breaking news
Kakinada
-
కోనసీమలో దారుణం.. ఇద్దరు పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
సాక్షి, కోనసీమ జిల్లా: ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో దారుణం జరిగింది. తన ఇద్దరు పిల్లలకు బాదంపాలులో పురుగుల మందు తాగించి చంపిన తండ్రి పావులూరి కామరాజు.. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఐదేళ్ల క్రితం కామరాజు భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్న కామరాజు.. తనను ముగ్గురు వ్యక్తులు దారుణంగా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనివాస్, దుర్గారావు అనే వ్యక్తుల వల్లే చనిపోతున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
భయాందోళనలు చెందుతున్నాం
గ్రామంలో 60–70 టన్నుల లోడుతో లారీలు వేగంగా వెళ్తున్నాయి. దీంతో, ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని భయాందోళనకు గురవుతున్నాం. మోటార్లతో ఇసుక తవ్వి తరలించేస్తున్నారు. దీనివల్ల స్థానికంగా ఇళ్లు నిర్మించుకునే వారికి ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. – మోర్త తాతారావు, సోమవరం ప్రమాదంలో ఎత్తిపోతల పథకం సోమవరంలోని ఎత్తిపోతల పథకం పంపు సమీపంలో యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. దీనివల్ల పంపింగ్ స్కీమ్ కూలిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సుమారు 1,200 ఎకరాలు బీడుగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అక్రమ ఇసుకతో సొమ్ము చేసుకుంటున్న నాయకులు.. రైతుల సమస్యలను కూడా పట్టించుకోవాలి. – అడబాల నాగరాజు, సోమవరం -
‘ఎత్తిపోతల’కు ముప్పు!
ఏలేరుపై ఆధారపడి మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రభుత్వ మనసు పెట్టి పని చేస్తే రెండో పంటకు సైతం సాగునీరు అందుతుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏలేరు నుంచి ఐదేళ్లూ క్రమం తప్పకుండా రెండో పంటకు సాగునీరు అందించారు. అటువంటి ఏలేరు తెలుగు తమ్ముళ్ల స్వార్థానికి బలైపోతోంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మెట్ట ప్రాంత రైతులకు మేలు చేసేలా అప్పటి మంత్రి తోట నరసింహం సోమవరం గ్రామం వద్ద ఏలేరులో ఎత్తిపోతల పంపింగ్ స్కీమ్ నిర్మించారు. ఇసుకాసురులు ఈ పథకం చుట్టుపక్కల ఏలేరు నదికి తూట్లు పొడిచేస్తున్నారు. ఇక్కడ మరికొన్ని రోజులు ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఈ ఎత్తిపోతల పథకం ఏలేరులో కూలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇసుక తవ్వకాలను శాశ్వతంగా నిలిపివేయాలని వారు కోరుతున్నారు. అడ్డగోలు తవ్వకాలతో ఏలేరులో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, దీనివలన కూడా శివారు ఆయకట్టుకు సాగునీరు అందడం గగనమవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ ఇసుక తవ్వకాలను కట్టడి చేయకుంటే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగ్రామం ఇర్రిపాకతో పాటు కిర్లంపూడి మండలం బూరుగుపూడి, సోమవరం తదితర గ్రామాల్లోని ఆయకట్టు ప్రమాదంలో పడటం ఖాయమని చెబుతున్నారు. -
పెళ్లి బృందాలకు క్షవర కల్యాణం
ఫ దళారుల దందాఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పేదలు తమ బిడ్డల వివాహాలు చేసుకునేందుకు వీలుగా రత్నగిరిపై పలువురు దాతలు ఉచిత కల్యాణ మండపాలు నిర్మించారు. కానీ, వీటి కేటాయింపులో దళారుల దందా సాగుతోంది. వారికి కొంతమంది దేవస్థానం సిబ్బంది అండదండలు ఉండటంతో పేదలకు ఉచిత కల్యాణ మండపాలు లభించడం దుర్లభంగా మారుతోంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఉచిత కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానం అధికారులు సక్రమంగా పర్యవేక్షించకపోవడంతో దళారులు, కొంతమంది సిబ్బంది ఒక్కటై వివాహ బృందాలను దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజా ఉదంతమే దీనికి ఉదాహరణ. రూ.25 వేలకు ఒప్పందం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన తోట నాగతేజ గత శనివారం రాత్రి రత్నగిరిపై వివాహం చేసుకున్నారు. ఈ వివాహ ఏర్పాట్ల కోసం ఆయన గత ఆగస్టులో దేవస్థానానికి వచ్చారు. మట్టే వారి సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపంలో ఏసీ కల్యాణ మండపం, పక్కనే సత్రంలో రెండు ఏసీ గదులు, పురోహితుడు, సన్నాయి మేళం కోసం దేవస్థానం సీఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించారు. సత్రం గదులు, వివాహ మండపం వివాహానికి నెల రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేస్తారని అక్కడి అధికారులు చెప్పారు. అక్కడి నుంచి నాగతేజ వెలుపలకు రాగానే అశోక్, పోరి అనే ఇద్దరు దళారులు అతడి వద్దకు వెళ్లారు. అక్టోబర్ 11 వివాహానికి గదులు, వివాహ మండపం సెప్టెంబర్ 11న వస్తే రిజర్వ్ చేస్తారని చెప్పారు. ఆయన రానవసరం లేకుండా అన్నీ తామే ఏర్పాటు చేస్తామని, రూ.25 వేలు ఇవ్వాలని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగతేజ.. వారికి తన, పెళ్లి కుమార్తె ఆధార్ నకళ్లతో పాటు శుభలేఖ, రూ.15 వేల నగదు ఇచ్చారు. మిగిలిన రూ.10 వేలు వివాహ సమయంలో ఇస్తామని చెప్పారు. అయితే, వివాహం చేసుకునేందుకు గత శనివారం దేవస్థానానికి వచ్చిన నాగతేజకు నాన్ ఏసీ కల్యాణ మండపం, రెండు నాన్ ఏసీ గదులు మాత్రమే ఇచ్చారు. దీంతో, అతడు దళారులకు రూ.10 వేలకు బదులు రూ.7,500 మాత్రమే ఇచ్చారు. మిగిలిన రూ.2,500 కూడా ఇవ్వాలని దళారులు గొడవకు దిగడంతో నాగతేజ పెళ్లి దుస్తుల్లోనే వెళ్లి ఈఓ వీర్ల సుబ్బారావుకు ఫిర్యాదు చేశాడు. దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వివాదం సంగతి అలా ఉంచితే.. ఈ ఎపిసోడ్లో అసలు వ్యక్తులు రాకుండా దళారులు ఆధార్ కార్డులు ఇస్తే వివాహ మండపం, సత్రంలో గదులు ఎలా రిజర్వ్ చేశారు? సీఆర్ఓ కార్యాలయ సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది జరిగే పనేనా వంటి అనేక సందేహాలు కలుగుతున్నాయి. నెరవేరని దాతల లక్ష్యం అన్నవరం దేవస్థానంలో సత్యగిరిపై పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా రైస్ ఇండస్ట్రీస్ ఎండీ మట్టే శ్రీనివాస్ దంపతులు 2022లో 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద ఏసీ కల్యాణ మండపం నిర్మించారు. ఇదేవిధంగా విశాఖపట్నానికి చెందిన దాత ఎంఎస్ రెడ్డి కూడా 12 మినీ కల్యాణ మండపాలతో పెద్ద కల్యాణ మండపం నిర్మించారు. ఈ రెండు మండపాల్లో చెరో తొమ్మిది మినీ కల్యాణ మండపాల కేటాయింపును దేవస్థానానికి అప్పగించారు. మిగిలిన చెరో మూడు మండపాలను దాత సిఫారసు మేరకు కేటాయిస్తారు. ఈ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారు రూపాయి కూడా అద్దె చెల్లించనవసరం లేదు. అలాగే, ఒక్కో వివాహానికి రెండు గదులను దేవస్థానం అద్దె ప్రాతిపదికన ఇస్తుంది. వివాహ ముహూర్తానికి నెల రోజుల ముందు మాత్రమే ఈ కల్యాణ మండపాలను రిజర్వ్ చేస్తారు. ఈ విషయం తెలియక చాలామంది వివాహానికి చాలా రోజుల ముందే వస్తున్నారు. తీరా విషయం తెలిశాక మళ్లీ రాలేకపోతున్నారు. అటువంటి వారిని గుర్తించి, దళారులు వల విసురుతున్నారు. ఇలా చేస్తే మేలు ఫ దేవస్థానంలో వివాహ మండపాలు, సత్రం గదుల కేటాయింపుపై ఎటువంటి ప్రచారమూ లేదు. వీటిని వివాహాలకు నెల రోజుల ముందు మాత్రమే కేటాయిస్తారని ఫ్లెక్సీలు, మైకుల ద్వారా ప్రచారం చేయాలి. ఫ సీఆర్ఓ కార్యాలయంతో పాటు దేవస్థానంలో దళారులు లేకుండా చర్యలు తీసుకోవాలి. వివాహ మండపాలు కేటాయించాలంటే పెళ్లి బృందం సభ్యులు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే సీఆర్ఓ కార్యాలయం వద్దకు రావాలంటూ ప్రకటనలు చేయాలి. ఫ వివాహ బృందాల వారికి అవసరమైన సమాచారం ఇచ్చేందుకు టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలి. ఆ నంబర్పై విస్తృత ప్రచారం చేయాలి. ఫ వివాహాల సీజన్లో ఈఓ, ఇతర ఉన్నతాధికారులు తరచుగా వివాహ మండపాలు, సీఆర్ఓ కార్యాలయంలో తనిఖీలు చేయాలి. పెళ్లి బృందాల అభిప్రాయాలు తెలుసుకుని, వారి సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఫ ఉచిత వివాహ మండపాలు కేటాయించడానికి ముందు, వివాహం అయ్యాక ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా అనే విషయమై ఆరా తీసి, ఆ మేరకు చర్యలు చేపట్టాలి. ·˘ Æý‡™èl²WÇOò³ ÑÐéçßæ Ð]l$…yýl´ëË$, సత్రం గదులు ఇప్పిస్తామని మోసాలు ·˘™égêV> DKMýS$ ఓ బాధితుడి ఫిర్యాదు ·˘§ólÐ]lÝ릯]l… íܺ¾…¨ సహకారంపై సందేహాలు -
కౌశల్ పోటీలను విజయవంతం చేయండి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లోని విద్యార్థులు కౌశల్ రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ కోరారు. పోటీలకు సంబంధించిన వాల్పోస్టర్లను మంగళవారం తన చాంబర్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన మండలి, సైన్స్ సిటీ ఆఫ్ ఏపీ, రాష్ట్ర శాస్త్ర, సాంకేతిక మండలి ఆధ్వర్యాన ఈ పోటీలు జరుగుతున్నాయన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయి విజేతలకు నగదు బహుమతులు అందిస్తారన్నారు. ఈ నెల 23లోగ ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి ఎం.శ్రీనివాస్ వినీల్, కౌశల్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జాయింట్ కో ఆర్డినేటర్ పి.మోహన్రెడ్డి, ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.చలపతి, ప్రధాన కార్యదర్శి సీహెచ్ఎన్ శ్రీనివాస్, వీవీఎం జిల్లా సమన్వయకర్త డి.శివప్రసాద్ పాల్గొన్నారు. ఫ క్విజ్ పోటీలు 8, 9, 10 తరగతుల వారికి ఉంటాయి. నవంబర్ 1, 2, 3 తేదీలలో పాఠశాల స్థాయిలో నిర్వహించే ఈ పోటీలకు తరగతికి ముగ్గురు చొప్పున మాత్రమే పాల్గొనాలి. ఫ తొమ్మిదో తరగతి వారు పోస్టర్–1, ఎనిమిదో తరగతి వారు పోస్టర్–2 పోటీలకు అర్హులు. ఫ రీల్స్ పోటీలకు 10వ తరగతి విద్యార్థులు మాత్రమే అర్హులు. ఫ పోటీల్లో పాల్గొన్న వారిలో పాఠశాల స్థాయిలో ప్రతి తరగతి నుంచి మూడు విభాగాల్లో ఇద్దరు చొప్పున విజేతలను జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. వారి నుంచి ప్రతి ఈవెంట్కు ఇద్దరు చొప్పున రాష్ట్ర స్థాయికి వెళ్తారు. రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 27న తిరుపతి భారతీయ విజ్ఞాన జాతీయ సమ్మేళనంలో జరుగుతాయి. -
వంట గ్యాస్ లీకై ముగ్గురికి గాయాలు
పిఠాపురం: మల్లాం గ్రామంలోని ఒక ఇంట్లో వంట గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో మల్లెపాముల వీర నాగేశ్వరరావు ఇంట్లో పని చేస్తుండగా మంగళవారం అకస్మాత్తుగా గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో అతడితో పాటు, భార్య నాగలక్ష్మి, తమ్ముడు లోవరాజుకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఐదుగురు ఉన్నట్టు సమాచారం. చిన్న పిల్లాడు ఏడుస్తుండడంతో ఆ బాలుడితో పాటు మరో వ్యక్తి బయటకు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
రామేశంపేట మెట్టలో అక్రమ మైనింగ్
● ఆగే వరకూపోరాటం చేస్తాం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు విశ్వేశ్వరరావు బోట్క్లబ్ (కాకినాడసిటీ): మైనింగ్ మాఫియా ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగవారం పెద్దాపురం మండలం రామేశం పేట మెట్టలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై విలేకర్ల సమావేశం నిర్వహించారు. రామేశంపేటలో అక్రమ మైనింగ్ జరుగుతోందని తనకు 60 ఫిర్యాదులు అందాయన్నారు. తాను స్వయంగా అక్కడ వెళ్లగా అనధికార మైనింగ్ జరుగుతోందన్నారు. దానిపై కలెక్టర్కు, మైనింగ్ శాఖ డీడీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశానన్నారు. కానీ అధికారులు చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారన్నారు. ఇటీవల గ్రావెల్ వాహనం ఢీకొని కళాశాల విద్యార్థి మృతి చెందాడన్నారు. ప్రస్తుతం అక్రమ మైనింగ్ కారణంగా కొండలు రోజురోజుకీ తరిగిపోతున్నాయన్నారు. అధికారుల లెక్కల ప్రకారం 900 ఎకరాల్లో కేవలం 260 ఎకరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారన్నారు. మిగిలినదంతా అనధికారికంగా జరుగుతోందన్నారు. రామేశంమెట్టలో అక్రమ మైనింగ్ ఆగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కుండల సాయి, మొసలగంటి సురేష్ , చోడిశెట్టి రమేష్బాబు పాల్గొన్నారు. -
ఆ నలుగురూ ఒక్కడై..
● కాకినాడ వాసి గొప్పదనం ● బహ్రెయిన్తో తెలుగు ప్రజల మృతదేహాలకు అంత్యక్రియలు కాకినాడ క్రైం: ఆఖరి మజిలీలో ఆ నలుగురూ తానే అభాగ్యులకు అండగా నిలుస్తున్నాడు మన కాకినాడ వాసి. స్వదేశానికి రాకుండా విదేశాల్లో ఉండిపోయిన తెలుగు ప్రజల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎడారిలో అమృత బంధువుగా మారిన శివకుమార్ వివరాలు ఇవీ.. బతుకుతెరువు కోసం చాలా మంది తెలుగు ప్రజలు బహ్రెయిన్ దేశానికి ఉపాధి కోసం వెళుతుంటారు. ఏదైనా కారణాల వల్ల అక్కడ చనిపోతే, ఆ మృతదేహం స్వదేశానికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ కారణంతో చాలా మృత దేహాలు అక్కడే ఫ్రీజర్లలో ఉండిపోతున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశంలో స్థిరపడిన కాకినాడ వాసి దౌర్ల శివకుమార్ గమనించాడు. కూలి పనుల కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న తెలుగు వారి కష్టాలను కళ్లారా చూశాడు. ఇరు దేశాల మధ్య మృతదేహాల తరలింపునకు చేసే ప్రక్రియల్లో వివిధ కారణాల వల్ల చోటు చేసుకుంటున్న జాప్యమే ఈ దుస్థితికి కారణమని తెలుసుకున్నాడు. దీంతో అక్కడి తెలుగు వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. మృతి చెందిన వారు తానకేమీ కాకున్నా అంతిమ వేళల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహం ఐదేళ్లుగా బహ్రెయిన్లోనే ఉండగా, అక్కడి అధికారులతో మాట్లాడి ఇటీవల మృతదేహాన్ని విడుదల చేయించాడు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాడు. -
అప్పు తీర్చలేక స్నేహితుడి హత్య
● ఆపై భయంతో నిందితుడి ఆత్మహత్యాయత్నం ● వీడిన హత్యకేసు మిస్టరీ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీహరి రాజు ఏలేశ్వరం: తీసుకున్న అప్పు తీర్చాలని స్నేహితుడు ఒత్తిడి చేయడంతో అతడిని హత్య చేశాడో దుర్మార్గుడు. ఆపై పోలీసులకు దొరికిపోతాననే భయంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని పోలీసులు విచారణ చేయడంతో హత్య కేసు మిస్టరీ వీడింది. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అడ్డతీగల మండలం కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లు ఈ నెల 4న ఏలేశ్వరంలోని తన కుమారుడు ఆంజనేయులు ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యాడు. దీంతో తన తండ్రి కనిపించడం లేదంటూ ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పురుగు మందు తాగి అడ్డతీగల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని పోలీసులు విచారణ చేయగా అతడే వెంకటేశ్వర్లును హత్య చేసినట్టు తేలింది. కోడిపందేలకు పిలిచి.. బొదిరెడ్డి వెంకటేశ్వర్లుకు ఏలేశ్వరానికి చెందిన వల్లూరి రాజా రమేష్తో కోడి పందేల వద్ద స్నేహం కుదిరింది. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు నుంచి రాజా రమేష్ రూ.10 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. తన బాకీ తీర్చమని వెంకటేశ్వర్లు ఒత్తిడి తేవడంతో అతడిని కడతేర్చేందుకు రాజా రమేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో నర్సీపట్నంలో కోడి పందేలు ఉన్నాయని చెప్పి, తనతో కారులో వెంకటేశ్వర్లును తీసుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో మత్తు మందు కలిపిన డ్రింక్ను వెంకటేశ్వర్లుకు ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితిలోకి చేరుకున్న అతడిని హత్య చేసి, అతని వద్ద ఉన్న డబ్బు, బంగారం తీసుకున్నాడు. బురదరాళ్ల ఘాట్ రోడ్డులోని బొంతువలస గ్రామం వద్ద తుప్పల్లో మృతదేహాన్ని పారవేసి వెళ్లి పోయాడు. ఆ డబ్బుతో తాను తీసుకున్న బాకీలను తీర్చాడు. అయితే హత్య కేసులో పోలీసులకు దొరికిపోతాననే భయంతో రాజా రమేష్ పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చేరిన అతడిని విచారణ చేసిన పోలీసులకు జరిగిన సంఘటన వివరించాడు. చికిత్స అనంతరం ఈ నెల 13న కోలుకోగా ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం ప్రత్తిపాడు కోర్టుకు తరలించారు. -
హరిప్రియకు అభినందనలు
అంబాజీపేట: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన అంబాజీపేట జెడ్పీ హైస్కూల్ ఆరో తరగతి విద్యార్థిని కుడుపూడి కావ్య సుందరి హరిప్రియను మంగళవారం ప్రధానోపాధ్యాయుడు కడలి సాయిరామ్ అభినందించారు. బాపట్ల జిల్లా పేటేరు హైస్కూల్లో ఈ నెల 10 నుంచి 12 వరకు జరిగిన తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 కేజీల విభాగంలో హరిప్రియ మొదటి స్థానంలో నిలిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కార్యక్రమంలో పీడీ కుంపట్ల ఆదిలక్ష్మి, ఉమా మహేశ్వరరావు, పీఈటీ అందె సూర్యకుమారి, కోచ్ త్రిమూర్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దేవరపల్లి: జాతీయ రహదారిపై యర్నగూడెం గండి చెరువు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. పోలవరం మండలం కొత్తపట్టిసం గ్రామానికి చెందిన దొడ్డి నాగు (35) కొవ్వూరు మండలం పంగిడిలో నివాసం ఉంటున్నాడు. దొమ్మేరుకు చెందిన తాళ్ల అభిషేక్తో కలిసి నాగు బైక్పై విజయవాడలోని బంధువుల ఇంటికి బయలు దేరాడు. యర్నగూడెం సమీపంలో గండి చెరువు వద్ద హైవేపై వెళుతున్న క్వారీ లారీ సడన్గా సర్వీస్ రోడ్డులోకి వచ్చింది. దీంతో సర్వీస్ రోడ్డులో వెళుతున్న బైక్ అదుపు తప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో దొడ్డి నాగు తలకు బలమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. అభిషేక్ తల, కాలికి బలమైన గాయాలు కావడంతో చికిత్స కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. అభిషేక్ అవివాహితుడు. నాగు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, ఎస్సై వి.సుబ్రహ్మణ్యం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
భక్తులకు అన్నవరమై..
పెళ్లి భోజనంలా.. అన్నదాన పథకంలో భక్తులకు పెళ్లి భోజనం మాదిరిగా ఆహార పదార్థాలు వడ్డిస్తారు. పులిహోర, స్వీట్, రెండు రకాల కూరలు, పచ్చడి, సాంబారు, పెరుగుతో కలిపి కేవలం అరటి ఆకులోనే భోజనం పెడతారు. ఇక్కడకు వచ్చిన భక్తులతో పాటు వాడపల్లి క్షేత్రానికి వెళ్లి వస్తున్న వారు కూడా అన్నవరప్పాడులో ఆగి, అన్న ప్రసాదం స్వీకరిస్తారు. స్వామి వారికి ప్రతి ఏడాది వైశాఖ మాసంలో అంగరంగా వైభవంగా కల్యాణం జరుపుతారు. ఆ సమయంలో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకూ వారం రోజుల పాటు అన్నదానం చేయడం విశేషం. ప్రస్తుతం ప్రతి శనివారం నిర్వహిస్తున్న అన్నదానాన్ని నిత్య అన్నదానంగా మార్చడానికి దేవదాయ ధర్మాదాయశాఖకు అనుమతులు కోరుతూ నివేదికలు సమర్పించారు. ● అన్నవరప్పాడు వెంకన్న ఆలయానికి భక్తుల రద్దీ ● ప్రతి శనివారం అన్నదానం ● పెళ్లి భోజనంలా ఆహార పదార్థాలు ● నిత్యాన్నదానంగా మార్చేందుకు చర్యలు పెరవలి: జాతీయ రహదారి పక్కనే పెరవలి మండలం అన్నవరప్పాడులో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతోంది. నిత్యం ఈ ఆలయానికి వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు అన్నసమారాధన నిర్వహిస్తారు. వేల మంది భక్తులు తరలివచ్చి, స్వామివారి అన్నప్రసాదం స్వీకరిస్తారు. అయితే కేవలం భక్తులు ఇచ్చిన విరాళాలతోనే ఈ కార్యక్రమం జరపడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయ చరిత్ర అన్నవరప్పాడులోని వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం వెనుక పెద్ద చరిత్ర ఉంది. గ్రామానికి చెందిన ఓసూరి సోమన్న కలలో తిరుమలలో కొలువైన వేంకటేశ్వరస్వామి సాక్షాత్కరించి, ఈ దివ్యస్థలిలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంట. ఆయన ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలపడంతో అందరూ స్వామివారి ఆజ్ఞను పాటించాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి 1965లో ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు ప్రతి ఏటా వైశాఖ మాసంలో స్వామివారికి అంగరంగ వైభవంగా వారం రోజుల పాటు కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. పూర్వం ఇదే ప్రదేశంలో అత్రి మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ క్షేత్రానికి ఇంతటి తేజస్సు లభించిందని నమ్మకం. అన్నదాన పథకం ఆలయంలో ఐదేళ్ల క్రితం అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని కేవలం భక్తుల విరాళాలతో మాత్రమే నిర్వహిస్తున్నారు. స్వామివారి మూలధనం నుంచి ఒక్క పైసా కూడా వినియోగించరు. ప్రతి శనివారం నిర్వహించే ఈ అన్నదానానికి భక్తులు ముందస్తుగానే తమ విరాళాలు అందిస్తారు. ఆలయంలో ప్రతి శనివారం 6 వేల నుంచి 9 వేల మంది వరకు భక్తులు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ప్రత్యేక రోజుల్లో వారి సంఖ్య మరో మూడు వేలకు పెరుగుతుంది. ప్రతి వారం దర్శనం అన్నవరప్పాడులో కొలువైన వేంకటేశ్వరస్వామిని ప్రతి శనివారం దర్శించుకుంటాను. దాదాపు పదేళ్లుగా ఆలయానికి వస్తున్నాను. ఇక్కడ భక్తులు కోరుకున్న కోరికలను స్వామివారు తప్పకుండా తీర్చుతారు. – కాపక పాపారావు, భక్తుడు, కాకరపర్రు అన్నదానం బాగుంది ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం చాలా బాగుంది. వచ్చిన భక్తులందరికీ అన్న ప్రసాదం వడ్డిస్తారు. అది కూడా పెళ్లి భోజనంలా పెడతారు. ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. – కంటిపూడి సూర్యనారాయణ, భక్తుడు, తీపర్రు భక్తుల తాకిడి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రతి శనివారం నిర్వహించే అన్నదానాన్ని నిత్యాన్నదానంగా మార్చేందుకు అనుమతి కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. 1965లో నిర్మించిన ఆలయం ప్రస్తుతం శిథిలస్థితికి చేరింది. దీంతో నూతన ఆలయ నిర్మాణానికి కూడా నివేదిక ఇచ్చాం. – మీసాల రాధాకృష్ణ, ఆలయ ఈఓ, అన్నవరప్పాడు విరాళాలు అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శాశ్వత అన్నదాన పథకం కింద ఇప్పటి వరకు రూ.4 లక్షల డిపాజిట్లు, బంగారం 376 గ్రాములు, 30 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. భక్తులు నిత్య గోత్రార్చన కింద రూ.12 లక్షలు డిపాజిట్లు ఉన్నాయి. ఇవి స్వామివారికి శాశ్వత డిపాజిట్లు కాగా, ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం మాత్రం ఎప్పటికప్పుడు భక్తులు విరాళాలతో నిర్వహిస్తారు. పెళ్లిళ్ల గుడి ఆలయంలో ఏటా వేల సంఖ్యలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద ముహూర్తాల సమయంలో ఆలయ ప్రాంగణంతో పాటు రోడ్లపైనే వివాహాలు జరుపుతారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా తరలివస్తారు. అందుకే ఈ వెంకన్న సన్నిధి.. పెళ్లిళ్లకు చల్లని పెన్నిధి అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలామంది ఈ ఆలయాన్ని పెళ్లిళ్ల గుడిగా పిలుస్తారు. -
సంప్రదాయాలపై అవగాహన అవసరం
● నన్నయ వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ ● వర్సిటీలో ఘనంగా యువజనోత్సవాలు రాజానగరం: చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్ (కాకినాడ) ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీడీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహ దపడతాయన్నారు. ఈ సందర్భంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న 944 మంది విద్యార్థులు జానపద నృత్యం, జానపద గేయాలు, స్టోరీ రైటింగ్, పోస్టర్, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, పర్యావరణ పరిరక్షణ మున్నగు వాటిలో పోటీ పడ్డారు. విజేతలు వీరే.. ● ఇన్నోవేషన్ ట్రాక్ (సైన్స్ మేళా ప్రదర్శన)లో వంగ అయ్యప్ప గ్రూప్ ప్రథమ, షేక్ మోనినా గ్రూప్ ద్వితీయ, జానపద నృత్యం (గ్రూప్)లో ఎస్ఆర్ఎస్ గ్రూప్ ప్రథమ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ ద్వితీయ, పి.డోలా స్రవంతి గ్రూప్ తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● జానపద గేయాల విభాగంలో తాతరాజు గ్రూప్ ప్రథమ, ఎ.మొలరాజు గ్రూప్ ద్వితీయ, వై.జానీ ఏంజెల్ గ్రూప్ తృతీయ స్థానాలు సాధించాయి. ● ఉపన్యాసంలో విధూషీ శాండిల్య ప్రథమ, జి.ధ్రువిత్ ద్వితీయ, వైష్టవి కొల్లిమల్ల తృతీయ, కథ రాయడంలో వీబీ జ్ఞాన షర్మిల ప్రథమమ, అపూర్వ కొచ్చే ద్వితీయ, ఎ.లాలస్య తృతీయ బహుమతులు సాధించారు. ● పెయింటింగ్లో మహ్మద్ సమీర్, డి.వెంకట త్రివిక్రమ్, కె.లాజర్ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కవిత్వంలో జి.ధ్రువిత్ ప్రథమ, బోడా హాసిని ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. -
గరుడ వాహనంపై మలయప్ప దర్శనం
● ఘనంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో భూసమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక దివ్య బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బ్రహ్మోత్సవాలను వీక్షించి తరించారు. దేవదాయ ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహనసేవ, ఊరేగింపులు జరిపారు. గరుడ వాహనంపై శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్శంగా పండితులు గరుడ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. కాగా..ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో రికార్డ్ అసిస్టెంట్ మృతి
అనపర్తి, రాయవరం: రోడ్డు ప్రమాదంలో జూనియర్ కళాశాల రికార్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కడియం మండలం వేమగిరి గ్రామానికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ (52) రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పని చేస్తున్నారు. రోజూలాగే వేమగిరి నుంచి అనపర్తి కొప్పవరం మీదుగా రాయవరంలోని కళాశాలకు బయలుదేరారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుండడంతో కొప్పవరం గ్రామ శివారుకు చేరుకునే సరికి ఆయన బైక్ రోడ్డుపై జారి పోయింది. వాహనంతో పాటు ఆయన రోడ్డుపై పడిపోవడంతో అపస్మారక స్థితికి చేరుకోగా స్థానికులు గమనించారు. ఆయన జేబులోని సెల్ఫోన్ తీసి రాయవరం కళాశాలలోని సహోద్యోగులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి హుటాహుటిన అనపర్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. ఈ మేరకు ట్రైనీ ఎస్సై సుజాత కేసు నమోదు చేశారు. -
నకిలీపై సమరం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మద్యపాన వ్యసనానికి ప్రజలను దూరం చేసి, వారి ఆరోగ్యాన్ని, తద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, ఫుల్ కిక్ ఇచ్చే మద్యాన్ని అందిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో మందుబాబులకు వల వేశారు. వారి బలహీనతతో ఆటాడుకుని, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ ఆ ధీనంలో ఉన్న మద్యం షాపులను కూటమి నేతలకు కట్టబెట్టారు. తద్వారా వారికి ‘సంపద సృష్టించారు.’ అధిక ధరలకు మద్యం అమ్మకాలు మొదలుపెట్టి ఎడాపెడా దోచుకోవడం మొదలెట్టారు.. వీధివీధినా బెల్టు షాపులు తెరచి, మద్యం ఏరులై పారిస్తున్నారు. డోర్ డెలివరీ సైతం ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు చేటుగా పరిణమించిన ఈ నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం పోరుబాట పట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను సైతం లెక్క చేయకుండా.. ప్రజలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని, మద్యం అమ్మకాలకు నిర్దేశిత సమయాలు పాటించాలని, నకిలీ మద్యం కుంభకోణంపై సిట్తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తుని, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఎకై ్సజ్ కార్యాలయాల వరకూ భారీ ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ‘రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చి టీడీపీ నాయకులు వేల కోట్లు దిగమింగారు. ఇప్పటి వరకూ బెల్టు షాపులకు పరిమితమైన నేతలు ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంపై సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) సిట్తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి, స్థానిక ఎకై ్సజ్ శాఖ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. కార్యాయల సిబ్బంది ఎంతకూ గేటు తెరవలేదు. దీంతో, నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని నాయకులు చెప్పడంతో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక బయటకు వచ్చారు. ఆమెకు కన్నబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు, అధిక రేట్లు, బెల్టు షాపుల గురించి మాత్రమే చూశామని.. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం ద్వారా వేల కోట్లు దిగమింగారని ఆరోపించారు. నకిలీ మద్యం కోసం స్పిరిట్ నుంచి లేబుళ్ల వరకూ వారే పెట్టేశారని, 15 నెలల నుంచి జరుగుతున్నా ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. తెలియకపోతే చేతకానితనమని, తెలిస్తే పార్టనర్షిప్గా భావించాల్సి వస్తుందని, రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి నకిలీ ‘ఎన్’ బ్రాండ్లు ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం మరణాలు 421 ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష కట్టి గొంతు నొక్కాలని ఎడిటర్, విలేకర్లపై కేసులు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’పై కేసులు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అని, ఇదేవిధంగా కక్ష కడితే చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పచ్చ పత్రికలు కనిపించవని, ఇది సోషల్ మీడియా యుగమనే విషయం గుర్తుంచుకోవాలని కన్నబాబు అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురామ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ ఎస్ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, సరోజ, మాకినీడి శేషుకుమారి, మైనార్టీ సెల్ నేత కరీం బాషా, పి.నాగబాబు, కొప్పిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై సీబీఐ విచారణ చేపట్టాలి. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా నాణ్యమైన మద్యం తక్కువ ధరకే సరఫరా చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అక్రమ కేసులు పెడుతూ నాయకులను ప్రభుత్వం వేధిస్తోంది. మద్యం దుకాణాలను కూటమి నేతలు తమ అనుచరులకు అప్పగించారు. నకిలీ మద్యం తాగిన వ్యక్తులు నాలుగైదు రోజుల్లో జవసత్వాలు కోల్పోతున్నారు. నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేతులు దులుపుకొనేందుకే చంద్రబాబు సిట్, సీఐడీ విచారణ అంటున్నారు. వేల కోట్ల రూపాయల స్కాములు చేసిన చంద్రబాబు, లోకేష్లు ఇకనైనా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకుండా నాణ్యమైన మద్యం అందించాలి. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పాలన సాగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థావరాలు ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మద్యం షాపులను నిబంధన మేరకే నిర్వహించారు. నేడు కూటమి సర్కారు వేలాదిగా బెల్టు షాపులు తెరచి ‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం విక్రయిస్తోంది. దీనిని తాగిన మందుబాబులు మృత్యువాత పడుతున్నారు. నకిలీ మద్యం నిందితులు పట్టుబడుతున్నా ఎక్కడ బెల్టు షాపు కానీ, మద్యం దుకాణం కానీ సీజ్ చేయలేదు. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీబీఎన్ సిట్ కాదు.. సీబీఐ విచారణ కావాలి నకిలీ మద్యానికి వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళనతుని తుని రైల్వే బ్రిడ్జి నుంచి పట్టణంలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఈ ర్యాలీలో కదం తొక్కారు. కూటమి సర్కార్ మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ పట్టాభి చౌదరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల కృష్ణుడు, రాయి మేరీ అవినాష్, కోరుమిల్లి లలిత, నాగం దొరబాబు, సకురు నాగేంద్ర నెహ్రూ, రేలంగి రమణగౌడ్, పోతల రమణ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై సంప్రోక్షణ పూజలు ప్రారంభం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఆలయంలోని దర్బారు మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఈ పూజలు, హోమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలుత కలశాలతో మండపారాధన చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ పూజలు నిర్వహించారు. తర్వాత శాంతి హోమానికి అంకురార్పణ చేశారు. అన్నవరం దేవస్థానంలో కొన్ని నెలలుగా అనేక అగ్ని ప్రమాదాలు, అపశ్రుతులు జరిగిన నేపథ్యంలో ఈ సంప్రోక్షణ పూజలు, శాంతి హోమం నిర్వహిస్తున్నట్లు పండితులు తెలిపారు. బుధవారం ఉదయం శాంతి హోమం పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయన్నారు. తరువాత మంత్ర జలాన్ని దేవస్థానం ఆవరణలో వెదజల్లి శుద్ధి చేస్తారు. దేవస్థానంలో చాలాకాలంగా సంప్రోక్షణ పూజలు కాని, ప్రత్యేక యాగాలు, కోటి తులసి పూజలు కాని జరగకపోవడంతో మూడు నెలల నుంచి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పండితులు, అర్చకస్వాములు అభిప్రాయపడ్డారు. దీనిపై ఈ నెల 7న ‘సాక్షి’ దినపత్రికలో ‘అపశ్రుతులు అందుకేనా..?’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దానికి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు స్పందించి శాంతి పూజలు నిర్వహించాలని దేవస్థానం పండితులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పూజల్లో చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరబట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు దత్తాత్రేయ శర్మ, కంచిబట్ల సాయిరామ్, కల్యాణ బ్రహ్మ ఛామర్తి కన్నబాబు తదితర బృందం పాల్గొన్నారు. -
కళాశాల బస్సును ఢీకొన్న వ్యాన్
దేవరపల్లి: ప్రైవేటు కళాశాల బస్సును బొలెరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో బస్సులోని 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఇందులో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సు సుమారు 40 మంది విద్యార్థులతో సోమవారం ఉదయం కళాశాలకు వెళుతుండగా, కృష్ణంపాలెం వద్దకు వచ్చేసరికి విజయవాడ నుంచి రాజమహేంద్రవరానికి కిరాణా సరకులతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులకు స్వల్ప గాయాలు కాగా స్థానిక పీహెచ్సీలో వైద్యం చేసి ఇళ్లకు పంపించారు. వ్యాన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. 13 మంది విద్యార్థులకు గాయాలు -
మాగాంలో కొండముచ్చు దాడి
ఐదుగురికి తీవ్ర గాయాలు అయినవిల్లి: మాగం గ్రామంలో ఓ కొండముచ్చు రెండు రోజుల్లో ఐదుగురిపై దాడి చేసింది. ఆ గ్రామానికి చెందిన బి.సత్యనారాయణ, బొడపాటి రాజేష్, కొట్టల శ్రీనులు పొలం నుంచి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో కొండముచ్చు దాడి చేసి గాయపరిచింది. ఇలా మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిందని గ్రామస్తులు చెప్పారు. బాధితులు అమలాపురం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొండముచ్చు దాడి ఘటనపై అటవీ శాఖ అధికారులకు పంచాయతీ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా 15 మందిపై దాడి చేసినా అధికారులు స్పందించలేదని అంటున్నారు. ఇప్పటికై నా కొండముచ్చులను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
కమనీయం.. కడు రమణీయం
● వాడపల్లిలో శ్రీనివాసుని కల్యాణం ● కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు ● యోగనారసింహ అలంకరణలో శ్రీవారు విహారం కొత్తపేట: శ్రీవారు ఓరకంట చూడగా.. అమ్మవారు సిగ్గులమొగ్గగా మారగా.. జగద్రక్షకుడి కల్యాణం కన్నుల పండువగా జరగ్గా.. ఈ క్రతువును తిలకించిన భక్తజనం మురిసిపోగా.. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శ్రీనివాసుని కల్యాణం అట్టహాసంగా జరిగింది. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తజనం కల్యాణోత్సవాన్ని, వాహన సేవను తిలకించి పులకించింది. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు తదితర పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, అష్టకలశారాధన, మహాస్నపనం, ప్రధాన హోమాలు, నీరాజన మంత్రపుష్పం, దిగ్దేవతా బలిహరణ తదితర పూజలు నిర్వహించారు. కనుల వైకుంఠం.. శ్రీనివాసుని కల్యాణం లోక సంక్షేమార్థం శ్రీనివాసుని కల్యాణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ప్రదానం నుంచి తలంబ్రాల వరకూ వేదపండితుల వ్యాఖ్యానం నడుమ వైభవంగా నిర్వహించారు. సర్వాభరణ భూషితులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి తీసుకువచ్చి మండపంలో అలంకరించారు. దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు, కల్యాణ మాలలు తదితరాలు సమర్పించారు. నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి, మాంగల్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్రపుష్పం జరిపారు. సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు శ్రీవారు యోగనారసింహ అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి సింహ వాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా పండితులు సింహ వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. ఈ ఘట్టం భక్తులకు ఐశ్వర్యం, యశస్సు, శ్రీ, జ్ఞానం తదితర గుణాలను ప్రసాదిస్తారని అర్థం. సింహం ధైర్యం, వేగం, చురుకుదనానికి ప్రతీక. కాబట్టి స్వామివారు ఈ వాహనంపై ఊరేగుతూ పైలక్షణాలను అనుగ్రహిస్తారు. యోగనారసింహ రూపంలో శ్రీవారిని దర్శించిన వారికి మంచి జరుగుతుందని వివరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేంకటేశ్వర స్వామివారి వేషధారణలో ఒక కళాకారుడు ఆకట్టుకున్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం వసంతోత్సవం, అష్టదళ పాదపద్మారాధన నిర్వహిస్తారు. సాయంత్రం హనుమత్ మూలమంత్ర హవనం, అష్టోత్తర శత కలశారాధన, పంచశయ్యాధివాసం విశేష పూజలు, సేవలు, రాత్రి మలయప్ప అలంకరణతో గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. -
ఉప్పాడ తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల గృహాలు కోతకు గురై సముద్రంలో కలిసిపోయిన సీసీ రోడ్డు ఉప్పాడ తీరంలో ఇలా..
