breaking news
Karimnagar
-
ప్రాణభిక్ష పెట్టండి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆర్థిక సాయం చేసి పతిభిక్ష పెట్టాలని ఓ ఇల్లాలు వేడుకుంటుంది. అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన తన భర్తను ప్రాణాలు నిలబెట్టాలని అర్థిస్తోంది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల తిరుపతి(34) కేసీఆర్ కాలనీలో ఉంటున్నాడు. బతుకుదెరువు కోసం గతంలో దుబాయ్, మలేషియా వెళ్లి వచ్చాడు. గల్ఫ్లో ఉండగానే అనా రోగ్యానికి గురికావడంతో అప్పులు తీరకుండానే స్వగ్రామానికి చేరాడు. ఇటీవల అనారోగ్యానికి గురికాగా కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చూపించగా ప్రాంక్యియాసిస్గా వైద్యులు నిర్ధారించారు. అప్పటి నుంచి హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అక్కడి నుంచి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. తిరుపతికి రక్తం తక్కువ ఉందని బ్లడ్ప్యాకెట్లు ఎక్కించాలని వైద్యులు సూచించారు. ఒక్కో బ్లడ్ ప్యాకెట్కు రూ.2వేల చొప్పున కొనుగోలు చేసి ఎక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రస్తుతం శస్త్రచికిత్సకు రూ.20లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో చేతిలో చిల్లి గవ్వలేక భర్తను బతికించుకోవడానికి భార్య శ్యామల పడుతున్న వేదన వర్ణనాతీతం. దాతలు స్పందించి తన భర్తను బతికించాలని శ్యా మల, కూతుళ్లు సింధు, తను, కుమారుడు సుచిత్ కోరుతున్నారు. దాతలు 7893969976లో సంప్రదించాలని వేడుకుంటున్నారు. భర్త అనారోగ్యంతో ఆస్పత్రిపాలు ఆదుకోవాలని వేడుకుంటున్న ఇల్లాలు -
నానోపై ఆసక్తి చూపని అన్నదాత
మంథనిరూరల్: పంటలకు యూరియా కన్నా నానో యూరియా లిక్విడ్ ఎంతోమంచిదని ప్రభుత్వం, వ్యవసాయాధికారులు సూచిస్తున్నా రైతుల్లో ఇంకా నమ్మకం కలగడం లేదు. చీడపీడలు, తెగుళ్లను తట్టుకుని దిగుబడి పెంచే నానోపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ఏడాది నుంచి కొంత వరకు యూరియా కొరత తలెత్తుతుండడంతో ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వినియోగంలోకి తీసుకొస్తున్నారు. అక్కడక్కడా కొందరు వినియోగిస్తున్నా ఫలితాలు ఆలస్యంగా వస్తుండటంతో అన్నదాతలు అటువైపు మొగ్గు చూపడంలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో నానో యూరియా బెటర్ అని వ్యవసాయాధికారులు అవగాహన కల్పిస్తున్నా రైతులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో సుమారు 2.15లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు జిల్లాకు దాదాపు 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు 25వేల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. యూరియా కొంత కొరత ఏర్పడితే ప్రత్యామ్నాయంగా నానో యూరియా వాడుకునే అవకాశం ఉందని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆలస్యంగా ఫలితాలు రావడంతో.. సాధారణంగా పంటకు ఎరువులు, పురుగుల మందులు వేసిన వెంటనే ఫలితం చూపిస్తేనే వాటిని వాడుతుంటారు. అయితే వరిలో యూరియా చల్లిన మరుసటి రోజునే పైరు పచ్చబడి ఫలితం చూపిస్తుంది. కానీ నానో యూరియా పిచికారీ చేశాక రెండు, మూడు రోజుల తర్వాతనే ఫలితం కనిపిస్తోంది. దీంతో రైతుల నానో యూరియాపై ఆసక్తి చూపడం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా నానో యూరియాను సాయంత్రం వేళలో పంటపై పిచికారీ చేయాలని, మధ్యాహ్న సమయంలో చేస్తే ఎండ తీవ్రతకు ఫలితం చూపించదని, దీంతోనే రైతులు మొగ్గు చూపడం లేదంటున్నారు. నానో యూరియాతో ప్రయోజనాలు ● అన్ని పంటలకు నత్రజనిని సమర్థవంతంగా అందిస్తుంది. ● పిచికారీతో ఎక్కువ పత్రహరితం, మెరుగైన కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యంలో దిగుబడి పెరుగుతుంది. ● అనుకూల పరిస్థితుల్లో పోషక వినియోగ సామర్థ్యం కన్నా ఎక్కువగా ఉంటుంది. ● యూరియా బస్తా కన్నా నానో యూరియా తక్కువ ధరకు లభిస్తుంది. చీడ పీడల తెగుళ్ల ఉధృతిని తట్టుకుంటుంది. అవగాహన కల్పిస్తున్నాం గ్రామాల్లో నానో యూరియా వాడకం పెంచేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. నానో యూరియా పిచికారీ విధానం, ఏ పంటపై ఏ దశలో పిచికారీ చేయాలో, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాం. అయితే యూరియాతో వెంటనే ఫలితం కనిపిస్తుంది. నానో యూరియా వాడితే రెండు, మూడు రోజుల తర్వాత ఫలితం వస్తుంది. దీంతో రైతులు కొంత మేర వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో అక్కడక్కడా యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను వాడుతున్నారు. – శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి ఆలస్యంగా ఫలితాలు.. కరువైన ఆదరణ మంచి ఫలితాలు ఉంటాయంటున్న అధికారులు -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
ధర్మపురి: ధర్మపురిలోని హనుమాన్వాడకు చెందిన రాపర్తి లక్ష్మి ఇంటిలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చోరీ కేసులో మైనర్ బాలుడిని అరెస్టు చేసి ఆభరణాలు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. గురువారం ధర్మపురి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. రాపర్తి లక్ష్మి ఇంట్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, పది తులాల వెండి గొలుసులు దొంగిలించారని బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో సీఐ రాంనర్సింహారెడ్డి, ఎస్సై మహేశ్లు కేసును సవాల్గా తీసుకొని తమ సిబ్బందితో సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీలు పరిశీలించి ఇతర సమాచారాన్ని సేకరించి చోరీకి పాల్పడిన మైనర్ బాలుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు మైనర్ అయినందున చట్టపరమైన నిబంధనల మేరకు అతని పేరు, ఫొటో వెల్లడించలేదని అన్నారు. నిందితుడి నుంచి 2తులాల బంగారం, 14 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గతంలో చోరీ చేసిన ద్విచక్ర వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. కాగా చోరీ కేసును 24 గంటల్లో చేధించిన పోలీసులను ఎస్పీ అశోక్కుమార్ అభినందించారు. ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం -
బైక్ ఢీకొని కార్మికుడి మృతి
పాలకుర్తి: పెద్దపల్లి జిల్లా పా లకుర్తి మండలం ఈసాలత క్కళ్లపల్లి గ్రామశివారులో గు రువారం రాత్రి బైక్ ఢీకొని ముంజాల రాజయ్య(50) మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ఈసాలతక్కళ్లపల్లికి చెందిన రాజయ్య ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికుడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. రైస్మిల్లు స మీపంలో ఎదురుగా వచ్చిన బైక్ వేగంగా ఢీకొ ట్టింది. రాజయ్యకు తీవ్రగాయాలు కాగా పెద ్ద పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. పరిస్థితి విషమించి అక్కడ మృతిచెందాడు. మృతుడికి భార్య రాజేశ్వరి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. వీరిలో ఒక కూతురు వికలాంగురాలు. పెద్దదిక్కును కోల్పోయిన ఆ కు టుంబసభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. బసంత్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, రాజయ్య మృతికి కారకుడైన ఎండీ రజాక్ రూ.4లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు స్థానికులు తెలిపారు. క్వారీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతికొత్తపల్లి(కరీంనగర్)/ఇల్లంతకుంట(మానకొండూర్): కొత్తపల్లి మండలం కమాన్పూర్ శివారులోని ఎస్ఎల్పీజీ గ్రానైట్ క్వారీలో సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేటకు చెందిన మామిడి పర్శరాం(46) ఎస్ఐఎస్ సెక్యూరిటీ కంపెనీ ద్వారా కమాన్పూర్లోని ఎస్ఎల్వీజీ గ్రానైట్ క్వారీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే గురువారం రాత్రి విధులకు హాజరైన ఆయన ఉదయం మరో సెక్యూరిటీ గార్డు విధులకు వచ్చి చూసే సరికి చనిపోయి ఉన్నాడు. ఈ విషయాన్ని క్వారీ సూపర్వైజర్ హనుమంతు ద్వారా మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మృతుడి భార్య అనారోగ్యంతో రాకపోవడంతో బావమరిది నరేందర్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన చేగొండ స్వామి(53) ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం మృతుడి భార్య లావణ్యను బర్రె ఢీకొట్టడంతో కాలికి గాయమైంది. వైద్యా నికి ఖర్చు కావడం, భార్య ఆరోగ్యంగా లేకపోవడంతో స్వామి మద్యానికి బానిసయ్యాడు. మనస్థాపానికి గురై ఉరి వేసుకున్నాడని రూరల్ ఎస్సై మధుకర్ తెలిపారు. జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసు కస్టడీకి ఇద్దరుకరీంనగర్క్రైం: కరీంనగర్లో సంచలనం సృష్టించిన పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నింది తులైన యాదవ్ అలియాస్ జైనుల్ అబుద్ధీన్, ఆదిల్ఖాన్ను పోలీసులు శుక్రవారం నుంచి మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అ నుమతితో నిందితులను కస్టడీకి తీసుకున్న ద ర్యాప్తు అధికారులు, దోపిడీకి సంబంధించిన కీలకాంశాలపై విచారిస్తున్నారు. నిందితుల కస్టడీ ఆదివారం ముగుస్తుండడంతో సోమవారం తిరిగి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. -
మూడు ఆలయాల్లో దొంగతనం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ శివారులోని శ్రీ మల్లికార్జునస్వామి, రేణుకా ఎల్లమ్మ, హనుమాన్ ఆలయాల్లో గురువారం రాత్రి గుర్తు గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. గ్రామ శివారులో ఒకే కాంపౌండ్లో ఉన్న ఈ మూడు ఆలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయాల చుట్టూ ఉన్న మూడు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. మల్లికార్జున స్వామి ఆలయంలోని అమ్మవారి పుస్తెమట్టెలతోపాటు హుండీలోని నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఆలయాల్లో దొంగలు పడడం ఇది మూడోసారి. మూడు సీసీ కెమెరాలు పగులగొట్టగా మరో సీసీ కెమెరాలో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసుల దొంగల కోసం గాలిస్తున్నారు. యాదవ సంఘం అధ్యక్షుడు సోనవేని రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్రెడ్డి తెలిపారు. పోలీసుల తనిఖీలు అల్మాస్పూర్ శివారులోని మూడు ఆలయాల్లో దొంగతనం జరిగిన నేపథ్యంలో మండల కేంద్రంతోపాటు వీర్నపల్లి రోడ్డు, రాగట్లపల్లి, రాచర్ల గొల్లపల్లి వద్ద వాహన తనిఖీలు చేశారు. అనుమానితులను ఆపి వివరాలు సేకరించారు. నంబర్ప్లేట్ లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గాలిస్తున్న పోలీసులు -
టేకుచెట్లు నరికిన వ్యక్తిపై కేసు
జగిత్యాలక్రైం: మల్యాల మండలం గొర్రెగుండంలో పట్టా భూ మిలో 201 టేకు చెట్లు నరికివేసేందుకు అనుమతి తీసుకుని 211 చెట్లు నరికివేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా అట వీశాఖ అధికారి రవిప్రసాద్ తెలిపారు. గొర్రెగుండంలోని పట్టా భూమిలో 201 టేకుచెట్లు నరికివేసేందుకు అనుమతి తీసుకున్నారు. యజమాని నుంచి జీపీఏ చేయించుకొని ఓ వ్యక్తి 211 చెట్లు నరికారు. దీంతో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో గతనెల 28న విచారణ చేసి నివేదిక తయారుచేశారు. అనుమతి కంటే 10 చెట్లు నరికాడని, నరికిన చెట్లను కూడా పట్టా భూమిలో ఉంచకుండా ఇతర ప్రాంతాల్లో నిల్వ చేశారని తేలిందన్నారు. ఒబులాపూర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీకాంత్ బీట్ ఆఫీసర్ గోపాల్లు విచారించి స్థానికుల సమక్షంలో పంచనామా నిర్వహించి కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. తెగిపడ్డ హైటెన్షన్ విద్యుత్ వైర్లుసిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు బస్టాండ్ సమీపంలో 33 కేవీ హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఇళ్ల ముందు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో ఐదు ఇళ్లలోని విద్యుత్ మీటర్లు, టీవీలు, ఫ్రిజ్లు, స్వీచ్బోర్డులు కాలిపోయాయి. గతంలో కూడా ఇలాగే హైటెన్షన్ వైరు తెగిపడడంతో పలు గృహోపకరణాలు కాలిపోయినట్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న విద్యుత్శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మరమ్మతు పనులు చేపట్టారు. ఇండ్లపై నుంచి వెళ్తున్న హైటెన్షన్ లైన్లను తొలగించాలని స్థానికులు కోరారు. -
చదువురాని సీఎం చదువుల మంత్రిగా ఉన్నాడు
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో చదువురాని ముఖ్యమంత్రి చదువుల మంత్రిగా ఉన్నారని, చదువు విలువ తెలియకపోవడం వల్లే కేంద్రీయ విద్యాలయానికి స్థల కేటాయింపులో అవాంతరాలు సృష్టిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అర్వంద్ అన్నారు. శుక్రవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయానికి అనుకూలంగా ఉండే విధంగా చల్గల్లో 10ఎకరాల స్థలం ఇస్తూ కేబినేట్ ఆమోదం తెలిపినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేసే రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు అదికారులు తలొగ్గవద్దని సూచించారు. జగిత్యాల జిల్లా విద్యార్థులకు పాఠశాలల్లో సౌకర్యాలు వద్దా? అని ప్రశ్నించారు. వేరే జిల్లాల్లో కేవీకి పది ఎకరాల స్థలం కేటాయించిన ముఖ్యమంత్రి జగిత్యాలలో ఐదు ఎకరాలు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు పాస్పోర్టు సేవా కేంద్రం కూడా మంజూరైందని త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అద్యక్షుడు యాదగిరి బాబు, నియోజకవర్గ ఇన్చార్జి భోగ శ్రావణితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ -
270 టన్నుల పత్తి విత్తనాలు దగ్ధం
● రూ.90 లక్షలు నష్టం ఇల్లంతకుంట(మానకొండూర్): Æ>f¯]l²-íÜ-Ç-íÜ-ÌSÏ hÌêÏ CÌSÏ…-™èl-MýS$…r Ð]l$…yýl-ÌS… ™éâýæÏ-ç³-ÍÏÌZ° }Æ>f-Æ>gôæ-ÔèæÓÆý‡ B{Vø C…yýl[çÜt zీ‹Ü 糆¢Ñ$Ë$Ï-ÌZ Ô¶æ${MýS-ÐéÆý‡… AW² {ç³Ð]l*§ýl… ^ør$-^ól-çÜ$-MýS$…¨. D {ç³Ð]l*-§ýl…-ÌZ 270 r¯]l$²ÌS 糆¢ Ñ™èl¢-¯éË$ §ýlVýS®-Ð]l$-Ķæ*ÅÆ‡$$. Ý린MýS$-Ë$, Ñ$Ë$Ï Ä¶æ$fÐ]l*° ç³Ñ{™èl }°Ðé‹Ü ™ðlÍí³¯]l ÑÐ]l-Æ>Ë$. 糆¢ Ñ$Ë$Ï-ÌZ §é§éç³# 300 r¯]l$²ÌS Ñ™èl¢¯]l çÜ…^èl$-ÌS¯]l$ ¯ðlr$t MösêtÆý‡$. Ñ$Ë$Ï íܺ¾…¨ Æ>gôæÔŒæ Ô¶æ${MýS-ÐéÆý‡… ™ðlÌS-ÏÐéÆý‡$-gêÐ]l¬¯]l Ñ™èl¢¯]l çÜ…^èl$-ÌSMýS$ Ð]l$…rË$ A…r$-MøÐ]lyýl… VýSÐ]l$-°…^éyýl$. Ððl…r¯ól íÜÇíÜ-ÌSÏ OòœÆŠ‡ õÜtçÙ¯ŒSMýS$ ¸ù¯ŒS-ÌZ çÜÐ]l*-^éÆý‡… A…¨…-^éÆý‡$. OòœÆŠ‡ BïœçܯЇ ¯]lÆó‡…§ýlÆŠ‡ B«§ýlÓ-Æý‡Å…ÌZ íܺ¾…¨ Æ>Ð]l$-^èl…-{§ýl…, VýS×ôæÔŒæ, A°ÌŒæ, Æ>gôæ-ÔèæÓ-ÆŠæ, ÔèæÕ«§ýl-ÆŠæ, ÕÐ]l-MýS$-Ð]l*-ÆŠæ {ÔèæÑ$…_ Ð]l$…rÌS¯]l$ A§ýl$-ç³#-ÌZMìS ™ðl^éaÆý‡$. 糆¢ Ñ™èl¢-¯éÌS ¯ðlr$tMýS$ Æð‡…yýl$ OÐðlç³#-Ìê ¯ðlr$t-Mösìæt E¯]l² Ð]lyýlÏ-ºÝë¢-ÌSMýS$ Ð]l$…rË$ A…r$-MøMýS-´ù-Ð]l-yýl…-™ø ò³¯]l$ {ç³Ð]l*§ýl… ™èlí³µ…¨. Ð]l$…rÌZÏ ç³†¢ Ñ™èl¢-¯éË$ M>Í´ù-Ð]l-yýl…-™ø Æý‡*.90ÌS-„ýSÌS Ð]lÆý‡MýS$ ¯]lçÙt… fÇW¯]lr$Ï Ñ$Ë$Ï Ä¶æ$fÐ]l*° õ³ÆöP-¯é²Æý‡$. çÜ…çœ$-r¯]l çܦÌê°² CÌSÏ…-™èl-MýS$…r GOòÜÞ AÔZMŠS, Æð‡Ððl¯]l*Å C¯ŒS-òܵ-MýStÆŠ‡ ¯éƇ$$° Æý‡çœ¬ ç³ÇÖÍ…-^éÆý‡$. -
ఫామ్ నింపేదెలా?
వేములవాడ: ఓటరు ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ఫారమ్స్ ఎలా నింపాలో తెలియక చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. చిన్నపాటి పొరపాట్లతో ఓటుహక్కు కోల్పోవాల్సి వస్తోందేమోనని ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్యూమరేషన్ పత్రాలను ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. అయితే వేములవాడ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో ఒక్క పత్రం, మరికొన్ని గ్రామాల్లో రెండేసి ఫామ్స్ ఇస్తుండడంతో అయోమయానికి గురవుతున్నారు. అవగాహన లేక ఆందోళన ఎన్యూమరేషన్ ఫామ్స్ను పంపిణీ చేస్తున్న సిబ్బంది వాటిని ఎలా భర్తీ చేయాలో తెలపడం లేదని ప్రజలు వాపోతున్నారు. నమోదు ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేయాలని కోరుతున్నారు. అదనపు సిబ్బందిని నియమించి వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ● ఫారం ఎలా నింపాలో అవగాహన లేకపోవడం. ● అవసరమైన పత్రాలపై స్పష్టత లేకపోవడం. ● వృద్ధులు, మహిళల్లో కొందరికి చదువు రాకపోవడం. జనం డిమాండ్లు ఇవీ.. ● బీఎల్వోలు, బీఎల్ఏలకు ఫారమ్స్ నింపే బాధ్యత అప్పగించాలి. ● ప్రతి మీసేవ కేంద్రాల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేయాలి. ● గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలి. ఎస్ఐఆర్పై అవగాహన కల్పించని అధికారులు ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన సిబ్బంది ఎలా నింపాలో తెలియక అయోమయం అవగాహన లేక ఆందోళన వీరు వేములవాడకు చెందిన చిట్టి రామారావు–కుమారి దంపతులు. 35 ఏండ్ల క్రితం ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వేములవాడలో ఆటోమొబైల్ దుకాణం నడుపుతున్నారు. గత 35 ఏండ్లుగా జరిగిన ప్రతీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 2002 ఓటర్ల జాబితాలో కుమారి పేరు ఉండగా, భర్త రామారావు పేరు గల్లంతైంది. బీఎల్వో, బీఎల్ఏల వద్దకు నాలుగుసార్లు వెళ్లినా సరైన సమాధానాలు ఇవ్వడం లేదని వాపోతున్నారు. వీరితోపాటు నివాసముండే లింగేశ్వర్రావు–పార్వతి దంపతుల్లో లింగేశ్వర్రావు పేరు గల్లంతైంది. చనిపోయిన లింగేశ్వర్రావు తల్లి పేరు మాత్రం ఉంది. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెటిలర్స్ చాలా మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. -
వేములవాడలో వీధికుక్కల బీభత్సం
● రెండు రోజుల్లో 8 మందిపై దాడి వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని విద్యానగర్, భవానినగర్లో వీధి కుక్కల దాడిలో రెండు రోజుల్లో 8 మంది గాయపడ్డారు. గురువారం నాలుగేళ్ల హేమచంద్ర, పిట్టల మాధురి (30), కూర వీరమ్మ(45), ఎరుకల రాజమ్మ(60), శుక్రవారం మహమ్మద్ రజాక్(55), రాములు(38), నాగుల సత్యం(26)లను కరిచాయి. వీరందరిని కో–ఆప్షన్ సభ్యులు పీర్ మహమ్మద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. విద్యానగర్లో రాజమ్మ తన ఇంటి ముందు కూర్చోగా.. మనవరాలిపై కుక్క దాడికి యత్నించగా అడ్డుకోబోయింది. దీంతో కుక్క ఆమెను కరిచింది. ఉపాధి వేటలో సౌదీకి.. శవపేటికలో ఇంటికి ● 11 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లిన దాసు ● సుద్దాలలో విషాదం కోనరావుపేట(వేములవాడ): స్వగ్రామంలో ఉపాధి లేక భార్య, పిల్లలను సౌదీ బాట పట్టిన వలస జీవి 11 ఏళ్ల తర్వాత శవపేటికలో తిరిగివచ్చాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన దొబ్బల దాసు(46) 11 ఏళ్ల క్రితం సౌదీ వెళ్లాడు. ఒక్కసారి కూడా స్వగ్రామానికి రాలేదు. తల్లి, కూతురి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో డబ్బాంతా వారి వైద్య ఖర్చులకే సరిపోవడం లేదు. దీంతో అప్పులు తీర్చేందుకు అక్కడే ఉండిపోయాడు. ఈక్రమంలో గత జూన్ 17న గదిలో ఉండగా చాతిలో నొప్పి వస్తుందని స్నేహతులకు తెలపగా.. వారు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి తల్లి రత్నమ్మ, భార్య లక్ష్మి, కూతురు కీర్తన, కొడుకు ప్రసన్నకుమార్ ఉన్నారు. దాసు దహన సంస్కారాలకు చందాలు పోగు చేశారు. -
ఆపరేషన్లకే పరిమితం కాదు
కరీంనగర్: అనస్తీషియాలజీ అనేది ఆపరేషన్ థియేటర్కే పరిమితం కాదని, అత్యవసర వైద్యం, క్రిటికల్ కేర్, పెయిన్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో అత్యంత కీలకమని రాష్ట్ర అనస్తీషియా సంఘం అధ్యక్షుడు డాక్టర్ దేవులపల్లి ప్రవీణ్కుమార్ అన్నారు. శిశు శస్త్రచికిత్సల నుంచి గుండె, మెదడు, ఆర్థోపెడిక్, గైనకాలజీ వంటి అన్ని రకాల ఆపరేషన్లలో రోగి జీవక్రియలను ని యంత్రిస్తూ భద్రత కల్పించే బాధ్యత వీరిదేనన్నా రు. మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్యులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవా లని సూచించారు. శుక్రవారం కరీంనగర్లోని ఐఎంఏ హాల్లో రాష్ట్రస్థాయి అనస్తీషియాలజిస్టుల సద స్సు పోస్టర్ను ఆవిష్కరించారు. నగరంలో పలు ఆస్పత్రులలో లైవ్ సర్జరీలతో ఈ సదస్సు ప్రారంభమైంది. ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎనమల్ల నరేశ్ మాట్లాడుతూ.. ‘విజిలెన్స్– ఇన్నోవేషన్– పేషెంట్ సెంటర్డ్ ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్’ప్రధానాంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాంప్రదాయ ఉపన్యాసాలకు భిన్నంగా నగరంలోని రె నీ, సన్రైజ్, ప్రతిమ, చల్మెడ ఆస్పత్రుల్లో ఏకకాలంలో ఐదు ప్రత్యేక వర్క్షాప్లు ఏర్పాటు చేశామన్నా రు. మెకానికల్ వెంటిలేషన్, క్రిటికల్ కేర్, హీమోడైనమిక్ మానిటరింగ్, అల్ట్రాసౌండ్ గైడెడ్ రీజినల్ నర్వ్ బ్లాక్స్తో పాటు కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై జాతీయ, రాష్ట్ర స్థాయి నిపుణులు వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఈ వర్క్షాప్ ల్లో 250మంది పీజీ వైద్యులు పాల్గొన్నారు. కాగా, ఈ సదస్సుకు స్పాట్ రిజిస్ట్రేషన్లతో కలిపి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్లు నిర్వాహకులు తెలి పారు. ముఖ్య అతిథిగా కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ కె.రమేశ్రెడ్డి, గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రతిమ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ బోయినపల్లి హరిణి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.తకీయుద్దీన్ఖాన్, డీఎంహెచ్ఓ డాక్టర్ ధనసరి శ్రీరామ్ హాజరుకానున్నారని తెలిపారు. సంఘం తెలంగాణ కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.మహేశ్వర్రెడ్డి, ట్రెజరర్ టి.ఓంప్రసాద్, కరీంనగర్ అధ్యక్షుడు బి.వినయ్కుమార్, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ నిఖిల్ ముద్గల్కర్, కార్యదర్శి పి.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అత్యవసర వైద్యంలోనూ కీలకం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి రాష్ట్ర అనస్తీషియా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కరీంనగర్లో రాష్ట్రస్థాయి సదస్సు, వర్క్షాప్లు -
అయోమయంగా ఉంది
మాది వేములవాడలోని సాయినగర్. 1985 నుంచి ఇక్కడే ఉంటున్నాం. ప్రస్తుతం సర్(ఎస్ఐఆర్)తో తలనొప్పిగా ఉంది. 2002 ఓటర్ల జాబితాలో నాది(సాబీర్) పేరు మాత్రమే ఉందని ఒకే ఫామ్ ఇచ్చారు. నా కొడుకు(ఫైసల్) పేరు లేదని ఫామ్ ఇవ్వలేదు. మరో బీఎల్ఏ వద్ద ఉందంటున్నారు. వాళ్లని అడిగితే సరైన సమాధానం లేదు. – సాబీర్, ఫైసల్ పాషా, వేములవాడ ఫామ్ నింపడం ఇబ్బంది ఎస్ఐఆర్లో ఫామ్ ఇచ్చి వివరాలు నింపాలని చెప్పారు. అందులో 2002కు సంబంధించిన ఓటర్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు పత్రం ఉండాలని చెబుతున్నారు. ఫామ్లో వివరాలు నింపడం ఇబ్బందిగా ఉంది. ఎన్యూమరేటర్లు సహకరించాలి. లేకుంటే చాలా ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉంది. – బొడ్డు రాజలింగం, బోయినపల్లి -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.22వేల కోట్లు
కరీంనగర్ కార్పొరేషన్: తాను ఎంపీగా గెలిచినప్పటి నుంచి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.22 వేల కోట్లు తీసుకువచ్చానని, అందులో రూ.10 వేల కోట్లు రోడ్ల కోసమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. నగరపాలకసంస్థ 37వ డివిజన్ గాయత్రీ నగర్లో రూ.77 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు,డ్రైనేజీ నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అంతకుముందు షాషామహాల్ వద్ద ఓపెన్జిమ్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మరోవారం రోజుల్లో రూ.50 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులను నగరంలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మూడు నెలల్లో అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) పథకం కింద రూ.840 కోట్లతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పనులను ప్రారంభించబోతున్నామని తెలిపారు. డంప్యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని, ఇక అక్కడ చెత్త నిల్వ ఉండదన్నారు. హుజూరాబాద్లో డంప్యార్డ్కు తాము వ్యతిరేకమన్నారు. నగరంలో పార్కింగ్ సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.25 కోట్లతో మల్టిలెవెల్ పార్కింగ్ను నిర్మిస్తున్నామన్నారు. త్వరలో కరీంనగర్, జగిత్యాల హైవే పనులు ప్రారంభిస్తామని, గన్నేరువరం బ్రిడ్జి పనులకు శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. యూసీఎఫ్ నిధులపై మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా 17 ప్రాజెక్ట్లను మాత్రమే యూసీఎఫ్లో ఎంపిక చేశారని, రెండేళ్ల తరువాత తాము కరీంనగర్కు చోటు కల్పించామన్నారు. మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్దేశాయ్, స్థానిక కార్పొరేటర్ కేఏపీపీ చంద్ర పాల్గొన్నారు. మహిళలకు మోదీ కానుకతిమ్మాపూర్: దుర్గాబాయ్ మహిళా ప్రాంగణంలో ఇటీవల కుట్టు శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కేంద్రమంత్రి బండి సంజయ్, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కేంద్ర ప్రభుత్వ ‘మోదీ కానుక’ కార్యక్రమం ద్వారా ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. మహిళలకు విడతలవారీగా ఆటోలు అందిస్తామన్నారు. -
చూస్తే నోరూరే.. తింటే రోగాలే!
డేంజర్డ్రైనేజీలుముంబైలో భారీ వర్షాలకు ఓ వ్యక్తి మ్యాన్హోల్లో పడి కొట్టుకుపోయాడు. ఈ ఘటన పాలకుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతుండగా.. ఇప్పుడిప్పుడే కరీంనగరాన్ని వరుణుడు ముద్దాడుతుండగా.. మున్ముందు కురిసే భారీ వర్షాలతో మనమూ.. డ్రైనేజీ డేంజర్లో ఉన్నామనే సంకేతాలిస్తోంది. చిన్నవానకే నగరంలోని రోడ్లు చెరువును తలపిస్తుండగా.. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియని పరిస్థితి. జనసంచారం ఉన్న చోట డ్రైనేజీలు, మ్యాన్హోళ్లు నోళ్లు తెరుచుకుని ఉండగా.. భారీ వర్షం కురిస్తే ఎక్కడ ఏ గొయ్యి ఉందో చూసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ప్రధాన రహదారుల వెంట డ్రైనేజీలపై రక్షణ చర్యలు లేకపోగా.. భారీ వర్షాలకు పొంగిపొర్లే సమయంలో ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యులని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాంనగర్, మంకమ్మతోట, హౌసింగ్బోర్డుకాలనీ, కోర్టు ఏరియా, ఎస్సారార్ కాలేజీ రోడ్డుతో పాటు మంచిర్యాల చౌరస్తా ప్రాంతాల్లో డ్రైనేజీలు ప్రమాదకరంగా ఉండగా.. పాలకులు సమస్య పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్కరీంనగర్ అర్బన్: పాల డెయిరీల్లో నాణ్యత దేవుడెరుగు కల్తీ రాజ్యమేలుతోందని తెలుస్తోంది. రైతులను బూచిగా చూపుతూ విచ్చలవిడిగా యూరియాతో పాలు తయారు చేస్తున్నారని స్పష్టమవుతోంది. శుక్రవారం ‘సాక్షి’లో ‘డెయిరీకి యూరియా’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రైతుల పొలాలకు చేరాల్సిన యూరియా పలువురి హోల్సేల్ డీలర్ల అక్రమ వ్యవహారంతో పాల డెయిరీలకు చేరిందని ప్రస్తావించగా, జిల్లావ్యాప్తంగా చర్చకు దారి తీసింది. నాణ్యతతో పాల వ్యాపారం జరుగుతుందని సుద్దులు చెప్పే వ్యాపారులు మరి యూరియా బస్తాలు ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యూరియా వ్యవహారంపై కలెక్టర్ చిత్రామిశ్రా తీవ్రంగా పరిగణించారని సమాచారం. హోల్సేల్ డీలర్ల యూరియా నిల్వలు, విక్రయాలపై సమగ్ర నివేదిక కోరినట్లు తెలుస్తోంది. యూరియా అక్రమ రవాణాపై ‘సాక్షి’లో కథనం రావడంపై మీడియాకు ఎవరు సమాచారమిచ్చారని అంతర్గతంగా ఆరా తీస్తూ అనుమానితులను కొందరు బెదిరింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. ఎవరికేం కాదు తానే అన్నీ చూసుకుంటానని, ఓ అధికారి భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. డీఏపీ కృత్రిమ కొరతపై కలెక్టర్ ఆరా తీయగా ఎక్కడా కొరత లేకుండా, ఎంఆర్పీ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖను ఆదేశించినట్లు సమాచారం.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో కల్తీ ఆహారం ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ కల్తీ హోటళ్లు, టిఫిన్సెంటర్లు అయితే బాధితులు వందల్లో ఉంటారు. కానీ, ఆహార పదార్థాలు తయారుచేసి ప్యాక్ చేసి విక్రయించే పరిశ్రమలు వేలాదిమందికి విషాహారం పంచిపెడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఫుడ్సేఫ్టీ అధికారులు, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా రామడుగు మండలం దేశ్రాజ్పల్లిలో నిర్వహించిన దాడిలో పెద్దఎత్తున కల్తీ పదార్థాలు పట్టుకోగా.. రెడీమేడ్ ఆహార పదార్థాల వినియోగంలోని ప్రమాదాన్ని చాటిచెప్పింది. గతంలో కల్తీ కారం, టీపొడి, పసుపు, నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ల పరిశ్రమలపై దాడులు జరగగా.. మిల్మేకర్ వంటి ప్రీమియం బ్రాండ్ల రూపంలో చలామణి అవుతున్న పలు ఉత్పత్తుల నాణ్యతపై సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఇదే సమయంలో జిల్లాలో ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలు పా టిస్తూ.. ఓపెన్ కిచెన్లో వంట చేస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. మిగిలిన వాటిలో కిచెన్ వైపు తొంగిచూడకపోవడమే నయం. పుట్టగొడుగుల్లా.. పిల్లల ఉత్పత్తులు కరీంనగర్ శివారులో తయారవుతున్న పలు తినుబండారాల ఉత్పత్తుల్లో పిల్లలను లక్ష్యం చేసుకుని సాగుతున్న దందా చాలాపెద్దది. రోజూ రూ.లక్షల్లో ఈ వ్యాపారం సాగుతుంది. ఉదయం తినే బ్రెడ్ దగ్గర నుంచి స్నాక్స్, చిప్స్, చాక్లెట్లు, స్వీట్లు తయారు చేసి విక్రయిస్తున్న పలు కంపెనీలు ప్రమాణాలు పాటించడం లేదు. ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సంస్థ అనుమతి తీసుకుంటున్నా ఆ మేరకు ఆహార ఉత్పత్తుల నాణ్యత ఉండడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు జరిపిన ప్రతీసారి బయటపడుతూనే ఉంది. అనేక రకాల ప్యాకేజ్డ్ ఫుడ్స్లో పరిశ్రమలు అనుమతి లేని కలర్ ఏజెంట్లు, కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, కల్తీ నూనెలు వాడుతున్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలంలో పిల్లలకు జీర్ణాశయ సమస్యలతోపాటు, కిడ్నీ, కేన్సర్ వంటి రోగాలకు కారణమవుతాయని తెలిసినా.. ఫుడ్సేఫ్టీ అధికారులు పూర్తిస్థాయిలో నిఘా పెట్టకపోవడం వల్ల వీరి వ్యాపారం వర్థిల్లుతోంది. ముఖ్యంగా బేకరీల్లోని కేకుల్లో వాడే కలర్ ఏజెంట్లు కేన్సర్ కారకాలని తెలిసినా వాటి వినియోగంపై నియంత్రణ లేకపోవడం దురదృష్టకరం. గతేడాది నుంచి 350 దాడులు మరోవైపు ఫుడ్సేఫ్టీ అధికారులు గతేడాది అక్టోబరు నుంచి జూన్ వరకు దాదాపు 350 దాడులు నిర్వహించారు. ఇందులో పరిశ్రమలు, పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీటు షాపులు ఉన్నాయి. వీటిలో 100వరకు శాంపిళ్లను సేకరించి ల్యాబ్కు పంపగా అందులో 20వరకు శాంపిళ్లలో పూర్తిగా నాణ్యత లోపించిందని అధికారులు తెలిపారు. వీరిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ 13 మందికి రూ.5 లక్షల జరిమానా విధించి కొరడా ఝుళిపించడం గమనార్హం.జిల్లాలో పలుచోట్ల ఆహార ఉత్పత్తుల కల్తీపై మాకు ఫిర్యాదులు అందుతున్నాయి. మీరు కొనుగోలు చేసిన ప్యాకేజ్డ్ లేదా ఇతర ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తే ఉపేక్షించకండి. వెంటనే మాకు 70320 87727 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించండి. మున్ముందు కల్తీ ఆహార పదార్థాల ఉత్పత్తి కేంద్రాలపై దాడులను మరింత ముమ్మరం చేస్తాం. – రోహిత్రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్కల్తీ ఆహారమా.. ఫిర్యాదు చేయండి 70320 87727 -
బీఆర్ఎస్ హయాంలోనే చేనేత సంక్షేమం
కొత్తపల్లి: కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకా రోత్సవానికి శుక్రవారం ముఖ్యఅతిథిగా హాజ రయ్యారు. తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్న ఏకై క ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నా రు. 17,18 డివిజన్ల కార్పొరేటర్లు వేముల కవి త, వాసాల రమేశ్, సంఘం అధ్యక్షుడు మునీందర్, ఉపాధ్యక్షుడు చంద్రమౌళి పాల్గొన్నారు. ఈవీఎం గోదాం ఆకస్మిక తనిఖీకరీంనగర్ అర్బన్: ఈవీఏం గోడౌన్ను అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టరేట్ వెనుకాల గల గోడౌన్ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గోదాం వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీశారు. ఈవీఎం గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ ఎన్.రాజేశ్ వివిధ పార్టీల ప్రతినిధులు మడుపు మోహన్, నాంపల్లి శ్రీనివాస్, సత్తినేని శ్రీనివాస్, మజీద్ హుమైన్ సయ్యద్ ఇబ్రహీం, ఎర్రవెల్లి రవీందర్, నరేష్, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. కరీంనగర్సిటీ: ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల పీజీ మొదటి, మూడో సెమిస్టర్ ఫలి తాలను శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ కల్వ కుంట రామకృష్ణ, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తిరుకోవెల శ్రీనివాస్ విడుదల చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పీజీ మొదటి సెమిస్టర్లో 233మంది పరీక్షలు రాయగా 213 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. మూడో సెమిస్టర్లో 246మందికి 215 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. వెబ్సైట్లో తమ ఫలితాలు చూసుకోవచ్చన్నారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్ టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్రెడ్డి, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి ఎం.మల్లారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: రిజర్వాయర్లు, చెరువుల్లో ఆగస్టు 31వరకు చేపల వేట నిషేధమని జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి స్పష్టం చేశారు. ఈ కాల పరిమితిలో తల్లి చేపలు సహజంగా ప్రేరణ పొంది కోట్ల సంఖ్యలో సంతానోత్పత్తి జరుగుతుందని వివరించారు. అందువల్ల ఈ నెల 1నుంచి చేపల వేటను నిషేధించామని లైసెన్స్దారులు, మత్స్యకారులు చేపలు, రొయ్యలు పట్టవద్దని వెల్లడించారు. ఒకవేళ నిబంధనను విస్మరించి, చేపల వేట చేపడితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. కరీంనగర్ అర్బన్: మత్స్యకారులకు రాయితీపై వాహనాలను ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి విజయభారతి తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా చేపలు, చేప ఆధారిత ఉత్పత్తుల విక్రయానికి రెండు సంచార చేపల అమ్మక వాహనాలను కేటాయించినట్లు వివరించారు. సదరు యూనిట్లను 40శాతం రాయితీపై ఇవ్వనున్నామని, ఆసక్తిగల మత్స్యకారులు ఈ నెల 18లోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. చేపల అమ్మకంలో అనుభవం, స్వయం సహాయక సంఘంలో సభ్యులై ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని తెలిపారు. రూ.10లక్షల విలువ గల వాహనం 40శాతం రాయితీతో వస్తుందని వివరించారు. -
‘కాళేశ్వరం’ మరమ్మతు ఏమైంది?
