు వారికి జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు. దివ్యాంగుల పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.50 కోట్లు వెచ్చించినట్టు మంత్రి వెల్లడించారు. తాను మంత్రి అయిన తర్వాత కరీంనగర్లోని మానసిక వికలాంగుల పాఠశాలకు సహాయం అందించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు గుర్తు చేశారు. పాఠశాల సిబ్బంది జీతభత్యాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కడంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కృషి ఉందన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, దివ్యాంగులను ప్రేమతో ఆదరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు సేవా సంస్థలు, దాతలు ముందుకు రావాలని కోరారు. మానసిక వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ మాట్లాడుతూ, దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా దివ్యాంగులు ఉన్నారని, బాలభరోసా కార్యక్రమం ద్వారా 5 ఏళ్లలోపు దివ్యాంగ పిల్లలను గుర్తించి,చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. -
పార్క్పై బల్దియా విచారణ
సాక్షిప్రతినిధి,కరీంనగర్: నగరంలో వివాదాస్పదంగా మారిన మల్ట్టీపర్పస్ పార్క్ గలీజు దందాపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ ఇంజినీర్ రాజ్కుమార్ ఆధ్వర్యంలో డీఈ వెంకటేశ్వర్లు, ఏసీపీ వేణు, ఏఈ సతీష్, టీపీబీవో నవీన్ల బృందం బుధవారం పార్క్ను సందర్శించింది. నగరపాలక సంస్థతో కుదుర్చుకున్న లీజు ఒప్పంద ఉల్లంఘనపై అధికారులు దృష్టిపెట్టారు. పార్క్లో టికెట్ ధరలు, వాకింగ్ ట్రాక్ దుర్వినియోగం, దాబాను ప్రారంభించడం లాంటి అంశాలు పరిశీలించారు. కాగా.. లీజు ఒప్పందం మేరకు పార్క్లోకి ప్రవేశ రుసుం రూ.20 ఉండగా, నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా వీకెండ్స్లో రూ.50 వసూలు చేస్తుండడం తెలి సిందే. అయితే రూ.50 టికెట్లకు సంబంధించిన బుక్లు ఎక్కడా అధికారులకు దొరకకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. కాగా... పార్క్లో వి చారణ చేపట్టిన అధికారుల బృందం గురువారం నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి నివేదిక అందించనుంది. ఆ నివేదిక ఆధారంగా కమిషనర్ చర్యలు తీసుకోనున్నారు. దాబా...కంటిన్యూ మల్ట్టీపర్పస్ పార్క్లో లీజు ఒప్పందాలకు తూట్లుపొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకుల తీరుపై సర్వత్రా విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా.. వారి తీరులో మాత్రం ఇసుమంత మార్పుకూడా కనిపించడం లేదు. అధికారులు నోటీసులు ఇస్తున్నా.. విచారణచేపడుతున్నా...మరో వైపు మాత్రం నిర్వాహకులు దాబాను కొనసాగించడం వారి లెక్కలేనితనాన్ని తెలియజేస్తోంది. విచారణ, నోటీసులతో అయ్యేదేమీ లేదని, షరామామూలుగానే దాబా నడిపించడమేననే ధీమా వారిలో ఉంది. మరి నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు ఏంచేస్తారో వేచి చూడాలి.గలీజ్ దందా పార్ట్– 3 -
కాళేశ్వరం దోపిడీ రూ.లక్షా 15 వేల కోట్లు
కరీంనగర్కార్పొరేషన్: కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.లక్షా 15 వేల కోట్లు దోచుకుందని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం ధ్వజమెత్తారు. బుధవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.35 వేల కోట్లతో పూర్తయితే, రూ.1లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ చెబుతున్నారన్నారు. హరీశ్రావు, సంతోష్రావు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని కవిత చెప్పారని, అవినీతి వాస్తవాలు సొంత కుటుంబం నుంచే వస్తుంటే, కేటీఆర్ సీఎంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సచివాలయం నిర్మిస్తున్న సమయంలో దొరికిన నిజాంకు చెందిన బంగారం, వజ్రాలు, హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ బినామీ పేరిట ఉన్న 30 వేల ఎకరాల భూములు, ఆస్తుల పంపకాల్లో కేటీఆర్తో సమానంగా తనకు వాటా కావాలనే కవిత పంచాయితీ మొదలైందని ఆరోపించారు. తెలంగాణ వస్తే ఉద్యమకారులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబం మాత్రం రూ.3 లక్షల కోట్లు దండుకుందని మండిపడ్డారు. గతంలో ఇళ్లు కూడా సరిగాలేని కేసీఆర్ కుటుంబానికి అమెరికా, దుబాయి, లండన్, సింగాపూర్లో రూ.వేలకోట్ల ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడివని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు సముద్రాల అజయ్, గోష్కి శంకర్ పాల్గొన్నారు. సంఘటితంగా ముందుకెళ్లాలికరీంనగర్: అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా రాజ్యాంగ ఫలాలను పునికి పుచ్చుకునేందుకు సంఘటిత శక్తితో ముందుకు సాగాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా అంబేద్కర్ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. రాజకీయ పార్టీల్లో ఉన్న దళిత వర్గాలు దళిత శ్రేయస్సే లక్ష్యంగా పనిచేయాలని, పొరపచ్చాలు లేకుండా ముందుకు సాగా లని పిలుపునిచ్చారు. నాయకులు గజ్జల ఆనంద్రావు, సుద్దాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం -
పశువుల పాక నివాసమై..
ఇల్లందకుంట(హుజూరాబాద్): కని పెంచిన తల్లి కొడుకులకు భారమైంది. కనికరం లేని కొడుకులు తల్లిని ఎడ్లపాకలో నివాసం ఉంచారు. దీంతో ఆ తల్లి కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామంలో జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో ఆర్డీవో రమేశ్బాబు, అధికారులు స్పందించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతి, సఖి కౌన్సిలర్ పద్మావతి భోగంపాడులో ఎడ్లపాకలో నివాసం ఉంటున్న వృద్ధురాలు కళ్లెం అమృతమ్మను కలిసి వివరాలు సేకరించారు. అమృతమ్మ భర్త పదేళ్ల క్రితం మృతిచెందగా, అప్పటినుంచి కొడుకుల ఆదరణ కరువైందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం బాధితురాలి కుమారులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్రెడ్డికి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి, అమృతమ్మకు తగిన సాయం చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆర్ఐ నాగరాజు తెలిపారు. -
అట్టహాసంగా రెస్క్యూ పోటీలు
గోదావరిఖని: సింగరేణి 54వ జోనల్ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం మెయిన్ రెస్క్యూస్టేషన్లో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 6 పురుషులు, 2 మహిళా జట్లు హాజరయ్యాయి. సింగరేణి డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డీఎంఎస్ ఉమేశ్ సావర్కర్ పోటీలు ప్రారంభించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రతినిధులను నాగ్పూర్ జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. కార్పొరేట్ సేఫ్టీ జీఎం శ్రీనివాస్, రెస్క్యూ జీఎం శ్రీనివాస్రెడ్డి, ఆర్జీ –1, 3 జీఎంలు లలిత్కుమార్, సుధాకర్రావు, డీడీఎంఎస్లు పాల్గొన్నారు. -
బతుకమ్మ చీరలొస్తున్నాయ్
కరీంనగర్ అర్బన్: బతుకమ్మ పండుగకు చీరలొస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరిట మహిళలకు చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా.. ఒక్కో మహిళకు 2 చీరలు పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా.. గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తా జాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక.. అతి వలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కనుల విందే. ఉదయం వేళలో పూలు తేవడం.. బొడ్డెమ్మలను పేర్చడం.. సాయంత్రం వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాలోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే.. బతుకమ్మకు అత్యంత ప్రా ధాన్యమిస్తూ ప్రభుత్వం చీరలు పంపిణీ చేస్తోంది.వివిధ రకాల డిజైన్లుగతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు చెబుతున్నారు. ఒక్కో చీరకు సుమారు రూ.500కు పైగా ఖర్చు కాగా.. మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్లను జోడించారు. బంగారు, వెండి జరి అంచు చీరలు, చెక్స్ డిజైన్లు ఈసారి ప్రత్యేకమని అధికారులు చెబుతున్నారు. అయితే చీరల పంపిణీ ఎపుడన్నది ఇంకా సందిగ్ధమే. ఈనెల 21 నుంచి ఎంగిలి పూల బతుకమ్మ ప్రారంభం కానుండగా.. వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈనెల మూడో వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా.. ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉంది.నేడో, రేపో రానున్న చీరలుగతంలో రెవెన్యూ డివిజన్లవారీగా చీరలను వేరు చేసి మండలాలవారీగా సరఫరా చేయగా.. అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారివారి జాబితా ప్రకారం చీరలను తీసుకొని పంపిణీ చేశారు. 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేశాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రత కార్డులో పేరుండి 18 ఏళ్లు నిండిన మహిళలకు గతంలో చీరలను పంపిణీ చే యగా.. జిల్లాలో 2.72లక్షల కార్డుదారులకు అందజేశారు. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపి ణీ జరగగా.. తాజాగా జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రా మీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డీఆర్డీవో శాఖ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు. నేడో, రేపో కలెక్టరేట్కు చీరలు రా నుండగా.. అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరనున్నాయి. వచ్చేవారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. సంఘాల్లో ఉన్న సభ్యులకు రెండేసి చొప్పున పంపిణీ చేస్తారా.. రెండో విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత లేదు. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరుగుతుందని డీఆర్డీవో విభాగ అధికారులు వివరించారు.జిల్లాలో మొత్తం సంఘాలు: 13,748సభ్యులు: 1,47,723వీవో సంఘాలు: 527మండల సమాఖ్యలు: 16జిల్లా సమాఖ్య: 1రేషన్ దుకాణాలు: 566ఆహార భద్రత కార్డులు: 2,78,199మొత్తం యూనిట్లు: 8.98,21218 ఏళ్లు నిండిన మహిళలు: 2.52లక్షలు -
కవి సామ్రాట్ విశ్వనాథ సాహిత్యం విలక్షణమైంది
కరీంనగర్కల్చరల్/సప్తగిరికాలనీ: తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సాహిత్యం విలక్షణమైందని సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణరావు అన్నారు. బుధవారం ఎస్సారార్ కళాశాల, కరీంనగర్ పద్య కవితా సదస్సు ఆధ్వర్యంలో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జయంతి సభలో మాట్లాడారు. ఏకవీర లాంటి ఎన్నో నవలలు, నర్తనశాల వంటి ఎన్నో నాటకాలు, విమర్శ గ్రంథాలను విశ్వనాథ సత్యనారాయణ రాశారని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రామక విఠల్శర్మ, గాజుల రవీందర్, బూర్ల చంద్ర శేఖర్, నీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బోయినపల్లి కేజీబీవీలో ఏసీబీ తనిఖీలు
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి కేజీవీబీలో బుధవారం ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4:20 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి. లీగల్ మెట్రాలజీ, శానిటరీ, ఫుడ్, ఆడిటర్ అధికారులు అధికారులు పాల్గొన్నారు. కేజీబీవీలో ఆహార నాణ్యత, పరిమాణం, పారిశుధ్య పరిస్థితులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల వివరాలు, టీచింగ్, నాన్ టీచింగ్ రికార్డులు తనిఖీ చేశారు. వంటగది అపరిశుభ్రంగా ఉండడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రికార్డుల నిర్వహణ సరిగా లేదని, పాఠశాల క్యాష్ బుక్ ఎంట్రీలను అప్డేట్ చేయలేదని గుర్తించారు. కొన్ని అనవసర కొనుగోళ్లు చేయడంతో పలు అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కాగా బోయినపల్లి కేజీబీలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఆదర్శ కమిటీ నిధులు గోల్మాల్ చేశారని ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. పలు టెండర్లను కేజీబీవీలో పనిచేసే ఉద్యోగుల బంధువులకే ఇచ్చారని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఏసీబీ అధికారులు ప్రకటనలో తెలిపారు. -
వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని దొంగలు రెండుంపావు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కుని పారిపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీపుటేజీలో రికార్డు అయింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అన్నం పెట్టని కొడుకు
జగిత్యాలక్రైం: కొడుకు అన్నం పెట్టడంలేదని, అడిగినా పట్టించుకోవడంలేదని జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన బొల్లె భూమయ్య, కొమురవ్వ దంపతులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. భూమయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు గతంలో మరణించాడు. పెద్ద కుమారుడు రెండు నెలలుగా అన్నం పెట్టకపోవడంతో దంపతులిద్దరూ బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో కాలం వెళ్లదీశారు. తమకు అన్నం పెట్టడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ రూరల్ ఎస్సై సదాకర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వారి పెద్ద కొడుకు, చిన్న కొడుకు కుటుంబ సభ్యులను పిలిచించి కౌన్సెలింగ్ ఇచ్చారు. వృద్ధుల పోషణభారం చూసుకోవాలని, మరోసారి విస్మరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నరేందర్రెడ్డికి అవార్డు
కొత్తపల్లి(కరీంనగర్): ముప్పై ఐదేళ్లుగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న అల్ఫోర్ప్ విద్యా సంస్థల చైర్మన్ డా.నరేందర్రెడ్డికి ప్రతిష్టాత్మక ‘అవుట్స్టాండింగ్ ఎడ్యూకేషన్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డు వరించింది. ఢిల్లీకి చెందిన ఇండియన్ స్కూల్ అవార్డ్స్, వరల్డ్ ట్రేడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్తంగా అవార్డు ప్రకటించాయి. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో వీఎన్ఆర్ తరుఫున అల్ఫోర్స్ విద్యా సంస్థల ప్రతినిధి అవార్డును అందుకున్నారు. అవార్డు వచ్చిన సందర్భంగా బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో నరేందర్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా అవార్డు బాధ్యత పెంచిందని, రానున్న రోజుల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థలు మరిన్ని అత్యుత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా రాష్ట్ర విద్యారంగానికి గొప్ప మార్గదర్శకంగా నిలిచేలా కృషి చేస్తానని నరేందర్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఒక్కడే.. అధిపతి
● కోరుట్ల నుంచి ఐదుగురు కీలక మావో నేతలు ● చివరికి మిగిలింది తిప్పిరి తిరుపతే ● దక్కిన దళపతి పీఠం నిజాముద్దీన్ (ఫైల్) పసుల రాంరెడ్డి(ఫైల్) బెజ్జారపు కిషన్(ఫైల్) కోరుట్ల: పీపుల్స్వార్ నుంచి మావోయిస్టులుగా రూపు మార్చుకున్న నక్సల్ ఉద్యమ పంథాతో కోరుట్లకు 50 ఏళ్ల విడదీయరాని అనుబంధం ఉంది. 1980–85 మధ్యకాలం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా భారతీయ విద్యార్థి పరిషత్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి వర్గాల్లో తమ ఊపును కొనసాగించాయి. ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య పరస్పర వైరుధ్యాలు, గొడవలు, కొట్లాటలు, ఓ దశలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ఐదుగురు ఆర్ఎస్యూ నాయకులు పీపుల్స్వార్ వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ ఐదుగురు కీలక నేతలుగా ఎదగగా.. వారిలో ఇద్దరి ఆచూకీ లేదు. మరో ఇద్దరు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇక మిగిలింది..తిప్పిరి తిరుపతి. ఆ ఒక్కనికే మావోయిస్టు దళపతి పీఠం దక్కింది. ఐదుగురు కీలక నేతలే.. 1980–90 దశకంలో కోరుట్లకు చెందిన ఆర్ఎస్యూ నేతలు తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్, పసుల రాంరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యే సమయంలో వీరిపై పోలీసు నిర్భంధం పెరగడంతో సిద్ధాంతపరమైన భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్వార్లో కీలక నేతలుగా ఎదిగారు. ముక్కా వెంకటేశం నల్గొండ జిల్లా పీపుల్స్వార్ కార్యదర్శిగా పనిచేస్తూ 1996 అక్టోబర్లో యాదగిరిగుట్ట పోలీస్స్టేషన్పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్తున్న సమయంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పసుల రాంరెడ్డి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో 2001లో సిరిసిల్ల జిల్లా మద్దిమల్ల ఎన్కౌంటర్లో మృతి చెందాడు. నిజాముద్దీన్ మావోయిస్టు డెన్ కీపర్గా చాలారోజులు వ్యవహరించినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో నిజాముద్దీన్ ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అసలు ఉద్యమంలో ఉన్నాడా..? లేడా..? అనే వివరాలు లేవు. బెజ్జారపు కిషన్ 1980–85లో బుల్లెట్ మోటార్సైకిల్ మెకానిక్గా కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. పీపుల్స్వార్లో చేరిన ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ విభాగం కార్యకలాపాలను పర్యవేక్షించారని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదు. ఇక మిగిలిన తిప్పిరి తిరుపతి మహారాష్ట్ర, ఒడిశాల్లో దేవ్జీగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి, దంతెవాడ సమీపంలో పోలీసులను హతమార్చిన సంఘటనలకు వ్యూహాకర్తగా తిరుపతి పేరు పలుమార్లు వినవచ్చింది. కోరుట్లలో తమ్ముడు వెంకటి చనిపోయిన సమయంలోనూ తిరుపతి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో ఒడిశా పరిసరాల్లోని ఆదివాసీబిడ్డ, ఉద్యమ సహచరి సృజనను ఆయన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు సమాచారం. 2019–20లో కరోనా సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆమె మృతి చెందింది. అట్టడుగు స్థాయి నుంచి అఽధిపతి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మావో సిద్ధాంతలక్ష్యాలను వీడని తిరుపతికి మావోయిస్టు దళపతి పీఠం దక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
దుబాయ్ వెళ్లేందుకు మరొకరు సిద్ధం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జనవరి నుంచి పలు కేసుల్లో.. జీబీఆర్ క్రిప్టో కరెన్సీ పేరిట కరీంనగర్ కేంద్రంగా ఈ ఏడాది జనవరిలో వెలుగుచూసిన రూ.95 కోట్ల స్కాంలో నిందితుడు రమేశ్గౌడ్ దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధపడ్డాడు. ఇక్కడ వసూలు చేసిన డబ్బులతో దుబాయ్లో ప్లాటు కొని, పదేళ్ల వీసా సంపాదించాడు. ఇంతలో రమేశ్గౌడ్ కరీంనగర్ సీఐడీ డీఎస్పీ కుమ్మక్కయ్యారని, బాధితులు సీఐడీ చీఫ్కు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. అప్పటి కరీంనగర్ సీఐడీ డీఎస్పీని అదే రోజు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. వెంటనే రమేశ్గౌడ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ నుంచీ లీక్.. ఆగస్టు చివరి వారంలో బల్దియాలో ఓ అవినీతి తిమింగళంలా పేరొందిన అధికారిని వేటాడేందుకు ఏసీబీ వలపన్నింది. అయితే, స్థానికంగా ఉన్న కొందరు అధికారులు ముందే ఈ సమాచారాన్ని సదరు అధికారికి లీక్ చేశారు. దీంతో సదరు అధికారి ఆ రోజు ఏసీబీకి చిక్కకుండా ఊరొదిలి పారిపోయాడు. అమెరికాకు పరారై .. వాట్సాప్ స్టేటస్ పెట్టి.. తాజాగా ఈనెల 3న వన్టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ మహిళపై దాడి కేసులో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. మహిళపై మరో మహిళ, నలుగురు పురుషులు దాడి చేశారు. ఈ దాడిలో మహిళ దంతాలు రాలిపోయి, చేతివేళ్లు విరిగాయి. కంటికి, ఒంటికి తీవ్ర గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో ఇద్దరు పురుషులు ఎన్నారైలు. వారిద్దరూ దేశం వదిలి పారిపోతారని చెప్పినా.. కనీసం ఎఫ్ఐఆర్లో వారి పేర్లు కూడా ప్రస్తావించలేదు. ఫలితంగా 9న అర్ధరాత్రి నిందితులిద్దరూ అమెరికాకు పారిపోయి, వాట్సాప్లో స్టేటస్ పెట్టడం గమనార్హం. ఈ వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారాయని బాధితులు ఆరోపిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులను సైతం పరిగణనలోకి తీసుకోకపోవడంపై కాలనీ మొత్తం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై సీపీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు. టౌన్ ఏసీపీని పిలిపించి వివరణ కోరారు. అమెరికా పారిపోయిన వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించినట్లు సమాచారం. థాయ్లాండ్ ట్రాఫికింగ్ విషయంలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన థాయ్లాండ్ కేంద్రంగా వెలుగుచూసిన సైబర్ కేఫ్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు సరైన కాలంలో లుక్అవుట్ నోటీసు సర్క్యులర్ జారీ చేయలేకపోయారు. దీంతో నిందితుడిని ఢిల్లీలోని ఏపీ హౌజ్లో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధపడ్డారు. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జోక్యంతో నిందితుడిని కరీంనగర్కు తీసుకువచ్చారు. మెటా ఫండ్ పేరిట కరీంనగర్ కేంద్రంగా మరో క్రిప్టో స్కాం వెలుగుచూసింది. రోజూ లాభాలు వస్తాయని ఆశపెట్టడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని ప్రచారం జరగుతోంది. ఈ కేసులో టూటౌన్, రూరల్, కొత్తపల్లిలో బాధితులు ఫిర్యాదు చేసినా.. పోలీసులు తాత్సారం చేశారు. పైగా నిందితులతో సెటిల్ చేసుకోవాలని బాధితులకు ఉచిత సలహా ఇచ్చి పంపారు. ఎట్టకేలకు జూలైలో దాసరి రమేశ్, దాసరి రాజుపై కేసు నమోదైంది. పోలీసుల నిర్లక్ష్యం అదునుగా చేసుకుని నిందితులు విజయవాడకు పరారై ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన లోకేశ్ థాయ్లాండ్ పారిపోయాడని ప్రచారం జరుగుతోంది. ఇంకో నిందితుడు సతీశ్ దుబాయ్లో ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టి దేశం వదిలిపారిపోయేందుకు సిద్ధంగా ఉండటం కొసమెరుపు. -
ఆస్తిపన్ను లక్ష్యం పూర్తి చేయండి
కరీంనగర్కార్పొరేషన్: ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. బుధవారం కళాభారతిలో ఆర్వోలు, ఆర్ఐలు, వార్డు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్ల వారీగా వార్డు అధికారులకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆస్తి పన్ను పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆస్తి పన్ను, నగరపాలక దుకాణ సముదాయాల అద్దె బకాయిలు వసూలు చేయాలని సూచించారు. ఒప్పందం పూర్తయిన దుకాణాలకు మళ్లీ బహిరంగ వేలం నిర్వహించేందుకు సిద్ధం చేయాలని, ఆ వివరాలు అందించాలన్నారు. రెవెన్యూ బ్లాక్ల వారీగా కమర్షియల్ భవనాల్లో, రెసిడెన్షియల్ టాక్స్ ఉంటే కమర్షియల్ టాక్స్కు మార్చాలని ఆదేశించారు. నగరవ్యాప్తంగా దాదాపు 32 వేల కమర్షియల్ విద్యుత్ మీటర్లు ఉన్నాయని, వాటిని కమర్షియల్ టాక్స్కు మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. విలీన గ్రామాలకు సంబంధించిన అన్ని ఇంటినంబర్ల అసెస్మెంట్లను ఆన్లైన్ చేయాలని, నగరంలో ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు ఉన్నవాటిని గుర్తించి తొలగించాలని చెప్పారు. అలాగే నివాసగృహాలను కూల్చి పన్ను చెల్లించకుంటే ఆ అసెస్మెంట్ నంబర్లను కూడా తొలగించాలన్నారు. పారిశుధ్య పనులు పర్యవేక్షించాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకం
కరీంనగర్: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్ రోడ్డు చౌరస్తాలో గల విగ్రహానికి సుడా చైర్మన్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నరేందర్రెడ్డి మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, హక్కుల కోసం ఎలుగెత్తి చాటిన సాహస వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, మహిళా శక్తికి ఐలమ్మ ఒక నిదర్శమని పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి అనిల్ ప్రకాశ్, రజక సంక్షేమ సంఘాల నాయకులు కొత్తకొండ రాజయ్య, రాచకొండ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ విద్యాలయంగా శాతవాహనకు గుర్తింపు సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీఉమేశ్కుమార్ అన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఇటీవల అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్ఆర్ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలను సందర్శించి రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ‘సేవాపక్షం’ విజయవంతం చేయాలి తిమ్మాపూర్/కరీంనగర్ టౌన్: బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి చేపట్టనున్న సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సేవా పక్షం రాష్ట్ర కన్వీనర్ మల్క కొమురయ్య పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, సేవా పక్షం జిల్లా కన్వీనర్ ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బాస సత్యనారాయణ, వై.సునీల్రావు, డి.శంకర్, గుగ్గిల రమేశ్, వాసాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల రక్షణచట్టం అమలు చేయాలి కరీంనగర్క్రైం: న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను లాయర్లు డిమాండ్ చేశారు. ఇటీవల మేడ్చల్, ఖమ్మం, ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ల సభ్యులు సురేశ్బాబు, ఎండీ జహీర్ అలీ, ఇజ్జగిరి మనోజ్పై జరిగిన దాడులను నిరసిస్తూ బుధవారం కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు లింగంపల్లి నాగరాజు, కందుల అరుణ్కుమార్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. అనంతరం జిల్లా కోర్టు నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. సీనియర్ న్యాయవాదులు కుసుంబ కృష్ణారావు, కొరివి వేణుగోపాల్, బి.రాంరెడ్డి, పి.బాపురావు, వినయ్, కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాళోజీకి ఘన నివాళి