తీరంలో ‘అల’జడికోతకు గురవుతున్న మత్స్యకారుల ఇళ్లు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో సూరాడపేట, మాయాపట్న ం పాత మార్కెట్లోని మత్స్యకారుల ఇళ్లు కళ్ల ముందే కోతకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్లతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సైతం నెలకొరుగుతున్నాయి. రూ.లక్షలతో నిర్మించుకున్న ఇళ్లు రాకాసి అలల ధాటికి మొండి గోడలుగా మిగులుతుండటంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – కొత్తపల్లి -
షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
రాష్ట్ర స్థాయి అండర్–19 షటిల్ బాడ్మింటన్ పోటీలకు ఎంపికై న బాలికలు ఎంపికై న బాలురు పెదపూడి: క్రీడలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జి.మామిడాడ జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ అధ్యక్షుడు ద్వారంపూడి భాస్కరరెడ్డి, లయన్స్ క్లబ్ అడ్మిన్ మండ రాజారెడ్డి అన్నారు. జి.మామిడాడలోని జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ద్వారంపూడి దివాకర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండర్–19 బాలుర, బాలికల విభాగాల్లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడా జట్ల ఎంపికలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా ద్వారంపూడి భాస్కర్రెడ్డి, మండ రాజారెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పడాల గంగాధర్రెడ్డి మాట్లాడుతూ ఈ ఎంపికలు స్థానిక లయన్స్ క్లబ్, జీఆర్ఎస్ఏ ఫ్యామిలీ హెల్త్ క్లబ్ సహకారంతో నిర్వహించామన్నారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టు తరఫున పాల్గొంటారన్నారు. షటిల్ బ్యాడ్మింటన్ సెలక్షన్ కమిటీ సభ్యులు టీఎన్వీఆర్ మూర్తి, ఫిజికల్ డైరెక్టర్లు ద్వారంపూడి యువరాజారెడ్డి, నల్లమిల్లి అప్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సెప్టిక్ ట్యాంక్లో ఆవు నరకయాతన
బయటకు తీసి రక్షించిన స్థానికులు అమలాపురం టౌన్: సెప్టిక్ ట్యాంక్లో పడిన ఆవు నరకయాతన అనుభవించింది. నీరు, తిండి లేక బాగా నీరసించిపోయి కుంగిపోయింది. చివరకు స్థానికులు ఆ ఆవును సెప్టిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి రక్షించారు. అమలాపురం పట్టణం 22వ వార్డు పరిఽధి భోగరాజు వీధిలో తుప్పల్లో ఉన్న సెప్టిక్ ట్యాంక్లో ఆవు ప్రమాదవశాత్తూ పడిపోయింది. పచ్చిక మేత కోసం వెళ్లిన ఆవు ఆ ట్యాంక్లో పడి బయటకు రాలేక పోయింది. అమలాపురం సత్యసాయి సేవా సంస్థల డివిజన్ కో ఆర్డినేటర్, ఈఎన్టీ నిపుణులు డాక్టర్ జి.ప్రభాకర్ ఈ సమాచారాన్ని ఆ వార్డు కౌన్సిలర్ గొవ్వాల రాజేష్కు అందించారు. జేసీబీని రప్పించి ఆవును బయటకు తీయించారు. స్థానికుల సహాయంతో గంటకు పైగా శ్రమించి ఆవును బయటకు తీశారు. స్థానికులు గంగుమళ్ల శ్రీను, మేడిద రమేష్, రాజులపూడి భాస్కరరావు శ్రమించారు. బయటకు తీసిన ఆవు బాగా నీరసించిపోయి ఉండడంతో దానికి తాగునీరు, అరటి పండ్లు పెట్టి సేద తీర్చారు. -
పదికి చేరిన ‘బాణసంచా’ మృతులు
చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి కాకినాడ క్రైం/అనపర్తి: ఈ నెల 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న పెను విస్ఫోటం వల్ల మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన సమయంలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులు నలుగురిని కాకినాడకు తరలించారు. వారిలో ముగ్గురు కాకినాడ జీజీహెచ్లో చేరగా మరో వ్యక్తి ట్రస్ట్ ఆసుపత్రిలో చేరాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ట్రస్ట్ ఆసుపత్రిలో చేరిన పాట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వాసంశెట్టి విజయలక్ష్మి అనే మహిళ కాకినాడ జీజీహెచ్లో మృతి చెందింది. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ జీజీహెచ్ ఎస్ఐసీయూలో చికిత్స పొందుతున్న అనపర్తికి చెందిన చిట్టూరి యామిని(32) ఆదివారం తెల్లవారుజామున ఉదయం 3.19 గంటలకు ప్రాణాలొదిలింది. అదే ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పెదపూడి మండలం వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (21)కాలిపోయి మాంసపు ముద్దగా మారి తుది వరకు మృత్యువుతో పోరాడాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. ఆదివారం నాటి మరణాలతో విస్ఫోటంలో తీవ్ర గాయాలపాలైన వారిలో ఏ ఒక్కరూ ప్రాణాలతో మిగల్లేదు. అనపర్తిలో విషాద ఛాయలు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం అధికారులు వారి బంధువులకు అప్పగించారు. అనపర్తికి చెందిన యామిని మృతదేహం మధ్యాహ్నం తీసుకురావడంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చూసిన కనులదే భాగ్యం!
● వైభవంగా వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ● 3వ రోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు కొత్తపేట: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడోరోజు తిరువీధుల్లో శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. శ్రీవారు కోదండరాముని అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు ఈ వాహన సేవను వీక్షించారు. భక్తుల గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యహవాచనం, పంచామృత మండపారాధన, మహాస్నపనము, ప్రధాన హోమాలు, దుష్ట్రగహ పరిహారార్థం మహాసుదర్శన హోమం, తోమాల సేవ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి స్వస్తివచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహించారు. దేవస్థానం తరపున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు దంపతులు, ఉత్సవ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. హనుమద్వాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారు కోదండరామ అలంకరణలో హనుమద్వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి హనుమద్వాహనంపై స్వామివారిని అలంకరించగా మాడ వీధుల్లో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని కోదండరాముని అవతారంలో అలంకరించి, హనుమంత వాహనంపై ఊరేగించడం ఆనవాయితీ. ఈ ఘట్టం హనుమంతుడు తన భుజాలపై శ్రీరాముడిని మోసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. హనమద్వాహనంపై స్వామి వారి విహారం భగవంతుని పట్ల హనుమతునికి ఉన్న భక్తికి, నమ్మకానికి, అణకువకు ప్రతీక. ఈ వాహన సేవ మనిషిలోని భక్తి, సేవ ద్వారా దివ్యత్వానికి ఎలా చేరగలరో చూపిస్తుంది. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము బందోబస్తు నిర్వహించారు. నేటి కార్యక్రమాలు ఇవీ.. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగోరోజు సోమవారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం జగత్ కళ్యాణార్థం శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. సాయంత్రం విశేష పూజలు, సేవలు, రాత్రి యోగనారసింహ అలంకరణతో సింహ వాహన సేవ నిర్వహిస్తారు. -
మహిళా కబడ్డీ టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ప్రారంభం
పెదపూడి: జి.మామిడాడ డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఆదివారం ఆదికవి నన్నయ యూనివర్సిటీ మహిళల కబడ్డీ జట్టు టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ, కరస్పాండెంట్ డి.ఆర్.కే.రెడ్డి హాజరయ్యారు. డీఆర్కే రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డాక్టర్ సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి మాట్లాడుతూ రెండ్రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి యూనివర్సిటీ పరిధిలోని 11 కళాశాలలకు చెందిన 150 మంది క్రీడాకారులు పాల్గొంటారన్నారు. వీరిలో 14 మందిని విశ్వవిద్యాలయం జట్టుగా ఎంపిక చేస్తారన్నారు. ఈ జట్టు ఈ నెల 29 నుంచి నవంబర్ రెండు వరకు తమిళనాడు రాష్ట్రం సేలంలో వినాయక మిషన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల మహిళా కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటుందన్నారు. ఎంపికై న జట్టుకు పది రోజులపాటు డీఎల్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తారన్నారు. అబ్జర్వర్లుగా డాక్టర్ జీ.ప్రమీలరాణి, సభ్యులుగా వై.సుధారాణి, ఎం.వీరబాబు వ్యవహరించారు. టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.లోవరాజు, జి.మామిడాడ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు ఎం.రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
సత్యదీక్ష వస్త్రాలు, మాలల పంపిణీ
అన్నవరం: ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సత్యదీక్షలకు ప్రచారంతో బాటు సత్యదీక్షలు చేపట్టే స్వాములకు దీక్షా వస్త్రాలు, మాలలు, దీక్షా నియమాల పుస్తకాల పంపిణీని ఆదివారం ప్రారంభించారు. శనివారం సాక్షి దినపత్రికలో ‘సత్యదీక్షకు ప్రచారమేదీ? శీర్షికన వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ వార్తకు స్పందించిన దేవస్థానం అధికారులుచైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు చేతులమీదుగా ఆదివారం దీక్షా వస్త్రాల పంపిణీ ప్రారంభించారు. త్వరలో అల్లూరి జిల్లా అడ్డతీగలలో కూడా ఈ దీక్షా వస్త్రాలు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. సత్యదీక్షలపై సత్యరథంతో ప్రచారం చేయిస్తున్నట్టు తెలిపారు. -
రూ.ఐదు లక్షల దీపావళి సామాన్లు సీజ్
తుని రూరల్: ఎస్.అన్నవరంలో అనుమతి లేకుండా నిల్వ ఉంచిన రూ.ఐదు లక్షల విలువ చేసే దీపావళి సామాన్లను సీజ్ చేసినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి ఆదివారం తెలిపారు. ముందస్తు చర్యగా తనిఖీలు చేస్తుండగా ఎస్.అన్నవరంలో అక్రమంగా నిల్వ ఉంచిన దీపావళి సామాన్లను గుర్తించామన్నారు. సామాన్లను సీజ్ చేసి ఒకరిని అరెస్టు చేశామన్నారు. తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, వీఆర్వో కృష్ణ పాల్గొన్నారు. 7వ బ్యాచ్ శిక్షణ ప్రారంభం సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న 11 జిల్లాలోని మండల పరిషత్తు పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు నిర్వహిస్తున్న శిక్షణలో భాగంగా ఆదివారం 7వ బ్యాచ్ శిక్షణను గ్రామీణ తాగునీటి విభాగం ప్రభుత్వ సలహాదారు తోట ప్రభాకరరావు ప్రారంభించారు. తాగునీటిపై ఏఈఈలకు అవగాహన ఉండాలన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు, విశ్రాంత ఎస్ఈలు ఉమాశంకర్, శ్రీనివాసు, సురేష్, పెద్దాపురం డీఈఈ స్వామి, ఎఈఈ శ్రీరామ్, ఈటీసీ సీనియర్ ఫ్యాకల్టీ శేషుబాబు శిక్షణ నిర్వహించారు. రామాలయంలో నగల చోరీ రంగంపేట: మండల పరిధిలోని ముకుందవరంలో దేవుని గుడిలో నగలు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కాపుల రామాలయంలో దేవతల విగ్రహాలకు నాలుగు వెండి కిరీటాలు, అమ్మవారి బంగారు తాళిబొట్టు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వెండి కిరీటాల విలువ రూ.1.50 లక్షలు, బంగారం విలువ రూ. 1.20 లక్షలు ఉంటుందన్నారు. నగలు చోరీ జరిగినట్టు 9వ తేదీ గురువారం గుర్తించామన్నారు. 9వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. -
నేడు కొలువుదీరనున్న కొత్త ఉపాధ్యాయులు
లీప్ యాప్లో పోస్టింగ్ ఆర్డర్ల విడుదల రాయవరం: డీఎస్సీ–2025 ఉపాధ్యాయులు సోమవారం కొలువుదీరనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,241 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. 1,230 పోస్టులకు పోస్టింగ్ ఆర్డర్లు విడుదలయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 414 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారు. వీరిలో 28 మంది మున్సిపల్ యాజమాన్యాల్లో నియామకం పొందగా, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల్లో 386 మంది చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు 164 మంది ఉపాధ్యాయులను కేటాయించగా, వీరిలో 53 మంది మున్సిపల్ కార్పొరేషన్, 111 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో నియామకం పొందారు. కాకినాడ జిల్లాకు వివిధ కేటగిరీలకు చెందిన 474 మంది ఉపాధ్యాయులను నియమించారు. వీరిలో 124 మంది మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లోను, 350 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల్లో నియమితులయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 173 మంది ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో వివిధ క్యాటగిరీల కింద నియామకం పొందారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖాధికారి తరఫున నియామక ఉత్తర్వులు లీప్ యాప్లో జారీ చేశారు. ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో విధుల్లో చేరతారు.కేటాయించిన పోస్టుల వివరాలిలా.. కాకినాడ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 03 34 ఎస్ఏ హిందీ 02 26 ఎస్ఏ తెలుగు 04 16 ఎస్ఏ బీఎస్ 06 50 ఎస్ఏ గణితం 02 41 ఎస్ఏ పీఈ 0 66 ఎస్ఏ పీఎస్ 0 43 ఎస్ఏ ఎస్ఎస్ 5 50 ఎస్జీటీ 102 24 కోనసీమ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 18 105 ఎస్ఏ హిందీ 03 45 ఎస్ఏ తెలుగు 01 14 ఎస్ఏ బీఎస్ 0 91 ఎస్ఏ గణితం 01 06 ఎస్ఏ పీఈ 02 20 ఎస్ఏ పీఎస్ 0 31 ఎస్ఏ ఎస్ఎస్ 0 05 ఎస్జీటీ 18 105 తూర్పుగోదావరి జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 02 06 ఎస్ఏ హిందీ 0 06 ఎస్ఏ తెలుగు 01 02 ఎస్ఏ బీఎస్ 0 19 ఎస్ఏ గణితం 0 05 ఎస్ఏ పీఈ 0 42 ఎస్ఏ పీఎస్ 2 04 ఎస్ఏ ఎస్ఎస్ 6 17 ఎస్జీటీ 42 10 ఏఎస్ఆర్ జిల్లా కేటగిరీ పోస్టు మున్సిపల్ ప్రభుత్వ/ స్థానిక సంస్థలు ఎస్ఏ ఇంగ్లిషు 0 17 ఎస్ఏ హిందీ 0 01 ఎస్ఏ తెలుగు 0 04 ఎస్ఏ బీఎస్ 0 05 ఎస్ఏ గణితం 0 09 ఎస్ఏ పీఈ 0 09 ఎస్ఏ పీఎస్ 2 07 ఎస్ఏ ఎస్ఎస్ 6 02 ఎస్జీటీ 0 119 -
నకిలీ మద్యంపై నేడు నిరసనలు
వైఎస్సార్ సీపీ నేత కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన అన్ని నియోజకవర్గాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ‘సాక్షి’తో మాట్లాడారు. కూట మి నాయకుల అండదండలతో నకిలీ మద్యం తయారీ, బెల్టు షాపుల నిర్వహణ జోరందుకున్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా ఎకై ్సజ్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్ సీపీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరా రు. కాకినాడలో నాగమల్లితోట సమీపాన ఎకై ్సజ్ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద ఉద యం 10.30 గంటలకు శాంతియుతంగా నిరసన తెలియజేస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కన్నబాబు కోరారు. తలుపులమ్మ సన్నిధిలో రద్దీ తుని రూరల్: వివిధ జిల్లాల నుంచి వచ్చిన 10 వేల మంది భక్తులు ఆదివారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం వచ్చిందని వివరించారు. -
రవాణా.. ప్రైవేటు పథాన!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టూ వీలర్ లేదా నాలుగు చక్రాలు ఆపైన సామర్థ్యం కలిగిన ఏ వాహనమైన రోడ్డెక్కాలంటే ముందుగా రవాణా శాఖ అధి కారుల దర్శనం చేసుకోవాల్సిందే. లేకుంటే ఆ వాహ నం రోడ్డెక్కే అవకాశమే ఉండేది కాదు. డ్రైవింగ్ లైసె న్స్, వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు తదితర అన్ని సేవలూ పదేళ్ల కిందట రవాణా శాఖ కార్యాలయాల్లోనే అందేవి. కొన్నేళ్లుగా ఈ సేవలను ప్రభుత్వం క్రమంగా ప్రైవేటు పరం చేస్తోంది. దీంతో, ఒకప్పుడు వందలాది మంది వాహనదార్లతో కళకళలాడిన ఆర్టీఓ కార్యాలయాలు నేడు వెలవెలబోతున్నాయి. ‘ప్రైవేటు’కు అప్పగించారిలా... ● గతంలో ఎవరైనా వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి (ఆర్టీఏ) కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసేవారు. దీంతో, కొనుగోలుదార్లు అక్కడకు వెళ్లాల్సి వచ్చేది. ఈ ప్రక్రియను మొదటి దశలో ప్రైవేటు రంగానికి అప్పగించారు. వాహనం కొనుగోలు చేసిన వెంటనే డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేశారు. ● స్కూల్ బస్సులు, లారీలు, వ్యాన్లు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. రవాణా శాఖ విధుల్లో ఇది అత్యంత కీలకమైనది. కానీ, ఈ అధికారాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ల (ఎంవీఐ) నుంచి తప్పించి, ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణాధికారం కూడా రవాణా శాఖ అధికారులకు లేకుండా చేశారు. ● ఇక మిగిలింది డ్రైవింగ్ లెసెన్స్ల జారీ. దీనిని కూడా డ్రైవింగ్ స్కూళ్లకు అప్పగించి, వారి ద్వారానే శిక్షణ కూడా ఇచ్చి లైసెన్సులు జారీ చేయించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ● మరోవైపు గతంలో వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల పర్మిషన్లను కార్యాలయ పరిపాలనాధికారి స్థాయిలో మాన్యువల్గా చేసి జారీ చేసేవారు. ఈ సేవలను ఆన్లైన్ చేసి, అవసరమైన సమయానికి రుసుం చెల్లిస్తే కార్యాలయానికి వెళ్లకుండానే వీటిని జారీ చేస్తున్నారు. ● వాహనాల్లో సామర్థ్యానికి మించి సరకులు లోడ్ చేయడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పర్మిట్ల వంటి వాటిపై రవాణా అధికారులు గతంలో చెక్పోస్టుల వద్ద తనిఖీ చేసేవారు. ఇప్పుడు ఆ చెక్పోస్టులు ఎత్తివేశారు. ● ఇలా రవాణా శాఖ అధికారాలను ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేయడం లేదా కుదించడంతో అధికారులు కేవలం రోడ్లపై వాహనాలను ఆపి తనిఖీ చేసి, చలానాలు రాయడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు ఎంవీఐ స్థాయి అధికారులు డెప్యూటేషన్పై వేరే శాఖకు వెళ్లాలని యోచిస్తున్నారు. ‘పరివాహన్’పై అవగాహన శూన్యం కాగిత రహిత సేవలకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర రవాణా శాఖ 2019లో పరివాహన్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా రవాణా శాఖకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ వంటి 16 రకాల సేవలు పొందవచ్చు. కానీ, యాప్పై వాహన యజమానులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. ఈ యాప్ నిర్వహణ కూడా సక్రమంగా లేకపోవడంతో వాహన యజమానులు పర్మిట్లు, లైసెన్సుల కోసం ప్రైవేటు ఏజెన్సీలను ఆశ్రయించాల్సి వస్తోంది. రవాణా శాఖలో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష పాసైన తర్వాత వచ్చిన మెసేజ్ ఆధారంగా వాహన చోదకులు మీ–సేవ కేంద్రాలకు వెళ్లి ఆ పత్రాలు తీసుకోవాల్సి వస్తోంది. వీటిని ఉచితంగా ఇవ్వాల్సిన నిర్వాహకులు రూ.20 నుంచి రూ.50 వరకూ వసూలు చేస్తున్నారు. అదే కార్డు రూపంలో కావాలంటే రూ.100 నుంచి రూ.150 వరకూ చెల్లించాల్సి వస్తోంది. టూ వీలర్, ఫోర్ వీలర్ లైసెన్సులు, రెన్యువల్కు వచ్చే వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఆటో, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులకు వచ్చే వారిలో అత్యధికులు నిరక్షరాస్యులే ఉంటారు. వారిని రవాణా కార్యాలయానికి తీసుకువెళ్లి ఓటీపీ చెప్పిన అనంతరం దరఖాస్తు చేయించాల్సి వస్తోంది. కాగిత రహితంగా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి పూర్తి విరుద్ధంగా ఈ తతంగమంతా సాగుతోంది. ఏటీఎస్లు వద్దంటూ ఆందోళన వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు (ఏటీఎస్) ఏర్పాటు చేసింది. వాటి నిర్వాహకులు కావాల్సిన సర్టిఫికెట్ను బట్టి డబ్బులు డిమాండ్ ఆటో యూనియన్లు, రవాణా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పర్యవేక్షించే అధికారం రవాణా అధికారులకు లేకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులకు అడ్డు లేకుండా పోతుంది. జిల్లా మొత్తానికి కాకినాడలో ఒకే ఒక్క ఏటీఎస్ ఏర్పాటు చేయగా జిల్లా సరిహద్దుల్లో ఉన్న వారు తమ వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. దీనివలన వారు అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. కార్యాలయాల్లో రద్దీ తగ్గింది ఒకప్పుడు రవాణా శాఖ కార్యాలయాలకు ఉదయం నుంచి రాత్రి వరకూ నిత్యం వందలాది మంది వివిధ పనులపై వచ్చేవారు. క్రమేణా సేవలన్నీ ఆన్లైన్తో పాటు ప్రైవేటు పరం చేయడంతో కార్యాలయాల్లో రద్దీ తగ్గింది. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఫిట్నెస్ కేంద్రాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సేవలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు బండి కండిషన్ చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏటీఎస్లు ఏర్పాటు చేసి ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఇందులో మా పాత్రేమీ లేదు. – కె.శ్రీధర్, రవాణా శాఖ ఉప కమిషనర్ (డీటీసీ), కాకినాడఫ సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం ఫ డ్రైవింగ్ లైసెన్సు జారీని త్వరలో అప్పగించే చాన్స్ ఫ జనం లేక వెలవెలబోతున్న ఆర్టీఏ కార్యాలయాలు జిల్లాలో వాహనాల వివరాలు ప్రయాణికుల బస్సులు 489 స్కూల్ బస్సులు 1,494 గూడ్స్ క్యారియర్లు 13,546 మ్యాక్సీ క్యాబ్లు 481 మోటార్ క్యాబ్లు 1,730 ప్రైవేటు సర్వీస్ వెహికల్స్ 237 త్రీ వీలర్ (గూడ్స్) 3,484 ప్యాసింజర్ ఆటోలు 13,191 ట్రైలర్లు (కమర్షియల్) 3,491 కమర్షియల్ ట్రాక్టర్లు 912 -
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయంఅన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. ఏసీ బస్సులో 10 శాతం రాయితీఅమలాపురం రూరల్: ఏపీఎస్ ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్కు నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో ఈ నెల 31 వరకూ 10 శాతం రాయితీ ఇస్టున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్టీపీ రాఘవకుమార్ ఆది వారం తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్కు రూ.1,250, బీహెచ్ఈఎల్కు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం నుంచి రాత్రి 8.30 గంటలకు సర్వీస్ నంంబర్ 2572, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు సర్వీస్ నంబర్ 2573 బయలుదేరుతాయన్నారు. ఈ సర్వీస్ విజయవాడ నుంచి హైదరాబాద్కు నాన్స్టాప్గా నడుపుతున్నామని తెలిపారు. -
భక్తులతో రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● ఆలయ ప్రాకారంలో సత్యదేవుని ఊరేగింపు అన్నవరం: రత్నగిరిపై శనివారం భక్తులు పోటెత్తారు. రెండో శనివారం సెలవుదినం కావడం, శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెళ్లిళ్లు జరగడంతో ఆ బృందాలతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామిని దర్శించి పూజలు చేశారు. దీంతో రత్నగిరిపై పార్కింగ్కు స్ధలం లేక భక్తులు తమ వాహనాలను సత్యగిరికి మళ్లించారు. కాగా స్వామివారి సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టిక్కెట్పై అంతరాలయ దర్శనానికి రెండు గంటలు పట్టింది. వెలుపల నుంచే అంతరాలయ దర్శనం కల్పించడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామివారి వ్రతాలు ఐదు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా ఆలయానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరింది. ఎనిమిది వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తిరుచ్చి వాహనంలో ఊరేగింపు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం పది గంటలకు తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేయగా వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగింగించి తిరిగి ఉత్సవ మూర్తులను ఆలయానికి చేర్చారు. -
రత్నగిరికి కొబ్బరి సిరి!
● కొండపైనా, కిందా సుమారు 70 లక్షల కాయల విక్రయం ● రాష్ట్రంలో అధిక వినియోగం ఇక్కడే! ● కార్తికంలో రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ● ధర పెరుగుదలతో వ్యాపారుల ఆనందం అన్నవరం: కొబ్బరికాయ ధర కొండెక్కి కూర్చుంది. ఓ మాదిరి కొబ్బరికాయ రూ.40కి, కాస్త పెద్ద కాయ అయితే రూ.50 కి విక్రయిస్తున్నారు. ఈ పెరుగుదల వ్యాపారులకు సంతోషం కలిగిస్తున్నా భక్తులకు మాత్రం రుచించడం లేదు. గతేడాది కాయ ధర రూ.20 మాత్రమే ఉండగా, ఈ ఏడాది రెట్టింపైందని వారంటున్నారు. కాగా కొబ్బరి తోటలోనే వెయ్యి కాయ ధర రూ.30 వేలకు విక్రయిస్తున్నట్టు రైతులు చెప్తున్నారు. ఏటా 70 లక్షల కాయల విక్రయం రత్నగిరికి వచ్చే భక్తులు కొండదిగువన తొలి పావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద ఏటా దాదాపు 70 లక్షలు కొబ్బరికాయలు స్వామి వారికి కొడుతుంటారు. రాష్ట్రంలోని మరే ఇతర పుణ్యక్షేత్రంలో ఇంత వినియోగం లేదంటే అతిశయోక్తి కాదు. రానున్న కార్తికమాసంలో సుమారు పది లక్షలు కొబ్బరి కాయలు వినియోగిస్తారని, సుమారు రూ.20 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోంది. కార్తికంలో అధిక వినియోగం ఈ నెల 22వ తేదీ నుంచి మొదలయ్యే కార్తికమాసంలో స్వామివారి సన్నిధికి భక్తులు లక్షలాదిగా వస్తారు. స్వామి వ్రతాలు సుమారు 1.3 లక్షలు జరిగే అవకాశం ఉంటుంది. వ్రతానికి ఆరు కొబ్బరికాయలు వినియోగిస్తారు. ఆ లెక్కన సుమారు ఎనిమిది లక్షల కాయలు వినియోగిస్తారు. ఇవి కాకుండా స్వామివారి దర్శనానికి మరో రెండు లక్షలు కొబ్బరికాయలు, కొండ దిగువన తొలిపావంచా వద్ద, నమూనా ఆలయాల వద్ద భక్తులు కొబ్బరికాయలు కొడతారు. కార్తిక పౌర్ణిమనాడు నిర్వహించే గిరిప్రదక్షణలో సత్యరథం ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రదక్షణలో పాల్గొనడం ఆనవాయితీ కాబట్టి ఆ ఒక్క రోజే పది వేల కాయలు కొనుగోలు చేస్తారు. ఇన్ని కాయల విక్రయం వల్ల సుమారు రూ.మూడు కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుంది. 50కి పైగా కొబ్బరికాయల దుకాణాలుఅన్నవరంలో 50కి పైగా కొబ్బరికాయల దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు వంద కుటుంబాలు బతుకుతున్నారు. ఏటా లక్షలాది కాయలు విక్రయం ద్వారా రూ.కోట్లులో వ్యాపారం జరుగుతోంది. ఉత్పత్తి తగ్గి.. ధర పెరిగి.. కొబ్బరి ఉత్పత్తి కొంతకాలంగా తగ్గడం ధర పెరుగుదలకు కారణమని రైతులు అంటున్నారు. రాష్ట్రంలో నే కాకుండా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతి ఎక్కువగా ఉండడం వల్ల కూడా ధర పెరుగుదలకు మరో కారణమని వారంటున్నారు. దేవస్థానానికి రూ.ఆరు కోట్ల ఆదాయం అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల దుకాణాల వేలం, వ్రతాలు, ఆలయాలలో కొట్టిన కొబ్బరికాయల ముక్కలు ఏరుకోవడానికి నిర్వహించిన వేలం పాట ద్వారా ఏడాదికి రూ.ఆరు కోట్లు ఆదాయం వస్తోంది. కొబ్బరి ధర పెరగడంతో ముక్కలు తీసుకునే వేలం నెలకు రూ.19.05 లక్షలకు ఖరారైంది. అంటే ఏడాదికి రూ.2.28 కోట్ల ఆదాయం దీని ఒక్కదాని ద్వారానే వస్తోంది. -
అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి
మామిడికుదురు: బాల తిరుపతి అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవంగా ఆరాధించే స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రాతః కాలంలో ఆలయ అర్చకులు సుప్రభాత సేవ అనంతరం తొలి హారతి ఇచ్చారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీలక్ష్మీ నారాయణ హోమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,91,093 ఆదాయం సమకూరిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.95.541 విరాళాలుగా అందించారన్నారు. నాలుగు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. -
రూ.25 నుంచి రూ.35 మధ్య విక్రయానికి అనుమతించాలి
అన్నవరం దేవస్థానంలో కొబ్బరికాయల విక్రయానికి ఏడాదికి రూ.రెండు కోట్లకు వేలం పాడాం. దీనికి జీఎస్టీ అదనం. గతంలో కాయ ఒక్కంటికి రూ.25 రేటు మంజూరు చేశారు. ఐదు నెలలుగా కొబ్బరి తోటలోనే కాయ రూ.30కి కొంటున్నాం. వాటిలో చిన్నకాయలు కూడా ఉంటాయి. అవి చాలా తక్కువ ధర పలుకుతాయి. కొన్ని కాయలు రవాణాలో పాడైపోతాయి. అవన్నీ మాకు నష్టమే. తోట నుంచి దేవస్థానానికి తేవడానికి రవాణా, ఇతర ఖర్చులు మరో రూ.రెండు నుంచి రూ.మూడు అవుతాయి. అంటే కనీసం కొబ్బరి కాయ రూ.33 వరకు మాకే ఖర్చు అవుతుంది. కొన్నిసార్లు తమిళనాడు నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అక్కడ కూడా అదే రేటు ఉంటోంది. అంటే కొబ్బరికాయ రూ.35 కి అమ్మితే మాకు అసలు రేటు పడుతుంది. ఆ మేరకు రేటు మంజూరు చేయాలి. డీమార్ట్, స్మార్ట్బజార్ లోనే కొబ్బరి కాయ రేటు రూ.30 దాటి విక్రయిస్తున్నారు. అందువలన దేవస్థానం అధికారులు మార్కెట్ లో కూడా వాకబు చేసి కొబ్బరి కాయ రేటు రూ.35 కి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలి. – వీర్ల సూరిబాబు, కొబ్బరికాయల దుకాణం పాటదారుడు -
‘సత్యదీక్ష’కు ప్రచారమేదీ..?
