Karimnagar
-
ప్రాణం తీసిన ఈతసరదా
● ఈతకు వెళ్లి యువకుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన యువకుడు ముష్కి రాజీవ్గాంధీ(36) ఈత కోసమని వెళ్లి నీటమునిగి చనిపోయాడు. ఈ ఘటన ముప్పిరితోట గ్రామంలో చోటుచేసుకుంది. జూలపల్లి ఎస్సై సనత్ కుమార్ కథనం ప్రకారం.. గోదావరిఖనిలోని జైభీమ్నగర్కు చెందిన ముష్కి రాజీవ్గాంధీ ఈనెల 14న ముప్పిరితోట గ్రామంలో జరిగిన శ్రీవేంకటేశ్వరస్వామి రథోత్సవం, జాతరకు వచ్చాడు. సాయంత్రం వేళ సరదాగా స్నేహితులతో కలిసి వ్యవసాయ బావిలో ఈత కొట్టడానికి వెళ్లాడు. ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని బావిలో దిగాడు. ప్రమాదవశాత్తు బావిలో నీట మునిగి మృతి చెందాడు. గురువారం ఉదయం వ్యవసాయ బావి నుంచి మృతదేహాన్ని బయటకు తీసి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. నీటి సంపులో పడి చిన్నారి మృతివేములవాడ అర్బన్: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్లో గురువారం విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాలు. తిప్పాపూర్లో బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి జిక్రా ఫాతిమా ప్రమాదవశాత్తు ఇంటి ముందు నీటిసంపులో పడిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందింది. ఈ సంఘటనపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. రైలు ఢీకొని యువకుడు..మల్యాల: కొడిమ్యాల మండలం రాంసాగర్కు చెందిన అనుముల శేఖర్ (37) కొండగట్టు సమీపంలో రైలు ఢీకొని మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. వార్డు సభ్యుడిగా పనిచేసిన శేఖర్ ఇటీవల దుబాయ్ వెళ్లి వచ్చాడు. బుధవారం కొండగట్టు సమీపంలోని రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మల్యాల సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్కుమార్లు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అయితే ప్రమాదవశాత్తు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందా? రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి జైలుజగిత్యాలక్రైం: అతిగా మద్యం సేవించి వాహనం నడిపి పట్టుబడిన వ్యక్తికి న్యాయమూర్తి ఒకరోజు జైలుశిక్ష విధించారు. రాయికల్ మండలం ఉప్పుమడుగు గ్రామానికి చెందిన అల్లెపు వెంకటనర్సయ్య ఇటీవల అతిగా మద్యం సేవించి వాహనం నడుపగా రాయికల్ ఎస్సై సుదీర్రావు పట్టుకుని అతడిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని గురువారం స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్టేట్ సెకెండ్ క్లాస్ న్యాయమూర్తి కరుణాకర్ ముందు హాజరు పర్చగా ఒకరోజు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. గొర్రె, మేకల దొంగల అరెస్టుమల్యాల: గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లి విక్రయిస్తూ జల్సాలు చేస్తున్న ముగ్గురు దొంగలను పట్టుకొని అరెస్టు చేసినట్లు మల్యాల సీఐ నీలరం రవి, ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. జగిత్యాలకు చెందిన ముద్దవేని అనిల్, మహ్మద్ మోసిన్, వెంకటేశ్లు రాత్రివేళ గ్రామాల్లో మోటారు సైకిల్, ఆటోల్లో తిరుగుతూ షెడ్లలోని గొర్రెలు, మేకలను దొంగిలించి కొన్నింటిని అమ్ముకోగా, మరికొన్నింటిని కోసి మాంసం విక్రయించే వారన్నారు. వచ్చిన డబ్బులను సమానంగా పంచుకొని జల్సాలు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం మల్యాల ప్రాథమిక సహకార కేంద్రం వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా బైక్, ఆటోలో రెండు మేకలు, రెండు గొర్రెలు తీసుకెళ్తున్న వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా వివిధ ప్రాంతాల్లో గొర్రెలు, మేకలు దొంగిలించినట్లు అంగీకరించారన్నారు. బైక్, ఆటో, రెండు మేకలు, రెండు గొర్రెలు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
టికెట్ బుక్ చేసుకొని.. అక్కడే ఆగిపోయి
ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన ఆర్మీ జవాన్ అంతటి అనిల్ జమ్మూకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆ ప్రాంతంలోనే బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 8 నెలలుగా జమ్మూసెక్టార్లోనే ఉంటున్నాడు. ఈనెల 7న ఇంటికొచ్చేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ 6వ తేదీ నుంచి యుద్ధ సన్నాహాలు మొదలుకావడంతో అక్కడే ఉండిపోయాడు. ఇల్లంతకుంట మండల కేంద్రం నుంచి 11 మంది యువకులు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అంతటి అనిల్ -
ముగ్గురు యువకులపై కత్తులతో దాడి
● ఒకరి పరిస్థితి విషమం జగిత్యాలక్రైం: పుట్టిన రోజు వేడుకలకు సిద్ధమవుతున్న యువకుడితో పాటు అతని ఇద్దరు స్నేహితులపై కత్తులతో దాడి చేయడంతో ముగ్గురికి తీవ్రగాయాలైన సంఘటన గురువారం లింగంపేట శివారులో చోటు చేసుకుంది. జగిత్యాలరూరల్ మండలం అంతర్గాంకు చెందిన ఏళ్ల అరవింద్ తన జన్మదిన వేడుకల కోసం అంతర్గాం, లింగంపేట శివారులోని గంగమ్మతల్లి ఆలయం వద్ద ఏర్పాట్లు చేసుకున్నాడు. అరవింద్ అతని స్నేహితులు తోపారపు గంగాధర్, ఉయ్యాల వంశీలు ఉండగా ఉండగా అదే గ్రామానికి చెందిన మహేశ్, రాకేశ్, చందు, దినేశ్తో పాటు మరికొంతమంది కత్తులతో దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గంగాధర్కు 23 చోట్ల గాయాలు కాగా, అరవింద్, వంశీలకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న సీఐ వేణుగోపాల్, ఎస్సై గీత బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మహేశ్, రాకేశ్, దినేశ్, చందులతో పాటు మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. -
ప్రతీ జిల్లాలో రైతువిజ్ఞాన కేంద్రం
జగిత్యాలఅగ్రికల్చర్: కృషి విజ్ఞాన కేంద్రాలు, డాట్ సెంటర్లు లేని అన్నిజిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో గురువారం శ్రీరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలుశ్రీ కార్యక్రమం నిర్వహించారు. జానయ్య ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 జిల్లాల్లో డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్కో కేంద్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రతీజిల్లాలో 50 ఎకరాలు అందుబాటులో ఉన్నచోట రైతువిజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో లేదని, వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేక రైతు కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులతో పంటలపై అనేకరకాల పురుగులు, తెగుళ్లు దాడి చేస్తున్నాయన్నారు. వాటి నివారణకు శాస్త్రవేత్తలు లోతుగా పరిశోధనలు చేయాలని కోరారు. ఆర్ఎంపీల మాదిరిగా గ్రామాల్లో ఫార్మర్స్ క్లినిక్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం తెలంగాణ సీడ్ సంస్థ రూపొందించిన శ్రీమన సంస్థ– మన విత్తనంశ్రీ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్ శ్రీలత, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ సైదానాయక్, జిల్లా వ్యవసాయ, ఉద్యానశాఖాధికారులు భాస్కర్, శ్యాంప్రసాద్, రైతు నాయకులు రవీందర్రెడ్డి, నారాయణరెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్శిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జానయ్య -
క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు
● నేడు కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, వేములవాడ శిక్షణ శిబిరాల్లో ఎంపికలు కరీంనగర్స్పోర్ట్స్: క్రికెట్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించేందుకు కరీంనగర్ జిల్లా క్రికెట్ సంఘం శ్రీకారం చుట్టింది. క్రీడాకారుల ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరిగే అవకాశాలు ఉంటాయని క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ప్రస్తుతం అండర్– 17 నుంచి 23 వరకు ఎంపిక పోటీలు నిర్వహించి భవిష్యత్లో అన్నిరకాల కేటగిరీలో ఇలాగే ఎంపికలు నిర్వహించేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. 13 నియోజకవర్గాలు.. 6 జట్లు.. ఉమ్మడి జిల్లాలోని 13 నియోజకవర్గాల నుంచి 6 జట్లను ఎంపిక చేయనున్నారు. కరీంనగర్ టౌన్ 1వ జట్టు, కరీంనగర్ రూరల్, చొప్పదండి 2, పెద్దపల్లి, మంథని, రామగుండం 3, సిరిసిల్ల, వేములవాడ 4, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి 5, మానకొండూర్, హుస్నాబాద్, హుజురాబాద్ 6వ జట్టుగా ఎంపిక చేసినట్లు సంఘం బాధ్యులు తెలిపారు. కరీంనగర్, వేములవాడ, జగిత్యాల, గోదావరిఖనిలోని క్రికెట్ శిబిరాల్లో ఎంపిక పోటీలు జరుగనున్నాయి. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణపత్రం, ఆధార్, సొంత కిట్, వైట్ డ్రెస్తో హాజరుకావాలని పేర్కొన్నారు. కరీంనగర్ డ్రిస్ట్రిక్ట్ జట్టు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 6 జట్ల ఎంపిక అనంతరం రౌండ్ రాబిన్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. లీగ్స్, క్వార్టర్స్, సెమీఫైనల్స్, ఫైనల్స్ నిర్వహించి ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారిని కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపిక చేస్తారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్లో జరిగే పోటీల్లో పాల్గొననున్నట్లు సమాచారం. పటిష్ట జట్టు ఎంపిక కోసం.. ప్రస్తుతం క్రికెట్ ఎంపిక పోటీలకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు హాజరవుతున్నారు. అందరి ప్రతిభను చూడలేకపోతున్నాం. అప్పుడప్పుడు మంచి క్రీడాకారుడు కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడీ పోటీలతో క్రీడాకారులు తమ టాలెంట్ ఒక మ్యాచ్లో మిస్సయితే మరో మ్యాచ్లో చూపించే అవకాశం ఉంటుంది. ఉత్తమ జట్టు ఎంపిక చేసే అవకాశం కూడా కలుగుతుంది. – ఆగంరావు, జిల్లా అధ్యక్షుడు -
ఇల్లాలు.. కన్నీళ్లు
కరీంనగర్క్రైం: పెళ్లి చేసుకొని కోటి ఆశలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు మొదట్లో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్న కొద్ది రకరకాల రూపాల్లో వేధింపులు ఎదురవుతున్నాయి. అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త, మామ, ఆడబిడ్డల వేధింపులు పెరుగుతున్నాయి. పోలీసుస్టేషన్లలో పెద్ద ఎత్తున పిటిషన్లు ఈ కారణాలతోనే వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల పరంగా వెనకబడడంతో మగవారు మద్యం, గంజాయి ఇతర దురలవాట్లకు బానిసవుతున్నారు. దీంతో నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ పెట్టడం, ఇల్లాలిని తిట్టడం, భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతోంది. ఇలాంటి కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు ● అనుమానం పెనుభూతంగా మారి ఇల్లాలిని హత్య చేయడం వంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే, వివిధ రకాల వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ● ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుమానం కారణంగానే హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు మహిళలు ఇంట్లో ఆర్థిక పరిస్థితి చితికిపోవడంతో భవిష్యత్తు జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేమని భయపడి ముందుగానే తనువు చాలిస్తున్నారు. ● బతుకుబండిని మోయలేక వ్యసనాలకు అలవాటుపడి భర్తలు.. ఇంట్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారి కనీస అవసరాలను సైతం వివాహితలు పుట్టింటివారికి చెప్పుకోలేక బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు అనేకం ఉంటున్నాయి. ● అలాగే మిస్సింగ్ కేసుల్లో కూడా ఎక్కువ శాతం వివాహితలు ఉంటున్నట్లు గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. ఇంట్లో సమస్యలు భరించలేక, వేధింపులు తట్టుకోలేక ఇళ్ల నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. వేధింపులు ఆగడంలేదు సమాజంలో మహిళలపై వేఽ దింపులు పెరుగుతున్నాయి. అదనపు కట్నం కోసం వివిధ విషయాల వల్ల ఆడవారిపై భర్త, వారి కుటుంబ సభ్యుల గృహహింస కేసులు పెరుగుతుండడం కనిపిస్తుంది. చిన్న విషయాలకే హత్యలు, ఆత్మహత్యల ఘటనలు జరుగుతున్నాయి. ఆడవారి భద్రతకు మరింత కఠిన చట్టాలు అవసరం. – కర్రె పావని, ఆదరణ సేవా సమితి, ఎన్జీవో నిర్వాహకురాలు కౌన్సెలింగ్ ఇస్తున్నాం గృహహింస కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. భర్త, భర్త కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తుంటాయి. మేము సాధ్యమైనంత వరకు కౌన్సెలింగ్ ఇచ్చి జంటలను కలుపుతున్నాము. తీరుమార్చుకోకపోతే కేసులు నమోదు చేసి కోర్టుకు పంపిస్తున్నాం. – శ్రీలత, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్స్టేషన్ -
ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే..
నేను గత ఎనిమిదేళ్లుగా దేశ సేవలోనే ఉంటున్నాను. మా నాన్న అంజయ్య మద్దిమల్లలో పనులు చేసుకుంటాడు. తల్లి లక్ష్మి ఇంటి వద్దే ఉంటుంది. నేను ప్రస్తుతం పంజాబ్ సమీపంలోని పటిండ వద్ద విధులు నిర్వర్తిస్తున్నాను. మాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాక్ బాంబు పడింది. – తాళ్లపల్లి వినోద్, ఎగ్లాస్పూర్ (కోనరావుపేట) దేశ సేవలో.. నా తల్లిదండ్రులు బెదిరె నాంపెల్లి–లక్ష్మి. అమ్మానాన్న గ్రామంలోనే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటారు. నేను 2019లో ఆర్మీలో చేరాను. గత ఐదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తుండడం సంతోషంగా ఉంది. దేశం కోసం పనిచేయడం గర్వంగా ఉందని వేణు పేర్కొన్నాడు. – బెదిరె వేణు, మామిడిపల్లి (కోనరావుపేట) -
దేశరక్షణలో పల్లె యువత
● సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న జిల్లా బిడ్డలు ● కశ్మీర్లో కాపలాగా ఉన్న యువకులు ● గర్వంగా భావిస్తున్న కుటుంబ సభ్యులు కోనరావుపేట(వేములవాడ)/ఇల్లంతకుంట(మానకొండూర్): దేశరక్షణలో జిల్లా యువత ముందుంటున్నారు. ఉగ్రవాద ముష్కరులను మట్టుబెట్టడంలో మేమున్నామంటూ దేశసరిహద్దుల్లో గస్తీ కాస్తున్నారు. ఇటీవల భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా జిల్లాలో ఉద్విగ్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత సైన్యంలో పనిచేస్తున్న జిల్లాకు చెందిన యువతలో అత్యధికులు జమ్మూకశ్మీర్లోని దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు. సరిహద్దుల్లో గస్తీ కాస్తూ రక్షణగా నిలుస్తున్న వారిలో కోనరావుపేట మండలం మామిడిపల్లి నుంచి జవ్వాజి ప్రసాద్, బెదిరె వేణు, కోనరావుపేట నుంచి కస్తూరి ప్రశాంత్రెడ్డి, అజ్జు, ఎగ్లాస్పూర్ నుంచి తాళ్లపెల్లి శ్రీకాంత్, తాళ్లపెల్లి వినోద్, వేములవాడ మండలం చెక్కపల్లి నుంచి మెతుకు మధుకర్రెడ్డి, ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన అంతటి అనిల్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా జమ్మూకశ్మీర్, లడక్లో దేశభద్రత విధుల్లో నిమగ్నమై ఉన్నారు. -
విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం
● డీటీసీ పురుషోత్తం తిమ్మాపూర్(మానకొండూర్): విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు విద్యాసంస్థల బస్సులు నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. గురువారం తిమ్మాపూర్లోని జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీ పురుషోత్తం ఆధ్వర్యంలో విద్యాసంస్థల యాజమాన్యాలు, డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా డీటీవో చక్రవర్తి మాట్లాడుతూ, జిల్లాలో 666 స్కూల్ బస్సుల్లో 550 మాత్రమే ఫిట్నెస్ కలిగి ఉన్నాయని, గతేడాది విద్యాసంస్థల వాహనాల వల్ల ప్రమాదాలు జరగలేదని, దీంతో కరీంనగర్ ప్రమాదరహిత జిల్లాగా నిలిచిందని అభినందించారు. స్కూల్ బస్సులు పూర్తిగా పసుపు రంగులో, పిల్లల బొమ్మలతో, అటెండర్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. 60 ఏళ్లు దాటినవారు, ఆరోగ్య సమస్యలున్నవారు డ్రైవింగ్ చేయరాదని ఆదేశించారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను ఉపయోగించకూడదని, ప్రతీ 10 బస్సులకు ఒక అదనపు బస్సు సిద్ధంగా ఉంచాలన్నారు. ట్యాక్స్ బకాయిలు లేకుండా చూడాలన్నారు. 9, 10వ తరగతి విద్యార్థులు రవాణా శాఖ చిల్డ్రన్ పార్క్లో అవగాహన కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. అనంతరం పోస్టర్ ఆవిష్కరించారు. ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధి యాదగిరి శేఖర్రావు మాట్లాడుతూ, స్కూల్ బస్సులను వివాహాలు, రాజకీయ కార్యక్రమాల కోసం అడగవద్దని, నష్టం జరిగితే యాజమాన్యంపైనే భారం పడుతుందని విజ్ఞప్తి చేశారు.శిక్షణతో పాఠశాల విద్య బలోపేతంకొత్తపల్లి(కరీంనగర్): పాఠశాల విద్య బలోపేతానికి ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని గురువారం పరిశీలించారు. శిక్షణ తరగతులను కింది స్థాయి ఉపాధ్యాయుల వరకు చేర్చవలసిన బాధ్యత జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్పైన ఉందని, ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అన్ని మండలాల్లో శిక్షణ తరగతుల సమయం ఒకే విధంగా ఉండేలా జిల్లా స్థాయిలోనే తయారు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఉపాధ్యాయుడు అప్డేట్ అవుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. డీఈవో జనార్దన్రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ఆంజనేయులు, ఆనందం, మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మల్కాపూర్, లక్ష్మీపూర్ గ్రామాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 33/11 కేవీ బద్ధిపల్లి సబ్స్టేషన్ పరిధిలోని బద్ధిపల్లి, నాగులమల్యాల, కమాన్పూర్, గ్రానైట్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆకట్టుకున్న సాయిబాబా జీవిత చరిత్రకరీంనగర్కల్చరల్: మన సమైక్యత కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కళాభారతిలో షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర నాటక ప్రదర్శన అలరించింది. సంస్థ అధ్యక్షుడు రొడ్డ యాదగిరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎస్టీవ్ దేవేందర్, చిందం శ్రీనివాస్, నెల్లుట రవీందర్రావు, సంస్థ కార్యదర్శి అగస్టీన్, కెప్టెన్ మధుసూదన్రెడ్డి తదితరులున్నారు. -
కార్మికుల పిల్లలకు ప్రత్యేక బోధన
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్/కొత్తపల్లి: జిల్లాలోని వలస కార్మికుల పిల్లలందరినీ చదువు వైపు ఆకర్షించామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో వలస కార్మికుల పిల్లలు, ఉపాధ్యాయులు, యజమానులతో గురువారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వలస కార్మికుల పిల్లలు చదువుకు దగ్గర కావాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఎంపిక చేసిన 16 పాఠశాలల్లో సుమారు 500 మందికి ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా గత ఫిబ్రవరి నుంచి బోధిస్తున్నామని అన్నారు. జిల్లా యంత్రాంగం తరఫున పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించామని, ఒడిశా కార్మికుల పిల్లల కోసం ఆ రాష్ట్రం నుంచి పుస్తకాలు తెప్పించి ఇచ్చామని వెల్లడించారు. ఈనెల 24 వరకు తరగతులు కొనసాగుతాయని, చివరి పరీక్ష నిర్వహించి ప్రగతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులను జింకలపార్కు, ఉజ్వల పార్క్ సందర్శనకు తీసుకెళ్లారు. డీఈవో జనార్దన్రావు, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, జిల్లా సైన్స్ ఆఫీసర్ జైపాల్రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, గంగాధర ఎంఈవో ప్రభాకర్రావు, ఇటుకబటీ యజమానుల సంఘం అధ్యక్షుడు హరిచంద్రప్రసాద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందించాలి మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైనవిద్య అందించాలని ఉపాధ్యాయులు కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విభిన్న అంశాలలో ఐదురోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. రానున్న విద్యా సంవత్సరంలోనూ మరిన్ని కొత్త సేవలు ఆవిష్కరిస్తామని తెలిపారు. సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలన్నారు. వారిని నిత్యం గమనిస్తూ చెడుదోవ పట్టకుండా చూడాలన్నారు. పొక్సో, యాంటీ డ్రగ్, ట్రాఫిక్, డిజిటల్ అరెస్ట్ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. డీఈవో జనార్దన్రావు, అల్ఫోర్స్ చైర్మన్ నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దపీట!
మౌలిక సదుపాయాలకు● అదనపు లైన్లు, స్టేషన్ల ఆధునీకరణకు నిధులు ● ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు విడుదల ● కొత్తపల్లి–మనోహరాబాద్కు రూ.205 కోట్లు ● పెద్దపల్లి బైపాస్కు రూ.36 కోట్లు, నిజామాబాద్–పెద్దపల్లికి రూ.13 కోట్లు ● కొలనూరు ఆర్వోబీకి రూ.29 కోట్లు, రాఘవాపురం ఆర్వోబీకి రూ.36 కోట్లు ● ఉమ్మడి జిల్లాకు రూ.435 కోట్లకుపైగా నిధులు ● ఆలస్యంగా దక్షిణ మధ్య రైల్వే పింక్బుక్ సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఎట్టకేలకు దక్షిణమధ్య రైల్వే బడ్జెట్ 2025–26 వెలుగుచూసింది. వాస్తవానికి ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండు లేదా మూడు రోజుల తర్వాత స్థానిక రైల్వే విభాగాల కేటాయింపులను పింక్ బుక్ పేరిట విడుదల చేస్తారు. కానీ..దాదాపు నాలుగు నెలల తరువాత బడ్జెట్ వెలుగుచూడటం ఇదేతొలిసారి. ఉమ్మ డి జిల్లాలోని కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగి త్యాల మార్గాల్లో నెలకొన్న ఈ బడ్జెట్లో రైల్వే పను ల కోసం దాదాపు రూ.435 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఇవే కాకుండా పలు అభివృద్ధి పనులకు మిగిలిన జిల్లాల్లోని స్టేషన్లతోకలిపి మరి కొన్ని రూ.కోట్లు కేటాయించడం గమనార్హం. ఈసా రి స్టేషన్ల ఆధునీకరణ, స్టేషన్లలో లూప్లైన్ల ఏర్పాటు, గూడ్స్ షెడ్ల నిర్మాణం, స్టేషన్లలో అదనపు మెయిన్ లైన్ల ఏర్పాటుకు ఈ నిధులు కేటాయించింది. కొత్తపల్లి– మనోహరాబాద్కు రూ.205 కోట్లు అత్యంత కీలకదశలో ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ (151 కిమీ) మార్గానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.205 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం సిద్దిపేట (సుమారు 77 కిమీ) వరకు లైన్ పూర్తయి సర్వీసు కూడా నడుస్తోంది. సిరిసిల్ల–సిద్ధిపేట మధ్య లైన్పనులు నడుస్తున్నాయి. ఇప్పటికే కరీంనగర్, సిరిసిల్లలో భూసేకరణ వేగంగా సాగుతోంది. 2026 వరకు ట్రాక్ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. మిడ్మానేరులో బ్రిడ్జి పనులు స వాలుగా మారనున్నాయి. ఫలితంగా 2027లో పూర్తి అవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సర్వేలకు.. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు లైన్లకు ఫైనల్ లొకేషన్ సర్వేలకు నిధులు కేటాయించింది. కరీంనగర్–హసన్పర్తి రూ.1.55 కోట్లు, పెద్దపల్లి బైపాస్ లైన్ ఎఫ్ఎల్ఎస్ సర్వే రూ.2 లక్షలు, పెద్దపల్లి–నిజామాబాద్ డబ్లింగ్ లైన్ ఎఫ్ఎస్ఎల్ సర్వే కోసం రూ.3.56 కోట్లు ఇచ్చింది. మెయిన్లైన్కు ● నిజామాబాద్– కరీంనగర్–పెద్దపల్లి లైన్ కోసం రూ.13.86 కోట్లు ● పెద్దపల్లి బైపాస్ లైన్ (2.169 కిమీ) ను బల్లార్షా కాజీపేట మెయిన్ లైన్కోసం రూ.36.99 కోట్లు స్టేషన్ల కోసం.. ● నూకపల్లి– నూకపల్లి మల్యాల హాల్ట్ స్టేషన్ను బ్లాక్ స్టేషన్గా మార్చేందుకు రూ.15.85 కోట్లు ● కరీంనగర్లో అదనంగా రెండు లూప్లైన్ల నిర్మాణం, రైల్వేస్టేషన్ కోసం రూ.27.50 కోట్లు ● నిజామాబాద్–పెద్దపల్లి సెక్షన్లో లింగపేట–జగిత్యాల స్టేషన్లోలూప్లైన్ కోసం రూ.19.89 కోట్లు ● మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి ప్లాట్ఫారాల అభివృద్ధికి రూ.4.54 కోట్లు ● పెద్దపల్లిలో గూడ్స్ షెడ్ అభివృద్ధి కోసం రూ.9.99 కోట్లు ● పెద్దపల్లి–నిజామాబాద్ మార్గంలో న్యూ క్రాసింగ్ స్టేషన్ పూడురు (నూకపల్లి మల్యాల–గంగాధర స్టేషన్ మధ్యలో) రూ.23.59 కోట్లు ● సుల్తానాబాద్–ఎస్టీబీడీ యార్డ్ విస్తరణ, అప్గ్రేడేషన్ కోసం రూ.రూ.36.80 కోట్లు ● మణుగూరు–రామగుండం (రాఘవాపురం) 200 కి.మీ లైన్కు ఈసారి నామమాత్రపు నిధులు కేటాయించారు. రైలు వంతెనల కోసం.. ● కొలనూరు–పెద్దపల్లి ఆర్వోబీ కోసం రూ.29.33 కోట్లు ● పెద్దపల్లి–రాఘవాపురం ఆర్వోబీ కోసం రూ.36.83 కోట్లు ● కొలనూరు–పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఆర్యూబీ రూ.7.41 కోట్లు -
జీపీవో నియామక ప్రక్రియ కొలిక్కి
● 25న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష ● ఇక సొంత జిల్లాలకు కేటాయించేలా చర్యలుకరీంనగర్అర్బన్: గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన గ్రామ పాలన అధికారి(జీపీవో) నియామక ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇతర శాఖలకు సర్దుబా టు అయిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఇటీవల మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకుంది. సొంత జిల్లాను వదిలి ఇతర జిల్లాకు వచ్చినవా రిని తిరిగి స్వస్థలాలకు పంపేలా కసరత్తు చేస్తుండడంతో హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఈ నెల 25న జీపీవో భర్తీ ప్రక్రియకు పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలను గుర్తించగా ప్రభుత్వానికి నివేదించారు. 175 మంది పరీక్ష రాయనున్నారు. 175 మంది ఆసక్తి భూభారతి చట్టం అమలులో భాగంగా సర్కారు ప్రతీ రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలన అధికారిని (జీపీవో) నియమించాలని నిర్ణయించింది. గతంలో ఆయా శాఖల్లో సర్దుబాటు అయిన వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి గత డిసెంబరులో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అప్పట్లో 217 మంది మాతృశాఖకు తిరిగి వచ్చేందుకు దరఖాస్తులు చేశారు. ఇందులో డిగ్రీ అర్హత కలిగినవారు, ఇంటర్, ఇంటర్లోపు వా రీగా విద్యార్హతను బట్టి లెక్కతేల్చారు. ఇక ఉత్తర్వులు రావడమే తరువాయి అనుకుంటున్న సందర్భంలో నేరుగా నియమిస్తే కోర్టు చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న యోచనతో ప్రభుత్వం గత నెల 26 వరకు మరోమారు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో ఇంటర్, డిగ్రీ వారికే అవకాశం ఇస్తూ స్క్రీనింగ్ పరీక్ష రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సర్వీసు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో కేవలం 175 మంది మాత్రమే మాతృశాఖకు వచ్చేందుకు సుముఖత చూపారు. ఇందులో 119 మంది వీఆర్వోలు, 56 మంది వీఆర్ఏలు ఉన్నారు. జిల్లాల వారీగా జాబితా తయారీ ఇటీవల తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తామని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్ఏల సమాచారాన్ని కలెక్టరేట్ అధికారులు జిల్లాల వారీగా జాబితాను సిద్ధం చేసి పెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా తగు చర్యలు తీసుకునేలా కసరత్తు పూర్తిచేశారు. సీసీఎల్ఏ నుంచి వచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. సొంత జిల్లాలకు అవకాశం వీఆర్వో వ్యవస్థ రద్దు సమయంలో సర్దుబాటు పేరిట మిగులు సిబ్బందిని ఇతర జిల్లాలకు కేటాయించారు. అలా భూపాలపల్లి, పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పని చేస్తున్నారు. గతంలో జిల్లాలో విధులు నిర్వహించగా సుదూరంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఇతర జిల్లాల నుంచి వచ్చి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నవారి జాబితాను రూపొందించారు. వారంతా ఆయా జిల్లాలకు తరలివెళ్లేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండటంతో వారిలో ఆనందం కనిపిస్తోంది. -
మనదీ ఘన చరిత్రే
● చారిత్రక కట్టడాలకు నిలయం ● పర్యాటకంలో ఉమ్మడి కరీంనగర్ ● ప్రపంచ సుందరీమణులకు చూపించని వైనం ● అధికారులకు కనిపించని ఉమ్మడి జిల్లా ఘన సంస్కృతివిద్యానగర్(కరీంనగర్): ఉమ్మడి కరీంనగర్ చారిత్రక భాండాగారం. ప్రాచీన సంస్కృతి, కళారూపాలు, చారిత్రక వారసత్వ సంపద కలిగిన గొప్ప జిల్లా. గత చరిత్రకు ఆలవాలమైన చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వినోదం కలిగించే సందర్శనీయ స్థలాలు ఎన్నో ఉన్నాయి. విశ్వసుందరి పోటీలు మన రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న వేళ కరీంనగర్ చారిత్రాత్మక కళా వైభవాన్ని మన అధికారులు విస్మరించడంపై ఉమ్మడి జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.– 8లోu -
సరస్వతీ నమస్తుతే..