మానకొండూర్: కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు మరమ్మతు చేయడం లేదో చెప్పాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ.రామకృష్ణారావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయరమణరావు మాజీ మంత్రి హరీశ్రావుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మానకొండూర్లో శుక్రవారం మాట్లాడుతూ విజయరమణరావు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలని సూచించారు. ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన ఉత్తర్వులను పూర్తిగా చదివి మాట్లాడాలని హితవు పలికారు. కేటీఆర్, హరీశ్ బీఆర్ఎస్కు రెండు కళ్లలాంటి వారని, చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరి తోక ముడిచారన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్గౌడ్, శాతరాజు యాదగిరి పాల్గొన్నారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం31.0/25.0శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 20267వర్షంలోనూ భీమన్న దర్శనంవేములవాడ: భీమన్నను శుక్రవారం 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు చేశారు. వర్షం కురుస్తున్నా భక్తులు రాక కొనసాగింది.సంకష్టహర చతుర్థి పూజలువిద్యానగర్: సంకష్టహర చతుర్థి సందర్భంగా శుక్రవారం నగునూర్లోని దుర్గాభవానీ ఆలయంలో ల క్ష్మిగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అభిషేకం, ఫలపంచామృతాభిషేకం నిర్వహించారు. -
బెల్ట్ దుకాణాలపై ఉక్కుపాదం
కరీంనగర్రూరల్: మద్యపాన నిషేధం దిశగా కరీంనగర్ మండలం ఎలబోతారం గ్రామపంచాయతీ అడుగులేస్తోంది. ఈనెల ఒకటో తేదీ నుంచి గ్రామంలోని మద్యం బెల్ట్షాపులపై నిషేధం విధించారు. ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.60వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. ఎలబోతారంలో నాలుగు బెల్ట్షాపులున్నాయి. నగునూరు, తీగలగుట్టపల్లిలోని మద్యం దుకాణాల నుంచి స్టాక్ తీసుకొస్తుంటారు. రాత్రిపగలు తేడాలేకుండా విక్రయిస్తున్నారు. కొందరు ఆరుబయట సిట్టింగ్లు నిర్వహిస్తుండటంతో అర్ధరాత్రివరకు మద్యం ప్రియుల రాకపోకలు, గొడవలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు భర్తలు తాగి వచ్చి భార్యలను కొట్టడం, యువకులు గొడవలకు దిగడంతో ప్రశాంత వాతావరణం కో ల్పోయిందనే ఉద్దేశంతో సర్పంచ్ తప్పట్ల రాజు బెల్ట్షాపులపై నిషేధం ప్రకటించారు. బుధవారం నుంచి బెల్ట్ దుకాణాలు మూసివేయాలని ఉపసర్పంచ్ గోపాల్, వార్డుసభ్యులతో చర్చించి నిర్ణయించారు. నలుగురు బెల్ట్షాపు నిర్వాహకులకు ఇక నుంచి గ్రామంలో మద్యం విక్రయించరాదని, ఒకవేళ అమ్మినట్లయితే రూ.60వేల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. విక్రయించినవారిని పట్టించినవారికి రూ.2వేల నగదు బహుమతి ప్రకటించారు. -
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. -
వ్యవసాయ బావిలో 24 గంటలు
కరీంనగర్ జిల్లా: నీటిలో గంటసేపు ఉంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటిది వ్యవసాయబావిలో 24 గంటలపాటు నరకం అనుభవించిందో మహిళ. బావి యజమాని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. కరీంనగర్ కిసాన్నగర్కు చెందిన లక్ష్మి అడ్డా కూలీ. నిత్యం నగరంలోని టవర్ సర్కిల్ వద్ద ఉన్న లేబర్ అడ్డా వద్దకు పని కోసం వస్తుంది. బుధవారం ఉదయం కూడా అడ్డా మీదకు వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి పని ఉందని పిలిచాడు. రాపిడో బైక్ బుక్ చేసి తిమ్మాపూర్ స్టేజీ వరకు పంపించాడు. మరో బైక్పై వెనకే వెళ్లాడు. తిమ్మాపూర్ నుంచి తన బైక్ ఎక్కించుకొని నుస్తులాపూర్ శివారులోని ఓ రైతు వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను బెదిరించి, ఒంటిపై ఉన్న బంగారం లాక్కొని, బావిలోకి తోసేశాడు. లక్ష్మికి ఈత రావడంతో దరికి చేరి తాడు పట్టుకుంది. ఆ తాడును కోసేసి అతను అక్కడి నుంచి పరారయ్యాడు. బావిలో దొరికిన మరో ఆసరాతో బుధవారం రాత్రంతా, గురువారం మధ్యాహ్నం వరకు లక్ష్మి బావిలోనే ఉండిపోయింది. మిస్సింగ్ కేసు నమోదుతో.. బుధవారం రాత్రయినా ఇంటికి రాకపోవడంతో లక్ష్మి కొడుకు కరీంనగర్లోని త్రీటౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఉదయం లేబర్ అడ్డా వద్ద తన తల్లిని డ్రాప్ చేశానని, ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా లక్ష్మి నుస్తులాపూర్ ఏరియాలో ఉన్నట్టు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం వ్యవసాయ బావివద్దకు వెళ్లిన పొలం యజమానికి బావిలోంచి అరుపులు వినిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు బావి వద్దకు చేరుకొని మహిళను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. రాపిడో బుక్ చేసిన వివరాలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
మక్కల లోడుతో వెళ్తున్న లారీబోల్తా
గంగాధర: కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి మండలంలోని కురిక్యాల గ్రామ శివారులో గురువారం లారీ బోల్తాపడింది. జగిత్యాల నుంచి కరీంనగర్కు మక్కల లోడుతో వెళ్తున్న లారీ కురిక్యాల శివారులోని మూల మలుపు వద్ద అదపుతప్పింది. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. చెక్బౌన్స్ కేసులో న్యాయవాదికి ఏడాది జైలు పెద్దపల్లిరూరల్: చెక్ బౌన్స్ కేసులో పెద్దపల్లి బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది నర్సింగంకి ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.15లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ గురువారం జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. ఈ కేసు విషయమై గతంలో సుల్తానాబాద్ కోర్టు ఏడాది జైలుతో పాటు ఫిర్యాదుదారునికి రూ.15లక్షలు చెల్లించాలని ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నర్సింగం జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విని కేసు పూర్వపరాలు పరిశీలించి, గతంలో ఇచ్చిన తీర్పులో చట్టపరమైన లోపం లేదని జిల్లా జడ్జి పేర్కొన్నారు. క్రిమినల్ అప్పీల్ను కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును యధాతథంగా అమలు చేయాలని పేర్కొన్నారు. చీటింగ్ కేసులో నిందితుడి అరెస్టు కరీంనగర్క్రైం: కరీంనగర్లోని రాంనగర్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరుకుటి మల్లేశంను నమ్మించి కేసు పరిష్కారం చేస్తానని రూ.7.5లక్షలు తీసుకొని మోసం చేసిన కేసులో ఇల్లంతకుంట మండలం నర్సక్కపేట గ్రామానికి చెందిన బి.తిరుపతిని అరెస్ట్ చేశామని టూ టౌన్ పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మల్యాల మధును ఇప్పటికే అరెస్టు చేశారు. విద్యుదాఘాతంతో పశువు మృతికథలాపూర్: సిరికొండలో గురువారం సాయంత్రం విద్యుదాఘాతంతో ఓ గేదె మృతిచెందినట్లు సర్పంచ్ ముదాం రవి తెలిపారు. సిరికొండ గ్రామ శివారులో పచ్చి గడ్డిని గేదెలు మేస్తున్న క్రమంలో సమీపంలో ఉన్న విద్యుత్ తీగలను తాకడంతో ఓ గేదె మృతిచెందిందని బాధిత రైతు కొడిపెల్లి లింగారెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. రూ.80వేల విలువైన గేదెను కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు. శివారులోని కార్గిల్లేక్ చెరువులో గురువారం మృతదేహం తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు వెళ్లి బయటకు తీయించారు. మృతుడి వద్ద వివరాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు సుమారు 30 నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉంటాడని, టీషర్ట్ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని సిరిసిల్ల మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు. గోదావరిలో మృతదేహం లభ్యంమంథని: మంథని వద్ద గోదావరి నదిలో ఆసంపల్లి కొమురయ్య(50) మృతదేహం గురువారం లభ్యమైంది. మున్సిపాలిటీ పరిధిలోని శ్రీపాదకాలనీకి చెందిన కొమురయ్య బుధవారం గోదావరినదికి స్నానం కోసమని వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. ఆచూకీ కోసం వెతుకగా నదిలో మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. కొమురయ్య కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దరఖాస్తుల ఆహ్వానంతిమ్మాపూర్: మహాత్మా జ్యోతిబాపులే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు ఒప్పంద ప్రతిపదికన పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అంజలి తెలిపారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూ, డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ, బీఈడీ పూర్తిచేసి ఉండాలని, ఈనె 8న తిమ్మాపూర్లోని జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో ఉదయం 10 గంటలు ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెట్టుబడుల పేరిట రూ.7కోట్ల మోసంకరీంనగర్క్రైం: కరీంనగర్ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టుబడుల పేరుతో సుమారు 100 నుంచి 110 మంది బాధితుల నుంచి రూ.6కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు సేకరించి, మోసానికి పాల్పడిన మొలుగూరి సురేశ్ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రారంభంలో లాభాలు చెల్లించి, అనంతరం భారీగా పెట్టుబడులు సేకరించిన సురేశ్, ఫారెక్స్ ట్రేడింగ్, క్రిప్టోకరెన్సీ, ఆన్లైన్ నెట్వర్క్ మార్కెటింగ్లో నష్టపోయినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కొత్త పెట్టుబడిదారుల నుంచి తీసుకున్న డబ్బుతో పాత వారికి చెల్లింపులు చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. -
విద్యాబోధన బాగుందని..
గుండారం(కమాన్పూర్) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా బోధన బాగుందని తెలియడంతో మా తల్లిదండ్రులతో వచ్చి తెలుసుకున్న. క్లాస్ రూంలు, సౌకర్యాలు బాగుడటంతో ఎంపీసీలో చేరా. – ఎం.హర్షిత్ రాఘవపూర్, పెద్దపల్లి మండలం కళాశాల ఏర్పాటైన నాటి నుంచి ఇంటర్లో విద్యార్థులు సాధిస్తున్న మంచి ఫలితాలను చూసి కళాశాలలో చేరా. ఇక్కడ రెగ్యూలర్ ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేస్తున్నారు. – కె.సహజ ఆదివారంపేట, రామగిరి మండలం ప్రైవేటు కళాశాలలో లేని విధంగా ఈ కళాశాలలో డిజిటల్ క్లాస్లు, నీట్, ఎప్సెట్ క్లాస్లు ఉన్నాయి. ప్రైవేటుకు దీటుగా కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. – సహస్ర, రాఘవపూర్, పెద్దపల్లి మండలం -
పోక్సో కేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్రూరల్: బాలికపై అత్యాచారం ఘటనలో పోక్సో కేసు నమోదైన నిందితుడిని గురువారం కరీంనగర్రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం మానకొండూరు మండలం జగ్గయ్యపల్లెకు చెందిన ఆటోడ్రైవర్ గనుకుండ్ల మురళీకృష్ణ రెండేళ్ల నుంచి ఒక బాలికను కళాశాలకు ఆటోలో తీసుకెళ్తూ ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి స్వగ్రామంలోని ఇంటికి తీసుకెళ్లాడు. మురళీకృష్ణకు వివాహమై కుమార్తె ఉన్నట్లు తెలుసుకున్న బాలిక అతడికి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో గత నెల 29న బలవంతంగా ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పెద్దపల్లి జిల్లా నీరుకుల్ల సమ్మక్క గద్దెల వద్దకు తీసుకెళ్లాడు. చంపుతానని బెదిరించి అత్యాచారం చేశాడు. మరుసటిరోజున బాలిక రూరల్పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. గురువారం బొమ్మకల్ శివారులో మురళీకృష్ణ ఉన్నాడనే సమాచారంతో సీఐ నిరంజన్రెడ్డి అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ద్విచక్రవాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. మురళీకృష్ణపై గతంలో వరకట్న వేధింపులు, వన్టౌన్ పోలీస్స్టేషన్లో పోక్సో కేసు ఉందన్నారు. -
శాతవాహన యూజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల
కరీంనగర్ సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ 2026లో జరిగిన అండర్ గ్రాడ్యుయేట్ యూజీ ఆరో సెమిస్టర్(రెగ్యులర్–బ్యాక్లాగ్), నాలుగో సెమిస్టర్(రెగ్యులర్–బ్యాక్లాగ్), రెండో సెమిస్టర్(బ్యాక్లాగ్) పరీక్షల ఫలితాలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పి.సతీశ్కుమార్, ఓఎస్డీ టు ివీసీ డా.హరికాంత్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.సురేశ్కుమార్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారులు డా.శ్రీవాణి, డా.రమాకాంత్, డీన్, కాలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ డాక్టర్ జాఫర్ విడుదల చేశారు. ఆరో సెమిస్టర్ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ పరీక్షలకు 9,361 మంది హాజరవగా.. 4,721 మంది ఉత్తీర్ణత సాధించారు. బీబీఏ 65 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలిచింది. నాలుగో సెమిస్టర్ పరీక్షలకు 7,902 మంది హాజరవగా.. 3,536 మంది ఉత్తీర్ణత సాధించారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. ఫలితాల అనంతరం రీవాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్, జవాబు పత్రాల నకలు(జిరాక్స్ కాపీ) పొందాలనుకునే అర్హులైన విద్యార్థులు తమ సంబంధిత కాలేజీల ద్వారా ఆన్లైన్ విధానంలో ఈనెల 12 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
పల్లె ఆత్మను ఆవిష్కరించిన ‘సీతక్క బంగుల’
సిరిసిల్ల: ఉద్యమాల ఖిల్లా సిరిసిల్ల. నిత్య చైతన్యానికి ప్రతీక. ఇక్కడి మట్టి పరిమళాలను, చెట్టూ... పుట్టను.. కళ్లారా చూసిన ఆ యువకుడు పల్లెను.. ఆ పల్లె ఆత్మను ఆవిష్కరించేందుకు సిడ్నీ(ఆస్ట్రేలియా)లో ఉంటూ కలలు కన్నాడు. ఆ కలలను నిజం చేసేందుకు ‘సీతక్క బంగుల’ ఓ ఆటో డ్రైవర్ ప్రేమకథ పేరుతో పాటను చిత్రీకరించాడు. సిరిసిల్ల ప్రాంతమే అందుకు వేదికై ంది. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన సుతారి మధుకర్(మ్యాడీ సీడ్నీ) ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. తను పుట్టి పెరిగిన నేలను, తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని శాశ్వతం చేసేందుకు జానపదాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ వాతావరణాన్ని, తెలంగాణ పల్లెను ఆత్మీయ బంధాలను పొందుపరుస్తూ ఓ దృశ్యగీతాన్ని మధుకర్ అందించారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి ప్రాంతాల్లోని ప్రకృతి అందాలను పాటలో చిత్రీకరించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. నా మనసు ఎప్పుడూ నా తెలంగాణ పల్లె చుట్టూనే తిరుగుతుందని చెబుతూ.. మధుకర్(మ్యాడీ సీడ్నీ) మన పల్లె కథను అల్లుకున్నానని వివరించారు. ‘సీతక్క బంగుల’ నా తొలి అడుగని, మరిన్ని తెలంగాణ జానపదాలను రూపొందించేందుకు ముందు ముందు కృషి చేస్తానని పేర్కొన్నారు. మధురం డిజిటల్ యూ ట్యూబ్ చానల్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం ‘సీతక్క బంగుల’ విడుదల అవుతుందని మధుకర్ తెలిపారు. తెలంగాణ జానపదాన్ని ప్రపంచానికి అందించేందుకు మధుకర్ చేసిన కృషిని అభినందించాల్సిందే. సిరిసిల్ల చుట్టూ సిడ్నీ యువకుడి షూటింగ్ నేడు విడుదలవుతున్న జానపదం -
ధర్మపురిలో చోరీ
● బంగారం, వెండి ఆభరణాలు అపహరణ ధర్మపురి: కుటుంబమంతా పైఅంతస్తులో నిద్రిస్తుండగా కింది అంతస్తులో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన ఘటన ధర్మపురిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు కథనం ప్రకారం.. పట్టణంలోని హన్మాన్వాడకు చెందిన రాపర్తి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి ఇంటి పైఅంతస్తులో పడుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కింది అంతస్తులోని గదిలోకి చొరబడి కప్బోర్డు పగులగొట్టి రెండు తులాల బంగారం, పది తులాల వెండి గొలుసులు, రూ.15వేల నగదు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహేశ్ ఘటన స్థలానికి చేరుకుని ఆరా తీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ప్రభుత్వ కళాశాలకు జై
కమాన్పూర్(మంథని): పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలంలోని గుండారం (కమాన్పూర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పడిన నాటి నుంచి ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఈ కళాశాలలో చేర్పించేందుకు ముందుకొస్తున్నారు. ఈ ఏడాది కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో 90 మంది బాలురు, 63 మంది బాలికలు అడ్మిషన్లు తీసుకున్నారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు గుండారం (కమాన్పూర్) ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటైన నాటి నుంచి ప్రతీ విద్యా సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. పలుమార్లు జిల్లా, రాష్ట్రస్థాయిలో ర్యాంకులు సాధించిన సందర్భాలున్నాయి. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ఇక్కడ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన డిజిటల్ విద్యా బోధన, కంప్యూటర్ ల్యాబ్, ఎఫ్సెట్, నీట్ క్లాస్లు, విశాలమైన భవనం, రెగ్యూలర్ ఉపాధ్యాయులతో అత్యత్తమైన విద్యా బోధనను అందిస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు చూడకుండా ప్రతీ ఎడాది ఈ ప్రభుత్వ కళాశాలలో చేర్పించడానికి ముందుకు వచ్చి అడ్మిషన్లు తీసుకొని వివిధ కోర్సుల్లో చేరుతున్నారు. ఈ ఏడాది అడ్మిషన్లలో జిల్లాలోనే ప్రథమ స్థానం, ఉమ్మడి జిల్లాలో నాల్గో స్థానంలో నిలిచింది. కమాన్పూర్ కళాశాలలో 152 అడ్మిషన్లు జిల్లాలో ప్రథమ, ఉమ్మడి జిల్లాలో నాల్గో స్థానం ఆసక్తి చూపిస్తున్న విద్యార్థులు విద్యార్థులకు అనుజ్ఞులైన రెగ్యూలర్ ఉపాధ్యాయులతో విద్యా బోధన చేస్తున్నాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. డిజిటల్ క్లాస్లు, కళాశాలలో నీట్, ఎపసెట్ క్లాస్లు నిర్వహిస్తున్నాం. – కాశిమల్ల సుధాకర్ ప్రిన్సిపాల్ -
భూ వివాదంలో దాడి
● ట్రాక్టర్ను బావిలో పడేసిన వైనం చందుర్తి(వేములవాడ): అన్నదమ్ముల మధ్య వివాదంలో ఉన్న భూమిలో ట్రాక్టర్తో దున్నుతున్న వ్యక్తిపై తమ్ముడు దాడి చేశాడు. అంతేకాకుండా ఆ ట్రాక్టర్ను వ్యవసాయబావిలో పడేసిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు. చందుర్తి మండల కేంద్రానికి చెందిన మార్త మల్లేశం, మార్త లక్ష్మీరాజం అన్నదమ్ములు. వీరి మధ్య నాలుగేళ్లుగా తల్లిదండ్రుల ఆస్తి పంపకాల్లో పంచాయితీలు కొనసాగుతున్నాయి. వివాదంలో ఉన్న భూమిలో అన్న మల్లేశం గురువారం ట్రాక్టర్తో దున్నించాడు. గమనించిన తమ్ముడు ట్రాక్టర్తో దున్నేందుకు వచ్చిన మేడిశెట్టి శంకర్కు, తమ్ముడు లక్ష్మీరాజం పరస్పరం దాడి చేసుకున్నారు. అంతేకాకుండా అన్న మల్లేశంను దూషించి, దాడి చేశాడు. ట్రాక్టర్ను వ్యవసాయ బావిలో పడేశాడు. ఈమేరకు అన్న మల్లేశం ఫిర్యాదుతో తమ్ముడు మార్త లక్ష్మీరాజంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రమోద్రావు తెలిపారు. -
ముత్తారంలో క్షుద్రపూజల కలకలం
ముత్తారం: మండలంలోని మల్యాల లక్ష్మీ దేవేందర్ వార్డు మెంబర్ ఇంటి ఎదుట రోజులుగా చేస్తున్న క్షుద్ర పూజలు గురువారం కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తెల్లవారు జామున నిమ్మకాయలు పెట్టడంతో పెంపుడు కుక్క అరవడంతో వెనుదిరిగారు. మరుసటి రోజు పెంపుడు కుక్క అరవకుండా చేసి వెంట్రుకలు వీరబోసిన మట్టితో తయారు చేసిన మూరేడు బొమ్మ కనిపించడంతో కుటుంబసభ్యులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని దేవేందర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై రవికుమార్ తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. క్షుద్రపూజలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు, స్థానికులు ఎస్సైని కోరారు. గ్రామ సర్పంచ్ సుదాడి రవీందర్రావు, పోలీసులు పోచమ్మను కొలిచే రవిని పిలిపించి తీయించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాలలో.. జగిత్యాలక్రైం: జగిత్యాలలోని పోచమ్మవాడలో నడి రోడ్డుపై క్షుద్ర పూజల ఆనవాళ్లు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి పసుపు, కుంకుమ, బియ్యం, నిమ్మకాయలు, బొమ్మ, జీడిగింజలు, అన్నంతో తయారు చేసిన ముద్దలు పెట్టడం చర్చనీయాంశమైంది. ఉదయం చూసిన ప్రజలు భయాందోళన చెందారు. -
అబద్ధాలాడందే హరీశ్కు నిద్రపట్టదు
కరీంనగర్ కార్పొరేషన్: ప్రతీరోజు వంద అబద్దాలు ఆడందే బీఆర్ఎస్ నేత హరీష్రావుకు నిద్రపట్టదని, తెలంగాణకు అసలైన ఎల్నినో ఆయనేనని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ధ్వజమెత్తారు. అబద్దాలల్లో పోటీపెడితే దేశంలోనే కేసీఆర్, హరీష్రావు ,కేటీఆర్లు మొదటి మూడు స్థానాల్లో ఉంటారని ఎద్దేవాచేశారు. గురువారం నగరంలోని ఆర్అండ్ బీ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మామ ఇంజినీర్, అల్లుడు సబ్ ఇంజినీర్ అయి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు రెండేళ్లు కూడా గడవక ముందే కుంగి పోయాయన్నారు. దీనికి కారకులెవరో హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారితీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ముందడుగు వేస్తుందని, ఇప్పటికే కొన్ని మరమ్మతు పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. తెలంగాణకు అసలైన ఎల్నినో హరీష్రావేనని, వర్షాలు కురవద్దు ప్రాజెక్టులు నిండొద్దని కోరుకుంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు ద్వారా ఫస్ట్ ఫేజ్లోనే 5 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తుచేశారు. కానీ... కాళేశ్వరం పేరుతో కట్టిన లిఫ్టుల ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం 50 వేల ఎకరాలకై నా నీళ్లిచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇక్కడి నీళ్లను మెదక్ జిల్లాలోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు తరలించుకుపోయి సొంత భూములను తడుపుకున్నారని ఆరోపించారు. ఏకకాలంలో రూ.21 వేల కోట్లు కేటాయించి 25 లక్షల మందికి పైగా రైతులకు రుణమాఫీ చేశామని, లబ్ధిపొందిన రైతులు మళ్లీ బ్యాంకులకు వెళ్లి కొత్త రుణాలు తెచ్చుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఇలా ఏకకాలంలో రుణమాఫీ జరిగి, మళ్లీ లోన్లు తెచ్చుకున్న ఒక్క రైతునైనా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూపించగలరా అని సవాల్ విసిరారు. ఇప్పటికే మూడు ఎకరాల లోపు ఉన్న రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా రైతు భరోసా నిధులు విడుదల చేశామని అన్నారు. మరో వారం రోజుల్లో మిగతా రైతులందరికీ రూ. 9 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబోతున్నామన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు, పడాల అజయ్ గౌడ్, మెతుకు కాంతయ్య, చెల్లొజ రాజు, చిలుక సతీశ్ పాల్గొన్నారు. -
● ఘనంగా సందల్ షరీఫ్
కరీంనగర్కల్చరల్/విద్యానగర్/తిమ్మాపూర్: అలుగునూర్ పరిధిలోని కేబుల్ బ్రిడ్జి పక్కనున్న హజరత్ షేర్ అలీ బాబా రహ్మతుల్లా అలైహి 63వ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలో షాసాహబ్ మొహళ్ల నుంచి ముస్లింలు, దర్గా వ్యవస్థాపకురాలు దివంగత హజ్రత్ హజీరాబి, కుమారుడు హసన్ వారసుడైన అబ్దుల్ వసీం బారీ, ఫైజ్ఖాన్ ఆధ్వర్యంలో ర్యాలీగా సందల్ గ్రంథ లేపనం, ప్రత్యేక చాదర్ హజ్రత్ షేర్ అలిబాబా రహ్మతుల్లా అలైహి సమాధికి సమర్పించారు. సీపీ గౌస్ ఆలం దర్గాను సందర్శించారు. ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కరీంనగర్, మానకొండూర్, నుస్తులాపూర్, ఎల్ఎండీకాలనీ, చింతకుంట ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. -
ధన్గర్వాడీ పాఠశాలలో అన్నా, అక్క మెంటర్షిప్
కరీంనగర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘అన్నా అక్క మెంటర్షిప్’ ఏఐ, డిజిటల్ లెర్నింగ్ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను కరీంనగర్లోని ధన్గర్వాడీ పాఠశాలలో గురువారం ఎస్సారార్ కళాశాల ప్రిన్సి పాల్ కల్వకుంట రామకృష్ణ ప్రారంభించారు. ఎస్సారార్ కళాశాలకు చెందిన 5వ సెమిస్టర్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్పై మార్గదర్శనం చేస్తారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.ప్రమోద మాట్లాడుతూ డిగ్రీ విద్యార్థులు పాఠశాల విద్యార్థులకు ఏఐ టూల్స్పై మార్గదర్శనం చేయడం అభినందనీయమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, కా మర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ సురేందర్ రెడ్డి, నోడల్ అధికారులు మధు, రాజేశ్ పాల్గొన్నారు. 4న మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లుసప్తగిరికాలనీ(కరీంనగర్): కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో టీజీ పాలిసెట్–2026 ఫేజ్ 1, 2, ఇంటర్నల్ స్లీడింగ్ అనంతరం మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభా రాణి తెలిపారు. స్పాట్ అడ్మిషన్లో సీట్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. వెంటనే మొదటి సంవత్సరం ట్యూషన్ ఫీజు రూ.5,080 చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్పా ట్ అడ్మిషన్ పొందినవారికి ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ వర్తించవని తెలిపారు. డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఇవ్వాల్సిందేకరీంనగర్ అర్బన్: డిఫాల్ట్ మిల్లర్లు బకాయి ఇవ్వాల్సిందేనని టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ చాంబర్లో డిఫాల్ట్ మిల్లర్లు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వందశాతం బియ్యం, 25శాతం పెనాల్టీ వసూలు, రబీ 2022–23లో వేలం వేసిన వడ్ల రికవరీపై సమీక్షించారు. బాకీ ఉన్న బియ్యం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వాలని మిల్ల ర్లను ఆదేశించారు. విస్మరిస్తే చట్టపరమైన చర్యలతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ఎం. రజనీకాంత్, డీఎస్వో నర్సింగరావు, సివిల్ సప్లయ్ డీటీలు సురేందర్, ఖాజా, అన్వర్ పాల్గొన్నారు. దివ్యాంగులకు సేవ అదృష్టంకరీంనగర్టౌన్: దివ్యాంగ పిల్లలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని, వారికి సదుపాయాలు సకాలంలో అందేలా చూడాలని డీఈవో ఎన్.ప్రశాంత్రెడ్డి సూచించారు. జిల్లాకేంద్రంలోని ధన్గర్వాడీ పాఠశాలలోని భవిత కేంద్రంలో గురువారం విలీన విద్యా రిసోర్స్ సమీక్ష నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ భవిత కేంద్రానికి రాలేని పిల్లల కోసం ప్రతీ శనివారం ఇంటి వద్దకే వెళ్లి బోధన చేయాలని సూచించారు. కోఆర్డినేటర్ డి.శ్రీనివాస్, ఈఈఆర్పీలు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకరీంనగర్టౌన్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకానికి అర్హులైన ఎస్సీ విద్యార్థిని, విద్యార్థులు ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఈనెల 1వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఉపసంచాలకుడు వై.తిరుపతిరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కరీంనగర్లోని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
శిశువుల పాలిట సికిల్సెల్
కరీంనగర్: వారసత్వంగా సంక్రమించే రక్త సంబంధిత జన్యు లోపాల్లో ‘సికిల్సెల్’ అత్యంత ప్రమాదకరమైంది. సికిల్సెల్తో తరచూ రక్తహీనత (అనీమియా), కీళ్లు, ఎముకలు, చాతీలో నొప్పులు, ఇన్ఫెక్షన్లు, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, ప్లీహం, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాల పై ప్రభావం, హార్ట్ స్ట్రోక్, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. తల్లిదండ్రులిద్దరిలోనూ సికిల్సెల్ జన్యు వు ఉంటే, పుట్టే బిడ్డకు వ్యాధి వచ్చే అవకాశముంటుంది. ఈ వ్యాధి ప్రభావం భవిష్యత్ తరాలపై పడకుండా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం జిల్లాలోనే 128 మంది సికిల్సెల్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. 3 నుంచి 5 నెలలలోపే పరీక్షలు సికిల్సెల్ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భిణులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భం దాల్చి న 3 నుంచి 5 నెలల వ్యవధిలో ఉన్న మహిళలందరికీ తప్పనిసరిగా ‘హెచ్పీఎల్సీ’ రోగ నిర్ధారణ చేస్తున్నారు. ఈ పరీక్షల ద్వారా రక్తంలో సికిల్సెల్ జన్యువుల ఉనికిని స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఈ ప్రక్రియ 2025 అక్టోబర్లో ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 128మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. అవయవ లోపాల ముప్పు సికిల్సెల్ పాజిటివ్ వచ్చిన గర్భిణుల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, వారికి జన్మించే పిల్లలు తీవ్రమైన అవయవ లోపాలతో పుట్టే ప్రమాదం ఉంది. రక్తప్రసరణలో అవరోధాలు ఏర్పడి పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల మందగించడం, అంతర్గత అవయవాలు దెబ్బతినడం, తరచూ తీవ్రమైన నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ముందస్తు వ్యూహంతో పనిచేస్తోంది. సికిల్సెల్ బాధితులకు జన్మించే పిల్లలకు ఎలాంటి అవయవ లోపాలు రాకుండా ఉండేందుకు గర్భధారణ సమయం నుంచే ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచితంగా మందులు, అవసరమైన జన్యు సలహాలు ఇస్తూ పుట్టబోయే బిడ్డల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్నారు. గర్భిణులందరూ తప్పనిసరిగా ప్రభుత్వ ఆసుపత్రులలో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. సూచించిన సమయంలో హెచ్పీఎల్సీ పరీక్ష చేయించుకోవాలి. పరీక్షల్లో సికిల్సెల్ పాజిటివ్ ముందస్తు నిర్ధారణ చేసినట్లయితే సరైన వైద్యంతో వ్యాధి ప్రభావాన్ని పూర్తిగా అడ్డుకోవచ్చు. సికిల్సెల్ ప్రభావం ఉన్న పిల్లల్లో రక్తహీనత, తరచూ నొప్పులు, ఇన్ఫెక్షన్లు, ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ముందస్తు పరీక్షలు, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. – డాక్టర్ ఎం.సుధ, అడిషనల్ డీఎంహెచ్వో, కరీంనగర్ -
డెయిరీకి యూరియా!
కరీంనగర్ అర్బన్: జిల్లాలో రాయితీ యూరియా పక్కదారి పడుతోంది. ఓ అధికారి, హోల్సేల్ డీలర్, పలువురు ఫర్టిలైజర్ దుకాణదారుల తీరుతో బ్లాక్ మార్కెట్లో యూరియా నిల్వలు పేరుకుపోతుండగా అధికారుల కళ్లకు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, అసలు సదరు యూరియా ఉత్పత్తి అయి ఎన్ని రోజులవుతోంది, తాజాగా వచ్చిందా.. గతంలోదా అన్నది తేల్చేందుకు అవకాశమున్నా.. తదనుగుణ చర్యలు శూన్యం. పాల డెయిరీల్లో భారీగా యూరియా నిల్వలుండగా, హోల్సేల్ వ్యాపారే ఒక్కో బస్తాకు రూ.600కు విక్రయించాడని తెలుస్తోంది. డెయిరీలు, దాణా తయారీ కేంద్రాల్లో భారీ నిల్వలు పాల డెయిరీలు, పశువుల దాణా, కోళ్ల దాణా తయారీ చేసే కేంద్రాల్లో పెద్దమొత్తంలో యూరియా నిల్వలున్నట్లు సమాచారం. చిన్న డెయిరీల నుంచి బడా డెయిరీల వరకు అక్రమ మార్గంలో యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నారు. పాల ఉత్పత్తిలో ఇది కీలకం కాగా, నేరుగా కంపెనీల నుంచి కొనాల్సిందిపోయి రైతుల పేరిట భారీ మొత్తంలో నిల్వ చేస్తున్నారు. జిల్లాలో పదుల సంఖ్యలో పాల డెయిరీలు, పశువుల దాణా, కోళ్ల దాణా తయారు చేసే పరిశ్రమలున్నాయి. వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే యంత్రాంగం కరవవడంతో దందా నిరాటంకంగా సాగుతోంది. సీజన్ వచ్చిందంటే చాలు ముందస్తు ప్రణాళికలతో సఫలీకృతులవుతున్నారు. ఏళ్లుగా ఈ దందా సాగుతుండగా పలువురు అధికారులకు ముడుపులు ముడుతున్నాయన్నది బహిరంగ రహస్యం. కరీంనగర్కు చెందిన హోల్సేల్ వ్యాపారి నుంచే వేల బస్తాలు వ్యవసాయేతర రంగాలకు చేరినట్లు ప్రచారం. నగదే కావాలట యూరియా వ్యాపారులకు వరంగా మారుతోంది. సాగురంగం ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటుండగా పత్తి వేసిన రైతులు యాప్లో నమోదు చేసుకుని కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. బస్తా కావాలంటే నానో యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు తీసుకోవాల్సిందేనని తెగేసి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 55వేల ఎకరాల్లో పత్తి, 1.75లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అధికారుల అంచనా. మొదటి దశలో ఎకరానికి బస్తా యూరియా చొప్పున 2.05లక్షల యూరియా బస్తాలు అవసరం. ఇదే వ్యాపారులకు అవకాశంగా మారుతోంది. చాలామంది వ్యాపారులు అధిక ధరలు అమ్మే విషయం బయటపడకుండా యూపీఐ చెల్లింపులు వద్దంటూ నగదు మాత్రమే తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. అదనంగా రూ.100 వసూలు యూరియా బస్తాకు రూ.266 ధర నిర్ణయించగా వ్యాపారులు రూ.350 నుంచి 400 వరకు విక్రయిస్తున్నారు. వ్యాపారుల వద్ద ఎరువులు తీసుకుంటేనే తర్వాత అప్పు కింద పిచికారీ మందులను ఇస్తున్నా రు. కాదని సహకార సంఘం, ఇతరుల వద్ద ఎరువులు కొనుగోలు చేస్తే మిగతా మందులు ఇవ్వడం లేదని, చేతిలో నగదు లేక వారి వద్దనే అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు.కాగా వ్యాపారులు డీఏపీకి కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులను పిండేస్తుండగా అవగాహన కల్పించాల్సిన వ్యవసాయశాఖ నామమాత్రంగా మిగిలిపోయింది. రాష్ట్రస్థాయిలో టోల్ ఫ్రీ ఫిర్యాదు నంబర్ 89777 41771 ఉండగా దానిపై అవగాహన రైతులకు శూన్యం. వ్యాపారులు కేవలం రాష్ట్రస్థాయి నంబర్ను మాత్రమే ప్రదర్శిస్తుండగా పలు దుకాణాలు నిబంధనలను విస్మరిస్తున్నాయి. రైతు వేదికలే వేదికగా ప్రచారం చేయాల్సి ఉండగా తదనుగుణంగా అవగాహన కల్పించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక జిల్లాస్థాయిలో ఫిర్యాదు నంబర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటికీ ఆ ఊసే లేదని తెలుస్తోంది. -
శుక్రవారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2026
వాన కురవక.. పనులు సాగకచినుకు కురవక రైతు గుండెల్లో వణుకుపుడుతోంది. సాగు పనులు మొదలుకాక పొలాల వద్ద అన్నదాతలు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నారు. మహిళా కూలీలు వ్యవసాయ పనుల కోసం ఆరా తీస్తున్నారు. అడపా.. దడపా పడుతున్న వాన భూమికి పదనివ్వకపోగా.. యాసంగిలో కోసిన వరి మొదళ్లు దుక్కిదున్నకపోవడంతో వెక్కిరిస్తున్నాయి. కచ్చరానికి కట్టేసిన కాడెడ్లు నెమరువేసుకుంటూ నాగళ్ల సందడి కోసం ఎదురుచూస్తున్నాయి. ఎన్నో ఆశలతో పోసిన వరినారు ఎదుగుతుండగా.. నెర్రెలుబారిన నేల చినుకు కోసం నిరీక్షిస్తోంది. పక్షం రోజుల క్రితం వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తకపోగా.. సాగుచేసిన భూమి ఎడారిని తలపిస్తోంది. వర్షాలు లేక సాగురంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా.. పంటలతో కళకళలాడాల్సిన భూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఈ చిత్రాలు గంగాధర మండలంలో కన్పించగా వరుణుడు కరుణిస్తేనే కాడి సాగనుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్నారుమడికి నెర్రెలు: నీరులేక నెర్రెలుబారిన నాడుమడిదుక్కికి దిక్కేది: వర్షాలు లేక బీడువారిన పొలంచినుకు పడితేనే: వ్యవసాయ భూమిలో మొలకెత్తని పత్తి -
● లారీలు ఇలా.. వాహనాలకు దారి ఎలా..?