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని సత్య దీక్ష అంటే గోదావరి జిల్లాల్లో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏటా ఈ దీక్షలను భక్తిశ్రద్ధలతో పాటించేవారు వందల్లో ఉంటారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూడా వందలాది మంది గిరిజనులు చేపడుతుంటారు. కార్తిక మాసానికి ముందు వచ్చే సత్యదేవుని జన్మనక్షత్రం ‘మఖ’ నాడు సత్య దీక్షలు ప్రారంభమవుతాయి. 27 రోజుల అనంతరం కార్తిక మాసంలో వచ్చే స్వామివారి జన్మనక్షత్రం రోజున ముగుస్తాయి. 27 రోజుల దీక్షలు చేయలేని వారి, మహిళల కోసం 18 రోజులు, తొమ్మిది రోజుల దీక్షలు కూడా ఉంటాయి. దీక్షల ముందు రోజు రాత్రి రత్నగిరిపై సత్యదేవుని పడిపూజ ఘనంగా నిర్వహిస్తారు. దీనిపై వివరంగా తెలియజేసేందుకు కనీసం నెల రోజుల ముందు నుంచి ప్రచారం చేసేవారు. ఈ ఏడాది 17వ తేదీ నుంచి దీక్షలు ప్రారంభం కానున్నా, ఇంత వరకూ ఎలాంటి ప్రచారం చేయకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రచార రథంతో జిల్లా అంతా సమాచారం చేరవేసేవారు. అదేవిధంగా గిరిజన భక్తులకు దీక్షా వస్త్రాలు, మాలలు ఉచితంగా అందజేసేవారు. ఇప్పుడూ అదే విధంగా చేస్తారా.. లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఇవీ నియమాలు : పసుపు వస్త్రాలు ధరించి సత్యదేవుని ఆలయం లేదా, మరే ఇతర ఆలయంలోనైనా అర్చకుడు లేదా గురుస్వామి లేదా తల్లి చేతుల మీదుగా తులసి మాల ధరించి సత్యదీక్ష చేపట్టవచ్చు. ఈ నియమాలన్నీ స్వామి అయ్యప్ప నియమాలలా ఉంటాయి. ప్రాతః కాలానికి ముందు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని సత్యదేవుని పూజ చేయడం, అదే విధంగా సూర్యాస్తమయం తరువాత స్వామివారికి పూజ చేయడం ప్రధానాంశాలు. స్వాములు ఒక పూట భోజనం, రాత్రి వేళ ఫలహారం, నేలపై నిద్ర, బ్రహ్మచర్యం పాటించడం, మాంసాహారం, ఉల్లిపాయ వంటివి తీసుకోకుండా ఉండడం చేయాలి. ఎవరినీ పరుషంగా మాట్లాడరాదు. స్వాములందరినీ సత్యదేవుని స్వరూపంగా భావించి గౌరవించాలి. మరో వారమే గడువు : సత్యదీక్షల ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు స్పందించి దీని గురించి ప్రచారం చేయాలని భక్తులు కోరుతున్నారు. అదే విధంగా ఏజెన్సీ గిరిజన భక్తులకు సత్యదీక్ష వస్త్రాలు, మాలలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఫ రత్నగిరిపై 17 నుంచి ప్రారంభం ఫ ఇంకా వివరాలు ప్రకటించని అధికారులు -
శిక్షణ ముగిసింది.. చేరికే మిగిలింది
ఫ కొత్త గురువులకు ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి ఫ 13న కొలువుల్లో చేరనున్న టీచర్లు రాయవరం: వారంతా ఎంతో శ్రమించారు.. పుస్తకాలతో కుస్తీ పట్టారు.. చివరికి కొలువులు సాధించారు.. తల్లిదండ్రుల కష్టాన్ని చూసి కొందరు.. గురువుల ప్రోత్సాహంతో ఇంకొందరు.. అన్నదమ్ముల ఆదర్శంతో మరికొందరు.. పుట్టిల్లు, మెట్టింటి వారి సహకారంతో.. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ.. పట్టుదలతో చదివి డీఎస్సీలో విజయం సాధించారు. కొత్తగా కొలువు సాధించిన ఉపాధ్యాయులకు ఇండక్షన్ ట్రైనింగ్ కూడా పూర్తయ్యింది. ఇక కొలువుల్లో చేరడమే తరువాయి. డీఎస్సీ–2025లోఎంపికై న నూతన ఉపాధ్యాయులకు ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు వెన్యూస్లో ఆయా సబ్జెక్టుల వారీగా ఇచ్చిన శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఇందులో భాగంగా వృత్తిలో పెంపొందించుకోవాల్సిన నైపుణ్యాలను వివరించారు. విద్యాశాఖ ప్రవేశపెట్టిన విధి విధానాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. నిపుణ్ భారత్ లక్ష్యాలు, విద్యా, బాలల హక్కులు, పాఠ్య ప్రణాళికలు తయారు చేయడం, మూల్యాంకన విధానాలు, లీప్ యాప్, డిజిటల్ టూల్స్, ఐఎఫ్పీలను ఉపయోగించడం, టెక్నాలజీ ద్వారా కొత్త బోధన విధానాలను పరిచయం చేయడం, వృత్తి నైపుణ్యం, నియమాలు పాటించడం, విద్యార్థులకు ఆదర్శంగా నిలవడం తదితర అంశాలపై వీరికి ఎనిమిది రోజుల శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 1,668 మంది ట్రైనింగ్ పొందాల్సి ఉండగా, 1,659 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో తొమ్మిది మంది హాజరు కాలేదు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 524 మందికి 524, సోషల్ సబ్జెక్టు 131 మందికి 130 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 210 మందికి 210, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించి 230 మందికి 227 మంది, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టుల నుంచి 244 మందికి 244 మంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 329 మందికి 324 మంది హాజరయ్యారు. బదిలీ ఉపాధ్యాయులకు మోక్షం అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో పలువురు కోరుకున్న స్థానాల్లో నేటికీ చేరలేదు. ఉపాధ్యాయుల కొరత ఉండడంతో బదిలీ జరిగిన ఉపాధ్యాయులనే వెనక్కి పంపించిన అధికారులు పాఠశాలల నిర్వహణ సాగిస్తున్నారు. కొత్త ఉపాధ్యాయుల చేరికతో బదిలీ అయ్యి రిలీవ్ కాలేని ఉపాధ్యాయుల సమస్యకు పరిష్కారం లభించనుంది. సమర్ధవంతంగా శిక్షణ ఇచ్చాం డీఎస్సీ–2025 ఉపాధ్యాయులకు నిర్వహించిన ఇండక్షన్ ట్రైనింగ్ను సమర్ధవంతంగా నిర్వహించాం. ఎక్కడా ఏ విధమైన లోటుపాట్లకు తావులేకుండా శిక్షణ ఇచ్చాం. నూతన ఉపాధ్యాయులు క్రమశిక్షణతో శిక్షణ తీసుకున్నారు. ఎస్ఆర్పీలు అన్ని అంశాలు వివరించారు. –డాక్టర్ షేక్ సలీం బాషా, డీఈఓ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వెబ్ ఆప్షన్లు పూర్తి కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెబ్ ఆప్షన్ల నమోదు పూర్తయ్యింది. పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయిన తర్వాత ఈ నెల 13న విధుల్లో చేరా ల్సి ఉంటుంది. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. –జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ నేడు పోస్టింగ్ ఆర్డర్లు శిక్షణలో భాగంగా గురు, శుక్రవారాల్లో ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మేనేజ్మెంట్ల వారీగా ఖాళీలను ప్రకటించారు. వెబ్ లింక్ ద్వారా ఉపాధ్యాయులు వారికి కావాల్సిన పోస్టులను ఎంపిక చేసుకున్నారు. శనివారం ఉపాధ్యాయులకు వారు ఎంచుకున్న స్థానాలను కేటాయిస్తూ పోస్టింగ్ ఆర్డర్లు జనరేట్ అయ్యే అవకాశముంది. వారికి కేటాయించిన స్థానాల ప్రకారం ఈ నెల 13న ఉపాధ్యాయ కొలువుల్లో చేరనున్నారు. -
నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నిబంధనలు పాటించని బాణసంచా తయారీ, విక్రయాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హెచ్చరించారు. అగ్నిమాపక అధికారులు, తహసీల్దార్లు, బాణసంచా తయారీదార్లతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటం నేపథ్యంలో తయారీ కేంద్రాల్లో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. దీపావళి పండగ సందర్భంలో జిల్లాలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాణసంచా తయారీ, విక్రయదారులు నిబంధనలు నూరు శాతం అమలు చేయాలని స్పష్టం చేశారు. అన్ని అనుమతులూ ఉన్నా ప్రమాదం జరిగితే బాణసంచా తయారీదారుపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. జిల్లాలో 29 బాణసంచా తయారీ కేంద్రాలు, 11 స్టోరేజ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. తయారీ కేంద్రాల్లో పని చేసే కార్మికులకు తప్పనిసరిగా ప్రమాద బీమా చేయించాలన్నారు. ఉల్లి బాంబుల తయారీ, అమ్మకాన్ని నిషేధించామని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, బాణసంచా తయారీ కేంద్రాల వద్ద నూరు శాతం ఫైర్ సేఫ్టీ కచ్చితంగా పాటించాలని అన్నారు. అన్నవరం దేవస్థానానికి రూ.30 లక్షల బస్సు అన్నవరం: సత్యదేవుని దేవస్థానానికి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.30 లక్షల విలువైన 32 సీట్లు కలిగిన బస్సును సమకూర్చింది. ఈ బస్సు తాళాలను ఎస్బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులుశెట్టి దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావుకు శుక్రవారం అందజేశారు. గతంలో కూడా ఎస్బీఐ రెండు బ్యాటరీ కార్లు, ఒక బస్సును దేవస్థానానికి అందజేసింది. కార్యక్ర మంలో ఎస్బీఐ అమరావతి సర్కిల్ సీజీఎం రాజేష్కుమార్ పటేల్, జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్, డీజీఎం పంకజ్ కుమార్ (రాజమహేంద్రవరం), సర్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంకజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల ముందే సిఫారసు లేఖలు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలోని సత్రాల్లో వసతి గదులు, దర్శనం, వ్రతాల కోసం ఐదు రోజుల ముందే సిఫారసు లేఖలు పంపించాల్సి ఉంటుంది. ఇకపై వాట్సాప్, ఫోన్ మెసేజ్లు అంగీకరించబోమని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిఫారసు లేఖలను కూడా పరిశీలించిన అనంతరం, అవి వాస్తవమని నిర్ధారించుకున్నాక మాత్రమే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. కార్తిక మాసాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై తిరిగి సమావేశంసామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ ఉదంతంలో హైకోర్టు తీర్పు సామర్లకోట: మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై తిరిగి సమావేశం నిర్వహించాలని హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. వివరాలివీ.. చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు 22 మంది సొంత పార్టీ సభ్యులు ఏప్రిల్ 2న సంతకాలు చేసి లేఖ ఇచ్చారు. ఈ మేరకు మే 15న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ సమావేశానికి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. అయితే, ఆ సమావేశానికి ముందే చైర్పర్సన్ కోర్టును ఆశ్రయించారు. మే 15న జరిగిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 25 మంది సభ్యులు ఓట్లు వేశారు. దాంతో, ఆ తీర్మానం నెగ్గింది. అయినప్పటికీ, కోర్టులో విచారణ జరుగుతున్న కారణంగా ప్రత్యేకాధికారి ఈ విషయాన్ని అప్పట్లో ప్రకటించలేదు. అవిశ్వాస తీర్మానంపై మరోసారి సమావేశం నిర్వహించాల్సిందిగా హైకోర్టు తీర్పు ఇచ్చిందని చైర్పర్సన్కు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించిన రెడ్నం సునీత విలేకరులకు తెలిపారు. -
పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ నిరసన
సఖినేటిపల్లి: అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నిర్వహణలో పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం హార్బర్లో స్థానిక మత్య్సకారులు నిరసన వ్యక్తం చేశారు. హార్బర్ నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు వనమాలి శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 40 ఏళ్లుగా ఇక్కడ జీవిస్తున్నామని, ఎటువంటి సమాచారం ఇవ్వకుండా హార్బర్ నిర్వహణను పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియ చేపట్టి కాంట్రాక్టర్కు అప్పగించాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. హార్బర్ నిర్మాణానికి ఫిషర్మెన్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ భూమి 20 ఎకరాలు ఇచ్చామని, గ్రామస్తులతో పాటు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారంతా కలసి ఇక్కడ మంచి వాతావరణంలో వేట కొనసాగిస్తున్నట్టు తెలిపారు. స్థానికేతరులు వేట విరామం సమయంలో స్వగ్రామాలకు వెళ్లి, అనంతరం తిరిగి వచ్చి తమతో పాటు ఉంటారని అన్నారు. కాగా పీపీపీ పద్ధతిలో కొంత మంది తమకు కావాల్సిన వారిని జీతాలకు పెట్టుకుని, తమను బయటకు గెంటేసే పద్ధతిలో ఉన్నారని, మత్స్య సంపదను ఇక్కడ అమ్మడానికి వీల్లేదంటూ అప్పుడే ఒత్తిళ్లు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యక్తుల నిర్వహణ వల్ల తమ బతుకు తెరువుకు ఇబ్బందిగా మారనుందని, తమకు పూర్తి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గ్రామస్తుడు పొన్నాల జయకృష్ణ మాట్లాడుతూ గ్రామస్తుల జీవనోపాధి మెరుగుపర్చేందుకు హార్బర్కు స్థలం ఇచ్చామని, గ్రామంలో ఎవరినీ సంప్రదించకుండా మధ్యస్థంగా పీపీపీ పద్ధతిలో టెండర్ ప్రక్రియకు చర్యలు తీసుకోవడం తగదని అన్నారు. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ..కూటమి ఉరి!
● జిల్లాలో 32 ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులు ● రూ.110 కోట్లకు పైగా బకాయి పెట్టిన సర్కారు ● వెంటనే చెల్లించాలని ఆస్పత్రుల డిమాండ్ ● స్పందించని ప్రభుత్వం ● నిలిచిన ఎన్టీఆర్ వైద్య సేవలు ● నిలిచిపోయిన సర్జరీలు 90 పైనే ● నిరాశతో తిరుగుముఖం పట్టిన రోగులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిరుపేదల ప్రాణ సంజీవని.. ఆరోగ్యశ్రీకి కూటమి సర్కారు ఉరి బిగిస్తున్నట్టే కనిపిస్తోంది. రెండు దశాబ్దాలుగా పేదలకు అధునాతన, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవ) సేవలపై సర్కారు పిడుగు పడేసింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను కూట మి ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో జిల్లాలోని దాదాపు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులన్నీ ఈ పథకం కింద వైద్య సేవలను నిలిపివేశాయి. ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిపివేసినట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవల కోసం ప్రతి రోజూ నెట్వర్క్ ఆస్పత్రులకు వెయ్యికి తక్కువ కాకుండా ఔట్ పేషెంట్లు (ఓపీ) వస్తారని అంచనా. ఒక్కో నెట్వర్క్ ఆస్పత్రిలో రోజుకు మూడు నాలుగు సర్జరీలు జరుగుతూంటాయని చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 32 నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ సమ్మె తొలి రోజైన శుక్రవారం 90కి పైగా సర్జరీలు నిలిచిపోయాయి. వీటిలో అత్యవసర శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆయా ఆస్పత్రుల వద్ద ఉచిత వైద్య సేవలను నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశతో ఇంటిముఖం పట్టారు. పేదల మనసు తెలిసిన డాక్టర్గా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ముందుగా గుర్తుకు వచ్చేది ఆరోగ్యశ్రీయే. ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత పరిపుష్టం చేశారు. రూ.లక్షలు ఖర్చయ్యే ఖరీదైన వైద్యాన్ని కూడా చిల్లిగవ్వ చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకం ద్వారా అందించి, సంపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేసేవారు. నిరుపేదల సంజీవనిగా నిలిచిన ఈ పథకం పేరు మార్చేసిన కూటమి సర్కారు.. ఇప్పుడు దీనికి ఏకంగా ఉరి బిగించే దిశగా అడుగులు వేస్తోంది. పదేపదే విన్నవించినా.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయి ఏడాది పైనే అవుతోంది. అప్పటి నుంచీ వీటి చెల్లింపులో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లా వ్యాప్తంగానే రూ.110 కోట్లు పైగా ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉంది. గుండె, గుండె సంబంధిత, గొంతు, చెవి, గ్యాస్ట్రో, సర్జరీ, మూత్రపిండ తదితర శస్త్రచికిత్సలకు రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయి. ఇవి గుదిబండగా మారి, ఆస్పత్రుల నిర్వహణ ఇబ్బందికరంగా తయారవడంతో ఈ నేపథ్యంలో ఆరేడు నెలలుగా నెట్వర్క్ ఆస్పత్రులు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాయి. బకాయిల విడుదలపై సానుకూలంగా స్పందించకుంటే వైద్య సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ఇప్పటికే రెండు పర్యాయాలు విన్నవించాయి. గత ఏప్రిల్ నెలలో ఒకసారి సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం చంద్రబాబు బిల్లులు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో నమ్మి సమ్మె విరమించారు. తీరా చూస్తే చంద్రబాబు ఆ హామీని కూడా షరా మామూలుగానే గాలిలో కలిపేశారని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో మండిపడుతున్న నెట్వర్క్ ఆస్పత్రులు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు ఎన్టీ ఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. ఈ మేరకు కాకినాడ నగరంలోని దాదాపు అన్ని నెట్వర్క్ ఆస్పత్రుల వద్ద సేవలు బంద్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. దీంతో, ప్రభుత్వ ఆస్పత్రులు మినహా మిగిలిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ, డయగ్నోస్టిక్స్, ఇన్వెస్టిగేషన్ సేవలకు పూర్తిగా బ్రేక్ పడింది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదలు ఖరీదైన వైద్యం అందుకోలేక నానా అగచాట్లూ పడుతున్నారు. -
అదిగో.. అల్లదిగో..
10ఆర్వీపీ63: ఫ వాడపల్లిలో ఆధ్యాత్మిక పరిమళాలు ఫ బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫ తొలిరోజు పరావాసుదేవ అలంకరణలో స్వామివారు కొత్తపేట: కోనసీమ వెంకన్నగా.. ఏడు వారాల స్వామిగా.. పూజలందుకుంటున్న బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయం భూగా వేంచేసిన శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ బహుళ చవితి శుక్రవారం ఆరంభమయ్యాయి. తొలిరోజు ఆ స్వామిని చూసిన భక్తజనం మురిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని కొలిచారు. శేష వాహనంపై శ్రీవారి విహార ఘట్టం కన్నుల వైకుంఠంగా సాగింది. గోవింద నామస్మరణతో వాడపల్లి క్షేత్రం మార్మోగింది. ఆలయ ప్రాంగణం, మాడ వీధులు రంగు రంగుల పూలమాలలు, విద్యుత్ అలంకరణలతో కనువిందు చేసింది. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చక బృందం, వివిధ ప్రాంతాల నుంచి వేద పండితులు ఉదయం నుంచి రాత్రి వరకూ నిరంతరాయంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు, వాహన సేవ, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారు జామునే సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, అనంతరం తీర్థ బిందెలతో గోదావరి జలాలను తీసుకువచ్చి అభిషేకించారు. గోత్ర నామాలతో పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 9.35 గంటల నుంచి స్వామివారికి స్వస్తి వచనం, పుణ్యహ వాచనం, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠాపన, విశేషార్చన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్యుంగ్రహణ, శాలా విహరణ, అంకురార్పణ, వాస్తుపూజ, వాస్తుహోమం, ధ్వజారోహణ, బలిహరణ, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున ఈఓ చక్రధరరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. శేషవాహనంపై శ్రీవారి విహారం బ్రహ్మోత్సవాలు ప్రారంభ వేళ స్వామివారు పరావాసుదేవగా భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7.30 గంటలకు శేషవాహనంపై స్వామివారిని అలంకరించగా, మాడ వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్శంగా పండితులు శేష వాహనంపై శ్రీవారు విహార ఘట్టం విశిష్టతను వివరించారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణ స్వామి శేష పాన్పుపై ఉంటారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో ప్రథమ వాహనం శేష వాహనం అని, ఈ వాహనంపై స్వామివారిని దర్శిస్తే వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దర్శించిన ఫలితం లభిస్తుందని వివరించారు. ఆ విధంగా స్వామివారిని దర్శించిన భక్తులు ఆనంద డోలికల్లో తేలియాడారు. తొలిరోజు కార్యక్రమాల్లో ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని ఈఓ చక్రధరరావు సత్కరించి, స్వామివారి చిత్రపటాలను అందజేశారు. పలువురు ప్రముఖులు, నాయకులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఎస్సై రాము పోలీసు బందోబస్తు నిర్వహించారు. వాడపల్లి మాడ వీధుల్లో శేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారు నేటి కార్యక్రమాలు ఇలా.. వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం బ్రహ్మోత్సవాల నిత్య పూజలు, హోమాలు, అభిషేకాలతో పాటు ఉదయం మహా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ, రాత్రి సరస్వతి అలంకరణతో హంస వాహనసేవ ఉంటుంది. -
ఇంటర్ పరీక్ష ఫీజుకు గడువు పెంపు
అమలాపురం టౌన్: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు ముందుగా ప్రకటించిన ఈ నెల 10వ తేదీ కాకుండా, ఆ గడువును ఈ నెల 22 వరకూ ఇంటర్మీడియెట్ విద్యా మండలి పెంచిందని డీఐఈఓ వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ విషయాన్ని అమలాపురంలో శుక్రవారం ఆయన తెలిపారు. గడవు తర్వాత ఈ నెల 30వ తేదీ వరకూ రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. మ్యాఽథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ : అమలాపురం ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యలో ప్రవేశపెట్టిన సంస్కరణల నిమిత్తం మ్యాథమెటిక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాల్గొని బోధనా అంశాలపై చర్చించారు. డీఐఈఓ సోమశేఖరరావు హాజరై అధ్యాపకులకు పలు అంశాలు వివరించారు. -
వైద్య కళాశాలలు ప్రజల ఆస్తి
● వాటి నిర్వీర్యానికి కూటమి కుట్రలు ● ప్రజా చైతన్యంతో చలో నర్సీపట్నం విజయవంతం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని రూరల్: గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేంద్రంతో పోరాడి తీసుకువచ్చిన 17 వైద్య కళాశాలలు రాష్ట్ర ప్రజల ఆస్తి అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యార్థులకు, ప్రజలకు మేలు చేసేందుకు ఒక్కో వైద్య కళాశాలలకు 50 ఎకరాల చొప్పున భూ సేకరణ జరిపిందని చెప్పారు. ఈ కళాశాలలు పూర్తయితే 630 పడకల ప్రభుత్వాస్పత్రులు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇప్పటికే ఐదు కళాశాలల్లో రెండేళ్లుగా తరగతులు నిర్వహిస్తున్నారని, తరగతుల నిర్వహణకు మరో రెండు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. పది కళాశాలల నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగా.. వీటిని తన తాబేదార్లకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానంలో కంకణం కట్టుకుందన్నారు. 17 వైద్య కళాశాలల్లో వైద్య విద్యతో పాటు కోట్లాది మందికి వైద్య సేవలు అందుతాయని చెప్పారు. అటువంటి మహత్తరమైన వైద్య కళాశాలలను నిర్వీర్యం చేసేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని మండిపడ్డారు. ఏ విద్యార్థి అయినా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సీట్లు కావాలనుకుంటారని అన్నారు. విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్ కాలేజీకి అనుబంధంగా కేజీహెచ్ ఉందన్నారు. గీతం, నారాయణ వంటి ప్రైవేట్ కాలేజీలున్నప్పటికీ ఆంధ్రా, రంగరాయ మెడికల్ కాలేజీల్లో సీట్ల కోసమే విద్యార్థులు పోటీ పడతారని చెప్పారు. అందుకే జగన్ పర్యటన స్పీకర్ హోదాలో ఉన్న అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ లేదని, జీఓ లేదని అంటూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించారని, ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్కడ పర్యటించి, కాలేజీ నిర్మాణాలను చూపించారని రాజా అన్నారు. అడ్డంకులు, నిర్బంధాలను దాటుకుని మరీ లక్షలాదిగా వచ్చిన ప్రజలు జగన్తో పాటు కాలేజీ నిర్మాణాలను కళ్లారా చూశారని చెప్పారు. తిమ్మిని బమ్మి చేసేందుకు చంద్రబాబుతో పాటు కొన్ని పత్రికలు ఆరాటపడుతున్నాయని దుయ్యబట్టారు. వైద్య సేవల్లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సాక్షాత్తూ రాజోలు ఎమ్మెల్యేనే అసంతృప్తి వ్యక్తం చేశారన్నారు. రక్షిత నీరు అందించని సర్కారు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాడు–నేడుతో అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకూ ఆర్వో వాటర్ అందిస్తే.. ఈ ప్రభుత్వం వాటిని అటకెక్కిస్తోందని రాజా మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో ఈ ఆర్వో ప్లాంట్ల నిర్వహణను గాలికొదిలేసిందన్నారు. ఫలితంగానే కలుషిత నీరు తాగి విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. గుంటూరులోనూ ఇదే పరిస్థితి నెలకొన్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షిత నీరు అందించలేని ప్రభుత్వం కర్ణాటకకు తాగునీరు అందిస్తామనడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. కల్తీ మద్యం తయారీ, విక్రయాలతో రూ.వేల కోట్లు కొల్లగొడుతున్నారన్నారు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల్లా అధికారులు కూడా మాజీ సీఎం జగన్ను ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడటం సరికాదని, భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని సెల్యూట్ చేస్తారని ప్రశ్నించారు. 2029లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని చెప్పారు. పోలీసులు, అధికార పక్షం జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకు తెగించి మరీ ప్రజలు తరలివచ్చి చలో నర్సీపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేశారని రాజా అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయి మేరీ అవినాష్, పార్టీ తుని రూరల్, పట్టణ, తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు దుంగల నాగేశ్వరరావు, అన్నవరం శ్రీను, బత్తుల వీరబాబు, చింతకాయల చినబాబు, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అన్నంరెడ్డి వీరరాఘవులు, ఆత్మ మాజీ చైర్మన్ చోడ్రాజు రాంబాబురాజు, సీనియర్ నాయకులు గొర్లి రామచంద్రరావు, చింతల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ మద్యంపై మహిళల పోరు
● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం వద్ద నిరసన ● సమయం ఇచ్చి డుమ్మా కొట్టిన అధికారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: నకిలీ మద్యంపై మహిళలు రోడ్డెక్కారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా చంద్రబాబు సర్కారు చెవికెక్కడం లేదంటూ వైఎస్పార్ సీపీ మహిళా విభాగం ఆధ్వర్యాన శుక్రవారం కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ నాయకత్వంలో జిల్లా నలుమూలల నుంచీ తరలి వచ్చిన పార్టీ మహిళా నేతలు, మహిళలు, ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. స్థానిక పైడా వీధిలోని పార్టీ కార్యాలయం నుంచి ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వంలో చలనం లేదని, మద్యం దుకాణాలు వేళాపాళా లేకుండా నడుపుతున్నారని, విచ్చలవిడి మద్యం అమ్మకాలను నియంత్రించాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను పూర్తిగా నిర్మూలించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నకిలీ మద్యం విక్రయాలతో పేదలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించకుండా కేవలం ఆదాయమే పరమావధిగా పని చేస్తున్న కూటమి సర్కార్పై మహిళా నేతలు నిప్పులు చెరిగారు. నిరసన అనంతరం ఉదయం 11 గంటలకు ఎకై ్సజ్ డీసీకి వినతిపత్రం అందజేసేందుకు ముందుగానే అనుమతి తీసుకున్నప్పటికీ ఆయన కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇచ్చి కూడా వెళ్లిపోవడమేమిటని మండిపడ్డారు. ఇతర అధికారులకు ఇవ్వాలని ప్రయత్నించినా వారు కూడా లేకపోవడంతో అందుబాటులో ఉన్న మహిళా ఎస్సైకి వినతిపత్రం అందజేశారు. విచ్చలవిడిగా నకిలీ మద్యం ఈ సందర్భంగా మహిళలనుద్దేశించి వంగా గీత మాట్లాడుతూ, రాష్ట్రంలో విచ్చలవిడిగా సరఫరా అవుతున్న నకిలీ మద్యంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ధ్వజమెత్తారు. జిల్లాలో బెల్టు షాపులు లెక్కే లేకుండా ఏర్పాటయ్యాయని, వీటిని దొడ్డిదారిన ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. మద్యం విక్రయాలు ఎనీ టైమ్ మద్యం (ఏటీఎం) మాదిరిగా తయారయ్యాయని ఆక్షేపించారు. రాష్ట్ర చరిత్రలోనే మద్యం అమ్మకాల్లో మునుపెన్నడూ ఇటువంటి పరిస్థితి చూడలేదన్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మద్యం యథేచ్ఛగా దొరుకుతూండటంతో పేద కుటుంబాలు గుల్లయిపోతున్నాయని, విచ్చలవిడి మద్యం అమ్మకాలు, కల్తీ మద్యంతో యువత మద్యానికి బానిసైపోయి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని గీత ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగులూరి శివకుమారి, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి దీప్తి కుమార్, బెహరా రాజేశ్వరి, అల్లవరపు నాగమల్లేశ్వరి, పి.సరోజ, మాకినీడి శేషుకుమారి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
కాకినాడ రూరల్: బృహత్తర బాధ్యతగా, తరతరాలకు ఉపయోగపడేలా రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు, బోధనాస్పత్రు ల నిర్మాణాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటు కు అప్పగించాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్యని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ వైద్య నగర్లోని తన నివాసంలో శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 12 మెడికల్ కాలేజీలుంటే జగన్మోహన్రెడ్డి 17 కాలేజీల నిర్మాణానికి సంకల్పించారన్నారు. వీటిల్లో 5 కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభించగా, మరో రెండు అడ్మిషన్లకు సిద్ధంగా, 10 కళాశాలు నిర్మాణంలో ఉన్నాయని చెప్పా రు. ఈలోగా ప్రభుత్వం మారడంతో కార్పొరేట్ల పక్షాన నిలిచే చంద్రబాబు వీటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించారన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పేదల పక్షాన నిలిచే జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ముందుకు వెళ్తున్నారన్నా రు. ఇందులో భాగంగా ఉద్యమ నిర్మాణం చేపడుతూ, కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారని చెప్పారు. జగన్ పర్యటనకు ప్రభం‘జనం’ :పోలీసుల ద్వారా ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా నర్సీపట్నం వద్ద మెడికల్ కాలేజీ సందర్శనకు గురువారం వచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనకు ప్రభంజనాన్ని తలపించేలా అన్ని వర్గాల ప్రజలూ తరలివచ్చారని కన్నబాబు అన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. జగన్ పర్యటనలో దారి పొడవునా ప్రజల నుంచి వచ్చిన వినతులు చూస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. స్టీల్ప్లాంటును దశల వారీగా మూసివేసే కార్యక్రమం చేపడుతున్నారని, బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు వద్దంటూ మత్స్యకారులు నిరసనలు తెలియజేస్తుంటే అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. చోడవరం సుగర్ ఫ్యాక్టరీ రైతులు నిరసన తెలియజేస్తున్నారన్నారు. కేజీహెచ్లో 65 మంది గిరిజన విద్యార్థులు కామెర్లతో చికిత్స పొందుతున్నారని, పార్వతీపురం ఆస్పత్రిలో 80 మంది.. ఇలా 600 మంది గిరిజన గురుకుల పాఠశాలల విద్యార్థుల్లో 200 మంది వరకూ అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మలమూత్రాలు కలసిన నీరు తాగాల్సిన పరిస్థితి హాస్టల్ విద్యార్థులకు ఉందంటే ఎవరు తలదించుకోవాలని చంద్రబాబును కన్నబాబు ప్రశ్నించారు. ప్రైవేట్కు దోచిపెట్టేందుకే.. : నర్సీపట్నంలో 52 ఎకరాల భూమిని కేటాయించి వైద్య కళాశాల కడుతూంటే ప్రైవేటుకు ఇవ్వాలని ఎలా అనుకుంటున్నారని, పాడేరులో మెడికల్ కాలేజీ కట్టాలనే ఆలోచన 15 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకు ఎందుకు రాలేదని కన్నబాబు నిలదీశారు. ప్రైవేటుకు దోచిపెట్టే కార్యక్రమం తప్ప చంద్రబాబు చేసిందేముందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలన్నారు. కేజీహెచ్ వద్ద విశాఖ పోలీస్ కమిషనర్ జగన్ పట్ల అనుచితంగా మాట్లాడినట్టు జర్నలిస్టులు చెప్పారని, ఇది సముచితమేనా అని ప్రశ్నించారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదని, మాజీ సీఎం అని, 2029లో కాబోయే సీఎం అనే విషయం గుర్తు పెట్టుకోవాలని అధికారులకు సూచించారు. ఎవరిని సంతోషపెట్టడానికి అధికారులు పని చేస్తున్నారని కన్నబాబు ప్రశ్నించారు. ఫ ప్రభుత్వ తీరును నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమం ఫ వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు -
అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి
రామచంద్రపురం: రాయవరంలో శ్రీగణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ. 50 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి, ఆదుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానికంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకుడు వెంటపల్లి భీమశంకరం తదితరులు మాట్లాడారు. ఆ ఫైర్ వర్క్స్లో సుమారు 50 మంది కార్మికులు పనిచేస్తుండగా, ఆ రోజు 30 మంది మాత్రమే వచ్చారని, భోజన విరామ సమయంలో ప్రమాదం సంభవించడంతో మరణాల సంఖ్య కొంత తగ్గిందన్నారు. అయినప్పటికీ, నీటి వనరులు అందుబాటులో లేకపోవడం, అగ్నిమాపక చర్యల్లో నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం తీవ్రరూపం దాల్చిందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రెవెన్యూ, అగ్నిమాపక, పరిశ్రమల, కార్మిక శాఖలు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత సంఘటన స్థలాన్ని సందర్శించినా ఇప్పటి వరకూ ఎటువంటి నష్ట పరిహారం ప్రకటించకపోవడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాయవరం మండలంలోని అన్ని ఫైర్ వర్క్స్ యూనిట్లను తక్షణం తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై సమీక్ష చేపట్టాలని అధికారులను కోరారు. -
బోడసకుర్రులో బాణసంచా సామగ్రి స్వాధీనం
అల్లవరం: బోడసకుర్రు పోస్టాఫీస్ సమీపంలో నిల్వ ఉంచిన మందుగుండు సామగ్రిని అల్లవరం పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై సంపత్కుమార్ ఆధ్వర్యంలో అల్లవరం పోలీసులు దాడి చేసి బాణసంచాను గుర్తించారు. బోడసకుర్రు పోస్టాఫీస్ను ఆనుకుని కిరాణా వ్యాపారం చేస్తున్న జక్కా కామేశ్వరరావు ఇంటి వెనుక బాత్రూమ్లో నిల్వ చేసిన బాణసంచాను సీఐ ప్రశాంత్కుమార్, తహసీల్దార్ వీవీఎల్ నరసింహారావు సమక్షంలో మూటలుగా కట్టి ట్రాక్టర్లోకి లోడ్ చేసి నిశిద్ధ ప్రదేశానికి తరలించారు. ఈ బాణసంచా విలువ రూ.1.94 లక్షలు ఉంటుందని సీఐ ప్రశాంత్కుమార్ తెలిపారు. అనుమతులు లేకుండా బాణసంచా నిల్వ చేసినా, తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
మందుపాతరలతో సహజీవనం
