breaking news
Karimnagar
-
అప్పు చెల్లించడం లేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హుజూరాబాద్: అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో ఇచ్చిన వ్యక్తి మనోవేదనకు గురై ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. హుజూరాబాద్ పట్టణానికి చెందిన పంజాల కృష్ణ, హోటల్ వ్యాపారి వనం హరీశ్కు రూ.25లక్షలు అప్పు ఇచ్చాడు. అప్పు తీసుకుని ఏడాదైనా హరీశ్ చెల్లించలేదు. తాను వేరేవారి వద్ద అప్పు తెచ్చానని, ఇబ్బందిపెడుతున్నారని, అప్పు చెల్లించాలని కృష్ణ హోటల్ వద్దకు వెళ్లి హరీశ్ను కోరగా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కృష్ణ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ వద్ద గడ్డిమందు తాగాడు. స్థానికులు గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం జమ్మికుంటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని బంధువులు తెలిపారు. హరీశ్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఆత్మహత్యాయత్నానికి ముందు కృష్ణ సెల్ఫీ వీడియో సైతం తీశారు. -
కాశీ సమీపంలో చల్గల్ వాసి ఆత్మహత్య
జగిత్యాలక్రైం: నాలుగు రోజుల క్రితం కనిపించకుండాపోయిన జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ కండక్టర్ మల్యాల మోహన్ (65) ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం కాశీ సమీపంలోని మీర్జాపూర్ బ్రిడ్జి వద్ద పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలో కనిపించాడని, స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా అప్పటికే మృతిచెందినట్లు అక్కడి పోలీసులు.. జగిత్యాల రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. చల్గల్కు చెందిన మోహన్ గతనెల 31న ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. కాశీ సమీపంలోని మీర్జాపూర్ వద్ద క్రిమిసంహారక మందుతాగి అపస్మారక స్థితిలో ఉండగా.. అక్కడి స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చేదుకు ఉత్తర్ప్రదేశ్కు బయల్దేరి వెళ్లారు. మోహన్కు భార్య రాధ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉరేసుకుని వ్యాపారి..మల్యాల: వ్యాపారంలో నష్టం రావడంతో మల్యాలకు చెందిన ముకుందు ఆదిరెడ్డి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నరేశ్కుమార్ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఆదిరెడ్డి(59) లారీ బిజినెస్ చేస్తున్నాడు. వ్యాపారంలో నష్టం రావడంతో కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. ఆదివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. సోమవారం వేకువజామున భార్య నిద్ర లేచి చూసి, జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి ఎలిగేడు(పెద్దపల్లి): ముప్పిరితోట గ్రామానికి చెందిన గీతకార్మికుడు కోట లింగయ్య(55) తాటిచెట్టు పైనుంచిపడి మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. లింగయ్య రోజూమాదిరిగానే సోమవారం ఉదయం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. సమీపంలోని ఓ రైతు చూసి వెంటనే కుటుంబసభ్యులకు ఫోన్ద్వారా సమాచారం అందించారు. వారువచ్చి కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాల శివారు లింగంపేట శివాజీ చౌరస్తా వద్ద గర్వందుల శ్రీహరి (55) ద్విచక్రవాహనం అదుపుతప్పి కంకర కుప్పకు ఢీకొని మృతిచెందారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంకు చెందిన శ్రీహరి ఆదివారం తన భార్య రమతో కలిసి జగిత్యాలలో ఓ వివాహానికి హాజరయ్యారు. రమను జగిత్యాలలోనే ఉంచి రాత్రి 11 గంటల సమయంలో అంతర్గాం బయల్దేరాడు. శివాజీ చౌరస్తా వద్ద రోడ్డు పక్కనున్న కంకరకుప్పను ఢీకొని తలకు బలమైన గాయాలవడంతో మృతిచెందాడు. రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై కుమారస్వామి తెలిపారు. -
ఆస్పత్రుల్లో మందుల కొరత లేదు
కరీంనగర్టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎలాంటి మందుల కొరత లేదని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్నాయక్ అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయా.. లేదా అనే అంశంపై పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్, డీఎంహెచ్వో, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి పరిసరాల శుభ్రత తదితర విషయాలను తెలియజేయాలన్నారు. సిజేరియన్ ప్రసవాలు తగ్గించి, సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. నాన్ కమ్యూనల్ డిసీజెస్ (ఎన్సీడీ)కు సంబంధించి, సీజనల్ వ్యాధుల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అనంతరం నగరంలోని అపోలోరీచ్, పలు ప్రైవేటు ఆస్పత్రులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ, ఆర్ఎంవో డాక్టర్ నవీన, డీటీసీవో డాక్టర్ రవీందర్రెడ్డి, స్వామి, రాంనాథమ్, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ -
భక్తజనసంద్రంగా సోమన్నగుట్ట
మల్లాపూర్: మల్లాపూర్లోని శ్రీకనకసోమేశ్వర స్వామివారి కొండ శ్రావణ రెండో సోమవారం సందర్భంగా భక్తులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామివారికి ప్రీతిపాత్రమైన వరదపాశంను వండి నైవేద్యంగా సమర్పించారు. ఆలయ కమిటీ చైర్మన్ సంగ గంగరాజం, వైస్ చైర్మన్ ఇల్లెందుల తుక్కారాం, ఆలయ ప్రధానార్చకులు బల్యపెల్లి ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. -
కళారంగానికి మల్లయ్య సేవలు చిరస్మరణీయం
సిరిసిల్లటౌన్: కళారంగానికి మల్లయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. సిరిసిల్ల టౌన్క్లబ్లో సోమవారం నిర్వహించిన నాగుల మల్ల్లయ్య పురస్కార అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై మాట్లాడారు. ఈ ప్రాంతం నుంచి నాగుల మల్లయ్య బీసీల కోసం పోరాడిన తొలితరం నాయకుడు అని కొనియాడారు. ఆయన పోరాట పటిమ బలహీనవర్గాలకు ఆదర్శనీయమన్నారు. గత 38 ఏళ్లుగా మల్లయ్య పేరిట వివిధ కళారంగాలకు వారికి పురస్కారాలు అందజేయడంపై కుటుంబ సభ్యులను అభినందించారు. చేనేతలో ఖండాంతరాల్లో ఖ్యాతి సంపాదిస్తున్న సిరిసిల్ల చేనేత శిల్పి వెల్ది హరిప్రసాద్ను శాలువాతో సన్మానించి అవార్డు ప్రదానం చేశారు. అవార్డు కమిటీ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కన్వీనర్లు ఎండీ సలీం, నాగుల సంతోష్గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు. ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● వెల్ది హరిప్రసాద్కు నాగుల మల్లయ్య అవార్డు ప్రదానం -
బర్త్ సర్టిఫికెట్ .. కష్టాలు అనేకం
జాతరో.. జాతర● బర్త్ సర్టిఫికెట్ కోసం తప్పని తిప్పలు ● దండుకుంటున్న దళారులు ● అయినా పనికావడం లేదంటున్న బాధితులు వేములవాడ: శ్రావణ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్నను 50 వేలకు పైగా భక్తులు దర్శించుకున్నారు. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్మగుండంలో స్నానాలు, కల్యాణకట్టలో తలనీలాలు, నిలువెత్తు బెల్లం పంపిణీ, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.45లక్షల ఆదాయం సమకూరింది. ‘కొత్తపల్లికి చెందిన మల్లయ్య కూతురు లండన్లో విద్యనభ్యసిస్తోంది. ఆధార్లో ఒకలా, సర్టిఫికెట్లలో మరోలా పుట్టిన తేదీలు ఉండడం సమస్యగా మారింది. జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని కూతురు కోరడంతో రెవెన్యూ కార్యాలయంలో ఓ దళారీని ఆశ్రయించి రూ.5వేలు అప్పగించాడు. వారం రోజుల్లో ఇప్పిస్తానని చెప్పగా ఆరు నెలలవుతోంది’. ‘కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధంపూర్కు చెందిన స్వప్న 20ఏళ్లుగా బీడీలు చుడుతూ జీవనోపాధి పొందుతోంది. ఈపీఎ్ఫ్, ఆధార్ కార్డులో వేర్వేరుగా పుట్టిన తేదీలు నమోదయ్యాయి. ఆధార్లో ఉన్నట్లే ఈపీఎఫ్లో ఉండాలనేది నిబంధన. ఇందుకు జనన ధ్రువీకరణ పత్రం తీసుకోవడం సమస్యగా మారింది. పుట్టింటి చిరునామాతో జనన ధ్రువీకరణ పత్రం జారీ అవుతోంది. దీంతో ఈపీఎఫ్లో ఉన్న చిరునామాకు సరిపోలడం లేదు’.కరీంనగర్ అర్బన్: బర్త్ సర్టిఫికెట్ తలనొప్పిగా మారింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కొరవడటంతో ఇబ్బందులు తప్పడం లేదు. 50సంవత్సరాల క్రితం జన్మించిన వారికి పుట్టిన తేదీ తెలియదు. అప్పట్లో ఎవరైనా ఇంట్లో ఏదో ఒక చోట తేదీ, సమయం రాసి పెట్టి ఉంటే సరి. లేదంటే నెల, ఏడాది అటో ఇటో చెప్పి ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేయించుకున్నారు. ప్రస్తుతం గుర్తింపు, ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి చేయడంతో అవస్థలు తప్పడం లేదు. ఆధార్, పాస్పోర్టు, పాన్కార్డులాగే జనన ధ్రువీకరణ పత్రం కీలకంగా మారుతోంది. విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు జనన పత్రం ఉంటేనే నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారుండగా చాలామంది ఉన్నత చదువులు చదువుతున్నారు. వారి తల్లిదండ్రులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పాస్పోర్ట్ తప్పనిసరి. వారికి జనన ధ్రువీకరణ పత్రం పొందాలంటే తిప్పలు తప్పడం లేదు. ఆధార్లో మార్పులు చేయాలంటే జనన ధ్రువీకరణ పత్రమే కీలకంగా మారింది. బర్త్ సర్టిఫికెట్ పొందడమిలా.. జనన ధ్రువీకరణ పత్రానికి ముందుగా పంచాయతీ కార్యదర్శి/మునిసిపల్ ఇచ్చిన ఫాం– 10 ఆధారంగా నోటరీ తీసుకోవాలి. ఆ రెండింటితో పాటు మరో రెండు ఫాంలు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగులతో ధ్రువీకరించుకోవాలి. మండలస్థాయి అధికారి (గెజిటెడ్) సంతకం అవసరం అవుతుంది. ఈ పత్రాలన్నీ జత చేసి మీసేవలో దరఖాస్తు చేయాలి, తహసీల్ కార్యాలయంలో అందజేస్తే అక్కడ పత్రాలను సరిచూసి ఆర్డీవో కార్యాలయానికి పంపుతారు. అక్కడినుంచి పత్రం జారీ కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. నిరక్షరాస్యులు దళారులను ఆశ్రయించి ఎంతో, కొంత చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ పత్రాలు అందడం లేదని పలువురు వాపోతున్నారు. దళారులను ఆశ్రయించొద్దు జనన ధ్రువీకరణ పత్రం నిబంధనల మేరకు తీసుకోవాలి. దళారులను ఆశ్రయిస్తే తప్పులు చోటుచేసుకునే అవకాశముంది. మాయమాటలు చెప్పి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – కుందారపు మహేశ్వర్, ఆర్డీవో, కరీంనగర్ -
సూర్యప్రతాపం
వానాకాలంలో కరీంనగర్రూరల్: వానాకాలంలో ఎండల తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతుండగా జిల్లావ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు దాటుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి సూర్యుడి ప్రతాపం రోజు రోజుకు పెరుగుతోంది. అపుడప్పుడు కురుస్తున్న చిరుజల్లులు ఎండ తీవ్రతను తగ్గించలేకపోవడంతో పగలు ఎండ, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. వర్షాలు కురవాల్సిన సమయంలో ఎండ కాస్తుండటంతో సామాన్య ప్రజలతోపాటు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సాగునీళ్లందించేందుకు పడరానీపాట్లు పడుతున్నారు. ఆగస్టులోనైనా భారీ వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు నిరీక్షిస్తున్నారు. ఉదయం 10గంటలకే.. పగటిపూట ఎండ వేసవిని తలపిస్తోంది. ఉదయం 10గంటలు దాటితే సుర్రుమంటోంది. సాయంత్రం సమయంలో వాతావరణం చల్లబడుతున్నా ఉక్కపోతతో ప్రజలు రాత్రంతా ఇబ్బందిపడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆరురోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసినా అనంతరం వరుణుడు ముఖం చాటేయడంతో క్రమంగా ఎండల తీవ్రత పెరుగుతోంది. మరో మూడురోజులపాటు ఎండల తీవ్రత ఉండే అవకాశముందని వాతావరణశాఖ సూచనలు జారీ చేస్తోంది. జ్వరాలబారిన జనం జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అసాధారణ వాతావరణ ప్రభావంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులు, ఉక్కపోత కారణంగా చర్మవ్యాధులు, జ్వరం, జలుబు, గొంతునొప్పి తదితర వ్యాధులు ప్రబలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుధ్య లోపంతో వైరల్ జ్వరాలు వ్యాపించడంతో బాధితులు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆకాశంవైపు ఆశగా.. కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప వర్షాలు మాత్రం కురవడంలేదు. రోజూ ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలు వర్షించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్ ఆరంభంలో మురిపించిన వరుణుడు అనంతరం ముఖం చాటేయడంతో జిల్లాలో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 389.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 373.7 మిల్లీమీటర్లు నమోదైంది. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బావులు, బోర్లపై ఆధారపడిన రైతులు పొలాలను దున్ని వరినాట్లేస్తున్నారు. వర్షాలు కురవకపోతే బావులు, బోర్లు కూడా ఎండిపోతాయేమోనని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. ఆగస్టులోనైనా వర్షాలు కురుస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలు ఆగస్టు పైనే రైతుల ఆశలు -
అంతర్జిల్లా దొంగ అరెస్ట్
కరీంనగర్క్రైం: కమిషనరేట్ పరిధిలోని వివిధప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన అంతర్జిల్లా దొంగతో పాటు అతడి వద్ద నగలు కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కమిషనరేట్ కేంద్రంలో సీపీ గౌస్ ఆలం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు చిరంజీవి ప్రస్తుతం ఆర్మూర్లో నివాసముంటున్నాడు. హార్వెస్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడ్డాడు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు, మానకొండూర్, ఎల్ఎండీ, చిగురుమామిడి, గన్నేరువరం, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల పరిధిలోని దొంగతనాలకు పాల్పడ్డాడు. కేవలం 2 నెలల వ్యవధిలోనే 19 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ.1 లక్ష నగదు చోరీ చేశాడు. తాళం వేసిన ఇళ్లను ముందస్తుగా గుర్తించి అక్కడే ఉండి గూగుల్ లొకేషన్ ద్వారా ప్రదేశాన్ని గుర్తుపెట్టుకొని రాత్రి అదే ఇళ్లలోకి ప్రవేశించి నగలు, సొత్తు దొంగిలించేవాడు. తిమ్మాపూర్ పరిధిలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా చిరంజీవి పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు విచారించగా దొంగతనం చేసిన సొత్తును నిజామాబాద్ జిల్లా నందిపేట గ్రామంలో బంగారు నరసయ్యకు విక్రయించాడు. దీంతో పోలీసులు అతడిని కూడా అరెస్టు చేశారు. ఈ కేసులో మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఇటీవల నిందితుడు చిరంజీవి భార్యకు కరీంనగర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో సర్జరీ కాగా ఈ ప్రాంతంలో తిరిగి దొంగతనాలకు ఎంచుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీసీఎస్ ఏసీపీ నర్సింహులు, సీఐలు సదన్కుమార్, ప్రకాశ్, ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు నరేశ్, జైపాల్, రాజశేఖర్, వేణుగోపాల్, అనిల్ అవినాష్ను సీపీ అభినందించారు. 19 తులాల బంగారం, 164 తులాల వెండి, నగదు స్వాధీనం చోరీ సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తి సైతం అరెస్ట్ వివరాలు వెల్లడించిన సీపీ గౌస్ ఆలం -
ఆధునిక టెక్నాలజీపై పట్టు సాధించాలి
కరీంనగర్క్రైం: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని న్యూ జెన్ఫోటెక్ సీఈవో కిశోర్ సూచించారు. సోమవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో కంప్యూటర్ విభాగం ఆధ్వర్యంలో శ్రీక్యాంపస్ టూ కార్పొరేట్ఙ్ పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని న్యూ జెన్ఫోటెక్ సాఫ్ట్వేర్ సంస్థ సహకారంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ, విద్యార్థినులు ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ఆధునిక టెక్నాలజీపై అవగాహన కల్పించారు. ఫ్యూచర్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల ప్రాధాన్యతను వివరించారు. నిరంతరం కొత్త ప్రోగ్రామ్స్, టూల్స్ను నేర్చుకొని కెరీర్లో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు టెక్నాలజీపై పట్టుసాధించాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.వరలక్ష్మి మాట్లాడుతూ, భవిష్యత్లో ఉద్యోగాల కోసం సన్నద్ధం అయ్యేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ విభాగం ఇన్చార్జి డాక్టర్ ఎం.కల్పన, అధ్యాపకులు డి.శ్రీనివాస్, ఎం.హరికృష్ణ, బి.సుప్రియ, జె.కిషోర్, వి.సరిత, శ్రీలేఖ తదితరులు పాల్గొన్నారు. -
పైప్లైన్ పనులు వేగవంతం చేయండి
● బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: అమృత్–2లో భాగంగా నగరంలో చేపట్టిన పైప్లైన్ పనులు వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్ ఆదేశించారు. సోమవారం నగరపాలక, ప్రజారోగ్యశాఖ, మిషన్భగీరథ అధికారులతో కలిసి ఫిల్టర్బెడ్ను సందర్శించారు. మోటారు పంపుల పనితీరును పరిశీలించారు. నీటి శుద్ధీకరణ ల్యాబ్ను తనిఖీ చేసి, నీటి పరీక్షలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పైప్లైన్లను పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇస్తూ వివరాలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. కొత్తగా విలీనమైన గ్రామాలు అమృత్–2లో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. బొమ్మకల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నీటిని శుద్ధి చేసి, నాణ్యతలో పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈలు లచ్చిరెడ్డి, దేవేందర్, పబ్లిక్ హెల్త్ డీఈ సంపత్రావు, భగీరథ ఈఈ రామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. 9 వేల ట్రేడ్ లైసెన్స్లు పూర్తి చేయాలి నగరంలో 9వేల ట్రేడ్ లైసెన్స్లను నెలరోజుల్లో పూ ర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. సోమవారం కళాభారతిలో రెవెన్యూ, శానిటేషన్, వార్డు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నివాసాలను వాణిజ్యానికి వినియోగిస్తే వాటిని కమర్షియల్కు మార్చాలని సూచించారు. డివిజన్ వారీగా వార్డు ఆఫీసర్లు రిజిస్టర్ పాటించాలన్నారు. చెత్త పాయింట్ల వద్ద చెత్త కనబడకుండా శుభ్రపరచాలని, ఒక్క స్వచ్ఛ ఆటో చెత్త సేకరణ చేయకపోయినా చర్యలు తప్పవన్నారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాధర్ మోహియోద్దిన్ తదితరులు పాల్గొన్నారు. -
నా దారి.. అడ్డదారి
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో ఆయనో ప్రముఖ వైద్యుడు.. ఆయన కన్ను విలువైన రోడ్డుపై పడింది. తాను కొనుగోలు చేశానంటూ పక్కనున్న స్థలంతో పాటు, ఏకంగా 50 ఫీట్ల రోడ్డును ఆక్రమించడం వివాదాస్పదమైంది. ఇటీవల రోడ్డుకు అడ్డుగా గేట్ పెట్టేందుకు ప్రయత్నించగా, స్థానికులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. ఇంత జరుగుతున్నా, రోడ్డు ఆక్రమణ ప్రయత్నాలను బల్దియా అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నగరంలోని అంబేడ్కర్నగర్లో 50 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోంది. ఆదర్శనగర్ బోర్డు ఎదురుగా కరీంనగర్–మంచిర్యాల మేయిన్రోడ్ నుంచి వ్యవసాయ మార్కెట్ యార్డ్, శ్మశానవాటిక వైపు వెళ్లే ఈ రోడ్డు స్థలం తనదేనంటూ తాజాగా ఓ వైద్యుడు రంగప్రవేశం చేశారు. పక్కనే ఉన్న స్థలంతో పాటు రోడ్డు స్థలం కూడా తనదేనంటూ వారం రోజుల క్రితం రోడ్డుకు అడ్డుగా గేట్ పెట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుకోవడం, పోలీసులు రావడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. కాగా ఏఎంసీకి, దళితుల శ్మశానవాటికకు వెళ్లే ఈ 50 ఫీట్ల రోడ్డు మాస్టర్ ప్లాన్లోనూ ఉంది. అయితే గతంలో రద్దు బదులు (భూమికి బదులు మరో చోట భూమి) కింద ప్రభుత్వం ఇచ్చిన భూమిని తనకు విక్రయించారని, అది తాను కొనుగోలు చేశానంటూ సదరు వైద్యుడు ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ రద్దు బదులు కింద ఇచ్చిన భూమి అయినా మాస్టర్ప్లాన్లో ఉన్న 50 ఫీట్ల రోడ్ను ఎలా కేటాయిస్తారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే పక్కనున్న స్థలం ఎవరిదనేది రెవెన్యూ అధికారులకు వదిలేస్తే, 50 ఫీట్ల రోడ్డును కాపాడాల్సిన నగరపాలకసంస్థ అధికారులు మిన్నకుండడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కబ్జా నుంచి రోడ్డును కాపాడాలి అంబేడ్కర్నగర్లో కబ్జాకు గురవుతున్న స్థలంతో పాటు, 50 ఫీట్ల రోడ్డును కాపాడాలని మాజీ కా ర్పొరేటర్ కుర్ర తిరుపతి, సామాజిక కార్యకర్త మ హమ్మద్ అమీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సో మవారం నగరపాలకసంస్థ అధికారులకు ఫిర్యా దు చేశారు. సర్వే నంబర్ 53లో శ్మశానవాటికకు సంబంధించిన ఎకరానికి పైగా స్థలం కబ్జాకు గురవుతుందని, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు. మాస్టర్ప్లాన్లో ఉన్న రోడ్డును కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అంబేడ్కర్ నగర్లో రోడ్డు కబ్జా ఓ ప్రముఖ వైద్యుడి నిర్వాకం స్థానికుల అభ్యంతరంతో నిలిచిన పనులు -
బీసీ బిల్లు ఆమోదింపజేస్తాం
● బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కరీంనగర్ కార్పొరేషన్: బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం ఢిల్లీలో 5,6,7 తేదీల్లో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. నగరంలోని మంకమ్మతోట పొన్నం కాంప్లెక్ష్లో నూతనంగా నిర్మించిన మంత్రి క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించి, కుటుంబసభ్యులతో కలిసి పూజాకార్యాక్రమాలు నిర్వహించారు. అనంతరం భగత్నగర్లోని అయ్యప్ప ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమం ఎలా చేశామో, అలానే బీసీ రిజర్వేషన్ సాధనకు ఉద్యమించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాసేవకు క్యాంప్ కార్యాలయం... ప్రజలకు అందుబాటులో ఉండేందుకు, సేవలందించేందుకు క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ప్రారంభించిన కార్యాలయాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడాల రాహుల్, యాగండ్ల అనిల్, గడ్డం విలాస్రెడ్డి, కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి, ఆకారపు భాస్కర్రెడ్డి, వైద్యుల అంజన్కుమార్, పులి ఆంజనేయిలుగౌడ్, కర్ర సత్యప్రసన్నరెడ్డి, మడుపు మోహన్, మల్యాల సుజిత్కుమార్, చాడగొండ బుచ్చిరెడ్డి, కట్ల సతీశ్, పడిశెట్టి భూమయ్య, ఆకుల ప్రకాష్, ఎండీ తాజ్, ఎస్ఏ మోసిన్ తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో నులిపురుగుల నివారణ
● కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్/కరీంనగర్టౌన్: జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడారు. ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1 నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తామని తెలిపారు. డీఈవో, డీఎంహెచ్వో, జిల్లా సంక్షేమ అధికారి, ఇంటర్మీడియట్ అధికారి సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, బల్దియా కమిషనర్ ప్రఫుల్దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు. స్వచ్ఛ పాఠశాల ర్యాంకింగ్కు.. కరీంనగర్అర్బన్: జిల్లాలో స్వచ్ఛత హరిత పాఠశాలల ర్యాంకింగ్, పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి యూనిసెఫ్ సహకారం అవసరమని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో మాట్లాడారు. జిల్లాలో యూనిసెఫ్ సహకారంతో చేపట్టిన పారిశుధ్య కార్మికుల సంక్షేమ కార్యక్రమాల గురించి ఇటీవల భువనేశ్వర్లో జరిగిన వర్క్షాప్లో కలెక్టర్ వివరించినందున యూనిసెఫ్ బృందం సన్మానించింది. -
ప్లకార్డులు.. నిరసనలు
● ప్రజావాణిలో గందరగోళం ● అధికారుల తీరుపై బాధితుల అసహనంకరీంనగర్ అర్బన్: అధికారుల తీరును నిరసిస్తూ ప్రజావాణి నిరసనలకు వేదికై ంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా క్షేత్రస్థాయిలో చర్యలు కరవయ్యాయని ప్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేయగా మరికొందరు మోకాళ్లపై నిరసన వ్యక్తం చేశారు. మొత్తంగా సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో గందరగోళం నెలకొంది. ప్రతి సోమవారం కలెక్టరేట్కు రావడం ఫిర్యాదు చేయడం పరిపాటిగా మారిందే తప్ప సాంత్వన కరవైందని బాధితులు వాపోయారు. కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మునిసిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో వెంకటేఽశ్వర్లు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. కాగా ప్రజావాణికి 290 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్ ఏవో గడ్డం సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురిని ‘సాక్షి’ పలకరించగా తమ ఆవేదనను వివరించారు..ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు: 290 ఇందులో ఎక్కువగా మునిసిపల్ కార్పొరేషన్: 46 సీపీ ఆఫీస్: 20 తహసీల్దార్ గంగాధర: 17 ఆర్డీవో కరీంనగర్: 15 కరీంనగర్రూరల్ తహసీల్దార్: 11 సైదాపూర్ తహసీల్దార్: 11 డీపీవో: 10 వారధి సొసైటీ: 09 -
రసాభాసగా అర్బన్ బ్యాంకు సమావేశం
కరీంనగర్అర్బన్: కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు సమావేశం రసాభాసాగా సాగింది. కొంతకాలంగా అంతర్గతంగా ఉప్పు నిప్పులా ఉన్న వైరం ఆదివారం రెవెన్యూ గార్డెన్ వేదికగా బయటపడింది. గత పాలకవర్గం, ప్రస్తుత పాలకవర్గానికి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోగా పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇటీవల టీఎన్జీవో భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో కోరం లేదని ఈ నెల 3కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమావేశ ఆరంభంలో బ్యాంకు చైర్మన్ గడ్డం విలాస్రెడ్డి హైకోర్టు తీర్పు ప్రతంటూ చూపిస్తూ వాటి సారాంశాన్ని వివరించారు. గత పాలకవర్గాల తీరు నిబంధనలకు విరుద్ధమని, కోరం లేకుండా ఎన్నో తప్పులు చేశారని ఆరోపించారు. దీంతో మాజీ చైర్మన్ కర్ర రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారుల కనుసన్నలో సమావేశాలు జరిగాయని, కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తెరవెనుక ఎవరున్నారో తెలుసని, ఎవరికీ భయపడేదిలేదన్నారు. దీనివెనుక రాజకీయ కోణం ఉందని, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో పోటీపడి గెలవాలని, తగ్గేదే లేదని స్పష్టం చేశారు. 15మంది సభ్యుల శాశ్వత తొలగింపు సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2007–17 వరకు ఉన్న పాలకవర్గ సభ్యులు కర్ర రాజశేఖర్, ఎండీ సమియుద్దీన్, ఇ.లక్ష్మణరాజు, వరాల జ్యోతి, దేశ వేదాద్రి, అనరాసు కుమార్, కె.రవి, సరిల్ల ప్రసాద్, వజీర్ అహ్మద్, తాటికొండ భాస్కర్, బాశెట్టి కిషన్, బొమ్మరాతి సాయికృష్ణ, దునిగంటి సంపత్, తాడ వీరారెడ్డి, ముద్దసాని క్రాంతిలను బ్యాంకు సభ్యత్వం నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్లు సభ ఆమోదం తెలుపగా చైర్మన్ విలాస్రెడ్డి ప్రకటించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో నునుగొండ శ్రీనివాస్, సభ్యులు మడుపు మోహన్, ముక్క భాస్కర్, రేగొండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, మంగి రవీందర్, నాగుల సతీశ్, రాజు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. గత పాలకవర్గ సభ్యత్వాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన అంతా చట్టప్రకారమే జరిగిందన్న మాజీ అధ్యక్షుడు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్కు చెందిన బొల్లి విద్యాసాగర్(37) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపిన వివరాలు.. కొంతకాలంగా విద్యాసాగర్కు మానసిక పరిస్థితి సరిగా లేక మందులు వాడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఈనెల 1న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా, గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంతుదూ ఆదివారం మృతిచెందాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. ఎలిగేడులో ఒకరు..ఎలిగేడు(పెద్దపల్లి): మండలంలోని సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన తీగల నరేశ్(32) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు.. నరేశ్ కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. రోజు తాగితే ఎలా అని ఈనెల 2న అతడి భార్య మమత మందలించగా మనస్తాపానికి గురయ్యాడు. అదేరోజు మధ్యాహ్నం 12గంటలకు గడ్డి మందు తాగానని చెప్పడంతో వెంటనే చికిత్సకోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యంకోసం ప్రతిమ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. నరేశ్కు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కొడుకు చేతిలో గాయపడిన తండ్రి..రాయికల్: కొడుకు చేతిలో గాయపడిన పట్టణానికి చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్య (55) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. గత నెల 29న నర్సయ్యపై ఆయన కొడుకు రాజేందర్ కత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్యను జగిత్యాల.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎంకు తరలించారు. చాతిలో తీవ్రమైన గాయాలు కావడంతో వైద్యులు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. నర్సయ్యకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. నర్సయ్యపై దాడి చేసిన కొడుకు రాజేందర్తోపాటు సహకరించిన అస్లాంను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై సుధీర్రావు తెలిపారు. గుర్తుతెలియని మృతదేహంకొత్తపల్లి(కరీంనగర్): చింతకుంట రెవెన్యూ పరిధిలోని ఎల్ఎండీ రిజర్వాయర్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం తేలినట్లు కొత్తపల్లి ఎస్సై సంజీవ్ తెలిపారు. 50–55 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతదేహాన్ని కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉంచామని, వ్యక్తికి సంబంధించి ఆచూకీ తెలిస్తే కొత్తపల్లి పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. -
దళారీ బెడద లేదిక!
● విత్తనోత్పత్తిలో నూతన ప్రక్రియకు శ్రీకారం ● మంత్రి ఆదేశాలు అమలైతే అన్నదాతకు మేలుకరీంనగర్ అర్బన్: విత్తనోత్పత్తిలో దళారీ బెడద లేకుండా నేరుగా కంపెనీలే రైతులతో సంబంధాలు పెట్టుకోవాలన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటన అన్నదాతల్లో ఆనందం నింపుతోంది. సదరు ఆదేశాలు అమలైతే రైతులకు గిట్టుబాటు ధర రానుండగా, కంపెనీలకు మేలు చేకూరనుంది. ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం సాగుతుండగా విత్తనాలకు డిమాండ్ లేదంటూ రైతులను మోసగిస్తున్న ఘటనలు అనేకం. ఆర్గనైజర్లతోనే రైతులకు నష్టం విత్తనోత్పత్తిలో దక్షిణ ఆమెరికా తరువాత తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమన్నది శాస్త్రవేత్తల మాట. అందులో ఉత్తర తెలంగాణ మరింత అనువైనదని గుర్తించారు. ప్రధానంగా పంట కోత సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ చీడపీడల బెడద, గాలిలో తక్కువ తేమశాతం, నేలల్లో పొటాష్ పోషక సమతౌల్యం, సాగునీటి లభ్యత ఉండటం వంటి అంశాలు విత్తనోత్పత్తికి ఉపయోగకరంగా ఉండటంతో కంపెనీలు కరీంనగర్పై కన్నేశాయి. ఆర్గనైజర్ల ద్వారా జిల్లాలో రైతుల శ్రమతో ఆటలాడుతున్నాయి. పలు రకాల విత్తనాలను సాగు చేయించి ముందొక మాట దిగుబడి తదుపరి మరో ధర చెల్లిస్తూ నిలువునా దోచుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలాచోట్ల డబ్బులు ఎగవేసిన సందర్భాలున్నాయి. విత్తనోత్పత్తి వ్యవస్థలో ఆర్థికంగా బాగుపడిన రైతుల సంఖ్య పదిశాతం ఉంటే, మధ్యవర్తులుగా ఉండి రూ.కోట్లకు పడగలెత్తిన వారి సంఖ్య వందశాతం ఉంది. ప్రధాన ఆర్గనైజర్లు ఊరురా వందల సంఖ్యలో సబ్ ఆర్గనైజర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గనైజర్లతో రైతులకు నేరుగా ఒప్పందాలు లేవు. దస్త్రాల్లో రైతుల వివరాలు మాత్రమే నమోదు చేసుకుంటారు. రైతులకు ఇచ్చే ప్రతి రూపాయికి బాధ్యులుగా సబ్ ఆర్గనైజర్లు ఉంటున్నారు. హైబ్రిడ్, సూటి రకాల్లో చేతివాటం జిల్లాలో 65వరకు సూటి వరి విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, నిజామాబాద్ జిల్లాకు చెందిన మొక్కజొన్న విత్తన కంపెనీలు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన జొన్న, సజ్జ సంస్థలు జిల్లాలో విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలోని కృషి విజ్ఞాన కేంద్రం, పరిశోధన స్థానాలు, ఏరువాక కేంద్రాలు, వ్యవసాయశాఖ గ్రామీణ విత్తనోత్పత్తి కేంద్రం వంటి వాటి ద్వారా సూటి రకాల్లో విత్తనోత్పత్తి చేయిస్తున్నారు. సూటిరకాల్లో రైతులకు పెద్దగా మోసాలు జరగకపోయినా హైబ్రిడ్ విత్తనోత్పత్తిలోనే తీవ్రంగా మోసపోతున్న ఉదంతాలున్నాయి. ప్రధానంగా రైతులు అమాయకంగా సంస్థల సూచనలు పాటిస్తుండటం.. వ్యవసాయ శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో హైబ్రిడ్ విత్తన ఉత్పత్తిలో ప్రయివేటు సంస్థలదే పెత్తనంగా మారింది. గతంలో మెట్పల్లి, కోరుట్ల, మానకొండూరు, హుజూరాబాద్ ప్రాంతాల రైతులతో పలువురు ఏజెంట్లు పలు విత్తనాలు ఉత్పత్తి చేయించి పంట తీసుకెళ్లాక సంస్థలు రైతులు చెల్లింపులు చేయకుండా మోసగించాయి. దీంతో ప్రభుత్వమే రైతులకు రూ.10కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంతకుముందు జమ్మికుంట ప్రాంతంలో బీపీటీ సూటిరకానికి క్వింటాల్కు రూ.1800పైగా ధర చెల్లిస్తామని విత్తన కంపెనీ సంస్థలు పంట పండిన తరువాత రూ.200 తగ్గించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. -
ఆటల పల్లె.. పతకాల ముల్లె
● జాతీయస్థాయిలో రాణిస్తున్న ఆయా గ్రామాల యువకులు ● ఉద్యోగాల కోసం ఎదురుచూపులు వేములవాడరూరల్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి, అనుపురం గ్రామాలు క్రీడాకారులకు పెట్టింది పేరుగా నిలిచాయి. ఈ గ్రామాల నుంచి ఎందరో క్రీడాకారులు గ్రామీణస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఎలాంటి శిక్షణ లేకున్నా పాఠశాల స్థాయి నుండే క్రీడల్లో పాల్గొని మంచిపేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ కొంత మంది యువకులు క్రీడలపై ఆసక్తితో ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని గ్రామీణ క్రీడలకు ఊపిరి పోస్తున్నారు. కబడ్డీ పోటీలంటేనే సదరు గ్రామాల యువకులు పాల్గొంటారని పేరుంది. కాగా, నూకలమర్రి గ్రామంలో చైతన్య యూత్ క్లబ్ పేరుతో క్రీడాకారులు యూత్గా ఏర్పడి ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తారు. ఉద్యోగాల కోసం నిరీక్షణ కబడ్డీ క్రీడపై ఎంతో ఆసక్తి ఉన్న యువకులు క్రీడల కోటాలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. క్రీడాకారులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా, చాలా మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ వయస్సు దాటిపోయి ఉద్యోగాలకు అనర్హులుగా ఉండిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, కుల వృత్తులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పంచాయతీలో కప్లు మండలంలోని ఎదురుగట్ల, చెక్కపల్లి, నూకలమర్రి గ్రామాల నుంచి కబడ్డీ పోటీల్లో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులు వారికి వచ్చిన కప్లను ఆయా గ్రామపంచాయతీల్లో భద్రంగా ఉంచుతారు. కాగా, కప్లను చూసి సంతోష పడడం తప్ప ఉద్యోగాలు మాత్రం రావడం లేదని ఆయా గ్రామాల క్రీడాకారులు నిరాశలో ఉన్నారు. పదుల సంఖ్యలో క్రీడాకారులు జిల్లాలోనే నూకలమర్రి, ఎదురుగట్ల, చెక్కపల్లి, అనుపురం క్రీడా గ్రామాలుగా పేరుపొందాయి. ఈ గ్రామాల నుంచి 30 ఏళ్లుగా ఎందరో క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. ప్రతీ గ్రామం నుంచి పదుల సంఖ్యలో కబడ్డీ క్రీడాకారులు ఉన్నారు. ప్రస్తుతం ఒకరిద్దరికి తప్ప మిగతా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు. -
స్వగ్రామానికి వలసజీవి మృతదేహం
మల్యాల(చొప్పదండి): ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి గుండెపోటుతో మృతిచెందిన వలసజీవి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బూస అంజయ్య(51) జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. జూలై 6న అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. దుబాయ్లో ఉన్న మృతుడి కుమారుడు బూస హరీశ్ తన తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించాలని ముత్యంపేట మాజీ సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండపల్కల రాంమోహన్రావు, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్యక్షుడు గుండ్లపల్లి నరసింహ, ఉపాధ్యక్షుడు శేఖర్గౌడ్ దృష్టికి తీసుకెళ్లాడు. వారు కంపెనీ యాజమాన్యంతో సంప్రదించి, మృతదేహాన్ని ఆదివారం దుబాయ్ నుంచి ముత్యంపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. -
శివయ్యా... దండాలయ్యా
వేములవాడ: ‘శివయ్యా.. మా కష్టాలు తీర్చయ్యా’.. అంటూ వివిధ ప్రాంతాలకు చెందిన 35 వేల మంది భక్తులు ఆదివారం రాజన్నను దర్శించుకున్నారు. ధర్మగుండంలో స్నానాలు చేసి కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్నను మహారాష్ట్ర రాష్ట్ర రవాణా కమిషనర్ వివేక్ భీమన్వార్ (ఐఏఎస్) ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. స్వామివారికి రూ.30 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈవో రాధాబాయి, ఏఈవోలు భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
పెన్షన్ డబ్బులతో ప్రతిభా పురస్కారాలు
● విశ్రాంత ఏఈ మల్లేశం దాతృత్వం సిరిసిల్లకల్చరల్: పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ఓ విశ్రాంత ఉద్యోగి ముందుకొచ్చారు. తన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. వాటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ప్రతిభావంతులకు పురస్కారాలిచ్చేలా ఏర్పాట్లు చేశారు. సిరిసిల్లకు చెందిన కుసుమ రామయ్య పెద్దకుమారుడు మల్లేశం ఏఈగా ఉద్యోగ విరమణ చేశారు. తనకొచ్చిన పెన్షన్ డబ్బుల్లోంచి రూ.1.50లక్షల చొప్పున తాను చదువుకున్న శివనగర్ జెడ్పీ హైస్కూల్తోపాటు అగ్రహారంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు అందజేశారు. వీటిపై వచ్చే వడ్డీ సొమ్ముతో ఏటా ప్రతిభ చూపే విద్యార్థులకు పురస్కారాలు ఇవ్వాలని ఆయా సంస్థల హెచ్ఎం, ప్రిన్సిపాళ్లకు సూచించారు. మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇదే తరహా నిధి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. -
అల్ఫోర్స్ ఇ–టెక్నోలో స్నేహితుల దినోత్సవం
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ–టెక్నో పాఠశాలలో ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులతో విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. స్నేహితుల ద్వారా ఆనందంతో పాటు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. ఆపదకు ఆపన్నహస్తంగా స్నేహితులు నిలుస్తారని, నేటి పోటీ ప్రపంచంలో సమయభావం వల్ల చాలామంది స్నేహితులు దూరమవుతున్నారని, వారితో సంప్రదింపులకు సైతం సమయం కేటాయించకపోవడం విచారకమరని పేర్కొన్నారు. తరతరాల నుంచి వస్తున్నటువంటి స్నేహబంధ వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని, విశిష్టతను ప్రతిఒక్కరూ పాటిస్తూ, స్నేహబంధంలో నైతిక విలువలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. వేడుకల్లో భాగంగా నరేందర్రెడ్డికి ఉపాధ్యాయులు ఫ్రెండ్షిప్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. -
జీతం బల్దియాలో.. పని ప్రైవేట్లో!