కరీంనగర్ కల్చరల్/కరీంనగర్క్రైం: ప్రజాకవి కాళోజీ నారాయణరావు తన కవిత్వం, రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజి నారాయణరావు 111వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్ కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ గౌస్ ఆలం కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీపీలు వెంకటరమణ, భీంరావు, ఆర్ఐలు రజినీకాంత్(అడ్మిన్), శ్రీధర్రెడ్డి(వెల్ఫేర్) పాల్గొన్నారు. -
ఏం చేద్దాం.. ఎలా చేద్దాం?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నిబంధనలకు విరుద్ధంగా దందా సాగిస్తున్న మల్టీపర్పస్ పార్క్ కాంట్రాక్ట్ ఏజెన్సీపై చర్యకు బల్దియా కసరత్తు చేస్తోంది. మల్టీపర్పస్ పార్క్ కాస్తా మల్టీ పార్టీస్ పార్క్గా మారడంతో షరామామూలుగానే అధికారులపై ఒత్తిళ్లు పెరిగాయి. పార్క్లో లీజు పేరిట కాంట్రాక్ట్ ఏజెన్సీ సాగిస్తున్న దందాలపై ‘ఇదేం గలీజు దందా’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించడం తెలిసిందే. లీజు ఒప్పందంలో పేర్కొన్న నిబంధనలను మీరి చేపడుతున్న దందాలపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తుండగా, చర్యలు తీసుకోకపోవడంతో అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రద్దా.. కొనసాగింపా? నగర ప్రజలకు ఆహ్లాదం పంచేందుకు ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ పార్క్ కొంతమంది వ్యాపారాలకు కేంద్రంగా మారింది. రెండేళ్ల నిర్వహణ పేరిట టెండర్ దక్కించుకున్న సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం సమస్యగా మారింది. లీజు ఒప్పందానికి విరుద్ధంగా ప్రవేశ రుసుం రూ.20 నుంచి రూ.50కి పెంచడం, వాహనాల పార్కింగ్కు డబ్బులు వసూలు చేయడం, వాకింగ్ ట్రాక్ను దుర్వినియోగం చేయడం, మ్యూజికల్ ఫౌంటెయిన్ పేరిట అదనపు వసూళ్లకు పాల్పడడంతో పాటు ఇప్పుడు ఏకంగా దాబా హోటల్ను ప్రారంభించారు. ఐదు వేల మొక్కలు నాటారట పార్క్లో నిబంధనలు ఉల్లంఘిస్తుండడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏజెన్సీ నిర్వాహకులు ఐదు వేల మొక్కలు నాటామంటూ కొత్త రాగం ఎంచుకొన్నారు. స్మార్ట్సిటీలో భాగంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పార్క్లో తాము ఐదు వేల మొక్కలు నాటామంటూ నమ్మబలుకుతున్నారు. అసలు ఐదు వేల మొక్కలు నాటే స్థలం ఆ పార్క్లో ఎక్కడుందో అని నిత్యం వాకింగ్కు వచ్చే వాకర్స్ వెతికే పనిలోపడ్డారు. పైగా మొక్కలు నాటేందుకు, ఇతరత్రా రూ.50 లక్షలు ఖర్చు చేశామని బల్దియాకు రాసిన లేఖనే వాళ్ల మెడకు ఇప్పుడు చుట్టుకొనే పరిస్థితి ఏర్పడింది. రూ.25 వేలు జరిమానా అనుమతి లేకుండా దాబా హోటల్ను ప్రారంభించిన రాక్ ఏజెన్సీకి బల్దియా నోటీసు జారీ చేస్తూ, రూ.25 వేలు జరిమానా విధించింది. పార్క్లో లీజు ఒప్పందం ఉల్లంఘనలపై డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. నివేదికలో ఉల్లంఘనలు నిజమే అని తేలితే మొత్తం లీజు ఒప్పందాన్ని రద్దు చేయనుంది. బుధవారం తుది నోటీసు జారీ చేసే అవకాశముంది.గ‘లీజ్’ దందా పార్ట్–2నిబంధనలు పక్కనపెట్టి, పార్క్ గోడను తొలగించి దాబా ప్రారంభించిన ఏజెన్సీ నిర్వాహకులు సరికొత్త వాదనను తెరమీదికి తీసుకొచ్చారు. దాబా ప్రారంభంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ తమకు క్యాంటీన్కు అనుమతి ఉందని, అందుకే దాబా ప్రారంభించామంటున్నారు. క్యాంటీన్కు, దాబాకు తేడా లేదని వాదనకు దిగుతున్నారు. క్యాంటీన్ అంటే కేవలం ప్యాకేజ్డ్ ఆహారపదార్థాలు మాత్రమే ఉంటాయి. దాబా హోటల్కు ప్రత్యేకంగా బట్టిని ఏర్పాటు చేయడంతో పాటు, వంటకాలు ఇక్కడే చేస్తారు. తద్వారా నిర్వాహకులు చెప్పుకొంటున్నట్లుగా ‘ఆక్సీజన్ జోన్’ పార్క్ కాస్తా ‘పొల్యూషన్ పాయింట్’గా మారుతోంది.చర్యలు తీసుకోవాల్సిందే: వెలిచాలమల్టీపర్పస్ పార్క్లో లీజు ఒప్పంద నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా దాబాను ప్రారంభించడంపై ఆయన నగరపాలకసంస్థ అధికారులకు ఫోన్ చేశారు. చర్యలకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకోకపోతే తాను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. -
‘బతికే ఉన్న బాంఛన్.. ఇప్పించండి పింఛన్’
గంగాధర: ‘నేను చచ్చిపోయానని పదేళ్లుగా ఇస్తున్న పింఛన్ను ఐదు నెలలుగా ఆపేసిండ్రు. బతికే ఉన్న బాంఛన్.. నాకు పింఛన్ ఇప్పించండి’ అంటూ ఓ వృద్ధురాలు అధికారులను వేడుకుంటోంది. సదరు వృద్ధురాలి వివరాల ప్రకారం.. గంగాధర మండలం చర్లపల్లి(ఆర్) గ్రామానికి చెందిన బూర్గు లక్ష్మి భర్త చనిపోయాడు. 2014 డిసెంబర్ నెల నుంచి సర్కారు వితంతు పింఛన్ ఇస్తోంది. మే 2025 నుంచి వృద్ధురాలికి అధికారులు పింఛన్ను నిలిపివేశారు. ఈ విషయమై అధికారులను ఆశ్రయిస్తే ‘నువ్వు చనిపోయినట్లు రికార్డుల్లో ఉంది. అందుకే పింఛన్ రావడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. ‘సారూ నేను బతికే ఉన్నా.. పింఛన్ ఇప్పించండంటూ’ నాలుగు నెలలుగా అధికా రుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయింది. కలెక్టర్ స్పందించి తనకు పింఛన్ వచ్చేలా చూడాలని కోరుతోంది. తెలంగాణ ఆత్మ కాళోజీ కరీంనగర్ కల్చరల్: తెలంగాణ ఆత్మ కాళోజీ అని తెలంగాణ రచయితల వేదిక (తెరవే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వేంకటేశ్వర్లు అన్నారు. తెరవే జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ప్యారడైజ్ హైస్కూల్లో 148వ ఎన్నీల ముచ్చట్లు నిర్వహించారు. ముందుగా రేకుర్తి చౌరస్తాలో కాళోజీ విగ్రహానికి నివాళి అర్పించారు. రాష్ట్ర సాధనకు కాళోజీ చేసిన కృషిని బుర్ర తిరుపతి, పీఎస్ రవీంద్ర, ఎర్రోజు వెంకటేశ్వర్లు వివరించారు. తెరవే అధ్యక్ష, కార్యదర్శులు సీవీ కుమార్, దామరకుంట సమన్వయ కర్తలుగా వ్యవహరించి, కాళోజీ స్మృతి కవితలను వినిపించారు. కవులు నడిమెట్ల రామయ్య, విలాసాగరం రవీందర్, బాలసాని కొమురయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం జమ్మికుంట: రైతులు దళారులను నమ్మి మోసపోకుండా నేరుగా మార్కెట్ యార్డులో పత్తి విక్రయించి, మద్దతు ధర పొందాలని మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ పూల్లూరి స్వప్న సూచించారు. మార్కెట్ యార్డులో మంగళవారం కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. ఇల్లందకుంటకు చెందిన దాంసాని స్వామి రెండు గన్నీ సంచుల్లో పత్తిని తీసుకువచ్చాడు. గరిష్ట ధర రూ.5,021కు కొనుగోలు చేశారు. పాత పత్తి మార్కెట్కు 15 క్వింటాళ్లు రాగా.. గరిష్ట ధర రూ.7,400కు వ్యాపారులు కొనుగోలు చేశారు. మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 కార్యదర్శి రాజా పాల్గొన్నారు. పవర్కట్ ప్రాంతాలు కొత్తపల్లి: విద్యుత్ లైన్ల నిర్వహణ పనులు కొనసాగుతున్నందున బుధవారం ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కేవీ డీఎఫ్ఓ ఫీడర్ పరిధిలోని సవరన్ స్ట్రీట్, ఎస్బీఐ ప్రధానశాఖ, రాజా థియేటర్, భూంరెడ్డి ఆస్పత్రి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్–2 డిపో నుంచి ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారం, సామర్లకోటలోని వివిధ దర్శనీయ ప్రాంతాలను దర్శించడానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశామని డిపో–2 మేనేజర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈ బస్సు 12వ తేదీ శుక్రవారం రాత్రి 10గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయల్దేరుతుందని, పెద్దలకు రూ.3300, పిల్లలకు రూ.2500 టికెట్ ఉంటుందని తెలిపారు. వివరాలకు 9398658062, 7382850708, 8978383084. నంబర్లలో సంప్రదించాలని సూచించారు. 18 వరకు లా కోర్సుల పరీక్ష ఫీజు గడువు కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ ఎల్ఎల్బీ నాలుగు, ఎల్ఎల్ఎం రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫీజు తేదీని విడుదల చేసినట్లు ఎగ్జామినేషన్ కంట్రోలర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వరకు గడువు ఉందని, రూ.300 అపరాధ రుసుంతో ఈ నెల 22వరకు అనుమతించినట్లు తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ చూడొచ్చని సూచించారు. -
తియ్యనైనది తెలుగు భాష
కొత్తపల్లి(కరీంనగర్): తెలుగు భాష తియ్యనైనదని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే అన్నారు. తెలంగాణ భాష దినోత్సవాన్ని పురష్కరించుకొని కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా క్వాలిటీ కో– ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి మధుసూదన్రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అల్ఫోర్స్లో తెలుగు ఉపాధ్యాయులకు ఘన సన్మానం -
ఊరూరా.. రైతన్న కన్నెర్ర
అదే వరుస.. తీరని వ్యథ మానకొండూర్/గంగాధర/శంకరపట్నం/గన్నేరువరం: మానకొండూరులోని గ్రోమోర్ సెంటర్ వద్ద మంగళవా రం ఉదయమే యూరియా కోసం రైతులు బారులు తీరారు.నిల్చునే ఓపిక లేక చెప్పులు వరుసలో ఉంచారు. రైతుకు రెండు బస్తాల చొప్పున ఇచ్చారు. గంగాధర మండలం మల్లాపూర్, గోపాల్రావుపల్లి 240 బస్తాలు తెప్పించగా.. 300మంది రైతులు వచ్చారు. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 120మందికే ఇచ్చారు. మిగితావారు మరుసటి రోజు తీసుకుంటామని చిట్టీ రాయించుకున్నారు. శంకరపట్నం మండలం మొలంగూర్, తాడికల్ సహకార సంఘం గోదాంల వద్ద పోలీసు పహారా మధ్య ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొ ప్పున ఇచ్చారు. గన్నేరువరం గ్రోమోర్లో 260, సహకార కేంద్రం ఆధ్వర్యంలో 460, గుండ్లపల్లి స్టేజీ వద్ద 260 బస్తాలు పంపిణీ చేశారు. యూరియా అందనివారు ఆందోళనకు దిగారు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ సొసైటీకి స్టాక్ వచ్చిందనే సమాచారంతో తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో రైతులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు టోకెన్లు పంపిణీ చేసి, ఒక్కో రైతుకు ఒక్కో బస్తా ఇచ్చారు.జిల్లాలో అన్నదాతకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఒక్క బస్తా అయినా ఇవ్వండంటూ గంటల తరబడి క్యూలో నిల్చున్నా ఫలితం లేదు. టోకెన్లు దక్కిన వారికి సైతం యూరి యా ఇవ్వడం లేదు. దీంతో ఓపిక నశించిన కొందరు రైతులు మంగళవారం పలు ప్రాంతాల్లో ప్రభుత్వంపై కన్నెర్రజేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. రైతుల కష్టాలపై ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ నాయకులు సైతం పోటాపోటీగా ఆందోళనకు దిగారు. రాస్తారోకోలు నిర్వహించి, దిష్టిబొమ్మలు దహనం చేశారు. -
లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్క్రైం: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ పరిధిలో ఉన్న లక్ష్మీదేవిపేటకు చెందిన పెద్ది దక్షిణ్ ఊరాఫ్ దక్షిణామూర్తి (23) కరీంనగర్ వచ్చి రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేశాడు. మద్యం సేవించి విధులకు హాజరుకావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కొంతకాలం స్వగ్రామంలో ఉండి తిరిగి కరీంనగర్ వచ్చాడు. ఆదర్శనగర్లోని ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్గా చేరాడు. మద్యం తాగడంతో పాటు అశ్లీలచిత్రాలు చూసే అలవాటు ఉన్న దక్షిణామూర్తి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై ఈనెల 6న వేకువజామున మత్తుమందిచ్చి లైంగికదాడి చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఘటనపై కలెక్టర్కు నివేదిక ఇచ్చామని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలపై త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు(చైల్డ్ ఫోర్నోగ్రఫీ) చూస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 30మందిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ సీఐ జాన్రెడ్డి పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్కు చెందిన ఈరవేణి రమ్య(30) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్రెడ్డి కథనం ప్రకారం.. రమ్య మంగళవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను స్కూల్కు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ‘అమ్మ తలుపు తీయూ’ అంటూ పిలిచినా పలక లేదు. దీంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రమ్య ఉరేసుకుని నిర్జీవంగా ఉండడంతో పిల్లలు లాస్య, ప్రవీన్, సుశాంత్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే రమ్య భర్త కృష్ణహరి బతుకుదెరువు కోసం 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. భర్త దుబాయ్లోనే ఉండగా, భార్య కడసారి చూపు కోసం బయల్దేరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల దేవయ్య (55)కు గతంలో మూడుసార్లు రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. ఆపరేషన్ల కారణంగా కాళ్ల నొప్పులు విపరీతమయ్యాయి. పలుసార్లు ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో కొంతకాలంగా మనస్తానపానికి గురవుతున్నాడు. సోమవారం సాయంత్రం పొలం వద్దకని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి పొలం శివార్లలో వెతకగా దేవయ్య చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మంగళవారం ఎస్సై ప్రశాంత్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య లచ్చవ్వ, కూతురు సౌజన్య, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒక రు..కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ(54) మంగళవారం గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్కుమార్ కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ కోరుట్ల ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తూ.. ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబపోషణ, ఇతర అవసరాలకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనారాయణ కుమారుడు వికాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసై ఒకరు..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారంలో నివాసం ఉంటున్న వాడెపు జంగయ్య (45) లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి తరుచూ గొడవలు పడుతున్నాడు. మంగళవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన లకావత్ లలిత– పరంగి దంపతుల కూతురు మధుమతి(16) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మధుమతి సరిగ్గా స్కూల్కు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుమతి ఈ నెల 1న గడ్డి మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. మహిళ మృతిబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్కు చెందిన సమ్మవ్వ (45) చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు.. సమ్మవ్వ భర్త సమ్మయ్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె మద్యానికి బానిసైంది. పదిరోజుల క్రితం సమ్మవ్వ అల్లుడు బోసు ప్రభాకర్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరి మృతితో డిప్రెషన్కు లోనైంది. మానసిక వేదనతో ఈ నెల 8న మద్యం సేవించిన సమ్మవ్వ తన భర్త సమాధి వద్ద విలపించింది. అనంతరం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యసైదాపూర్: మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణస్వామి(42) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సైదాపూర్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారంగా బోయిని సత్యనారాయణస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మణిసాయి, భార్య రేణుక హుస్నాబాద్లో ఓ శుభకార్యానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద సత్యనారాయణ, చిన్న కుమారుడు సాయితేజ ఉన్నారు. సాయితేజ కిరాణం షాపునకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ స్వామి ఇంట్లో ఉరేసుకొని మృతి చచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
మహిళపై కత్తితో దాడికి యత్నం
● కేసు నమోదు చేసినా మారని తీరు ● భయాందోళనలో మహిళ కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన కవిత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన రాజు అలియాస్ మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం కత్తి, బీరుసీసాతో దాడికి యత్నించాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా ఆమె డ్యాన్స్ చేస్తుండగా మల్లేశ్ అడ్డుకున్నాడు. దీంతో కవిత భర్త మల్లేశ్ను మందలించాడు. ఈ క్రమంలో కవితపై కక్షపెంచుకున్న మల్లేశ్ కత్తితో దాడికి యత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. మల్లేశ్ కత్తి, బీరుసీసాతో కాసేపు హంగామా సృష్టించాడు. ఎవరైనా అడ్డువచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైందని తెలుసుకున్న మల్లేశ్.. మంగళవారం సదరు మహిళ భర్తను చంపేస్తానంటూ మళ్లీ హంగామా సృష్టించాడు. కవిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
మెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వేంపేట మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు మారంపెల్లి శ్రీనివాస్(53) గుండెపోటుతో మృతి చెందారు. తిరుమలతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి సోమవారం వెళ్లాడు. తిరుపతిలోనే మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. పారిశుధ్య కార్మికుడు..పెగడపల్లి: మండలంలోని కీచులాటపల్లిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు కొత్తపల్లి సత్తయ్య (50) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన సత్తయ్య మృతిపై గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో అచ్చ గంగారాం (56) ద్విచక్ర వాహనం ఢీకొని మృతిచెందాడు. గంగారాం సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని సైకిల్పై ఇంటికి బయల్దేరాడు. మోరపల్లి బైపాస్రోడ్ వద్ద జగిత్యాలకు చెందిన మహేశ్ ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి గంగారాంను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గంగారాంను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. గంగారాం కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. మెట్పల్లి: పట్టణ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మగ్గిడి నర్సయ్య(59) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన నర్సయ్య ద్విచక్ర వాహనాంపై పని నిమిత్తం మెట్పల్లికి వస్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కౌలు రైతు ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు● ట్రాక్టర్ లాక్కెళ్లిన ఫైనాన్స్ ప్రతినిధులు ● కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి ● మనస్తాపంతో ఆత్మహత్య తిమ్మాపూర్: ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫైనాన్స్లో అప్పు చేసిన ఓ కౌలు రైతు సదరు ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్గౌడ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపగోని బాబు (43) భార్య పద్మతో కలిసి గ్రామంలో కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. గతంలో ట్రాక్టర్ కొన్న బాబు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు సక్రమంగానే కిస్తీలు చెల్లించాడు. తర్వాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సదరు ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ట్రాక్టర్ను తీసుకెళ్లాడు. మరోసారి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇటీవలే తన ఇంటిపై మరో ఫైనాన్స్ సంస్థలో రుణం పొందాడు. బయట రూ.4లక్షలు అప్పు ఉండడం.. రెండు ఫైనాన్స్ల్లో వడ్డీతో కలిపి రూ.8 లక్షలకు చేరడంతో కిస్తీలు చెల్లించడం గగనంగా మారింది. మరోవైపు ఫైనాన్స్ సిబ్బంది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాబు ఈనెల6న ఉదయం పొలం వద్దకని చెప్పి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున మృతిచెందాడు. బాబు భార్య పద్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటి నంబర్ల దందాపై బల్దియా నజర్
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధి లో ఇంటినంబర్ల దందాపై అధికారులు దృష్టి సారించారు. ఏళ్లకాలంగా ఇంటినంబర్లతో ఖాళీ స్థలాలను కబ్జాచేస్తున్న వ్యవహారానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేని స్థలాలకు ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయగా, ఇటీవల బొమ్మకల్లోనూ ఇలాంటి ఇంటినంబర్లను రద్దు చేశారు. నగరంలోని డివిజన్ల వారీగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లను గుర్తించేందుకు విచారణ చేపట్టా రు. నివేదిక వచ్చాక చర్యలు చేపట్టనున్నారు. ఇంటి నంబర్లతో ఆక్రమణ నగరంలో ఇంటి నంబర్లతో భూముల కబ్జాలకు పాల్పడే దందా ఏళ్లుగా సాగుతోంది. కొంతమంది నగరపాలకసంస్థ రెవెన్యూ అధికారుల కుమ్మక్కుతో కబ్జారాయుళ్ల ఆగడాలకు అడ్డు అదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ భూములు, వివా దాస్పద భూములే లక్ష్యంగా ఇంటి నంబర్లను ప్రయోగిస్తున్నారు. ఎంచుకున్న ఖాళీ స్థలంలో నిర్మాణాలు లేకున్నా, ఇంటి నంబర్ను జారీ చేస్తున్నారు. ఈ ఇంటి నంబర్ ఆధారంగా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని, ఆక్రమించుకొంటున్నారు. ఇలా ఇంటి నంబర్లతో భూముల ఆక్రమణపై అనేక ఫిర్యాదులు వచ్చిన క్రమంలో ఉన్నతాధికారులు నియంత్రణపై దృష్టి సారించారు. రేకుర్తి, బొమ్మకల్లో రద్దు వివాదాస్పద భూములకు అడ్డాగా ఉన్న రేకుర్తి, బొమ్మకల్లో పలు ఫిర్యాదు నేపథ్యంలో అధికారులు గతంలో విచారణచేపట్టారు. రేకుర్తిలో ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీ స్థలాలకు ఇచ్చిన 1002 ఇంటి నంబర్లను రద్దు చేశారు. బొమ్మకల్లోనూ విచారణ చేపట్టిన అనంతరం ఇప్పటివరకు దాదాపు 18 ఇంటి నంబర్లను రద్దు చేశారు. డివిజన్లవారీగా సేకరణ రేకుర్తి, బొమ్మకల్తో పాటు నగరంలోని అన్ని డివిజన్లలోనూ ఇలాంటి ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు జారీ అయిన వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టారు. నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశాలతో వార్డు అధికారులు, నిర్మాణాలు లేని స్థలాలకు జారీ అయిన ఇంటినంబర్ల వివరాలు సేకరిస్తున్నారు. ప్రభుత్వ భూములు, ప్రైవేట్ భూముల వారిగా జాబితా సిద్ధం చేస్తున్నారు. వారం రోజుల్లో విచారణ నివేదిక వచ్చిన తరువాత ఆ ఇంటినంబర్లను రద్దు చేయడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకొనే అవకాశముంది. -
జీవించు.. సాధించు
కరీంనగర్టౌన్: సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాదు. ఒక్క మనిషికే ఆ విపరీత బుద్ధి. చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు. చావే భయమన్న భ్రమలో పడిపోతాడు. అక్షరాస్యులైనా.. నిరక్షరాస్యులైనా... నిరుద్యోగి అయినా.. జీవితంలో స్థిరపడ్డవారైనా... చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ వైఫల్యం... ఒంటరితనం.. నిరుద్యోగం... ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. కారణమేదైనా ప్రాణాలు వదులుతున్నారు. జీవితాన్ని జయించలేక చావుకు చేరుకుంటున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం. పెరుగుతున్న బలవన్మరణాలు... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలవన్మరణాలు భయపెడుతున్నాయి. ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం విద్యార్థులే కావడం బాధాకర విషయం. చదవలేక కొందరు, సహచర విద్యార్థులు, ఫ్యాకల్టీ వేధింపులతో మరికొందరు, మార్కులు రాలేదని ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో బలమైన కారణాలు కనిపించడం లేదని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి బాగా మానసిక ఒత్తిడికి లోనైప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, తమకు ఏంచేయాలో, సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఉద్యోగం లేదని, మానసిక రుగ్మతలు, మత్తు మందులకు బానిసవడం, విపరీతమైన భయం, ఎక్కువగా నిరాశకు గురికావడం, విపరీతమైన అప్పులు, జీవితంపై నమ్మకం సన్నగిల్లడం, వ్యవసాయంలో నష్టాలు, పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటున్నాయి. ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. నిరాశతో ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి. వారిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ఓదార్చాలి. నేనున్నానంటూ భరోసా కల్పించాలి. ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు సమస్య ఏదైనా చావు మాత్రమే పరిష్కారం కాదు నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంఆత్మహత్యాయత్నం ఓ మానసిక సమస్య. చనిపోయినంత మాత్రాన సమస్య తీరదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారిని గుర్తించి చికిత్స చేయించడం అత్యవసరం. వారిని నెమ్మదిగా నలుగురిలోకి తీసుకువెళ్లాలి. జీవితంపై ఆసక్తి కలిగించేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు. డాక్టర్ ఎల్. వర్శి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి -
పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా..