సాక్షి, అమలాపురం: మందుగుండు సామగ్రి తయారు చేసే బాణసంచా తయారీ కేంద్రాలలో పని చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. మిగిలిన చోట్ల ఏమోకాని.. బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడం అంటే మృత్యువుతో నిత్యం చెలగాటం ఆడడమే. అది తెలిసి కూడా కార్మికులు, కూలీలు పొట్ట కూటికోసం వీటిలో పనిచేసేందుకు వెళుతున్నారు. మందుపాతర మీద కూర్చుని జీవన పోరాటం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాలు జరిగితే మృత్యువు బారిన పడుతున్నారు. గాయాలతో బయట పడినా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అనుమతి లేని కేంద్రాలే అధికం కోనసీమ జిల్లా రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో బుధవారం పెను విస్ఫోటం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలై ప్రాణాలతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులంతా అతి పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. జీవనోపాధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ వీరు ఇక్కడ పని చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు అధికారికంగా 18 వరకు ఉండగా, ఒక స్టోరేజ్ కేంద్రం ఉంది. కాని వాస్తవంగా అనుమతి లేని కేంద్రాలు చాలా ఉన్నాయి. అనుమతి ఉన్న కేంద్రాలలో మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని తయారీ కేంద్రాలు, అమ్మకం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటీవల అయినవిల్లి మండలం విలసలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుల రక్షణ పట్టని అధికారులు » నిబంధనల ప్రకారం అన్ని రక్షణ చర్యలు తీసుకుంటేనే అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో పనిచేస్తున్న కార్మికుల రక్షణ విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు.»బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులు. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. వీరెవ్వరూ వృత్తి నైపుణ్యం ఉన్నవారు కాదు. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే రా మెటీరియల్పై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. » బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలిపోయే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన లేకుండా పోతోంది. » పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. పౌడర్గా తగు పాళ్లలో కలిపి క్రేకర్స్ తయారు చేయాల్సి ఉంది. » బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అన్ స్కిల్డ్ లేబర్తో నూరిస్తున్నారు. అదే పేలుళ్లకు దారి తీస్తోంది. »బాణసంచా తయారు చేసే ప్రతి కార్మికునికి చేతులకి గ్లౌజ్లుండాలి. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతోపాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. తయారు చేస్తున్న బాణసంచా, దానికి వాడే రసాయనాలు, వాటిని ఎలా కలపాలి అనే దానిపై కార్మికుడికి అవగాహన కల్పించాల్సి ఉంది. కాని ఎక్కడా ఇటువంటివి పాటించడం లేదు. » బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా వారి శరీరాలు మారిపోతున్నాయి. జిల్లాలో ఇంచుమించు ప్రతి బాణసంచా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. » రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతీ కార్మికుని ముఖానికి మాస్క్ తప్పనిసరి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో పాటు చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడుతున్నారు. » దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు అప్పటికప్పుడు సాధారణ కూలీలను కూడా పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరికి తయారు చేసే అనుభవం లేకపోవడం వల్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. » చిన్న పిల్లలను, మహిళలను మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు అనుమతించ కూడదు. కానీ రాయవరంలో జరిగిన పేలుడులో మృతి చెందినవారిలో ఐదుగురు మహిళలే. » ఇంత జరుగుతున్నా వీటిపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, వైద్య శాఖలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. వారి నిర్లక్ష్యమే కార్మికుల పాలిట శాపంగా మారింది.తనిఖీ చేసిన కేంద్రంలోనే భారీ ప్రమాదంతయారీ కేంద్రాల వద్ద తీసుకుంటున్న రక్షణ చర్యలు, అధికారుల తనిఖీలు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఉండాల్సిన స్థాయిలో వాటర్ ట్యాంకులు ఉన్నాయా? ఇసుక నిల్వలు ఉంచారా? తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఏర్పాటు చేశారా లేదా? మంటలను ఆర్పే కార్బన్ డయాక్సైడ్ కిట్టు ఉందా లేదా చూసి లైసెన్సులు రెన్యువల్ చేయడం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తున్నారు. రాయవరంలో ప్రమాదానికి గురైన బాణసంచా తయారీ కేంద్రాన్ని కూడా అధికారులు ఇటీవల తనిఖీ చేసి రెన్యువల్ చేశారు. అటువంటి చోటే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. రసాయనాల పట్ల అవగాహన ఉండాలిబాణసంచా తయారు చేసేందుకు వాడే రసాయనాలపై ప్రతి కార్మికునికి, కూలీలకు అవగాహన ఉండాలి. ఇందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రసాయనాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇవన్నీ మండే కారకాలే. కార్మికుల ఒంటి నిండా రసాయనాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చిన్న నిప్పురవ్వ రాజుకున్నా పేలుడు సంభవించడం, కార్మికుల చనిపోవడం పరిపాటిగా మారింది. – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, గోదావరి కాలుష్యంపై అధ్యయనకర్త, అమలాపురం -
‘అప్పుడు రూ. 99లకే ‘‘క్వార్టర్’’ అన్నారు.. ఇప్పుడు 99 పైసలకే ఎకరం భూమి’
కాకినాడ జిల్లా: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చెయ్యాలనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈరోజు( శుక్రవారం, అక్టోబర్ 10) కాకినాడలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమ పోస్టర్ను కురసాల కన్నబాబు ఆవిష్కరించారు. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ గత ప్రభుత్వంలో 17 కళాశాలల్ని తీసుకువచ్చి ..ఐదు కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్ది. పేదల పక్షాన జగన్... కార్పొరేట్ సంస్ధల పక్షాన చంద్రబాబు ఉంటారని ప్రజలకు తెలుసు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాల నుండి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుకూలంగా మద్దత్తు కూడకట్టాలి నిర్ణయించారు. రచ్చ బండ కార్యక్రమం ద్వారా ప్రజలకు అన్ని విషయాలు తెలియజేస్తాం. మేధావులు,తటస్ధుల వద్దకు వెళ్ళి మెడికల్ కళాశాలల్ని అమ్మేయ్యడం ఎంత దుర్మార్గమో చెబుతాం. నిన్న జగన్ పర్యాటనలో ప్రభుత్వ తీరు బ్రిటిష్ పాలనను మించిపోయింది. ఎన్నో రకాలుగా జగన్ పర్యటనను ఫెయిల్ చేయ్యలని చూశారు. ఎప్పుడు లేనంతగా జగన్ కోసం జనం ప్రభంజనంలా తరలి వచ్చారు. మలమూత్రాలు కలిసిన నీళ్ళు తాగాల్సిన దుస్ధితి గిరిజన హస్టల్స్ లో ఉండడం దుర్మార్గం. గిరిజన విద్యార్ధులకు త్రాగునీరు అందించలేని చంద్రబాబు విజన్ 2027 అంటున్నాడు.* క్వాంటమ్ వ్యాలీ అంటూ కాలయాపన చేస్తున్నాడు.పాడేరు లో ఒక మెడికల్ కళాశాల నిర్మించాలనే ఆలోచన 15 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు కు ఎందుకు రాలేదు. *చంద్రబాబు కు అమ్మేయడం...దోచుకోవమే తెలుసు. మేము వస్తే రూ.99 లకు క్యాటర్ బాటిల్ ఇస్తామని చంద్రబాబు చెప్పాడు..ఇప్పుడు 99 పైసలకే ఎకరం భూమి ఇస్తున్నాడు. ఒక ప్రతిపక్ష నేతగా...పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్ విశాఖ వస్తే.. పోలీసు అధికారులు కూటమీ నేతల్లా మాట్లాడారు. వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి. 2029 లో వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని పోలీసు అధికారులు గుర్తించండి’ అని హెచ్చరించారు.‘చంద్రబాబు కుయ్ కుయ్ అనడం లేదు ఎందుకో?’ -
పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను చెల్లించాలి
● వేతన సవరణ కమిటీని నియమించాలి ● ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ డిమాండ్ అమలాపురం టౌన్: పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను ఈ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాలని, వేతన సవరణ కమిటీని నియమించాలని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఏసీ చైర్మన్ ఆలపాటి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. అమలాపురం సత్యసాయి కల్యాణ మండపంలో జిల్లా ఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. జిల్లా ఎన్జీవో అసోసియేషన్ ఇన్చార్జి అధ్యక్షుడు ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు, కూటమి ప్రభుత్వం తమ పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై చర్చించింది. వేతన సవరణ కమిటీని వేస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని విద్యాసాగర్ అసహనం వ్యక్తం చేశారు. అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. హెల్త్ కార్డు సిస్టంను క్రమబద్ధీకరణ చేసి ఉద్యోగులకు వైద్యం అందించేలా సహకరించాలన్నారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి డి.వెంకటరమణ, ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ను నియమించి, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఎన్జీవో అసోసియేషన్కు నూతన అడహక్ కమిటీని సమావేశం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. జిల్లా అధ్యక్షుడిగా మాధవరపు వెంకటేశ్వర్లు, కన్వీనర్గా గుత్తుల వెంకటేశ్వరరావు, కోశాధికారిగా గుర్రాల సురేష్ సింగ్, సభ్యులుగా తాడి ఏసుబాబు, రూతమ్మ, సీహెచ్ చిట్టిబాబు, పి.రవిలను సమావేశం ఎన్నుకుంది. అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పేపకాయల వెంకట కృష్ణ, జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయి ప్రసాదరావుతోతోపాటు జిల్లాలోని తాలూకా యూనిట్స్ కార్యవర్గ ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ప్రమాద రహితంగా బాణసంచా తయారు
కొత్తపేట: ప్రమాద రహితంగా బాణాసంచా తయారీకి యజమానులు, సిబ్బంది ఫైర్ నిబంధనలు పాటిస్తూ , జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. జిల్లాలోని రాయవరం బాణసంచా తయారీ కేంద్రంలో బుధవారం భారీ విస్ఫోటం సంభవించి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్పీ రాహుల్ మీనా జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల తనిఖీల్లో భాగంగా కొత్తపేట మండల పరిధిలోని బాణసంచా తయారీ కేంద్రాలను, దీపావళి బాణసంచా హోల్సేల్ షాపులను గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల లైసెన్స్లు, వాటిని రెన్యువల్ చేశారా? ఆయా కేంద్రాల వద్ద, పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా? నిర్లక్ష్యంగా ఉన్నారా? అని నిశితంగా పరిశీలించారు. ఆయా కేంద్రాల యజమానులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాణసంచా కేంద్రాల వద్ద అగ్నిమాపక రక్షణ పరికరాలు ఉంచుకోవాలని, ఇసుక, నీరు అందుబాటులో ఉంచాలని, సీసీ టీవీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రమాదం సంభివిస్తే ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా బాణసంచా కేంద్రాల వద్ద ధూమపానం చేయకుండా చూడాలని, మండే గుణం కలిగిన వస్తువుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, మైనర్లను పనిలో చేర్చుకోరాదని సూచించారు. ఎస్పీ వెంట రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్బీ సీఐ పుల్లారావు, కొత్తపేట ఎస్సై జీ సురేంద్ర ఉన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం ● నేడు పరావాసుదేవి అలంకరణలో శేష వాహనంపై ఊరేగింపు ● ముస్తాబైన కోనసీమ తిరుమల క్షేత్రం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు ఈ నెల 18 వరకూ వైభవంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆలయాన్ని, రాజగోపురంతో సహా ఉపాలయాలను, పరిసరాలను ఆ ప్రాంగణాన్ని, రంగు రంగుల పుష్పాలంకరణలు, విద్యుత్ దీప తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారు వివిధ అలంకరణలతో విహరించే వాహనాలను ముస్తాబు చేశారు. వాహన సేవలు, నిరంతరాంగా సాగే సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకోనున్నాయి. తొలిరోజు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రుత్విక్ వరుణ, దీక్షాధారణ, విశేషార్చన, నీరాజనం, సాయంత్రం వాస్తు హోమం, ధ్వజ పతాక హోమాలు నిర్వహించనున్నారు. రాత్రి స్వామి వారిని పరావాసుదేవ అలంకరణలో శేషవాహనంపై ఊరేగించనున్నారు. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
మందుపాతరలతో సహజీవనం
తనిఖీ చేసిన కేంద్రంలోనే భారీ ప్రమాదం తయారీ కేంద్రాల వద్ద తీసుకుంటున్న రక్షణ చర్యలు, అధికారుల తనిఖీలు కూడా లోపభూయిష్టంగా ఉంటున్నాయి. ఉండాల్సిన స్థాయిలో వాటర్ ట్యాంకులు ఉన్నాయా? ఇసుక నిల్వలు ఉంచారా? తయారీ కేంద్రం ఊరికి దూరంగా ఏర్పాటు చేశారా లేదా? మంటలను ఆర్పే కార్బన్ డయాకై ్సడ్ కిట్టు ఉందా లేదా చూసి లైసెన్సులు రెన్యువల్ చేయడం, కొత్తగా ఏర్పాటు చేసుకుంటే అనుమతులు మంజూరు చేస్తున్నారు. రాయవరంలో ప్రమాదానికి గురైన బాణసంచా తయారీ కేంద్రాన్ని కూడా అధికారులు ఇటీవల తనిఖీ చేసి రెన్యువల్ చేశారు. అటువంటి చోటే భారీ ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం. సాక్షి, అమలాపురం: మందుగుండు సామగ్రి తయారు చేసే బాణసంచా తయారీ కేంద్రాలలో పని చేయడం అంటే ప్రాణాలను పణంగా పెట్టడమే. మిగిలిన చోట్ల ఏమోకాని.. బాణసంచా తయారీ కేంద్రంలో పనిచేయడం అంటే మృత్యువుతో నిత్యం చెలగాటం ఆడడమే. అది తెలిసి కూడా కార్మికులు, కూలీలు పొట్ట కూటికోసం వీటిలో పనిచేసేందుకు వెళుతున్నారు. మందుపాతర మీద కూర్చుని జీవన పోరాటం సాగిస్తున్నారు. దురదృష్టవశాత్తూ ప్రమాదాలు జరిగితే మృత్యువు బారిన పడుతున్నారు. గాయాలతో బయట పడినా జీవచ్ఛవాలుగా మారుతున్నారు. అనుమతి లేని కేంద్రాలే అధికం రాయవరంలో శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్ుక్సలో బుధవారం పెను విస్ఫోటం జరిగి ఎనిమిది మంది మృత్యువాత పడగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలై ప్రాణాలతో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో బాధితులంతా అతి పేద కుటుంబాలకు చెందినవారే కావడం గమనార్హం. జీవనోపాధి కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ వీరు ఇక్కడ పని చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు అధికారికంగా 18 వరకు ఉండగా, ఒక స్టోరేజ్ కేంద్రం ఉంది. కాని వాస్తవంగా అనుమతి లేని కేంద్రాలు చాలా ఉన్నాయి. అనుమతి ఉన్న కేంద్రాలలో మాత్రమే అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి లేని తయారీ కేంద్రాలు, అమ్మకం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటీవల అయినవిల్లి మండలం విలసలో ఇంటిలో నిల్వ ఉంచిన బాణసంచా పేలడం వల్ల ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుల రక్షణ పట్టని అధికారులు ● నిబంధనల ప్రకారం అన్ని రక్షణ చర్యలు తీసుకుంటేనే అనుమతులు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇందులో పనిచేస్తున్న కార్మికుల రక్షణ విషయాన్ని మాత్రం అధికారులు పట్టించుకోవడంలేదు. ● బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులు. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. వీరెవ్వరూ వృత్తి నైపుణ్యం ఉన్నవారు కాదు. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే రా మెటీరియల్పై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. ● బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలిపోయే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన లేకుండా పోతోంది. ● పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. పౌడర్గా తగు పాళ్లలో కలిపి క్రేకర్స్ తయారు చేయాల్సి ఉంది. ● బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అన్ స్కిల్డ్ లేబర్తో నూరిస్తున్నారు. అదే పేలుళ్లకు దారి తీస్తోంది. ● బాణసంచా తయారు చేసే ప్రతి కార్మికునికి చేతులకి గ్లౌజ్లుండాలి. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతోపాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. తయారు చేస్తున్న బాణసంచా, దానికి వాడే రసాయనాలు, వాటిని ఎలా కలపాలి అనే దానిపై కార్మికుడికి అవగాహన కల్పించాల్సి ఉంది. కాని ఎక్కడా ఇటువంటివి పాటించడం లేదు. ● బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారుతున్నారు. కనీసం గుర్తు పట్టేందుకు కూడా వీలు లేకుండా వారి శరీరాలు మారిపోతున్నాయి. జిల్లాలో ఇంచుమించు ప్రతి బాణసంచా కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ● రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతీ కార్మికుని ముఖానికి మాస్క్ తప్పనిసరి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో పాటు చర్మవ్యాధులు ప్రబలుతున్నాయి. కొంతమంది చిన్న వయసులోనే క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ● దీపావళి సమయంలో పెద్ద ఎత్తున వచ్చే ఆర్డర్ల కోసం తయారీదారులు అప్పటికప్పుడు సాధారణ కూలీలను కూడా పనిలో పెట్టుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీరికి తయారు చేసే అనుభవం లేకపోవడం వల్ల పేలుళ్లు సంభవిస్తున్నాయి. ● చిన్న పిల్లలను, మహిళలను మందుగుండు సామగ్రి తయారు చేసేందుకు అనుమతించ కూడదు. కానీ రాయవరంలో జరిగిన పేలుడులో మృతి చెందినవారిలో ఐదుగురు మహిళలే. ● ఇంత జరుగుతున్నా వీటిపై నిఘా పెట్టాల్సిన రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, కార్మిక, వైద్య శాఖలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదు. వారి నిర్లక్ష్యమే కార్మికుల పాలిట శాపంగా మారింది.09ఎఎంపీ04: బాణసంచా కేంద్రాల్లో భద్రత లేని కూలీలు కనీస రక్షణ కరవు చుట్టూ పేలుడు పదార్థాలు ఒంటి మీద కూడా రసాయనాలే అందుకే ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోతున్న కార్మికులు ఘటనా స్థలంలోనే మృత్యువాత నిపుణులు కూడా కొరత దీపావళి సమయంలో తాత్కాలికంగా కూలీల నియామకం ఆర్డర్ల పేరుతో విశ్రాంతి లేకుండా పనులు రసాయనాల పట్ల అవగాహన ఉండాలి బాణసంచా తయారు చేసేందుకు వాడే రసాయనాలపై ప్రతి కార్మికునికి, కూలీలకు అవగాహన ఉండాలి. ఇందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంది. రసాయనాలను కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇవన్నీ మండే కారకాలే. కార్మికుల ఒంటి నిండా రసాయనాలు ఉంటున్నాయి. ఈ కారణంగానే చిన్న నిప్పురవ్వ రాజుకున్నా పేలుడు సంభవించడం, కార్మికుల చనిపోవడం పరిపాటిగా మారింది. – పెచ్చెట్టి కృష్ణ కిషోర్, రసాయన శాస్త్ర అధ్యాపకుడు, గోదావరి కాలుష్యంపై అధ్యయనకర్త, అమలాపురం -
ఆరోగ్యశ్రీ.. తీస్తున్నారా ఊపిరి!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎంతో మంది ప్రాణాలు నిలిపి.. ఎన్నో కుటుంబాల్లో కొత్త వెలుగులను ప్రసరింపజేసి.. ఆపన్నులకు అపర సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ (కూటమి సర్కారు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’గా పేరు మార్చింది) ఊపిరిని ఆపివేసేందుకు కూటమి సర్కారు శతవిధాల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పథకం కింద నెట్వర్క్ ఆస్పత్రులకు ఏడాదికి పైబడి కోట్లాది రూపాయల మేర బకాయిలు పెట్టింది. ఈ బకాయిల గుదిబండను ఇక మోయలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు శుక్రవారం నుంచి సమ్మె బాట పడుతున్నాయి. ఈ పథకం కింద కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకుంటున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఈ వార్త అశనిపాతమే అవుతోంది. పైసా ఖర్చు లేకుండా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. పేద, మధ్య తరగతి ప్రజలకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించింది. క్యాన్సర్ వంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా సాయం అందించింది. ఈ పథకం కింద 1,059 ప్రొసీజర్లు (చికిత్సలు) అందిస్తూండగా.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సంఖ్యను ఏకంగా 3,257కి పెంచారు. అంతే కాకుండా, కుటుంబానికి రూ.5 లక్షల వరకూ ఉన్న చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. తద్వారా పేదల ఆరోగ్యానికి ఎంతో భరోసా కల్పించారు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రులు 32 ఉన్నాయి. వీటిల్లో ప్రతి రోజూ 2,500 వరకూ ఓపీ నమోదవుతుండగా ఇన్ పేషెంట్లుగా ఐదారు వందల మంది వరకూ ఈ పథకం కింద చేరుతున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని రోగులకు ప్రతి నెలా రూ.25 కోట్ల విలువైన శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని అంచనా. ఈవిధంగా పేదల పాలిట కల్పతరువుగా నిలిచిన ఈ మహత్తర పథకానికి మంగళం పాడేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఎత్తులు వేస్తోంది. ఈ పథకం స్థానంలో ఆరోగ్య బీమా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బకాయిల గుదిబండ జిల్లాలోని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.110 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఆస్పత్రికి రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ బకాయిలున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదిన్నర అవుతోంది. ఈ బకాయిలు కూడా ఏడాది నుంచి తొమ్మిది నెలల కాలంలో ఉన్నవే. వీటిని వెంటనే విడుదల చేయాలని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆషా) నెల రోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ప్రభుత్వం స్పందించలేదు. దీంతో, రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రుల సమ్మె అనివార్యమైంది. ఇంత కాలం పంటి బిగువన సమస్యలు భరించామని, ఇక తమ వల్ల కాదని నెట్వర్క్ ఆస్పత్రులు స్పష్టం చేస్తున్నాయి. కోట్లాది రూపాయల మేర బకాయిలు చెల్లించకపోతే తాము ఎంత కాలం వైద్య సేవలు అందించగలుగుతామని ప్రశ్నిస్తున్నాయి. నెట్వర్క్ ఆస్పత్రులకు బకాయిల విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టంగా వివరించినా ఫలితం లేదని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 25న సమావేశమైన ఆషా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆస్పత్రుల ప్రతినిధులు చెబుతున్నారు. ఈ మేరకు కాకినాడ సహా జిల్లాలోని 32 ప్రైవేటు, కార్పొరేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు సహకారం అందించే ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్లలో ఆరోగ్య మిత్రలు లేకుండా చేస్తున్నారు. ప్రజల ఆందోళన నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె బాట పట్టడంతో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత చికిత్సలు అందక తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్యశ్రీపై ఉచిత వైద్య సేవలు పొందేందుకు నెట్వర్క్ ఆస్పత్రులకు వచ్చే రోగులు సొమ్ము చెల్లిస్తేనే వైద్యం అందే పరిస్థితి కనిపిస్తోంది. సొమ్ము చెల్లించే స్తోమత లేని వారు ప్రాణాలు అరచేత పట్టుకుని వెనుతిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది. బకాయిలు విడుదల చేయకపోవడం అన్యాయం ఆరోగ్యశ్రీకి జవసత్వాలు లేకుండా చేయాలనుకోవడం అన్యాయం. నెట్వర్క్ ఆస్పత్రులకు కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయినా కూటమి సర్కారు స్పందించకపోతే ఇక పేదలకు వైద్యం ఎలా అందుతుంది? జిల్లాలోని దాదాపు అన్ని నెట్వర్క్ ఆస్పత్రులకూ రూ.100 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు వైద్యులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూంటే పేదల ఆరోగ్యంపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. – గుబ్బల తులసీకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు, యు.కొత్తపల్లి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి పేదల ఆరోగ్యానికి తూట్లు పొడవకండి. నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం ఒక వరం లాంటిది. ఆ పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చేసినంత మాత్రాన ఆ వర్గాలకు ఒరిగిందేమీ లేదు. ఆరోగ్యశ్రీ రూపురేఖలనే మార్చేస్తున్నారు. సేవలను కుదించేసి ఆ పథకాన్నే నీరుగార్చేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారు. బకాయిలు విడుదల చేయకుండా నెట్వర్క్ ఆస్పత్రుల్లో పేదలకు వైద్యం ఉచితంగా చేయమంటే ఎలా చేస్తారు? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిపోయినా ఇంతవరకూ బకాయిలు విడుదల చేయకపోడం అన్యాయం. – జమ్మలమడక నాగమణి, పౌర సరఫరాల సంస్థ మాజీ డైరెక్టర్ నేటి నుంచి నిలిచిపోనున్న ఎన్టీఆర్ వైద్య సేవలు జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు 32 ఏడాది కాలంగా రూ.110 కోట్లు పైనే బకాయిలు నేటి నుంచి సేవల బంద్కు ఆషా పిలుపు -
రాజమహేంద్రవరం కమిషనర్గా జేసీ రాహుల్ మీనా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముఖేష్కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జేసీగా మీనా సుమారు ఏడాది కాలం పాటు జిల్లాలో పని చేశారు. ఆయన స్థానంలో జాయింట్ కలెక్టర్గా ఎటపాక సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ను నియమించారు. ఇదిలా ఉండగా కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన కూడా బదిలీ అయ్యారు. ఆమెను బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమించారు. భావన ఇక్కడ సుమారు 15 నెలల పాటు కమిషనర్గా పని చేశారు. నేడు దిశ సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కలెక్టర్ షణ్మోహన్ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. ఆయా శాఖలు అమలు చేస్తున్న వివిధ పథకాలు, అభివృద్ధిపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. జక్కంపూడి రామ్మోహనరావుకు ఘన నివాళి రాజమహేంద్రవరం సిటీ: ప్రజా పోరాట యోధుడు, మాజీ మంత్రి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ఆశయ సాధనకు కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. జక్కంపూడి రామ్మోహనరావు 14వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు సెంటర్లో ఆయన విగ్రహానికి గురువారం ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక లోకం అభ్యున్నతి కోసం తన తండ్రి నిరంతరం పోరాడారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తిని ఆయుధంగా తీసుకుని ముందుకు వెళ్తున్నానని చెప్పారు. ఆయన ఆశయ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన జక్కంపూడి రామ్మోహనరావు.. వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, నాయకులు నీలి ఆనంద్, మహ్మద్ ఆరిఫ్, నరవ గోపాలకృష్ణ, మానే దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు నాట్లు ప్రారంభం
పరిమితికి మించి పంట వేయవద్దు పొగాకు బోర్డు ఇచ్చిన పరిమితికి లోబడి పంట వేయాలి. బ్యారన్కు 1.6 హెక్టార్ల విస్తీర్ణంలో పంట వేసి 35 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలి. అధిక విస్తీర్ణంలో పంట సాగు అనర్థదాయకమే. అంతర్జాతీయంగా పొగాకు ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యమైన పొగాకు ఉత్పత్తి చేయాలి. వరి పంట వేసిన బాడవ భూములు, పల్లపు ప్రాంత భూముల్లో సాగు చేయవద్దు. నారుమడిలో మేలైన నారును ఎంచుకుని నాట్లు వేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గల నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలి. అప్పర్ ఎన్ఎల్ఎస్లో నాట్లు జరుగుతున్నాయి. దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో రెండు రోజులుగా నాట్లు వేస్తున్నారు. ఎక్కువ మంది రైతులు ట్రే నారు నాట్లు వేస్తున్నారు. – జీఎల్కే ప్రసాద్, పొగాకు బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరందేవరపల్లి: మన జిల్లాతో పాటు ఏలూరు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో ప్రధాన వాణిజ్య పంటగా పండిస్తున్న వర్జీనియా పొగాకు సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. 2025–26 పంట కాలానికి రైతులు పొగాకు నాట్లు ప్రారంభించారు. వారం రోజులుగా నాట్లు వేస్తున్నారు. మెట్ట ప్రాంతంలోని ఎర్రమట్టి ఇసుక నేలలు, నల్లరేగడి భూముల్లో పొగాకు సాగు జరుగుతుంది. ఉత్తర తేలిక నేలల్లో(ఎన్ఎల్ఎస్) పండిస్తున్న పొగాకుకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తూర్పు, ఏలూరు జిల్లాల్లో ఎన్ఎల్ఎస్ పొగాకు సాగు జరుగుతుంది. ఈ పొగాకుకు ఎగుమతి ఆర్డర్లు ఉండడంతో మంచి ధర పలుకుతుంది. రెండేళ్లుగా పొగాకు పంట రైతులకు కాసులు కురిపిస్తోంది. ఎక్కువ పెట్టుబడితో కూడిన పంట ఎన్ఎల్ఎస్ సాగు. ఎకరాకు దాదాపు రూ.3 లక్షలు పెట్టుబడి అవుతుంది. నవంబర్ నెలాఖరుకు పొగాకు నాట్లు పూర్తికానున్నాయి. ఈ నెల 15 తర్వాత నాట్లు ముమ్మరంగా జరుగుతాయని బోర్డు అధికారులు చెబుతున్నారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతాన్ని అప్పర్ ఎన్ఎల్ఎస్, లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతాలుగా పిలుస్తారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను అప్పర్ ఎన్ఎల్ఎస్, గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల పరిధిలోని ప్రాంతాలను లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంగా పిలుస్తారు. ఏటా అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముందస్తు సాగు ప్రారంభిస్తారు. అక్టోబర్ మొదటి వారంలో అక్కడ నాట్లు వేయగా, 20 రోజుల తేడాలో లోయర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో సాగు ప్రారంభిస్తారు. ప్రస్తుతం అప్పర్ ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో ముమ్మరంగా నాట్లు జరుగుతున్నట్టు అధికారులు తెలిపారు. పెరిగిన సాగు రెండు జిల్లాల్లో సుమారు 80 వేల ఎకరాల్లో రైతులు పొగాకు పంట సాగు చేస్తున్నారు. గత ఏడాది బోర్డు లెక్కల ప్రకారం 29,480 హెక్టార్లలో పంట సాగు చేశారు. బోర్డు అనుమతి లేకుండా మరొక నాలుగు వేల హెక్టార్లలో సాగు చేసినట్టు సమాచారం. రాజమహేంద్రవరం రీజనల్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,2 వేలం కేంద్రాల పరిధిలో 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు కలిగి ఉన్నారు. అధిక దిగుబడుల వంగడాల సాగు అధిక దిగుబడులు వస్తున్న వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థల నుంచి వంగడాలను రైతులు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఎల్వీ–7, 1353 వంగడాలను రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ వంగడాలు ఎకరాకు 10 నుంచి 13 క్వింటాళ్లు దిగుబడి నిస్తున్నాయి. కిలో విత్తనం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నారు. అంతరించిపోతున్న జీడిమామిడి పంట జీడిమామిడి పంట మెట్ట ప్రాంతంలో అంతరించిపోతోంది. మార్కెట్లో పొగాకు ధర లాభసాటిగా ఉండడం, కౌలు ఎక్కువగా రావడంతో రైతులు జీడిమామిడి తోటలను తొలగించి పొగాకు సాగు చేస్తున్నారు. జీడిమామిడి పంట దిగుబడి తగ్గడంతో పాటు ధర లేకపోవడంతో గిట్టుబాటు కావడంలేదని రైతులు అంటున్నారు. నాటడానికి మడుల్లో సిద్ధంగా ఉన్న పొగాకు నారు దేవరపల్లి మండలం సంగాయగూడెంలో పొగాకు నాట్లు వేస్తున్న కూలీలు 80 వేల ఎకరాల్లో పంట సాగు 14,754 మంది రైతులు 12,723 బ్యారన్లు ఆసక్తి చూపుతున్న కౌలురైతులు లాభసాటిగా పొగాకు సాగు గణనీయంగా పెరగనున్న సాగు విస్తీర్ణం కౌలు రైతుల మధ్య పోటీ రెండేళ్లుగా పొగాకు సాగు లాభసాటిగా ఉంది. కిలో రూ.430 ధర పలకడంతో కౌలుదారులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. కౌలుదారుల మధ్య పోటీ ఏర్పడంతో భూమి కౌలు ఎకరం రూ.80 వేల నుంచి రూ.1 లక్ష పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి కౌలు పలుకుతుంది. బ్యారన్ లీజు రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షలు పలుకుతుంది. బ్యారన్ లైసెన్స్ ఖరీదు రూ.10.50 లక్షలు పలుకుతుంది. మూడేళ్ల క్రితం బ్యారన్ ఖరీదు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఉండగా, గత ఏడాది రూ.8 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.10.50 లక్షలు పలుకుతుండడంతో ఎక్కువ బ్యారన్లు ఉన్న రైతులు కొన్ని బ్యారన్లకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. -
కూలీలను కాపాడబోయి యజమాని ఆహుతి
రాయవరం: బాణసంచా ప్రమాదాల్లో సాధారణంగా కూలీలే సమిధలవుతారు. అయితే రాయవరంలో జరిగిన బాణసంచా ప్రమాదంలో కూలీలతో పాటుగా తయారీ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) మృత్యువాత పడ్డారు. దీపావళి సమీపిస్తుండడం, వివాహ ముహూర్తాలకు ఆర్డర్లు వస్తుండడంతో కూలీలతో పనులు చేయిస్తున్నారు. అనుకోకుండా జరిగిన దుర్ఘటన యజమాని సత్తిబాబుతో సహా ఎనిమిది మంది ప్రాణాలను బలిగొంది. అప్పటి వరకు బయట కూర్చున్న సత్తిబాబు ప్రమాదంలో చిక్కుకున్న కూలీల ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే మృత్యువాత పడినట్లుగా భావిస్తున్నారు. ప్రమాద జరిగిన వెంటనే ఇద్దరు కూలీలను బయటకు లాగినట్లుగా స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మరొకరిని బయటకు లాగే సమయంలో అప్పటికే అగ్నికీలలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో మృత్యువుకు చేరువైనట్లుగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బయట కుర్చీలో కూర్చున్న ఆయన అక్కడి నుంచి పారిపోయి ఉంటే ప్రాణాలతో బతికే వారని, కాని కూలీలను రక్షించే క్రమంలోనే అసువులు బాసినట్లుగా సమీపంలోని బాణసంచా తయారీ కేంద్రం యజమాని వేల్పూరి సత్తిబాబు చెబుతున్నారు. అప్పటి వరకు బయట కూర్చున్న మృతుడు సత్తిబాబుతో తాను మాట్లాడి వెళ్లిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం జరిగినట్లుగా సత్తిబాబు తెలిపారు. ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదన్నారు. -
మృతదేహాల అప్పగింత
రాయవరం: గ్రామ పరిధిలో బుధవారం జరిగిన బాణసంచా దుర్ఘటనలో మృతదేహాలను బాధిత కుటుంబాలకు గురువారం పోలీసులు అప్పగించారు. ఆరు మృతదేహాలకు రామచంద్రపురం, రెండు మృతదేహాలకు కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ దుర్ఘటనలో బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి(సత్తిబాబు)తో సహా ఏడుగురు కూలీలు మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు రాయవరం ఎస్సై డి.సురేష్బాబు తెలిపారు. కుటుంబానికి ఆధారం కోల్పోయాం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాసంశెట్టి విజయలక్ష్మి(51) మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన విజయలక్ష్మి పొట్టకూటి కోసం బాణసంచా తయారీకి కూలి పని నిమిత్తం వస్తోంది. ప్రతి రోజూ మాదిరిగానే బుధవారం కూలి పనికి వచ్చిన విజయలక్ష్మి దుర్ఘటనలో తీవ్రగాయాల పాలైంది. కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. ఇదిలా ఉంటే కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న విజయలక్ష్మి మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పని చేసుకుని ఇంటికి వస్తుందని ఆశించామని, ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తి అనపర్తి : శ్రీగణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్లో జరిగిన విస్ఫోటంలో మృతిచెందినవారి అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ ప్రమాదంలో అనపర్తి శివారు సావరానికి చెందిన కుడిపూడి జ్యోతి, పెంకే శేషారత్నం, చిట్టూరి శ్యామల ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారి మృతదేహాలకు స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