కాళేశ్వరం: సరస్వతి నది పుష్కరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.44 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి సరస్వతి ఘాట్లోని త్రివేణి సంగమం, అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కర స్నానాలు ఆచరించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో క్యూలైన్లో భక్తులు గంటల తరబడి నిల్చొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వరకు భక్తుల రద్దీ నెలకొంది. మొదటి రోజు భక్తుల తాకిడి.. తొలిరోజు ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు వాహనాల్లో వచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు, గోదావరి తీరం కిక్కిరిసింది. పార్కింగ్ స్థలాల్లో వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు అంచనా వేశారు. హారతి గద్దెలకు ఏడు జీవనదుల పేర్లు పుష్కరాల సందర్బంగా కాశీ పండితులచే నవరత్నమాల హారతి కార్యక్రమం నిర్వహించడానికి చతుర్వేదసరస్వతి ఘాట్ వద్ద ఏడు గద్దెలు నిర్మించారు. దేవాదాయశాఖ అధికారులు ఆ గద్దెలకు ఏడు జీవనధుల పేర్లను ప్రకటించారు. వాటిలో గంగా, య మున, గోదావరి, సరస్వతి, నర్మద, సిందూ, కావేరి పేర్లను తయారు చేసి ప్రదర్శించారు. కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటు కాళేశ్వర శాశ్వత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారు చేసి నివేదించాలని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను సీఎం కోరారు. పుష్కర ఏర్పాట్లపై సీఎం సంతృప్తి వ్యక్తం చేసి మంత్రి శ్రీధర్బాబు, అధికారులను అభినందించారు. విశేష పూజలతో పుష్కరాలు ప్రారంభం మొదటిరోజు సుమారు 50 వేల మంది పుణ్యస్నానం -
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
సాక్షి,పెద్దపల్లి: బాజాభజంత్రీలు.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. తరలివచ్చే అతిథుల సమక్షంలో ఓ అనాథ యువతి వివాహం జరిపించేందుకు పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. తల్లిదండ్రులను కోల్పో యి రామగుండంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రంలో మానస, తన చెల్లితో కలిసి 16 ఏళ్లుగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జనగామ జిల్లా రఘనాథపల్లికి చెందిన రాజేశ్తో ఇటీవల ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఆ యువతికి పెళ్లిపెద్దగా కలెక్టర్ కోయ శ్రీహర్ష వ్యవహరించేందుకు ముందుకు వచ్చారు. జిల్లా సంక్షేమశాఖ అధికారి వేణుగోపాల్రావు, అదనపు కలెక్టర్లు, బాలల పరిరక్షణ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈనెల 21న యువతి వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్లోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని వేదికగా ఎంచుకున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. -
జమిలి ఎన్నికలతో దేశానికి మేలు
కరీంనగర్టౌన్: వన్ నేషన్, వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) నిర్వహణతో దేశానికి లాభమే తప్ప నష్టం లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ సాయిని మల్లేశం, కో కన్వీనర్లు మాడ వెంకట్రెడ్డి, వాసాల రమేశ్ ఆధ్వర్యంలో బుధవారం నగరంలోని కెమిస్ట్ భవన్లో మేధావులతో సమావేశం నిర్వహించారు. పలువురు మేధావులు వన్ నేషన్, వన్ ఎలక్షన్పై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదాతో పాటు పరిపాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందన్నారు. మనకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1967 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగేవని, తర్వాత కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు రద్దు కావడం, 1970లో ఏడాది ముందే లోక్సభ రద్దు చేయడంతో ఈ విధానం మారిందన్నారు. సమావేశానికి ముందుగా పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి, ఇటీవల ఆపరేషన్ సిందూర్లో వీరమరణం పొందిన సైనికులకు నివాళి అర్పించి సంతాపం ప్రకటించారు. మాజీ మేయర్ సునీల్రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేశ్, బంగారు రాజేంద్రప్రసాద్, తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, బోయినపల్లి ప్రవీణ్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాజన్న హుండీ ఆదాయం రూ.1.65 కోట్లు
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామికి హుండీలలో భక్తులు వేసిన కానుకల ద్వారా రూ.1,65,84,607 నగదు సమకూరింది. దాదాపు 20 రోజుల తర్వాత హుండీలను లెక్కించగా రూ.1.65 కోట్లతోపాటు 204 గ్రాముల బంగారం, 13.200 కిలోల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో కొప్పుల వినోద్రెడ్డి తెలిపారు. గుడి ఓపెన్స్లాబ్లో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య బుధవారం హుండీని లెక్కించారు. కరీంనగర్ సహాయ కమిషనర్ కార్యాలయ అధికారి సత్యనారాయణ, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మల్లారెడ్డిపేటకు చెందిన ఖలీల్(45), శేఖర్ లింగన్నపేటకు వెళ్లి స్వగ్రామానికి తిరిగివస్తుండగా.. ధాన్యం కుప్పలకు ఢీకొని బైక్ అదుపుతప్పింది. 108 వాహనంలో క్షతగాత్రులను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా ఖలీల్ మృతి చెందాడు. శేఖర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబాలిచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రేమానందం తెలిపారు.రైలు నుంచి పడి ఒకరు..జమ్మికుంట: ప్రమాదవశా త్తు రైలు నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి తెలిపిన వివరాలు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రామశంకర్ (45) ఉపాధి కోసం స్నేహితులు మోహన్, విజయకుమార్తో కలిసి చైన్నైకి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైలులో వెళ్తుండగా జమ్మికుంట, బిజిగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి పడి మృతి చెందాడు. స్నేహితులు రైలు నుంచి పడినట్టు గమనించి కాజిపేట రైల్వే స్టేషన్ అధికారులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య గుడిదేవి, ముగ్గురు కుమారులున్నా రు. మృతదేహాన్ని హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నామని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుపతి వివరించారు.అనారోగ్యంతో యువతి బలవన్మరణంఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అనారోగ్యం భరించలేక.. తల్లిదండ్రులకు భారం కావడం ఇష్టం లేని యువతి జీ వితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడింది. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు. మండలంలోని రాచర్లగొల్లపల్లికి చెందిన ముద్రకోల అంజలి(18) కొన్నాళ్లుగా మూర్చ సంబంధిత వ్యా ధితో బాధపడుతోంది. కరీంనగర్, సిరిసిల్ల ఆస్పత్రుల్లో చూపించినా వ్యాధి నయం కాలేదు. తల్లి దండ్రులకు భారం కావడం ఇష్టం లేని అంజలి బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఊరి వేసుకుంది. మృతురాలి సోదరుడు మల్లికార్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.స్వగ్రామానికి మృతదేహంరాయికల్ దుబాయ్లో ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన రమేశ్ మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
సేవ.. ఆధ్యాత్మిక తోవ
వేములవాడ: యువత ఇటు సేవ.. అటు ఆధ్యాత్మిక బాటలో వెళ్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో వివిధ సేవలకు హాజరవుతున్నారు. చుట్టుపక్కల జిల్లాలకు చెందిన యువతీయువకులు సైతం రాజన్న ఆలయంలో చేపట్టే హుండీ లెక్కింపు, ఆలయంలో భక్తులకు అందించే వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీని ద్వారా తమకు సేవ చేశామన్న ఆనందంతోపాటు ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. భగవంతుడు, భక్తుల సేవలో తరిస్తున్న యువతను చూసి ఇతరులు సైతం స్ఫూర్తిపొందుతారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. హుండీ లెక్కింపులో పాల్గొన్న యువతీయువకులను ఆలయ అధికారులు అభినందించారు. ఆలయ ఈవో వినోద్రెడ్డి, ఏఈవోలు శ్రవణ్, శ్రీనివాస్ మాట్లాడుతూ యువత సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. సెలవులు వృథా కావద్దనే.. వేసవి సెలవులు వృథా కావద్దనే ఉద్దేశంతోనే వేములవాడ రాజన్న హుండీ లెక్కింపులో సేవలందించేందుకు వచ్చాం. స్వామి వారికి భక్తులు సమర్పించిన డబ్బులను లెక్కించడం ఆనందంగా ఉంది. ఇలాంటి సేవ లభించినందుకు గర్వపడుతున్నాం. – అమూల్య, రిత్విక, అక్షయ(నిర్మల్ జిల్లా కడెం) భక్తిభావంతో వచ్చాం మేమంతా రాజన్నపై భక్తిభావంతో సేవ చేసేందుకు వచ్చాం. బుధవారం నాటి హుండీ లెక్కింపులో పాల్గొన్నాం. సేవా చేసేందుకు వచ్చే వారికి కొంచె ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – అభిలాష్, కౌషిక్, మనోజ్, మహేశ్, శరత్, రంజిత్(జగిత్యాల జిల్లా గొల్లపల్లి) రాజన్న హుండీ లెక్కింపులో యువత వేసవి సెలవుల్లో విద్యార్థులు సైతం.. -
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దు
కరీంనగర్: రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచాలని టీజీఎఫ్ఆర్సీ ముందు పెట్టిన ప్రతిపాదనలను తిరస్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బద్దం ఎల్లారెడ్డిభవన్లో మాట్లాడారు. ఒక్కో కళాశాల వారు ప్రస్తుతం ఉన్న ఫీజులో 50శాతం పైగా పెంచాలని ప్రతిపాదించడం దారుణమన్నారు. ఇంజినీరింగ్ విద్యను వ్యాపారమయంగా మార్చారని, యాజమాన్య కోటా సీట్లను రూ.లక్షలకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్హత లేనివారితో కళాశాలలు నిర్వహిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఫీజుల దోపిడీని సీఎం నియంత్రించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్, నగర కార్యదర్శి హేమంత్, నాయకులు సందీప్రెడ్డి, సాయి, మచ్చ పవన్, వినయ్రెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు. -
టెక్నాలజీతో మెరుగైన సేవలందించాలి
కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ స్టేషన్లలో కొత్తగా ని యమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలి పారు. కమిషనరేట్ కేంద్రంలోని ఐటీ కోర్ కార్యాలయంలో పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు, సాంకేతిక పరిజ్ఞానంపై కొనసాగుతున్న శిక్షణను పురస్కరించుకొని సీపీ మాట్లాడారు. కొత్త కానిస్టేబు ళ్లకు బేసిక్ ట్రైనింగ్లో అందించిన శిక్షణతో పాటు, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి టెక్నాలజీపై మరింత పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. నేరాల ఛేదనలో సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుందన్నా రు. ఐటీ కోర్ కార్యాలయ ఇన్స్పెక్టర్ జె.సరిలా ల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల కట్టడిని బాధ్యతగా స్వీకరించాలికరీంనగర్/కొత్తపల్లి: మాదక ద్రవ్యాల కట్టడిని ‘గురు’తర బాధ్యతగా స్వీకరించాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ–టెక్నో స్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణలో భాగంగా ఆయన హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాలు మానవ శరీరానికి హాని కలిగిస్తాయని, మెదడు, నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని, జ్ఞాపకశక్తి క్షీణించడంతోపాటు ఏకాగ్రత లోపించడం ద్వారా వ్యక్తుల అభివృద్ధి మందగిస్తుందని పేర్కొన్నారు. అవగాహన లేమితో చాలా మంది విద్యార్థులు మాదకద్రవ్యాలకు బానిస అవుతున్నారని, ఇది అభివృద్ధికి పెద్ద ఆటంకమన్నారు. మాదకద్రవ్యాల వాడకం వల్ల నష్టాల గురించి విద్యార్థులకు స్పష్టంగా వివరిస్తే వాటి వాడకం నుంచి దూరమవుతారని అన్నారు. జి.రాము, ఎస్.అశోక్కుమార్, కె.లక్ష్మణ్కుమార్, మహమ్మద్ ఇషాక్, కె.అశోక్రెడ్డి, డి.ఆనందం పాల్గొన్నారు.వసతులు బాగున్నాయా?కరీంనగర్క్రైం: కరీంనగర్ జిల్లా జైలు, సఖి కేంద్రం, శక్తి సదన్లను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కటారి రేవతి రావు బుధవారం సందర్శించారు. జైలులో మహిళా ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవలు అడిగి తెలుసుకున్నారు. అగర్బత్తుల ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. సప్తగిరికాలనీలోని సఖి కేంద్రంలోని రికార్డులు చూశారు. బాధితులకు అందించిన న్యాయ, వైద్య, వసతి ఇతర సదుపాయాలపై ఆరాతీశారు. మహిళా కమిషన్ సభ్యురాలు వెంట జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సఖి కేంద్రం అడ్మిన్ లక్ష్మి, కోఆర్డినేటర్ శ్రీలత తదితరులు ఉన్నారు. సిటీలో పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: చెట్లకొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు గోదాంగడ్డ, ఉజ్వలపార్కు ఫీడర్ల పరిధిలోని మహాశక్తి దేవాలయం, బాలాజీ సూపర్ మార్కెట్, సంతోష్నగర్, సంతోషిమాత దేవాలయం, భాగ్యనగర్, శ్రీనగర్కాలనీ, భవానీకాలనీ, సప్తగిరికాలనీ, అంజనాద్రీ దేవాలయం, ధోబీఘాట్, గోదాం, బీఎస్ఎఫ్ క్వార్టర్స్, ఏఓస్ పార్కుకాలనీ, జెడ్పీ క్వార్టర్స్, భగత్నగర్, ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఉజ్వలపార్కు సబ్స్టేషన్ వరకు, పాలిటెక్నిక్ కళాశాల, ఐటీఐ కళాశాల, డిమార్ట్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. అదేవిధంగా ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ హౌసింగ్బోర్డు కాలనీ ఫీడర్ పరిధిలోని హౌసింగ్బోర్డు కాలనీ, విట్స్ కళాశాల, సుభాష్ బొమ్మ, వరహస్వామి దేవాలయం, మారుతీనగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్గౌడ్ వివరించారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ చేగుర్తి ఫీడర్ పరిధిలోని మొగ్దూంపూర్, నారాయణరావుపల్లి, నల్లగుంటపల్లి, చేగుర్తి పరిధిలోని వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
తాత ఉన్నాడా.. అంటూ బంగారం చోరీ
జమ్మికుంట: తాత ఉన్నాడా అంటూ మాటలు కలిపిన ఓ గుర్తు తెలియని వ్యక్తి వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన సంఘటన బుధవారం జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. టౌన్ సీఐ రవి తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన ఇంజమూరి వెంకటలక్ష్మి ఇంటిముందుకు బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి వచ్చి తాతా ఉన్నాడా అంటూ ఆమె మెడలోని తులం బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలి కొడుకు వెంకటసత్యనారాయణస్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ వివరించారు. వివాహిత ఆత్మహత్యకోనరావుపేట(వేములవాడ): మండలంలోని మంగళ్లపల్లికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మంగళ్లపల్లికి చెందిన సాసాల లక్ష్మి(50)కి ఇటీవల రెండు సార్లు కిడ్నీలో రాళ్ల కోసం ఆపరేషన్లు జరిగాయి. బుధవారం చిన్న కోడలు సీమంతం గంభీరావుపేటలో జరుగగా కుటుంబసభ్యులు వెళ్లారు. లక్ష్మి మల్లారం శివారులోని ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతురాలికి భర్త అంజయ్య, కుమారులు మహేశ్, బ్రహ్మానందం, కూతురు జ్యోతి ఉన్నారు. వేములవాడ ఎస్సై మారుతి కేసు విచారణ చేపడుతున్నారు. పుష్కరాల్లో ఆర్టీసీ సిబ్బంది కోసం వైద్య శిబిరంవిద్యానగర్(కరీంనగర్): సరస్వతీ పుష్కరాల విధినిర్వహణలో ఉండే ఆర్టీసీ సిబ్బంది కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు కరీంనగర్ జోనల్ హాస్పిటల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవీ గిరిసింహారావు తెలిపారు. కాళేశ్వరంలోని ప్రత్యేక ప్రయాణ ప్రాంగణంలో ఈవైద్య శిబిరం ఈనెల 15 నుంచి 26 వరకు కొనసాగుతుందని వివరించారు. ఆర్థికసాయం శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన వేముల చంద్రబాగ ఇటీవల మృతిచెందారు. బుధవారం ఆమె కుమారుడు శ్రీనివాస్కు 2004–05 ఎస్సెస్సీ స్నేహితులు వెంకటేశ్, సద్దాం, సంతోష్ రూ.11వేలు అందించారు. -
అటు పుష్కరాలు.. ఇటు పనులు
మంథని: పన్నెండేళ్లకోసా నిర్వహించే సరస్వతీ పుష్కరాలు గురువారం ప్రారంభం కానున్నాయి. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణాహిత నదులు కలుస్తుండంతో ఇక్కడ అంతర్వాహిణిగా ప్రవహించే సరస్వతీ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. 12రోజుల పాటు జరిగే పుష్కరాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరివస్తారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారికి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది కానీ.. అఽధికారుల ముందుచూపు లేమి, కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో భక్తులకు అవస్థలు తప్పేలాలేవు. ఇప్పుడే వంతెన మరమ్మతులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని మంథని మండలం) అడవిసోమన్పల్లి వంతెన అప్పటిసీఎం పీవీ నరసంహారావు హయాంలో నిర్మించారు. దాని సామర్థ్యాన్ని మించి వాహనాలు రాకపోకలు సాగించడం, పురాత వంతెన కావడంతో శిథిలావస్థకు చేరింది. దాని మరమ్మతులకు ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. సుమారు నెలరోజులుగా మరమ్మతులు కొనసా..గుతున్నాయి. దానిపై పగుళ్లు చూపాయి. పెద్దగుంతలు ఏర్పడ్డాయి. ఆ ప్రాంతంతోపాటు పాత నిర్మాణాన్ని తొలగించి సిమెంట్, కాంక్రీట్తో పనులు చేస్తున్నారు. ఒకవైపు వాహనాలకు అనుమతి ఇచ్చి మరోవైపు పనులు చేస్తున్నారు. పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి వంతెన మీదుగా వాహనాలు నడుస్తున్నాయి. అంతేగాకుండా బొగ్గు లారీలు, ఇతర భారీ వాహనాలు సైతం పెద్దఎత్తున రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్కు తీవ్రఅంతరాయం ఏర్పడుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇరువైపులా ఉన్న మానేరుతో ప్రమాదం ఏర్పడుతుంది. వాహనాలకు అంతరాయం ఒకేవైపు వాహనాల రాకపోకలతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. సాధారణ రోజుల్లో ఈపరిస్థితి ఉంటే.. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్కు తీవ్రమైన అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. రోడ్డు విస్తరణ.. అభివృద్ధి మల్హర్ మండలం కొయ్యూర్ నుంచి కాటారం మండలం దన్వాడ రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. సరస్వతీ పుష్కరాల తేదీలు ఏడాది ముందుగానే ప్రకటించారు. మంథని– కాటారం మధ్య విస్తరణ, అభివృద్ధి, సరిహద్దు వంతెన మరమ్మతులు ఆలస్యంగా ప్రారంభించడమే కాకుండా నత్తనడకన సాగుతుండడంతో పుష్కరాల వేళ భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. సరస్వతీ పుష్కరాల వేళ.. అధికారుల ముందుచూపు లేమి మంథని–కాటారం మధ్య సాగుతున్న అభివృద్ధి పనులు రెండు జిల్లాల సరిహద్దు వంతెనకు మరమ్మతులు ట్రాఫిక్కు అంతరాయం.. అసౌకర్యానికి గురవుతున్న వాహనదారులు అసౌకర్యం కలగకుండా చర్యలు మంథని మండలం అడవిసోమన్పల్లి వంతెనపై చేపట్టిన మరమ్మతు పనులతో వాహనదారులకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటాం. పనులను పర్యవేక్షిస్తూ వర్క్ ఇన్స్పెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. వాహనదారులు సహకరించాలి. –జఫార్, డీఈఈ, ఆర్ అండ్ బీ, మంథని -
మహిళలు బలోపేతం కావాలి
● కలెక్టర్ పమేలా సత్పతి తిమ్మాపూర్(మానకొండూర్): ప్రభుత్వం అందించే శిక్షణ, పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా శిశు వికాస కేంద్రంలో 20 మంది మహిళలకు గత నెల 12 నుంచి ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. కార్యక్రమాన్ని బుధవారం కలెక్టర్ పరిశీలించారు. మహిళల సాధికారత లక్ష్యంగా ఎలక్ట్రికల్ ఆటో డ్రైవింగ్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. ఈ ఆటోలను నిర్వహణ ఖర్చు లేకుండా నడపవచ్చన్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఆటోల కొనుగోలుకు రుణ సౌకర్యం కల్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఆటో డ్రైవర్లు డ్రైవింగ్ రంగంలో మరింత మంది మహిళలను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. శిక్షణలో పాల్గొన్న మహిళలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అనంతరం శిక్షణ పొందిన మహిళా డ్రైవర్లు ఆటో నడుపుతుండగా కలెక్టర్ స్వయంగా ప్రయాణించి వారి నైపుణ్యాన్ని పరిశీలించారు. మహిళా ప్రాంగణ జిల్లా మేనేజర్ సుధారాణి, కిషన్రెడ్డి, బజాజ్ కంపెనీ మేనేజర్లు అనిల్కుమార్, నాగరాజు పాల్గొన్నారు. -
చేతులెత్తేశారు!
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025నిద్ర..● భయపెడుతున్న గుర్గుర్ ● జనాభాలో 10 శాతం మంది బాధితులు ● హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్కు కారణమంటున్న డాక్టర్లు ● ప్రారంభంలో చికిత్స చేస్తే ఫలితమంటున్న నిపుణులుగురక..ఉమ్మడి జిల్లా జనాభాగుండెపోటు!‘కరీంనగర్కు చెందిన ఓ వ్యక్తిది ప్రైవేట్ జాబ్. రోజూ ఉదయమే విధులకు వెళ్లి పొద్దంతా పని చేసి సాయంత్రానికి అలసిపోయి ఇంటికి చేరేవాడు. రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్రలోకి జారుకోగానే గురకపెట్టేది. అతడికి తెలియకుండానే గురకతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడేది. శ్వాసలో ఇబ్బంది గురించి కుటుంబ సభ్యులు చెప్పినా పెడచెవిన పెట్టాడు. గురకే కదా అని నిర్లక్ష్యం చేశాడు. కొద్దిరోజులకు సమస్య తీవ్రరూపం దాల్చినా పట్టించుకోలేదు. ఓ రోజు వేకువజామున నిద్రలోనే గుండెపోటుకు గురై మృతిచెందాడు’.కరీంనగర్: 10,05,711జగిత్యాల: 13,57,796పెద్దపల్లి: 7,95,332సిరిసిల్ల: 5,52,037 ‘నగరపాలకసంస్థ పరిధిలోని 44వ డివిజన్లో గత జనవరి 21న నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో రేషన్కార్డుల అర్హుల జాబితా ప్రదర్శించారు. డివిజన్కు సంబంధించి 92 మంది రేషన్కార్డులు కొత్తగా పొందేందుకు అర్హులని అధికారులు పేర్లు చదివి వినిపించారు. ఆ జాబితాలో దరఖాస్తు దారు ఐడీ, ఆధార్కార్డు, ఇంటినంబర్, డివిజన్, మొబైల్ నంబర్లు తదితర వివరాలు ఉన్నాయి. అలాగే 41వ డివిజన్లో 62 మంది కొత్త రేషన్కార్డులకు అర్హులని గుర్తించారు. కానీ, ఇప్పటివరకు ఆ జాబితాల్లో ఉన్న ఏ ఒక్కరిని లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు, ఒక్క రేషన్కార్డు కూడా జారీ కాలేదు’.కరీంనగర్కార్పొరేషన్: నగరంలో తాగునీటికి ఎలాంటి కొరత లేదని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ స్పష్టం చేశారు. ఎల్ఎండీలో నీటి మట్టం క్రమేపీ తగ్గుతున్నా, నగరంలో నీటి సరఫరాకు సరిపడా నీళ్లున్నాయని తెలిపారు. ఈ వేసవి మొత్తం సరఫరా చేసే స్థాయిలో నీటిమట్టం ఉందన్నారు. నీటి సరఫరాలో అక్కడక్కడా సమస్యలు ఏర్పడుతున్నా, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నట్లు వివరించారు. వేసవిలో నీటి వినియోగం భారీగా పెరగడం, ఎల్ఎండీలో నీటి మట్టం తగ్గుతుండడం, నగరంలో తాగునీటి సరఫరా, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాల తీరును ‘సాక్షి’కి వెల్లడించారు.కరీంనగర్కార్పొరేషన్: కొత్తగా రేషన్కార్డులు పొందడానికి అర్హులన్నారు.. అర్హుల జాబితా సైతం రూపొందించారు. ఏకంగా ఆ జాబితాను ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన వార్డు సభల్లో ప్రదర్శించారు. పేర్లు చదివి వినిపించారు. అందులో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేయడమే తరువాయి అని చెప్పారు. కానీ, తర్వాత చేతులెత్తేశారు. నాలుగు నెలలు దాటుతున్నా ఆ జాబితాలో పేర్లున్న ఒక్కరిని కూడా లబ్ధిదారులుగా ఎంపిక చేయలేదు. ఆ జాబితా అనంతరం దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్కార్డులు వస్తుండగా, పాత జాబితాలో ఉన్నవారికి మాత్రం కనీస సమాధానం కరువైంది. నగరంలో రేషన్కార్డుల జారీ ప్రక్రియలో నెలకొన్న గందరగోళానికి నిదర్శనమిది. గతేడాది దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏళ్లుగా ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్కార్డుల ప్రక్రియలో కదలిక వచ్చింది. గతేడాదిలో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభల్లో ఆరుగ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులను అధికారులు స్వీకరించగా, ఆ సభల్లో రేషన్కార్డు కోసం కూడా చాలా మంది అర్జీలు ఇచ్చారు. అంతేకాకుండా నేరుగా రేషన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లున్నారు. మరోవైపు కులగణన సందర్భంగా రేషన్కార్డులు లేవని సమాచారం ఇచ్చినవారిని కూడా అర్హులుగా గుర్తించారు. ఇలా వివిధ కేటగిరీల్లో వచ్చిన రేషన్కార్డుల దరఖాస్తుల ఆధారంగా, డివిజన్ల వారీగా ‘రేషన్కార్డుల అర్హుల జాబితా’ రూపొందించారు. ఈ జాబితాను ఈ ఏడాది జనవరి 21న నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభల్లో ప్రదర్శించారు. ఆ జాబితా ఎక్కడ? రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి ప్రజాపాలన వార్డు సభలు నిర్వహించిన సందర్భంలో ప్రదర్శించిన అర్హుల జాబితా ప్రస్తుతం ఏమైందో తెలియడం లేదు. నగరంలోని 60 డివిజన్లకు సంబంధించి దాదాపు 5 వేల మందిని కొత్త రేషన్కార్డులు పొందేందుకు అర్హులుగా పేర్కొన్నారు. ప్రజాపాలన వార్డు సభల్లో స్వయంగా అధికారులే అర్హులుగా ప్రకటించడంతో ఆ జాబితాలో ఉన్నవారు తాము లబ్ధిదారులుగా మారడం ఖాయమంటూ ఆశపడ్డారు. ఏళ్లుగా రేషన్కార్డు కోసం ఎదురుచూస్తున్న తమ నిరీక్షణ ఫలించనుందనుకున్నారు. కానీ, జాబితాలో పేరు మాత్రమే తప్ప రేషన్కార్డు రాకపోవడం, పైగా ఆ జాబితా ఏమైందో కూడా తెలియని పరిస్థితి నెలకొనడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఏ వార్డు సభలో అర్హుల జాబితా ప్రదర్శించారో, ఆ జాబితాలో ఉన్నవారికి కార్డులు రాకపోగా, ఆ సభలో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం రేషన్కార్డులు రావడం గమనార్హం. ఇదిలాఉంటే నగరపాలకసంస్థ అధికారులు మాత్రం తాము అర్హుల జాబితాలో ఉన్న పేర్ల ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, లబ్ధిదారుల వివరాలను సివిల్సప్లైశాఖకు పంపించామంటున్నారు. ఏదేమైనా ప్రభుత్వం గుర్తించిన అర్హుల జాబితాలో నుంచి ఏ ఒక్కరినీ లబ్ధిదారులుగా ఎంపిక చేయకపోవడం, ఆ జాబితానే పరిగణలోకి తీసుకోకపోవడంపై నెలకొన్న గందరగోళానికి జిల్లా ఉన్నతాధికారులు తెరదించాల్సి ఉంది.న్యూస్రీల్ వార్డు సభల్లో ప్రదర్శించిన జాబితా ఎక్కడ? రేషన్కార్డుల జారీపై నగరంలో గందరగోళం -
తాగునీటి కొరత లేదు
● ఎల్ఎండీలో సరిపడా నీరు ● సరఫరాలో అక్కడక్కడా సమస్యలున్నాయి ● ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నాం ● ‘సాక్షి’తో నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్సాక్షి: చాలా ప్రాంతాల్లో నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదంటున్నారు. కారణమేమిటి?కమిషనర్: అలాంటి పరిస్థితి లేదు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోంది. నగరంలో మెజార్టీ ప్రాంతాల్లో నల్లా నీళ్లు వస్తున్నాయి. అక్కడక్కడా సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరిస్తున్నాం. వేసవి దృష్ట్యా రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నాం. కొత్తపల్లిలో రెండు బావులు అద్దెకు తీసుకొని నీటి సరఫరా చేపట్టాం. -
మావోయిస్టు పార్టీతో కేంద్రం శాంతి చర్చలు జరపాలి
కరీంనగర్క్రైం: మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క నారాయణరావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఫిల్మ్ భవన్లో పౌరహక్కుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా 5వ మహాసభలు అధ్యక్షుడు శ్రీపతి రాజగోపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈసందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ, సింగరేణి ఓపెన్ కాస్ట్ల విధ్వంసానికి, ఇటుక బట్టీలలో ఒరిస్సా కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉమ్మడి పౌరహక్కుల సంఘం జిల్లా కమిటీ పోరాటాలు నిర్వహించిందన్నారు. సంఘం నాయకులు కామ్రేడ్ గోపి రాజన్న, జాపా లక్ష్మారెడ్డి, అజాం ఆలీ, డాక్టర్ రామనాథం, నర్రా ప్రభాకర్ అక్రమ హత్యలు మొదలు జగిత్యాల జిల్లా రేచపల్లికి చెందిన పోగుల రాజేశంను అక్రమంగా అరెస్ట్ చేసిందని, అతడి కూతురును అల్లుడు హత్య చేస్తే కూతురు చివరి చూపునకు నోచుకోకుండా హింసించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ ఎన్. వేణుగోపాల్ మాట్లాడుతూ, కగార్ పేరుతో ఆదివాసీలను, వారికి మద్దతుగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, ఛత్తీస్గఢ్లో సైనిక క్యాంపులను ఎత్తివేయాలని తదితర అంవాలపై తీర్మాణాలు చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మాధన కుమారస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రమేశ్చందర్, ప్రధాన కార్యదర్శి పాణి, ముడిమడుగుల మల్లన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడిగా బొంకూరి లక్ష్మణ్, ఉపాధ్యక్షులుగా పుల్ల సుచరిత, నారా వినోద్, కార్యదర్శిగా బొడ్డుపల్లి రవి, సహాయ కార్యదర్శులుగా గడ్డం సంజీవ్, రెడ్డిరాజుల సంపత్, కోశాధికారిగా మాదవనేని పర్వతాలును ఎన్నుకున్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్క నారాయణరావు -
ఎందుకురా నీ బతుకు చావరాదు..! అని తిట్టడంతో
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కులపెద్దలు చేసిన పంచాయితీ ఒకరి నిండు ప్రాణాన్ని తీసింది. పంచాయితీలో బూతులు తిట్టడంతో అవమాన భారంగా భావించిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన కడమంచి స్వామి(34) ఇంట్లో లేనప్పుడు అ తని భార్యపై అదే గ్రామానికి చెందిన టేకు ప్రేమ్కుమార్ లైంగికదాడికి యత్నించాడు. స్వామికి ఈ విషయం తెలియడంతో ప్రేమ్కుమార్ను నిలదీశా డు.మూడు రోజుల క్రితం కులపెద్దలు పంచాయితీ పెట్టి ప్రేమ్కుమార్కు జరిమానా విధించారు. దీంతో కోపోద్రిక్తుడైన ప్రేమ్కుమార్ స్వామిని అందరిముందే బూతులు తిట్టాడు. అంతేకాకుండా చావమని తిట్టడంతో అవమానంగా భావించిన స్వామి మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో ప్రేమ్కుమార్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ట్రెయినీ ఎస్సై కె.వినీతారెడ్డి తెలిపారు. అయితే గ్రామానికి చెందిన కొందరు పెద్దమనుషులతోపాటు కొందరు విలేకరులు కలిసి ఈ పంచాయితీ నిర్వహించినట్లు తెలిసింది. వీరిద్దరి నుంచి రూ.4లక్షల చొప్పున మొత్తం రూ.8లక్షలు పంచాయితీ దరావతుగా తీసుకోవడంతోపాటు ఆ మొత్తం కూడా ఖర్చు అయినట్లు తెలిపారనే చర్చ సాగుతోంది. -
ప్రాణాలు కాపాడేదెలా?
సాక్షి, పెద్దపల్లి: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వరమే అత్యవసర వైద్యసేవలు అందించి ప్రాణాలు నిలబెట్టేందుకు ఉద్దేశించిన ట్రామాకేర్ కేంద్రాలు ప్రతిపాదనదశ వీడడం లేదు. కేంద్రప్రభుత్వం 2012లో ట్రామాకేర్ వైద్యసేవలు ప్రారంభించినా.. జిల్లాలో రాజీవ్ రహదారి విస్తరించి ఉన్నా ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. నిత్యం ఏదోఒక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉండడంతో గాయపడినవారిని సమీపంలోని జిల్లా ఆస్పత్రులు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. చాలా సందర్భాల్లో సత్వర వైద్య సేవలు అందక గాయపడినవారు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదం జరిగిన తొలిగంట(గోల్డెన్ అవర్)లో సరైన వైద్యం అందిస్తే ప్రాణాపాయ స్థితిలోని వ్యక్తి బతికే అవకాశాలు ఉన్నాయి. తాజా గా రాష్ట్రప్రభుత్వం 90 వరకు ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లోనూ వాటిని అందుబాటులోకి తీసుకు రావాలని స్థానికులు కోరుతున్నారు. ట్రామా వస్తే.. ఎంతోమేలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, రహదారులపై ప్రమాదాలు జరిగినా, ఇంట్లో జారీపడినా, భవనాలు కూలీ తీవ్రంగా గాయపడినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్య చికిత్సలు అందించడానికి ట్రామాకేర్లను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. బాధితుల ప్రాణాలు రక్షించడమే ధ్యేయంగా రహదారుల చెంతనే వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్దేశించింది. ట్రామాకేర్ సెంటర్ల ద్వారా ఆర్థో, న్యూరో, జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్, అనెస్తీషియా, ఎంబీబీఎస్, ఎక్స్రే, అంబులెన్స్, డ్రైవర్, సహాయకులు మందులు, అత్యవసర ఆపరేషన్ ఽథియేటర్, ఐసీయూ తదితర అన్నిరకాల సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రధానంగా రెఫరల్ కేసుల సంఖ్య బాగా తగ్గుతుంది. చొరవ తీసుకుంటే జిల్లాలో ట్రాామా సెంటర్ ఏర్పాటు చేయాలని మూడేళ్లుగా డిమాండ్ వస్తోంది. జిల్లాలో ట్రామా సెంటర్ ఏర్పాటు కోసం జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు చొరవ చూపితే స్థానికంగా ఎంతోమందికి అత్యవసర వైద్యం అందుబాటులోకి వచ్చి ప్రాణాలు దక్కుతాయి. జిల్లాలో ఈ ఏడాది జరిగిన ప్రమాదాలు ప్రతిపాదనలు దాటని ట్రామాకేర్ సెంటర్ సత్వర వైద్యం అందక పోతున్న ప్రాణాలు స్థానిక నేతలు చొరవ చూపాలని డిమాండ్ ప్రతిపాదన దశల్లోనే.. జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలనే అంశం ప్రతిపాదన దశలోనే ఉంది. ఇప్పటివరకు ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి సూచనలు రాలేదు. ప్రభత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ట్రామాకేర్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. సెంటర్ ఏర్పాటు అయితే, రహదారి ప్రమాద బాధితులకు ఎంతో మేలు చేకూరుతుంది. – శ్రీధర్, డీసీహెచ్వో -
ఒకరికొకరు అర్థం చేసుకోవాలి
తమ కూతురుకు పెళ్లి చేస్తే పరిస్థితి ఎలా ఉండాలో అమ్మాయి తల్లిదండ్రులు ముందే ఒక ఆలోచనకు వస్తున్నారు. పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను నిర్ణయించేది. అమ్మాయికి అర్థం చేసుకునే గుణం, అబ్బాయికి ఓపిక అనేది ఉన్నాయో లేవో గమనించి వివాహం చేస్తే ఆ బంధం నిలబడుతుంది. తల్లిదండ్రులు ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుంది. – డాక్టర్ ప్రవీణ్కుమార్, హుజూరాబాద్ ఆలోచనల్లో మార్పు రావాలి అమ్మాయిల తల్లిదండ్రుల ధోరణి ప్రస్తుతం పూర్తిగా మారింది. గత 20 ఏళ్లలో అమ్మాయిల ఆలోచన సైతం మారింది. పెళ్లి చేసుకునే అబ్బాయి ఉద్యోగం, ఆస్తిపాస్తులు, ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అడుగులు ముందుకు పడుతున్నాయి. అర్థం చేసుకునే గుణం, కష్టపడేతత్వం, తెలివితేటలతో ఎదిగే యువకుడికి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుంది. – ఆడెపు రవీందర్, మ్యారేజ్ బ్యూరో, హుజూరాబాద్ మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడాన్ని తల్లిదండ్రులు సమాజంలో నామోషీగా భావిస్తున్నారు. అబ్బాయిల్లో నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటివారికి కౌన్సెలింగ్ ఇప్పించడం చాలా అవసరం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.– డాక్టర్ ఎల్.వర్షి, మానసిక నిపుణుడు, హుజూరాబాద్ -
లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్కు గాయాలు
ధర్మపురి: ప్రమాదవశా త్తు లారీ బోల్తాపడి డ్రైవర్, క్లీనర్కు తీవ్రగాయాలైన ఘటన మండలంలోని ఆకసాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. నిజామాబాద్ నుంచి మంచిర్యాల వైపు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఆకసాయిపల్లె గుట్టమలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివనాగరాజు, క్లీనర్ దుర్గారావు క్యాబిన్లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసి 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.దుబాయి నుంచి వచ్చిన వారానికే..● బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతిధర్మపురి: దుబాయి నుంచి వచ్చి వారం రోజులకే బైక్ అదుపుతప్పి కిందపడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని దోనూర్లో వెలుగుచూసింది. ఎస్సై ఉదయ్కుమార్ కథనం ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన నారకట్ల చంద్రయ్య (43) కూతురుకు పెళ్లి చేద్దామని వారంక్రితం దుబాయి నుంచి వచ్చాడు. మంగళవారం దోనూర్లో ఉంటున్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. చంద్రయ్య తల రాయికి తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు భార్య ధనలక్ష్మి, కూతురు శ్రీజ, కుమారుడు తేజ ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఉరేసుకుని ఒకరి ఆత్మహత్యకోరుట్ల: పట్టణంలోని అల్లమయ్యగుట్ట చింతలవాడకు చెందిన టేకి సాయిలు (35) మంగళవా రం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ని జామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లింగా పూర్కు చెందిన సాయిలు కొంతకాలంగా ఇక్క డ హమాలీగా పనిచేస్తున్నాడు. రెండునెలల క్రితం సాయిలు తల్లి అనారోగ్యంతో మృతిచెందింది. అప్పటి నుంచి మనస్తాపంతో ఉంటున్నాడు. నాలుగురోజుల క్రితం భార్య పిల్లలతో కలిసి నిజామాబాద్లోని తల్లిగారింటికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయిలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.5 లోగా దరఖాస్తు చేసుకోవాలిపెద్దపల్లిరూరల్: ఒడిశా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఫస్టియర్ డిప్లొమా కోర్సులో చేరేందుకు ఆసక్తి, అర్హత గలవారు జూన్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ డెప్యూటీ డైరెక్టర్ విద్యాసాగర్ కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 9 సీట్లు కేటాయించారని పేర్కొన్నారు. మూడేళ్ల డిప్లొమా కోర్సులో చేరేందుకు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి 17 నుంచి 25 ఏళ్లలోపు వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు కరీంనగర్లోని చేనేత, జౌళిశాఖ కార్యాలయంలో దరఖాస్తులు సమ ర్పించాలని కోరారు. -
ఇద్దరి మృతికి కారణమైన వ్యక్తి అరెస్ట్
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని హనుమాన్వాడలో ద్విచక్రవాహనంపై వస్తున్న పాదం మల్లేశం, వితన్విల మృతికి కారణమైన నస్పూరి మణిదీప్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. మల్లేశం, ఆయన సోదరుడి కూతురు వితన్వి సోమవారం రాత్రి ద్విచక్రవాహనంపై వస్తుండగా మణిదీప్ అతిగా మద్యం సేవించి అతివేగంగా కారు నడిపి ఢీకొట్టాడు. ఈ ఘటనలో మల్లేశం, వితన్వి మృతిచెందారు. మల్లేశం సోదరుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు మణిదీప్పై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై గీత, ఏఎస్ఐ మోహన్, కానిస్టేబుల్ జీవన్ పాల్గొన్నారు. వడదెబ్బతో ఒకరి మృతివెల్గటూర్: వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జగదేవుపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సయ్య (46) రెండురోజులు ఎండలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. నర్సయ్యకు భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
మధుకర్ను స్వదేశానికి రప్పించండి
జగిత్యాలక్రైం: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి ఇతరులకు బ్యాంక్ ఖాతా ఇచ్చి ట్రావెల్ బ్యాన్ అయిన మల్లాపూర్ మధుకర్ను స్వదేశానికి రప్పించాలని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. జిల్లాలోని పెగడపెల్లి మండలం ఎల్లాపూర్కు చెందిన మల్లారపు మధుకర్ (27) ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. తన బ్యాంక్ ఖాతా ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు లావాదేవీలు జరిపారు. దీంతో అజ్మాన్లోని కోర్టు అతనిపై ప్రయాణ నిషేధం (ట్రావెల్ బ్యాన్) విధించింది. విషయం తెలుసుకున్న మధుకర్ తల్లిదండ్రులు మల్లవ్వ, అంజయ్య ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డితో కలిసి హైదరాబాద్లోని ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. సీఎంవో ద్వారా సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని ప్రజావాణి ఇన్చార్జి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి.చిన్నారెడ్డి వారికి హామీ ఇచ్చారు. -
హోంగార్డుల బదిలీకి దర్బార్
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: హోంగార్డుల బదిలీకి కమిషనరేట్లో మంగళవారం సీపీ గౌస్ ఆలం ప్రత్యేకంగా దర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, ఆ సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన కొత్త జిల్లాలకు కేటాయించబడిన హోంగార్డుల సంఖ్య ఆధారంగా బదిలీలు జరిగాయన్నారు. కరీంనగర్ నుంచి కొత్తగా ఏర్పడిన జిల్లాలకు బదిలీపై వెళ్లిన హోంగార్డులకు గత 9ఏళ్లుగా బదిలీలు జరగలేదన్నారు. వారి అభ్యర్థన మేరకు త్వరలో బదిలీలు చేపడతామని హామీ ఇచ్చారు. బదిలీలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం పోలీస్ కమిషనర్ అధ్యక్షతన ఇద్దరు ఏసీపీలు, ఏవో, రిజర్వ్ ఇన్స్పెక్టర్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కరీంనగర్కు 300మంది హోంగార్డులు కేటాయించినట్లు తెలిపారు. జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, హన్మకొండ, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలకు బదిలీలు జరగనున్నాయని వెల్లడించారు. ఏవో ముని రామయ్య, ఏసీపీలు మాధవి, శ్రీని వాస్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. -
సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
సైదాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రైతు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. మంగళవారం మండలంలోని దుద్దెనపల్లి, బొమ్మకల్ గ్రామాల్లో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని అన్నారు. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్దారణ, పార్ట్–బీలో చేర్చిన భూముల సమస్యలు, తదితర అంశాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపుతారన్నారు. ఫైలట్ మండలంలో సదస్సులు పూర్తి అయిన తర్వాత జిల్లావ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అక్కడే పరిష్కారమయ్యే దరఖాస్తులను తహసీల్దార్ పరిశీలించాలని ఆదేశించారు. హుజూరాబాద్ ఆర్డీవో రమేశ్బాబు, తహసీల్దార్ శ్రీనివాస్, కనకయ్య, సిబ్బంది పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి -
రూ.కోటితో ఎస్టీపీ ఆధునీకరణ పనులు
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని మురుగు నీటిశుద్ధీకరణ కేంద్రాన్ని (ఎస్టీపీ) రూ.కోటితో ఆధునీకరించనున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. మంగళవారం మధురానగర్లో ఉన్న మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని సందర్శించారు. మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్ను నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ.కోటి కేటాయించినట్లు తెలిపారు. కుక్కల బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేసేందుకు గతంలో కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఈఈ సంజీవ్ కుమార్, డీఈ అయూబ్ ఖాన్, ఏఈ గఫూర్ పాల్గొన్నారు. ప్రశాంతంగా పాలిసెట్సప్తగిరికాలనీ(కరీంనగర్): జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 4,234మంది విద్యార్థులకు 1,934మంది బాలురు, 1,985 మంది బాలికలు మొత్తం 3,919 మంది పరీక్షకు హాజరయ్యారు. 315మంది గైర్హాజరైనట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి.శోభారాణి తెలిపారు. -
నువ్వులేని లోకంలో నేనుండలేను కొడుకా..