రామగుండం: పల్లెపాలనను మరింత పారదర్శకంగా అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘సమర్ద్’ పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. గ్రామ పంచాయతీల పాలన, పథకాల అమలు, నిధుల వినియోగం తదితర అంవాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. పోర్టల్లోని వివరాలు.. ● ఈ గ్రామ్స్వరాజ్ : పంచాయతీల డిజిటలైజేషన్, నిధుల ట్రాకింగ్, పథకాల అమలు, పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, బడ్జెట్, గ్రాంట్లు, గ్రామ సభల ఆమోదం, ప్రణాళికలు, అభివృద్ధి.. ● ప్లాన్ప్లస్ : వార్షిక ప్రణాళిక, అభివృద్ధి పనులకు సాయం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ప్రాజెక్టు ఆమోదం, గ్రామసభల నిర్ణయాలు, బడ్జెట్ ప్రతిపాదనలు.. ● పీఆర్–వన్ : పారిశుధ్యం, తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్ మిషన్, చెత్త సేకరణ, మురుగునీటి తొలగింపు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ.. ● లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ : శాసనసభ, లోక్సభ నియోజకవర్గాలతో అనుసంధానించి డేటా నిర్వహణ.. ● పర్యవేక్షణ విధానం : జిల్లా పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు, కార్యదర్శుల ద్వారా పనితీరును పర్యవేక్షించే అవకాశం.. ● అవార్డులు, ప్రోత్సాహకాలు : ఏటా ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరును కనబరిచే పంచాయతీలకు ‘పంచాయత్ సశక్తీకరణ పురస్కార్’ ప్రదానానికి వీలు.. ● స్వచ్ఛభారత్ మిషన్ : మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన.. ‘సమర్ద్’ పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం -
యూరియా అడిగితే అరెస్టులా?
కరీంనగర్: రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలపడానికి వెళ్తున్న సీపీఐ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తారా? అని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీని వాస్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రైతులకు సరిపడా యూరియా తేవాలని సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టు చేసి పీటీసీకి తరలించారు. పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు రోడ్డెక్కుతున్నారన్నారు. యూరియా తీసుకురావడంలో బండి సంజయ్, ఇతర బీజేపీ ఎంపీలు విఫలం అయ్యారన్నారు. సరిపడా యూరియా తెప్పించాలని, లేకుంటే ఎంపీని తిరగనివ్వమని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు గూడెం లక్ష్మీ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కాంతాల శ్రీనివాస్రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మచ్చ రమేశ్, బామండ్ల పెల్లి యుగేందర్, బీర్ల పద్మ పాల్గొన్నారు. -
రోడ్డెక్కి ఆందోళన
కరీంనగర్/చిగురుమామిడి: రామడుగు మండలం వెదిర సహకార సంఘం గోదాం వద్ద కరీంనగర్– జగిత్యాల ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. వచ్చిన లోడ్లో సగమే వెదిరలో దింపి, మిగితాలోడ్ వేరేచోటుకు తరలిస్తున్నారని గంటకు పైగా రహదారిపై బైఠాయించారు. విషయం తెలిసిన కాంగ్రెస్ నాయకులు నెరెళ్ల మారుతి, రాల్లబండి పురుషోత్తంరెడ్డి, తొరికొండ అనిల్కుమార్, ఎడవెల్లి రాజిరెడ్డి, రత్నాకర్రెడ్డి, ముత్యం శేఖర్గౌడ్ పలువురు బీజేపీ నాయకులు రైతులకు మద్దతుగా రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎస్సై కె.రాజు రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. చిగురుమామిడి సింగిల్విండో కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. ఈనెల 1న 800 మందికి టోకెన్లు ఇచ్చారని ఇప్పటికీ యూరియా రాకపోవడంతో పంట నష్టపోతున్నామని మంగళవారం ఆందోళన నిర్వహించారు. -
మాఫియా చెట్టాపట్టాల్
రెవెన్యూ.. ఇసుక ● కోరుట్ల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఓ నాల్గో తరగతి ఉద్యోగి తన బంధువుల పేరిట ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం రెవెన్యూ వర్గాల్లో అందరికి తెలిసినా పట్టించుకునే నాథుడే లేడు. ● మెట్పల్లి పాత తాలుకా పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దవార్ల మధ్య ఇసుక ‘మామూళ్ల’ పంచాయితీ సాగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపైనొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అది కూడా ఇసుక ఆక్రమ రవాణాదారులతోనే కావడం గమనార్హం. ● కథలాపూర్ మండలం సిరికొండ–తక్కళ్లపల్లి శివారు నుంచి ప్రతీరోజు రాత్రి సమయంలో చెన్నూర్ ఇసుక పర్మిట్ల పేరిట సుమారు 10 నుంచి 15 లారీలు జిల్లా సరిహద్దు దాటుతున్నాయి. వారి ప్రాంతంలో ఇసుకరీచ్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నా.. రెవెన్యూ అఽధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తూ వారానికి ఓసారి మొక్కుబడిగా ఒకటి రెండు లారీలకు జరిమానాలు వేసి వదిలేస్తున్న వైనం అనుమానాస్పదంగా ఉంది. ● ఇటీవల కోరుట్లలో ఓ ఇసుక అక్రమ రవాణాదారు ఏర్పాటు చేసిన ఫంక్షన్కు కోరుట్ల, కథలాపూర్ ప్రాంతాల రెవెన్యూ అధికారులు పోటాపోటీగా వచ్చి విందులు ఆరగించడం గమనార్హం. కిందిస్థాయి ఉద్యోగులు అక్కడే మందు పార్టీ చేసుకోవడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎక్కడిక్కడే రెవెన్యూ ఉద్యోగులు ఇసుక మాఫియాతో కుమ్మకై ్కన ఆనవాళ్లు కనిపిస్తాయి. దీని ఫలితంగానే ఇసుక అక్రమంగా అడ్డూఅదుపు లేకుండా రవాణా అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల: కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ సబ్ డివిజన్ల పరిధిలో ఇసుక అక్రమార్కులతో కిందిస్థాయి రెవెన్యూ అధికారులు సంబంధాలు నెరుపుతున్న ఫలితంగా ఉన్నతాధికారులు ఎంత నిక్కచ్చిగా వ్యవహరించినా మార్పు రావడంలేదు. కోరుట్ల మండలం నాగులపేట, పైడిమడుగు, కథలాపూర్ మండలం సిరికొండ, తక్కళ్లపల్లి, బొమ్మన శివారుల్లో మెట్పల్లి మండలం ఆత్మకూర్ వాగు, మల్లాపూర్ మండలంలోని వేంపల్లి–వెంకట్రావ్పేట, రేగుంట ఏరియాలో ఇసుక అక్రమ రవాణాతో భూగర్బజలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాగుల పరిసరాల్లో కొట్టుకుపోయి చుట్టుపక్కలతోటలు, పొలాల్లో వరదలు వచ్చిన సమయంలో మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఏడాది క్రితం పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భారీగా జరిమానాలు ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి ఇసుక అక్రమ రవాణాకు పుల్స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నిరోజుల పాటు ఇసుక అక్రమ రవాణా నిలిచిపోయింది. అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ట్రాక్టర్కు రూ.25 వేలు, లారీకి రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఒక్క కోరుట్లలోనే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 40 ట్రాక్టర్లను పట్టుకుని నెల రోజల పాటు రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. చివరికి ట్రాక్టర్లను వదిలేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పట్టుబడిన ట్రాక్టర్లకు భారీగా జరిమానా వేసి వదిలేశారు. ఇదే రీతిలో మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఆ సమయంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొన్నాళ్లు పాటు నిక్కచ్చిగా వ్యవహరించారు. మళ్లీ మొదటికి.. ఇసుక అక్రమ రవాణాదారులు కొంతమంది కింది స్థాయి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క అడపదపా ట్రాక్టర్లను పట్టుకుని జరిమానాలు వేసినట్లు ఉన్నతాధికారులకు చూపి, మిగిలిన ట్రాక్టర్లు, లారీలను వదిలేయాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆర్నెళ్ల వ్యవధిలో కోరుట్ల, మెట్పల్లి సబ్ డివిజన్లలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవడం.. జరిమానా వేయడం చాలా మేర తగ్గిపోయింది. ప్రతీరోజు కోరుట్ల, కథలాపూర్ మండలాల నుంచి కనీసం 50 ట్రాక్టర్లు, 15 లారీల్లో ఇసుక తరలిపోతుండగా..నెలకు ఓ పది ట్రాక్టర్లు, రెండు మూడు లారీలు పట్టుకుని జరిమానా వేసి వదిలేస్తున్న వైనం రెవెన్యూ తీరుకు అద్దం పడుతోంది. ఇక్కడితో సరిపెట్టుకోకుండా కొంత మంది రెవెన్యూ ఉద్యోగులే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణాను సక్రమంగా చేసుకోవడానికి కాగితాలు సృష్టించుకోమని అక్రమార్కులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఆగని ఇసుక అక్రమ రవాణా -
ఇదేం గలీజు దందా!
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్లో స్మార్ట్సిటీ ప్రాజెక్టు కింద రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన మల్టీపర్పస్ పార్కును ఇష్టానికి వినియోగిస్తున్నారు. పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడం, అనుమతి లేకున్నా రెస్టారెంట్లు, దాబాలు ఏర్పాటు చేస్తూ హడావుడి చేస్తున్నారు. ఈ దందాలో మాజీ కార్పొరేటర్లు భాగస్వాములు కావడంతో బల్దియా అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఈ విషయమై సోమవారం ‘సాక్షి’ వివరణ కోరడంతో రంగంలోకి దిగిన కమిషనర్ అసలు మల్టీపర్పస్ పార్కులో రెస్టారెంట్కు ఎలాంటి అనుమతి లేదని, రద్దు చేస్తామని తొలుత తెలిపారు. రాత్రి 8.30 గంటల తరువాత ఇదే విషయాన్ని అధికారికంగా మాట్లాడారు. వినోదం కోసం ఏర్పాటుచేసిన పార్కులో ప్రజల జేబులకు చిల్లుల పడేలా వ్యవహరిస్తున్న మాజీ కార్పొరేటర్లు, వారితో కుమ్మక్కయిన బల్దియా అధికారులు కలిసి ఇంతకాలం చేసిన ఈ వ్యవహారం కమిషనర్ జోక్యంతో ముగిసినట్లయింది. అసలేం జరిగింది? కరీంనగర్ స్మార్ట్సిటీ ప్రాజెక్టులో చేపట్టిన మల్టీపర్పస్ పార్కు నిర్మాణం ఆదినుంచి వివాదాల నడుమే సాగింది. నిర్మాణంలో సుదీర్ఘ జాప్యం జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఒప్పందం ప్రకారం నిర్మించిన కాంట్రాక్టరు మూడేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు చూడాలి. అతన్ని కాదని మరో కాంట్రాక్టరుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. తరువాత ఓ మాజీ కార్పొరేటర్ భాగస్వామిగా ఉన్న సంస్థకు లీజుకిచ్చారు. ఈ లీజు చెల్లదంటూ పలువురు మాజీ కార్పొరేటర్లు ఫిర్యాదులు చేసినా బల్దియా వర్గాలు పట్టించుకోలేదు. పార్కులో ప్రవేశానికి రూ.20 ఎంట్రీ ఫీజు వసూలు చేయడం ప్రారంభించారు. దీనిపై విమర్శలు వచ్చినా.. భాగస్వాముల్లో మాజీ కార్పొరేటర్ ఉండటంతో బల్దియా అధికారులు కిమ్మనలేదు. తరువాత ఈ ఫీజును వారాంతాల్లో రూ.50కి పెంచారు. ఒప్పందంలో రూ.50ఫీజుగా తాము నిర్ణయించలేదని కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ‘సాక్షి’కి స్పష్టం చేశారు. ఈ లెక్కన వారంతాల్లో రూ.50 చొప్పున వసూలు చేసిన అధికఫీజు ఎవరి జేబులోకి వెళ్లింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. అది చాలదన్నట్లుగా ఇక్కడ రెస్టారెంట్ ప్రారంభించారు. వాస్తవానికి మున్సిపల్ పార్కుల్లో చిప్స్ తదితర ప్యాక్డ్ ఫుడ్ విక్రయించాలి. అక్కడే ఆహారం వండితే పొగ, కూరగాయల వ్యర్థాలతో వాకర్స్కు ఇబ్బంది కలుగుతుంది. ఎలకలు పందికొక్కులు వచ్చి మొక్కలను నాశనం చేస్తాయి. నగరవాసులకు ఆహ్లాదం కోసం నిర్మించిన పార్కు లక్ష్యం కాస్తా.. పక్కదారి పడుతోంది. ప్రస్తుతం లీజుకు తీసుకున్న నిర్వాహకులు బల్దియా అధికారులతో ఉన్న పాత పరిచయంతో రెస్టారెంట్ నిర్మాణం ప్రారంభించారు.లీజుకు తీసుకున్న వారు వాకర్స్కు ఆహారం అందిస్తామంటూ మున్సిపల్ కమిషనర్కు పెట్టుకున్న దరఖాస్తు వింతగా ఉంది. వారు పార్కును ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండేళ్ల కాలానికి లీజుకు తీసుకుని అభివృద్ధి చేశామని, వేసవికాలంలోనూ పార్కులో 5000 మొక్కలు నాటామని, చిన్నపాటి అడవిని సృష్టించామని, ఆక్సిజన్ జోన్గా మార్చామని చెప్పుకున్నారు. ఇందుకోసం ఏకంగా రూ.50 లక్షలు ఖర్చు చేశారంట. అందుకే, సందర్శకుల తాకిడి పెరిగి ఆహారం అందించాలని పట్టుబడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. కాబట్టి రెస్టారెంట్కు అనుమతి కావాలంటూ 6వ తేదీన కమిషనర్కు ఒక దరఖాస్తు పెట్టుకున్నారు. తీరా 7వ తేదీన ప్రారంభోత్సం చేశారు. కేవలం 18 గంటల్లో అక్కడ రెస్టారెంట్ కొలువుదీరిన రహస్యం అటు బల్దియా, ఇటు నిర్వాహకులకు మాత్రమే తెలుసు.ఈ విషయమై ‘సాక్షి’ బల్దియాలో అధికారులను వివరణ కోరగానే.. ఓ మాజీ విలేకరి అయిన ఓ మాజీ కార్పొరేటర్ రంగంలోకి దిగాడు. తమకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని వాదనకు దిగాడు. తీరా సాయంత్రానికి కమిషనర్ అనుమతులనే రద్దు చేశామని ప్రకటించడంతో చేసేది లేక తోకముడిచాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు యత్నించగా సంబంధిత ఇంజినీర్లు ఫోన్లు స్విచాఫ్ చేసుకోవడం గమనార్హం. చివరకు బల్దియా కమిషనర్ అధికారికంగా రెస్టారెంట్ను మూసివేస్తామని ప్రకటించడంతో బల్దియా అధికారుల ఫోన్లు స్విచ్ఆన్ అయ్యాయి. బల్దియా అధికారుల అవినీతి, వారికి మామూళ్లు ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్న మాజీ కార్పొరేటర్ల ధనదాహానికి ఈ రెస్టారెంట్ చక్కటి ఉదాహరణ అని నగరవాసులు అభివర్ణిస్తున్నారు. -
నిరసన .. నిరీక్షణ.. నిర్లక్ష్యం..