రాష్ట్ర స్థాయి సెపక్తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
దేవరపల్లి: రాష్ట్రస్థాయి సెపక్తక్రా పోటీలకు తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక గురువారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపిక పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో బాల బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ జట్లు ఈ నెల 11,12 తేదీల్లో బాపట్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంథ్రనాథ్ తెలిపారు. బాలుర జట్టుకు జి. కోట సతీష్(దొమ్మేరు), ఎం.ఆంథోని(రామన్నపాలెం), వై. పాల్(దొమ్మేరు), బి, చరణ్(దొమ్మేరు), ఎ. వివేక్(దేవరపల్లి), బి. రాధాకృష్ణ (రామన్నపాలెం) ఎంపికయ్యారు. బాలికల జట్టులో దుర్గామాధవశ్రీ (చిన్నాయగూడెం), ఎం. మహాలక్ష్మి (రామన్నపాలెం), ఎం.లాస్య(రామన్నపాలెం), ఎస్కే మనిషాబేగం(రామన్నపాలెం), ఎం.జేసీశ్రీ(రామన్నపాలెం), డి. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సుభాషిణి (రామన్నపాలెం) ఎంపికై నట్టు రవీంధ్రనాథ్ తెలిపారు. పోటీలను పీడీలు ఎల్. గణపతి, టి.సరస్వతి, సీహెచ్ సతీష్, పి.సాయి పర్యవేక్షించారు. 11, 12 తేదీల్లో బాపట్లలో జాతీయ స్థాయి పోటీలు -
పరిహారం.. పరిహాసం
● బాణసంచా పేలుడు బాధితులకు సాయం ప్రకటించని కూటమి ప్రభుత్వం ● తీరిగ్గా ఇప్పుడు తనిఖీలు ప్రారంభించిన జిల్లా యంత్రాంగం సాక్షి, అమలాపురం/ రాయవరం: రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటం జరిగి నిరుపేద కూలీలు మృత్యువాత పడినా కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పరిహారం ప్రకటించలేదు. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మి క శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్, హోం శాఖమంత్రి వంగలపూడి అనితతోపాటు ఉన్నతాధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. బాధితులను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పరిహారంపై స్పష్టత లేదు. ఇటువంటి చోట పనిచేసేవారికి అటు యాజమాన్యం, ఇటు కార్మిక శాఖలు కలిసి ఇన్సూరెన్స్ చేయించాల్సి ఉంది. కాని చనిపోయిన వారి వివరాలు కూడా కార్మిక శాఖకు వెంటనే తెలియని దుస్థితి. మృతులు కార్మికశాఖ రికార్డుల్లో నమోదు కానట్టు తెలిసింది. ‘ఎంప్లాయిస్ కాంపన్సేషన్ యాక్టు’ ప్రకారం యజమానుల వద్ద నుంచి పరిహారం కోరతామని కార్మిక శాఖ అధికారులు చెబుతున్నారు. చేతులు కాలాక హడావుడి బాణసంచా తయారీ కేంద్రంలో పెను విస్ఫోటంతో తీవ్ర విషాదం నెలకొనడంతో జిల్లా యంత్రాంగం ఇప్పుడు హడావుడి చేస్తోంది. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ జిల్లాలోని అన్ని శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ యూనిట్లు, హోల్సేల్ విక్రయ కేంద్రాల లైసెన్స్లను, భద్రత, రక్షణ ప్రమాణాల అంశాలను మూడు రోజులపాటు పర్యవేక్షణ బృందాలు తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. కేంద్రాలలో పనిచేసే కార్మికులకు నైపుణ్యం ఉన్నదీ లేనిదీ చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా బాణసంచా తయారీ యూనిట్లు 18 వరకు ఉన్నాయని, హోల్సేల్ డీలర్లు 19 మంది వరకు ఉన్నారన్నారు. ప్రతి కార్మికునికి బీమా చేయిస్తున్నదీ లేనిదీ చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలతో తయారీ, విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రూ.50లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు డిమాండ్ చేశారు. బాణసంచా దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని ఆయన పార్టీ సభ్యులతో కలిసి గురువారం పరిశీలించారు. -
బాణసంచా కేంద్రాలపై దాడులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అక్రమ బాణసంచా నిల్వలు, తయారీ కేంద్రాలపై జిల్లా పోలీసులు గురువారం మెరుపు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ డి.నరసింహకిశోర్ తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బొమ్మూరు, రాజానగరం, బిక్కవోలు, కడియం, చాగల్లు, సమిశ్రగూడెం, సీతానగరం, గోకవరం, నల్లజర్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో బాణసంచా తయారీ కేంద్రాలు, గోడౌన్లపై కేసులు నమోదు చేశారు. బాణసంచా లైసెన్సు కల్గిన వారు మాత్రమే ప్రభుత్వ నియమ నిబంధలనకు లోబడి బాణసంచా తయారీ లేదా విక్రయాలు చేయాలని ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించి ఎవరైనా జన సంచార స్థలాల్లోను, అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన, విక్రయాలు జరిపిన అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రతిరోజు ఈ తనిఖీలు కొనసాగించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఎవరైనా రహస్యంగా మందుగుండు సామగ్రి తయారు చేస్తున్నట్లు, నిల్వ ఉంచినట్లు తెలిస్తే డయల్ 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. -
చెరువు నీటిలో విష అవశేషాలు
తాళ్లపూడి: పెద్దేవం చెరువు నీటిలో విష అవశేషాలు ఉన్నట్టు గుర్తించామని, రైతులు తమ పశువులకు ఇన్సూరెన్స్ చేసుకుంటే నష్టాన్ని నివారించవచ్చునని పశు సంవర్ధక శాఖ డీడీ డాక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మండలంలోని పెద్దేవం గ్రామంలో కొద్దిరోజులుగా అనారోగ్యంతో మృత్యువాత పడుతున్న గేదెల జబ్బును గుర్తించేందుకు వీలుగా ఆయన ఆధ్వర్యంలో బృందం పర్యటించి గేదెల పేడ, మూత్రం పరీక్షలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా 50 మందికి పైగా రైతుల హాజరై తమ గేదెల పేడ పరీక్షలు చేయగా 90 శాతం గేదెలలో జలగ వ్యాధి ఉన్నట్లు గుర్తించినట్లు పశు సంవర్ధక శాఖ డీడీ పేర్కొన్నారు. డీడీ సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యంగా గేదెలకు ప్రభుత్వ ఇన్సూరెన్స్ పథకం అమలులో లేనందున ప్రైవేట్ కంపెనీ ఇన్సూరెన్్స్ అయినా సరే తీసుకుంటే నష్ట నివారణకు అవకాశం ఉంటుందని అన్నారు. ప్రైవేట్ కంపెనీ ప్రతినిధులను రైతులకు పరిచయం చేశారు. మృత్యువాత పడ్డ ఒక గేదెకు పోస్ట్మార్టం నిర్వహించి, జరిపిన పరీక్షల్లో రెండు వైరస్లు గుర్తించినట్లు, చెరువు నీటిలో పేరాకాట్ పోయిజినింగ్ అవశేషాలు ఉన్నట్లు తేలిందని, అవి ప్రమాదకరమని, గేదెలలో వ్యాధి నిరోధక శక్తి నశించి, మిగతా వైరల్ రోగాల పెరుగుదలకు అవకాశం ఇస్తోందని అన్నారు. నష్ట పరిహారం ఇవ్వాల్సిందే గ్రామ ఉప సర్పంచ్ తోట రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు పేరాకాట్ పాయిజన్ పొలాల్లో వాడతారని దీనివల్ల గేదెలకు రోగాలు వచ్చాయనటం ఆశ్చర్యంగా ఉందని, గేదెలకు వచ్చిన రోగాన్ని నిర్ధారణ చేసి సరైన మందు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెరువులో నీరు తాగని గేదెలకు కూడా వ్యాధి వచ్చిందని దానికి సమాధానం చెప్పాలని అన్నారు. పశుసంవర్ధక శాఖ డాక్టర్లు చేస్తున్న వైద్యం తమ గ్రామంలో రైతులకు సంతృప్తిగా లేదని తెలిపారు. దీనిని రాజకీయం చేయకుండా గేదెలు నష్టపోయినవారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ఎ.వెంకటరెడ్డి, కాకినాడ ల్యాబ్కు చెందిన డాక్టర్ సందీప్, డాక్టర్ ఎస్.వెంకటేశ్వరరావు, తాళ్లపూడి మండల పశువైద్యాధికారులు డాక్టర్ వరలక్ష్మి, డాక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 21,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 30,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 28,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 23,000 – 24,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)23,000 – 24,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,250 కిలో 350 -
బాణసంచా తయారీలో మూడు తరాలుగా..
రాయవరం: గ్రామం సమీపంలో ఉన్న బాణసంచా తయారీ కేంద్రాన్ని మూడు తరాలుగా ఒకే కుటుంబం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఇక్కడి నుంచే బాణసంచా తయారీ కుటీర పరిశ్రమగా ప్రారంభమైంది. స్వాతంత్య్రానికి పూర్వమే వెలుగుబంట్ల వీరన్న బాణసంచా తయారీని ప్రారంభించినప్పటికీ వారి కుమారులు తాత నారాయణమూర్తి, రామకృష్ణల హయాంలోనే అభివృద్ధి చెందింది.తాత నారాయణమూర్తి కుమారుడు వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు), రామకృష్ణ కుమారుడు కోటిబాబులు వేర్వేరుగా వ్యాపారాన్ని సాగించారు. కోటిబాబు మరణించే వరకు ఈ వృత్తిని కొనసాగించగా, వారసులు వృత్తికి స్వస్తి పలికారు. ఇదిలా ఉంటే సత్యనారాయణమూర్తి మాత్రం బాణసంచా తయారీని కొనసాగిస్తున్నారు. దీపావళి పర్వదినానికే కాకుండా వివాహాది శుభకార్యాలకు, గ్రామాల్లో జరిగే అమ్మవారి జాతర్లు, రాజకీయ పార్టీల ఊరేగింపులు, ఉత్సవాలకు బాణసంచా తయారీ చేస్తున్నారు. 1952లో మద్రాస్లో జరిగిన ఏఐసీసీ సమావేశం, 1978లో బెంగళూరులో జరిగిన జాతీయ క్రీడలకు, 1983లో ఎన్టీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి, 1983, 1999లలో ఫిలిం ఫెస్టివల్స్కు, పలు చలన చిత్రాల శత దినోత్సవాలకు వెలుగుబంట్ల సోదరులు తయారుచేసిన బాణసంచా కాల్చారు. వాటి తయారీలో ప్రత్యేక స్థానాన్ని సాధించి నిశిరాత్రిలో వెలుగుపూలు నింపిన వెలుగుబంట్ల సత్తిబాబు అదే బాణసంచా ప్రమాదానికి గురికావడాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. వివాద రహితుడు, సౌమ్యుడిగా పేరున్న సత్తిబాబు మృతితో ఆయన అభిమానులు, మిత్రులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
బతుకులు చితికి..
చీకటి వెలుగుల రంగేళీ.. జీవితమే ఒక దీపావళి.. కానీ ఈ దీపావళి వారి జీవితాల్లో చీకట్లు నింపింది. మిరుమిట్లు గొలుపుతూ ఉవ్వెత్తున ఎగసే చిచ్చుబుడ్డి వెలుగులు వారి జీవితాల్లో చిచ్చుపెట్టాయి. ఎవరికి ఎవరూ కాకుండా చేశాయి. మరో పది రోజుల్లో దీపావళి వస్తుంది. ఇంటిల్లిపాదీ ఈ పండగకు ఏ లోటూ లేకుండా బాణసంచా కాల్చాలి.. కొత్త దుస్తులు వేసుకోవాలి.. ఇలా ఎన్నో ఆశలతో ఆ కూలీలు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. ఇంతలో రాజుకున్న చిన్న నిప్పురవ్వ పేదల ఇంట పెను విషాదాన్ని నింపి వారి కుటుంబాలను అంధకారమయం చేసింది.సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు.ఆలనాపాలనా చూసేవారెవరు?పెంకే శేషారత్నంకు భర్త సూరిబాబు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కార్తిక్ అనపర్తిలో దుకాణంలో పని చేస్తుండగా, సుబ్రహ్మణ్యం 9వ తరగతి చదువుతున్నాడు. భర్త సూరిబాబు కార్పెంటర్గా పని చేస్తున్నారు. అనారోగ్యంతో ఒకరోజు పని చేస్తే రెండు రోజులు ఇంటి వద్దే ఉంటాడు. శేషారత్నం సంపాదిస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటోంది. తల్లి మృతి చెందిందని తెలిసి బేలగా చూస్తున్న చిన్నారులు స్థానికులకు కంట తడిపెట్టిస్తున్నారు. తమ చిన్నారుల పరిస్థితి ఏమిటని తండ్రి సూరిబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.పిల్లల చదువు కోసం పనికి వెళ్లి..నిరుపేద కుటుంబానికి చెందిన చిట్టూరి శ్యామలకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె మృతి వార్త విన్న వృద్ధురాలైన ఆమె అత్తగారిని ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. పిల్లలు ఇద్దరూ ఇంకా చదువుకుంటున్నారని వారికి ఖర్చులకు ఉంటాయని పనికి వెళ్లిందని, ఇలా మృత్యువాత పడుతుందని ఊహించలేదని రోదిస్తున్నారు. అత్తగారు గుండెలు పగిలేలా రోదిస్తుంటే ఓదార్చేందుకు మాటలు రావడం లేదని స్థానికులు వాపోతున్నారు.మా జీవన ‘జ్యోతి’ ఆరిపోయిందికుడిపూడి జ్యోతి కుటుంబ పరిస్థితి చాలా దయనీయం. కుమార్తె, కుమారుడు, వయసు పైబడిన తల్లి లక్ష్మి ఆమైపె ఆధారపడి జీవిస్తున్నారు. కుమార్తెకు ఇది వరకే వివాహం చేయగా, కుమారుడుకి ఇటీవలే వివాహమైంది. నాలుగు నెలల క్రితం భర్త సత్యనారాయణ మృతి చెందాడు. దీంతో వారి భారం జ్యోతిపై పడింది. ఆమె అనుకోకుండా ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని, అనారోగ్యంతో ఉన్న తనను ముందు రోజు ఆస్పత్రికి తీసుకుని వెళ్లి రూ.రెండు వేలు ఖర్చు పెట్టిందని గుండెలు పగేలా రోదిస్తోంది.మృతులు, క్షతగాత్రుల వివరాలుమృతులు1. వెలుగుబంట్ల సత్యనారాయణ (65), బాణసంచా తయారీ దుకాణం యజమాని, కొమరిపాలెం, బిక్కవోలు మండలం2. పాకా అరుణ(35),సోమేశ్వరం, రాయవరం మండలం3. చిట్టూరి శ్యామల(35), అనపర్తి4. పెంకే శేషారత్నం(40), అనపర్తి సావరం5. కుడుపూడి జ్యోతి(38), అనపర్తి సావరం6. కె.సదానందం (52), ఒడిశా వాసి7. పొట్నూరి వెంకటరమణ (55), కొమరిపాలెం, బిక్కవోలు మండలం8. వాసంశెట్టి విజయలక్ష్మి (51), సోమేశ్వరం, రాయవరం మండలంక్షతగాత్రులు1. చిట్టూరి యామిని, అనపర్తి2. లింగం వెంకట కృష్ణ, వేండ్ర, పెదపూడి మండలం -
ఆలనాపాలనా చూసేవారెవరు?
సాక్షి, అమలాపురం/రాయవరం/అనపర్తి/బిక్కవోలు: చుట్టూ పచ్చని పొలాలు.. సమీపిస్తున్న దీపావళి.. పండగ నాడు జనం కళ్లల్లో ఆనంద వెలుగులు చూడాలని అహోరాత్రాలు కష్టపడుతున్న బాణసంచా తయారీ కార్మికులు. అప్పుడప్పుడూ వచ్చిపోయే కొనుగోలుదారుల సందడి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్క సారిగా పేలుడు శబ్దం. చిచ్చుబుడ్డి తయారు చేస్తున్న సమయంలో రాజుకున్న నిప్పురవ్వలు కొద్ది క్షణాలలోనే ఆ ప్రాంతాన్ని భస్మం చేసేశాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో పెను విస్ఫోటం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కాకినాడ జీజీహెచ్లో వాసంశెట్టి విజయలక్ష్మి, కాకినాడ ట్రస్ట్ ఆస్పత్రిలో పొట్నూరి వెంకటరమణ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడు ధాటికి కార్మికులు పది నుంచి ఇరవై అడుగులు దూరం ఎగిరిపడ్డారు. మరి కొందరు కార్మికులు మంటల్లో చిక్కుకుని నీటితో ఆర్పుకొనేందుకు నాలుగువైపులా పరుగులు తీశారు. ఈ ఘటనతో తయారీ కేంద్రం మంటలకు ఆహుతై మరుభూమిని తలపించింది. ప్రమాదం బారిన పడిన వారిని రక్షించేందుకు వెళ్లిన వారికి అక్కడి దృశ్యాలు చూసి ఒళ్లు గగుర్పొడిచింది. ప్రమాద ధాటికి కొంతమంది కార్మికులు ఎగిరి పక్కనే ఉన్న పంట పొలాల్లో పడ్డారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా తయారీ కేంద్రం యజమానిని గుర్తించారు. మృతుల కుటుంబీకులు చెప్పిన ఆనవాళ్లను బట్టి పోలీసులు కొందరిని గుర్తించారు.శుభకార్యం ప్రాణాలు నిలిపిందిపేలుడు ఘటనలో గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో అనపర్తి సావరం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ గ్రామం నుంచి ప్రతిరోజు సుమారు 15 నుంచి 20 మంది మహిళలు బాణసంచా దుకాణంలో పని చేసేందుకు వెళ్తుంటారు. స్థానికంగా శుభకార్యం ఉండడం, రాబోయే దీపావళికి ఇల్లు శుభ్రం చేసుకునే పని ఉందని చాలామంది పనికి వెళ్లకపోవడంతో వారు మృత్యువు నుంచి తప్పించుకున్నారు. రోజూ తమతో పాటు పనికి వచ్చే వారిలో కొందరు మృతి చెందారని తెలిసి వారు కన్నీరుమున్నీరయ్యారు.ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదుఅసలు తన భార్య బతికుందా.. లేదా.. అనేది తెలియడం లేదని రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన కూలీ పాకా సుబ్బారావు రోదిస్తున్నాడు. మధ్యాహ్నం భోజన సమయంలో 12.02 గంటలకు తన భార్య అరుణకు ఫోన్ చేశానని, ఆ తర్వాత 12.30 గంటలకు ప్రమాదం జరిగినట్టు తెలిసిందని, ఇంతలోనే అంత ఘోరం జరుగుతుందనుకోలేదని బావురుమన్నాడు.విషాదంలో కుటుంబ సభ్యులుయజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి మృతితో కుటుంబం విషాదంలో కూరుకుపోయింది. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఇంటి వద్ద నెలకొంది. ప్రమాద స్థలికి చిన్న కుమారుడు చిట్టిబాబు చేరుకుని గుండెలు పగిలే రోదించాడు. -
ముందే హెచ్చరించిన ‘సాక్షి’
సాక్షి, అమలాపురం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దీపావళి వేళ ప్రమాదాలు చోటు చేసుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు సమీక్షలకే పరిమితమవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ దినపత్రిక ముందుగానే హెచ్చరించింది. ఈ నెల ఒకటో తేదీన ‘అలక్ష్యంతో అనర్థం’, నాలుగో తేదీన ‘ప్రాణ సంకటంగా బాణసంచా’ శీర్షికలతో కథనాలను ప్రచురించింది. దీపావళి సమయాల్లో గతంలో జరిగిన ప్రమాదాలను ఊటంకిస్తూ.. అధికారులు పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపింది. అయినా జిల్లా యంత్రాంగంలో కదలిక లేదు. తయారీ కేంద్రాన్ని ఇటీవల సందర్శించామని, అన్నీ జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు. అయినా ఇంత ప్రమాదం జరగడం స్థానికులను విస్మయ పరుస్తోంది. -
లోపం ఎక్కడుంది?
రాయవరం: మండల కేంద్రం రాయవరంలో బుధవారం జరిగిన ప్రమాద ఘటన పలు లోపాలను ఎత్తి చూపుతోంది. ఈ ఘటనలో తప్పెవరిది అనే ప్రశ్నకు సమాధానం లేదు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంలో పలు ఊహాగానాలున్నాయి. దర్యాప్తు పూర్తయితే గానీ ప్రమాదానికి కారణం చెప్పలేని పరిస్థితి నెలకొంది. చిచ్చుబుడ్డిని దట్టించే సమయంలో ప్రమాదం జరిగిందా.. షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా అనేది నిర్ధారించలేకపోతున్నారు.భీతావహ పరిస్థితిప్రమాద స్థలం మొత్తం మరుభూమిని తలపించింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల సమయానికి కూడా ఆరో మృతదేహాన్ని గుర్తించలేక పోయారంటే అసలు పనికి ఎంతమంది ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది పక్కాగా నమోదు చేయాల్సిన అవసరాన్ని తెలియజేస్తోంది.నివ్వెరపోయిన అధికారులు, ప్రజలుప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా సిబ్బందితో వచ్చి ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఘటనా స్థలిలో మృతదేహాలు ఉన్న తీరును చూసి అధికారులకు నోట మాట రాలేదు. అక్కడి పరిస్థితిని చూసిన వారు చలించిపోయారు.ఘటనా స్థలిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, కలెక్టర్ డాక్టర్ మహేష్కుమార్, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఎన్బీఎం మురళీకృష్ణ, రామచంద్రపురం ఆర్డీవో అఖిల, డీఎస్పీ బి.రఘువీర్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం తదితరులు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. -
కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనపై వైఎస్ జగన్ దిగ్ర్భాంతి
సాక్షి, తాడేపల్లి: కోనసీమలో బాణసంచా పేలుడు ఘటనలో పలువురి మృతిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనలో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని వైఎస్ జగన్ అన్నారు.రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. -
ఆహార తయారీ కేంద్రాల విస్తృత తనిఖీలు
అమలాపురం రూరల్: జిల్లావ్యాప్తంగా వివిధ హోటళ్లలో, వ్యాపార కేంద్రాల్లో విపరీతమైన కల్తీ, ఆహార తయారీలో నాణ్యత లోపం, నిల్వ సరకుల సరఫరా జరుగుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన జాయింట్ కలెక్టర్ నిషాంతి.. జిల్లాలోని ఆహార తయారీ కేంద్రాల తనిఖీకి ఆదేశించారు. ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా డీఎస్వో ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు ముఖ్య పట్టణాల్లో పౌర సరఫరాల, ఆహార భద్రత, తూనికలు–కొలతల శాఖల సంయుక్తాధ్వర్యంలో తనిఖీలు జరిగాయి. దాదాపు 200 ప్రదేశాల్లో ఏకకాలంలో జరిగిన తనిఖీల్లో అనేక లోపాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకున్నట్టు డీఎస్వో చెప్పారు. జేసీ నిషాంతి స్పందిస్తూ, ఎక్కడా ఆహార కల్తీలు కానీ, నాణ్యత లేని, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని సరఫరా చేయడాన్ని సహించబోమని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనని, ఇలాంటి తనిఖీలు విస్తృ తంగా చేపడతామని స్పష్టం చేశారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించిన నియమాలను అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు తప్పక పాటించాలన్నారు. కొన్నిచోట్ల ఈ నిబంధనలు పాటించకపోవడం వల్ల ఆహారం కల్తీ కావడం, నాణ్యత తగ్గడం జరుగుతున్నాయని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఆయా యజమాన్యాలు వ్యవహరించాలని ఆదేశించారు. నిల్వ, కాలం చెల్లిన, హానికర పదార్థాలు ఆహార తయారీలో వినియోగించరాదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఫుడ్ సేఫ్టీ, తూనికలు–కొలతల శాఖల జరిమానాలతో పాటు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తప్పవన్నారు. భద్రతతో కూడిన ఆహారం అందించకపోతే వ్యాపారాలను పూర్తిగా రద్దు చేయాలన్నారు. తనిఖీల్లో జిల్లా తూనికలు–కొలతల అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా ఆహార భద్రత అధికారి రామయ్య, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. హోటళ్లలో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, కల్తీ, వంటి సమస్యలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు డీఎస్వో ఉదయభాస్కర్ చెప్పారు. జిల్లాలో 200 చోట్ల ఏకకాలంలో నిర్వహణ కల్తీ, నిల్వ లోపాలు గుర్తించి అధికారుల తక్షణ చర్యలు లైసెన్స్ రద్దు చేస్తామని జేసీ హెచ్చరిక -
పంచారామ యాత్ర, శబరిమలైకి ప్రత్యేక బస్సులు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే కార్తికమాసం సందర్భంగా పంచారామ క్షేత్ర దర్శనం, అయ్యప్పస్వామి యాత్ర చేసే వారికి శబరిమలై ప్రత్యేక బస్సులు కాకినాడ డిపో నుంచి ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజారవాణాధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం యాత్రకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. పంచారామ స్పెషల్ అక్టోబర్ 25, 26 తేదీల్లో, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీల్లోను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కాకినాడలో శనివారం రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట దర్శనం తర్వాత కాకినాడ చేరుకొంటుందన్నారు. శబరిమలై యాత్రవెళ్లే అయ్యప్పభక్తులు వారు కోరుకున్న చోట నుంచి కోరుకొన్న క్షేత్రాలను చూపించడానికి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ యాత్రకు వెళ్లే వారు 99592 25564 నంబర్లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మనోహర్, పీఆర్వో వెంకటరాజు పాల్గొన్నారు. -
వేగంగా విశ్రాంతి షెడ్డు నిర్మాణం
● పనులను పరిశీలించిన కమిషనర్ రామచంద్రమోహన్ ● కార్తికమాసం నాటికి పూర్తి చేయాలని ఆదేశం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం ఎదురుగా నిర్మిస్తున్న భక్తుల విశ్రాంతి షెడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నానికి చెందిన ‘లారెస్’ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గత నెల మూడో తేదీన ఈ షెడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో సుమారు మూడు వేల మంది భక్తుల సేద తీరేలా దీనిని నిర్మిస్తున్నారు. 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనున్నారు. షెడ్డు చుట్టూ ఐదు అడుగుల మేర షేడ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. సుమారు 10,625 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మిస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం టిక్కెట్లు విక్రయించేందుకు వీలుగా 12 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటి ముందు స్టెయిన్లెస్ స్టీల్ క్యూ లు, మూడు హెలికాఫ్టర్ (హై వాల్యూమ్ లో స్పీడ్ ) ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్లు స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. విశ్రాంతి షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేసి ఎప్పటి కప్పుడు క్లీనింగ్ చేసేలా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విశ్రాంతి షెడ్డు రూఫ్ వరకు పూర్తయింది. పనులను దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ మంగళవారం ఉదయం పరిశీలించారు. షెడ్డు పనుల పురోగతి గురించి ఆయనకు దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ వివరించారు. కార్తికమాసం నాటికి పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తేవాలని కమిషనర్ ఆదేశించారు. -
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బోయవాడైన ఒక సాధారణ మనిషి మహా రుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించిచడం గొప్ప విశేషమని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఆదికవి వాల్మికి జయంతిని మంగళవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్ రాజ్ మహార్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇతిహాసాలలో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణం గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయమన్నారు. రామాయణం వంటి మహాకావ్యాన్ని ఈ సమాజానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి వాల్మీకి అని ఆయన కొనియాడారు. జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఎం.లల్లి, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసరావు, సెట్రాజ్ సీఈవో కెఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. -
కార్యకర్తపై మండిపడ్డ మంత్రి దుర్గేష్ బంధువు
నిడదవోలు : పదేళ్ల నుంచి జనసేన పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఓ కార్యకర్తపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బంధువు ప్రశాంత్ దుర్భాషలాడుతూ మండిపడ్డ ఆడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త ఫణీంద్రకుమార్ను ఇటీవల విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఇందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సిఫారసు చేశారు. అయితే అదే గ్రామానికి చెందిన అంజి అనే జనసేన కార్యకర్త మంత్రి దుర్గేష్ అనుచరుడు ప్రశాంత్కి ఫోన్ చేసి అసలు గ్రామంలో ఎంకై ్వరీ చేయకుండా పదవి ఎందుకు ఇచ్చారంటూ నిలదీశాడు. గ్రామంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోకుండా పదవి ఎలా ఇచ్చారంటూ అంజి ప్రశ్నించాడు. దీంతో ప్రశాంత్ కార్యకర్త అంజిపై విరుచుకుపడ్డాడు. పార్టీ పదవుల విషయంపై నీకు ఏమిటి సంబంధం, నువ్వు ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాకు సంబంధం లేదా అంటూ కార్యకర్త అంజి వాపోయాడు. మంత్రి దుర్గేష్ ఇష్ట ప్రకారం డైరెక్టర్ పదవి ఇచ్చారని, ఎక్కువగా మాట్లాడితే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామంటూ ప్రశాంత్ అన్నాడు. పార్టీ పట్ల నీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోమని దురుసుగా మాట్లాడాడు. మంత్రి కందుల దుర్గేష్కి ఫోన్ చేసి అడుగుతానని కార్యకర్త అంజి చెప్పడంతో మంత్రితో నువ్వు మాట్లాడతావా నువ్వు ఎంత..నీ స్థాయి ఎంత.నువ్వు కేవలం కార్యకర్తవు మాత్రమే.. లీడర్ను అనుకుంటున్నావా అంటూ మండిపడ్డాడు. వైరల్ అవుతున్న ఆడియో -
ముగిసిన పవిత్రోత్సవాలు
పెరవలి: ఆలయానికి వచ్చే అపవిత్ర భక్తులు, మంత్రోచ్ఛారణలో తప్పులు, ఆలయంలోకి వచ్చే క్రిమికీటకాల వలన జరిగే అపవిత్రతను పోగొట్టేందుకే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. పెరవలి మండలం అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించారు. ఉదయం స్వామి అమ్మవార్లకు హోమగుండం ఏర్పాటు చేసి అనంతరం వేదపండితులు పవిత్రాలకు పూజలు చేశారు. అనంతరం పవిత్రాలను, కలశాలను నెత్తిన పెట్టుకుని స్వామి వారికి సమర్పించారు. ఈ పవిత్రాల వల్ల ఆలయానికి, స్వామి వారికి భక్తులు, పండితుల వలన జరిగిన అపవిత్రత పోయి మళీకల జీవం వస్తుందని వర ప్రసాదాచార్యులు తెలిపారు. -
అతివేగం.. తీసింది ప్రాణం
● ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ● అక్కడికక్కడే ఇద్దరి దుర్మరణం రాజానగరం: ఒక్క క్షణం.. ఇంటి వద్ద ఓ కుటుంబం ఎదురుచూస్తుందని ఒక్క క్షణం ఆలోచిస్తే.. ఎంతో జీవితం మిగిలి ఉందన్న ఆలోచన ఒక్క క్షణమైనా వస్తే.. నిర్లక్ష్యపు ప్రయాణం, ప్రమాదకరమైన అతివే గం అనేవి ఉండవు. ఆ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే రెండు నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. మండలంలోని నందరాడ–నరేంద్రపురం మధ్య ఎదురెదురుగా వచ్చిన రెండు బైకులు ఢీకొన్న దుర్ఘటనలో, వాటిపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం, జట్టు కూలీగా పని చేసే రాజానగరానికి చెందిన బుదిరెడ్డి సత్యనారాయణ (30) మంగళవారం సాయంత్రం కో రుకొండ నుంచి స్కూటీపై వస్తున్నాడు. అదే సమయంలో కొవ్వూరుకు చెందిన మోర్ల శ్రీనివాసరావు (45) కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని అత్తవారింటికి వేరే మోటార్ బైక్పై వెళ్తున్నాడు. కాగితాలమ్మవారి గుడి సమీపంలో వీరి వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో గాయపడిన ఇద్ద రు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కాగా శ్రీనివాసరావు వివరాలు తెలియాల్సి ఉంది. రాజానగరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తీరని నష్టం : అతివేగం అనర్థదాయకమంటూ అనేక విధాలుగా హెచ్చరిస్తున్నప్పటికీ వేగ నియంత్రణపై జనాలు దృష్టి పెట్టడం లేదు. నందరాడలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. వీరు ప్రయాణిస్తున్న రెండు వాహనాలు ధ్వంసమైన తీరు చూస్తుంటే.. వీరు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారో అవగతమవుతోంది. ఆ వేగమే వారి ప్రాణాల నూ హరించి, వారి కుటుంబాలకు తీరని నష్టాన్ని చేకూర్చింది. -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో వివిధ క్రీడాంశాల్లో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను ఐపీఈ (ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్) సలీమ్ బాషా ప్రారంభించారు. బేస్బాల్, హాకీ, స్విమ్మింగ్లో అండర్–14, 17 బాలబాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. బేస్బాల్లో 64, హాకీలో 72, స్విమ్మింగ్లో 76 మంది ఎంపికై నట్టు ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు శ్రీనివాస్, సుధారాణి తెలిపారు. పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను పర్యవేక్షించారు. బేస్బాల్ పోటీలు ఎంపికై న కొవ్వూరు పాఠశాల క్రీడా సమాఖ్య ఽఆధ్వర్యంలో కాకినాడ డీఎస్ఏ మైదానంలో నిర్వహించిన అండర్–14, 17 బేస్బాల్ ఎంపికల్లో కొవ్పూరు జెడ్పీ పాఠశాల విద్యార్ధులు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో సోము దీక్షితారాణి, మాసాబత్తుల సూర్యహాసిని, బాలుర విభాగంలో మడుగుల తేజ, అనసూరి రోహిత్, వెంకట్గణేష్, అండర్–17లో విత్తనాల రాజా శ్రీవల్లి, వీధిసత్యశాంతి, సోము హారిక, బాలుర విభాగంలో రెడ్డిసత్య వెంకట్రావు, పిల్లి అభిరామ్ ఎంపికై నట్టు పాఠశాల హెచ్ఎం బండిసత్య శ్రీనివాస్, పీడీ ప్రసాద్ తెలిపారు. -
13 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: అనధికారికంగా తరలిస్తున్న 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. నిందితులపై 6ఏ కేసు నమోదు చేశారు. ఎంఎస్ఓ గొలుగూరి బాపిరాజు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి కాకినాడ జిల్లా పిఠాపురానికి వ్యాన్లో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. ముందుగా అందిన సమాచారంతో జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తుండగా, వ్యాన్ ద్వారా గోనె సంచుల్లో తరలిస్తున్న 13,750 కిలోల రేషన్ బియ్యం లభ్యమైంది. దీని విలువ రూ.12 లక్షలు ఉంటుంది. పట్టుబడిన బియ్యానికి ఎటువంటి రికార్డులు లేకపోవడంతో పిఠాపురం మండలం భోగాపురానికి చెందిన డ్రైవర్ కోరసిక విజయ్, సరకు రవాణాదారు, వాహన యజమాని అయిన గొల్లప్రోలుకు చెందిన గారపాటి రాజుపై 6ఏ కేసు నమోదు చేశారు. రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ఫోన్, నగదు కోసమే హత్య
● ఇద్దరు నిందితుల అరెస్టు ● మారణాయుధం, సొత్తు స్వాధీనం సామర్లకోట/తుని రూరల్: తాగిన మైకంలో ఓ యువకుడితో గొడవపడి, అతడి వద్ద ఉన్న సెల్ఫోన్, రూ.ఐదొందలు నగదు కోసం అతడిని హతమార్చిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తుని రూరల్ పరిధిలోని నర్సీపట్నం బస్టాండ్ వద్ద ఈ నెల రెండో తేదీన రాత్రి తుని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద (నర్సీపట్నం బస్టాండ్ వద్ద) జరిగిన గుర్తు తెలియని యువకుడి హత్య సంచలనం రేపింది. కాకినాడ జిల్లా ఎస్సీ జి.బిందుమాధవ్ ఆదేశాలతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో నియమించిన ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హత్య కేసును ఛేదించారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు వివరాలు వెల్లడించారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన బొడ్డు సురేష్, పాయకరావుపేటకు చెందిన తర్రా ప్రసాద్ చిత్తు కాగితాలు ఏరుకుంటూ, ఆ సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. కుటుంబమంటూ లేకపోవడంతో వారు ఆకతాయిలుగా తిరుగుతున్నారు. వీరిద్దరూ ఈ నెల రెండున రాత్రి బస్టాండ్ సమీపంలో మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన తానార అప్పలనాయుడు(37) బస్టాండ్ వద్దకు వచ్చాడు. నిందితుల వద్దకు వచ్చిన సమయంలో పరధ్యానంలో అప్పలనాయుడు వారిపై పడబోయాడు. దాంతో సురేష్ అతడిని తోసేయడంతో జేబులో ఉన్న విలువైన సెల్ఫోన్ కిందపడింది. చొక్కా జేబులో నగదు కనిపించింది. అతని వద్ద ఉన్న సెల్ఫోన్, నగదు కాజేసేందుకు నిందితులు కుట్ర పన్నారు. అతడి సెల్ఫోన్, నగదును నిందితులు లాక్కునే క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. సమీపంలో ఉన్న రాయి, ఇనుప రాడ్డుతో నిందితులు కలిసి అప్పలనాయుడిపై దాడి చేశారు. ఇష్టానుసారం కొట్టిన తర్వాత రాడ్డును తుప్పల్లోకి విసిరేసి, సెల్ఫోన్, నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా, సంఘటన స్థలిలో దొరికిన ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారు. మంగళవారం తుని పట్టణ శివార్లలో తచ్చాడుతున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు వాడిన ఇనుప రాడ్డు, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను బుధవారం కోర్టులో హాజరుపర్చుతామన్నారు. కేసును ఛేదించిన తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు, గీతారామకృష్ణ, తుని రూరల్ ఎస్సై కృష్ణమాచారి, తొండంగి ఎస్సైలు జగన్మోహన్, జె.విజయబాబు, సిబ్బంది, ప్రత్యేక బృందాలను జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అభినందించారు. -
దేశభక్తి చాటేలా.. స్ఫూర్తి నింపేలా..