కరీంనగర్ జిల్లా: ‘కొడుకా.. నువ్వే గుర్తొస్తున్నావ్... ఒక్కగానొక్క కొడుకని అపురూపంగా చూసుకున్నా.. చదువుకుంటా అంటే హైదరాబాద్ పంపిన. మాయ దారి బెట్టింగ్లో రూ.లక్షలు పోగొట్టుకున్నా.. సరే బిడ్డా అని ధైర్యం చెప్పిన. అయినా మమ్మల్ని మోసం చేస్తివి. బెట్టింగ్కు బలై ఈ లోకాన్నే విడిచిపోతివి. నిన్ను మర్చిపోలేకపోతున్నా కొడుకా.. నీవు లేని లోకం నాకు వద్దు బిడ్డా’అంటూ.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో ఓ తండ్రి పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతిచెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మన్నెంపల్లి గ్రామానికి చెందిన తిరుపతిరావు(49) కొడుకు నిఖిల్రావు (21) ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు అలవాటుపడి రూ.లక్షల్లో అప్పు చేశాడు. అవి తీర్చలేక, మానసిక ఒత్తిడితో రెండు నెలల క్రితం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నిఖిల్ ఒక్కగానొక్క కొడుకు కావడంతో, అతని మృతిని తిరుపతిరావు తట్టుకోలేకపోయాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆదివారం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే అతన్ని హైదరాబాద్లోని ఒక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. ఆన్లైన్ బెట్టింగ్తో కొడుకు.. అతని మరణం తట్టుకోలేక తండ్రి మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఇంధనం కరువు
● జనవరి నుంచి పెట్రోల్, డీజిల్ బిల్లులు పెండింగ్ ● పోలీసు వాహనాలకు డీజిల్ కరువు ● కరీంనగర్ కమిషనరేట్లో రూ.కోటికిపైగా బిల్లులు ● సిరిసిల్ల, రామగుండంలో రూ.40 లక్షల చొప్పున బాకీ ● వాహన మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడంలేదు ● మూడు నెలలుగా రాని స్టేషన్ నిర్వహణ బడ్జెట్సాక్షిప్రతినిధి,కరీంనగర్: తెలంగాణ పోలీసులు సాంకేతికత, కేసుల దర్యాప్తు విషయంలో దేశంలోనే నంబర్ వన్గా నిలుస్తున్నారు. ఈ విషయం ఇటీవల మరోసారి రుజువైంది. కానీ, కొన్నినెలలుగా పోలీసులకు సమయానికి నిధులు అందడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసు వాహనాలకు పెట్రోల్, డీజిల్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లో ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ పెట్రోల్ బిల్లులతోపాటు వాహనాల మరమ్మతులకు సంబంఽధించి మెయింటెనెన్స్ బిల్లులు కూడా రావడం లేదని వాపోతున్నారు. స్టేషన్ మెయింటెనెన్స్కు సంబంధించి అర్బన్, రూరల్ ఏరియాల్లో నెలనెలా కొంత మొత్తం అందజేస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పలువురు ఎస్హెచ్వోలు వాపోతున్నారు. గరిష్టంగా కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్జిల్లాలో కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు, సిరిసిల్ల, జగిత్యాల ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. కరీంనగర్ కమిషనరేట్ బిల్లులు జనవరి నుంచి పెండింగ్లోనే ఉన్నాయి. ప్రతీ నె లా రూ.25 లక్షలకుపైగా నిధులు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన కరీంనగర్ కమిషనరేట్లోనే దాదాపు రూ.కోటి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. సిరిసిల్ల లోనూ గత నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదని సమాచారం. అక్కడా దాదాపు రూ.40 లక్షల వరకు బకాయిలు రావాల్సి ఉందని సిబ్బంది వాపోతున్నారు. రామగుండంలో ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.40 లక్షలు మాత్రమే బిల్లులు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాలలో ఎలాంటి సమస్య లేదని స్పష్టంచేశారు. అంతా బానే ఉందని పైకి చెబుతున్న యూనిట్లలోనూ వాస్తవాలు వేరే ఉన్నాయని సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. వాహనాల మరమ్మతుల డబ్బులు సకాలంలో విడుదల కాకపోవడంతో మెయింటెనెన్స్కు ఇబ్బందిగా ఉంటుందని పలువురు పోలీసు అధి కారులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమైన సందర్భాల్లో తమ చేతుల నుంచి డీజిల్ పోయించుకుంటున్నామని వాపోతున్నారు. మెయింటెనెన్స్కు తిప్పలే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని రెండు కమిషనరేట్లు, రెండు ఎస్పీ కార్యాలయాల్లో స్టేషన్ మెయింటెనెన్స్ డబ్బులు మూడు నెలలుగా రావడం లేదని సమాచారం. ప్రాంతాన్ని బట్టి అర్బన్, రూరల్ ఏరియాలకు ప్రతీ నెలా స్టేషనరీ, తదితర మెమెంటెనెన్స్కు కొంతమొత్తం రావాల్సి ఉంటుంది. వీటిని స్టేషనరీతోపాటు వచ్చిన వారికి టీ, కాఫీల కోసం వినియోగిస్తారు. ఈ మొత్తం కూడా మూడు నెలలుగా రావడం లేదని పోలీసు అధికారులు వాపోతున్నారు. దీంతో పోలీసులు పలు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నారు. చాలాసార్లు తామే తొలుత చేతి నుంచి ఖర్చు చేసి, బిల్లులు వచ్చాక సర్దుబాటు చేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.యూనిట్ వాహనాలు కరీంనగర్ 380 రామగుండం 168 జగిత్యాల 242 సిరిసిల్ల 211 (నోట్: వాహనాల సంఖ్యలో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చు) -
24,25 తేదీల్లో తానా రాష్ట్రస్థాయి సదస్సు
కరీంనగర్టౌన్: తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్ (తానా) కరీంనగర్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో నగరంలోని ప్రతిమ హోటల్లో తానాకాన్–2025 పేరుతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ బాధ్యులు వెల్లడించారు. ఐఎంఏ హాల్లో సోమవారం సదస్సుకు సంబంధించి బ్రౌచర్ను ఆవిష్కరించారు. అనంతరం తానా బాధ్యులు మాట్లాడుతూ తానా జోన్–2 పరిధిలోని కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల బాధ్యులు పాల్గొంటారని తెలిపారు. మే 24న సీఎంఈ నిర్వహించబడుతుందని, 25న చిన్న, మధ్యతరహా ఆసుపత్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. అందులో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఆసుపత్రుల అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు నియమాలు, ట్రేడ్ లైసెన్స్, ఎస్టీపీ, ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఇదే రోజు రాష్ట్ర తానా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా డాక్టర్ అరుణ్ కఠారి ఎన్నికై నట్లు వెల్లడించారు. నాలుగు ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 500 మంది వైద్యులు హాజరవుతారని తెలిపారు. తానాకాన్–2025 ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు చాట్ల శ్రీధర్, రాజ్కుమార్, బీఎన్ రావు, జగన్మోహన్ రావు, ఎనమల్ల నరేశ్, శేష శైలజ, నవీన్, మహేశ్, రవికాంత్ పాల్గొన్నారు. -
యూరియా వాడకం తగ్గించాలి
గన్నేరువరం: పంటల సాగులో సిపార్సు చేసిన ఎరువులు మాత్రమే వాడాలని, యూరియా తగ్గించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి జయ భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు. భారతీయ మొక్కజొన్న పరిశోధన కేంద్రం లుది యానా సహకారంతో ఖాసీంపేట, పారువెల్ల గ్రామాలకు చెందిన 250 రైతులకు గడిచిన రబీలో మొక్కజొన్న విత్తనాలు, గడ్డిమందులు అందజేశారు. దీనిపై క్షేత్రస్థాయి పరిశీలన భాగంగా ఆ పంట సాగుచేసిన రైతులతో సోమవారం ఖాసీంపేట గ్రామ రైతువేదికలో నిర్వహించిన క్లస్టర్ స్థాయి సమావేశానికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పంటల సాగులో మేలైన విత్తనాల వాడాలన్నారు. ప్రతి రబీలో జీరో టిల్లర్ విధానంలో మొక్కజొన్న సాగు చేయాలన్నారు. జీరో టిల్లర్ సాగు అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ వ్యవసా య పరిశోధన కేంద్రం అధికారి ఉషారాణి, మండల వ్యవసాయశాఖ అధికారి కిరణ్మయి, శాస్త్రవేత్త శ్రావణి, ఏఈవో అనూష ఉన్నారు. వెల్నెస్ సెంటర్ సందర్శన కరీంనగర్టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఉన్న హెల్త్ వెల్నెస్ సెంటర్ను జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధి కారి డాక్టర్ వెంకటరమణ సోమవారం సందర్శించారు. వెల్నెస్ సెంటర్లో ఉద్యోగులకు ఎంప్లాయీ హెల్త్ స్కీం ద్వారా అందుతున్న సేవలు, పెన్షనర్స్, జర్నలిస్టులకు సెంటర్ ద్వారా అందుతున్న సేవలు, ల్యాబోరేటరీ పరీక్షలు, మందుల వివరాలకు సంబంధించిన ఫార్మసీ రికార్డులు పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలి కరీంనగర్: వైద్య ఆరోగ్య రంగంలో ప్రైవేటీకరణ ఆపాలని, ఆశా వర్కర్లను పర్మినెంట్ కార్మి కులుగా గుర్తించాలని ఆశ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి డిమాండ్ చేశారు. నగరంలోని ముకుందలాల్ మిశ్రాభవన్లో సోమవారం జరిగిన ఆశ వర్కర్స్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుక్లెట్స్ ఆవిష్కరించారు. జయలక్ష్మి మాట్లాడుతూ 19ఏళ్ల నుంచి పనిచేస్తున ఆశవర్కర్లకు హెల్త్ వర్కర్లుగా గుర్తింపు లేదన్నా రు. ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలుపెట్టాలని అన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేశ్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీలత, పద్మ, లక్ష్మి, రజిత, పరిమిత, సత్యలక్ష్మి, ప్రియాంక, సరిత, లత పాల్గొన్నారు. -
రేపు వేములవాడ బంద్
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా జూన్ 15 నుంచి మూసివేస్తామనడంపై ఈనెల 14న వేములవాడలో బంద్ పాటించాలని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ కోరారు. ఈమేరకు సోమవారం కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. 1100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన దేవతామూర్తులను తొలగించొద్దని, భక్తులను యథావిధిగా దర్శనాలకు అనుమతించాలని కోరారు. ఆలయాన్ని మూసివేయడంతో చాలా మంది వ్యాపారులు తమ ఉపాధి కోల్పోతారన్నారు. విస్తరణ పనులను ఎన్నేళ్లలో పూర్తి చేస్తారో ప్రకటించాలని కోరారు. కార్యదర్శి రామతీర్థపు రాజు తదితరులు పాల్గొన్నారు. రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ -
ప్రదర్శనకు ప్రతిపాదిత మాస్టర్ప్లాన్
కరీంనగర్ కార్పొరేషన్: శాతవాహన అర్బన్ డెవలెప్మెంట్ అథారిటి (సుడా) ఆధ్వర్యంలో రూ పొందించిన నగర కొత్త మాస్టర్ ప్లాన్ను ప్రజల కు తెలియచేసేందుకు నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచారు. కార్యాలయానికి వచ్చిన సందర్శకులు పరిశీలించారు. కొత్త మాస్టర్ ప్లాన్లో రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, రోడ్ల వెడల్పు, కొత్త రోడ్లు తదితర అంశాలను ఆసక్తిగా గమనించారు. ప్రతిపాదిత మాస్టర్ప్లాన్కు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే జారీ కాగా, 90 రోజుల అనంతరం ఆమోదం పొందనుంది. -
ప్రజావాణి.. సమస్యల ఝరి
కరీంనగర్ అర్బన్: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణికి అర్జీలు పెరుగుతున్నాయి. వచ్చిన వారే మళ్లీ మళ్లీ వస్తుండగా సాంత్వన అంతంత మాత్రమే. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి అర్జీలొచ్చాయి. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ అర్జీలను స్వీకరించగా పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సమస్యలు వచ్చాయి. మొత్తం 264 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య పరిష్కరించాలని వేడుకోలుమొత్తం అర్జీలు: 264 ఎక్కువగా మున్సిపల్ కార్పొరేషన్: 63 కరీంనగర్ రూరల్ తహసీల్దార్: 12 మానకొండూర్ తహసీల్దార్: 11 ఆర్డీవో కరీంనగర్: 09 తహసీల్దార్ తిమ్మాపూర్: 10 తహసీల్దార్ జమ్మికుంట: 09 -
డాన్స్ నేర్చుకుంటున్నాను
వేసవి సెలవులు వచ్చాయంటే టీవీలకు అతుక్కుపోయేవాళ్లం. స్పెషల్ సమ్మర్ క్యాంపులో డాన్స్ నేర్చుకుంటున్నాను. చేతిరాత బాగుండేలా మా సార్ శిక్షణ ఇస్తున్నారు. చెస్ నేర్చుకుంటున్న. ఇంటికెళ్లే ముందు స్నాక్స్ ఇస్తున్నారు. సమ్మర్ క్యాంపు బాగుంది. – ఎ.తేజస్విని, ముస్తాబాద్ స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్న సెల్ఫోన్, సినిమాలకు దూరంగా ఉండేలా సమ్మర్ క్యాంపులు నిర్వహించడం బాగుంది. నేను స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకుంటున్నాను. దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టాను. ఆటలంటే కూడా ఇష్టం. ఎండలో తిరగకుండా ఆటలు నేర్చుకుంటున్నాం. – జి.చందన, ముస్తాబాద్ నైపుణ్యాలు పెంపొందించేలా క్యాంపులు ఎండాకాలం సెలవుల్లో విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా ప్రభుత్వం మొదటిసారిగా క్యాంపులు నిర్వహిస్తోంది. జిల్లాలో 5వేల మందికి అవకాశం ఉంది. ప్రైవేటుకు దీటుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు క్యాంపులు ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలు మొబైల్, టీవీలకు ఆకర్శితులు కాకుండా నివారిస్తాయి. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలను వెలికితీసే అవకాశం ఉంది. – శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ -
మానేరు వంతెనకు మరమ్మతులు
● వైబ్రేషన్స్ పెరగడంతో సేఫ్టీ అధికారుల తనిఖీలు ● రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేత?తిమ్మాపూర్: కరీంనగర్– హైదరాబాద్– వరంగల్ ప్రధార రహదారిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెన సేఫ్టీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ రహదారి విస్తరణలో భాగంగా నూతన వంతెన నిర్మించినప్పటికీ 25 ఏళ్ల క్రితం నిర్మించిన పాత వంతెనపై కొన్ని రోజులుగా వైబ్రేషన్స్ పెరిగాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో ఆర్అండ్బీ, హెచ్కేఆర్ నిర్మాణ సంస్థ వెంటనే తనిఖీలు చేపట్టింది. మూడు రోజులుగా సేఫ్టీ అధికారులు వంతెనను పరిశీలిస్తున్నారు. గతంలో ఈ వంతెనకు మరమ్మతులు చేపట్టినప్పటికీ, ఇటీవల వైబ్రేషన్ సమస్యలు గుర్తించడంతో అధికారులు మరోసారి సాంకేతిక నిపుణులతో సమీక్ష చేయిస్తున్నారు. పరిశీలనలో కీలక అంశాలు వంతెనపై వాహనాల రాకపోకల సమయంలో అధి క వైబ్రేషన్లు గమనించడంతో, సాంకేతిక నిపుణుల బృందం వంతెన నిర్మాణ స్థిరత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో చేపట్టిన మరమ్మతులు వంతెనను బలో పేతం చేసినప్పటికీ, ప్రస్తుతం గుర్తించిన సమస్యలు దీర్ఘకాలిక భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. నిపుణులు వంతెనలోని పిల్లర్ల మధ్య ఉన్న బేరింగ్లు, గడ్డర్లు, గ్రౌటింగ్లను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ భాగాలలో ఏవైనా బలహీనతలు లేదా నిర్మాణ లోపాలు గుర్తిస్తే, సరిచేయడానికి తగిన మరమ్మతు పనులు చేపడుతారు. వంతెన లోడ్ బేరింగ్ సామర్థ్యం, వాహన ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నారు. మరమ్మతు చర్యలు పరిశీలన ఆధారంగా నిపుణులు వంతెనకు అవసరమైన మరమ్మతులను సూచించనున్నారు. బేరింగ్ల బలోపేతం, గ్రౌటింగ్ పనులు, ఇతర నిర్మాణ సర్దుబాట్లు ఈ చర్యలలో భాగంగా ఉండవచ్చు. అధికా రులు వంతెన సురక్షితతను నిర్ధారించడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి, దీర్ఘకాలిక పరిష్కారాలను అమలు చేయాలని యోచిస్తున్నా రు. ఈ పనులు పూర్తయ్యే వరకు రాకపోకలపై తా త్కాలిక ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ప్రజల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ, వంతెన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. -
ఇద్దరిని బలిగొన్న అతివేగం
● బైక్పై వస్తుండగా ఢీకొన్న కారు ● రెండేళ్ల చిన్నారి, ఆమె పెద్దనాన్న దుర్మరణం ● చిన్నారి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదంజగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకేంద్రంలోని హనుమాన్వాడ సమీపంలోని పూరెల్లవాడలో ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో రెండేళ్ల చిన్నారి.. ఆమె పెద్దనాన్న అక్కడికక్కడే మృతిచెందారు. పూరెల్లవాడకు చెందిన పాదం మల్లేశం (35), ప్రవళిక దంపతులకు సంతానం లేదు. అతని సోదరుడు పాదం శేఖర్, నవ్య దంపతుల కూతురు వితన్వి (2)ని కన్న కూతురులా చూసుకుంటున్నారు. ఆమెను ఎక్కువగా తమ ఇంటివద్దనే ఉంచుకుంటున్నారు. ఈ క్రమంలో మల్లేశం వితన్విని పొలానికి తీసుకెళ్లాడు. సోమవారం రాత్రి బైక్పై ఇంటికి వస్తున్నారు. ఇంటికి సమీపంలోకి రాగానే కండ్లపల్లి వైపు నుంచి జగిత్యాలకు వస్తున్న కారు అతివేగంగా వచ్చి మల్లేశం, వితన్విని ఢీకొంది. ఈ ఘటనలో మల్లేశ్, వితన్వి అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రెండు కుటుంబాల్లో విషాదం మల్లేశం, వితన్వి మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అటు మల్లేశ్ భార్య ప్రవళిక, వితన్వి తల్లిదండ్రలు శేఖర్, నవ్య తీవ్రంగా రోదిస్తున్నారు. చిన్నారితో నిత్యం ఆటపాటలతో సంతోషంగా ఉండే శేఖర్, నవ్య తమ కూతురు లేదని తెలుసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. -
నిర్లక్ష్యం వీడని వైద్యులు
జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో తరుచూ సంఘటనలు చోటుచేసుకుంటుండడంతో ఆస్పత్రికి వచ్చేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఇదే ఆస్పత్రిలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఆదివారం మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ఓ బాలుడు మృతిచెందిన సంఘటన తెలిసిందే. ముమ్మాటికీ ఇది వైద్యుల నిర్లక్ష్యమేనంటూ ఆస్పత్రి ఎదుట బాబు బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఆర్ఎంవోతో పాటు ఎస్సై, ఇతర డాక్టర్లు సదరు వైద్యుడిపై ఫిర్యాదు తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఏడాది క్రితం ఓ గర్భిణికి సిజేరియన్ చేసి కడుపులోనే కర్చీఫ్ మర్చిపోయి కుట్లు వేసిన ఘటన ఇంకా కళ్లముందే కదలాడుతోంది. ఆ మహిళ ఆర్నెళ్లపాటు నరకయాతన అనుభవించింది. చెకప్ కోసం మళ్లీ వైద్యుడి వద్దకు రాగా కడుపులో కర్చీఫ్ ఉన్నట్లు గుర్తించి చికిత్స చేశారు. వైద్యుల నిర్లక్ష్యమో.. సిజేరియన్లు వికటించడమోగానీ ఇదే ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు మృతిచెందారు. జగిత్యాలకు చెందిన ఓ గర్భిణి ఆస్పత్రిలో మగ బిడ్డకు జన్మనివ్వగా.. సిజేరియన్ చేసి కుట్లు వేశారు. ఆ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కొద్దిరోజుల పాటు వైద్యసేవలు అందినప్పటికీ బాబు చనిపోయిన తాజా ఘటనతో మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. వైద్యులపై ఆరోపణల వెల్లువ మాతాశిశు సంక్షేమ కేంద్రంలో పనిచేస్తున్న కొందరు వైద్యులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు కొందరు సొంతంగా ఆస్పత్రులు నిర్వహిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని తమ ఆస్పత్రికి పంపిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాబు చనిపోయిన సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. పెగడపల్లి మండలం సుద్దపల్లికి చెందిన రాజు, జ్యోత్న్స దంపతులకు శనివారం మాతాశిశు కేంద్రంలో బాబు పుట్టాడు. అతను ఆరోగ్యం బాగా లేదని, ఫలానా ఆస్పత్రిలో చాలామంచిగా చూస్తారని, అక్కడకు తీసుకెళ్లాలని ఆ దంపతులకు గుర్తుతెలియని వ్యక్తి సలహా ఇచ్చాడు. వాస్తవానికి అది అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టర్దని సమాచారం. బాబు అప్పటికే బరువు లేకపోవడం, పరిస్థితి సీరియస్గా ఉందని తిరిగి మాతాశిశు సంరక్షణ కేంద్రానికే పంపాడు. అప్పటికే బాబు చనిపోవడంతో వైద్యుల నిర్లక్ష్యమేనంటే ఆందోళనకు దిగారు. ఆ దంపతులను బయటి ఆస్పత్రికి వెళ్లమన్నది ఎవరు..? ఏ ఆస్పత్రికి వెళ్లారు..? అనే దానిపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. కమీషన్ల కోసమేనా..? జగిత్యాల ఎంసీహెచ్లో తరచూ సంఘటనలు వైద్యం అందక తాజాగా బాబు మృతి ప్రభుత్వ వైద్యుల తీరుపై విమర్శలు ఆస్పత్రులు కొత్తగా ఏర్పాటు చేసిన వారు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలతో కుమ్మక్కు అవుతారు. తమ ఆస్పత్రికి రోగులను తీసుకొస్తే కమీషన్లు ఇస్తామంటూ ఎర చూపుతారు. గ్రామీణ ప్రాంతంవారు, అమాయకులు ఆర్ఎంపీ చెప్పిన ఆస్పత్రికే వెళ్తారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనూ ఎవరైనా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేశారా..? గుర్తుతెలియని వ్యక్తులు చెప్పారా..? తేలాల్సి ఉంది. ఫలానా ఆస్పత్రిలో మంచిగా చికిత్స చేస్తారని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే మాతాశిశు సంరక్షణ కేంద్రంలో ప్రసవాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గతంలో 400కు పైగా అయ్యే ప్రసవాలు ప్రస్తుతం 200కు మించి జరగడం లేదని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో వైద్యులు ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి ఆస్పత్రిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. విచారణ చేస్తున్నాం బాబు మృతి ఘటనపై పూర్తిస్తాయిలో విచారణ చేపడుతున్నాం. దంపతులను ఇందులో పనిచేస్తున్న వైద్యుడి ఆస్పత్రికి వెళ్లాలని సూచించిన వ్యక్తిని కూడా విచారిస్తున్నాం. పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటాం. ఎంసీహెచ్లో మెరుగైన వైద్యం అందుతుంది. నిర్లక్ష్యం ఎక్కడా లేదు. – సుమన్రావు, ఇన్చార్జి సూపరింటెండెంట్ -
వైభవంగా శ్రీనివాస కల్యాణం
కరీంనగర్కల్చరల్: కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక మహోత్సవంలో భాగంగా సోమవారం శ్రీదేవి–భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సహస్త్ర దీపాలంకరణ కన్నుల పండువగా నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో శ్రీవారు విహరించారు. సుడాచైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి దర్శించుకున్నారు. ఈవో కందుల సుధాకర్, ధర్మకర్తలు చకిలం గంగాధర్, చకిలం శ్రీనివాస్ పాల్గొన్నారు.కరీంనగర్ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన కల్యాణ వేడుకకు హాజరైన భక్తులు -
పోలాండ్లో మల్యాల వాసి మృతి
మల్యాల: పొలాండ్ దేశంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్యాలకు చెందిన పొన్నం మ నోజ్ గౌడ్ (29) దుర్మరణం పాలయ్యాడు. ఉపాధి నిమిత్తం పోలాండ్ వెళ్లిన మనోజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుకనుంచి వేగంగా వచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. మనోజ్ ఏడు నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. చికిత్స పొందుతూ వ్యక్తి..కమాన్పూర్(మంథని): మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన పెరటి రాజిరెడ్డి(67) ఆదివారం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందా డు. పోలీసుల వివరాలు.. రాజిరెడ్డి తన ద్విచక్ర వాహనంపై గుండా బాపుతో కలిసి రాఘవపూర్కు వెళ్తున్న క్రమంలో కిష్టంపల్లె వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొనంతో తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. భాగస్వాముల వేధింపులు.. ఒకరి ఆత్మహత్యకరీంనగర్రూరల్: వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల్లో తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా తన భాగస్వాములు గురిచేసిన వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్రెడ్డి వివరాల ప్రకారం జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటకు చెందిన మోకినపల్లి శ్రీనివాస్ నగరంలోని తీగలగుట్టపల్లిలో అద్దె ఇంట్లో తన కుటుంబంతో ఉంటూ ఆటోకన్సల్టెన్సీ నడుపుతూ జీవిస్తున్నాడు. భూపతి పాపయ్య, రెడ్డి రాజు, నగునూరు గోపి, యాదగిరితో ఇసుకక్వారీ, హైదరాబాద్లోని పలు భూముల్లో పెట్టుబడులు పెట్టాడు. వీరు శ్రీనివాస్కు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోవడంతో మా నసికంగా వేదనకు గురయ్యాడు. ఆదివారం రాత్రి తన ఇంట్లోని బెడ్రూంలో ఉరివేసుకొ ని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య అంజలి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి విక్రేతల అరెస్ట్రామగుండం: గంజాయి విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాలు.. అంతర్గాం పోలీస్స్టేషన్ పరిధి బుగ్గ గుట్టల్లో సోమవారం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకొని సోదా చేయగా 15 కేజీల గంజాయి లభ్యమైంది. కమాన్పూర్ మండలం రొంపికుంటకు చెందిన చిందం సాయిప్రసాద్, తౌట శివకుమార్, మహబూబ్బాబ్కు చెందిన జక్క యశ్వంత్, భూ పాల్పల్లికి చెందిన జంగపల్లి కమల్ను అదుపులోకి తీసుకోగా, ఒడిశాకు చెందిన అలెక్స్ పరారీలో ఉన్నాడు. రెండు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అగ్నిప్రమాదంలో ధాన్యం, కరెంటు వైర్లు దగ్ధంఓదెల(పెద్దపల్లి): మండలంలోని కొలనూర్ మల్లన్నగుట్ట నుంచి ఓదెల వరకు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. నిప్పురవ్వలు కిందపడటంతో రైతులకు చెందిన కరెంట్ మోటర్లు, వైర్లు, వరిధాన్యం కాలిబూడిదయ్యాయి. సుమారు పదికిలోమీటర్ల వరకు మంటలు ఎగిసిపడటంతో రైతులు ఆందోళన చెందారు. రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. పెద్దపల్లి ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. ముగిసిన చదరంగం పోటీలుకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్లోని జ్యోతినగర్లోని జీనియస్ చెస్ అకాడమీలో నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఓపెన్ చదరంగం పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 100మంది క్రీడాకారులు హాజరయ్యారు. స్విస్ లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచినవారికి ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ రమణ మూర్తి బహుమతులు ప్రదానం చేశారు. జీనియస్ చెస్ అకాడమీ వ్యవస్థాపకుడు కంకటి కనకయ్య మాట్లాడుతూ చదరంగంలో క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ టోర్నీ నిర్వహించడం జరిగిందన్నారు. న్యూరో ఫిజీషియన్ వెంకట్, జీనియస్ చెస్ అకాడమీ డైరెక్టర్ కంకటి అనూప్ కుమార్, సృజన్ కుమార్, తాటిపల్లి సతీశ్బాబు, చీఫ్ ఆర్బిటర్ అరుణ్, ఆర్బిటర్స్ రేవిక్, నితిన్, ప్రభుచంద్ర, వరుణ్, అభిరామ్, శ్రీ నిజ, స్వాతి పాల్గొన్నారు. -
అమర కలం.. విమల గానం
● అరుణోదయ పర్యాయపదాలు.. విమలక్క, అమర్ ● ఆలేరు.. వేములవాడను కలిపిన వైనం ● అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు 50 ఏళ్లు ● నేడు హైదరాబాద్లో స్ఫూర్తి సభ సిరిసిల్ల: విమలక్క, అమర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్)కు పర్యాయపదాలు. ఒకరు పాటలను కై గట్టి రాస్తుంటే.. మరొకరు గొంతెత్తి పాడుతారు. ఆలేరుకు చెందిన విమల, వేములవాడకు చెందిన అమర్లను ఉద్యమమే కలిపింది. అతను పాటల ప్రవాహమైతే.. ఆమె ప్రవహించే జలపాతమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కూర దేవేందర్, విమల దంపతుల ఉద్యమ ప్రస్తానంలో ఎన్నో మైలురాళ్లు. అతను సాయుధుడై ప్రజాపోరాటాల్లో పాల్గొంటే.. ఆమె పాటల పల్లవై ప్రజాసంఘాల్లో పనిచేశారు. అరుణోదయ 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో సోమవారం స్ఫూర్తి సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దంపతుల ప్రస్తానంపై కథనం. కాలేజీలోనే కై గట్టి పాడుతూ.. సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమానికి పర్యాయపదాల్లో ఒక్కరైన కూర దేవేందర్ అలియాస్ అమర్, అలియాస్ మిత్ర మూడు దశాబ్దాల పాటు సాయుధ పోరాటాన్ని సాగిస్తూనే సాహిత్య పరిమళాలు అందించారు. వెయ్యికిపైగా పాటలు రాసిన అమర్ సిద్ధాంత పుస్తకాలను ప్రచురించారు. కాలేజీ వయసు నుంచే పాటలను కై గట్టి పాటడం అలవాటైంది. అమర్ అజ్ఞాతంలో ఉండగా ఆయన షెల్టర్లపై పోలీసులు దాడులు చేసినప్పుడల్లా అతని పాటలు, సాహిత్యం ధ్వంసమయ్యాయి. ఇప్పుడు ఓ 50 ఆడియో క్యాసెట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా వెయ్యి పాటలు ప్రజా బాహుళ్యంలోకి వెళ్లాయి. అమర్ జైలులోనే వందకు పైగా పాటలు రాశారు. పాటలు రాయడంతోపాటు బాణీలు కట్టేవారు. కొన్నింటికి అతని భార్య విమల బాణీలు కట్టి పాడారు. తాను రాసిన పాటల్లో కొన్నింటిని అమితంగా ఇష్టపడతారు. ‘గంతులేసి గోదారి గలగల పారుతుంటే.. చిందులేసి కృష్ణమ్మ పరవళ్లు తొక్కంగ అనే పల్లవితో సాగే పాటను బాగా ఇష్టపడతారు. ‘రియాజు.. రియాజు..’ ‘బిడ్డా నీకు దీవెన కన్న బిడ్డా నీకు దీవెన’ పాటలను అమితంగా ఇష్టపడతారు. 978లో అమరుడైన వెంకట నారాయణ కామ్రేడ్ను స్మరిస్తూ సంకట ప్రభుత్వాన్ని కూల్చ వెంకటనారాయణ.. అనే పాటను తొలిసారి రాసినట్లుగా అమర్ ఓ సందర్భంగా వెల్లడించారు. అనేక పుస్తకాలు రాశారు. అమరుల కొన్నెత్తుటి దారుల్లో, మానేటి పాటలు, అడవి అంటుకుంది, చితాభస్మం, మిత్ర తెలంగాణ పాటల పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఉద్యమ సిద్ధాంత గ్రంథంగా వేయి విషపు నీడలు అనే పుస్తకాన్ని 1984లో రాశారు. సారాబంద్, సీ్త్ర విముక్తి నృత్యరూపకాలను రాశారు. 2004లో ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లో అమర్ జనశక్తి ప్రతినిధిగా హాజరయ్యారు. ప్రజా ఉద్యమాలపై పాటలను సంధించే అమర్ సీపీఐ(ఎంఎల్) జనశక్తి ఉద్యమ నిర్మాత కూర రాజన్న అలియాస్ రాజేందర్కు స్వయాన తమ్ముడు. అభివృద్ధి శాసీ్త్రయంగా ఉండాలని, పీడిత ప్రజలంతా సంఘటితం కావాలని.. ఊపిరి ఉన్నంత కాలం ప్రజా ఉద్యమాల్లోనే కొనసాగుతానని అమర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అరుణోదయంకు ముందే పాటల ప్రవాహం విమలక్క 1972లోనే ‘మారాలి మన సమాజం’ అంటూ పాటలను చిన్నవయసులోనే పాడటం ప్రారంభించారు. ఆలేరులో తన తండ్రి బండ్రు నర్సింహులు రైతుకూలీ సంఘంలో పనిచేస్తుండగా.. అతని స్ఫూర్తితో ఏ పాటనైనా అదే బాణీలో పాడారు. ఎమర్జెన్సీ కాలంలో మరింత ప్రభావితమై గూడ అంజన్న రాసిన పాటను పాడారు. రాంసత్యం మొదటి గురువుగా విమలక్క పాట ప్రస్తానాన్ని సాగించారు. తెలంగాణ ఉద్యమంలో ఆమె నిర్వహించిన ధూంధాం వేదికలు.. తీరిక లేకుండా పాల్గొన్న సభలు ప్రజాబాహుళ్యంలో ఉద్యమకాంక్షను రగిలించాయి. పాటలు పాడటమే కాదు.. గజ్జె కట్టి, డప్పు వాయిస్తూ.. నృత్యం చేస్తుంటే పల్లెల్లో ఉద్యమస్ఫూర్తి రగులుతోంది. అరుణోదయ బాటలో... విమలక్క పాటల ప్రస్థానం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అరుణోదయ బాటలో సాగుతోంది. 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ కళాశాలలో అమరుడైన జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడుపోసుకుంది. మే 12న 50 ఏళ స్ఫూర్తి సభలు నిర్వహిస్తున్నారు. ‘అరుణోదయం’ అనే సావనీరును ఆవిష్కరించుకోవడం, అరుణోదయ డాక్యుమెంటరీని, విప్లవ ప్రజాసంస్థల 50 ఏళ్ల ప్రస్థానపు పాటను ప్రదర్శించనున్నారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరుణోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పని చేసింది. ఈ సభల్లో సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, చైన్నె రైటర్ మీనా కందస్వామి సహా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. అరుణోదయ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేశ్, చిన్నన్న, గంగ, నూతన్ పాల్గొననున్నారు. ‘ఆడుదాం డప్పుల్లా దరువేయరా.. పల్లె తెలంగాణ పాట పాడరా..’ అంటూ.. విమలక్క గజ్జెగట్టి ఆడితే తెలంగాణ పల్లెలు ఉర్రూతలూగాయి. ‘బిడ్డా నీకు దీవెన.. కన్న బిడ్డా నీకు దీవెన..’ అంటూ అమరుల త్యాగాలను ఆలపిస్తుంటే అవే పల్లెలు కన్నీటి ఊటలయ్యాయి. ‘మా ఊరు ఎములాడ. నా బత్కుదేవులా.. బెస్తోల్ల వాడకెళ్దునా.. కదనరంగమై పోనా..’ అంటూ తన ఊరు, తన ఉనికిని చెప్పారు అమర్ ఉరఫ్ కూర దేవేందర్. ‘మముగన్న మా తల్లి మల్లమ్మా..’ అంటూ అమ్మలోని పోరాట పటిమను అక్షరీకరించారు. సౌమ్యమైన రూపం కలం పడితే పాటల తూటాలు పేల్చుతాడు. -
● దైవంగా భావిస్తా..
నర్సింగ్ ఉద్యోగాన్ని దైవంగా భావిస్తున్న. 38 ఏళ్లుగా పని చేస్తున్న. నాకు పోలీస్ కావాలని ఉండేది. నర్సింగ్ చేస్తే బాగుంటుందని మా బాబయ్ సలహా మేరకు జనరల్ నర్సింగ్ చదివాను. 1987లో ఉద్యోగం వచ్చింది. నా చేతిలో చాలా మంది డెలివరీ అయ్యారు. రిస్క్ కేసులను చేశాం. చాలా మంది గుర్తు చేస్తూ పలకరిస్తారు. చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది. – మర్దలీన, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని ● తల్లిదండ్రుల ప్రోత్సాహంతో.. మాది జనగామ జిల్లా నర్మెట్ట మండలం. నాన్న ఆగయ్య, అమ్మ దేవమ్మ నన్ను నర్సింగ్ కోర్స్ చేసేందుకు బాగా ప్రోత్సహించారు. జంపింగ్, రన్నింగ్ తదితర క్రీడల్లో ముందుండే దాన్ని. ఫస్ట్ పీఈటీ అవుదామనుకున్న. కానీ నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వచ్చాను. ఎంజీఎంలో జనరల్ నర్సింగ్ పూర్తి చేశా. 35 ఏళ్ల నా సర్వీస్లో అనేక మంది పేషెంట్లకు చికిత్స చేసి చాలా సంతృప్తి పొందాను. నన్ను స్ఫూర్తిగా తీసుకొని నా కొడుకు కృపాకర్ డాక్టర్ అయ్యాడు. పీడియాట్రిషన్ పీజీ సెకండియర్ చదువుతున్నాడు. నా కూతురు కీర్తన బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి ఎమ్మెస్సీ నర్సింగ్ కోసం ప్రిపేర్ అవుతోంది. యువత హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకొని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలి. – వి.సౌందర్య, నర్సింగ్ సూపరింటెండెంట్, గోదావరిఖని జీజీహెచ్ -
● అమ్మ కోరిక మేరకు..
మాది గోదావరిఖని. నాకు ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు అక్కయ్యలు. చిన్నప్పుడే నాన్న మొండయ్య చనిపోయాడు. అమ్మ శాంతమ్మనే కష్టపడి మమ్మల్ని పెంచి పెద్దచేసింది. నేను నర్సింగ్ చేయాలని అమ్మ ఆశించింది. అమ్మ కోరిక మేరకే నేను మెడికల్ డిపార్ట్మెంట్ను ఎంచుకున్న. ఆర్థిక ఇబ్బందులతో నాలుగున్నరేళ్లు స్టూడెంట్ పాస్తో రోజూ బస్సుల్లో మంచిర్యాలకు వెళ్లి నర్సింగ్ పూర్తి చేశా. 2014 నుంచి 2017 వరకు గర్ట్స్ జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు పద్ధతిలో ఒకేషనల్ నర్సింగ్ లెక్చరర్గా పని చేశా. తర్వాత మెరిట్తో నాకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. పెద్దపల్లి జిల్లా తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలిగా కూడా వ్యవహరిస్తున్న. – జక్కుల మల్లేశ్వరి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని జీజీహెచ్ -
‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన
కరీంనగర్: ఈఏపీసెట్– 2025 ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాల్లో సత్తా చాటిన ‘అల్ఫోర్స్’ విద్యార్థులను ఆ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్రెడ్డి ఆదివారం అభినందించారు. ‘ట్రినిటి’ విజయభేరి కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950తో పాటు మొత్తం 89మందికి పైగా విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి, చైర్మన్ ప్రశాంత్రెడ్డి అభినందించారు. ట్రినిటి జూనియర్ కళాశాలలు విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని తెలిపారు. పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించారని ప్రశంసించారు. ‘శ్రీ చైతన్య’ ర్యాంకుల ప్రభంజనం కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. గోకులకొండ వైష్ణవి 810, బి.మనోఘ్న 968, బి.సాత్విక్ 1,142, పి.స్ఫూర్తిశ్రీ 1,527, బి.శ్రావణి 1,803, పి.బ్లెస్సీ సుసన్ 2,106, పి.చందన 2165, పి.భరత్రెడ్డి 2,815, పి.అజితేష్ 3,016, కె. అనూహ్య 3,503, వి. ప్రవీణ్ 3,623, డి.రిషి 3,996, జి.అర్చన 4,171, ఆర్.శ్రీయాన్ 4,246, వి.శివాణి 4,570, బి.స్రవంతి 4,957, 5000 లోపు 16 ర్యాంకులు, 10000 ర్యాంకుల లోపు 51 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్ మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం
ముత్తారం(మంథని): మండలంలోని మైదంబండ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పందుల మహేందర్(15) అనే విద్యార్థి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ టైర్ కింద పడి మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. మైదంబండకు చెందిన పందుల మొగిళి, లక్ష్మి దంపతుల చిన్న కొడుకు మహేందర్. ఆదివారం తన చిన్నాన్న పందుల శేఖర్, ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్ నిమ్మల కుమార్తో కలిసి ధాన్యాన్ని ట్రాక్టర్లో నింపుతున్నారు. ట్రాక్టర్ను ఎత్తుగడ్డపై పెట్టి ధాన్యం నింపుతుండగా, ట్రాక్టర్ కదలడంతో మహేందర్ ఆపే ప్రయత్నం చేయగా, ఇంజన్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మహేందర్ పోతారం జెడ్పీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివాడు. ఎస్సై నరేశ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహేందర్ మృతికి కారణమైన శేఖర్, కుమార్పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
ఈఏపీసెట్లో మనోళ్ల సత్తా
జమ్మికుంట/కథలాపూర్/రాయికల్/కోరుట్ల/శంకరపట్నం/హుజూరాబాద్/సిరిసిల్ల/ఇల్లంతకుంట: ఈఏపీసెట్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించి ఔరా అనిపించారు. జమ్మికుంట పట్టణానికి చెందిన అయిత రాజ్కుమార్, స్వప్న దంపతుల కుమారుడు ఆర్యన్ 522వ ర్యాంకకు సాధించాడు. కథలాపూర్ మండలంలోని బొమ్మెన గ్రామానికి చెందిన కొమ్ముల శ్రీహర్షిత ఇంజనీరింగ్ విభాగంలో 779ర్యాంకు సాధించింది. తల్లిదండ్రులు కొమ్ముల రాజేందర్– మంజుల వ్యవసాయం చేస్తుంటారు. రాయికల్లోని ప్రభుత్వ టీచర్లు దాసరి కృష్ణహరి–లక్ష్మి కూతురు దాసరి వేద సంహిత ఇంజినీరింగ్ విభాగంలో 546వ ర్యాంకు సాధించింది. ఎలిగేటి రాజు కిషోర్– లావణ్య కూతురు మధుమిత అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 344 ర్యాంకు సాధించింది. కోరుట్లకు చెందిన సాయిస్థ నూరెన్ రాష్ట్రస్థాయిలో 2,825 ర్యాంకు, సత్తి సీతారెడ్డి ఇంజినీరింగ్ విభాగంలో 6,910ర్యాంకు సాధించారు. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన గంప ప్రజ్ఞాని 869 ర్యాంకు సాధించింది. హుజూరాబాద్కు చెందిన మహ్మద్ రిఫాహ్ ఉర్ రెహమాన్ 309ర్యాంకు, మంచికట్ల సాయి వివేకానంద 777ర్యాంకు సాధించారు. సిరిసిల్లలోని విద్యానగర్కు చెందిన ఎనగందుల రిషివర్ధన్ 274వ ర్యాంకు సాధించాడు. రిషివర్ధన్ తల్లి రాణీ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, తండ్రి రవీందర్ కరీంనగర్ డీపీవోగా పనిచేసి, ప్రస్తుతం సిద్దిపేట డీఆర్డీఏలో పనిచేస్తున్నారు.ఇల్లంతకుంట మండలం రేపాకకు చెందిన రోండ్ల దత్తాశ్రీరెడ్డి 760వ ర్యాంకు సాధించాడు. తండ్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి స్వప్న గృహిణి. ముస్కాన్పేటకు చెందిన గుర్రం సిద్ధార్థరెడ్డి 1,025వ ర్యాంక్ సాధించాడు. తండ్రి సందీప్రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తల్లి రమాదేవి గృహిణి. -
● నర్సింగ్ వృత్తి పవిత్రమైంది
మాది మంచిర్యాల జిల్లా మందమర్రి. నర్సింగ్ కోర్స్ చదివితే భవి ష్యత్తు బాగుంటుందని మా మామయ్య, అత్తమ్మ ప్రోత్సహించారు. రామగుండం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో నాకు సీటు వచ్చింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. జీజీహెచ్ ఆస్పత్రిలో మాకు ఇచ్చిన క్లినికల్ స్టడీలో చాలా విషయాలు తెలుసుకున్న. నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైందని అర్థమైంది. కాలేజీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఫ్యాకల్టీలు చాలా బాగా క్లాసులు చెబుతున్నారు. – మార్త, నర్సింగ్ స్టూడెంట్, గోదావరిఖని ● సేవలోనే నిజమైన సంతృప్తి గర్భిణులకు సేవలందించడం నిజ మైన సంతృప్తి. సాధారణ డెలివరీలు లక్ష్యాన్ని మించి పెంచేందు కు ప్రత్యేక సేవలందించడం గ ర్వంగా ఉంది. సాధారణ డెలి వరీ జరిగి తల్లీబిడ్డలు ఇంటికి వె ళ్తుండగా వారు ఆనందంగా చెప్పే మాటలు వింటుంటే ఇంతకంటే ఈ జీవితానికి ఏం కావాలి అనిపిస్తుంది. – ఎన్.సునీత, మిడ్వైఫరీ, మాతాశిశు కరీంనగర్ ● అదృష్టంగా భావిస్తున్నా రోగులకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఏ సంబంధం లేకున్నా ఆస్పత్రికి వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తెలయజేయడం మా విధి. కొన్ని సందర్భాల్లో రోగి కుటుంబసభ్యులు కూడా పట్టించుకోరు. అలాంటి సమయంలో మమ్మల్ని దేవతలుగా చూస్తారు. – పి.విజయలక్ష్మి, గ్రేడ్–1 నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ -
ఏజేఆర్ ఆటోమోటివ్స్ షోరూం ప్రారంభం
కరీంనగర్: నగరంలోని విట్స్ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విపెమెంట్ ఏజెఆర్ ఆటోమోటివ్స్ షోరూంను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బుల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌత్ జోన్ హెడ్ వి.సోమసుందరం, స్టేట్హెడ్ ఎన్.సురేశ్ బాబు, షోరూం డీలర్ అంబటి జోజిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. బుల్ కంపెనీకి సంబంధించి ఒక స్టాండర్డ్ పోర్ట్, స్టాండర్డ్ క్వాలిటీ, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందన్నారు. బుల్ కన్స్ట్రక్షన్స్ ఎక్విప్మెంట్ ద్వారా గంటకు లీటర్ డీజిల్ ఆదా చేయడం జరుగుతుందన్నారు. సర్వీస్ విషయంలోనూ 100శాతం క్వాలిటీ అందిస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ జగ్గారెడ్డి, ఫాదర్ సంతోష్ పాల్గొన్నారు. -
తాగునీటి కోసం వెళ్లి అనంత లోకాలకు..
● ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైక్లు ● హనుమాన్ దీక్షాపరుడి దుర్మరణం వెల్గటూర్: తాగునీరు తెచ్చేందుకు వెళ్లిన ఓ హనుమాన్ దీక్షాపరుడు రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మృతిచెందిన ఘటన మండలంలోని రాజక్కపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దోరిశెట్టి నిక్షిత్వర్మ (17) ఇటీవలే ఇంటర్ పూర్తిచేశాడు. కొందరు యువకులతో కలిసి హనుమాన్ మాల ధరించాడు. ఆదివారం మధ్యాహ్నం భిక్ష సమయంలో పక్కనే ఉన్న కప్పారావుపేటకు స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తాగునీటి కోసం వెళ్లాడు. రోడ్డు దాటే సమయంలో కరీంనగర్ వైపు వెళ్తున్న బెజ్జంకి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు అన్నాజీ విక్రమ్ అతి వేగంగా.. అజాగ్రత్తగా వచ్చి వీరిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రెండు బైక్లపై ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నిక్షిత్వర్మ తలకు బలమైన గాయాలు కావడంతో అంబులెన్స్లో కరీంనగర్ తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు చికిత్స అందించేలోపే మృతిచెందాడు. మృతుడి తండ్రి దోరిశెట్టి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కొడుకు.. చేతికందే వయసులో రోడ్డు ప్రమాదం రూపంలో మృతిచెందడంతో ఆ తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు అక్కడున్న వారందరినీ కలిచి వేసింది.ఈత కొట్టేందుకు వెళ్లి..రాయికల్: ఈతకొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి బావిలో మృతిచెందిన ఘటన రాయికల్ మండలం కుమ్మరపల్లిలో చోటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాధ రెండో కుమారుడు మణిచరణ్. తండ్రి చనిపోవడంతో రాయికల్లోని తాత ఉట్నూరు శంకర్ ఇంట్లో ఉంటున్నాడు. పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో కుమ్మరిపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ సరదాగా ఈతకొట్టేందుకు బావిలోకి దిగాడు. ఈత రాకపోవడంతో బింగి మణిచరణ్(12) మునిగిపోయాడు. గమనించిన స్నేహితులు గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో విద్యార్థి కోసం గాలించగా మృతదేహం లభ్యమైంది. కారు ఢీకొని యువతి..చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరిలో రోడ్డు ప్రమా దం జరిగింది. బ స్సుకోసం రోడ్డు పక్కన వేచి చూస్తున్న యువతిని కారు ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా జాబితాపూర్కు చెందిన మౌనిక(23) సుందరగిరిలో స్నేహితురాలి వివాహానికి హాజరైంది. తిరుగుపయనం కోసం సంతోష్ అనే స్నేహితుడితో కలిసి ఫంక్షన్ హాల్ సమీపలో రోడ్డు పక్కన బస్సుకోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వేగంగా వచ్చిన కారు మౌనిక, సంతోష్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. సంతోష్కు తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై శ్రీనివాస్ క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. తిమ్మాపూర్ సీఐ సదన్కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీ లించారు. తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెంకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి వేగంగా, అజాగ్రత్తగా కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. -
అమ్మే అన్నీ తానై..
సాక్షిప్రతినిధి, కరీంనగర్ ●: కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం 2017 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయన ఉన్నత స్థానంలో ఉండటానికి కారణం ఆయన తల్లి నూర్జహాన్. ఐదుగురు కుమారుల్లో గౌష్ ఆలం చిన్నవాడు. ఆయన సోదరుల్లో ఇద్దరు మర్చంట్ నేవీలో, ఒకరు పరిశోధనా శాస్త్రవేత్తగా, మరొకరు రేడియాలజిస్ట్ డాక్టర్గా స్థిరపడ్డారు. తండ్రి సయ్యద్ ఆలం భారత సైన్యంలో సుబేదార్గా పనిచేశారు. 1993లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తండ్రి మరణించినప్పుడు గౌస్ ఆలం ఏడాది పిల్లవాడు. ఆ సమయంలో వారి కుటుంబం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది. సమాజం ఒంటరి మహిళ ఉద్యోగం చేయడాన్ని అంగీకరించని రోజుల్లో, ఐదుగురు పిల్లల బాధ్యతను తనపై వేసుకుని నూర్జహాన్ ధైర్యంగా ముందుకు సాగారు. భర్త మరణించిన మూడేళ్ల తర్వాత, ఆమె ఢిల్లీ ఆర్డినెన్స్ డిఫెన్స్లో క్లర్క్గా ఉద్యోగంలో చేరారు. ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయంలో గౌస్ ఆలం పాఠశాల విద్య సాగింది. తల్లి కోరిక మేరకు యూనిఫాం సర్వీస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆ కలను నిజం చేయడానికి నూర్జహాన్ ఎంతో కష్టపడ్డారు. అనేక సమస్యలను ఎదుర్కొంటూ తమ పిల్లలకు మంచి చదువు చెప్పించారు. ఆ కష్టానికి ఫలితమే ఈరోజు తాము ఈస్థాయిలో ఉన్నామని గౌస్ ఆలం గర్వంగా చెబుతున్నారు. తల్లి సంపాదనతో పాటు, తండ్రి పెన్షన్, ప్రభుత్వం నుంచి వచ్చిన స్కాలర్షిప్ల ద్వారా చదువుకోగలిగామని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ బాధ్యతలన్నీ తన తల్లి ఒక్కరే మోశారని ఆయన గుర్తుచేసుకున్నారు. తనతల్లి చూపిన ధైర్యానికి, చేసిన త్యాగానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మ.. రెండక్షరాలు కాదు.. సృష్టికి మూలం.. మానవ పుట్టుకకు సాక్ష్యం.. తన రక్తాన్ని పంచి బిడ్డకు ప్రాణం పోస్తుంది. ప్రాణాన్ని ఫణంగా పెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అక్షరాలు నేర్పి లక్షణంగా పెంచుతుంది. బుడిబుడి అడుగులు వేయించి సమాజం వైపు నడిపిస్తుంది. పిల్లలకు చిన్న ప్రమాదం ఏర్పడినా.. తల్లడిల్లిపోతుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ.. జీవితానికి దారి చూపుతుంది. పిల్లలు ఎదుగుతున్న కొద్ది గొప్పగా భావిస్తుంది. 50 ఏళ్లు వచ్చినా.. తన బిడ్డలు ఇంకా చిన్నారులే అంటూ.. ప్రేమను చాటుతుంది. ఇలా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు మాతృమూర్తులు తమ బిడ్డలకోసం అష్టకష్టాలు పడి జీవితంలో స్థిరపడేలా చేశారు. భర్త దూరమైనా అధైర్య పడకుండా బిడ్డలను జీవితంలో నిలబెట్టిన వారు కొందరైతే.. ఆపదలో ఉన్న పిల్లలకు అవయవాలు దానం చేసినవారు మరికొందరు ఉన్నారు. నేడు మదర్స్డే సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ మాతృమూర్తులపై ప్రత్యేక కథనాలు. -
ఐక్యంగా జాతీయతను చాటాలి
కరీంనగర్కల్చరల్: దేశ ప్రజలు ఐక్యంగా ఉండి జాతీయతను చాటాలని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచించారు. శనివారం కరీంనగర్ మార్కెట్ రోడ్డులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారత సైనికులకు మద్దతుగా ఆలయ ఆవరణలో వినూత్నంగా సింధూరంతో కూడిన చేతి ముద్రలను తెల్లటి వస్త్రంపై ఉంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అనంతరం గంగుల కమలాకర్ మాట్లాడుతూ పాకిస్థాన్కు వణుకుపుట్టేలా కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గర్వకారణం అన్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన తెలుగు బిడ్డ మురళినాయక్ ఆత్మకు శాంతి కలగాలని నివాళి అర్పించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనతో తననెల వేతనాన్ని ఇండియన్ ఆర్మీకి పంపించనున్నట్టు తెలిపారు. -
తల్లి త్యాగం.. నిలిచిన ప్రాణం..
ముస్తాబాద్(సిరిసిల్ల): తన జీవితం ఉన్నంత కాలం పేగు తెంచుకుని పుట్టిన సంతానం కోసం ఎంతటి త్యాగానికై న సిద్ధపడుతుంది అమ్మ. అందుకు నిలువెత్తు సాక్ష్యమే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్కు చెందిన అరుట్ల భాగ్యమ్మ. అరుట్ల రాజిరెడ్డి– భాగ్యమ్మ దంపతుల కుమారుడు అరుట్ల మహేశ్రెడ్డి వంశపారపర్యంగా వచ్చిన కిడ్నీ వ్యాధితో అస్వస్థతకు గురయ్యాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో చేరగా రెండు కిడ్నీలు చెడిపోయాయి. అత్యవసరంగా కిడ్నీ మార్పిడి చేస్తేనే ప్రాణపాయం నుంచి బయటపడుతాడని వైద్యులు తెలిపారు. మరో ఆలోచన లేకుండా తల్లి భాగ్యమ్మ తన కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు 15నెలల క్రితం సర్జరీ చేసి భాగ్యమ్మ ఒక కిడ్నీని మహేశ్రెడ్డి వేశారు. అప్పుడు భాగ్యమ్మ కొడుకును కాపాడుకునేందుకు చేసి న త్యాగంతో ఇప్పుడు మహేశ్రెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు. అమ్మ తనకు మరోసారి పునర్జన్మనిచ్చిందని, ఆమె త్యాగం వెలకట్టలేనిదని మహేశ్రెడ్డి అంటున్నారు. – మరిన్ని కథనాలు 10లోu తెలియదుఅవును12 48పేరెంట్స్ను పట్టించుకోకుంటే కఠిన చర్యలు అవసరమేనా?40వద్దు -
కరీంనగర్
గరిష్టం/కనిష్టం37.0 /28.09నృసింహుని సన్నిధిలో రద్దీ ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారి జ యంత్యోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివయ్యా.. దండాలయ్యా వేములవాడ: ‘శివయ్యా.. మా కష్టాలు తీర్చయ్యా’ అంటూ శనివారం 35 వేల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025 -
అమ్మ ప్రేమకు జై..
సాక్షి, పెద్దపల్లి: మన జీవితంలో అన్నిదశల్లో వెంటుండే అమ్మను ప్రేమించేందుకు ఒక్కరోజు తప్పనిసరని యువత భావిస్తోంది. మదర్స్ డే రోజు అమ్మకు గ్రీటింగ్ కార్డు, కేకులు, పూలు కానుకలుగా ఇస్తే సరిపోదు. మన జీవితంలోని ప్రతిక్షణాన్ని అమ్మకు అంకితం చేసినా తక్కువేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. నేడు మదర్స్డే సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు అంశాలపై 100 మందిని ప్రశ్నించగా.. చెప్పిన సమాధానాలు ఇవీ.. అవసరం లేదు05తల్లుల పాత్రను గౌరవించడానికి మదర్స్డే ముఖ్యమా?5837 -
విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలి
● పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: కరీంనగర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీ గౌస్ఆలం సూచించారు. శనివా రం టూ టౌన్ పోలీస్స్టేషన్లో టౌన్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్ లాంటి రద్దీ ప్రదేశాల్లో విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమాలు పెంచాలని ఆదేశించారు. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానాస్పద వ్యక్తులను విచారించి వారి వేలిముద్రలు సేకరించాలని తెలిపారు. తనిఖీల్లో పొర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్లను వినియోగించాలన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, సోషల్ మీడియాపై నిఘా ఉంచడం అవసరమని స్పష్టం చేశారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు బిల్లా కోటేశ్వర్, సృజన్రెడ్డి, జాన్రెడ్డి, శ్రీలత పాల్గొన్నారు. -
దేశ రక్షణ నిధికి ఎమ్మెల్యే నెల వేతనం విరాళం
సప్తగిరికాలనీ(కరీంనగర్): ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలు పుమేరకు దేశ రక్షణ నిధికి ఒకనెల వేతనాన్ని అందజేశారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సరిహద్దులో పాకిస్థాన్ ముష్కరులను తరిమి కొట్టిన భారత ఆర్మీవీరులకు సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశ ప్రజలు గర్వించే విజయాలను అందిస్తున్న భారత సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ, తన కర్తవ్యంగా దేశ రక్షణనిధికి ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా అందజేయాలని సీఎం పిలుపుమేరకు విరాళం అందజేసినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తమకు తోచిన విధంగా విరాళం అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిద్దాం ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి సప్తగిరికాలనీ(కరీంనగర్): ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదును పెంచాలని వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి పేర్కొన్నారు. పీఆర్టీయూ టీఎస్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో పదోతరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించిన 116పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల టాపర్లుగా నిలిచిన 50మంది విద్యార్థులకు శనివారం కలెక్టరేట్లో ప్రతిభా పురస్కారాలు, అవార్డులు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే అత్యున్నత బోధన అందుతుందని తెలిపారు. డీఈవో జనార్దన్రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పదోతరగతి ఫలితాల్లో 97.9శాతం ఉత్తీర్ణతతో జిల్లా ఆరోస్థానం నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఐలేని కరుణాకర్రెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సురేశ్, శంకర్ పాల్గొన్నారు.న్యూస్రీల్ -
నిర్మించారు.. వదిలేశారు!
● బల్దియాకు పట్టని రూ.కోట్ల భవనాలు ● స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్వహణకు రెండోసారి టెండర్ ● గతంలో బిడ్డర్లు రాకపోతే 15 శాతం తగ్గించి రీకాల్ ● రెండు దశాబ్దాలుగా నిరుపయోగంగా ఐడీఎస్ఎంటీ భవనం ● రూ.కోట్లు పెట్టి నిర్మించినా ఆదాయం లేదు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా భవన సముదాయాలు ● అధికారుల ముందు చూపు లోపమే కారణమా?సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చే యడం, బతికున్న వారికి డెత్సర్టిిఫికెట్ జారీ చేయ డం, చనిపోయిన వారికి ఇళ్లు కట్టబెట్టడం, ఎంబీ బుక్కులు మాయం చేయడం, జెండర్ మార్చి పింఛన్లు జారీ చేయడం, టెండర్ల అంచనాలు పెంచడం, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు అమ్ముకోవడం, ట్రేడ్ లైసెన్సుల్లో చేతివాటం, శ్మశానవాటికల్లో గడ్డిపీకే డబ్బులు జేబులో వేసుకోవడం తదితర అక్రమాల్లో ముందుండే బల్దియా అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రూ.కోట్లు పెట్టి నిర్మించిన సొంతశాఖ భవనాలను ఎలా వినియోగించుకోవాలో తెలియకపోవడం గమనార్హం. మార్కెట్లో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించకపోవడం,ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయాలన్న ఆలోచనలు అధికారులకు రాకపోవడం కరీంనగర్ ప్రజలకు శాపంగా మారింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్.. కరీంనగర్ స్మార్ట్సిటీలో భాగంగా అంబేద్కర్ స్టేడి యం ఆవరణలో రూ.26 కోట్ల నిధులతో పలు అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో రూ.16 కోట్లు వెచ్చించి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించారు. నిర్వహణకు ఇటీవల టెండర్లు పిలిచారు. బల్దియా కోరిన మొత్తం చూసిన బిడ్డర్లు బెంబేలెత్తి ముందుకు రాలేకపోయారు. దీంతో మరోసారి 15శాతం అంచనాలు తగ్గించి టెండర్ రీకాల్ చేశారు. ప్రస్తుతం నిర్వహణ టెండర్ను రూ.కోటి ఏడు లక్షలుగా నిర్ణయించారు. ఇందులో విశాలమైన పార్కింగ్, గ్రౌండ్ఫ్లోర్లో 22 షాపులతో కమర్షియల్ కాంప్లెక్స్లో 7447 చదరపు అడుగుల స్పేస్ అందుబాటులో ఉంది. విశాలమైన హాల్, ప్యాంట్రీ, స్టోర్రూం, కిచెన్, స్టోర్, టాయిలెట్లు, ఫ్యాన్లు, ఏసీలతో కలిపి 9,053 చదరపు అడుగుల స్పేస్ అందుబాటులో ఉంది. రెండో అంతస్తులో బాలికలు, బాలురకు ప్రత్యేక డార్మిటరీ, గదులు, స్టోర్ రూం, టాయిలెట్లు, ఏసీలు, ఫ్యాన్లు తదితరాలతో కలిపి 8,278 చదరపు అడుగల స్పేస్ ఉంది. ఈ సారి కూడా బిడ్డర్ల నుంచి ఆశించిన మేర స్పందన ఉంటుందో లేదో వేచి చూడాలి. ఐడీఎస్ఎంటీ భవనం సైతం.. 2006లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ (ఐడీఎస్ఎంటీ) పథకంలో భాగంగా మార్కెట్లోని శ్రీవెంకటేశ్వర ఆలయం సమీపంలో నిర్మించిన ఐడీఎస్ఎంటీ భవనం నేటికీ నిరుపయోగంగానే ఉంది. రెండు దశాబ్దాలుగా ఈ భవనం నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడం వసతుల కల్పనలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. 2006–07లోనే రూ.4 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ సముదాయానికి 2017లో టెండర్ పిలిచినప్పుడు పలువురు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. కానీ, లిఫ్ట్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలంటే.. మీరే పెట్టించుకోండి అని బల్దియా అధికారులు ఉచిత సలహా ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప.. బిడ్డర్లు అడిగిన దిశగా ఆలోచనలు చేయలేదు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భవనంలో రాత్రిపూట అసాంఘిక కార్యకలాపాలు జరుగతున్నాయంటే.. అది బల్ది యా అధికారుల నిర్లక్ష్యపు పుణ్యమే. వీటితోపాటు చైతన్యపురి మీసేవా అంతస్తులోని మొదటి అంతస్తు, కశ్మీర్ గడ్డ మీసేవాలో మున్సిపల్ బిల్డింగ్ నిరుపయోగంగా ఉన్నాయి. రూ.కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలను సద్వినియోగం చేసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు పెరిగిపోతున్నాయి.సద్వినియోగ పరుస్తాం స్పోర్ట్స్ కాంప్లెక్స్కు గతంలో టెండర్లు పిలిచినపుడు రాకపోవడంతో 15శాతం తగ్గించి టెండర్ రీకాల్ చేశాం. ప్రస్తుతానికి బిడ్డర్ల నుంచి సానుకూల స్పందన ఆశిస్తున్నాం. ఇక ఐడీఎస్ఎంటీ భవనంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేసి, కొన్ని ప్రాంతాల్లో రీమోడలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇటీవల కలెక్టర్తోనూ చర్చించాం. త్వరలోనే రీమోడలింగ్ చేసి టెండర్ పిలుస్తాం. – చాహత్ బాజ్పేయ్, ఎంసీకే కమిషనర్ -
తనను మరిచి.. పిల్లల్ని ముందుకు నడిపించి..
ధర్మారం(ధర్మపురి): ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన కల్లెం శంభా రెడ్డి–లక్ష్మి దంపతులకు కూతురు అంజవ్వ, ఇద్దరు కుమారులు మధుకర్రెడ్డి, జీవన్రెడ్డి. పిల్లలు చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. దీంతో కుటుంబ భారం మొత్తం తల్లిపై పడింది. చిన్నపాటి వ్యవసాయమే ఒక్కటే ఆధారం. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివించింది. ఎలాంటి ట్యూషన్ లేకుండా కుమారులు ఉన్నత చదువులు చదివారు. కూతురుకు వివాహం చేయగా వ్యవసాయంలో స్థిరపడింది. పుట్టింటికి చేదోడు వాదోడుగా నిలిచి ఇల్లు కట్టించింది. మధుకర్రెడ్డి జగిత్యాల జిల్లాలో మండల ప్రణాళిక అండ్ గణాంకాధికారిగా, జీవన్రెడ్డి పెద్దపల్లి జిల్లాలో ప్రణాళిక అండ్ గణాంకాధికారిగా ఉద్యోగం సాధించారు. ఇద్దరికీ పెళ్లిల్లు అయ్యాయి. మధుకర్రెడ్డి మేనమామ కుతూరు మౌనికను వివాహం చేసుకోగా హౌజ్వైఫ్. జీవన్రెడ్డి భార్య ప్రియంకా మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్. లక్ష్మి ఆత్మస్థైర్యంతో కష్టపడి ముగ్గురిని ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. తనను మరిచి తమను ముందుకు నడిపించిన అమ్మ లేకుంటే ఈ స్థితికి రాలేకపోతుమని కొడుకులిద్దరూ చెప్పుకొచ్చారు. -
తండ్రి లేని లోటును తీర్చి..
రామగుండం: అంతర్గాం మండలం కుందనపల్లి ఇందిరమ్మ కాలనీకి చెందిన బొంగోని సమ్మయ్య– తిరుమల దంపతులకు ప్రియాంక, భూమిక సంతానం. సమ్మయ్య స్థానికంగా పెట్రోల్ బంక్లో పని చేస్తూ 2006లో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో భార్యపై కుటుంబ భారం పడింది. 2007లో అక్బర్నగర్ అంగన్వాడీ కేంద్రంలో టీచర్గా ఉద్యోగంలో చేరిన తిరుమల కుటుంబపోషణ కష్టంగా మారినా తన కూతుళ్లకు ఉన్నత చదువులు చదివించి తండ్రి లేని లోటును తీర్చింది. గతేడాది ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరడంతో తిరుమలకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగింది. పెద్ద కూతురుకు వివాహం చేయడంతో హైదరాబాద్లో స్థిరపడగా, చిన్న కూతురు హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. -
అమ్మే.. అన్నీ తానై
● కష్టాలను ఎదురొడ్డి.. ● పిల్లలను ప్రయోజకులను చేసి ● ఆదర్శంగా ఉమ్మడి జిల్లాలోని మాతృమూర్తులు ● నేడు మదర్స్ డే ప్రతికూల పరిస్థితుల్లో కష్టాలకు ఎదురొడ్డారు.. ఇంటి పెద్ద దూరమైనా.. మొక్కవోని ధైర్యంతో కుటుంబ భారాన్ని తలకెత్తుకున్నారు.. ఎవరి సాయం లేకున్నా రెక్కల కష్టాన్ని నమ్ముకుని పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రయోజకులుగా చేశారు ఆ మాతృమూర్తులు. ఇంకొందరు ప్రాణాలను లెక్కచేయకుండా తమ కంటిపాపలకు అవయవదానం చేసి ఆదర్శంగా నిలిచారు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు.. కంటికి రెప్పలా కాపాడి.. మల్యాల(చొప్పదండి): తండ్రి వేలు పట్టుకొని నడక నేర్చిన జ్ఞాపకాలు ఆ చిన్నారులకు లేవు. చిన్ననాడే తండ్రి కనుమూస్తే ఆ తల్లే తండ్రిగా బాధ్యత తీసుకుంది. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ 25ఏళ్లుగా కూలీపని చేస్తూ పిల్ల లను పోషించింది. మల్యాల మండలం పోతారం గ్రామానికి చెందిన కట్కూరి శంకర్–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు రాజు, రంజిత్, కుమార్తె రాధ సంతానం. పిల్లల చిన్నతనంలోనే శంకర్ మృతిచెందాడు. అప్పటి నుంచి నిత్యం కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని వెళ్లదీసింది లక్ష్మి. పెద్ద కుమారుడు తల్లికి ఆసరాగా ఉంటూ, తమ్ముడు, చెల్లెకు తోడుగా నిలిచాడు. ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్పై పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడిని ఇంటర్ వొకేషనల్ కోర్సు చదివించింది. ప్రస్తుతం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. కూతురు రాధకు వివాహం చేసింది. అమ్మకు తోడుగా ఉంటాం నాన్న ప్రేమ తెలియదు. అమ్మే లోకంగా, అమ్మ కష్టం చూసుకుంటూ పెరిగినం. నేను స్కూల్కు వెళ్తే అమ్మ పనికి వెళ్లేది. నిత్యం ఏదో ఒక పనికి వెళ్లి మమ్మల్ని పోషించింది. అమ్మను కళ్లలో పెట్టి చూసుకుంటాం. – రంజిత్, చిన్న కుమారుడు -
కూలీ పనిచేస్తూ.. కొడుకును చదివిస్తూ..
కథలాపూర్(వేములవాడ): పిల్లలకు తల్లిదండ్రులు అన్ని వసతులు సమకూర్చి చదవాలని చెబితే కొందరు పెడచెవిన పెట్టి వదిలేస్తున్న రోజులివి. కానీ చిన్నప్పటి నుంచి తండ్రి దూరమైనా తల్లి కూలీ పనిచేస్తూ కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తోంది. కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన సదుల జలకు రంజిత్ సంతానం. రంజిత్ చిన్నగా ఉన్నప్పుడే జలను ఆమె భర్త విడిచి వెళ్లిపోయాడు. అయినా ఆమె కుంగిపోకుండా ఒకగానొక్క కుమారుడిని ప్రయోజకుడిగా చేయాలనుకుంది. కూలీ పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. రంజిత్ను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి, కథలాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసి టాపర్ స్థానం దక్కించుకున్నాడు. ఎంసెట్లో మంచి మార్కులు సాధించి హైదరాబాద్లోని కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం పూర్తి చేశాడు. రెక్కాడితేనే డొక్కాడే నిరుపేద కుటుంబానికి చెందిన జల తన కుమారుడిని ఉన్నత చదువులు చదివించడంతో ఆమె కష్టపడిన తీరును అభినందిస్తున్నారు. అమ్మ తన కోసం పడిన శ్రమను చూసి ఉన్నత చదువుల్లో రాణించాలన్నదే లక్ష్యమని రంజిత్ పేర్కొన్నాడు. -
కిడ్నీతో పునర్జన్మ
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): అమ్మ కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ఇస్తే.. అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని కాల్వశ్రీరాంపూర్ మండలం పందిల్లకు చెందిన నాగరాజు పేర్కొన్నాడు. వివరాలు.. వెల్ది సరోజన– రాజమల్లు దంపతుల పెద్ద కుమారుడు నాగరాజు కిడ్నీలు చెడిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. ఆర్థిక స్థోమత లేక కొన్నాళ్లు మందులతో నెట్టుకొచ్చారు. అప్పుడే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం వారికి వరంగా మారింది. తల్లి సరోజన కిడ్నీ ఇవ్వడంతో నాగారాజు పూర్తిగా కోలుకున్నాడు. ఆరోగ్యశ్రీ కాపాడింది వైఎస్ రాజశేఖర్రెడ్డి మాకు దేవుడు. మా కొడుకు ద క్కడని అనుకున్నాం. ఆరోగ్యశ్రీ పథకం ఆపరేషన్కు దారి చూపింది. నేను కిడ్నీ ఇచ్చి కొడుకును బతికించుకున్నా. ఆ దేవుడికి రుణపడి ఉన్నాం. కొడుక్కు పెండ్లి చేశాం. భార్యాపిల్లలతో ఆనందంగా ఉన్నారు. – సరోజన, నాగరాజు తల్లి మందులు వాడుతున్న రోజూ మందులు వాడుతున్న. పని ఎక్కువై అలసిపోతే జ్వరం వస్తది. డాక్టర్ వద్దకు వెళ్లి చిక్తిత్స తీసుకుంటే నయమవుతది. నెలకు మందులకు రూ.5 వేలు ఖర్చవుతున్నాయి. అప్పటి సీఎం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంతోనే నా ప్రాణాలు దక్కాయి. – భార్యాపిల్లలతో నాగరాజు -
ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి
పెద్దపల్లిరూరల్: పట్టణ శివారు చందపల్లికి చెందిన అరికె సంపత్ (27) అనే యువకుడు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మరణించాడని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. సంపత్ శనివారం పశువులు మేపేందుకు వెళ్లాడు. కాగా మధ్యాహ్న భోజనం చేసే సమయంలో తాగునీటికోసం వ్యవసాయ బావివద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. మృతుడి తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించిన భర్తపై కేసుకథలాపూర్: మండలంలోని చింతకుంట గ్రామంలో అరికొప్పుల పుష్పలతను గుడిసెలో ఉంచి నిప్పంటించి హత్య చేసేందుకు ప్రయత్నించిన ఆమె భర్త అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్కుమార్ తెలిపారు. పుష్పలత, అంజయ్య శుక్రవారం రాత్రి గొడవపడ్డారు. శనివారం ఉదయం పుష్పలతను గుడిసెలో ఉంచి అంజయ్య నిప్పంటించారు. ప్రమాదంలో గుడిసెలోని వస్తువులు కాలిపోయాయి. అదృష్టవశాత్తు పుష్పలతకు గాయాలు కాలేదు. పుష్పలత ఫిర్యాదు మేరకు అంజయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. మిడ్మానేరు భద్రతపై ఆరాబోయినపల్లి(చొప్పదండి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్మానేరు ప్రాజెక్టును శనివారం బాంబ్స్క్వాడ్ బృందం తనిఖీ చేసింది. భారత్, పాక్ మధ్య యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు పరిసరాలను బాంబ్స్క్వాడ్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రాజెక్టు భద్రతపై ఆరా తీశారు. -
కూడళ్లలో అప్రమత్తం
కోరుట్ల: భారత్, పాక్ యుద్ధం.. కాల్పుల విరమణ నేపథ్యంలో అసాంఘికశక్తుల కార్యకలాపాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం జాగ్రత్తలు చేపట్టింది. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రసంస్థల మిలిటెంట్లు జనసమ్మర్ధం అధికంగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పేల్చడం వంటి దుశ్చర్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్ అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్న కారణంగా పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు. గతంలో జరిగిన సంఘటనలు ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇదివరకు పలుచోట్ల పాక్ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలు బాంబులు పేల్చిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ● 2000 సంవత్సరంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో లష్కర్ ఏ తోయిబాకు చెందిన మోస్ట్వాంటెడ్ తీవ్రవాది అజంఘోరి ఎన్కౌంటర్ జరిగింది. ● 1999లో మెట్పల్లి పట్టణంలో ప్రతిరోజు జనంతో నిండి ఉండే ఓ సినిమా టాకీస్లో బాంబు పేలింది. ● ఆ బాంబు పేలుడు తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. ● ఆ బాంబు పేల్చివేత వెనక అజంఘోరి పాత్ర ఉందన్న ప్రచారం జరిగింది. ● 2005లో కరీంనగర్ బస్టాండ్లో బాంబు పేలి సుమారు 21 మందికి గాయాలు అయ్యాయి. ● ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఉగ్రవాద సంస్థల క్యాంప్కు వెళ్తూ రాజస్తాన్లోని జైసల్మేర్ వద్ద అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. ● దీనికి తోడు గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పీఎఫ్ఐ కార్యకలాపాల ఉనికి వెలుగులోకి రావడం గమనార్హం. ● ఈ పరిస్థితుల నేపథ్యంలో భారత్–పాక్ కాల్పుల విరమణ కుదిరినప్పటికీ అవాంఛనీయ శక్తులు విచ్ఛిన్నకర సంఘటలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయన్న కారణంగా పోలీసు యంత్రాంగం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లు, తనిఖీలకు శ్రీకారం చుట్టింది. జనసమ్మర్ధం ఉన్న కూడళ్లలో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెట్పల్లి, కోరుట్ల, హుజూరాబాద్, వేములవాడ వంటి పట్టణాలతోపాటు ఇతర మండలాల్లోనూ జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రెండురోజుల క్రితం జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి స్పెషల్ బ్రాంచీ పోలీసులు జనం ఎక్కువగా ఉండే కూడళ్ల విషయంలో పూర్తి స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. ఈ క్రమంలో ఆయా పట్టణాల్లో జనం ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉన్న కూడళ్లలో ప్రతీరోజు పోలీసుల తనిఖీలు, పికెటంగ్లు ఏర్పాటుకు నిర్ణయించారు. శనివారం నుంచి అన్ని పట్టణాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ భద్రతా ఏర్పాట్లతో అవాంచనీయ సంఘటనలకు అడ్డుకట్ట పడుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, పాక్ యుద్ధం.. విరమణ నేపథ్యంలో.. పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు -
దుబాయ్లో అల్లీపూర్ వాసి మృతి
రాయికల్: రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన దాసరి రమేశ్ (55) దుబాయ్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రమేశ్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడి ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. ఆయన ప్రయాణిస్తున్న ట్రక్కును మరో ట్రక్కు ఢీకొనడంతో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని గ్రామస్తులు కోరుతున్నారు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. వడదెబ్బతో గొర్లకాపరి..పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి జిల్లా బోజన్నపేట గ్రామానికి చెందిన గొర్లకాపరి కుడుదుల సమ్మయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. రోజువారీగా కుడుదుల సమ్మయ్య గొర్లను తీసుకెళ్లి మేపుతుండగా వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. సమ్మయ్యను చికిత్సకోసం హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. గాయపడిన వ్యక్తి..జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ రోడ్లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న సంఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన చెట్పల్లి అజయ్ (19) చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి అంత్యక్రియలు జగిత్యాలలో శనివారం సాయంత్రం నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతిచెందడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని ఒకరు..జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చ ల్గల్ గ్రామానికి చెందిన లగిశెట్టి తిరుపతి (40) శనివారం ఉదయం రైలు ఢీకొని మృతి చెందాడు. తిరుపతి కొద్ది రోజులుగా మతిస్థిమితం లేకుండా బయట తిరుగుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మోరపల్లి, చల్గల్ శివారులోని రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రైలు ఢీకొని మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో..చొప్పదండి: ఆర్నకొండ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన చీకట్ల శంకరయ్య మృతి చెందాడు. ఎస్సై మామిడాల సురెందర్ కథనం ప్రకారం... ఆర్నకొండ శివారులోని మామిడితోటకు శంకరయ్య నీళ్లు పెట్టి ఖమ్మర్ఖాన్ పేట ఎక్స్ రోడ్డు వద్ద గల హోటల్ టీ తాగడానికి వచ్చాడు. టీతాగి తిరిగి వెళ్తుండగా ధర్మారం నుంచి కరీంనగర్ వస్తున్న గుర్తు తెలియని వాహనం డ్రైవర్ అజాగ్రత్తగా, అతి వేగంగా నిర్లక్ష్యంగా నడిపి శంకరయ్యను ఢీకొట్టాడు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 ద్వారా కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఉపాధి హామీ కూలీ..రాయికల్: రాయికల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ ఏగోలపు రాములు (50) చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈనెల 8న ఉపాధి హామీ పనికి వెళ్లగా.. అక్కడ గుండెనొప్పి రావడంతో గమనించిన తోటి కూలీలు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆత్మస్థైర్యమే ఆలంబనగా
ఇల్లంతకుంట(మానకొండూర్): గుండెపోటుతో భర్త అకాల మరణం.. నలుగురు కూతుళ్లు చిన్నవారు. అయినా ఆ తల్లి మొక్కవోని ధైర్యంతో కష్టాలకు ఎదురొడ్డింది. ఆత్మస్థైర్యమే ఆలంబనగా పిల్లలను పెంచి పెద్ద చేసి ఆదర్శంగా నిలిచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి చెందిన నంది లక్ష్మి భర్త కనకయ్య 2005లో గుండెపోటుతో మరణించాడు. అప్పటికే నలుగురు అమ్మాయిలు. లక్ష్మి గుండెనిబ్బరం చేసుకొని కూలీ పనులు చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. మామిడి పండ్లు, చేపలు, కూరగాయలు అమ్ముతూ.. కాలానికి తగ్గట్టుగా పని చేసి తన కుటుంబాన్ని పోషించుకుంది. నలుగురు కూతుళ్లు రేణుక, మమత, లావణ్య, అనూషను చదివించింది. నలుగురిలో ముగ్గురు డిగ్రీ, చిన్న కూతురు ఇంటర్ వరకు చదివారు. పెద్ద కూతురు రేణుక కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి తల్లికి చేదోడుగా నిలిచింది. ప్రస్తుతం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. లక్ష్మి నలుగురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపింది. ఆదర్శమూర్తి.. బంగారు లక్ష్మియైటింక్లయిన్కాలనీ(రామగుండం): యైటింక్లయి న్కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుర్లు. వారి చిన్నతనంలోనే రాజయ్య 2000 సంవత్సరంలో మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ కూతుర్లను చదివించి పెళ్లిళ్లు చేసింది. ప్రస్తుతం చిన్న కిరాణం నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ చేసి ఆశ వర్కర్గా పని చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటుంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదవగా, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాల్గో కుమార్తె పద్మిని పీజీ పూర్తి చేసింది. ఐదో కూతురు సంగీత (ఎమ్మెస్సీ) పీజీ పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. ప్రసుత్తం రామగుండం కమిషనరేట్ పరిధి కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. -
ఎముకలు కొరికే చలిలోనూ అలర్ట్
ఇల్లంతకుంట(మానకొండూర్): కార్గిల్ యుద్ధం జరిగిన రోజుల్లో కంటిమీద కునుకు ఉండేది కాదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎముకలు కొరికే చలిలోనూ అలర్ట్గా ఉండేవాళ్లమంటున్నాడు ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆర్మీలో పనిచేసిన కాలంలో తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నాడు. 1985లో ఆర్మీలోకి.. నేను 1985లో ఆర్మీలో చేరాను. 1999 మేలో ప్రారంభమైన కార్గిల్ యుద్ధంలో (ఆపరేషన్ విజయ్)లో పాల్గొన్నాను. పది మంది సైనికులతో కూడిన జట్టు మాది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఎముకలు కొరికే చలినీ సైతం లెక్కచేయకుండా ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళం. రేడియోలో వార్తలు మాత్రమే వినేవాళ్లం. ఇంటికి మాట్లాడుదామంటే ఫోన్ సౌకర్యం ఉండేది కాదు. యుద్ధ ప్రాంతానికి వెళ్తుంటే కార్గిల్ పరిసర ప్రాంత ప్రజలు మంగళహారతులతో వీరతిలకం దిద్ది పంపేవారు. యుద్ధ సమయంలో మా ధ్యాస శత్రు సైనికులపైనే ఉండేది. ఎయిర్ డిఫెన్స్కు సంబంధించిన బీఎంపీ యుద్ధ ట్యాంకుల వద్ద పనిచేశాను. ప్రస్తుతం రైల్వే డిపార్ట్మెంట్లో కాచిగూడ రైల్వేస్టేషన్లో సిగ్నలింగ్ విభాగంలో పనిచేస్తున్నాను. భార్య ఉషారాణి, కూతుళ్లు తేజస్వినిరెడ్డి, సింధూజరెడ్డి. కార్గిల్యుద్ధంలో పాల్గొనడం అదృష్టం రిటైర్డ్ ఆర్మీ జవాన్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
అమ్మ జ్ఞాపకాల్లో అక్షరాల నివాళి
మా అమ్మ అంగలకుదిటి గోవిందమ్మ 2020 ఆగస్ట్లో కాలం చేశారు. అప్పటి నుంచి అమ్మను తలచుకుంటూ వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాల సంపుటే ఈ పుస్తకం. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అమ్మ పేరిట సాహిత్య అవార్డులను కూడా అందిస్తున్నా. మొదటి ఏడాది ప్రముఖ నవలా రచయిత పెద్దింటి అశోక్కుమార్కు అందించాను. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మను స్మరించుకునే అవకాశం లభించింది. – డాక్టర్ కందేపి రాణీప్రసాద్, కవయిత్రి, సిరిసిల్ల -
అమ్మంటే అమ్మాయే..