నిరీక్షణగన్నేరువరం/చిగురుమామిడి: యూరియా కోసం రైతుల పాట్లు తప్పడం లేదు. గన్నేరువరం గుండ్లపల్లిలో యూరియా టోకెన్ల కోసం సోమవారం ఎరువుల దుకాణం వద్ద క్యూ కట్టారు. 230బస్తాలకు టోకెట్లు ఇచ్చి, యూరియా పంపిణీ చేశారు. 70 మంది రైతులకు నిరాశే మిగిలింది. చిగురుమామిడి మండలం ఇందుర్తిలో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. 500 యూరియా బస్తాలు రాగా, వెయ్యి మంది రైతులు క్యూలో నిల్చున్నారు. తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్, చిగురుమామిడి ఎస్సై సాయికృష్ణ పర్యవేక్షణలో టోకెన్లు జారీ చేసి, యూరియా పంపిణీ చేశారు. బస్తాలు అందనివారు నిరాశతో వెనుదిరిగారు.నిరసనకరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు చేయకుంటే గద్దె దింపుతామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకుడు శ్రీనివాస్ హెచ్చరించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం వృద్ధులు, దివ్యాంగులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వృద్ధులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఇచ్చిన హమీలు అమలు చేయకుండా సర్కారు దగా చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఇచ్చిన మాట నిలుపుకోవాలన్నారు.నిర్లక్ష్యంమానకొండూర్/కరీంనగర్ రూరల్: మానకొండూర్ చెరువు వద్ద వినాయక నిమజ్జన తరువాత చెత్త పేరుకుపోయింది. చెరువులో విగ్రహాలు తొలగించకపోవడం అధికా రుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిమజ్జనం అనంతరం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విగ్రహా ల ఇనుము తీసుకెళ్లి, ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలు అక్కడే వదిలేశారని స్థానికులు ఆరో పిస్తున్నారు. చెరువులోని చేపలు చనిపోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ మల్లయ్య చెరువులోనూ వినాయక విగ్రహాలు తొలగించకపోవడంతో నీళ్లు కలుషితమవుతున్నాయి. -
దొంగబంగారం కొంటే కటకటాలే
కరీంనగర్క్రైం: జిల్లాలో చోరీ కేసులు పెరిగిపోతున్నాయి. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులను పట్టుకుని జైలుకు తరలిస్తున్నారు. కాగా.. విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిందితులు ముందుగానే దొంగనతం చేసిన సొత్తును కొనుగోలు చేసేవారిని వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. చోరీ చేసిన బంగారాన్ని అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు. దొంగబంగారం బయట ఎవరూ కొనుగోలు చేయరు కాబట్టి.. ప్రత్యేకంగా పలువురు వ్యాపారులు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ అడ్డదారిలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆలోచన చేస్తున్నారు. దొంగతనం కేసుల్లో నిందితులు పోలీసులకు పట్టుబడినప్పుడు రికవరీ కోసం ఎక్కడ అమ్మారు అనే విషయాలు లోతుగా అడగడంతో గోల్ట్ వ్యాపారుల పేర్లు చెప్పడంతో వారినీ నిందితుల జాబితాలో చేర్చుతున్నారు. ఇటు బంగారం.. అటు డబ్బు నష్టం దొంగతనం కేసుల్లో నిందితుల వద్ద నుంచి బంగారం కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తున్నారు. కొన్ని రోజుల తరువాత పోలీసులు దొంగతనం చేసిన నిందితులను పట్టుకొని, గోల్ట్ వ్యాపారుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు అటు డబ్బు ఇటూ బంగారం కోల్పోవడంతో పాటు కేసుల్లో ఇరుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దొంగ బంగారాన్ని కొనేందుకు ఒక ముఠానే ఉందని సమాచారం. దొంగ బంగారాన్ని మార్కెట్ రేటులో 25 నుంచి 50శాతానికే కొనుగోలు చేస్తుండడంతో పెద్ద ఎత్తున లాభం ఉంటుంది. గుట్టుచప్పుడు కాకుండా కరిగించి మార్కెట్ రేటుకు అమ్ముకొని లాభాలు పొందుతున్నారు. పోలీసులకు చిక్కితే బంగారంతో పాటు డబ్బులు నష్టపోతున్నారు. కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఆర్మూర్ వంటి ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. దొంగ బంగారం కొనుగోలు చేస్తే పోలీసులకు చిక్కకతప్పదని, కోర్టు కేసులు వెంటాడుతాయని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ పరిధిలో ఇటీవల జరిగిన ఆరు చోరీ కేసుల్లో నిందితులు పోలీసులకు చిక్కారు. ఇందులో ఇద్దరు దొంగతనం చేసినవారుండగా.. మరో ఇద్దరు వారినుంచి బంగారం కొనుగోలు చేసినవారున్నారు. అందరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఇటీవల తిమ్మాపూర్ పరిధిలో దొంగతనాలు చేసిన నిందితుడు బంగారాన్ని ఓ వ్యాపారికి అమ్మాడు. పోలీసులు సదరు వ్యక్తిని కూడా నిందితుడిగా కేసులో చేర్చారు. దొంగలతో పాటు కొనుగోలు చేసినవారిపైనా కేసు తక్కువ ధరకు వస్తుందని కొంటున్న వ్యాపారులు ఆపై కేసుల చుట్టూ తిరుగుతున్న వైనం చోరీ సొత్తు కొనొద్దంటున్న పోలీసులు -
మిలాద్ ఉన్ నబీ వేడుకలు
కరీంనగర్ కల్చరల్: మహమ్మద్ ప్రవక్త 1500 వ జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉన్ నబీని సోమవారం నగరంలో ముస్లింలు ఘ నంగా నిర్వహించారు. హుస్సేనీపురలోని బొంబాయి స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డీఎఫ్వోచౌరస్తా, గీతాభవన్, బస్టాండ్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా రాజీవ్చౌక్ కరీ ముల్లాషా దర్గాకు చేరింది. సీపీ గౌస్ఆలం బందోబస్తును పర్యవేక్షించారు. తెలంగాణచౌక్లో కలెక్టర్ పమేలా సత్పతి ర్యాలీలో పాల్గొన్నారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్, సుడా చైర్మన్ నరేందర్రెడ్డి హాజరయ్యారు. కొత్తపల్లి: సర్వీసుల డీటీఆర్లకు ఫీడర్ల అనుసంధానం వందశాతం పూర్తి చేసి మ్యాపింగ్ ఇవ్వాలని టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు సూచించారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో సోమవారం అధికారులతో సమావేశం అయ్యారు. ఫీడర్ల బ్రేకర్లను త్వ రగా పూర్తిచేయాలన్నారు. సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకునే వారి దరఖాస్తులను త్వరగా పరిశీలించాలన్నారు. డీఈలు కే.ఉపేందర్, జంపాల రాజం, ఎం.తిరుపతి, పి.చంద్రమౌళి, ఎస్ఏఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి, చేప, రొయ్య పిల్లల పంపిణీకి కేటాయించిన రూ.122 కోట్ల నిధులను టెండర్ల పేరుతో కాలయాపన చేయకుండా మత్స్య సోసైటీల అకౌంట్లలో జమ చేయాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం(టీఎంకెఎంకెఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నగరంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో మాట్లాడారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.5000 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. ప్రతీ సొసైటీకి రూ.10లక్షలు, మార్కెటింగ్ కో–ఆపరేటివ్ సొసైటీకి, మహిళా మత్స్య సొసైటీకి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించాలన్నారు. జిల్లా నేతలు వెంకటేశ్, గణేశ్ ఉన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ ట్రాన్స్కో కరీంనగర్ రీజినల్ కార్యవర్గ ఎన్నికలు జరిగా యి. పవర్ ఇంజినీర్స్ భవన్లో సోమవారం యూనియన్ ట్రాన్స్కో కంపెనీ అధ్యక్షుడు తులసి రామ్ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వేంకటేశ్వర్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. యూనియన్ ట్రాన్స్కో కరీంనగర్ రీజియన్ అధ్యక్షుడుగా ఎ.సందీప్, సెక్రటరీగా ఎల్.రాహుల్, వర్కింగ్ ప్రెసిడెంట్గా వి.జగదీశ్, అడిషనల్ సెక్రటరీగా బి.త్రిలోచన్, కోశాధికారిగా వి.సదయ్య ఎన్నికయ్యారు. యూనియన్ కార్యదర్శి బాలకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇ.నాగరాజు పాల్గొన్నారు. తిమ్మాపూర్: నూతన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు వాహనాల తనిఖీపై ఉమ్మడి జిల్లా రవాణాశాఖ ఉప కమిషనర్ పి.పురుషోత్తం అలుగునూర్ చౌరస్తాలో అవగాహన కల్పించారు. వాహనాల పత్రాలు, బీమా, డ్రైవింగ్ లైసెన్స్, భద్రతా ప్రమాణాలను వివరించారు. డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఎంవీఐ రవికుమార్, ఏఎంవీఐ స్రవంతి పాల్గొన్నారు. -
మిడ్మానేరులో 27 టీఎంసీలు
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర(మిడ్మానేరు) ప్రాజెక్టులో రికార్డుస్థాయిలో నీరు చేరింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు నీటిమట్టం 27.19 టీఎంసీలకు చేరింది. ఉదయం ఆరు గంటలకు ఏకంగా 27.171 టీఎంసీలకు చేరగా.. ఎల్ఎండీకి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 27.50 టీఎంసీలు. కొద్ది రోజులుగా ఎస్సారెస్పీ నుంచి పెద్ద మొత్తంలో నీరు వస్తోంది. వర్షాకాలం ఆరంభంలో ఎల్లంపల్లి నీటిని రామడుగు మండలం గాయత్రి పంప్హౌస్ నుంచి వరదకాల్వ మీదుగా ఎత్తిపోశారు. గత జూలైలో ఏడు టీఎంసీలు మాత్రమే నీరు నిల్వ ఉన్న మిడ్మానేరులోకి ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ నుంచి వరద వస్తుండడంతో ఏకంగా 27 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి సోమవారం ఎస్సారెస్పీ నుంచి 16,300 క్యూసెక్కులు వస్తుండగా, ఎల్ఎండీకి 10వేలు, ప్యాకేజీ–10లోకి 6,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 2024 అక్టోబర్ 3వ తేదీన 27.19 టీఎంసీల నీరు చేరడం గమనార్హం. ఏడాది అనంతరం మళ్లీ 27.19 టీఎంసీల మేర నీరు నిల్వ ఉండడం గమనించాల్సిన అంశం. రికార్డు స్థాయిలో నీటి నిల్వ -
ఎంవోయూతో మరిన్ని సేవలు
కొత్తపల్లి(కరీంనగర్): ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంవోయూలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరిన్ని సేవలు అందిస్తామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లి (హవేలి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జేఈఈ, ఐఐటీ, నీట్ కోర్సు పుస్తకాలను ‘ట్రస్మా’ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు అందించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ విద్యార్థులకు విభిన్న రంగాల్లో విజయవంతంగా శిక్షణ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదవడం, రాయడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులకు ప్రతినెలా రీడింగ్, రైటింగ్ పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కొత్తపల్లి పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, ఇక్కడి విద్యార్థులు విభిన్న రంగాల్లో ఎంపికవుతుండటం సంతోషదాయకమన్నారు. అనంతరం విద్యార్థులకు రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు నిర్వహిస్తున్న విటమిన్ గార్డెన్ను పరిశీలించారు. భవిత కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రంథాలయాన్ని పరిశీలించారు. ఎంఈవో తుమ్మ ఆనందం, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, హెచ్ఎం కన్నం రమేశ్ పాల్గొన్నారు. -
పేదల బతుకులను ఆగం చేయొద్దు
హుస్నాబాద్– కొత్తపల్లి మధ్య నిర్మించతలపెట్టిన నాలుగు వరుసల రహదారిని మా గ్రామం మీదుగా కాకుండా బైపాస్ ద్వారా చేపట్టండి. కొద్దిరోజుల క్రితం బైపాస్ కోసమే అధికారులు సర్వే చేపట్టారు. కొందరు స్వార్థ రాజకీయం కోసం గ్రామం మీదుగా వేయాలని ప్రయత్నించారు. ఇదే జరిగితే వందలాది ఇళ్లను కూల్చాల్సి వస్తుంది. సుమారు 200 మంది కుటుంబాలు రోడ్డున పడతాయి. పైగా గ్రామంలో ఐదు మూలమలుపులు ఉన్నాయి. ఇది ప్రమాదాలకు కారణం కానుంది. వాహనాల స్పీడ్ పెరిగి తరచూ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు పార్కింగ్ కూడా తగ్గిపోతుంది. ఎలా చూసినా నష్టం కలిగించే రహదారిని గ్రామం మీదుగా కాకుండా బైపాస్ చేపడితే బాగుంటుంది. – బాధిత కుటుంబాలు, సుందరగిరి, చిగురుమామిడి -
దొరికిన శ్రీకర్ మృతదేహం
జగిత్యాలక్రైం: మెట్పల్లి మండలం పెద్దాపూర్ శివారులో ఎస్సారెస్పీ కాలువలో గతనెల 27న ట్రాక్టర్ పడి గల్లంతైన కాటిపల్లి శ్రీకర్ రెడ్డి మృతదేహం సోమవారం జగిత్యా ల రూరల్ మండలం తాటిపల్లి శివారు ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో లభ్యమైంది. శ్రీకర్ బంధువులు, కుటుంబ సభ్యులు 13 రోజులుగా శ్రీకర్ ఆచూకీ కోసం వెదుకుతూనే ఉన్నారు. శ్రీకర్రెడ్డి శవమై కనిపించడంతో కుటుంబసభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. చనిపోయి పడి ఉంటాడా..? కోరుట్ల/మెట్పల్లిరూరల్: వినాయక చవితి రోజు తమ రైస్మిల్లులో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరోచోట వినాయకుని ప్రతిష్ఠ కోసం శ్రీకర్రెడ్డి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రాక్టర్లో వెళ్లాడు. రైస్మిల్లుకు ఎదురుగా ఎస్సారెస్పీ కెనాల్ ఉండగా ట్రాక్టర్.. ట్రాలీకి మధ్య ఉన్న శ్రీకర్రెడ్డి ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్ ట్రాలీకి ఢీకొని మృతి చెంది ఉంటాడని, సుమారు 20 మీటర్ల లోతులో ఉన్న కెనాల్ నీటిలో పడిపోయి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈతవచ్చే శ్రీకర్రెడ్డి నేరుగా నీటిలో పడి ఉంటే ఇతర స్నేహితులతోపాటు బయటకు వచ్చే అవకాశాలు ఉండేవి. కానీ.. ట్రాక్టర్ కెనాల్లోకి దూసుకెళ్తున్న సమయంలోనే దెబ్బలు తగలడంతో శ్రీకర్రెడ్డి స్పృహలేని స్థితిలోనే కెనాల్ నీటిలో పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కారణంగానే పన్నెండు రోజులు గడిచినా శ్రీకర్రెడ్డి మృతదేమం పెద్దగా దెబ్బతినలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దాపూర్లో విషాదం శ్రీకర్రెడ్డి చనిపోయి ఉండకపోవచ్చన్న ఆశతో 12 రోజులుగా కాలం గడిపిన తండ్రి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి ఆశలు నీరుగారిపోయాయి. శ్రీకర్రెడ్డి కెనాల్లో గల్లంతైన మరుసటి రోజే నీటిని ఆపేసి వారంపాటు గాలించినా ఫలితం దక్కలేదు. చివరికి తాటిపల్లి వద్ద ఎస్సారెస్పీ కెనాల్లో శ్రీకర్రెడ్డి మృతదేహం కనిపించడంతో పెద్దాపూర్లో విషాదం నెలకొంది. సోమవారం సాయంత్రం కాటిపల్లి శ్రీకర్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. మంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్ గ్రామ శివారులోని ఎల్.మడుగు ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సోమవారం పొలం పనులకు వెళ్లిన వారికి దుర్వాసన రావడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రమేశ్ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా వ్యక్తి మృతదేహం కనిపించింది. భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరిగి మృతదేహం కొట్టుకు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం వినాయక నిమజ్జనం సందర్భంగా గోదావరిఖనిలోని గోదావరినదిలో యువకుడు రాజేశ్ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ మృతదేహం రాజేశ్దే అని తొలుత భావించిన పోలీసులు.. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని రాజేశ్ది కాదని చెప్పడంతో మృతదేహం ఎవరిదనేది తేలాల్సి ఉంది. -
మల్లన్నసాగర్కు తరలుతున్న ‘గంగమ్మ’
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు ప్రాజెక్టు నుంచి మల్లన్నసాగర్కు గోదావరి జలాలు తరలిపోతున్నాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు సామర్థ్యం 50 టీఎంసీలు కాగా ఇక్కడి నుంచి 25 టీఎంసీలు తరలిచాలనే లక్ష్యంతో ఎత్తిపోస్తున్నారు. ముందుగా అన్నపూర్ణ ప్రాజెక్టుకు నీటిని తరలించి అక్కడి నుంచి సిద్దిపేట జిల్లా రంగనాయక్ సాగర్ నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లకు ఎత్తిపోస్తున్నారు. మిడ్ మానేరుకు 44 టీఎంసీల ఇన్ఫ్లో రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మిడ్మానేరులోకి గత 15 రోజుల్లోనే 37 టీఎంసీల వరకు ఇన్ఫ్లో చేరింది. ఇందులో మెజార్టీగా 20 టీఎంసీలు ఎస్సారెస్పీ నుంచి, మరో 17 టీఎంసీలు వరద ద్వారా వచ్చింది. గత జూన్ 1 నుంచి సెప్టెంబర్ 4 వరకు 44 టీఎంసీల మేర ఇన్ఫ్లో వచ్చింది. ఇందులో ఎల్లంపల్లి నుంచి 6.766 టీఎంసీలు, ఎస్సారెస్పీ నుంచి 20.080 టీఎంసీలు, వరద ద్వారా 17.071 టీఎంసీల మేర నీరు మిడ్మానేరులోకి చేరింది. మిడ్మానేరు నుంచి 24 టీఎంసీల ఔట్ఫ్లోగా వెళ్లింది. ఇందులో కరీంనగర్ ఎల్ఎండీకి 11 టీఎంసీలు, అన్నపూర్ణ ప్రాజెక్టులోకి 13 టీఎంసీలు, ఎడమ కాలువకు 0.002 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 0.963 క్యూసెక్కులు తరలించా రు. ప్రస్తుతం మిడ్మానేరులో 26.042 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి 13,150 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో వస్తోంది. మిడ్మానేరు నుంచి ప్యాకేజీ–10లోకి 12,800, ఎల్ఎండీకి వేయి క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరు టు మల్లన్నసాగర్ మిడ్మానేరు నుంచి సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ వరకు సుమారు 70 కిలోమీటర్ల మేర నీటిని పంపుల ద్వారా ఎత్తిపోస్తున్నారు. అన్నపూర్ణలో 3.5, రంగనాయక్సాగర్లో 3, మల్లన్నసాగర్లో 25, కొండపోచమ్మసాగర్లో 12 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈనెల 4 వరకు అన్నపూర్ణలోకి 1.38, రంగనాయకసాగర్కు 1.51, మల్లన్నసాగర్కు 9.34, కొండ పోచమ్మసాగర్లోకి 2.28 టీఎంసీల మేర మొత్తం 14.51 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోశారు. ఇంకా అన్నపూర్ణకు 0.84, రంగనాయకసాగర్కు 0.47, మల్లన్నసాగర్కు 5.412, కొండపోచమ్మసాగర్కు 4.9 టీఎంసీలు మొత్తం 11.62 టీఎంసీల మేర నీటిని ఎత్తిపోయడం ఉందని అధికారులు తెలిపారు. మిడ్ మానేరులో 27 టీఎంసీలు 20 రోజులుగా మిడ్మానేరులోకి ఎస్సారెస్పీ జలాలతోపాటు వర్షాలతో వరద నీరు సుమారు 37 టీఎంసీల మేర చేరింది. ప్రాజెక్టులో నీటిమట్టం 27 టీఎంసీలకు చేరడంతో ప్రభుత్వ ఆదేశాలతో అన్నపూర్ణ ప్రాజెక్టులోకి కొద్ది రోజులుగా రోజుకు 11 నుంచి 12 వేల క్యూసెక్కుల మేర నీరు తరలిస్తున్నాం. – జగన్, మిడ్ మానేరు, ఈఈ 25 టీఎంసీలు లక్ష్యం ఇప్పటికే 10 టీఎంసీలు తరలింపు అన్నపూర్ణ, రంగనాయక్సాగర్ మీదుగా ఎత్తిపోతలు 27 టీఎంసీలతో నిండుకుండలా మిడ్మానేరు పాజెక్టుల స్వరూపం -
సిటీలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ నిర్వహణ పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.కిసాన్నగర్ ఫీడర్ పరిధిలోని దుర్గమ్మగడ్డ, ఖాన్పుర, ప్రవిష్ట అపార్ట్మెంట్, కిసాన్నగర్, ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.గోదాంగడ్డ ఫీడర్ పరిధిలోని సప్తగిరిహిల్స్ రోడ్డు నంబర్ 1,2,3,4, తాహెర మజీద్, శ్రీనగర్కాలనీ, భవానీకాలనీ, మల్లికార్జున కాలనీ, జానకిస్ట్రీట్ అపార్ట్మెంట్, అంజనాద్రి దేవాలయం, దోబీఘాట్, గోదాంగడ్డ, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, జెడ్పీ క్వార్టర్స్, భగత్నగర్, మల్లమ్మ మార్కెట్, రఘుపతి రెడ్డి హాస్పిటల్ ప్రాంతాలు, ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 11 కె.వీ.సాయికృష్ణ ఫీడర్ పరిధిలోని ముకరంపుర, గీతాభవన్, జెడ్పీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, భగత్నగర్, సాయికృష్ణ థియేటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి పీడర్ పరిధిలోని సరస్వతీనగర్, విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
మన నేత్రాలకు మరోజన్మ
కోల్సిటీ (రామగుండం): మరణించినా.. మన నేత్రాలకు మరోజన్మను పొందే అవకాశం ఉంటుందని, నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని గోదావరిఖని సిమ్స్ వైస్ ప్రిన్సిపల్ నరేందర్ అన్నారు. నేత్రదానం పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని సోమవారం సిమ్స్లో సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు నిర్వహించారు. నరేందర్ మాట్లాడుతూ, నేత్రదాన మహాయజ్ఞంలో అందరూ పాల్గొనాలన్నారు. నేత్ర, అవయవ, శరీర దానాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సదాశయ ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. జీజీహెచ్ ఆర్ఎంవో దండే రాజు, అప్తమాలజిస్ట్ ప్రొఫెసర్ గోపీకృష్ణ, మైక్రోబయాలజీ హెచ్వోడీ ఓబులేశ్ మాట్లాడుతూ, నేత్రదానానికి ముందుకు వచ్చే వారితోపాటు మరణించిన వారినేత్రాలను విషాదంలో కూడా దానం చేసిన కుటుంబాల త్యాగం గొప్పదని కొనియాడారు. సదాశయ ఫౌండేషన్ జాతీయ గౌరవ అధ్యక్షడు సానా రామకష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షుడు లగిశెట్టి చంద్రమౌళి, ప్రచార కార్యదర్శి కేఎస్ వాసు మాట్లాడారు. కార్నియాలను సేకరించే విధానం, కార్నియాలను నిల్వ చేసే పద్ధతిపై ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ అవగాహన కల్పించారు. ఆయనను ఈ సందర్భంగా సత్కరించారు. సదాశయ ఫౌండేషన్ ప్రతినిధులు మిట్ట సత్యం, మిట్టపల్లి కాంతారావు తదితరులు పాల్గొన్నారు. సిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ -
బాలిక ఆరోగ్యానికి కలెక్టర్ భరోసా
సిరిసిల్ల: ఆరోగ్యం బాగ లేక ఇబ్బంది పడుతున్న బాలికకు కలెక్టర్ సందీప్కుమార్ ఝా బాసటగా నిలిచారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్కు చెందిన మిడిదొడ్డి భాగ్య కూతురు వెన్ను ఎముకకు సంబంధించిన సమస్యతో బాధపడుతోంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో అసహాయ స్థితిలో బాలిక తల్లి మిడిదొడ్డి భాగ్య సోమవారం కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్కు తన ఆవేదనను విన్నవించింది. స్పందించిన కలెక్టర్ ఆ బాలిక శస్త్రచికిత్స కోసం రూ.74,938 ఆర్థిక సహాయం చెక్కును అందించారు. తన కూతురు ఆపరేషన్ కోసం వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్కు భాగ్య చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స కోసం ఆర్థిక సాయం -
వినతుల జాతర
కరీంనగర్ అర్బన్: కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వినతుల తాకిడి పెరుగుతోంది. ప్రతీ సోమవారం సంఖ్య పెరగడమే తప్పా తగ్గడం లేదు. వివిధ రకాల సమస్యలతో వందలాది మంది ప్రజావాణిని ఆశ్రయిస్తున్నారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేశన స్థలాల కోసం అధికారులకు అర్జీలు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.మొత్తం అర్జీలు: 300 మున్సిపల్ కార్పొరేషన్: 60 మానకొండూర్ తహసీల్దార్: 15 డీపీవో: 13, సీపీ ఆఫీస్: 12 ఆర్డీవో కరీంనగర్: 10 తహసీల్దార్ గంగాధర: 10గ్రామంలో 244/ఎ/1 లో 21గుంటల సాగు భూమి ఉంది. వారసత్వంగా మా తండ్రికి రాగా సదరు భూమిని నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ముందే తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా.. రిజిస్ట్రేషన్ చేశారు. అధికారులు వెంటనే రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలి. – తిరుపతి, గద్దపాక, శంకరపట్నం -
పసి బిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి
రాయికల్: రాయికల్ పట్టణానికి చెందిన కట్టెకోల సుధాకర్, అర్చన దంపతులకు రెండు రోజుల క్రితం ఆడ శిశువు 800గ్రాముల బరువుతో జన్మించింది. ఆమెను వెంటిలేటర్పై సుమారు మూడు నెలలపాటు ఉంచాలని వైద్యులు చెప్పడంతో ఆ నిరుపేద తండ్రి బిడ్డను బతికించుకునేందుకు నానాపాట్లు పడుతున్నాడు. సుధాకర్ మెకానిక్ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బిడ్డ వైద్యానికి సుమారు రూ.మూడు లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు అంటున్నారు. బంధువుల సహకారంతో మెడికల్ బిల్లు మాత్రమే చెల్లిస్తున్నారు. తన చేతిలో చిల్లగవ్వ లేదని, దాతలు స్పందించి ఆర్థిక సహాయం అందించాలని తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఆదుకునేవారు 96183 25316 నంబర్లో సంప్రదించాలని వేడుకుంటున్నారు. వైద్యం కోసం వేడుకుంటున్న తండ్రి దాతల సహాయం కోసం ఎదురుచూపు -
పెళ్లయిన రెండు నెలలకే..