● విద్యార్థులకు వీరగాథ 5.0 ● మూడు నుంచి 12వ తరగతుల వారికి పలు పోటీలు ● కేటగిరీలుగా వివిధ అంశాలపై నిర్వహణ ● ఈ నెల 31తో ముగుస్తున్న గడువు రాయవరం: విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు, వారిలో సృజనాత్మకతను వెలికితీసేందుకు జాతీయ విద్యా మంత్రిత్వ, రక్షణ శాఖలు సంయుక్తంగా వీరగాథ 5.0 పేరిట పోటీలు నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. మూడు నుంచి 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యార్థులకు నాలుగు అంశాల్లో పోటీలు చేపడుతున్నారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుల గాథలను వివరించడం, వారి త్యాగాలను తెలిపేలా విద్యార్థులకు పద్యాలు, కథలు, చిత్రలేఖనం, వ్యాసరచన, మల్టీమీడియా ప్రదర్శన వంటి పోటీలు నిర్వహిస్తున్నారు. ఆయా పోటీల్లో పాల్గొనే వారికి ఈ నెల 31వ తేదీ గడువు విధించారు. ఇప్పటికే ఈ పోటీలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఉత్తర్వులు పంపింది. నాలుగు విభాగాల్లో.. పాఠశాలల వారీగా ఆయా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. 3–5 తరగతులకు ఓ విభాగంగా, 6–8, 9–10, 11–12 తరగతులకు వేర్వేరు కేటగిరీలుగా విభజించారు. 3–5 తరగతుల వారికి పద్యం, కథ (150 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, 6–8 తరగతుల వారికి పద్యాలు/కథ(300 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 9–10 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(700 పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన. 11–12 తరగతుల వారికి పద్యాలు, వ్యాసం(వెయ్యి పదాలు), చిత్రలేఖనం, పెయింటింగ్, మల్టీమీడియా ప్రదర్శన ఉంటుంది. ఒకటి లేదా రెండు నిమిషాల నిడివితో దేశభక్తికి సంబంధించిన ప్రదర్శన వీడియో రూపంలో ఇవ్వడమే మల్టీమీడియాగా పరిగణిస్తారు. ఎంచుకోవాల్సిన అంశాలు వీరగాథ 5.0 పోటీల్లో పాల్గొనే విద్యార్థులు వారికి నచ్చిన అంశాలను ఎంచుకునే అవకాశాన్ని కల్పించారు. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన వారిని రోల్ మోడల్గా ఎంచుకుని, వారి నుంచి నేర్చుకున్న విలువలను ప్రస్తావించాలి. ఆ విద్యార్థికి అవకాశమిస్తే ఏం చేయదలిచాడో చెప్పాలి. ఉదాహరణకు ఝాన్సీలక్ష్మీబాయి కలలోకి వచ్చి దేశానికి సేవ చేయాలని కోరితే.. ఏం చేస్తారో వివరించవచ్చు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును తాను ఆదర్శంగా తీసుకున్న స్వాతంత్య్ర సమరయోధుల జీవిత కథఽలు విద్యార్థిపై ఎలా ప్రభావితం చేసిందో చెప్పాల్సి ఉంటుంది. అలాగే స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల తిరుగుబాటు పాత్ర, ఇతర అంశాలను ఎంపిక చేసుకుని వివరించవచ్చు. సద్వినియోగం చేసుకోవాలి వీరగాథ 5.0 పోటీలను అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత ఈ పోటీల ద్వారా బయటకు వస్తుంది. విద్యార్థులకు నిర్వహించిన పోటీలు, మల్టీమీడియా వీడియోలు ఆన్లైన్లో నమోదు చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేలా.. వీరగాథ 5.0 కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే కాకుండా, వారిలోని సృజనాత్మకతను వెలికితీసే చక్కటి కార్యక్రమం. విద్యార్థుల ప్రతిభ జాతీయ స్థాయిలో కనబర్చేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు మార్గదర్శకత్వం చేయాలి. విద్యార్థుల్లో దేశభక్తిని చాటేలా, వీరుల గాథలు వారిలో స్ఫూర్తి నింపేలా పోటీలు నిర్వహించాలి. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నమోదు విధానం ఆయా పాఠశాలల విద్యార్థులకు ఉపాధ్యాయులు కేటగిరీలుగా, తరగతుల వారీగా పోటీలు నిర్వహించాలి. ఆసక్తి ఉన్న విద్యార్థులకు పోటీలు నిర్వహించి, వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ఇన్నోవేటివ్ ఇండియా.మై జీవోవీ.ఇన్/వీర్.గాథ 5.0 అనే వెబ్సైట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ యువర్ ఎంట్రీ అని ఉన్న చోట క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల నుంచి అత్యుత్తమమైన నాలుగు ఎంట్రీలను అప్లోడ్ చేయాలి. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమంగా ఎంపిక చేసిన వాటిని జాతీయ స్థాయికి పంపిస్తారు. జాతీయ స్థాయిలో ఒక్కో విభాగంలో 25 మంది వంతున అత్యుత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల వంతున నగదు పారితోషికాన్ని, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ఇప్పటికే ప్రతిభ కనబరుస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో ఉన్న 2,030 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యల పరిధిలో 2.08 లక్షల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా, కేటగిరీల వారీగా ఉపాధ్యాయులు పోటీలు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యార్థులు సొంతంగా దేశభక్తిని పెంపొందించేలా చిన్న వీడియోలు రూపొందిస్తున్నారు. -
జనారణ్యంలోకి వన్యప్రాణి
● కుక్కకాట్లకు గురైన జింక ● చికిత్స అనంతరం అడవిలో విడిచిపెట్టిన అటవీ అధికారులు ప్రత్తిపాడు: దారి తప్పి జనారణ్యంలోకి ఓ వన్యప్రాణి చొచ్చుకొచ్చింది. శునకాల బారిన పడి గాయపడింది. ప్రత్తిపాడులో శస్త్రచికిత్స చేయగా, తిరిగి అరణ్యంలోకి స్వేచ్ఛగా అడుగిడింది. మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సమీప అటవీ ప్రాంతం నుంచి గొర్రెల మందతో పాటు ఓ జింక జనారణ్యంలోకి అడుగిడింది. రంగంపేట మండలం ఆనూరు గ్రామంలో ఓ గొర్రెల మందతో పాటు జింకను కాపర్లు గమనించారు. అప్పటికే అది కుక్కకాట్లకు గురై, గాయపడి ఉంది. ఈ మేరకు రంగంపేట గ్రామస్తులు జిల్లా అటవీ శాఖాధికారులకు సమాచారం అందించారు. ఏలేశ్వరం డిప్యూటీ రేంజ్ అధికారి ఎం.జాన్సన్ తన సిబ్బందితో రంగంపేట చేరుకుని, గాయపడిన జింకను చికిత్స కోసం ప్రత్తిపాడు ప్రభుత్వ పశు వైద్యశాలకు తరలించారు. పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ చిక్కం బాలచంద్ర యోగేశ్వర్ ఆ జింకకు శస్త్రచికిత్స అందించారు. కుదుటపడిన జింకను మంగళవారం సాయంత్రం ఏలేశ్వరం మండలం లింగంపర్తి రిజర్వు ఫారెస్ట్ ప్రాంతంలో విడిచిపెట్టినట్టు డిప్యూటీ రేంజ్ అధికారి జాన్సన్ తెలిపారు. -
కొవ్వాడలో పట్టపగలు చోరీ
● 50 కాసుల బంగారు ఆభరణాల అపహరణ ● సొత్తు విలువ రూ.40 లక్షలు కాకినాడ రూరల్: మండలంలోని కొవ్వాడ గ్రామంలో పట్టపగలే భారీ చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి గేటు, తలుపు తాళాలు పగులగొట్టి, లోనికి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని బంగారు ఆభరణాలు కొల్లగొట్టారు. ఇంద్రపాలెం పోలీసుల వివరాల మేరకు, కిర్లంపూడి ఎంఈఓ మక్కా చిన్నారావు కొవ్వాడలో నివసిస్తున్నారు. ఆయన భార్య విద్య మాధవపట్నంలో టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమారులు చదువుకుంటున్నారు. సోమవారం ఉదయం 8.30కు ఇంటి తలుపులు వేసి, బయట గేటుకు తాళం వేసి వారు విధులకు వెళ్లిపోయారు. సాయంత్రం 4.30కు తిరిగొచ్చేసరికి గేటు తాళం పగులగొట్టి ఉన్నట్టు గుర్తించారు. లోనికి వెళ్లిచూడగా.. ఇంటి తలుపు తాళం తెరిచి, గదిలోని బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలోని బంగారు ఆభరణాలు కనిపించకపోయేసరికి వారు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ద్వారా రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సుమారు 50 కాసుల బంగారు ఆభరణాలు దొంగిలించారని, వీటి విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారావు ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ చైతన్యకృష్ణ ఈ వివరాలను మంగళవారం రాత్రి మీడియాకు తెలిపారు. -
పట్టుబట్టి.. తూర్పార బట్టి..
సాక్షి ప్రతినిధి, కాకినాడ/బోట్క్లబ్: కూటమి సర్కార్ తీరుపై తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. జిల్లా పరిషత్లో పూర్తి ఆధిపత్యం కలిగిన వైఎస్సార్ సీపీ సభలో పైచేయి సాధించింది. సమావేశం ప్రారంభం నుంచి చివరి వరకు వైఎస్సార్ సీపీ సభ్యులు కూటమి సభ్యులకు చుక్కలు చూపించారు. సర్కార్ పాలనా తీరును వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో ఎండగట్టడంతో సమావేశం ఆద్యంతం కూటమి పక్ష సభ్యులు ఖిన్నులయ్యారు. మంగళవారం కాకినాడలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. తొలుత ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కరప ఎంపీడీఓ బి కృష్ణగోపాల్కు సంతాపంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం అజెండాపై చర్చ ప్రారంభమవ్వగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చకు వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. జిల్లాలో రైతులను ఇబ్బందులు పాల్జేస్తోన్న యూరియా కొరత, మెట్ట ప్రాంత మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులకు జరిగిన నష్టం, జీఎస్టీ, రంపచోడవరం ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించని తీరు, జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు తదితర అంశాలపై చర్చ వాడివేడిగా జరిగింది. తొలుత గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ ప్రైవేటీకరించడంపై సభ అట్టుడికింది. ఈ అంశంపై చర్చ జరగాల్సిందే, ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా సభ తీర్మానాన్ని ఆమోదించాల్సిందేనని వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాస్, కుడుపూడి శ్రీనివాసరావు, గుబ్బల తులసీకుమార్, ఉలవకాయల లోవరాజు తదితరులు పట్టుబట్టారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ వ్యతిరేకించడంతో ఇరుపక్షాల మధ్య సంవాదం చోటు చేసుకుంది. సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చ కోసం పట్టుబట్టి చివరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్ సీపీ సభ్యులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ వేణుగోపాలరావు కల్పించుకుని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్కు సూచించడంతో సభ్యులకు సర్దిచెప్పి తిరిగి సభలోకి తీసుకురావడంతో సమస్య సద్దుమణిగింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం అనంతరం జరిగిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై జరిగిన చర్చలో వైఎస్సార్ సీపీ సభ్యులు పాల్గొని కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. నిర్మాణాలు పూర్తి అయిన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించి ప్రభుత్వ వైద్యవిద్యను పేదలకు దూరం చేసే కూటమి కుట్రలను రాజ్యసభ సభ్యుడు సుభాష్చంద్రబోస్, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తీవ్ర స్థాయిలో నిరసించారు. 16 సంవత్సరాలు సీఎంగా ఒక్క కాలేజీ కూడా తీసుకురాలేకపోయిన చంద్రబాబు.. 17 కాలేజీలను జగన్మోహన్రెడ్డి తీసుకువస్తే వాటిని ప్రైవేటీకరిస్తున్నారని సభ్యులు ధ్వజమెత్తారు. చర్చ అనంతరం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఆమోదింపచేయడంలో వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో పై చేయి సాధించారు. జిల్లాలో యూరియా కొరతతో రైతులు పడుతున్న కష్టాలు సర్కార్ చెవికెక్కలేదంటూ గొల్లప్రోలు, తాళ్లరేవు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, దొమ్మేటి సాగర్ ప్రశ్నించారు. 2023తో పోలిస్తే 2025లో 3వేల మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా పంపిణీ చేశామని వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్ ఇచ్చిన వివరణపై ఎంపీ బోస్ తప్పుపట్టారు. చెబుతున్న లెక్కలకు జిల్లాల్లో ఎరువుల పంపిణీకి అసలు పొంతనే ఉండటం లేదన్నారు. ఇంతలో ఎమ్మెల్సీ అనంతబాబు కల్పించుకుని రంపచోడవరం ఏజెన్సీలో వర్షాభావ పరిస్థితుల్లో ఐదు ఎకరాల రైతుకు ఒక యూరియా బస్తా కూడా ఇవ్వలేదన్నారు. మెట్ట ప్రాంతంతో పోలిస్తే ఏజెన్సీలో రైతులు యూరియా కోసం నానా పాట్లు పడ్డారన్నారు. జగన్ ప్రభుత్వంలో నూరుశాతం రాయితీ విత్తనాలు అందిస్తే ఇప్పుడు ఎంతమంది రైతులకు ఎన్ని టన్నులు ఇచ్చారో చెప్పాలని అనంతబాబు ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం లభించలేదు. ఏజెన్సీలో ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని వై రామవరం ఎంపీపీ ఆనంద్, జెడ్పీటీసీ సభ్యురాలు వెంకటలక్ష్మి నిలదీశారు. వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టి కుటుంబ సభ్యులు టెంకాయ కొట్టిన ఫ్లెక్సీ ఫొటోను అనంతబాబు సభలో ప్రదర్శించి అధికారుల తీరును ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించకుండా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను అవమానపరుస్తున్నారని ఎమ్మెల్సీ అనంతబాబు, రంపచోడవరం ఎంపీపీ వెంకటలక్ష్మి ప్రశ్నించారు. ఐటీడీఏలో డీఈఈ చైతన్య చేసిన పనులకు రెండోసారి బిల్లులు పెట్టి రూ.40 లక్షలు కాజేసిన విషయాన్ని నిరూపిస్తానని ఎమ్మెల్సీ అనంతబాబు నిలదీయగా సమాధానం ఇవ్వలేక అధికారులు నీళ్లు నమిలారు. నకిలీ పత్తి విత్తనాల ప్రస్తావన పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యుడు లోవరాజు సభ దృష్టికి తీసుకువచ్చారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయగా విచారణ చేస్తున్నామని, నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ఉప్పాడ బీచ్ రోడ్డు చాలా అధ్వానంగా తయారైనా పట్టించుకోవడం లేదని జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత ప్రశ్నించారు. తుని ఏరియా ఆస్పత్రిలో ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చి తల్లి తనువు చాలించిన విషయాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని ఆమె నిలదీయగా విచారణ చేస్తున్నామని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు. మరో ఏడాది మాత్రమే తమ పదవీ కాలం ఉందని, ఇప్పటికై నా నిధులు విడుదల చేయాలని జెడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. జీఎస్టీకి అనుకూలంగా తీర్మానాన్ని ఆమోదించే విషయంపై కూటమి పక్ష ప్రజాప్రతినిధులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సోము వీర్రాజుతో వైఎస్సార్ సీపీ రావులపాలెం, గొల్లప్రోలు జెడ్పీటీసీ సభ్యులు కుడుపూడి శ్రీనివాసరావు, లోవరాజు విభేదించారు. సమావేశానికి హాజరైన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడుతున్న చైర్పర్సన్ విప్పర్తి. చిత్రంలో కలెక్టర్ షణ్మోహన్, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావుసాగునీటి కొరత రాకుండా చర్యలుఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4.79 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు నీటి కొరత రాకుండా చూడాలని సభ్యులు అధికారులకు సూచించారు. ఇప్పటి వరకూ 60 టీఎంసీలు సరఫరా చేశామని, గోదావరిలో చేరిన సర్ ప్లస్ సరఫరా చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. సీలేరు జలాలను కూడా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఆలమూరు మండలం లంక భూముల్లో మట్టిని ఇటుక బట్టీల కోసం లోతుగా తవ్వేయడంతో దొండ, ఇతర కూరగాయల పంటల సాగు కనుమరుగవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. గోకవరం, కోరుకొండ, రాజానగరం మండలాలు ఎక్కడో దూరంగా ఉన్న అమలాపురం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో ఉండటం వల్ల అధికారుల పర్యవేక్షణకు, రైతుల సమస్యల పరిష్కారానికి అసౌకర్యంగా ఉందని, వాటిని రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోకి తేవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన ప్రతిపాదనను సభ ఆమోదించింది. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, రంపచోడవరం ఐటీడీఏ పీవో బి.స్మరన్రాజ్, తూర్పుగోదావరి డీఆర్వో టీ.సీతారామమూర్తి, కోనసీమ జిల్లా డీఆర్వో కె.మాధవి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం యూరియా కొరతపై గళం విప్పిన సభ్యులు నకిలీ పత్తి విత్తనాలపై నిలదీత రంపచోడవరం మన్యంలో ప్రొటోకాల్పై చర్చ గరం..గరంగా ‘తూర్పు’ జెడ్పీ సమావేశం -
అధినేతతో జిల్లా నాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కలిశారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశాలలో పాల్గొన్న అనంతరం జగన్ను కలిసి కాకినాడ జిల్లాలో పలు అంశాలపై చర్చించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసన సామర్లకోట: అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్పై దాడి జరగడం దారుణమని పెద్దాపురం న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దాపురంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. పెద్దాపురం బార్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు నుంచి వాకౌట్ చేసి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఘనంగా ప్రత్యంగిర హోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు. కార్తిక మాస ఏర్పాట్లపై నేడు సమావేశం అన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్సదన్ సత్రంలోని ట్రస్ట్ బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన ఇన్చార్జి అధికారి వీ.డీ.జీ.మురళీ మంగళవారం తెలిపారు. ఖతర్ దేశంలో హోమ్కేర్ నర్స్, జర్మనీలో ఫిజియో థెరఫిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ ఉద్యోగాలకు, రష్యాలో మెటలర్జీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. అర్హత, ఫీజు వివరాలు తదితర వాటికోసం 99888 53335 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. -
పత్తి రైతులను ఆదుకోవాలి
● తక్షణం నష్టం అంచనా వేయాలి ● నష్టపరిహారం ఇవ్వాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సాక్షి ప్రతినిధి, కాకినాడ: నిన్న మొన్నటి వరకూ యూరియా కొరత సృష్టించి రైతులతో ఆటలాడుకున్న కూటమి సర్కారు.. ఇప్పుడు పత్తి రైతులను కష్టాల్లోకి నెట్టేసిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. జిల్లాలోని మెట్ట ప్రాంత మండలాల్లో రైతులు గంపెడాశలతో పత్తి సాగు చేశారన్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకస్మాత్తుగా మొక్కలు చనిపోతున్నా రైతుల గోడు సర్కారు చెవికెక్కడం లేదన్నారు. నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్లాటినం రకం విత్తనాలు కొనుగోలు చేసిన ప్రతి రైతూ తీవ్రంగా మోసపోయి గగ్గోలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని కోటనందూరు, తుని, తొండంగి, గోకవరం, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, పెద్దాపురం తదితర మెట్ట ప్రాంత మండలాల్లో సుమారు 35 వేల హెక్టార్లలో రైతులు పత్తి సాగు చేశారన్నారు. గతంలో మూడు విడతలుగా దిగుబడి తీసేవారన్నారు. అటువంటిది రానురానూ రెండు విడతలకే పరిమితమైందన్నారు. నాలుగైదు నెలలుగా కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్న పత్తి పంట చేతికొచ్చే సమయానికి ఇంత దారుణంగా దెబ్బతిని నష్టపోతామనుకోలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ఎకరాకు రూ.40 వేల ఆదాయం వస్తుందనే అంచనాతో ఉన్న రైతులకు ఈ పరిణామం అశనిపాతమేనని అన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా మొదట వ్యవసాయ రంగమే నష్టపోతుందని చెప్పారు. ఎప్పుడూ ఎరువులు దండిగా లభించేవని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత యూరియా కోసం రైతులు నానా పాట్లూ పడ్డారని గుర్తు చేశారు. ఇప్పుడు పిఠాపురం తదితర నియోజకవర్గాల్లో నకిలీ పత్తి విత్తనాల సరఫరా సర్కారుకు రివాజుగా వస్తోందని ఆరోపించారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని, సరైన విజిలెన్స్ లేకపోవడమే దీనికి కారణమని అన్నారు. జిల్లాలో రైతులు ఎక్కడెక్కడ పత్తి సాగు చేశారు, ఎంత మంది రైతులు, ఎన్ని ఎకరాల్లో నష్టపోయారో అధికారులు లెక్కలు రూపొందించాలని రాజా డిమాండ్ చేశారు. -
నేడు జెడ్పీ సమావేశం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి జెడ్పీ పరిధిలోని కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు పాల్గొనాలని సీఈఓ కోరారు. పీజీఆర్ఎస్కు 418 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డుల్లో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. పంచారామ క్షేత్రంలో 22 నుంచి కార్తిక మాసోత్సవాలు సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 20వ తేదీ వరకూ కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం 6 గంటకు ఆకాశదీపంతో కార్తిక మాసోత్సవాలు ప్రారంభిస్తామన్నారు. స్వామివారి కార్త్తిక మాస దర్శనాలు 22 నుంచి ఉంటాయన్నారు. నాలుగు ఆది, నాలుగు సోమవారాల్లో భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్ 5న కార్తిక పౌర్ణమి, 6న కృత్తికా నక్షత్రాన్ని పురస్కరించుకొని గ్రామోత్సవం ఉంటాయని తెలిపారు. స్వామివారు ఆలయానికి తిరిగి వచ్చిన తరువాత రాత్రి జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. నవంబర్ 18న మాసశివరాత్రి, 20న అమావాస్య సందర్భంగా కోటి దీపోత్సవం, 21న పోలి పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారికి జటాజూటాలంకరణతో ఉత్సవాలు ముగుస్తాయని ఈఓ వివరించారు. కార్తిక సోమవారాల్లో తెల్లవారుజామున 4 నుంచి మధ్యాహ్నం 2.30 వరకూ, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకూ స్వామివారి దర్శనాలు ఉంటాయని తెలిపారు. మిగిలిన రోజుల్లో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకూ దర్శనాలు ఉంటాయని నీలకంఠం వివరించారు. వాడపల్లిలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సాక్షి, అమలాపురం: ఆత్రేయపురం మండలంలో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదో తేదీ నుంచి 18వ తేదీ వరకూ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకూ తావు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ మహేష్కుమార్ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులను ఆదేశించారు. కలెక్టరేట్లో వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెల 11, 18వ తేదీల్లో భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, పార్కింగ్, బందోబస్తు ఏర్పాట్లు, రేవుల వద్ద భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 10న శేష వాహన సేవ, 11న హంస వాహన సేవ, 12న హనుమద్వాహన సేవ, 13న సింహ వాహన సేవ, 14న గరుడ వాహన సేవ, 15న ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ, 16న రాజాధిరాజ అలంకరణతో గజవాహన సేవ, 17న ఉదయం కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం అశ్వవాహన సేవ, 18న చివరి రోజు చక్రస్నానం కార్యక్రమాలను జరుగుతాయని వివరించారు. కళావేదిక వరకు బస్సులు నడపాలని, క్యూలు, దర్శన ఏర్పాట్లపై పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ రాహుల్ మీనా, దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, డీఎస్పీ మురళీమోహన్, ఆర్డీవో పి.శ్రీకర్, తహసీల్దార్ రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
భక్తుల్లో అదే అసంతృప్తి
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో వివిధ సేవలపై దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకూ రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో లభిస్తున్న సేవలపై గత ఆగస్టు మాదిరిగానే ఈసారి కూడా దాదాపు 30 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ● సత్యదేవుని దర్శనంపై జూన్లో 73, జూలైలో 74, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా సర్వేలో అది 74.1 శాతంగా నమోదైంది. ● మౌలిక వసతుల కల్పనలో జూన్ 66, జూలైలో 65, ఆగస్టులో 64.9 శాతం మంది సంతృప్తి చెందగా సెప్టెంబర్లో అది 66 శాతంగా ఉంది. ● స్వామివారి గోధుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్లో 77, జూలైలో 78, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా.. ఈసారి అది 79.2 శాతానికి పెరిగింది. ● పారిశుధ్యంపై జూన్లో 70, జూలైలో 68, ఆగస్టులో 66.5 మంది మాత్రమే సంతృప్తి చెందగా, సెప్టెంబర్లో అది 64.5 శాతానికే పరిమితమైంది. కార్తికం నాటికి చక్కదిద్దాలి ఈ నెల 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతోంది. ఆ నెలంతా రత్నగిరికి భక్తుల తాకిడి ఉంటుంది. పర్వదినాల్లో లక్ష మందికి పైగా వస్తారు. ఆ సమయంలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయకపోతే ప్రభుత్వ సర్వేల్లో దేవస్థానం పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుంది. కేవలం ఈఓ మీదనే బాధ్యత వదిలేయకుండా దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా సరైన మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు అవసరమైతే ప్రత్యేకాధికారిని నియమించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సత్యదేవునికి రూ.1.49 కోట్ల హుండీ ఆదాయం
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. గడచిన 35 రోజులకు హుండీల ద్వారా రూ.1,48,77,755 రాబడి వచ్చింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ సందర్భంగా నగదు రూ.1,39,47,961, చిల్లర నాణేలు రూ.9,29,794 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. హుండీల ద్వారా 62 గ్రాముల బంగారం, 345 గ్రాముల వెండి కూడా లభించాయి. అలాగే, అమెరికన్ డాలర్లు 76, ఇంగ్లండ్ పౌండ్లు 15, సింగపూర్ డాలర్లు 4, సౌదీ రియల్స్ 6, యుఏఈ దీరామ్స్ 20, ఖతార్ రియల్స్ 1, మలేషియా రింగిట్స్ 1 చొప్పున భక్తులు హుండీల్లో వేశారు. గత 35 రోజులకు సరాసరి హుండీ ఆదాయం రూ.4.25 లక్షలుగా నమోదైంది. ఈ 35 రోజుల్లో 23 రోజులు భాద్రపదం కాగా, 12 రోజులు మాత్రమే ఆశ్వయుజ మాసం. దసరా సెలవుల్లో భక్తులు రత్నగిరికి పోటెత్తడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడం కూడా హుండీ ఆదాయం పెరుగుదలకు కారణమని అధికారులు తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్, ఈఓలతో పాటు సిబ్బంది, పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు పాల్గొన్నారు. హుండీల్లో వచ్చిన నగదును స్థానిక యూనియన్ బ్యాంకుకు తరలించారు. -
స్వచ్ఛమైన తాగునీరు అందించాలి