వీణవంక: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి, కొండపాక, కోర్కల్, మల్లారెడ్డిపల్లి గ్రామాల్లో ఇసుక క్వారీలున్నాయి. పోతిరెడ్డిపల్లి నుంచి కొండపాక వరకు రెండు కిలోమీటర్ల మేర ఇసుక లారీలు రోడ్డుకు ఇరువైపుల నిలుపుతున్నారు. ఇసుక లారీలను క్వారీల పరిధిలోనే పార్కింగ్ చేసుకోవాలని అప్పటి కలెక్టర్తో పాటు సీపీ గౌస్ ఆలం క్షేత్రస్థాయిలో పర్యటించి హెచ్చరించినా క్వారీ నిర్వాహకుల తీరు మార డం లేదు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న క్వారీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
● శునకం.. భయం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కుక్కల బెడద తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులుగా తిరుగుతూ చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయి. 54వ డివిజన్ అశోక్నగర్లో మాంసం విక్రయాలు జరుగుతుండడం, ఆ వ్యర్థాలను అక్కడే పడవేయడంతో కుక్కల బెడద పెరిగింది. కుక్కల బెడదను నివారించాలని కార్పొరేటర్ గొట్టిముక్కుల ఉమారాణి బుధవారం కమిషనర్ ప్రఫుల్దేశాయ్కి ఫిర్యాదు చేశారు.చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో వర్షాలు కురిసి, సమృద్ధిగా పంటలు పండాలని కోరుతూ గ్రామ దేవతలకు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ అలువాల శంకర్ ఆధ్వర్యంలో మహిళలు బిందెలతో గ్రామదేవతలకు జలాభిషేకం చేశారు. పసుపు, కుంకుమ చల్లి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఉప సర్పంచ్ కానవేని జితేందర్, వార్డు సభ్యులు సదగోని ఇందిరా పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్శాఖలో అధికారుల బదిలీలు
కరీంనగర్క్రైం: రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్– స్టాంపులశాఖలో పరిపాలనా కారణాలతో చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్లో జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా రిజిస్ట్రార్ (మార్కెట్ వ్యాల్యూ అండ్ ఆడిట్ఎంవీ)గా పనిచేస్తున్న జి.స్థితప్రజ్ఞను అదే హోదాలో కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్గా నియమించింది. ప్రస్తుతం సంగారెడ్డి– మెదక్ జిల్లా రిజిస్ట్రార్గా ఉన్నవల్లి సుబ్బలక్ష్మికి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్తో పాటు కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ (ఎంవీ అండ్ ఏ) బాధ్యతలను అదనపునంగా అప్పగించింది. కరీంనగర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ)గా విధులు నిర్వహిస్తున్న బి.ప్రవీణ్ కుమార్ను మేడ్చల్–మల్కాజిగిరి డీఐజీగా బదిలీ చేస్తూ, వరంగల్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. రంగారెడ్డి డీఐజీగా ఉన్న ఎస్.డి.ట్వింకిల్ జాన్ను నిజామాబాద్ డీఐజీగా బదిలీ చేయడంతో పాటు కరీంనగర్ డీఐజీ బాధ్యతలను అదనపు బాధ్యతలుగా (ఎఫ్ఏసీ) నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్ చేసి, కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
● తిమ్మాపూర్లో ఘటన ● ప్రయాణికులకు స్వల్ప గాయాలు ● తృటిలో తప్పిన పెను ప్రమాదం తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్ రాజీవ్ రహదారిపై బుధవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ఘటన తిమ్మాపూర్లోని పోలీస్స్టేషన్ ఎదురుగా జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు మధ్యాహ్నం హైదరాబాద్ వైపు వెళ్తోంది. దాని ముందుగా వెళ్తున్న నూతన లారీ ఫిట్నెస్ పరీక్ష కోసం ఆర్టీవో ఆఫీస్ వైపు డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుంటోంది. వెనకాలే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఆటో డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు కలిసి బస్సులో ఉన్న 47 మందిని ఎమర్జెన్సీ విండో నుంచి బయటికి దింపేశారు. తిమ్మాపూర్ సీఐ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
సర్కు సహకరించాలి
కరీంనగర్ కార్పొరేషన్/కరీంనగర్కల్చరల్: ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని నరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు మున్సిపల్, రెవెన్యూ యంత్రాంగం నిరంతరం శ్రమిస్తోందన్నారు. నగరవ్యాప్తంగా పోలింగ్ బూత్ల ప్రకారం ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు 80శాతం పూర్తయ్యిందన్నారు. ఫారాల పంపిణీ వందశాతం పూర్తయిన బీఎల్వోలు పూర్తిస్థాయిలో పూరించిన దరఖాస్తులను తిరిగి సేకరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫీల్డ్ లెవల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరై ఉండి ఎన్యూమరేషన్ ఫారాలు అందని వారు బూత్ లెవల్ అధికారులను కలిసేలా ఓటర్లకు సూచనలు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాల విషయంలో ఎలాంటి సమస్యలున్నా స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లోని హెల్ప్ డెస్కులను సందర్శించి, సమస్యను పరిష్కరించేలా పార్టీల ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అన్నారు. డబుల్, డూప్లికేట్ ఓట్ల తొలగింపుపై దృష్టి పెట్టాలన్నారు. మరణించిన వారి వివరాలను బూత్ లెవల్ అధికారుల సహకారంతో తొలగించేలా సహకరించాలని సూచించారు. సైన్స్ మ్యూజియం చారిత్రాత్మకమైంది నగరంలోని సైన్స్ మ్యూజియం చారిత్రాత్మకమైందని కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా సైన్స్ మ్యూజియాన్ని సందర్శించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల సైన్స్ నమూనాలు, గ్యాలరీలను పరిశీలించారు. అధునీకరించిన మ్యూజియాన్ని సందర్శకులకు త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్నారు. -
రేవంత్వి బురద రాజకీయాలు
కరీంనగర్టౌన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు చేశాడని, రెండున్నరేళ్లలో మరమ్మతు చేయకుండా వదిలిపెట్టి బురద రాజకీయాలు చేస్తున్నాడని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ ముందుచూపుతో కాళేశ్వరాన్ని నిర్మించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని రెండు గేట్లను మరమ్మతు చేసి ఉంటే హైదరాబాద్కు, రాష్ట్రానికి తాగునీరు, 50వేల ఎకరాలకు సాగునీరు అందేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే కన్నెపల్లి పంప్హౌజ్ మోటార్లు ఆన్ చేసి మిడ్మానేరు, ఎల్ఎండీ, ఎస్సారెస్పీ నింపి వరదకాలువల ద్వారా అనంతగిరి వరకు సాగు, తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేశారు. మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టినందుకు, బోనస్ ఇవ్వనందుకు, యూరియా కోసం గోస పెడుతున్నందుకు కాగడాలతో రైతులు తరుముతారని రేవంత్రెడ్డిని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఓటర్ల పేర్లను తొలగించే అవకాశాలున్నందున బీఎల్వోలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు, ప్రతి డివిజన్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసి సర్లో అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయించాలన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎల్ఎండీ, మిడ్మానేరు ఎండిపోయాయని, సాగు, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయన్నారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, రసమయి బాలకిషన్, రాష్ట్ర నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, సర్దార్ రవీందర్సింగ్, కొండూరు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ
కరీంనగర్క్రైం: కరీంనగర్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్గా జె.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, సిబ్బంది ఘ నంగా స్వాగతం పలికారు. రవికుమార్ మాట్లాడుతూ పనితీరును మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, అక్రమ మద్యం, మాదకద్రవ్యాల నియంత్రణకు పాటుపడతామని తెలిపారు. డీటీఎఫ్ సీఐ నాగేశ్వర్రావు, హుజూరాబాద్ సీఐ శ్రీనివాస్, తిమ్మాపూర్ సీఐ బాబా, జమ్మికుంట సీఐ మాధవీలత, కరీంనగర్ రూరల్ ఇన్చార్జి సీఐ విజయ్ భాస్కర్, హెచ్సీ/ఈసీ అసోసియేషన్ అధ్యక్షుడు పులి నగేశ్గౌడ్తో పాటు పలువురు ఎకై ్సజ్ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన డిప్యూటీ కమిషనర్కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. గన్నేరువరం: గన్నేరువరం నుంచి కరీంనగర్ వరకు మానేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి గన్నేరువరంలో సాయి టెస్టు పనులను ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ వసంత నాయక్ బుధవారం పరిశీలించారు. వారం రోజుల్లో బ్రిడ్జి పనులను కేంద్ర, రాష్ట్ర మంత్రులు బండి సంజయ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించనున్న నేపథ్యంలో ఏ ర్పాట్లు పరిశీలించారు. ఈఈ చారి, డీఈ రాజశేఖర్రెడ్డి, ఏఈ సురేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొడ్డు సునీల్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కటకం తిరుపతి పాల్గొన్నారు. కరీంనగర్: వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జిల్లాశాఖ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసై టీ సహకారంతో బుధవారం ఐఎంఏ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పలు వురు డాక్టర్లు మాట్లాడుతూ రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక యూనిట్ రక్తదానం ద్వారా మూడు నుంచి నలుగురి ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. రెడ్క్రాస్ బాధ్యులు ఎం. ఎల్.ఎన్.రెడ్డి, కేశవ్రెడ్డి, ఐఎంఏ బాధ్యులు ఆకుల శైలజ, వి.నీలిమ, కాసం శివకుమార్, సంతోష్ కుమార్, నరేశ్, రాజేశ్వర్, రామణాచారి, మోహన్రెడ్డి, మల్లికార్జున్, విజయలక్ష్మి, సర్దారున్నిసా, జ్యోతి,మానస పాల్గొన్నారు. కరీంనగర్ సిటీ: కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్కుమార్ ఆధ్వర్యంలో జర్మనీలోని గోట్టింగెన్ యూనివర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుందని శాతవాహన యూని వర్సిటీ అధికారులు తెలిపారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ జర్మనీ పర్యటనలో భాగంగా ఈ భాగస్వామ్యం సాధ్యమైందన్నారు. హుజూరాబాద్: హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి ఓ వైద్యుడు మద్యంమత్తులో వచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి 11గంటల సమయంలో అత్యవసర విభాగాని కి వచ్చిన రోగులు, అక్కడ విధుల్లో ఉన్న రేడియాలజిస్ట్ మద్యంమత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది బ్రీత్ అనలైజర్తో ఆస్పత్రికి వచ్చారు. పరీక్షకు సహకరించలేదు. తన కారులో పోలీసుస్టేషన్కు వెళ్లాడు. అక్కడా బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించలేదు. ఈ ఘటనపై హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీందర్ను వివరణ కోసం సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
బాధితులకు భరోసా కల్పించాలి
కొత్తపల్లి(కరీంనగర్)/కరీంనగర్టౌన్/కరీంనగర్ అర్బన్: వేధింపులకు గురైన మహిళలు, చిన్నారులకు సత్వర న్యాయం అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా సూచించారు. కొత్తపల్లిలోని భరోసా సెంటర్లో సీపీ గౌస్ ఆలం అధ్యక్షతన బుధవారం రాత్రి నిర్వహించిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రానికి వచ్చే బాధితులకు తక్షణ సాయం అందించాలని సూచించారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ భరో సా సెంటర్ బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికపై పోలీసు, వైద్య, న్యాయ, కౌన్సెలింగ్, పునరావాస సేవలను అందించే సమగ్ర వ్యవస్థ అ న్నారు. ప్రతి కేసును మానవీయ కోణంలో పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పనిచేస్తామన్నారు. జూలై 1 నుంచి 31వరకు జరిగే ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సప్తగిరికాలనీలోని సఖి సెంటర్ను కలెక్టర్, సీపీ సందర్శించారు. కేంద్రంలో బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కేసు ల నిర్వహణ, అత్యవసర సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రతీ బాధితురాలికి ధైర్యం చెప్పి, వారి సమస్యలను పరిష్కరించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. సెంటర్లోని రికార్డ్స్ విభాగం, అడ్మినిస్ట్రేటర్ గది, షెల్టర్ గదులను పరిశీలించి, నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న ఓ బాలికతో మాట్లాడారు. శిక్షణ కలెక్టర్ హరిప్రసాద్, డీసీపీ వెంకటరమణ, సంక్షేమ అఽ దికారి సరస్వతి, డీఎంహెచ్వో శ్రీరామ్ ఉన్నారు. మార్కెట్ యార్డును ఆధునీకరిస్తాం కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ యార్డును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. యార్డు పరిశుభ్రతతో పాటు అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో షర్మిల,వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఆకుల నర్సన్న ఉన్నారు. -
మొలకెత్తని ఆశలు
సాక్షి, పెద్దపల్లి: కార్తెలు కరిగిపోతున్నా వానాకాలం సాగు ముందుకు సాగడంలేదు. జూన్ తొలివారంలోనే వర్షాలు విస్తారంగా కురిసి వివిధ పంటలతో పొలాలు పచ్చదనంతో కళకళలాడాల్సి ఉంది. ఈసారి ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడడం, వర్షాలు కురవక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తొలి జల్లులు పడగానే పత్తి విత్తనాలు వేసినా ఇంకా మొలకలు రాలేదు. మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వరి నాట్లు వేయాల్సిన సమయం దాటిపోతుండగా పొలాలు నీళ్లులేక ఎండిపోవడంతో రైతులు తమ ఆశలన్నీ భారీవర్షాలపైనే పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోయాయి. ఎండల తీవ్రత, వర్షాల ఆలస్యంతో బావులు, బోర్లు నీరందించడం లేదు. చెరువులు, కుంటల్లో నీరులేక ఆయకట్టులోనూ సాగు ప్రారంభం కాలేదు. వర్షాధారం సాగుపైనే ఆధారపడే రైతులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పదిరోజులే వర్షం.. లోటు వర్షపాతం జూన్ ఒకటి నుంచి జూలై ఒకటో తేదీ వరకు జిల్లాలో కేవలం పదిరోజులే వర్షం నమోదైంది. జూన్ 5న చిరుజల్లులు ప్రారంభమైనా.. అన్ని మండలాలను తడపలేదు. ఇప్పటివరకు సాధారణంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 588.1 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా 95.8 మి.మీ. లోటు ఏర్పడింది. ఈసారి మోస్తరు కాకుండా చిరుజల్లులే కురవడంతో వ్యవసాయానికి పెద్దగా ఉపయోగపడలేదు. నేలలో తేమ నిలవడం లేదు. విత్తనాలు ఎండిపోవడం, నారుమడులు సిద్ధం కాకపోవడం, భూగర్భ జలాలు పడిపోవడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరో వారం రోజుల్లో భారీవర్షాలు కురవకపోతే వానాకాలం సాగు మరింత ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఎదురైతే దిగుబడి తగ్గే ప్రమాదంతోపాటు పెట్టుబడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరీంనగర్లో మరో ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు ప్రయాణికుల్లో ఆందోళన పెంచుతున్నాయి. 15 రోజుల క్రితం అలుగునూర్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైన ఘటన మరువకముందే.. తాజాగా కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్న మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. మంగళవారం కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉన్న ఎలక్ట్రిక్ బస్సు బ్యాటరీ విభాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్యాటరీలో షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర బస్సులకు వ్యాపించకుండా సమయానికి చర్యలు చేపట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.ఇదే జిల్లాలో జూన్ 21న అలుగునూర్ శివారులో కరీంనగర్–హైదరాబాద్ మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ అద్దె ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన ఆపి ప్రయాణికులందరినీ వెంటనే కిందకు దించడంతో 42 మంది సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం బ్యాటరీ బాక్స్ నుంచి మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. మూడు ఫైర్ ఇంజన్లు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.తాజాగా మరోసారి అదే జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. వరుస ఘటనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, బ్యాటరీల నాణ్యత, భద్రతా ప్రమాణాలపై సమగ్ర సాంకేతిక పరిశీలన చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాజా ఘటనకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు విచారిస్తున్నారు. -
రవిచంద్ర, శ్యాంప్రసాద్కు ‘ఆటా’ ఆహ్వానం
కరీంనగర్కల్చరల్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరఫున జూలై 31 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు అమెరికాలోని మేరీల్యాండ్లో నిర్వహించే 19వ ద్వైవార్షిక ఆటా మహాసభలు, యువజన సదస్సుకు కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, సివిల్ సప్లైస్ డైరెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్ లాల్ను ముఖ్య అతిథిలుగా ఆహ్వానించారు. మూడు రోజులపాటు జరిగే కార్యక్రమంలో యువత, వివిధ రంగాల నిపుణులు, సామాజిక నాయకులు పాల్గొంటారు. సాంస్కృతిక కార్యక్రమాలు, యువ నాయకత్వ శిక్షణ, విద్యా, వ్యాపార సదస్సులు, ఉద్యోగ మేళాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు తమ అనుభవాలను పంచుకుంటారు. రవిచంద్ర, శ్యాంప్రసాద్లాల్కు మాడిశెట్టి గోపాల్, అన్నవరం దేవేందర్, డాక్టర్ నలిమెల భాస్కర్ అభినందనలు తెలిపారు. -
బుధవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, కరీంనగర్●: భూ చిక్కు ముళ్లు విప్పేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేస్తోంది. ప్రతీ గ్రామంలో హద్దుల వివాదాలు గరిష్టసంఖ్యలో ఉండగా ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేకు చర్యలు చేపడుతోంది. ఉమ్మడి జిల్లాలో బుధవారం నుంచి డిజిటల్ సర్వే ప్రారంభం కానుంది. నిజాం కాలంలో చేపట్టిన భూసర్వే, నక్షా(మ్యాప్), నాటి రికార్డులే ఆధారంగా రెవెన్యూ కార్యకలాపాలు సాగుతున్నాయి. భూ కమతాలు పెరగటం, విస్తీర్ణాలు విభజనకు నోచుకోవటంతో హద్దులు మారిపోతున్నాయి. గ్రామాల్లో భూముల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి పరిష్కారానికి సర్వే చేయక తప్పదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇప్పటికే లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించింది. రోవర్ పరికరాలపై శిక్షణ పైలెట్ ప్రాజెక్ట్లో భాగంగా తొలిసారి రెవెన్యూ రికార్డు అందుబాటులో లేని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో రీసర్వే జరిపి దస్త్రాలు తయారు చేస్తున్నారు. తాజాగా జిల్లాకు ఐదు నుంచి ఏడు మండలాలు ఎంపిక చేయగా, మండలానికో గ్రామంలో సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా సర్వేయర్లకు కరీంనగర్ కలెక్టరేట్లో రోవర్ పరికరాలపై శిక్షణ ఇచ్చారు. వీలైనంత త్వరగా ఎంజాయ్మెంట్ సర్వే చేసి నక్షాను రూపొందించనున్నారు. ఒక్కోగ్రామంలో 1500 నుంచి 2500 ఎకరాలకు పైగా సాగుభూములున్నాయి. ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి కొత్తగా రికార్డులు తయారు చేయనుండగా సర్వే నంబర్వారీగా నక్షా రూపొందిస్తుంది. వీటన్నింటినీ ఆన్లైన్లో పొందుపరుస్తుంది. అనంతరం భూధార్ నంబర్లను రైతులకు అందిస్తుంది. లైసెన్స్డ్ సర్వేయర్లకు బాధ్యతలు ఉమ్మడి జిల్లాలో వందలాది మంది లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పరీక్షలో పాల్గొనగా వీరితోనే ఎంజాయ్మెంట్ సర్వే చేపట్టనున్నారు. అధునాతన రోవర్ పరికరాలను ఉపయోగించి పక్షం రోజుల్లో సర్వే పూర్తి చేయనున్నారు. భూ విస్తీర్ణాన్ని నెల రోజుల్లో సర్వే చేసేందుకు రూ.40వేలు, 2వేల ఎకరాలు మించితే రూ.60వేలను సంబంధిత లైసెన్స్డ్ సర్వేయర్లకు సర్కారు చెల్లించనుంది.ముఖ్యమంత్రి సదస్సు వీక్షణహైదరాబాద్లోని శిల్పకళా వేదికలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సును కొత్తపల్లి రైతు వేదికలో కలెక్టర్ చిత్రామిశ్రా, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సన్న, డీఏవో భాగ్యలక్ష్మి, కా ర్పొరేటర్లు వాసాల రమేశ్, వేముల కవిత, రైతులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సీఎం ప్రసంగాన్ని విన్నారు. వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు. –కొత్తపల్లిఎడ్లబండి మూలనయాంత్రీకరణ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందకముందు వ్యవసాయ ఉత్పత్తులు తరలించడంలో రైతులు ఎడ్లబండ్లను విరివిగా వినియోగించేవారు. ఇంట్లో ఏ శుభకార్య మైనా, ఏ ఆపద వచ్చినా ఎడ్లబండ్లే దిక్కుగా మారేవి. ట్రాక్టర్లు, హార్వెస్టర్లు మార్కెట్లోకి రావడంతో ఎడ్లబండ్ల వినియోగం తగ్గిపోయి మూలనపడుతున్నాయి. వీణవంక మండలం కనపర్తి గ్రామంలో ఓ రైతు ఇంటి ఎదుట నిరుపయోగంగా ఎడ్లబండి కనిపించింది. –వీణవంక భూ భారతిలో ప్రస్తావించిన ప్రతి రైతుకూ భూధార్ నంబరు ఇచ్చే ప్రక్రియను అమలు చేయనున్నారు. చట్టం ప్రకారం మొదట ప్రతి రైతు రికార్డులు పరిశీలించి.. సరిగ్గా ఉన్నాయని భావిస్తే టెంపరరీ భూధార్ నంబరు ఇవ్వనుండగా ఆ తర్వాత సరిహద్దులను గుర్తించి మ్యాప్ గీయనున్నారు. సర్వేయర్ అప్రూవ్ చేస్తే తహసీల్దార్ అమలు చేస్తారు. అప్పుడు అది సరిహద్దులు గల భూమిగా గుర్తింపు పొందుతుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే పర్మినెంట్ భూధార్ నంబరు ఇవ్వాలని ఆర్వోఆర్–2025 స్పష్టం చేస్తుంది. ఈ రెవెన్యూ రికార్డుల వెరిఫికేషన్ జీపీవోలు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లతోనే పూర్తవుతుంది. మోకాపై ఉన్న భూమినే కొలవనున్నారు. ఒక రైతుకు 2ఎకరాల భూమి ఉంటే ఎంత భూమి ఉందనేది కొలుస్తారే తప్పా రికార్డులో ఉన్న 2ఎకరాల భూమిని చూపించరు. రైతు అనుభవిస్తున్న భూమిని మాత్రమే కొలవనుండగా దీంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రస్తుతానికి ఎంజాయ్మెంట్ సర్వే చేస్తామని, తదుపరి ప్రభుత్వ ఆదేశాల క్రమంలో హద్దులు నిర్ణయిస్తామని కరీంనగర్ జిల్లా సర్వే లాండ్ ఏడీ కిషన్రావు చెబుతున్నారు. -
శభాష్.. సమష్టిగా పని చేస్తున్నారు
కరీంనగర్: హైదరాబాద్లోని ఘట్కేసర్లో మంగళవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కరీంనగర్ పార్టీ నేతలను సమష్టిగా పార్టీ అభివృద్ధికి కష్టపడుతున్నారని అభినందించారు. రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. సమావేశ విరామ సమయంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డిని బండి సంజయ్ జా తీయ అధ్యక్షుడు నితిన్ నభీన్కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్ వారిని శాలువాలతో సన్మానించి అభినందించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో శ్రమించాలని సూచించారు. -
సీఏ సేవలు తప్పనిసరి
దేశంలో ఆర్థిక పారదర్శకత, పన్నుల క్రమశిక్షణ, చట్టబద్ధమైన వ్యాపార వ్యవస్థ బలో పేతానికి చార్టర్డ్ అకౌంటెంట్ల సేవలు కీలకం. వ్యాపార సంస్థ ప్రారంభం నుంచి కంపెనీ రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఆదాయపు పన్ను, టీడీఎస్, ట్రస్టులు, సొసైటీలు, కంపెనీల చట్టబద్ధమైన కంప్లయెన్స్, వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాంకు రుణాలు, కార్పొరేట్ గవర్నెన్స్, విలీనాలు, కొనుగోళ్లు, ఇన్సాల్వెన్సీ ప్రక్రియకు చార్టర్డ్ అకౌంటెంట్లు సమగ్ర సేవలు అందిస్తున్నారు. – వనపట్ల శేఖర్ రెడ్డి, సీఏ వికసిత్ భారత్–2047 లక్ష్య సాధన దిశగా తీసుకెళ్లడంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం. స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బి జినెస్ వంటి కార్యక్రమాల అ మలులో సీఏలు భాగస్వాములు గా నిలుస్తున్నారు. – జి.ఆనంద్ కుమార్, సీఏ తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, టీ హబ్, టాస్క్ కార్యక్రమాల అమలులో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ సంస్థలు, విద్యాసంస్థలు, సేవా సంస్థలు, సహకార సంఘాలు చట్టబద్ధంగా ముందుకు సాగేందుకు సీఏల మార్గదర్శకత్వం అవసరం. – ఎం.సంతోష్రెడ్డి, సీఏ -
వైద్యంలో వారియర్స్
కరీంనగర్: తల్లి జన్మనిస్తే.. వైద్యుడు పునర్జన్మనిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ వైద్యుడిలో దేవుడిని చూస్తారు. వైద్య వృత్తిలో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటూనే, కొంత మంది డాక్టర్లు సామాజికసేవలో తరిస్తున్నారు. పేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. వైద్య వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటున్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కథనం..మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం శ్రీలక్ష్మి మహేశ్వర చారిటబుల్ ట్రస్టును 2017 ప్రారంభించా. ఏటా 10 మందికి రూ.30 లక్షలు వెచ్చించి ఉచిత కీలు మార్పి డి ఆపరేషన్లు చేస్తున్నా. నా భార్య డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఏటా 10మంది సంతానం లేని దంపతులకు రూ.20 లక్షలు ఖర్చుచేసి ఉచిత ఐవీఎఫ్ వైద్య సేవలు అందిస్తున్నారు. – డాక్టర్ బంగారి స్వామి, ఆర్థోపెడిక్ సర్జన్ఆడపిల్ల భారమని భావించే వివక్షను వీడి, లక్ష్మిదేవిలా భావించినప్పుడే సమాజంలో లింగనిష్పత్తి తేడాలు తొలుగుతాయని మా ఆస్పత్రిలో దేవీ పుత్రిక పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సాధారణ ప్రసవం అయినా, సిజేరియన్ అయినా ఆడపిల్ల పుడితే ఒక్క రూపాయి తీసుకోకుండా పూర్తిస్థాయి వైద్యం అందిస్తున్నాం. – ఎనమల్ల శ్రీదేవి, గైనకాలజిస్టుబీఎన్.రావు చారిటబుల్ ట్రస్టు పేరుమీద 2017 నుంచి సేవ కార్యక్రమాలు చేపడుతున్నా. ఉమ్మడి జిల్లాలో అనీమియా సమస్యతో బాధపడే 10వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఐరన్ మాత్రలు, పౌష్టికాహారం అందజేశాను. కరోనా సమయంలో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులకు లక్ష మాస్కులు, 20వేల శానిటైజర్స్ పంపిణీచేశాను. 100 గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాం. మహిళకు కుట్టు మిషన్లో శిక్షణ ఇచ్చి, స్వయం ఉపాధికల్పిస్తున్నాం. – డాక్టర్ బీఎన్ రావు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షుడు -
లెక్కల్లో లెజెండ్స్
కరీంనగర్టౌన్: దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది వేస్తూ, ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తూ, వ్యాపార సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించే వృత్తిగా చార్టర్డ్ అకౌంటెన్సీ నిలిచింది. డిజిటల్ చెల్లింపులు, ఈ– గవర్నెన్స్, ఆన్లైన్ పన్ను, ఈ–ఇన్వాయిసింగ్, డిజిటల్ ఆడిటింగ్, ఫిన్టెక్ సేవలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చార్టర్డ్ అకౌంటెంట్ల బాధ్యత మరింత పెరి గింది. మనీలాండరింగ్ నియంత్రణ, ఫోరెన్సిక్ ఆడిట్లో సీఏల సేవలు కీలకంగా మారాయి. 1949 జూలై 1న పార్లమెంట్ చట్టం ద్వారా దేశంలో చార్టర్డ్ అకౌంటెంట్ల అత్యున్నత సంస్థగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఏర్పడింది. ఏటా జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ 2012 జనవరి 29న 103మంది సభ్యులతో ప్రారంభమైన ఐసీఏఐ కరీంనగర్ బ్రాంచ్ ప్రస్తుతం 596 మంది సభ్యులు, 1,200 మందికి పైగా విద్యార్థులతో ఉత్తర తెలంగాణలో ప్రముఖ వృత్తిపరమైన సంస్థగా ఎదిగింది. గతంలో సీఏ పరీక్షల కోసం హైదరాబాద్, విజయవాడ వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం కరీంనగర్లోనే పరీక్షా కేంద్రం ఏర్పాటు కావడంతో వేలాది మందికి ప్రయోజనం చేకూరుతోంది. విద్యా ర్థులకు ప్రత్యేక లైబ్రరీ, మాక్ టెస్టులు, స్టడీ సర్కిళ్లు, సెమినార్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2025లో బ్రాంచ్కు 4,000 చదరపు గజాల స్థలంలో శాశ్వత భవనం నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో ఉత్తర తెలంగాణ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణకు వేదికగగా మారనుంది. -
పోలియో చుక్కలు వేశారా?
చిగురుమామిడి: ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి నూరుశాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. సోమవారం చిగురుమామిడిలో ఐదేళ్లలోపు వయసు గల పిల్లల్లున్న ఇండ్లను సందర్శించారు. ఆదివారం నాటి పల్స్పోలియో కార్యక్రమంలో చుక్కలు వేయించారా అని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ఆశ, ఏఎన్ఎంలను ఆదేశించారు. గ్రామంలో బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎస్ఐఆర్ ఫారాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బీఎల్వోలకు ఓటర్లు సహకరిస్తేనే ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని అన్నారు. చిగురుమామిడి సర్పంచ్ ఆకవరం భవానీప్రసాద్, ఏఎన్ఎం లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రమేశ్ పాల్గొన్నారు. -
ఆక్రమణలపై అర్జీల వెల్లువ
‘నా సొంత స్థలంలో సంబంధం లేని వ్యక్తులు నిర్మాణం చేస్తున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు’ అని ఓ వృద్ధుడు ప్రజావాణిలో కన్నీటి పర్యంతమయ్యాడు. క్యూలైన్ నుంచి కలెక్టర్ వద్దకు చేరుకునే వరకూ నేను వృద్ధుడిని, నన్నెవరూ పట్టించుకోవడం లేదంటూ రోదించడం అక్కడున్నవారిని కదిలించింది. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన గాజర్ల వెంకట్రెడ్డికి గ్రామంలో సర్వే నంబర్ 6,7లో భూమి ఉంది. అక్కడే ఇంటిని నిర్మించుకుని 40ఏళ్లుగా జీవనం చేస్తున్నాడు. తన భూమిపై ఎలాంటి హక్కు లేని వ్యక్తులు దౌర్జన్యంగా ఇంటి నిర్మాణం చేస్తున్నారని, పంచాయతీ కార్యదర్శిని కలిస్తే తానేం చేయలేనని, అధికారులకు చెప్పుకో అంటున్నాడని వాపోయాడు.కరీంనగర్ అర్బన్: తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఎక్కువ శాతం, భూ సమస్యలు, ఆక్రమణలుపైనే బాధితులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, డి.శ్రీనివాస్రెడ్డి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 225 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు.మాది పేద కుటుంబం. నా తల్లిదండ్రులు నన్ను ఉన్నత చదువులు చదివించాలని అల్గునూరులోని ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్ చేశారు. గతేడాది ఇంటర్లో చేరగా నేను కాలేజీకి వెళ్లింది 20రోజులే. తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో భయమేస్తోంది. నేను కాలేజీకి రాను టీసీ కావాలని అడిగితే పూర్తి ఫీజు చెల్లించాలని వేధిస్తున్నారు. కలెక్టర్ మేడమ్ నాకు న్యాయం చేయాలి. – కృపాసాగర్, విద్యార్థి, రామన్నపేట గ్రామ శివారులో సర్వే నంబర్ 206, 207లో 16 ఎకరాల భూమి ఉంది. గత 50ఏళ్లుగా సాగు చేసుకుంటూ బతుకుతున్నం. ఉత్తరం వైపు ఒద్యారం నుంచి ఖాజీపూర్ వచ్చే తోవ ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. గ్రానైట్ కంపెనీవాళ్లు తోవను దౌర్జన్యంగా తొలగించి ఆక్రమించుకున్నారు. ఇంత దౌర్జన్యమా..? అధికార యంత్రాంగం ఎందుకున్నట్లు? – విద్యాసాగర్, వేణుగోపాల్, ఒద్యారం, గంగాధర గ్రామంలో 312 సర్వే నంబర్లో రెండెకరాల ప్రభుత్వ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారు. అందులో ఉన్న వేప, తుమ్మ చెట్లను తొలగించి భూమిని చదును చేశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే చర్యలుండవా.? తిరిగి స్వాధీనం చేసుకోరా..? – ఖాజీపూర్ గ్రామస్తులు, కొత్తపల్లి మండలం -
గేటు సమస్య పరిష్కరించరా?
గంగాధర: కరీంనగర్– జగిత్యాల జాతీయ రహదారిపై గంగాఽ దర మండలం మంగపేట రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వేగేటు కష్టాలు తప్పడం లేదు. తరచూ గేటు వద్ద వాహనాలు నిలిచిపోవడం, గేటుమధ్యలో ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ జామవుతోంది. సోమవారం ఓ భారీ వాహనం గేటు కింద ఇరుక్కు పోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. దాదాపు రెండు గంటలకు పైగా ట్రాఫిక్ జామైంది. ఇక్కడ వాహనాలు ఇరుక్కు పోవడం, గేటు మొరాయించడం వంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఒక్కోసారి రోగులను తరలించే అంబులెన్స్లు సైతం పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
గందరగోళం సర్
కరీంనగర్ అర్బన్: పల్లె నుంచి నగరం వరకు ఎక్కడైనా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చర్చే. 2002.. ఓటర్ల గుండెల్లో గుబులు రేపుతుంటే ఓటర్లు దొరక్క బీఎల్వోలు అయోమయానికి గురవుతున్నారు. పక్కాగా ఓటరు జాబితా రూపొందించేందుకే సర్ను చేపడుతున్నామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేస్తుండగా, సందేహాలను తీర్చాల్సిన ఉన్నతాధికారులు మీడియాకు సమయం ఇవ్వడం లేదు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడం ఓటర్లకు ఇబ్బందికరంగా మారింది. క్యూఆర్ కోడ్తో ముద్రితమైన ఈ పత్రంలో చిన్నతప్పు చేసినా ఓటు విషయంలో గందరగోళం నెలకొనే పరిస్థితి ఉంది. అందుకనే వాటిని నింపడానికి ఓటర్లు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. చదువుకున్న వారూ అందులోని వివరాలను రాయడానికి తటపటాయించాల్సి వస్తోంది. ఫారాలు నింపడంలో ఓటర్ల అవస్థలు జిల్లాలో 1,334మంది బీఎల్వోలు వారి వద్ద ఉన్న ఎన్యూమరేషన్ ఫారాలను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 800– 900 మందికి పంపిణీ చేయాల్సి ఉంది. 2002 జాబితాలో ఉన్న ఓటర్లు, తాజా జాబితాలో ఉన్న ఓటర్లకు ఒకే రకమైన ఫారాన్ని ఇస్తున్నారు. అందులో వేర్వేరుగా నింపాల్సి ఉంటుంది. ఎక్కువమంది ఈ విషయంలో అవగాహన లేక పత్రాలు నింపడం లేదు. చాలామందికి ఎపిక్ నంబర్ను ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. బీఎల్వోలకు ఇప్పటికే అందుకు సంబంధించి సమగ్ర శిక్షణనిచ్చారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఓటర్లు అడిగే పలు సందేహాలు నివృత్తి చేసేందుకు వారు ఉన్నతాధికారులపై ఆధారపడుతున్నారు. నియోజకవర్గం, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, బంధుత్వం తదితర వివరాలు ఎలా పొందుపర్చాలనేది కొన్నిచోట్ల బీఎల్వోలకు తెలియడం లేదు. ఓటర్లు దొరకట్లే చాలా చోట్ల ఓటర్ల జాబితా సవరణపై ప్రజలకు అవగాహన ఉండటం లేదు. కొన్నిచోట్ల పార్టీ నాయకులు హుషారుగా ఓటర్లు, ఇంటి యజమానుల వివరాలు, ఫోన్ నంబర్లను బీఎల్వోలకు అందిస్తున్నారు. బీఎల్వోలకు 1,200 వరకు ఓటర్ల వివరాలు నమోదు చేయాలని సూచించడంతో ఇబ్బందులు పడుతున్నారు. సహకరించాల్సిన బీఎల్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది. బీఎల్వోలు ఓటర్ల జాబితా పట్టుకొని ఇంటింటికీ తిరుగుతుండగా వృద్ధులు మాత్రమే ఇంటి వద్ద ఉంటున్నారు. మిగతా వారు ఎక్కడున్నారని అడిగితే వలస వెళ్లారని సమాధానమిస్తున్నారు. గత్యంతరం లేక బీఎల్వో ఉన్నవారికే ఎన్యూమరేషన్ ఫారాలు అందించి వెనుదిరుగుతున్నారు. ఒక్కో బీఎల్వో నిత్యం 200 మంది ఓటర్ల వివరాలు ఈఎస్ఐ యాప్లో సరి చూడాలి. వీరు మొదట ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలి. 2002, 2025లో ప్రచురించిన ఓటర్ల జాబితాలోని పేర్లను సరి చూడాలి. ఆ సమయంలో ఎక్కడ ఓటు వేశారు? ప్రస్తుతం వారు ఎక్కడున్నారు? ఎవరైనా మృతి చెందారా? పెళ్లి చేసుకొని వెళ్లిపోయారా? వంటి విషయాలను గమనించాలి. ఓటర్లకు ఇచ్చిన ఫారాల్లో 12 రకాల గుర్తింపు కార్డుల వివరాలు పొందుపరిచి, ఒక పీపీసైజ్ ఫొటోను అతికించి బీఎల్వోలకు అందించాలి. కానీ, చాలాచోట్ల ఇళ్లలో ఇంటి యజమానులు కనిపించడం లేదు. చాలా ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. -
జీవన ప్రమాణాలు పెంచే దిశగా అభివృద్ధి
కరీంనగర్ కార్పొరేషన్: నగర ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తె లిపారు. 46వ డివిజన్ పరిధిలోని రాంనగర్ రోడ్డు నంబర్ 6లో రూ.10 లక్షలతో చేపట్టను న్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు, 35వ డివి జన్ కాపువాడలో రూ.51 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, ఎస్డబ్ల్యూజీ పైప్లైన్ డ్రైనేజీ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి, డిప్యూటీ మేయర్ వై.సునీల్రావు, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, సాదవేని సుజాత, తోట అనిల్ పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: ప్రజావాణిలో దరఖా స్తులు పెండింగ్లో ఉంచొద్దని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. నగరపాలకసంస్థ కార్యాలయ ఆవరణలోని కళా భారతిలో సోమవారం నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 11 దరఖాస్తులు రాగా, అందులో ఇంజినీరింగ్ రెండు, టౌన్ ప్లానింగ్ ఆరు, రెవెన్యూ రెండు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒకటి ఉన్నాయి. కొత్తపల్లి చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించుకొన్న ఇండ్లకు నగరపాలకసంస్థ ఇచ్చిన ఇంటినంబర్లను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహార్, పట్టణ ప్రణాళిక డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీ శ్రీధర్, వెటర్నరీ అధికారి దుర్గాప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ అర్బన్: భారతీయ గణాంక శాస్త్ర పితామహుడు ప్రొఫెసర్ పీసీ మహలనోబిస్ జయంతి సందర్భంగా కేంద్ర గణాంక శాఖ ఉప ప్రాంతీయ కార్యాలయంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రొఫెసర్ పి.సి.మహలనోబిస్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. కేంద్ర గణాంకశాఖ కరీంనగర్ ఉప ప్రాంత కార్యాలయ సీని యర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గోవర్ధన్ శ్రీనివాసరావు, కొమ్మినేని సుధాకర్ పాల్గొన్నారు. కరీంనగర్సిటీ: నగరంలోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటనామస్ కళా శాల డిగ్రీ 6వ సెమిస్టర్ ఫలితాలను సోమవా రం ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ తిరుకోవెల శ్రీనివాస్ విడుదల చేశారు. 6వ సెమిస్టర్లో 78శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ నితిన్ పాఠక్, టి.రాజయ్య, టీజీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్రెడ్డి పాల్గొన్నారు. టీజీఎప్సెట్ ధ్రువపత్రాల పరిశీలన పూర్తిసప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన టీజీఎప్సెట్– 2026 తొలి విడత ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. చివరి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 261 మందికి కరీంనగర్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేశారు. మొత్తంగా 3,807మంది ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకున్నారని ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలి పారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకున్న వారు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు. -
మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026
‘సర్’ ఫారం నింపారా?సైదాపూర్/చిగురుమామిడి: ఓటర్ సవరణను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సోమవారం సైదాపూర్ మండలం ఎలబోతారంలో ఓటర్ సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఫారాలు నింపుతున్నారా ఓటర్లను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ సవరణ కొత్త కాదని, 2002లోనూ అప్పటి ప్రభుత్వం చేయించిందన్నారు. ఓటర్లు తమ ఓటు తప్పిపోకుండా చూసుకోవాలన్నారు. అనంతరం గొడిశాలలో ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. చిగురుమామిడి మండలం ఒగులాపూర్లో రూ.10లక్షలతో నిర్మించిన వీవో సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. చిగురుమామిడిలో రూ.16 లక్షల వ్యయంతో నిర్మించే వీవో భవనానికి శంకుస్థాపన చేశారు. పెద్దమ్మతల్లి విగ్రహాప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. బొమ్మనపల్లిలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. సైదాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు చాడ కొండాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, హుస్నాబాద్ ఏఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని మడిపల్లి, అంకూషాపూర్ గ్రమాల మధ్య శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన మండలంలో కలకలం రేపింది. టౌన్ సీఐ రామకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాలు.. మడిపల్లి గ్రామానికి చెందిన పైతరి మొగిలి (52) కొన్నేళ్లుగా అంకూషాపూర్ గ్రామంలో కూలీగా, వ్యవసాయ పాలేరుగా పని చేస్తూ ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. శనివారం రాత్రి మడిపల్లి గ్రామంలో జరిగిన పీరీల పండుగకు సైకిల్పై వెళ్లాడు. అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా రెండు గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తులు బలమైన ఆయుధంతో మొగిలిపై దాడి చేయగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటన స్థలాన్ని ఏసీపీ మాధవి పరిశీలించారు. తన భర్త హత్యపై మడిపల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేశ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని మృతుడి భార్య శారద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తెలిపారు. పాత కక్షలే కారణమా..? గతంలో అంకూషాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళపై పైతరి మొగిలి లైంగికదాడికి యత్నించాడనే ఫిర్యాదుతో కేసు నమోదు కాగా జైలుకు వెళ్లి ఇటీవల వచ్చాడు. ఆ కేసుకు సంబంధించిన పాత కక్షలతో మొగిలి దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. దొంగిలించిన వాహనం బోల్తా..?వేములవాడరూరల్: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి వద్ద శనివారం అర్ధరాత్రి ఆటో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. వాహనం వద్ద ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు ఆరా తీయగా, శనివారం జగిత్యాలలో చోరీకి గురైన పెద్దూరు రామస్వామికి చెందిన వాహనంగా గుర్తించారు. బ్రిడ్జి వద్ద సైడ్ వాల్ నిర్మించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పలు వాహనాలు కూడా ఇలాంటి ప్రమాదాలకు గురయ్యాయి. -
మంచి ప్రొటీన్
ధర నిలకడగా ఉంటే రైతుకు లాభం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోటి వరకు గుడ్ల కోళ్లు ఉన్నాయి. ఇప్పుడు పేరుకే కోడిగుడ్డు రేటు పెరిగింది. కోళ్ల పరిశ్రమ రైతులకు లా భం లేదు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు వేలల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. దానా రేట్లు సైతం విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు ఉన్న ధరలు నిలకడగా కొన్ని నెలలు ఉంటే లేయర్ రైతులకు లాభం. – ఒంటెల వెంకటరమణారెడ్డి, లేయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్కోడిగుడ్లలో మంచి ప్రోటీన్లు ఉంటాయి. ఎగ్తో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. సామాన్యులకు కోడిగుడ్డు అందుబాటులో ఉండే ప్రొటీన్ ఆహారం. ఇందులో కేలరీస్, విటమిన్లు, ప్రోటీన్లు బాగా ఉంటాయి. కరోనా అనంతరం ప్రతీ ఒక్కరు ప్రోటీన్ ఉండే కోడిగుడ్లను తీసుకోవడంలో శ్రద్ద చూపుతున్నారు. – దీప్తి, వైద్యురాలు, వేములవాడ -
పిడుగుపాటుకు బాలుడు మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన పోతు ప్రణీత్ (11) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ వివరాల మేరకు.. మానేరు డ్యాంలో మేకలు కాసేందుకు తాతతో వెళ్లిన బాలుడిపై శనివారం సాయంత్రం ఉరుములతో కూడిన పిడుగు పడింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. టిప్పర్ ఢీకొని వ్యక్తి..పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని ప్రగతినగర్ చౌరస్తావద్ద ఆదివారం బైక్ను టిప్పర్ ఢీకొన్న ఘటనలో వరాల కొమురయ్య (54) మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గౌరెడ్డిపేటలో వ్యవసాయ పనుల కోసం బైక్పై బయల్దేరిన కొమురయ్యను వెనక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జమ్మికుంట(హుజూరాబాద్): మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన కొండవేన పోశాలు(56) ఆదివారం వ్యవసాయ బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో మోటారు చెడిపోయింది. మరమ్మతు కోసం పోశాలు బావిలోకి దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడా..లేదా విద్యుత్ షాక్తో మృతిచెందాడా.. అనే విషయమై గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. మృతుడికి భార్య పద్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ ఘటనపై టౌన్ సీఐ రామకృష్ణను వివరణ కోరగా, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. మీర్జంపేట ఎల్లమ్మ గుడిలో చోరీకాల్వశ్రీరాంపూర్: మండలంలోని మీర్జంపేటలో రేణుకా ఎల్లమ్మ తల్లి గుడిలో దొంగలు సుమారు రూ.50 వేలు విలువ చేసే పుస్తెల తాడు, మెట్టెలు ఎత్తుకెళ్లారు. ఆదివారం గీతకార్మికులు అమ్మవారి మెడలో గొలుసు చోరీకి గురైనట్లు కనుగొని సర్పంచుకు సమాచారం అందించారు. సర్పంచు శైలజ సదానందం గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో సందిల్ల శివాలయం, కాల్వశ్రీరాంపూర్ రామాలయంలో దేవుడి ఆభరణాలు దోచుకెళ్లిన ఘటనలు జరిగాయి. షార్ట్ సర్క్యూట్తో మెస్ దగ్ధంపెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి క్రాస్రోడ్ సమీపంలో గల శ్రీలక్ష్మి మెస్ లో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆదివారం మెస్ను మూసి ఉంచగా.. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్టు భావిస్తున్నారు. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు రూ.2లక్షల మేర నష్టం వాటిల్లి ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. దాతలు.. దయచూపరూ..జగిత్యాలరూరల్: పేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అతడికి వైద్యం చేయించేందుకు ఆ కుటుంబ సభ్యులు వైద్య ఖర్చుల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన తోట హరీశ్ జగిత్యాల పరిధిలో విద్యుత్ బిల్లులు కొట్టే స్పాట్ బిల్లర్గా పనిచేస్తున్నాడు. ఈనెల 18న హన్మాజీపేట శివారులో అతని ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడిపోగా, తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ మెడికల్ కళాశాలలో చేర్పించారు. ప్రస్తుతం అతను కోమాలో ఉండటంతో రోజుకు రూ.30 వేల వైద్య ఖర్చలవుతున్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో ఎవరైనా మానవతా దృక్పథంతో ఆర్థికసాయం చేస్తే అతని ప్రాణాలు కాపాడవచ్చు. దాతలు ఆదుకోవాలని, వివరాలకు 91009 12072 నంబర్లో సంప్రదించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
వర్రీ గుడ్డు !