పెగడపల్లి: పెళ్లయిన రెండునెలలకే ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. పెగడపల్లి ఎస్సై కిరణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గారం మండలం శెకల్లకు చెందిన జక్క ఆనంద్ (25)కు పెగడపల్లి మండలంలోని బతికపల్లికి చెందిన సలాది రాజయ్య, సరా కూతురు రమ్యతో రెండు నెలల క్రితం వివాహమైంది. ఆనంద్ ఆదివారం రాత్రి బతికపల్లికి ద్విచక్రవాహనంపై వస్తుండగా మండలంలోని లింగాపూర్ శివారులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆనంద్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఆనంద్ తండ్రి జానయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ఆనంద్ మృతితో ఇరువురి కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. యువకుడి ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపుయైటింక్లయిన్కాలనీ(రామగుండం): గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 6న గోదావరి నదిలో గల్లంతైన రామగుండంలోని అక్బర్నగర్కు చెందిన రాజేశ్ ఆచూకీ కోసం పోలీసులు సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవాశాత్తు యువకుడు నదిలో పడిపోయిన విషయం విదితమే. గోదావరిఖని ఏసీపీ రమేశ్ ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో ఇందారం బ్రిడ్జి నుంచి సుందిళ్ల, బ్యారేజీ, మంథని బ్రిడ్జి వరకు గాలించారు. అయినా యువకుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు.కొత్తపేట రైతులకు రూ.79.84లక్షల ప్యాకేజీబోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడలో నిర్మించిన మిడ్మానేరు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన కొత్తపేటకు చెందిన పలువురికి రూ.79,84,370 పరిహారం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో కొత్తపేటకు చెందిన 75 మంది రైతులు తమ భూములను కోల్పోయారు. వారు కొన్నాళ్లుగా ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా భూములు కోల్పోయిన 75 మంది రైతులను పీఏఎఫ్ కుటుంబాలుగా గుర్తించి వారికి పనిదినాల కింద పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించారు. 2025 ఆర్అండ్ఆర్ పాలసీ కింద ఈ పరిహారం మంజూరైనట్లు పేర్కొన్నారు. -
ఊరూరా ‘కాళేశ్వరం’ ఫ్లెక్సీలు
● బీఆర్ఎస్ ప్రచారపర్వం ● ఆసక్తికర చర్చ సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కొత్త అధ్యాయానికి తెరలేపింది. అధికారంలో ఉన్న పార్టీ తాము అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఫ్లెక్సీలు, హోర్డింగుల ద్వారా ప్రచారం చేసుకోవడం చూస్తుంటాం. కానీ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఊరూరా ఫ్లెక్సీలతో ప్రచారం చేస్తుంది. ‘కాళేశ్వరం లేకుంటే... రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఈ జలాశయాలు ఎక్కడివి?, లక్షలాది ఎకరాలకు నీళ్లు ఎక్కడివి?’ అంటూ ప్రచారం మొదలుపెట్టింది. బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద 27.55 టీఎంసీలతో నిర్మించిన మధ్యమానేరు, కోనరావుపేట మండలం మల్కపేట వద్ద 3 టీఎంసీలతో నిర్మించిన మల్కపేట రిజర్వాయర్, ఇల్లంతకుంట మండలం అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల అన్నపూర్ణ రిజర్వాయర్ ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్యాకేజీ–9, 10, లింకు 3, 4లను రూ.4,468 కోట్లతో నిర్మించిన జలాశయాలతో 1,11,150 ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొంటూ ప్రచారం చేస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. సిరిసిల్ల ప్రాంతంలో గులాబీరంగు, వేములవాడ నియోజకవర్గంలో తెల్లరంగుల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం చర్చకు దారితీసింది. పార్టీ శ్రేణుల్లోనూ చర్చ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఘోష్ కమిటీ సిపార్సుల నేపథ్యంలో చర్చ నడుస్తుంది. మరో వైపు కాళేశ్వరం కూలిపోతే గోదావరి నీళ్లు ఎలా జిల్లాకు చేరాయని బీఆర్ఎస్ శ్రేణులు చర్చకు తెరలేపారు. కాళేశ్వరం నుంచి చుక్కనీటిని లిఫ్ట్ చేయడం లేదని, దేవాదుల ద్వారా నీరు వస్తోందని కాంగ్రెస్ శ్రేణులు వాదిస్తుంటే.. దేవాదుల ద్వారా మధ్యమానేరుకు ఎలా నీరు వస్తోందని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. లక్ష్మి, గాయత్రీ పంప్హౌస్లను ఎవరు నిర్మించారంటూ నిలదీస్తున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన పంపుహౌస్లతోనే మిడ్మానేరు వరకు నీటిని ఎత్తిపోస్తున్నారంటున్నారు. ఏదీ ఏమైనా జిల్లాలో ఫ్లెక్సీ రాజకీయం నడుస్తోంది. -
లెవల్ క్రాసింగ్ గేట్లకు మరమ్మతు
ఓదెల(పెద్దపల్లి): కాజీపేట– మల్హార్ష సెక్షన్ల మధ్యలోని ఓదెల, పొత్కపల్లి రైల్వేస్టేషన్ల సమీప లెవల్ క్రాసింగ్ గేట్ల మరమ్మతు కొద్దిరోజులుగా సాగుతోంది. దీంతో రైళ్ల వేగం బాగా తగ్గింది. ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు చాలా ఆలస్యంగా నడవడంతో గమ్యస్థానాలు చేరుకునేందుకు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఓదెలలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్థానికులు, పొత్కపల్లిలో గేట్తో జమ్మికుంట నుంచి సుల్తానాబాద్కు వెళ్లే ప్రయాణికులు, ప్రజలు నరకయాతన పడుతున్నారు. గేట్ మరమ్మతు సందర్భంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
భూగర్భ గనిలో దొంగలు పడ్డారు
గోదావరిఖని: కాపర్ కోసం పదిమంది సభ్యులు గల దొంగల ముఠా ఏకంగా భూగర్భగనిలో చొరబడింది. ఆదివారం అర్ధరాత్రి ఎల్డీఎల్ యంత్రాలు లోనికి పంపించే దారి గుండాలోనికి వెళ్లారు. ఇందుకోసం గనిపై, లోపల ఉన్న ఐరన్మెస్లు తొలగించారు. పంప్ ఆపరేటర్ దొంగలను చూసి అప్రమత్తమై గనిపైఉన్న అధికారులకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. దీంతో దొంగలు పలాయనం చిత్తగించారు. ఆర్జీ –వన్ ఏరియాలోని జీడీకే–2,2ఏగనిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్డీఎల్ యంత్రాలు గనిలోకి పంపించే ప్రత్యేక దారిని సాధారణ రోజుల్లో మూవేస్తారు. దీనిని గమనించిన దొంగలు గని వద్దకు చేరుకున్నారు. మద్యం తాగి, స్నాక్స్ తిని గనిలోనికి వెళ్లింది. పంప్ ఆపరేటర్ దొంగలను చూసి ఫోన్ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం చేరవేడంతో సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, నాలుగు బృందాలు గని ప్రత్యేక టన్నెల్ వద్దకు చేరుకున్నారు. వీరినిచూసిన దొంగలు పరారైనట్లు చెబుతున్నారు. చోరీ ఘటనను కవర్ చేయడానికి వెళ్లిన పాత్రికేయులతో సెక్యూరిటీ గార్డు రుసరుసలాడారు. తన అనుమతి లేకుండా ఫొటోలు తీయడానికి మీరెవరంటూ బెదించాడు. ఈవిషయంపై సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి మాట్లాడుతూ, సకాలంలో తాము గనిపైకి చేరుకోవడంతో దొంగలు పారిపోయారని, సంస్థ ఆస్తికి నష్టం వాటిళ్లలేదన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. పంప్ ఆపరేటర్ అప్రమత్తతతో దొంగల పరార్ -
‘రాజకీయ లబ్ధికే రాద్ధాంతం’
కరీంనగర్ కార్పొరేషన్: తమ రాజకీయ లబ్ధికే కొంతమంది వెలిచాల రాజేందర్రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేపుతున్నారని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పుడు మాటలు నమ్మరాదని సూచించారు. సోమవారం నగరంలో మాట్లాడుతూ.. రాజేందర్రావు అభిమానులు ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో ప్రొటోకాల్ పాటించలేదంటూ రాద్ధాంతం చేయడం ఉద్దేశపూర్వకమేనని విమర్శించారు. వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకునే ఫ్లెక్సీలో ప్రొటోకాల్ ఏంటని ప్రశ్నించారు. ఫ్లెక్సీలో కవ్వంపల్లి ఫొటో లేదంటూ దళితుల పేరిట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తమ ఇంట్లో దళితులతో కలిసి అప్పుడు జగపతిరావు, ఇప్పుడు రాజేందర్రావు సహఫంక్తి భోజనం చేస్తున్నారన్నారు. రాజేందర్రావుపై ఇదే వైఖరి కొనసాగిస్తే తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. నాయకులు అర్ష మల్లేశం, సుద్దాల లక్ష్మణ్, శ్రీనివా స్, శ్రీనివాస్, అజయ్, శంకర్ పాల్గొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రిలో యువతిపై లైంగికదాడి
కరీంనగర్ క్రైం: కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా ఉన్న యువతిపై లైంగికదాడి జరిగింది. ఆస్పత్రి కాంపౌండర్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. కరీంనగర్ త్రీటౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. పొరుగు జిల్లాకు చెందిన ఓ యువతి ఆరోగ్యం బాగోలేదని కరీంనగర్లోని శ్రీదీపిక ఆస్పత్రిలో శనివారం ఇన్పేషెంట్గా అడ్మిట్ అయ్యింది. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతిపై ఆదివారం వేకువజామున ఆస్పత్రిలో పనిచేసే కాంపౌండర్ దక్షిణామూర్తి (24) మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. విషయాన్ని యువతి తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆస్పత్రిలో విచారణ చేపట్టారు. బాధితురా లిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సీసీ పుటేజీలు, బెడ్షీట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన సమయంలో ఎమర్జెన్సీ వార్డులో ఇతర పేషెంట్లు ఎవరైనా ఉన్నారా, డ్యూటీ డాక్టర్లు, సిబ్బంది ఎవరున్నారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
అనిల్కుమార్కు పురస్కారం
కరీంనగర్ కల్చరల్: త్రివర్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియం భాస్కర ఆడిటోరియంలో ఆదివారం దక్షిణ భారత భాషా కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు డా.నందిని సిధారెడ్డి చేతుల మీదుగా కరీంనగర్కు చెందిన కవి కొత్త అనిల్కుమార్ ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం అందుకున్నారు. అన్నాడి గజేందర్రెడ్డికి గుర్రం జాషువా పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆచార్య కొలకూరి ఇనాక్, ఎమ్మెల్సీ ఇక్బాల్, బైస దేవదాస్, దొమ్మటి శంకర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సాహితీవేత్తలు పాల్గొన్నారు. -
కొండగట్టు ఆలయ ద్వార బంధనం
మల్యాల: చంద్ర గ్రహణాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం శ్రీకొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ద్వార బంధనం చేశారు. ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ప్రధాన ద్వారం మూసేశారు. ఆలయ పరిసరాలు భక్తులు లేక వెలవెలబోయాయి. సోమవారం పుణ్యహచనము, సంప్రోక్షణ, తిరుమంజనము, ఆరాధన నిర్వహించిన అనంతరం ఉదయం 7.30 గంటల నుంచి భక్తులు ఆంజనేయస్వామివారిని యధావిధిగా దర్శనం చేసుకోవచ్చని ఆలయ అర్చకులు తెలిపారు. స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, లక్ష్మణప్రసాద్, హరిహరనాథ్, ఉమామహేశ్వర్, ఏఎస్సై రమణారెడ్డి పాల్గొన్నారు. -
2 రోజులైనా కానరాని యువకుడి జాడ
రామగుండం: కళ్లు మూసినా.. తెరిచినా.. ఏ శబ్దం వచ్చినా.. ఎవరైనా తలుపు తట్టినా.. ఎవరి పిలుపు విన్నా.. ఫోన్ శబ్దమైనా.. ఉలిక్కిపాటుకు గురవుతూ తన కొడుకే వస్తున్నాడనే భ్రమతో మది నిండా కన్న కొడుకునే ధ్యానిస్తూ ఓ తల్లి రోదిస్తోంది. కళ్లలో కన్నీరు ఇంకిపోయి.. 2 రోజులుగా ఇంట్లో ఓ మూలన కూర్చొని అదే మూగరోదన. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక అక్బర్నగర్కు చెందిన నారకట్ల సత్యం–మహేశ్వరి దంపతుల కుమారుడు రాజేశ్యాదవ్(24) శుక్రవారం గణపతి నిమజ్జన వేడుకల్లో గోదావరి నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆదివారం రాత్రి వరకు గోదావరి నదిలో వివిధ ప్రాంతాల్లో గాలించినా ఎలాంటి ఆచూకీ లేదు. కనీసం కడసారి చూపుకై నా నోచుకోలేదని రోదిస్తుండడంతో.. కాలనీ ప్రజలు సైతం కన్నీటిపర్యంతమవుతున్నారు. నోరు ఎండిపోతే తోబుట్టువులు నీటి చుక్కలతో తడుపుతున్నా ఆమె రోదన మాత్రం ఆపడం లేదు. ఇప్పటికే పలుమార్లు లోబీపీతో ఆస్పత్రిలో చేరినా.. తన కొడుకు లేని బతుకు నాకెందుకంటూ గుండెలు బాదుకుంటోంది. రాజేశ్ తల్లిదండ్రులను ఓదార్చడం స్థానిక కాలనీవాసుల తరం కావడం లేదు. 2 రోజులుగా ఏం తినకుండా వేయి కళ్లతో ఎదురుచూపులు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వరద నీటి విడుదల అరికట్టడంతో.. గోదావరి నదిలో వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గి ఇసుక తిన్నెలు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఓచోట రాజేశ్ మృతదేహాన్ని గుర్తించే అవకాశముంటుందని, వివిధ ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని గోదావరిఖని టూటౌన్ సీఐ ప్రసాదరావు తెలిపారు. శుక్రవారం ఉదయం గోదావరిలో గల్లంతైన రాజేశ్ నా కొడుకు ఎక్కడంటూ రోదిస్తున్న మాతృమూర్తి -
పీటీఎస్లో ఆగని చోరీలు
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టులో ప్రజా సంబంధాలు కరువయ్యాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రాజెక్టు ప్రభావిత, పునరావాస ప్రాంతాల్లో వైద్య శిబిరాలు, పశు వైద్యశిబిరాలతోపాటు పలు అభివృద్ధి పనులపై ప్రజలకు విషయాలను తెలియజేయడంలో ముందుండేది. కాని కొద్ది నెలలుగా అసలు ప్రాజెక్టులోని సీఎస్సార్ విభాగం ఏం చేస్తోంది.. అభివృద్ధి పనులను ప్రజలకు ప్రజా సంబంధాల విభాగం ఎందుకు తెలియజేయడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. గోప్యం ఎందుకు.. 2 నెలల క్రితం ప్రాజెక్టులో క్రషర్ హామర్స్ చోరీ జరిగిన విషయాన్ని సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొచ్చిన మరుసటి రోజు చోరీ నిందితులను ఎన్టీపీసీ పోలీసులకు అప్పగించిన పలు విషయాలను సైతం సంబంధిత విభాగం గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటని చర్చించుకుంటున్నారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ నుంచి రైలు మార్గం ద్వారా వచ్చే బొగ్గును కొందరు చోరీ చేస్తున్న విషయాలపై సరైన దృష్టి సారించకపోవడం, పోలీసులు సైతం చోరీ పట్టనట్లుగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. చివరకు సీఐఎస్ఎఫ్ విభాగం నిఘా చేపట్టి నిందితులను పట్టుకొని ఎన్టీపీసీ పోలీసులకు అప్పగిచిన విషయాన్ని సైతం పూర్తిస్థాయిలో తేటతెల్లం చేయకపోవడం వంటి విషయాలపై స్థానికులు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇటీవల పర్మినెంట్ టౌన్షిప్ నుంచి ఓ ట్రాక్టర్, హైడ్రాలో ఇనుస సామగ్రిని చోరీ చేసి స్క్రాప్ దుకాణదారుడికి విక్రయిస్తున్న విషయంపై సీఐఎస్ఎఫ్ దృష్టి సారించి చోరీని నియంత్రించడంతోపాటు నిందితులను సైతం అదుపులోకి తీసుకొని ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులకు అప్పగించారు. అయినా చోరీ నిందితులు, చోరీకి సంబంధించిన విషయాలను ప్రజా సంబంధాల ద్వారా ప్రజలకు తెలియజేయకపోవడంతో అసలు ప్రజా సంబంధాలు ఏమయ్యాయని విమర్శిస్తున్నారు. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన భవన నిర్మాణ పనుల వద్ద ఓ వ్యక్తిని హత్య చేసి అతడి మృతదేహాన్ని ట్రాక్టర్లో గోదావరిఖని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లిన అనంతరం పీటీఎస్ సెక్యూరిటీ సిబ్బందికి తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికల వివరాల వెల్లడిలో సైతం.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగడం అందరికీ తెలిసిందే. ఈనెల 25న గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు వెలువరించిన అధికార యంత్రాంగం.. ఎన్నికల షెడ్యూల్ను ప్రజా సంబంధాలు తెలపకపోవడం ఏమిటని పలు యూనియన్లు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల తేదీలు, సంబంధిత అధికారుల వివరాలు, నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల నియమావళిని సైతం విడుదల చేయకపోవడంతో ఒక యూనియన్కు యాజమాన్యం అనుసంధానంగా వ్యవహరిస్తున్నట్లు పీటీఎస్లో ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరగాలని, ఏకపక్షంగా జరగకుండా చర్యలు తీసుకోవాలని కొన్ని యూనియన్లు న్యూఢిల్లీ కార్పొరేట్ సెంటర్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పెరుగుతున్న చోరీలు పర్మినెంట్ టౌన్షిప్లో ఇటీవల చోరీలు అధికమయ్యాయని ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్టీపీసీ సంస్థ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయానికి రెండువైపులా ఏ, బీ గేట్లున్నాయి. వాటి వద్ద 24 గంటల నిఘా ఉంటుంది. కాని చోరీలు మాత్రం ఆగడం లేదు. పోలీసులు, సీఐఎస్ఎఫ్ అధికారులు కొంతమేర నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారు. సంవత్సరం క్రితం ఎన్టీపీసీ పీటీఎస్ సెక్యూరిటీ విభాగానికి 24 గంటల కోసం ఓ వాహనం ఉండేది. దానిలో పీటీఎస్లో నిరంతరం గస్తీ చేపట్టేవారు. వాహనాన్ని తొలగించడంతో సెక్యూరిటీ సిబ్బంది తమ సొంత వాహనాలపై గస్తీని చేపడుతున్నారు. ఒక్కోసారి వాహనం లేక గస్తీ చేపట్టలేక చోరీలు అధికమవుతున్నాయని తెలుస్తోంది. ప్రజా సంబంధాలు ఏమయ్యాయి..? సంస్థ చేపట్టే కార్యకలాపాలతోపాటు పలు అభివృద్ధి పనులు, ప్రాజెక్టు పనితీరు తదితర అంశాలను ప్రజలకు తెలిపేందుకు ఏర్పాటు చేసిన ప్రజా సంబంధాల విభాగం కేవలం ఉన్నామా.. వచ్చామా.. పోయామా అనేలా వ్యవహరిస్తోందనేది జగమెరిగిన సత్యం. ప్రాజెక్టు పనితీరు, ప్రభావిత గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన విభాగం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండకపోవడంతోపాటు మాకేంది అనే విధంగా వ్యవహరించడంతో.. ప్రాజెక్టులోని పలు ఉత్తమమైన కార్యకలాపాలు, పనితీరు ప్రజలకు తెలియడం లేదు. ఎన్టీపీసీ సంస్థ గతంలో వ్యవహరించిన తీరు.. ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీపీసీలో ప్రజా సంబంధాలు కరువు సెక్యూరిటీ సిబ్బందికి వాహనం లేకపోవడంతో నిఘా విఫలం గుర్తింపు సంఘం ఎన్నికల షెడ్యూల్ను బహిర్గతం చేయకపోవడంలో ఆంతర్యమేమిటో.. అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియని వైనం -
సేవా ‘కుసుమా’లు
సిరిసిల్లకల్చరల్: సిరిసిల్ల చరిత్రలో పదోతరగతిలో రాష్ట్రస్థాయి ర్యాంకులతో ఉత్తీర్ణులైన తొలి తరం విద్యార్థులు వాళ్లు. కటిక పేదరికంలో పుట్టి కష్టపడి ప్రయోజకులయ్యారు. మల్లేశం సివిల్ ఇంజనీర్గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ పొందారు. తన తొలి ప్రయత్నంలోనే మెడిసిన్లో సీటు సంపాదించిన ప్రతిభాశాలి విఠల్. శ్రీహరి పరిశోధక రంగంలో స్థిరడ్డారు. పేద విద్యార్థులకు సాయం చేయాలి.. వాళ్ల పురోగతిలో భాగస్తులం కావాలి.. సాధ్యమైన సౌజన్యాన్ని పంచాలనుకొని సమాజ సేవలో తరిస్తున్నారు. పట్టణంలో సాధారణ నేత కార్మికులైన కుసుమ రామయ్య–శాంతవ్వ దంపతులకు మల్లేశం, విఠల్, శ్రీహరితోపాటు ముగ్గురు కూతుళ్లున్నారు. పాఠశాల విద్య పూర్తి చేసేందుకు కూడా సహకరించని ఆర్థిక పరిస్థితుల మధ్య నానా ఇబ్బందులు పడుతూ చదువుకున్నారు. పసితనం నుంచే చురుగ్గా ఉండే మల్లేశం, విఠల్, శ్రీహరి తల్లిదండ్రులకు సహాయపడుతూనే చదువుపై ఆసక్తి పెంచుకున్నారు. ఫలితంగా శివనగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతిలో ప్రతిభావంతుడిగా మల్లేశం, పక్కనే జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్సెస్సీలో స్టేట్ ఐదో ర్యాంకుతో విఠల్ ఉత్తీర్ణుడయ్యాడు. గాంధీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్ కోర్సులు, పెళ్లి తరువాత అమెరికాలో గ్యాస్ట్రో ఎంటరాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేసి అక్కడే స్థిరపడ్డారు. పండుగకు వచ్చి.. చలించి.. పండుగకు సిరిసిల్లకు వచ్చిన విఠల్.. చదువుకున్న బడికి వెళ్లారు. వర్షాకాలం కావడంతో పైకప్పు నుంచి ఉరుస్తున్న దృశ్యానికి చలించిపోయారు. పాఠశాల పురోగతి కోసం రూ.15లక్షల విరాళం ప్రకటించాడు. తన తండ్రి పేరుతో కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్గా స్థిరపడింది. కంప్యూటర్ విద్య కోసం రూ.5లక్షలు, జెండా వందనాలు, పిల్లల పండుగలు, ఫర్నీచర్కు ప్రతి ఏటా కొంత నిధిని సమకూరుస్తున్నారు. యూఎస్ఏలో ప్లాస్టిక్ సర్జన్గా పని చేస్తున్న కొడుకు శశిధర్తో ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించి 100కు పైగా శస్త్ర చికిత్సలు చేయించారు. గాంధీ మెడికల్ కళాశాలకు రూ.15లక్షలు విరాళం, హైదరాబాద్లో ఉన్న పద్మశాలీ, ఉమెన్స్ హాస్టళ్లకు ఆర్థిక చేయూత, అమెరికాలోని ఆలయాలు, ఆసుపత్రుల అభివృద్ధి కోసం దాదాపు రూ.30లక్షల వరకు వెచ్చించారు. పెన్షన్ నిధితో ప్రతిభా పురస్కారాలు పుట్టి పెరిగిన ప్రాంతంపై అభిమానంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహించాలనుకున్నారు కుసుమ మల్లేశం. సివిల్ ఇంజనీర్గా ఏఈ హోదాలో ఉద్యోగ విరమణ చేసిన ఆయన తనకు వచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి కొంత మొత్తాన్ని ప్రభుత్వ పాఠశాలల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు. తద్వారా వచ్చే వడ్డీ డబ్బులతో ప్రతి ఏటా ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు అందజేసేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు అగ్రహారంలోని ఎస్ఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, శివనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కుసుమ రామయ్య జెడ్పీ హైస్కూల్, గీతానగర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానాచార్యులకు డిపాజిట్ చేసిన పత్రాలను అందజేశారు. యూనియన్ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకుల్లో రూ.1.5లక్షల చొప్పున డిపాజిట్ చేసిన పత్రాలను ఇటీవలే ఆయా విద్యాసంస్థల ప్రధాన నిర్వాహకులకు అందజేశారు. ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రోత్సాహం సర్కార్ బడుల బాగు కోసం ఆర్థిక చేయూత -