సామర్లకోట: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గ్రామీణ నీటిపారుదల విభాగం (ఆర్డబ్ల్యూఎస్) చీఫ్ ఇంజినీర్ ఇషాన్ బాషా అన్నారు. జల్జీవన్ మిషన్పై 11 జిల్లాల్లోని 402 మంది ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు సామర్లకోటలోని విస్తరణ శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో మూడు రోజుల శిక్షణను సోమవారం ఆయన ప్రారంభించారు. మొదటి బ్యాచ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 40 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాషా మాట్లాడుతూ, గ్రామాల్లో ప్రమాణాలు పాటించని ఆర్ఓ కేంద్రాల నీటి వాడకం బాగా పెరిగిపోయిందని, దీని వలన ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు మాట్లాడుతూ, తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలని సూచించారు. ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు మాట్లాడుతూ, తాగునీటి పథకాల నిర్వాహకులు సమన్వయంతో పని చేయాలన్నారు. శిక్షణ పొందే అధికారుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి యూనిట్ను పరిశీలించాలని సూచించారు. ప్రతి బ్యాచ్కు మూడు రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. కాకినాడ ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అబ్దుల్ మదీన్, విశ్రాంత ఎస్ఈ ఉమాశంకర్, పెద్దాపురం డీఈఈలు స్వామి, శ్రీరామ్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, చీఫ్ ఇన్స్ట్రక్టర్ డి.శ్రీనివాసరావు తొలి రోజు శిక్షణ ఇచ్చారు. రేపటి నుంచి ఆధార్ క్యాంపులుబాలాజీచెరువు (కాకినాడ సిటీ): జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ఈ నెల 8 నుంచి ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కాకినాడ పోస్టల్ సూపరింటెండెంట్ కె.కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో తేదిన పిఠాపురం భాష్యం హైస్కూల్, నీలపల్లి ఉన్నత పాఠశాల; 10, 11 తేదీల్లో ఏలేశ్వరం ఎంపీపీ స్కూల్, గాడిమొగ ఉన్నత పాఠశాల; 13, 14 తేదీల్లో పెద్దాపురం లూథరన్ ఉన్నత పాఠశాల, డి.పోలవరం ఉన్నత పాఠశాలల్లో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఐదు నుంచి ఏడేళ్లు, 15 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛాంధ్ర ఉద్యమం నిరంతరం కొనసాగించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానోత్సవం స్థానిక గోదావరి కళాక్షేత్రం ఆడిటోరియంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో 2, జిల్లా స్థాయిలో 15 కేటగిరీల్లో మన జిల్లా 50 అవార్డులు అందుకుందంటూ హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు సాధించిన వివిధ సంస్థల ప్రతినిధులను, అధికారులను అభినందించి, అవార్డులు అందించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ భావన, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు
విత్తనాలు, మొక్కల శాంపిల్స్ సేకరణ పిఠాపురం: గొల్లప్రోలు మండలం చేబ్రోలు తదితర గ్రామాల్లో నకిలీ పత్తి విత్తనాలతో నష్టపోయామంటూ రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అధికారులు సోమవారం పత్తి పంటను పరిశీలించారు. ‘రైతుకు విపత్తి’ శీర్షికన ‘సాక్షి’ సోమవారం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. గుంటూరు లాం ఫామ్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎస్.రాజామణి (ప్రిన్సిపల్ సైంటిస్ట్, పత్తి), డాక్టర్ వీవీ మనోజ్ కుమార్ (ప్రిన్సిపల్ సైంటిస్ట్, తెగుళ్ల విభాగం), డాక్టర్ రాజేష్ చౌదరి (సైంటిస్ట్, కీటక శాస్త్రం), సీతారామశర్మ (పెద్దాపురం ఏరువాక కేంద్రం), జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, పిఠాపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పి.స్వాతి కలసి చేబ్రోలు, చెందుర్తి, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించి పత్తి చేలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిజేరియం విల్ట్, ఆకుమచ్చ తెగులు, టొబాకో స్ట్రీక్ వైరస్ ఆశించడం వలన పత్తి మొక్కలు చనిపోతాయని చెప్పారు. జరిగిన నష్టంపై కలెక్టర్కు నివేదిక సమర్పిస్తామని, మొక్కల శాంపిల్స్ను పరీక్షించేందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. రైతుల నుంచి విత్తనాలు సేకరించి, వాటిని కూడా పరీక్షకు తీసుకు వెళ్తామని, రెండు రోజుల్లో నివేదిక పంపిస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల వెంట అధిక సంఖ్యలో రైతులు, మండల వ్యవసాయ అధికారి కేవీ సత్యనారాయణ, గ్రామ వ్యవసాయ సహాయకులు రాజా, ఉదయ్, రెడ్డి తదితరులున్నారు. అధికారులు శాసీ్త్రయంగా నిర్ధారించకుండా కేవలం తెగుళ్ల వంక చూపించి, విత్తన కంపెనీలకు కొమ్ము కాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కేవలం విత్తనాల్లో నాణ్యత లేనందువల్లనే ఇంత నష్టం జరిగిందని, పూర్తి స్థాయిలో విత్తనాలను పరిశీలించి, అసలు నిజాన్ని బయటపెట్టి, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
సెజ్ రైతులపై కక్ష!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో ప్రతిపక్షంలో ఉండగా కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) లోని రైతుల భూములు తిరిగి వారికే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ రైతులపై కక్ష కట్టినట్టు ఆ అంశాన్ని గాలికొదిలేశారు. తద్వారా కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో సుమారు 300 మంది రైతుల జీవితాలతో సర్కారు ఆటలాడుకుంటోంది. గత చంద్రబాబు పాలనలోనే భూసేకరణ కాకినాడ సెజ్ కోసం తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల పరిధిలో గత చంద్రబాబు సర్కార్ అవసరం లేకున్నా అడ్డగోలుగా 8,401 ఎకరాలు సేకరించింది. ఇందులో 2,180 ఎకరాల భూ సేకరణను అప్పట్లో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ భూముల స్వాధీనానికి అప్పట్లో చంద్రబాబు సర్కారు వందలాది మంది రైతులు, ఉద్యమ నేతలపై ఉక్కుపాదం మోపింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యమం నడిచింది. గతంలో వెనక్కిచ్చిన జగన్ ప్రభుత్వం అటువంటి తరుణంలో ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సెజ్ ప్రాంతానికి వచ్చిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అవసరం లేని భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకని నిర్దేశించిన కాకినాడ సెజ్లో అవసరం లేని భూములను రైతులకు తిరిగి ఇచ్చేయాలని గత జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు 2021 మార్చి 4న జీఓఎంఎస్ నంబర్ 12/21 ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాకుండా రైతులకు ఆ భూములను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని కూడా నిర్ణయింది. ఆ మేరకు 2021 జూలై 6న జీఓఎంఎస్ నంబర్ 158ని అనుసరించి స్టాంప్ డ్యూటీ మినహాయించి ఉచిత రిజిస్ట్రేషన్లతో రైతులకు మేలు చేసింది. రైతులకు తిరిగి ఇచ్చేసే భూములకు రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ప్రారంభమైంది. నాడు గ్రామ సచివాలయాల్లో సైతం ఉచిత రిజిస్ట్రేషన్లు చేయించారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేయక... గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉచిత రిజిస్ట్రేషన్లకు అవసరమైన మార్పులను సంబంధిత సాఫ్ట్వేర్లో చేయకుండా జాప్యం చేస్తోంది. తద్వారా సాంకేతిక ప్రతిబంధకాన్ని సాకుగా చూపిస్తూ, ఉచిత రిజిస్ట్రేషన్లకు బ్రేకులు వేసింది. ఇది సుమారు 300 మంది సెజ్ రైతులకు శాపంగా మారింది. గత జగన్ ప్రభుత్వం భూ మార్పిడి కింద రైతుల నుంచి 785 ఎకరాలు తీసుకుని, వారి సొంత మండలాల్లో గ్రామాలకు ఆనుకుని భూములు తిరిగి ఇవ్వడానికి శ్రీకారం చుట్టింది. సెజ్ కోసం చంద్రబాబు సర్కారు అడ్డగోలుగా సేకరించిన భూముల్లో 526 ఎకరాలను జగన్ ప్రభుత్వం రైతులకు తిరిగి ఇవ్వడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయించింది. అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రైతులకు 259 ఎకరాలు రీ రిజిస్ట్రేషన్లు జరగకుండా పెండింగ్లో పడిపోయాయి. అలాగే, ఎవరి భూమి వారికి వదిలేసిన దానిలో 1,395 ఎకరాలున్నాయి. ఇందులో 465 ఎకరాలు రైతుల పేరున రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేశారు. మిగిలిన 930 ఎకరాలు రిజిస్ట్రేషన్కు నోచుకోక రైతులు గగ్గోలు పెడుతున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సాఫ్ట్వేర్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది అక్టోబరు 30న జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి రిజిస్ట్రేషన్ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్కు లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కూటమి సర్కారు సాఫ్ట్వేర్లో మార్పులు చేయకుండా గాలికొదిలేసింది. పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి భూములున్నా రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంతోమంది రైతులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో తిరిగి ఇచ్చిన భూములకు కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. తక్షణమే రిజిస్ట్రేషన్లు యథావిధిగా నిర్వహించాలి. – చింతా సూర్యనారాయణమూర్తి, రైతు, మూలపేట, కొత్తపల్లి మండలం రిజిస్ట్రేషన్లు చేయాలి గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మినహాయింపు ప్రకటించిన సెజ్ భూములకు వెంటనే రిజిస్ట్రేషన్లు చేయాలి. అలా చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. నాకు ఏడెకరాలకు రిజిస్ట్రేషన్ చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మినహాయింపు భూములకు రిజిస్ట్రేషన్ నిలిపియడం చాలా దారుణం. – బొమ్మిడి గోవిందు, రావివారిపోడు, కొత్తపల్లి మండలం గతంలో భూములు తిరిగిచ్చిన జగన్ ప్రభుత్వం నాడు ఉచిత రిజిస్ట్రేషన్లతో మేలు నేడు సాఫ్ట్వేర్ ప్రతిబంధకాలతో జాప్యం కలెక్టర్ లేఖ రాసినా స్పందించని రిజిస్ట్రేషన్ల శాఖ 1,189 ఎకరాలకు నిలిచిన రిజిస్ట్రేషన్లు 300 మందికి ఇబ్బందులు కూటమి సర్కారు తీరుపై ఆగ్రహం నష్టపోతున్న రైతులు తమ భూములను తిరిగి ఇచ్చే ఉద్దేశం లేనందువల్లనే కూటమి ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందనే విమర్శలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో సెజ్ రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. భూములు తమవని చెప్పుకోవడానికే తప్ప అధికారికంగా ఎందుకు పనికిరాకుండా ఉన్నాయని మండిపడుతున్నారు. ఈ భూముల టైటిల్ డీడ్స్ అన్నీ కాకినాడ సెజ్ పేరిట ఉన్నాయి. అదే రైతులకు పెద్ద గుదిబండగా మారింది. ఈ కారణంగా వీటిని కనీసం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలన్నా.. పిల్లలకు కట్నకానుకలుగా ముట్టజెప్పాలన్నా రైతులకు అవకాశం ఉండటం లేదు. కూటమి ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించడానికి ముందుకు రాకుంటే డబ్బులు పెట్టి చేయించుకోవాలని అనుకున్నా సెజ్ భూములు కమర్షియల్లో ఉన్నాయి. ఈ కారణంగా వీటి విలువ పెరిగిపోయి రిజిస్ట్రేషన్ చార్జీలు రెండు మూడింతలు పెరిగిపోయి, రైతులకు తలకు మించిన భారమవుతోంది. వారసత్వంగా తాతముత్తాల దగ్గర నుంచి వస్తున్న ఈ భూములను నాడు జగన్ సర్కార్ తిరిగి ఇచ్చేస్తామని చెప్పడమే కాకుండా ఉచితంగా రిజిస్ట్రేషన్ కూడా చేయించగా.. అంతటి మానవతా దృక్పథం చంద్రబాబు సర్కారుకు లేకుండా పోయిందని రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగా సెజ్ భూముల్లో ఏరువాక సాగి, రైతుల భూములు తిరిగి ఇచ్చేస్తానన్న చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక ఆ విషయం పట్టించుకోకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. -
నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబీ మాట్లాడుతూ, నామమాత్రంగా మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారని, వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను పక్కన పెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఆ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని బాబీ డిమాండ్ చేశారు. -
రత్నగిరిపై కొనసాగుతున్న రద్దీ
అన్నవరం: రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి 50 వేల మంది భక్తులు ఆదివారం సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. క్యూ లైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తుల తో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామి ని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడికి, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటలకు టేకు రథంపై ఊరేగించారు. ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం -
రైతుకు విపత్తి
ఎప్పుడూ ఇంత దారుణంగా నష్టపోలేదు పదేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాం. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదు. ప్లాటినం రకం విత్తనాలు ఒక ఎకరం, మరో రకం విత్తనాలు మరో ఎకరంలో సాగు చేశాను. ప్లాటినం రకం విత్తనాలు వేసిన చేలో మొక్క లు చనిపోతున్నాయి. మొక్క ఎర్రబారి ఎండిపోతోంది. కంపెనీ ప్రతినిధులు వచ్చి చూసి వెళ్లారు తప్ప ఏ సమాధానమూ చెప్పలేదు. మాకు విత్తనాలు అమ్మిన దుకాణదారు కూడా ఎగతాళిగా మాట్లాడుతున్నాడు. ఇప్పటికే సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లింది. – ధూళిపూడి వెంకటరావు, రైతు, చేబ్రోలు పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రైతులు కష్టాలకు గురవుతూనే ఉన్నారు. చిన్న విషయానికి కూడా జిల్లా యంత్రాంగం మొత్తం వచ్చేసి హడావుడి చేసే ఈ నియోజకవర్గంలో ఏడాదిన్నర నుంచి రైతులు అనేక సందర్భాల్లో ఆందోళన బాట పడుతున్న పరిస్థితులే నెలకొంటున్నాయి. గతంలో ధాన్యం కొనుగోళ్లు, వరద నష్టం పంపిణీ.. కొద్ది రోజుల కిందట యూరియా అందక అన్నదాతలు ఆందోళనలు చేశారు. ఈ కోవలోనే తాజాగా నకిలీ విత్తనాలపై పత్తి రైతులు రోడ్డెక్కారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో పత్తి సాగు అధికంగా జరుగుతూంటుంది. ముఖ్యంగా గొల్లప్రోలు మండల రైతులు ఎక్కువగా పత్తి సాగు చేస్తారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఇక్కడి రైతులు వేదా కంపెనీ ఉత్పత్తి చేసిన ప్లాటినం రకం విత్తనాలు కొనుగోలు చేశారు. పంట వేసి రెండు నెలలు గడిచింది. అయినప్పటికీ దిగుబడి రాకపోగా, మొక్కలు వాటంతట అవే ఎండిపోవడం ప్రారంభమైంది. ఎందుకిలా జరుగుతోందో వారికి అర్థం కాలేదు. రకరకాల పురుగు మందులు వాడి చూశారు. అయినా ప్రయోజనం లేదు. విత్తనాలు కొన్న దుకాణదారుకు ఈ సమస్య చెప్తే ఎగతాళిగా మాట్లాడారు. సమస్యను విత్తన కంపెనీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో దాని ప్రతినిధులు వచ్చి పంటను చూసి వెళ్లారు. ఆ తరువాత ఎటువంటి స్పందనా లేదు. తమకు జరిగిన నష్టంపై దుకాణదారు, కంపెనీ ప్రతినిధులు కనీసం ఎటువంటి సమాధానం చెప్పకపోవడంపై మండిపడిన రైతులు చేబ్రోలులోని విత్తనాల షాపు ముందు శనివారం రాత్రి ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో ప్లాటినం రకం పత్తి విత్తనాలను రైతులు వేసినట్లు సమాచారం. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి, దుర్గాడ, తాటిపర్తి తదితర ప్రాంతాల్లోనే సుమారు 2 వేల ఎకరాల్లో ఈ రకం విత్తనాలు సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఒక చేబ్రోలులోనే 400 ఎకరాల్లో ఈ విత్తనం వేశారు. ఎకరానికి సుమారు రూ.80 వేల వరకూ పెట్టుబడి పెట్టినా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. మొత్తం చేనంతా నాశనమైందని రైతులు వాపోతున్నారు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన పంట మాత్రమే దెబ్బ తినడంతో ఆ విత్తనాలు నాసిరకం లేదా నకిలీవి అయి ఉంటాయని ఆరోపిస్తున్నారు. ఎకరానికి రూ.80 వేల నష్టం కంపెనీ ప్రతినిధితో రైతులు ఫోనులో మాట్లాడితే.. ‘కావలిస్తే సైంటిస్టుల్ని తెచ్చుకోండి.. మీకు నచ్చింది చేసుకోండి’ అని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా డీలర్లు, దుకాణం యజమానులు రెండు నెలలుగా పట్టించుకోలేదు. దీంతో, ఆందోళనకు దిగాల్సి వచ్చింది. రెండెకరాల్లో సాగు చేసేందుకు ప్లాటినం రకం పత్తి విత్తనాలను చేబ్రోలు సాయికృష్ణ ఏజెన్సీస్లో కొన్నాను. కాయలు కాసే దశలో పత్తి మొక్కలు ఎక్కడికక్కడే చనిపోవడం మొదలైంది. ఎక్కడైనా పత్తికాయ పగిలితే నల్లబారిపోతోంది. కాయ రాలిపోతోంది. మొక్క గిడసబారి గుడ్డి పత్తిలా పగులుతోంది. చివరకు మొక్క చనిపోతోంది. గత సంవత్సరం ఎకరం పత్తి సాగు చేస్తే రూ.50 వేల నుంచి రూ.80 వేల వరకూ లాభం వచ్చింది. ఇప్పుడు మేం పెట్టిన పెట్టుబడి రూ.80 వేలు వచ్చే పరిస్థితి లేదు. తీవ్ర నష్టాల పాలయ్యాం. విత్తనాలమ్మిన దుకాణదారు తనకు సంబంధం లేదని చెబుతున్నారు. – ఓరుగంటి సూర్యచంద్రశేఖర్, పత్తి రైతు, చేబ్రోలు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. సుమారు రూ.2 లక్షలు పైగా పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకూ కేజీ పత్తి కూడా చేతికి రాలేదు. చెట్లన్నీ చనిపోతున్నాయి. కాయ పగలడం లేదు. విత్తనం గురించి దుకాణదారుకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రెండు నెలలుగా తిరుగుతున్నాం. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కేవలం ప్లాటినం రకం విత్తనాలు సాగు చేసిన వారి పంటే పూర్తిగా దెబ్బ తింది. మిగిలిన రకాలు వేసిన వారి పంటలు బాగానే ఉన్నాయి. అందువల్లనే విత్తనాల్లో తేడా ఉందని చెబుతున్నాం. దీనిపై అధికారులు విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుని, రైతులను ఆదుకోవాలి. – ధూళిపూడి గనికిరాజు, రైతు, చేబ్రోలు సరిగ్గా పండకుండానే ఎండిపోయిన పత్తి మొక్క ఫ పవన్ ఇలాకాలో రైతుకు మరో విపత్తు ఫ నిండా ముంచేసిన నకిలీ పత్తి విత్తనాలు ఫ 2 వేల ఎకరాల్లో పంట నష్టం ఫ రూ.లక్షల్లో నష్టపోయిన రైతులు ఫ పట్టించుకోని విత్తన కంపెనీ, అధికారులు చర్యలు తీసుకుంటాం ప్లాటినం రకం విత్తనాలు దెబ్బ తీసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మాకు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకుంటాం. అవసమైతే శాస్త్రవేత్తలను రప్పించి, పంట నష్టం ఎందువల్ల జరిగిందనే దానిపై పరిశీలన చేయిస్తాం. విత్తనాల వల్లే ఇలా జరిగిందా లేక ఏదైనా తెగులు సోకిందా అనే అంశాలను కూడా పూర్తిగా పరిశీలించి నిర్ధారించాల్సి ఉంది. – సత్యనారాయణ, వ్యవసాయ అధికారి, గొల్లప్రోలు -
ఆయనొస్తేనే చేపల వేట
కొత్తపల్లి: తీర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల వలన సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద లభించకపోవడంతో మండలంలోని మత్స్యకారులు ఇటీవల కుటుంబ సమేతంగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వచ్చి, తమకు న్యాయం చేయాలని ఆ సందర్భంగా డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి త్వరలోనే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని అప్పట్లో జిల్లా కలెక్టర్ చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. ఆందోళన చేపట్టినప్పటి నుంచీ ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటకు చెందిన మత్స్యకారులు పవన్ వచ్చి హామీ ఇచ్చేంత వరకూ వేటకు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రామన్నపాలెం, కోనపాపపేట తీర ప్రాంతంలో బోట్లకు లంగరు వేశారు. మరోవైపు రొయ్యల శుద్ధి పరిశ్రమలకు వెళ్లే మత్స్యకార మహిళలు కూలి పనులు కూడా మానుకున్నారు. ఉప్పాడ, అమీనాబాదు, మూలపేట, కోనపాపపేటలో చేపలను విక్రయించే అంగళ్లు సైతం నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారు. తమ సూచనలు పాటించకుండా వేటకు వెళ్లే వారికి జరిమానా విధిస్తామని మత్స్యకార నాయకులు స్పష్టం చేశారు. తమ ఓట్లు వేయించుకుని గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్ తక్షణం ఉప్పాడ వచ్చి, మత్స్యకారులతో సమావేశం నిర్వహించి, సమస్య పరిష్కరించేంత వరకూ వేటకు వెళ్లబోమని మత్స్యకారులు చెబుతున్నారు. న్యాయం చేయకపోతే ఈ నెల 13 నుంచి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దీనిపై మత్స్యకార గ్రామాల్లో నాయకులు సమావేశమై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించుకుంటున్నారు. ఫ పవన్ రావాల్సిందే.. ఫ మా సమస్యలు పరిష్కరించాల్సిందే.. ఫ మత్స్యకారుల స్పష్టీకరణ ఫ ఉప్పుటేరులో నిలిచిపోయిన బోట్లు ఫ 13 నుంచి ఉద్యమం ఉధృతం చేసేందుకు అడుగులు -
సివిల్ పెన్షనర్ల నూతన కార్యవర్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. కాకినాడలో శనివారం జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్గా పి.మహేశ్వరరావు, కన్వీనర్గా తురగా సూర్యారావు, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శిగా డీఎల్ఎన్ శాస్త్రి, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పాత పెన్షనర్లకు వేతన సంఘం సిఫార్సులు అందించాలని డిమాండ్ చేశారు. వాలిడేషన్ చట్టం రద్దుతో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాజ్యసభ, ఎంపీలను కలిసి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. -
నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా..
● వాడపల్లి క్షేత్రంలో భక్తజన ప్రవాహం ● ఒక్క రోజులోనే దేవస్థానానికి రూ.53.41 లక్షల ఆదాయం కొత్తపేట: గోవింద నామస్మరణతో కోనసీమ తిరుమల క్షేత్రం మార్మోగింది. నిత్య కల్యాణమూర్తీ.. గోవిందా.. శ్రీనివాసా... శ్రీ పురుషోత్తమా.. అంటూ వాడపల్లి వాసుని స్మరిస్తూ భక్తులు తన్మయులయ్యారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కోర్కెలు తీరిన అనేక మంది భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన చేరుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా సుగంధ పరిమళ పుష్పాలతో విశేషంగా అలంకరించారు. శ్రీవేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వేలాది మంది భక్తులతో లైన్లు నిండిపోయాయి. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు అన్ని సౌకర్యాలూ కల్పించారు. ఉచిత వైద్య శిబిరాల్లో పలువురు భక్తులకు వైద్య సేవలందించారు. ఉచిత వాహనాల్లో వృద్ధులు, దివ్యాంగులను, గర్భిణులను చేరవేశారు. విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదాన విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో దేవస్థానానికి సాయంత్రం 7 గంటల సమయానికి రూ.53,41,146 ఆదాయం వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్సై ఎస్ రాము వాడపల్లిలో ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలను పర్యవేక్షించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
వైఎస్సార్ సీపీలో నియామకాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తునికి చెందిన నల్లమిల్లి గోవింద్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు వెలువరించింది. అలాగే, పిఠాపురానికి చెందిన అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డిని పార్టీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శిగా నియమించారు. జల్ జీవన్ మిషన్పై రేపటి నుంచి శిక్షణ సామర్లకోట: జల్జీవన్ మిషన్ కార్యక్రమంపై 11 జిల్లాల్లోని ఏఈఈలు, డిప్యూటీ ఎంపీడీఓలకు స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని 402 మందికి ఈ నెల 17 వరకూ బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తామని వివరించారు. ప్రతి బ్యాచ్కు మూడు రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలందరికి జల భద్రత కల్పించడం లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. మూడు రోజుల శిక్షణలో భాగంగా జల్ జీవన్ మిషన్ అమలు చేస్తున్న గ్రామాల సందర్శన కూడా ఉంటుందని ప్రసాదరావు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు సహాయం పంపిణీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో అర్హులైన ఆటో, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం జమ చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. జిల్లాలోని 12,966 మంది డ్రైవర్ల ఖాతాల్లో శనివారం రూ.19.44 కోట్లు జమ చేశారు. స్థానిక స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, అర్హులైన వారికి ఈ పథకం అందకపోతే సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి దరఖాస్తులను ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి, డబ్బులు జమ చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన పాల్గొన్నారు. నేడు పారా స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా మైదానంలోని స్విమ్మింగ్ పూల్లో ఆదివారం పారా స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా దివ్యాంగుల పారా స్విమ్మింగ్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి.రామస్వామి, సాఖీర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఏలూరులో జరగనున్న 7వ రాష్ట్ర స్థాయి పారా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును ఈ సందర్భంగా ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఉదయం 9 గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్దకు హాజరు కావాలని, వివరాలకు 93901 31777 నంబరులో సంప్రదించాలని సూచించారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వివిధ కోర్టుల్లోని కేసులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరించే విధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (పీపీ), అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు (ఏపీపీ) కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకటరావు అన్నారు. పీపీలు, ఏపీపీలతో కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమావేశంలో వివిధ కేసుల పరిస్థితిపై ఆయన సమీక్షించారు. జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ఎన్ని కేసులు వేశారు.. ఎన్నింటికి తీర్పులు వెలువడ్డాయి.. పెండింగ్ కేసులు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. లెక్చరర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం పిఠాపురం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పద్ధతిలో పని చేయడానికి కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ కావాలని ప్రిన్సిపాల్ పి.సుభాషిణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు దీనికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. -
అన్నవరం.. భక్తజనసంద్రం
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన అన్నవరం దివ్యక్షేత్రం శనివారం భక్తజనసంద్రాన్ని తలపించింది. వేలాదిగా వచ్చిన భక్తులకుతోడు వివాహ బృందాల వారు, నవ దంపతులు, వారి బంధువులు తరలి రావడంతో రత్నగిరిపై తెల్లవారుజాము నుంచే తీవ్ర రద్దీ ఏర్పడింది. సుమారు 60 వేల మంది భక్తులు సత్యదేవుడిని దర్శించుకున్నారు. సత్యదేవుని సర్వ దర్శనానికి మూడు గంటలు, రూ.200 టికెట్టుపై అంతరాలయ దర్శనానికి రెండు గంటల చొప్పున సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 5 వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 8 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. భక్తులకు ఇబ్బందులు ఫ ఉదయం నుంచే వివిధ వాహనాల్లో వేలాదిగా భక్తులు వచ్చారు. రత్నగిరిపై పార్కింగ్కు చోటు చాలకపోవడంతో ఆ వాహనాలను సత్యగిరికి మళ్లించారు. దీంతో, భక్తులు అక్కడి నుంచి ఆలయానికి నడిచి రావాల్సి వచ్చింది. ఉచిత బస్సు ఉన్నప్పటికీ అందులో 50 మందికి మించి ఎక్కే అవకాశం లేకపోవడంతో ఇబ్బంది తప్పలేదు. ఫ అంతరాలయం టికెట్టు తీసుకున్నప్పటికీ వెలుపల నుంచే సత్యదేవుని దర్శనం కల్పించడంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సి రావడంతో వృద్ధులు, చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం. పలుమార్లు తోపులాట జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో క్యూ లైన్లను నియంత్రించే వారే లేకుండా పోయారు. ఫ ప్రత్యేక దర్శనం చేయిస్తామంటూ పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు భక్తుల నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారు. వారిని దేవస్థానం ఉద్యోగుల సహాయంతో ఆలయానికి తీసుకువెళ్లారు. దీనిని అడ్డుకునే వారే లేకపోవడంతో ఇతర భక్తులు ఇబ్బంది పడ్డారు. ·˘ సత్యదేవుని దర్శించిన 60 వేల మంది భక్తులు ·˘ రూ.60 లక్షల ఆదాయం -
కడుపుకొట్టి.. బుజ్జగింపులా..?