బోయినపల్లి(చొప్పదండి): పెరిగిన ఉష్ణోగ్రతలతో లేయర్ కోళ్లు అనేకం చనిపోయాయి. ఫలితంగా కోడిగుడ్ల ఉత్పత్తి పడిపోయింది. ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధంతో దాణా ధరలు కూడా పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం ఒక ట్రే(30 గుడ్లు) ధర రూ.180 ఉండగా.. ఇప్పుడు రూ.200కి చేరింది. హోల్సేల్గా ఒక్కో గుడ్డు ధర రూ.6.60 పలకడంతో రిటేల్గా కిరాణా దుకాణాల్లో రూ.7 నుంచి రూ.8లకు విక్రయిస్తున్నారు. ఎండలకు తగ్గిన ఉత్పత్తి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు దంచికొట్టడంతో చాలా కోళ్ల ఫారాల్లో గుడ్ల కోళ్లు చనిపోయాయి. ఎండ వేడిమికి గుడ్ల ఉత్పత్తి భారీగా తగ్గింది. గతంలో 95 శాతం గుడ్ల ఉత్పత్తి ఉంటే ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో సుమారు కోటి సామర్థ్యం గల లేయర్స్ కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్ నుంచి హైదరాబాద్ మార్గంలో సుమారు 30 నుంచి 40 లక్షల కెపాసిటీ గల లేయర్స్ ఫారాలు ఉన్నాయి. రోజుకు 70 లక్షల గుడ్ల ఎగుమతి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి అస్సాం, హిమాచల్ప్రదేశ్, కశ్మీర్, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నాగ్పూర్, కోల్కత తదితర రాష్ట్రాలకు రోజూ సుమారు 70 లక్షల గుడ్ల వరకు ఎగుమతి అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో సైతం భారీగా కోడిగుడ్ల వాడకం ఉంది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.6కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. పెరిగిన కోడిగుడ్డు ధరలు ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8 ఎండకు చనిపోయిన కోళ్లు.. తగ్గిన గుడ్ల ఉత్పత్తి యుద్ధంతో పెరిగిన దాణా ధరలు -
తీర్థయాత్రకు వెళ్లి అనంతలోకాలకు
సుల్తానాబాద్రూరల్: తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్కు చెందిన ఫొటోగ్రాఫర్ తూర్పటి భార్గవ్కృష్ణ(36), కరీంనగర్కు చెందిన కల్యాణం శ్రీనివాస్, చల్ల వెంకటేశ్, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్కు చెందిన తూర్పటి హరిబాబు బంధువులు. మూడు రోజుల క్రితం అస్సాంలోని గౌహతిలో కామాఖ్యమాత దర్శనానికి కారులో హైదారాబాద్ వరకు వెళ్లి, అక్కడి నుంచి ఫ్లైట్లో బయలుదేరారు. తీర్థయాత్ర ముగించుకొని ఆదివారం వేకువజామున కారులో తిరుగుపయనమయ్యారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో హరిబాబును దించేందుకువ వెళ్లగా ప్రమాదవశాత్తు కారు డివైడర్ను ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా, భార్గవ్కృష్ణ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్రగాయాలైన వెంకటేశ్, హరిబాబులు వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భార్గవ్కృష్ణకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. సుల్తానాబాద్లో విషాదం పెద్దపల్లి: ఫొటోగ్రాఫర్ తూర్పాటి భార్గవకృష్ణ మృతితో సుల్తానాబాద్లో విషాదం నెలకొంది. ఆదివారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుడి ఎనిమిదేళ్ల కొడుకు పకోడి తీసుకువచ్చి ‘నాన్న లే తిను’ అనడంతో అక్కడున్నవారు కంటతడి పెట్టారు. భార్గవకృష్ణ మృతదేహానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, పెద్దపల్లి సీఐ ప్రవీణ్కుమార్, కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. కమలాపూర్ మండలం ఉప్పల్లో డివైడర్ను ఢీకొన్న కారు ఇద్దరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు -
వ్యవసాయ కోర్సులకు నోటిఫికేషన్
జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్రంలోని వ్యవసాయ, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బైపీసీ చదివి తెలంగాణ ఎప్సెట్–2026(మెడికల్ అండ్ అగ్రికల్చర్)లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఆయా కోర్సుల వ్యవధి నాలుగేళ్లు. సీట్ల వివరాలు హైదరాబాద్లోని రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, నాగర్కర్నూల్ జిల్లా పాలెం, వరంగల్ అర్బన్ జిల్లా, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, సూర్యపేట జిల్లా హుజుర్నగర్, వికారాబాద్ జిల్లా కొడంగల్, నిజామాబాద్లో పది అగ్రికల్చర్ కళాశాలలు ఉండగా, 855 సీట్లు ఉన్నాయి. వీటికి అదనంగా 500 సెల్ఫ్ ఫైనాన్స్ (పేమెంట్) సీట్లు ఉన్నాయి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బీఎస్సీ(హార్టికల్చర్) కళాశాలో 30, నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కళాశాలలో 25 సీట్లు, వీటికి అదనంగా 4 ఫేమెంట్ సీట్లు ఉన్నాయి. అన్ని కోర్సుల్లో ఫేమెంట్ సీట్లను సైతం తెలంగాణ ఎప్సెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తారు. జూలై 25 చివరి తేదీ ఆన్లైన్ దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.3,000, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. సీటు వచ్చిన సమయంలో.. వ్యవసాయ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ కోర్సులకు రూ 50,740, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ కోర్సులో పేమెంట్ సీట్లకు రూ.1,12,790 చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ సీట్లకు సంబంధించి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఫీజు చెల్లింపునకు జూలై 24, ఆన్లైన్ దరఖాస్తు పంపేందుకు జూలై 25 చివరి తేదీ. అర్హతలు ఆయా కోర్సులకు జనరల్ అభ్యర్థుల వయస్సు 17 ఏళ్లు పూర్తయి 22 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీలకు 25, పీహెచ్లకు 27 ఏళ్ల వరకు అనుమతి ఉంటుంది. వ్యవసాయ కోర్సుల్లో 25 శాతం సీట్లు రైతుల పిల్లలకు, రైతు కూలీల పిల్లలకు రిజర్వ్ చేయబడ్డాయి. అయితే, ఆ భూమి విద్యార్థి పేరు మీద లేదా తల్లితండ్రుల పేరిట పట్టా ఉండాలి. ఇంటర్ వరకు కనీసం నాలుగేళ్ల పాటు నాన్ మున్సిపల్ ఏరియా (గ్రామీణ ప్రాంతం)లో చదివి ఉండాలి. పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీజేటీఎస్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. తెలంగాణ ఎప్సెట్ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు -
కలహాల కాపురం.. వీడుతున్న దాంపత్యం
‘జగిత్యాల అర్బన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడాది నుంచి భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. వారికి ఓ బాబు జన్మించాడు. గొడవల కారణంగా మూడేళ్లుగా భార్య పుట్టింటి వద్దే ఉంటోంది’. ‘బుగ్గారం మండలకేంద్రానికి చెందిన ఓ యువతి ఆరేళ్ల క్రితం ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత రెండునెలల నుంచే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పాప జన్మించినప్పటికీ సదరు మహిళ పుట్టింటి వద్దే పాపతో ఉంటూ పోషణ కోసం కోర్టులో కేసు వేసింది’.‘కోరుట్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకుంది. పెళ్లయిన రెండేళ్లకు బాబు జన్మించాడు. అత్తామామలతోపాటు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగగా.. భర్త బాబును తన వద్దే ఉంచుకుని భార్యను పుట్టింటికి పంపాడు. దీంతో, ఆ మహిళ బాబు తనకు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది’.జగిత్యాలక్రైం: చివరి వరకు కలిసి ఉంటామని అ గ్నిసాక్షిగా ప్రమాణం చేసి వివాహం చేసుకున్న దంపతులు.. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్నా రు. మరికొందరు భార్య ఓ చోట, భర్త మరో చోట, పిల్లలు ఇంకో చోట ఉంటూ ఏళ్ల తరబడి కుటుంబ కలహాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దంపతుల మఽ ద్య చిన్న గొడవలు, కుటుంబ విషయాల్లో విభేదాలతో పచ్చని కుటుంబాల్లో చిచ్చు మొదలవుతోంది. దీంతో ఏ ఒక్కరూ తగ్గకపోగా, నువ్వెంత అంటే నే నంత అంటూ భార్యాభర్తలు విడిపోతుండడం, చివరకు పంచాయితీలు, పోలీస్స్టేషన్లు, కోర్టు మెట్లు ఎక్కుతూ ఏళ్ల పాటు కాలం వృథా చేస్తున్నారు. పిల్లలకూ ఇబ్బందులే.. భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలతో వారి పిల్లలు కూడా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది పిల్లలు తల్లి వద్ద, మరికొంత మంది తండ్రి వద్ద ఉంటున్నారు. ఇద్దరూ మెట్టు దిగిరాకపోవడంతో వారి పిల్లలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తల్లి వైపు ఉండాలో, తండ్రి వైపు ఉండాలో తెలియని వయస్సులో క్షోభ అనుభవిస్తున్నారు. ఏళ్లుగా దూరందూరం ఒక్కో జంటది ఒక్కో కారణం. కట్నం తేవట్లేదని ఒకరు, అత్తింటి వారు వేధిస్తున్నారని మరొకరు, భూమి తన పేరున రిజిస్ట్రేషన్ చేయలేదని, పుట్టిన పిల్లలు అందంగా లేరని, భార్య చెప్పినట్లు భర్త వినడం లేదని, భార్య వినట్లేదని, పట్టణాల్లో ఉందామని, స్వగ్రామాల్లోనే ఉండాలని ఇలా.. చిన్నచిన్న కారణాలతో నూటికి 30 కుటుంబాలు దాంపత్య జీవితానికి దూరమవుతున్నాయి. తల్లిదండ్రులను ఎలా కలపాలో తెలియక వారి పిల్లలు కన్నీరుమున్నీరవుతున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లి దాంపత్య జీవితాల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేక చాలా మంది దూరంగా ఉంటున్నారు. కొంత మంది భార్య ఉండగానే గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంత మంది భార్యలు తమకు జీవితంలో భర్తే వద్దంటూ మొండికేస్తున్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలతో చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో పాటు, ఆర్థికంగా కుంగిపోతూ బిక్కుబిక్కుమంటున్నాయి. చిన్నచిన్న కారణాలతోనే విడిపోతున్న కుటుంబాలు తెలిసి తెలియని వయస్సుల్లో చిన్నారుల క్షోభ -
మట్టిని సుగంధ భరితం చేసిన సాహితీవేత్త ‘నలిమెల’
కరీంనగర్కల్చరల్: పరిశోధనలు, అనువాదాల ద్వారా వేర్వేరు భాషలను ఒకే ఊపిరిలోకి ముడివేసి మట్టిని సుగంధ భరితం చేసిన బహుభాషా వేత్త, సాహితీవేత్త నలిమెల భాస్కర్ అని తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి అన్నారు. ఆదివారం కరీంనగర్ ఫిలింభవన్లో జరిగిన భాస్కర్ పరిశోధన గ్రంథాల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు. భాస్కర్ ఎంఫిల్ పరిశోధనా గ్రంథం ‘తెలుగులో సామెతలు, ద్రావిడ భాషల్లో తులనాత్మక పరిశీలన’, పీహెడీ పరిశోధన గ్రంథం ‘తెలుగు, మలయాళ సామెతలు, కుటుంబ జీవన చిత్రణ’ ఆవిష్కరించారు. అనంతరం నలిమెల తన తల్లిదండ్రులు నలిమెల బుచ్చమ్మ–రామచంద్రం స్మారక తొలి పురస్కారాన్ని కవి అన్నవరం దేవేందర్కు అందించారు. తెలంగాణ భాషను శ్వాసించిన కవి అన్నవరంను పురస్కారానికి ఎంపిక చేయడం సముచితమన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.రఘు, బీసీ రచయితల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, తెరవే జిల్లా కార్యదర్శి దామరకుంట శంకరయ్య, రంగినేని మోహనరావు, జూకంటి జగన్నాథం, కూకట్ల తిరుపతి, పొన్నం రవిచంద్ర, పీఎస్ రవీంద్ర, డాక్టర్ రఘురామన్ తదితరులు పాల్గొన్నారు. -
చకచకా అభివృద్ధి పనులు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జంక్షన్ రైల్వేస్టేషన్లో అమృత్భారత్ పథకం కింద చేపట్టిన పనులు చకచకా సాగుతున్నాయి. వివిధమండలాలు, గ్రామాలతోపాటు పొరుగు జిల్లాలకు చెందిన ప్రజలు దూర, సుదూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేలా సకల సౌకర్యాలతో రైల్వేస్టేషన్ను ఆధునికీకరిస్తున్నారు. తొలుత అభివృద్ధి పనులు నెమ్మదించినా, ఉన్నతాధికారులు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రయాణికులు, రైల్వే ఫోరం సంఘాల నాయకులు, డీఆర్యూసీసీ సభ్యులు పనులను వేగంగా చేసేలా చూడాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పనులు ఊపందుకున్నాయి. సోలార్ సిస్టం ఏర్పాటు రైల్వేస్టేషన్ ఎదుట వాహనాల పార్కింగ్ కోసం సోలార్ప్లేట్లతో కూడిన షెడ్ ఏర్పాటు చేశారు. వాటికి సమీపంలోని రైల్వే క్వార్టర్లపై కూడా సోలార్ ప్లేట్లు అమర్చారు. సూర్యవిద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాటు చేసిన షెడ్ల కింద వాహనాలను నిలిపి ఉంచుతున్నారు. మారుతున్న రూపురేఖలు అభివృద్ధి పనులతో రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోయాయి. ప్రధాన ముఖద్వారం పనులు పురోగతిలో ఉన్నాయి. లిఫ్ట్, ఎస్కలేటర్ పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు ప్లాట్ఫామ్స్, బోగీలు నిలిచే సంఖ్యను సూచించే బోర్డులు, ఇతర సేవలను సులువుగా గుర్తించేలా కొత్త సైన్బోర్డులు సైతం అమర్చారు. రైల్వేస్టేషన్ ముందు చేపట్టిన గూడ్స్షెడ్ పనులు కూడా పూర్తయ్యాయి. వానలు కురిసినా, ఎండలు దంచి కొట్టినా ఇబ్బందులు లేకుండా బియ్యం, ఎరువులు లాంటి తదితర నిల్వలను లోడింగ్, అన్లోడింగ్ చేసేందుకు వీలుగా చేపట్టిన పనులు పూర్తయ్యాయి. ఆకర్షణీయంగా ‘పెద్ద’పల్లి జంక్షన్ ఖాజీపేట–బల్హార్ష సెక్షన్లో రైలు ప్రయాణం చేసేవారికి నిర్మాణాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇది పెద్దపల్లి రైల్వేస్టేషన్ అని గుర్తించేలా కనిపిస్తున్నాయి. వీటికితోడు సమీపంలోనే చేపట్టిన రైల్వే ఓవర్బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావొస్తుండడంతో చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు చురుకుగా జరుగుతున్నాయని, కొద్దిమాసాల్లోనే అందుబాటులోకి వస్తాయని డీఆర్యూసీసీ సభ్యుడు ఎన్డీ తివారీ తెలిపారు. వేగంగా రైల్వేస్టేషన్ సుందరీకరణ పనులు ప్లాట్ఫామ్స్పై సైన్బోర్డుల ఏర్పాటు -
ఏరువాక.. సాగుదామిక
● సేద్యానికి సిద్ధమవుతున్న రైతన్న ● సన్నాల సాగుకు పెరిగిన డిమాండ్ ● ఏడు రకాల సన్నాలకే బోనస్ ● నేడు ఏరువాక పున్నమి విద్యానగర్(కరీంనగర్): ఆధునికత ఎంత ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. వైశాఖ మాసం ముగిసి జ్యేష్ట మాసం మొదలైన తర్వాత వర్షాలు కురవడం మొదలవుతాయి. జ్యేష్ట పౌర్ణమి నాటికి తొలకరి పడి భూమి మెత్తబడుతుంది. ఏరువాకతోనే వ్యవసాయ పనులు మొదలవుతాయి. నేడు ఏరువాక పౌర్ణమి సందర్భంగా కథనం. ఏరువాక అంటే.. అన్నదాతలు ఏటా జ్యేష్ట శుద్ధ పూర్ణిమనాడు జరుపుకునే పండుగ. ఏరు అంటే ఎద్దులను నాగలికి కట్టి దున్నడానికి సిద్ధం కావడం అని అర్థం. ఈరోజు రైతులు కాడెద్దుల కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు, గంటలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజించి వాటికి భక్ష్యాలు తినిపిస్తారు. పొలాలకు వెళ్లి భూతల్లికి పూజలు చేస్తారు. దుక్కి దున్నడం ప్రారంభిస్తారు. తొలకరి జల్లుల ఆగమనంతో రైతులు ఆనందోత్సాహాల మధ్య సాగు పనులు మొదలుపెడతారు. దేశమంతటా.. ఏరువాకను జ్యోతిష శాస్త్రవేత్తలు కష్యారంభం, సస్యారంభం అని వ్యవహరిస్తారు. దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. జ్యేష్టమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం దేశమంతా ఒకేలా ఉంటుంది. దేశంలో దాదాపు 80శాతం వర్షపాతం నైరుతి వల్లే కలుగుతుంది. పాడిపంటలకు, పొలం పనులకు ఆటంకాలు ఎదురుకావద్దని ఏరువాకను మహా యజ్ఞంలా పరిగణించి ఆచరిస్తారు. నాగేటి సాల్లలో సీత దొరికింది కాబట్టి సీతా యజ్ఞంగాను భావిస్తారు. మరో విశేషం ఏమిటంటే ఈ రోజే ఒడిశాలోని పూరీ జగన్నాఽథునికి స్నానోత్సవం నిర్వహిస్తారు. జాడ లేని చినుకు నైరుతి రుతుపవనాలు జూన్ ప్రారంభంలో కేరళను తాకడంతో వర్షాకాలం మొదలవుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో రుతుపవనాలు జూన్ మొదటి లేదా రెండో వారంలో విస్తరిస్తాయి. ఈ సీజన్లో జూన్ గడిచినా ఇప్పటి వరకు చినుకు జాడ లేక రైతన్న కళ్లలో వత్తులు వేసుకుని ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండడంతో వారి ఆశలు అడియాశలు అయ్యేలా ఉన్నాయి. చాలా గ్రామాల్లో వర్షాలు కురువాలని వరుణ దేవుడికి పూజలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కనీసం ఒక్క పదును వర్షం కూడా కురవకపోవడంతో సాగు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వాతావరణ పరిస్ధితులు వెక్కిరిస్తుండడంతో వ్యవసాయశాఖ రాయితీపై ఎరువులు, విత్తనాలు మంజూరు చేసినా తెచ్చుకోవడానికి రైతులు ఆసక్తి చూపడం లేదు. సన్నాలతో లాభాలు, ప్రభుత్వ ప్రోత్సాహం మార్కెట్లో డిమాండ్ ఉన్న సన్నరకాల వరి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గతేడాది 33 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఈసారి 7 రకాలకే బోనస్ ప్రకటించి వాటి సాగును ప్రోత్సహిస్తు రైతు వేదికపై విత్తనాల పంపిణీ సైతం ప్రారంభించింది. ఈ రకాలకు నీటి వినియోగం తక్కువతోపాటు అధిక దిగుబడి, మిల్లింగ్ చేస్తే అధిక బియ్యం రావడం ప్రత్యేకత. సాంబామసూరి, తెలంగాణ సోనా, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కూనారం సన్నాలు, సిద్ది, కేఎన్ఎం– 7715 (కొత్తతరం సన్న రకం) విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. -
ఫాంహౌస్లకు నోటీసులు
కొత్తపల్లి(కరీంనగర్): ‘డర్టీ హౌస్..కరీంనగర్ శివారులోని ఫామ్హౌస్ల్లో విచ్చలవిడిగా అసాంఘిక కార్యకలాపాలు’ పేరిట ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్ స్పందించారు. ఫామ్హౌస్లు, రిసార్ట్లు, ఫంక్షన్ వేదికలు, ఇతర సంస్థల యజ మానులు, నిర్వాహకులు సూచనలు పాటించాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఫామ్హౌస్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలను కవర్ చేస్తూ కనీసం 60 రోజుల రికార్డింగ్ బ్యాకప్తో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని, సందర్శకుల వివరాలతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఐదు ఫొటో గుర్తింపు పత్రాలతో కూడిన అతిథి రిజిస్టర్ను నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్ధాలు, చట్టవిరుద్ధమైన జూ దం, వ్యభిచారం, అక్రమ రవాణా, చట్టవిరుద్ధమైన ఆయుధాలు, పేలుడు పదార్థాలు లేదా మరే ఇతర చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను కలిగి ఉండటం, నిల్వ చేయడం, అమ్మడం, పంపిణీ చేయడం, వినియోగించడం వంటివి నిషేధించినట్లు నోటీసులో పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల ఆద్యుడు పీవీకరీంనగర్ కార్పొరేషన్: దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ నరసింహారావు అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఆదివారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టిన అపరచాణక్యుడిగా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్, నాయకులు వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ఉదయ్, వంగల విద్యాసాగర్, షుకూర్, నాగుల సతీష్, కుంబాల రాజ్ కుమార్, మాదాసు శ్రీనివాస్, సుదర్శన్, మాలోతు మహాలక్ష్మి పాల్గొన్నారు. మోడల్ స్కూళ్లను విలీనం చేయాలికరీంనగర్టౌన్: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ల వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి, ఉద్యోగులకు నేరుగా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ టీచర్స్ ఫెడరేషన్ (టీఎస్ఎంఎస్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు బి.కొండయ్య డిమాండ్ చేశారు. ఆదివారం వాగేశ్వరి కళాశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఎస్ఎంఎస్టీఎఫ్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందించడంలో మోడల్ స్కూల్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న టీజీటీలకు నోషనల్ సర్వీస్ ప్రయోజనం అందించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి లువేరు మహేశ్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ముల్కల విజయ్కుమార్, కార్యదర్శి లాకను బాబు, ఎంఎస్ఎఫ్ కార్యదర్శి సురేశ్ ఉన్నారు. -
పునరాలోచన చేయాలి
భూమికి, రైతుకు అనుకూలమైన విత్తనాలతో పంటలు సాగుచేస్తేనే దిగుబడులు సాధ్యమవుతాయి. ప్రభుత్వం సూచించిన విత్తన రకాలు ఈ ప్రాంత వాతావరణానికి అనుకూలంగా ఉండవు. ప్రభుత్వం నిర్దేశించిన విత్తనాలతో వరిసాగు చేస్తే నష్టాలు తప్పవు. సర్కారు మరోసారి పునరాలోచన చేయాలి. అనపురం కమలమ్మ, మహిళా రైతు, దమ్మనపేటనాకున్న ఐదు ఎకరాల్లో సన్నవడ్లు సాగుచేస్తున్న. సన్నరకాలపై ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించాలి. భూమిని బట్టి సాగయ్యే, నీటి లభ్యతను బట్టి సాగు చేసే సన్నరకాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించే సన్నరకాలను సాగు చేయాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. – ఐలు శ్రీనివాస్, పోతిరెడ్డిపేట -
సన్నాలపై సందిగ్ధం!