ముంబయి–కరీంనగర్ మధ్య మరో వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు
రామగుండం: రాబోయే దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకొని పలు రూట్లలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మధ్య రైల్వే జోన్ పరిధిలోని ముంబాయి డివిజన్ రైల్వే అధికారులు అక్టోబర్ 1 నుంచి నవంబర్ 26 మధ్య రైలు నడపనుంది. రైలు నం.01067 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్(సీఎస్ఎంటీ) లోకమాన్య తిలక్ టర్మినస్(ఎల్టీటీ) ముంబాయి నుంచి కరీంనగర్ మధ్య రాకపోకలు సాగించి అక్టోబర్ 1, 8, 15, 22, 29, నవంబర్ 5, 12, 19, 26ల్లో కరీంనగర్కు ఉదయం 8.30 గంటలకు చేరుకోనుంది. రైలు నం.01068 తిరుగు ప్రయాణం కరీంనగర్–ముంబయి వరకు అదే తేదీల్లో కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ముంబాయి చేరుకుంటుంది. కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసరలో హాల్టింగ్స్ కల్పించారు. ఈ రైలులో షిర్డీ వెళ్లే భక్తులు నాగర్సోల్లో దిగి వెళ్లేందుకు అవకాశముంటుంది. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునేందుకు నాసిక్లో హాల్టింగ్ ఉంది. ఈ రైలుకు ఫస్ట్ క్లాస్ ఏసీ–1, 2, సెకండ్క్లాస్ ఏసీ–2, థర్డ్ ఏసీ–6, స్లీపర్ క్లాస్–8, జనరల్ బోగీలు 3 ఉంటాయి. ఈ రైలు కరీంనగర్ రైల్వే స్టేషన్లో కనీసం 9 గంటలు ప్లాట్ఫారంపై ఉండడంతో దానిని కాగజ్నగర్ వరకు పొడిగించే అవకాశాలను పరిశీలించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
వరి పంటపై గడ్డి మందు
● భూ తగాదాలతో ప్రత్యర్థి పనేనంటున్న బాధితుడు సైదాపూర్: రెండేళ్ల నుంచి కొనసాగుతున్న భూ తగాదాలో భాగంగా పచ్చని వరి పంటకు ప్రత్యర్థులు గడ్డి మందు కొట్టి నాశనం చేశారని ఓ రైతు వెన్నంపల్లిలోని వరి చేనులో బోరున విలపించాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ఆరెపల్లికి చెందిన బాగోతపు వెంకటయ్య అనే రైతు వెన్నంపల్లికి చెందిన మొలుగూరి లింగయ్య అనే రైతు వద్ద సర్వే నం.300/2లో 2.25 ఎకరాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. రెండేళ్ల నుంచి మొలుగూరి రాజయ్య అందులో 0.20 గుంటల భూమి ఉందని గొడవ పడుతున్నాడు. వెంకటయ్య వేసిన పంటలను ప్రతి ఏటా ధ్వంసం చేస్తున్నాడు. వెంకటయ్య పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. 25 రోజుల క్రితం వరి నాటు వేశాడు. పచ్చగా ఉన్న వరి పంటను శుక్రవారం రాత్రి గడ్డి మందు కొట్టి ధ్వంసం చేశారని వెంకటయ్య వరి చేనులో విలపిస్తూ ఆరోపించాడు. భూ సమస్యను పరిష్కరించి పంట ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
జీపీవోలొస్తున్నారు
కరీంనగర్ అర్బన్: గ్రామ పాలన అధికారు(జీపీవో)లొస్తున్నారు. నాలుగైదు రోజుల్లో విధుల్లో చేరనుండగా రెవెన్యూ సమస్యలు గాడిన పడనున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో ఇక వీరే కీలకం కానున్నారు. 2020 సెప్టెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన విషయం విదితమే. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త హోదాను సృష్టిస్తూ గ్రామస్థాయి రెవెన్యూ సేవలను పునరుద్ధరించింది. వీఆర్వోల్లో ప్రతిభ గల వారిని గుర్తించి ఈ నెల 5న జీపీవో నియామక పత్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి అందజేశారు. సదరు జీపీవోలను జిల్లాకు అలాట్మెంట్ చేయగా ఈ నెల 8న కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇవ్వనున్నారు. గ్రామ పాలనలో వీరే కీలకం పల్లెలు ప్రగతి సాధించాలంటే క్షేత్రస్థాయిలో అన్నిశాఖల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ, వైద్య, విద్య.. ఇలా దాదాపు 16 రకాల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి, భూముల హద్దుల గుర్తింపునకు గతంలో సేవలందించిన వీఆర్వో, వీఆర్ఎలను తొలగించారు. వారి స్థానాన్ని భర్తీ చేయడంతోపాటు గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు గ్రామ పాలనాధికారి వ్యవస్థను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. జీపీవో పోస్టుల భర్తీకి గతంలో రెవెన్యూశాఖలో వీఆర్వోలు, వీఆర్ఎలుగా పనిచేసిన వారిలో ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించగా జిల్లా పరిధిలో 163 మంది ఉత్తీర్ణత సాధించారు. జీపీవోల జాబ్చార్ట్ ఇదే ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ జీపీవోలు పర్యవేక్షిస్తారు. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఈ పోస్టులను ప్రభుత్వం కొత్తగా తీసుకురాగా 11 రకాల జాబ్చార్ట్ను అనుసరించనున్నారు. భూభారతి చట్టంలో భాగంగా భవిష్యత్లో ప్రతి రిజిస్ట్రేషన్–మ్యుటేషన్కు గ్రామ పటం జోడించడంలో వీరు సహాయకారిగా పనిచేయనున్నారు. గ్రామ స్థాయిలో భూఖాతా (విలేజ్ ఎకౌంట్) ని ర్వహణ, పహాణీల నమోదు, రెవెన్యూ మాతృ ద స్త్రం నిర్వహిస్తారు. అన్నిరకాల భూముల నిర్వహణ, మార్పు చేర్పులు చేస్తారు. లావోణి, లసైన్డ్, దేవాదాయ, వక్స్, ప్రభుత్వం సేకరించిన భూ ముల నిర్వహణ చూస్తారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటివనరుల కింద భూములను పరిరక్షిస్తారు. భూమి ఖాతాల నిర్వహణ, మా ర్పు, చేర్పుల నమోదు చేస్తారు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందిస్తారు. ప్ర కృతి విపత్తులు వాటిల్లితే నష్టం అంచనా వేస్తా రు. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల కు అర్హుల ఎంపికలో విచారణ చేస్తారు. జనన, మరణ విచారణలు నిర్వహిస్తారు. ఎన్నికల సమయంలో గ్రామస్థాయిలో సహకారం. వివిధ ప్ర భుత్వశాఖల మధ్య సమన్వయంగా పనిచేస్తారు. జిల్లాలో మొత్తం గ్రామాలు: 318కార్పొరేషన్: 01(కరీంనగర్) మున్సిపాలిటీలు: 03(హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి) సాగు విస్తీర్ణం: 3,38,450 ఎకరాలు వ్యవసాయేతర భూమి: 33,007ఎకరాలు ప్రభుత్వ భూమి: 40,366వక్ఫ్భూములు: 517 ఎకరాలు అటవీ భూములు: 1,748 ఎకరాలు ఖాతాల సంఖ్య: 1,92,687మొత్తం సర్వేనంబర్లు: 3,51,545 రెవెన్యూ డివిజన్లు: 02(కరీంనగర్, హుజూరాబాద్) రెవెన్యూ క్లస్టర్లు: 255రెవెన్యూ గ్రామాలు: 205జీపీవోలు: 163 -
ఇల్లు కట్టు.. చిత్రాలు పెట్టు
కరీంనగర్ అర్బన్: ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లు చెల్లింపులో జాప్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం నూతన విధానం తీసుకొచ్చింది. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ఆలస్యం చేసినా లబ్ధిదారే ఫొటో అప్లోడ్ చేసేలా యాప్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపడంలో ఎదురవుతున్న జాప్యాన్ని నివారించేందుకు లబ్ధిదా రుకే చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం కల్పించింది. ఇల్లు నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి నిర్మాణ దశలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శి, మునిసిపాలిటీలో వార్డు అధికారి చిత్రాలను తీసి ఇందిరమ్మ ఇళ్ల యాప్లో అప్లోడ్ చేయాలి. అవి గృహనిర్మాణ శాఖ ఏఈ లాగిన్కు అటు నుంచి డీఈ, పీడీ తర్వాత కలెక్టర్కు వెళ్తాయి. బేస్మెంట్ పూర్తయితే రూ.లక్ష, గోడల దశలో మరో రూ.లక్ష, స్లాబు పూర్తయితే రూ.2లక్షలు, రంగులు వేశాక మరో రూ.లక్ష చొప్పున మొత్తం రూ.5 లక్షలు విడతల వా రీగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో జమవుతాయి. ఈ ప్రక్రియలో ఆలస్యం కావడం, డబ్బులు డి మాండ్ చేస్తుండటంతో చిత్రాలను అప్లోడ్ చేసే అవకాశం లబ్ధిదారుకే ఇ చ్చారు. అధికారులు మళ్లీ ఆయా చిత్రాలు నిజమైనవేనా అని క్షేత్రస్థాయిలో విచారణ చేపడుతారు. -
హైకోర్టుకు మెటా నిందితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ. లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బోర్డు తిప్పేసిన కంపెనీ విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నా రు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల వద్ద నుంచి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ.30 కోట్లు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసిన మెటా ఫండ్ ప్రతినిధుల్లో ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవడం, నిందితులు యథేచ్ఛగా తిరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు పిటిషన్, ఒక కేసు మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్లో క రీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయా ఠాణా ల్లో ఎస్హెచ్వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వెనక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాస రి రమేశ్, దాసరి రాజుపై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తులపై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలే క కేసు నమోదు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లె క్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలి సేందుకు సిద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివా రించేందుకు కేసును సీసీఎస్కు అప్పగించారు. ఈ విషయం లీకవడంతో నిందితులు విజయవాడకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్కోసం హై కోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.ఐదుగురిలో ముగ్గురు పరారీ..ఈ కేసులో హైదరాబాద్కు చెందిన లోకేశ్, కరీంనగర్కు చెందిన దాసరి రమేశ్, దాసరి రాజు, ప్రకా శ్, సతీశ్ మాస్టర్మైండ్స్గా ఉన్నారు. వీరు కులాన్ని, లాభాలను ఎరగా వేసి రోజుకు రూ.6లక్షల చొప్పున ఆదాయాన్ని పొందవచ్చని పెట్టుబడులు పెట్టించారు. వసూలు చేసిన మొత్తంతో ఇప్పటికే లోకేశ్ థాయ్లాండ్కు, రమేశ్, రాజులు విజయవా డకు పారిపోయారు. ఇక మిగిలింది సతీశ్, ప్రకాశ్ లే. వీరిలో సతీశ్ అనే వ్యక్తి దర్జాగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన వారిలో అధికశాతం రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు ఉన్నారు. ఇ దే నిందితులకు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను మెటా ప్రతినిధులు ప్రభు త్వ అనుమతి లేకుండా సింగపూర్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు మసాజ్ల కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లారు. తీరా ఇప్పుడు కేసులు పెడితే.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో.. అ న్న భయంతో కేసులకు వెనకాడుతున్నారు. అందులోనూ వీరి పెట్టుబడి పెట్టిన డబ్బంతా అక్రమార్జన, నల్లడబ్బు కావడంతో తేలుకుట్టిన దొంగల్లా.. తెరవెనక నుంచి సెటిల్మెంట్ కోసం యత్నిస్తున్నారు. -
● ప్రభుత్వ బడులకు రేటింగ్ ● ఆరు అంశాల ఆధారంగా నిర్ణయం ● రేటింగ్ సాధించిన స్కూళ్లకు పురస్కారాలు
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాయి. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరుతో మెరుగైన సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణపై దృష్టిసారించాయి. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంటే విద్యార్థుల ఆరోగ్యాలు బాగుంటాయని, వారి ఆరోగ్యాలు బాగుంటే నాణ్యమైన చదువు అందుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు పాఠశాలలకు ఏటా ప్రత్యేక పురస్కారాలు అందించింది. ఐదేళ్లుగా నిలిచిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ విద్యా సంవత్సరం ప్రారంభించింది. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) పేరుతో ప్రత్యేక పురస్కారాలు అందించనుంది. మూత్రశాలలు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల వినియోగం, నీటివసతి తదితర అంశాలను పక్కాగా అమలు చేస్తున్న పాఠశాలలకు రేటింగ్ ఇవ్వనున్నారు. 60అంశాల ఆధారంగా 1–5 రేటింగ్ కేటాయించనున్నారు. అత్యుత్తమ రేటింగ్ సాధించి, జాతీయస్థాయికి ఎంపికై న పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష నజరానా అందించనుంది. జిల్లాలో 651 పాఠశాలలు జిల్లావ్యాప్తంగా 651 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో 35వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. మనఊరు– మనబడి, అమ్మ ఆదర్శ పాఠశాలల అమలుతో చాలా పాఠశాలల రూపురేఖలు మారాయి. కిచెన్ గార్డెన్ల వినియోగం, మరుగు దొడ్ల నిర్వహణ మెరుగుపడ్డాయి. ఇలాంటి పాఠశాలల్లో ఆరు ప్రధానాంశాలను నమోదు చేసి, దాన్నిబట్టి రేటింగ్ ఇస్తారు. మొత్తం 60 ప్రశ్నలకు 125 మార్కులు సాధిస్తే అయిదు స్టార్స్ ఇస్తారు. నీటి సంరక్షణ, తాగునీటి వసతికి 22 మార్కులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, చేతుల శుభ్రతకు 27, మొక్కలు తోటల పెంపకానికి 14, వ్యర్థాల నిర్వహణకు 21, విద్యుత్తు పొదుపు, సోలార్ వినియోగానికి 20, పర్యావరణ పరిరక్షణ అవగాహనకు 21 మార్కులు ఉంటాయి. అయిదు రేటింగ్స్ సాధించిన పాఠశాలలకు కేంద్రం పురస్కారాలు అందించే అవకాశం ఉంది. పాఠశాలలను అభివృద్ధి చేసి, నిర్వహణలో తమవంతు కృషి చేస్తున్న హెచ్ఎంలు చొరవ తీసుకొని నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆరు అంశాల ఆధారంగా పాఠశాలల రేటింగ్ను నిర్ణయిస్తారు. జాతీయస్థాయి వరకు పోటీ స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్) కార్యక్రమంపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఈనెల 4 నుంచి 30వ తేదీ వరకు ఉపాధ్యాయులు వారి పాఠశాలల వివరాలు ఎస్హెచ్వీఆర్ యాప్ లేదా ఎస్హెచ్వీఆర్.ఎడ్యుకేషన్.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో యూడైస్ కోడ్తో లాగిన్ అయి నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లాస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి వరకు పోటీ పడేందుకు ఆరు అంశాల ఆధారంగా రేటింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.స్వచ్ఛ పాఠశాలలే లక్ష్యంగా.. -
వెనకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టండి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్: ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవడంతో పాటు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కొత్తపల్లి శివారులోని ఓ ఫంక్షన్ హాలులో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులకు చదువుతో పాటు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, నైతిక విలువలు బోధించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా గమనించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ప్రైవేటు పాఠశాలల టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్ (ఎస్హెచ్వీఆర్)లో పాల్గొనాలని సూచించారు. డీఈవో చైతన్య జైనీ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులకు ప్రశంశాపత్రాలు అందించి సత్కరించారు. ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా మార్చాలి నగరంలోని ఓల్డ్ హైస్కూల్ భవనాన్ని సైన్స్ మ్యూజియంగా ఆధునీకరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. పురాతన ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియాన్ని శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, బల్దియా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఈవో చైతన్య జైనీతో కలిసి సందర్శించారు. పురాతన పాఠశాల తరగతులను నూతన భవనంలోకి మార్చాలన్నారు. అక్కడే కొనసాగుతున్న డీసీబీ కార్యాలయాన్ని మరోచోటకు, ఓపెన్ స్కూల్ కేంద్రాన్ని సీతారాంపూర్లోని ఎంపీపీఎస్ పాఠశాల సమీప భవనంలోకి తరలించాలన్నారు. పురాతన పాఠశాల భవనాన్ని పూర్తిగా సైన్స్ మ్యూజియానికే కేటాయించాలన్నారు. సైన్స్ మ్యూజియంలో రోబోటిక్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్, ఆర్ట్, క్రాప్ట్ కంప్యూటర్ ల్యాబ్ కోసం ప్రత్యేక గదులు, విద్యార్థుల కోసం సెమినార్ హాల్ ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ అశోక్, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ పాల్గొన్నారు. -
చెవికి తీవ్ర నష్టం
సెల్ఫోన్ వచ్చాక చెవుడు సమస్యలు ఎక్కువయ్యాయి. 12–34 ఏళ్ల మధ్య 24శాతం మంది పర్సనల్ లిసెనింగ్ డివైజ్ (హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్) వాడుతూ, 48శాతం మంది 85 డిసెబుల్స్ కన్నా ఎక్కువ శబ్దాన్ని వింటూ వినికిడి సమస్యల బారిన పడుతున్నారు. తీవ్రమైన శబ్దం వినడం వల్ల శ్రవణ వ్యవస్థలో ఉండే సూక్ష్మమైన హెయిర్ సెల్స్ దెబ్బతిని చెవుడు ఏర్పడుతుంది. డీజే సౌండ్ లాంటి అధిక వాల్యూమ్తో శాశ్వత చెవుడు వచ్చే అవకాశముంది. మ్యూజిక్, వాయిస్కాల్స్ హెడ్ఫోన్స్, ఇయర్ బడ్స్తో ఎక్కువ సమయం వినడం వల్ల బ్రెయిన్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇయర్ఫోన్స్, హెడ్ఫోన్స్, సెల్ఫోన్, డీజే సౌండ్ను ఎంత తక్కువగా ఉపయోగిస్తే అంత మేలు. – ప్రశాంత్, ఈఎన్టీ నిపుణుడు -
చాలా ఇబ్బందులు
కళాశాలలో మె స్ చిన్నగా ఉండటంతో ఇ బ్బందిగా ఉంది. షిప్టుల వారీ గా తింటున్నాం. హాస్టల్ నుంచి కళాశాల కి లోమీటరుకు పైగా దూరం ఉంటుంది. రోజు నడుచుకుంటూ వ స్తున్నాం. సెలవు రోజు కళాశాలకు వచ్చి తిని వెళ్లాలి. కళాశాలలో హా స్టల్ వసతిలేక ఇబ్బందిగా ఉంది. – సాయివర్ధన్, విద్యార్థి తరగతిగదులు సరిపోతలేవు కళాశాలలో మొత్తం ఎనిమిది తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఆ గదుల్లోనే షిప్టుల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు. సరిపోయే సంఖ్యలో గదులు లేక ఇబ్బందులు పడుతున్నాము. – అంజలి, విద్యార్థినిల్యాబ్, లైబ్రరీ లేదు ఇంజినీరింగ్ కళాశాలలో లైబ్రరీ లేదు. ల్యాబ్లు మాత్రం కొన్ని కోర్సులకే ఉన్నాయి. ల్యాబ్ అవసరం ఉంటే కొండగట్టు జేఎన్టీయూకు, దగ్గరలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుంది. – సాయిచరణ్య, విద్యార్థిని నిధులు ఇస్తే బాగు తంగళ్లపల్లి మండలం మండెపల్లి గ్రామ శివారులో 20 ఎకరాల భూమిని జేఎన్టీయూ కళాశాల కోసం కేటాయించారు. కానీ నిధులు మాంజూరు చేయలేదు. అధ్యాపకుల పోస్టులు కూడా మంజూరు చేయలేదు. – వేణుగోపాల్, జేఎన్టీయూ ప్రిన్సిపాల్, అగ్రహారం -