● ఓ వర్క్ ఇన్స్పెక్టర్ వ్యవహారం ● మూడు నెలలుగా కాంట్రాక్టర్ వద్దే విధులుకరీంనగర్ కార్పొరేషన్: ఆ వర్క్ ఇన్స్పెక్టర్ జీతం తీసుకునేది కరీంనగర్ నగరపాలకసంస్థలో. పనిచేసేది మాత్రం ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద. గత మూడు నెలలుగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. కొంతమంది అధికారుల అండదండలతో సదరు వర్క్ఇన్స్పెక్టర్ సేవలు ప్రైవేట్లో తరిస్తున్నట్లు సమాచారం. నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులకు వర్క్ ఇన్స్పెక్టర్లు సహాయకులుగా పనిచేస్తుంటారు. ఔట్సోర్సింగ్ కింద నియామకం అయ్యే వర్క్ ఇన్స్పెక్టర్లు ప్రతి ఏఈ పరిధిలో దాదాపు నలుగురు ఉంటారు. నగరపాలకసంస్థ 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు పెరిగిన తరువాత అధికారులు, ఉద్యోగులపైన కూడా పనిభారం పెరిగింది. ఏ అధికారి, ఉద్యోగి ఖాళీగా ఉండే పరిస్థితి లేదు. ఇదిలాఉంటే సుడా నిధులతో నగరంలోని ఓ పార్క్లో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ వద్ద సదరు వర్క్ ఇన్స్పెక్టర్ పనిచేస్తుండడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. గత మూడు నెలలుగా పార్క్లో కాంట్రాక్టర్కు సంబంధించిన పనులు చక్కబెడుతూ, నగరపాలకసంస్థ కార్యకలాపాలకు దూరంగా ఉన్నప్పటికీ.. ఉన్నతాధికారులు గుర్తించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికై నా నగరపాలకసంస్థలో కొనసాగుతున్న ఇష్టారాజ్య వ్యవహారాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. బదిలీల్లో ఆ పేర్లుండవ్ నగరపాలకసంస్థలోని వర్క్ ఇన్స్పెక్టర్లను అంతర్గత బదిలీ చేస్తూ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. 20 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను ఏఈలకు అసిస్టెంట్లుగా, ఒకరిని వాహన నిర్వహణకు కేటాయించారు. వర్క్ ఇన్స్పెక్టర్ల బదిలీ జరిగిన ప్రతిసారి నలుగురి పేర్లు మాత్రం అందులో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో పనిచేసే ఆ వర్క్ ఇన్స్పెక్టర్లకు బదిలీలు లేకపోవడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేశామని, కార్యాలయంలో పనిచేస్తున్నందునే వారిని బదిలీ చేయలేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. -
‘ఇంటింటికీ బీజేపీ’ని విజయవంతం చేయండి
హుజూరాబాద్: బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుమేరకు జిల్లాలో తలపెట్టిన ఇంటింటికీ బీజేపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వీణవంక మండలం బేతిగల్లో మండల అధ్యక్షుడు బత్తిని నరేశ్గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 3, 4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ– ప్రతీ ఇంటికి పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి చేపట్టిన కార్యాచరణగా తెలిపారు. ప్రతీ బూత్ కమిటీ అధ్యక్షుడు కనీసం 100 ఇళ్లను సందర్శించి, ప్రధాని మోదీ సందేశం అందించాలనన్నారు. మద్దతు తెలిపేందుకు 92400 15366 మిస్డ్కాల్ నంబర్ ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహారాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు గొట్టుముక్కుల సంపత్రావు కిషన్, ప్రధాన కార్యదర్శి మాడుగురి సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల మానవహారం కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం మార్చి 2025లో పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కేంద్ర పెన్షనర్డ్ సమాఖ్య న్యూఢిల్లీ పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన అల్ ఇండియా పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం కరీంనగర్లోని టవర్ సర్కిల్లో ఉన్న హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉప్పల రామేశం మాట్లాడుతూ నూతన పెన్షన్ చట్టం రద్దు చేయాలని, కరోనా సమయంలో రావల్సిన 36 నెలల కరువు భత్యం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పెన్షనర్ల కన్నా కేంద్ర పెన్షనర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరీంనగర్లో కేంద్ర ఆరోగ్య పథకం ద్వారా వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పెన్షనర్లు మంచికట్ల లక్ష్మిపతి, కొండపాక చంద్రమోహన్రావు, యస్వాడ చంద్రమౌళి పాల్గొన్నారు. కేసీఆర్కు కొనసాగింపే రేవంత్రెడ్డి పాలన కరీంనగర్: కేసీఆర్ ప్రభుత్వానికి కొనసాగింపుగానే రేవంత్రెడ్డి పాలన ఉందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రాజ్యాధికార జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం జరిగిన ఉమ్మడి జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్– రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో 90శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రజలు రాజ్యాధికారం సాధించడమే అసలైన తెలంగాణ అన్నారు. ఇప్పుడు వచ్చిన తెలంగాణ కేవలం ‘వెలమ–రెడ్డి’ వర్గాలకు సంబంధించినదే అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ కోసం యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అణగారిన వర్గాల రాజ్యాంగ హక్కుల కోసం లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ప్రారంభమైందని, అతి త్వరలో కరీంనగర్కు రాబోతున్న యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు రాఘవేంద్ర ముదిరాజ్, వినోద్ యాదవ్, సభ్యులు శ్రీకాంత్, రాము యాద వ్, కార్తీక్ ఏకలవ్య, బీసీ సంఘాల నాయకులు రణధీర్ సింగ్, విశ్వం, కాంతక్క, లక్ష్మీ, నరేశ్ యాదవ్, నరేశ్, మనోజ్గౌడ్ పాల్గొన్నారు. -
నిరుపేదలకు కడుపునిండా బువ్వ
శంకరపట్నం/మానకొండూర్/రామడుగు/కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీతో నిరుపేదలు కడుపునిండా భోజనం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఇన్చార్జి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో, రామడుగు మండలం షానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పలువురు లబ్ధిదారులకు రేషన్కార్డులు పంపిణీ చేశారు. మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లిలో విశాల సహకార పరపతి సంఘ నూతన భవనం, షాపింగ్ కాంప్లెక్స్, సంఘ వ్యవస్థాపకుడు అనభేరి వెంకటరమణారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి నిరుపేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఏకై క రాష్ట్రం తెలంగాణ అన్నారు. గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ పనులు త్వరలో చేపడతామని, గోదావరి జలాలు చొప్పదండి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, పౌరసరాపరాలశాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్, కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలం, మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద, కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, గట్టుదుద్దెనపల్లి సొసైటీ చైర్మన్ అనభేరి రాధా కిషన్రావు, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు ఘనస్వాగతం జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్కు స్పోర్ట్స్స్కూల్లోని హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్డీవో మహేశ్వర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, వెలి చాల రాజేందర్రావు ఘన స్వాగతం పలికారు. స్కూటీని ఢీకొన్న మంత్రి కాన్వాయ్లోని పోలీస్ వాహనం కేశవపట్నం పోలీస్స్టేషన్ సమీపంలో ఆదివారం మంత్రుల కాన్వాయ్లోని ఓ పోలీస్వాహనం స్కూటీని ఢీకొనడంతో ఒకరికి గాయాలయ్యా యి. కేశవపట్నంకు చెందిన చల్ల వెంకటి సాయంత్రం స్కూటీపై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమం ముగించుకుని మంత్రుల కాన్వాయ్ అదే రోడ్డుమీదుగా వెళ్తోంది. కాన్వాయ్లోని ఓ పోలీస్ వాహనం స్కూటీని తప్పించే క్రమంలో రోడ్డు కిందకు వెళ్లింది. రోడ్డు పక్క బండరాయికి తాకి ముందుటైర్లు పగిలిపోయాయి. అదుపు తప్పి స్కూటీకి తగిలింది. గాయపడిన వెంకటిని పోలీసులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.మూడు పంటలకు సాగునీరురామగుండం/ధర్మారం: రామగుండం ఎత్తిపోతల ద్వారా ఏటా మూడు పంటలకు సాగునీరు అందుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూర్ శివారులో రూ.75 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతలను మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ధర్మారం మండలం ఎర్రగుంటపల్లి శివారులో రూ.45.15 కోట్లతో చేపట్టిన ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు, పంపుహౌస్లను రామగుండం, పెద్దపల్లి నియోజకవర్గాల్లో నిర్మించారని, ఒక్క ఎకరాకూ నీటిని వినియోగించుకోలేదన్నారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ రామగుండాన్ని పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అంతర్గాంలో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకం సంపూర్ణంగా అమలవుతోందన్నారు. మంత్రి లక్ష్మణ్కుమార్ విన్నపం మేరకు పత్తిపాక శివారులో శ్రీలక్ష్మీనర్సింహస్వామి రిజర్వాయర్ నిర్మిస్తామని, డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు కేటాయించిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి రామడుగు, శంకరపట్నంలో రేషన్కార్డులు పంపిణీ గట్టుదుద్దెనపల్లిలో సొసైటీ నూతన భనవం ప్రారంభం -
గుండెల్లో డుగ్గుడుగ్గు
తిమ్మాపూర్లోని రామగుండం– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం కొందరు కళాశాల కుర్రాళ్లు ఖరీదైన బైక్లపై చక్కర్లు కొట్టారు. భారీ శబ్దాలు వచ్చే బైక్లతో తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగించారు. బైక్పై ఫీట్లు వేస్తూ భయబ్రాంతులకు గురిచేశారు. వారు నడిపే బైక్ల నుంచి వచ్చే శబ్దం కిలోమీటర్ వరకు వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పోలీసులు కొందరికి కౌన్సెలింగ్ ఇచ్చినా తీరుమారడం లేదంటున్నారు.కరీంనగర్లోని ఓ కాలనీలో ఒకరోజు రాత్రి 11 గంటలకు కొందరు యువకులు భారీ శబ్దాలు వచ్చే బైక్లతో చక్కర్లు కొడుతున్నారు. నాలుగైదు బైక్లపై తిరుగుతూ చెవులు పగిలిపోయేలా సౌండ్ చేస్తూ.. ఇబ్బందులకు గురిచేశారు. నిద్రపోతున్న కాలనీవాసులు ఏం జరుగుతుందోనని రోడ్లపైకి వచ్చారు. సదరు యువకులను ప్రశ్నించేలోపే అక్కడి నుంచి జారుకున్నారు. బైక్లకు భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లు ప్రధానరోడ్లు.. గల్లీల్లో యువత స్టంట్లు ఇబ్బందులకు గురవుతున్న ప్రజలు కొరడా ఝులిపిస్తున్న పోలీసులు నగరంలో ఇటీవల 243 వాహనాలు పట్టివేత, జరిమానా విధింపు -
పచ్చదనం పెంపే లక్ష్యం
● కసరత్తులో అటవీశాఖ ● జిల్లాలో అటవీ విస్తీర్ణం 0.02శాతమేకరీంనగర్ అర్బన్: కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల పెంపుదలపై దృష్టి సారిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అడవులను రక్షించడంతో పాటు పచ్చదనంతో విస్తరించి ఉండే రెవెన్యూ, ప్రైవేట్ భూముల్లో అడవుల పెంపకానికి ప్రాధాన్యమిస్తోంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 33శాతం అడువులుండాలనేది నిబంధన. కానీ జిల్లాలో అడవుల శాతం 0.02శాతమే. పచ్చదనమే లక్ష్యం అటవీ సంరక్షణకు సంబంధితశాఖ అధికారులు ప్రణాళిక రూపొందించారు. అభివృద్ధి పనులు ఖర్చుల వివరాల నివేదిక తయారు చేశారు. ప్రధానంగా అటవీ భూముల స్థిరీకరణ, అటవీ ప్రాంత పునరుజ్జీవం, అటవీ జంతువుల సంరక్షణకు కావా ల్సిన నిధుల ప్రతిపాదనలను ఇప్పటికే అందజేశా రు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి, కొత్తపల్లి పట్టణాల్లో అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. ప్రతి నర్సరీల్లో 10వేలకు పైగా మొక్కలను పెంచుతుండగా పంచాయతీలకే బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ ఖాళీ స్థలముంటే అక్క డ మొక్కలు పెంచేలా కార్యచరణ చేస్తున్నారు. జిల్లా అడవులు 0.30 శాతమే రాష్ట్రంలోని మన జిల్లా అడవుల వాటా 0.30శాతమే. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రేంజ్లుండగా కరీంనగర్ అటవీ రేంజ్లో 101.75 హెక్టా ర్లు, హుజూరాబాద్ రేంజ్లో 692.5 హెక్టార్ల అడవి ఉన్నట్లు అధికారిక లెక్కలు చాటుతున్నాయి. హు జూరాబాద్ పరిధిలో సైదాపూర్ మండలం ఆకునూరులో మాత్రమే అడవి ఉండగా కరీంనగర్ పరిధిలో గంగాధర మండలం వెంకటాయపల్లి శివారులో అడవి ఉంది. పచ్చదనంతో కూడిన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ లేవో తెలుసుకునేందుకు ఇప్పటికే శాటిలైట్ ఆధారంగా క్షేత్రస్థాయిలోని వివరాల క్రోడీకరణ కోసం ఛాయచిత్రాలను సేకరించే ప్రక్రియను అటవీశాఖ ప్రారంభించింది. జిల్లాలవారీగా పచ్చదనం విస్తరించిన ప్రాంతాల్లో ప్రైవేట్ పరిధిలోనివా,? రెవెన్యూ పరిధిలోనివా.? నని ఆరా తీస్తోంది. అధికారుల సర్వే పూర్తి రిజర్వ్, సాధారణ, ప్రైవేట్ మూడు రకాలైన అటవీ ప్రాంతాలుంటాయన్నది తెలిసిందే. రిజర్వు అటవీ ప్రాంతం ప్రత్యేక విధి విధానాలతో ఉండనుండగా అటవీ భూములకే పరిమితం. ప్రైవేట్ అడవి ప్రైవే ట్ వ్యక్తుల పరిధిలోకి వస్తుంది. సాధారణ అడవి ప్రభుత్వం పరిధిలోనే ఉంటుంది. ఈ భూములు రెవెన్యూ శాఖ పరిధిలోనివా? అటవీ శాఖ పరిధిలో నివా అనేది తేల్చాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఛాయచిత్రాల ద్వారా లెక్క తీస్తున్న భూములు సాధారణ అటవీ ప్రాంతాల్లోనివి కావడంతో భవిష్యత్తులో నిర్వహించే సంయుక్త సర్వేకు ఉపయోగపడొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.జిల్లా విస్తీర్ణం: 2,125 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం: 793.80 హెక్టార్లు మొత్తం విస్తీర్ణంలో అడవుల శాతం: 0.30శాతం జనాభా: 10.25లక్షలు -
సర్టిఫికెట్ల పరిశీలన
కరీంనగర్: ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఆదివారం డీఈవో కార్యాలయంలో ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ కోసం అర్హులైన వారి జాబితాను డీఈవో వెబ్సైట్లో పొందుపరిచారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం వరకు జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్జీటీలు తమ విద్యార్హతల ఒరిజినల్ ఽధ్రువపత్రాలు, సర్వీస్ రిజిస్టర్ను పరిశీలించారు. జాబితాలో దొర్లిన తప్పులను సవరించాలని కొంత మంది ఆధారాలతో సహా అర్జీలు పెట్టుకో, రానున్న జాబి తాలో ఆయా కేటగిరీల వివరాలను పొందుపర్చే అవకాశం ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన రాత్రి వరకు కొనసాగింది. డీఈవో చైతన్య జైనీ దగ్గరుండి పర్యవేక్షించారు. వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కార్యాలయం ఆవరణలో జాబితాపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. -
‘పత్తిపాక’కు అడుగులు
● డీపీఆర్ తయారీకి రూ.1.10కోట్లు ● 2.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు అవకాశంసాక్షి, పెద్దపల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని జిల్లాకు అందించేందుకు ప్రతిపాదనలో ఉన్న పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగునీటి స్థిరీకరణ, కొత్త ఆయకట్టు కోసం ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వాయర్ డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీకి ప్రభుత్వం రూ.1.10 కోట్లు మంజూరు చేసింది. 7.78 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తారు. అక్కడినుంచి నేరుగా కాకతీయ కాలువలోకి పంపిస్తారు. రేవెల్లి సమీపంలోని హెడ్రెగ్యులేటర్ ద్వారా ఎస్సారెస్సీ డీ–83, డీ–86 కాలవలకు అందిస్తారు. తద్వారా ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 2.40లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాథమిక అంచనాలు సిద్ధం.. ప్రతిపాదిత ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్సింగ్ అధికారులతో కలిసి గతంలోనే పరిశీలించి సమీక్షించారు. రిజర్వాయర్ ఎంత సామర్థ్యంతో నిర్మించాలి..? ఎన్ని ఎకరాలు ముంపునకు గురవుతాయి..? ప్రభుత్వ భూములు, పట్టా భూములు ఎన్ని..? తదితర అంశాలపై ఇప్పటికే నీటి పారుదల శాఖ అధికారులు ప్రాథమికంగా ప్ర తిపాదనలు రూపొందించారు. 7.78 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మిస్తే 1,700 ఎకరాలు ముంపునకు గురవుతాయని అంచనాకు వ చ్చారు. ఇందులో 400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు సేకరించాల్సి ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గాయపడి.. మానసిక స్థితి కోల్పోయి..
గోదావరిఖని: స్థానిక జ్యోతినగర్కు చెందిన బండారి రాకేశ్(30) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో హోండా షోరూంలో మెకానిక్గా పనిచేసిన రాకేశ్.. ప్రస్తుతం ఏ పనీలేకుండా ఖాళీగా ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో మానకస్థితి కోల్పోయాడు. ఇదేక్రమంలో అతడి మేనమామ ఇటీవల మృతి చెందడంతో మానసికస్థితి మరింత క్షీణించింది. అలాగే చెల్లెకు ఎంగేజ్మెంట్ అయి క్యాన్సిల్ కావడంతో అది మనుసులో పెట్టుకుని మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో శనివారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. మృతుడి తండ్రి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆయన వివరించారు. కాగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుడిని నేత్రాలు సేకరించి హైదరాబాద్ తరలించినట్లు ప్రతినిఽధి వాసు తెలిపారు. రైల్వే పట్టాలపై చిక్కుకున్న కారుకొడిమ్యాల: కొడిమ్యాల శివారు.. గంగాధర సమీపంలో ఉన్న రెల్వేగేట్ మధ్య ఓ కారు చిక్కుకుంది. రైలు వస్తుందన్న సమాచరంతో గేట్మెన్ సిగ్నల్ ఇచ్చి గేట్ క్లోజ్ చేస్తుండగా.. ఆ లోపే మరోవైపు ఉన్న గేట్ ద్వారా కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న కారు డ్రైవర్ దూసుకొచ్చాడు. వెంటనే గేట్మెన్ అప్రమత్తమై సిగ్నల్ అందించి రైలును ఆపడంతో ప్రమాదం తప్పింది. తర్వాత గేట్లు తెరచి కారును బయటకు పంపించారు. లేకుంటే పెను ప్రమాదం సంభవించేంది. గల్ఫ్ ఏజెంట్పై ఎస్పీకి ఫిర్యాదుజగిత్యాలక్రైం: జగిత్యాలలో గల్ఫ్ ట్రావెల్స్ నిర్వహిస్తున్న ఓ ఏజెంట్ నిజామాబాద్ జిల్లా ఎండపల్లికి చెందిన ఐదుగురి నుంచి రూ.1.75లక్షల చొప్పున తీసుకున్నాడు. వారిని గల్ఫ్ పంపిస్తానని మోసం చేశాడు. దీంతో బాధితులు శనివారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆయన బాధితులను పట్టణ పోలీస్స్టేషన్కు పంపించారు. సీఐ కరుణాకర్ గల్ఫ్ ఏజెంట్ను పిలిపించి సత్వరమే ఎవరి డబ్బులు వారికి చెల్లించాలని ఆదేశించారు. దశలవారీగా ఇస్తనని చెప్పడంతో బాధితులు అంగీకరించారు. సదరు ఏజెంట్ కొద్దిరోజులుగా జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు చెబుతూ పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎవరైనా కార్యాలయానికి వెళ్తే మహిళారిసెప్షన్లతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ● యువకుడి బలవన్మరణం -
ఆ రోజు అందరూ ఒకే చోట
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఎక్కడ ఉన్నా ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితులందరూ ఒకే చోట కలుసుకుంటారు. కుల, మత భేదం.. సీనియర్, జూనియర్ తేడా లేదు. కాల్వశ్రీరాంపూర్ జెడ్పీ హైస్కూల్లో 1976–77 విద్యాసంవత్సరం నుంచి చిగురించిన వారి స్నేహంతో వరుసగా రెండు దశాబ్దాలుగా ఒకే చోట చేరుతారు. యోగక్షేమాలు తెలుసుకుంటారు. వివిధ కారణాలతో మృతిచెందిన గురువులు, స్నేహితులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. అనంతరం అందరూ భోజనం చేస్తారు. తాము చదివిన పాఠశాలలో ప్రతీ విద్యాసంవత్సరం ప్రతిభచాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తారు. -
స్నేహబంధానికి సార్థకత
కోరుట్లటౌన్: కోరుట్ల పట్టణానికి చెందిన గాజెంగి శ్రీధర్ ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి భార్య, కూతురు ఉన్నారు. అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈనేపథ్యంలో 1994–95లో తమతో ఆడుతూ పాడుతూ పదో తరగతి చదివి స్నేహబంధాన్ని పెంచుకున్న శ్రీధర్ చనిపోవడంతో అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు కదిలారు స్నేహితులు. ఎవరికి తోచిన రీతిలో వారు డబ్బులు సమకూర్చారు. రూ.లక్ష పోగుచేసి శ్రీధర్ కూతురు పేరిట ఫిక్స్ డిపాజిట్ చేసి అందించారు. స్నేహితుని కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆ సమయంలో అందరినీ కలుపుకుని డబ్బులు సమకూర్చడంతో పోతుగంటి శ్రీనివాస్, ఆనంద్, ప్రసాద్ తదితరులు ముందుకు కదిలి స్నేహబంధానికి సార్థకత చేకూర్చారు. ఇలాగే నాలుగేళ్ల క్రితం మరో స్నేహితుడు వాసం విద్యాసాగర్ అనార్యోగంతో చనిపోగా అతడి కుటుంబాన్ని ఆదుకునేందుకు వీరే ముందుకు కదిలి రూ.1.60 లక్షల ఆర్థికసాయం అందించారు. నలభై ఏళ్లుగా.. వెల్గటూర్(ధర్మపురి): వెల్గ టూర్ మండల కేంద్రానికి చెందిన పరకాల రమేశ్, సిరిపురం సత్యనారాయణలు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదో తరగతితో చదువు మానేసి మండల కేంద్రంలోని టైలరింగ్ షాపులో పని నేర్చుకున్నారు. పనిలో ప్రావీణ్యం సంపాదించాక 22 ఏళ్ల క్రితం 2003లో లక్కీ టైలర్ పేరుతో షాపు ప్రారంభించారు. అనంతరం దినదినాభివృద్ధి చెంది లక్కీ ఫ్యాషన్స్గా మారింది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులతో పాటు వారి కుటుంబాలు, పిల్లలు కూడా మంచి స్నేహితులుగా మారారు. భవిష్యత్లో కూడా ఎలాంటి అరమరికలు లేకుండా కలిసే ఉంటామని పేర్కొన్నారు. రక్తదాన స్నేహితుడు బోయినపల్లి(చొప్పదండి): ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాక.. వారి కళ్లలో తొణికిసలాడే ఆనందం చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని చెబుతాడు బోయినపల్లి మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన పెరుక మహేశ్. రక్తం పంచుకుని పుట్టినవారే.. రక్తదానం చేసే సందర్భం వస్తే తప్పించుకు తిరుగుతున్న రోజులివి. కానీ, ఏ సంబంధం లేకుండా పలువురికి రక్తదానం చేస్తూ స్నేహానికి కొత్త అర్థాన్ని ఇస్తున్నాడు మహేశ్. ఇప్పటికి 28 సార్లు, ఇందులో స్నేహితులకు కూడా రక్తదానం చేసినట్లు మహేశ్ తెలిపాడు. -
గంజాయి ముఠా అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కొడిమ్యాల పోలీస్స్టేషన్ పరిధి పూడూరులో గంజాయి విక్రయిస్తున్న గుండుపాషా, బాలె నవీన్, జగిత్యాలలో ఆవునూరి రణదీర్, ఆకుల అమర్నాథ్, రాయారపు మల్లికార్జున్ను అరెస్ట్ చేసి వారి నుంచి 2.250 కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కొడిమ్యాల మండలం పూడూరుకు చెందిన గుండు ప్రశాంత్, మల్యాల మండలం తాటిపల్లికి చెందిన బాలె నవీన్, గంగాధర మండలం వెంకటయ్యపల్లికి చెందిన వంశీ కొద్దికాలంగా నాగ్పూర్ ట్రైన్లో వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేసి చొప్పదండి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. పూడూరులో విక్రయిస్తుండగా గుండు ప్రశాంత్, బాలె నవీన్ను పట్టుకోగా.. మరో నిందితుడు వంశీ పారిపోయాడు. జగిత్యాల శివారులోని లింగంపేటకు చెందిన రణదీర్, తులసీనగర్కు చెందిన అమర్నాథ్, రాయపు మల్లికార్జున్ను గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించామన్నారు. వంశీ పరారీలో ఉన్నట్లు తెలిపారు. గంజాయి విక్రేతలను పట్టుకోవడంలో కృషిచేసిన పట్టణ సీఐ కరుణాకర్, మల్యాల సీఐ నీలం రవి, ఎస్సైలు సందీప్, రవికిరణ్ను డీఎస్పీ అభినందించారు. ఐదుగురు నిందితుల పట్టివేత 2.250 కిలోల గంజాయి స్వాధీనం డీఎస్పీ రఘుచందర్ -
ఆపదలో అండగా..
యైటింక్లయిన్కాలనీ(రామగుండం): యైటింక్లయిన్కాలనీ సెక్టార్–3 సింగరేణి స్కూల్లో 1993–94లో 10వ తరగతి చదివిన విద్యార్థులు ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అనే మాటకు నిర్వచనంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడ్డారు. వాట్సాప్ గ్రూప్గా ఏర్పడి చిన్ననాటి మిత్రుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సాయం అందించి ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ స్నేహితుడు యైటింక్లయిన్కాలనీకి చెందిన పెండ్యం వీరయ్య కరెంట్ షాక్తో రెండు చేతులు కోల్పోగా రూ.4.8 లక్షలు సేకరించి బాధితుడికి అందజేశారు. గోదావరిఖనికి చెందిన బాసాని లక్ష్మయ్య 2018లో అనారోగ్యంతో మృతి చెందగా రూ.1.35 లక్షలు, మరో మిత్రుడు కొండ్ర సురేశ్ 2022లో చనిపోగా రూ.2.55 లక్షలు ఆయా కుటుంబాలకు అందజేశారు. ఇప్పటి వరకు దాదాపు రూ.14 లక్షలు చేయూతనందించారు. -
వాకింగ్ ఫ్రెండ్స్
విద్యానగర్(కరీంనగర్): పదిహేనేళ్ల క్రితం కొత్తపల్లి రతన్, మోటూరి ఆంజనేయులు, తొడుపునూరి శ్రీనివాస్ వాకింగ్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు రోజూ అంబేడ్కర్ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ప్రస్తుతం 15 మంది స్నేహితులతో ట్రైగర్స్ వాకింగ్ గ్రూప్ అయ్యారు. వీరిలో కొందరికి కొందరు బంధువులు అయినా స్నేహితులుగానే కలిసి ఉంటారు. ఫంక్షన్లు, ఫిక్నిక్, పుణ్యక్షేత్రాలకు కుటుంబాలతో కలిసి వెళ్తారు. వీరిలో రాచమల్ల ప్రసాద్, శ్రీనివాస్, పల్లేర్ల శ్రీనివాస్, చీకటిమల్ల అశోక్కుమార్, తొడుపునూరి వేణుగోపాల్, పడకంటి వినోద్ తదితరుల ఆలోచన మేరకు 2023 జనవరి 2న బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఏర్పాటు చేసి కరీంనగర్ ప్రభుత్వ ప్రధానాస్పుత్రి, మాతాశిశు కేంద్రంలో చికిత్స కోసం వచ్చినవారికి రోజూ ఉదయం అల్పాహారం, సాయంత్రం భోజనాలు అందిస్తున్నారు. ప్రతీ శనివారం వీక్లీ మార్కెట్లో చిరువ్యాపారులు, గ్రామాల నుంచి వచ్చిన రైతులు, అమ్మకందారులకు, నగునూర్ దుర్గాభవానీ ఆలయంలో ప్రతీ మంగళ, శుక్ర, ఆదివారాలతో పాటు ప్రత్యేక రోజుల్లో భక్తులకు దాత సహకారంతో అన్నప్రసాదం అందిస్తున్నారు. కల్మషం లేని దోస్తీ.. చిన్ననాటి దోస్తుల్లో కల్మషం లేకుండే. కలిసి ఆడిన ఆటలు, కాకి ఎంగిలి చేసి పంచుకున్న పిప్రమేట్లు, జారే నెక్కరు పైకి దోపుకుంటూ గోనె సంచిలో పుస్తకాలు దోపుకుని భుజాల మీద చేతులేసుకుంటూ బడికి పోయిన దోస్తులు ఇప్పుడు కష్టమే. అయినా అక్కడక్కడ ప్రాణమిచ్చే దోస్తులు ఉన్నారు. వారిని జీవితకాలం నిలుపుకోవాలి. – ఎ.కిరణ్కుమార్, న్యాయవాది, రాంనగర్, కరీంనగర్ -
విద్యార్థులను ప్రోత్సహిస్తూ..
జమ్మికుంట(హుజూరాబాద్): అబాది జమ్మికుంట ప్రభుత్వ పాఠశాలలో చదివిన కాటిపల్లి లింగారెడ్డి (అసిస్టెంట్ ప్రొఫెసర్), మార్క విజయప్రతాప్(ఎన్ఆర్ఐ), పింగిళి వెంకట్రెడ్డి, అయిత శ్రీనివాస్, అమృత సురేశ్(టీచర్లు) ఐదుగురు స్నేహితుల బృందం ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. తాము చదివిన పాఠశాలలో ఏటా 10వ తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు (ముగ్గురు) రూ.10వేలు నగదు పురస్కారం అందజేస్తున్నారు. అలాగే ఇతర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బుక్స్, క్యాలెండర్, ఐడెంటిటీ కార్డులు తదితర వస్తువులు అందిస్తూ సేవాభావాన్ని చాటుతున్నారు. -
బడి దోస్తులు
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హైస్కూల్లో 2004–05లో పదో తరగతి చదివిన విద్యార్థులు 2017లో బడి దోస్తులు గ్రూపుగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వీరి స్నేహితుడు ఇల్లంతకుంటకు చెందిన బండారి రమేశ్ ఆకస్మికంగా మరణించగా రూ.13 వేలు, రోడ్డ శ్రీకాంత్ అనారోగ్యానికి గురికాగా రూ.11 వేలు, కాసుపాక తిరుపతి మృతిచెందగా రూ.11 వేలు, వల్లంపట్ల గ్రామంలో ఎర్రవెల్లి శంకర్ చనిపోగా అతడి కుటుంబానికి రూ.15 వేలు ఆర్థికసాయం అందించారు. అలాగే ముస్కాన్పేటలో హరికుమార్, మహేశ్ కుటుంబాలకు.. ఇలా చాలా కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు స్నేహితులంతా ప్రతినెలా కొంత మొత్తం బ్యాంకులో జమ చేస్తుంటారు. ఈ గ్రూపు మాదిరిగానే గాలిపెల్లి, కందికట్కూర్, ఇల్లంతకుంట ఎఫ్బీఐ, స్నేహితుల గ్రూపులు కూడా ఉన్నాయి. వీరు కూడా బాధిత కుటుంబాలకు సాయం చేస్తూ, వైద్య శిబిరాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. -
ట్రస్టుతో సేవా కార్యక్రమాలు
ఎలిగేడు(పెద్దపల్లి): మండలకేంద్రంలోని జెడ్పీ స్కూల్లో 1987–88లో పదో తరగతి పూర్తి చేసిన 100 మంది విద్యార్థులు సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో 2003 సెప్టెంబర్ 23న నానేస్తం ట్రస్టు ఏర్పాటు చేశారు. యువతకు కంప్యూటర్, డ్రైవిండ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థికసాయం, పేదలకు వైద్య ఖర్చులు, అనాథలకు ఆర్థికసాయం చేస్తున్నారు. ఎలిగేడులో వైకుంఠరథం, బాడీఫ్రీజర్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలకు దాదాపు రూ.50లక్షలకు పైగా ఖర్చు చేసి ఏడాదికి ఒకసారి అందరూ కలుసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందరం స్పందిస్తాం మా క్లాస్మేట్స్ వంద మంది కాగా ప్రస్తుతం 95మంది ఉన్నా రు. జరిగిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ, ఎవరికి ఏ ఆపద వచ్చినా అందరం స్పందిస్తాం. ఏడాదికోసారి ట్రస్టు ఏర్పాటు చేసిన రోజు కలుసుకుంటూ యోగా క్షేమాలు తెలుసుకుంటాం. ట్రస్టు నిర్వహణపై చర్చించి ముందుకెళ్తాం. – కట్ల సత్యనారాయణ, ట్రస్టు అధ్యక్షుడు -
స్నేహం గొప్ప వరం
సాక్షి, పెద్దపల్లి: మంచి స్నేహం భవిష్యత్కు మార్గం చూపిస్తుంది. చెడు అలవాట్లు కలిగినివారికి దూరంగా ఉండాలి. సినిమాలు, షికార్లు అంటూ తిరగకుండా చదువును ప్రోత్సహించే వారే నిజమైన స్నేహితులు. అలాంటివారిని నేను సంపాదించుకున్నా. ఉప్పల్లోని స్కూల్ ఫ్రెండ్స్తో ఇప్పటికీ టచ్లో ఉంటా. ఏటా మేమంతా కలిసి చిన్ననాటి చిలిపి చేష్టలను గుర్తుచేసుకొని సరదాగా గడుపుతాం. అందరం కలిసి కష్టాల్లో ఉన్న స్నేహితులకు చేయూతనందిస్తూ, చదువుకున్న పాఠశాల, ఉపాధ్యాయుల కోసం సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. – కరుణాకర్, డీసీపీ, పెద్దపల్లి -
పీఎంపీ నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం
రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ పీఎంపీ నిర్లక్షం మండల కేంద్రానికి చెందిన వృద్ధుడు గంగారాంకు శాపంగా మారింది. ఆరోగ్యం బాగాలేదని పీఎంపీతో ఇంజక్షన్ వేయించుకుంటే సెప్టిక్ కావడంతో ఆ వృద్ధుడి బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇలా ఎందుకు అయ్యిందని సదరు పీఎంపీ దగ్గరికి వెళ్లి పెద్ద హాస్పిటల్కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించుమని గంగారాం కోరగా.. నీ ఇష్టమున్న చోట చెప్పుకోమంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశాడు. నెల రోజులుగా ఏం చేయాలో తెలియక పెద్ద ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు డబ్బులు లేక ఇంట్లోనే ఆ బాధను భరిస్తున్నాడు. తనకు న్యాయం చేయాలని, పీఎంపీపై చర్యలు తీసుకోవాలని వృద్ధుడు గంగారాం వేడుకుంటున్నాడు. నెల రోజులుగా నరకయాతన పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలంటే పట్టించుకోని పీఎంపీ ఏం చేసుకుంటావో చేసుకోమని బెదిరింపులు ఏం చేయలేని నిస్సాయ స్థితిలో నలిగిపోతున్న వృద్ధుడు -
కరీంనగర్: మంత్రుల పర్యటనలో మళ్లీ బయటపడ్డ విభేదాలు
సాక్షి, కరీంనగర్: జిల్లాలో మంత్రుల పర్యటనలో మళ్లీ విభేదాలు బయటపడ్డాయి. మానకొండూరు నియోజకవర్గం గట్టుదుద్దెనపల్లి సహకార సంఘం నూతన భవన ప్రారంభోత్సవంలో ఫ్లెక్సీల విషయంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావువి తప్ప.. వేదికపైనున్న ఫ్లెక్సిపై మంత్రి అడ్లూరి ఫోటో కనిపించలేదు.గత క్యాబినెట్ విస్తరణతో విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తనకు మంత్రి పదవి దక్కుతుందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆశపడి భంగపడ్డ సంగతి తెలిసిందే. అడ్లూరికి మంత్రి పదవి దక్కడంతో కవ్వంపల్లి అలిగారు. ఆ ప్రభావమే ఇవాళ ప్రోటోకాల్ వివాదానికి కారణమనే చర్చ జరుగుతోంది.స్కూటీని ఢీకొట్టిన మంత్రుల కాన్వాయ్శంకరపట్నంలో ప్రజాపాలన మీటింగ్ ముగించుకొని వెళ్తున్న మంత్రుల కాన్వాయ్ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కేశపట్నం గ్రామానికి చెందిన సల్ల వెంకటికి స్వల్ప గాయాలయ్యాయి. కాన్వాయ్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్, పీఆర్వోలు ఉన్నారు. -
గంగాధరలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
గంగాధర: గంగాధర సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు తగ్గాయి. గతంలో రోజుకు ముప్పై నుంచి 40కి మించి రిజిస్ట్రేషన్లు జరగగా.. ప్రస్తుతం క్రయ,విక్రయదారులు రాక వెలవెలబోతుంది. వారం రోజులుగా రెండు, మూడుకు మించి డాక్యుమెంట్లు కావడం లేదని సిబ్బంది పేర్కొంటున్నారు. గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో గంగాధర, రామడుగు, చొప్పదండి, కొత్తపల్లి మండలాలకు చెందిన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కొత్తపల్లి మండలంలో కరీంనగర్ జిల్లా శివారులోని రేకుర్తి, ఆరెపల్లి, సీతీరాంపూర్, మల్కాపూర్ గ్రామాలతో పాటు కొత్తపల్లి గ్రామం ఉండటంతో ప్రతి రోజు ముప్పైకి మించి డాక్యుమెంట్లు నమోదవుతుండేవి. అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు, సబ్ రిజిస్ట్రార్ సస్పెండ్ కావడం, ఇంటి నంబర్తో రిజిస్ట్రేషన్లకు వచ్చే వారికి ఖచ్చితమైన నిబంధనలు అమలు చేయడంతో రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కొత్తపల్లి, రేకుర్తి రెవెన్యూ పరిధిలోని భూముల్లో సమస్యలు ఎదురవుతుండడంతో కొనుగోలుదారులు ముందుకు రావడంలేదు. సంబంధిత భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారులు మొగ్గు చూపడం లేదు. -
బీజేపీలో సొంత నిర్ణయాలుండవు
చొప్పదండి: బీజేపీలో సొంత నిర్ణయాలుండవని, పదవుల కోసం పాకులాడబోమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తామని, పత్రికల్లో తప్పుడు వార్తలు రాయొద్దని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మాదిరిగా బీజేపీని చూడొద్దని విజ్ఞప్తి చేశారు. కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించగా, చొప్పదండిలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. అనంతరం మోడీ కానుక కార్యక్రమంలో భాగంగా చొప్పదండి, రామడుగు మండలాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను రారాజు చేయడమే మోడీ లక్ష్యమన్నారు. 11 ఏళ్లలో రూ.71లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు చేసిన ఘనత మోడీ ప్రభుత్వానిదన్నారు. పదోతరగతి బాగా చదివిన విద్యార్థులకు స్కూటీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తా అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఒక లక్షా 81 వేల 305 మంది రైతుల ఖాతాల్లో రూ.36.26 కోట్లకు పైగా నిధులు జమయ్యాయని తెలిపారు. చొప్పదండి మండలంలో 4,612 మంది రైతుల అకౌంట్లలో 92.24 లక్షలు జమ చేసినట్లు తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ కేంద్ర మంత్రి గొప్ప సంకల్పంతో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారని కొనియాడారు. 20వేల సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, కేవీకే శాస్త్రవేత్తలు, మండల అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రైతును రాజు చేయడమే మోడీ ప్రభుత్వ లక్ష్యం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొప్పదండిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ -
బెస్ట్ ఫ్రెండ్ శివం ఉపాధ్యాయ
సిరిసిల్ల: నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పడం చాలా కష్టం. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో, కెరీర్లో అనేక మంది ఫ్రెండ్స్ అయ్యారు. నా కంటే సీనియర్ ఆఫీసర్ అయిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ ఝా చాలా క్లోజ్గా ఉంటారు. నాకు మంచి ఫ్రెండే. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే.. 2021 ఐపీఎస్ బ్యాచ్మెట్ శివం ఉపాధ్యాయ. అతను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పవచ్చు. అతనితో ఐదేళ్లుగా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. చాలా మంచి సలహాలు ఇస్తారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఏఎస్పీగా పని చేస్తున్నారు. – మహేశ్ బి గితే, ఎస్పీ, రాజన్న సిరిసిల్ల -
స్నేహితుడా..