పెగడపల్లి(ధర్మపురి): పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన పంగ అమ్మాయికి ఇద్దరు కుమారులు అజయ్, రమేశ్, కుమార్తె అంజలి సంతానం. 25 ఏళ్ల క్రితం భర్త రాజలింగం కాలం చేశాడు. దీంతో ముగ్గురు పిల్లల బాధ్యత ఆమైపె పడింది. తన రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. పుట్టింటి వారు తాము చూసుకుంటామని చెప్పినా వెళ్లలేదు. వంశపారంపర్యంగా వంతుల వారీగా ఆరు నెలలకోమారు గ్రామ సేవకురాలిగా, ఆ తర్వాత రోజుల్లో కూలీ పనులకు వెళ్లి పిల్లలను చదివించింది. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో తన పిల్లలను చేర్పించి చదువులకు ప్రోత్సహించింది. తల్లి కష్టాన్ని పిల్లలు వృథా చేయలేదు. పెద్ద కొడుకు అజయ్ ఇంజినీరింగ్ చదివి పోస్టల్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కొడుకు రమేశ్ ఉస్మానియాలో ఎంబీబీఎస్, తర్వాత ఎండీ అనస్తీషియా చదివి ప్రస్తుతం కరీంనగర్లోని ఓ నర్సింగ్ హోమ్ నిర్వహిస్తూ అదే ఆసుపత్రిలో విధులు నిర్వహి స్తున్నాడు. కూతురు అంజలి బీటెక్ పూర్తి కాగానే వివాహం జరిగింది. పిల్లల చిన్న తనంలోనే భర్త చనిపోయినా వెరవకుండా చాలీచాలని కూలీ డబ్బులతో వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి తాను పడ్డ కష్టాలను గుర్తు చేసుకుని ఆవేదన చెందారు అమ్మాయి. తన కుమారులు ఉద్యోగాలు సాధించారని, అదే తనకు సంతోషాన్నిచ్చే విషయమని, వారిని చూస్తే తన కష్టాన్ని మరచిపోతానని చెప్పుకొచ్చారు. -
లక్ష్యం నిర్దేశించుకుని చదవాలి
సుల్తానాబాద్: విద్యార్థులు, యువత లక్ష్యం నిర్దేశించుకుని చదవాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రకుమార్ అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో శనివారం జిల్లా స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్వర్ణకారుల సహకార సంఘం సహకారంతో విశ్వబ్రాహ్మణ సహకార కుటుంబ సభ్యులు పదో తరగతి, ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదవాలని, ఎలాంటి పరిస్థితి వచ్చినా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. సినీనటులు సంపూర్ణేశ్ బాబు, బలగం రాజయ్య చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు, పట్టణ కోశాధికారి కనపర్తి భాస్కరాచారి, వేణు, బెజ్జంకి రవి, చందు, మహేందర్, శ్రావణ్, సదానందం, రాజేందర్, వెంకటస్వామి, రవీందర్ పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ ప్రాజెక్టులో మాక్డ్రిల్
● విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొంటాం ● రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా జ్యోతినగర్(రామగుండం): అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారయంత్రాంగం అన్ని వేళలా సన్నద్ధంగా ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లోని ఎన్టీపీసీ ప్రాజెక్టులోని భద్రత సిబ్బందితో శుక్రవారం మాక్డ్రిల్ నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలో ముందస్తుగా మాక్డ్రిల్ నిర్వహించామని అన్నారు. ప్రాజెక్టులో ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు వాటిల్లితే ఎలా వ్యవహరించాలనే అంశాలపై రక్షణ దళాలు అప్రమత్తమవుతాయని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రక్షణ నిమిత్తం తీసుకోవాల్సిన ముందస్తు చర్యలకు, అక్కడ ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా దళాలు స్పందించాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరిఖని ఏసీపీ రమేశ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్కిరణ్, సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, డిప్యూటీ కమాండెంట్ ఎస్.ఆంజనేయరాజు, ఓవీకేశాస్త్రి, కన్వర్, అసిస్టెంట్ కమాండెంట్ ఆకేశ్వర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ డైట్ కళాశాల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారం ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ నుంచి నలుగురు ఆటోలో దైవదర్శనం కోసం వేములవాడ వెళ్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న మరో ఆటో నర్సింగాపూర్ వాసులు వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దైవదర్శనం కోసం వెళ్తున్న నలుగురు, ఆటో డ్రైవర్ సంపత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎల్ఎండీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
పల్లెల్లో పారిశుధ్య పనులకు నిధులు
● స్వచ్ఛ భారత్ గ్రామీణ్ మిషన్ కింద రూ.9.57 కోట్లు మంజూరు కరీంనగర్రూరల్: కేంద్రప్రభుత్వం పరిశుభ్రమైన గ్రామాల కోసం చర్యలు చేపట్టింది. ప్రతీ గ్రామపంచాయతీలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వివిధ పనులే చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్బీఎం–2025–26 ఆర్ధిక సంవత్సరంలో కరీంనగర్ జిల్లాకు 368 వివిధ యూనిట్ల నిర్మాణం కోసం రూ.957.23 లక్షలు మంజూరు చేసింది. ఈ నెలాఖరు వరకు ఆయా గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఇందుకోసం అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. చురుకుగా స్థల పరిశీలన.. స్వచ్ఛభారత్ గ్రామీణ్ మిషన్కు సంబంధించిన పనుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల్లో ప్రదర్శిస్తారు. ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో గ్రామస్తుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు. గ్రామాల్లో ఎక్కడెక్కడ సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు అవసరమో పరిశీలించి, ఇందుకు అవసరమైన స్ధలాలను ఎంపిక చేస్తారు. పంచాయతీల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడుగుంతలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు నిర్మించనున్నారు. ప్లాస్టిక్ నిర్వహణ యూనిట్ కోసం తిమ్మాపూర్ మండలం అల్గునూరులో 20గుంటల స్ధలాన్ని అధికారులు ఇటీవల పరిశీలించి ఎంపిక చేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన గ్రామపంచాయతీలు.. శంకరపట్నం మండలం గుడాటిపల్లి, నల్లవెంకయ్యపల్లి, అంబేడ్కర్నగర్, మానకొండూరు మండలం రాఘవపూర్, బంజేరుపల్లి, సైదాపూర్ మండలం గర్రెపల్లి, కుర్మపల్లి, గొల్లగూడెం, గన్నేరువరం మండలం గుండ్లపల్లి ఎక్స్రోడ్డు, హుజూరాబాద్ మండలం అంబేడ్కర్నగర్లో కొత్తగా కంపోస్టుషెడ్లు నిర్మిస్తారు. కొత్త గ్రామపంచాయతీలన్నింటినీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు నిర్మించేలా అవగాహన కల్పించి దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇప్పటివరకు 2,600 వ్యక్తిగత మరుగుదొడ్లు, 9 సామూహిక మరుగుదొడ్లు, 6 కంపోస్టుషెడ్లు మంజూరైనట్లు ఎస్బీఎం జిల్లా కో ఆర్డినేటర్ రమేశ్ తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఆయా యూనిట్లకు స్ధలాలను ఎంపిక చేయడంతోపాటు లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు డీఆర్డీవో వేణుమాధవరెడ్డి తెలిపారు. వచ్చేనెలలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి, జూలైలో పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. జిల్లాకు మంజూరైన యూనిట్లు, నిధులు యూనిట్ లక్ష్యం విలువ నిధులు(రూ.లక్షల్లో) వ్యక్తిగత మరుగుదొడ్లు 3097 రూ.12వేలు రూ.371.64 సామూహిక మరుగుదొడ్లు 9 రూ.3లక్షలు రూ.27 ప్లాస్టిక్ నిర్వహణ యూనిట్లు 2 రూ.64లక్షలు రూ.128 కంపోస్టుషెడ్లు 10 రూ.1.50లక్షలు రూ.15 సామూహిక ఇంకుడుగుంతలు 126 రూ.93వేలు రూ.117.18 వ్యక్తిగత ఇంకుడుగుంతలు 3,713 రూ.7వేలు రూ.241.35 వ్యక్తిగత ఇంకుడుగుంతలు(ఈజీఎస్) 32 రూ.93వేలు రూ.29.76 ప్రభుత్వ స్థలాల్లో ఇంకుడుగుంతలు 210 రూ.13వేలు రూ.27.30 -
క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు
కరీంనగర్ కల్చరల్: జిల్లా కేంద్రంలోని సేయింట్ మార్క్ చర్చి గ్రౌండ్లో స్థానిక సీఎస్ఐఐ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైజాగ్కు చెందిన జాతీయ అంతర్జాతీయస్థాయి గుర్తింపు పొందిన ప్రవచకుడు డాక్టర్ ఎం.జేమ్స్ స్టీఫెన్ ప్రసంగించారు. ఏసుక్రీస్తు మానవీయ విలువలు, గుణగణాలు మానవ జీవితాలకు ఎలా అన్వయింపజేసుకోవాలో, ఆచరించాలో వివరించారు. ఈ కార్యక్రమంలో సి.రాములు, ఇమ్మానుయేలు, ఎస్.జాన్, పాల్ కొమ్మాలు, ఆర్.ప్రసాద్, బి.ప్రసాద్, ఎ.మధుమోహన్, పింటు, రోజి, ఎస్.సత్యానందం, రెనాల్డ్, నారాయణ, మాణిక్యరావు, రాధిక, ఇండిపెండెంట్ పాస్టర్స్, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పెళ్లి బరాత్కు వెళ్లి వస్తూ..
● అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్ ● యువకుడు మృతి.. మరొకరి పరిస్థితి విషమంజగిత్యాలక్రైం: ముగ్గురు యువకులు స్నేహితుడి పెళ్లి బరాత్కు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్ర, ఇంకొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల పట్టణ శివారులోని గోవిందుపల్లికి చెందిన కొలగాని వెంకటేశ్ (18), విద్యానగర్కు చెందిన గడిల విఘ్నేశ్, చిలుకవాడకు చెందిన చెట్పల్లి అజయ్ బుధవారం ద్విచక్ర వాహనంపై బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో జరిగిన స్నేహితుడి పెళ్లికి వెళ్లారు. రాత్రి బరాత్లో పాల్గొన్నారు. గురువారం వేకువజామున జగిత్యాలకు వస్తుండగా పట్టణంలోని నిజామాబాద్ రోడ్లో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో కొలగాని వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. చెట్పల్లి అజయ్ పరిస్థితి విషమంగా ఉంది. గడిల విఘ్నేశ్కు స్వల్పగాయాలయ్యాయి. పట్టణ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్ తండ్రి రవి ఫిర్యాదు మేరకు ద్విచక్ర వాహనం నడుపుతున్న గడిల విఘ్నేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై మన్మదరావు తెలిపారు. -
విత్తన ‘సబ్సిడీ’కి మంగళం
● వరి విత్తనాలపై రాయితీ ఎత్తేసిన ప్రభుత్వం ● గతంలో 30కిలోల బస్తాకు రూ.550.. ప్రస్తుతం రూ.వెయ్యి ● అన్నదాతపై అదనపు భారంవీణవంక(హుజూరాబాద్): వరి విత్తనాలపై ప్రభుత్వం సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అధనపు భారం పడుతోంది. అసలే మొగిపురుగు, ఇతర తెగుళ్లుతో ఏటా రైతాంగం నష్టాలను చవిచూస్తుంటే విత్తనాలకు రాయితీ లేకపోవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర రకాలకు గతంలో సబ్సిడీ వర్తించేది. కానీ, సబ్సిడీ ఎత్తేయడంతో రైతులపై అధనంగా రూ.300 భారం పడుతుంది. యాసంగి సీజన్ ముగియడం.. ఈ నెల 25న రోహిణి కార్తే ప్రారంభం కానుండటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడు జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో వరి సాగులోకి రానున్నట్లు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. రైతులపై అదనపు భారం తెలంగాణ వరి రకాలకు 30 కిలోల బస్తాకు నాలుగేళ్ల క్రితం రూ.550 ధర ఉండగా, యాసంగిలో రూ.వెయ్యికి పెరిగింది. తెలంగాణ రకాలకు కిలో రూ.10, ఆంధ్ర రకాలపై కిలోకు రూ.5ల చొప్పున సబ్సిడీ ఉండేది. కానీ... ఈ సారి ఆ అవకాశం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకాలు (బీపీటీ) 25కిలోల బస్తాకు గత యాసంగిలో రూ.900, దొడ్డురకం రూ.వెయ్యి ధర ఉండగా ఇప్పుడు మరింత పెరుగనున్నాయి. జిల్లా రైతులు ఎక్కువగా సొసైటీలు, ఆగ్రోస్, డీసీఎంస్ల ద్వారా విత్తన బస్తాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోనస్ ఇస్తుండటంతో సీజన్లో వాటికి డిమాండ్ పెరుగనుంది. మొగి పురుగుతో పరేషాన్.. మూడేళ్లుగా మొగిపురుగు విజృంభిస్తుండటంతో రైతులు ఖరీదైన రసాయన మందులు పిచికారీ చేసినా పంటను కాపాడుకోలేకపోతున్నారు. ఈ ప్రభా వం ముందస్తు వేసిన వరి నాట్లపైన ఉంటుంది. గత యాసంగిలో పంట చేతికి వచ్చే దశలో వేరుకుళ్లు వ్యాప్తి చెందడంతో ఎకరాకు 40 బస్తాల పైనే దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు 35 బస్తాల చొప్పున దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం నిల్వలు ఉన్నాయి. నత్తనడకన కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతులు ఇబ్బందులు ప డుతున్నారు. గత చేదు అనుభవాలను దిగమింగు తూ వానాకాలం పంట సాగుకు రైతులు సిద్ధమవుతుండగా సబ్సిడీ విత్తనాల భారం కుంగదీస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం కలుగజేసుకొని వరి విత్తనాలకు సబ్సిడీ అందించాలని రైతులు కోరుతున్నారు.విత్తన ధరలను నియంత్రించాలి వరి విత్తనాలపై సబ్సిడీ లేకపోవడంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. విత్తన కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచాయి, దీంతో చిన్న, సన్నకారు రైతులపై ప్రభావం పడుతుంది. ధరలను ప్రభుత్వం నియాంత్రించాల్సి ఉండగా తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం తగదు. గతంలో కిలోకు రూ.10 చొప్పున సబ్సిడీ ఉండటంతో కొంత భారం తగ్గింది. ఇప్పటికై నా ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు ఇచ్చేలా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలి. – అప్పని హరీశ్వర్మ, రైతు, రామకృష్ణాపూర్ -
వంగిన విద్యుత్ స్తంభాలు
విద్యుత్ తీగలకు సపోర్టుగా స్తంభాలు ఉండాలి. కానీ, ఇక్కడ చూస్తే వంగిన స్తంభాలకు విద్యుత్ తీగలు సపోర్టుగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందోనని అన్నదాతలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొంటున్నారు. అకాలవర్షాలు, ఈదురుగాలులతో స్తంభాలు కూలిపోతే పెద్ద ప్రమాదమే జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ – జాఫర్ఖాన్పేట మధ్య రోడ్డు వెంట వంగిన విద్యుత్ స్తంభాలు ఇలా శ్రీసాక్షిశ్రీ కెమెరాకు చిక్కాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
ప్రతీరోజు వీధి దీపాలు వెలగాలి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని సెంట్రల్ లైటింగ్తో పాటు, అన్ని వీధి దీపాలు ప్రతీ రోజు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో అధికా రులతో రివ్యూ నిర్వహించారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆధునీకరణ, ఆన్లైన్ నల్లా టాక్స్, వీధి దీపాల మరమ్మతు, వాహనాల కొనుగోలు, సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్, స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు. వీధిదీపాల నిర్వహణపై ప్రజల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వెంటనే క్షేత్రస్థాయిలో పరిస్థితిని తనిఖీ చేయాలని, వెలగని వీధి దీపాలకు మరమ్మతులు చేయించాలన్నారు. నగరంలోని సీవేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ఆధునీకరణకు ప్రభుత్వం మంజూరు ఇచ్చిందని తెలిపారు. వెంటనే ఎస్టీపీ ఆధునీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఆన్లైన్లో నల్లా పన్నులు వసూలు చేయాలన్నారు. ఇప్పటి వరకు మాన్యువల్గా వసూలుచేసిన రసీదు బుక్లను నగరపాలక సంస్థకు అప్పగించాలన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన డిజిటల్ లైబ్రరీ, కాశ్మీర్ గడ్డ రైతు బజార్, బాలసదన్భవన్, ఐసీసీసీ తదితర పనులను వేగవంతంగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశం ఈఈలు యాదగిరి, సంజీవ్, డీఈ లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, ఓంప్రకాశ్, శ్రీనివాస్ రావు, ఏఈ సతీష్ కుమార్, గట్టు స్వామి పాల్గొన్నారు.నీటి సరఫరాలో నిర్లక్ష్యం ● బల్దియా తీరుతో భగత్నగర్ వాసుల బేజార్కరీంనగర్ కార్పొరేషన్: అసలే ఎండాకాలం...ఆపై నీటి వినియోగం అధికం...సాధారణ పరిస్థితులకు మించి నగరపాలక సంస్థ ఏర్పాట్లు చేయాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నీటి సరఫరాలో అనుసరిస్తున్న నిర్లక్ష్యం కారణంగా సిటీలోని కొన్నిప్రాంతాలకు చెందిన వారు కృత్రిమ నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. ఎల్ఎండీలో సరిపడా నీటి మట్టం ఉన్నప్పటికీ.. చిన్నచిన్న సాంకేతిక సమస్యల కారణంగా ప్రజల గొంతు ఎండుతోంది. ముఖ్యంగా భగత్నగర్ రిజర్వాయర్ పరిధిలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. భగత్నగర్ రిజర్వాయర్ నుంచి భగత్నగర్, గోదాంగడ్డ, శ్రీనగర్ కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా జరుగుతోంది. రిజర్వాయర్కు వచ్చే నీళ్లను సంప్ ద్వారా ట్యాంక్లో నింపుతారు. ట్యాంక్ నుంచి రిజర్వాయర్ పరిధిలోని కాలనీలకు నీటి సరఫరా చేయాల్సి ఉంటుంది. వేసవికాలం కావడంతో నగరంలో ప్రతీ రోజు తాగునీటి సరఫరా కాస్తా, రోజు విడిచి రోజుగా మారడం తెలిసిందే. రోజు విడిచి రోజు నీటి సరఫరా కావడంతో సహజంగానే నల్లా నీళ్ల కోసం కాలనీ వాసులు ఎదురు చూడాల్సి వస్తోంది. కాగా కొద్దికాలంగా సంప్, ట్యాంక్ ద్వారా కాకుండా నేరుగా పైప్లైన్తోనే నీటిసరఫరా చేస్తున్నారు. వాల్వ్ చెడిపోయిందనే కారణంతో ట్యాంక్కు నీటిని ఎక్కించకుండా, నేరుగా పైప్లైన్తోనే ఇండ్లకు సరఫరా జరుగుతోంది. దీంతో సహజంగానే నీటి ఫ్రెషర్ ఉండకపోవడంతో, రిజర్వాయర్ పరిధిలోని చివరి ప్రాంతాలకు నీళ్లు వెళ్లడం లేదు. తగిన ప్రెషర్ ఉండడం లేదు. దీంతో భగత్నగర్ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల వాసులు కృత్రిమ నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు డివిజన్ల వాసులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రైతుల ఖాతాలో రూ.382 కోట్లు జమ●కరీంనగర్ అర్బన్: ధాన్యం కొనుగోళ్లలో పౌరసరఫరాల సంస్థ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు వసతులను కల్పిస్తుండగా కొనుగోళ్ల వేగం పెంచింది. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, హాకా విభాగాల ద్వారా 343 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తుండగా 1,64,879 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇందులో దొడ్డు రకాలు 1,47,592 మెట్రిక్ టన్నులు, సన్న రకాలు 17,287 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. గతానికి కన్నా 11,552 మెట్రిక్ టన్నులను అధికంగా కొనుగోలు చేసింది. 24,575 మంది రైతుల నుంచి కొనుగోలు చేయగా రూ.382 కోట్లు వారి ఖాతాలో జమయ్యాయి. ఇక సన్నరకాల వడ్ల బోనస్ విలువ రూ.8.64కోట్లు కాగా రైతుల ఖాతాలో జమ చేసేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆదర్శ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల క్రమంలో 16 ఆటోమెటిక్ ప్యాడీ క్లీనర్లు కేటాయించారు. సదరు పరికరం వల్ల తాలు, తప్పా, ఇతర వ్యర్థాలను తొలగించవచ్చు. గోనె సంచుల కొరత లేకుండా చర్యలు చేపడుతుండగా టార్పాలిన్లను కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూంఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ 9154249727 ఏర్పాటు చేశారు. దీంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్న అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ వివరించారు. -
విజయోస్తు.. చికిత
● నేడు షాంఘైలో జరిగే ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 ఫైనల్ పోరులో పాల్గొంటున్న చికిత ● స్వర్ణంతో తిరిగి రావాలంటున్న పలువురుకరీంనగర్స్పోర్ట్స్: మారుమూల గ్రామం నుంచి ఎదిగి నేడు భారత జాతీయ పతాకాన్ని పొరుగు దేశం చైనాలో రెపరెపలాడించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలువడం విశేషం. చిన్నప్పటి నుంచి క్రీడలపై మక్కువ పెంచుకున్న తను అర్చరీ క్రీడలో రాణించి నేడు భారత బృందంలో మేటి క్రీడాకారిణిగా ఎదిగింది పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి చికిత. ప్రస్తుతం చైనా దేశంలోని షాంఘైలో జరుగుతున్న ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 పోటీల్లో భారత మహిళల కాంపౌండ్ జట్టు అద్వితీయ ప్రతిభతో ఫైనల్లో అడుగుపెట్టింది. భారత జట్టులోని ముగ్గురిలో తానిపర్తి చికిత ఒకరు. శనివారం మెక్సికోతో జరిగే ఫైనల్ పోరులో భారత మహిళల జట్టు చాంపియన్గా నిలిచి స్వర్ణంతో తిరిగిరావాలని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చికిత సాధించిన పతకాలు ● హర్యానా రాష్ట్రంలోని సోనిపట్లో శిక్షణ పొందుతున్న చికిత ఇదివరకు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తెలంగాణకు, భారత దేశానికి పతకాలు సాధించిపెట్టింది. ● తాజాగా ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్లో జరిగిన 38వ జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ● మార్చిలో బ్యాంకాక్లో జరిగిన ఏషియన్ గేమ్స్లో సైతం కాంస్య పతకం సాధించింది. ● ప్రస్తుతం జరుగుతున్న పోటీల్లో కూడా పతకం ఖాయం చేసుకుంది. కూతురుపై నమ్మకం ఉంది నా కూతురుపై నమ్మకం ఉంది. తప్పకుండా స్వర్ణ పతకం సాధిస్తుంది. దేశ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తుంది. – తానిపర్తి శ్రీనివాస్ రావు, చికిత తండ్రిజాతీయ పతాకం ఎగరేయాలి స్వర్ణ పతకం సాధించాలి. పొరుగు దేశం చైనాలో భారత జాతీయ పతాకాన్ని సగౌరవంగా ఎగురవేయాలి. – చింతకుంట విజయరమణారావు, ఎమ్మెల్యే, పెద్దపల్లి చాంపియన్గా నిలవాలి ఫైనల్లో మెక్సికోపై విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాలి. చాంపియన్ గా నిలవాలి. – సురేశ్, డీవైఎస్ఓ, పెద్దపల్లిప్రపంచపటంలో నిలపాలి అర్చరీలో స్వర్ణ పతకం సాధించాలి. పెద్దపల్లి జిల్లాను ప్రపంచ పటంలో నిలపాలి. – ముస్త్యాల రవీందర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు స్ఫూర్తిగా నిలవాలి ప్రపంచకప్ అర్చరీ స్టేజ్–2 లో విజేతగా నిలిచి అందరికీ స్పూర్తిగా నిలవాలి. తెలంగాణ కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటాలి. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడుగర్వంగా ఉంది మారుమూల గ్రామం నుంచి ఎదిగి నేడు భారత జట్టులో కీలక క్రీడాకారిణి కావడం గర్వంగా ఉంది. విజేతగా తిరిగి రావాలి. – గసిరెడ్డి జనార్ధన్ రెడ్డి, తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శిమరిన్ని పతకాలు సాధించాలి అర్చరీలో ఎవరికీ అందనంత ఎదిగి నేడు దేశానికి పతకం సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. ఆనందంగా ఉంది. భవిష్యత్లో మరిన్ని పతకాలు సాధించాలి. – కొమురోజు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి -
రాజన్నా... దీవించు
ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా మల్లన్న సన్నిధిలో పూజలు ఓదెల(పెద్దపల్లి): ఆపరేషన్ సిందూర్కు మద్దతుగా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో శుక్రవారం ఆలయ సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. పాక్లోని ఉగ్రవాదులతో ధైర్యసాహసాలతో పోరాడుతున్న భారత త్రివిధ దళాలకు మద్దతుగా పూజలు చేశారు. దేవాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్ర స్వామి, నందీశ్వరుల సన్నిధిలో పూజలు చేసి టెంకాయలను కొట్టారు. అనంతరం కశ్మీర్లో దుండగుల చేతిలో మృతి చెందిన పర్యాటకుల ఆత్మశాంతికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆలయ ఈవో సదయ్య, అర్చకులు పాల్గొన్నారు. వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో కలసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. ఆపరేషన్ సిందూర్ దిగ్విజయం కావాలని, భారత త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని రాజన్న ఆలయంలో శుక్రవారం ఆలయ అర్చకులు స్వామివారి మహామంటపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సైన్యానికి దైవిక బలరక్షణ, స్వామి వారి ఆశీస్సులు ఉండాలని దేవాదాయ ధర్మాదాయశాఖ ఆదేశాలతో చండీ సహిత రుద్ర హోమం నిర్వహించారు. -
గురుకులాల్లో సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి
కరీంనగర్రూరల్: ప్రభుత్వం మైనార్టీ గురుకులాల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మైనార్టీ గురుకులాల పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల రీజినల్ లెవల్ కోఆర్డినేటర్ డాక్టర్ కనపర్తి సురేశ్ కోరారు. శుక్రవారం కరీంనగర్లోని అస్లాం మజీద్ వద్ద మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలపై ఉపాధ్యాయులతో కలిసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలు అందరితో సమానంగా విద్యారంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గురుకులాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో గురుకులాలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయుల పనితీరుకు నిదర్శనంగా నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నుంచి కొత్తగా 8వ తరగతి నుంచి ఐఐటీ, నీట్ పౌండేషన్ శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కోఆర్డినేటర్ మహేందర్, రాజు, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
● 10వ తరగతి ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్: రానున్న విద్యాసంవత్సరంలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల పెంపు, పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు తదితర అంశాలపై ఐసీడీఎస్, విద్యాశాఖ సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ బాట నిర్వహించి ఆరు సంవత్సరాల్లోపు పిల్లలందరినీ అంగన్వాడీలో చేర్పించాలని ఆదేశించారు. అంగన్వాడీ సేవలు, నూతన సిలబస్ ద్వారా ఇస్తున్న ప్రత్యేక బోధన గురించి తల్లిదండ్రులకు తెలియజేస్తూ నమోదును పెంచాలన్నారు. అంగన్వాడీలో ప్రీస్కూల్ పూర్తి చేసిన పిల్లలందరి జాబితా మండల విద్యాధికారులకు సమర్పించాలని సూచించారు. ఈ జాబితాలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రైవేటు భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలన్నీ స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని అన్నారు. ఇప్పటికే మా ర్చాల్సిన అంగన్వాడీ కేంద్రాలను గుర్తించామని, ప్రభుత్వ భవనాల్లో ఈ కేంద్రాలకు కావాల్సిన వసతులు సమకూరుస్తామన్నారు. 2015 నుంచి 2023 వరకు పదోతరగతి ఫెయిలై చదువు ఆపేసిన విద్యార్థులందరినీ గుర్తించి వచ్చే సంవత్సరం వారు 10వతరగతిలో ఉత్తీర్ణులయ్యేలా అవగాహన కల్పించాలని మండల విద్యాధికాలను ఆదేశించారు. ఈ ఏడాది పదోతరగతి ఫెయిలైన విద్యార్థులందరూ వచ్చే జూన్ నెలలో సప్లిమెంటరీ రాసి ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ.. మండల విద్యాధికారులు ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించాలని ఆదేశించారు. అక్కడ మౌలిక వసతుల కల్పనకు గ్రౌండింగ్పై దృష్టి పెట్టాలని అన్నారు. సమ్మర్ క్యాంపులను పరిశీలించాలని, బడిబాటపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో డీటీడీవో పవన్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా విద్యాధికారి జనార్దన్రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, కోఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్, ఆంజనేయులు, సీడీపీవోలు సబితా, శ్రీమతి, నర్సింగారాణి, సుగుణ, మండల విద్యాధికారులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
కల్వర్టును ఢీకొట్టిన కారు
● ఒకరి మృతి.. మరొకరికి గాయాలు మానకొండూర్: మండలంలోని రాఘవాపూర్ శివారులో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కల్వర్టును కారు ఢీకొనగా.. ఒకరు మృతి చెందారు. మరొకరికి గాయాలు అయ్యాయి. పోలీసులు, స్థా నికుల వివరాల ప్రకారం.. పచ్చునూరు గ్రామానికి చెందిన దాసారం నర్సయ్య(62) సింగరేణి రిటైర్డ్ కార్మికుడు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నివాసం ఉంటున్నాడు. పచ్చునూరులో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు మానకొండూర్కు చెందిన కోండ్ర సంజీవ్తో కలిసి కారులో బయల్దేరారు. కార్యక్రమంలో పాల్గొని మానకొండూర్కు తిరుగుపయనం అయ్యారు. మార్గంమధ్యలో రాఘవాపూర్ శివారులో కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య అక్కడికక్క డే చనిపోయాడు. సంజీవ్కు సైతం తీవ్రగాయాలు అయ్యాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పశువులకు నీరందించాలి
వేసవిలో పాడి రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీటిని మూడుపూటలు అందించాలి. మధ్యాహ్నం వేళలో పశువులపై నీటిని జలకరించాలి. నీడ ఉండే ప్రాంతాల్లోనే పశువులను కట్టేయాలి. మూడు భాగాలు ఎండు గడ్డితో పాటు ఒక భాగం పచ్చిగడ్డి వేయాలి. పెంపుడు కుక్కలు ఉష్ణోగ్రతలకు చిరాకు పడుతుంటాయి. ఆయాసం, ఆకలి ఉంటుంది. ఫుడ్, వాటర్ సకాలంలో ఇవ్వాలి. వాటికి నీడ చల్లగా ఉండేలా చూడాలి. కోళ్ల ఫారాల్లో గన్నీసంచులను చుట్టూ కట్టడంతో పాటు రెండు గంటలకోసారి నీటితో తడపాలి. – తుమ్మల కిరణ్కుమార్రెడ్డి, పశువైద్యుడు -
దరఖాస్తు చేసిన వెంటనే రుణాలు
● యూబీఐ హెడ్ అపర్ణరెడ్డి సుల్తానాబాద్(పెద్దపల్లి): అర్హులైన రైతులకు దరఖాస్తు చేసిన వెంటనే రుణాలు మంజూరు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) రీజినల్ హెడ్ అపర్ణరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం అగ్రి రైస్ ఔట్ రీచ్ రైతులకు అవగాహన కల్పించారు. బ్యాంక్ సేవలు అందుబాటులో లేనిరైతులకు శిబిరాల ద్వారా పరిచయం చేస్తామని అన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, ఏజీఎం సురేశ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ మేనేజర్ కిశోర్కుమార్, రైస్మిల్లర్స్ జిల్లా అధ్యక్షుడు నగునూరి అశోక్కుమార్, వెంగళదాసు శ్రీధర్, రైస్మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తంరావు, జెపాల్రెడ్డి, మండల మాజీ అధ్యక్షుడు పల్ల మురళి, చీటి కేశవరావు పాల్గొన్నారు. -
ఎన్టీపీసీ ప్రాజెక్టుకు భారీ బందోబస్తు
జ్యోతినగర్(రామగుండం): పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడుల నేపథ్యంలో ఎన్టీపీసీ ప్రాజెక్టు వద్ద భారీ భద్రత చేపట్టామని సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవిందకుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా కీలక ప్రాంతాల్లో బందోబస్తు చేపట్టారని, ఇందులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రామగుండం ఎన్టీపీసీలోనూ హైఅలర్ట్ ప్రకటించామన్నారు. ఇప్పటికే ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా(సీఐఎస్ఎఫ్) దళానికి తోడు మరిన్ని బలగాలను మోహరించామని అన్నారు. ప్రాజెక్టును పరిరక్షించడం, అత్యంత భద్రత కల్పించడం లక్ష్యంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, అదనపు ఆయుధాలు సమకూర్చుకోవడం, డ్రోన్ దాడులను ఎదుర్కోవడం, విపత్తులకు ప్రతిస్పందించడం వంటి ముప్పులకు సిద్ధం కావడానికి కేంద్ర పోలీసు దళం మాక్డ్రిల్ నిర్వహిస్తోందని వివరించారు. ప్రాజెక్టు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను అంకితభావంతో ఉన్న అధికారులు పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. క్షుణ్ణంగా తనిఖీలు చేశాక కదలికలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పరిసరాల్లో నిఘాను కొనసాగించడానికి 24 గంటలపాటు వాహన గస్తీ నిర్వహించడంతోపాటు విజిలెన్స్ బృందాలు వివిధ వనరుల నుంచి చురుకుగా సమాచారం సేకరిస్తున్నాయని అన్నారు. కేంద్ర, రాష్ట్ర నిఘా సంస్థలతో నిరంతరం కమ్యూనికేషన్ విధానాన్ని అనుసరిస్తూ భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు ఆయన వివరించారు. మోహరించిన సీఐఎస్ఎఫ్ బలగాలు సీనియర్ కమాండెంట్ అరవింద్కుమార్ వెల్లడి -
కొండగట్టులో భక్తుల సందడి
● ప్రైవేట్ ఓబీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ● పట్టించుకోని సింగరేణి అధికారులు ● ప్రమాదాల తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం భక్తుల సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దీక్షాపరులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హరిహరనాథ్, సునీల్ కుమార్, రాములు, సుధాకర్ భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరిఖని: కండీషన్లో లేనియంత్రాలు.. నామమాత్రపు రక్షణ చర్యలు.. వెరసి కాంట్రాక్టు కార్మికుల జీవితాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.. ఏదైనా ప్రమాదం జరిగితే ఉరుకులు, పరుగులు పెట్టించే అధికారులు.. రక్షణచర్యల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్ పేరిట ప్రైవేట్ ఓబీలపై ఒత్తిడి పెంచుతున్న యాజమాన్యం.. రక్షణ విషయంలో పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రైవేట్ ఓబీల్లో మరమ్మతులు చేయకుండా వాహనాలను పనులకు పురమాయించడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులకు రక్షణ విషయంలో శిక్షణ కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రతీమూడు నెలలకోసారి ఇతర రాష్ట్రాల కార్మికులు ఇక్కడ నుంచి వెళ్లిపోవడం, మళ్లీ కొత్తవాళ్లు రావడంతో నిరంతర ప్రక్రియగా సాగుతోంది. సూపర్వైజరే డైవర్.. జీడీకే–5 ఓసీపీలో ఇటీవల ప్రమాదం జరిగి కాంట్రాక్టు కార్మికుడు వికాస్ కుమార్ మృతి చెందాడు. వాస్తవానికి వికాస్ సూపర్వైజర్గా విధులు నిర్వహించాల్సి ఉంది. అయితే ట్యాంకర్ డ్రైవర్ విధులకు రాకపోవడంతో సూపర్వైజర్ను డ్రైవర్ పనికి పురమాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ట్యాంకర్పై అవగాహనలేని వికాస్.. నడుపుతున్న క్రమంలో అదుపుతప్పింది. ప్రాణాలు కాపాడుకునేందుకు సీట్లో నుంచి దూకే ప్రయత్నంలో వెనుక టైర్ కింద పడి మృతి చెందాడు. అదే రెగ్యులర్ డ్రైవర్ నడిపి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని తోటి కార్మికులు చెబుతున్నారు. అంతా వారికనుసన్నల్లోనే.. సింగరేణిలో ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టర్ల పెత్తనం కొనసాగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారిపై చర్యలు తీసుకుంటే కేంద్ర మంత్రుల స్థాయి నుంచి ఫోన్లు వస్తుండడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. కార్మికుల సంక్షేమం నుంచి వేతనాలు, సౌకర్యాల కల్పన విషయంలో కూడా కాంట్రాక్టర్లు చెప్పిందే వేదవాక్కుగా సాగుతోందని పేర్కొంటున్నారు. విచారణ జరపాలి.. జీడీకే–5 ఓసీపీలో జరిగిన ప్రమాదంపై డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మైన్స్ సేఫ్టీ అధికారి ఆధ్వర్యంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఓబీల్లో చాలా వరకు యంత్రాలు కండిషన్లో ఉండటం లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వాపోతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదంలో బోల్తాపడిన ట్యాంకర్ కండీషన్ కూడాసరిగా లేదని అంటున్నారు. బోల్తాపడిన వాటర్ట్యాంకర్(ఫైల్) -
సీడ్ డబ్బులు ఇవ్వలేదని రైతుల ఆందోళన
● వాహనాలు నిలిపివేసి నిరసన.. రోడ్డుపై వంటావార్పు ఓదెల: సీడ్ కంపెనీ ధాన్యం డబ్పులు చెల్లించడంలేదని ఆరోపిస్తూ పలువురు రైతులు కనగర్తిలో గురువారం లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. సీడ్ ఏజెంట్ బండ రాజు, రెతుల కథనం ప్రకారం.. గత వానాకాలం సీజన్లో కనగర్తి గ్రామంలో ఓ సీడ్ కంపెనీకి చెందిన ధాన్యం విత్తనాలను 23 మంది రైతులు దాదాపు 60 ఎకరాల్లో సాగుచేశారు. పంట చేతికొచ్చాక ధాన్యం లోడ్చేసుకొని వెళ్లిన కంపెనీ.. తమకు రావాల్సిన రూ. 22లక్షల్లో రూ.14 లక్షలే చెల్లించింది. మిగతా డబ్బుల కోసం సీడ్ కంపెనీ యాజమాన్యం చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండాపోయింది. ఈ వానాకాలం మళ్లీ అదే సీడ్ కంపెనీకి చెందిన ముగ్గురు రైతులు సాగు చేసి ధాన్యాన్ని లారీ, డీసీఎం వ్యాన్లో గురువారం తరలిస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకూ రోడ్డుపైనే బైఠాయించారు. వంటావార్పుతో నిరసన తెలిపారు. తమకు రావాల్సిన రూ.14లక్షలు చెల్లించి, సీడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్దిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నెదురు రమేశ్, భద్రయ్య, శ్రీరామోజు భద్రయ్య, తాటిపల్లి వీరయ్య, పరుపాటి చంద్రారెడ్డి, కొప్పుల సమ్మయ్య, మల్లారెడ్డితోపాటు 25మంది రైతులు పాల్గొన్నారు. -
ఏడున్నరో.. ఎట్లున్నరో..