హుజూరాబాద్: వానాకాలం సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో వరిసాగుపై ప్రభుత్వ నిర్ణయం రైతులను అయోమయంలోకి నెట్టింది. దొడ్డు రకాలు తగ్గించి, సన్నరకాల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించగా ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. హుజూరాబాద్ డివిజన్లోని ఇల్లందకుంట మండలంలో 12,000 ఎకరాలు, హుజూరాబాద్ మండలంలో 22,800 ఎకరాలు, జమ్మికుంట మండలంలో 14,500 ఎకరాలు, సైదాపూర్ మండలంలో 19చ500 ఎకరాలు, వీణవంక మండలంలో 23,000 ఎకరాల్లో వరి సాగు చేస్తుండగా ఇందులో 60 నుంచి 70శాతం సన్నవడ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రచారం ఒకటి.. అనుమానాలు వంద సన్న రకాల సాగును పెంచేందుకు వ్యవసాయశాఖ ఫ్లెక్సీలు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తోంది. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం కేవలం 8 సన్నరకాలు మాత్రమే సాగుకు సిఫార్సు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం రూపొందించిన ఇతర రకాలు, ప్రైవేట్ కంపెనీల రకాలను సాగుచేస్తే క్వింటాల్కు రూ.500 బోనస్ వర్తిస్తుందా? లేదా? అన్న అంశంపై రైతుల్లో తీవ్ర సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో, తాము ఏ రకాలను ఎంచుకోవాలో అర్థం కాక రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాది 33 రకాలకు బోనస్ ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్లో 33 రకాల సన్నాలకు బోనస్ ప్రకటించింది. ఆ రకాలకే క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ చెల్లించింది. వ్యవసాయశాఖ ప్రచారం చేస్తున్న రకాల్లో బీపీటీ–5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్–15048 (తెలంగాణ సోనా), కేఎన్ఎం1638 (కూనారం వరి2), జేజీఎల్–1798 (జగిత్యాల సన్నాలు), జైశ్రీరామ్, హెఎంటీ సోనా, వరంగల్–44 (సిద్ధి), డబ్ల్యూజీఎల్–962 ఉన్నాయి. వీటికి బహిరంగ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఈ రకాల పంటకాలం ఎక్కువగా ఉండటంతో పాటు చీడపీడలు, పురుగు, దోమ ఉధృతి ఎక్కువగా ఉంటుందని రైతులు ఎంటీయూ– 1262, ఎంటీయూ– 1061, ఎంటీయూ– 1124కు మొగ్గు చూపుతున్నారు. అయితే సాగుకు సమయం దగ్గర పడుతున్న తరణంలో తమకు నచ్చిన రకాలపై దృష్టి పెడుతున్నారు. -
సర్కార్ బడికి జై
విద్యానగర్(కరీంనగర్): సర్కారు బడి మెరుగు పడింది. ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్రూంలు, ఉచితంగా పుస్తకాలు.. దుస్తులు, షూలతో పాటు ఉదయం అల్పాహారం.. మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సర్కారు బడిలో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. సర్కారు బడిలో గతం కన్నా అత్యుత్తమ బోధన అందుతుండడంతో అడ్మిషన్లకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలను వీడి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రీ ప్రైమరీ మొదలు అన్ని తరగతుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఫీజులు భారమై.. మాది పేద కుటుంబం. మా నాన్న కష్టపడి 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివించాడు. ఇప్పుడు ఫీజు ఎక్కువ అడగడంతో, ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచిగా చదువు చెబుతున్నారని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ఇక్కడ నేను చదివిన ప్రైవేట్ స్కూల్ కన్నా పాఠాలు మంచిగా చెప్పుతున్నారు. అర్థం కాలేదంటే మళ్లీ వివరిస్తున్నారు. ఫీజులు లేవు. అన్ని ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడే బాగుంది. – వరుకోలు సమన్విత్, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్ ఫలితాలు బాగున్నాయి 7వ తరగతి వరకు ప్రైవేట్ స్కూల్లో చదివాను. ప్రస్తుతం సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతిలో చేరాను. ఫీజులు ఉండవు. పైగా ఇక్కడ టీచర్లు మంచిగా చెప్పుతున్నారు. పదో తరగతి ఫలితాలు బాగా వచ్చాయని అందరూ చెప్పడంతో నన్ను మా నాన్న ఇక్కడ చేర్పించారు. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడే బాగుంది. – తిప్పారపు శ్రీలోహిత, 8వ తరగతి, సప్తగిరికాలనీ హైస్కూల్ కరీంనగర్లోని సప్తగిరికాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది కొత్తగా 27 అడ్మిషన్లు జరిగాయని ప్రధానోపాధ్యాయుడు ముర్మూరి రాజేందర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ఆరోతరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో ఎనిమిది మంది, తొమ్మిదవ తరగతిలో ఇద్దరు, పదోతరగతిలో ముగ్గురు చేరారని వివరించారు. ఇంకా 20 మంది వరకు చేరడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నగరంలోని కార్ఖానాగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 20 మంది చేరారని ప్రధానోపాధ్యాయుడు సంగోజు సత్యనారాయణ చారి తెలిపారు. 6వ తరగతిలో 10 మంది, ఏడోతరగతిలో నలుగురు, ఎనిమిదో తరగతిలో నలుగురు చేరారని, మరో 10 మంది చేరడానికి సిద్ధం అవుతున్నారని వివరించారు. నగరంలోని మంకమ్మతోట బాలికల ఉన్నత పాఠశాలలో ముగ్గురు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారని ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల తెలిపారు. ముగ్గురు బాలికలు 6వ తరగతిలో చేరారని తెలిపారు. మరో ఐదుగురు చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నగర పరిధిలోని ఆరెపల్లి ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 13 మంది అడ్మిషన్లు తీసుకున్నారని హెచ్ఎం ఎస్.శ్రీనివాస్ తెలిపారు. వీరిలో 6వ తరగతిలో ఏడుగురు, 7వ తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ముగ్గురు, 9వ తరగతిలో ఒక్కరు చేరారన్నారు. ఈ నెలాఖరు వరకు మరో 10 మంది వరకు రావొచ్చని తెలిపారు. -
‘బెస్ట్ అవైలబుల్’కు దరఖాస్తుల వెల్లువ
కరీంనగర్టౌన్: నిరుపేద విద్యార్థుల నుంచి బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారికి ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే జిల్లాలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో 11 ప్రైవేటు పాఠశాలల్లో 673 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తాజాగా 2026–27 విద్యా సంవత్సరానికి గాను 1వ, 5వ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా వ్యాప్తంగా 120 సీట్లు ఖాళీ ఉండగా 289 మంది దరఖాస్తులు చేసకున్నారు. నాన్ రెసిడెన్షియల్, రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తంగా 120 సీట్లకు ఒకటో తరగతికి నాన్ రెసిడెన్షియల్, ఐదో తరగతికి రెసిడెన్షియల్లో ప్రవేశం ఉంటుంది. ఎంపికై న పాఠశాలలు ఇవే.. జిలాల్లో బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపికై న పాఠశాలలు తొమ్మిది ఉన్నాయి. మరో నాలుగు పాఠశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. నందిని కాన్వెంట్, సెయింట్ ఆల్పోన్స్(కరీంనగర్), వివేకానంద విద్యానికేతన్(గంగాధర), టెట్రా హైడ్రన్ స్కూల్, మాంటిస్సోరీ(హుజూరాబాద్), న్యూమిలినియన్, విద్యోదయ, మాస్టర్ ఎస్వీ, శ్రీకాకతీయ(జమ్మికుంట). కొత్తగా దరఖాస్తు చేసుకున్న పాఠశాలలు లయోలా స్కూల్, విజ్ఞాన్ స్కూల్(కరీంనగర్), కాకతీయ స్కూల్(గంగాధర), కేరళ స్కూల్(హుజూరాబాద్). పేద విద్యార్థులకు వరం ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. ఎంపికై న వారికి పదో తరగతి వరకు ఉచితంగా మెరుగైన విద్య అందిస్తాం. ఉచిత వసతులు కల్పిస్తాం. దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. త్వరలో కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీడ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. – వై.తిరుపతిరావు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి -
ఖాకీల్లో కుమ్ములాట
కరీంనగర్ క్రైౖం: ఇద్దరు యువకులతో పోలీసులకు జరిగిన గొడవ చిలికి చిలికి గాలివానలా మారుతోంది. కరీంనగర్ పోలీసు ట్రైనింగ్ కళాశాల(పీటీసీ)కు చెందిన ఐదుగురు పోలీసు అధికారుల భవిష్యత్ ను ప్రశ్నార్థకంలోకి నెట్టింది. రోడ్డుపై జరిగిన చిన్నపాటి గొడవతో ప్రారంభమైన వ్యవహారం, వైరల్ వీడియో, పరస్పర ఆరోపణలు, బ్లాక్మెయిల్ కుట్ర కేసులు, శాఖాపరమైన విచారణల వరకు వెళ్లడం పోలీసుశాఖలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏం జరిగిందంటే.. ఈ నెల 19న నగరంలోని మంకమ్మతోటలో రోడ్డు పై బైక్ అడ్డుగా పెట్టడంతో పీటీసీకి చెందిన ఆర్ఐ, ఇద్దరు ఆర్ఎస్సైలతో ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులను గుర్తించని యువకుల్లో ఒకరు కర్రతో దాడి చేయడంతో ఆర్ఐ, ఆర్ఎస్సైలకు గాయాలయ్యాయి. యువకుడిని వెంటాడి నిర్మాణంలో ఉన్న ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి చితకబాదిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకుని శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. ముగ్గురిపై నివేదిక.. మరో ఇద్దరిపై క్రిమినల్ కేసు ఈ ఘటనపై ఆర్ఐతో పాటు ఇద్దరు ఆర్ఎస్సైలపై శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. అయితే వైరల్ అయిన సీసీ కెమెరా వీడియోను ఆధారంగా చేసుకుని పీటీసీలో పనిచేస్తున్న ఇద్దరు ఆర్ఎస్సైలు సహచర అధికారులను ఇరికించేందుకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. వీడియోను చూపిస్తూ ఒక్కో అధికారిని రూ.5 లక్షలు ఇవ్వాలని యువకుల ద్వారా బెదిరించినట్లు ఆర్ఐ ఫిర్యాదుతో ఈనెల 25న ఇద్దరు ఆర్ఎస్సైలపై టూ టౌన్లో నేరపూరిత కుట్ర, ప్రేరేపణ తదితర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఐదుగురిపై చర్యలు? ఒకే ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ, మరో ఇద్దరు క్రిమినల్ కేసును ఎదుర్కొంటుండటంతో డిపార్టుమెంట్లో జోరుగా చర్చ సాగుతోంది. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా సదరు అధికారులపై సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యలు లేదా ఇతర పరిపాలనా నిర్ణయాలు తీసుకునే ఉందని సమాచారం. సహచర అధికారుల మధ్య వ్యక్తిగత విభేదాలు, పరస్పర కక్షలు ఇంత తీవ్రస్థాయికి చేరుకోవడం పోలీసుశాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకే ఘటనలో ఐదుగురు అధికారులు విచారణను ఎదుర్కొనడం హాట్టాపిక్గా మారింది. మొత్తంగా చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్ట వ్యతిరేక కార్యకపాలాలకు దిగడంపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉండగా.. అంతర్గత కుమ్ములాటలు ఉద్యోగాలకే ఎసరు పెట్టేలా తయారయ్యాయని పలువురు పోలీసులు చర్చించుకుంటున్నారు. -
సాగునీరు ఇవ్వకుంటే పాదయాత్ర
కొత్తపల్లి(కరీంనగర్): మేడిగడ్డ పంప్హౌజ్ నుంచి వరదకాలువ ద్వారా కరీంనగర్ నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు ఇవ్వకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేపడతామని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అల్టిమేటం జారీ చేశారు. గోదావరి నుంచి 12వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళ్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కన్నెపల్లి నుంచి నీటిని మళ్లిస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే అక్కసుతోనే సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఆచంపల్లి గ్రామ శివారులోని వరద కాలువ తూం వద్ద నియోజకవర్గ రైతులు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్తో కలిసి ఆదివారం వంటావార్పు, సహపంక్తి భోజనం, మహాధర్నా చేపట్టారు. కొత్తపల్లి మండలం నాగులమల్యాల, బద్దిపల్లి, బావుపేట, ఎలగందుల, కమాన్పూర్, మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలకు వరదకాలువ తూము నుంచి నీటి మళ్లింపు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చెరువులు, కుంటలు మత్తడి దునికిస్తే.. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కరువు వచ్చి రైతులు నారు పోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారంలోగా ప్రభుత్వం స్పందించి వరద కాలువ తూము ద్వారా నీటిని విడుదల చేయాలని, లేకపోతే వరద కాలువలో 50 హెచ్పీ మోటార్లు ఏర్పాటు చేసి నీటి ఎత్తిపోస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రైతులతో కలిసి కన్నెపల్లి వరకు పాదయాత్ర నిర్వహించి మోటార్లు ఆన్ చేసి రైతులకు నీరందిస్తామని హెచ్చరించారు. -
ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.25 కోట్లు కేటాయించినట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం 53వ డివిజన్ పరిధిలోని మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్ తదితర ప్రాంతాల్లో నాలా, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వర్షాకాలం వరదతో నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టామన్నారు. స్మార్ట్సిటీ నిధులు రూ.25 కోట్లతో ముంపు సమస్యలను తీర్చనున్నామని తెలిపారు. ఇందుకోసం డీపీఆర్,టెండర్ ప్రక్రియలు పూర్తి చేసి త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ లోగా మురుగునీరు, వరద సాఫీగా నాలాలు, డ్రైనేజీల ద్వారా వెళ్లేందుకు చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. మురుగు కాలువల్లో ప్లాస్టిక్, చెత్త వేయవద్దని, పూడికతీత పనుల సమయంలో మట్టికన్నా ఎక్కువగా ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభం నగరంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం నగరపాలకసంస్థ 31వ డివిజన్ దుర్గమ్మగడ్డ,ఖాన్పూర రోడ్ నెం.11 వద్ద రూ.15 లక్షల నగరపాకలసంస్థ సాధారణ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, 31వ డివిజన్ కార్పొరేటర్ ముఖద్దర్ హుస్సేన్ పాల్గొన్నారు. -
సర్లో పొరపాట్లకు తావివ్వొద్దు
కరీంనగర్కార్పొరేషన్: నగరంలో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని నగరపాలకసంస్థ కమిషనర్, ఈఆర్వో ప్రఫుల్ దేశాయ్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం బల్దియా సమావేశ మందిరంలో బూత్ లెవెల్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై అధికారులను ఆరా తీశారు. అనంతరం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో నిర్లక్ష్యం పనికిరాదని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలన్నారు. అనుమతి లేకుండా ఎలాంటి సెలవులు తీసుకోవడానికి వీలులేదన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ ప్రకారం ఫాంలను పూర్తి చేసేలా బీఎల్వోలు ఓటరుకు అవగాహన కల్పించాలన్నారు. డ్రాఫ్ట్ ఎలక్టోరల్ లో ఎర్రర్, అన్ కలెక్టెబుల్తో పాటు, ఫార్మాట్ ప్రకారం వివరాలు నింపని వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు సువార్త, ఆయాజ్, డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియుద్దీన్, సహాయ కమిషనర్ రాజమనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే నీటి కష్టాలు
కరీంనగర్టౌన్: కరువు వచ్చినప్పుడు ఆదుకునేదే కాళేశ్వరం ప్రాజెక్టు అని, కేసీఆర్కు పేరు వస్తుందనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సాగు, తాగునీటిని అందించడం లేదని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎల్ఎండీ జలాశయం అడుగంటడంతో నగర ప్రజలు, హుజురాబాద్, మానకొండూరు నియోజకవర్గ రైతులకు నీటి ఇబ్బందులు మొదలైన దృష్ట్యా శనివారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో ఎల్ఎండీలో క్రికెట్, హాకీ, వాలీబాల్ ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రెండు దశాబ్దాల చరిత్రలో జూన్లో ఎల్ఎండీ నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్కి పడిపోవడం ఇదే మొదటిసారి అని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎత్తిపోసి ఎల్ఎండీలో ఎప్పుడూ 10 టీఎంసీలు నిల్వ ఉండేలా జీవో విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కన్నెపల్లిలోని మోటార్లను ఆన్చేసి మిడ్మానేరు, ఎల్ఎండీలను నింపాలన్నారు. ప్రజలకు నీటిని అందించే వరకు పోరాడాతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం32.0/26.0ఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 20267వర్షాలు కురవాలని.. చిగురుమామిడి: వర్షాలు కురవాలని మండలంలోని నవాబుపేట్లో శనివారం రైతులు, ట్రాక్టర్ యూని యన్ సభ్యులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వరదపాశం సమర్పించారు.వేములవాడ: శనిత్రయోదశిని పురస్కరించుకుని భీమన్న ఆలయంలోని నవగ్రహాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో రమాదేవి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లాలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. గాలిలో తేమ అధికంగా ఉంటుంది. ఈదురుగాలులు వీస్తాయి. -
15 టీఎంసీలు ఉన్నాయని నిరూపించు
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ హయాంలో ఇదే సీజన్లో ఎల్ఎండీలో 15 టీఎంసీల నీళ్లున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరూపించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. లేదంటే పదవికి రాజీనామా చేసి ముక్కునేలకు రాయాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఎల్ఎండీ నీటిమట్టాన్ని పరిశీలించి మాట్లాడారు. మానేరు డ్యాంలో నీళ్లు లేవని, తమ హయాంలో 15 టీఎంసీల నీళ్లు ఉండేవని ప్రజలను ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. డ్యాంలో ఆటల పేరుతో డ్రామాలాడారని విమర్శించారు. తాను అధికారిక ఆధారాలు చూపిస్తున్నానని, 15 టీఎంసీల నీళ్లు ఎప్పుడూ లేవన్నారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని, నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. నిరూపించకపోతే ఎమ్మెల్యే పదవికి కమలాకర్ రాజీనామా చేయాలన్నారు. ఇప్పుడున్న 5.8 టీఎంసీలలో డెడ్ స్టోరేజ్ పోను 2 టీఎంసీలు తాగునీటికి సరిపోతాయన్నారు. ఇలాంటి డ్రామాలు ఆపకపోతే డ్యాంలో ఫుట్బాల్ ఆడినట్లే, ప్రజలు బీఆర్ఎస్ నాయకులను ఫుట్బాల్ ఆడుతారని హెచ్చరించారు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పర్వతాల మల్లేశం, గోపు మల్లారెడ్డి, లయాక్, చర్ల పద్మ, నెల్లి నరేశ్, షబానా మహమ్మద్, ముల్కల కవిత, జ్యోతిరెడ్డి, అస్థాపురం తిరుమల, మహాలక్ష్మి, కంది అశోక్రెడ్డి, బషీర్, షెహన్షా, మాసుం ఖాన్, రాజ్కుమార్, హనీఫ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పల్స్పోలియో
కరీంనగర్: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం 0–5 ఏళ్ల వయస్సులోపు చిన్నారులకు ఆదివారం పల్స్పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 91,178 మంది ఐదేళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు గాను 1,00,300 పోలియో డోస్లు సిద్ధంగా ఉంచారు. 18 పీహెచ్సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, గ్రామ పంచాచతీ కార్యాలయాలు, వార్డు ఆఫీసులు, డివిజన్ కార్యాలయాలు, ప్రముఖ కూడళ్లలో సెంటర్లు ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయనున్నారు. ఈనెల 29,30వ తేదీల్లో జిల్లా కేంద్రంతో పాటు ప్రతీ గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్వాడీలు ఇంటింటా సర్వే నిర్వహించి చుక్కల మందు వేసుకోని చిన్నారులకు అక్కడే పోలియో చుక్కలు వేయనున్నారు. వలస కూలీల పిల్లలకు వారి నివాసాల వద్దకే బృందాలను పంపించి పోలియో చుక్కలు వేయనున్నారు. పనితీరుతో ప్రతిష్ట పెంచాలితిమ్మాపూర్: పోలీసులు తమ పనితీరుతో శాఖ ప్రతిష్టను పెంచాలని, రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం అన్నారు. శనివారం తిమ్మాపూర్ సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ముందుగా కార్యాలయ ఆవరణలోని పరిసరాలను పరిశీలించి మొక్క నాటారు. అనంతరం తిమ్మాపూర్, గన్నేరువరం, చిగురుమామిడి పోలీస్ స్టేషన్ల పనితీరుపై సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థానిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. సర్కిల్ పరిధిలోని రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందని సీపీ పేర్కొన్నారు. సీఐ బొల్లం రమేశ్ అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నందుకు ప్రత్యేకంగా అభినందించారు. డీజీపీ ఆదేశాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థను అందించాలని సీపీ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, గ్రామాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయ్కుమార్, ఎస్సై అన్వర్, గన్నేరువరం, చిగురుమామిడి ఎస్సైలు నరేందర్రెడ్డి, పృథ్వీగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ ఉన్నత విద్య పర్యటనకు శాతవాహన వీసీకరీంనగర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈనెల 28 నుంచి జూలై 6 వరకు జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు శాతవాహన విశ్వవిద్యాలయ వైస్ చాన్స్లర్ యు.ఉమేశ్కుమార్ ఎంపికయ్యారు. ఆయనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి.సరసిజ కూడా ఈ ప్రతినిధుల బృందంలో ఉన్నారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణ ఉన్నత విద్యా వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన సిఫార్సులు అందించనున్నారు. -
నాంపల్లి సిగలో పర్యాటక నగ
● నాంపల్లిగుట్టపై ప్రత్యేక ఏర్పాట్లు ● ఇప్పటికే ఆకట్టుకుంటున్న కాళీయమర్ధనం ● త్వరలో అందుబాటులోకి ఎయిర్ఫోర్స్ విమానంవేములవాడఅర్బన్: ఆధ్యాత్మిక క్షేత్రం వేములవాడ పట్టణంతో నాంపల్లిగుట్ట ఆధ్యాత్మికంగా.. పర్యాటకంగా ఆకట్టుకుంటుంది. దీనికితోడు తాజాగా గుట్టపైన ఎయిర్ఫోర్స్ విమానాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తయితే గుట్టకు మరింత అందం చేకూరనుంది. గరుడ వాహనంపై ఊరేగింపు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో పలు చోట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆయా సమయాల్లో స్వామివారిని గరుడ వాహనంపై ఊరేగిస్తుంటారు. పక్షులకు రాజైన గరుడవాహనంపై స్వామివారిని ఊరేగించడం భక్తులకు కనువిందు చేస్తుంది. ఈక్రమంలోనే నాంపల్లిగుట్టపై గాలిలో వెళ్లే లోహపు పిట్ట(విమానం) ఏర్పాటు చేస్తున్నారని స్థానిక పెద్దలు చర్చించుకుంటున్నారు. గుట్టపై కాళీయమర్ధనం అప్పటి ఎంపీ విద్యాసాగర్రావు హయాంలో నాంపల్లిగుట్ట అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధులు వెచ్చించారు. ఘాట్రోడ్డు, కాళీయమర్ధనం, వాటర్ ఫౌంటేయిన్లు ఏర్పాటు చేశారు. గుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనం ఆకర్షణీయంగా నిలిచింది. ఎయిర్ఫోర్స్ విమానం.. అదనపు ఆకర్షణ నాంపల్లిగుట్టపై భక్తులకు ఆహ్లాదం పంచేందుకు వీటీడీఏ అధికారులు రెండేళ్లుగా ఎయిర్ఫోర్స్ విమానం ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నారు. ఎట్టకేలకు గుట్టపైకి ఎయిర్ఫోర్స్ విమానాన్ని తీసుకొచ్చారు. వాటి పనులు ప్రారంభించి పూర్తి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ విమానాన్ని చూసేందుకు స్థానికులు గుట్టపైకి వస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. -
యువకుడిపై కర్రలు, పిడిగుద్దులతో రెచ్చిపోయిన పోలీసులు
కరీంనగర్: రాంనగర్లో ఓ యువకుడిని కర్రలతో కొట్టి, పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు పోలీసులు. దారికి అడ్డంగా బైక్ పెట్టాడనే నెపంతో ఇంట్లో నుంచి బయటకు లాగి యువకుడిపై ఆర్ఐ రమేశ్, ఆర్ఎస్ఐ దత్తు, కానిస్టేబుల్ పరుశురాం దాడి చేసినట్లు తెలుస్తోంది.సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులను గుర్తించక వారితో వాగ్వాదానికి దిగాడు బాధిత యువకుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి కరీంనగర్ టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Alleged Assault by Plain clothes #police in #Karimnagar captured on #CCTV.According to eyewitness accounts circulating on social media, three men in civilian clothes stopped a local youth over a dispute about a bike parked across the road. pic.twitter.com/tf4TIfpWMP— Ramana Reddy (@RamanaR69561502) June 26, 2026 -
యువకుడి అనుమానాస్పద మృతి
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం కమాన్పూర్ పంచాయతీ పరిధిలోని అధర్వ్ రిసార్ట్స్లో ఓ యువకుడు అనుమానస్పదంగా మృతిచెందాడు. సీఐ బిల్ల కోటేశ్వర్ తెలిపిన వివరాలు..పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన దుర్శిటి సతీశ్కు ఇద్దరు కొడుకులు. చిన్నకుమారుడైన దుర్శిటి అఖిల్ (21) రెండునెలల నుంచి హైదరాబాద్లోని తుక్కుగూడ ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 30న జరిగిన ఎల్లమ్మ జాతరకు ఇంటికి వచ్చిన అఖిల్ నాలుగురోజుల పాటు ఉండి తిరిగి హైదరాబాద్ వెళ్లాడు. అయితే అఖిల్ తన సోదరుడి బైక్ తీసుకెళ్లగా, బైక్ కోసం ఫోన్ చేయడంతో స్నేహితుడు ఎలిగేటి అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేసి కమాన్పూర్లోని అధర్వ్ రిసార్ట్కు వచ్చినట్లు తెలిపాడు. తెల్లారి నిద్రలేచి చూసేసరికి అఖిల్ కనిపించడం లేదని వెతుకుతుండగా స్విమ్మింగ్పూల్ వద్ద షర్ట్, చెప్పులు కనిపించాయని మృతుడి తండ్రి, సోదరుడికి సమాచారమిచ్చారు. వారు రిసార్ట్ వద్దకు చేరుకొని వాచ్మెన్ నెల్లి అభి అలియాస్ ఆర్యప్రకాష్ను ఆరా తీసి వెతికారు. ఈ క్రమంలో అఖిల్ మృతదేహం స్విమ్మింగ్పూల్లో లభించింది. బర్త్డే పార్టీ ఉందని ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ఎలిగేటి అరవింద్ తన కుమారుడిని పిలిచాడని, ఈ పార్టీలో 8 మంది యువతులు, 9 మంది యువకులు పాల్గొన్నట్లు తెలిసిందని మృతుడి తండ్రి తెలిపాడు. తన కొడుకు మృతిపై ఎలిగేటి అరవింద్, ముక్కెర అంజి, మరికొందరు స్నేహితులపై అనుమానం ఉందని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అఖిల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. కాగా సదరు రిసార్ట్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు
కరీంనగర్క్రైం: కరీంనగర్ అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, గతంలో వేములవాడ ఎస్హెచ్వోగా పనిచేసిన గుండెటి రాముపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి సోదాలు నిర్వహించారు. లంచం తీసుకున్న కేసులో మార్చి 18న రాము, అతడి స్నేహితుడు జక్కని వేణును అరెస్టు చేశారు. వేణు ద్వారా లంచం డబ్బులు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పుడు తన ఆదాయ వనరులకు మించి చట్టవిరుద్ధంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. జగిత్యాల జిల్లా భవానీనగర్లోని అతడి అద్దె నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.20.67 లక్షల నగదు, ఎస్బీఐ ఖాతాలో రూ.29.88 లక్షలు, అతడి తండ్రి యూబీఐ ఖాతాలో రూ.16.77 లక్షల బ్యాంకు నిల్వలు, రూ.11.97 లక్షల విలువైన ఇతర వస్తువులు, కరీంనగర్లో ఖాళీ స్థలం, సిరిసిల్లలో వాణిజ్య స్థలం సహా మొత్తం పత్రాల విలువ రూ.87.44 లక్షల ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాలు కొనసాగుతున్నాయని, కేసుపై తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు నగదు, బ్యాంకు డిపాజిట్లు, స్థలాలు వెలుగులోకి.. మార్చిలో లంచం తీసుకున్న కేసులో ఎకై ్సజ్ సీఐ, అతడి స్నేహితుడిపై కేసు -
వివక్ష చూపుతున్నరు
బెస్ట్ అవైలేబుల్ పథకంలో మా విద్యార్థి ఎంపికయ్యిండు. ఎన్టీపీసీ ప్రాంతంలోని ఓ స్కూల్ వివక్ష చూపుతంది. మా పిల్లలను వేరే కాడ కూర్చోబెట్టి చదివిస్తున్నరు. యజమానిని అడిగితే దాటవేస్తున్నరు. అధికారులు శ్రద్ధ తీసుకోవాలి. – శంకర్, నివాసి, బాధిత పేరెంట్, లింగాపూర్ బెస్ట్ అవైలబుల్ స్కూల్ అడ్మిషన్ పొందిన విద్యార్థులకు నిబంధనల ప్రకారం చదువు చెప్పాలి. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం. కొన్ని యాజమాన్యాలు బెస్ట్ అవైలేబుల్ స్కీం కొనసాగించలేమని లేఖ ఇచ్చాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. పేద విద్యార్థులకు అన్యాయం జరగనివ్వం. – రవీందర్, ఎస్సీ అభివృద్ధి అధికారి -
ఎన్యూమరేషన్ ఫామ్ నింపండి ఇలా..
సాక్షి పెద్దపల్లి: ప్రతీపౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈలక్ష్యంతో తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లిష్లో ఉండే ’ఎన్యూమరేషన్ ఫామ్’ అందిస్తారు. చాలామంది దీనిని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. సరైన సమాచారం అందిస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. ఈ ఫామ్ను ఎలా నింపాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఎన్యూమరేషన్ ఫామ్ అంటే ఏమిటి? ● ఇది ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక ఫామ్. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫామ్లో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి. మొదటి భాగం: రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకోని నింపాలి.ఫామ్పై భాగం: మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి. అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫొటో అతికించాలి.01–01–2002 నాటికి ఓటు ఉన్నట్లయితే: 2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ బాక్స్ని పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబరు(భాగం సంఖ్య), క్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సిరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి.01–01–2002 నాటికి ఓటు లేకపోతే: 2002లో మీకు ఓటు లేదు, మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ బాక్స్ పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు అనేచోట వారి తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య, పోలింగ్ స్టేషన్ నంబర్(భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ లిస్ట్లో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కావున, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్లో నింపాలి.మూడో భాగం: మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలివేయండి.ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్లో ఓటరు కార్డులో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే, ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.1. వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. 2. చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. 3. ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్తో అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి. 4. ఫొటో, సంతకం: ఫామ్ చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు. -
చెరువుల కబ్జాతో నీటి ఎద్దడి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో తాగునీటి ఎద్దడి.. చెరువులు, కుంటల కబ్జాలకు నిరసనగా సీపీఐ ఆందోళన చేపట్టింది. గురువారం నగరపాలకసంస్థ కార్యాలయం గేట్ ముందు ఆ పార్టీ నాయకులు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఆందోళన చేస్తున్న సీపీఐ శ్రేణులను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, మానేరు డ్యాం నుంచి పక్క జిల్లాలకు నీళ్లను పంపించి, నగరానికి మాత్రం నీటి కష్టాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అలాగే నగరంలోని చెరువులు, కుంటల కబ్జాలతో నీటి కష్టాలు పెరిగాయన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నడుమ సమన్వయం కొరవడడంతో సమస్య మరింత తీవ్రమవుతుందన్నారు. వెంటనే చెరువులు, కుంటలను కబ్జాల నుంచి రక్షించాలని, నీటి కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు న్యాలపట్ల రాజు, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పైడిపల్లి రాజు, బుచ్చన్న, పద్మ, అంజలి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలికరీంనగర్క్రైౖం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా జైలులో గురువారం ఖైదీలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైదీలతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జైలు సూపరింటెండెంట్ జి.విజయ్దేని మాట్లాడుతూ, మాదకద్రవ్యాలను కలిగి ఉండడం, కొనుగోలు, విక్రయం, రవాణా చేయడం తీవ్రమైన నేరమని, వాటికి కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై కలిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రత్యేక అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. జైలు వైద్యాధికారి కె.వేణుగోపాల్, ఫార్మసిస్ట్ ఆర్.శ్రీలత, జైలర్లు జి.లక్ష్మీనారాయణ, యు.పరశురాములు, డిప్యూటీ జైలర్లు ఎస్.సుధాకర్రెడ్డి, కె.అనిల్కుమార్, ఎస్.అజయ్చారి తదితరులు పాల్గొన్నారు. యోధులను మరువలేంకరీంనగర్: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధులను మరువలేమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన పోరాట యోధులను సన్మానించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పటి ప్రధాని విధించిన అత్యవసర పరిస్థితి దేశానికి గొడ్డలిపెట్టులాంటిదన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బాస సత్యనారాయణ, మాడ వెంకట్ రెడ్డి, మేకల ప్రభాకర్ యాదవ్, బోయినపల్లి ప్రవీణ్ రావు, కళ్లెం వాసుదేవ రెడ్డి, కన్నకృష్ణా, గుజ్జ శ్రీనివాస్ రావు, పుప్పాల రఘు, అలివెల్లి సమ్మిరెడ్డి, బండ రమణారెడ్డి, అనిల్, అడిచెర్ల రాజు, బండారి గాయిత్రి, తనుకు సాయికృష్ణ, రవీందర్, దాసరి రమణారెడ్డి, ఈసంపల్లి మహేశ్, తిరుమల్ రెడ్డి, వంగల ఆంజనేయులు, వాసు తదితరులు పాల్గొన్నారు. టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలకరీంనగర్టౌన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు గురువారం వెలువడ్డాయని డీఈవో ఎన్.ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 125 మంది బాలురు, 64 మంది బాలికలు మొత్తం 189 మంది పరీక్షలకు హాజరు కాగా 124 మంది బాలురు, 62 మంది బాలికలు, మొత్తం 186 (98.41శాతం) మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. విద్యార్థులు మార్కులు రీకౌంటింగ్కు రూ.500 లేదా రీవెరిఫికేషన్ కోసం రూ.1000 చెల్లించి ఈనెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు సంబంధిత వెబ్సైట్లో హాల్ టికెట్ జిరాక్స్, మార్కుల మెమోలు జతచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
మత్తు వీడండి.. క్రీడలతో ఒత్తిడిని జయించండి
కరీంనగర్క్రైం: యువత మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, చదువుల ఒత్తిడిని అధిగమించేందుకు డ్రగ్స్ వైపు కాకుండా క్రీడలు, శారీరక వ్యాయామంపై దృష్టి సారించాలని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలో భారీ అవగాహన ర్యాలీ, సదస్సు నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గీతాభవన్ చౌరస్తా మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగింది. వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. గీతాభవన్ చౌరస్తాలో నర్సింగ్ విద్యార్థినులు ప్రదర్శించిన వీధి నాటకం, అవగాహన గీతాలు ఆకట్టుకున్నాయి. అస్త్ర కన్వెన్షన్ హాలులో జరిగిన అవగా హన సదస్సులో తెలంగాణ ఈగల్ ఫోర్స్ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించి.. డ్రగ్స్ దుష్పరి ణామాలపై ప్రత్యేక షార్ట్ ఫిల్మ్ను ప్రదర్శించారు. సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల దుర్వి నియోగం సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిగా మారిందన్నారు. వ్యాసరచన, చిత్రలేఖన పో టీల విజేతలకు సీపీ బహుమతులు అందజేశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ శ్రీ నివాస్రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి సరస్వతి, డీసీపీవో పర్వీన్, ఏసీపీలు వేణుగోపాల్, విజయకుమార్, యాదగిరిస్వామి, యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ఖాన్, పోలీస్, ఎకై ్సజ్ శాఖ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కారు ప్రమాదంలో వృద్ధుడు..
సిరిసిల్లటౌన్: బజారుకెళ్లి ఇంటికి తిరిగొస్తున్న వృద్ధుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు. పట్టణంలోని వెంకంపేటకు చెందిన ఆడెపు ఆంజనేయులు(68) గురువారం రాత్రి పాతబస్టాండుకు వచ్చి మందుల షాపులోకి వెళ్లి కొనుక్కొని రోడ్డుపైకి వచ్చాడు. సిగ్నల్ పడుతోందని కారును డ్రైవర్ వేగంగా పోనిచ్చాడు. దీంతో ఎదురుగా వస్తున్న ఆంజనేయులును కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వృద్ధుడిని స్థానికులు జిల్లాసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ వాహనంతోపాటు పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆంజనేయులు తలకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి ఇద్దరు కొడకులు ఉన్నారు. కారు నడిపిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. -
పల్స్ పోలియో విజయవంతం చేయాలి
కొత్తపల్లి(కరీంనగర్): జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బంది విధిగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ సూచించారు. గురువారం కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పరిధిలోని 25 బూత్ల ద్వారా 5,642 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు, ఇందులో వందమంది వలంటీర్లు, సిబ్బంది పా ల్గొంటారని చెప్పారు. అలాగే ఆదివారం తప్పిపోయిన పిల్లలకు 29, 30వ తేదీల్లో ఇంటింటికీ తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొత్తపల్లి, ఆసిఫ్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గ్రీష్మ, మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐటీఐతో ఉపాధి అవకాశాలు
కరీంనగర్టౌన్: ఆసక్తి, తపన ఉంటే చాలు.. ఐటీఐ శిక్షణతోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు. విదేశాల్లోనూ రాణించవచ్చు. మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయిని అందిపుచ్చుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వ ఐటీఐలు అడ్వాన్స్్డ్ ట్రైనింగ్ సెంటర్లు (ఏటీసీ)గా విస్తరిస్తున్నాయి. వీటిలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రాంగణ నియామకాల్లో వివిధ పరిశ్రమల్లో ఎంపిక కానున్నారు. ఏటీసీ సెంటర్లను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఐటీఐ, ఏటీసీ కోర్సుల్లో చేరేందుకు పదో తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఈ నెల 8 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో విభిన్న ట్రేడులున్నాయి. విద్యార్థి అభిరుచికి తగిన కోర్సును ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఉన్నత చదువులు చదవలేని నిరుపేదలకు ఈ కోర్సులు వరంగా చెప్పుకోవచ్చు. వివిధ పరిశ్రమలకు సంబంధించి ఉద్యోగ నియామకాల్లో ఐటీఐ, ఏటీసీ చదవినవారికే ప్రథమ ప్రాధాన్యమిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసినవారిలో సుమారు 85 శాతం వరకు ఉపాధి పొందుతున్నట్లు ప్రభుత్వ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అందుబాటులో 1,824 సీట్లు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో 4 ఏటీసీలు ఉండగా, వాటిలో 1,824 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లిలో మూడు ప్రభుత్వ ఐటీఐల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ)లను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో మానకొండూరు నియోజకవర్గం తాడికల్, చొప్పదండి నియోజకవర్గం వెదిర, హుజూరాబాద్ నియోజకవర్గం రంగాపూర్లో ఏటీసీలు మంజూరయ్యాయి. భూసేకరణ, ప్రభుత్వ అనుమతులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇలా దరఖాస్తు చేసుకోవాలి ప్రవేశాలకు సంబంధించి ఈ నెల 30 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ ఐటీఐలో చేరే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ttps:// iti. telangana. gov. in వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. కోర్సు ప్రతిపాదికన వెబ్ ఆప్షన్లు పెట్టి అన్ని ధ్రువపత్రాలను అప్లోడ్ చేయాలి. ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, వెబ్ ఆప్షన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. దరఖాస్తు సమయంలో ఉపయోగించే సెల్ఫోన్ నంబరు, ఈమెయిల్ మాత్రం కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలి. ఏటీసీలతో 85 శాతం ఉద్యోగాలు కోర్సుల వివరాలు ఒక సంవత్సరం కోర్సులు: డీజిల్ మెకానిక్, కంప్యూటర్, వెల్డర్, కోపా(కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అనలిస్ట్) తదితర కోర్సులు. రెండు సంవత్సరాల కోర్సులు: డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్, డ్రాఫ్ట్స్మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటారు మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ తదితర విభాగాలు. ఏటీసీలో కోర్సులు: మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, కంట్రోల్ అండ్ ఆటోమేషన్(ఏడాది), ఇండస్ట్రీయల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్(ఏడాది), బేసిక్ డిజైన్ అండ్ వర్చువల్ అనాలిసిస్ అండ్ డిజైనర్ (రెండేళ్లు), అడ్వాన్స్డ్ సీఎస్సీ మెకానిక్ టెక్నీషియన్ (రెండేళ్లు), మెకానికల్ ఎలక్ట్రికల్ వెహికల్(రెండేళ్లు). పదో తరగతి విద్యార్థులకు మంచి అవకాశం. ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఈ కోర్సు పూర్తి చేసినవారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఇతర వివరాల కోసం అందుబాటులో ఉన్న ఐటీఐ కేంద్రాల్లో సంప్రదించాలి. ఐటీఐ, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లలో(ఏటీసీ) చదివిన విద్యార్థులు విదేశాల్లో సైతం ఉపాధి పొందవచ్చు. ప్రస్తుతం ఐటీఐ పాసైన విద్యార్థులకు హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. – కె.అశోక్కుమార్, ఐటీఐ ప్రిన్సిపాల్, కరీంనగర్ -
మావా!
శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026ఊ.. అంటావా మావా..ఊఊ.. అంటావావేగవంతంగా సర్ ప్రక్రియసాక్షిప్రతినిధి,కరీంనగర్/కొత్తపల్లి ●: ప్రకృతి ఒడిలో ఉపశమనం పొందేందుకు నిర్మించుకున్న ఫాంహౌస్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రి పూట సాగుతున్న ‘చీకటి వినోదాలు’ పెచ్చుమీరుతున్నాయి. మందు, విందులతో మత్తులో చిందులు.. కంచె దాటిన కామం, హద్దులు మీరిన జూదం.. వెరసి కొన్ని ఫాంహౌస్లు చీకటి కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. హైదరాబాద్కే పరిమితమైన ఫాంహౌస్ సంస్కృతి క్రమేణా జిల్లా కేంద్రాలకు సోకింది. ఫలితంగా చట్టవిరుద్ధమైన పనులకు సురక్షితమైన అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికారుల నిఘా లోపం వల్లే ఈ అక్రమ ఫాంహౌస్ల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాయన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, యువతను పెడదోవ పట్టిస్తున్న అక్రమ ఫాంహౌస్లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జోరుగా చీకటి కార్యకలాపాలు కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్ల సంస్కృతి పెరిగింది. ప్రశాంతత, వినోదాలకు వేదికలుగా నిలవాల్సిన ఫాంహౌస్లు చట్టవ్యతిరేక కార్యకాలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఫాంహౌస్ల సంస్కృతి జోరందుకుంది. రాత్రి అయిందంటే ఈ ఫాంహౌస్ వేదికలుగా మందు, విందు, వ్యభిచారం వంటి చీకటి కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా చెడు ధోరణికి అలవాటుపడ్డ యువత ఇలాంటి వేదికలను ఏర్పాటు చేస్తూ విందు, వినోదాల్లో తేలియాడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఇలాంటి అక్రమ ఫాంహౌస్లపై తక్షణమే ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా.. నిబంధనలు ఉల్లంఘించిన ఫాంహౌస్లను సీజ్ చేయడంతో పాటు, నిర్వాహకులపై కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. అనుమతిలేని నిర్మాణాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఫాంహౌస్లు నిర్మించారు. కరీంనగర్ శివారు కొత్తపల్లి, కొత్తపల్లి మండలం, కరీంనగర్ రూరల్, తిమ్మాపూర్, రామడుగు తదితర మండలాల్లో గ్రామ పంచాయతీ/మున్సిపల్ నుంచి ఎలాంటి కమర్షియల్ అనుమతులు పొందకుండా ఫాంహౌస్లను అద్దెకు ఇస్తున్నారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లోనైతే అనుమతుల్లేకుండానే నిర్మాణాలు చేపట్టి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే వీటికి విద్యుత్ మీటర్ల మంజూరుపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇష్టారీతిన ఫాంహౌస్ల నిర్మాణాలు జరిగినా పంచాయతీ, రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడంలేదు. కేవలం సొంత అవసరాల కోసం నిర్మించుకున్నట్లు చూపుతూ..లోపల మాత్రం యథేచ్ఛగా ఈవెంట్లు, పార్టీలకు అనుమతులిస్తున్నారు. వినోదం వెనుక వికృత చేష్టలు ఫాంహౌస్ సంస్కృతి తప్పు కానప్పటికీ దాని వెనుక సాగే వికృత క్రీడలే సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయి. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డ యువత మద్యం మత్తులో విచక్షణ కోల్పోతున్నారు. ఫలితంగా ఘర్ణణలకు దిగుతున్నారు. దీంతో యువత భవిష్యత్తు చీకట్లోకి జారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది. పచ్చని ప్రకృతి సాక్షిగా సాగుతున్న ఈ నల్లటి వ్యాపారాలపై అధికారులు నిఘా పెట్టినప్పుడే ఫాంహౌస్ బాగోతాలకు తెరపడుతుంది.ఫాంహౌస్ల చాటున సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిరంతరం తనిఖీలు చేస్తూ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశాం. కేవలం కుటుంబ సభ్యుల ఫంక్షన్లకు మాత్రమే అద్దెకు ఇవ్వాలని, యువతకు ఇవ్వకూడదని సూచించాం. పలు ఫాంహౌస్లలో సౌండ్ పొల్యూషన్ కేసులు నమోదు చేశాం. ఫాంహౌస్లకు తప్పనిసరిగా అనుమతులుండాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తే సీజ్ చేస్తాం. – బిల్ల కోటేశ్వర్, సీఐ, కొత్తపల్లి -
‘బెస్ట్’ స్టూడెంట్లపై వివక్ష
పెద్దపల్లి: జిల్లాలోని కొన్ని బెస్ట్ అవైలేబుల్ స్కూళ్లలో విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థులతో కాకుండా ఉచితంగా సీట్లు పొందిన వారిని వేరుగా కూర్చోబెట్టి చదువు చెబుదున్నారని పేర్కొంటున్నారు. అంతేకాదు.. స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర పోటీల్లోనూ వీరికి అవకాశం కల్పించడం లేదంటున్నారు. జిల్లాలోని 12 ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్అవైలేబుల్ కింద 587 మంది విద్యార్థులను చేర్చుకోగా.. వారిపై యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయనే విమర్శలు రావడంతో విద్యాభిమానులు నివ్వెరపోతున్నారు. కలెక్టర్కు తల్లిదండ్రుల మొర ఎన్టీపీసీ ప్రాంతంలోని విశ్వభారతి హైస్కూల్లో 133 మంది విద్యార్థులు బెస్ట్ అవైలేబుల్ ద్వారా సీట్లు పొందారని, వీరిని పలు ప్రాంతాల్లోని వివిధ స్కూళ్లలో చదివిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై విచారణ జరిపించాలని అధికారులను కోరుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులను ఆ పాఠశాలలో అనుమతించకపోగా, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, బెల్ట్లు, టై, షూస్ను సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయాలని యాజమాన్యం పేరెంట్స్కు సూచించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసి, ఇటీవల కలెక్టరేట్కు చేరకున్నారు. ఎస్సీ అభివృద్ధి అధికారి రవీందర్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొత్త మేనేజ్మెంట్ షరతులు 2026– 27 విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు పదిరోజులు గడుస్తోంది. అయినా సుమారు 20 మంది విద్యార్థులు ఇంకా తరగతులకు హాజరు కావడంలేదు. కొత్త యాజమాన్యం(రెండు దశాబ్దాల పాటు నడిచిన స్కూల్ను సొంతం చేసుకున్న మేనేజ్మెంట్) బెస్ట్ అవైలేబుల్ విద్యార్థులను స్కూల్కు రానివ్వడం లేదంటున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. కలెక్టర్ నుంచి లేఖ తీసుకురావాలని షరతు పెట్టిందని పేర్కొంటున్నారు. బెస్ట్ అవైలేబుల్ స్కూల్ విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పుస్తకాలు, యూనిఫామ్స్ వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ సదరు కొత్త మేనేజ్మెంట్ ఇందుకు విముఖత చూపడం విమర్శలకు తావిస్తోంది. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు.. ప్రైవేట్ స్కూళ్లలో బెస్ట్ అవైలేబుల్ సీట్లు పొందేవారంతా పేదలు, వెనుకబడిన వర్గాల వారే. హఠాత్తుగా యాజమాన్యం మారడంతో వీరి చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్పై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.దాదాపు రెండు దశాబ్దాల పాటు నిర్వహించిన పాఠశాల(బెస్ట్ అవైలేబుల్ స్కూల్ కూడా) యాజమాన్యం ఇటీవల బాధ్యతల నుంచి తప్పుకుంది. దీనిని సిద్ధార్థ యాజమాన్యం కొనుగోలు చేసింది. పేరు కూడా మార్చేసింది. బెస్ట్ అవైలేబుల్ స్కూల్గా ఉన్న సమయంలో 6 నుంచి పదో తరగతి వరకు ప్రతీ తరగతిలో నలుగురి నుంచి ఐదుగురు విద్యార్థులు ఉచితంగా సీట్లు కేటాయించింది. ప్రభుత్వం వారి ఫీజులు చెల్లించేది. -
గాయపడ్డ యువకుడు మృతి
చొప్పదండి: మండలంలోని ఆర్నకొండకు చెందిన గుంట మహేశ్ (25) ట్రాలీ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్ఐ నరేశ్ రెడ్డి కథనం ప్రకారం మహేశ్ బుధవారం చొప్పదండిలోని మర్లవాడలో అమరగొండ సురేశ్ కూతరు వివాహ వేడుకలకు హాజరయ్యాడు. రాత్రి బరాత్లో పాల్గొని 11.30 గంటల ప్రాంతంలో రోడ్డు వెంట ఇంటికి నడుచుకుంటు ఆర్నకొండ వైపు వెళ్తుండగా చొప్పదండి నుంచి ధర్మారం వెళ్తున్న ట్రాలీ ఆటో మర్లవాడ వద్ద ఢీకొట్టింది. దీంతో మహేశ్ కిందపడిపోవడంతో స్థానికులు వెంటనే కరీంనగర్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించగా గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ. 10 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి తండ్రి బీరయ్య ఫిర్యాదు మేరకు ట్రాలీ అటో డ్రైవర్ గుమ్మడి తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పుట్టపాక గ్రామంలో అదుపుతప్పిన కారు ● ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు మంథనిరూరల్: పెద్దపల్లి– మంథని ప్రధాన రహదారి మంథని మండలం పుట్టపాక సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దపల్లి గ్రామానికి చెందిన ఏల్పుల మణికంఠ(25) మృతి చెందాడు. వివరాలు.. సిద్దపల్లి గ్రామానికి చెందిన మణికంఠ బిట్టుపల్లికి చెందిన మిత్రుడిని మరికొంతమంది మిత్రులతో కలిసి కారులో దిగబెట్టడానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధి చల్లపల్లి స్టేజీ వద్ద కారు అదుపుతప్పి సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఉన్న షెడ్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మణికంఠ అక్కడికక్కడే మృతి చెందగా రాహుల్, ఆకాశ్, అనిల్ గాయపడ్డారు. వీరిని పెద్దపల్లికి.. అక్కడి నుంచి కరీంనగర్ తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకున్నామని ఏఎస్ఐ మల్లయ్య తెలిపారు. గీత కార్మికుడి ఆత్మహత్యహుజూరాబాద్: హుజూరాబాద్కు చెందిన పంజాల భిక్షపతి గౌడ్ (48) అనే గీతకార్మికుడు బుధవారం రాత్రి శ్మశాన వాటికలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడని..మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. భార్య శారద ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కరీంనగర్రూరల్: మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని సీపీ గౌస్ ఆలం పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో దుర్శేడ్ జెడ్పీ పాఠశాలలో చేపట్టిన ‘మాదక ద్రవ్యాల వినియోగం– యువతపై ప్రభావం’ అనే కార్యక్రమంలో సీపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్ధులు మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి ఉజ్వల భవిష్యత్ను నాశనం చేసుకోవద్దన్నారు. గంజాయి, సిగరేట్, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఙ చేయించారు. రూరల్ ఏసీపీ విజయ్కుమార్, సీఐ నిరంజన్రెడ్డి, యాంటీ నార్కోటిక్ సీఐ రఫీక్ఖాన్, ఎస్సై లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ రవీందర్, ప్రధానోపాధ్యాయుడు రత్నాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ కార్పొరేషన్: నగరాభివృద్ధి నిరంతర ప్రక్రియ అని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. నగరపాలకసంస్థ 13వ డివిజన్ మార్కండేయనగర్లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ను బుధవారం ప్రారంభించారు. ఒకటో డివిజన్ బృందావన్కాలనీ రూ.29.70 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 13వ డివిజన్ కార్పొరేటర్ తేళ్ల లక్ష్మి, ఒకటవ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కరీంనగర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్షిప్’ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం నగరంలోని ఎస్సారార్ కళాశాలలో రెండవ రోజు బీబీఏ విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్ లెర్నింగ్’ పై శిక్షణ ఇచ్చినట్లు ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ తెలిపారు. శిక్షకులు జడల రమేశ్, ప్రేమ్ చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్, మహేందర్ ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్, పైతాన్ లాంగ్వేజ్, డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.నితిన్, కామర్స్ విభాగాధిపతి టి.రాజయ్య, ఉన్నత విద్య ఐకాస చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్రెడ్డి, కళాశాల నోడల్ అధికారులు మధు, రాజేశ్, ఎం.మల్లారెడ్డి, ఎం.ఆంజనేయులు పాల్గొన్నారు. కొత్తపల్లి(కరీంనగర్): యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ విద్యుత్ భవన్ ఆవరణలో రెండోరోజు బుధవారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, యాష్హ్యాండ్లింగ్ ప్లాంట్లను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్పీడీసీఎల్ నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, కొలుపుల రాజు, యుగంధర్, సంపత్ , శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హలో.. సర్
పురుషులుకరీంనగర్ అర్బన్: బోగస్ ఓట్ల తొలగింపు, అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు లక్ష్యంగా సర్ అడుగులేస్తోంది. ఇప్పటికే మ్యాపింగ్ ప్రక్రియ దాదాపు పూర్తవగా ఇక బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టనున్నారు. గురువారం నుంచి సదరు ప్రక్రియ ప్రారంభమై జూలై 24వరకు కొనసాగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో రాజకీయ పార్టీలూ భాగస్వామ్యమయ్యాయి. జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే బీఎల్వోలకు శిక్షణనిచ్చి సంబంధిత సామగ్రిని అందజేశారు. తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించనున్నారు. మృతిచెందిన వారి పేర్లతో పాటు రెండు, మూడు ఉన్న ఓట్లను జాబితా నుంచి తొలగించడానికి కేంద్రం ’సర్’ను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. బీఎల్వోలు ప్రత్యేక యాప్ ద్వారా ప్రస్తుత ఓటర్ల వివరాలను 2002 జాబితాతో మ్యాపింగ్ చేపట్టారు. 89శాతం పూర్తిచేయగా, కొంతమందికి అవగాహన కొరవడటం, 2002లో ఓటు లేకపోవడం, జాబితాలో తల్లిదండ్రులు, తాత, నాయనమ్మ వివరాలు గుర్తించకపోవడంతో మ్యాపింగ్ జరగలేదు. సర్వేలో ఏం చేస్తారంటే బీఎల్వోలకు అవసరమైన ఫారాలతో పాటు 17వస్తువులతో కూడిన కిట్లను అందజేశారు. వారు ఇంటింటి సందర్శనలో ప్రతి ఓటరుకు రెండు ఫారాలు అందిస్తారు. వాటిని పూర్తి చేసి బీఎల్వోలకు అందించాలి. ఎన్యూమరేషన్ పత్రాల్లో కొత్త జాబితా ప్రకారం ఓటర్ల పేరు, క్రమసంఖ్య, పార్ట్ సంఖ్య, పాత ఫొటో, క్యూఆర్ కోడ్ ఉంటాయి. దానిపై ఓటరు జాబితాలోని వివరాలు రాయాలి. కొత్త ఫొటో అతికించి, ఫోన్ నంబరు, ఎపిక్ నంబరును పూరించి, సంతకం చేసి ఒకటి బీఎల్వోకు అందించాలి. మరోటి తమ వద్ద ఉంచుకోవాలి. పాత జాబితాలో వివరాలు లేకున్నా, సరిపోలకున్నా, తప్పులున్నా.. ఎన్యుమరేట్ పత్రంతో జతపర్చాలి. బీఎల్వో ఓటరు ఇంటికి వెళ్లినపుడు తాళం వేసి ఉంటే నెల రోజుల్లో మూడుసార్లు విధిగా వెళ్లాల్సి ఉంటుంది. కాగా ప్రతి పది మంది బీఎల్వోల పనితీరు పర్యవేక్షణకు ఓ సూపర్వైజర్ను నియమించగా వారిపై ఆయా తహసీల్దార్లు పర్యవేక్షిస్తారు. ప్రస్తుతం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 నుంచి 1,500 వరకు ఓటర్లుండగా సర్ పూర్తయ్యాక కేంద్రాలను హేతుబద్ధీకరిస్తారు. 2002 జాబితాతో పరిశీలన సర్వేలో ప్రధానంగా ఓటరు పేరు 2002 జాబితాలో ఉందో లేదో పరిశీలిస్తారు. పేరు లేకున్నా, ఉండి ప్రస్తుత జాబితాలో లేకుంటే కారణం తెలుసుకుంటారు. అప్పటివరకు జన్మించని వారిని గుర్తించి ప్రస్తుత జాబితాలో చేరుస్తారు. 2002 ఓటరు జాబితాలో పేరు లేని వారు తల్లిదండ్రుల వివరాల ఆధారంగా మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఓటు హక్కు పొందినవారూ తల్లిదండ్రుల వివరాలతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్వోలు అందించిన ఫారాలు తీసుకోకున్నా, వివరాలు తెలుపకున్నా ఓటరుగా అనర్హులవుతారు. వలస వెళ్లినవారు ఈ నెల రోజుల్లో విధిగా స్వగ్రామాలకు వచ్చి వివరాలు అందించాల్సి ఉంటుంది. ఓటర్లకు కాల్ బుకింగ్ సౌకర్యం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుండగా కాల్ బుకింగ్ సౌకర్యం కల్పించింది. బీఎల్వోలు ఓటరును సంప్రదించకుంటే.. నేరుగా వారినే ఇంటికి పిలిపించే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. కాల్ బుకింగ్ సౌకర్యం వినియోగించుకునేందుకు ఓటర్లు ప్లేస్టోర్ నుంచి ’ఈసీఐఎన్ఇటి’ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. కాల్ బుక్ చేసుకున్న 48 గంటల్లోపు బీఎల్వోలు సదరు ఓటరును సంప్రదిస్తారు. రోజుకు ఎన్ని కాల్స్ బుక్ అయ్యాయి..? ఏ సేవలపై ఓటర్లు వివరాలు అడిగారు..? చూపిన పరిష్కారం ఏమిటీ..? తదితర వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా, డివిజనల్ స్థాయి ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తారు. సీ్త్రలుకరీంనగర్ 45 హుజూరాబాద్ 7 మానకొండూరు 1 చొప్పదండి 8 మొత్తం 61థర్డ్జెండర్మొత్తంఓటరు జాబితాను పక్కాగా రూపొందించే ప్రక్రియలో భాగమే సర్. బీఎల్వోలు ప్రతి ఇంటికి వెళ్లి పత్రాలు జారీ చేయాల్సిందే. విధులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు. పకడ్బందీ వివరాల క్రమంలో అక్టోబర్ 1న ఓటరు తుది జాబితా ప్రకటిస్తాం. – చిత్రామిశ్రా, కలెక్టర్ ఏఈఆర్లు 16 సూపర్వైజర్లు 133 బీఎల్వోలు 1,334కరీంనగర్ 1,83,480 హుజూరాబాద్ 1,22,678 మానకొండూరు 1,10,301 చొప్పదండి 1,13,878 మొత్తం 5,30,337కరీంనగర్ 1,84,641 హుజూరాబాద్1,29,666 మానకొండూరు 1,16,083 చొప్పదండి 1,21,963 మొత్తం 5,52,353కరీంనగర్ 3,68,166 హుజూరాబాద్ 2,52,351 మానకొండూరు 2,26,385 చొప్పదండి 2,35,849 మొత్తం 10,82,751 -
వీధి వ్యాపారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
కరీంనగర్ కార్పొరేషన్: వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. నగరంలోని కళాభారతిలో బుధవారం నిర్వహించిన స్వనిధి మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వీధి వ్యాపారుల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై చర్చించేందుకు త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ పీఎం స్వనిధి పథకం ద్వారా లభిస్తున్న అవకాశాలను వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పీఎం స్వనిధి పథకం కింద మంజూరైన రూ.50 లక్షల విలువైన చెక్కును 98 మంది లబ్ధిదారులకు అందజేశారు. కొత్త వీధి వ్యాపారులకు డిజిటల్ పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ అందించారు. పుడ్స్టాళ్ల ఏర్పాటు స్వనిధి మహోత్సవంలో భాగంగా కళాభారతి ఆవరణలో వీధి వ్యాపారులతో ఫుడ్స్టాళ్లు ఏర్పాటు చేశారు. సందర్శకులు స్టాళ్లలోని ఆహారపదార్థాలను రుచిచూశారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, సీపీ గౌస్ ఆలం, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు. పలు నిర్మాణాలకు శంకుస్థాపన కరీంనగర్ అర్బన్: నూతన కలెక్టరేట్ను మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సుడా ఆధ్వర్యంలో హెలిప్యాడ్, సర్వీస్ రోడ్డు, హెలిప్యాడ్కు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేసేందుకు బుధవారం శంకుస్థాపన చేశారు. రూ.53లక్షల సుడా నిధులతో చేపట్టనున్న ఈ నిర్మాణాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ శంకుస్థాపన చేశారు. కొత్త కలెక్టరేట్ నుంచి ఈశాన్యం గేట్ వరకు రహదారి అభివృద్ధి పనులు, గార్డెన్ సుందరీకరణ పనులు ప్రారంభించారు. అధికారులపై ఎమ్మెల్యే గంగుల ఫైర్ కలెక్టరేట్లో పలు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగగా తనకు సమాచారమివ్వలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేశారు. సమాచారంతో పాటు ప్రొటోకాల్ పాటించడంలో అగౌరవపరచడం తగదని, మరోసారి పునరావృతం కావద్దని సూచించారు. -
కారు సునామీ ఖాయం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ వైఫల్యాలపై కదం తొక్కాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కరీంనగర్ మొదటి నుంచి బీఆర్ఎస్కు కంచుకోటగా మారిందన్నారు. దురదృష్టవశాత్తు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలు మోసాలతో కొన్ని స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ల విఫల పరిపాలన తర్వాత ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారన్నారు. పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారు గుర్తు మరోసారి సునామీ సృష్టించబోతోందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల నుంచి నియోజకవర్గాలవారీగా పార్టీ క్షేత్రస్థాయి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమాలను తెలుసుకున్నారు. సింగరేణిపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు, అవినీతిని కార్మికులకు తెలియజేయాలన్నారు. కరీంనగర్కు కాళేశ్వరం ప్రాజెక్టు అందించిన ప్రతిఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ నేతలంతా సామాజిక మాధ్యమాల శక్తిని అర్థం చేసుకొని, వాటి ద్వారా ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మంత్రులు జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్రెడ్డి, సతీశ్బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు. -
పథకాల అమలులో అగ్రభాగాన నిలపండి
కరీంనగర్ అర్బన్/కరీంనగర్(కొత్తపల్లి)/తిమ్మాపూర్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను అగ్రభాగాన నిలపాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక జిల్లాస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికను విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టర్ చిత్రామిశ్రా 99 రోజుల కార్యక్రమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 6నుంచి జూన్ 12వరకు 10 ప్రధాన అంశాలపై జిల్లాలో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. పరిశుభ్రత, ఫైళ్ల పరిష్కారంలో భాగంగా 4,290 ఫైళ్లు పరిష్కరించగా, 3,835 దరఖాస్తులు స్వీకరించామని, అరైవ్–అలైవ్ కార్యక్రమంలో 318 గ్రామపంచాయతీల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మెగాజాబ్ మేళాలో 292 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, ప్రజావాణి ద్వారా వచ్చిన 2,995 దరఖాస్తుల్లో 2,144 పరిష్కరించినట్లు వివరించారు. అంధ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అంధ విద్యార్థులు విద్యను ఆయుధంగా చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని జిల్లా స్పెషల్ ఆఫీసర్ సందీప్ కుమార్ సుల్తానియా సూచించారు. శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న అంధుల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సంగీత శిక్షణ గది, రికార్డు గదిని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎల్ఎండీకాలనీలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు నిర్వహిస్తున్న మేధో వికలాంగుల పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. -
విద్యాభివృద్ధికి హెచ్ఏఎల్ చేయూత
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నత విద్యా అవకాశాల విస్తరణకు కీలక అడుగుపడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తన కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల కింద రూ.10 కోట్ల వ్యయంతో నూతన డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ ఫలితంగా బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో హెచ్ఏఎల్ ప్రతినిధులు, జగిత్యాల జిల్లా యంత్రాంగం మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, హెచ్ఏఎల్ హైదరాబాద్ చీఫ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవీ మురళీకృష్ణ, డీజీఎం (హెచ్ఆర్) సూర్యకాంత్ రౌత్, సీనియర్ మేనేజర్ (హెచ్ఆర్) ఎస్.సత్యనారాయణ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..విద్యాభివృద్ధే సమాజ అభ్యున్నతికి మూలాధారమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. ధర్మపురి, వెల్గటూరు, పెగడపల్లి, గొల్లపల్లి తదితర మండలాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు ఈ డిగ్రీ కళాశాల వరంగా మారనుందని తెలిపారు. నూతన కళాశాల భవనం ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలతో నిర్మించబడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించారు. సీఎస్ఆర్ నిధులను సామాజికాభివృద్ధికి వినియోగిస్తూ విద్యారంగానికి హెచ్ఏఎల్ సంస్థ అందిస్తున్న సహకారానికి హెచ్ఏఎల్ యాజమాన్యానికి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, మంత్రి ఓఎస్డీ వైజే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేరాలు చేయడానికో యాప్..అందులో చోరీల అసైన్మెంట్లు!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుబో«ధ్ సింగ్.. పోలీసు విచారణలో చెప్పిన విషయాలు వారే నిర్ఘాంతపోయేలా చేశాయి. అతడి నేర విధానం, సాంకేతికతను వాడుకుంటున్న తీరు, తాను స్వయంగా పాల్గొననప్పుడు పకడ్బందీగా ముఠాను నడిపించడం చూస్తే మొత్తం నేర సామ్రాజ్యమే నివ్వెరపోయేలా ఉంది. కేవలం బంగారం, నగల దుకాణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడటం ఇతని ముఠా ప్రత్యేకత. అందుకే ఇతన్ని గోల్డ్ థీఫ్ (బంగారం దొంగ)గా పిలుస్తారు.ఇతను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా వాడుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్నాడు. దొంగల నెట్వర్క్ కోసం ఒక పకడ్బందీ యాప్ నిర్వహిస్తున్నాడు. తన ముఠా సభ్యులకు ప్రతినెలా జీతాలు చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా దోపిడీకి గురైన సంస్థల జాబితాలో మనప్పురం, తనిష్క్ వంటి సంస్థలుండగా, ఈ గ్యాంగ్ ఇప్పటివరకు 400 కిలోల బంగారం దొంగిలించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే.. ఇతను నేరుగా కరీంనగర్ దోపిడీలో పాల్గొనలేదు. బిహార్ జైల్లో ఉండి, పక్కా స్కెచ్ వేసి తన గ్యాంగ్తో పని కానిచ్చాడు.10 వరకే చదువుకున్నా..బిహార్కు చెందిన సుబోధ్సింగ్ కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నాడు. ప్రస్తుతం సొంత రాష్ట్రంతో పాటు కోల్కతా, మధ్యప్రదేశ్, యూపీ, జార్ఖండ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో 27 కేసులు ఎదుర్కొంటున్నాడు. కరీంనగర్లో మే 3వ తేదీన దోపిడీ జరగ్గా పోలీసులు స్వల్ప వ్యవధిలోనే కొందరు నిందితులను పట్టుకోగలిగారు. వారిని తమదైన శైలిలో విచారించి బిహార్ జైల్లో ఉన్న సుబోధ్సింగ్ కీలక సూత్రధారి అని తెలుసుకు న్నారు.అతని పాత్రపై తగిన ఆధారాలు సంపాదించడంతో పాటు పీటీ వారంట్పై మే 28న రాష్ట్రానికి తీసుకువచ్చారు. కరీంనగర్ జైల్లో పెడితే తోటి ఖైదీలకు డబ్బు ఎరవేసి లోబరుచు కునే ప్రమాదముండటంతో ఒకే ఖైదీ ఉండేందుకు అవకాశం ఉన్న హైదరాబాద్లోని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం కస్టడీలోకి తీసుకుని విచారించారు. బుధవారం సుబోధ్సింగ్తో పాటు అతని అనుచరుల కస్టడీ ముగిసింది.యాప్తో గ్యాంగ్ నిర్వహణసుబోధ్సింగ్ తన దోపిడీ నెట్వర్క్ కోసం ప్రత్యేక యాప్ నిర్వహిస్తున్నాడు. నేరాలు చేసి జైలుకు వెళ్లినప్పుడు పరిచయం అయిన చిన్న చిన్న నేరాలు చేసిన వారిని ముఠాలో చేర్చుకునే వాడు. ఒకరి గురించి మరొకరికి తెలియకుండా జాగ్రత్త పడేవాడు. నెలనెలా డబ్బులు ఇచ్చేవాడు. అత్యాధునిక ఎన్క్రిప్టెడ్ యాప్లు వాడటంలో ఆరితేరాడు. ఈ క్రమంలోనే తన గ్యాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక యాప్ వాడుతున్నాడు.ఎవరి టాస్క్ వారికే.. గ్యాంగ్లో చేరిన వారి మొబైల్ ఫోన్లో ఆ యాప్ ఇన్స్టాల్ చేస్తారు. అందులో ఎవరికి కేటాయించిన టాస్క్ వారికి మాత్రమే కనిపిస్తుంది. అలా అప్పగించిన పనిని చేయగానే వారికి అందాల్సిన డబ్బు పక్కాగా అందుతుంది. పనిలో ప్రతిభ చూపిస్తే బోనస్లు కూడా ఇస్తాడు. బంగారం దోపిడీ పని కొందరికి, రవాణా బాధ్యత మరికొందరికి, అమ్మే పని వేరేవాళ్లకు.. ఇలా ఎవరికి కేటాయించిన పనిని వారు చేస్తారు. దీంతో ఎవరైనా పోలీసులకు చిక్కినా దోపిడీ గురించిన పూర్తి సమాచారం వారికి తెలియదు. అయితే కరీంనగర్ సీపీ గౌస్ ఆలం నేతృత్వంలోని పోలీసుల బృందం చాకచక్యంగా వ్యవహరించి కేవలం రోజుల వ్యవధిలోనే జైల్లో ఉండి సుబోధ్సింగ్ వేసిన స్కెచ్కు సంబంధించిన కీలకాధారాలు న్యాయస్థానం ముందుంచి తెలంగాణకు తరలించడంలో సఫలీకృతమయ్యింది.ఎంతకైనా తెగిస్తాడు..సుబో«ధ్సింగ్ నేరాల్లో అధిక శాతం బిహార్, బెంగాల్లోనే ఉన్నాయి. తాను ఇప్పటివరకు దొంగిలించిన 400 కిలోల బంగారంలో అధిక శాతం బిహార్ను ఆనుకుని ఉన్న నేపాల్లో విక్రయించాడు. ఇతను తోటి ఖైదీలను అలాగే తన గ్యాంగ్కు సహకరిస్తారనుకున్న పోలీ సులు, జైలు అధికారులు, లాయర్లకు ఎంతైనా చెల్లిస్తాడు. లేనిపక్షంలో అవసరమనుకుంటే వారిపై దాడి చేయడం లేదా చంపేయడం ఇతని గ్యాంగ్కు అలవాటే. అందుకే పోలీసులు ఇతన్ని కరీంనగర్ జైల్లో ఉంచలేదు. సుబోధ్ సింగ్కు సంబంధించిన ఉదంతాన్ని తెలంగాణ పోలీస్ అకాడమీ (టీజీపీఏ)లో కేస్ స్టడీగా బోధించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
నెహ్రూనగర్.. ఉత్తమ బడి
సిరిసిల్లటౌన్: సిరిసిల్లలోని నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల 1978లో ఏర్పాటైంది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో 2002లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యింది. ఇంగ్లిష్ మీడియం ప్రాధాన్యత పెరగడంతో ప్రైవేట్ స్కూళ్లపై మక్కువ పెరగడంతో 2016లో విద్యార్థుల సంఖ్య 52కు తగ్గి మూతబడే పరిస్థితికి చేరింది. అప్పుడే ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలన్న లక్ష్యంతో పాఠశాల సిబ్బంది, ఎస్ఎంసీ, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ బడిలో ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేశారు. దీంతో 2016లోనే 170కి పెరిగింది. ప్రస్తుతం 191 మంది చదువుకుంటున్నారు. స్వచ్ఛ పురస్కారానికి అడుగులు ఇలా.. సురక్షిత తాగునీరు: దాతలు అందజేసిన ఆర్వో ప్లాంటు ద్వారా శుద్ధి చేసిన నీటిని విద్యార్థులకు అందిస్తున్నారు. శౌచాలయాల నిర్వహణ: టాయిలెట్స్ బాలికలు, బాలురకు సపరేట్గా నిర్మించారు. టాయిలెట్స్లో నిరంతరం వాటర్ సరఫరా, సబ్బులు, న్యాప్కిన్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ర్యాంపు నిర్మించారు. హ్యాండ్వాష్,: మధ్యాహ్న భోజన సమయంలో సబ్బు నీళ్లు అందుబాటులో ఉంచుతారు. విద్యార్థుల కెప్టెన్స్ వాటిని తోటి విద్యార్థులు వాడేలా చూస్తారు. టాయిలెట్ వెళ్లొచ్చిన వారితో ఖచ్చితంగా సబ్బుతో హ్యాండ్వాష్ చేయిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రత: ప్రతీ తరగతిగదిలో డస్ట్బిన్స్ ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో చెత్త వేయకుండా స్పెషల్ డస్ట్బిన్స్ ఉంచారు. పరిసరాల్లో గ్రీనరీ పెంచి బడిని ఆహ్లాదంగా తీర్చిదిద్దారు. ఇంకుడు గుంత: బడిలో బోరు బావికి సమీపంలో ఆరు ఫీట్లలోతు ఇంకుడుగుంతను ఏర్పాటు చేశారు. వర్షం నీరు దానిలోకి వెళ్లి భూగర్భ జలాలు పెరిగేలా నిర్మించారు. తడి, పొడి చెత్త నిర్వహణ: బడిలో ఒక చోట కంపోస్టు గుంతను తవ్వించి కూరగాయల వేస్ట్ను వేస్తారు. నెల వరకు వర్మీకంపోస్టు తయారై బడితోటకు వినియోగిస్తున్నారు. బడితోట: తక్కువ స్థలంలోనే కొత్తిమీర, ఆకుకూరలు, వంకాయలు, మునగచెట్లు, దొండ పందిరి టమాటలు పెంచి వాటితో మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు వడ్డిస్తున్నారు. విద్యార్థి సంఘాలు: విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచేలా కమిటీలు ఏర్పాటు చేశారు. గ్రంథాలయ కమిటీ పుస్తకాలు చదివించడం, విద్యార్థులను సైలెన్స్గా ఉంచడం చేస్తుంది. పరిశుభ్రం పచ్చదనం కమిటీ ప్రతినిధులు మొక్కలు పెంచడం,వాటికి నీరు ఏర్పాటు చేస్తారు. మధ్యాహ్న భోజన కమిటీ ద్వారా క్యూలైన్లు, చేతులు పరిశుభ్రంగా కడుక్కొని భోజనం చేసేలా చూస్తారు. పరిశుభ్రతపై అవగాహన: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేతులు కడుక్కోవడం, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లతో అవగాహన కల్పించడం, గోర్లు కత్తిరించడం వంటి అంశాల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఎకోక్లబ్: మట్టితో వినాయకులు తయారుచేసి పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ప్రాజెక్టు వర్క్కింద పేపర్ బ్యాగుల తయారీ, సింగిల్ప్లాస్టిక్ వాడొద్దని అవగాహన కల్పిస్తున్నారు. ఎర్త్డే, వాటర్ డే ప్రాధాన్యతలు వివరిస్తున్నారు. ఈ స్ఫూర్తి కొనసాగిస్తాం పిల్లల్లో పెరిగిన క్రమశిక్షణ, తల్లిదండ్రులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రోత్సాహంతో పాఠశాల గొప్ప మైలురాయికి చేరింది. ఇది చాలా సంతోషదాయకం. కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం పాఠశాల చరిత్రలో నిలిచిపోయిన సంఘటన. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తాం. – వాసాల హరిప్రసాద్, హెచ్ఎం -
కాంగ్రెస్ది ప్రజావంచన పాలన: జీవన్రెడ్డి
మంథని: రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని, ప్రజావంచన పాలన అని, 2014కు ముందు రైతులు ఎలా దగా పడ్డారో ఇప్పుడు మళ్లీ అదేపరిస్థితి నెలకొందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తాటిపర్తి జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని ఎస్ఎల్బీ గార్డెన్లో నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పుట్ట మధూకర్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ శిబిరంలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, భూపాలపల్లి జెడ్పీ మాజీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘవీర్సింగ్, నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీర్ల వెంకటేశ్వర్రావుతో కలిసి ఆయన మాట్లాడారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా ఆనాడు కేసీఆర్ రైతుబంధు పేరిటి ఎకరాకు రూ.పది వేలు ఇస్తే.. తాము రూ.పదిహేను వేలు ఇస్తామంటూ రైతులను మోసం చేశారన్నారు. ప్రస్తుతం రైతుబంధును బంద్ చేసి శ్రమదోపిడీ చేస్తున్నారన్నారు ప్రభుత్వం చేపట్టిన సర్పై అప్రమత్తంగా ఉండాలని, దీనిపై పూర్తిగా ప్రజల్లో అవగాహన లేదన్నారు. కేవలం మార్పులు చేర్పులు మాత్రమే అనుకుంటున్నారని, కానీ జూన్ 25 నుంచి జూలై 24వరకు ఎన్యూమెటర్ ఇంటింటికి వస్తారని, ఈ క్రమంలో గతంలో ఓటు కలిగి ఉన్నా ఫాం నిర్దేసిత సమయంలో సమర్పిస్తేనే ఓటు నమోదు ఆరంభం వుతుందన్నారు. ఫాం నింపివ్వకుంటే ఓటును తొలగించే అవకాశం ఉంటుందని, దీనిపై కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాబోయే రెండున్నర సంవత్సరాల కాలాన్ని దృష్ట్టిలో ఉంచుకుని పార్టీ పరంగా గట్టిగా కృషి చేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ దిశానిర్దేశం చేశారు. మంత్రి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న వేధింపులతో భయానక వాతావరణం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్గా ఉన్న శ్రీధర్బాబు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాదరణ పొందిన పుట్ట మధుపై రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఆరోచిస్తూ బద్నాం చేశారన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుద్దిళ్ల శ్రీధర్ పైసలతో గెలుస్తాడని, కానీ ఎప్పుడూ డబ్బులే గెలువవని తెలిపారు. అనేకమంది మహామహులు డబ్బులుండి కూడా ఓటమిని చవిచూశారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గుర్తు చేశారు. -
మెరిసిన ఒద్యారం బడి
గంగాధర(చొప్పదండి): కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత, పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయం రేటింగ్(ఎస్హెచ్వీఆర్)ను ఆరు ప్రధాన కొలమానాలకు సంబంధించిన 60 సూచికల ఆధారంగా ఒకటి నుంచి ఐదు స్టార్లు కేటాయించారు.విద్యార్థులు 300 రకాల చెట్లను నాటి సంరక్షిస్తున్నారు. పాఠశాల ఆవరణలో సేంద్రియ విధానంలో కూరగాయల సాగుచేస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంతోపాటు, మెరుగైన మూత్రశాలలు, తాగునీటి సౌకర్యం, వంటగది, డైనింగ్హాల్, బాలికలకు రెస్ట్రూం, బోధనకు డిజిటల్బోర్డు, కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యాలు కల్పించారు. -
‘ఎల్కలపల్లి’ వెలుగులు
ఫెర్టిలైజర్సిటీ: అది ఒక సాధారణ ప్రభుత్వ పాఠశాల.. అక్కడ అడుగుపెడితే కార్పొరేట్ స్కూళ్లకు సైతం అసూయ పుట్టక మానదు. పచ్చని చెట్లు, పరిమళించే పూలమొక్కలు.. అద్దంలా మెరిసే పరిసరాలు.. అన్నింటికీ మించి విద్యార్థులపై ఉపాధ్యా యులకు ఉన్న అపారమైన ప్రేమ.. ఇవన్నీ కలగలిసి ఆ పాఠశాలను దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలబెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్వచ్ఛ్ ఏవం హరిత విద్యాలయ’ (ఎస్హేచ్విఆర్) రేటింగ్లో పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల జాతీయస్థాయిలో 49వ ర్యాంక్ సాధించింది. దేశవ్యాప్తంగా వందపాఠశాలలు పోటీపడగా.. తెలంగాణ నుంచి ఎంపికై న 10 స్కూళ్లలో ఎల్కలపల్లి బడి ఉంది. ఇది రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్ సాధించడం విశేషం. తద్వారా కేంద్ర ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి రూ.లక్ష ప్రోత్సాహకం ప్రకటించింది. పచ్చదనం.. నందనవనం ఎల్కలపల్లి బడి వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదం పంచుతోంది. హరితహారంలో నాటిన వివిధ రకాలమొక్కలు, పూలతోట నందనవనాన్ని తలపిస్తోంది. తరగతి గదుల చుట్టూ పచ్చదనం విద్యార్థులకు ప్రకృతి ఒడిలో చదువుకుంటున్న అనుభూతి కలిగిస్తోంది. కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రశంసలు జాతీయస్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించి జిల్లా పేరును దేశపటంలో నిలిపిన ఎల్కలపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులను కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. అన్నింటినీ ఇలాగే తీర్చిదిద్దితే కార్పొరేట్ కన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ముందుంటారని కొనియాడారు. పరిసరాల పరిశుభ్రతలో నంబర్ వన్ పచ్చదనమే కాదు.. పరిశుభ్రతలోనూ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. సురక్షితమైన తాగునీరు, ఆధునిక శౌచాలయాలు, వ్యర్థాల నిర్వహణ వంటి విభాగాల్లోనూ ఉత్తమ ప్రమాణాలు పాటిస్తోంది. హెచ్ఎం సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం ప్రధానోపాధ్యాయుడు ఆడెపు లక్ష్మీనారాయణ దూర ప్రాంతాల నుంచి బడికి వచ్చే విద్యార్థుల కోసం తన సొంత ఖర్చులతో ఆటో సౌకర్యం కల్పించారు. విద్యార్థులను సురక్షితంగా బడికి తీసుకురావడం, తిరిగి ఇంటికి చేర్చడం ద్వారా ప్రవేశాలూ పెంచుతున్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ.. మధ్యాహ్న భోజనంతోపాటు ప్రతీవిద్యార్థికి అదనంగా పౌష్టికాహారాన్ని(న్యూట్రిషన్ ఫుడ్) అందిస్తున్నారు. పండ్లు, గుడ్లు, ఇతర పోషకాలు గల ఆహారం అందిస్తూ శారీరక, మానసిక ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్లో జాతీయస్థాయిలో గుర్తింపు సాధించడం గర్వంగా ఉంది. ఉపాధ్యాయులు, పోషకులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతోనే పాఠశాలను అభివృద్ధి చేశాం. ఇందుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. – ఆడేపు లక్ష్మీనారాయణ, హెచ్ఎం, ఎల్కలపల్లి మండల పరిషత్ పాఠశాల -