● తోటి మిత్రులకు సాయంగా.. ● దూరమైనవారి జ్ఞాపకంగా.. ● సేవలు చేస్తూ.. అండగా నిలుస్తూ.. ● ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా పలువురు ● నేడు స్నేహితుల దినోత్సవం‘బృందావనంలో గోపాలురతో కన్నయ్య చేసిన దోస్తీ.. కుచేలుడితో కృష్ణుడి స్నేహం.. రామాయణంలో శ్రీరాముడు.. సుగ్రీవుల మైత్రి. అశోకవనంలో కాపలాగా ఉన్న త్రిజట సీతమ్మతల్లికి ఎన్నోవిధాలుగా ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలువగా.. దశరథుడితో ఉన్న మైత్రితో జటాయువు సీతమ్మ తల్లిని రక్షించేందుకు రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం మంచీ చెడు, విచక్షణ, కీర్తి, అపకీర్తికి తావులేదని మహాభారతం వివరించింది’. స్నేహం.. అనిర్వచనీయం.. అద్వితీయం.. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను పంచే ఏకై క బంధం స్నేహం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం.. ఓదార్పునిచ్చేది నేస్తం.. విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. విషాదంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే నలుగురు స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు. అందుకే మనిషికి తలా ఓ పేరున్నప్పటికీ.. అందరినీ దగ్గరకు చేర్చేది స్నేహబంధం మాత్రమే. స్నేహంకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కష్టమైనా.. నష్టమైనా.. మన ఫ్రెండ్ కోసమే కదా అనిపిస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేకమంది తమ స్నేహితుల కోసం ఎన్నోరకాల సేవలందిస్తున్నారు. జీవితాలను నిలబెడుతున్నారు. కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. వారి నుంచి దూరమైన స్నేహితుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్నేహితుల పేరిట మరికొందరికి సాయంగా నిలుస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!! – విద్యానగర్/సప్తగిరికాలనీస్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 100మందిని పలుకరించగా.. అభిప్రాయాలు ఇలా..12స్నేహం అంటే..? అవసరాలు తీర్చేది కల్మషం లేనిది 88ఫ్రెండ్షిప్ కలుషితమైందా? అవును కాలేదు 3862నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు? ఒకరు ఇద్దరికి మించి 72నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం?అమ్మానాన్న తరువాత ఫ్రెండ్ ఫస్ట్ నాన్న తరువాత ఫ్రెండ్, అమ్మ ఫ్రెండ్ తరువాత అమ్మ,నాన్న 582814 -
నగరంలో నాఖాబందీ
కరీంనగర్క్రైం: శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సీపీ గౌస్ఆలం ఆధ్వర్యంలో శని వారం రాత్రి 10గంటలకు నగరంలో మెరుపు నాఖాబందీ చేపట్టారు. 20 ప్రధాన కూడళ్ల వద్ద సుమారు 150మంది పోలీసులు తనిఖీల్లో పా ల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్యాంపరింగ్, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్, సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీ లు చేపట్టామని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలను సీపీ కోరారు. అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలుకరీంనగర్ కార్పొరేషన్: నగరంలోన్ని అన్ని డివిజన్లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. శనివారం నగరంలోని 10,11 డివిజన్లకు చెందిన వార్డు కార్యాలయాలను సందర్శించారు. 11వ డివిజన్ పరిధిలోని న్యూశ్రీనగర్ కాలనీలో పిల్లలపార్క్ను, 12వ డివిజన్ వార్డు కార్యాలయాన్ని పరిశీలించారు. 35వ డివిజన్ సప్తగిరికాలనీలో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ఆధునీకరణ పనులను తనిఖీ చేశారు. మహిళా సంఘం భవనాన్ని సందర్శించారు. సప్తగిరికాలనీ వాసులకు వైద్య సేవలందించేందుకు అర్బన్ హెల్త్ సెంటర్కు సొంతభవం సమకూరుస్తున్నట్లు తెలిపారు. న్యూ శ్రీనగర్ కాలనీలోని పిల్లల పార్క్లో చెడిపోయిన వాటర్ ఫౌంటెన్, ఓపెన్ జిమ్ పరికరాలకు మరమ్మతులు చేసి వాడుకలోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. నేడు జిల్లాలో మంత్రుల పర్యటనకరీంనగర్ కార్పొరేషన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలోని స్పోర్ట్స్స్కూల్కు హెలిక్యాప్టర్ ద్వారా చేరుకొంటారు. మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నంకు రోడ్డు మార్గం ద్వారా వెళ్లి సాయంత్రం 4 గంటల వరకు కొత్త రేషన్కార్డుల పంపిణీతో పాటు, గట్టుదుద్దెనపల్లిలోని విత్తననిల్వ గోదామును స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30కు చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగుకు చేరుకొని 5.30 గంటల వరకు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి రేషన్కార్డులు పంపిణీ చేస్తారు. 5.30 గంటలకు రామగుడు నుంచి బయలుదేరి 6 గంటలకు కరీంనగర్కు చేరుకొంటారు. అక్కడి నుంచి హెలిక్యాప్టర్ ద్వారా హైదరాబాద్కు వెళ్తారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ స్తంభాల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ. పీటీసీ ఫీడర్ పరిధిలోని మార్క్ఫెడ్ ముందు, శ్రీహరినగర్, సంతోశ్నగర్, గణేష్నగర్, కుర్మవాడ, బడిగుడి, పిటిసీ, బుల్స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.లావణ్య తెలిపారు. బల్దియా డీసీకి షోకాజ్ నోటీసుకరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహియొద్దీన్కు మున్సిపల్ పరిపాలనశాఖ జాయింట్ డైరెక్టర్ ఫాల్గున్కుమార్ షోకాజ్ నోటీసు జారీ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నగరపాలకసంస్థ పరిధిలో ఆమోదించిన సెల్ఫ్ అసెస్మెంట్ల వివరాలను వారంరోజుల్లో సమర్పించాలని ఆదేశించినా, నివేదిక సమర్పించకపోవడంతో షోకాజ్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. షోకాజు అందుకున్న మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, సెల్ఫ్ అసెస్మెంట్ పేర్లు, వివరాలు ఇవ్వాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బాల్య మిత్రుడి జ్ఞాపకాలతో స్కూల్కు శ్రీకారం
సిరిసిల్ల: ‘అరేయ్ మన మిత్రుడు దయానంద్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. వాడిని అందరూ గుర్తుంచుకునే విధంగా ఏదైనా చేద్దాం’ అంటూ.. బాల్య స్నేహితులు ఏకమయ్యారు. ఓ స్కూల్ను ఏర్పాటు చేశారు. 19 ఏళ్ల కిందటే రూ.30లక్షలు వెచ్చించి శాశ్వత భవనాన్ని నిర్మించారు. వందలాది మంది పిల్లలకు ఉచితంగా ఇంగ్లిష్ మీడియంలో విద్యను అందిస్తున్నారు. సిరిసిల్లలోని పద్మనగర్కు చెందిన గోసికొండ దయానంద్ 2002లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని స్నేహితుడు గాజుల శ్రీనివాస్ యూఎస్ఏ సాప్ట్వేర్ ఇంజినీరు. దయానంద్పై ఉన్న అభిమానంతో స్నేహితులతో కలిసి పట్టణ శివారులో 22 గుంటల భూమిని కొనుగోలు చేశారు. 19 ఏళ్ల కిందట సుమారు రూ. 30 లక్షలు వెచ్చించి స్కూల్ను 2006లో స్థాపించారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. రాజీవ్నగర్లోని పేదలందరూ తమ పిల్లలను దయానంద్ మెమోరియల్ స్కూల్కు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఏటా 25 మంది జెడ్పీస్కూళ్లకు వెళ్తున్నారు. నిర్వహణకు ఏటా రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ట్రస్ట్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్ స్నేహితులు భీమేశ్వర్ అంకతి, రాంబాబు చేబ్రోలు, జి.రాజశేఖర్, ప్రసన్న పోల్సాని, విజయ్కృష్ణ భరాతం, మురళీకృష్ణ సింగారం, రవీందర్ నాగంకేరి, రవి వూరడి, గణేశ్ గోసికొండ భాగస్వాములుగా ఉన్నారు. -
‘ఇందిరమ్మ’ అనర్హులకు చెక్
● పీఎం ఆవాస్ యోజన యాప్ ద్వారా గుర్తింపు ● ఎల్–1 జాబితా అర్హుల వివరాలపై రీసర్వేకరీంనగర్రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేయగా కొత్తగా పీఎం ఆవాస్ యోజన యాప్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గతనెల15నుంచి జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. ప్రభుత్వం రెండురోజులక్రితం ఎల్–1 జాబితాలోని అర్హుల వివరాలపై మరోసారి సమగ్ర విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో అర్హుల వివరాలను సేకరిస్తున్నారు. యాప్లో సమగ్ర వివరాల నమోదు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా తొలివిడతలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాలతో పాటు రెండో విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్ధిదారుల వివరాలను కార్యదర్శులు సేకరిస్తున్నారు. గతనెల15నుంచి లబ్ధిదారు పేరు, చిరునామా, ఆధార్కార్డు నంబరు, బ్యాంకుఖాతా, ఉపాధిహామీ కూలీ అయితే జాబ్కార్డు వివరాలు నమోదు చేస్తున్నారు. 400 నుంచి 600 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఇంటి కొలతలు తీసుకుని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోవడం, యాప్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో లబ్ధిదారుల వివరాల నమోదులో జాప్యమేర్పడుతోంది. కొందరు లబ్ధిదారుల ఆధార్, ఐరిస్తో ఫొటో సరిపోవడం లేదు. మరికొందరి ఆధార్ అప్డేట్ చేసుకోకపోవడంతో సాంకేతికంగా తీసుకోవడంలేదు. పూర్తి వివరాలను నమోదు చేసినప్పటికి సర్వర్ మొరాయిస్తుందని కార్యదర్శులు పేర్కొంటున్నారు. ముందుగా ఎంపికై న లబ్ధిదారుల వివరాల సర్వే గత నెల 31వరకు పూర్తి చేయాల్సి ఉండగా ఎల్–1 జాబితాలోని అర్హులను సర్వే చేయాలనే ఆదేశాలతో ఆదివారం వరకుగడువు పొడిగించారు. గడువులోగా సర్వే పూర్తి చేసే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వం గడువు పెంచే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్– 1జాబితా అర్హుల రీసర్వే జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లో పీఎం ఆవాస్యోజన సర్వే నడుస్తోంది. ప్రభుత్వం కొత్తగా ఎల్– 1 జాబితాలోని అర్హులపై రీసర్వే చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలతో సర్వేలో కొంత జాప్యమవుతోంది. నిర్ణీత గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాం. – ఎస్.రాజేశ్వర్, ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా గృహ నిర్మాణ సంస్థ పీఎం ఆవాస్ యోజన సర్వే వివరాలు జిల్లాలో గ్రామ పంచాయతీలు 318 సర్వే చేస్తున్న గ్రామ పంచాయతీలు 305 సర్వే ప్రారంభించని గ్రామ పంచాయతీలు 13 ఎల్– 1అర్హులు 49,470 రద్దు చేసిన ఇళ్లు 863 మొత్తం లబ్ధిదారులు 48,607 సర్వే పూర్తయినవి 5,915 సర్వే పూర్తి చేయాల్సినవి 42,692 -
చేతులెత్తి మొక్కుతున్నా.. నీళ్లిచ్చి పర్యటించండి
● లేదంటే రైతులతో కలిసి మంత్రులను అడ్డుకుంటాం ● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కొత్తపల్లి(కరీంనగర్): ‘చెరువులు, కుంటలు, వాగులు వంకలు, ప్రాజెక్టులు అడుగంటి ఎడారిని తలపిస్తున్నాయి. రైతులు సాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. చేతులెత్తి మొక్కుతున్న గోదావరి జలాలు లిఫ్ట్ చేసి రైతులను ఆదుకోండి’ అంటూ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి చేశారు. లేదంటే రైతులతో కలిసి మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ సీతారాంపూర్లోని ఓ హోటల్లో శనివారం మాట్లాడుతూ.. ఏ ముఖం పెట్టుకొని భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు జిల్లా పర్యటనకు వస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా నీటిని అందించే అవకాశం ఉన్నా.. పట్టించుకోకుండా ఉత్తర తెలంగాణను ఎడారి ప్రాంతంగా మార్చుతున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లను మిడ్మానేరుకు తరలించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై చిత్తశుద్ధి ఉంటే నీటిని విడుదల చేశాకే మంత్రులు జిల్లాలో పర్యటించాలని, లేకుంటే మంత్రుల పర్యటనలు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సారెస్పీ, మిడ్ మానేరు, ఎల్ఎండీ, కడెం, నారాయణపూర్ రిజర్వాయర్ల ద్వారా నీరందించే మార్గాలు చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్గౌడ్, నాయకులు నారాయణరావు, జితేందర్రెడ్డి, గంగాధర్, విజయేందర్ రెడ్డి, సురేందర్, నజీర్, అఖిల్, చుక్కా శ్రీనివాస్, రమేశ్, మల్లేశ్, మల్లయ్య, శంకర్ పాల్గొన్నారు. -
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల -
స్నేహబంధమే శాశ్వతం
సాక్షి, పెద్దపల్లి: స్నేహబంధమే అన్నింటికన్నా శాశ్వతమైనది. నేను ఇప్పటికీ నా స్కూల్మేట్స్ను కలుస్తుంటా. చిన్నప్పుడు ఖమ్మం పాఠశాలలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నం. చదువులు పూర్తయ్యాక చిన్ననాటి మిత్రులందరూ వివిధ దేశాలు, పట్టణాల్లో డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, వ్యాపారులుగా స్థిరపడ్డారు. ఎవరెక్కడ ఉన్నా మేమంతా ఒకరికొకరు తోడుగా ఉన్నామన్న భరోసా ఇస్తూ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాం. 30 ఏళ్లుగా మా స్నేహం కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్ ద్వారా నిత్యం టచ్లో ఉంటాం. ఏడాదికోసారి ఒకచోట కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటాం. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నిర్వహిస్తా: బండి సంజయ్
కరీంనగర్: తనను మంత్రి పదవి నుంచి విముక్తి కల్పించాలంటూ తాను అధిష్టానాన్ని కోరినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. అవన్నీ అవాస్తవమని బండి సంజయ్ ఖండించారు. మంత్రి పదవి తనకు వద్దని గానీ, కావాలని గానీ తాను అధిష్టానానికి చెప్పలేదన్నారు. ఈ మేరకు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ‘క్రమశిక్షణ గల బీజేపీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలి అనేది అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలాంటింది కాదు బీజేపీ. నాకు మా నాయకత్వం ఏ బాధ్యత ఇచ్చినా నేను నిర్వహిస్తా’ అని తెలిపారు.రైతును రారాజున చేయడమే మోదీ లక్ష్యం.. చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానమంత్రి కిసాన్ ఉత్సవ్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. రై‘తును రారాజును చేయడమే మోదీ లక్ష్యం. 11 ఏళ్లలో రైతుల కోసం రూ. 71 లక్షల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం మోదీది. రైతులు ఎరువుల కోసమే సబ్సిడీ రూపంలో రూ.11 లక్షల కోట్లకుపైగా ఖర్చు చేశాం. కనీస మద్దతు ధర అందించేందుకు 16 లక్షల 35 వేల కోట్లు ఖర్చు చేసింది మోదీ సర్కారు. కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతుల ఖాతాల్లో రూ.3 లక్షల 69 వేల 561 కోట్లు జమ చేశాం. టెన్త్ బాగా చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు స్కూటీ ఇచ్చేందుకు యత్నిస్తా ’ అని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
యాంత్రీకరణకు మహర్దశ
ఈ సారైన రైతులకు చేరేనా..! ప్రభుత్వం విడుదల చేసే నిధులను ఆర్థిక సంవత్సరంలోనే ఖర్చు చేయాలి. గత మార్చి నెల 17వ తేదీన నిధులు కేటాయించగా అంతే వేగంగా వ్యవసాయశాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. 25వరకు దరఖాస్తులు తీసుకోగా వచ్చిన వాటిని ఆన్లైన్ చేసి ప్రక్రియకు సిద్ధం చేయగా అంతలోనే ఆర్థిక సంవత్సరం ముగిసింది. దీంతో నిధులు ఖర్చు చేయలేని పరిస్థితి. అయితే 1990 నుంచి వ్యవసాయ యాంత్రీకరణ పథకం కొనసాగుతోంది. 2014వరకు యాంత్రీకరణ పథకానికి నిధులు రాగా అప్పటి నుంచి నిధుల కేటాయింపు లేదు. ఈ క్రమంలో గత మార్చి నెలలో యాంత్రీకరణ పథకాన్ని తెరపైకి తేగా 2024–25 సంవత్సరానికి గానూ కరీంనగర్ జిల్లాకు రూ.73లక్షలు కేటాయించింది. కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరిస్తాయి. ఈ పథకానికి మహిళా రైతులు మాత్రమే అర్హులు కాగా గతంలో పురుషులకే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా 50శాతం రాయితీతో పరికరాలు ఇస్తుండటం, దాదాపు దశాబ్దం తరువాత అవకాశం రావడంతో దరఖాస్తులు 5వేల వరకు వచ్చాయని సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో తక్కువ నిధులు కేటాయించగా ఈ సారి రెట్టింపు నిధులు కేటాయించడం శుభ పరిణామం. కరీంనగర్ అర్బన్: దశాబ్దానికి పైగా దూరమైన వ్యవసాయ యాంత్రీకరణ పథకం మళ్లీ చేరువవుతోంది. గత ఆర్థిక సంవత్సరంలోనే రైతులకు రాయితీ పరికరాలు చేరాల్సి ఉండగా సదరు సంవత్సర ముగింపు నెలలో నిధులు కేటాయించడం, అంతలోనే మార్చి ముగియడంతో పథకం నిలిచిపోయింది. తాజాగా మళ్లీ నిధులను కేటాయించగా దరఖాస్తుల స్వీకరణకు జిల్లా వ్యవసాయశాఖ చర్యలు చేపడుతోంది. ఈ నెల 5నుంచి 15 వరకు దరఖాస్తులను స్వీకరించనుండగా ఆయా దశల వారీగా ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లాకు 10.4కోట్లు కేటాయించారు. ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2025–26 సంవత్సరానికి వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలుకు రూ. 10.4 కోట్ల నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50 శాతం రాయితీ, జనరల్ కేటగిరీ రైతులకు 40శాతం రాయితీ వర్తిస్తుంది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి యాసంగి వరకు పూర్తిస్థాయిలో అమలు చేస్తారు. ఈ సారి 15 రకాల యంత్ర పరికరాలతో వ్యవసాయ యాంత్రీకరణ పథకం అమలు చేస్తున్నారు. మళ్లీ దరఖాస్తుల స్వీకరణ ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పథకం అమలుకు సంబంధించి ఆగస్టు 5నుంచి 15వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో చేసిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. వచ్చిన దరఖాస్తులను వ్యవసాయాధికారులు 16వ తేదీన జిల్లా కలెక్టర్కు అందజేస్తారు. 20 వరకు వాటిని పరిశీలిస్తారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు కారణాలను తెలియజేస్తారు. ఎంపికై న రైతులకు ఈ నెల 27 నుంచి సెప్టెంబరు 5వరకు మంజూరు పత్రాలు, సెప్టెంబరు 7 నుంచి 17 వరకు పరికరాలు పంపిణీ చేస్తారు. -
నాన్న కార్నియా దానం చేశాం
మా నాన్న శౌరయ్య అనారోగ్యంతో గత జూన్ 3న మృతి చెందాడు. బంధువులు వారిస్తున్నా శ్మశాన వాటికలో పార్థివదేహాన్ని ఖననం చేయకుండా అర్ధగంట ఆపాం. సదాశయ ఫౌండేషన్ అవగాహన కల్పించగా, కుటుంబ సభ్యులను ఒప్పించా. టెక్నీషియన్ను శ్మశానవాటికకే రప్పించి నేత్రాలు దానం చేయించా. – విజయ్కుమార్, గోదావరిఖని ముగ్గురికి పునర్జన్మ మా నాన్న రామకృష్ణ బీపీ పెరి ఇంట్లో పడియాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ చికిత్స పొందుతూ గత జూన్ 29న బ్రెయిన్ డెడ్ అయ్యాడు. ఆయన అవయవాలను దానం చేస్తే పలువురికి పునర్జన్మ కల్పించవచ్చని జీవన్ధాన్ కో ఆర్డినేటర్లు కౌన్సెలింగ్ ఇవ్వడంతో కాలేయాన్ని ఒకరికి, మూత్రపిండాలను మరోఇద్దరికి దానం చేశాం. దీంతో మా నాన్న అవయవాలు వారికి పునర్జన్మ నిచ్చాయి. – తుమ్మ ప్రణయ్, గోదావరిఖని అవగాహన పెరుగుతోంది అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. సదాశయ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 1,511 వరకు నేత్రదానాలు, 90 వరకు అవయవదానాలు, 151 వరకు దేహదానాలు జరిగాయి. 1,600 వరకు అవయవదానాలపై అవగాహన సదస్సులు నిర్వహించాం. సుమారు 50,000లకు పైగా మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానాలకు ప్రజలు స్వచ్ఛందంగా అంగీకారం తెలిపారు. – సీహెచ్ లింగమూర్తి, జాతీయ ప్రధాన కార్యదర్శి, సదాశయ ఫౌండేషన్ -
దోమలపై మీనాస్త్రం
గంబూిసియా చేపలతో దోమల వ్యాప్తికిచెక్●● నీటి గుంతల్లో వేసేందుకు ప్రణాళిక ● లక్ష్మినగర్ చేపలు వదిలిన కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ● నగరం మొత్తం అమలుకు ఆదేశంకరీంనగర్ కార్పొరేషన్: నగరంలో దోమల వృద్ధికి చెక్ పెట్టేందుకు నగరపాలకసంస్థ చర్యలు చేపట్టింది. వర్షాకాలం వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉండడం, అందుకు దోమలే ప్రధాన కారణం అవుతుండడంతో నివారణ దిశగా ప్రణాళిక రూపొందించింది. నగరంలో ఖాళీ ప్రదేశాలు అధికం కావడం, వర్షపు నీళ్లు నిలుస్తుండడం తెలిసిందే. ఆ నీటి గుంతలు దోమల పుట్టుకకు కారణమవుతుండడంతో, దోమల పుట్టుకను హరించే గంబూసియా చేపలను వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది. లార్వా తినే గంబూిసియా దోమల వృద్ధిని అరికట్టడంలో గంబూసియా చేపలు అత్యంత కీలకం. సాధారణంగా వర్షాకాలంలో దోమలు వ్యాధుల విజృంభణకు కారణమవుతాయి. దోమల నివారణకు స్ప్రే, ఫాగింగ్, ఆయిల్బాల్స్ లాంటివి రసాయనాలతో కూడి ఉంటాయి. దోమల పుట్టుకనే లేకుండా చేసే ఈ గంబూసియా చేపలు ఎలాంటి హానికరం కావు. నీటి గంతల్లో దోమలు పెట్టిన గుడ్లు, లార్వా దశ దాటి దోమలుగా మారడానికి దాదాపు పదిహేను రోజులు పడుతుంది. ఆ గుంతల్లో గంబూిసియా చేపలు వదలడం వల్ల, ఆ చేపలు దోమల గుడ్లు, లార్వాను ఆహారంగా తీసుకొంటాయి. ఫలితంగా దోమల పుట్టుకే లేకుండా పోతుంది. మత్స్యశాఖ నుంచి సేకరణ నగరంలోని ఉజ్వల పార్క్ సమీపంలోని మత్స్యశాఖ చేపల పెంపక కేంద్రంలో ఈ గంబూసియా చేపలను పెంచుతున్నారు. ఒక్కో ప్యాకెట్లో 200 నుంచి 300 చేపపిల్లలు ఉంటాయి. ఇలా ప్యాకెట్లలో తీసుకువచ్చి, నీటి గుంతల్లో వదులుతుంటారు. నీటి గుంతల గుర్తింపు నగరపాలకసంస్థ పరిధిలో వర్షపు నీళ్లు నిలిచి, దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్న నీటిగుంతల గుర్తింపును పారిశుధ్య విభాగం చేపట్టింది. ఆయా డివిజన్లలో ఉన్న నీటి గుంతల వివరాలు సేకరించి ఇవ్వాలని సంబంధిత జవాన్లను అధికారులు ఆదేశించారు. నగరంలోని 66 డివిజన్లలో దాదాపు 250 నీటి గుంతల వరకు గుర్తించినట్లు సమాచారం. ఇలా గుర్తించిన నీటి గుంతల్లో దశలవారీగా అంటే వారం రోజుల్లోగా గంబూిసియా చేపలను వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. లక్ష్మినగర్ నుంచి శ్రీకారం లక్ష్మినగర్ నుంచి గంబూిసియా చేపలను నీటి గుంతల్లో వదిలే కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది. కాలనీలోని నీటి గుంతలో గంబూసియా చేపలను కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అధికారులతో కలిసి వదిలారు. దోమలు వృద్ధిచెందే ప్రతి నీటి గుంతలో చేపలు వదిలి, దోమలను ఆదిలోనే అంతమొందించాలని నగరవాసులు కోరుతున్నారు.వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి నీటి గుంతల్లో గంబూసియా చేపలను వదిలే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తాం. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎక్కడెక్కడ నీటి గుంతలున్నాయనేది గుర్తిస్తున్నాం. ఆ నీటి గుంతల్లో చేపలను వదలడం ద్వారా, దోమలు పుట్టకుండా చర్యలు చేపడుతాం. – డాక్టర్ కట్ట సుమన్కుమార్, మెడికల్ ఆఫీసర్, నగరపాలకసంస్థ -
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి
గొల్లపల్లి: మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని తునికి శ్రీనివాస్ మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాములపల్లికి చెందిన తునికి శ్రీనివాస్ జగిత్యాల వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వెంగళాపూర్ ఎక్స్రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనివాస్ జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక వెంగళాపూర్ ఎక్స్రోడ్డుకు సమీపంలో చిరువ్యాపారం నిర్వహిస్తున్న తన తల్లి వద్దకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
తప్పంతా వాళ్లదే
● రెవెన్యూశాఖ సమాచార లోపంతోనే పొరపాట్లు ● స్థలాల డీమార్కేషన్ చేయకపోవడంతోనే తప్పులు ● ప్రతీ డాక్యుమెంట్ పరిశీలించాలంటే ఇబ్బంది ● సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాం ● పత్రాలు ఉంటే ఇంటినంబర్లకు రిజిస్ట్రేషన్లు ● డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.వందల కోట్లు అవినీతి.. ప్రభుత్వ భూములను ఏదో ఒక కారణం చూపడం, రిజిస్ట్రేషన్లు చేసేయడం, విషయం బయటికి పొక్కితే అవునా..? అంటూ నాలిక కరుచుకోవడం.. నెపమంతా రెవెన్యూ విభా గంపైకి నెట్టేయడం.. ఇదీ రిజిస్ట్రేషన్శాఖలో భూ ములు రిజిస్ట్రేషన్ చేసే అధికారుల తీరు. ఇటీవల కరీంనగర్ పరిధిలో రూ.వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్శాఖ అధికారులు అప్పనంగా రిజిస్ట్రేషన్ చేయడంపై లోకాయుక్త మొట్టికాయలు వేయడంతో రిజిస్ట్రేషన్శాఖ లీలలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. సంబంధితశాఖ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ మాత్రం జరుగుతున్న అవినీతి కార్యక్రమాల్లో సబ్రిజిస్ట్రార్ల పాత్ర అసలు లేదని, ఇదంతా రెవెన్యూ విభాగం చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఏ భూమి ప్రభుత్వానిదో, ఏ భూమి నిషేధితమో వారు సమాచారం ఇవ్వడం లేదని, అందువల్లే.. సబ్రిజిస్ట్రార్లు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని, సమాచారం ఉంటే వారు అలా ఎందుకు చేస్తారని శుక్రవారం శ్రీసాక్షిశ్రీతో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో హుజురాబాద్, ఇటీవల గంగాధర సబ్రిజిస్ట్రార్లపై ఈ కారణంగానే వేటు పడిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ రికార్డుల్లో.. కొత్తపల్లిలోనే సర్వే నంబరు 272/14లో ఉన్న 20 గుంటల భూమిని తొమ్మిదిమందికి ఇటీవల మాజీ సబ్రిజిస్ట్రార్ నూర్ అఫ్జల్ఖాన్ రిజిస్ట్రేషన్ చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సబ్రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటువేశారు. జూలై 26వ తేదీన సస్పెండ్ చేసినా.. కార్యాలయానికి వచ్చి.. 28వ తేదీన కూడా పనిచేయడం గమనార్హం. ఆయన చేతికి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చేలోగా.. 20 గుంటల భూమిలో జరిగిన తొమ్మిది రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. 272 సర్వేనంబర్లో మిగిలిన బైనంబర్లతో ఉన్న భూమి కూడా ప్రభుత్వ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో ఇప్పటికీ చూపిస్తోంది. అయినా, తమకు సమాచారం లేదంటూ రిజిస్ట్రేషన్శాఖ అధికారులు చెబుతున్నారు. పైపెచ్చు.. రెవెన్యూ విభాగం తమకు ప్రొహిబిటెడ్ భూముల సమాచారం ఇవ్వడం లేదంటూ సబ్రిజిస్ట్రార్లు యథేచ్ఛగా ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేస్తుండటం గమనార్హం. ఇంటి నంబర్ల బాగోతం జిల్లా రిజిస్ట్రేషన్శాఖలో వెలుగుచూస్తున్న వరుస అక్రమాలపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. కొత్తపల్లిలోని సర్వే నంబరు 272/14లోని 20 గుంటల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంటి నంబర్లతోనూ పలు ప్రభుత్వ భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్లో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో షెడ్లుకట్టి, సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇంటినంబర్లు పొందిన వందలాది ఇళ్ల వివరాలను కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గుర్తించింది. ఆయా నంబర్లపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని రిజిస్ట్రేషన్ శాఖకు అధికారికంగా లేఖ రాసింది. దీంతో నగరంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం కాకుండా అడ్డుకట్ట వేయగలిగినట్లయింది.జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంరెండు నెలల్లో రూ.వందల కోట్ల అక్రమాలు కొత్తపల్లి మండలంలోని సర్వే నంబర్లు 175, 197, 198లోని దాదాపు 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో జరిగిన 476 రిజిస్ట్రేషన్లు లోకాయుక్త ఆదేశాలతో రద్దయిన విషయం తెలిసిందే. 175, 197, 198 సర్వేనంబర్లలోని 20 ఎకరాల ప్రభుత్వ భూమి విషయంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల మధ్య సమన్వయలోపం ఉందన్న విషయం 1995లోనే వెలుగుచూసింది. మూడు దశాబ్దాలు గడిచినా ఈ రెండు శాఖలు ఎందుకు పరస్పరం సమాచారం ఇచ్చిపుచ్చుకోలేదో.. ఎందుకు లోకాయుక్త నుంచి ఆదేశాలు వచ్చే వరకూ రిజిస్ట్రేషన్లు చేశారో జిల్లా ఉన్నతాధికారులకే తెలియాలి. ఫలితంగా ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొన్న 476 మంది అమాయకులు న్యాయం కావాలంటూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ కొనుగోళ్లతో రూ.వందల కోట్లు చేతులు మారాయి.పత్రాలుంటే రిజిస్ట్రేషన్లు చేస్తాం ఇంటినంబర్ల విషయంలో మాకు కొన్ని ఆదేశాలు వచ్చిన మాట వాస్తవమే. సరైన డాక్యుమెంట్లు, పన్నులు కట్టిన పత్రాలు, గ్రామ కార్యదర్శి లేదా బల్దియా కమిషనర్ ఎండార్స్మెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తాం. ప్రొహిబిటెడ్ భూముల విషయంలో రెవెన్యూశాఖదే బాధ్యత. వివాదాస్పద భూములను ఎప్పటికప్పుడు డీమార్కేషన్ చేసి రికార్డులను అప్డేట్ చేయకపోవడంతో సమస్య ఉత్పన్నమవుతోంది. చాలా సందర్భాల్లో సబ్రిజిస్ట్రార్లు ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలను తెలియకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మాకు ఫీల్డ్ స్టాఫ్ లేరు. ప్రతీ ప్రాపర్టీని విచారణ చేయాలంటే.. మేం రోజుకు ఒక్క డాక్యుమెంట్ కూడా చేయలేం. ఇప్పటికే పని ఒత్తిడితో సతమవుతున్నాం. – ప్రవీణ్కుమార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, కరీంనగర్ -
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
తిమ్మాపూర్: తిమ్మాపూర్ మండలం మొగిపాలెం శివా రులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కరీంనగర్లో నివసిస్తున్న చిగురుమామిడి మండలం రేకొండకు చెందిన మోరే రాజు(38), మామిడి కనకయ్య(55) శుక్రవారం బైక్పై రేకొండకు వెళ్లి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరిగి కరీంనగర్ వెళ్తుండగా మొగిలిపాలెం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడ్డారు. కనకయ్య అక్కడిక్కడే మృతిచెందగా, రాజు తీవ్రంగా గాయపడ్డాడు. 108 వాహనంలో రాజును కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కనకయ్య చిన్నాన్న ఐదురోజుల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లిపాల ప్రాముఖ్యతను వివరించాలి
● అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కరీంనగర్: తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 7వరకు నిర్వహించనున్న కార్యక్రమాల్లో తల్లిపాల ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో తల్లిపాల వా రోత్సవాల నిర్వహణ సమన్వయ సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఐసీడీఎస్, ఆరోగ్యశాఖ సమన్వయంతో అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆరోగ్య, పోషన్ అభియాన్ సిబ్బంది తల్లిపాల ప్రాధాన్యతను వివరించాలన్నారు. తల్లిపాల ప్రాముఖ్యతను వివరించే పోస్టర్లు బ్యానర్లు ప్రదర్శించాలని తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో అన్నప్రాసన, అక్షరాభ్యాసం, సీమంతం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం వారోత్సవాల పోస్టర్లు ఆవిష్కరించారు. ఫేస్ రికగ్నేషన్ హాజరుకు సర్వర్ సమస్య కరీంనగర్రూరల్: ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నుంచి ఉపాధ్యాయుల హాజరు కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నేషన్ అటెండెన్స్ విధానానికి సాంకేతిక సమస్యలేర్పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఉపాధ్యాయులందరూ యాప్ను వినియోగించడంతో సర్వ ర్ సమస్య తలెత్తింది. జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు స్మార్ట్ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేసుకుని లాగిన్ అయిన తర్వాత ఉదయం 8.50గంటలకు నిర్ధేశిత సమయంలో ఫేస్ రికగ్నేషన్ హాజరు వేసుకున్నారు. అనంతరం పాఠశాల ముగింపు సమయంలో తిరిగి హాజరు వేసుకోవడం జరిగింది. ప్రారంభంలో యాప్ వినియోగించడంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కొంత జాప్యమేర్పడిందని పలువురు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. హాస్టల్లో మెనూ పాటించాలి కరీంనగర్ కార్పొరేషన్: ప్రభుత్వం రూపొందించిన ప్రకారం మెనును హాస్టల్లో తప్పకుండా పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరంలోని ముకరంపుర కళాశాలస్థాయి వసతిగృహాన్ని సందర్శించారు. హాస్టల్ను పరిశీలించారు. కిచెన్ను తనిఖీ చేశారు. మెనూ పాటిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు. మెనూ ప్రకారం ఆహారం అందించే విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వార్డెన్కు సూచించారు.పవర్కట్ ప్రాంతాలుకొత్తపల్లి: కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ.అంబేద్కర్నగర్ ఫీడర్ పరిధిలోని అంబేద్కర్నగర్, శివాజీనగర్, ఎస్టీకాలనీ, కిసాన్నగర్ ప్రాంతాలతో పాటు విద్యుత్ లైన్ల షిఫ్టింగ్ పనులు చేపడుతున్నందున ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.భగత్నగర్ ఫీడర్ పరిధిలోని ఎర్రగట్టు, వాసుదేవకాలనీ, న్యూ శ్రీనగర్కాలనీ, కట్టరాంపూర్, ఆయోధ్యకాలనీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈలు పంజాల శ్రీనివాస్ గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. చెట్ల కొమ్మల తొ లగింపు పనులు చేపడుతున్నందున ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 కె.వీ.తీగలగుట్టపల్లి ఫీడర్ పరిధిలోని సరస్వతీనగర్, విద్యారణ్యపురి, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు. -
అంగన్వాడీలను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ పమేలా సత్పతితిమ్మాపూర్: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణ కోసం అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమికోన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. పోషణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మూడేళ్లలోపు చిన్నారులకు బాలామృతం గుడ్లు పంపిణీ చేశారు. ప్రీస్కూల్ పిల్లలతో ముచ్చటించారు. సిలబస్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. ప్రతీ శుక్రవారం నిర్వహించే సమావేశాలకు మహిళలు హాజరై, అంగన్వాడీ సేవల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించి, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో సంభాషించి, వారి అభ్యసన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలు లేదా మ్యాట్లపై కూర్చోబెట్టాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల ప్రగతి నివేదికను తెలియజేయాలని ఆదేశించారు. బుధవారం బోధనను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి, బాలల సంక్షేమ ప్రాజెక్టు అధికారి శ్రీమతి, ఎంఈవో శ్రీనివాస్ పాల్గొన్నారు. -
8న బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’
కొత్తపల్లి(కరీంనగర్): ‘మేమెంతో మాకంతా’ అనే డిమాండ్తో రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపడుతోందని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి స్పష్టం చేశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగరంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన కరీంనగర్లోని జ్యోతిరావు ఫూలే మైదానంలో నిర్వహించే బీసీ గర్జన బహిరంగ సభకు కదలిరావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివా స్గౌడ్, కొప్పుల ఈశ్వర్, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్తో కలిసి శుక్రవారం జ్యోతిరా వు ఫూలే మైదానాన్ని పరిశీలించారు. చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రవతి వద్ద పెండింగ్లో ఉండగానే ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పలుమార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి ఏనాడు రాష్ట్రపతి, పార్లమెంట్లో ఆమోదించే విధంగా ఒత్తిడి తేలేదని విమర్శించారు. రేవంత్ ట్రాప్లో పడ్డ కాంగ్రెస్ హైకమాండ్ బీసీలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్ బీఆర్ఎస్కు సెంటిమెంట్ కనుక రాష్ట్ర సాధన పోరాట తరహాలోనే బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి 42శాతం రిజర్వేషన్లు సాధించుకుంటామని పేర్కొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, విద్యాసాగర్ రావు, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్ కుమార్,రసమయి బాలకిషన్, దాసరి మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు పాల్గొన్నారు. కరీంనగర్ సభకు యావత్ తెలంగాణ కదలి రావాలి సీఎం ట్రాప్లో కాంగ్రెస్ హైకమాండ్ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి -
ప్రాణం తీసిన నిద్రమత్తు
● డ్రైవర్ మృతి ● మరొకరికి తీవ్రగాయాలు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): శాసీ్త్రనగర్ సమీపంలోని రాజీవ్ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున అగి ఉన్న లారీని మరో లారీ ఢీకొంది. ఈ ఘటనలో రాజస్తాన్కు చెందిన డ్రైవర్ శౌకిన్(40) మృతి చెందాడు. మరో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై శ్రావణ్కుమార్ కథనం ప్రకారం.. కొత్తగూడెం నుంచి మిర్చిలోడ్తో ఢిల్లీకి వెళ్తన్న లారీ సుల్తానాబాద్కు చేరుకుంది. అయితే, నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డు పక్కన అగిఉన్న మరోలారీని వెనుకనంచి ఢీకొట్టాడు. దీంతో డ్రైవింగ్ చేస్తున్న మహబూబ్కు తీవ్రగాయాలయ్యాయి. మరో డ్రైవర్ శౌకిన్ క్యాబిన్లో పడుకొని ఉండగా అక్కడికక్కడే మృతి చెందాడు. హరియాణాకు చెందిన వ్యక్తి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేశారు. క్వారీ సూపర్వైజర్ మృతిసైదాపూర్: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగీర్పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్న దీకొండ రాజు(43) ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తికి చెందిన దీకొండ రాజు జాగీర్పల్లిలోని శ్రీలక్ష్మీ గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్గా రెండేళ్లుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం గ్రానైట్ బండను యంత్రంతో జరుపుతున్న క్రమంలో ఒక బండరాయి రాజు కుడికంతకు బలంగా తగిలింది. కంత, తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజుకు భార్య సంతోష్కుమారి, కూతురు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. విద్యుత్షాక్తో ఎద్దు మృతికరీంనగర్రూరల్: కరీంనగర్ శివారు గోపాల్పూర్లో శుక్రవారం రైతు అనుముల అంజయ్యకు చెందిన ఎద్దు విద్యుత్షాక్తో మృతిచెందగా రైతుకు తృటిలో ప్రాణాపాయం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. దాడి నర్సయ్యకు చెందిన పొలంలో అనుముల అంజయ్య ఎద్దులతో గొర్రు కొట్టేందుకు కిరాయికి వెళ్లాడు. గొర్రు కొడుతున్న క్రమంలో పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం సపోర్టువైరుకు ఎద్దు తాకడంతో విద్యుత్షాక్తో మృతిచెందింది. అప్రమత్తమైన అంజయ్య పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎన్పీడీసీఎల్ రూరల్ ఏడీఈ రఘు, ఏఈ అనిల్, బొమ్మకల్ పశువైద్యాధికారి జ్యోత్స్న పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును బాధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఎద్దు విలువ సుమారు రూ.60వేల వరకు ఉంటుందని అంజయ్య తెలిపాడు. ప్రభుత్వం నష్టపరి హారం మంజూరు చేసి ఆదుకోవాలని కోరాడు. -
శాంతి భద్రతలకు విఘాతం కల్గించొద్దు
● పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ● కొత్తపల్లిలో కార్డన్ సెర్చ్కొత్తపల్లి(కరీంనగర్): శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ గౌస్ఆలం హెచ్చరించారు. కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పాత నేరస్తులపై ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 45వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్ 100 ద్వారా లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడతామని స్థానికులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, షీం టీంలతో అవగాహన కల్పించారు. టౌన్ ఏసీపీ వెంకటస్వామి, సీఐలు నిరంజన్రెడ్డి, పుల్లయ్య, ప్రదీప్కుమార్, శ్రీలత పాల్గొన్నారు. -
కుళ్లిన మాంసం.. నాణ్యత లేని సామగ్రి