22 తర్వాత కొందాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కారు, బైక్ షోరూంలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. జీఎస్టీ శ్లాబులు తగ్గుతాయని కేంద్రం ప్రకటన దరిమిలా.. ఇప్పటికిప్పుడు బండి (కారు లేదా బైక్) కొందామనుకున్న ప్రతీ ఒక్కరూ వాయిదా వేశారు. సెప్టెంబరు 22 తరువాత తగ్గించి న జీఎస్టీ అమలులోకి రానుండటంతో కారు, బైకుల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. ఫలితంగా మధ్యతరగతికి భారీ ఊరట కానుంది. ప్రతీ బైకుపై కనిష్టంగా రూ.8,000 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైనా రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనున్నాయి. దీంతో ప్రస్తుతం షోరూముల్లో బుకింగులు నిలిచిపోయాయి. కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. సెకండ్ హ్యాండ్ మార్కెట్కు కుదుపు జీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో షోరూంల్లోనే కాదు, ఇటు సెకండ్ హ్యాండ్ మార్కెట్పైనా ప్రభావం పడింది. బైకుల ధరలు పెట్రోల్ వేరియంట్లలో రూ.8000 నుంచి రూ.20,000 వర కు తగ్గింపు వర్తించనుండడం, కార్లకు రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనుండడంతో ఇంతకాలం సెకండ్ హ్యాండ్ కొందామనుకున్న వారంతా కొత్త బండ్ల వైపు చూస్తున్నారు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెలవెలబోతోంది. ఆగస్టు 13 నుంచే కటకట సెప్టెంబరు 3వ తేదీన కొత్త జీఎస్టీ శ్లాబులను కేంద్రం ప్రకటించింది. దాంతో 4వ తేదీ నుంచి షో రూంలు, సెకండ్ హాండ్ మార్కెట్లు బోసిపోతున్నా యి. ఆటోమొబైల్ రంగానికి ఈ కుదుపు ఆగస్టు 13నే తాకింది. ఆ రోజు రాత్రి ప్రతీ వాహనంపై 2శాతం ట్యాక్స్ను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరునాటి నుంచి కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15న కేంద్రం జీఎస్టీ విషయంలో దీపావళికి తీపి కబురు చెబుతానడటంతో ఆటోమొబైల్ రంగం ఆందోళన చెందింది. దీపావళి వరకు కొనుగోళ్లు బోసిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 3న ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొత్త ఆఫర్లు.. డిస్కౌంట్లు ప్రస్తుతం షోరూం నిర్వాహకులు వాహనాలు బుకింగ్ చేసుకోవచ్చని, డెలివరీ సెప్టెంబరు 22 తరువాతే ఇస్తామని సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ.. కొనుగోళ్లు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ పాత వాహనాలను క్లియర్ చేసేందుకు 10శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నారు. అయినా, పెద్దగా కొనుగోళ్లు పుంజుకోవడం లేదని షోరూం నిర్వాహకులు వాపోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల కొనుగోళ్లు అధికంగానే జరుగుతాయి. మధ్యతరగతి వారు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అంటే దాదాపు 10శాతం వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రతీ 100 సీసీ ఆపై సామర్థ్యం ఉన్న బైకులు రూ.లక్షకుపైనే పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధర రూ.30వేల నుంచి మొదలవుతుంది. వీటికి సైతం 10శాతం జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. ప్రతీ నెలా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల షోరూముల్లో కలిపి దాదాపు 3000కుపైగా బైకులను విక్రయిస్తారు. ఈ లెక్కన ఎలక్ట్రిక్ బైకులపై రూ.3000, పెట్రోల్ బైకులపై రూ.8000 వరకు కనిష్టంగా ధరలు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా నెలకు రూ.2.40కోట్ల వరకు వినియోగదారులకు లబ్ధి చేకూరతుందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు నెలకు 500 నుంచి 550 వరకు కార్లు అమ్ముడుపోతాయి. 1200 సీసీ లోపు సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రతీ నెలా రూ.2.6 కోట్ల చొప్పున ఏటా రూ.31.2 కోట్ల వరకు వినియోగదారులకు కలిసి రానుంది. బైక్, కార్ల కొనుగోళ్లలో ఉమ్మడిజిల్లా కస్టమర్లకు దాదాపుగా రూ.60 కోట్ల వరకు కలిసి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ప్రభుత్వ భూమిలోని భవనం స్వాధీనం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి తహసీల్దార్ పరిధి సీతారాంపూర్లోని సర్వే నంబర్ 26 ప్రభుత్వ శిఖం భూమిలో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశా ల మేరకు శనివారం రాత్రి అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. తహసీల్ధార్ వెంకటలక్ష్మి, నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొయినొద్దీన్ ఆధ్వర్యంలో భవనంలోని సామగ్రిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయగా.. మ హిళలు అడ్డుకున్నారు. తప్పుకోవాలంటూ తహసీల్దార్ చెప్పినప్పటికీ వినకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బిల్లా కోటేశ్వర్ అక్కడికి చేరుకుని భవనాన్ని ఖాళీ చేయించారు. భవనాన్ని ఓపెన్ స్కూల్కు అప్పజెప్పనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని ఇటీవల కలెక్టర్కు గ్రామానికి చెందిన పాదం శివరాజ్, ఎడ్ల లక్ష్మణ్ ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఆనందం, ఆర్ఐలు నదీమ్, రజనీకుమార్ పాల్గొన్నారు. కరీంనగర్కల్చరల్: పదోతరగతి, ఇంటర్ ఫెయిలైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను తెలంగాణ ఓపెన్ స్కూల్లో చేర్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మెప్మా, డీఆర్డీవో అధికారులతో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ల గడువు ముగియకముందే మీసేవ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించి, ఓపెన్ స్కూల్లో చేర్పించాలన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ అక్షర జ్ఞానం కలిగి ఉండాలన్న ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఆర్డీవో శ్రీధర్, మెప్మా పీడీ సరూపారాణి పాల్గొన్నారు. జమ్మికుంట: వ్యవసాయ సాంకేతిక ప్రయోగ పరిశోధన సంస్థ(ఏటీఏఆర్ఐ) హైదరాబాద్ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని వెల్లూరులో ఈ నెల 4వ తేదీన 2024 ఏడాదికి సంబంధించి వార్షిక సమీక్ష నిర్వహించారు. తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి రాష్ట్రాల జోన్–ఎక్స్ పరిధి 72 కేవీకేల్లో జమ్మికుంట కేవీకే(కృషి విజ్ఞాన కేంద్రం)కు మూడో ర్యాంకు వచ్చింది. రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. హైదరాబాద్ జోన్–ఎక్స్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా, తమిళనాడు అవినాశలింగం విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ భారతి హరిశంకర్ల చేతుల మీదుగా జమ్మికుంట కేవీకే హెడ్, సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ప్రశంస పత్రం అందుకున్నారు. కేవీకే ప్రధాన కార్యదర్శి విజయగోపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రశంసపత్రం మరింత బాధ్యత పెంచిందని హర్షం వ్యక్తం చేశారు. ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని కరీంనగర్ డివిజన్ దేవాదాయధశాఖ పరిశీలకుడు సత్యనారాయణ పర్యవేక్షణలో శనివారం లెక్కించారు. 4నెలల 14 రోజులకు గాను 23 హుండీలను లెక్కించారు. రూ.8,59,861 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఇన్చార్జి ఈవో కందుల సుధాకర్ తెలిపారు. దేవస్థాన కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, ధర్మకర్తలు మూడేత్తుల మల్లేశ్ యాదవ్, గోపాల్రెడ్డి, కిషన్రెడ్డి, నాగరాజు, అర్చకులు శేషం వంశీధరాచార్యులు, నవీన్శర్మ పాల్గొన్నారు. -
ఇయర్ ఫోన్స్ వాడొద్దు
ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగింది. ప్రజలు మరింత సౌలభంగా ఉండేందుకు వీలుగా ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. ప్రస్తుతం వచ్చిన ఇయర్ ఫోన్స్లో శబ్ద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. చెవి నొప్పితో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇయర్ ఫోన్న్లను తక్కువ వాడటమే ఉత్తమం. – రాజు, ఈఎన్టీ వైద్యుడు, హుజూరాబాద్ ‘హుజూరాబాద్కు చెందిన శ్రావణికి (పేరు మార్చాం) ఫోన్లో రీల్స్ చూడడం.. పాటలు వినడం అలవాటు. ఎప్పుడు చూసినా ఇయర్ ఫోన్లు పెట్టుకొనే కనిపిస్తుంది. దీంతో ఆమె కర్ణభేరి దెబ్బతింది. రెండు చెవులు వినిపించడంలేదు. మెదడులో నరాలు దెబ్బతిన్నాయి. అప్పుడప్పుడు మతిస్థిమితం లేకుండా వ్యవహరిస్తోంది. డాక్టర్లను సంప్రదిస్తే అతిసీపం నుంచి శబ్ధం.. అంటే ఇయర్ ఫోన్స్ లాంటివి వాడితే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఇప్పుడామెది ఏమీ వినలేని పరిస్థితి.’ ‘సిరిసిల్లకు చెందిన పరమేశ్కు(పేరు మార్చాం) ఇయర్ ఫోన్స్ పెట్టి సెల్ఫోన్లో పాటలు వినడం, సినిమాలు చూడడం అలవాటు. క్రమంగా ఆయన వినికిడి శక్తిని కోల్పోయాడు. చెవిలో అతిదగ్గరినుంచి శబ్దం వినడంతో కర్ణభేరికి ఇబ్బందిగా మారిందని వైద్యులు చెప్పారు. ఇప్పుడాయనా చెవికి వినికిడి పరికరం అమర్చుకున్నాడు. లేదంటే ఆయన ఎలాంటి శబ్ధం వినలేడు’.చెవి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంలో వినికిడి సమస్య తలెత్తుతుంది. అందుకే లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. చెవుల్లో శబ్దాల హోరు చిన్న శబ్దాలను కూడా వినలేకపోవడం చెవుల్లో తరచూ ఇన్ఫెక్షన్లు, నొప్పి అధికంగా గులిమి ఏర్పడడం చెవిపై ఒత్తిడి పెరగడంతో వర్దిగో సమస్య -
రాజన్నకు భక్తుల నీరాజనం
వేములవాడ: రాజన్నను శనివారం 15వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) అడిషనల్ సీఈవో కాత్యాయనిదేవి, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మి వేర్వేరుగా దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో రమాదేవి, పర్యవేక్షకులు జి.శ్రీనివాస్శర్మ, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, ప్రొటోకాల్ అధికారులు అశోక్, సింహాచార్యులు పాల్గొన్నారు. అలరించిన ‘ట్రినిటి’ ఫ్రెషర్స్ డేకరీంనగర్కల్చరల్: నగరంలోని శుభం గార్డెన్లో శుక్రవారం రాత్రి నిర్వహించిన ట్రినిటి జూనియర్ కళాశాల (గర్ల్స్) ఫ్రెషర్స్ డే వేడుకలు అలరించాయి. ట్రినిటి వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి, ట్రినిటి గ్రూప్ చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డిలు జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు ముందుఆ నిర్వహించే ఆలోచన ఉన్నందున ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. మీ ప్రయాణం ఆధ్యాత్మికత, విద్య, క్రీడా, సాంస్కృతిక అభివృద్ధితో నిండి ఉండాలని అన్నారు. ఇంటర్లో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేశారు. విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాత్యాయనిదేవికి స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులుసోషల్ వెల్ఫేర్ కమిషనర్ సీతాలక్ష్మికి ప్రసాదాలు అందిస్తున్న అర్చకులు -
కొడుకు పుట్టనో..చెట్టునో పట్టుకుని ఉంటడు
● జాడ కోసం గోదావరిలో గాలించండి ● రాజేశ్ యాదవ్ తల్లిదండ్రుల ఆవేదన ● వినాయక నిమజ్జన ప్రదేశంలో కన్నీటి పర్యంతం ● నదిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వ రి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
జేఎన్టీయూ.. అరకొర వసతులు
వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లాకు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ మంజూరుతోనే సరిపెట్టారు. ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేసిన ప్రభుత్వం పక్కా భవనం నిర్మాణం మరిచిపోయింది. దీంతో తాత్కాలికంగా అగ్రహారం డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నారు. డిగ్రీ కాలేజీలో ఉన్న వసతులు ఇంజినీరింగ్ విద్యార్థులకు సరిపోయేలా లేవు. అయినా తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2021–02 విద్యాసంవత్సరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి అగ్రహారం డిగ్రీ కాలేజీలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని తరగతి గదులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని తరగతి గదుల్లోని సగం గదులను తాత్కాలికంగా జేన్టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు. నాలుగేళ్లుగా అరకొర గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. అగ్రహారం జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఐదు కోర్సుల్లో 1,032 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ దాదాపుగా 20 తరగతి గదులు అవసరం ఉంటుంది. కానీ అరకొర గదులతోనే నెట్టుకొస్తున్నారు. కొండగట్టులో ప్రాక్టికల్స్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ మాత్రమే ఉంది. ఈసీఈ, మెకానికల్ కోర్సు విద్యార్థులకు ప్రాక్టికల్స్ కోసం కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు తీసుకెళ్తున్నారు. సివిల్ కోర్సు విద్యార్థులను సమీపంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలోని ల్యాబ్కు తీసుకెళ్తున్నారు. మిగతా కోర్సులకు అంతంతే ల్యాబ్ సౌకర్యం ఉంది. అద్దె భవనాల్లో హాస్టల్ వసతి అగ్రహారంలోని ఎనిమిది అద్దె భవనాల్లో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించారు. ఉదయం, మధ్యాహ్నం కళాశాలలోని మెస్లో టిఫిన్, భోజనం అందుబాటులో ఉంటుంది. రాత్రి కొందరు మెస్లో తింటున్నారు. దూరంగా ఉన్న హాస్టల్ విద్యార్థులకు అక్కడికి భోజనం పంపుతున్నారు. హాస్టల్ నుంచి కాలేజీకి దాదాపు కిలోమీటర్ దూరం ఉంది. హాస్టల్ నుంచి కాలేజీకి నడుచుకుంటూ రావాల్సిందే. ఇద్దరే ప్రభుత్వ ప్రొఫెసర్లు కళాశాల ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్నా ఇద్దరే రెగ్యులర్ ప్రభుత్వ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒకరు ప్రిన్సిపాల్, మకొకరు ఈసీఈ ప్రొఫెసర్. కాంట్రాక్ట్ పద్ధతిన ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 40 మంది గెస్ట్ ఫ్యాకల్టీ విధులు నిర్వర్తిస్తున్నారు. అగ్రహారం డిగ్రీ కాలేజీలో తరగతులు సరిపోని తరగతి గదులు కిలోమీటర్ దూరంలో హాస్టల్ అద్దె భవనం.. అసౌకర్యాలు ఇబ్బందిపడుతున్న విద్యార్థులుకళాశాలలో కోర్సులు, విద్యార్థులు కోర్సు ఫస్టియర్ సెకండియర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ సివిల్ 14 61 60 59 ఈఈఈ 16 62 60 63 మెకానికల్ 0 01 59 56 ఈసీఈ 54 68 66 64 సీఎస్ఈ 67 65 69 68 మొత్తం 151 257 314 310 -
2,206 విగ్రహాలు నిమజ్జనం
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్ కల్చరల్/కొత్తపల్లి/కరీంనగర్ టౌన్/ మానకొండూర్: వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం ప్రారంభమై శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. నగరపాలకసంస్థ ఆధ్వర్యంలో మానకొండూరు, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,206 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. వీటితో పాటు దుర్శేడ్, గోపాల్పూర్, బొమ్మకల్లోని చెరువులు, వాగుల్లోనూ నిమజ్జనం చేశారు. విగ్రహాల శిథిలాల తొలగింపును ఆదివారం నుంచి చేపట్టనున్నారు. ప్రతిసారి నిమజ్జనం అనంతరం ఆయా చెరువులు, కాలువల్లో విగ్రహ శిథిలాలు రోజుల తరబడి పేరుకుపోవడం, స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలో ఈసారి ముందుగానే శిథిలాల తొలగించడానికి నగరపాలకసంస్థ రంగం సిద్ధం చేసింది. నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విగ్రహ శిథిలాల తొలగింపునూ టెండర్లో చేర్చింది. మానకొండూరు చెరువు నుంచి విగ్రహాలు, శిథిలాలు తొలగించడానికి రూ.98 వేలు, కొత్తపల్లి చెరువు నుంచి తొలగించేందుకు రూ.95 వేలు,చింతకుంట కెనాల్ నుంచి తొలగించేందుకు రూ.99 వేలు కేటా యించారు. ఆదివారం నుంచి శిథిలాల తొలగింపును ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు కొనసాగిన నిమజ్జనం మానకొండూర్, కొత్తపల్లి చెరువు, చింతకుంట కెనా ల్లో శనివారం సాయంత్రం వరకు నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. మానకొండూర్ చెరువుకు వేకువజాము వరకు భారీ విగ్రహాలు తరలివచ్చా యి. 844 పెద్దవి, 174 చిన్న విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్ రాంనగర్లోని మిత్ర యూత్ క్లబ్ భారీ గణేశుడిని చింతకుంట కెనాల్లో నిమజ్జనం చేయడంతో వేడుకలు సంపూర్ణంగా ముగిశాయి. కొత్తపల్లి చెరువులో 535 విగ్రహాలు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 488 విగ్రహాలు నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. శనివారం కొత్తపల్లి చెరువు, చింతకుంట ఎస్సారెస్పీ కెనాల్ను పరిశీలించారు. భారీ గణేశుడి శోభాయాత్రకు అడ్డంకులు కరీంనగర్లోని రాంనగర్లో మిత్ర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 35అడుగుల భారీ మట్టి వినాయకుడి శోభాయాత్రకు విద్యుత్ తీగలు, సీసీ సర్వేలెన్స్ కెమెరాల స్తంభాలు అడ్డంకిగా మారాయి. దీంతో శుక్రవారం రాత్రి నుంచే రాంనగర్ చౌరస్తాలో శోభాయాత్ర నిలిచిపోయింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో మేరకు మాజీ మేయర్ వై.సునీల్రావు విద్యుత్శాఖ, నగరపాలక సంస్థ కమిషనర్తో మాట్లాడారు. అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలు, కెమెరా స్తంభాలను తొలగించి శోభయాత్రకు మార్గం సుగమం చేయడంతో గణేశుడు చింతకుంటకు నిమజ్జనానికి తరలాడు. కలెక్టర్, కమిషనర్లకు అభినందనలు కరీంనగర్లో గణేశ్ నిమజ్జన ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో కార్యక్రమం నిర్వహించిన కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మున్సిపల్ కమి షనర్ ప్రఫుల్ దేశాయ్ సహా అన్నిశాఖల అధికారులను ఒక ప్రకటనలో ప్రత్యేకంగా అభినందించారు.మానకొండూర్ 1,018 కొత్తపల్లి 535 చింతకుంట 488 దుర్శేడ్ 78 బొమ్మకల్ 48 గోపాల్పూర్ 39 మొత్తం 2,206 -
తీరని యూరియా కష్టాలు
కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్/ఎలిగేడు(పెద్దపల్లి): యూరియా కోసం అన్నదాతలు అన్నిపనులూ వదిలేసి మండల కేంద్రాలు, పట్టణాలకు పరుగులు పెడుతున్నారు. వరి, పత్తి తదితర పంటలకు ప్రస్తుతం యూరియా ఎంతోఅవసరమని, అదను దాటితే ఎంతవేసినా ప్రయోజనం ఉండదనే ఆతృతతో అన్నదాతలు వేకువజాము నుంచే దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. వచ్చే ఒకట్రెండు లోడ్లో వరుసలో ముందున్న వారికే సరిపోవడం లేదని, వెనుకాల ఉన్నవారి వంతు వచ్చేవరయే స్టాక్ ఖాళీ అవుతోందని రైతులు వాపోతున్నారు. శనివారం కూడా జిల్లావ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఉదయమే సింగిల్విండోలు, దుకాణాలు, గ్రోమోర్ తదితర గోదాముల ఎదుట బారులు తీరి కనిపించారు. పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి యూరియా వచ్చిందనే సమాచారంతో పలు గ్రామాల రైతులు ఉదయమే గోదాము వద్దకు చేరుకుని బారులు తీరారు. లారీలోడ్లో 340 బస్తాల యూరియా రావడంతో పట్టాదారుపాస్ పుస్తకాలు, సాగు విస్తీర్ణం ఆధారంగా ఒక్కో రైతుకు ఒకట్రెండు యూరియా బ్యాగులు అందజేశారు. రైతుల సంఖ్య అధికంగా ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేశారు. మిగతా వారికి సోమవారం యూరియా స్టాక్ వస్తుందని చెప్పి పంపించి వేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పీఏసీఎస్ కార్యదర్శి సంతోష్కుమార్, ఇన్చార్జి చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు. క్యూలైన్లో చెప్పులు.. రైతుల పాట్లు కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలోని ఆగ్రోస్ కేంద్రం వద్దకు రైతులు ఉదయమే చేరుకున్నారు. అదేవిధంగా ఇదేగ్రామంలోని సాయికృష్ణ ఫెర్టిలైజర్స్ దుకాణం ఎదుట కూడా వందల సంఖ్యలో క్యూలో నిల్చున్నారు. యూరియా స్టాక్ రాక ఆలస్యం కావడంతో తమవంతు లైన్లో చెప్పులు ఉంచారు. రైతులు భారీ సంఖ్యలో తరలి రావడంతో పాస్బుక్కు జిరాక్స్ ఆధారంగా ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా, నానో లిక్విడ్ బాటిల్ ఇస్తున్నారు. పొద్దంతా పడిగాపులు కాస్తే.. ఒకబస్తా సైతం అందలేని, వరి పొట్టదశకు వచ్చిందని, పత్తి పూతపూసి గుంజర వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ఈ సమయంలో యూరియా వేయాల్సి ఉన్నా.. దొరకడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరని యూరియా కష్టాలు ఎలిగేడు మండలం ధూళికట్ట సహకార సంఘానికి యూరియా లోడ్ వచ్చిందనే సమాచారంతో ఎండను సైతం లెక్కచేయకుండా రైతులు ఉదయమే తరలివచ్చారు. క్యూలైన్లో ఒక్కసారిగా గందరగోళం నెలకొనడంతో పంపిణీని కాసేపే ఆపివేసారు. సాయంత్రం 5గంటలకు పోలీసులు రావడంతో పంపిణీని మళ్లీ ప్రారంభించారు. ధూళికట్టలో ఎకరాకు ఒకబస్తా చొప్పున 340 బస్తాలు, ఎలిగేడులో టోకెన్కు రెండు బస్తాల చొప్పున 540 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు ఏవో ఉమాపతి తెలిపారు. ఏఈవో శరణ్య పాల్గొన్నారు. మూడు రోజులు బారులు తీరినా.. వీర్నపల్లి: మండల కేంద్రంలో మూడురోజులుగా రైతులు బారులు తీరుతున్నా యూరియా లభించ డం లేదు. శనివారం ఉదయం నుంచి రైతువేదికకు 220 యూరియా బస్తాలు రాగా.. క్యూలో నిలబడితే.. ఒకేఒక్క యూరియా బస్తా ఇవ్వడంతో ఇవేమీ కష్టాలని రైతులు ఆవేదన చెందారు. రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆవేదన చెందారు. టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు.. చందుర్తి: విప్ ఆది శ్రీనివాస్ ఆదేశాలకు మేరకు శనివారం 330 యూరియా బస్తాలను సరఫరా చేశారు. సమాచారం అందుకున్న రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. 156 మంది రైతులకు రెండు బస్తాల చొప్పన సిబ్బంది పంపిణీ చేశారు. సగం మందికి కూడా సరిపడా యూరియా అందలేదు. దీంతోవారు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరు రైతులకు వ్యవసాయాధికారులు టోకెన్లు ఇచ్చారు. మరోలోడ్ వచ్చేక ప్రాధాన్యత ప్రకారం యూరియా అందిస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. గూడెంలో రైతుల జాగరణ ఓదెల(పెద్దపల్లి): గూడెం గ్రామంలో రైతులు యూరియా కోసం జాగరణ చేశారు. రాత్రి సమయంలో 140 బస్తాల యూరియా లోడ్ రాగా.. 400 మంది దాకా రైతులు గుమిగూడారు. తమకు ఇవ్వాలని ఆందోళనకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎస్సై రమేశ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బ్యాగ్ పంపిణీ చేయడంతో ఆందోళన విరమించారు. దుకాణాల ఎదుట ఉదయం నుంచే బారులు అయినా, అందరికీ సరిపడా అందని బ్యాగులు నిరాశతో వెనుదిరుగుతున్న అన్నదాతలు అదను దాటిపోతుందనే ఆందోళనలో రైతులు -