విద్యార్థిని మృతిపై తల్లిదండ్రుల ఆందోళన
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో విద్యార్థిని మృతిచెందడంతో బంధువులు ఆందోళన చేపట్టారు. చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. ముస్తాబాద్కు చెందిన ఇజా(4) ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. ఇజా బుధవారం స్కూల్కు ఆరోగ్యంగా వెళ్లిందని తల్లిదండ్రులు ఫరీదా, ఫారుక్ తెలిపారు. సాయంత్రం ఇజా ఆరోగ్యంం బాగాలేదని పాఠశాల టీచర్ ఫోన్లో తెలిపిందన్నారు. వెంటనే ఇజాను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లామని, పరిస్థితి విషమించడంతో అంబులెన్స్లో సిద్దిపేటకు తరలిస్తుండగా మృతిచెందినట్లు తెలిపారు. పాఠశాల యజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇజా మృతిచెందిందని రోదించారు. ఇజా మృతదేహంతో పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాలలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీతో ఏం జరిగిందో విచారణ చేయాలని కోరారు. ఎస్సై జ్యోతి పాఠశాలకు చేరుకుని బాధితులను శాంతింపజేశారు. ఇజా మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు తెలిపారు. లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కొరడా కరీంనగర్ క్రైం: కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు తప్పనిసరిగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల నియంత్రణ చట్టం–2005 (పీఎస్ఏఆర్ఏ) ప్రకారం లైసెన్స్ పొందిన తర్వాతే సేవలు అందించాలని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ వన్టౌన్, కరీంనగర్ టూటౌన్, చొప్పదండి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏడు సెక్యూరిటీ ఏజెన్సీలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఏజెన్సీల ద్వారా సుమారు 146 మంది సెక్యూరిటీ గార్డులు వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. చట్టబద్ధమైన అనుమతులు లేకుండా సెక్యూరిటీ సేవలు నిర్వహించడం నేరమని, సంబంధిత యజమానులు వెంటనే అవసరమైన లైసెన్సులు పొందాలని సూచించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ మల్యాల: మండలకేంద్రంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళం పగులగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఎస్సై సందీప్ కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన కాలువల సత్య భర్త దుబాయ్ వెళ్లాడు. ఆమె కుమారుడితో కలిసి కరీంనగర్లో నివసిస్తోంది. సత్య తల్లి బుచ్చవ్వ ఇంటిని ప్రతిరోజూ శుభ్రం చేస్తోంది. ఎప్పటిలాగే బుధవారం ఉదయం ఇంటిని శుభ్రపరిచేందుకు వెళ్లగా.. తాళం పగులగొట్టి కనిపించింది. దీంతో సత్యకు ఫోన్లో సమాచారం ఇవ్వగా.. ఆమె చేరుకుని ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువా పగులగొట్టి ఉంది. అందులో దాచిన రెండు తులాల బంగారం, 35 తులాల వెండి చోరీకి గురైనట్లు గుర్తించింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
దొంగ నోట్ల తయారీ ముఠా గుట్టురట్టు
పాలకుర్తిటౌన్: అక్రమ సంపాదన కోసం దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య వివరాలు వెల్లడించారు. ఈనెల 24న దేవరుప్పుల గ్రామంలోని చింత సుదర్శన్ ఇంట్లో దొంగ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై సృజన్కుమార్ సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ సమయంలో జగిత్యాల జిల్లాకు చెందిన సయ్యద్ రసూల్, దేవరుప్పులకు చెందిన చింత సుదర్శన్, ఇదే మండలంలోని కడవెండి గ్రామానికి చెందిన బషిపాక అంజయ్య, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామానికి చెందిన గోపాలదాస్ లక్ష్మయ్య దొంగనోట్లు తయారు చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి కరెన్సీ, ప్రింటర్, కారు, రూ. 8500 నగదు, నాలుగు సెల్ఫోన్లు, సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఛేదించిన ఎస్సైతోపాటు సిబ్బంది యాకూబ్, యాకేశ్, దామోదర్, అశోక్ను డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య యైటింక్లయిన్కాలనీ: పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్కాలనీ హనుమాన్నగర్లో నివాసం ఉంటున్న మొహమ్మద్ రియాజ్(28) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. రియాజ్ పుట్టుకతోనే మూగ, చెవిటి. కాలనీలోని ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతుండేవాడు. తనకు వివాహం చేయాలని తండ్రితో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 23న ఇంటికి వచ్చిన రియాజ్తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేశాడు. తల్లితో అర్ధరాత్రి వరకూ మాట్లాడి ఆ తర్వాత తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. బుధవారం చూసేరికి గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించాడు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ విద్యాలయాలుగా ఎంపిక ● నెహ్రూనగర్ మూతబడి నుంచి ఉత్తమంగా.. ● ఒద్యారం స్కూల్ హరితమయం ● బీర్పూర్లో ఉత్తమ బోధన ● స్వచ్ఛ పురస్కారాలకు ఎంపిక
బీర్పూర్.. మెరుగైన బోధన జగిత్యాలరూరల్: మెరుగైన విద్యాబోధనతోపాటు వసతులు, విద్యార్థుల క్రమశిక్షణలో ఉత్తమంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిత విద్యాలయం పురస్కారానికి ఎంపికై ంది. పాఠశాలలో 350 మంది విద్యార్థులు చదువుతుండగా, గత మూడేళ్లుగా పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధిస్తున్నారు. హరిత విద్యాలయంగా ఎంపికవడంతో పాఠశాలలో మెరుగైన వసతుల కల్పించే అవకాశం దక్కింది. ఈ పథకం కింద ఎక్స్పోజర్ విజిట్ ఫ్రీ స్టడీటూర్తోపాటు సైన్స్ అండ్ మ్యాథ్స్లో ఉత్తమ మార్కులు సాధించేందుకు బోధన వసతులు కల్పించనున్నారు. ప్రత్యేక బోధనతో ఉత్తమ ఫలితాలు బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెరుగైన విద్యాబోధన దక్కుతుంది. పదో తరగతిలో 573 మార్కులు సాధించాను. ప్రస్తుతం ఇంటర్లో ఎంపీసీలో చేరాను. – కలకోట నిహారిక, విద్యార్థి, ఎంపీసీ మెరుగైన బోధనతోనే.. బీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్యతోపాటు మౌలిక వసతులు, మెరుగైన విద్యాబోధన అందుతుంది. రానున్న రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేక నిధుల ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తాం. – సంజనభట్ల నర్సింహమూర్తి, హెచ్ఎం -
గొడిశెలపేటలో పిచ్చికుక్కల వీరంగం
వెల్గటూర్: ఎండపల్లి మండలం గొడిశెలపేటలో పిచ్చికుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. సుమారు 12 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దాడిలో గాయపడ్డవారిలో చీకట్ల పోచయ్య, మోకేనపల్లి విజయ, దొంత నర్సయ్య, బత్తుల లచ్చవ్వ, గుడిసెల నర్సవ, కాంపెళ్లి రాజయ్యతోపాటు మరికొందరు ఉన్నారు. బాధితులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మేకలమందపై చిరుతదాడిఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండా శివారు అటవీ ప్రాంతంలో బుధవారం మేకలమందపై చిరుత దాడి చేసింది. కాపరి దూరం నుంచి చిరుతను చూసి తండాకు పరుగులు పెట్టాడు. గ్రామస్తులకు విషయం తెలపడంతో కర్రలతో తండావాసులు పెద్దసంఖ్యలో అటవీప్రాంతానికి చేరుకోగా అప్పటికే చిరుత పరారైంది. ధాన్యం కొనుగోలు ఉల్లంఘనపై ఫిర్యాదు మంథని: మహారాష్ట్రలోని సిరొంచ ప్రాంతంలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో సేకరించినట్లు సృష్టించి రైస్ మిల్లుకు తరలించిన అక్రమ దందాపై ఎట్టకేలకు బాధ్యులపై చర్యలకు అధికారులు మందుకు వచ్చారు. ధాన్యం అక్రమ రవాణాలో పాత్రధారులుగా విచారణలో తేలిన పీపీసీ ఇన్చార్జి, ట్యాబ్ ఆపరేటర్, స్టాఫ్ అసిస్టెంట్, పీఏసీఎస్ సిబ్బంది, వాహన యజమానులు, డ్రైవర్లు, స్టాఫ్ అసిస్టెంట్ సోదరుడితో పాటు ఇతరులపై చర్యలు తీసుకోవాలని బుధవారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, నమ్మకద్రోహం, కుట్ర వంటి తీవ్రమైన నేరాలతోపాటు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు మార్గదర్శకాలను కూడా ఉల్లంఘించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బీర్పూర్ పీఏసీఎస్లో తొలి ‘స్మార్ట్ విలేజ్ సెంటర్’
● దేశంలోనే మొదటి రూటాజ్ కేంద్రం ఏర్పాటు ● వర్చువల్గా ప్రారంభించిన నాబార్డ్ చైర్మన్ అజయ్కుమార్ జగిత్యాలరూరల్: బీర్పూర్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో దేశంలోనే తొలి రూటాజ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ ఏర్పాటైంది. నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని సంస్థ చైర్మన్ అజయ్కుమార్ వర్చువల్గా ఢిల్లీ నుంచి ప్రారంభించారు. సాంకేతిక ఆధారిత గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించడం, సహకార వ్యవస్థను బలోపేతం చేయడం దిశగా ఈ రూటాజ్ విలేజ్ సెంటర్ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ప్రధాన శాసీ్త్రయ సలహాదారు గోవర్దన్ సింగ్ రావత్, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, డీజీఎం సాయి శ్రీనివాస్, డీడీఎం దిలీప్చంద్ర, జిల్లా సహకార అధికారి మనోజ్కుమార్, డీఏవో భాస్కర్, ఎల్డీఎం రాజ్కుమార్, కేడీసీసీ బ్యాంక్ జీఎం శ్రీధర్, చైర్మన్ రాంచందర్రావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. రూ.33.50 లక్షల సాయం రూటాజ్ స్మార్ట్ విలేజ్ సెంటర్ కోసం నాబార్డ్ వికాస్ నిధి కింద రూ.33.50 లక్షలతో మూడేళ్ల కాలపరిమితితో ప్రారంభించింది. ప్రాజెక్ట్ను హైదరాబాద్లోని కార్నెల్ సాత్గురు ఫౌండేషన్ సాంకేతిక సహకారంతో అమలు చేస్తారు. 18 వేల జనాభా కలిగిన 7 గ్రామాలను కవర్ చేస్తుంది. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం విస్తరించి.. స్థిరమైన జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆధునిక, సాంకేతిక పరికరాలను సమకూర్చడం ప్రాజెక్టు లక్ష్యం. -
నాణ్యమైన విత్తనాలు కొనండి
కొత్తపల్లి(కరీంనగర్): రైతులు నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడులు పొందాలని డీఏవో జె.భాగ్యలక్ష్మి సూచించారు. కొత్తపల్లి రైతు వేదికలో మంగళవారం కార్పొరేటర్లు వేముల కవిత, వాసాల రమేశ్తో కలిసి విత్తన మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ వరకు మేళా కొనసాగనుందని తెలిపారు. డీడీఏ కె.దామోదర్, ఏడీఏ ఓ.ఉష, ఏవోలు అనూష, బి.తిరుమలేశ్వర్, ఎంఏవో సంతోష్కుమార్, ఇఫ్కో సంస్థ జిల్లా మేనేజర్ బి.బాలాజీ పాల్గొన్నారు. శంకరపట్నం: గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పిల్లలను పంపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తామని సర్పంచ్ లావణ్య ప్రకటించారు. చింతలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల నమోదుశాతం పెంచడమే లక్ష్యంగా తల్లిదండ్రులకు ప్రోత్సాహకంగా ఇంటిపన్ను మాఫీ చేస్తామని మంగళవారం పాలకవర్గం తీర్మాణించింది. తమ పిల్లలను సర్కారుబడికి పంపించే తల్లిదండ్రుల ఇంటిపన్నును సొంత డబ్బుతో ఐదేళ్లు చెల్లిస్తానని సర్పంచ్ హామీ పత్రాన్ని హెచ్ఎంకు అందజేశారు. కరీంనగర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అన్న అక్క మెంటర్షిప్’ టీచింగ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో భాగంగా మంగళవారం నగరంలోని ఎస్సారార్ ప్రభు త్వ అటనామస్ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ రామకృష్ణ ప్రారంభించారు. మొదటి రోజు బీకాం విద్యార్థులకు ‘ఏఐ, డిజిటల్ లర్నింగ్’ పై శిక్షణ ఇచ్చా రు. శిక్షకులుగా కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగ అధ్యాపకుడు జడల రమే శ్, ప్రేమ్చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్, మహేందర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్, పైతాన్ లాంగ్వేజ్, డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా వినియోగించడంపై శిక్షణ ఇచ్చారు. కరీంనగర్టౌన్: ఏబీవీపీ రాష్ట్రశాఖ పిలుపు మేరకు జిల్లా కన్వీనర్ పూసల విష్ణు ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు బంద్ చేయించారు. ప్రభుత్వం పాఠశాల విద్యపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారంలో చొరవచూపాలని సూచించారు. స్టేట్ హాస్టల్స్ కో–కన్వీనర్ బామాండ్ల నందు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముసరి మురళి, విగ్నేష్, వంశీ, విష్ణు పాల్గొన్నారు. ముగిసిన నిందితుల కస్టడీకరీంనగర్క్రైం: పీఎంజే జువెల్లరీ చోరీ కేసులో నిందితుల ఆరు రోజుల కస్టడీ మంగళవారంతో ముగిసింది. ప్రధాన నిందితుడు సుబోధ్ సింగ్ను చంచల్గూడ కేంద్ర కారాగారానికి, మిగిలినవారిని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. దోపిడీ అనంతరం బంగారాన్ని వివిధ చోట్లకు తరలించిన మరో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు సమాచారం. త్వరలోనే వీరిని కరీంనగర్కు తీసుకురానున్నట్లు తెలిసింది. కొత్తపల్లి: బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్వర్క్స్, ఐబీ ఫీడర్ల పరిధిలోని సర్కస్ మైదానం, పద్మనాయక ఫంక్షన్ హాల్, ఐబీచౌరస్తా, సీఎస్ఐ హాస్పిటల్, రెడ్డిగారి వంటిల్లు, టీటీడీ కల్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్సెంటర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.బ్యాంక్కాలనీ ఫీడర్ పరిధిలోని తేజ స్కూల్, విద్యాధరి స్కూల్, రెడ్డి ఫంక్షన్హాల్, బూత్బంగ్లా, గుండు హనుమాన్ ఆలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026
డ్రైనేజీల్లో ప్లాస్టిక్ గుట్టలు‘చేతిలో వాటర్ బాటిల్. నీళ్లు తాగడం ఆలస్యం. రోడు పక్కన డ్రైనేజీలో పడవేయడమే. చేతిలో ప్లాస్టిక్ కవర్ ఉందా డ్రైనేజీలో వేసేయడమే. పండ్లు, కూరగాయలు.. కవర్ ఏదైతేనేం డ్రైనేజీల్లో విసిరిస్తే సరి’ ఇలా పాదాచారులు, పరిసర నివాసితులు, దుకాణదారులు ఇష్టారీతిన పడవేస్తున్న ప్లాస్టిక్ డ్రైనేజీల్లో భూతంలా మారుతోంది. డ్రైనేజీలు, నాలాల్లో గుట్టలుగా పేరుకుపోయి మురుగునీటిని ముందుకు కదలనీయడం లేదు. దీంతో మురుగునీరు నిలిచిపోయి ఆ ప్రాంతమంతా దుర్వాసన, పందులు, దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వరద ముందుకు వెళ్లలేక రోడ్డెక్కడం, ఇండ్లను ముంచెత్తడం సాధారణంగా మారింది. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా నగరంలో కొద్దిరోజులుగా డ్రైనేజీలు, నాలాల్లో సిల్ట్ తొలగిస్తున్నారు. ఎక్కువగా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు దర్శనమిస్తున్నాయి. మంగళవారం నగరంలోని జ్యోతినగర్ శివ థియేటర్ సమీపంలో మెయిన్రోడ్డు వెంట డ్రైనేజీల్లో సిల్ట్ తీశారు. దుకాణాలు, వ్యాపారసంస్థలు అధికంగా ఉండే ఆ డ్రైనేజీ నుంచి కనీసం రెండు ట్రాక్టర్ల లోడ్కు మించి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు బయటపడడం నగరపాలకసంస్థ అధికారులనే కాదు, ఆ రోడ్డు వెంట వెళ్లే వాళ్లనూ షాక్కు గురిచేసింది. ప్లాస్టిక్ గుట్టలను నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ చూసి ఆశ్యర్యపోయారు. ఒక్క డ్రైనేజీలోనే రెండు ట్రాక్టర్ల లోడ్కు పైగా ప్లాస్టిక్ బయటపడితే, నగరవ్యాప్తంగా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించడం కష్టం కాదు. ఇదిలా ఉంటే డ్రైనేజీల్లో సిల్ట్ ఎప్పటికప్పుడు తీస్తే ఈ పరిస్థితి ఉండదని, ఏడాదికి ఒకసారి తీస్తే ఇలానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. – కరీంనగర్ కార్పొరేషన్ పరిశీలిస్తున్న కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ -
విద్యుత్ ఉద్యోగుల నిరసన
కొత్తపల్లి(కరీంనగర్): యాదాద్రి పవర్ ప్లాంట్(వైటీపీఎస్)లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ), యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (ఏహెచ్పీ)లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీజీ జెన్కో చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ మంగళవారం భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి కరీంనగర్లోని విద్యుత్ భవన్ ఆవరణలో నిరసన చేపపట్టారు. టీజీపీపీజేఏసీ, టీజీఎన్పీడీసీఎల్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జెన్కో మేనేజ్మెంట్ టెండర్లు పిలవడం జరిగిందని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తే సుమారు 1,900 మంది ఉపాధి అవకాశలు కోల్పోనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాయకులు రంగు వెంకటనారాయణ, గాదం రఘు, రాజు, రమేష్, మహేందర్, సంపత్, శ్రీనివాస్, శ్రీనివాస్, పవన్ కుమార్, రజనీకాంత్, మధు, రమణారెడ్డి పాల్గొన్నారు. -
చిరుధాన్యాలతో లాభాలు
కరీంనగర్ అర్బన్: చిరుధాన్యాల సాగులో యాజ మాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలతోనే లాభాలు గడించవచ్చని భారతీయ చిరుధాన్యాల సంస్థ శాస్త్రవేత్తలు అనురాధ, దీపిక, శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో షెడ్యుల్ కులాల ఉపప్రణాళిక ద్వారా చిరుధాన్యాల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణపై శిక్షణ, వ్యవసాయ ఉత్పాదకాల పంపిణీ చేపట్టారు. చిరుధాన్యాల సాగు వివరాలు, ఖేత్ బచావో అభియాన్ ముఖ్య ఉద్దేశాలను వివరించారు. చొప్పదండి, చిగురుమామిడి మండలాలకు చెందిన వివిధ గ్రామాల 40మంది షెడ్యూల్ కులాల రైతులకు 3 కిలోల పీవైపీఎస్–2 జొన్నలు, 2కిలోల పీఆర్ఎస్–2 రాగులు, బయో పెస్టిసైడ్స్ ట్రీకోడెర్మా, ఇమిడాక్లోప్రిడ్, ప్రొపికోనజోల్, కార్బొఫురన్ గుళికలు, టార్పాలిన్లు తదితర ఉత్పాదకాలను పంపిణీ చేశారు. తెలంగాణ రైతు విజ్ఙాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త బోగరి హరికృష్ణ, కరీంనగర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి బి.రాంప్రసాద్, శాస్త్రవేత్తలు ఇ.రజనీకాంత్, జి.ఉషారాణి, ఇ.ఉమారాణి పాల్గొన్నారు. -
మోసం చేసింది!
మోటబావిసాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: వాన ముఖం చాటేసింది. సాగునీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ సారి వ్యవసాయ బావులే సాగు కు దిక్కనుకుంటే అక్కడా తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఈ ఏడాది భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో రుతుపవనాలు జాడ లేకుండా పోయాయి. ఫలితంగా ఆరుద్ర కార్తె ప్రవేశించినా నేటికీ సరైన వర్షపాతం లేక రైతులు పొలాలు దున్నేందుకు వెనకాడుతున్నారు. మరోవైపు వ్యవసాయశాఖ నీరు అధికంగా తీసుకునే పంటలు కాకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి తమను ప్రకృతి బలంగా పగబట్టినట్లుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు ముఖం చాటేశాయి, సాగునీరు అందించే జలాశయాల్లో నీళ్లు అడుగంటాయి, కనీసం వ్యవసాయ బావి మీద ఆధారపడి పంటలు సాగు చేసుకుందామంటే భూగర్భజలాలు దారుణంగా పడిపోడి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులున్నారు. దారుణంగా పడిపోయిన జలాలు జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి. గతేడాది మేతో పోల్చినప్పుడు గణనీయస్థాయిలో నీటిమట్టాలు పడిపోయాయి. ముఖ్యంగా గంగాధర మండలంలో భూ ఉపరితలం నుంచి 15 మీటర్లలో బావులన్నీ ఎండిపోయాయి. చొప్పదండి మండలంలోనూ నీటిమట్టం 14 మీటర్ల లోతున పడిపోయి అదే పరిస్థితి నెలకొంది. కరీంనగర్ రూరల్, మానకొండూరు, వీణవంక, జమ్మికుంట మండలాల్లో నీటి మట్టాలు కేవలం 4 మీటర్ల వరకే వెళ్లి నిలిచిపోయాయి. ఈ మండలాల్లో చుట్టుపక్కల ఎల్ఎండీ, ఎంఎండీ, పెద్ద చెరువులు ఉన్న కారణంగా ఇక్కడ భూగర్భ జలాలు అంతగా పడిపోలేదు. మిగిలిన మండలాల్లో సరైన నీటివనరులు లేకపోవడంతో ఇక్కడ భూగర్భజలాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. గతేడాది ఆయా మండలాల్లో భూగర్భ జలాలు మీటరు లోపే ఉండటం గమనార్హం. బోర్ల వైపు చూస్తున్న రైతులు.. ప్రస్తుతం సాగునీరు వచ్చే పరిస్థితి లేకపోవడం, వ ర్షాలు ముఖం చాటేయడం, బావులలో నీరు పాతాళానికి పోతుండటంతో రైతులు తిరిగి బోర్లు వేసే ఆలోచనలో ఉన్నారు. ఎలాగైనా ఈసారి పంటే వేయాలన్న పట్టుదలతో బోర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. నీటి పారుదల సౌకర్యం ఈసారి అంతగా కనిపించకపోవడంతో కౌలు రైతులు పొలాలు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. బోర్లు లేకుండా పంట వేయలేమని స్పష్టం చేస్తున్నారు. వ్యవసాయ బావులలో నీళ్లు అడగంటడం.. బోరు బావులు కొన్ని నిమిషాలు మాత్రమే నడవడంతో కొన్ని బావుల వద్ద నారు మడులు అంతంత మాత్రంగా తడుస్తున్నాయి.మండలం మే 2026 మే 2025 చిగురుమామిడి 7.71 0.40 చొప్పదండి 14.37 –1.25 ఇల్లందకుంట 5.62 0.27 గంగాధర 16.13 15.89 గన్నేరువరం 7.59 8.13 హుజూరాబాద్ 7.29 7.46 జమ్మికుంట 4.30 4.79 కరీంనగర్ 11.74 13.38 కరీంనగర్ రూరల్ 3.45 3.82 కొత్తపల్లి 9.15 9.01 కేశవపట్నం 5.86 6.16 మానకొండూరు 2.03 4.10 రామడుగు 11.03 10.57 సైదాపూర్ 4.91 6.72 తిమ్మాపూర్ 8.48 9.82 వీణవంక 4.64 4.88నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి, పారకానికి బావి ఉంది. ఈ బావిలో నీళ్లు అడుగంటి పోవడంతో రూ. మూడున్నర లక్షలు ఖర్చు చేసి 720 ఫీట్ల బోరు వేయించాను. ప్రస్తుతం బోరు 20 నిమిషాలు నడుస్తోంది. ఆ నీరు పశువులు తాగడానికే సరిపోతోంది. నారుమడికి పారడం లేదు. కాలం కరుణిస్తేనే పొలం సాగు చేస్తా. – అమ్ముల ఐలయ్య, గోపాల్రావుపల్లి, గంగాధర మండలం -
ఓటరు జాబితా పక్కాగా ఉండాలి
కరీంనగర్ అర్బన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు, ప్రజలు సహకారం అందించాలని కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు. సర్ కార్యక్రమం అమలులో జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలన్నారు. మంగళవారం రాత్రి రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 25నుంచి జూలై 24వరకు బీఎల్వోలు ఇంటింటి సందర్శన చేపట్టి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తారని తెలిపారు. జూలై 24న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ, జూలై 31నుంచి ఆగష్టు 30వరకు అభ్యంతరాల స్వీకరణ, సెప్టెంబర్ 28వరకు అభ్యంతరాల పరిష్కారం చేపట్టి అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురించనున్నట్లు వెల్లడించారు. బీఎల్వోలు ఇంటింటి సర్వే సందర్భంగా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని, ఫారం అందని వారు లేదా పొరపాటున జాబితాలో చేరని అర్హులైన ఓటర్లను గుర్తించి నమోదు చేయించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, మాస్టర్ ట్రైనర్ సంపత్, వివిధ పార్టీల నేతలు సిరాజ్ హుస్సేన్, సత్తినేని శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, మిల్కూరి వాసుదేవ రెడ్డి, ఎర్రవెల్లి రవీందర్, సిరిసిల్ల అంజయ్య పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో
కరీంనగర్: ఈ నెల 28న జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీరామ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, సూపర్వైజరీ సిబ్బందికి నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ జిల్లాలో సున్నా నుంచి ఐదు సంవత్సరాల్లోపు వయసు గల 91,178 మంది చిన్నారులను గుర్తించామని, వారికి పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 535 పోలియో బూత్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటికే 1,00,300 వ్యాక్సిన్ డోసులు చేరాయని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సిబ్బందికి సమగ్ర అవగాహన బూత్ల నిర్వహణ, వ్యాక్సిన్ నిల్వ, రవాణా, కోల్డ్ చైన్ మెయింటెనెన్స్, ఇంటింటి సందర్శనలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. ముఖ్యంగా వలస కార్మికులు, సంచార జాతుల (మైగ్రెంట్) కుటుంబాల పిల్లలను గుర్తించి, వారికిచుక్కలు అందేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుధ, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీవోఎంహెచ్ఎన్ డాక్టర్ సనా, డాక్టర్ విప్లవశ్రీ, పీవోఎన్సీడీ డాక్టర్ ప్రభుదాస్ పాల్గొన్నారు. -
ఈడనే ఉంటాం సారూ!
కరీంనగర్ అర్బన్: తమ కొడుకులు తాము బతికుండగానే నరకం చూపిస్తున్నారని వృద్ధ దంపతులు ప్రజావాణిని ఆశ్రయించారు. రెండేళ్ల క్రితం ఇలాగే ఫిర్యాదు చేస్తే అప్పటి ఆర్డీవో చర్యలు చేపట్టినా వారిలో మార్పు లేదని వాపోయారు. ‘సారూ.. మీరే న్యాయం చేయాలి.. లేకుంటే ఈడనే ఉంటాం’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్లో చోటుచేసుకున్న ఈ ఘటన అక్కడున్నవారిని కలచివేసింది. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన వేనేంక కనకరాజు–అంజవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచి అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఉన్న ఆస్తిని పంచగా.. అప్పటి నుంచి కుమారులు తమపట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. రోగమొస్తే ఆసుపత్రికి తీసుకుపోవడం లేదని, సపర్యలు చేయడం లేదని, కనీసం తిండి కూడా పెట్టడం లేదని రోదించారు. తామిచ్చిన ఇంటిని తీసుకున్న కోడలు నానా రభస చేస్తోందని, ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. 2024లో ఇదే ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, అప్పుడు ఒప్పందం రాశారని, కానీ పూర్తిగా పాటించడం లేదని వివరించారు. ఆస్తులు పంచడమే తాము చేసిన పాపమని తామిచ్చిన దాంట్లో 5.14 ఎకరాల భూమిని తమ పేరున మార్చాలని కలెక్టర్తో గోడు వెల్లబోసుకున్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. -
బోగ్యాస్కు చెక్
● రేషన్, గ్యాస్ కనెక్షన్లకు ఈకేవైసీ తప్పనిసరి ● బోగస్ ఏరివేతకు కేంద్రం నిర్ణయం ● ఈ నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు ● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్కరీంనగర్అర్బన్: బోగస్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేపడుతోంది. గ్యాస్ కనెక్షన్దారులు ఈ నెలాఖరులోగా ఈకేవైసీ తప్పనిసరి చేసుకోవాలని లేకుంటే గ్యాస్ రాయితీ రద్దవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కలెక్టర్ చిత్రా మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని గ్యాస్ ఏజెన్సీలను ఆదేశించారు. అలాగే రేషన్ కార్డు యజమానితో పాటు సభ్యులంతా ఈకేవైసీ చేసుకోవాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించగా జిల్లాలో నత్తనడకన సాగుతోంది. రేషన్ దుకాణాల్లోనే సదరు ప్రక్రియ చేపట్టాల్సి ఉండగా ప్రతినెలా 1 నుంచి 15–17వరకు సరుకుల పంపిణీ ఉంటుండగా డీలర్లు సరిగ్గా స్పందించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు ఈకేవైసీ జరిగింది కేవలం 71.86శాతమే. మూడేళ్ల కిందటే ఈ ప్రక్రియ పూర్తిచేయాలని కేంద్రం సూచించింది. కానీ, ఆచరణలో ఆమడదూరం. బోగస్ కనెక్షన్లు ఎన్నో? రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ల సంఖ్యను పరికిస్తే విస్తుపోవాల్సిందే. జిల్లాలో 10శాతం కుటుంబాలకే రేషన్ కార్డులు లేవని సమాచారం. బడా రాజకీయ నేతలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, సీఏలు, పలు కంపెనీల్లో కీలక పాత్ర పోషిస్తున్నవారు మినహా అందరికీ రేషన్ కార్డులున్నాయి. రేషన్ కార్డుల సంఖ్య 3.17లక్షలు కాగా గ్యాస్ కనెక్షన్లు 4.37లక్షలు అంటే 1.20లక్షల కనెక్షన్లు అదనంగా ఉన్నాయి. ఇందులో 20వేల కనెక్షన్లను మినహాయించినా లక్ష కనెక్షన్లు అదనమే. ఈ లెక్కన బోగస్ కనెక్షన్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. కనెక్షన్లలో చాలావరకు మృతిచెందినవారి పేరున ఉన్నట్లు తెలుస్తోంది. ఈకేవైసీ పూర్తయితే అక్రమాల చిట్టా వెలుగుచూడనుంది. నెలాఖరులోపు చేసుకోకుంటే రాయితీ రద్దు గ్యాస్ కనెక్షన్ ఉన్నవారంతా ఈకేవైసీ చేసుకోవాల్సిందే. సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి వేలిముద్ర, ఐరిస్ ఇస్తే సరిపోతుంది. ఒక కుటుంబానికి ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలనేది నిబంధన కాగా పలువురు రెండుమూడు ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఈకేవైసీ పూర్తయితే ఒకే గ్యాస్ కనెక్షన్కు సబ్సిడీ రానుంది. మరోరకంగా అక్రమ కనెక్షన్ల సంఖ్య వెలుగుచూడనుంది. మహాలక్ష్మి పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.500 గ్యాస్ బండ ఇస్తుండగా ఉజ్వల పథకం కింద కేంద్రం రాయితీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేవైసీ చేసుకోకుంటే ఇవేవీ వర్తించవని కలెక్టర్ స్పష్టం చేస్తున్నారు. నత్తనడకన రేషన్ కేవైసీ రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేసుకునే ప్రక్రియలో ఏలాంటి గడువు లేకపోగా ఎప్పుడైనా గడువు విధించవచ్చని, నిజమైన లబ్ధిదారులకే రేషన్ సరుకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కార్డులోని ప్రతి సభ్యుడు వేలిముద్ర, ఐరిస్ స్కాన్ ధ్రువీకరణ చేయించుకోవాలి. రాష్ట్రంలో ఏ రేషన్ దుకాణంలోనైనా ఈకేవైసీ చేసుకునే వెసులుబాటు ఇచ్చారు. కాగా, రేషన్ షాపులు మాత్రం మూసివేసి ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. సరుకులు ఇచ్చేటప్పుడు మాత్రమే డీలర్లు దుకాణం తెరుస్తుండగా మిగతా సమయాల్లో సేవలందించడం లేదు. పరిస్థితి ఇలాగుంటే ఈకేవైసీ ఎలా చేసుకోవాలని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర కార్డుల్లో ఇప్పటివరకు 70 శాతానికి పైగా ఈ ప్రక్రియ పూర్తయింది. మిగతా కార్డుదారులు తప్పకుండా ఈ–కేవైసీ చేయించుకోవాలి. – నర్సింగరావు, జిల్లా పౌరసరఫరాల అధికారి -
డబుల్ బెడ్రూంలు ఇస్తారా.. ఆక్రమించుకోమంటారా..?
కరీంనగర్టౌన్: గత ప్రభుత్వ హయాంలో నిర్మించి న డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు ఇస్తారా.. లేక సీ పీఐ ఆధ్వర్యంలో ఆక్రమించుకోమంటారా.. అని పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, నగరంలో ఎంతోమంది నిరుపేదలు అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ కిరా యి కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పే ర్కొన్నారు. చింతకుంట ప్రాంతంలో సుమారు 600 ఇళ్లు నిర్మించి పదేళ్లు కావస్తున్నా అర్హులకు కే టాయించకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా వాటిని పంపిణీ చేయలేదని, తక్షణమే అర్హులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. నాయకులు కసిరెడ్డి సురేందర్రెడ్డి, న్యాలపట్ల రా జు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, బుచ్చన్నయాదవ్, అంజలి, సదానందం తదితరులు పాల్గొన్నారు. -
పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ మరమ్మతు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు ఫీడర్ పరిధిలో టౌన్ 2, ఏడీఈలు ఎం.లావణ్య, పి.శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గణేశ్నగర్, కమాన్ మెయిన్రోడ్, విశాల్మార్ట్, ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ శ్రీరాంనగర్ ఫీడర్ పరిధిలోని వేంకటేశ్వరఆలయం కమాన్, బీరప్పగుడి కమాన్, కొత్తయాస్వాడ, విద్యానగర్, సాలంపుర ప్రాంతాలు, ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ వాటర్ వర్క్స్, ఐబీ ఫీడర్ పరిధిలో సర్కస్ మైదానం, పద్మనాయక ఫంక్షన్ హాల్, ఐబీ చౌరస్తా, సీఎస్ఐ హాస్పిటల్, టీటీడీ కళ్యాణ మంటపం, గాయత్రీ టిఫిన్ సెంటర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. -
ప్రారంభానికి ముందే పగుళ్లు
కరీంనగర్ అర్బన్: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభానికి ముందే పగుళ్లు బారింది. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నూతన కలెక్టరేట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా పనులు సా..గుతూనే ఉన్నాయి. అప్పటి కలెక్టర్ కర్ణన్ నుంచి ఇప్పటి కలెక్టర్ చిత్రా మిశ్రా వరకు నిర్మాణం పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించడం పరిపాటిగా సాగుతోంది. ఈ క్రమంలో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. జీ ప్లస్ 2లో నిర్మించగా భవనంపై ఫ్లోరింగ్లో చాలా చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. సెకండ్ కోటింగ్ రంగు వేయడం పూర్తవగా పై ప్రాంతంలో అసలు ప్రైమరీ, ఫైనల్ కలర్ వేయకుండానే వదిలేశారు. ఈ నెలలో కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయగా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. 27న సీఎం ప్రారంభిస్తారని అధికార వర్గాల సమాచారం కాగా ఆ లోపు పనులు పూర్తవడం అనుమానమే. హడావుడి పనుల క్రమంలో నాణ్యతను విస్మరించే అవకాశాలు లేకపోలేదు. బిల్డింగ్పై పగుళ్లు, కలర్ వేయకుండా వదిలిన ప్రాంతం -
తరలివచ్చి.. సమస్యలు విన్నవించి
మొత్తం అర్జీలు: 192, అత్యధికంగా హౌజింగ్: 71 కరీంనగర్ కార్పొరేషన్: 65 ఎన్పీడీసీఎల్: 06, వారధి సొసైటీ: 04కరీంనగర్ అర్బన్: సమస్యలు పరిష్కరించాలని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి ప్రజలు బారులు తీరారు. తమ పరిస్థితిని కలెక్టర్ చిత్రా మిశ్రాకు వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. అలాగే, సార్లు లేకుండా ఎలా చదువుకోవాలని విద్యార్థులు ప్రజావాణి బాట పట్టారు. ఒక్కో సారు రిటైరవుతుండగా టీచర్ పోస్టులు ఖాళీగా మిగులుతున్నాయని, భర్తీ చేయడం లేదని దివ్యాంగులు వాపోయారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీఆర్వో స్వామి, ఆర్డీవోలు షర్మిళ, జలకుమారి బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రధానంగా భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లకు సంబంధించి మొత్తం 192 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్బంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వారి మాటల్లోనే.. -
తుప్పు పడుతున్న ప్రభుత్వ వాహనం
‘రాజుల సొమ్ము రాళ్ల పాలేనంటూ’ చాటుతున్నారీ అధికారులు. అధికారుల ప్రయాణాల కోసం ప్రభుత్వం వాహనాలు కేటాయించగా కొత్త వాహనాల మోజులో పడిన అధికారులు పాత కారును ఇలా ముళ్లపొదల్లో పడేశారు. ఇదెక్కడో కాదు సాక్షాత్తు కలెక్టరేట్ సముదాయంలో హెలిప్యాడ్ నిర్మించే ప్రాంతంలో నిర్లక్ష్యంగా వదిలేశారు. సదరు సఫారీ వాహనాన్ని వేలం వేసినా డబ్బులు వచ్చేవి లేదా చిన్నపాటి మరమ్మతు చేసినా వినియోగించే పరిస్థితి. కానీ, కనిపించకుండా ఓ మూలన పడేశారు. దీంతో కారు టైర్లు, ఇతర పరికరాలు చోరీకి గురవుతున్నాయి. లక్షలు వెచ్చించి ప్రభుత్వం వాహనం సమకూర్చితే లక్షణంగా వదిలేయడం విడ్డూరం. – కరీంనగర్ అర్బన్ -
దంచికొట్టిన వాన
పంచాయతీ కార్యాలయంలోకి వస్తున్న వరద ఇంట్లో చేరిన వరద శంకరపట్నం: మండలంలోని కొత్తగట్టు గ్రామంలో సోమవారం వర్షం దంచి కొట్టింది. ఉక్కపోతతో సతమతమైన ప్రజలు వర్షంతో కొంత ఊరట చెందారు. వరదనీరు జీపీ కార్యాలయం, ఇళ్లల్లోకి చేరింది. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి ఎత్తు పెంచడంతో రోడ్డుపై వరదనీరు నేరుగా జీపీ భవనంలోకి చేరింది. డోర్లు వేసినా వరద నీరు ఆగక పోవడంతో జీపీ సిబ్బంది వరదనీటిని దారి మళ్లించారు. కుర్చీలు, టేబుళ్లు నీళ్లలో ఉండడంతో పైళ్లు తడవకుండా ఇబ్బందులు పడ్డారు. రజకవాడలోకి వరదనీరు చేరడంతో నిత్యావసర సామగ్రి తడిసిపోయాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి విత్తన మేళా
కరీంనగర్అర్బన్: రైతుల ప్రయోజనమే అంతిమ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతుండగా రైతు వేదికలను వేదికగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 23 నుంచి 30వరకు విత్తన మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. దీంతో విత్తన మేళా నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలోని 76 రైతు వేదికల్లో మేళా నిర్వహించనున్నారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడమే దీని ప్రధాన ఉద్దేశం కాగా కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ కార్పొరేషన్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్థానికంగా ఉండే విత్తన డీలర్లు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సన్నరకాలైన బీపీటీ–5204, ఆర్ఎన్ఆర్–15048, హెచ్ఎంటీ సోనా, జైశ్రీరామ్, కేఎన్ఎం–7715, డబ్ల్యూజీఎల్–44 విత్తనాలు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే కంది, పెసర, మినుములు, నువ్వులు, వేరుశనగ, కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ ఎరువులు ఉండనున్నాయి. కరీంనగర్కార్పొరేషన్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు దయతోనే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు రాజకీయంగా ఎదిగాడని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం అన్నారు. సోమవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడారు. శ్రీధర్బాబుపై మధు చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. మధుకు రాజకీయ భిక్ష పెట్టిందే శ్రీధర్బాబు కుటుంబమన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే మధు రూ.900 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కుటుంబం రూ.3 లక్షల కోట్లు దోచుకుంటే, ఆ పార్టీ ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ కాకముందు ఆస్తులు ఎంత, ప్రస్తుతం ఎంత అనే విషయాలను మధు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందా, గంజాయి వ్యాపారాలు, హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర ఆయనదని ధ్వజమెత్తారు. తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల పాల్జేసి, అందులో రూ.3 లక్షల కోట్లను కేసీఆర్ కటుంబం దోచుకుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట రూ.1.50 లక్షల కోట్ల వ్యయంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదని, బీజేపీలో ఆ పార్టీ విలీనం కావడం ఖాయమన్నారు. నాయకులు సముద్రాల అజయ్, గోషిక శంకర్, రవీందర్ పాల్గొన్నారు. కరీంనగర్క్రైం: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలను సోమవారం సీపీ గౌస్ ఆలం పోస్టర్ విడుదల చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ కార్యక్రమాలల్లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన సదస్సులు, డ్రగ్స్కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ, డ్రగ్–ఫ్రీ క్యాంపస్ డిక్లరేషన్ తదితర కార్యక్రమాలు వారం పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకు టీజీ ఏప్సెట్– 2026 తొలి విడత కౌన్సెలింగ్ సోమవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. మొదటి రోజు స్లాట్ బుక్ చేసుకున్న 609 మంది విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించినట్లు పిన్సిపాల్ వివరించారు. -
సొసైటీ బ్రాండ్తోనే..