● వేములవాడలో రెస్టారెంట్ సీజ్ ● సిరిసిల్లలో నోటీస్లు ● రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఫుడ్సేఫ్టీ అధికారుల తనిఖీలుసిరిసిల్ల: వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లోని రెస్టారెంట్లలో శుక్రవారం రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. వేములవాడలో ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించని తాజ్ రెస్టారెంట్ను సీజ్ చేసి, రూ.30 వేల జరిమానా విధించారు. సిరిసిల్లలో రుచి హోటల్లో అపరిశుభ్రతను గుర్తించి నోటీసులు జారీచేశారు. రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ డాక్టర్ శివలీల ఆదేశాల మేరకు జిల్లాలో అకస్మికంగా తనిఖీలు చేపట్టారు. వేములవాడ రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, నిలువ చేసిన మాంసం దుర్వాసన రావడం, హానికర రసాయనాలతో ఉన్న కృత్రిమ రంగులను గుర్తించారు. రూ.20,500 విలువైన 70 కిలోల మాంసం నిల్వ ఉన్నట్లు తేలింది. రెస్టారెంట్ను సీజ్ చేసి, రూ.30వేల జరిమానా విధించారు. జిల్లా కేంద్రంలోని రుచి రెస్టారెంట్లోనూ అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేయడం, ఫుడ్ హ్యాండ్లెట్స్ గ్లౌస్, హెయిర్ క్యాప్స్ ధరించకపోవడం, వండిన ఆహారంపై మూతలు కప్పకపోవడం, కుళ్లిన వస్తువులను గుర్తించిన అధికారులు హోటల్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. అనుమానిత ఆహార పదార్థాల నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించారు. ఈ తనిఖీల్లో టాస్క్ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి.జ్యోతిర్మయి, టాస్క్ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్రెడ్డి, శ్రీషిక, స్వాతి, అంకిత్రెడ్డి పాల్గొన్నారు. -
కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య
రాజన్నకు మొక్కులుబస్సు ఢీకొని వ్యక్తి మృతికరీంనగర్ క్రైం: కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ ఔట్ గేట్ వద్ద శుక్రవారం బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. రామడుగు మండలం వన్నారం గ్రామానికి చెందిన దావు రాజయ్య(65) కరీంనగర్లో కూలీ పనిచేస్తున్నాడు. భార్య, పిల్లలకు దూరంగా ఉంటూ బస్టాండ్లో ఉంటున్నాడు. బస్టాండ్ ఔట్ గేటు వద్ద రోడ్డు దాటుతుండగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ గాంధీపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ కోటేశ్వర్ తెలిపారు. మానకొండూర్: కట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మానకొండూర్ మండలం గంగిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి తల్లి కొయ్యడ సమ్మక్క వివరాల ప్రకారం.. గంగిపల్లికి చెందిన చలిగంటి నాగయ్యతో మెట్పల్లికి చెందిన హేమలతకు ఐదేళ్లక్రితం వివాహమైంది. భర్త, అత్త, ఇద్దరు ఆడబిడ్డలు అదనపు కట్నం తేవాలని వేధించారు. దీంతో తల్లిగారింటికి వెళ్లింది. కుమారుడు జన్మించడంతో ఐదు నెలల తరువాత అత్తగారింటికి వచ్చింది. మరోసారి డబ్బులు తేవాలంటూ వేధించడంతో ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సంజీవ్ తెలిపారు. ఉరేసుకుని ఒకరు.. చొప్పదండి: పట్టణంలోని బీసీకాలనీలో నివాసముండే దండే పరందాములు (43) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టైలరింగ్ పనిచేసే పరందాములు కొద్దికాలంగా మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి టైలర్షాప్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దండె కవిత ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామానికి చెందిన దుర్శెట్టి రాకేశ్ (32) పురుగుల మందు తాగి శుక్రవారం మరణించాడు. మూడేళ్లక్రితం రాకేశ్ మానసిక స్థితిసరిగ్గా లేదని భార్య తన కొడుకుతో కలిసి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. భార్య రావడం లేదని రాకేశ్ మరింత మనస్తాపానికి గురై క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నగేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై మల్లేశ్తెలిపారు. శతాధిక వృద్ధురాలు మృతిరాయికల్: రాయికల్ మండలం రామారావుపల్లికి చెందిన దయ్యాల రాజు (120) అనే శతాధిక వృద్ధురాలు శుక్రవారం అనారోగ్యంతో మృతిచెందింది. రాజుకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉరేసుకొని వృద్ధుడి ఆత్మహత్యమల్యాల: మండలంలోని నూకపల్లి అర్బన్ హౌసింగ్కాలనీకి చెందిన భీనవేని భాగయ్య (69) శుక్రవారం అనారోగ్యంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డినట్లు మల్యాల ఎస్సై నరేశ్కుమార్ తెలిపారు. భాగయ్య భార్య పదేళ్ల క్రితం మృతి చెందగా.. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతూ అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన తన ఇంటి ఎదుట ఉన్న మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రౌడీషీటర్ మనోజ్పై పీడీయాక్ట్సిరిసిల్లక్రైం: భూ వివాదంలో బొల్లు మల్లవ్వ అనే మహిళను రెండు నెలల క్రితం హత్య చేసిన కేసులో చందుర్తి మండలానికి చెందిన రౌడీషీటర్ మనోజ్పై పీడీయాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. ఈమేరకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చర్లపల్లి జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. మనోజ్ 2023లో హత్య, దొంగతనం, బెదిరింపుకు పాల్పడిన కేసులలో నిందితుడిగా ఉన్నట్లు వెల్లడించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న యువకుడిపై 2024లో రౌడీషీట్ తెరిచినట్లు తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించినా ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తరచూ నేరాలకు పాల్పడుతుండడంతో పీడీయాక్ట్ అమలు చేసి, చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు. హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలువేములవాడఅర్బన్: హత్యాయత్నం కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్ కోర్టు న్యాయమూర్తి అజయ్కుమార్ జాదవ్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. బోయినపల్లికి చెందిన అలువాల శ్రీనివాస్కు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా భార్య పురుగుల మందు తాగి మృతిచెందింది. ఆమె మృతికి భర్త శ్రీనివాస్, కుటుంబ సభ్యులు కారణమని భార్య తండ్రి భూపతి మల్లయ్య, అన్న విజయ్ చింతాల్ఠాణా గ్రామస్తులు.. శ్రీనివాస్తోపాటు అతని స్నేహిడుతు మోహన్పై దాడి చేశారు. బాధితుడి శ్రీనివాస్ ఫిర్యాదుతో 2023, ఫిబ్రవరి 17న వేములవాడ అప్పటి ఎస్సై ఎండీ రఫీక్ఖాన్, వేములవాడ టౌన్ సీఐ వెంకటేశ్ కేసు నమోదు చేశారు. భూపతి మల్లయ్య, విజయ్కు ఐదేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు తెలిపారు. ● గతంలో దరఖాస్తులు స్వీకరించి నిలిపివేత ● ఈ నెల 5నుంచి మళ్లీ స్వీకరణ ● ఉమ్మడి జిల్లాకు రూ.10.4కోట్ల కేటాయింపు ఉమ్మడి జిల్లాకు కేటాయించిన నిధులు: రూ.10.4 కోట్లు కొనుగోలు చేయనున్న పరికరాల సంఖ్య: 13,140ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులకు: 50 శాతం రాయితీ ఇతరులకు: 40 శాతం రాయితీ దరఖాస్తుల స్వీకరణ: ఈ నెల 5నుంచి 15వరకు ఉమ్మడి జిల్లాకు ఏయే పరికరాలు ఎన్నెన్ని ఇవ్వనున్నారంటే బ్యాటరీ స్ప్రేయర్స్ :9,579 పవర్ స్ప్రేయర్స్ :1,761 రోటవేటర్ : 564 సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్: 110 కల్టివేటర్ : 651 బండ్ ఫార్మర్ : 30 పవర్ వీడర్ : 59 బ్రష్ కట్టర్ : 132 పవర్ టిల్లర్ : 84 స్ట్రా బాలర్స్ : 170 -
గుండెపోటుతో కార్మికుడి మృతి
● నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ ప్రాజెక్టు కాంట్రాక్టు కార్మికుడు నారిశెట్టి శ్రీకాంత్(39) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయం విధులకు హాజరైన కార్మికుడు.. అస్వస్థతగా ఉందని తోటి కార్మికులకు చెప్పాడు. ఆ వెంటనే అంబులెన్స్లో పీటీఎస్లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స అందించేలోపే మృతి చెందాడు. మృతుడికి భార్య అనూష, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. గోదావరిఖని విఠల్నగర్కు చెందిన శ్రీకాంత్.. డీఎం ప్లాంట్లో పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై ఉదయ్కిరణ్ తెలిపారు. అయితే, పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య అనూష, కుటుంబసభ్యులు శ్రీకాంత్ నేత్రాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. కాగా, శ్రీకాంత్ మృతి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మరోవైపు.. డీఎం ప్లాంట్ కాంట్రాక్ట, కార్మిక సంఘాల నాయకులు, కాంట్రాక్టర్ల మధ్య జరిగిన చర్చల అనంతరం శ్రీకాంత్ కుటుంబానికి రూ.7లక్షల పరిహారం, ఇద్దరికి ఉద్యోగావకాశం కల్పించేందుకు, అంత్యక్రియలకు రూ.50వేలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టర్ రాజ్కుమార్, యూనియన్ల ప్రతినిధులు కౌశిక హరి, భూమల్ల చందర్, చిలుక శంకర్, నాంసాని శంకర్, కాంట్రాక్టర్లు ఏబీసీ రెడ్డి, ఎలిని నారాయణ, వెంకటేశ్వరరావు, రాజాకిషన్, రాజేశం, సోమిరెడ్డి ఉన్నారు. -
కొత్త కోర్సులు.. కాలేజీలు.. హాస్టళ్లు
● శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అభివృద్ధి పనులు షురూ ● హుస్నాబాద్లో ఇంజినీరింగ్, క్యాంపస్లో లా కళాశాల ● ఎల్ఎండీ, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు మంజూరు ● మూడు ఆడిటోరియంల ఆధునీకరణ ● ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని క్యాంపస్ భూముల రక్షణకు ప్రహరీ ● మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి ఈ నెల 4న శంకుస్థాపనసాక్షిప్రతినిధి,కరీంనగర్: గత వైస్ చాన్స్లర్ హయాంలో అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన శాతవాహన యూనివర్సిటీ.. ఇప్పుడు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. కొత్త కళాశాలలు, కోర్సులతో మరింత విస్తరిస్తోంది. శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన 9 నెలల్లోనే కొత్త కళాశాలలు, కోర్సులకు అనుమతులు పొందడంతోపాటు అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహకారంతో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీతోపాటు ఫార్మసీ కాలేజీలో ఎంఫార్మసీ కోర్సు, క్యాంపస్లో ఎంసీఏ కోర్సు, అకడమిక్ బ్లాక్, రెండు కొత్త హాస్టళ్లు మంజూరయ్యాయి. ఇంజినీరింగ్, లా కాలేజీ నిర్వహణకు 120 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘బండి’ సహకారంతో లా కాలేజీకి గుర్తింపు ఎస్యూ క్యాంపస్లో మూడేళ్ల ఎల్ఎల్బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులతో లా కాలేజీ ప్రారంభం కాబోతోంది. మూడేళ్ల లా కోర్సులో ఒక్కో సెక్షన్లో 60 అడ్మిషన్ల చొప్పున 120 సీట్లు(2 సెక్షన్లు), ఎల్ఎల్ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా)లో 20 సీట్లు మంజూరు చేశారు. లా కాలేజీలో బోధనకు 14 టీచింగ్, 19 నాన్ టీచింగ్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. లా కాలేజీకి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) గుర్తింపు తప్పనిసరి కావడంతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సహకారంతో అతి తక్కువ కాలంలో అనుమతులు లభించాయి. ఫార్మసీ కళాశాలకు మహర్దశ ఎల్ఎండీ సమీపంలోని ఫార్మసీ కళాశాలలో ఇ న్నాళ్లు బీఫార్మసీ కోర్సు మాత్రమే ఉండేది. తాజాగా ఎంఫార్మసీ ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆ ఫ్ ఇండియా అనుమతిచ్చింది. ఫార్మసీ కళాశాలలో పీఎం ఉష నిధులు రూ.7.28 కోట్లతో చేపట్టిన అకడమిక్ బ్లాక్ నిర్మాణ పనులకు గత నెల 22న మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు శంకుస్థాపన చేశారు. ఫార్మసీ కళాశాల భూములు ఆక్రమణకు గురికాకుండా రూ.2.85 కోట్ల వర్సిటీ నిధులతో ప్రహరీ పనులు ప్రారంభించారు. సదుపాయాలకు పెద్దపీట వర్సిటీలో సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నాం. కొత్తకాలేజీలు, హాస్టళ్లు, ఆడిటోరియాలు నిర్మిస్తున్నాం. క్యాంపస్లో శాతవాహన విగ్రహం ప్రతిష్టించనున్నాం. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు యూనివర్సిటీ విషయంలో సానుకూలంగా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. త్వరలో వర్సిటీకి న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. – ఉమేశ్ కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీహుస్నాబాద్లో ఇంజినీరింగ్ కాలేజీ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యాసంవత్సరంలో హుస్నాబాద్లో ఇంజినీరింగ్ కళాశాల ప్రారంభం కాబోతోంది. ఇందులో సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు మంజూరు చేశారు. ఇందుకోసం 54 టీచింగ్ పోస్టులు, 33 నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేశారు. బీటెక్లో ఒక్కోబ్రాంచ్లో 60అడ్మిషన్ల చొప్పున 240 సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఎప్సెట్ కౌన్సెలింగ్లో ఇప్పటికే 110మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు.మరెన్నో పనులు గోదావరిఖని పీజీ కాలేజీలో అకడమిక్ బ్లాక్, ప్రహరీ, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ నుంచి ఎంబీఏ బ్లాక్ వరకు అప్రోచ్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలలో గతంలో ఉన్న పాత సెమినార్ హాల్ను సరికొత్త సీటింగ్, సౌండ్ సిస్టంతో ఆధునీకరించి మంత్రి పొన్నం చేతుల మీదుగా ప్రారంభించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ, ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కాలేజీలో కొత్త కంప్యూటర్ ల్యాబ్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫార్మసీ కాలేజీ, గోదావరిఖని పీజీ కాలేజీలో డిజిటల్ స్మార్ట్ క్లాస్రూమ్స్ ఏర్పాటు చేశారు.మరో రెండు కొత్త హాస్టళ్లు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులకు మరో రెండు కొత్త హాస్టళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. యూనివర్సిటీలో అడ్మిషన్లు పెరుగుతున్న నేపథ్యంలో క్యాంపస్లో ఒకటి, ఫార్మసీ కాలేజీలో మరొకటి గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని నిర్ణయించారు. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో ఈ హాస్టళ్ల పనులకు ఈ నెల 4న శంకుస్థాపన చేసేందుకు జిల్లా ఇన్చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆహ్వానించినట్లు వీసీ ఉమేశ్ కుమార్ వెల్లడించారు. త్వరలో రూ.18 కోట్లతో లా కాలేజీతో పాటు, సెంట్రల్ లైబ్రరీలో సెమినార్ హాల్ ఆధునీకరణ, పరిపాలన భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న నూతన సెమినార్ హాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. -
రోడ్డు మారలె.. ప్రమాదాలు ఆగలె
● అధ్వానంగా కరీంనగర్– కామారెడ్డి ప్రధాన రహదారి ● బోల్తా పడుతున్న వాహనాలు ● అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల పాట్లుకొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్– కామారెడ్డి ప్రధాన రహదారి రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోంది. కొత్తపల్లి మండలం బావుపేట గ్రామం వద్ద ఏర్పడ్డ గుంతలతో రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రహదారిపై గుంతలను అంచనా వేయలేని డ్రైవర్లు ప్రమాదాలకు గురవుతున్నారు. రోజుకో వాహనం బోల్తా పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలన్న కనీస ఆలోచన లేకపోవడంపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయం కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ (బావుపేట) మీదుగా వేములవాడ, సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్కు రద్దీని దృష్టిలో పెట్టుకొని పద్మనగర్– ఒడ్యారం మధ్య 13.8 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి విస్తరణకు రూ.89 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. రహదారి వెళ్లే గ్రామాల్లో ఇరువైపుల నిర్మించే డ్రైనేజీల నీటి మళ్లింపుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడంలో అధికారులు విఫలం కావడంతోనే బావుపేట వద్ద రోడ్డు సమస్య తీవ్రరూపం దాల్చింది. బావుపేట ఎన్టీఆర్కాలనీ మురికి నీరంతా ప్రధాన రహదారిపైకి రావడం, ఆ నీరు వెళ్లేందుకు దారి లేకపోవడంతో నెలల తరబడి నీరు రోడ్డుపైనే నిలిచి కుంటను తలపించడంతో, శిథిలావస్థకు చేరుకుంది. సమస్యను గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం..‘సాక్షి’ కథనాలతో తాత్కాలికంగా నీటి మళ్లింపుకు చర్యలు చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలతో గుంతల్లో నీరు చేరడంతో వాహనాలు బోల్తా పడుతున్నాయి. శాశ్వత పరిష్కారమెప్పుడు? బావుపేటలో నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడన్న ప్రశ్న స్థానికులకు సందేహంగా మారింది. శిథిలావస్థకు చేరిన రహదారిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ పరిశీలించి చర్యలు చేపట్టాలని కలెక్టర్ను కోరారు. రహదారిని పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి శాశ్వత పరిష్కారంగా రూ.90 లక్షలతో డ్రైనేజీ నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఆ నిధుల మంజూరు ఎప్పుడూ..? తమ సమస్య పరిష్కారం ఎప్పుడని ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.మరమ్మతు చేపట్టాలి కరీంనగర్– కామారెడ్డి రహదారి బావుపేట వద్ద అధ్వానంగా తయారైంది. డ్రైనేజీ నీటి మళ్లింపులు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఎన్టీఆర్ తమిళకాలనీ, ఖాజీపూర్ చౌరస్తాల్లో రహదారి శిథిలావస్థకు చేరింది. ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మరమ్మతు పనులు చేపట్టాలి. – సోమినేని తిరుపతి, ఖాజీపూర్ -
స్వయం ప్రతిపత్తితోనే సంఘాల పురోగతి
కరీంనగర్ అర్బన్: స్వయం ప్రతిపత్తితోనే సంఘాలు పురోగతి సాధిస్తాయని, తదనుగుణ కార్యాచరణతో సాగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ డా.సుబ్బారాయుడు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎన్.లింగారెడ్డి ఆధ్వర్యంలో 18వ సర్వసభ్య సమావేశం గురువారం నగరంలోని ఇందిరా గార్డెన్స్లో నిర్వహించారు. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఆడిట్ నివేదికల సమర్పణ, ఉమ్మడి సంఘం నుండి కొత్త జిల్లాల విభజన తదితర అంశాలు చర్చించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ, సంఘాలు స్వయం సమృద్ధిని సాధించి బలోపేతం కావాలని సూచించారు. జిల్లా పశువైద్యాధికారి సుధాకర్ మాట్లాడుతూ, సంఘాలు సొంత వ్యాపార అవకాశాలను ఏర్పాటుచేసుకుని లబ్ధి పొందాలని అన్నారు. సహకార యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.లింగారెడ్డి మాట్లాడుతూ, సంఘాలు స్వతంత్రంగా, నూతన కార్యక్రమాలు చేపట్టి, వారి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల సంఘాలు ఏర్పాటుకు అన్ని చర్యలు పూర్తి చేశామని అన్నారు. సిరిసిల్ల జిల్లాశాఖ అధికారి రవీందర్ రెడ్డి, పెద్దపల్లి జిల్లాశాఖ అధికారి శంకర్, ఉప సంచాలకుడు రవికుమార్, అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రీధర్, బాలకిషన్, వాణిశ్రీ పాల్గొన్నారు. రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ బి.సుబ్బారాయుడు -
కొండగట్టులో ముగిసిన సప్తాహం
మల్యాల: శ్రావణమాసం సందర్భంగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో వారం రోజు లుగా నిర్వహిస్తున్న శ్రావణ సప్తాహం ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరిరోజు స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. సాయంత్రం శ్రీవేంకటేశ్వర స్వామివారికి సేవ నిర్వహించారు. ఆలయంలో సహస్ర దీపాలంకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్రావు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సునీల్కుమార్, హరిహరనాథ్, ఆలయ పర్యవేక్షకులు ఉమా మహేశ్వర్, ఆలయ ప్రధాన అర్చకులు వకుళాభరణం రఘు, ఉప ప్రధాన అర్చకులు తిరుకోవెల మారుతి ప్రసాద్, తిరునగరి రాంచంద్ర ప్రసాద్, ముఖ్య అర్చకులు, అర్చకులు పాల్గొన్నారు. -
పెన్షన్ ఇప్పిస్తానని పుస్తెలతాడు చోరీ
ధర్మపురి: ఓ వృద్ధురాలికి పింఛన్ ఇప్పిస్తానని మా యమాటలు చెప్పి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును తీసుకెళ్లిన ఘటన పట్టపగలే చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన అయ్యోరి పోశవ్వ ధర్మపురి గోదావరిలో స్నానం చేసేందుకు నేరెళ్ల వద్ద గురువారం బస్సు ఎక్కింది. అదే బస్సులో ఉన్న ఓ మోసగాడు ఆమెను అనుసరించాడు. ధర్మపురిలో పోశవ్వ బస్సు దిగి కూరగాయల మార్కెట్ వైపు వెళ్తుండగా.. సదరు వ్యక్తి ‘అవ్వా నీకు పింఛన్ వస్తుందా.. రాకుంటే నేను ఇప్పిస్తా.. నేను నేరెళ్ల గ్రామ కార్యదర్శిని. నీకు పింఛన్ వచ్చేలా చేస్తా..’ అని మాయమాటలు చెబుతూ నందీ కూడలి పక్కనున్న సందిలోకి తీసుకెళ్లాడు. మెడలో ఉన్న పుస్తెలతాడు ఇస్తే.. వేరే మహిళ మెడలో వేసి ఫొటో తీసి ఇస్తానని నమ్మించాడు. దీంతో వృద్ధురాలు ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడు తీసి ఇచ్చింది. వెంటనే సదరు మోసగాడు అక్కడి నుంచి జారుకున్నాడు. అరగంటపాటు ఎదురుచూసిన పోశవ్వ మోసపోయాయని గమనించి లబోదిబోమంటూ ఏడ్చింది. జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
విజయవంతంగా అమలు చేశాం
పెద్దపల్లి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ సిస్టంను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు కలెక్టర్ ఆదేశాలతో శ్రీకారం చుట్టాం. కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని సామరస్యంగా సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్లాం. 11నెలల కాలంలో 85 నుంచి 95 శాతం సమయపాలన సాధించేలా చర్యలు తీసుకున్న కలెక్టర్ శ్రీహర్ష రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. – మల్లేశ్, ఎఫ్ఆర్ఎస్ జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ ఉపాధ్యాయుల పాత్రకీలకం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుల పాత్ర కీలకం. వారంతా సమయపాలన పాటిస్తూ నిబద్దత, అంకితభావంతో భావిభారత పౌరులను క్రమశిక్షణ, పట్టుదలతో చదివేలా ప్రోత్సహించి ఉన్నతంగా ఎదిగేలా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. ఇందుకోసం జిల్లాలో చేపట్టిన ఎఫ్ఆర్ఎస్ సిస్టం కు అనుగుణంగా టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ విధులు నిర్వర్తిస్తూ జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశారు. – కోయ శ్రీహర్ష, కలెక్టర్, పెద్దపల్లి -
విద్యార్థులు కష్టపడి చదవాలి
కరీంనగర్క్రైం: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.వెంకటేశ్ గురువారం నగరంలోని బాల సదన్, శిశుగృహను సందర్శించారు. చిన్నారులతో ముచ్చటించా రు. కష్టపడి చదువుకుని ప్రథమస్థానంలో ఉత్తీ ర్ణత సాధించాలని సూచించారు. ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశా రు. చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. న్యా యపరమైన సేవ అవసరం ఉంటే సంప్రదించాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. ఈ చెత్త ఏమిటి?● సిబ్బందిపై కమిషనర్ ఆగ్రహం కరీంనగర్కార్పొరేషన్: ‘ఈ చెత్త ఏమిటి..? ఇంకోసారి కనబడితే బాగుండదు’ అంటూ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్దేశాయ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని షట్టర్లు, కా ర్యాలయాన్ని పరిశీలించారు. షటర్లను ఓపెన్ చేసి అందులో పడి ఉన్న చెత్త చెదారం, సామగ్రిని పరిశీలించారు. సామగ్రిని, చెత్త చెదారా న్ని ఎక్కడ పడితే అక్కడ పడేయవద్దంటూ ఆదేశించారు. అదనపు కమిషనర్ సువార్త, డిప్యూ టీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జూలై 1నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ విజయవంతమైందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి పేర్కొన్నారు. గురువారం సంబంధిత కార్యాలయంలో కమిటీ సభ్యులు రేండ్ల కళింగ శేఖర్ కే.విజయ్కుమార్, రాధ, అర్చనరెడ్డితో కలిసి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో నెలరోజులపాటు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, 102మంది పిల్లలను కాపాడామని తెలిపారు. వీరిలో 98మంది బాలురు, నలుగురు బాలికలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పోలీసుశాఖ అధికారులు ఎస్డీ అన్వర్, ఎస్ఐ విజయసాగర్, హెడ్కానిస్టేబుల్ కుమారస్వామి, లేబర్ ఆఫీసర్లు చక్రధర్రెడ్డి, చందన, రఫీ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఫర్వీన్, శాంత, స్వప్న, కవిత పాల్గొన్నారు. ఆర్వోబీ నిర్మాణంలో నిర్లక్ష్యం కరీంనగర్రూరల్: తీగలగుట్టపల్లి ఆర్వోబీ డిజైన్ జాప్యంతోనే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఆరోపించారు. ఆర్వోబీ పనులను గురువారం కాంగ్రెస్పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. రైల్వేశాఖ నుంచి స్ట్రక్చరల్ డిజైన్, డ్రాయింగ్స్ మార్చి వరకు పూర్తి కాకపోవడానికి కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్కుమార్ బాధ్యత వహించాలన్నారు. భూసేకరణ కాకపోవడంతోనే ఆర్వోబీ పనులు ఆలస్యమవుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ తెరవెనుక ఉండి డైవర్షన్ రాజకీయాలను చేయడం మానుకుని ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పవర్ కట్ ప్రాంతాలుకొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులతో పాటు నూతన లైన్ల ఏర్పాటు పనులు చేపడుతున్నందున శుక్రవారం ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు 11 కె.వీ.టవర్ ఫీడర్ పరిధిలోని రాజీవ్చౌక్, రూరల్ పోలీస్స్టేషన్, భారత్ టాకీస్, టవర్సర్కిల్, బ్రాహ్మణవీధి, అహ్మద్పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1 ఏడీఈ పంజాల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. -
పెద్దపల్లి కలెక్టర్దే
ఎఫ్ఆర్ఎస్ ఘనత పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పాలనాపగ్గాలు చేపట్టిన కోయ శ్రీహర్ష.. విద్య, వైద్యశాఖలను గాడిన పెట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నిత్యం తన పర్యటన ఏ మండలం.. గ్రామంలో ఉన్నా అందుబాటులో ఉన్న పాఠశాల, వైద్యశాలలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై సమస్యలు, అందుతున్న సేవలపై ఆరా తీస్తారు. ఈ క్రమంలో పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులంతా సమయపాలన పాటించేలా ఏం చేయాలా.. అని ఆలోచించారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి జిల్లాలో ఎఫ్ఆర్ఎస్ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) పద్ధతిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు 2024 సెప్టెంబర్లో అనుమతి పొంది అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లా విద్యాశాఖలో పనిచేసే మల్లేశంను కోఆర్డినేటర్గా నియమించి పూర్తి బాధ్యతలు అప్పగించారు. 11 నెలల కాలంలో 85 నుంచి 95శాతం సమయపాలన సాధించగలిగారు. ● గూగుల్ షీట్ నుంచి ఎఫ్ఆర్ఎస్ వరకు.. విద్యాశాఖలో పనిచేసే నాన్టీచింగ్ అధికారులు, ఉద్యోగులు మొదలు స్కూళ్లలో పాఠాలు చెప్పే పంతుళ్ల వరకు వివరాలను ఆన్లైన్లో గూగుల్ షీట్ ద్వారా నమోదు చేశారు. దానిని ఆధునిక సాంకేతికతతో 2024 అక్టోబర్లో గూగుల్ ఫారంకు మార్చారు. అందులోనూ పూర్తిస్థాయి ఫలితం కనిపించకపోవడంతో గతేడాది డిసెంబర్ 3 నుంచి ఎఫ్ఆర్ఎస్ను జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు. ఈ పద్ధతిని అమలు చేయవద్దంటూ పలు ఉపాధ్యాయసంఘాలు, ఉపాధ్యాయులు కొంతమేర ఒత్తిడి తెచ్చినా, సమయస్ఫూర్తిగా వారిని ఒప్పించి ముందుకు సాగించారని అధికారవర్గాలు తెలిపాయి. ● ఆన్డ్యూటీలో లేకుంటే ఆబ్సెంటే.. పాఠశాలకు ఉపాధ్యాయుడు, ఆఫీసుకు ఉద్యోగులు ఏ సమయంలో వచ్చారో ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలి. ఉపాధ్యాయుడు పాఠశాలకు వచ్చినపుడు ఎఫ్ఆర్ఎస్లో లాగిన్ అయి, బయటకు వెళ్లేటప్పుడు లాగౌట్ కావాలి. ఒక వేళ అత్యవసరంగా సదరు ఉపాధ్యాయుడు బయటకు వెళ్లాల్సి వస్తే ఆన్లైన్లోనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి అనుమతి పొందాలి. ఉపాధ్యాయుడు చూపిన కారణం సమంజసం కాదని హెచ్ఎం భావిస్తే ఉపాధ్యాయుడి రిక్వెస్ట్ను తిరస్కరించేలా అవకాశం కల్పించారు. ఇలా 22 రకాలతో కూడిన సెలవులను అందులో పొందుపర్చారు. ● నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఎఫ్ఆర్ఎస్ సిస్టం విజయవంతం కావడంతో ఆగస్టు 1నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఇందుకోసం పెద్దపల్లి జిల్లాలో కార్యక్రమ కోఆర్డినేటర్గా వ్యవహరించిన మల్లేశ్ రాష్ట్రంలోని మిగతా 32 జిల్లాలకు చెందిన విద్యాశాఖ అధికారులు, ఇతర సిబ్బందికి గురువారం జూమ్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పించారు. పెద్దపల్లిలో పైలట్ ప్రాజెక్టుగా అమలుకు ప్రభుత్వ అనుమతి 85 నుంచి 95 శాతం సమయపాలన సాధింపు నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ప్రభుత్వ నిర్ణయం -
చికిత్స పొందుతూ బాలిక మృతి
శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన ఆయేషా(3) హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. బెల్లంపల్లికి చెందిన ఎండీ గౌస్ భార్య కరిష్మా, పిల్లలు మహేక్, తాజ్బాబా, అయేషాతో కరీంపేటలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం గౌస్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలు భారం కరిష్మాపై పడింది. ఆయేషా గుండెకు రంధ్రం ఉండడంతో కరీంనగర్లో వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నీలోఫర్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి చనిపోయింది. అనారోగ్యంతో గర్భిణి..జమ్మికుంట: పట్టణానికి చెందిన ఓ గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందింది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. పట్టణంలోని శాలవాడకు చెందిన బంకుల జ్యోతి(33) అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి తల్లి రాముల లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. రోడ్డు ప్రమాదంలో పీఎంపీ ..సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామ శివారులోని కస్తుర్బా విద్యాలయం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన పీఎంపీ శివుపల్లి రవీందర్(57) బైక్పై ఐతరాజుపల్లిలోని అత్తింటికి వచ్చి అక్కడినుంచి గర్రెపల్లిలో పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడగా తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్యశంకరపట్నం: మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ (25) పెళ్లికావడం లేదని గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్రెడ్డి వివరాల ప్రకారం.. మొలంగూర్ గ్రామానికి చెందిన గూళ్ల శ్రీకాంత్ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. కొద్దిరోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కుదరకపోడంతో మనస్తాపం చెందాడు. బుధవారం తమ వ్యవసాయపొలం వద్ద గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. శ్రీకాంత్ తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. హుండీ దొంగతనం కేసులో మూడేళ్ల జైలు ధర్మపురి: నేరెళ్ల సాంబశివ ఆలయంలో మార్చి 4న జరిగిన హుండీ దొంగతనం, సీసీ కెమెరాల ధ్వంసం కేసులో నిందితుడైన ఉబ్బిడి శేఖర్కు మూడేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధించినట్లు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి యోగి జానకి గురువారం తీర్పునిచ్చారు. దొంగతనం జరిగిన అనంతరం ఎస్సై ఉదయ్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాలను కోర్టుకు సమర్పించగా పరిశీలించిన జడ్జి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. ఆర్ఎంపీ ఇంట్లో చోరీ రాయికల్: రాయికల్కు చెందిన ఆర్ఎంపీ మోర శంకర్ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రూ.4లక్షల నగదు, 3 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి కథనం ప్రకారం.. శంకర్ బుధవారం ఇంటికి తాళాలు వేసి కిష్టంపేటలోని తన బావమరిది ఇంట్లో హల్దీ వేడుకకు వెళ్లాడు. అర్ధరాత్రి తిరిగి రాగా గదులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని రూ.4 లక్షలు, మూడు తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమన్నాడు. శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్టీం, ఫింగర్ ప్రింట్స్ సేకరించారు. విద్యుత్ మోటారు.. జగిత్యాలక్రైం: జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామంలోని బోగు లింగన్న వ్యవసాయ పొలం వద్దనున్న విద్యుత్ మోటారును బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. కొద్దికాలంగా తిప్పన్నపేట, గోపాల్రావుపేట, హైదర్పల్లి గ్రామాల్లో విద్యుత్ మోటార్లు చోరీకి గురవుతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
రైతులు జర భద్రం
గంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాకాలంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. పాములు అంటేనే భయపడతాం. వానాకాలంలో వర్షాలతో భూమి తడవడంతో పాములు తమ రక్షణ కోసం పొడి వాతావరణం కోసం బయటకు వస్తాయి. ఈ క్రమంలో చేనులు, పొలాల గట్టు, ఇళ్లలోకి చేరుతుంటాయి. దీంతో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు, రైతులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పాము కాటుకు గురికాక తప్పదు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. వర్షాలు జోరందుకున్నాయి. సెప్టెంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాములు ఎలుకలు, కప్పలను తినేందుకు బయట తిరుగుతూ చెట్ల పొదల్లో ఉంటాయి. వానాకాలం సాగు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలను దున్నడం, పొలాలకు నీరు పెట్టడంతో భూములు బురదమయంగా మారుతాయి. దీంతో పొడి భూమిలోకి చేరేందుకు బయటకు వస్తాయి. ఈ క్రమంలోనే ఇళ్లలోకి చేరడం, రైతులు తొలగించిన గడ్డి, పిచ్చి మొక్కల్లో ఉంటూ ఆహారం కోసం అన్వేషణ కొనసాగిస్తాయి. రైతులు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు వాటిపై కాలు వేస్తే కాటు వేసే అవకాశం ఉంది. పాముకాటుతో జాగ్రత్త.. కప్పలు, ఎలుకలు సంచరించే ప్రదేశాల్లో ఎక్కువగా పాములు ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాము కాటేస్తే ఒంటిపై రెండు లేదా నాలుగు కామా ఆకారపు గుర్తులు పడుతాయి. అరగంటలోపు విషం ఒళ్లంతా పాకి నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కళ్లు మూతలు పడడం, చేతులు, కాళ్లు తాత్కాలికంగా పక్షవాతం రావడం, మాట ఆగిపోవడం, నాలుకకు రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని పాములు ఉదాహరణకు రక్తపంజర పాము కరిస్తే కరిచిన భాగం ఉబ్బి తీవ్రంగా నొప్పి కలిగిస్తుంది. అరగంటలో నోరు, చెవులో నుంచి రక్తస్రావం జరుగుతుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రైతులు పంట చేలకు వెళ్లినప్పుడు పాదరక్షలు వేసుకోవాలి. రాత్రి, తెల్లవారుజామున పొలాలకు వెళ్లేటప్పుడు టార్చిలైట్ వెంట ఉండాలి. పశుగ్రాసం, చెత్త కుప్పులు, కట్టెలు, రాళ్ల కుప్పలు వంటి ఉన్నచోట సర్పాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చేతిలో కర్ర పట్టుకొని శబ్దాలు చేసుకుంటూ కర్రతో అటు ఇటు కదుపుతూ ముందుకెళ్లాలి. మోటార్ స్టార్టర్ డబ్బాల్లోనూ పాములు సేద తీరుతుంటాయి. వాటి తలుపులు తీసే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకూడదు. తీవ్రమైన ఒత్తిడితో గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. పాముకాటు వేయగానే గాయాల పైభాగంలో కట్టు కట్టాలి. దీంతో విషం శరీరానికి వెళ్లకుండా నివారించవచ్చు. విషానికి విరుగుడుగా యాంటీ వినమ్ ఇంజక్షన్ తీసుకొని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వానాకాలంలో పాములతో ప్రాణాపాయం ఏమరపాటుగా ఉంటే ముప్పే అప్రమత్తత అవసరం అందుబాటులో మందులు మండలంలోని లింగన్నపేట పీహెచ్సీ పరిధిలో పాముకాటుకు మందులు అందుబాటులో ఉన్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు పొలం పనులు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. పాముకాటుకు గురైన వ్యక్తులు భయం, కంగారు పడొద్దు. వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తొందరగా ఇంజక్షన్ వేయిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. – వేణుగోపాల్రెడ్డి, పీహెచ్సీ వైద్యుడు, లింగన్నపేట -
ఉపాధ్యాయుల ప్రమోషన్లకు పచ్చజెండా
కరీంనగర్: ఉపాధ్యాయుల ప్రమోషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రమోషన్ల ప్రక్రియ ఈనెల 2 నుంచి 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. పదోన్నతుల ప్రక్రియ సజావుగా జరిగేలా విద్యాశాఖ సెక్రటరీ గురువారం సాయంత్రం అన్ని జిల్లాల డీఈవోలతో సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా మొదటగా గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు రానున్నాయి. మల్టీజోన్– 2లో మిగిలిపోయిన, పదవీ విరమణతో ఖాళీగా ఉన్న గెజిటెడ్ హెచ్ఎం పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి ఇచ్చి వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. డీఎస్సీ–2012 తర్వాత పీఈటీ, భాష పండితులకు కూడా అప్గ్రేడ్ చేయాల్సి ఉంది. మొత్తంగా జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ గెజిటెడ్ హెచ్ఎంలుగా, భాషా పండితులు, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందే అవకాశం దక్కింది. జూన్ 30 వరకు ఉన్న ఖాళీలను ఆధారంగా తీసుకుని ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. పదోన్నతుల షెడ్యూల్ ఈనెల 2న ఖాళీల వెబ్సైట్లో ప్రదర్శన. 3న సీనియార్టీ జాబితాపై అభ్యంతరాల సమర్పణ. 4,5న అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా విడుదల. 6న వెబ్ ఆప్షన్ల అమలు (హెడ్మాస్టర్ గ్రేడ్–2 కోసం), 8,9న ఎస్జీటీల తుది జాబితా విడుదల, 10న ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్ల ఆవకాశం, 11న స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి అర్డర్లు, 12న ఎస్జీటీల పదోన్నతి అర్డర్లు(జిల్లా కలెక్టర్ అనుమతితో) మొత్తంగా పది రోజుల్లో పదోన్నతుల ప్రక్రియను ముగించేలా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 2 నుంచి 12 వరకు పదోన్నతుల ప్రక్రియ -
ఉన్నత లక్ష్యాలు ఏర్పర్చుకోవాలి
చొప్పదండి: విద్యార్థులు పాఠశాల సమయంలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి సాధనకు క్రమ శిక్షణ కలిగి ఉండాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. పట్టణంలోని పీఎంశ్రీ నవోదయ విద్యాలయంలో హైదరాబాద్ రీజియన్ ఖోఖో పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు మెమొంటోలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక దారుఢ్యానికి ఉపయోగపడుతాయని, క్రీడల్లో ప్రతిభ కనబరచడం ద్వారా దేశవ్యాప్త కీర్తిని పొందాలని సూచించారు. క్రీడల ముగింపు సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఫైనల్ మ్యాచ్లో వివిధ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అండర్ 14 బాలుర విభాగంలో బీదర్ జట్టు గెలుపొందగా, కృష్ణా జట్టు రన్నరప్గా, బాలికల విభాగంలో విన్నర్గా కృష్ణా జట్టు, రన్నర్గా షిమోగా జట్లు నిలిచాయి. అండర్–17 బాలుర విభాగంలో విన్నర్గా బీదర్, రన్నర్గా తుంకూర్ జట్టు, బాలికల విభాగంలో విన్నర్గా బీదర్, రన్నర్గా కృష్ణా జట్టు నిలిచాయి. అండర్– 19 బాలుర విభాగంలో బీదర్ జట్టు విన్నర్గా, రన్నర్గా కడప జట్టు, బాలికల విభాగంలో విన్నర్గా ఖమ్మం జట్టు, రన్నర్గా బీదర్ జట్లు నిలిచాయి. ప్రిన్సిపాల్ మంగతాయారు పాల్గొన్నారు. ‘డబుల్’ ఇళ్లు సిద్ధం చేయండి కొత్తపల్లి(కరీంనగర్): చింతకుంటలోని డబుల్ బెడ్రూం ఇండ్లలో వసతులు కల్పించి సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశింంచారు. పెండింగ్ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. చింతకుంటలోని డబుల్ బెడ్రూం సముదాయాలను గురువారం అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి పరిశీలించారు. పెండింగ్ పనులపై ఆరా తీశారు. త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఆర్అండ్బీ ఈఈ నరసింహాచారి పాల్గొన్నారు. కలెక్టర్ పమేలా సత్పతి ముగిసిన జేఎన్వీ రీజియన్ ఖోఖో పోటీలు -
ఫీజు బకాయిల కోసం పోరాటం
● ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికరీంనగర్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్స్ బకాయిలు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి అధ్వర్యంలో గురువారం చలో కలెక్టరేట్ చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లగా ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలను ప్రభుత్వం ఇవ్వడం లేదని, ప్రభుత్వం మారినా విద్యార్థుల బతుకులు మారడం లేవన్నారు. మొత్తం రూ.8,158 వేల కోట్ల పెండింగ్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో చదువుకోవా ల్సిన విద్యార్థులు రోడ్డెక్కి ఉద్యమించే పరిస్థితి వచ్చిందన్నారు. తక్షణమే ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శి రామారావు వెంకటేశ్, మచ్చ రమేశ్, ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్, రాముయాదవ్ పాల్గొన్నారు. -
ఏది నిజం..?