కొడుకు పుట్టనో.. చెట్టునో పట్టుకుని ఉంటడు
రామగుండం/యైటింక్లయిన్కాలనీ: ‘నా కొ డుకు చెట్టునో పుట్టనో పట్టుకొని ఉంటడు.. ఒక్కగానొక్క కొడుకు.. ఓ కన్ను పోయినా సాదుకుంటా.. ఓ కాలు తెగినా సాదుకుంటా దేవుడా.. ఎంతో అందంగా ఉన్న సక్కనోడు.. అమ్మా.. నాన్న ఒక్కడు పనిచేస్తే డబ్బులు సరిపోతలేవు.. దసరా పోయినంకా నేను కూడా పనికి పోతనే.. నీకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీవు పనిచేసే పరిస్థితి లేదు కదా.. నేను, నాన్న ఇద్దరం కలిసి పనికి పోతమే.. ఏడాదిలో రెండు గదులతో ఇల్లు కట్టుకుందామే.. అంటివి బిడ్డా.. మొన్ననే సెల్ఫోన్ కొనిత్తిని.. వినాయకుడా.. నాకు కడుపుకోత పెట్టకు.. గోదారమ్మ తల్లీ.. నా కొడుకును నువ్వు తీసుకుంటే నేను, మా ఆయన ఇద్దరం కలిసి నీ ఒడిలోకి చేరుతం’ అని ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కంట తడిపెట్టించింది. వివరాలు.. స్థానిక అక్బర్నగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారకట్ల మహేశ్వరి – సత్యం దంపతుల కుమారుడు రాజేశ్యా దవ్ ఉన్నాడు. అదేకాలనీలో గణపతి విగ్రహాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గోదావరిఖని గంగానగర్ సమీప గోదావరిలో నిమజ్జనం చేసేందుకు మండప నిర్వాహకులతో కలిసి వెళ్లాడు. శనివారం వేకువజామున విగ్రహం నిమజ్జనం కోసం క్రేన్ కొక్కేనికి తగిలించే క్రమంలో టేబుల్పైకి రాజేశ్యాదవ్ ఎక్కాడు. దానిపై అడ్డుగా ఉన్నతీగలు కాలికి తగలడంతో అదుపుతప్పి ప్రమాదవాశాత్తు గోదావరిలో పడిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల వరకూ యువకుడి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనను నిరసిస్తూ అక్బర్నగర్ కాలనీవాసులు నది వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా పూర్తియ్యిందనుకునే సమయంలోనే గో దావరిలో యువకుడు గల్లంతుకావడంతో విషా దం నెలకొంది. ఎమ్మెల్యే మక్కాన్సింగ్ ఠాకూ ర్, బీఆర్ఎస్ కారి్మక సంఘం నేత కౌశిక హరి, కాంగ్రెస్ నేత అయోధ్యసింగ్ఠాకూర్, ఏసీపీ రమేశ్, సీఐలు ప్రసాదరావు, ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వంతెన పిల్లర్ల నుంచి సుందిళ్ల బ్యారేజీ వరకు రెండు స్పీడ్ బోట్లు, నాలుగు నాటు పడవలు, ఇరవై మందితో గా లింపు చర్యలు చేపట్టామని ఏసీపీ రమేశ్ తెలి పారు. కాగా, మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ మా ట్లాడుతూ, రాజేశ్యాదవ్ కుటుంబానికి రూ. 2లక్షల నగదు పరిహారంగా అందిస్తామని, ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇప్పిస్తామన్నారు. ఊహించని పరిణామమని బీఆర్ఎస్ కార్మిక సంఘం నేత కౌశిక హరి అన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పింఛన్లు పెంచకుండా మోసం చేస్తున్న ప్రభుత్వం
మానకొండూర్/గంగాధర: ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం 21నెలలుగా ప్రజలను మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా మండిపడ్డారు. మానకొండూర్, గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో శుక్రవారం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులతో సమావేశం అయ్యారు. సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల సమయంలో నెల రోజుల్లో పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రశ్నించాల్సి ఉండగా, ప్రజల్లోకి రాకుండా గడీలకే పరిమితం అయ్యారన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన రేవంత్రెడ్డి, కేసీఆర్కు పేదల బాధలు తెలియవని, తాను కడు పేదరికం నుంచి వచ్చాను కాబట్టి పేదల బాధలు తెలుసన్నారు. ప్రభుత్వం పింఛన్లు పెంచాలని ఈ నెల 8న కలెక్టరేట్లు, 12న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తామన్నారు. 20వ తేదీన విజయవాడ– హైదరాబాద్ జాతీయ రహదారి బంద్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. 21 నుంచి 26వరకు గ్రామ పంచాయతీల ఎదుట దీక్షలు చేపడతామన్నారు. వీహెచ్పీఎస్ నాయకులు గోపాల్, అనవేని కౌసల్య, జిల్లా ఇన్చార్జి మంద రాజు, మానకొండూర్ మండల ఇన్చార్జి కనకం అంజిబాబు, రాష్ట్ర నాయకుడు చిలుము ల రాజయ్య, ఎమ్మార్పీఎస్ గంగాధర మండలాధ్యక్షుడు గంగాధర రవి, జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ పాల్గొన్నారు.ఉత్తమ అవార్డులు అందుకున్న అధ్యాపకులుకరీంనగర్క్రైం: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణి, శాసనమండలి సభ్యుడు పి.శ్రీపాల్రెడ్డి, శాతవాహన విశ్వవిద్యాలయ వీసీ ఉమేశ్కుమార్ చేతుల మీదుగా ఉన్నత విద్యా విభాగంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా శ్రీవాణి, కాంపల్లి అర్జున్ అవార్డులు స్వీకరించారు. వీరిని వీసీ రిజిస్ట్రార్ రవికుమార్ జాస్తి, హరికాంత్, సూరేపల్లి సుజాత, ఎస్సారార్ ప్రిన్సిపాల్ కె.రామకృష్ణ అభినందించారు. పిల్లల భవిష్యత్ను తీర్చిదిద్దండికరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్ను తీర్చిదిద్దాలని డీఈవో చైతన్య జైనీ సూచించారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన వారిని సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు. ముఖ్య అతిథిగా డీఈవో చైతన్యజైనీ హాజరై గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకే ఉందన్నారు. విద్యాశాఖలో ఎన్ని రకాల అధికారులు ఉన్నా.. ప్రత్యక్షంగా సేవలందించే అవకాశం ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకే ఉంటుందన్నారు. జిల్లా పరీక్షల బోర్డు కార్యదర్శి భగవంతయ్య మాట్లాడుతూ నూతన ప్రధానోపాధ్యాయులు సేవాభావంతో ముందుకు వెళ్లాలని సూచించారు. సంఘం జిల్లాశాఖ అధ్యక్షుడు నలుమాచు సుదర్శనం, సర్వ శిక్ష అభియాన్ కోఆర్డినేటర్లు కర్ర అశోక్రెడ్డి, ఆంజనేయులు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపల్లి శ్రీనివాస్, కోశాధికారి అనురాధ పాల్గొన్నారు. రేపు ఇల్లందకుంట రామాలయం మూసివేతఇల్లందకుంట: జిల్లాలోని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ఈ నెల 7న ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు కార్యనిర్వాహణాధికారి సుధాకర్ తెలిపారు. 7న మధ్యాహ్నం 12గంటల నుంచి మూసివేయనున్నారు. 8న సోమవారం మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 10 గంటల నుంచి స్వామివారికి యథావిధిగా అభిషేకాలు, ఆర్జిత సేవలు కొనసాగుతాయని ఈవో పేర్కొన్నారు. -
రాత్రనకా.. పగలనకా..
చెర్లభూత్కూర్ గోదాం వద్ద రైతుల తోపులాటచిగురుమామిడిలో యూరియా కోసం రాత్రిపూట వరుసలో రైతులుకరీంనగర్రూరల్/హుజూరాబాద్/చిగురుమామిడి/శంకరపట్నం/రామడుగు: జిల్లాలో పగలనకా.. రాత్రనకా.. పండుగనకా.. పబ్బమనకా.. యూరి యా కోసం రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. యూరియా బస్తాల కోసం వాగ్వాదానికి దిగుతున్నారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ ఎరువుల గోదాంకు శుక్రవారం 400 యూరియా బస్తాలు వచ్చాయి. ఎఈవో స్వర్ణలత రైతుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాలను తీసుకుని టోకెన్లను జారీ చేశారు. క్యూలో ఉన్న రైతులు యూరియా కోసం ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. ఒకేసారి రైతులందరూ గోదాంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో అధికారులు యూరియా పంపిణీ నిలిపివేశారు. 160 మందికి టోకెన్లు జారీ చేయగా 70బస్తాలు పంపిణి చేశామని సీఈవో రమేశ్ తెలిపారు. దుర్శేడ్ సహకార సంఘంలో 380 యూరియా బస్తాలకు 146 బస్తాలను పంపిణీ చేశామని సీఈవో వేణుమాధవ్ తెలిపారు. నగునూరులోని ఆగ్రోస్లో 120 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు ఏవో సత్యం తెలిపారు. దుర్శేడ్, చెర్లభూత్కూర్లో మిగిలిన బస్తాలను శనివారం పంపిణీ చేస్తామన్నారు. హుజూరాబాద్ సింగిల్ విండో ఎదుట శుక్రవారం వేకువజామున నుంచే బారులు తీరారు. అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున టోకెన్లు అందించారు. చిగురుమామిడిలోని రైతుడిపోకు శుక్రవారం సాయంత్రం వరకు లారీ యూరియా వచ్చింది. చీకట్లోనూ క్యూలో నిల్చున్న రైతులు యూరియా తీసుకుని వెళ్లారు. శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో యూరియా కోసం రైతులు తోపులాడుకున్నారు. మహిళలు సైతం ఇంటి పనులు పక్కనపెట్టి క్యూలో ఉన్నారు. కన్నాపూర్, కాచాపూర్లో పోలీసుల పహారాలో పంపిణీ చేశా రు. రామడుగు మండలం వెదిర సహకార సంఘం గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరగా.. ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. -
లడ్డూ.. అ‘ధర’హో
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్ కల్చరల్/సప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని పలు మండపాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంపాట అ‘ధర’హో అనిపించింది. రేకుర్తి కాళోజీనగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను రూ.1.85 లక్షలకు సంకిటి స్వరూప శ్రీని వాస్రెడ్డి దంపతులు దక్కించుకున్నారు. సూర్యనగర్– 3 వినాయకుడి లడ్డూను రూ.1.82లక్షలకు శనిగరపు మంజుల నర్సయ్య దంపతులు దక్కించుకున్నారు. రేకుర్తి ద్వారకానగర్లోని శ్రీ అమృతేశ్వర మహాశివాలయంలోని లడ్డూను రూ.42,500లకు కొత్త శ్రీనివాస్ దంపతులు, సూర్యనగర్ (శుభంగార్డెన్) లడ్డూను రూ.37,516లకు వుల్లెంగుల మౌనిక సాయిరాం, సీతారాంపూర్ బాలాజీనగర్ లడ్డూను రూ.21,500లకు తిరుణహరి సురేఖ ప్రశాంత్ దంపతులు కై వసం చేసుకున్నారు. నగరంలోని పాత బజార్ ఒకటోనంబర్ వినాయకుడి లడ్డూను సీనియర్ కరాటే మాస్టర్ కె.వసంత్ కుమార్ రూ.20వేలకు దక్కించుకున్నారు. కోతిరాంపూర్ వినాయకుడి లడ్డూ రూ.9999 పలికింది. భాగ్యనగర్ యూత్ ఆధ్వర్యంలోని లడ్డూను రూ.30,116కు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి కూతురు రిషితారెడ్డి దక్కించుకున్నారు. -
వినాయకా.. వీడ్కోలిక
కరీంనగర్కల్చరల్/కరీంనగర్క్రైం/విద్యానగర్/ కరీంనగర్ కార్పొరేషన్/కొత్తపల్లి/మానకొండూర్: డప్పు చప్పుళ్లు.. భక్తి గీతాలు.. మహిళల కోలాట నృత్యాలు.. ఒగ్గుడోలు విన్యాసాలతో భక్తజనం వెంట నడవగా.. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న విఘ్నేశ్వరుడి నిమజ్జన శోభాయాత్ర కరీంనగరంలో కన్నుల పండువగా సాగింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం వేకువజామున వరకు నగరం సందడిగా మారింది. గణపతి బొప్పా మోరియా, జై బోలో గణేశ్ మహారాజ్కీ నినాదాలతో మార్మోగింది. ప్రతీ గణనాథుడు శోభాయాత్రగా టవర్సర్కిల్, కమాన్ చౌరస్తా, రాంనగర్కు చేరుకోగానే గణేశ్ ఉత్సవ కమిటీ, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, నగర కమిషనర్ ప్రఫుల్దేశాయ్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి విగ్రహాలను మానకొండూర్, కొత్తపల్లి చెరువులు, చింతకుంట కెనాల్కు శోభాయాత్రగా తరలించి నిమజ్జనం చేశారు. శనివారం వేకువజామున వర కూ నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. టవర్సర్కిల్ వద్ద గోగుల ప్రసాద్ ఈవెంట్ ఆధ్వర్యంలో సంగెం రాధాకృష్ణ బృందం చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కాగా.. గణేశ్ నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సీపీ గౌస్ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి నిమజ్జన ప్రాంతాలైన కొత్తపల్లి, మానకొండూరు చెరువులను, చింతకుంట కెనాల్ను సందర్శించారు. క్రేన్సాయంతో కొన్ని విగ్రహాలను స్వయంగా నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి 867 మంది పోలీసతో బందోబస్తు నిర్వహించామని సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఇద్దరు అడిషనల్ డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 350మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్ఐలు, 100 మంది హోంగార్డులు, 150 మంది ఎన్సీసీ కెడెట్లు, 200మంది వలంటీర్లు విధుల్లో ఉన్నారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ప్రశాంత వాతావారణంలో వినాయ క నిమజ్జనం జరిగేలా ఏర్పాట్లు చేశామని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ వివరించారు. -
ఎస్సారార్ నుంచి అర్జున్
కరీంనగర్క్రైం: నగరంలోని ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ కే.అర్జున్ రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లికి చెందిన కే.అర్జున్ 2013, జనవరి 1న అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా నియామకం అయ్యాడు. 12ఏళ్లుగా కామర్స్ సబ్జెక్టు బోధిస్తూ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్లో తన పరిశోధనన పత్రాలు ప్రచురించారు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం, జిల్లా నోడల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అర్జున్ను ప్రిన్సిపాల్ కలువకుంట రామకృష్ణ, కడారు సురేందర్రెడ్డి, నితిన్పాఠక్, టి.రాజయ్య అభినందించారు. -
రోడ్డెక్కిన కాంగ్రెస్ వర్గపోరు
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు రోడ్డెక్కింది. ఇటీవల పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావు పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో లేదంటూ గొడవ మొదలైంది. ప్రోటోకాల్ ఉల్లంఘించిన కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీ వెలిచాల రాజేందర్రావుపై చర్యతీసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాలు నగరంలోని తెలంగాణచౌక్లో రాస్తారోకో చేశాయి. డీసీసీ,పీసీసీ అధ్యక్షుడి చిత్రపటాలను పాలతో అభిషేకించాయి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్కుమార్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కాదాసి ప్రభాకర్, మాదిగ విద్యార్థి నాయకుడు మాతంగి రమేశ్ మాట్లాడుతూ పీసీసీ, డీసీసీ అధ్యక్షుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనన్నారు. దళితుడనే కవ్వంపల్లి ఫొటోలు ఫ్లెక్సీల్లో ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఈ వ్యవహారంపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. దళితుల ఆత్మబంధువు ‘వెలిచాల’ దళితుల ఆత్మబంధువు వెలిచాల రాజేందర్రావుపై నిందలు వేయడం సరికాదంటూ ఆయన అభిమానులు పేర్కొన్నారు. నగరంలోని తెలంగాణచౌక్లో రాజేందర్రావు ఫ్లెక్సీని పాలతో అభిషేకించారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్రావు యువసేన అధ్యక్షుడు కిరణ్కుమార్ మాట్లాడుతూ మచ్చలేని నేతపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంటే ఎంతో గౌరవం ఉందని, ఆ ఫ్లెక్సీల ఏర్పాటుతో రాజేందర్రావుకు సంబంధం లేదన్నారు. -
నిమజ్జనానికి వేళాయె
కరీంనగర్క్రైం/కరీంనగర్ కార్పొరేషన్/విద్యానగర్/కొత్తపల్లి/మానకొండూర్: జిల్లావ్యాప్తంగా నేటి వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. నగరానికి చెందిన విగ్రహాలు మానకొండూర్, కొత్తపల్లి చెరువులతో పాటు చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జనం చేయనున్నారు. డప్పు చప్పుళ్లు, నృత్యాలు, భక్తిశ్రద్ధలతో శోభయా త్ర నిర్వహించేందుకు కరీంనగర్ ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలోని టవర్ సర్కిల్ వద్ద విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్, హిందూ ఉత్స వ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన తరువాత గణనాథులు నిమజ్జనానికి తరలనున్నాయి. సీపీ గౌస్ ఆలం పర్యవేక్షణలో, ఇద్దరు అడిషనల్ డీసీపీలు, నలుగురు ఏసీపీలు, 15 మంది సీఐలు, 30 మంది ఎస్సైలతో పాటు మరో 650మంది పోలీ సు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉండనున్నారు. ఏర్పాట్లు పూర్తి.. ఇన్చార్జి బాధ్యతలు నిమజ్జనోత్సవానికి మానకొండూర్, కొత్తపల్లి చెరు వు, చింతకుంట ఎస్సారెస్పీ కాలువ వద్ద క్రేన్లను సిద్ధంగా ఉంచారు. ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. టవర్సర్కిల్, రాంనగర్ తదితర ప్రాంతాల్లో స్వాగ త వేదికలు ఏర్పాటు చేశారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు బల్దియా సిబ్బందికి బాధ్యతలు కేటాయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక బ్యాచ్, రాత్రి 8 గంటల నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మరో బ్యాచ్ ఆయా పాయింట్ల వద్ద విధులు నిర్వర్తిస్తారు. చింతకుంట కెనాల్ వద్ద డీఈ శ్రీనివాస్, ఏఈ సల్మాన్, శానిటరీ సూపర్వైజర్ అనిల్కుమార్, మానకొండూరు వద్ద శానిటరీ సూపర్వైజర్ శ్యాంరాజ్, పర్యావరణ ఇంజినీర్ స్వామి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీధర్, డీఈ వెంకటేశ్వర్లు, ఏఈ సంతోష్, కొత్తపల్లి వద్ద ఎంహెచ్వో సుమన్, డీఈ లచ్చిరెడ్డి, ఏఈ భీంవర్ధన్రెడ్డి ఇన్చార్జీలుగా వ్యవహరిస్తారు. టవర్సర్కిల్, రాంనగర్, చింతకుంట, కొత్తపల్లికి పశువైద్యాధికారి దుర్గాప్రసాద్రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీఈ అరుణ్కుమార్, ఏఈ అయూబ్, బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్కు డీఈ దేవేందర్, ఏఈ గట్టుస్వామిలను ఇన్చార్జీలుగా నియమించారు.హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు మానకొండూర్ బస్టాండ్ నుంచి ముంజంపల్లి, పోరండ్ల వైపు మళ్లిస్తారు. తిమ్మాపూర్ రాజీవ్ రహదారి మీదుగా కరీంనగర్ వెళ్లొచ్చు. కరీంనగర్ నుంచి హుజూరా బాద్ వైపు వెళ్లే వాహనాలకు దారి మళ్లింపు లేదు. జగిత్యాల నుంచి కరీంనగర్ వైపు వచ్చే వాహనాలు వెలిచాల ఎక్స్రోడ్డు, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్ ఎక్స్రోడ్డు, ఎన్టీఆ ర్ విగ్రహం మీదుగా నగరంలోకి వెళ్లొచ్చు. 5తేదీ నుంచి 6వ తేదీ వరకు గ్రానైట్, ఇతర భారీవాహనాలను సిటీలోకి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు.నగరంలోని గాంధీచౌక్ నుంచి రాజీవ్చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్కు గణనాథులు వెళ్తాయి. తెలంగాణ చౌక్ నుంచి వచ్చేవి బస్టాండ్, సీఎస్ఐ చర్చి, అమరవీరుల స్తూపం, రాజీవ్చౌక్, క్లాక్ టవర్, కమాన్, అల్గునూర్ మీదుగా మానకొండూర్ చేరుకుంటా యి. హౌజింగ్బోర్డు కాలనీ, కాపువాడ, మంగళి వాడ, మారుతినగర్, అశోక్నగర్ నుంచి వచ్చే ప్రతిమలు బోట్చౌరస్తా, మారుతినగర్ చౌరస్తా, పాతబజార్, రాజీవ్చౌక్, క్లాక్టవర్, కమాన్, అల్గునూర్ నుంచి నిమజ్జనానికి వెళ్తాయి. గోదాం గడ్డ నుంచి ఉమెన్స్ కళాశాల, టూటౌన్చౌరస్తా, మంకమ్మతోట, రాంనగర్, పద్మనగర్ మీదుగా చింతకుంట కెనాల్కు చేరుకుటాయి. జ్యోతినగర్ నుంచి సెయింట్ జాన్స్ స్కూల్, కొత్తపల్లి పీఎస్, చింతకుంట కెనాల్కు వెళ్తాయి. అపోలోరీచ్ హాస్పిటల్, మంచిర్యాల చౌరస్తా, కోర్టు చౌరస్తా, చైతన్యపురి, ఎస్సారార్ కళాశాల మీదుగా కొత్తపల్లి చెరువుకు వెళ్తాయి. శివ థియేటర్ చౌరస్తా మీదుగా వచ్చేవి సెయింట్ జాన్స్ స్కూల్, శాతవాహన యూనివర్సిటీ, విజయపురికాలనీ, రేకుర్తి, కొత్తపల్లి చెరువుకు చేరుకుంటాయి. -
రహదారి పనులు వేగవంతం చేయండి
కరీంనగర్ అర్బన్/రామడుగు: కొత్తపల్లి– హుస్నాబాద్ నాలుగు వరుసల రహదారి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సదరు రహదారి పనుల ప్రగతిపై గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. నాలుగు వరుసల రహదారి కోసం ఇప్పటికే మార్కింగ్ పూర్తయినందున ఎలక్ట్రికల్ వర్క్స్, బావుల పూడ్చివేత, చెట్లు తొలగించే పనులు వేగవంతం చేయాలని అన్నారు. గ్రామాల మీదుగా వెళ్తున్న రహదారి నిర్మాణం కోసం గ్రామసభలు ఏర్పాటు చేసి తీర్మానం చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, జిల్లా అటవీ అధికారి బాలమణి, ఆర్అండ్బీ ఈఈ నరసింహచారి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మెలకువలతో విద్యాబోధన చేయాలి ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో విద్య బోధన చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. రామడుగు మండలం దేశరాజ్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, పల్లె దవాఖానాను గురువారం తనిఖీ చేశారు. ఏడోతరగతిలో మ్యాఽథ్స్ పాఠం వింటున్న విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని పెద్దగదిలోకి మార్చాలని సూచించారు. పల్లె దవాఖానాను తనిఖీ చేసి వైద్య పరీక్షలు చేసుకుంటున్న రోగులను సేవలను అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో వెంకటరమణ, ప్రోగ్రాం ఆఫీసర్ సనా, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరీ పాల్గొన్నారు.