● ‘మావో’ళ్లు క్షేమమేనా? ● కర్రిగుట్టల్లో ఎన్కౌంటర్ మృతులు ఎవరూ.. ● అజ్ఞాత నక్సలైట్ల కుటుంబాల్లో గుబులు సిరిసిల్ల: తెలంగాణ– ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో కర్రిగుట్ట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మృతుల వివరాలు వెల్లడించడం లేదు. దేశంలోని ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాలుగు కుటుంబాల్లో కలవరం మొదలవుతుంది. తాజాగా బీజాపూర్ ఊసూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కర్రిగుట్ట సమీపంలోని గుంజపర్తి–ఇత్తగూడ సమీపంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మరణించిన వారి వివరాలను అటు చత్తీస్గఢ్ ప్రభుత్వం, ఇటు భద్రతా దళాలు ప్రకటించడం లేదు. ఎన్కౌంటర్ మృతుల్లో తెలంగాణకు చెందిన నేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. చనిపోయిన వారిలో ఎవరు ఉన్నారో తెలియడం లేదు. గుర్తు తెలియని మావోయిస్టులుగానే ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన వారు నలుగురు అజ్ఞాతంలో ఉంటూ.. మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలియని మావోయిస్టు మృతదేహాల్లో జిల్లా వాసులు ఎవరైనా ఉన్నారా..? అనే అనుమానం ఆ కుటుంబాలను కలవరానికి గురి చేస్తుంది. శ్రీమావోశ్రీళ్లు క్షేమంగా ఉన్నారా..? అని అజ్ఞాత వాసుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్ఞాతంలో జిల్లా మావోయిస్టులు తెలంగాణ వ్యాప్తంగా 90 మంది నక్సలైట్లు అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ వర్గాలు ప్రకటించాయి. ఇందులో జిల్లాకు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొసా అలియాస్ సాధు తంగళ్లపల్లి మండలం గోపాల్రావుపల్లెకు చెందినవాడు. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయినా ఇంటి ముఖం చూడకుండా, దండకారణ్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తలపై రూ.కోటి రివార్డు ఉంది. కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన చంద్రయ్య అలియాస్ ఆజాద్, ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల (మ్యాదరి) శ్రీనివాస్ అలియాస్ విశ్వనాథ్ పేరుతో జనశక్తి నక్సలైట్ల ఉద్యమంలో పని చేశారు. కానీ ఆయన ఇప్పుడు మావోయిస్టుల్లో చేరినట్లు అనుమానాలు ఉన్నాయి. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన బాలసంతుల ఉప్పలయ్య అలియాస్ చిన్నన్న ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో ఎవ్వరికీ తెలియ దు. పోలీస్ రికార్డుల్లో మాత్రం చిన్నన్న ఇంకా అజ్ఞాతవాసిగానే ఉన్నాడు. ‘గుర్తు తెలియని శవాల’ గుబులు ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల్లో తరచూ ఎన్కౌంటర్లు జరగడం, ఎక్కువ సంఖ్యలో మావోయిస్టులు మరణించడం, ఆయుధాలను పోలీసులకు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. తాజాగా కర్రిగుట్ట శివారుల్లో, అంతకు ముందు ఘరియాబండ్ అడవుల్లో, పూజారీ కాంకేర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టులు మరణించారు. ఇలా ఎన్కౌంటర్ జరిగిన ప్రతిసారి గుర్తు తెలియని నక్సలైట్లుగా ప్రకటిస్తూ.. చాలా మంది మృతదేహాలను పోస్ట్మార్టం అనంతరం పోలీసులే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల తరబడి జిల్లాకు చెందిన వారు అజ్ఞాతంలో ఉండడంతో వారి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అనేక మంది అజ్ఞాత నక్సలైట్లు ‘గుర్తు’ తెలియని శవాలుగా దహనమైపోతున్నారనే అనుమానాలు ఉన్నాయి. సీనియర్ అజ్ఞాత నేతలు మరణించినప్పుడు పోలీసులు ముఖ్యుల పేర్లను ప్రకటిస్తున్నారు. కానీ, చాలా సందర్భాల్లో ఎన్కౌంటర్ శవాలు చిధ్రమై ఉండడంతో గుర్తించడం కష్టంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ వర్గాలే మృతుల పేర్లను ప్రకటించాల్సి ఉంటుంది. కానీ అటు పోలీసులు, ఇటు మావోయిస్టు వర్గాలు మృతుల వివరాలు వెల్లడించక పోవడంతో గుర్తు తెలియని మృతదేహాలు ఎవరివి అనే భయం వారి కుటుంబ సభ్యుల్లో గుబులు పుట్టిస్తుంది. ‘మావో’ళ్లు ఎలా ఉన్నారో.. అని వారి కుటంబ సభ్యులు ఆందోళనకు గురి అవుతున్నారు. -
వరదకాలువలో పడి గీతకార్మికుడు మృతి
మల్యాల: మండలంలోని సర్వాపూర్కు చెందిన గీత కార్మికుడు గుర్రం నాగమల్లు (50) ప్రమాదవశాత్తు వరదకాలువలో పడి మృతి చెందాడు. ఎస్సై నరేశ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నాగమల్లు వేములవాడలో ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం సర్వాపూర్లోని తల్లి వద్దకు వచ్చాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నాగమల్లు కోసం గాలిస్తుండగా.. వరదకాలువలో శవమై తేలాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ మధుసూదన్, సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..చొప్పదండి: మండలంలోని ఆర్నకొండ శివారు కమ్మర్ఖాన్పేట ఎక్స్రోడ్డు వద్ద గురువారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన కట్ట నవీన్ (32) మరణించాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. నవీన్కు అదే గ్రామానికి చెందిన కృష్ణవేణితో ఆరేళ్లకిత్రం వివాహమైంది. బుధవారం రాత్రి నవీన్ తన బామ్మర్ది మామిడి కార్తీక్, మరో యువకుడు కట్ట నాగరాజుతో కలిసి కరీంనగర్లో సినిమా చూసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్లారు. సినిమా సమయం మించిపోవడంతో తిరుగు పయనమయ్యారు. ఖమ్మర్ఖాన్పేట ఎక్స్రోడ్డు వద్ద కట్ట నవీన్ గుర్తు తెలియని వాహనాన్ని తప్పించబోయి కింద పడిపోయారు. బలమైన గాయాలు కావడంతో నవీన్ అక్కడికక్కడే చనిపోగా, కార్తీక్, నాగరాజులకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు 108వాహనంలో కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. మృతుడి మామ మామిడి మల్లేశం ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరి ఆత్మహత్యచొప్పదండి: పట్టణానికి చెందిన ఉండాటి సతీశ్(30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సురేందర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం లక్కరం గ్రామానికి చెందిన సతీశ్కు చొప్పదండిలోని మానుపాటి కనుకయ్య కూతురు కళను ఇచ్చి పదమూడేళ్ల క్రితం వివాహం చేశారు. వీరు చొప్పదండిలోనే నివాసం ఉంటూ కూలీపని చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం దంపతులకు గొడవలు రాగా పంచాయితీలు జరిగాయి. అత్తగారి ఊరికి రానని, కళ చెప్పడంతో చొప్పదండిలోనే ఉంటున్నారు. ఇటీవల శ్రీరామనవమికి కుటుంబసభ్యులంతా వేములవాడకు వెళ్లగా.. అక్కడా గొడవ జరిగింది. తాజాగా లక్కారం వెళ్తానని సతీశ్ చెప్పడంతో రూ.లక్ష అప్పు ఉందని అడ్డుకున్నారు. దీంతో లక్కారంలోని తల్లికి సతీశ్ ఫోన్ చేసి భార్య కళ, మామ కనుకయ్య, అత్త రాజమ్మ, మరుదళ్లు సార్ల అంజలి, లోకిని శారదలు తనను వేధిస్తున్నాడని వాపోయాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం ఉదయం ఇంట్లో చీరతో ఉరివేసుకున్నాడు. భార్య గమనించి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా.. అప్పటికే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఉండాటి సాయిలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
600 మంది.. 8 గంటలు
కరీంనగర్కల్చరల్: 600మంది కళాకారులు.. 29 గ్రూపులు.. 8గంటల నిర్విరామ ప్రదర్శనతో చిడతల భజనలో వండర్బుక్ ఆప్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ కరీంనగర్ ఫోక్ అకాడమీ, కళారవళి సోషియో కల్చరల్ అసోసియేషన్, సల్వాజీ ఈవెంట్స్ కల్చరల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళాభారతిలో గురువారం ప్రపంచ రికార్డ్ కోసం చిడతల భజన ప్రదర్శించారు. 8గంటల నిర్విరామ ప్రదర్శనతో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించారు. ఇండియా కో– ఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ సర్టిఫికెట్ అందించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి 29 మందికి ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కరీంనగర్, సిద్దిపేట, వరంగల్, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, ఆదిలా బాద్ జిల్లాల నుంచి కళాకారులు పాల్గొన్నారు. మున్సిపల్ అడిషనల్ కమిషనర్ సువార్త, ఆర్డీవో కె.మహేశ్, టి.అనిల్రాజు, గోదావరిఖని కళా సంఘాల సమైక్య అధ్యక్షుడు కె.రమణయ్య, ఫోక్ ఆర్ట్స్ అకాడమీ కో– ఆర్డినేటర్ జ్ఞాన ప్రకాశ్, సల్వాజీ ప్రవీణ్, విష్ణుదాస్, గోపాలరావు, జి.కృపాదానం, మురళి, మధు, సంధ్య పాల్గొన్నారు.● చిడతల భజనకు వండర్ బుక్ఆఫ్ రికార్డ్స్లో చోటు -
ఎండ.. అప్రమత్తతే అండ!
● పెరుగుతున్న ఎండలు ● అప్రమత్తత అవసరం అంటున్న నిపుణులుకరీంనగర్ అర్బన్: భానుడి ప్రతాపానికి సకలవర్గాలు సతమతమవుతున్నాయి. మానవులతో పాటు జంతువులు, పంటలకు ప్రతికూల పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో ఇప్పటికే పలువురు వడదెబ్బతో మరణించారు. గురువారం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేమిటి అనే అంశాలు వివరించారు.ఉదయం, సాయంత్రం నీరు పెట్టాలి ఉష్ణోగ్రతలు హెచ్చరికస్థాయికి చేరినందున రైతులు జాగ్రత్తగా వ్యవహరించాలి. కూరగాయల తోటలకు ఉదయం, సాయంత్రం వేళలో మాత్రమే నీరు కట్టాలి. షెడ్నెట్ వేసుకుంటే మంచిది. పండ్ల తోటలకు పెద్దగా ఇబ్బంది లేదు. తీగజాతి కూరగాయలు, ఆకు కూరలకు ఉదయం, సాయంత్రం వేళలో నీటిని అందించాలి. ఉదయం 10నుంచి సాయంత్రం 4గంటల వరకు నీటిని ఇవ్వకూడదు. – ఆర్.శ్రీనివాస్రావు, జిల్లా పట్టుపరిశ్రమ, ఉద్యానశాఖ అధికారిగర్భిణులు, వృద్ధులు జాగ్రత్త వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవాలి. చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లొద్దు. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. కీరదోస, పుచ్చకాయ లాంటి తాజా పండ్లు తీసుకోవాలి. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచుకోవాలి. బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీరు తీసుకెళ్లాలి. ప్రతీ 30నిమిషాలకు నీరు తాగుతూ ఉండాలి. – సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్ -
కదం తొక్కిన జర్నలిస్టులు
గోదావరిఖని: సాక్షి ఎడిటర్ ధనంజయ్రెడ్డి నివాసంపై ఏపీ పోలీసుల దాడిని నిరసిస్తూ పాత్రికేయులు స్థానిక బస్టాండ్ వద్ద గురువారం రాస్తారోకో నిర్వహించారు. సాక్షి ఉమ్మడి జిల్లా బ్యూరో భాషబోయిన అనిల్కుమార్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంపై కక్ష సాధిస్తోందని దుయ్యబట్టారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని కోరారు. రాస్తారోకోలో జర్నలిస్టులు గుడ్ల శ్రీనివాస్, కాల్వ చంద్రశేఖర్రెడ్డి, మోత్కూరి శ్రీనివాస్, కీర్తి రమేశ్, పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. -
ఖాకీ నిఘా
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025సిటీ బస్టాండ్లోవరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని కరీంనగర్లో పరీక్ష రాసేందుకు తన తల్లితో కలిసి బస్టాండులో దిగింది. తెల్లవారితే పరీక్షకాగా.. రాత్రి బస్టాండులోనే ఉండాల్సి వచ్చింది. వేకువజామున వీరిని గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు వీరి బ్యాగును చోరీచేశారు. లబోదిబోమంటూ తల్లీకూతుళ్లు వన్టౌన్ పోలీసుస్టేషన్కు చేరుకున్నారు. బ్యాగులో సర్టిఫికెట్లు, హాల్టికెట్, సెల్ఫోన్, నగదు ఉందని వాపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్నారు.న్యూస్రీల్ -
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
● ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ● ఈనెల 20 వరకు గడువు ● ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ● జిల్లాలో 11 మోడల్ స్కూళ్లు ● ఒక్కో పాఠశాలలో 160 సీట్లుకరీంనగర్: ఇంటర్మీడియట్ ఆంగ్లమాధ్యమంలో చదవాలనుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆదర్శ పాఠశాలలు ఓ వరం. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రవేశాల కోసం ఈనెల 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ వెలువడింది. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలో 11 ఆదర్శ పాఠశాలలు జిల్లాలో చొప్పదండి మండలం రుక్మాపూర్, కరీంనగర్ మండలం ఎలగందల్, మానకొండూర్ మండలం పోచంపల్లి, రామడుగు, వీణవంక, జమ్మికుంట మండలం టేకుర్తి, చిగురుమామిడి మండలం ముల్కనూర్, గంగాధర, శంకరపట్నం, తిమ్మాపూర్, సైదాపూర్లో ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ప్రతీ స్కూల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రతీ గ్రూపునకు 40 మంది విద్యార్థుల చొప్పున, ఒక్కో పాఠశాలలో 160 మందికి అవకాశం కల్పించారు. బాలికలకు హాస్టల్ సౌకర్యం ఆదర్శ పాఠశాలల్లో బాలికలకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది. పూర్తిస్థాయి భవన నిర్మాణాలు, మౌలిక వసతులు లేని పాఠశాలల్లో బాలికలకు హాస్టల్ వసతి కల్పించడం లేదు. హాస్టల్లో 9,10వ తరగతులు, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంద మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంది. హాస్టల్కు కనీసం 3 కిలోమీటర్ల, ఆపై దూరంగా ఉండేవారు అర్హులు. వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి ఈనెల 20వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 26న మెరిట్ లిస్టు, 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ఇంటర్ విద్యతో పాటు ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్తో పాటు వివిధ ఉన్నతస్థాయి చదువుకు మార్గదర్శనం చేస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందజేస్తారు. ఆసక్తి గల విద్యార్థులు అడ్మిషన్ పొందడానికి ఇంటర్నెట్ సెంటర్ లేదా మీసేవ, ఈసేవ సెంటర్ను సంప్రదించాలి.ప్రతి గ్రూపునకు 40 సీట్లు.. కేటాయింపులు ఇలా.. కేటగిరి సీట్లు జనరల్ బాలికలు జనరల్ 20 13 07 ఎస్సీ 06 04 02 ఎస్టీ 02 01 01 బీసీ–ఏ 03 02 01 బీసీ–బీ 04 03 01 బీసీ–సీ 00 00 00 బీసీ–డీ 03 02 01 బీసీ–ఈ 02 02 00దరఖాస్తు చేసుకోవాలి మోడల్ స్కూల్లో ఇంటర్ప్రవేశాలకు ఈనెల 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఉచిత వసతి, సదుపాయాలు, మెరుగైన బోధన, ఫలితాల్లో ముందంజలో ఉంటున్న మోడల్ స్కూళ్లను అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జనార్దన్రావు, డీఈవో -
సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
సుల్తానాబాద్(పెద్దపల్లి): సరస్వతీ పుష్కరాలకు కరీంనగర్ రీజియన్ నుంచి ఆర్టీసీ బస్సులు నడుపుతామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమాన్ తెలిపారు. జిల్లాలోని పలు బస్టాండ్లను ఆయన గురువారం సందర్శించారు. అనంతరం ఆర్టీసీ అధికారులతో సమీక్షించారు. కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు జరిగే సరస్వతీ పుష్కరాలకు ఆర్టీసీ బస్సులు నడుపుతుందని, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు, వరంగల్ రీజినల్ మేనేజర్ విజయభాను, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు భానుకిరణ్, భూపతిరెడ్డి, డిపో మేనేజర్ ఇందిర, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి యుగంధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్ అర్బన్: భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి రెవెన్యూ చట్టం, 2025కు గా నూ రాష్ట్రవ్యాప్తంగా 5వేల మంది లైసెన్స్ సర్వేయర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో దాదాపు 5000 మంది లైసెన్స్ పొందిన సర్వేయర్లకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ అనంతరం ఈ లైసె న్స్డ్ సర్వేయర్లను జిల్లాల్లో నియమిస్తారని తెలి పారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ ఇప్పటికే నోటిఫికేషన్ ప్రచురించిందని తెలిపారు. ఈ నెల 5నుంయి 17వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించనుందని పేర్కొన్నారు. అనంతరం ఈ నెల 26నుంచి జులై 26వరకు (50 పని దినాలు) శిక్షణ ఉంటుందని తెలిపారు. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ అధికారి సహాయంతో ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం సర్వేయర్ల శిక్షణను అత్యంత జాగ్రత్తగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. -
ఏడేళ్ల ప్రేమ అంతలోనే .. ! పాపం ఆ యువకుడు..
జమ్మికుంట(కరీంనగర్): ఇటీవల యువతలో ఒకరిని ప్రేమించడం, మరొకరిని పెళ్లాడటం కామన్గా మారిపోయింది. అయితే కొందరు దీన్ని జీర్ణించుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతుండటమే బాధకరం. అలాంటి దారుణ ఘటనే కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకెళ్తే..కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లుగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆమె ఇటీవలే వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుంది. ఇది తెలిసి మనస్తాపం చెందిన ఎల్లేష్ సెల్ఫీ వీడియో తీసుకోని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. పైగా ఆ వీడియోలో తన ఫోన్లో ఆమెకు సంబంధించిన కాల్ రికార్డింగ్స్ అన్ని ఉన్నాయని..యువతి వచ్చే వరకు తన శవాన్ని తీయవద్దని కోరాడు. అలాగే తనను ఇంతలా మోసం చేసిన ఆ యువతి కుటుంబంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని రైలు కింద పడ్డ యువకుడు7 ఏళ్ళు ప్రేమించిన అమ్మాయి మోసం చేసి వేరే పెళ్లి చేసుకుందని.. సెల్ఫీ వీడియో తీసి రైలు కింద పడి యువకుడి ఆత్మహత్యకరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం లక్ష్మణపల్లి గ్రామానికి చెందిన దార ఎల్లేష్ అనే యువకుడితో ఏడేళ్ల నుండి ప్రేమ… pic.twitter.com/lx0DPxyUEd— Telugu Scribe (@TeluguScribe) May 8, 2025 -
భూ భారతి సదస్సులను వినియోగించుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతిసైదాపూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. భూభారతి పైలెట్ మండలంగా సైదాపూర్ ను ఎంపిక చేశామని తెలిపారు. ఈ మేరకు మండలంలోని ఎగ్లాస్పూర్, రాయికల్ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతుల సందేహాలు నివృత్తి చేశారు. భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసుబుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్–బీలో చేర్చిన భూములు సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర సమస్యలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ ప్రకారం అధికా రులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం చూపుతామన్నారు. సదస్సులో ఏఎంసీ చైర్మన్ సుధాకర్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్, ఆర్డీవో మహేశ్వర్, తహసీల్దార్లు శ్రీనివాస్, కనకయ్య పాల్గొన్నారు. శిశుగృహ నుంచి శిశువు దత్తత కరీంనగర్: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలోని కరీంనగర్ శిశుగృహలో పెరుగుతున్న ఐదు నెలల ఆడ శిశువును కలెక్టర్ పమేలా సత్పతి చేతులమీదుగా హైదరాబాద్ పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. చైల్డ్కేర్ ఇనిస్టిట్యూట్లో పెరుగుతున్న 13ఏళ్ల బాలుడిని కరీంనగర్కు చెందిన పిల్లలు లేని దంపతులకు దత్తత ఇచ్చారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, డీసీపీవో పర్వీన్, పీవో తిరుపతి, శిశుగృహ మేనేజర్ తేజస్విని పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడి వీరంగం
వేములవాడ: మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. పట్టణంలోని నటరాజ్ విగ్రహం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో అకస్మాత్తుగా వచ్చి టిఫిన్ సెంటర్పై రాళ్లు విసిరాడు. వంట పనిముట్లను చిందరవందరగా పడేశాడు. దీంతో అక్కడ టిఫిన్ చేస్తున్న కస్టమర్లు పరుగులు తీశారు. టిఫిన్ సెంటర్ నిర్వహుకుడు శ్రీనివాస్పై దాడికి పాల్పడ్డాడు. గమనించిన టిఫిన్ సెంటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఇతరులపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు అప్పగించారు. సీఐల బదిలీకరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు సర్కిళ్ల సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తిమ్మాపూర్ సీఐగా జి.సదన్కుమార్ నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న కె.స్వామి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. హుజూరాబాద్ సీఐగా కరుణాకర్ బదిలీకాగా.. అక్కడ పనిచేస్తున్న గుర్రం తిరుమల్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కోర్టు భవనాలకు ముహూర్తం
గురువారం శ్రీ 8 శ్రీ మే శ్రీ 2025● సిరిసిల్ల, పెద్దపల్లి సహా 12 జిల్లాలకు కొత్త కాంప్లెక్స్లు ● పోక్సో, ఫ్యామిలీ కోర్టుల కోసం బిల్డింగులు ● ‘న్యాయ నిర్మాణ్’ ప్రణాళిక కింద నిర్మాణాలు ● రూ.691 కోట్లతో టెండర్లు పిలిచిన ఆర్ అండ్ బీ ● ఉమ్మడి జిల్లాకు రూ.118 కోట్లు కేటాయింపు ● నాలుగంతస్తులు.. 2.18 లక్షల చదరపు అడుగుల స్పేస్సాహో భారత్ఆహ్లాదం కోసం కశ్మీర్ వెళ్లిన అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలకు భారత ప్రభుత్వం సరైన శిక్ష విధించిందని ఉమ్మడి జిల్లా ప్రజానీకం హర్షం వ్యక్తం చేసింది. పహల్గాం మృతులకు ఇది ఘన నివాళిగా అభివర్ణించింది. మంగళవారం అర్ధరాత్రి తరువాత భారత త్రివిధ దళాలు పాకిస్థాన్ ఉగ్రమూకలపై జరిపిన మెరుపుదాడిపై బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. దాడికి ప్రతిదాడిగా మన రక్షణదళం బదులు తీర్చుకుందని ఆనందం వ్యక్తం చేశా రు. ‘సిందూర్’ పేరిట నిర్వహించిన ఆపరేషన్ అదుర్స్ అంటూ.. సైనికులకు సెల్యూట్ చేశారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా చౌరస్తాల్లో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. సాహో భారత్ అంటూ.. నినాదాలు చేశారు. – వివరాలు 8లోuకరీంనగర్లో సంబురాలు జరుపుకుంటున్న యువతపారదర్శకంగా రేషన్కార్డుల జారీ● నగరపాలకసంస్థ కమిషనర్, చాహత్ బాజ్పేయ్ కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో రేషన్కార్డుల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ ఆదేశించారు. నగరంలోని 53,59,60 డివిజన్లలో జరుగుతున్న రేషన్కార్డుల లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియను బుధవారం తనిఖీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక జాబితా ప్రకారం ఇంటింటికి తిరిగి వెరిఫికేషన్ చేయడాన్ని స్వయంగా పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా వెరిఫికేషన్ చేపట్టాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. డంప్యార్డ్ ప్రక్షాళనకు చర్యలు డంప్యార్డ్ను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్ తెలిపారు. బుధవారం నగరంలోని బైపాస్రోడ్డు ఆటోనగర్లో ఉన్న డంప్యార్డ్ను సందర్శించారు. డీఆర్సీ సెంటర్ను పరిశీలించారు. బయోమైనింగ్ ప్రక్రియపై సంబంధిత అధికారులు, ఏజెన్సీ కాంట్రాక్టర్కు పలు సూచనలు చేశారు. డంప్యార్డ్కు నగరం నుంచి వచ్చే చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ కమిషనర్ వేణు మాధవ్, ఈఈ సంజీవ్,డీఈ లచ్చిరెడ్డి, పర్యావరణ ఇంజినీర్ స్వామి పాల్గొన్నారు.సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో కొత్తగా కోర్టు భవన సముదాయాల నిర్మాణానికి ముహూర్తం సిద్ధమైంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత పలు కొత్త జిల్లాల్లో కోర్టు భవనాల కొరత ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో న్యాయనిర్మాణ ప్రణాళిక కింద మంచిర్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జనగాం, వికారాబాద్ మొత్తం 12 జిల్లాలో ఫ్యామిలీ, పోక్సో కోర్టుల భవన సముదాయాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవనాల నిర్మాణాన్ని ఆర్అండ్బీ ఎస్ఈ, యాదాద్రి సర్కిల్ వారు పర్యవేక్షించనున్నారు. గత వారంలో టెండర్లు పిలవగా.. టెండర్లకు మంచి ఆదరణ ఉందని సమాచారం. పలు పేరు మోసిన సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలు భవన నిర్మాణానికి ముందుకు వచ్చినట్లు తెల్సింది. ఈనెల రెండో వారంలో రూ.691.18 కోట్లతో టెండర్లు ఖరారు కానున్నాయి, ఇందులో పెద్దపల్లి, సిరిసిల్ల కోసం దాదాపు రూ.118 కోట్లు కేటాయించనున్నారు. 24 నెలల్లో పూర్తి.. ఈ భవనాలు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఉండనున్నాయి. ప్రతీ భవనంలో ఒక బేస్మెంట్ (88 కార్లు, 62 బైకులు పార్కింగ్ చేసుకునేలా పార్కింగ్ లాట్), గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లు మొత్తం నాలుగు అంతస్తుల్లో ఈ భవన సముదాయాలను నిర్మించనున్నారు. అనంతరం ఈ భవన సముదాయాల్లో పోక్సో, ఫ్యామిలీ కోర్టులు నడవనున్నాయి. ప్రతీ ఫ్లోర్లో 43వేల చదరపు అడుగుల నుంచి 44వేల చదరపు అడుగుల చొప్పున మొత్తం 2,18, 743.58 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా భవనాలు సిద్ధం చేస్తారు. మే రెండో వారంలో టెండర్లు ఖరారు కాగానే నిర్మాణాలు మొదలవుతాయి. నిర్మాణాలుమొదలైన 24 నెలల్లో అంటే 2027 నాటికి ఈ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.691.18 కోట్లతో.. మొత్తం రూ.691.18 కోట్ల బడ్జెట్తో ఈ భవనాలు నిర్మించనున్నారు. ప్రతీ భవనం తూర్పు అభిముఖంగా విశాలంగా, విరివిగా గాలి, వెలుతురు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇందుకోసం రాజసం ఉట్టిపడేలా భవనం మధ్యలో భారీ ఎలివేషన్తో ముఖద్వారం, దానికి ఇరువైపులా రెండు విశాలమైన భుజాలతో ఆర్ట్స్ కాలేజీ తరహాలో భవనం స్కెచ్ కూడా ఖరారైంది. ప్రతీ భవనం సివిల్, ఎలక్ట్రిక్, సానిటరీ– వాటర్ వర్క్స్ కోసం దాదాపు రూ.53 కోట్ల నుంచి రూ.59 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇందులో సిరిసిల్ల కోర్టు కాంప్లెక్స్కు రూ.59.92కోట్లు, పెద్దపల్లి కోర్టు భవన సముదాయాలకు రూ.58.58 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో జీఎస్టీ కలపలేదు. మొత్తం రూ.691 కోట్లలో రూ.563 కోట్లు సివిల్ పనులకు, రూ.563.70 కోట్లు శానిటరీ, వాటర్ వర్క్స్ కోసం రూ.7.01 కోట్లు, ఎలక్ట్రికల్ వర్క్స్ కోసం రూ.120.46కోట్లుగా పేర్కొన్నారు. న్యూస్రీల్ -
ఉద్యోగ నియామకాలు చేపట్టాలి
కరీంనగర్కల్చరల్: జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్ బుధవారం అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ నియామకాలు, నూతన గ్రంథాలయ భవన నిర్మాణ పనుల గురించి చర్చించి, నియామ కాలు చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఘనంగా అథ్లెటిక్స్ దినోత్సవంకరీంనగర్స్పోర్ట్స్: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కరీంనగర్లోని ప్రాంతీయ క్రీడా పాఠశాలలో జిల్లా అథ్లెటిక్ సంఘం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. డీవైఎస్ఈ శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. క్రీడలతో స్నేహ సంబంధాలు, అథ్లెటిక్స్తో శక్తి సామర్థ్యాలు, వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందుతాయని తెలిపారు. చిన్నారుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభ ఇలాంటి పోటీల ద్వారానే బయటకు వస్తుందన్నారు. సాయంత్రం జరిగిన ముగింపు సమావేశానికి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నందెల్లి మహిపాల్ హాజరై విజేతలకు బహుమతులు అందించారు. కేక్ కట్చేశారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కడారి రవి, సభ్యులు హరికిషన్, ఎస్.రమేశ్, కోచ్లు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతీ ఇంటినుంచి ఆర్థికసాయం అందించాలి కరీంనగర్: దేశవ్యాప్తంగా ప్రతీ ఇంటినుంచి ఆర్థికసాయం అందించాలని మాజీ మేయర్ సర్దార్ రవీందర్సింగ్ కోరారు. సైనికుల సహా యార్థం సిక్కుల తరఫున రూ.13,013 చెక్కు ను బుధవారం కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్సింగ్ మా ట్లాడుతూ ఒక వైపు మన సైనికులు యుద్ధ భూ మిపై పోరాడుతుంటే, సాధువులు జీవన భూ మిపై పోరాడుతున్నారన్నారు. మనం చేసే ఈ చిన్న ప్రయత్నం తరాలు గుర్తుండి పోయేలా ఉండాలన్నారు. గురుద్వార్ ప్రబందు కమిటీ సభ్యులు సర్దార్ బిషన్సింగ్ పాల్గొన్నారు. క్వింటాల్ పత్తి రూ.7,550 జమ్మికుంట: జమ్మికుంట వ్యవసాయ పత్తి మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర గరిష్టంగా రూ.7,550 పలికింది. బుధవారం మార్కెట్కు 10వాహనాల్లో 143 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,500, కనిష్ట ధర రూ.7,100కు ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్రయ విక్రయాలను ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్–2 రాజా పర్యవేక్షించారు. నేడు పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ నిర్వహణ పనులు చేపడుతున్నందున గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 11 కేవీ ఎల్లమ్మ ఫీడర్ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం, కోతిరాంపూర్, మై విలేజ్, ఆటోనగర్, బీఎస్ఎన్ఎల్ టవర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్– ఏడీఈ పి.శ్రీనివాగౌడ్ తెలిపారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు 11 కే.వీ.సంతోష్నగర్ ఫీడర్ పరిధిలోని జ్యోతినగర్, గీతాభవన్ వెనకభాగం, కార్పెంటర్స్ సొసైటీ ప్రాంతాలు, ఉదయం 8.30 నుంచి 10.30 గంటల వరకు 11 కె.వీ.తెలంగాణ చౌక్ ఫీడర్ పరిధిలోని కాశ్మీర్గడ్డ, ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల మెయిన్రోడ్, మైసమ్మ చెట్టు, రైతు బజార్, ముకరంపుర, టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు. -
చర్చి నిర్మాణ పనులు అడ్డగింత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో నిర్మిస్తున్న చర్చి పనులను బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వాదోపవాదనలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్సై రమాకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలతో చర్చించారు. బీజేపీ మండలాధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, మాజీ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, చుట్టుపక్కల పొలాలు ఉన్నాయని, ఆ ప్రాంతంలో చర్చి నిర్మించొద్దని రైతులు గ్రామపంచాయతీ అధికారులకు గతంలోనే ఫిర్యాదు చేశారన్నారు. ఈ విషయం తెలిసి తాము పనులు అడ్డుకునేందుకు వెళ్తే దాడి చేశారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు దారితీయడంలో పోలీసులు సముదాయించారు. అక్కడి నుంచే తహసీల్దార్, ఎంపీడీవోలతో ఫోన్లో బీజేపీ నాయకులు మాట్లాడి.. చర్చి నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వవద్దని కోరారు. నాయకులు నంది నరేశ్, మారవేణి రంజిత్కుమార్, దాసరి గణేశ్, గ్రామస్తులు ఉన్నారు. -
పాశవిక చర్యకు చెంపపెట్టు
పచ్చని కశ్మీరాన్ని రక్తసిక్తం చేసి అతివల సిందూరాన్ని తుడిచివేసిన పహల్గాం పాశవిక చర్యకు ఆపరేషన్ సిందూర్ తగిన గుణపాఠం చెప్పింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాదస్థావరాలపై దాడి చేసిన భారత సైనిక వ్యూహం అభినందనీయం. – అయిత అనిత, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, జగిత్యాల సైన్యానికి సలాం దాయాది దేశ దాడుల్లో ప్రతీసారి తన సత్తా చూపిస్తున్న మన సైన్యానికి సలాం. మన దేశ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఉగ్రస్థావరాలు, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న పాకిస్థాన్పై ముప్పేట దాడి చేసి, ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయడంతో పేరుమోసిన ఉగ్రవాడులను మట్టపెట్టింది. ఈ సంఘటన సైన్య విజయపరంపరలో మరో మైలురాయి. – కిరణ్కుమార్, యువజన అవార్డు గ్రహీత, రాంనగర్, కరీంనగర్ సాయుధులకు వందనం పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై చేసిన దాడులతో దేశప్రజలు గర్వంగా ఉన్నారు. నిత్యం ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థల కనుసన్నలో పాకిస్థాన్ ఎప్పుడూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. భారత సైన్యం మాత్రం అక్కడి ప్రజలకు, సైన్యానికి కానీ చిన్న హాని కూడ తలపెట్టకుండా కేవలం ఉగ్రవాద శిక్షణ శిబిరాలను కూల్చివేసింది. – కోట ప్రభాకర్రెడ్డి, ప్రైవేటు ఉపాధ్యాయుడు -
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలి
ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసి పాకిస్తాన్కు భారత్ సైన్యం తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఈ చర్య మనదేశ పౌరులకు భరోసా కల్పించింది. లౌకిక దేశమని, ప్రజలందరూ సమానమేనని చాటిచెప్పింది. ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు పాల్పడితే పాకిస్తాన్ మరోమారు భారత సత్తా చాటడానికి సిద్ధమని సంకేతం ఇచ్చింది. – కొమురోజు శ్రీనివాస్, ఉపాధ్యాయుడు, మంథని సైన్యానికి అండగా నిలుద్దాం పహల్గాం దాడులకు వ్యతిరేకంగా ఆపరేషన్ సిందూరం చేపట్టిన భా రత సైన్యం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మనదేశ ప్రజలంతా గర్వపడాల్సిన రోజు ఇది. టెర్రరిస్టులు మరోసారి మనదేశంపై దాడిచేస్తే ఎలా ఉంటుందోననే భయాన్ని చూపించారు. ప్రపంచమే ఆశ్చర్యపోయేలా దాడులు చేసిన భారత సైన్యానికి అందరం అండగా నిలవాలి. –బెజ్జంకి డిగంబర్, విద్యార్థి నాయకుడు, మంథని -
12 నుంచి అరుణోదయ 50 ఏళ్ల స్ఫూర్తి సభలు
సిరిసిల్ల: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య(ఏసీఎఫ్) 50 ఏళ్ల పరిపూర్తి స్ఫూర్తి సభలను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 12న నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క తెలిపారు. సభ కరపత్రాలను బుధవారం హైదరాబాద్ సుందరయ్యవిజ్ఞాన కేంద్రం ముందు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ, 1974 మే 12న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాలలో అమరులు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ప్రసాద్ చొరవతో అరుణోదయ సాంస్కృతికి సమాఖ్య ఏర్పడిందన్నారు. 50 ఏళ్లుగా ఒక విప్లవ సాంస్కృతిక సంఘంగా ఉన్నా అరుణోదయ ఎన్నో నిర్బంధాలు ఎదుర్కొంటూ పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మల్సూర్ అన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల పైన జరుగుతున్న విధ్వంసాన్ని ఆపాలని, ప్రభుత్వం నక్సలైట్లతో శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశ్ పోతుల, ఉపాధ్యక్షులు అనిత, రాష్ట్ర కమిటీ సభ్యులు లింగన్న, రాకేశ్, చిన్నన్న, గంగా, నూతన్ తదితరులు పాల్గొన్నారు. ప్రాణం తీసిన ఈత సరదా యైటింక్లయిన్కాలనీ(రామగుండం): సరదాగా ఈతకోసం వెళ్లిన అయాన్(14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి గోదావరి నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. గోదావరిఖని టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. అయాన్ తల్లి డ్రులతో కలిసి గంగానగర్లో కొంతకాలంగా నివాసం ఉండేవారు. అవసరాల నిమిత్తం మూడు నెలల క్రితం కుర్మపల్లికి చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అయాన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో గంగానగర్లోని తన అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఆడుకుంటానని ఇంట్లో చెప్పి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి గోదావరి నదిలోకి ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలోనే నీటమునిగి చనిపోయాడు. బుధవారం అటువైపు వెళ్లిన జాలర్లకు గోదావరి నది ఫిల్టర్బెడ్ సమీపంలో శవం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి ఆస్మా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్నట్లు ఎస్సై సురేశ్ తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడు అనూహ్యంగా నీటమునిగి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీమానసాదేవి ఆలయం