● హైదరాబాద్ ‘సృష్టి’ ఘటనతో ఐవీఎఫ్లపై అనుమానాలు ● ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా సంతాన సాఫల్య కేంద్రాలు ● అమాయకుల నుంచి రూ.లక్షలు వసూలుకరీంనగర్టౌన్: అమ్మానాన్న కావాలనేది దంపతులు కల. సహజ సిద్ధంగా సాధ్యం కాని పరిస్థితుల్లో దత్తత విషయంలోనూ విముఖత చూపుతూ... ఇన్విట్రో ఫెర్టిలైజేషన్(ఐవీఎఫ్) వైపు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ ‘సృష్టి’ ఘటన ఉమ్మడి జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా సంతానం పొందిన దంపతుల్లో కలకలం సృష్టించే పరిస్థితి నెలకొంది. ఐవీఎఫ్కు వెళ్లాలనుకునే దంపతులు ఏది నిజం.. ఏది అబద్ధం.. అని తెలుసుకునే పరిస్థితి నెలకొంది. శాసీ్త్రయమా... అశాసీ్త్రయమా? ఐవీఎఫ్ సంతానం లేని దంపతులకు వరం లాంటి ది. ఈ పద్ధతితో చాలా మంది తల్లిదండ్రులు అవుతున్నారు. అయితే దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండం ద్వారా పిల్లలను కంటే ఇబ్బంది లేదు. కానీ ఉమ్మడి జిల్లాలో సంతాన సాఫల్య కేంద్రాలు శాసీ్త్రయ పద్ధతిలో చికిత్సలు అందిస్తున్నా యా.. లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కరీంనగర్ కేంద్రంగా ఐవీఎఫ్ సెంటర్లు విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో 15, పెద్దపల్లిలో ఒకటి, జగిత్యాలలో ఒకటి చొప్పున కేంద్రాలున్నాయి. పిల్లలు లేని జంటలే లక్ష్యంగా కేంద్రాల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. ఫలితం లేకపోతే తమ తప్పేంలేదని చేతులు దులుపుకుంటుండడం దంపతుల కన్నీటికి కారణమవుతోంది. కమీషన్లతో వ్యవహారం వివాహం జరిగి ఏళ్లు గడిచినా సంతానం లేని దంపతులే టార్గెట్గా నిర్వాహకులు దందా సాగిస్తున్నారు. ఫెర్టిలిటీ సెంటర్, టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వంటి పేర్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో చికిత్స చేయించుకుంటే బిడ్డ జన్మించడం గ్యారంటీ అని నమ్మిస్తూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి దంపతులు సంతానంపై ఆశతో వస్తున్నారు. దంపతులను పంపిస్తే ఆర్ఎంపీలు, వైద్యులకు కమీషన్లు ఇచ్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. ‘సక్సెస్ రేట్’ అంతంతే! దంపతుల్లో సంతాన లేమికి అనేక కారణాలు ఉంటాయి. దంపతులెవరైనా సంతానంలేదని వస్తే వైద్యులు అందుకు కారణాలను నిర్ధారించాల్సి ఉంటుంది. కానీ.. చికిత్స చేస్తే సంతానం గ్యారంటీ అని నమ్మబలికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో సక్సెస్ అంతంత మాత్రమే ఉంటుందని నిపుణులు చెబుతుండగా, సెంటర్ల నిర్వాహకులు ఆదాయమే లక్ష్యంగా చికిత్స చేస్తున్నారని సమాచారం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఇప్పటికే ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేపట్టాం. నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తప్పవు. అమాయకులైన దంపతులకు హానీ కలిగించేలా వ్యవహరించొద్దు. అనుమతి ఉన్న సెంటర్ల నిర్వాహకులైనా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. జిల్లాలోని అన్ని సెంటర్లను తనిఖీ చేసి నిబంధనల అమలును పరిశీలిస్తాం. – వెంకటరమణ, డీఎంహెచ్వో, కరీంనగర్ -
ప్రాణం తీసిన వంద రూపాయల గొడవ
జ్యోతినగర్(రామగుండం): ఊరుగాని ఊరికి వలసవచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ కార్మికుడు రూ.వంద గొడవలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎన్టీపీసీ పోలీస్స్టేషన్ పరిధి రామగుండం పర్మినెంట్ టౌన్షిప్లో జరిగింది. వలస కార్మికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా జాట్లాపూర్ గ్రామానికి చెందిన వినోద్ బుబాజి సోన్కరి(44) ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఓ కంపెనీకి సంబంధించి బహుళ అంతస్తుల భవన నిర్మాణ పనులు చేసుకుంటూ అక్కడే ఓ షెడ్లో ఐదుగురితో కలిసి ఉంటున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి తనతో పాటు ఉన్న మనోజ్ అనే వ్యక్తి నీలకంఠ అనే మరో కార్మికుడికి రూ.300 అప్పు ఇచ్చాడు. నీలకంఠ తిరిగి మనోజ్కు రూ.200 ఇచ్చి మరో వంద తర్వాత ఇస్తానని చెప్పగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. మనోజ్ మద్యం మత్తులో నీలకంఠపై దాడికి పాల్పడగా అక్కడే ఉన్న వినోద్ ‘గొడవ చేయకండి, బయటకు వెళ్లండి’ అని వారించాడు. తనను బయటకు వెళ్లమని చెప్పిన వినోద్ మాటలకు పగ పెంచుకున్న మనోజ్ అర్ధరాత్రి లేబర్షెడ్లో నిద్రిస్తున్న వినోద్ తలపై ఇనుపరాడ్తో దాడి చేశాడు. ఉదయం అందరికీ వంట చేయాల్సిన వినోద్ నిద్ర నుంచి మేల్కోనకపోవడం, తలపై రక్తం ఉండటంతో వెంటనే తోటి కార్మికులు ట్రాక్టర్లో గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మృతిచెందాడని తెలి పారు. వినోద్ను హత్య చేసిన నిందితుడితోపాటు మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్, సీఐ రవీందర్, ఎస్సై ఉదయ్కిరణ్ పరిశీలించారు. కాగా, మృతుడికి భార్య ప్రతిభ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీపీసీ పీటీఎస్లో వలస కార్మికుడి హత్య -
‘ఐవీఎఫ్’లపై స్పెషల్ డ్రైవ్
● నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు ● ఇప్పటివరకు 43 స్కానింగ్ సెంటర్లకు నోటీసులు ● జిల్లా వైద్యాధికారి వెంకటరమణకరీంనగర్టౌన్: వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్లపై జిల్లాస్థాయి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఆక్ట్ (ఎంటీపీ ఆక్ట్), అసిస్టెడ్ ప్రొడక్టివ్ టెక్నాలజీ (ఏఆర్టీ), సరోగసీ చట్టాల నిబంధనలను పాటించని సెంటర్లపై కొరడా ఝుళిపించనున్నారు. లింగ నిర్ధారణ నిషేధ చట్టం– 1994 ప్రకారం నడుచుకోని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులను గుర్తించి చర్యలు చేపట్టనున్నారు. రోగుల సంఖ్య తక్కువగా ఉండి ఆదాయం లేని కొన్ని నర్సింగ్ హోమ్లు, పెర్టిలిటీ కేంద్రాలతో ఎవరికీ అనుమానం రాకుండా లింగనిర్ధారణ జరుపుతుండడం విస్మయానికి గురిచేస్తోంది. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు ప్రైవేటు ప్రాక్టీషనర్లు మధ్యవర్తులుగా ఉండి ఆడపిల్లలకు మరణశాసనం లిఖిస్తున్నారు. ఈ తంతును అరికట్టేందుకు వైద్యారోగ్యశాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. అడ్వైజరీ కమిటీ సమావేశం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే గర్భస్థ పూర్వ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం 1994 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటరమణ తెలిపారు. బుధవారం డీఎంహెచ్వో చాంబర్లో జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. డీఎంహెచ్వో లింగ నిర్ధారణ నిషేధచట్టం అమలు తీరును సమీక్షించారు. ఇటీవల ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీకి సంబంధించిన పలు కేసులు బయటపడుతుండడంతో జిల్లాలోని ఐవీఎఫ్ సెంటర్లపై దృష్టి సారించినట్లు తెలిపారు. జిల్లాలో 15 సెంటర్లు రిజిస్టర్ అయి ఉండగా, వాటిలో 4 లెవల్–1, మిగిలినవి లెవల్–2గా నమోదు అయ్యాయని వెల్లడించారు. అదనంగా వచ్చిన కొన్ని కొత్త దరఖాస్తులను ఆమోదం కోసం రాష్ట్రస్థాయిలో ప్రక్రియలో ఉన్నాయన్నారు. 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు లింగ ఎంపిక నిషేధ చట్టాన్ని అతిక్రమించిన 43 స్కానింగ్ సెంటర్లకి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధిస్తారని వెల్లడించారు.అక్రమాలకు పాల్పడితే సీజ్ చేస్తాం జిల్లాలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పా టించని వారికి నోటీసులు జారీ చేస్తాం. గడు వు ప్రకారం సమాధానం చెప్పనట్లయితే సీజ్ చేస్తాం. తనిఖీలు నిరంతరం కొనసాగుతా యి. ఐవీఎఫ్, సరోగసీలో అక్రమాలు, లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.– వెంకటరమణ, డీఎంహెచ్వో -
చేయకండి
గురువారం శ్రీ 31 శ్రీ జూలై శ్రీ 2025ఆ ఇళ్లకు రిజిస్ట్రేషన్లుసాక్షిప్రతినిధి,కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు రద్దు.. అది కూడా కేవలం రెండు నెలల కాలంలో. అదీ రిజిస్ట్రేషన్లశాఖ అధికా రులు కళ్లు మూసుకుని.. మామూళ్ల మత్తులో చేసిన ఘనకార్యాలే. కొత్తపల్లి పరిధిలోని ప్రభుత్వ భూమిని గంగాధర సబ్రిజిస్ట్రా ర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన 476 పట్టాలు రద్దయిన విషయం మరుకముందే.. మరో 202 రిజిస్ట్రేషన్లు చేయవద్దంటూ కరీంనగర్ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్లశాఖకు లేఖ రా యడం కలకలం రేపుతోంది. ఇటీవల కొత్తపల్లి మండలంలోని సర్వే నంబరు 272/14లో రూ.కోట్లు విలువచేసే ప్రభుత్వ భూమిని అప్పనంగా ఇతరులకు రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కు గురైన విషయం మరవకముందే.. తాజాగా అక్రమ పద్ధతుల్లో ఇంటినంబర్లను ఆసరాగా చేసుకుని వచ్చే 202 మందికి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ గంగాధర, కరీంనగర్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు మున్సిపల్ కార్పొరేషన్ లేఖ రాసింది.న్యూస్రీల్ఇటీవల ‘సాక్షి’లో ప్రచురించిన కథనం -
విద్యార్థులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి
హుజూరాబాద్: వానాకాలంలో వ్యాధులు సంక్రమించకుండా విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఎంజేపీ జాయింట్ సెక్రటరీ శ్యామ్ప్రసాద్లాల్ సూచించారు. పట్టణ శివారు కేసీ క్యాంపులోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహాన్ని బుధవారం సందర్శించారు. విద్యార్థులు వైరల్ ఫీవర్తో బాధపడితే, వెంటనే హాస్టల్ అధికారులకు తెలియజేయాలన్నారు. పౌష్టికాహారం తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉంటారని సూచించారు. అనంతరం వసతిగృహాల్లో అందుతున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. సింగిల్ విండో విధానంలో హెచ్టీ సర్వీసులుకొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ సర్కిల్ పరిధిలో 11, 33 కె.వీ.హెచ్టీ సర్వీసులను ఇకపై సింగిల్ విండో విధానంలో వేగవంతంగా మంజూరు చేస్తున్నట్లు టీజీఎన్పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు తెలిపారు. కరీంనగర్ విద్యుత్ భవన్లో బుధవారం వినియోగదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హెచ్టీ సర్వీసుల మంజూరును మరింత సరళీకృతం చేసేందుకు మానిటరింగ్ సెల్ను సర్కిల్, కార్పొరేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11 కేవీ ఓల్టేజీ హెచ్టీ దరఖాస్తులను సర్కిల్ ఆఫీస్లో ఏడీఈ(కమర్షియల్), 33 కేవీ ఓల్టేజీ ఆపైన వాటి దరఖాస్తులను ఏడీఈ/ కమర్షియల్ కార్పొరేట్ ఆఫీస్ అధికారి మానిటర్ చేస్తారన్నారు. ఈ కొత్త విధానం ద్వారా మొదట వినియోగదారులు టీజీఎన్పీడీసీఎల్ వెబ్ పోర్టల్లో అవసరమైన పత్రాలతో హెచ్టీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్ఈ కోరారు. వైద్య పరీక్షలు, స్కానింగ్పై 40 శాతం రాయితీ కరీంనగర్టౌన్: పేదలకు మోయలేని భారంగా మారుతున్న వైద్య పరీక్షలు, స్కానింగ్పై 40శాతం రాయితీ ఇ ప్పించేందుకు డయాగ్నోస్టిక్ సెంటర్లతో ఒప్పందం చేసినట్లు బీఎన్రావు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ బీఎన్రావు తెలిపారు. బుధవారం నగరంలోని ఫౌండేషన్ కార్యాలయంలో మాట్లాడుతూ.. నిరుపేదలు అనారోగ్యం పాలైన సమయంలో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రులకు వస్తే రక్తపరీక్షలు, ఎంఆర్ఐ, సిటిస్కానింగ్ల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల నుంచి వైద్యులకు కమీషన్లు ముట్టజెబుతూ పేషెంట్ల జేబులు గుళ్ల చేస్తున్నారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు రోగాలు వస్తే ఆస్తులు అమ్ముకొని పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతోందన్నారు. ఇలాంటి పరిస్థితిని దూరం చేసి పేదలకు ఆర్థిక భారం తగ్గించేందుకు నగరంలోని విజయ, సాయిరాజా, కేసీ డయగ్నోస్టిక్ సెంటర్లను సంప్రదించగా వారు బీఎన్రావు ఫౌండేషన్ ద్వారా 40శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. నిరుపేదలు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రక్తపరీక్షలు, స్కానింగ్ అవసరమైన వారు 8331875779, 9866842211 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కొనసాగుతున్న నవోదయ క్రీడా పోటీలు చొప్పదండి: జవహర్ నవోదయ హైదరాబాద్ రిజియన్ ఖోఖో పోటీలు నేడు ముగియనున్నా యి. సుమారు 560 మంది క్రీడాకారులు ఎని మిది క్లస్టర్లు, నాలుగు రాష్ట్రాల నుంచి రీజి యన్ ఖోఖో పోటీల్లో పాల్గొనగా, బుధవారం అండర్–19 బాలుర విభాగంలో బీదర్ వర్సెస్ ఖమ్మం, తుమ్కూర్ వర్సెస్ కడప, అండర్–17 బాలుర విభాగంలో బీదరు వర్సెస్ కడప, తుముకూర్ వర్సెస్ కృష్ణ, అండర్ –17 బాలి కల విభాగంలో బీదర్ వర్సెస్ కడప, అండర్–19 విభాగంలో తుముకూరు వర్సెస్ కడప జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయి. గురువా రం సెమీ ఫైనల్స్, ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. -
ముదిరాజ్లకు అధిక సీట్లు ఇవ్వాలి
కరీంనగర్: తెలంగాణలో ముదిరాజ్ జనాభా దామాషా ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సీట్లు కేటాయించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ మత్స్యకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంద నగశ్ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని కెమిస్ట్రీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ముదిరాజుల జనాభా 14.6 శాతం ఉన్నా.. అధికారాల్లో వారి ప్రాతినిధ్యం శాతం తక్కువుందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులకు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయకపోవడం విచారకరమని మండిపడ్డారు. ముదిరాజులను బీసీ–డి నుంచి బీసీ–ఏ గ్రూపునకు మారుస్తామని గొప్పగా ప్రకటించినా.. అది మాటలకే పరిమితమైందన్నారు. తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా సిద్ధి సంపత్కు నియామక పత్రం అందజేశారు. సంపత్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా ముదిరాజుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మురళి, పిట్టల మధుసూదన్, నారాయణ, శ్రీని వాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్తమ జాతీయ పంచాయతీకి రూ.కోటి బహుమతి ● ఆన్లైన్లో పల్లెప్రగతి వివరాలు నమోదు ● జిల్లా నుంచి తొమ్మిది గ్రామాల ఎంపికకు కసరత్తు
‘ఉత్తమ’ అవార్డుకు పోటీకరీంనగర్రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీల ఎంపికకు పోటీలు నిర్వహిస్తోంది. ఎంపికై న మొదటి ఉత్తమ గ్రామపంచాయతీకి రూ.కోటి, రెండో పంచాయతీకి రూ.75 లక్షలు, మూడో పంచాయతీకి రూ.25 లక్షల నగదు పురస్కారం అందిస్తోంది. జిల్లాలోని 318 గ్రామపంచాయతీల్లో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వివరాలను పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్(పీఏఐ) యాప్లో పంచాయతీ కార్యదర్శులు నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ముందుగా గ్రామపంచాయతీ, మండల, జిల్లాస్థాయిలో పూర్తి చేస్తారు. ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఉపాధి అవకాశాలు, తాగునీరు, ఆరోగ్యం, సౌకర్యాలు, ప చ్చదనం, పరిశుభ్రత, భద్రత, సామాజిక న్యాయం తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి నమోదు చేస్తున్నారు. జిల్లా నుంచి తొమ్మిది అంశాల్లో ప్రతిభను ప్రదర్శించిన తొమ్మిది పంచాయతీలను రాష్ట్రస్థాయికి పంపిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ మార్కులు సాధించిన తొమ్మిది పంచాయతీలను రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థాయి పోటీలకు పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామపంచాయతీస్థాయిలో పీఏఐలో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల సమాచారాన్ని నమోదు చేస్తున్నట్లు డీపీవో జగదీశ్వర్ తెలిపారు. దరఖాస్తులు ఆహ్వానంచొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యాసంవత్సరం పదకొండో తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ మంగతాయారు కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులై ఎలాంటి ఎంట్రెన్స్ పరీక్ష రాయకపోయినా, నవోదయ వెబ్సైట్లో ఫాం డౌన్లోడ్ చేసుకొని, పూరించి విద్యాలయంలో స్వయంగా గాని, మెయిల్ ద్వారా గాని పంపవచ్చని తెలిపారు. పూర్తి చేసిన ఫారాలను ఆగస్టు 10లోగా పంపించాలని సూచించారు. వివరాలకు నవోదయ వెబ్సైట్ సంప్రదించాలని కోరారు. -
నమ్మించి.. గొంతుకోసి
● వృద్ధురాలిపై మహిళ హత్యాయత్నం ● బంగారం, నగదు కోసం ఘాతుకం సైదాపూర్: ‘నా భర్తతో గొడవ జరిగింది. ఈ రాత్రికి మీ ఇంట్లో పడుకుంటాను’ అంటూ ఓ వృద్ధురాలిని నమ్మించింది. వృద్ధురాలు నిద్రపోయాక, హత్యాయత్నం చేసింది. ఆపై బంగారం, నగదుతో ఉడాయించిందో మహిళ. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధితురాలి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రావుల ప్రమీల(70) ఒంటరిగా ఉంటోంది. పెద్ద కొడుకు రావుల రాజిరెడ్డి కరీంనగర్లో, చిన్న కొడుకు దేవేందర్రెడ్డి సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. ఇదే గ్రామానికి చెందిన మిట్టపల్లి స్వరూప(50) మంగళవారం మధ్యాహ్నం నుంచి ప్రమీల ఇంటికి తరుచూ వచ్చి మాట్లాడుతోంది. రాత్రి పూట కూడా వచ్చింది. భర్తతో గొడవ జరిగిందని, రాత్రికి మీ ఇంట్లోనే పడుకుంటానని నమ్మబలికింది. ప్రమీల నిద్రపోయిన తర్వాత దిండుతో ముఖంపై అదిమిపట్టింది. కత్తితో గొంతు, శరీరభాగాలపై గాయపరిచింది. చనిపోయిందని అనుకుని వృద్ధురాలిపై ఉన్న బంగారం, నగదుతో పారిపోయింది. బుధవారం వేకువజామున స్పృహ వచ్చిన ప్రమీల చిన్న కొడుకు దేవేందర్రెడ్డికి ఫోన్చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన కొడుకులిద్దరూ వృద్ధురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితురాలు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
జగిత్యాలక్రైం: ప్రభుత్వ పనులు చేపట్టిన సివిల్ కాంట్రాక్టర్కు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేసిన జగిత్యాల పంచాయతీ రాజ్ శాఖలో విజిలెన్స్ క్వాలిటీకంట్రోల్ విభాగం ఏఈ అనిల్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన పంచరి వెంకటేశ్ సవిల్ కాంట్రాక్టర్. ఐదేళ్ల క్రితం కోరుట్లలో రూ.13.80 లక్షలతో ఎల్లమ్మ (గౌడ) కమ్యునిటీ హాల్ నిర్మించాడు. ఎంబీ రికార్డు కూడా పూర్తయింది. అలాగే రెండేళ్ల క్రితం రూ.4.50 లక్షలతో చిన్నమెట్పల్లిలో హనుమాన్ కమ్యునిటీ హాల్ నిర్మించాడు. కోరుట్లలోని ఆర్డీవో కార్యాలయం ప్రహరీని రూ.5లక్షలతో పూర్తి చేసి ఎంబీ రికార్డు పూర్తి చేయించాడు. మొత్తం మూడు పనులను రూ.23.30లక్షలతో పూర్తి చేశాడు. వాటికి సంబంధించిన బిల్లుల కోసం ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని ఏఈ అనిల్కుమార్ను కొన్నాళ్లుగా కోరుతున్నాడు. రేపుమాపు అంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చిన అనిల్.. గత శనివారం రూ.18 వేలు డిమాండ్ చేశాడు. దీనికి వెంకటేశ్ రూ.10 వేలు ఇచ్చేందుకు ఒప్పుకుని అదేరోజు రూ.3వేలు అడ్వాన్స్గా ఇచ్చాడు. అనంతరం ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం కరీంనగర్రోడ్లో ఉన్న పంచాయతీరాజ్ శాఖ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయం వద్ద కాపుకాశారు. వెంకటేశ్ నుంచి అనిల్ రూ.7వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతడిపై కేసు నమోదు చేశారు. అనిల్ను కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబరు 1064లో సంప్రదించాలని డీఎస్పీ వివరించారు. దాడుల్లో ఏసీబీ సీఐలు పున్నం చందర్, కృష్ణకుమార్, తిరుపతి, సిబ్బంది శ్రీకాంత్, విష్ణు, బాలు, మొగిలయ్య పాల్గొన్నారు. రూ.7వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్తో డబ్బుల డిమాండ్ ఏసీడీ డీఎస్పీ విజయ్కుమార్ వెల్లడి -
మతోన్మాదం రేపడమే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశంలో మతోన్మాదం రేపుతూ, ఓట్లు దండుకోవడమే బీజేపీ లక్ష్యమని కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ వి.హన్మంతరావు అన్నారు. బీసీల కులగణన చేయాలని ఉద్యమిస్తున్న రాహుల్గాంధీ ఆకాంక్షను హర్షిస్తూ బుధవారం సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన అనంతరం మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కులగణన జరగలేదని, బీసీలకు అనేక బాధలు ఉన్నాయని, ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తాము ప్రధాని మోదీని కోరినా పట్టించుకోలేదన్నారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరగాలంటే బీసీ కులగణన జరగాలని రాహుల్గాంధీ ప్రగాఢంగా నమ్మి ఆ దిశగా ఉద్యమిస్తున్నారని, ఇందుకు అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. దేశంలో యాభైశాతం రిజర్వేషన్ల సీలింగ్ ఎత్తివేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తారని ఇది కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. రాహుల్గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి బీసీ డిక్లరేషన్కు తగ్గట్టుగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీలు ముస్లిం రిజర్వేషన్ను వ్యతిరేకిస్తూ హిందూదేశంగా మార్చాలని కుట్రపూరితంగా ఉన్నాయన్నారు. బీసీ కులగణన కోసం ఆగస్టులో జంతర్మంతర్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర్య దేవరాజు, వెలుముల స్వరూపరెడ్డి, బొప్ప దేవయ్య, రాపల్లి కళ్యాణ్, గుండ్లపెళ్లి గౌతమ్, ఆడెపు చంద్రకళ, మడుపు శ్రీదేవి, కల్లూరి చందన తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఓబీసీ జాతీయ కన్వీనర్ హనుమంతరావు -
కొడుకు, కోడలు మధ్య మనస్పర్థలు
జూలపల్లి(పెద్దపల్లి): తన కొ డుకు, కోడలు మధ్య మనస్పర్థలు తలెత్తాయనే మనస్తాప ంతో జెన్కో ఉద్యోగి మేడుదుల రాజన్న (49) బుధవారం తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్ర ం లోనే ఉరివేసుకుని ఆత్మ హ త్య చేసుకున్నాడు. ఎస్సై సనత్కుమార్ కథనం ప్రకారం.. పెద్దపల్లికి చెందిన రా జన్న జూలపల్లి మండలం కాచాపూర్ 14వ మైలురా యి వద్ద గల జెన్కో జలవిద్యుత్ కేంద్రంలో జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయనకు కుమారుడు సాయికుమార్, ఒక కూతురు ఉన్నారు. సాయికుమార్ 2020లో మేకల కావ్యను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి కుమారుడు(3) ఉన్నాడు. అయితే, ఎంబీఏ చదువుకునేందు కు సాయికుమార్ 2022లో యూకేకు వెళ్లాడు. ఆ త ర్వాత ఆయన భార్య కావ్య తనతల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. 2024లో ఇండియాకు తిరిగి వచ్చిన సాయికుమార్.. తన భార్యను కాపురానికి రమ్మని అనేకసార్లు కోరినా ఆమె తిరస్కరించింది. దీంతో వారి మధ్య మనస్పర్థలు ఏర్పడి పంచాయితీలు జరుగుతున్నాయి. ఈక్రమంలోనే తన కుమారుడి సంసారం సాఫీగా సాగడం లేదనే మనస్తాపానికి గురైన తండ్రి రాజన్న.. తను పనిచేస్తున్న జలవిద్యుత్ కేంద్రంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేశారు. మనస్తాపంతో తండ్రి ఆత్మహత్య జలవిద్యుత్ కేంద్రంలో బలవన్మరణం -
సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్
● జన్నారం కేంద్రంగా కార్యకలాపాలు ● కాంబోడియా దేశం నుంచి సూచనలు ● వివరాలు వెల్లడించిన డీసీపీ భాస్కర్ జన్నారం: జన్నారం కేంద్రంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సైబర్ నేరాలకు వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఆయన కార్యాలయంలో బుధవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్(వీ) గ్రామానికి చెందిన భావు బాపయ్య 2024 జూలైలో కాంబోడియా దేశానికి వెళ్లి రెస్టారెంట్లో పనికి కుదిరాడు. బాపయ్యకు కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వేదాంతపురం గ్రామానికి చెందిన పాలవల్సుల సాయికృష్ణ ఉరఫ్ జాక్ ఉరఫ్ రాజు విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం ప్రయత్నిస్తుండగా 2023లోనే ఛండీఘర్లో పరిచయమయ్యాడు. 2024లో రాజు కాంబోడియా వెళ్లి బాపయ్యను రెస్టారెంట్లో కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్లో బాపయ్య ఇండియాకు తిరిగి వచ్చాడు. ఓ రోజు వాట్సాప్లో బాపయ్యను సాయికృష్ణ సంప్రదించి.. జన్నారం ప్రాంతంలో తనకు ఒక అద్దె ఇల్లు కావాలని కోరాడు. దీనికి బాపయ్య తన చెల్లెలి భర్త, జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన గొట్ల రాజేశ్తో కలిసి కలమడుగు గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఈ ఏడాది మేలో సాయికృష్ణ వాట్సాప్లో బాపయ్యను సంప్రదించి.. ఓ వ్యక్తి ద్వారా సామగ్రి పంపిస్తున్నానని, దానిని జగిత్యాల బస్టాండ్కు వెళ్లి తీసుకుని అద్దె గదిలో ఉంచాలని సూచించాడు. ఆ సమయంలో బాపయ్య అందుబాటులో లేకపోవడంతో అతడి తమ్ముడు మధుకర్ సామగ్రిని తీసుకెళ్లి కలమడుగులోని అద్దె గదిలో ఉంచారు. తర్వాత నెట్ కనెక్షన్, ఇన్వర్టర్, ల్యాప్టాప్ సమకూర్చుకున్నారు. తాను చెప్పినట్లు చేయాలని, ఇందుకు నెలకు రూ.30వేల చొప్పున ఇస్తానని, పైగా వచ్చిన సొమ్ములో వాటా కూడా ఇస్తానని బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ను సాయికృష్ణ పనికి కుదుర్చుకున్నాడు. వీరితోపాటు అప్పటికే ఆన్లైన్ గేమ్స్ ఆడి రూ.లక్షలు పోగొట్టుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన యాండ్రాపు కామేశ్ను నెలకు రూ.70వేల జీతం, వాటా ఇస్తానని ఉద్యోగానికి కుదుర్చుకున్నాడు. కామేశ్కు ఢిల్లీలోని ఓ వీల్స్ కంపెనీలో డీజిల్ సేల్స్లో అకౌంట్ కీ మేనేజర్గా పనిచేసిన అనుభవం ఉంది. ఈ క్రమంలో బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్, కామేశ్ కలిసి అద్దె గదిలో డీలింక్ రూటర్లు, ల్యాప్టాప్, సిమ్ ప్యానల్ ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించారు. ఆధారాలు లేని సిమ్కార్డులు 350 కొనుగోలు చేశారు. సాయికృష్ణ టెలిగ్రాం యాప్ ద్వారా చెప్పినట్లు ఈ నలుగురు ప్యానెల్లో సిమ్లు అమర్చి, కొంత సమయం తర్వాత తీయడం, కొత్త సిమ్లు పెట్టడం చేస్తూ ఉండేవారు. సిమ్బాక్స్ పరికరాలు ఏర్పాటు చేసి వివిధ రకాలైన ఐఎంఈఐ నంబర్లు, లింకులు తయారు చేసి సైబర్ నేరాలు పాల్పడుతూ అమాయక ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారు. పట్టుబడింది ఇలా.. ఢిల్లీకి చెందిన టెలి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సాంకేతిక పరిజ్ఞానంతో వీరి బండారాన్ని గుర్తించింది. రామగుండం సైబర్ క్రైం, పోలీసులు టెక్నికల్ సహాయంతో బుధవారం కలమడుగు చేరుకుని సోదాలు నిర్వహించారు. సోదాల్లో కామేశ్, భావు బాపయ్య, మధుకర్, గొట్ల రాజేశ్ పట్టుబడ్డారు. వారిని అరెస్ట్ చేసి సైబర్ నేరాలకు వినియోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ కాల్స్ లింక్స్ ఉన్నందున లోతైన విచారణ చేస్తున్నామని డీసీపీ వివరించారు. నిందితులను పట్టుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సైబర్ క్రైం డీసీపీ వెంకటరమణరెడ్డి, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ అలెన్, అనురాగ్, సైబర్ క్రైమ్ సీఐలు కృష్ణమూర్తి, శ్రీనివాస్, ఎస్సైలు గొల్లపెల్లి అనూష, సురేశ్, తహసీనోద్దీన్ను రామగుండం సీపీ, మంచిర్యాల డీసీపీ అభినందించారు. -
డాబాపై కూరగాయల సాగు
జగిత్యాలఅగ్రికల్చర్: రసాయనాల నుంచి తప్పించుకునేందుకు చాలామంది పట్టణవాసులు ఇంటిపై.. ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో కూరగాయలు పండించుకుంటున్నారు. తద్వారా ఆరోగ్యమైన ఆహారం పొందడంతోపాటు మనస్సుకు ఆనందం, ఆహ్లాదం అందించుకుంటున్నారు. గృహిణులు ఒకప్పుడు ఖాళీ ప్రదేశాల్లో పువ్వులు, అలంకరణ మొక్కలకు ప్రాధాన్యమిస్తే.. ఇప్పుడు రోజువారీ ఆహారంలో ఉపయోగించే ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ● ఆహ్లాదకర వాతావరణంలో.. కూరగాయలు పండిస్తున్న రైతులు ఎక్కువగా క్రిమిసంహారక మందులు వినియోగిస్తుండటంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. కొందరు వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి రసాయనాలు లేకుండా.. ఇంటికి అవసరమైన కూరగాయలను ఇంటి డాబాపై, ఖాళీ ప్రదేశాల్లో పండించుకునేందుకు గృహిణులు ముందుకొస్తున్నారు. ఇంటి వాతావరణం మారిపోవడంతోపాటు చల్లని గాలి, పచ్చని మొక్కల మధ్య సేద తీరుతున్నారు. ● తేలికపాటి కుండీల ఎంపిక డాబాపై కూరగాయల పెంపకానికి తేలికపాటి కుండీలను ఎంపిక చేసుకుంటున్నారు. ప్లాస్టిక్ కుండీలు, పైబర్తో తయారు చేసిన గ్రోబ్యాగ్స్ ఉపయోగిస్తున్నారు. ప్లాస్టిక్ బకెట్లు, వాటర్ క్యాన్లు, సింక్ తొట్టీలు, పాత టైర్లు.. ఇలా అన్నింటిని కూరగాయల పెంపకానికి ఎంపిక చేసుకుంటున్నారు. నిటారుగా ఉండే అంతస్తుల కుండీలు, వేలాడేదీసే కుండీలను కూడా వాడుకోవచ్చు. ఇనుపకుండీలైతే మొక్క వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. లోతు వేరు వ్యవస్థ గల మొక్కలకు ఎక్కువ లోతు కుండీలు.. తక్కువ వేరు వ్యవస్థ గల మొక్కలకు తక్కువ లోతు కుండీలను ఎంచుకోవాలి. బొప్పాయి, అరటి వంటి పెద్ద మొక్కలకు పెద్ద పరిమాణం గల ప్లాస్టిక్ డ్రమ్ములను ఉపయోగించవచ్చు. ● గ్రోబ్యాగ్స్ అనుకూలం గ్రో బ్యాగ్స్.. తక్కువ బరువు ఉండి, డాబాపై కూరగాయల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి. ఎంచుకున్న మొక్కలకు అనుగుణంగా గ్రోబ్యాగ్స్ వినియోగించాలి. మార్కెట్లో వివిధ పరిమాణాలు, ఆకారాల్లో దొరుకుతాయి. వీటిలో మట్టి పరిమాణం తక్కువ బరువు ఉండేలా చూసుకోవాలి. మట్టి మిశ్రమం అధికంగా ఉంటే డాబాపై బరువు పెరుగుతుంది. ఎర్రమట్టి, కోకోపీట్, పశువుల ఎరువు లేదా వర్మి కంపోస్టు వంటి తేలికపాటి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుని కుండీల్లో నింపాలి. మార్కెట్లో రెడీమేడ్ కుండీ మిశ్రమం కూడా దొరకుతోంది. మట్టి మిశ్రమాన్ని నింపేటప్పుడు పైభాగంలో కొంత ఖాళీ వదలాలి, ● మొక్కల ఎంపిక ప్రధానం డాబాపై మొక్కల పెంపకానికి కూరగాయల ఎంపిక ప్రధానం. కాలానుగుణంగా పండే కూరగాయలను ఎంపిక చేసుకోవాలి. శీతాకాలంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలను పండించవచ్చు. వేసవిలో క్యాబేజీ, కాలీప్లవర్, క్యారెట్, ఆలుగడ్డ మినహాయించి మిగతా కూరగాయలు పండించవచ్చు. తీగజాతి వాటికి పందిరి వేసుకోవాలి. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి షేడ్నెట్ వేసుకోవాలి. ఈ పద్ధతిలో కుటుంబ అవసరాలకు అనుగుణంగా నాలుగు రకాల కూరగాయలు, రెండు లేదా మూడు రకాల ఆకుకూరలు పండించవచ్చు. ● నీటి యాజమాన్యం కీలకం దాబా తోటల్లో నీటిని క్యాన్ ద్వారా అందించవచ్చు. స్వయంగా మొక్క వయస్సు, ఎదుగుదలను బట్టి ఎంత నీరు అవసరముంటే అంత నీరు ఇవ్వవచ్చు. ఇంట్లోని వ్యర్థాల నుంచి కంపోస్టు తయారు చేసి మొక్కలకు పోషకాలు అందించవచ్చు. మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి చీడపీడలు వస్తే చేతి ద్వారా తీసివేయవచ్చు. తీగజాతి కూరగాయల్లో పండు ఈగ వస్తే లింగాకర్షక బుట్టలు వాడి నివారించవచ్చు. ఎక్కువ చీడపీడలు వస్తే వేప నూనెను లీటర్ నీటికి 5 మి.లీ పిచికారీ చేస్తే సరిపోతుంది. రసాయనాలు లేని ఆకుకూరలు, కూరగాయలు అవగాహనతో ఆరోగ్యం కాపాడుకుంటున్న జనం కొన్నేళ్లుగా సాగు చేస్తున్న కొన్నేళ్లుగా ఇంటి పరిసరాలతోపాటు డాబాపై కూరగాయలు సాగు చేస్తున్నాను. మార్కెట్కు వెళ్లే అవసరం లేకుండాపోయింది. పూత నుంచి పిందె, కాత వరకు జరిగే చర్యలు కూడా ఆసక్తికరంగా ఉంటుండటంతో ప్రతిరోజు ప్రతి మొక్కనూ పరిశీలిస్తాను. – సముద్రాల జ్యోతి, గృహిణి, జగిత్యాల చాలా కూరగాయలు పెంచొచ్చు ఇంటి ఖాళీ ప్రదేశాలు, డాబాలపై కూరగాయలు పెంచుకోవచ్చు. ఆసక్తి గల గృహిణులు గ్రూపుగా ముందుకొస్తే ఉద్యానశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తాం. కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరలతోపాటు చిన్నపాటి సంచుల్లో టమాట, మిర్చి వంటి కూరగాయలు సాగు చేయవచ్చు. మా శాఖ తరఫున అవగాహన కల్పిస్తున్నాం. – స్వాతి, ఉద్యానశాఖాధికారి, జగిత్యాల -