ఇప్పటి వరకు సొసైటీల ద్వారా ఎరువులు, రుణాలు, ధాన్యం కొనుగోళ్లు మాత్రమే చేపట్టాం. ఇక నుంచి విత్తనోత్పత్తి చేసి ఆ విత్తనాలను రైతులకు సొసైటీ బ్రాండ్తో ఇవ్వనున్నాం. ఇలా ఇవ్వడం ద్వారా నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి పొందవచ్చు. – జిల్లా రైతు విజ్ఞాన కోఆర్డినేటర్ డా.ఆర్.సాయికుమార్ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యంగా పాలకవర్గం పనిచేస్తుంది. సొసైటీ ద్వారానే విత్తనోత్పత్తి చేపట్టి సొసైటీ బ్రాండ్పై రైతులకు అందిస్తాం. పైలట్ ప్రాజెక్టు కింద వేములవాడ సొసైటీని ఎంపిక చేశారు. మా సొసైటీకి విత్తనోత్పత్తి చేసేందుకు సొంత స్థలాలు కూడా ఉన్నాయి. – ఏనుగు తిరుపతిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్, వేములవాడ -
వడదెబ్బతో రైతు మృతి
చిగురుమామిడి: మండలంలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన రైతు కుందేళ్ళ వెంకటయ్య (48) వడదెబ్బతో ఆదివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. వెంకటయ్య ఆదివారం తన పొలంలో పనులు చేస్తుండగా ఎండ వేడి తట్టుకోలేక స్పృహతప్పి పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే వెంకటయ్య ఆదివారం మృతిచెందినట్లు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గౌరయ్య తెలిపారు. సోమవారం మృతుడి కొడుకు మల్లికార్జున్ ఫిర్యాదు మేరకు శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించినట్లు వివరించారు. కరీంనగర్క్రైం: కరీంనగర్ నగరంలో ఓ వృద్ధురాలు బావిలో పడి మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. శర్మనగర్కు చెందిన నలుమాచు సుగుణమ్మ (80) వయసు మీద పడడంతో కళ్లు, చెవులు సరిగా పనిచేయడం లేదు. సోమవారం వేకువజామున ఇంట్లో వాళ్లు నిద్రలేచి చూసేసరికి సుగుణమ్మ కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. ఇంట్లోని బావిలో చూసేసరికి కనిపించింది. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి కుమారుడు రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు: ముగ్గురికి గాయాలుమల్యాల: మండలంలోని ముత్యంపేట శివారు.. జగిత్యాల–కరీంనగర్ రహదారిపై సోమవారం వేకువజామున ఓ కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ముగ్గురు గాయపడ్డారు. కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు కొండగట్టు సమీపంలో అదుపు తప్పి, విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ సంఘటనలో కోరుట్లకు చెందిన నాగరాజు, అనిల్, మహమ్మద్ గాయపడ్డారు. బాధితులను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బెల్టుషాపుల బంద్కు జీపీ తీర్మానం
జమ్మికుంట: మద్యం అమ్మకాల కట్టడికి మండలంలోని మడిపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచన చేసింది. సోమవారం సర్పంచ్ పసుల తిరుమల అధ్యక్షతన పాలకవర్గం సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా గ్రామంలో బెల్ట్షాపుల నిర్వహణ బంద్ చేయాలని తీర్మానం చేశారు. జీపీ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయాలు జరిపితే రూ.10వేలు జరిమానా విధించడం జరుగుతుందని, మద్యం విక్రయాలకు సంబంధించి సమాచారం అందించిన వారికి రూ.2వేల బహుమతి అందజేస్తామని పాలకవర్గం తీర్మానం చేసింది. కార్యదర్శి అంజిరెడ్డి, ఉప సర్పంచ్ కస్తూరి శ్రీనాథ్, వార్డు సభ్యులు సురేశ్, సాయిరాం, హసీనా, శ్రీనివాస్, కళ్యాణి, శేషివాదన, ఆంజనేయులు, చెన్నబోయిన చంద్రమౌళి, రాణి తదితరులు పాల్గొన్నారు. కాగా బెల్ట్షాపుల బంద్పై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసున్నారు. -
ప్రయాణికులను కాపాడిన డ్రైవర్కు సన్మానం
కరీంనగర్టౌన్: కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రికల్ బస్సు ఆదివారం నగర శివారులోని అల్గునూరులో దగ్ధమైన విషయం తెలిసిందే. కాగా అగ్నిప్రమాద సమయంలో బస్సులోని 39 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారి ప్రాణాలను కాపాడిన డ్రై వర్ బోయిని ప్రశాంత్ను సోమవారం జేబీఎం, చక్రా ఈ –ట్రాన్స్ యాజమాన్యాలు సన్మానించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తి, ధైర్యం, బాధ్యతాయుతమైన చర్యల ద్వారా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా కాపాడటమే కాకుండా, టీజీఎస్ఆర్టీసీ ప్రతిష్టను నిలబెట్టినందుకు గుర్తింపుగా ప్రాంతీయ రీజినల్ మేనేజర్ రాజు చేతుల మీదుగా ప్రత్యేక షీల్డ్, ప్రశంసాపత్రం, రూ.5వేల నగదు బహుమతిని అందజేశారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరె డ్డి, డిప్యూటీ ఆర్ఎం మల్లేశం, 2 డిపో మేనేజర్ శ్రీనివా స్, జేబీఎం ఆపరేషన్స్ మేనేజర్ అభిచరణ్, చక్రా ఈ –ట్రాన్స్ ఆపరేషన్స్ మేనేజర్ ఖాన్, అన్వర్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. -
నాగ్పూర్ టు అల్గునూర్
● గంజాయి తరలిస్తూ పట్టుబడిన ముగ్గురు యువకులు తిమ్మాపూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో గంజాయి కొనుగోలు చేసి తిమ్మాపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో యువకులకు అమ్ముతున్న అల్గునూర్కు చెందిన అందె అజయ్, సిల్ల పరశురామ్, ముసాపురి అరవింద్ను ఎల్ఎండీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై అన్వర్ కథనం ప్రకారం.. సోమవారం ఉదయం ముగ్గురు యువకులు గంజాయితో బైక్పై అల్గునూర్వైపు వెళ్తున్నారని ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మధ్యాహ్నం సమయంలో వారిని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. అల్గూనూర్ చౌరస్తాలో గంజాయితో అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురు యువకులను పోలీసులు ప్రశ్నించారు. వారు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఛేజ్ పట్టుకున్న పోలీసులు.. వారిని తనిఖీ చేయగా, పాలిథిన్ కవర్లో 235 గ్రాముల గంజాయి లభ్యమైంది. దీంతో వారిని అదుపులోకి తీసున్నారు. యువకుల నుంచి బైక్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై అన్వర్ తెలిపారు. -
ఆవునూర్లో అపురూప పురాతన విగ్రహాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని ఆవునూర్లో ప్రాచీన శివాలయం పరిసరాల్లో వందల ఏళ్ల నాటి శిల్పాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపే రాజ్కుమార్ తెలిపారు. సోమవారం గ్రామాన్ని సందర్శించారు. ఆవునూర్కు ప్రాచీన చరిత్ర ఉందని, చెరువుకట్ట సమీపంలోని శివాలయ ప్రాంగణంలో చాముండేశ్వరీ విగ్రహం ఉందని, ఇది 14వ శతాబ్దానికి చెందిందని తెలిపారు. పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం, పరహస్తాల్లో కత్తి, రక్తపాత్రలతో సుఖాసీనస్థితిలో విగ్రహం ఉందని, కరండ మకుటాన్ని ధరించి ఉందని పేర్కొన్నారు. 15వ శతాబ్దానికి చెందిన కాలభైరవుడు జ్వాలాకేశాలతో పూర్వహస్తాల్లో త్రిశూలం, ఢమరుకం కలిగి ఉన్నాడని, పరహస్తాల్లో ఖడ్గం, ఖండిత శిరస్సును కలిగి ఉన్నాడని, నగ్నమొలతో, నడుముకు కపాల మేఖలను ధరించి ఉన్నాడని తెలిపారు. ఖండిత శిరస్సు రక్తపు చుక్కల కోసం కుక్కపైకి దుముకుతున్న దృశ్యాలను శిల్పులు కళ్లకు కట్టినట్లు వివరించారన్నారు. గుడి ప్రాంగణంలో చాళుక్యశైలి పోలిన నంది 12వ శతాబ్దానికి చెందిందన్నారు. సంతానం కోసం ఆరాధించే నాగశిల కూడా ప్రాచీనమైందని తెలిపారు. అమూల్యమైన ప్రాచీనశిల్ప సంపదను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాముండేశ్వరీ విగ్రహం కాలభైరవుడి విగ్రహం చరిత్ర పరిశోధకుడు రాజ్కుమార్ -
ఒద్యారం స్కూల్కు జాతీయ పురస్కారం
కరీంనగర్టౌన్: జాతీయ స్థాయి స్వచ్ఛ విద్యాలయ పురస్కారానికి ఉమ్మడి జిల్లా నుంచి నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. కరీంనగర్ జిల్లా నుంచి ఒద్యారం ప్రభుత్వ హైస్కూల్, పెద్దపల్లి జిల్లా నుంచి ఎల్కపల్లి పాఠశాల, జగిత్యాల జిల్లా నుంచి బీర్పూర్ పాఠశాల, రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి నెహ్రూనగర్ హైస్కూల్ పురస్కారాలకు ఎంపికయ్యాయి. ఈ మేరకు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వి.నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్)ను రెండేళ్లుగా ప్రకటిస్తుంది. పాఠశాల ఆవరణ, పరిశుభ్రతతో పాటు స్వచ్ఛమైన నీరు, పచ్చదనం తదితర అంశాలను పరిశీలించి గ్రేడ్ నిర్ణయిస్తారు. కరీంనగర్ జిల్లాలోని ఒద్యారం పాఠశాలలో 300 రకాల చెట్లను విద్యార్థులు సంరక్షిస్తూ, ప్లాస్టిక్ కవర్లను నిషేధిస్తూ, సేంద్రియ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ పాఠశాల ఆవరణలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇందుకు గానూ రాష్ట్ర స్థాయిలో ఎంపికై న 10 పాఠశాలల్లో ఉమ్మడి జిల్లాలో నాలుగు స్కూళ్లు ఎంపికవగా, కరీంనగర్లో ఒద్యారం జడ్పీహెచ్ఎస్ను ఎంపిక చేశారు. మెరిట్ సర్టిఫికెట్తో పాటు రూ.1లక్ష ప్రోత్సాహక నిధి, పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక విద్యా అధ్యాయన పర్యటనకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
రూ.14.56 కోట్లతో హాస్టళ్ల నిర్మాణం
కరీంనగర్సిటీ: హుస్నాబాద్లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల వసతి గృహాల సౌకర్యాల కల్పనకు కీలక అడుగు పడింది. శాతవాహన విశ్వవిద్యాలయం 86వ కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇంజినీరింగ్ కళాశాలలో బాలుర, బాలికల హాస్టళ్ల నిర్మాణ పనులు అధికారికంగా మొదలుకానున్నాయని సోమవారం వీసీ ఉమేశ్కుమార్ తెలిపారు. రూ.14.56 కోట్ల అంచనాతో రెండు హాస్టళ్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించారని పేర్కొన్నారు. హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నం.132/1లో 36 ఎకరాల ప్రభుత్వ భూమిలో వసతి గృహాలను నిర్మించనున్నారు. పనులు వేగవంతంగా ప్రారంభించాలని సంబంధిత అధికారులను వీసీ ఆదేశించారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా విడుదల చేయనుందని, 2027 జూన్ 30 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. హాస్టళ్ల నిర్మాణం పూర్తయితే హుస్నాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన వసతి, సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం మరింత సులభతరం కానుందని పేర్కొన్నారు. వసతి గృహ నిర్మాణాలకు నిధులు మంజూరు కావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్కు ధన్యవాదాలు తెలిపారు. -
ఇక విత్తనోత్పత్తి బాటలో..
వేములవాడరూరల్: రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంతోపాటు పండించిన ధాన్యం కొంటున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)లు ఇక విత్తనోత్పత్తిని చేపట్టనున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ప్రణాళిక రూపొందించి నాబార్డు సహకారంతో విత్తనాలను తయారు చేసి సొసైటీల ద్వారా రైతులకు చేరవేసేందుకు ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈనెల 20న కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక సమావేశమయ్యారు. మొదటగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 12 సొసైటీల్లో విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. 12 సొసైటీల్లో పైలట్ ప్రాజెక్టుగా.. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఒక్కో జిల్లా నుంచి మూడే సొసైటీలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాజన్నసిరిసిల్లలో వేములవాడ, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, కరీంనగర్ జిల్లాలో గట్టుదుద్దెనపల్లి, ఊటూరు, జమ్మికుంట, జగిత్యాల జిల్లాలో రాయికల్, జైన, బీర్పూర్, పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్, నందిమేడారం, ఎలిగేడు ప్రాథమిక సహకార కేంద్రాలను ఎంపిక చేశారు. పీఏసీఎస్ పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు నాణ్యమైన విత్తనోత్పత్తి చేయనున్నారు. విత్తనోత్పత్తిపై రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. సీడ్ ఉత్పత్తి తర్వాత రైతుల నుంచి పీఏసీఎస్ కొనుగోలు చేసే సొంత బ్రాండ్తో రైతులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల సరఫరా ధాన్యం కొనుగోళ్లతో తోడ్పాటు రైతుల అభివృద్ధిలో సహకార సంఘాలు ఉమ్మడి జిల్లాలో 12 సొసైటీలు ఎంపిక -
బైక్ దొంగ పట్టివేత
● వాహనం స్వాధీనం పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని తమ్మిశెట్టి రవీందర్కు చెందిన బైక్ను ఈనెల 19న అపహరించిన కేసులో నిందితుడిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడ్డాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం మర్తిడి గ్రామానికి చెందిన బోర్తుడి సంజీవ్ వాహన దొంగతనాలు చేస్తూ గతంలోనూ బెజ్జూరు, కాగజ్నగర్, సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో చోరీచేసి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. పెద్దపల్లికి చెందిన రవీందర్ ఇంటి ఎదుట నిలిపి ఉంచిన బైక్ను సైతం అపహరించాడు. మంగళవారం శాంతినగర్ శివారు రైల్వే ఓవర్బ్రిడ్జి వద్ద వాహనతనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా అప్రమత్తమై అదుపులోకి తీసుకుని విచారించడంతో దొంగతనం విషయం తెలుసుకుంది. నేరాన్ని అంగీకరించడంతో బైక్ను స్వాధీనం చేసుకుని, సంజీవ్ను అరెస్ట్ చేసినట్టు ఎస్సై నరేశ్ తెలిపారు. భూపాల్పల్లి డీటీవో వెంకన్న మృతికి నివాళి జగిత్యాలక్రైం: జిల్లాలో 27నెలలు ఎంవీఐగా పనిచేసి.. పదోన్నతిపై భూపాల్పల్లి జిల్లా రవాణా శాఖ అధికారిగా వెళ్లిన వెంకన్న సోమవారం ఉదయం టిప్పర్ ఢీకొని మృతిచెందడంతో స్థానిక రవాణా శాఖ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన వెంకన్న 2003లో విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా ఉద్యోగం పొందారు. కేటీపీఎస్లో బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ఏడీఏగా పదోన్నతి పొందారు. ఏపీపీఎస్సీలో పరీక్ష రాసి రవాణా శాఖలో ఎంవీఐగా ఉద్యోగం పొందారు. 15 రోజుల క్రితమే భూపాల్పల్లి డీటీవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన మృతిపై జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ సందాని, ఎంవీఐ రామారావు, అసిస్టెంట్ ఎంవీఐలు సాయిచరణ్, రియాజ్లు సంతాపం వ్యక్తం చేశారు. అప్పుల బాధ తో వ్యక్తి ఆత్మహత్య ముస్తాబాద్(సిరిసిల్ల): అప్పుల బాధలు తాళలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై జ్యోతి తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన బాలసాని బాలరాజు(40) ఆదివా రం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బాలరాజు భార్య క్యాన్సర్ వ్యాధికి గురై మృతిచెందింది. ఆమె చికిత్స కోసం బాలరాజు రూ.10లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీరే మార్గం లేక మనోవేదనకు గురైన బాలరాజు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో వీరి కుమారుడు, కూతురు అనాథలుగా మిగిలారు. నాలుగేళ్ల క్రితం తల్లి, ఇప్పుడు తండ్రి మృతిచెందడంతో చిన్నారులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం, మానవతవాదులు చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మృతుని బంధువు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జ్యోతి తెలిపారు. -
పీఎంజే కేసులో మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
కరీంనగర్క్రైం: పీఎంజే జ్యువెలరీ షోరూంలో జరిగిన దోపిడీ కేసులో కరీంనగర్ పోలీసులు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 8కి చేరింది. ఈ నెల 17న కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీలోకి తీసుకున్న ఐదుగురు నిందితులు సుబోధ్సింగ్, రఘునాథ్, రావిష్, అమర్సింగ్, జైనుల్లాబ్దీన్ కస్టడీ రేపటితో ముగియనుంది. కస్టడీ విచారణలో భాగంగా నిందితుడు రఘునాథ్ ఇచ్చిన సమాచారం మేరకు నేరానికి ఉపయోగించిన టీవీఎస్ అపాచీ బైక్ను మహారాష్ట్రలోని బల్లార్షా రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షోరూంలో దోపిడీకి పాల్పడిన ఐదుగురిలో ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ కాగా, తాజాగా మూడో వ్యక్తి సూర్యమణి అలియాస్ సనోజ్ కుమార్ను కరీంనగర్ శివారులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామడుగు మండల శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద గల తాత్కాలిక నిర్మాణ షెడ్ల సమీపంలో కీలక ఆధారాలు సేకరించారు. నేరం జరిగిన రోజు నిందితులు ధరించిన 5 జతల దుస్తులు, 3 జతల బూట్లు, మూడు నకిలీ టూ వీలర్ ఆర్సీ కార్డులు, మొబైల్ ఫోన్, అక్కడే దాచి ఉంచిన పిస్టల్, మ్యాగజైన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నిందితుడు ఎండీ ఆదిల్ఖాన్ను బిహార్ రాష్ట్రం పాట్నాలోని పుల్వారి షరీఫ్ వద్ద కరీంనగర్ ప్రత్యేక పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. ఇతడిని తెలంగాణకు తరలించేందుకు స్థానిక కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ దాఖలు చేసినట్లు సీపీ తెలిపారు. గతంలో అరెస్ట్ అయిన క్రెటాకార్ డ్రైవర్ జైనులబ్దీన్కు ఆదిల్ఖానే కారు, నిందితులకు తుపాకులను సరఫరా చేసినట్లు విచారణలో తేలింది. మహమ్మద్ మెహతాబ్ఖాన్ నిందితులకు సిమ్ కార్డులు అందించినందుకు అరెస్టయి జైలులో ఉన్నాడు. ఈ నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కరీంనగర్ అడిషనల్ డీసీపీ వెంకటటరమణ, టౌన్ ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు సృజన్రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, తిరుమల్, ప్రకాష్, ఎస్సై శేఖర్ సిబ్బందిని సీపీ అభినందించారు. -
దశాబ్దం తర్వాత బడికి ఊపిరి
చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తున్న ఎంఈవో తదితరులు పాఠశాలను ప్రారంభిస్తున్న ఎంఈవో కనకతార, సర్పంచ్, ఉపాధ్యాయులు మెట్పల్లిరూరల్: దశాబ్దాల తరబడి పిల్లలకు అక్షరాలు నేర్పి.. వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన పాఠశాల మూతబడడంతో ఆ గ్రామ సర్పంచ్ దంపతులు చలించిపోయారు. మూతబడిన ఆ పాఠశాలను ఎలాగైనా తెరిపించాలని కంకణం కట్టుకున్నారు. ముందుగా తమ ఇద్దరు పిల్లలను పాఠఽశాలలో చేర్పించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత ఇంటింటికీ వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారం చేశారు. ఇందుకు అంగీకరించిన తల్లిదండ్రులు పాఠశాలను తెరిపించాలని కోరారు. విషయాన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో చర్యలు చేపట్టిన అధికారులు మూతబడిన పాఠశాలను తెరిపించారు. మెట్పల్లి మండలం కేసీఆర్తండాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పదేళ్ల కిందట మూతబడింది. అప్పటి నుంచి ఆ పాఠశాలను తిరిగి తెరిపించాలని ఎవరూ దృష్టి సారించలేదు. ఇటీవల సర్పంచ్గా ఎన్నికై న మంజుల, గణేశ్ దంపతులు పాఠశాలకు పూర్వవైభవం తేవాలని వారి పిల్లలను పాఠశాలలో చేర్పిస్తున్నామని ఊరంతా తెలిపారు. దీంతో మిగతా వారు కూడా తమ పిల్లలను చేర్పిస్తామని చెప్పడంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలను పునఃప్రారంభించారు. మెట్పల్లి ఎంఈవో కనకతార సోమవారం పాఠశాలను ప్రారంభించి విద్యార్థులతో సాముహిక అక్షరాభ్యాసం చేయించారు. పుస్తకాలు, నోట్బుక్కులు ఇతర సామగ్రి అందించారు. మిఠాయిలు పంపిణీ చేశారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 25 ఉండగా.. ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్రెడ్డి, ఉపసర్పంచ్ మదన్లాల్, విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్థులు పాల్గొన్నారు. పదేళ్ల తర్వాత తెరుచుకున్న ప్రభుత్వ పాఠశాల సర్పంచ్ తన పిల్లలను చేర్పించడంతో పూర్వవైభవం 25మందికి చేరిన విద్యార్థుల సంఖ్య -
ఆలస్యం.. సమస్యాత్మకం..!?
ఈ నెల 15న.. మెట్పల్లిలోని మఠంవాడకు చెందిన మహిళపై దాడి ఘటన కర్ర లేదా రాళ్లతోనే జరిగిందని పోలీసులు చెప్పారు. చివరికి మహిళ తలలో బుల్లెట్ లేదా ఇనుప ముక్క బయటపడటంతో పోలీసు విచారణ ప్రశ్నార్థకంగా మారింది.శనివారం సాయంత్రం మెట్పల్లిలోని ఆదర్శనగర్లో దాసరి రాజేంద్రప్రసాద్ అనే బిల్డర్ మృతి చెందాడు. ఆయన మెడలో ఉన్న చైన్ మాయం కావడం, తల వెనక బలంగా పదునైన ఆయుధంతో కొట్టిన ఆనవాళ్లు ఉండటం వంటి అంశాల గుర్తింపులో జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు తరువాత హత్య కేసుగా మార్చారు. ఈ కాస్త జాప్యం నిందితుడు దూర ప్రాంతాలకు పరారై సమస్యను మరింత జఠిలం చేసేందుకు ఆస్కారం చిక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ రెండు సంఘటనల్లోనూ పోలీసుల విచారణ సరైన సమయంలో.. సరైన రీతిలో జరగలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన జరిగిన సమయంలో కాస్త లోతుగా విచారణ జరిపితే ఆయా సంఘటనల పూర్వాపరాలు పూర్తిస్థాయిలో బయటపడే అవకాశాలు ఉంటాయి. కోరుట్ల/మెట్పల్లి: ఆలస్యం చేస్తే అమృతం విషంగా మారుతుందన్న నానుడి అందరికీ తెలిసిందే. నేర సంఘటనలు జరిగిన సమయంలో కారణాలు గుర్తించడంలో ఆలస్యం సమస్యను మరింత జఠిలం చేస్తుంది. మెట్పల్లిలో ఈనెల 15న మహిళపై దాడి జరిగిన సంఘటనలో ముగ్గురు ఉన్నట్లు బాధితురాలు చెబితే.. ఇద్దరిపైనే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. బాధితురాలు చెప్పిన మరో వ్యక్తిని కేసులో ఎందుకు చేర్చలేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడి సమయంలో పెద్దగా రేకుల చప్పుడు వచ్చిందని చుట్టుపక్కల వారు చెప్పినట్లు తెలిసింది. అది రేకుల చప్పుడు కాదని, ఏదైనా పేలిన శబ్దంగా అనుమానించడంలో అధికార యంత్రాంగం తాత్సారం చూపిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మహిళ తలలో దొరికిన ఇనప ముక్క దాదాపు బుల్లెట్టు అని నిర్ధారణకు వస్తున్నా.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చేవరకూ విషయం తేటతెల్లం కాదు. ఒకవేళ బుల్లెట్గా తేలితే.. జరిగిన జాప్యం ఫలితంగా తపంచా లేదా రివాల్వర్.. ఎవరు..ఎక్కడి నుంచి తెచ్చారు..? ఎవరు దాడి సమయంలో కాల్చారు..? అనే విషయం తేల్చడంలో ఆలస్యంతోపాటు నిందితులు తప్పించుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుమానం హత్యగా తేలిందిశనివారం సాయంత్రం మెట్పల్లిలోని ఆదర్శనగర్లో బిల్డర్ రాజేంద్రప్రసాద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన స్థలంలో రాజేంద్రప్రసాద్ తల వెనక భాగంలో పదునైన గాయం ఉంది. మొదట బిల్డింగ్పై నుంచి పడి మృతి చెందాడని అనుమానించారు. రాజేంద్రప్రసాద్ మెడలో ఉండాల్సిన బంగారు చైన్ ఎక్కడికి వెళ్లిందన్న విషయం ఆ సమయంలో పోలీసుల దృష్టికి రాలేదు. ఈ విషయం ఆదివారం బయటపడింది. రాజేంద్రప్రసాద్ వద్ద పనిచేసే పేయింటర్ తనకు సకాలంలో డబ్బులు చెల్లించలేదని గొడవ పడి అందుబాటులో ఉన్న పదునైన ఆయుధంతో బలంగా తల వెనక కొట్టాడు. దీంతో రాజేంద్రప్రసాద్ అక్కడిక్కడే మృతి చెందాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు రాజేంద్రప్రసాద్ మృతి కేసును హత్యగా మార్చి విచారణ ప్రారంభించారు. మొత్తం మీద ఏదైనా నేర సంఘటనలు జరిగిన సమయంలో విచారణ లోతుగా జరిపితే బాధితులకు మేలు జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు దగ్ధం
తిమ్మాపూర్/విద్యానగర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూర్ శివారులో రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు షార్ట్సర్క్యూట్తో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. కరీంనగర్–2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (టీజీ 02టి1138) ఆదివారం ఉదయం 8 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి ఇద్దరు చిన్నారులు సహా 40 మంది ప్రయాణికులతో బయల్దేరింది. ఉదయం 8.20 గంటలకు అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ దాటాక బ్యాటరీలో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ ప్రశాంత్ వెంటనే బస్సును రోడ్డు పక్క ఆపేశాడు.బస్సు తలుపులు, ఎమర్జెన్సీ తలుపులు తెరిచి ప్రయాణికులను బయటకు పంపించాడు. బస్సులోని అగ్నిమాపక పరికరాలు ఉపయోగించి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు వేగంగా వ్యాపించడంతో అదుపు తప్పాయి. ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు.ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.వెంకన్న, కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్, కరీంనగర్ ఆర్ఎం బి.రాజు, రవాణాశాఖ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్గౌడ్, డీటీసీ రవీందర్ పరిశీలించారు. డ్రైవర్ ప్రశాంత్ సమయస్ఫూర్తిని అభినందించి రూ.5 వేల ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. ఎల్ఎండీ సీఐ రమేశ్, ఎస్ఐ అన్వర్ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
యోగా.. వేడుకగా
కరీంనగర్లో ఆయుష్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న ప్రజలు, యోగాసనాలు వేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్కుమార్కరీంనగర్స్పోర్ట్స్/కరీంనగర్క్రైం: అంతర్జాతీయ యోగాడేను ఆదివారం వేడుకగా నిర్వహించారు. ఉదయాన్నే ఆయా ప్రాంతాల్లో యోగా గురువుల సమక్షంలో ఆసనాలు వేశారు. పలువురు యోగా ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి రోజు దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ సూచించారు. కరీంనగర్లో ఆయుష్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయుష్శాఖ వరంగల్ రీజినల్ ప్రాంతీయ అధికారి ప్రమీలాదేవి, అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్రెడ్డి, ఆర్డీవో షర్మిల, మేయర్ కొలగాని శ్రీనివాస్తో కలిసి పాల్గొన్నారు. కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన జడ్జి ఎస్.శివకుమార్, జడ్జిలు సంతోష్ కుమార్, నీరజ, పావని, చిరాగ్ మెహతా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్ పాల్గొన్నారు. జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రాంతీయ క్రీడా పాఠశాలలో యోగా డే నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. డీవైఎస్వో శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టేడియంలో యోగా వాక్ను జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ ప్రారంభించారు. -
మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం
● రవాణాశాఖ మంత్రి పొన్నం హుజూరాబాద్/చిగురుమామిడి/శంకరపట్నం: మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రవా ణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నా రు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల సమయపాలన, పరిశుభ్రత, తాగునీరు, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి నేరెళ్ల మహేందర్ గౌడ్, తిరుపతి, శంకర్ పాల్గొన్నారు. ఫోర్లైన్ బాధితులకు న్యాయం చేయాలి చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఫోర్లైన్ నిర్మాణంలో ఇండ్లు, ప్లాట్లు కోల్పోతున్న బాధితులకు తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. ఆదివారం హుస్నాబాద్లోని క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి గోడు వెల్లబోసుకున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోతున్నవారికి పరిహారం ఇప్పించడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. సర్పంచ్ జంగ శిరీష, హుస్నాబాద్ వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, చిగురుమామిడి సింగిల్విండో చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఉపసర్పంచ్ మెడబోయిన రాజు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరాఫరాలో ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి పొన్నం ప్రభా కర్ అన్నారు. కేశవపట్నం మీదుగా వెళ్తూ, కాన్వాయ్ ఆపి స్థానికులతో మాట్లాడారు. మొలంగూర్ క్రాస్ రోడ్డు వద్ద రిక్వెస్ట్స్టాప్ ఏర్పాటు చేసినా బస్సులు ఆగడం లేదని మంత్రికి స్థానికులు వివరించారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక రావడం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. వెల్నెస్ సెంటర్లో వైద్యుల ఇష్టారాజ్యంకరీంనగర్: కరీంనగర్లో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లో వైద్యుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వెల్నెస్ సెంటర్కు పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవల కోసం వచ్చారు. ఓపీ సమయం కొనసాగుతున్నప్పటికీ సంబంధిత డాక్టర్ గది తలుపు తెరవకుండా రోగులను వేచి ఉండేలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ను పలు మార్లు పిలిచినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి వేచి చూసినా వైద్యులు అందుబాటులోకి రాకపోవడం, రోగుల సమస్యలను పట్టించుకోకపోవడంతో, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం విచారకరమని పేర్కొన్నారు. సెంటర్లో విధులు నిర్వహించే వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. టీజీ ఏప్సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభంకరీంనగర్స్పోర్ట్స్: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాలకోసం ఈనెల 19వ తేదీ 28 వరకు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు కరీంనగర్లోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 22వ తేదీ నుంచి 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని ప్రిన్సిపాల్ డి.శోభారాణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్: ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 15 రోజులు గడిచినా రైతులకు ఎరువులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బీరెడ్డి కరుణాకర్రెడ్డి విమర్శించారు. రైతులకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రైతులకు రుణమాఫీ పూర్తి చేయడంలోనూ, కొత్త పంట రుణాలు మంజూరు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. -
రైల్వే ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి
రామగుండం: ఆటో కిరాయి విషయమై తలెత్తిన వివాదంలో ఉత్తర ప్రదేశ్కు చెందిన ప్రయాణికుడిపై ఆటో డ్రైవర్ దాడి చేయడం చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలులో ఆదివారం రామగుండం చేరుకున్న విజయ్కుమార్ అనే కార్మికుడు కరీంనగర్కు వెళ్లేందుకు రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ఆటోవాలాను సంప్రదించాడు. కిరాయి విషయమై ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్కుమార్పై ఆటో డ్రైవర్ దాడి చేయడంతో గాయపడ్డాడు. సదరు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఉపక్రమించగా మిగతా ఆటోడ్రైవర్లు అతనిని వారించడంతో ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్కు అకస్మాత్తుగా అస్వస్థత● చాకచక్యంగా రోడ్డును దింపిన బస్సు ● ప్రభుత్వాసుపత్రికి డ్రైవర్ తరలింపుపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం పెద్దకల్వల స్టేజీ సమీపంలోకి చేరిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ తిరుపతి అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వెళ్తున్న బస్సు (టీఎస్ 02 9326) నడుపుతున్న డ్రైవర్ తిరుపతికి కుడి చేయి కాలు పనిచేయకపోవడంతో హైరానా పడ్డాడు. వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. గమనించిన కండక్టర్ భారతి, బస్సులోని 25మంది ప్రయాణికులు వెంటనే డ్రైవర్ తిరుపతిని ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. డ్రైవర్ చాకచక్యంగా రోడ్డు పక్కన నిలపడంతో ప్రయాణికులంతా ఊపిరిపీల్చుకున్నారు. విద్యుత్షాక్తో వ్యక్తి మృతిగంగాధర: గంగాధర మండలం ర్యాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం విద్యుత్షాక్తో ఆరెపల్లి హన్మయ్య(60) మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ స్తంభం విరిగిపడి, వైర్లు కింద పడిపోయాయి. బైక్పై వెళ్తున్న హన్మయ్య వైర్లు గమనించక ముందుకు కదిలాడు. కాళ్లకు తీగలు తగిలి విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. -
నీట్కు 2,661 మంది హాజరు
కరీంనగర్టౌన్: జిల్లాలో ఆదివారం నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలి పారు. పరీక్ష నిర్వహణను కలెక్టర్, సీపీ గౌస్ ఆలం సంయుక్తంగా పర్యవేక్షించారు. కరీంనగర్లోని ఎస్ ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కేంద్రీయ విద్యాలయం కేంద్రాలను సందర్శించారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. 2,661 మంది హాజరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షకేంద్రాల్లో 3,001 మంది అభ్యర్థులకు 2,661 మంది హాజరయ్యారు. 340 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాలలో 744 మందికి 662మంది హాజరుకాగా, 82మంది గైర్హాజరయ్యారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో 720 మందికి 651మంది హాజరయ్యారు. 69మంది గైర్హాజరయ్యారు. అలుగునూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లో 408 మందికి 359 మంది హాజరయ్యారు. 49 మంది గైర్హాజరయ్యారు. కేంద్రీయ విద్యాలయంలో 361 మందికి 316మంది హాజరయ్యారు. 45 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 312 మందికి 278 మంది హాజరుకాగా, 34 మంది గైర్హాజరయ్యారు. మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర కళాశాలలో 288 మందికి గాను 251మంది హాజరుకాగా, 37 మంది గైర్హాజరయ్యారు. చింతకుంటలోని టీజీఎస్డబ్ల్యూఆర్ బాలికల జూనియర్ కళాశాలలో 168 మందికి 144మంది హాజరుకాగా, 24 మంది గైర్హాజరయ్యారు. అభ్యర్థికి పోలీస్ సాయం కరీంనగర్ క్రైం: నీట్ పరీక్ష రాసేందుకు ఓ యువతి కరీంనగర్ వచ్చింది. సమయం గడిచిపోతుండడంతో ఆందోళనతో ఉంది. గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కుమార్ తన బైక్పై యువతిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద చేర్చాడు. కానిస్టేబుల్ను సీపీ అభినందించారు.నగరంలోని మహిళా కళాశాల వద్ద పరీక్షకు హాజరైన విద్యార్థులు -
ఉదయించిన ఉపాధి
● ఆర్థికాభివృద్ధిలో మహిళల ముందడుగు ● ఉదయం పూట వ్యాపార బాట ● కుటుంబానికి ఆసరా ● సమాజంలో ఆదర్శంవేములవాడ: నేటి మహిళలు స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం.. ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే పనిచేయడం కంటే సొంతంగా వ్యాపారాలు మొదలు పెడుతున్నారు. చిన్న వ్యాపారం చేసినా సొంత కాళ్లపై నిలబడతామన్న నమ్మకంతో ముందుకెళ్తున్నారు. వేములవాడ పట్టణంలో పలువురు మహిళలు ఉదయం పూటే తమ వ్యాపారాలను ప్రారంభించి మధ్యాహ్నంలోపే ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు. మిల్లెట్స్ పేరిట ఆరోగ్యకరమైన అల్పాహారం, పాలు, కూరగాయలు, పండ్లు విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారు. కుటుంబ బాధ్యతలతోపాటు వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్ద బాడిసె పుస్తకావిష్కరణ
కరీంనగర్కల్చరల్: అద్భుతమైన చరిత్రకు, అభ్యుదయ పోరాటాలకు నిలయమైన కరీంనగర్ నేల నుంచి విశ్వకర్మల వృత్తి పనిముట్లను అక్షరబద్ధం చేస్తూ చారిత్రక కావ్యంగా పెద్ద బాడిసె కవితా సంపుటిని అందించడం అభినందనీయమని గంటా మనోహర్రెడ్డి అన్నారు. భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ ఆధ్వర్యంలో వైరాగ్యం ప్రభాకర్ అధ్యక్షతన ఫిలిం భవన్లో మియాపురం శ్రీనివాస్ రచించిన పెద్ద బాడిసె కవితా సంపుటిని ఆవిష్కరించారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూకట్ల తిరుపతి, ఆంగ్ల కవి గందె పరశురాంరావు మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అనేక వస్తువులను కవితా రూపంలో చక్కగా వివరించారని తెలిపారు. పెద్దిరాజు సత్యనారాయణ రాజు ఆహ్వానం పలికిన ఈ కార్యక్రమంలో అన్నాడి గజేందర్రెడ్డి, కాళిదాసు, కసిరెడ్డి జలంధర్రెడ్డి, తడిగొప్పుల కుమారస్వామి, చిమ్మని చంద్రశేఖర్, జి.హన్మయాచారి, కొండ దినేశ్, జి.రాజమల్లయ్య, సందెవేని నరేంద్ర, కట్ట శ్యామ్సుందర్, రాపర్తి వెంకటేశ్వర్లు, గూడెపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బుద్ధుని శిల్పం కాదు
వేములవాడ: వేములవాడ భీమేశ్వరాలయంలో గల మానవ శిల్పాన్ని గతంలో ‘బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పం’గా భావించి ప్రచారం చేసినట్లు చరిత్ర పరిశోధకుడు, డిస్కవరీ మ్యాన్రెడ్డి రత్నాకర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఆలయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన అనంతరం తన అభిప్రాయాన్ని వెల్ల డించారు. భీమేశ్వరాలయంపై 30 రోజుల చాలెంజ్లో భాగంగా రూపొందించిన వీడియోల్లో ఆలయం అడుగుభాగంలో పడుకుని ఉన్న మానవ శిల్పాన్ని పొరపాటున బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పంగా పేర్కొన్నానని ఆయన చెప్పారు. శిల్పాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా దానిలో యజ్ఞోపవీతం (జంధ్యం) స్పష్టంగా కనిపించడంతోపాటు, శిల్పానికి చిరు బొజ్జ కూడా చెక్కి ఉన్నట్లు గుర్తించినట్లు వివరించారు. ఈ రెండు లక్షణాలు హిందూ భక్తుని రూపాన్ని సూచిస్తున్నాయని, బుద్ధుని మహాపరినిర్వాణ శిల్పాల్లో ఇటువంటి లక్షణాలు సాధారణంగా కనిపించవని అభిప్రాయపడ్డారు. భీమేశ్వరాలయం ఆది నుంచి శైవక్షేత్రంగానే కొనసాగిందని, ఇప్పటివరకు ఈ ఆలయం బౌద్ధారామంగా లేదా జైన దేవాలయంగా ఉన్నట్లు నిర్ధారించే ఆధారాలు లేవన్నారు. పురావస్తు, చారిత్రక అంశాలపై పరిశోధనలు చేసే సమయంలో కొత్త ఆధారాలు లభించినప్పుడు గత అభిప్రాయాలను సవరించుకోవడం పరిశోధనలో సహజ ప్రక్రియేనని, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం పరిశోధకుల బాధ్యత అని పేర్కొన్నారు. టేకు కలప పట్టివేతమానకొండూర్: మానకొండూర్ మండలంలోని రంగపేట సర్పంచ్ ఇంటి వద్ద ట్రాక్టర్లో ఉన్న కలపను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. సర్పంచ్ కొత్త రాంరెడ్డి ఇంటి వద్ద టేకు కలప ట్రాక్టర్లో లోడుతో ఉన్న సమాచారాన్ని ఫారెస్టు అధికారులు తెలుసుకుని శనివారం అర్ధరాత్రి దాటాక దాడిచేసి పట్టుకున్నారు. పోలీసుల పర్యవేక్షణలో ట్రాక్టర్ను కరీంనగర్ కార్యాలయానికి తరలించారు. -
పేషెంటుగా వచ్చి.. దొంగతనానికి యత్నించి
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. పేషెంటుగా ఆసుపత్రికి వచ్చిన ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలోని గదుల్లో జనం రద్దీ లేని డ్రెస్సింగ్ రూంలోకి చేరి అక్కడ ఉన్న కొంత సామగ్రిని సంచిలో వేసుకున్నాడు. అలాగే ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది బ్యాగులో ఉంచిన సెల్ఫోన్ను కూడా అపహరించాడు. సీసీ కెమెరాలో గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకొని విచారించారు. పొరపాటు చేశానని, ఇకముందు ఇలాంటి తప్పులు చేయనని వేడుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది సదరు వ్యక్తిని మందలించి వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిరామగుండం: రామగుండం టెంపుల్ రోడ్డులో నివాసముంటున్న మాచినేని రమేశ్ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషన్ భగీరథలో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్న రమేశ్ ఆదివారం ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా రామగుండం రైల్వే వంతెనపై వెనుక నుంచి బొలేరో వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరిఖని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రామగుండం ఎస్సై గుండేటి సంధ్యారాణి తెలిపారు. కుక్కల దాడిలో చిన్నారులకు గాయాలుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కుక్కల బెడద తీవ్రమవుతోంది. ఫలితంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. ఆదివారం కాశ్మీర్గడ్డ మైసమ్మ చెట్టు ప్రాంతంలో కుక్కలు దాడులకు దిగాయి. పలువురిని గాయపరిచాయి. కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలను నగరపాలకసంస్థ ప్రారంభించినప్పటికి, సరిపడా సంఖ్యలో చేసే పరిస్థితి లేకుండా పోయింది. కుక్కల బెడదను నివారించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. -
వేములవాడలో రంగుబిల్లల జూదం
వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని రంగుబిల్లల జూదం పేరుతో అందినకాడికి ఓ ముఠా దండుకుంటుంది. టార్గెట్ పూర్తి చేసుకున్నాక అక్కడి నుంచి జారుకుని మరోచోట జూదం నిర్వహిస్తూ వేలాది రూపాయలను కొల్లగొడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు శనివారం రాత్రి వరంగల్ జిల్లా నుంచి ఓ కుటుంబం వేములవాడకు చేరుకుంది. ఆదివారం స్వామివారిని దర్శించుకున్నాక కుటుంబ సభ్యుల్లోని ఒకరు గుడి చెరువు పార్కింగ్ స్థలంలో నిర్వహిస్తున్న రంగుబిల్లల జూదం వైపు వెళ్లాడు. భక్తులు రద్దీగా ఉండే ఆది, సోమవారాల్లో జాతరగ్రౌండ్, ఓపెన్ పార్కింగ్ స్థలం ప్రాంతాల్లో రంగుబిల్లల జూదం రూ.100తో మొదలై రూ.5 వేల వరకు సాగుతోంది. ఇందులో నిర్వాహకులు మోసానికి పాల్పడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదే తరహాలో ఆట ఆడుతూ ఏకంగా ఓ వ్యక్తి రూ.5 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో నగదు పోగొట్టుకున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకుని నిర్వాహకులతో గొడవకు దిగారు. ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో భక్తులు పెద్ద ఎత్తున గుమిగూడారు. నగదు పోగొట్టుకున్న కుటుంబానికి కొంత నగదు ఇచ్చి అక్కడ నుంచి నిర్వాహకులు జారుకున్నారు. అమాయక భక్తులను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున నగదు దోపిడీకి పాల్పడుతున్న జూదం అంశంపై పోలీసు యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అమాయక భక్తులే టార్గెట్