గన్నేరువరం: మండలంలోని ఖాసీంపేటలో ఉద్భవించిన ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీమానసాదేవి ఆలయం సప్తమ వార్షికోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ ఆలయం దక్షిణభారతదేశంలో మొదటిదిగా ప్రసిద్ధి చెందింది. 108 శక్తి పీఠాల్లో 6వ శక్తిపీఠం. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి వెళ్లే రహదారిలో కరీంనగర్–సిద్దిపేట జిల్లాల సరిహద్దులోని బద్దం చిన్న నర్సింహారెడ్డి వ్యవసాయ పొలంలో 2015 జూన్లో అమ్మవారి విగ్రహం వెలిసింది. గ్రామస్తులు భూ యజమానితో కలిసి తాత్కాలికంగా ఆలయాన్ని ఏర్పాటు చేసి అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. అప్పటినుంచి పూజలందుకుంటున్న మానసాదేవి అమ్మవారికి 2018లో ఆలయాన్ని పూర్తి చేసి అదే ఏడాది ఏప్రిల్ 26 నుంచి 29 వరకు విగ్రహ ప్రతిష్టామహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. 108 శివలింగ నాగ ప్రతిమల ధర్మగుండం, 12 ఫీట్ల భారీ ఆంజనేయ స్వామి ఏకశిల విగ్రహం, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ఆలయానికి భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నారు. ఇక్కడ ప్రతి మంగళ, శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 54 కిలోలతో ప్రత్యేక అభిషేకాలు మూడు రోజులపాటు జరిగే ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 8న 54 కిలోల పసుపుతో అమ్మవారికి హరిద్రా అభిషేకం, 54 కిలోల కుంకుమతో అపురూప లక్ష్మీకి కుంకుమాభిషేకం నిర్వహించనున్నారు. నేటి నుంచి సప్తమ వార్షికోత్సవం మూడు జిల్లాల సరిహద్దుల్లో ఆలయం దక్షిణ భారతదేశంలోనే మొదటిది మూడురోజుల పాటు వివిధ కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి శ్రీమానసాదేవి సప్తమ వార్షికోత్సవానికి ఆలయంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది, కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి నుంచి గుండ్లపల్లి మీదుగా, వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా బస్సు సౌకర్యం ఉంది. – ఏలేటి చంద్రారెడ్డి, మానసాదేవి ఆలయ చైర్మన్ మూడు రోజులు వేడుకలు అమ్మవారి ఆలయ సప్తమ వార్షికోత్సవాలు ఈనెల 8 నుంచి పదో తేదీ వరకు జరుగుతాయి. ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, మానసాదేవి లక్ష్మీపుష్పార్చన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులకు ప్రతిరోజు అన్నప్రసాదం, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. – పెండ్యాల అమర్నాథ్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు -
గుండెపోటుతో మాజీ ఎంపీటీసీ మృతి
హుజూరాబాద్: మండలంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కంకణాల రాజ్కుమార్రెడ్డ్డి (47) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. రాజ్కుమార్రెడ్డి భూమి కరీంనగర్– వరంగల్ బైపాస్ రోడ్డు కింద కోల్పోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే గుండెపోటుకు గురై మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రికి కుమార్తె శివాని అంత్యక్రియలు నిర్వహించింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితెల ప్రణవ్, మాజీ ఎమ్మెల్యే ఇనుగాల పెద్దిరెడ్డి సంతాపం తెలిపారు. పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : పెళ్లి సంబంధం కుదరడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు దేవయ్య కుమారుడు ఒగ్గు మహేశ్(21) గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడు. ఇటీవల పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నిస్తుండగా గొర్రెల కాపరీగా పనిచేస్తున్నాడనే సంబంధాలు కుదరడం లేదు. తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో తనకు ఇక పెళ్లి కాదని మనస్తాపానికి గురయ్యాడు. ఎల్లారెడ్డిపేట శివారులోని పొలాల వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతు ఛిటకి తల్లి రాజవ్వ, సోదరుడు నగేశ్ ఉన్నారు. తల్లి మందలించిందని కూతురు.. గొల్లపల్లి: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని చిల్వాకోడూర్లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్ల లక్ష్మి కుటుంబం బతుకుదెరువు నిమిత్తం ముంబయి వెళ్లింది. ఆమె కూతురు త్రిష అక్కడే ఇంటర్ చదివింది. రెండు నెలల క్రితం ఇద్దరూ కలిసి స్వగ్రామానికి వచ్చారు. కూతురు ఆలస్యంగా నిద్రలేవడంతోపాటు ఏ పనీ చేయకపోవడంతో తల్లి మంగళవారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన త్రిష (21) మంగళవారం అర్ధరాత్రి తమ రేకులషెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.ప్రేమ విఫలమై యువకుడు.. జమ్మికుంట: ప్రేమ విఫలమైందని ఓ యువకుడు బుధవారం జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం.. ఇల్లందకుంటకు చెందిన దార మొగిలి, రాజేశ్వరి దంపతుల కొడుకు దార ఎల్లేశ్(23) జమ్మికుంటలో ఇంటర్ చదివే రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కొన్నాళ్లు కలిసి తిరిగారు. తరువాత సదరు అమ్మాయి వేరే వివాహం చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఎల్లేశ్ ‘ఆ అమ్మయిని నా శవం వద్దకు తీసుకరావాలని’ సెల్ఫీ వీడియో తీసుకొని జమ్మికుంటలో రైలుకిందపడి ఆత్మహత్యకు చేసుకున్నాడు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. -
సిరిసిల్లలో ‘కాసం ఫ్యాషన్స్’ ప్రారంభం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్లో ‘కాసం ఫ్యాషన్స్’ షాపింగ్మాల్ను బుధవారం సినీనటి అనసూయ ప్రారంభించారు. పట్టుచీరలను అలంకరించుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. షాపింగ్మాల్ ముందున్న స్టేజీపైకి వచ్చి జనానికి అభివాదం తెలిపారు. సిరిసిల్లలో ‘కాసం ఫ్యాషన్స్’తో కొత్త కలెక్షన్స్ వచ్చాయని, అందరూ ఆదరించాలని కోరారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 17వ షాపింగ్మాల్ను సిరిసిల్లలో ప్రారంభించామని, మరో పది షాపింగ్ మాల్స్ను త్వరలోనే ప్రారంభిస్తామని ‘కాసం’ ఫ్యాషన్స్ డైరెక్టర్లు కాసం నమశివాయ, మల్లికార్జున్, కేధారినాథ్, శివప్రసాద్ ప్రకటించారు. నాణ్యమైన వస్త్రాలతో నమ్మకమైన వ్యాపారమే లక్ష్యమని వివరించారు. అన్ని వర్గాల వారికి అందుబాటు ధరల్లో వస్త్రాలను అందిస్తామని, ఆధునాతన కలెక్షన్స్తో ముందుకు సాగుతామని కాసం ఫణీ, సాయికృష్ణ, యాంసాని ప్రవీణ్, పుల్లూరి అరుణ్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, మాజీ కౌన్సిలర్లు, టౌన్ సీఐ కృష్ణ, వస్త్ర వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ బాహుబలి
● వాహనాల ఫిట్నెస్ ఇక పక్కా.. ● అందుబాటులోకి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ● ఏఎఫ్ఎంఎస్ సాఫ్ట్వేర్తో సామర్థ్య పరీక్షలు ● త్వరలో రూ.8 కోట్ల యంత్రసముదాయం ఇన్స్టాలేషన్ ● కేంద్రం ఆదేశాలతో తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్మాణం ● ఫిట్నెస్ వివరాలు నేరుగా ‘వాహన్’ పోర్టల్తో అనుసంధానంసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకప్పుడు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ విషయంలో ఏదోలా నెట్టుకొచ్చేవారు. ఇందులో అక్రమాలకు పుష్కలంగా ఆస్కారం ఉండేది. ఫలితంగా ఫిట్నెస్లేని వాహనాలు రోడ్ల మీద అమాయకులను బలిగొన్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇకపై అలాంటి రోడ్డు ప్రమాదాలేవీ జరగకుండా రోడ్డు భద్రతలో భాగంగా.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) అనే భారీ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. తిమ్మాపూర్లోని ఆర్టీఏ కార్యాలయంలో త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈ యంత్ర సముదాయం.. ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) ప్రత్యేక సాఫ్ట్వేర్తో పనిచేయనుండటం గమనార్హం. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్ బాధ్యతలను ఆర్అండ్బీ అధికారులు తీసుకున్నారు. పూర్తి అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఈ భారీ యంత్రాల సముదాయం ఇకపై ఉమ్మడి జిల్లాలోని అన్ని లైట్ మోటార్ వెహికిల్స్ నుంచి భారీ యంత్రాల వరకు ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనుంది. ఏటీఎస్ ప్రత్యేకతలు ఏంటంటే.. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ఒక యంత్రం కాదు. ఇది వాహనాల ముఖ్యమైన విడిభాగాల సామర్థ్యాన్ని కచ్చితంగా మదించి రిపోర్ట్ ఇచ్చే బహుళ యంత్ర సముదాయం. ఎందుకంటే వాహనంలో ఏ భాగం సరిగా పనిచేయకున్నా.. అది ప్రమాదాలకు దారితీస్తుంది. పైగా ప్రస్తుతం మాన్యువల్గా జారీ చేసే ఫిట్నెస్ సర్టిఫికెట్లలో అనేక లోపాలు ఉన్నాయి. అందుకే దేశవ్యాప్తంగా అలాంటి లోపాలు నివారించేందుకు ఏకరూపకంగా, దోషరహితంగా, పూర్తి కంప్యూటీకరణ చేసిన ఏటీఎస్ యంత్రాలతో కచ్చితమైన ఫిట్నెస్ రిపోర్టు ఇవ్వడం దీని ప్రత్యేకత. హెడ్లైట్, స్టీరింగ్, టైర్ కోసం స్లిప్టెస్ట్, సస్పెన్షన్, ఇంజిన్, నాయిస్, ఎయిర్పొల్యుషన్.. ఇలా ప్రతీ విడిభాగం పనితీరును పకడ్బందీగా తనిఖీ చేసి ఆటోమేటెడ్ ఫిట్నెస్ మేనేజ్మెంట్ సర్టిఫికెట్ (ఏఎఫ్ఎంఎస్) రిపోర్ట్ ఇస్తుంది. ఆ వెంటనే.. ఆ రిపోర్ట్ను కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న ‘వాహన్–పరివాహన్’ పోర్టల్కు చేరవేస్తుంది. ఇలా ప్రతీ బండి సామర్థ్యం, దాని వివరాలు అన్నీ దేశంలో ఎక్కడ నుంచైనా అధికారులు చూసే వీలుంటుంది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలోని గ్రానైట్, ఇసుక, మైనింగ్, బొగ్గు, రైస్మిల్లుల కోసం నడిచే భారీ వాహనాలు ఇకపై ఈ యంత్రాలతో ఫిట్నెస్ తీసుకోవాల్సిందే. పాత వాహనాలకు ఫిట్నెస్ లేకపోతే ఒకటి రెండు సార్లు అవకాశం ఇస్తారు. అయినా మార్పు రాకపోతే ఎండ్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్ జారీ చేసి ఆ వాహనాలను స్క్రాప్కు పంపిస్తారు. రెండెకరాల స్థలంలో.. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు ఒక ఏటీఎస్ యంత్ర సముదాయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కరీంనగర్లోని తిమ్మాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో ఈ యంత్ర సముదాయాన్ని ఇన్స్టాల్ చేయనున్నారు. ఇది ఉమ్మడి జిల్లా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు అందించనుంది. భారీ వాహనాలకు 1500 చదరపు మీటర్ల స్థలం కావాల్సి వస్తుంది. ఇలా ఉమ్మడి జిల్లాలోని హెవీ, లైట్ మోటార్ వెహికిల్స్ను బట్టి.. ఇక్కడ నాలుగు లేన్లు అవసరమవుతాయని ఇందుకోసం ఎకరంన్నర నుంచి రెండెకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం భారీ షెడ్లు, వచ్చే వాహనాల పార్కింగ్, డ్రైవర్ల కోసం వెయిటింగ్ రూం, సీటింగ్ ఏర్పాటు, టాయిలెట్లు, జనరేటర్లు తదితరాలు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రాల ఇన్స్టాలేషన్, షెడ్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన అంతా కేంద్రం మార్గదర్శకాల మేరకు రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేయనుంది.15ఏళ్లు నిండిన వాహనాల వివరాలుజిల్లా వాహనాలు కరీంనగర్ 1,58,129 జగిత్యాల 4,283 పెద్దపల్లి 9,660 రాజన్నసిరిసిల్ల 2,039 మొత్తం 1,74,111 నోట్: ఆటోరిక్షా, కాంట్రాక్ట్ క్యారేజ్, విద్యాసంస్థల బస్సులు, గూడ్స్క్యారేజ్, మ్యాక్సీ క్యాబ్, మోటర్ క్యాబ్, కారు, ద్విచక్రవాహనం, ప్రైవేట్ సర్వీస్ వెహికిల్, స్టేజీ క్యారేజ్, ట్రాక్టర్, ట్రైలర్తో కలిపి. -
బ్రహ్మోత్సవాలకు రండి
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8వ తేదీ నుంచి నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు రావాలని ఆలయ ఉత్సవకమిటీ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆహ్వాన పత్రిక అందించారు. హైదరాబాద్లోని మంత్రి నివాసంలో బ్రహ్మోత్సవాల వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ హౌస్ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, హుస్నాబాద్ వ్య వసాయమార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శంకరయ్య, ఈవో రాజ్కుమార్, క్లర్క్ కవిత, పూజా రి శేషం నవీనాచార్యులు, లక్ష్మణ్ ఉన్నారు. వక్ఫ్పై రాద్ధాంతం వద్దుకరీంనగర్టౌన్: వక్ఫ్ చట్ట సవరణ జన జాగరణ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడు దురిశె ట్టి సంపత్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్లోని కోర్టు చౌరస్తా నుంచి తెలంగాణచౌక్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వక్ఫ్ సవరణ చట్టంపై కొందరు అపోహతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం విచారకరమన్నారు. అన్యాయానికి గురవుతున్న నిరుపేద ముస్లింలకు న్యాయం చేయడానికి మోడీ ప్రభుత్వం వక్ఫ్పై సవరణలు చేపడితే, కొంతమంది పనిగట్టుకుని తప్పుదారి పట్టిస్తున్నారని తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ముస్లింల ఆస్తులను దోచుకుని, వక్ఫ్బోర్డుతో ఇన్నేళ్లు ప్రయోజనం పొందిన వారికి సవరణ చట్టం మింగుడు పడటం లేదన్నారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్గౌడ్, మహమ్మద్ ముజీబ్, కటకం లోకేశ్, శ్రీరాముల శ్రీకాంత్, శశిధర్రెడ్డి, పుప్పాల రఘు, నాగసముద్రం ప్రవీణ్, సమీ పర్వేజ్ పాల్గొన్నారు. యువజన సంఘాలను భాగస్వామ్యం చేయండి కరీంనగర్స్పోర్ట్స్: నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ప్రతీ కార్యక్రమంలో యువజన సంఘాలను భాగస్వామ్యం చేయాలని కోరు తూ ఎన్వైకే కోఆర్డినేటర్ ఎం వెంకటరాంబాబుకు జాతీయ, రాష్ట్ర, జిల్లా యువజన అవార్డీ లు, యువజన సంఘాల బాధ్యులు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకలను గ్రామీణ ప్రాంతాలకు చెరవేసేందుకు యువజన సంఘాలపాత్ర కీలకమన్నారు. నెహ్రు యువ కేంద్ర, యువజన సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో యువజన సదస్సులు, సమావేశలు, క్రీడా పోటీలు నిర్వహించి గ్రామీ ణ ప్రాంతాల్లో ఉన్న యువత ప్రతిభను వెలికితీయనున్నట్లు తెలిపారు. అవార్డు గ్రహీతలు ఏ.కిరణ్ కుమార్, రెండ్ల కళింగ శేఖర్, అలువా ల విష్ణు, మహ్మద్ అజమ్, శ్రీనివాస్, వొడ్నాల రాజు, తొర్తి శ్రీనివాస్, అజయ్, శ్రీనివాస్, అశోక్, వసంతరావు, భూంరెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ జాగ్రత్తలను వివరించండి కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతులకు విద్యుత్ భద్రత జాగ్రత్తల గురించి వివరిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని ఉద్యోగులకు టీజీఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ (ఆపరేషన్) అశోక్ సూచించారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా కరీంనగర్లోని విద్యుత్ భవన్లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రమాదాల నివారణలో ఉద్యోగులదే ప్రధాన పాత్ర అన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేష్బాబు, డీఈలు కే.ఉపేందర్, జంపాల రాజం, ఏడీఇలు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య పాల్గొన్నారు. -
కాంగ్రెస్ నుంచి ‘పురుమల్ల’ సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని వేటు కరీంనగర్ కార్పొరేషన్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పురుమల్ల శ్రీనివాస్పై సస్పెన్షన్ వేటు పడింది. గత జనవరిలో ఇచ్చిన సంజాయిషీ సంతృప్తికరంగా లేనందున పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ జి.చిన్నారెడ్డి మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతేడాది డిసెంబర్లో డీసీసీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావును ఉద్దేశించి పురుమల్ల చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణా కమిటీ జనవరి 6వ తేదీన షోకాజు నోటీసు జారీ చేయగా, అదేనెల 11వ తేదీన పురుమల్ల వివరణ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన డీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి పరోక్షంగా పురుమల్ల మరోసారి చేసిన ఘా టు వ్యాఖ్యలతో గొడవ చెలరేగడం తెలిసిందే. ఈ గొడవపై ఇరువర్గాలు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకొన్నాయి. ఈ క్రమంలోనే జనవరి 11వ తేదీన ఇచ్చిన సంజాయిషీ సంతృప్తిగా లేదంటూ పురుమల్లపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ చాలా సమయం ఇచ్చినా శ్రీని వాస్ ప్రవర్తనలో మార్పు లేనందున, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ చేస్తున్నట్లు చిన్నారెడ్డి ఆ సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వల్పంగా పెరిగిన పత్తి ధర జమ్మికుంట: స్థానిక మార్కెట్లో పత్తిధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటాల్ కు రూ.7,400 కాగా మంగళవారం రూ.150 పెరిగి, గరిష్ట ధర రూ.7,550 పలికింది. మార్కెట్కు 57క్వింటాళ్ల పత్తిని రైతులు అ మ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,400, కనిష్ట ధర రూ.7,100కు ప్రైవే టు వ్యాపారులు కొనుగోలు చేశారు. -
15 గంజాయి కేసుల్లో నిందితుడి అరెస్ట్
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 గంజాయి కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎండీ హమ్మద్ (23)ను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి, బోయినపల్లి, చందుర్తి పోలీస్స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో హమ్మద్ నిందితుడని వివరించారు. సిరిసిల్ల పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు, చందుర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని మరో కేసులో పరారీలో ఉన్నాడని ఎస్పీ వివరించారు. హమ్మద్ సిరిసిల్లకు వస్తున్నాడనే సమాచారం మేరకు టౌన్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్లోని ఎల్లమ్మ చౌరస్తా వద్ద పట్టుకుని రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిరోధానికి సహకరించండి జిల్లాలో గంజాయి రవాణాపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. గంజాయి నిరోధానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములై సహకరించాలన్నారు. జిల్లాలో గంజాయి విక్రయించినా, సాగు చేసినా, రవాణా చేసినా, సేవించిన వారి సమాచారం 87126 56392 నంబర్కు అందించాలని ఎస్పీ కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతానమి తెలిపారు. సమావేశంలో టౌన్ సీఐ కృష్ణ, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ఇంతియాజ్ ఉన్నారు. ఐదు కేసుల్లో పరారీ గంజాయి నిరోధానికి సమాచారం ఇవ్వండి: ఎస్పీ మహేశ్ బీ గీతే -
పుస్తకం గురువుతో సమానం
రామడుగు/మల్యాల: ప్రతీ వ్యక్తికి పుస్తకం ఒక గురువులాంటిదని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. రామడుగు మండలం వెదిర జిల్లా పరిషత్తు పాఠశాలలో ఆకర్షణ సతీశ్ 22వ గ్రంథాలయాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేరళకు చెందిన 9వ తరగతి విద్యార్థి ఆకర్షణ సతీశ్ ఇప్పటి వరకు 21గ్రంథాలయాలు ఏర్పాటు చేశారని, 22వది వెదిరలో ఏర్పా టు చేయడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్లో మంచి మార్కులు సాధించిన కోరుకండ్ల పల్లవి, ప్రణీతను సత్కరించారు. పద్మశాలివాడ నుంచి గణేశ్నగర్ వరకు రూ.50లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీరోడ్డు ప్రారంభించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్వరీ, ఎంపీడీవో రాజేశ్వరీ, ఎంఈవో వేణుకుమార్, హెచ్ఎం రాజమౌళి పాల్గొన్నారు. లివింగ్ రిలేషన్ మంచిది కాదు యువత చెడుదారిన వెళ్లవద్దని, తల్లిదండ్రులు తలవంచుకునేలా ఆకర్షణే ప్రేమగా భావించి, లివింగ్ రిలేషన్కు వెళ్లవద్దని మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మా ట్లాడుతూ తెలంగాణలో మహిళల ఫిర్యాదులు పెరిగాయని, కౌన్సెలింగ్ చేస్తూ తక్షణమే పరిష్కరించేలా కృషి చేస్తున్నామని అన్నారు. మహిళలతోపాటు పురుషులుసైతం మహిళా కమిషన్ను సంప్రదిస్తున్నారని అన్నారు. తమ పరిధిని మించిన వాటినిసైతం మానవీయ కోణంలో స్పందిస్తూ, కొన్ని సందర్భాల్లో సుమోటాగా స్వీకరించి, సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నవారుసైతం తమ సమస్యల పరిష్కారం కోసం కమిషన్ను సంప్రదిస్తున్నారని, యువతీ, యువకులు లివింగ్ రిలేషన్ను ఎంచుకోవద్దని సూచించారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాభివృద్ధి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. -
ఆస్తమా వ్యాధి కాదు.. అలర్జీ మాత్రమే
కరీంనగర్టౌన్: ఆస్తమా వ్యాధి కాదని, కేవలం అలర్జీ మాత్రమేనని మెడికవర్ పల్మనాలజిస్టు డాక్టర్ రవీంద్రచారి అన్నారు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దగ్గు, ఆయాసం, అలర్జీ మాత్రమే ఆస్తమా లక్షణాలని, అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని పేర్కొన్నారు. ఆస్తమా వచ్చినవారు జీవితాంతం మందులు వాడాల్సిన పనిలేదని, త్వరగా గుర్తిస్తే నయం చేయడం సులువు అవుతుందని వివరించారు. ఆస్తమాకు మందులు వాడితే పిల్లలు పుట్టరనే అపోహలు ఉన్నాయని, వాటిని నమ్మవద్దన్నారు. ఆస్తమాను తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్ల కంటే ఇన్హేలర్ వాడడం మంచిదన్నారు. వ్యాక్సినేషన్తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని వెల్లడించారు. మెడికవర్ సెంటర్హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో క్రిటికల్ కేర్ నిపుణులు ఉపేందర్రెడ్డి, వైద్యులు నాగరాజు, లోకేశ్, సూపరింటెండెంట్ రవి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డుకిందకు దూసుకెళ్లిన లారీ
శంకరపట్నం(మానకొండూర్): మండలంలోని వంకాయగూడెంలో మంగళవారం వేకువజామున బొగ్గులారీ రోడ్డు కిందకు దూసుకుపోయింది. బొగ్గులోడ్ లారీ వైజాగ్ నుంచి నాగపూర్ వెళ్తుండగా వంకాయగూడెంలోకి చేరుకోగా డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో లారీ రోడ్డు కిందకు దూసుకుపోయిందని స్థానికులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్తో మీసేవ కేంద్రం దగ్ధంసిరిసిల్లటౌన్: షార్ట్ సర్క్యూట్తో యువకుడి ఉపాధి కేంద్రం కాలిపోయిన ఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు.. సిరిసిల్ల పట్టణంలోని యూనియన్ బ్యాంకు సమీపంలో రజనీకాంత్ చాలా రోజులుగా మీ సేవ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాప్ను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం దుకాణం తెరిచే సరికి కంప్యూటర్, ఫర్నీచర్, ప్రింటర్ తదితర వస్తువులు కాలిపోయినట్లు పేర్కొన్నాడు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నాడు. రైలు ఢీకొని వృద్ధురాలు మృతిఓదెల(పెద్దపల్లి): కాజిపేట్– బల్లార్షా సెక్షన్ల మధ్యలోని కొలనూర్ రైల్వేస్టేషన్ సమీపంలో లెవల్ క్రాసింగ్ గేట్ వద్ద ఇదే గ్రామానికి చెందిన కాంతాల లక్ష్మి(67) పట్టాలు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని మృతిచెందింది. రామగుండం జీఆర్పీఎఫ్ హెడ్కానిస్టేబుల్ పర్శరాములు కథనం ప్రకారం.. లక్ష్మి మంగళవారం తన పుట్టినిల్లు సుల్తానాబాద్ మండలం తొగర్రాయికి బయలుదేరింది. రైల్వేగేట్ పడి ఉండటంతో అవతలివైపునకు దాటుతుండగా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి కుమారుడు వేణుగోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ పేర్కొన్నారు. దొంగతనం కేసులో జైలు, జరిమానాపెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలో గతేడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన దొంగతనం (రెండు) కేసుల్లో నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం కోటేశ్వర్రావుకు 10నెలల జైలు, రూ.4వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి మంజుల తీర్పునిచ్చారు. ఎస్సై లక్ష్మణ్రావు తెలిపిన వివరాలు.. దొంగతనాలకు సంబంధించి పెద్దపల్లి పోలీస్స్టేషన్లో నమోదైన కేసుల్లో కోటేశ్వర్రావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా, నేరం రుజువు కావడంతో జూనియర్ సివిల్ జడ్జి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారని ఎస్సై వివరించారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ● 10 గ్రాముల బంగారం మాయం వేములవాడ: వేములవాడలోని మార్కండేయనగర్లో తాళం వేసిన ఇంట్లో మంగళవారం చోరీ జరిగింది. తాటికొండ సంతోష్ అనే ఫిజియోథెరపిస్ట్ కు టుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల క్రితం విహా రయాత్రకు వెళ్లారు. మంగళవారం తిరిగి వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఇంట్లో ఉన్న దాచిన రూ.25వేలకు పైగా నగదు, 10 గ్రాముల బంగారం వస్తువులు చో రీ అయింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘నల్లరంగు నోటు’ ముఠా అరెస్ట్
వెల్గటూర్(ధర్మపురి): నల్లరంగు నోటు పేరిట అమాయకుల నుంచి డబ్బు కాజేసే ముఠాను పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. మంగళవారం వెల్గటూర్ పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. చెగ్యాం గ్రామానికి చెందిన రామిల్ల విజయ్సాగర్ను నల్లరంగులో ఉన్న రూ.500 నోట్లను ఒరిజినల్గా మార్చే రసాయనం ఉందని కంది నరేశ్, పాలాజి శ్రీనివాస్, ఎంబడి మల్లేశ్, అల్తాపు రాజు, మగ్గిడి కిషన్ నమ్మించారు. 17 ఫిబ్రవరి 2025 రోజున మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి గ్రామానికి తీసుకెళ్లారు. ఒక ప్లాస్టిక్ గ్లాస్లో ఏదో రసాయనం పోసి నిందితుల వద్ద ఉన్న నలుపురంగు రూ.500 నోట్లను రసాయనంలో ముంచి ఒరిజినల్ నోట్లలా మారిపోయినట్లు నమ్మించారు. ఈ క్రమంలో రూ.లక్షకు రూ.ఐదు లక్షల నల్లరంగు రూ.500 నోట్లు ఇస్తామని, రసాయనంలో ముంచి సులభంగా లక్షలు సంపాదించవచ్చని విజయ్సాగర్ను మభ్యపెట్టారు. మార్చి 4న రూ.7 లక్షలు ఒరిజినల్ నోట్లు తీసుకున్నారు. కోటిలింగాలకు వస్తే రూ.35 లక్షల నల్లరంగు నోట్లు ఇస్తామని బొమ్మ కరెన్సీ నోట్ల కట్టలు చూపించారు. అదే సమయంలో రాజశేఖర్, కార్తీక్ అనే ఇద్దరు నిందితులు పోలీసులమని బెదిరించారు. నిందితులందరూ కలిసి రూ.7 లక్షల ఒరిజినల్ నోట్లతో పారిపోయారు. తర్వాత వారికి విజయ్సాగర్ ఫోన్ చేయగా, మరోసారి డబ్బు అడిగితే చంపేస్తామని బెదిరించారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణలో భాగంగా మంగళవారం నిందితులు వెల్గటూర్ మీదుగా కరీంనగర్ వెళ్తుండగా, స్తంభంపల్లి వద్ద తనిఖీల్లో శ్రీనివాస్, రాజు, మల్లేశ్, రాజశేఖర్, నరేశ్ పట్టుబడ్డారు. మరో ముగ్గురు నిందితులు కిషన్, నవీన్, కార్తీక్ పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి కారు, ఐదు సెల్ఫోన్లు, రూ.4వేల నగదు, ఆరు నలుపురంగు రూ.500 నోట్లు, 570 బొమ్మ కరెన్సీ నోట్లు, బైక్ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. గతంలోనూ నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని డీఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ రాంనర్సింహారెడ్డి, వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం ఎస్సైలు ఉమాసాగర్, ఉదయ్కుమార్, శ్రీధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ముటేషన్ మార్చాలని ఆందోళన
జగిత్యాల: ముగ్గురు సంతానంలో ఒకరికే ఇంటిని ముటేషన్ చేయడంతో మిగతా ఇద్దరు మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆందోళన చేపట్టారు. వివరాలు.. జగిత్యాల పట్టణానికి చెందిన అప్సర్ బేగం, మహ్మద్ఖాన్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అప్సర్బేగం మరణించిన అనంతరం మహ్మద్ఖాన్ ముగ్గురు కూతుళ్లలో ఒక కూతురుకు తన ఇంటిని ముటేషన్ చేశాడు. మిగతా ఇద్దరికి చేయకపోవడంతో మంగళవారం కూతుళ్లతో పాటు అల్లుళ్లు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఒకరికే ముటేషన్ ఎలా చేస్తారని, తమకు కూడా చేయాలని కూతుళ్లు, అల్లుళ్లు ఆందోళన చేపట్టడంతో పాటు, అందులో అల్లుడు జఫరోద్దీన్ కార్యాలయ గోడకు తల బాదుకోవడంతో తీవ్రగాయమైంది. వెంటనే 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈవిషయమై మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ, మహ్మద్ఖాన్ వారి కూతుళ్లలో ఒక కూతురుకే ఇల్లు ముటేషన్ చేశారని, తమ సమస్య కాదని, అది వారి కుటుంబ సమస్య అని పేర్కొన్నారు. -
అంజన్నా.. నీడ లేదన్నా..
మల్యాల(చొప్పదండి): ఎండల తీవ్రతకు కొండగట్టు అంజన్న సన్నిధిలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారిని దర్శించుకుని సేద తీరేందుకు నీడ కరువైంది. ఆలయ పరిసరాల్లో మాత్రమే చలువ పందిళ్లు వేశారు. వై జంక్షన్ నుంచి ఆలయ సమీపం వరకు సుమారు మూడు వందల మీటర్ల దూరం నడిచి వెళ్లాలి. ఆ ప్రాంతంలో చలువ పందిళ్లు లేక ఎండకు మహిళలు, చిన్నారులు, వృద్ధులకు తిప్పలు తప్పడంలేదు. కాలినడకన వచ్చే భక్తుల ఇబ్బంది కొండగట్టులో ఆలయ సమీపం వరకు వాహనాలు వెళ్తుండడంతో కాలినడక వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వాహనాలను ఆలయ సమీపంలోకి అనుమతించకూడదని, వికలాంగులు, వృద్ధులకు సంబంధించి వాహనాలను మాత్రమే అనుమతించాలని ఆలయ ఈవో ఆదేశాలు జారీ చేశారు. అక్కడక్కడ మాత్రమే పందిళ్లు వేసవి సెలవులు ప్రారంభం నుంచి రోజురోజుకు ఆంజనేయస్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ పెరుగుతోంది. కాగా, భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ సమీపంలో నీడ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయ ప్రధాన, వెనక ద్వారంతో పాటు ఆలయ కార్యాలయం ఎదుట, తాత్కాలిక అన్నదానం సత్రం వద్ద కొంతమేర చలువు పందిళ్లు ఉన్నా భక్తులకు సరిపోవడం లేదు. వై జంక్షన్ నుంచి.. అంజన్న దర్శనానికి వచ్చేవారి కోసం వై జంక్షన్ సమీపంలోని ఆలయ తోరణం నుంచి చలువు పందిళ్లు వేయాలని భక్తులు కోరుతున్నారు. కాలినకడన వెళ్తున్న భక్తులు ఎండ వేడిమి తట్టుకోలేక ఆలయ ద్వారం వరకు చెప్పులతో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఆలయ పరిసరాల్లో అక్కడక్కడే చలువ పందిళ్లు ఎండకు భక్తుల ఇబ్బంది వై జంక్షన్ నుంచి దారి పొడవునా చలువ పందిళ్లు వేయాలని భక్తుల వేడుకోలు -
పిడుగుపాటుకు పశువు మృతి
చిగురుమామిడి(హుస్నాబాద్): మండలంలోని సుందరగిరి గ్రామంలో సోమవారం రాత్రి రైతు జీల రాజు తెలిపిన వివరాలు.. రాజు తన వ్యవసాయబావి వద్ద పశువుల పాకలో సోమవారం రాత్రి పాడి పశువును కట్టేశాడు. పిడుగుపాటుకు రూ.50వేల విలువగల పశువు మృతి చెందింది. మండల పశువైద్యాధికారి శ్రీనివాస్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నష్టంపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని పేర్కొన్నారు. ఐదుగురిపై వరకట్నం కేసుజమ్మికుంట(హుజూరాబాద్): అదనపు కట్నం తేవాలని వేధింపులకు పాల్పడుతున్న ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. మండలంలోని పాపక్కపల్లి గ్రామానికి చెందిన రవళికి ఇల్లందకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఉమ్మనవేణి మహేశ్కు 2024లో కట్నకానుకలతో వివాహం జరిగింది. కొంతకాలంగా అదనపు కట్నంగా రూ.పది లక్షలు తీసుకరావాలని రవళిని భర్త, అత్తామామ ప్రమిల, మల్లయ్య, ఆడపడుచు, ఆమె భర్త మౌనిక, మల్లేశ్ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో..జమ్మికుంట(హుజూరాబాద్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చిట్యాల కిషోర్ ఏప్రిల్ 29న జమ్మికుంట పట్టణంలో పేయింటింగ్ పని మగించుకొని బైక్పై ఇంటికి వెళ్తుండగా, గాంధీచౌక్ సమీపంలో శంకరపట్నం మండలం చింతలపల్లికి చెందిన శనిగరపు చంటి అజాగ్రత్తగా బైక్తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కిషోర్కు తీవ్రగాయాలై చికిత్స పొందుతున్నాడు. బాధితుడి భార్య కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై..జమ్మికుంట(హుజూరాబాద్): రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ప్లాట్ కొనిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ రవి తెలిపారు. 2023లో పట్టణంలోని పొనగంటి కావ్య నుంచి మ్యనకొండ సాయికిరణ్ తక్కువ ధరకు ప్లాట్ కొనిస్తానని రూ.93లక్షలు తీసుకున్నాడు. ప్లాట్ చూపించకుండా మోసం చేస్తున్నాడు. డబ్బు అడిగితే అంతుచూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వరి పొలం దగ్ధంకాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని హుస్సేన్మియా వాగు సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు జంగ రాజయ్యకు చెందిన ఎకరంపావు బాస్మతి వరి, కొరకండ్ల శ్రీనివాస్రెడ్డికి చెందిన 30 గుంటలు బాస్మతి వరి కుప్ప మంటల్లో కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. వరి కొయ్యలు కాలపెట్టడంవల్లే నిప్పురవ్వలు గాలికి చెలరేగి మంటలు వ్యాపించినట్లు బాధిత రైతులు వాపోయారు. సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
నాలుగు ఇళ్లలో దొంగతనం
మెట్పల్లిరూరల్(కోరుట్ల): మండలంలోని రాంచంద్రంపేట, వెల్లుల్ల గ్రామాల్లోని నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాంచంద్రంపేటకు చెందిన పుల్లూరి గంగమణి, అల్లిక గణేశ్.. వెల్లుల్లకు చెందిన పెండెం నరేందర్, బొడ్డు లింగాధర్ తమ ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లారు. మంగళవారం వచ్చి చూసే సరికి ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. గంగమణి ఇంట్లో బీరువాలో దాచిన రూ.10వేల నగదు, గణేశ్ ఇంట్లో రూ.4వేల నగదు, నరేందర్ ఇంట్లో రూ.10వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి వేర్వేరుగా పోలీసులకు సమాచారమందించారు. సీఐ అనిల్కుమార్, ఎస్సై కిరణ్కుమార్ ఘటన స్థలాలను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్స్క్వాడ్లతో పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఈసారైనా సిరులు కురిపించేనా..?