బడిలో పాఠాలు.. పొలంలో వరినాట్లు
గంగాధర: విద్యార్థులకు తరగతి గదుల్లో చదువుతో పాటు పంటలసాగుపై అవగాహన కల్పించడానికి గంగాధర మండలం ఒద్యారం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులను రైతులు సాగు చేస్తున్న పొలాల వద్దకు తీసుకెళ్లి వరినాట్లు వేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభాకర్రావు మాట్లాడుతూ.. విద్యార్థులను క్షేత్రస్థాయిలోకి వ్యవసాయ పనుల్లో భాగస్వామ్యులను చేయడం ద్వారా సాగుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. పంటలు, ఎరువుల రకాలు, నేల స్వభావంతో పాటు, ఏ పంట ఎంతకాలంలో దిగుబడి వస్తుందో తెలుస్తుందన్నారు. విద్యార్థులు రైతులు పండించే పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. -
ట్రాక్టర్ యజమానుల బైండోవర్
కరీంనగర్రూరల్: కరీంనగర్ మండలం నగునూరు వాగునుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మహేశ్, అశోక్ను బుధవారం తహసీల్దార్ రాజేశ్ ఎదుట బైండోవర్ చేసినట్లు కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. మరోసారి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడినట్లయితే రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించేలా సొంత పూచీకత్తుపై బైండోవర్ చేసినట్లు వివరించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. సెల్ఫోన్ అప్పగింత కరీంనగర్ గోదాంగడ్డకు చెందిన బోయిని రాజేశ్ పోగోట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ టెక్నాలజీ ద్వారా పట్టుకుని బుధవారం బాధితుడికి అప్పగించినట్లు సీఐ నిరంజన్రెడ్డి తెలిపారు. జనవరి 6న మొగ్ధుంపూర్లో రాజేశ్ సెల్ఫోన్ పోగొట్టుకోగా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సీఈఐఆర్ టెక్నాలజీతో నిజామాబాద్లో గుర్తించి పట్టుకున్నట్లు వివరించారు. -
సౌదీలో భూషణరావుపేట యువకుడు ఆత్మహత్య
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలం భూ షణరావుపేటకు చెందిన స ంగెం వినోద్ (30) సౌదీ అరేబియా దేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రా మస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సంగెం గంగరా జం– సరోజన దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వినోద్ పెద్ద కుమారుడు. ఆయన కొంతకాలంగా గల్ఫ్ దేశం వెళ్లి వస్తున్నా డు. ఏడాదిన్నర క్రితం సౌదీ వెళ్లాడు. ఈనెల 22న వినోద్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి వారు కుటుంబసభ్యులకు బుధవారం ఫోన్లో సమాచారం ఇచ్చారు. వినోద్కు ఇంకా పెళ్లి కాలేదు. అతడి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని బంధువులు పేర్కొన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని మృతుడి బంధువులు కోరుతున్నారు. భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదుజగిత్యాలక్రైం: భార్యను హత్య చేసిన భర్తకు జీ విత ఖైదుతోపాటు, రూ.2 వేల జరిమానా విధి స్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి నారా యణ బుధవారం తీర్పునిచ్చారు. కోరుట్ల మండలం యెకిన్పూర్కు చెందిన ఎర్ర చంద్రయ్య, భార్య గంగరాజు కూలీలు. చంద్రయ్య మద్యాని కి బానిసై గంగరాజుతోపాటు కొడుకును వేధించేవాడు. 2022 అక్టోబర్ 29న ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులో భార్యతో ఘర్షణ పడి ఆమెను హత్య చేసి.. ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని మృతదేహాన్ని మూ టకట్టి యెకిన్పూర్ శివారులో పడేశాడు. మృతురాలి కుమారుడు సుధీర్ ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు కేసు నమోదు చేసి చంద్రయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు కోర్టులో సాక్షులను హాజరుపర్చారు. దీంతో చంద్రయ్యకు జడ్జి శిక్ష ఖరారు చేశారు. హాస్టల్ నుంచి పారిపోయిన విద్యార్థులు● స్థానికులు పట్టుకుని తిరిగి అప్పగింత ● ఘటన ఆలస్యంగా వెలుగులోకి.. మల్యాల: మండలకేంద్రం శివారులోని జగిత్యా ల అర్బన్ గురుకులం విద్యార్థులు హాస్టల్ గోడ దూకి పారిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకులాన్ని గతేడాది జగిత్యాల నుంచి మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు తరలించారు. ప్రస్తుతం ఇక్కడ 6, 7, 8 తరగతుల విద్యార్థులు 40మంది ఉన్నారు. ఈ ఏడా ది అడ్మిషన్ తీసుకున్న ఇద్దరు ఆరు, ఎనిమిదో తరగతి విద్యార్థులు సోమవారం రాత్రి హాస్టల్ గోడ దూకి పారిపోయారు. వారిని మండలకేంద్రంలో గుర్తించి తిరిగి వార్డెన్కు అప్పగించారు. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఇరువర్గాలపై కేసు సుల్తానాబాద్రూరల్(పెద్దపల్లి): భూ సమస్యపై గొడవపడగా ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్కుమార్ బుధవారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ఏరుకొండ సరోజన, భర్త తిరుపతి, కరీంనగర్ జిల్లా చర్లబూత్కూర్కు చెందిన బుర్ర రేణుక, భర్త రాములు, అల్లిపూర్కు చెందిన బండ రాణి, భర్త భూమయ్య, రేగడిమద్దికుంటకు చెందిన ముంజాల అశోక్, ఏరుకొండ వినోద్తోపాటు మరోవర్గం ముంజల శ్యామల, భర్త సతీశ్ భూసమస్యపై మంగళవారం గొడవ పడ్డారు. ఇదేసమయంలో పెట్రోలింగ్కు వెళ్లిన బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని సముదాయించినా వినకుండా పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. బుధవారం ఇరువర్గాలను సీఐ సుబ్బారెడ్డి ఠాణాకు పిలిపించి నోటీసులు అందించారు. గొడవ పడొద్దని కౌన్సెలింగ్ ఇస్తుండగా, ఏరుకొండ వినోద్ పోలీసులపై దురుసుగా ప్రవర్తించి, అసభ్యపదజాలంతో దూషించాడు. దీంతో వినోద్పై కేసు నమోదు చేశారు. ఈ విషయమై సీఐని సంప్రదించగా భూసమస్యపై ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఏడుగురిపై కేసు నమోదు చేశామన్నారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతిగొల్లపల్లి: చదువు ఇష్టం లేక మనస్తాపంతో ఈనెల 25న క్రిమి సంహారక మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని గోవిందుపల్లికి చెందిన బోనగిరి సూర్య బుధవారం మృతిచెందినట్లు ఎస్సై కృష్ణసాగర్రెడ్డి తెలిపారు. సూర్యను ఇంటర్ చదువు నిమిత్తం తల్లిదండ్రులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అక్కడ చదువుకోవడం ఇష్టం లేక ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు మందలించడంతో ఈనెల 25న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించారు. వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. సూర్య తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
రేషన్కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
చొప్పదండి: రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రి య అని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం మండలంలోని పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 78వేలకు పైగా నూతన రేషన్ కార్డులు మంజూ రు కాగా, చొప్పదండి నియోజకవర్గంలో నాలు గు వేల కార్డులు అందిస్తున్నామని తెలిపారు. నూతన రేషన్ కార్డు రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాబోతోందని, గంగాధరలో డిగ్రీ కాలేజీ, రామడుగులో అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం పలువురికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేశారు. తహశీల్దార్ నవీన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కొత్తూరి మహేశ్, వైస్ చైర్మన్ మునిగాల రాజేందర్, ముద్దం మహశ్ గౌడ్, గుర్రం భూంరెడ్డి, గుర్రం రాజేందర్ రెడ్డి, పెరుమాండ్ల గంగయ్యగౌడ్ పాల్గొన్నారు.● కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం -
ఉన్నత విద్యకు వరం
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ● దళిత విద్యార్థులకు చక్కని అవకాశం ● రూ.20లక్షల వరకు రుణ సదుపాయం ● పది దేశాల్లో చదివేందుకు ప్రాధాన్యంకరీంనగర్: దళిత విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఓ వరం లాంటిది. 2025 విద్యా సంవత్సరానికి విదేశాల్లో ఉన్నత చదువులు, ప్రత్యేక కోర్సులు పూర్తి చేసేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ద్వారా అమలవుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద ఒక్కో విద్యార్థికి రూ.20లక్షల వరకు అందిస్తోంది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా ఎంపిక చేస్తూ అవసరమైన రుణ సౌకర్యం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకున్న వారికి అర్హతలను బట్టి రుణం మంజూరు చేస్తారు. డిగ్రీ అనంతరం పీజీ, వైద్యవిద్య, ఎరోనాటికల్ విద్యకు ప్రాధాన్యం ఉంది. డిగ్రీలో 60శాతానికి పైగా మార్కులు కలిగి ఉండాలి. విదేశాల్లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశ పత్రం పొంది ఉండాలి. జీఆర్ఈ, టొఫెల్, ఐఈఎల్టీఎస్, జీఎంఏటీ తదితర లాంగ్వేజీ కోర్సుల్లో అర్హత సాధించి ఉండాలి. జాతీయ బ్యాంక్ అకౌంట్, ఆధార్కార్డు, పాస్పోర్టు ఉండాలి. వీటితో పాటు విద్యా సంవత్సరంలో గ్యాప్ ఉంటే దానికి సంబంధించిన వివరాలు, మీసేవ ద్వారా పొందిన కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. వార్షికాదాయం గతంలో రూ.2 లక్షలు మాత్రమే ఉండాలన్న నిబంధనను సడలించి, రూ.5లక్షల వరకు పెంచారు. ఈ సంవత్సరం ఎక్కువ మందిని పంపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఎస్సీ సంక్షేమశాఖ నుంచి విరివిరిగా ప్రచారం చేస్తున్నారు. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు. పథకం తీరుతెన్నులపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదని సమాచారం. సద్వినియోగం చేసుకోవాలి దళిత విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు ప్రవేశపెట్టిన అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని సద్వి నియోగం చేసుకుని భవిష్యత్లో రాణించాలి. విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు www.telangana. epass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పథకంపై ఎస్సీ నిరుద్యోగ యువతకు పూర్తిస్థాయి అవగాహన క ల్పిస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకున్న వారికి హైదరాబాద్లో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం ఉన్నతాధికారులు ఎంపిక చేస్తారు. – నగైలేశ్వర్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి -
మేం గురిపెడితే..
కరీంనగర్క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ఎలగందల్ ఫైరింగ్ రేంజ్లో బుధవారం పోలీసులు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీసు నిర్వహించారు. సీపీ గౌస్ఆలం ఫైరింగ్ ప్రాక్టీస్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం శిక్షణలో భాగంగా అధికారులందరికీ ఫైరింగ్ ప్రాక్టీసు నిర్వహిస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు ప్రాక్టీసు కొనసాగుతుందని అన్నారు. 0.9 ఎంఎం పిస్టల్, ఏకే–47 రైఫిల్, ఇతర ఫైర్ ఆర్మ్స్తో ప్రాక్టీస్ చేశారని వెల్లడించారు. కమిషనరేట్ పరిధిలోని అధికారులందరూ ఈ శిక్షణలో పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీసు చేయాలని సూచించారు. -
తండ్రిపై కొడుకు హత్యాయత్నం
రాయికల్: రాయికల్ పట్టణంలోని మత్తడివాడకు చెందిన చిట్యాల లక్ష్మీనర్సయ్యపై అతని కుమారుడు రాజేందర్ మంగళవారం రాత్రి కత్తితో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. లక్ష్మీనర్సయ్య స్థానికంగా హోటల్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాపిల్లలు తిండి పెట్టడం లేదు. దీంతో తల్లి వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తనకున్న భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్ తండ్రిపై కోపంతో రగిలిపోయాడు. మంగళవారం రాత్రి ఇంటికి రాగానే రాజేందర్ తన స్నేహితులతో కలిసి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో లక్ష్మీనర్సయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యుల ద్వారా తెల్సింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సుధీర్రావు పరిశీలించారు. రాజేందర్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం -
మాదకద్రవ్యాల నివారణకు చర్యలు
● నేర సమీక్షలో సీపీ గౌస్ఆలం కరీంనగర్క్రైం: మాదకద్రవ్యాల వాడకాన్ని కట్టడి చేస్తున్నామని, వీటి నివారణకు కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. మంగళవారం కరీంనగర్ కమిషనరేట్లో నేర సమీక్ష నిర్వహించారు. రౌడీ, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పోలీస్ అధికారుల వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. డివిజన్ను సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కి ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్ను ఇన్చార్జిగా నియమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచే తగిన కార్యాచరణ ప్రారంభించాలని ఆదేశించారు. పలు కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా కృషి చేసినందుకు జిల్లాలోని అన్నికోర్టుల్లో పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను సీపీ ఘనంగా సన్మానించారు. అడిషనల్ డీసీపీలు వెంకటరమణ(పరిపాలన), భీం రావు(ఏఆర్), ఏసీపీలు శ్రీనివాస్, విజయకుమార్, వేణుగోపాల్, శ్రీనివాస్జీ, సతీశ్, వెంకటస్వామి, డిప్యూటీ డైరెక్టర్ ఫర్ ప్రాసిక్యూషన్ డి.శరత్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె.శ్రీరాములు, అడిషనల్ పీపీలు పాల్గొన్నారు. -
నాగమ్మా.. దీవించు
బుధవారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2025నాగుల పంచమి సందర్భంగా మంగళవారం పలు ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ సమీపంలో ఉన్న పుట్టల్లో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. భగత్నగర్లోని అయ్యప్ప ఆలయంలో కలెక్టర్ పమేలా సత్పతి పూజలు చేశారు. పుట్ట లో పాలుపోశారు. శ్రీపురం, ప్రసన్నాంజనేయస్వామి, భగత్నగర్ అయ్యప్ప ఆలయం, అంజనాద్రి, కోతిరాంపూర్ పోచమ్మ, బొమ్మకల్ రోడ్డులోని శివ నాగేంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. తీగలగుట్టపల్లిలోని శ్రీమాతా మాణిక్యేశ్వరీ ఆలయం, మొగ్ధుంపూర్, చెర్లభూత్కూర్ ఎల్ల మ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. –కరీంనగర్కల్చరల్/విద్యానగర్ కరీంనగర్రూరల్ -
భాష.. యాసతోనే గుర్తింపు
● తెలంగాణ ఉద్యమంతో గౌరవం దక్కింది ● సంస్కృతీసంప్రదాయాలకు ప్రాచుర్యం ● ఉత్తరాది కల్చర్ మనపై దాడి చేస్తుంది ● అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ● దాశరథి పురస్కార గ్రహీత అన్నవరం దేవేందర్ తెలంగాణ మాండలికం తెలంగాణ మాండలికంలో కవితలు, రచనలు చేయడంతో నన్ను గుర్తించారు. నేను ఎక్కువగా పల్లెటూళ్లు, అక్కడి జీవనవిధానం, పల్లెప్రజలు వాడుకునే పనిముట్లు.. వాటిపైనే ఎక్కువగా రాశాను. తెలంగాణ భాష అనేది నా భాష అని రాసిన. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైంది. గిదేం భాష అని ఎక్కిరించిన్రు. అయినా మన తాతలు, తండ్రులు మాట్లాడిన భాషలోనే రాసిన. తెలంగాణ ఉద్యమ ఫలితంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు గుర్తింపు దక్కింది. తెలంగాణ మాండలికంలో వచ్చిన సినిమా పాటలు, జానపద గేయాలు సక్సెస్ అవుతున్నాయి.మొదట ఎక్కిరించిన్రు -
బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ
● కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డికరీంనగర్ కార్పొరేషన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్ల వ్యవహారంతో బీజేపీ బీసీలకు వ్యతిరేకమని మరోసారి రుజువైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత టి.జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ.. అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందినప్పుడు లేని అభ్యంతరం, కేంద్రం వద్దకు వెళ్లేసరికి బీజేపీకి ఎందుకొస్తుందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తే ముస్లింలకు ప్రయోజనం కలుగుతుందని ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్ అనుకూలంగా లేదన్నారు. 42శాతం రిజర్వేషన్లలో 10శాతం ముస్లింలే పట్టుకుపోతారంటూ బీజేపీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ అమలైతే ముస్లింలకు దక్కేది 5.08శాతం మాత్రమేనని, 10శాతం అంటూ ఎలా చెబుతున్నారో బీజేపీ నేతలకే అర్థం కావాలన్నారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి, ఆమోదం పొందేలా కృషి చేయాలన్నారు. సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, నాయకులు ఎండీ.తాజ్, సమద్నవాబ్, కోడూరి రవీందర్గౌడ్, శ్రవణ్, నరసింగం, దన్నాసింగ్ పాల్గొన్నారు. -
మొదట ఎక్కిరించిన్రు
సాక్షి, కరీంనగర్ డెస్క్: మా సొంతూరు ప్రస్తుత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారంం. అమ్మానాన్న అన్నవరం దశరథ–కేదారమ్మ. 1962 అక్టోబర్ 17న పుట్టిన. ఉపాధ్యాయిని ఏదునూరి రాజేశ్వరితో వివాహమైంది. కూతురు స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. పంచాయతీరాజ్శాఖ, కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్లో చాలా కాలం పనిచేశా. ముస్తాబాద్ మండల ప్రజాపరిషత్లో సూపరింటెండెంట్గా 2020 అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ చేసిన. 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా కొనసాగుతూ, తెలంగాణ పదాలతో కవిత్వం, రచనలు చేసిన. 25 ఏళ్లుగా వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్న. ఇప్పటి వరకు 12 కవితా సంపుటాలు, రెండు వ్యాస సంకలనాలు వెలువరించా. నా సాహితీకృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి ‘దాశరథి సాహితీ పురస్కారం’ ప్రకటించింది. ఈనెల 22న రవీంద్రభారతిలో దాశరథి శతజయంతి ఉత్సవసభలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా పురస్కారం అందుకున్న. ● 2001లో సాహితీ సృజన షురూ.. 2001లో ‘తొవ్వ’తో కవిత్వ రచనకు తొవ్వ దొరికింది. 60 ఏళ్ల కింద ఊరిలో ఉన్న మానవసంబంధాలు, వస్తువు(ఇసిరె)లు ఎలా ఉండే అనే దానిపై మూడేళ్లపాటు కాలమ్స్ రాశా. అన్ని కలిపి ‘తెలంగాణ జీవనచిత్రిక’ అనే ట్యాగ్లైన్తో పుస్తకం వేసిన. దానికి తెలంగాణ సారస్వత పరిషత్ నుంచి అవార్డు వచ్చింది. ఓ పత్రికలో మూడున్నరేళ్లపాటు అంతరంగాలు అనే కాలమ్ రాసిన. మనుషులకు సంబంధించిన జీవనచిత్రన రాయగా, దాన్ని కూడా పుస్తకంగా తీసుకొచ్చిన. గిన్నెసాహితీ అకాడమీ వారు కవిసంధి కార్యక్రమాన్ని కరీంనగర్లో నిర్వహించి ఇక్కడ నన్ను ఎంపిక చేశారు. నా కవిత్వ ప్రయాణాన్ని గంట సేపు ప్రసంగం కవిత్వంలో చెప్పాను. ● 12 కవితా సంపుటాలు.. 12 కవితా సంపుటాలు వెలువరించా. ఈ 12 కలిపి రెండు బృహత్ సంకలనాలు తీశాను. మూడు పుస్తకాలు ఇంగ్లిష్లోకి అనువాదమయ్యాయి. గతంలో పత్రికల్లో రాసిన వ్యాసాలను కలిపి ‘మరో కోణం’ అనే వ్యాస సంపుటిని తీసుకొచ్చాను. ‘ఊరి దస్తూరి’, ‘అంతరంగం’, ‘సంచారం’ పుస్తకాలు వెలువరించా. నాకు వివిధ ప్రాంతాలను సందర్శించడం అలవాటు. అలా ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం గురించి కవిత్వంలో లేదా వ్యాసంలోనైనా రాయడం నాకు అలవాటు. ప్రతీ దాని గురించి రాయడమనేది కవికి, రచయితకు అలవాటుగా ఉండాలి. ఈ అక్టోబర్లో నా పుట్టినరోజు సందర్భంగా మరో కవితాసంపుటిని వెలువరిస్తా. 2001 నుంచి ప్రతీ అక్టోబర్లో ఒక సంకలనం తీసుకురావాలని నిర్ణయించుకున్నా. అదే కొనసాగిస్తున్న. ● అవార్డులు రావడంపై.. అవార్డులు అనేవి కవి, రచయితకు ప్రోత్సాహకంగా నిలుస్తాయి. మన రచనలను బట్టి అవార్డులు, గుర్తింపు దక్కుతుంది. కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డి మా తరానికి ఆదర్శం. ఎప్పుడైనా అవార్డులు బాధ్యతను పెంచుతాయి. దాశరథి సాహితీ పురస్కారం రావడం గౌరవంగా భావిస్తా. ఆయన స్ఫూర్తితోనే నేను రచనలు చేస్తున్నాను. ● ఇంగ్లిష్ ప్రభావంతో.. ఇంగ్లిష్ ప్రభావంతో తెలుగు, తెలంగాణ యాస, భాషలు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం కూడా తెలంగాణకు సంబంధించిన పాఠ్యాంశాలను పుస్తకాల్లో పెట్టింది. కానీ మన ప్రజలు మాట్లాడే భాషలో లేదు. వాటిని తెలంగాణ మాండలికంలో తీసుకొస్తే భవిష్యత్ తరాలకు మన భాషను చేర్చినట్లు అవుతుంది. ప్రభుత్వం కూడా ప్రాథమిక స్థాయి వరకు పాఠశాలల్లో తెలంగాణ భాషలోనే బోధించాలి. అదే సమయంలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రోత్సహించాలి. తెలంగాణ పదాలను బతికించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. నిత్య అధ్యయనంతోనే కవిత్వం రాయగలం. అంతకుముందు ఉన్న సాహిత్యాన్ని చదవడం వల్లే మళ్లీ కొత్తగా వివిధ అంశాలపై రాయగలుగుతాం. భాష, ఊరు, అణగారిన సామాజిక వర్గాల మీద ప్రేమ ఉండాలి. అప్పుడే కొత్తగా రచనలు చేయగలం. నాకు స్ఫూర్తినిచ్చిన కవులు శ్రీశ్రీ మహాప్రస్తానం చదివిన తర్వాత కవిత్వం రాయాలనే ఆలోచన వచ్చింది. తర్వాత శివసాగర్, వరవరరావు, చెరబండ రాజు, గోపి, సినారె, శివారెడ్డి రచనలు నాపై ప్రభావం చూపాయి. వారి స్ఫూర్తితో నాదైన ప్రత్యేక శైలిలో రచనలు చేశాను. ● మన సంస్కృతిపై ఉత్తారాది దాడి.. బతుకమ్మ, బోనాలలో కొత్తకొత్త సంప్రదాయాలు వస్తున్నాయి. అయితే పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే కొత్త పోకడలు వస్తున్నాయి. బతుకమ్మ ఆట ఒకప్పుడు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ పాట పాడుతూ ఆడేవారు. ఇప్పుడు డీజే సౌండ్లతో ఆడుతున్నారు. ఉత్తరాది కల్చర్తో మన బతుకమ్మ ఆగమైంది. బతుకమ్మ ఆటపై దాండియా దాడి చేసింది. అలాగే మన వంటలు, తినే ఆహారంలోనూ మార్పు వచ్చింది. ఉత్తరాదికి చెందిన పానీపురి మన ప్రాంతానికి వచ్చింది. మన సర్వపిండి రాజస్థాన్లో ఎవరూ తినరు కదా. ఇడ్లీ తమిళనాడు నుంచి వచ్చింది. మనం కొంచెం బానిస మనస్తత్వంతో బతుకుతాం. మనకు తెలువకుండా ఇతరుల సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నాం. దీన్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంది. ● పంటలు.. ఉపాధి కారణంగానే.. మన దగ్గర విస్తారమైన పంటలు, ఉపాధి ఎక్కువగా దొరకుతుండడంతో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రజలు వలస వస్తున్నారు. వారి సంస్కృతి, సంప్రదాయాలకు మనవాళ్లు అలవాటు పడుతున్నారు. కానీ, ఇక్కడికి బతకడానికి వచ్చిన మార్వాడీలు, ఉత్తరాది రాష్ట్రాలవారు మన కల్చర్ను అలవాటు చేసుకోరు. పత్రికలు కూడా రాజకీయపార్టీల వైపు వెళ్లడంతో సమాజాన్ని అప్రమత్తం చేసే, చైతన్యం చేసే బాధ్యతను మరిచిపోయాయి. పౌరసంఘాలు కూడా తమ పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. -
వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయండి
కరీంనగర్ అర్బన్: జిల్లాలో వనమహోత్సవం లక్ష్యాన్ని పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. వన మహోత్సవం లక్ష్యాన్ని, నాటిన మొక్కల సంఖ్యను సమీక్షించారు. ప్రతిశాఖకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాలని, మొక్కలకు జియో టాకింగ్ చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు చేసేందుకు కావలసిన వివిధ సరుకులకు సంబంధించి ఈ ఏడాది టెండర్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. జిల్లాలోని భవిత, కేజీబీవీలలో భవనాల మరమ్మతులు, సదుపాయాల పనులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ, డీఆర్డీవో శ్రీధర్, ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ నాగలేశ్వర్, బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. వైద్య కళాశాలలో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలుకొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో తాత్కాలిక పద్ధతిలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీఏఎస్(ఐసీయూ) స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి వచ్చే నెల 1వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ తఖీయుద్దీన్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 14 మంది ప్రొఫెసర్లు, 33 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 20 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు సీఏఎస్ స్పెషలిస్టు, 48 మంది సినియర్ రెసిడెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు కళాశాల వెబ్సైట్ https://www.gmcknr.com/gmc knr. htmlwww. gmcknr.com నుంచి దరఖాస్తు ఫారంను డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలు పూరించి సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఈ నోటిఫికేషన్ను సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం నుంచి కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. మెరిట్, రిజర్వేషన్ నియమావళి ఆధారంగా నియామకాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ‘చేసింది గోరంత.. ప్రచారం కొండంత’గన్నేరువరం: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో అమలు చేసింది గోరంత అయితే.. ప్రచారం కొండంత చేసుకుంటోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గన్నేరువరంలో పార్టీ మండల అధ్యక్షుడు తిప్పర్తి నికేశ్ అధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నేతల సమావేశానికి హాజరై మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామాలు ప్రదర్శిస్తోందని విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు ఆగస్టులో పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందులో నాయకులు, కార్యకర్తలు పాల్గొని, బీజేపీని గడపగడపకు తీసుకెళ్లాలని తెలిపారు. -
వీధికుక్కల దాడిలో 200 నాటు కోళ్లు మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల గ్రామంలో వీధికుక్కలు దాడి చేయడంతో 200 నాటు కోళ్లు మృతిచెందాయి. పిట్ల నర్సింలుకు చెందిన కోళ్ల షెడ్లోకి కుక్కల గుంపు చేరి కోళ్లను చంపాయి. తనకు సుమారు రూ.1.50లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గంజాయి ముఠా అరెస్టుకరీంనగర్రూరల్: గంజాయి విక్రయిస్తున్న ముఠాను మంగళవారం అరెస్టు చేశారు. పట్టుబడిన నలుగురులో ఓ మైనర్ ఉన్నాడు. కరీంనగర్రూరల్ సీఐ నిరంజన్రెడ్డి కథనం ప్రకారం.. ఎస్సై లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ రహదారిలోని ఇరుకుల్ల వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కరీంనగర్ నుంచి పెద్దపల్లి వైపు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పట్టుకున్నారు. వారివద్ద 2.30 కిలోల లభించింది. పట్టుబడిన వారిలో మొగ్ధుంపూర్కు చెందిన బుర్ర వంశీ(22), దుర్గం హరికృష్ణ(22), సుల్తానాబాద్ మండలం పూసాలకు చెందిన సాయి(21)తోపాటు ఓ బాలుడి ఉన్నాడని, వారినుంచి నాలుగు సెల్ఫోన్లు, రెండు మోటార్సైకిళ్లు స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
గోదావరిఖని: తనకు రూ.10 లక్షల ఇవ్వాలని వ్యాపారులకు ఫోన్చేసి బెదిరించిన యాదనవేని తిరుపతి అనే హమాలీని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక కల్యాణ్నగర్కు చెందిన ఇద్దరు వ్యాపారులకు ఈనెల 18న ఫోన్చేసి తలా రూ.10లక్షలు ఇవ్వాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులకు హాని చేస్తానని తిరుపతి బెదిరించాడు. గతంలో ఓవ్యక్తిని కూడా మర్డర్ చేశానని, మీ ఫ్యామిలీకి కూడా ఇదేగతి పడుతుందని హెచ్చరించాడు. దీంతో బాధితులు ఈనెల 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్కాల్స్ ఆధారంగా ఎస్సై రమేశ్ దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు స్థానిక చంద్రశేఖర్నగర్కు చెందిన యాదనవేని తిరుపతిగా గుర్తించి మంగళవారం అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామం కాన్కూర్కు చెందిన తిరుపతి ఐదేళ్లుగా కిరాణాల్లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఇటీవల చంద్రశేఖర్నగర్లో ఇల్లు కొనుగోలు చేసి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కిరాణా షాపుల యజమానుల కదలికలు గమనించి సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో బెదిరింపు కాల్స్ చేసినట్లు సీఐ వివరించారు. గోదావరిఖని వన్టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి వెల్లడి -
క్యాన్సర్ సోకిందని మహిళ ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల ): క్యాన్సర్ వ్యాధి వచ్చిందనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు. మండలంలోని దుమాలకు చెందిన పిల్లి మానస(38) ఇటీవల అనారోగ్యానికి గురైంది. పలు ఆస్పత్రుల్లో వైద్యం అందించారు. క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోంది. ఈక్రమంలో మనస్తాపంతో సోమవారం రాత్రి అధిక మొత్తంలో ఐరన్ ట్యాబెట్లు మింగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త రామచంద్రం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చికిత్స కోసం ఖర్చులు ఎక్కువగా అవుతుండడంతో అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త రామచంద్రం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ గీత కార్మికుడి మృతిసైదాపూర్: మండలంలోని సోమారంలో తాటిచెట్టు పైనుంచి జారిపడిన గీత కార్మికుడు దాసారపు సదానందం(54) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారంగా.. సదానందం ఈనెల 15న గ్రామపరిధిలో కల్లుగీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబసభ్యులు హుజూరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..కోరుట్ల: పట్టణంలోని బస్టాండ్ ఇన్ గేట్ సమీపంలో సోమవారం బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డ షేర్దార్ వెంకటేశ్ (44) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం వెంకటేష్ బస్టాండ్ నుంచి తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా మేడిపెల్లి మండలం వల్లంపెల్లి గ్రామానికి చెందిన ముంజం కార్తీక్ అనే వ్యక్తి తన బైక్పై అతి వేగంగా వచ్చి వెంకటేష్ను ఢీకొట్టాడు. తీవ్ర గాయాల పాలైన ఆయనను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రాత్రి కరీంనగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. వెంకటేశ్ తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. పాత నేరస్తుల బైండోవర్జగిత్యాలక్రైం: పట్టణంలోని పాత కేసుల్లో ఉన్న ఆరుగురు వ్యక్తులను పట్టణ సీఐ కరుణాకర్ మంగళవారం జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పట్టణానికి చెందిన కొత్తకొండ వినీత్సాయి, జువ్వాడి దీక్షిత్, మర్రి మల్లికార్జున్, పాల రాజ్కుమార్, బుర్ర వినయ్, పూరెల్ల వినయ్ పాత కేసుల్లో నేరస్తులని, ప్రజలను భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా వీరిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి అదృశ్యంకొడిమ్యాల: మండలంలోని బొల్లంచెరువు గ్రామానికి చెందిన ఓ యువతి (19) సోమవారం రాత్రి తన ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయిందని యువతి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 130 గ్రాముల గంజాయి పట్టివేతధర్మపురి: పట్టణంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడి వద్ద 130 గ్రాముల గంజాయి పట్టుబడిందని ధర్మపురి ఎస్సై ఉదయ్కుమార్ తెలిపారు. స్థానిక పోలీసులు మండలంలోని రాయపట్నం శివారులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద 130 గ్రాముల గంజాయి లభించింది. యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నవోదయ దరఖాస్తు గడువు పొడిగింపుచొప్పదండి: జవహర్ నవోదయ 2026–27 విద్యా సంవత్సరంలో ఆరోతరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువు తేదీని ఆగస్టు 13 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ 13న ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ట్యాపింగ్!
నీడలా వెంటాడారు.. డ్రైవర్ ఫోనూ ట్యాప్ చేశారు..● సిట్ ముందు గ్రంథాలయ జిల్లా చైర్మన్ మల్లేశ్ వాంగ్మూలం ● ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన ఈటల రాజేందర్ ● బండి సంజయ్, ఆయన పీఆర్వో విచారణ వాయిదా ● త్వరలో చొప్పదండి ఎమ్మెల్యే సత్యంకూ నోటీసులునాలుగున్నరేళ్లపాటుసాక్షిప్రతినిధి,కరీంనగర్●: ‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగున్నరేళ్లపాటు నా ఫోన్ ట్యాప్ అయింది. నాదే కాదు.. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అనుక్షణం నీడలా వెంటాడారు.. పలుమార్లు మమ్మల్ని అడ్డగించారు.. మా వ్యక్తిగత సమాచారం తస్కరించారు. ప్రతీక్షణం మా మాటలు విన్నారు..’ ఇవీ.. కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ ఫోన్ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట చెప్పిన మాటలు. ఏడాదిన్నరగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కరీంనగర్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశ్ మంగళవారం హైదరాబాద్లోని సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. 3.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఇద్దరు అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనకు ఫోన్ట్యాపింగ్ ద్వారా ఎదురైన చేదు అనుభవాలు, ఇబ్బందులను పోలీసులకు సత్తు మల్లేశ్ వివరించారు. ఉమ్మడి జిల్లాతో లింకు.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు కరీంనగర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు బంధువులు కరీంనగర్కు చెందిన వారు కావడం, ఈ కేసులో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు పలుమార్లు కరీంనగర్కు వచ్చినట్లు సిట్ దర్యాప్తులో తేలడం, అలాగే ఈకేసులో సిరిసిల్ల ఎస్సీఆర్బీ డీఎస్పీగా దుగ్యాల ప్రవీణ్రావును సిరిసిల్లలోనే అరెస్టు చేయడం తెలిసిందే. అసలు అతని అరెస్టుతో సిట్ బృందం దర్యాప్తు వేగం పెంచింది. వాస్తవానికి 2021లోనే అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్రెడ్డి ఫోన్ ట్యాపింగ్పై కరీంనగర్లోని మైత్రీ హోటల్లో విలేకరుల సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. ఆ సమయంలోనే ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు, వేణుగోపాల్రావు, దుగ్యాల ప్రవీణ్రావు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారన్న విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ‘బండి’ నుంచి మల్లేశ్ వరకు.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ సిట్ బృందం ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కు హాజరు కావాలని సిట్ అధికా రులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. పార్లమెంటు సమావేశాలు, ఆపరేషన్ సిందూర్పై చర్చల కారణంగా బండి సంజయ్ విచారణకు రాలేనని సమాధానమిచ్చారు. బండి సంజయ్ తోపాటు ఆయన ఆంతరంగికుడు ప్రవీణ్రావు, ఆయన పీఆర్వో పసూనూరి మధుల ఫోన్లు కూడా ట్యాపయ్యాయని, వారు కూడా విచారణకు రా వాలని సిట్ కోరిన సంగతి తెలిసిందే. త్వరలోనే బండి సంజయ్ ఆయన అనుచరులు కూడా సిట్ ముందు హాజరై.. వాంగ్మూలం ఇవ్వనున్నారు. ● ఇక కరీంనగర్కు చెందిన మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కూడా గత నెలలో సిట్ ఎదుట విచారణకు హాజరై తన అనుభవాలను వివరించారు. ● సీఎంకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన.. జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తుమల్లేశ్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని.. పోలీసులు స్వాధీ నం చేసుకున్న పలు డివైజ్ల ద్వారా అప్పట్లోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ● ఇక ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్న మేడిపల్లి సత్యం ఫోన్లు కూడా ట్యాపయ్యాయని సమాచారం. త్వరలోనే ఆయనకు కూడా విచారణ కోసం సిట్ నుంచి పిలుపు రావొచ్చని తెలిసింది. -
భారతీయుడి త్రీడీ కళకు దక్కిన గౌరవం
రామగిరి(మంథని): అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్, మెకానికల్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్ఎస్ఆర్ కృష్ణ ఆధునిక పద్ధతులు ఉపయోగించి సృష్టించిన 10 త్రీడి డిజైన్స్కు అరుదైన గౌరవం దక్కింది. యూకే(యునైటెడ్ కింగ్డమ్)కు చెందిన అధికారిక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పేటెంట్ ఆఫీస్ ఈ 10 త్రీడీ డిజైన్స్ పేటెంట్ హక్కులను కృష్ణ పేరిట నమోదు చేసింది. దాదాపు 14ఏళ్ల నుంచి తాను త్రీడీ కళపై చేస్తున్న కృషికి గుర్తింపుగా యూకే పేటెంట్ హక్కులు రావడం గర్వంగా ఉందని కృష్ణ తెలిపారు. భారతదేశంలో పుట్టిన అనేక సాంకేతిక విజ్ఞానశాస్త్రాల్లో త్రీడీ కళ కూడా ఒకటని, ఈ విజయానికి ఆదినుంచీ సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన మంథని జేఎన్టీయూ ప్రిన్సిపాల్ బులుసు విష్ణువర్ధన్, మెకానికల్ ప్రొఫెసర్ శ్రీధర్రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఉదయ్కుమార్, తోటి ఉద్యోగులకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జ్వరం చూసి.. భోజనం చేసి
● గంగాధరలో గురుకులాలను తనిఖీ చేసిన కలెక్టర్ పమేలా సత్పతికరీంనగర్అర్బన్/గంగాధర: గంగాధరలోని మహాత్మజ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, మధురానగర్ చౌరస్తాలోని బాలికల మైనారిటీ గురుకులాన్ని కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు కూర్చోవడానికి సరఫరా చేసిన గ్రీన్మ్యాట్లు ఉపయోగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న విద్యార్థులతో మాట్లాడారు. మెడికల్ రిజిస్టర్ తనిఖీ చేసి, మందులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వెంట బీసీ సంక్షేమ అధికారి అనిల్ప్రకాశ్ ఉన్నారు. జిల్లాలో ఏడు ఇసుక రీచ్ల కేటాయింపు వినియోగదారుల అవసరాల నిమిత్తం జిల్లాలో ఏడు ఇసుక రీచ్ల నుంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇసుక రవాణాకు అనుమతులను మంజూరు చేసినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో డిస్టిక్ లెవెల్ సాండ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వినియోగదారుల అవసరాల నిమిత్తం ఊటూరు–2, ఊటూరు–1, చల్లూర్, మల్లారెడ్డిపల్లి, కోర్కల్, కొండపాక, పోతిరెడ్డిపల్లి రీచ్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. చేగుర్తి ఇసుక రీచ్ను ప్రభుత్వ అవసరాలు, ఇందిరమ్మ నిర్మాణానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా మల్యాల, పెగడపల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ అవసరాలకు రామడుగు మండలం మోతెలోని ఇసుక రీచ్ నుండి 15,000 మెట్రిక్ టన్నుల ఇసుక తీసుకునేందుకు అనుమతించామని వెల్లడించారు. ఆర్టీవో మహేశ్వర్, మైనింగ్శాఖ ఏడీ రాఘవరెడ్డి, ఈఈలు బలరామయ్య, రవీంద్ర కిషన్, జిల్లా ఇరిగేషన్ అధికారి జగన్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, జియాలాజిస్ట్ ప్రసన్న కరణం పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్యుత్ అందించాలి
కొత్తపల్లి(కరీంనగర్): వినియోగదారులు, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఉద్యోగులు పనిచేయాలని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ విద్యుత్ భవన్లోని ఎస్ఈ చాంబర్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా భద్రత పరికరాలు వాడాలన్నారు. లేకుంటే పెనాల్టీ విధించాలని ఆదేశించారు. ట్రాన్స్ఫార్మర్లు చెడిపోకుండా చర్యలు చేపట్టాలని, ఒక వేళ కాలిపోతే వెంటనే ఎస్పీఎం సెంటర్కు పంపించి రిపేర్లు చేయించాలని సూచించారు. విద్యుత్ మీటర్లను తనిఖీ చేయడంతో పాటు చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. బకాయిలు వసూలు చేస్తూ రెవెన్యూ పెంచాలన్నారు. కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ మేక రమేశ్బాబు, డీఈలు ఎం.తిరుపతి, ఎస్.లక్ష్మారెడ్డి, పి.చంద్రమౌళి, రమణారెడ్డి, ఎస్ఏవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
ఉరేసుకుని యువకుడి బలవన్మరణం
వెల్గటూర్: పరీక్షల్లో తరచూ ఫెయిల్ అవుతున్నాననే మనోవేదనతో ఓ యువకుడు ఉరేసుకున్న ఘటన మండలంలోని పైడిపెల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కూన రఘు (22) కరీంనగర్లో ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. డిగ్రీలో మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. పలుసార్లు రాసినా పాస్ కావడంలేదు. మనోవేదనతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కరీంనగర్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడి తండ్రి మల్లేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. -
భార్యను వదిలేసి.. ట్రాన్స్జెండర్ దీపుతో కాపురం
జగిత్యాల జిల్లా: జగిత్యాలలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి పెళ్లై 10 ఏళ్లు గడిచింది. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఆ భర్త.. భార్యా, పిల్లలను వదిలేసి ట్రాన్స్ జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్కు, పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహమైంది. ఇటీవలి కాలంలో రాజశేఖర్, హైదరాబాద్కు చెందిన ట్రాన్స్ జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పర్చుకున్నాడు.ఈ క్రమంలోనే భార్య లాస్యను వదిలి, దీపుతో సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య, మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. లాస్య ఆసుపత్రిలో ఉన్నప్పటికీ రాజశేఖర్ హాస్పిటల్ కు రాకపోవడంతో ఆందోళన కు గురైన అత్తమామలు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. తన ఇంట్లోనే ట్రాన్స్ జెండర్ దీపుతో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు కుటుంబ సభ్యులు. రూమ్ కు తాళం వేసి తదనంతరం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ దీపు లను స్టేషన్కు తరలించి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ విషయం తెలిసిన పలువురు వీడెక్కడి మొగుడండీ బాబు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. -
ముస్లింల పేరుతో రిజర్వేషన్లను అడ్డుకునే కుట్ర
కరీంనగర్కార్పొరేషన్: ముస్లింల నెపంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను అడ్డుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని సుడా చైర్మన్, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. ఓసీ అయినప్పటికీ సీఎం రేవంత్రెడ్డి బీసీల పట్ల చిత్తశుద్ధితో 42 శాతం రిజర్వేషన్ అమలుకు పూనుకున్నారని తెలిపారు. కానీ, పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టలేక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు సంజయ్ నాటకాలు మొదలు పెట్టారన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించడం బీజేపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. కేవలం వార్తల్లో ఉండేందుకే హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సీఎంపై చవకబారు ఆరోపణలు చేస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాకతప్పదని హెచ్చరించారు. కొరివి అరుణ్కుమార్, బానోతు శ్రవణ్నాయక్, సమద్నవాబ్, దండి రవీందర్, గుండాటి శ్రీనివాస్రెడ్డి, మహమ్మద్ అమీర్, కీర్తి కుమార్, పెద్దిగారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
● సీపీ గౌస్ ఆలం కరీంనగర్క్రైం: చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. సోమవారం ఉదయం త్రీటౌన్ పరిధిలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డెన్సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు రవాణా చేస్తే చర్యలు తప్పవని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పాత నేరస్తులు అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తున్నారా అని ఆరా తీశారు. సరైన ధ్రువపత్రాలు లేని 71 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 64 బైకులు, 5 ఆటోలు, ఒక ట్రాలీ ఆటో, ఒక కారు ఉన్నాయి. కార్యక్రమంలో ఏసీపీ వెంకటస్వామి, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్– బెంగళూరు ప్రయాణికులకు రాయితీ కరీంనగర్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులలో ప్రయాణించేవారికి బేసిక్ ఫేర్లో 25 శాతం రాయితీ ఉంటుందని రీజనల్ మేనేజర్ బి.రాజు ప్రకటనలో తెలిపారు. ఇదే రూట్లో సూపర్లగ్జరీ బస్సులో ప్రయాణించేవారికి ఆక్చువల్ చార్జీలో 20శాతం రాయితీ కల్పించబడునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీట్ల ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. రేపు ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో జాబ్ డ్రైవ్ కరీంనగర్క్రైం: నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జి సెంటర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వరలక్ష్మి తెలిపారు. కళాశాలలోని ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు జాబ్ డ్రైవ్ ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో వివిధ కంపెనీలు పాల్గొంటాయని మహిళా అభ్యర్థులు మాత్రమే సర్టిఫికెట్లు, దరఖాస్తుతో హాజరుకావాలని సూచించారు. 4న మీనాక్షీ నటరాజన్ పాదయాత్ర కరీంనగర్ కార్పొరేషన్: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆగస్టు 4న చొప్పదండి నియోజకవర్గానికి రానున్నారు. ఈ నెల 31 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆమె పాదయాత్ర చేపట్టం తెలిసిందే. ఇందులో భాగంగా 4న సాయంత్రం 5 గంటలకు చొప్పదండి నియోజకవర్గంలో పాదయాత్ర చేపడుతారు. రాత్రి అక్కడే బసచేసి, 5న ఉదయం 11 గంటలకు శ్రమదానం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ వర్కర్స్తో సమావేశమవుతారు. అనంతరం వరంగల్ జిల్లాకు బయలుదేరుతారని పార్టీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానంతో విద్యాబోధన కరీంనగర్ కార్పొరేషన్: ఈ–క్లాస్రూమ్స్ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు బోధన జరుగుతుందని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ తెలిపారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఈ–క్లాస్రూమ్స్ను అభివృద్ధి చేసిన నగరంలోని బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శంచారు. ఈ–క్లాస్రూమ్స్ను తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాల్లోని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధన వల్ల విద్యార్థులకు సులువుగా పాఠ్యాంశాలు అర్థమవుతాయన్నారు. ఆన్లైన్ విద్యను సక్రమంగా అభ్యసించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో డీఈ లచ్చిరెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. -
ప్రజావాణికి వినతుల వెల్లువ
కరీంనగర్అర్బన్: కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వినతుల తాకిడి ఎక్కువవుతోంది. ప్రతీ సోమవారం సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాల కోసం అర్జీలు అందజేశారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు మహేశ్వర్, రమేశ్ దరఖాస్తులు స్వీకరించారు. పలు దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవచూపారు. మొత్తం 328 దరఖా స్తులు వచ్చాయని కలెక్టరేట్ ఏవో సుధాకర్ వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను ‘సాక్షి’కి వివరించారు. వారి మాటల్లోనే.. -
సస్పెన్షన్కు ముందే క్యాన్సిల్!
● సర్వే నం. 272/14లో తొమ్మిది డాక్యుమెంట్లు రద్దు ● ఆ వెంటనే అందిన సస్పెన్షన్ ఆర్డర్ ● ఫలించని గంగాధర సబ్రిజిస్ట్రార్ వ్యూహం ● 272లో తొమ్మిదిన్నర ఎకరాల మాటేంటి? ● అనర్హులకు పట్టాభిషేకంపై నోరెత్తని ఉన్నతాధికారులు ● రూ.250 కోట్ల భూమి మింగేసేందుకు ప్లాన్!సాక్షిప్రతినిధి,కరీంనగర్ ●: అవన్నీ లావుణి పట్టాలు.. రెవెన్యూ రికార్డుల ప్రకారం పక్కా ప్రభుత్వ భూములు. వీటిలో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరపరాదు. కానీ, లంచాలకు రుచిమరిగిన రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు మాత్రం ఇష్టానుసారంగా తమ పని తాము చేసుకుంటూ ప్రభుత్వ భూములను తమకు నచ్చినవారికి పట్టాలు చేసుకుంటూ పోతున్నారు. గంగాధర సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో వెలుగుచూస్తున్న అక్రమాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల కొత్తపల్లి మండలంలోని 175,197,198 సర్వే నంబర్లలో ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసిన 476 పట్టాలు రద్దయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరువకముందే తాజాగా కొత్తపల్లిలోని సర్వే నంబరు 272/14లో ప్రభుత్వభూమిలో 20 గుంటల్లో అక్రమంగా చేసిన రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. కానీ... అప్పటికే ఆలస్యం అయింది. తప్పును గుర్తించిన అధికారులు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, అప్పటికే సదరు అధికారి ప్రభుత్వ భూమిలో తాను చేసిన డాక్యుమెంట్లను తిరిగి రద్దు చేయడం గమనార్హంరూ.250 కోట్ల భూమికి స్కెచ్.. కొత్తపల్లి మండలంలో 272 సర్వే నంబరులో మొత్తం 24 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. దాదాపు రూ.250 కోట్లు వరకు మార్కెట్ రేటు ఉంటుంది. పైగా జాతీయ రహదారి 563ను ఆనుకుని ఉండటం ఈ రేటు పలకడానికి కారణం. అందులో తొమ్మిదిన్నర ఎకరాలు కూడా లావుణి పట్టా కిందే ఉంది. అయినా ఈ భూమిని పలువురి పేరు మీదకు సబ్రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేశారు. మిగిలిన 15 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే రికార్డుల్లో ఉంది. ఈ భూమి కూడా ఎవరి పేరు మీదైనా ఇంటి నంబర్ల పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్న అనుమానాలు ఉన్నాయి. పలువురు రాజకీయ నాయకుల అనుచరుల పేరు మీద ఇక్కడ భూములు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రూ.250 కోట్ల భూమిని మింగేసేందుకు ఎవరు ప్రయత్నించారు? దీని వెనక ఉన్న వారెవరు? అన్న విషయంలో అధికారులు లోతుగా విచారణ జరపాల్సి ఉంది. -
జాతీయ వర్క్షాపులో కలెక్టర్ పమేలా సత్పతి
● కరీంనగర్ పారిశుధ్యంపై ప్రసంగం ● వెల్లువెత్తిన ప్రసంశలు కరీంనగర్ అర్బన్: పారిశుధ్య కార్మికుల రక్షణ, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భువనేశ్వర్లో నిర్వహించిన రెండురోజుల జాతీయస్థాయి వర్క్షాపులో కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు. పారిశుధ్య పనుల్లో భద్రత, రక్షణ, పారిశుధ్య కార్మికుల గౌరవం పెంచేందుకు ఇతర రాష్ట్రాలు, సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను ఈ వర్క్షాపులో చర్చించారు. పారిశుధ్య కార్మికుల భద్రతకు కరీంనగర్లో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ వివరించారు. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ప్రత్యేకంగా ఆరోగ్యకార్డులు అందజేశామని, తరచూ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు రికార్డు చేశామని తెలిపారు. కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించడం వంటి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా కరీంనగర్లో పారిశుధ్య కార్మికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, ఒడిశా రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు. అలాగే కరీంనగర్లో అనుసరిస్తున్న విధానాలను అన్ని రాష్ట్రాల్లో అనుసరించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. -
సమన్వయంతో సమస్య పరిష్కరించాలి
● ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సర్ఫరాజ్ అహ్మద్కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో డ్రైనేజీలు, కల్వర్ట్లను అభివృద్ధి చేసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్అహ్మద్ అన్నారు. ఇటీవల ముంపునకు గురైన మంచిర్యాల చౌరస్తా, రాంనగర్, ఆర్టీసీ వర్క్షాప్ ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో వరద నీళ్లు రోడ్లపై నిలవడానికి, ఇళ్లలోకి వెళ్లడానికి కారణాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు పడుతున్న సమయంలో నాలాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, నీళ్లు నిలిచే ప్రాంతాల్లో తాత్కాలికంగా కచ్చా నాలాల ద్వారా డ్రైనేజీలకు మళ్లించాలన్నారు. కాగా, తరచూ ముంపునకు గురవుతున్న మంచిర్యాల చౌరస్తా, శర్మనగర్, సాహెత్నగర్, సాయినగర్లో డ్రైనేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ ప్రత్యేక అధికారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. నగరపాలక కమిషనర్ ప్రఫుల్దేశాయ్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజి వాకడే, ఆర్డీవో మహేశ్వర్, ఈఈ యాదగిరి, డీఈ లచ్చిరెడ్డి, ఏసీపీ శ్రీధర్ తదితరులు ఉన్నారు. ఎరువుల దుకాణాలపై నిఘా పెట్టాలి గంగాధర(చొప్పదండి): ఎరువులు, విత్తనాల దుకాణాలపై వ్యవసాయశాఖ అధికారులు నిఘా ఉంచి తరుచూ తనిఖీలు నిర్వహించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి సర్ఫరాజ్అహ్మద్ ఆదేశించారు. సోమవారం మండలంలోని మధురానగర్ చౌరస్తాలో ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ, ఐపీ రిజస్టర్లును పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్డీవో మహేశ్వర్, డీఏవో మహేశ్వర్, డీఎంహెచ్వో వెంకటరమణ, తహసీల్దార్ అనుపమ, ఎంపీడీవో రాము ఉన్నారు. -
తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ, బాబు
● కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణపై ప్రధాని మోదీ, ఎపీ సీఎం చంద్రబాబు విషం చిమ్ముతూ ఎడారి చేసే ప్రయత్నం చేస్తున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. రేకుర్తిలోని స్వయంభూ శంఖు చక్రధార శ్రీలక్ష్మీనరసింహస్వామిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తున్నాయన్నారు. బీజేపీ మెడలు వంచాలంటే ఢిల్లీలో తిష్ట వేసి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సాధించుకోవాలని పేర్కొన్నారు. కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తమని, టీఆర్ఎస్ పుట్టింది తెలంగాణ కోసమేనని, ఎందులో విలీనం కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే శంఖుచక్రాలతో వెలసిన ఏకై క స్వయంభూ ఆలయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.25 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బాధాకరమని, మరో రూ.5 కోట్లు కేటాయిస్తే ఆలయ నిర్మాణం పూర్తయి భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఏనుగు రవీందర్రెడ్డి, కాసారపు శ్రీనివాస్గౌడ్, సుధగోని మాధవి కృష్ణగౌడ్, ఎదుల రాజశేఖర్, కర్ర సూర్యశేఖర్, నేతి రవివర్మ, చందు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కండి
కొత్తపల్లి(కరీంనగర్)/తిమ్మాపూర్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కొత్తపల్లి మండలం కమాన్పూర్, తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఎంపీ ఎన్నికల్లో తిమ్మాపూర్ మండలం నుంచి అత్యధిక ఓట్లతో ప్రజలు బండి సంజయ్కు భారీ మెజార్టీ అందించారని గుర్తుచేశారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలాల అధ్యక్షులు తిరుపతి, సుగుర్తి జగదీశ్వరాచారి, రతన్కుమార్, అనిల్కుమార్, నాగేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, కొమురయ్య, శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, తిరుపతిరెడ్డి, రాజుయాదవ్, రవీందర్యాదవ్, గడ్డం అరుణ్, బండి సాగర్, దుర్సెట్టి రమేశ్, కొయ్యడ శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆడుకుంటూ వెళ్లి.. నీటిబకెట్లో పడి..
జూలపల్లి(పెద్దపల్లి): సరదాగా ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి గుండు సాన్వీ(21నెలలు) నీటిబకెట్లో పడి చనిపోయింది. పెద్దపల్లి జిల్లా పెద్దాపూర్ గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపూర్ గ్రామానికి చెందిన గుండు సతీశ్ – రవళి దంపతులు. వీరికి ఒక మారుడు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు పెద్దవాడు, కూతురు సాన్వీ ఇంట్లో సందడిచేస్తూ ఉండేది. ఈక్రమంలోనే ఈనెల 27న రాత్రి 7.00 గంటల సమయంలో ఇంట్లో ఆడుకుంటోంది. చిన్నారి తల్లిదండ్రులు ఇంటి పనుల్లో నిమగ్నయ్యారు. అయితే, ఇంట్లో ఆడుకుంటూ క్రమంగా బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి ఆవరణలోనే ఆడుకుంటూ సమీంలోని నీటి బకెట్ వద్దకు చేరుకుంది. అక్కడ నీటిని చేతితో తాకేందుకు యత్నించగా బకెట్లో తలకిందులుగా పడిపోయింది. ఆ వెంటనే గమనించిన చిన్నారి పెద్దనాన్న నరేశ్ కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్కుమార్ తెలిపారు. -
కోడెలను సంరక్షించాలి
భక్తులు సమర్పించే నిజ కోడెలు గోశాలలోనే ఉంచి సంరక్షించాలి. కోట్ల ఆదాయం ఉన్న ఆలయానికి కోడెల సంరక్షణ సమస్య కాదు. వాటి కోసం ప్రత్యేక నిధులు, సిబ్బందిని కేటాయించి వాటి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉంది. – గడప కిశోర్రావు, విశ్వహిందూ పరిషత్ సహాయ కార్యదర్శి, కరీంనగర్ జిల్లా 50 ఎకరాల్లో నిర్మాణం రాజన్న ఆలయానికి ఏటా రూ.123 కోట్ల 76 లక్షల ఆదాయం వస్తుంది. దాదాపు 68 శాతం కోడెమొక్కుల ద్వారా సమకూరుతుంది. కోడెల సంరక్షణకు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మర్రిపల్లి శివారులో గోశాల కోసం 50 ఎకరాల్లో నిర్మించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. – చిలుక రమేశ్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి -
రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించండి
కరీంనగర్టౌన్: పెండింగ్లో ఉన్న కరీంనగర్–జగిత్యాల రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన ఆయన కరీంనగర్–జగిత్యాల విస్తరణ పనులతో పాటు సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ (సీఆర్ఐఎఫ్) మంజూరు అంశాలపై చర్చించారు. కరీంనగర్ నుంచి జగి త్యాల వరకు ఫోర్లేన్ విస్తరణకు ఎన్నికలకు ముందే కేంద్రం రూ. 2151 కోట్ల 35 లక్షల నిధులతో ప్రతిపాదనలు రూపొందించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే విస్తరణ పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పలు రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్లో ఉన్నాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) ను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. మొత్తం రూ.113 కోట్లతో కూడిన సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలను గడ్కరీకి సమర్పించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బావుపేట–ఖాజీపూర్ రోడ్డులో భాగంగా మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జితోపాటు గన్నేరువరం మండలం గుండ్లపల్లి–పొత్తూర్ రోడ్డు విస్తరణ పనులు, చందుర్తి నుంచి మోత్కురావుపేట వరకు వంతెనల నిర్మాణ పనులు, కిష్టంపల్లి వరకు రోడ్డుపై వంతెన నిర్మాణ ం, శంకరపట్నం మండలం అర్కండ్ల (గ్రామం) నుంచి కన్నాపూర్ (గ్రామం) వరకు వరద కాలు వపై హై లెవల్ వంతెన నిర్మాణ ప్రతిపాదనలు వీటిలో ఉన్నాయి. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ త్వరలోనే సీఆర్ఐఎఫ్ నిధులు విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి బండి సంజయ్ వినతి -
మాతృమూర్తుల కళ్లు సజీవం
సుల్తానాబాద్/కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్ మండలాలకు చెందిన ఇద్దరు మాతృమూర్తులు చనిపోతూ మరికొందరికి చూపునిచ్చారు. వివరాలు.. సుల్తానాబాద్లోని గాంధీనగర్కు చెందిన భీమవరపు సుందరమ్మ(86) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో సోమవారం ఇంట్లోనే చనిపోయింది. ఆమె భర్త మురహరిరావు స్వాతంత్య్ర సమరయోధుడు. అయితే, సుందరమ్మ నేత్రాలు దానం చేస్తే మరో ఇద్దరికి చూపువస్తుందని సదాశయ ఫౌండేషన్ ముఖ్య సలహాదారు నూక రమేశ్.. ఆమె కుటుంబసభ్యులను ఒప్పించారు. దీంతో ఆ మాతృమూర్తి కొడుకులు, కోడళ్లు, కూతుళ్లు, అళ్లుళ్లు ఇందుకు అంగీకరించారు. ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్నాయక్ సహకారంతో కార్నియాలు సేకరించారు. ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, గౌరవ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, నూక రమే శ్, భీష్మాచారి, కేఎస్ వాసు తదితరులు కుటుంబసభ్యులను అభినందించారు. మాజీ ఎంపీపీ రాజమ్మ కళ్లు దానం.. కాల్వశ్రీరాంపూర్ మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఈద రాజమ్మ(65) ఆది వారం రాత్రి చనిపోయారు. దీంతో సదాశివ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రావణ్కుమార్, మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్ ఆమె కుటుంబ సభ్యులను కలిసి కళ్లు దానం చేయాలని విన్నవించారు. దీంతో వారు అంగీకరించగా, టెక్నీషియన్ ఆమె కార్నియాలు సేకరించారు. మృతురాలు భర్త, మాజీ సర్పంచ్ ఈద సత్యనారాయణరెడ్డి, కుమారుడు రఘోత్తంరెడ్డి, కూతురు మాధవి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ బాలే మల్లేశ్వరి, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. చనిపోతూ మరికొందరికి చూపునిచ్చిన ఇద్దరు మహిళలు -
ఎస్సారెస్పీపైనే ఆశలు
● భారీ వర్షాలు కురిస్తేనే ప్రాజెక్టులోకి నీరు ● 23.866 టీఎంసీలకు చేరిన నీటిమట్టం ● నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్ జగిత్యాల అగ్రికల్చర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద చేరుతోంది. ఆయకట్టుకు విడుదల చేసేస్థాయిలో ప్రాజెక్టు నీటిమట్టం పెరగకపోవడంతో, నీటి విడుదలపై సందిగ్ధం నెలకొంది. మొన్నటి వరకు వర్షాలు లేక, పంటలు ఎండిపోతుండటంతో నీరు విడుదల చేయాలని జిల్లాలోని కథలాపూర్, మెట్పల్లి రైతులు ఆందోళనకు దిగారు. ● ఎగువప్రాంతాల్లో వర్షాలు అంతంతే ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పెద్దగా లేకపోవడంతో నీరు చేరడం లేదు. రెండేళ్లలో జూలై నెలలోనే ప్రాజెక్టు నిండింది. జిల్లా ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సాగునీరు ఇచ్చారు. ప్రాజెక్టుకు చెందిన కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకే కాకుండా వరదకాలువకు సైతం పలుమార్లు నీటిని వదిలారు. ప్రాజెక్టు నిండిన తర్వాత ఐదారుసార్లు గేట్లు ఎత్తి వరదను గోదావరిలోకి వదిలారు. ● జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో సాగు జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్లో దాదాపు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగుకానున్నాయి. ఇందులో వరి 3 లక్షల ఎకరాల్లో సాగుచేసే అవకాశముంది. వరికి సాగునీటి అవసరం ఎక్కువ. ప్రస్తుతం వ్యవసాయ బావుల్లో ఉన్న నీటితోనే వరి నాట్లు వేస్తున్నారు. ప్రాజెక్టు నిండుతుందనే ఆశతో రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడే వరద వచ్చే అవకాశం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ బావుల్లో ఉన్న నీరు సైతం ప్రధాన పొలం దున్నేందుకు సరిపోవడం లేదని చెపుతున్నారు. లక్షన్నర ఎకరాల్లో సాగయ్యే మొక్కజొన్న, పసుపు పంటలకు వర్షం నీరు సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో డ్రిప్ ద్వారా సాగునీరు అందిస్తున్నారు. ● ప్రాజెక్టులో 23.866 టీఎంసీలు ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091.00 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.30 అడుగుల నీరుంది. నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీ(గతంలో 90.3 టీఎంసీ)లకు ప్రస్తుతం 23.866 టీఎంసీలు ఉంది. ప్రాజెక్టులోకి ఈ సీజన్లో జూన్ 1 నుంచి 13.045 టీఎంసీల నీరు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సగటున ప్రాజెక్టులోకి 10,484 క్యూసెక్కుల నీరు చేరుతోంది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టు నీటి మట్టం 1073.60 అడుగులు ఉండగా, నీటి నిల్వ సామర్థ్యం 29.933 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 50,503 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. 622 క్యూసెక్కుల ఔట్ఫ్లో వెళ్తోంది.కాగా.. కథలాపూర్, మెట్పల్లి ప్రాంత రైతులు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలని ఆందోళన చేస్తున్నారు. ఎదురుచూస్తున్నాం ఎస్సారెస్పీ ప్రాజెక్టు జిల్లాకు వరప్రదాయినీ. ఈ ప్రాజెక్టు ద్వారా జగిత్యాల జిల్లాకే ఎక్కువ నీరు అందుతుంది. ప్రాజెక్టు నీరు రాకపోతే పంటలు సాగుచేయడం కష్టం. చాలామంది వరినాట్లు వేసి ఎస్సారెస్పీ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. – వేముల కరుణాకర్, ధర్మపురి ప్రాజెక్టు నిండాలి ఖరీఫ్ సీజన్కు ఆన్, ఆఫ్ పద్ధతిలో ఎస్సారెస్పీ నీరు విడుదల చేయాలి. ఇప్పటి వరకు వ్యవసాయ బావిలో ఉన్న నీటితో నాట్లు వేసుకున్నాం. బావుల్లో సరిపోయేంత నీరు లేదు. ప్రాజెక్టు తొందరగా నిండి, వానాకాలం, యాసంగి పంటలకు నీరు అందించాలి. – నక్కల తిరుపతి రెడ్డి, తొంబరావుపేట, మేడిపల్లి -
ముదిగొండ అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం
కరీంనగర్: ముదిగొండ అమరవీరుల స్ఫూర్తితో పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాల కోసం సమరశీల ఉద్యమాలను ఉధృతం చేస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బుర్రి ప్రసాద్ అన్నారు. సోమవారం స్థానిక ముకుందలాల్ మిశ్రాభవన్లో మాట్లాడారు. ముదిగొండలో పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై తుపాకీ తూటాల వర్షం కురిపించి ఏడుగురిని కాల్చి చంపిందన్నారు. పాలకులు మారినా పేదల జీవితంలో మార్పు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ముందు అందరికీ ఇళ్లు ఇస్తామని హామీలను విస్మరించిందని, ఇంటి స్థలం కోసం పోరాటం చేసిన పేదలపై కేసులు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇంటి స్థలం ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యదర్శి వాసురెడ్డి, సుంకరి సంపత్, భూతం సారంగపాణి, వడ్ల రాజు, కవ్వంపల్లి అజయ్, మాతంగి శంకర్, రాయికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రసాద్ -
సరస్వతీ పుత్రునికి అందిన లక్ష్మీకటాక్షం
తిమ్మాపూర్: కూలిపనులు చేసుకుంటూ బతికే మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ–శంకర్ దంపతుల కొడుకు మహేశ్ గత ఎప్రిల్లో విడుదలైన జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా 453 (ఎస్సీ విభాగంలో 17)వ ర్యాంకు సాధించాడు. తమిళనాడులోని తిరుచిరాపల్లి ఎన్ఐటీలో ఆర్కిటెక్చర్ సీటు దక్కించుకున్నాడు. ఫీజుకట్టలేని పరిస్థిలో తల్లిదండ్రులు ఉండడంతో మహేశ్ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సత్యనారాయణ పీఏ మురళీధర్ రెడ్డి విద్యార్థికి ఎలాగైనా సహాయం చేయాలని తలిచి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన, కాంగ్రెస్పార్టీ నాయకులు, అధికారుల సహకారంతో రూ.3.30 లక్షలు సమీకరించారు. సోమవారం స్థానికంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో విద్యార్థి మహేశ్కు అందజేశారు. ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో పేదలకు సాయం చేయాలని, విద్యార్థికి ఆర్థిక సాయం చేసిన దాతలు అభినందించారు. కార్యక్రమంలో తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్, తహసీల్దార్లు శ్రీనివాసరెడ్డి, విజయ్కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పులికృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్, ఒగ్గు దామోదర్, బండారి రమేశ్, తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, మోరపల్లి రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన పీఏ మురళీధర్ రెడ్డి స్పందించి సాయం చేసిన నేతలు -
గోశాల.. గోస తీరేనా.!
వేములవాడరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలోని గోశాలల్లో అధునాతనమైన గోశాలను నిర్మించాలని ఇందుకు 21 ప్రాంతాలను ఎంపికచేసింది. అందులో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న గోశాలను 50 ఎకరాల స్థలంలో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గోవుల పోషణ, సంరక్షణకు పశుసంవర్ధక, రెవెన్యూ, దేవాదాయ శాఖల భూముల్లో ఈ గోశాలను నిర్మించాలని ఇంతకుముందు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాజన్న ఆలయ గోశాల కోసం వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లిలోని 748 సర్వేనంబర్లో 50 ఎకరాల స్థలాన్ని రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే ఈ ప్రాంతంలో గోశాల నిర్మించనున్నారు. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం.. రాజన్నకు భక్తులు మొక్కుబడిగా కోడెలు సమర్పిస్తారు. కొందరు ఆలయంలో కోడె మొక్కులు చెల్లించుకుంటారు. కోడె మొక్కులతో ఏటా ఆలయానికి కోట్లాది రూపాయలు ఆదాయం సమకూరుతోంది. తిప్పాపూర్లో మూడెకరాల స్థలంలో దాదాపు 400 కోడెలు ఉంటాయి. ఆలయంలో భక్తుల మొక్కు చెల్లింపుల కోసం సమీపంలోని గోశాల వద్ద కొన్ని కోడెలు సిద్ధంగా ఉంచుతారు. వీటి సంరక్షణ కోసం ఏఈవో స్థాయి అధికారి పర్యవేక్షణలో కోడెల బాగోగులు చూసుకుంటారు. భక్తులు పశుగ్రాసం వితరణగా అందిస్తారు. ఇటీవల వరుసగా కోడెలు మృత్యువాత పడటంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్కుమార్ ఝా ప్రత్యేక దృష్టిసారించారు. రాజన్న గోశాల కోసం ప్రత్యేకంగా అధునాతనమైన గోశాల నిర్మించాలని ఎమ్మెల్యే సీఎంకు వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేములవాడ గోశాల కోసం 50 ఎకరాల స్థలం గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రెవెన్యూ శాఖ అధికాారులు మర్రిపల్లిని 748 ప్రభుత్వ స్థలాన్ని 50 ఎకరాలుగా గుర్తించి అందులో హద్దులు ఏర్పాటు చేశారు. మర్రిపల్లిలో 50 ఎకరాల్లో గోశాల అనుమతుల రాగానే నిర్మాణ పనులు కేబినెట్ ఆమోదంతో హర్షంవ్యక్తం చేస్తున్న భక్తులు -
ఎరువులు కొంటే బీమా
కరీంనగర్రూరల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతోపాటు ప్రైవేట్ డీలర్ల వద్ద ఎరువులు కొన్న రైతులకు కొత్తగా బీమా సౌకర్యం కల్పించారు. ఇఫ్కో ఎరువుల కంపెనీ ఉచిత సంకటహరణ బీమా పథకాన్ని అమలు చేస్తోంది. ఎరువులు కొన్న ప్రతీ రైతుకు ప్రమాద బీమా సౌకర్యం వర్తింపజేస్తారు. ఇటీవల కురిసిన వర్షాలతో వానాకాలం సీజన్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనుల నిమిత్తం రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈక్రమంలో రైతులు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలు ఆర్థికంగా ఎంతో ఇబ్బందులకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రైతులు ప్రమాదాల బారిన పడితే కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇఫ్కో ఎరువుల కంపెనీ బీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఎరువులు కొంటే సరిపోతుంది. రసీదు భద్రపరుచుకోవాలి సహకార సంఘాలు, డీలర్ల వద్ద ఇఫ్కో కంపెనీ ఉత్పత్తి చేసిన ఎరువులు కొనుగోలు చేసినపుడు రసీదులను త ప్పనిసరిగా తీసుకుని భద్రపరుచుకోవాలి. రైతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం, నీటిలో మునిగిపోవడం, పాముకాటు, ట్రాక్టర్, హర్వెస్టర్ తదితర యంత్రాలతో ప్రమాదానికి గురైతే బీమా పరిహారం పొందే అవకాశముంది. రసీదుతోపాటు రైతు మృతికి సంబంధించి పోలీస్స్టేషన్లో కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్మార్టం రిపోర్టు, మరణ ధ్రువీకరణ పత్రం ఇఫ్కో కంపెనీ ప్రతినిధులకు రెండునెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల వరకు.. సహకార సంఘాలతోపాటు ప్రైవేట్ డీలర్ల వద్ద ఇఫ్కో ఎరువులు కొన్న రైతులందరికీ ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. రైతు కొనుగోలు చేసిన ఒక బస్తా, నానో ఎరువు బాటిల్పై రూ.10వేల బీమా, 20 బస్తాలు లేదా నానో యూరియా సీసాలు కొనుగోలు చేస్తే రూ.2 లక్షల వరకు బీమా వర్తిస్తుంది. ఎరువులు కొన్న నెల తర్వాత నుంచి ఏడాది వరకు బీమా సౌకర్యముంటుంది. రైతు మృతిచెందితే వందశాతం, రెండు అవయవాలు కోల్పోతే 50శాతం, ఒక అవయం కోల్పోతే 25శాతం బీమా పరిహారం చెల్లిస్తారు. సద్వినియోగం చేసుకోవాలి సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద ఇఫ్కో ఎరువులు కొన్న రైతులందరికీ బీమా సౌకర్యముంటుంది. ఎరువులు కొన్న రసీదులను భద్రపరుచుకోవాలి. గతంలో సైతం బీమా సౌకర్యముండగా పరిహారం తక్కువగా ఉండేది. ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి పరిహారం పెంచిన దృష్ట్యా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – బి.బాలాజీ, ఇఫ్కో కంపెనీ జిల్లా మేనేజర్ ఇఫ్కో కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు అమలు రూ.2లక్షల వరకు ఆర్థికసాయం -
అందుకే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్ను మొదట కేటీఆర్కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్ని కలిశారు. కేటీఆర్కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
ప్రతిరోజూ పండుగే
● శ్రావణం.. ఆధ్యాత్మిక మాసం ● ఆలయాల్లో ప్రత్యేక పూజలు ● నోములు.. వ్రతాలు.. పండుగలువిద్యానగర్(కరీంనగర్): శ్రావణమాసం ప్రత్యేకమైనది. ఈ నెల రోజులు పూజలు, నోములు, ప్రతాలతో ఇళ్లు, గుళ్లు కళకళలాడుతాయి. శుభకార్యాలు, వివాహాలు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలకు శుభకరం. శుక్రవారం ప్రారంభమైన శ్రావణం ఆగస్టు 23న పోలాల అమావాస్యతో ముగుస్తుంది. ఇవీ పండుగలు ఈనెల 28 సోమవారం నాగ చతుర్థి, 29 మంగళవారం పంచమి, మంగళగౌరీ ప్రతం, 30న బుధవారం కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి, ఆగస్టు 1 శ్రావణ మాసంలో రెండో శుక్రవారం, 5న మంగళవారం ఏకాదశి, 8న వరలక్ష్మి వ్రతం, వారాహి జయంతి ఉంటుంది. 9న రాఖీ పౌర్ణమి, 12న సంకష్ట హర చతుర్థి, 16న శ్రీకృష్ణ జన్మాష్టమి, 19న కామిక ఏకాదశి, 21 గురువారం మాసశివరాత్రి, ఆగస్టు 23న పోలాల అమావాస్యతో శ్రావణం ముగుస్తుంది. ప్రత్యేక పూజలు శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. కొత్తగా పెళ్లయిన దంపతులు ప్రతి సోమవారం గౌరీదేవి అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణం రెండో శుక్రవారం సామూహిక కుంకుమార్చన, మూడో శుక్రవారం మహాలక్ష్మి ఆలయాల్లో లక్ష కుంకుమార్చన, లక్ష్మి సహస్రనామార్చన చేస్తారు. -
యూరియాకు ప్రత్యామ్నాయం నత్రజని
● తగ్గుతున్న యూరియా నిల్వలకు చెక్ ● వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు రామగిరి(మంథని): వానాకాలం సాగు ప్రారంభమైంది. రైతులు పంటలు వేయడం, ఎరువులు సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. అయితే, తక్కువ ధరకు లభించే యూరియాను పంట పొలాల్లో కుమ్మరిస్తున్నారు. మరికొందరు రాబోయే అవసరాలకు కూడా ఇప్పుడే అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వచేస్తున్నారు. దీంతో మార్కెట్లో డిమాండ్ పెరిగి నిల్వలు తగ్గి కొరత సమస్య ఏర్పడుతోంది. అయితే, వాస్తవ అవసరాల మేరకు ఎరువులు వాడితే సత్ఫలితాలు వస్తాయని కృషి రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం మృత్తిక శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ పిల్లి చెబుతున్నారు. మోతాదుకు మించి యూరియా వద్దు యూరియాలోని నత్రజని మిగతా పోషకాల కంటే పంటకు అధికంగా అవసరం. యూరియా పొలంలో వేసిన వెంటనే నీటిలో కరిగి భూమి లోపలి పొరలు, భూగర్భ జలాల్లోకి చేరి వృథా అవుతోంది. మరికొంత ఆవిరైపోతుంది. దీంతో 30 – 35 శాతమే మొక్కకు అందుతుంది. అవసరానికి మించి యూరియా వాడితే మొక్కలు పెలుసుబారి, పురుగులు ఆశించి వ్యాధులు వస్తాయి. పంటలకు యూరియాతోపాటు భాస్వరం, పొటాష్, సూక్ష్మపోషకాలు అవసరం. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే రైతులు వీటి వినియోగానికి ఆసక్తి చూపడం లేదు. ఏ ఎరువైనా ఒకటే అనే మూసలో యూరియా కుమ్మరిస్తున్నారు. ఇవి ప్రత్యామ్నాయం పంటపై పిచికారీ చేసే ఎరువులు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. నానో యూరియా, నానో డీఏపీ నీటిలో కలిపి పిచికారీ చేసే 19:19:19, 20:20:20, రకం కాంప్లెక్స్ ఎరువులు, అధిక సాంధ్ర కలిగిన 13–0–45 (ఏఈ), ద్రవరూప నత్రజని వంటివి ఇందులో ఉన్నాయి. దుక్కిలో సిఫారసు మేరకు కాంప్లెక్స్ వేసుకొని, పైరుపై పిచికారీ చేసే ఎరువును స్ప్రే చేసుకుంటే తక్కుఖర్చు, తక్కువ ఎరువుల నష్టంతో మంచి ఫలితాలువ స్తాయి. ఉదా : వరిలో పిలకలు పెట్టే దశలో నానో యూరియా, నానో డీఏపీ, ఫార్ములా–4 కలిపి స్ప్రే చేసుకోవచ్చు. చిరుపొట్ట దశలో నానో యూరియా, 13–0–45 కలిపి స్ప్రే చేస్తే ఖర్చు తక్కువ వస్తుంది. చీడచీడల సమస్య తగ్గుతుంది. యూరియా అతిగా వాడితే నష్టాలు ఇవే అవసరానికి మించి వేస్తే నేల నిస్సారమవుతుంది పోషకాల సమతౌల్యత దెబ్బతింటుంది. సూక్ష్మపోషకాల లోపాలు అధికమవుతాయి. మొక్కల్లో శాఖీయోత్పత్తి పెరిగి చీడపీడల ఉధృతి పెరుగుతుంది భూగర్భ జలాలు నైట్రేట్, నత్రజనితో కలుషితమవుతాయి. నేలలో ఉండి పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గుతుంది. ఆమ్ల స్వభావం ఉండటంతో అధికంగా వాడితే భూమి ఆమ్ల నేలగా మారే ప్రమాదం ఉంది. -
● సీబీఎస్ఈ క్లస్టర్– 7 కబడ్డీ పోటీలు ప్రారంభం ● తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 800మంది క్రీడాకారులు హాజరు ● పోటీలను ప్రారంభించిన కబడ్డీ సంఘం చైర్మన్ వెలిచాల రాజేందర్రావు
కబడ్డీ.. కబడ్డీకరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానంద సీబీఎస్ఈ పాఠశాల ఆవరణలో శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీబీఎస్ఈ 7వ క్లస్టర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తెలుగు రాష్ట్రాల్లోని సీబీఎస్ఈ పాఠశాలల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథి గా జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్ వెలిచాల రాజేందర్రావు హాజరై క్రీడా పతాకాలను ఆవిష్కరించి, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కబడ్డీకి కేరాఫ్గా కరీంనగర్ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో కేట గిరీ 14, 17, 19లో గెలుపొందిన వారికి రూ. 10వేలు, రన్నర్లకు రూ.8 వేలు, మూడో బహుమతిగా రూ.5వేలు ఇస్తానని తెలిపారు. కేటగిరీ 14, 17, 19 విభాగాల్లో రాష్ట, జాతీయస్థాయి పోటీలు నిర్వహిస్తామని ప్రకటించారు. జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్.అమిత్కుమార్ మాట్లాడుతూ క్రీడలు మానసికంగా, శారీరకంగా ఎంతో శక్తిని ఇస్తాయని తెలి పారు. వివేకానంద పాఠశాల అకడమిక్ డైరెక్టర్ టి.లలితా కుమారి మాట్లాడుతూ కబడ్డీ ఉత్కంఠభరితమైన పోటీ క్రీడగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు సీహెచ్.సంపత్రావు, జిల్లా కార్యదర్శి మల్లేశం గౌడ్, రెఫరీ బోర్డు చైర్మన్ లక్ష్మీనారాయణ, వివేకానంద సీబీఎస్ఈ హైస్కూల్ చైర్మన్ పోల్సాని సుధాకర్, ప్రిన్సిపాల్ రేణుక, వైస్ ప్రిన్సిపాల్ ప్ర శాంత్, హెచ్ఎం అనిత, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చిత్తరంజన్, అడ్వైజరీ మెంబర్ గండ్ర లక్ష్మణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.సత్యనారాయణ పాల్గొన్నారు. -
విపక్షాల గొంతు నొక్కుతున్న కేంద్రం
కరీంనగర్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విపక్షాల గొంతునొక్కే విధంగా వ్యవహరిస్తోందని, ఉపరాష్ట్రపతి విషయంలోనూ పొమ్మనలేక పొగ పెడుతున్నట్లు కనిపిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బద్ధం ఎల్లారెడ్డి భవన్లో కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్కుమార్ అధ్యక్షతన జరిగిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తోందన్నారు. విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పార్లమెంటు సమావేశాలు వాయిదా వేయడం సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఆర్డినెన్స్ పంపినప్పటికీ, తమ వైఖరి స్పష్టం చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధం కావాలని సూచించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యులు అందె స్వామి, అశోక్,గూడెం లక్ష్మి, టేకుమల్ల సమ్మ య్య, కసిరెడ్డి సురేందర్రెడ్డి పాల్గొన్నారు. -
కార్పొరేట్ గోల్మాల్
శనివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2025● ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్లు.. అకాడమీల్లో తరగతులు ● కోచింగ్ సెంటర్ల పేరిట ప్రైవేటు విద్యా సంస్థల వ్యాపారం ● పట్టనట్లు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు ● ఒక కళాశాలలో చేరిన వారికి మరో కోచింగ్ సెంటర్లలో శిక్షణసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నగరం నడిబొడ్డులోని గణేశ్నగర్లో ఓ జూని యర్ కళాశాల ఉంది. పేరుకు అది ప్రైవేటు కళాశా ల. పేరు, బోర్డు అన్నీ బాగానే ఉంటాయి. దాదాపు 900కుపైగా అడ్మిషన్లు ఉన్నాయి. ఇక్కడ ఖాళీ బిల్డింగు, బెంచీలు తప్ప మరేం లేవు. విద్యార్థులు అసలే లేరు. విద్యార్థులు లేకున్నా, ఉన్నట్లు.. తరగతులు జరగకున్నా జరిగినట్లు.. ప్రాక్టికల్స్ లేకున్నా చేసినట్లు మేనేజ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్లు ఇదంతా ఔట్ సోర్సింగ్ ప్రక్రియలా చేస్తున్నారు. కరీంనగర్లోని ఓ ప్రయివేటు కోచింగ్ సెంటర్కు ఈ విద్యార్థులను సరఫరా చేస్తున్నారని సమాచారం. కోచింగ్ సెంటర్ల హవా కరీంనగర్లో కొందరి కోచింగ్ సెంటర్ల హవా నడుస్తోంది. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట అకాడమీలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి వీరిది రూ.కోట్లలో వ్యాపారం. బహుళ అంతస్తుల భవనాలు, అద్దాల మేడలు, ఆకర్షణీయమైన ప్రచారం, బ్రాండ్ అంబాసిడర్లతో తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. కోచింగ్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. విద్యార్థి అడ్మిషన్ రాసే సమయంలో అసలు బుద్ధి బయట పెట్టుకుంటున్నారు. తమ కోచింగ్ సెంటర్లో చేరినవారికి ముందే సృష్టించి పెట్టుకున్న జూనియర్ కళాశాలలో అడ్మిషన్ రాస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. సదరు జూనియర్ కళాశాల వైపు ఏనాడూ విద్యాశాఖ అధికారులు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అధికారులు పట్టించుకోరా? నగరంలో చాలావరకు కోచింగ్ సెంటర్లను ఉత్తరాది పేర్లతో నడిపిస్తున్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరిట తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వీటిలో 99శాతం అకాడమీలకు ఎలాంటి అనుమతులు లేవు. అలాంటివారిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనం వహిస్తున్నారే తప్ప విద్యార్థులు లేని కళాశాలలపై కొరడా ఝుళిపించడం లేదు.కేసులు పెట్టాలి జిల్లాలో ప్రైవేట్ ఇంటర్ కళాశాలలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేదు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి ఒకచోట, తరగతుల నిర్వహణ మరొక చోట చేస్తున్న ఇంటర్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న కళాశాలలపై చీటింగ్ కేసు నమోదు చేసి, ఆయా కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. – కసిరెడ్డి మణికంఠ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
గురుకులంలో ఎలుకల కలకలం
హుజూరాబాద్: గురుకులంలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. మున్సిపల్ పరిధి బోర్నపల్లి శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల(సైదాపుర్)లో 8వ తరగతి చదువుతున్న యశ్వంత్, సాయిచరణ్, కౌశిక్, అక్షిత్, శజన్, 9వ తరగతికి చెందిన రక్షిత్ను బుధవారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎలుకలు కొరికాయి. విద్యార్థులు గురువారం ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా, పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేయించారు. పాఠశాల చుట్టూ రైస్ మిల్లులు, పాఠశాలకు ఆనుకునే చెట్ల పొదలు ఉండటంతో విపరీతమైన దోమలతో పాటు, ఎలుకలు తిరుగుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాల్ రాణిని వివరణ కోరగా విద్యార్థులకు ప్రమాదం ఏం లేదని, ఆరుగురిని ఎలుకలు కరిచినట్లు తెలిసిందని, మరో ఇద్దరికి కరిచినట్లు అనుమానం ఉందని తెలిపారు. అందరికి వ్యాక్సిన్ వేయించినట్లు పేర్కొన్నారు. ఎలుకల బోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శుక్రవారం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ గురుకులంను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. -
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
● నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కరీంనగర్ కార్పొరేషన్: ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్దేశాయ్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్లో శుక్రవారం శానిటేషన్, టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో పారిశుధ్య పనులు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, వనమహోత్సవంలో మొక్కలు నాటడంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రఫుల్దేశాయ్ మాట్లాడుతూ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిస్తే తొలగించి, యజమానులకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. స్వచ్ఛ ఆటోలు డీఆర్సీ సెంటర్లకు వెళ్లాలని, జీపీఎస్ ట్రాకింగ్ రీడింగ్ రిపోర్ట్ను ప్రతిరోజు అందించాలన్నారు. డంప్యార్డ్కు వెళ్లే చెత్త వాహనాలను ఎవరు అడ్డుకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నీళ్లు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ప్రధాన కూరగాయల మార్కెట్ లో చెత్త బయట వేయకుండా వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇండ్లను గుర్తించి, అందులో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అంబేడ్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ షట్టర్లను అద్దెకిచ్చే ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహియొద్దీన్ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎల్హెచ్బీ బోగీలు
● తిరుపతి– కరీంనగర్ ఎక్స్ప్రెస్కు మారనున్న బోగీలు ● ఒకప్పుడు నీలి, ప్రస్తుతం పసుపు, రేపటి నుంచి ఎరుపు బోగీలు ● ప్రమాద తీవ్రత తగ్గించేందుకు ఈ బోగీలు ఏర్పాటుసాక్షి ప్రతినిధి, కరీంనగర్: నేటి నుంచి తిరుపతి– కరీంనగర్ బైవీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలతో నడవనుంది. శనివారం రాత్రి తిరుపతిలో ఎగువ మార్గంలో ఈ రైలు 12761 ఎల్హెచ్బీ బోగీలతో మొదటిసారిగా కరీంనగర్ వైపు పరుగులు తీయనుంది. ఆదివారం రాత్రి ఇదే రైలు కరీంనగర్ నుంచి తిరుపతికి 12762 ఇదే బోగీలతో దిగువమార్గంలో నడవనుంది. ఈ అధునాతన ఎల్హెచ్బీ రైలు బోగీల సంఖ్య మొత్తం 19. ఇందులో ఆరు స్లీపర్ బోగీలు, ఐదు తృతీయ శ్రేణి శీతల బోగీలు, రెండు ద్వితీయ శ్రేణి శీతల బోగీలు, నాలుగు సాధారణ (జనరల్ ) బోగీలు, ఒక వికలాంగుల బోగీలతో నడవనుంది. ఈ రైలుకు 12769/70 తిరుపతి– సికింద్రాబాద్– తిరుపతి సెవెన్ హిల్స్ బై వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. కాగా.. తిరుపత్తి– కరీంనగర్ రైలు ఇప్పటి వరకు పసుపు రంగులో ఉండే 22 బోగీలతో నడిచింది. ఇదే రైలు ప్రారంభించిన కొత్తలో నీలి రంగు బోగీలతో నడిచింది. ఎల్హెచ్బీ బోగీలు అంటే? ఎల్హెచ్బీ అంటే లింక్మన్ హాఫ్మన్ బుష్ బోగీలు. ఇవి తేలికపాటి స్టీల్తో తయారు చేస్తారు. జర్మన్ దేశ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసినవి. మొట్టమొదటి సారి వీటిని మన దేశంలో తీసుకురావాలని అప్పటి దేశ ప్రధాని పీవీ.నరసింహారావు నిర్ణయించారు. ప్రమాదాలు జరిగినపుడు తక్కువ నష్టం జరిగేలా ఈ కోచ్లను రూపొందించారు. తొలుత ఈ ఎల్హెచ్బీ బోగీలను అప్పటి యూపీఏ ప్రభుత్వం కేవలం రాజధాని లాంటి ప్రీమి యర్ రైళ్లకు మాత్రమే ఉపయోగించింది. -
లోటు నుంచి సాధారణ వర్షపాతం
● మూడు మండలాల్లో సాధారణానికి మించి నమోదు ● నిండుతున్న చెరువులు, జోరందుకున్న నాట్లు ● సాగురంగానికి ప్రయోజనంకరీంనగర్ అర్బన్: జిల్లాలో మూడు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియగా వాగులు, వంకలు, చెరువులు అలుగు పారుతున్నాయి. ఇన్నిరోజులు వర్షాలు లేక వెలవెలబోయిన పొలాలు నాట్లతో ఊపందుకుంటున్నాయి. ఎగువన ఎస్సారెస్పీ జలాశయం ఆశాజనకంగా ఉండగా, దిగువ మానేరు, మధ్యమానేరు జలాశయాల్లో ఇప్పుడిప్పుడే నీటిమట్టం పెరుగుతోంది. జిల్లావ్యాప్తంగా కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు నిండి ప్రవహిస్తుండగా ప్రాజెక్టులకు భారీగా నీరు చేరుతోంది. జిల్లాలో కరీంనగర్, హూజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లుండగా దాదాపు అంతటా ఆశాజనకమే. గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాలు స్వల్ప తేడాతో లోటు వర్షపాతంగా నమోదవగా మిగతా మండలాలన్ని సాధారణ వర్షపాతానికి చేరువయ్యాయి. జిల్లాలో వరి ప్రధాన సాగు కాగా 2.70లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అధికారుల అంచనా. వారం రోజుల క్రితం వరకు 40వేల ఎకరాలే సాగవగా తాజాగా లక్ష ఎకరాలను దాటింది. మరోవారం రోజుల్లో అధికారుల అంచనాను చేరుకోనుంది. మూడు రోజులుగా జిల్లాలో నమోదైన వర్షపాతం కరీంనగర్ అర్బన్ మండలంలో 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మానకొండూరులో 16.3, కరీంనగర్ రూరల్లో 15.8, వీణవంకలో 14.8, చొప్పదండిలో 11.2, జమ్మికుంటలో 14.7, హుజూరాబాద్లో 11.2, తిమ్మాపూర్ 9.0, ఇల్లందకుంట 15.9, శంకరపట్నంలో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.జిల్లాలో సగటున వర్షపాత వివరాలు నెల సాధారణం నమోదైన వర్షపాతం జూన్ 124.5 99.5 జూలై 179.7 218.1 -
పూజలకు ప్రత్యేకం
శ్రావణం పూజలకు ప్రత్యేక మాసం. సాక్షాత్తు విష్ణుమూర్తి జన్మ నక్షత్రం. ఈ నెల రోజుల్లో ప్రతిరోజూ ప్రత్యేకమే. ముఖ్యంగా మహిళలు తమ సౌభాగ్యం కోసం దేవతామూర్తులను ఆరాధిస్తూ పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. – చామ కృష్ణవేణి, భారత్ టాకిస్ రోడ్, కరీంనగర్ మంగళదాయకం శ్రావణ మాసం మంగళదాయకమైన మాసం. ప్రతి మహిళ ఈ నెల రోజులు నిష్టతతో పూజల్లో పాల్గొంటుంది. తమ జీవితాల్లో మంచి జరగాలని, అమ్మవారిని వేడుకుంటు పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. – తొడుపునూరి సౌమ్య, జ్యోతినగర్, కరీంనగర్శివుడికి ప్రీతిపాత్రం శ్రావణం విష్ణుమూర్తి జన్మనక్షత్రం. సాక్షాత్తు శివుడు కూడా విష్ణుమూర్తిని పూజించడం ఈ మాసం ప్రత్యేకత. శ్రావణ నక్షత్రానికి ఆధిపతి అయిన శివుడికి శ్రావణ సోమవారాల్లో పూజలు చేయడంతో ఆయన కృపకటాక్షాలు లభిస్తాయి. – వేములవాడ కమల, రాఘవేంద్రనగర్ -
ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారిగా సర్ఫరాజ్ అహ్మద్
కరీంనగర్ అర్బన్: ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా సర్ఫరాజ్ అహ్మద్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్ఫరాజ్ అహ్మద్ ఐదేళ్ల క్రితం కరీంనగర్ కలెక్టర్గా వ్యవహరించగా అంతకుముందు ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్గా వ్యవహరించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు ప్రత్యేక అధికారిగా వ్యవహరించనుండగా విపత్తులు, ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును పర్యవేక్షించనున్నారు. కొన్ని నెలల క్రితం వరకు ఆర్వీ కర్ణన్ జిల్లా ప్రత్యేక అధికారిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. -
శ్మశానవాటికను దున్నిన రైతు
ఇల్లంతకుంట(మానకొండూర్): ప్రభుత్వ శ్మశానవాటిక స్థలం దాని పక్కనే నర్సరీ కేంద్రం పల్లెప్రకృతి వనం, డంపింగ్యార్డ్ ఉన్న భూమి తనదేనంటూ రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో ఓ వ్యక్తి దున్నేశాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వల్లంపట్లకు చెందిన మాజీ నక్సలైట్ కుక్కల మల్లేశం జనజీవన స్రవంతిలో కలిసే సమయంలో 1993లో ప్రభుత్వం మూడెకరాల అసైన్డ్ భూమిని జీవనోపాధి కోసం ఇచ్చింది. దాన్ని సాగుచేయకపోవడంతో నిరుపయోగంగా ఉంది. గ్రామస్తులు ఆ భూమిలోని ఒకటిన్నర ఎకరంలో ఐదేళ్ల క్రితం శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్ నిర్మించారు. రెండు రోజుల క్రితం మల్లేశం కొడుకు కుక్కల శ్రావణ్ సదరు శ్మశాన వాటికలో తమ భూమి ఉందంటూ దున్నేశాడు. ఇది గమనించిన గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామపంచాయతీకి శ్రావణ్ పిలిపించగా.. ఇటీవల సర్వేయర్ పంచనామా చేసి ఇచ్చిన రిపోర్టును చూపించాడు. ఇప్పుడు అటువైపు ఎవరూ వెళ్లవద్దని ఉన్నతాధికారులకు తెలియజేస్తానని కార్యదర్శి తెలిపారు. ఈ విషయంపై శ్రావణ్ను వివరణ కోరగా శ్మశానవాటిక, నర్సరీ, డంపింగ్యార్డ్ ఉన్న 374/1 సర్వే నంబర్లో తమకు ఎకరంనర స్థలం ప్రభుత్వం ఇచ్చిందేనన్నారు. రికార్డుల్లో తమ పేరు ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని కోరారు. -
శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభం
మల్యాల/ధర్మపురి: కొండగట్టు అంజన్న, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో శుక్రవారం శ్రావణ సప్తాహ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొండగట్టులో ఆంజనేయస్వామి మూలవిరాట్ను ప్రత్యేకంగా అలంకరించి, పంచామృతాభిషేకం తదితర పూజలు చేశారు. సాయంత్రం కుంకుమార్చన, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ నిర్వహించారు. ఈవో శ్రీకాంత్రావు, ప్రధాన అర్చకులు రామకృష్ణ, జితేందర్స్వామి, రఘు, స్థానాచార్యులు తిరుకోవెల కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవస్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే ధర్మపురిలో శ్రీయోగా లక్ష్మీనృసింహస్వామి, అనుబంధ ఉగ్ర వేంకటేశ్వర, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు తరలివచ్చి స్వామివారలను దర్శించుకున్నారు. ముందుగా గోదావరిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. -
అల్ఫోర్స్లో శ్రావణమాస ఆరంభ వేడుకలు
కొత్తపల్లి: కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్లో శ్రావణ మాస ఆరంభోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సరస్వతీ మాత విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి ఈ వేడుకలను ప్రారంభించారు. శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రీతికరమని, భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. దరఖాస్తు చేసుకోండి చొప్పదండి: నవోదయలో వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుకు జూలై 29 చివరి తేదీగా ప్రకటించబడిందని ప్రిన్సిపాల్ మంగతాయారు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు లేదా రెసిడెంట్ సర్టిఫికెట్, ఫోటో, పేరెంటు, స్టూడెంట్ సంతకంతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్యతిమ్మాపూర్: ఉద్యోగానికి వెళ్లడం లేదంటూ తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘట న మండలంలోని మన్నెంపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దరిపల్లి సతీశ్ మండలంలోని కొత్తపల్లిలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా డు. అతని కొడుకు అజయ్(23) ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా జల్సాలకు అలవాటు పడి ఉద్యోగానికి వెళ్లడం లేదు. సోమవారం ఉద్యోగానికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడంతో సతీశ్ అజయ్ని మందలించాడు. మనస్తాపం చెందిన అజయ్ గ్రామ శివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. తరువాత వరసకు చిన్నాన్న అయిన వేణుకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అజయ్ని 108లో కరీంనగర్ తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చని పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆత్మహత్యాయత్నం తంగళ్లపల్లి(సిరిసిల్ల): తండ్రి మందలించాడని మండలంలోని దేశాయిపల్లికి చెందిన మైనర్ బాలుడు(16) శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. దేశాయిపల్లికి చెందిన బాలుడిని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఇంట్లోనే ఉన్న కూరగాయలకు పిచికారీ చేసే పురుగుల మందు తాగాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
ఆకట్టుకున్న ‘టెడ్ఎడ్ టాక్స్’
కరీంనగర్: కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎంవోయూలో భాగంగా పారమిత, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు శుక్రవారం టెడ్ఎడ్టాక్స్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ఈ.ప్రసాద్రావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జెడ్పీహెచ్ కొత్తపల్లిలో 9వ తరగతి చదువుతున్న ఎన్. అక్షయ, జెడ్పీహెచ్ఎస్ చల్లూరులో 10వ తరగతి చదువుతున్న విష్ణు, టీజీఎంఎస్ గంగాధరలో 9వ తరగతి చదువుతున్న శ్రీవల్లి, జెడ్పీహెచ్ఎస్ గర్శకుర్తిలో పదోతరగతి చదువుతున్న రితిక తమ టెడ్ టాక్స్తో ఆకట్టుకున్నా రు. పారమిత విద్యార్థులు రితీష, విజ్ఞత, లాస్య, అక్షత, నిత్య, చైత్య ఆసక్తికరమైన అంశాలతో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యపరిచారు. మంత్రి అడ్లూరిని కలిసిన ఆర్టీసీ ఆర్ఎం రాజుకరీంనగర్: ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ను కరీంనగర్లోని ఆయన నివాసంలో ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ బి.రాజు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ధర్మపురి నియోజకవర్గంలో ప్రయాణికులకు తగిన బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్ ఎస్.భూపతిరెడ్డి, కరీంనగర్–2 డిపో మేనేజర్ ఎం.శ్రీనివాస్ ఉన్నారు. శుక్రవారం సభ సమస్యల పరిష్కార వేదికకరీంనగర్: మహిళా సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదికగా నిలుస్తుందని సీడీపీవో సబిత పేర్కొన్నారు. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లోని వావిలాలపల్లి–3 అంగన్వాడీ కేంద్రంలో జరిగిన శుక్రవారం సభలో పాల్గొని మాట్లాడారు. ప్రతీ గర్భిణి, బాలింత తప్పక హాజరు కావాలని సూచించారు. డీఎంహెచ్వో వెంకటరమణ మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కార్యక్రమంలో సుమారు 50రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. మెప్మా శ్రీవాణి, హెచ్ఎం జ్యోతిలక్ష్మి, డీసీపీవో ఫర్వీన్, వైద్యాధికారి ఇమ్రాన్ఖాన్ పాల్గొన్నారు. -
ఒక్కవానకే చిత్తు!
నగరంలోని జ్యోతినగర్ మోర్ సూపర్ మార్కెట్నుంచి మంకమ్మతోట వైపు వెళ్లే రోడ్డు ఇది. సీఎం హమీ పథకం కింద ఈ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టగా మధ్యలోనే నిలిచిపోయింది. జ్యోతినగర్ నుంచి మంకమ్మతోట, కాశ్మీర్గడ్డ తదితర ప్రాంతాలకు మెయిన్ లింక్ రోడ్డు కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. రెండేళ్లుగా ఈ రోడ్డు బాగుపడడం లేదు. ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు.నగరంలోని కోతిరాంపూర్ నుంచి కట్టరాంపూర్కు వెళ్లే ప్రధాన రోడ్డు ఇది. కోతి బొమ్మ నుంచి గిద్దెపెరుమాండ్ల ఆలయం వరకు రోడ్డు పూర్తికాగా, తరువాత వదిలేశారు. అప్పటి నుంచి ఈ రోడ్డు వెంట ప్రయాణం నరకంగా మారింది. వర్షం కురియడంతో గుంతల రోడ్డుతో ఇబ్బంది పడుతున్నారు. -
రాజన్న సన్నిధిలో శ్రావణ సందడి
వేములవాడ: శ్రావణమాసం ఆరంభం కావడంతో శుక్రవారం శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె, బద్దిపోచమ్మకు బోనం మొక్కులు పెట్టారు. అనుబంధ దేవాలయమైన మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. జల్సాలకు అలవాటు పడి.. జైలుపాలైన యువకులు● గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ ఇద్దరు ● 109 గ్రాముల గంజాయి స్వాధీనం ముస్తాబాద్(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ ఇద్దరు యువకులు డబ్బు కోసం గంజాయి విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపిన వివరాలు. ముస్తాబాద్ మండలం గూడెంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచా రంతో ఎస్సై గణేశ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. గూడెంలోని పెద్దమ్మ ఆలయం వద్ద అనుమానితులను పోలీసులు తనిఖీ చేశారు. వారి నుంచి 109 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గూడెంకు చెందిన సూర అజయ్(19), సూర ప్రదీప్(18) అనే యువకులుగా గుర్తించారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన అజయ్, ప్రదీప్ ఉన్నత చదువులకు వెళ్లకుండా గంజాయికి, జల్సాలకు బానిసలయ్యారు. డబ్బు కోసం అదే గంజాయిని విక్రయించడం ప్రారంభించారు. పక్క సమాచారంతో పోలీసులు అజయ్, ప్రదీప్లను పట్టుకుని రిమాండ్కు తరలించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను అనుక్షణం గమనించాలని సీఐ సూచించారు. మత్తుకు బానిసలుగా మారితే డీ–ఆడిక్షన్ సెంటర్కు తరలించి బాగుచేయిస్తామన్నారు. రోడ్డుపై కేజ్వీల్స్ ట్రాక్టర్ ఎలిగేడు(పెద్దపల్లి): నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై నడుపుతున్న కేజ్వీల్స్ ట్రాక్టర్ను ఎస్సై సత్యనారాయణ పట్టుకున్నారు. సుల్తాన్పూర్ గ్రామంలో శుక్రవారం నత పోలీసు సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో గడ్డం రాంరెడ్డికి చెందిన కేజ్వీల్స్ ట్రాక్టర్ రోడ్డుపైకి రావడంతో పట్టుకుని పోలీసుస్టేషన్ తరలించారు. రెవెన్యూ అధికారులకు దానిని అప్పగించడంతో వారు రూ.5వేల జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. -
మాట ఇచ్చి.. ఆస్పత్రి బిల్లు చెల్లించి
గంగాధర(చొప్పదండి): అభివృద్ధి పనులు చేసి అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నం చేసిన మాజీ సర్పంచ్ భర్తకు రూ.4 లక్షలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన తాళ్ల విజయలక్ష్మి సర్పంచుగా పని చేసింది. తన పదవీకాలంలో అభివృద్ధి పనులు చేసి దాదాపు రూ.10 లక్షల అప్పులు చేసింది. చేసిన పనులకు బిల్లులు రాక, అప్పులు చెల్లించలేక మనస్తాపానికి గురైన విజయలక్ష్మి భర్త రవీందర్ ఈనెల 14న పురుగులమందు తాగి ఆత్మహత్యా యత్నం చేశాడు. బాధితున్ని ఎమ్మెల్యే సత్యం పరామర్శించి ఖర్చులు భరిస్తానని భరోసా ఇచ్చారు. మాట ప్రకారం గురువారం రవీందర్ డిశ్చార్జ్ కాగా రూ.4 లక్షలు చెల్లించారు. మాజీ సర్పంచ్ బీఆర్ఎస్కు చెందిన వ్యక్తి అయినా సాయం చేయడంపై ప్రజలు అభినందిస్తున్నారు.