వేములవాడ: ఎములాడ రాజన్నకు భక్తులు సమర్పించుకునే కురులతో ఏటా సిరులు కురిశాయి. ఈనేపథ్యంలో కరోనా కాలంలో కల్యాణకట్టను మూసివేశారు. తర్వాత 2023–25 రెండేళ్ల కోసం నిర్వహించిన తలనీలాల సేకరణ టెండర్ రూ. 19.01 కోట్లకు పెరిగింది. దీంతో రాజన్నకు భక్తు ల కురులు సిరులు కురిపించాయి. అయితే ఏడాదిపాటు సక్రమంగా చెల్లింపులు చేసిన సదరు కాంట్రాక్టర్ పది నెలలుగా సేకరణ నిలిపివేసి చే తులెత్తేశాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి నేరుగా తలనీలాలను సేకరించి భద్రపరిచారు. టెండర్ సమయం 11 ఏప్రిల్ 2025తో ముగిసింది. ఈలోగా సదరు కాంట్రాక్టర్ కొన్ని డబ్బులను స్వామివారికి చెల్లించి మిగతా డబ్బు జూన్ వరకు చెల్లిస్తానని అగ్రిమెంట్ చేశారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ఓ స్పెషల్ ఆర్డర్ కూడా రావడం గమనార్హం. నేడు ఏడోసారి.. ఈ– టెండర్కే మొగ్గు రాజన్నకు భక్తులు కల్యాణకట్టలో సమర్పించుకునే తలనీలాలను పోగు చేసుకునే హక్కు కోసం గత టెండర్ ఏప్రిల్ 11తో ముగియగా, అంతకుముందే నాలుగుసార్లు ప్రకటన చేసి టెండర్ నిర్వహించారు. కానీ ఎవరూ హాజరుకాలేదు. ఐదోసా రి రూ.13.67 కోట్లు, ఆరోసారి రూ. 14.01 కోట్లు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఆశించినంత డబ్బు రాకపోయేసరికి ఆలయ అధికారులు నిబంధనల మేరకు టెండర్ను రద్దు చేశారు. దీంతో బుధవారం ఏడోసారి తలనీలాల టెండర్ నిర్వహించనున్నారు. అయితే ఈసారి సీల్డ్ టెండర్, బహిరంగ వేలం పాటలను ఆలయ అధికారులు రద్దు చేసి కేవలం ఈ–టెండర్కు మాత్రమే అవకాశం కల్పించారు. ఈసారైనా భక్తుల కురులతో రాజన్నకు సిరులు కురుస్తాయా.. లేదా వేచి చూడాల్సిందే. తలనొప్పిగా తలనీలాల సేకరణ భక్తుల తలనీలాల సేకరణ ఆలయ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. టెండర్ నిర్వహించి కాంట్రాక్టర్కు అప్పగిస్తే ఈ పనులు కాంట్రాక్టరే తమ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని నిర్వహించేవారు. అయితే కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాక కల్యాణకట్ట నుంచి తలనీలాలను సేకరించి పోగు చేయడం ఇబ్బందిగా మారిందని అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక సిబ్బంది, సెక్యూరిటీతో తలనీలాలను సేకరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాజన్న భక్తుల తలనీలాల సేకరణకు నేడు ఏడోసారి టెండర్ ఈ–టెండర్తో సరి బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లు రద్దు -
ప్రకృతి సాగు.. ఆరోగ్యం బాగు
కరీంనగర్అర్బన్: సారవంతమైన నేలలు నిస్సారమవుతున్నాయి. విచ్చలవిడిగా ఎరువులు, మందుల వాడకంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ప్రజారోగ్యంతో పాటు సాగు నేలలను సారవంతంగా మార్చాలని కేంద్రం బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పేరుతో కార్యక్రమం అమలు చేస్తోంది. సహజ పద్ధతుల్లో విభిన్న పంటలు పండించేలా రైతులను ప్రొత్సహించనుంది. మూస పద్ధతిలో సాగుకు స్వస్తి పలికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను ఆర్జించే పంటలకు ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందు కోసం జిల్లాలో మండలానికో గ్రామం చొప్పున ఎంపిక చేసి నివేదిక పంపాలని ఆదేశించింది. ఈ క్రమంలో కరీంనగర్ అర్బన్ మినహా 15 మండలాలకు గానూ 15 గ్రామాలను ఎంపిక చేసి నివేదించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదముద్ర తదుపరి త్వరలోనే శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవనున్నాయి. ఏంటీ జాతీయ సహజ వ్యవసాయ మిషన్ ఇప్పటికే సాగులో సేంద్రియ పద్ధతులు పాటిస్తున్న రైతులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), వ్యవసాయదారుల ఉత్పత్తి సంఘాలు (ఎఫ్పీవోలు), స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీలు) వంటి వాటికి ఈ పథకంలో ప్రాధాన్యమిస్తారు. సురక్షితమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సహజ సాగు పద్ధతులను ప్రోత్సహిస్తుంది. 2025–26లో ఈ పథకం కోసం వెచ్చించే రూ.2,481 కోట్ల మూలధనంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,584 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.897 కోట్లు ఖర్చు చేయనున్నాయి. సేంద్రియ వ్యవసాయానికి అవసరమయ్యే సహజ ఉత్పత్తులను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అవసరాన్ని బట్టి జీవాధార వనరుల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రైతుల పొలాల్లో 2వేల వరకు నమూనా సహజ వ్యవసాయ క్షేత్రాలను నెలకొల్పుతారు. ఆసక్తి గల రైతులకు నిపుణులైన శిక్షకులు సహజ వ్యవసాయ పద్ధతులు, జీవ ఎరువుల తయారీ వంటి వాటిలో శిక్షణనిస్తారు. జిల్లాల్లో ఎంపిక చేసిన వ్యవసాయ క్లస్టర్లలో ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు, స్థానిక రైతుల మధ్య సహకారం పెంచేందుకు కృషి సఖులు, సాగు సహాయకుల (సీఆర్పీ)ను ఉపయోగించుకోనున్నారు. నేల సారవంతానికి కేంద్రం చర్యలు మండలానికో గ్రామం ఎంపికకు ఆదేశం ప్రయోజనాలిలా.. సేంద్రియ ఎరువులు, సంబంధ పద్ధతుల వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి, భూసారం మెరుగుపడుతుంది. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం వల్ల వాతావరణంలో కార్బన ఉద్గారాలు తగ్గుతాయి. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ధర ఉండటం వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. సేంద్రియ ఉత్పత్తులు మానవ ఆరోగ్యానికి సురక్షితమైనవి. పోషక విలువలను అధికంగా కలిగి ఉంటాయి. కాగా నేషనల్ మిషన్.. నేచురల్ ఫార్మింగ్ పథకం కోసం మండలానికో గ్రామం ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వం ఆమోదం అనంతరం కార్యక్రమం ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి వివరించారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.1.07 కోట్లు
మల్యాల: కొండగట్టు ఆంజన్న ఆలయంలోని 12 హుండీలకు భక్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, అసిస్టెంట్ కమిషనర్ రాజమౌళి ఆధ్వర్యంలో సోమవారం లెక్కించారు. 39 రోజులకు రూ.1,07,67,134 సమకూరాయి. 134 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మిశ్రమ వెండి, బంగారాన్ని తిరిగి బ్యాగుల్లో పెట్టి, సీల్ వేసి హుండీల్లోనే వేశారు. జువెల్లర్స్ సమక్షంలో తూకం వేయనున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, రఘు, ఆలయ పరిశీలకులు సునీల్కుమార్, చంద్రశేఖర్, హరిహరనాథ్, అశోక్, రాములు పాల్గొన్నారు. కొండగట్టులో భక్తుల రద్దీ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మధ్యాహ్నం ఎండలను సైతం లెక్కచేయకుండా స్వామి వారిని దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకున్నారు. -
ట్యాంకర్ కిందపడి సూపర్వైజర్ మృతి
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–5 ఓసీపీలో తాను నడుపుతున్న ట్యాంకర్ కిందపడి పీసీపటేల్ అనే ప్రైవేట్ ఓబీ కాంట్రాక్టు సూపర్వైజర్ మృతి చెందాడు. సోమవారం రెండో షిప్టులో వికాస్కుమార్(35) అనే సూపర్వైజర్ ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యాడు. హాలేజీ రోడ్డులో దుమ్ములేవకుండా వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు చల్లేందుకు వాహనం నడుపుకుంటూ వెళ్లాడు. ఈక్రమంలో ట్యాంకర్ అదుపు తప్పింది. అందులోంచి దూకి ప్రాణాలు కాపాడుకోవాలనే ప్రయత్నంలో అదుపుతప్పి అదేట్యాంకర్ వెనుక టైర్ కింద పడి వికాస్కుమార్ దుర్మరణం చెందాడు. డ్రైవర్ నడపాల్సిన ట్యాంకర్ను సూపర్వైజర్ ఎందుకు నడపాల్సి వచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాలంచెల్లిన వాహనంతో పనులు చేయించడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుడి కుటుంబానికి రూ.కోటిపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగేంత వరకు శవాన్ని కదలనివ్వం ప్రమాదంపై విచారణ జరిపి, మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు శవాన్ని ఇక్కడ నుంచి తీయనివ్వమని కార్మిక సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, మడ్డి ఎల్లాగౌడ్ డిమాండ్చేశారు. పీసీపటేల్ ప్రైవేట్ ఓబీ సంస్థ నిర్లక్ష్యంతోనే వికాస్కుమార్ మృతి చెందాడని ఆరోపించారు. రూ.కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ -
వక్ఫ్ ఆస్తులపై దురాక్రమణ తగదు
● వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి ● మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు జగిత్యాలటౌన్: వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ దురాక్రమణ తగదని, వక్ఫ్ అధికారాలను పరిమితం చేయడం సరికాదని, ఇది ముస్లిం మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ ప్రతినిధులు అన్నారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ఇండియా పర్సనల్ లాబోర్డు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు కేవలం షరియా మేధోమార్పిడి మాత్రమే కాకుండా రాజ్యాంగబద్ధంగా లభించిన మైనార్టీల హక్కులకు విరుద్ధంగా ఉందన్నారు. ర్యాలీలో మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ నాయకులు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లియాఖత్అలీ మొహిసిన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, మాజీ కౌన్సిలర్, ముస్లిం సదర్ మహ్మద్భారీ, నేహాల్ పాల్గొన్నారు. -
ఆశన్నపల్లెలో నకిలీ మందుల విక్రయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఆశన్నపల్లె గ్రామంలో సంజీవని న్యూట్రిషన్ కేర్ సెంటర్ నిర్వాహకుల మని నమ్మించి గ్రామస్తులకు సోమవారం నకిలీ మ ందులు విక్రయించారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. మాజీ సర్పంచ్ మంద వెంకన్న వైద్యాధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో నిందితులను అదుపులోకి తీసకున్నారు. వరంగల్కు చెందిన కొందరు వ్యక్తులు గ్రామానికి చేరుకుని గడువు తీరిన, నకిలీ మందులు విక్రయించారు. విక్రేతలకు గ్రామ పంచాయతీ కా ర్యదర్శి సహకరించినట్లు గ్రామస్తులు ఆరోపించా రు. ఈవిషయమై డిప్యూటీ డీఅండ్హెచ్వో సుధాక ర్, కూనారం ఆరోగ్య కేంద్రం డాక్టర్ భావన మాట్లాడుతూ, నకిలీ వైద్యం, నకిలీ మందులకు ప్రజలు మోసపోవద్దన్నారు. నకిలీ మందులు, వాహనాన్ని సీజ్చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్ట్
కరీంనగర్క్రైం: కరీంనగర్ పట్టణంలోని సిక్కువాడిలో గత నెల 18న జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. సిక్కువాడిలోని అమ్మ మెస్లో వంట పని చేస్తున్న అన్నమనేని మంజులను ఆమె భర్త అన్నమనేని కొమురయ్య హత్య చేయాలని ప్రయత్నించాడు. హోటల్లోని పొయ్యిపై ఉన్న వేడి కూరను మంజుల మీద పోయడంతో ఆమె ముఖం, ఛాతి, వీపు భాగాల్లో తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. హోటల్ యజమాని విజయ్ 108 అంబులెన్స్ ద్వారా మంజులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మంజుల ఫిర్యాదు మేరకు ఎస్సై రాజన్న కేసు దర్యాప్తు చేపట్టారు. కొమురయ్యకు మొదటి నుంచి తన భార్యపై అనుమానం ఉండేది. అంతేకాకుండా, మంజుల గతంలో మహిళా పోలీస్ స్టేషన్లో భర్తపై ఫిర్యాదు చేసింది. ఈ కారణంగా కొమురయ్య తన భార్యపై కక్ష పెంచుకుని ఆమెను చంపాలని ప్రయత్నించాడు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నీట్ ర్యాంక్ రాదని యువతి ఆత్మహత్యజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన జంగ పూజ (20) ఆదివారం నీట్ పరీక్ష రాసింది. ప్రభుత్వం విడుదల చేసిన కీ చూసుకుని ర్యాంక్ రాదనే మనస్తాపంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజ 2023లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి నీట్పరీక్ష కోసం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకుంది. పరీక్ష సరిగా రాయలేదని మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. పూజ తల్లి జంగ జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోతులా.. దొంగలా..?శంకరపట్నం(మానకొండూర్): మండలంలో వరుస చోరీలతో జనం జంకుతుండగా.. తాజాగా కిరాణ దుకాణంలో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని వ్యాపారి అనుమానం వ్యక్తం చేస్తుండగా.. పోలీసులు మాత్రం కోతులు దూరాయని పేర్కొంటున్నారు. వివరాలు.. మండలంలోని కేశవపట్నం ఎస్సీ, బీసీ కాలనీలో సత్యనారాయణ అనే వ్యక్తి రెండురోజుల క్రితం కిరాణ దుకాణానికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం తాళం తీసి చూడగా దుకాణంలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై సుమన్రెడ్డి సిబ్బందితో కలిసి పరిశీలించారు. కాగా, దుకాణం వెనక తలుపులకు గడియ పెట్టకపోవడంతో కోతులు దూరి వస్తువులను చిందరవందర చేశాయని, అలాగే బ్యాగ్లో ల్యాప్ట్యాప్ భద్రంగా ఉండడంతో కోతులు దూరినట్లు నిర్ధారణకు వచ్చారు. దుకాణంలో పడింది దొంగలు కాదని, కోతుల పడి వస్తువులు చిందవందర చేశాయని ట్రెయినీ ఎస్సై పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుశంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన గంట గణేశ్, నరాల కొమురయ్య సోమవారం రాత్రి వర్షంలో మోటార్సైకిల్పై వస్తుండగా కేశవపట్నంలో కిందపడి తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరిని 108వాహనంలో హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. -
సంక్షేమం.. అభివృద్ధి ధ్యేయంగా పాలన
ధర్మారం: సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణా అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. ధర్మారంలోని మోడల్ స్కూల్ నుంచి ఎండపల్లి క్రాస్రోడ్డు వరకు రూ.3.20 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీరోడ్డు పనులకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకువడ్డీలు చెల్లిస్తూనే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీనెల తొలివారంలోనే వేతనాలు చెల్లిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు రూ.20వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించిందని ఆమె స్పష్టం చేశారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం పెగడపల్లి: కాంగ్రెస్ పార్టీ పేదల అభివృద్ధికి పాటుపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. పెగడపల్లి మండలంలోని కీచులాటపల్లి కేంద్రంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో రూ.20కోట్ల తో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తున్నామని, ఇందిరమ్మ పథకం కింద నియోజకవర్గానికి 3500 ఇళ్లు, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తున్నామని వివరించారు. సన్నబియ్యం కొనలేని స్థితిలో ఉన్న పేదల కోసం దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ధర్మపురి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందని అన్నారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ధర్మపురి అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్అండ్బీ సీఈ సమత, డీపీఓ మదన్మోహన్, ఈఈ శ్రీనివాస్, సీఈఓ గౌతం రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శోభారాణి, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. సన్నబియ్యం పంపిణీ ప్రతిష్టాత్మకం నిరుపేదలు సన్నబియ్యంతో అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ప్రభుత్వం సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించిందని సీతక్క అన్నారు. నర్సింహునిపేటకు చెందిన దళితురాలు తాండ్ర లక్ష్మి ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేశారు. దొడ్డుబియ్యం తినేందుకు ఇబ్బందిపడ్డామని, సన్నబియ్యం ఇవ్వడంతో ఇంటిల్లిపాదిభోజనం చేస్తున్నామని లక్ష్మి తెలిపారు. సీతక్కకు ఘన స్వాగతం ధర్మపురి: పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు జిల్లాకు వచ్చిన మంత్రి సీతక్కకు మండలంలోని రాయపట్నం వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. శ్రీలక్ష్మినృసింహుడి ఫొ టో, ప్రసాదాలు అందించారు. ఎస్పీ అశోక్కుమార్, డీఎస్పీ రఘుచందర్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
ఉగ్రవాదమే ప్రధాన సమస్య
జగిత్యాలటౌన్: ఉగ్రవాదమే మనదేశం ముందున్న ప్రధాన సమస్య అని మాజీమంత్రి జీవన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్న పాకిస్తాన్ను అణిచివేసే చర్యలు చేపట్టాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునేందుకు ఇదే సరైన సమయమని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. పహెల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బతీయడంతోపాటు ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో దేశ ప్రజలంతా కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలువడం హర్షించదగిన పరిణామమన్నారు. మల్లికార్జన ఖర్గే, రాహుల్గాంధీతోపాటు ప్రతిపక్షాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం దేశ ఐక్యతకు నిదర్శనమన్నారు. దేశ జాతీయత, ఐక్యత, భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం పాకిస్తాన్పై చర్యలు చేపట్టాలన్నారు. మేధావులు, ప్రజాసంఘాలు విజ్ఞప్తి మేరకు ఆపరేషన్ కగార్ను నిలిపివేసి ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఆయుధాలు పట్టిన వారితో శాంతిచర్చలు జరపాలని కోరారు. ఆయన వెంట పీసీసీ కార్యదర్శి బండ శంకర్, నాయకులు గాజంగి నందయ్య, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, ధర రమేష్, జున్ను రాజేందర్, చందారాదాకిషన్, బీరం రాజేష్, గుండ మధు తదితరులు ఉన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలి మాజీ మంత్రి జీవన్రెడ్డి -
భూప్రకంపన.. గాలివాన
● భయం గుప్పిట ప్రజలుకరీంనగర్అర్బన్/కరీంనగర్రూరల్/గంగాధర/శంకరపట్నం/మానకొండూర్/గన్నేరువరం: ఓ వైపు భూ ప్రకంపన.. మరోవైపు గాలివాన తీవ్ర భయాందోళనకు గురి చేసింది. సోమవారం సాయంత్రం 6.49 నుంచి 6.55 గంటల వ్యవధిలో జిల్లావ్యాప్తంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై 3.9గా నమోదైంది. జిల్లాకేంద్రంలో రెండుసార్లు భూకంపం రాగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్, హుజూరాబాద్, గంగాధర, కొత్తపల్లి ప్రాంతాల్లో కొన్ని సెకన్లపాటు స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు తమ వారి యోగక్షేమాలను తెలుసుకునేందుకు ఫోన్లను ఆశ్రయించారు. కొద్దిసేపు భవనాలకు దూరంగా ఉన్న ప్రజలు మళ్లీ యథాస్థితిని కొనసాగించారు. కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్, చామనపల్లి తదితర గ్రామాల్లో రెండు పర్యాయాలు భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దుర్శేడ్లోని ఓ కిరాణ దుకాణంలో భూకంపం ధాటికి రిఫ్రిజిరేటర్తోపాటు భవనం కదిలిన దృశ్యం సీసీ కెమెరాలో నమోదైంది. గన్నేరువరం మండలంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అంతలోనే గాలివాన.. భూప్రకంపనలతో జనం భయభ్రాంతులకు గురికాగా, అంతలోనే గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. కరీంనగర్ నగరంలోని భగత్నగర్లో గల శ్రీచైతన్య కాలేజీ భవన రేకులు వెనుకాల ఇంటిపై పడగా పాక్షిక నష్టం వాటిల్లింది. గంగాధర మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసింది. శంకరపట్నం మండలం ఆముదాలపల్లిలో రాళ్లవాన కురిసి, తాటిచెట్టుపై పిడుగు పడింది. కేశవపట్నంలో విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిపడి, తీగలు తెగిపోవడంతో సరాఫరా నిలిచిపోయింది. తాడికల్–వంకాయగూడెం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై చెట్లు విరిగిపడగా, వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మానకొండూర్ మండలం కొండపల్కల, కెల్లెడ తదితర గ్రామాల్లో వడగండ్లు కురిశాయి. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మామిడి తోటల్లో కాయలు నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. గంగిపల్లి, కొండపల్కలలో విద్యుత్ స్తంభాలు విరిగిపడి అంధకారం నెలకొంది.జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా గాలిదుమారంతో పాటు వాన కురవడంతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు చినిగిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కరీంనగర్ -
మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదవరా?
కరీంనగర్అర్బన్: ‘ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదవాలని ప్రచారం చేస్తున్నారు సరే.. మరి మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించరా’.. అంటూ ఓ విద్యార్థిని ప్రజావాణిలో ప్రశ్నించింది. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో ఆసక్తికర సన్నివేశం నెలకొంది. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థి బామండ్ల అక్షర ప్రజావాణిలో వినతిపత్రం అందజేసింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, హాస్టల్స్ సరిగా ఉండాలన్నా, సరిపడా సిబ్బంది ఉండాలన్నా, విద్యార్థులకు మంచి చదువు రావాలన్నా, మంచి భోజనం అందాలన్నా ప్రభుత్వ అటెండర్ నుంచి కలెక్టర్ వరకు, వార్డు మెంబర్ నుంచి ఎంపీ వరకు వారి పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లో చదివించాలని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో చదివినవారికే ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులన్న నిబంధన తేవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ మరణాలు తగ్గాలన్న ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదు మీకే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నానని వివరించారు. -
తుదిమెరుగులు
రైల్వేస్టేషన్లకు● దాదాపు పూర్తయిన రామగుండం, కరీంనగర్ స్టేషన్లు ● ఆధునికీకరణలో ముందడుగు.. ఈనెల 15న ప్రారంభం? ● లిఫ్టులు, ఎస్కలేటర్లు, అదనపు ప్లాట్ఫారాల నిర్మాణం పూర్తి ● తుదిదశలో స్వాగత తోరణాలు, సుందరీకరణ పనులు ● కరీంనగర్ ఆర్వోబీ కోసం రైల్వేగేట్ పక్కకు తరలింపుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లాలో రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం రైల్వేస్టేషన్ల పనులు దాదాపు పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. అన్నీ కుదిరితే.. ఈనెల 15న ప్రారంభోత్సవం జరగవచ్చని రైల్వేవర్గాలు అంటున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ 27న కరీంనగర్, రామగుండం స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించాల్సింది. అయితే భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వాయిదాపడింది. ఈసారి అనుకుంటున్న 15వ తేదీన జరగుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పెద్దపల్లిలో పనులు ఇంకా కొనసాగుతున్నాయి. అటల్ మిషన్ ఫర్ రిజునవేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ (ఏఎంఆర్యూటీ) దీనినే అమృత్ పథకం కింద కేంద్రం రూ.73 కోట్లు ఈ మూడు స్టేషన్ల కోసం విడుదల చేసింది. తొలిదశలో కరీంనగర్ రూ.26.06, రామగుండం రూ.26.50 కోట్లు విడుదల కాగా.. రెండో దశలో పెద్దపల్లికి రూ.20 కోట్లు విడుదలయ్యాయి. కరీంనగర్, రామగుండంకు సరికొత్త రూపు రోజుకు ఒకటి, రెండు మినహా పెద్దగా రైళ్లు రాని కరీంనగర్ స్టేషన్ రూపురేఖలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. స్టేషన్లో రెండు దశాబ్దాలుగా ఉన్న ఒక్క ప్లాట్ఫారానికి అదనంగా 2, 3 ప్లాట్ఫారాలు నిర్మించారు. వాటిని వృద్ధులు, వికలాంగులు వినియోగించుకునేలా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు నిర్మించారు. స్వాగత తోరణాలు, స్టేషన్ ముఖద్వారం ఎలివేషన్, పార్కు పూర్తికావొచ్చాయి. ఇవి కాకుండా మరుగుదొడ్లు, ఫుట్ఓవర్బ్రిడ్జి, బుకింగ్ కార్యాలయం, ఆర్పీఎఫ్ పోస్టు, కేటీరింగ్ స్టాల్స్, వెయిటింగ్ రూములు, రిజర్వ్డ్ లాంజ్లతోపాటు కమర్షియల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ మేనేజర్, చీఫ్ గూడ్స్ సూపర్వైజర్, డిప్యూటీ స్టేషన్ మేనేజర్లకు ప్రత్యేక కార్యాలయాలు నిర్మించారు. రామగుండం రైల్వేస్టేషన్ ఆధునీకరణ, సుందరీకరణ పనులు కరీంనగర్ కంటే ముందే పూర్తయ్యాయి. దీని వీడియోలు ఇప్పటికే సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లి స్టేషన్ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. రెండో ఫేజ్లో నిధులు మంజూరవడంతో ఇక్కడ పనులు ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. ఆర్వోబీ కోసం.. రైల్వేగేటు తొలగింపు రైల్వేస్టేషన్ నిర్మాణ పనులతోపాటు కరీంనగర్– చొప్పదండి మార్గంలో ఆర్వోబీ పనులు కూడా ఊపందుకున్నాయి. ట్రాక్కు రెండువైపులా నిర్మాణాలు రైల్వేగేట్ వరకు వచ్చాయి. ఈ నేపథ్యంలో రైల్వేగేటు తొలగించి అక్కడ పిల్లర్లు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ప్రస్తుతమున్న రైల్వేగేట్ను తొలగించి పక్కకు తరలించి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. వాస్తవానికి ఇప్పటికే పూర్తి కావాల్సిన ఆర్వోబీ నిర్మాణం ఇంకా కొనసాగుతూ.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తోంది. ఉదయం ఉద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండలు ముదరడంతో బాధలు రెట్టింపయ్యాయి. అంబులెన్స్లో కరీంనగర్కు వచ్చే రోగుల పరిస్థితి చెప్పనలవి కాకుండా ఉంది. -
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండి
● కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్అర్బన్: మౌలిక సదుపాయాల పనులకు సంబంధించి గ్రౌండింగ్ వర్క్ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రహరీ, టాయిలెట్స్, కిచెన్ షెడ్ వంటి మౌలిక అవసరాల నిర్మాణానికి పనులు మంజూరు చేశామని తెలిపారు. ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు ఇప్పటికీ గ్రౌండింగ్ వర్క్ పూర్తి కాలేదని, సంబంధిత శాఖల హెచ్వోడీలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవతో ఎంపీడీవో, ఆర్డీవోల సమన్వయంతో ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి విచారణ అధికారులు పకడ్బందీగా విచారించాలన్నారు. అనర్హులకు మంజూరైనట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, పంచాయతీరాజ్, గ్రామీణ నీటిపారుదల, మిషన్ భగీరథ అధికారులు నీటి సరఫరా వ్యవస్థ పై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పేయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, డీటీడీవో పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలను విజయవంతం చేయాలి● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్టౌన్: గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 30, 31న అమెరికా వాషింగ్టన్లో జరిగే మహాసభలలో మున్నూరుకాపులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం అపెక్స్ కమిటీ గౌరవ చైర్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ అన్నారు. సోమవారం మహాసభల పోస్టర్ను జ్యోతినగర్లో ఆవిష్కరించారు. మున్నూరుకాపులందరూ రాజకీయాలకతీతంగా, ఐక్యంగా ముందుకు సాగలన్నారు. గ్లోబల్ మున్నూరుకాపు అసోసియేషన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య, జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆర్వీ మహేందర్, నాయకులు ప్రకాశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.నేల ఆరోగ్యాన్ని కాపాడాలి జమ్మికుంట(హుజూరాబాద్): పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకంతో నేల ఆరోగ్యాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని మడిపల్లి రైతు వేదికలో జయశంకర్ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు కార్యక్రమంలో డీఏవో, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త వెంకటేశ్వర్రావు, డీహెచ్ఎస్వో శ్రీనివాస్రావు, శాస్త్రవేత్త నర్సయ్య మాట్లాడారు. పంటలో అధిక మోతాదులో యూరియా వాడకం వల్ల చీడపీడలు పెరిగి సాగు వ్యయం పెరుగుతుందని, వ్యవసాయ అధికారుల సూచన మేరకే వాడుకోవాలన్నారు. భావితరాలకు సారవంతమైన నేలను అందించాలన్నారు. విత్తనాలు, పురుగుమందుల కొనుగోలు సమయంలో రసీదులను పంటకాలం ముగిసేవరకు భద్రపరుచుకోవాలని, పంటనష్టం జరిగితే కష్టకాలంలో పని చేస్తాయని పేర్కొన్నారు. హుజూరాబాద్ ఏడీఏ సునీత, ఏవో ఖాదర్హుస్సేన్, ఏఈవోలు రామ్ప్రసాద్, మహేందర్, అచ్యూత్, అర్చన తదితరులు పాల్గొన్నారు. నియమాలు పాటించాలిజమ్మికుంట(హుజూరాబాద్): విద్యుత్ ప్రమాదాల నివారణకు వినియోగదారులు, సిబ్బంది నియమాలు పాటించాలని ఎస్ఈ రమేశ్బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ భద్రత పోస్టర్లు ఆవిష్కరించారు. డివిజనల్ ఇంజినీరు (ఆపరేషన్స్) ఎస్ లక్ష్మారెడ్డి, టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ ఉపేందర్, ఏడీఈ రాజేందర్, టౌన్ ఏఈ ఆనంద్, రూరల్ ఏఈ రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
డంప్యార్డ్కు చెత్త తగ్గించాలి
● నగరపాలకసంస్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కరీంనగర్కార్పొరేషన్: ఇంట్లో ఉత్పత్తి అయిన చెత్తను వేరు చేసి డిస్పోజ్ చేయడం ద్వారా డంప్యార్డ్కు చెత్తను తగ్గించాలని నగరపాలక కమిషనర్ చాహత్ బాజ్పేయ్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా సోమవారం నగరంలోని భగత్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోని పలు అపార్ట్మెంట్లలో తడి, పొడి చెత్త వేరు చేయడం, డిస్పోజ్ చేయడంపై అవగాహన కల్పించారు. తడి చెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేస్తున్నామని, పొడి చెత్తను డీఆర్సీ సెంటర్కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. డంప్యార్డ్ పరిసర ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వేస్ట్ ఎనర్జీ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. కొత్తగా ఉత్పత్తి అయ్యే చెత్త భారిగా డంపు యార్డుకు తరలివెళ్లడం ద్వారా బయోమైనింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుందన్నారు. స్థలం దొరకగానే డంప్యార్డ్ తరలింపు ఇతర ప్రాంతంలో స్థలం దొరకగానే డంప్యార్డ్ను ఆటోనగర్ నుంచి తరలిస్తామని కమిషనర్ చాహత్ బాజ్పేయ్ అన్నారు. సోమవారం డంప్యార్డ్ బాధితులతో తన చాంబర్లో సమావేశమయ్యారు. డంప్యార్డ్ కోసం హుజురాబాద్ ప్రాంతంలో స్థలం కేటాయింపునకు సంబంధించిన ప్రతిపాదన ఉందన్నారు. రోజూ అధికంగా వస్తున్న చెత్త కారణంగా బయోమైనింగ్లో జాప్యం జరుగుతుందున్నారు. -
7 నుంచి క్రికెట్ శిక్షణ శిబిరాలు
● కరీంనగర్, గోదావరిఖని, వేములవాడ, జగిత్యాలలో నిర్వహణకు కేడీసీఏ రెడీ ● ఈ నెల 6 లోపు దరఖాస్తు చేసుకున్నవారికే అవకాశం కరీంనగర్స్పోర్ట్స్: క్రికెట్లో ఓనమాలు నేర్పించేందుకు హెచ్సీఏ, కేడీసీఏ శ్రీకారం చుట్టాయి. గతంలో మూడు జిల్లాల్లోనే శిబిరాలు నిర్వహించగా, ఈ ఏడాది నుంచి జగిత్యాలలో శిబిరాన్ని ప్రారంభించనున్నారు. నిష్ణాతులైన కోచ్ల సమక్షంలో శిక్షణ ఇవ్వనున్నట్లు క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వి.ఆగంరావు, ఎన్.మురళీధర్రావు తెలిపారు. ఈనెల 7 నుంచి జూన్ 6 వరకు శిబిరాలు నిర్వహిస్తారు. ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని క్రికెట్ సంఘం బాధ్యులు తెలిపారు. 13 నుంచి 23 ఏళ్ల వారికి.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అనుబంధమైన కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిబిరాలు నిర్వహిస్తారు. 13 నుంచి 23 ఏళ్ల బాలబాలికలు, పురుషులకు, మహిళలకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. దరఖాస్తు ఇలా.. క్రీడాకారులు ఫొటో, ఆధార్కార్డుతో సంబంధిత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. కరీంనగర్ వావిలాలపల్లిలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. శిబిరానికి ఎంపికై న క్రీడాకారులు వైట్ యూనిఫాంతో రావాలి. మిగిలిన కిట్ శిబిరంలో ఇస్తారు. ఒక్కో శిబిరంలో 100 నుంచి 120 మంది క్రీడాకారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా దరఖాస్తు చేసుకునే వారికి అవకాశం దక్కుతుంది. రాణించినవారు హెచ్సీఏ టోర్నమెంట్లో.. శిక్షణ శిబిరాల్లో రాణించిన క్రీడాకారులకు మంచి అవకాశాలు దక్కనున్నాయి. శిబిరం అనంతరం జూన్లో ఉమ్మడి జిల్లా క్రికెట్ టీంలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అండర్– 14,16,19,23 విభాగాల్లో జట్లను ఎంపిక చేసి హెచ్సీఏ (హైదరాబాద్ క్రికెట్ సంఘం) ఆధ్వర్యంలో జరుగనున్న టోర్నమెంట్లకు పై జట్లను పంపించనున్నారు. కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ, పీజీ కళాశాల ఎదురుగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ మైదానం, సెయింట్ అల్ఫోన్స్ పాఠశాల మైదానంలో శిబిరాలు జరుగుతాయి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 86887 68775 (శ్రావణ్కుమార్) పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీలోని జీఎం గ్రౌండ్లో శిక్షణ శిబిరం జరగనుంది. సంప్రదించాల్సిన ఫోన్నంబర్ 98663 51620 (కిరణ్కుమార్) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని 2వ బైపాస్లో గల స్వర్గీయ నర్సింగరావు మైదానంలో శిబిరం జరుగనుంది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 91772 59935 (రాజు) జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మినీస్టేడియం లేదా ఎస్కేఎన్ఆర్ కళాశాల మైదానంలో తొలిసారిగా శిక్షణ శిబిరం జరుగనుంది. సంప్రదించాల్సిన ఫోన్నంబర్ 99480 64712 (జలపతి) క్రికెటర్లుగా ఎదిగేందుకు అవకాశం క్రికెట్ అంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. చాలా మంది పిల్లలు మైదానాలు, గల్లీలో క్రికెట్ ఆడుతంటారు. వీరందరు క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే శిబిరాల్లో పాల్గొనాలి. అత్యాధునిక పద్ధతుల్లో కోచ్లు ట్రైనింగ్ ఇస్తారు. క్రికెటర్లుగా ఎదగాలనుకునే చిన్నారులు శిబిరాల్లో శిక్షణ తీసుకుంటే చాలా బాగుంటుంది. – వి.ఆగంరావు, క్రికెట్ సంఘం జిల్లా అధ్యక్షుడు -
చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
కథలాపూర్(వేములవాడ): మండలంలోని ఊట్పెల్లి గ్రామశివారులో శనివారం రాత్రి పిచ్చిమొక్కలకు నిప్పంటుకొని మంటలు చెలరేగడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. పిచ్చిమొక్కలకు అంటుకున్న మంటలు వ్యాపించి గ్రామశివారులోని రైస్మిల్, పెట్రోల్ బంక్ సమీపం వరకు చేరుకున్నాయి. గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేదు. ఎస్సై నవీన్కుమార్ తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని ప్రజలను అప్రమత్తం చేశారు. మెట్పల్లి నుంచి ఫైరింజన్ వచ్చి మంటలార్పేసింది. అగ్నిప్రమాదంలో రైస్మిల్, పెట్రోల్ బంక్కు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
అత్తపై కోడలు దాడి
జగిత్యాలక్రైం: అత్తపై కోడలు కత్తితో దాడిచేయగా, కేకలు వేయడంతో స్థానికులు కాపాడి సఖి కేంద్ర నిర్వాహకులకు అప్పగించారు. స్థానికుల వివరాలు.. జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతానికి చెందిన పెండ్యాల భాగ్య సంతానం లేకపోవడంతో వినయ్ అనే వ్యక్తిని పెంచుకుంది. అతడికి అఖిల అనే యువతితో వివాహం జరిపించింది. కాగా, కొన్నేళ్లుగా అత్తను అఖిల శారీరకంగా, మానసికంగా వేధిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఉన్న బోరు వేయాలని అఖిల అత్తకు సూచించగా, ఆమె మరిచిపోయింది. దీంతో ఆగ్రహించిన కోడలు ఇంట్లోని కత్తితో అత్తపై దాడిచేయగా వీపు, ముఖంపై స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు జిల్లా సంక్షేమశాఖాధికారి నరేశ్కు సమాచారం అందించగా, వెంటనే సఖి నిర్వాహకులు లావణ్య, సామాజిక కార్యకర్త శారద చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఎస్సై గీత వృద్ధురాలి కోడలు, కొడుకును పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సఖి కేంద్ర నిర్వాహకులు వృద్ధురాలిని ఆమె ఇంటికి తరలించారు. -
వేసవి దుక్కి.. పంటకు పుష్టి
● పంట కొయ్యలు కాల్చేస్తే ప్రమాదమే ● తొలకరికి ముందు లోతు దుక్కులు మేలు ● ఏటవాలుగా దున్నితే మరింత శ్రేయస్కరంకరీంనగర్ అర్బన్: శాస్త్రవేత్తల మాటలు కాకుండా సొంత నిర్ణయాలే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. పంట కొయ్యలు కాల్చకుండా కలియదున్నడం, వేసవిలో లోతు దుక్కులతో ఎంతో ప్రయోజనం. పురుగులు, తెగుళ్లు, కలుపును నివారించుకోవడంతో పాటు భూమిపొరల్లో వర్షపునీరు ఇంకి పంటకు ఉపయోగపడుతుంది. వేసవిలో లోతు దుక్కుల ఉపయోగాల గూర్చి కరీంనగర్ వ్యవసాయ పరిధశోధనస్థానం హెడ్ డీన్ డా.జి.మంజులత వివరించారు. వేసవి దుక్కులకు ఏప్రిల్, మే నెలలు అనుకూలం, వేసవి దుక్కులను అడ్డం, పొడువు సాళ్లతో కాకుండా ఏటవాలుగా దున్నడం శ్రేయస్కరం. ఏటవాలు దుక్కితో ప్రయోజనాలనేకం ఏటవాలుగా దున్నడం వల్ల భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతుగా దున్నినపుడు భూమిలోపలి పొరల్లో ఉన్న క్రిమికీటకాలు సూర్యకిరణాలతో చనిపోతాయి. వేసవి దుక్కుల్లో తొలకరి వర్షాలు కురిసినపడు విత్తనాలు వేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. తొలకరి వర్షాలకు ముందే రెండుసార్లు దున్నితే గట్టిగా ఉన్న భూమి గుల్లబారడంతో పాటు కలుపు నివారించుకోవచ్చు. వర్షం నీరు భూమిలోకి చొచ్చుకొనిపోతోంది, భూమి పొరల్లోకి గాలి చేరుతుంది. సూక్ష్మజీవుల సాంద్రత, సేంద్రియ కర్బనం బాగా పెరుగుతుంది. దీంతో భూమిలోని పోషకాలను మొక్క గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది. కలుపు, పురుగు మందుల అవశేషాలకు మొక్కలు తీసుకోవు. భూమి వర్షపునీటిని తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజని వర్షపునీటితో కలిసి భూమిలోకి చేరడం వల్ల భూసారం పెరుగుతుంది. పురుగుమందులు, తెగుళ్ల మందులకయ్యే పెట్టుబడిని తగ్గించుకోవచ్చు. హానిచేసే బాక్టీరియాను నాశనం చేయొచ్చు. వరికొయ్యలు కలియదున్నాలి వరి కోతలు పూర్తయ్యాక కొయ్యలను తగులబెడుతుంటారు. దీనివల్ల భూమి సారం కోల్పోతుంది. అలా కాకుండా వరి కొయ్యలను నీటిలో నాన్చి దున్నడం లేదా బీడులోనే కలియదున్నితే నేలలో పోషక విలువలు పెరుగుతాయి. పత్తి రైతులు కాల్చివేయకుండా కలియదున్నాలని శాస్త్రవేత్తలు స్పష్టం సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణతో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. -
విషపురుగు కాటుకు వ్యక్తి మృతి
సారంగాపూర్(జగిత్యాల): రోళ్ళవాగు ప్రాజెక్టు వద్ద ఎండ్రికాయలు పడుతుండగా పాముకాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బీర్పూర్ ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నందగావ్ గ్రామానికి చెందిన గణపతిదేవ్రావు టార్పే (34) తన స్నేహితుడు సూర్యభాను మారుతితో కలిసి శనివారం ఎండ్రికాయలు పట్టేందుకు బీర్పూర్ శివారులోని రోళ్ళవాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఎండ్రికాయలు పడుతున్న క్రమంలో చీకటిగా ఉండడంతో విషపురుగు కాటువేసింది. వెంటనే సూర్యభాను మారుతి 100కు డయల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గణపతిదేవ్రావు టార్పేను 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యహ్నం మృతిచెందాడు. మృతుడి భార్య పుష్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా నిర్మల్ జిల్లా సరిహద్దుల్లోని మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారు జీవనోపాధి కోసం ఇక్కడి వచ్చి ఎండ్రికాయలు పట్టుకుని వెళ్తుంటారని పోలీసులు తెలిపారు. కోతుల దాడిలో మహిళకు గాయాలుహుజూరాబాద్: కోతుల దాడిలో ఆదివారం మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాలు.. పట్టణంలోని విద్యానగర్ మూడో రోడ్లో కోతుల మంద భారీ సంఖ్యలో తిరుగుతూ పుల్లూరి త్రివేణిని తీవ్రంగా గాయపరిచాయి. కోతులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మున్సిపల్ అధికారులు తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. శివలింగం, నంది విగ్రహం లభ్యం చొప్పదండి: మండలంలోని దేశాయిపేట గ్రామ చెరువు వద్ద ఆదివారం నంది, శివలింగం విగ్రహాలు లభ్యమయ్యాయి. విషయం తెలిసిన గ్రామస్తులు విగ్రహాల వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేస్తున్నారు. విగ్రహాలు లభ్యమైన చోటనే శివాలయం నిర్మించాలని కొందరు అభిప్రాయం వ్యక్తం చేయగా పూజారులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని మరి కొందరు అన్నారు. ఆలయ నిర్మాణానికి వేరే స్థలం తీసుకొని విగ్రహాలు ప్రతిష్ఠించాలని గ్రామంలోని నాయకులు పేర్కొన్నారు. డబ్బులతో ఉడాయించిన వ్యాపారులుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారులుగా స్థిరపడ్డ రాజస్థాన్కు చెందిన ఇద్దరు అందినకాడికి అప్పు చేసి రూ.50లక్షలతో రాత్రికిరాత్రే ఉడాయించారు. విషయం తెలుసుకున్న రుణదాతలు లబోదిబోమంటున్నారు. బాధితులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. వివరాలు.. రాజ స్థాన్లోని నాగుల్కు చెందిన గుమాన్ రాచర్లగొల్లపల్లిలో బట్టల వ్యాపారిగా స్థిరపడ్డాడు. మ రొకరితో కలిసి వ్యాపారం కోసమని స్థానికుల నుంచి రూ.లక్షల్లో అప్పు చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా పలు చిట్టీలను ఎత్తుకున్నారు. ఇద్దరు కలిసి సుమారు రూ.50లక్షలకు పైగా అ ప్పులు చేసి గుట్టుచప్పుడు ఉడాయించారు. మూడు రోజుల క్రితమే వారు గ్రామాన్ని విడిచి పరారీ కాగా.. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. దీంతో అప్పులు ఇచ్చిన వారు తల పట్టుకుంటున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పరారీ అయిన వ్యాపారుల కోసం గాలిస్తున్నారు. అప్పులిచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. -
ఏటీఎంలో నగదు కాజేసేందుకు కుట్ర
కరీంనగర్క్రైం: ఏటీఎంలో నగదు కాజేసేందుకు గుర్తు తెలి యని వ్యక్తులు కుట్రపన్నారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు, ఏటీఎం నిర్వాహకుల వివరాలు.. నగరంలోని క్రిస్టియ న్కాలనీలోని ఎస్బీఐ ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం ప్రవేశించి, ఏటీఎం మిషన్ తలుపుతెరిచి, డబ్బు కాజేసేందుకు పరికరాన్ని అమర్చారు. ఉన్నతాధికారులు సీ పీ ఫుటేజీ ద్వారా గమనించి, ఏటీఎం చానల్ ఎగ్జిక్యూటర్ రజినీకాంత్కు సమాచారమిచ్చారు. ఆయన పోలీసుల కు ఫి ర్యాదు చేయగా, సీఐ సృజన్రెడ్డి ఏటీఎంను పరిశీలించారు. నగదు డ్రా చేసినవారి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.