సాక్షి, అమలాపురం/పి.గన్నవరం: ఓవైపు ఉచిత బస్సు పేరుతో తమ పొట్ట కొట్టారనే ఆగ్రహం.. దీనికి తోడు ఇస్తానన్న రూ.15 వేల సాయానికి నిబంధనల కొర్రీలు.. ఇలా గిల్లి జోల పాడినట్టుగా వ్యవహరిస్తున్న కూటమి సర్కారు తీరుపై ఆటో డ్రైవర్లు మండిపడ్డారు. టీడీపీ శనివారం నిర్వహించిన ‘ఆటో డ్రైవర్ల సేవలో..’ కార్యక్రమం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో రసాభాసగా మారింది. ‘గోరంత సాయానికి.. కొండంత హడావుడి’ అనే తీరులో ప్రచారార్భాటం చేయాలనుకున్న నేతల వ్యూహం బెడిసికొట్టింది. పలుచోట్ల ఆటో డ్రైవర్లు ఎదురు తిరిగారు. కూటమి సర్కారు తీరుపై అసంతృప్తితో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం అమలాపురంలో టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆటో డ్రైవర్ల సేవలో ర్యాలీకి వంద ఆటోలు కూడా రాలేదు. వచ్చిన వారిలోనూ చాలా మంది కార్యక్రమంలో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఎమ్మెల్యే ఆనందరావు, ఇతర టీడీపీ నేతలు వచ్చిన సమయంలో కొంతమంది చోటామోటా నాయకులు ఆటోల ముందు టీడీపీ జెండాలతో ఫొటోలు దిగేందుకు సిద్ధమయ్యారు. దీనికి ఆటో డ్రైవర్లు అభ్యంతరం చెప్పడంతో తమ్ముళ్లు కంగుతిన్నారు. టీడీపీ, జనసేన బాహాబాహీ నియోజకవర్గ కేంద్రమైన పి.గన్నవరంలో టీడీపీ, జనసేన నేతలు బాహాబాహీకి దిగారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో పాటు, పరుష పదజాలతో తిట్ల దండకం అందుకున్నారు. ఇక్కడ నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కోసం రవాణా శాఖ తయారు చేసిన ఫ్లెక్సీపై, ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసే నమూనా చెక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో లేకపోవడంతో జనసేన నేతలు విరుచుకుపడ్డారు. జనసేనకు చెందిన పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సమక్షంలోనే అధికారులపై మండిపడ్డారు. పవన్ వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. తాము నిర్వహించే కార్యక్రమాల్లో చంద్రబాబు ఫొటో వేస్తున్నామని, టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం పవన్ కల్యాణ్ ఫొటో వేయ డం లేదని ప్రశ్నించారు. అధికారులు సర్ది చెబుతున్న సమయంలో టీడీపీకి చెందిన మద్దాల సుబ్రహ్మణేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో జనసేన నేతలు మండిపడ్డారు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో పాటు మాజీ జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఇతర టీడీపీ నాయకుల పైకి దూసుకుపోయారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు కలుగజేసుకుని ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పారు. ఫ బెడిసికొట్టిన ‘ఆటో డ్రైవర్ సేవలో..’ ఫ ఉచిత బస్సు నేపథ్యంలో మొక్కుబడిగా పాల్గొన్న ఆటో డ్రైవర్లు ఫ పసుపు జెండాలతో ఫొటోలకు అంగీకరించని వైనం -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనేక మంది భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారి దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,49,570, అన్నదాన విరాళాలు రూ.51,217, కేశఖండన ద్వారా రూ.7,480, తులాభారం ద్వారా రూ.700, ప్రసాదం విక్రయాలకు రూ.18,600 కలిపి మొత్తం రూ.2,27,627 ఆదాయం సమకూరిందని వివరించారు. భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు భక్తులకు సేవలందించారు. -
రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి
తుని: అన్నవరం రైల్వేస్టేషన్ ట్రాక్పై గుర్తుతెలియని రైలు ఢీకొని జార్ఖండ్ వాసి మృతి చెందిన ఘటన గురువారం జరిగిందని సామర్లకోట రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ పి.వాసు తెలిపారు. మృతుని వద్ద తుని రైల్వే హెడ్ కానిస్టేబుల్ మోహన్రావుకు దొరికిన ఆధారాలను బట్టి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన హోనార్ గ్రామానికి చెందిన సులం పాన్(25)గా తెలిసింది. మృతుడికి తండ్రి మంగళ్సింగ్ పాన్, తల్లి, ముగ్గురు తమ్ముళ్లు, చెల్లి ఉన్నట్టు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కొంతకాలం నుంచి మానసికంగా మృతుడు ఇబ్బంది పడుతున్నట్టు వివరించారు. సుమారు నెలక్రితం చేపల చెరువు వద్ద ప్యాకింగ్ నిమిత్తం వచ్చినట్టు వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
సత్యదేవుని సన్నిధిన ధ్యాన మందిరం
అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో చైన్నెకి చెందిన దాత గురుపరన్, శాంతి దంపతులు రూ.27 లక్షల వ్యయంతో ధ్యాన మందిరం నిర్మిస్తున్నారు. దీనికి విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు వారు శంకుస్థాపన చేశారు. సత్యగిరిపై ఆగమ పాఠశాల సమీపాన ఈ ధ్యాన మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఎనిమిది నెలల్లో నిర్మాణం పూర్తి చేసి, దీనిని భక్తులకు అందుబాటులోకి తీసుకుని రావాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దేవస్థానం అధికారులను ఆదేశించారు. శంకుస్థాపనలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ రామకృష్ణ కూడా పాల్గొన్నారు. దేవస్థానంలో వివిధ పథకాలకు గురుపరన్, శాంతి దంపతులు గతంలో రూ.25 లక్షల మేర విరాళాలు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్
కాకినాడ లీగల్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా అడారి గణేశ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఇప్పుటి వరకు భీమవరం జిల్లా ట్రెజరీ శాఖలో అసెస్టెంట్ డైరెక్టర్, అకౌంట్ ఆఫీసర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులయ్యారు. జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్గా గణేశ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయనను మర్యాద పూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు, ఉద్యోగులు కలిశారు. -
ప్రాణ సంకటంగా బాణసంచా
రాయవరం: దీపావళి పండగ అంటే చిన్నా, పెద్దా అందరికీ ఆనందమే. ఈ నెల 21న దీపావళి పర్వదినం జరుపుకొనేందుకు జనం సన్నద్ధమవుతున్నారు. అయితే జీవితంలో వెలుగులు నింపాల్సిన దీపావళి పండగ..కొందరి స్వార్థంతో చీకట్లును తెస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ, నిల్వలు చేస్తుండడంతో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా ఇలాంటి దుర్ఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. దీపావళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. లైసెన్స్ పొందినవారు బాణసంచా తయీరీలో నిమగ్నమయ్యారు. అధికారికంగా బాణసంచా తయారీ చేసే వారికంటే అనధికారికంగా చేసేవారు ఎక్కువ. గతంలో అధికారికంగా బాణసంచా తయారీ చేసే కేంద్రాలతో పాటు అనధికారికంగా బాణసంచా తయారీ చేసే చోట కూడా ప్రమాదాలు సంభవించి అధిక సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. 45 వరకు బాణసంచా తయారీ కేంద్రాలు దీపావళికే కాక పలు సందర్భాల కోసం బాణసంచా తయారు చేస్తుంటారు. ప్రస్తుతం దీపావళికి బాణసంచా తయారు చేసే పనిలో జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులకు చేతినిండా పని ఉంటుంది. బాణసంచా తయారీ కోసం ఫారమ్ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్డ్ తయారీ కేంద్రాలు ఉన్నాయి. అతి పెద్ద ఘటన అదే బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. జిల్లాలోని మండపేట, జువ్విపాడు, ద్రాక్షారామ, కొమరిపాలెం, రాయవరం, బిక్కవోలు, యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప తదితర చోట్ల బాణసంచా కేంద్రాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే వాకతిప్పలో 2014 అక్టోబర్ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన జిల్లాలోనే అతి పెద్ద దుర్ఘటనగా చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది. గతేడాది మండపేట మండలం ఏడిదలో దీపావళి ముందు రోజు జరిగిన దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో తాము నిర్వహిస్తున్న కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. అనధికార నిల్వలతోనే.. బాణసంచా తయారీకి పేరొందిన తమిళనాడులోని శివకాశి నుంచే రాష్ట్రానికి ఎక్కువగా సరకు దిగుమతి అవుతుంది. చైనా బాణసంచా కూడా అధికంగానే దిగుమతి చేసుకుంటున్నారు. పలువురు వ్యాపారులు దీపావళికి బాణసంచాను దిగుమతి చేసుకుని నిల్వలు పెట్టుకుంటారు. నిబంధనలు అతిక్రమించి గోడౌన్లలో నిల్వలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బాణసంచా గొడౌన్ ఏర్పాటు చేయాలంటే ఫారం–26 ప్రకారం అధికారులు అనుమతి ఇవ్వాల్సి ఉంది. జనావాస ప్రాంతంలో బాణసంచా నిల్వలు ఏర్పాటు చేయరాదు. అగ్నిమాపక నిబంధనలు పాటిస్తూ, గ్రామ శివారు ప్రాంతాల్లోనే బాణసంచా కేంద్రాలను నెలకొల్పాలి. మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవేమీ పాటించకుండా కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొంతమంది లైసెన్స్లు పొందకుండానే జనావాసాల మధ్య అవగాహన లేకుండా అనధికారికంగా బాణసంచా తయారు చేయడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అనధికార తయారీదారులతోనే సమస్య జిల్లాలో లైసెన్స్ పొందిన బాణసంచా తయారీదారులు కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని పలువురు అనధికారికంగా జనావాసాల మధ్య బాణసంచా తయారు చేయడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోలీస్, ఫైర్ అధికారులు వచ్చి తరచుగా తనిఖీలు చేపడుతున్నారు. – వి.సత్యనారాయణమూర్తి, గౌరవ అధ్యక్షుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాణసంచా తయారీ యజమానుల సంఘం, రాయవరంరాజీపడే ప్రసక్తి లేదు బాణసంచా తయారీ కేంద్రాలు కచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలి. అప్పుడే రెన్యువల్ లైసెన్స్లకు సిఫారసు చేస్తాం. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. అధికారిక తయారీ కేంద్రాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తున్నాం. అనధికారికంగా తయారు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకుని రావాలి. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం బాణసంచా తయారీదారులు పాటించాల్సిన నిబంధనలు బాణసంచా తయారీ కేంద్రం చుట్టూ 9 మీటర్ల ఖాళీ స్థలం ఉంచాలి. అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వర్తించేందుకు అనువుగా నాలుగువైపులా 9 మీటర్ల మేర ఖాళీ స్థలం ఉండాలి. గ్రామ పంచాయతీ, పట్టణాలకు 1.5 కిలోమీటర్లలోపు మందుగుండు సామగ్రి తయారు చేయకూడదు. బాణసంచా తయారుచేసే ప్రదేశాల్లో అగ్నినిరోధక పరికరాలు ఉండాలి. షెడ్ల నిర్మాణానికి ఉపయోగించే మెటిరీయల్ కనీసం రెండు గంటల పాటు అగ్నిని నిరోధంచగలగాలి. షెడ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన గుమ్మాలు కనీసం 100 సెంటీమీటర్ల వెడల్పు, 200 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. తయారీ కేంద్రంలో ఆటోమెటిక్ వెంటిలేషన్ సిస్టమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 18 ఏళ్లలోపు పిల్లలను, మహిళలను బాణసంచా తయారీకి ఉపయోగించకూడదు. అక్కడ పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా ఫైర్ఫైటింగ్ కోర్సులో ప్రాథమిక శిక్షణ తీసుకుని ఉండాలి. తయారీ కేంద్రం విస్తీర్ణాన్ని బట్టి 5 కిలోల సామర్థ్యం ఉన్న డ్రై పౌడర్ ఎస్టింగ్విషర్ (అగ్నిమాపక సిలిండర్)లు నాలుగు సిద్ధంగా ఉండాలి. ఐదు ట్రక్కుల పొడి ఇసుకను కూడా ఆ ఆవరణలో సిద్ధంగా ఉంచాలి. ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి అవసరమైన నీటి కోసం తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. మంటలు, అగ్నిని సష్టించే ద్రవ పదార్థాలు (పెట్రోలు, డీజిల్ వంటివి) ఎట్టి పరిస్థితుల్లోనూ తయారీ కేంద్రాల్లో నిల్వ ఉంచకూడదు. తయారీ కేంద్రంలో విద్యుద్దీకరణలోను జాగ్రత్తలు పాటించాలి. వైర్లను బహిరంగంగా ఉంచకూడదు. వైర్ల జాయింట్లు ఎక్కడా ఉండకూడదు. తయారీ కేంద్రంలో వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. నీరు, పొడి ఇసుకను నింపిన బకెట్లు సిద్ధంగా ఉంచాలి. బయటి వ్యక్తులు అక్కడికి వెళ్లకుండా చూడాలి. అత్యవసర సమయంలో అలారం మోగించేందుకు, అవసరమైతే లోపలి వారిని బయటకు తీసుకువచ్చేందుకు తగినంత సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి. అగ్నిప్రమాద సమాచారాన్ని అత్యవసరంగా తెలియజేసేందుకు ఫోన్లు అందుబాటులో ఉంచాలి. మండుతున్న బాణసంచాను ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఉంచకూడదు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అందులో మందులు సిద్ధంగా ఉంచాలి. ఈ నిబంధనలను పాటించకుంటే లైసెన్సు రద్దు అవుతుంది. ఎక్స్ప్లోజివ్ యాక్టు ప్రకారం బాణసంచా తయారు చేసే షెడ్లు, ప్లాట్ఫారం తగినంత దూరంలో ఉండాలి. తయారీ కేంద్రాలపై నిఘా అవసరం ప్రమాదాల నుంచి పాఠాలు నేర్వాలి దీపావళి వేళ అప్రమత్తతే రక్ష ప్రమాదాల్లో కొన్ని.. తేదీ ఊరు మృతులు 2012 డిసెంబర్ 30 వి.సావరం (రాయవరం) 3 2014 అక్టోబర్ 22 వాకతిప్ప(యు.కొత్తపల్లి) 18 2015 జూలై 22 పలివెల (కొత్తపేట మండలం) 5 2025 సెప్టెంబర్ 30 విలస (అయినవిల్లి మండలం) 2 -
వృద్ధుడి గల్లంతు
నిడదవోలు రూరల్: బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలోకి జారిపడి వృద్ధుడు గల్లంతైనట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు శుక్రవారం తెలిపారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామానికి చెందిన ఉల్లూరి చిరంజీవి (64) ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటలకు గోదావరి ఒడ్డున బహి ర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారిపడి పోయాడు. చిరంజీవి అల్లుడు ప్రత్తిపాటి శ్రీను ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి గోదావరిలో గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఆర్డీఓ రాణిసుస్మిత, తహసీల్దార్ బి.నాగరాజునాయక్, ఎంపీడీఓ జగన్నాథరావు శుక్రవారం పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● ఒకరికి తీవ్ర గాయాలు ● మోటార్ సైకిల్ను ఢీకొట్టిన కారు పెరవలి: విజయ దశమి రోజున జరిగిన రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. జాతీయ రహదారిపై పెరవలి మండలం నల్లాకులవారిపాలెం వద్ద మోటార్ సైకిల్ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గురువారం రాత్రి 9.20 గంటలకు నల్లాకులవారిపాలెం వద్ద రోడ్డు కట్టింగ్ను దాటే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వైపు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మోటార్ సైకిల్పై ఉన్న ముగ్గురు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడటంతో పాటు వారిపై నుంచి కారు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. ప్రమాదంలో ఇంజేటి ఇస్సాకు (49)పై కారు వెళ్లటంతో తీవ్ర గాయాలు అయి రక్తపు మడుగులో కొట్టుకుంటూ మృతి చెందాడు. కంతేటి పోసయ్య (29) కారు ఢీకొట్టిన వేగానికి గాలిలోకి ఎగిరి రోడ్డు మధ్యలో ఉండే డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాతు వెంకటేశ్వరరావు ప్రమాద సమయంలో గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలై కొట్టుకుంటుండగా స్థానికులు 108లో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూరు అక్కడ నుంచి విజయవాడ, అక్కడ నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. వెనక్కి వెళ్లిపోదామనుకోగా... పండగ రోజు కావటంతో స్నేహితులు ముగ్గురు కలసి ఖండవల్లి నుంచి తణుకు వెళ్లటానికి మోటార్ సైకిల్పై వస్తుండగా నల్లాకులవారిపాలెం వచ్చేటప్పటికి తిరిగి ఖండవల్లి వెళ్లిపోదామని ఉద్దేశంతో మోటార్ సైకిల్ టర్నింగ్ తిప్పటంతో అదే సమయంలో రావులపాలెం నుంచి తణుకు వస్తున్న కారు వేగంగా ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. దీనికితో కారు ఢీకొట్టిన వెంటనే అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కన్నీటి సంద్రమైన ఖండవల్లి ప్రమాదం జరిగిందని తెలిసిన ఖండవల్లిలో మూడు కుంటుంబాలు కన్నీటి పర్యతం అయ్యాయి. పండగ రోజు ఎంతో ఆనందంగా గడిపిన ఈ ముగ్గురు స్నేహితులు రాత్రి అయ్యే సమయానికి మృతి చెందటంతో ఆ కుటుంబాలు కన్నీటిలో మునిగిపోయాయి. గ్రామస్తులు ప్రమాద స్థలానికి వెళ్లి అక్కడ కనిపించిన భయానక దృశ్యాలను చూచి కన్నీరు పెట్టుకున్నారు. మృతుడు పోసియ్య భార్య కనకదుర్గ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెంకటేశ్వరావు తెలిపారు. -
అంబరాన్నంటిన దసరా సంబరాలు
● గగుర్పాటు కలిగించిన చెడీ తాలింఖానా విన్యాసాలు ● కత్తులు తిప్పిన ప్రజాప్రతినిధులు అమలాపురం టౌన్: విజయ దశమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన అమలాపురం దసరా ఉత్సవాలు, ఊరేగింపుల సంబరాలు గురువారం అంబరాన్నంటాయి. పట్టణంలోని ఏడు వీధులైన కొంకాపల్లి, మహిపాల వీధి, నల్లా వీధి, గండువీధి, రవణం వీధి, శ్రీరామపురం, రవణం మల్లయ్యవీధిలకు చెందిన దేవతా మూర్తుల వాహనాలతో ఊరేగింపులు వైభవంగా జరిగాయి. జిల్లావాసులతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉంటున్న వారంతా అమలాపురానికి తరలివచ్చి దసరా ఊరేగింపులను కన్నులారా వీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఏడు వీధుల ఊరేగింపుల సమ్మేళనంతో ఉత్సవాలు జరిగాయి. ఊరేగింపుల్లో చెడీ తాలింఖానా ప్రదర్శనలు ఉత్కంఠభరితంగా, గగుర్పాటు కలిగించేలా సాగాయి. కళ్లకు గంతలు కట్టుకుని నేలపై పడుకున్న వ్యక్తి పొట్ట, గొంతుపై కొబ్బరి కాయలు, కూరగాయలు ఉంచి పట్టా కత్తితో నరికే సన్నివేశాలను చూసేందుకు పలువురు ఎగబడ్డారు. అగ్గి బరాటాల విన్యాసాలు, లేడి కొమ్ములు, బల్లేలతో పోరాటాలు, కర్రసాము ప్రదర్శనలతో ఊరేగింపులు హోరెత్తాయి. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీలు గంటి హరీష్ మాధుర్, సానా సతీష్, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పలు వీధుల దసరా ఊరేగింపుల్లో పాల్గొని కొద్దిసేపు సరదాగా కత్తులు తిప్పారు. అమలాపురానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ కూడా ఊరేగింపుల్లో పాల్గొని సరదాగా కత్తులు, కర్రలు తిప్పారు. ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో దాదాపు 500 మంది పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహించారు. ఏడు వీధుల ఊరేగింపుల వద్ద అడుగడుగునా పోలీసులు వలయంగా మోహరించి ఆయుధాల ప్రదర్శనలతో సాగిన చెడీ తాలింఖానా బృందాలను పర్యవేక్షించారు. ఏడు వీధుల ఊరేగింపులతో అమలాపురం పట్టణం కత్తుల సవ్వడితో హోరెత్తింది. చెడీ తాలింఖానా ప్రదర్శనలకు తోడు ప్రతి వీధి ఊరేగింపులో శక్తి వేషాలు, తీన్ మార్ డప్పులు ఇలా ఎన్నో సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఉత్సవాలు జరిగాయి. అమలాపురంలో ఊరేగింపులు సాగిన మెయిన్ రోడ్లన్నీ జనం రద్దీతో నిండిపోయాయి. ఇళ్ల అరుగులుపై, డాబాలపై ఎటు చూసినా ఊరేగింపులను జనం ఉత్కంఠగా, ఉత్సాహంగా తిలకించారు. ఊరేగింపులను వీక్షించిన డీఐజీ ఏడు వీధుల దసరా ఊరేగింపుల సమ్మేళనాన్ని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్ శుక్రవారం తెల్లవారుజామున వీక్షించారు. గడియారం స్తంభం సెంటరులోని పట్టణ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో వద్ద ఐజీ, ఎస్పీ, ఏఎస్పీలు ఊరేగింపులను దాదాపు గంటన్నర సమయం పాటు వీక్షించారు. ఊరేగింపుల్లో భాగంగా రవణం వీధి మహిషాసురమర్దినీదేవి ఉత్సవ వాహనానికి ఐజీ, ఎస్పీలు ప్రత్యేక పూజలు చేశారు. -
న్యాయం చేయాలంటూ ధర్నా
గణేశ్ జిల్లా ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని బ్లూ ఓషన్ కంపెనీ యాజమాన్య నిర్లక్ష్య వైఖరికి నిరసగా శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికురాలు లొల్ల దుర్గమ్మను గత నెల ఏడవ తేదీన ఫ్యాక్టరీకి చెందిన వాహనం ఢీ కొనడంతో రెండు కాళ్లూ పూర్తిగా దెబ్బతిన్నాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమెకు చెందిన ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా వైద్యం చేయించి ఇంటికి పంపించి వేశారు. అయితే ఆమెకు ప్యాక్టరీ యాజమాన్యం ఆర్థిక సహాయం అందించకపోవడంతో పాటు ఆమె ఆరోగ్య పరిస్థితిపై శ్రద్ధ చూపలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులు ధర్నా చేయడానికి నిర్ణయించారు. ఆమెకు జి. రాగంపేట సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు బుంగా శేఖర్బాబు, ప్రజలు మద్దతు ఇచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ఫ్యాక్టరీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. భర్త పని చేయలేని పరిస్థితిలో ఉండటంతో ఫ్యాక్టరీలో ఆమె పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటోందని చెప్పారు. దుర్గమ్మ మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతుందని తెలిపారు. దుర్గమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బంగారు కృష్ణ, గ్రామ నాయకులు కల్యాణ్, బాబీ, విజయ్లు ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. -
అమ్మ అనుగ్రహం అందరికీ లభించాలి
కాకినాడ రూరల్: అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం అందరికీ లభించాలని కోరుకున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. దేవీ నవరాత్రులను పురస్కరించుకుని రమణయ్యపేట శ్రీపీఠంలో గత నెల 22న మహాశక్తి యాగం ప్రారంభమైన విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన మహిళలు దీక్షా వస్త్రాలు ధరించి లలితా సహస్ర నామాలు పఠిస్తూ భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు చేశారు. దీంతో, నవరాత్రుల్లో 9వ రోజుకే 100 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయి. అనంతరం విజయ దశమి పర్వదినమైన గురువారం నాడు యాగం పరిపూర్ణమైనట్లు స్వామీజీ ప్రకటించారు. ఉదయం ఒకసారి లలితా సహస్ర నామాలు, దేవీ ఖడ్గమాలతో కుంకుమార్చనలు నిర్వహించి, పూర్ణాహుతి గావించారు. భక్తులు తీసుకువచ్చిన బూరెలను హోమగుండంలో వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వరుసగా మూడేళ్ల పాటు 100 కోట్ల చొప్పున ఇప్పటికి 300 కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయని చెప్పారు. వెయ్యి కోట్లు లక్ష్యంగా 400 కోట్ల కుంకుమార్చనలకు వెళ్దామని అన్నారు. యాగం విజయవంతానికి శ్రీపీఠం ట్రస్ట్ చైర్మన్ సుధీర్రాజు, రాగిరెడ్డి దొరబాబు (కన్నా), అశోక్, సురేష్ వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు. పీఠంలో 25 సంవత్సరాలుగా ఆస్థాన సంగీత విద్వాంసుడిగా సేవలందిస్తున్న వినుకోట వెంకటేశ్వరరావును సత్కరించారు, సుధీర్రాజు బంగారు ఉంగరం ప్రదానం చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దసరా మరుసటి రోజున శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామిగా దర్శనమిచ్చారు. మహాశక్తి యాగానికి రెండు నెలల ముందు నుంచే రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఐడీ కార్డులు పొంది, కుంకుమార్చనల్లో పాల్గొని, హాలోగ్రామ్ వేయించుకున్న భక్తులకు శని, ఆదివారాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ ఐశ్వర్య కంకణాలు (రాగి కంకణాలు) పంపిణీ చేయనున్నారు. 21 నుంచి కార్తిక మాసోత్సవాలు సామర్లకోట: పంచారామ క్షేత్రమైన సామర్లకోట బాలాత్రిపురసుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 21 నుంచి నవంబర్ 20 వరకూ కార్తిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి కాలభైరస్వామి ఆలయం వద్ద శుక్రవారం ముహూర్తపు రాట వేశారు. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, సన్నిధిరాజు వెంకన్న, శ్రీకాకుళపు సత్యనారాయణమూర్తి, సన్నిధిరాజు అంజిబాబు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ విలేకర్లతో మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీ రాత్రి ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించి, కార్తిక మాసోత్సవాలు ప్రారంభిస్తామని చెప్పారు. 22 తేదీ నుంచి భక్తులకు కార్తిక మాస దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. క్యూలైన్లు, ఇతర పనులు శుక్రవారం ప్రారంభిస్తామన్నారు. రాట ముహూర్తం కార్యక్రమంలో ట్రస్టు బోర్డు సభ్యులు కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో పలువురికి పదవులుసాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని అధిష్టానం పలు హోదాల్లో నియమించింది. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) సభ్యులుగా మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, జ్యోతుల చంటిబాబులను నియమించారు. స్టేట్ కౌన్సిల్ సభ్యులుగా నెక్కంటి సాయి, ఆవాల లక్ష్మీనారాయణ, చల్లగళ్ల పద్మనాభుడు (దొరబాబు), రావు చిన్నారావు, వడిశెట్టి నారాయణరెడ్డి, గండేపల్లి రామారావు, గోపిశెట్టి వీర వెంకట సత్యనారాయణ (బాబ్జీ), బెజవాడ సత్యనారాయణ, అడ్డూరి ఫణీశ్వర రవికుమార్ నియమితులయ్యారు.మహాశక్తి యాగం ముగింపు కార్యక్రమంలో పరిపూర్ణానంద స్వామి -
ఉత్సాహంగా ఎస్జీఎఫ్ఐ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడాసమాఖ్య అండర్–14, 17 ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని టెన్నిస్ కోర్టులలో బాలబాలికల ఎంపికలు శుక్రవారం ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎంపికలను ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 కార్యదర్శి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికలకు 70 మంది హాజరయ్యారు. టెన్నిస్ కోచ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహించారు. ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి మాచరరావు, కోశాధికారి నాగలింగేశ్వరరావు, సీనియర్ పీడీలు ఎల్.జార్జి, పట్టాభిరామం పాల్గొన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో త్వరలో జరిగే రాష్ట్రస్ధాయి పోటీలకు జిల్లా జట్లు ఎంపిక నిర్వహించామన్నారు. అండర్–14 బాలురు–5, బాలికలు–5, అండర్–17 బాలురు–5, బాలికలు–5 మందిని ఎంపిక చేశారు. ఎంపికలు ఎస్జీఎఫ్ఐ బాలికల కార్యదర్శి సుధారాణి పర్యవేక్షించారు. -
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. దసరా సెలవులు ముగియడంతో స్వస్థలాలకు తిరిగి వెళ్తున్న వారితో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చారు. దీనికి తోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు కూడా సత్యదేవుని సన్నిధికి తరలి వచ్చారు. దీంతో, సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో ఏడు గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. శని, ఆదివారాల్లో కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండనుంది. స్వామి, అమ్మవార్లను ఆలయ ప్రాకారంలో శనివారం తిరుచ్చి వాహనం మీద, ఆదివారం టేకు రథ పైన ఉదయం 10 గంటలకు ఊరేగిస్తారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వెళ్లిన వేలాది మంది ఉత్తరాంధ్ర జిల్లాల భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగారు. రత్నగిరి తొలి పావంచా వద్ద కొబ్బరి కాయలు కొట్టి సత్యదేవుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తొలి పావంచా వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. భక్తులు తమ వాహనాలను మెయిన్ రోడ్డుపై నిలిపివేయడంతో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. -
అనుమతి ఉండాలి
ప్రభుత్వ అనుమతి పొందిన జూనియర్ కళాశాలల వివరాలు జిల్లా ఇంటర్మీడియెట్ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మూడు కళాశాలలకు కొత్తగా అనుమతి వచ్చింది. మరి కొన్నింటికి రావాల్సి ఉంది. అనుమతి లేకుండా ఈ ఏడాది అడ్మిషన్లు చేసుకుని, తరగతులు నిర్వహిస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఆ వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. అనుమతి లేని కళాశాలలో చేరితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయం గమనించాలి. – ఐ.శారద, జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి అడ్డూ అదుపూ లేదు అనేక ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించడం లేదు. ఈ విషయం ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులకు సైతం తెలుసు. అయినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చుకుని, మరో కళాశాలలో చదివినట్లుగా నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ రిజిస్టర్లో పేర్లు రాయిస్తున్నారు. ఇలాంటి అవకతవకలు చాలా ప్రైవేటు కళాశాలల్లో జరుగుతున్నాయి. తనిఖీలు చేయాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. – బి.సిద్ధు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
అమ్మ అనుగ్రహానికి పాత్రులవుదాం
కాకినాడ రూరల్: అమ్మవారికి అందరూ చేసిన దీక్షను సమర్పించి ఆమె ఆనుగ్రహానికి పాత్రులవుదామని, విజయ దశమి అందరి కుంటుంబాలలో సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి భక్తులకు ఆశీర్వచనాలు ఇచ్చారు. మహాశక్తి యాగంలో భాగంగా 10వ రోజు బుధవారం శ్రీపీఠంలో లక్ష కుంకుమార్చనలు వంద కోట్లపై బడి కొనసాగించారు. ఐశ్వర్యాంబిక అమ్మవారు మహాలక్ష్మిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీసూక్త, మహాలక్ష్మి హోమం నిర్వహించారు. సాయంత్రం భక్తులు తీసుకువచ్చిన పండ్లను నివేదించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ మహాశక్తి యాగం గురువారం పూర్ణాహుతితో ముగుస్తుందన్నారు. అమ్మవారికి మూల మంత్ర సంపుటితో ఒక్కసారి పారాయణం చేసుకుందామన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీవేంకటేశ్వరుడి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు దర్శనమిస్తారని అన్నారు. అమ్మ అనుగ్రహం ఎవరికి ఎప్పుడు ఎలా లభిస్తుందో తెలియదన్నారు. మంగళవారం రాత్రి బగళాముఖి హోమంలో అమ్మవారు బిడ్డలను లాలిస్తూ దర్శనమిచ్చారన్నారు. పూర్ణాహుతి కోసం ప్రతి ఒక్కరూ మూడు బూరెలను చిన్న సైజులో తీసుకురావాలని కోరారు. రెండు నెలలు మహాశక్తి యాగం విజయవంతానికి ఏర్పాట్లు చేసిన వారందరికి ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీ పీఠంలో నేటితో ముగియనున్న మహాశక్తి యాగం, కుంకుమార్చనలు 10వ రోజు మహాలక్ష్మి దేవి అలంకరణలో ఐశ్వర్యాంబిక అమ్మవారు -
అనాథ శిశువు జాడ కోసం...
కాకినాడ క్రైం: రోడ్డు పక్కన లభ్యమైన సుమారు నాలుగు నెలలు వయసున్న ఓ అనాథ ఆడ శిశువు జాడ కోసం సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి బుధవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ రాత్రి 10.40 సమయంలో జగ్గంపేట గ్రామ శివారులో రోడ్డు పక్కన ఓ ఆడ శిశువు ఏడుస్తూ ఉండడాన్ని మేడపాడు గ్రామానికి చెందిన వల్లూరి సురేష్ గమనించాడని తెలిపారు. శిశువుని చేరదీసి అనారోగ్యంగా ఉండడాన్ని గుర్తించి కాకినాడ జీజీహెచ్లో చేర్చి, చికిత్స అనంతరం ఆగస్టు 13వ తేదీన శిశు గృహకు అప్పగించాడని పేర్కొన్నారు. అక్కడి సిబ్బంది శిశువుని సంరక్షిస్తుండగా, బాలిక లభ్యతపై గత నెల 24న జగ్గంపేట పోలీసులు జీడీలో నమోదు చేశారన్నారు. శిశువు ఆరోగ్యం మరింత క్షీణించడంతో మళ్లీ జీజీహెచ్లో చేర్చామని తెలిపారు. శిశువు రక్త సంబంధీకులు లేదా బంధువులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు సమీపంలో ఉన్న పీడీ కార్యాలయ అధికారులను లేదా 0884–2368442, 89191 23488 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. రీజెన్సీ తెరిచేందుకు ప్రజా మద్దతు అవసరం ● సంస్థ ఎండీ జీఎన్ నాయుడు యానాం: రీజెన్సీ సిరామిక్స్ పరిశ్రమ పునఃప్రారంభానికి పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల బృందం త్వరలో ప్రధాని మోదీని కలవనున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ జీఎన్ నాయుడు తెలిపారు. బుధవారం స్థానిక ఐఏఎస్ అఽధికారి, ఆర్ఏఓ అంకిత్కుమార్ను ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్తో పాటు ఆయన కలిసారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏడాది క్రితం సీఎం రంగసామితో చర్చించిన అనంతరం రూ.30 కోట్ల పెట్టుబతో మెషినరీ అమర్చినట్టు తెలపారు. గెయిల్ ద్వారా వచ్చే గ్యాస్ నిలిపివేయడంతో ఆ పైపులు తుప్పుపట్టాయని, వాటికి అయ్యే రూ.80 కోట్ల వ్యయాన్ని తామే భరిస్తామని, ఫ్యాక్టరీ ప్రారంభమైతే వచ్చే రెవెన్యూ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లిస్తామని వారిని కోరినట్టు తెలిపారు. సంస్థకు సహజవాయువు కేటాయింపుపై అక్టోబర్ 15వ తేదీలోగా ఎంపీల బృందం ప్రధానిని కలవనున్నట్టు ఆయన తెలిపారు. ప్రజల నుంచి సైతం రీజెన్సీ తెరవాలని ప్రజల మద్దతు తెలిసేలా పోరాటం చేయాలని ఆయన అన్నారు. 2012 జనవరి 27న జరిగిన ఫ్యాక్టరీ విధ్వంసం తదనంతర పరిణామాలు, ఇద్దరు మృతి ఘటనలపై సీబీఐ విచారణ పూర్తిచేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయుడు కోరారు. 665 మంది కార్మికులకు 25 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. వారు సైతం వాటిలో నివాసాలకు ముందుకు రావాలని కోరారు. సమావేశంలో వారితో పాటు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస అశోక్ పాల్గొన్నారు. రాజమహేంద్రవరం–తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి తొలి విమాన సర్వీసు బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ సర్వీసును ప్రారంభించారు. వర్చువల్ ద్వారా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థఈ సర్వీసు వారానికి 3 రోజులు నిర్వహిస్తుంది. ఉదయం 7–40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 9–25 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుంది. ఇక్కడ నుంచి 9–50 గంటలకు తిరుపతికి బయలుదేరి ఉదయం 11–20 గంటలకు చేరుతుంది. మొదటి 35 సీట్లు రూ.1,999కు, తర్వాత 35 సీట్లు రూ.4,000కు అందిస్తారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, శ్రీనివాసు, బలరామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ వెంకటరమణ చౌదరి, ఎయిర్పోర్టు డైరెక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. -
కాకినాడ జిల్లాలో ప్రేమ్మోనాది ఘాతుకం..
సాక్షి, కాకినాడ: జిల్లాలో దారుణం జరిగింది. గొల్లప్రోలు మండలం పనసపాడులో ప్రేమ్మోనాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బ్లేడ్తో ప్రియురాలు దీప్తి గొంతుకోసి హత్య చేసిన ప్రియుడు అశోక్.. అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.గ్రామానికి చెందిన బాలిక, యువకుడు అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధ రాత్రి పనసపాడులోని ఓ ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
దండెత్తిన దళితులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్న కూటమి సర్కార్పై దళితులు దండెత్తారు. పేద, మధ్య తరగతి, ఎస్సీ విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసే చంద్రబాబు విధానాలకు వ్యతిరేకంగా కాకినాడలో సోమవారం నిరసన తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా ఎస్సీ సెల్ ఆధ్వర్యాన ఈ ఆందోళన నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా ఆధ్వర్యాన కదం తొక్కుతూ ఇంద్రపాలెం అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని వివిధ మండలాల నుంచి నేతలు సామర్లకోట మీదుగా కాకినాడ చేరుకున్నారు. తుని, పిఠాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల నుంచి పిఠాపురం, కాకినాడ భానుగుడి సెంటర్ రోడ్డు మీదుగా కాకినాడ ఇంద్రపాలెం అంబేడ్కర్ సెంటర్కు ర్యాలీగా తరలివచ్చారు. కూటమి సర్కారు తీరును తీవ్ర స్వరంతో ఎండగట్టారు. తక్షణమే నిలిపివేయాలి వైద్య విద్యను సొంత వారికి పప్పుబెల్లాల మాదిరిగా ఇచ్చే ఉద్దేశంతోనే కూటమి సర్కారు ప్రైవేటీకరణ జపం చేస్తోందని నేతలు, కార్యకర్తలు మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ డౌన్ డౌన్, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణం నిలిపివేయాలి, పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసే కుట్రలను తిప్పికొడతాం, ప్రైవేటీకరణ జీఓను ఉపసంహరించుకోవాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎస్సీలు, పేదలకు వైద్య విద్యను దూరం చేస్తున్న చంద్రబాబునాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులు, ప్రజలనుద్దేశించి నేతలు ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు లంకా కృపానందం, గుడాల వెంకటరత్నం, బూలా అబ్బులు, బంగారు కృష్ణ, బళ్ల సూరిబాబు, పెదపాటి రమేష్ కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు చిల్లి దేవరాజు, రాష్ట్ర కార్యదర్శులు శెట్టిబత్తుల సురేష్ కుమార్, రామప్రసాద్, అప్పలరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల భీమారావు, ఎస్సీ సెల్ మండల, గ్రామ నేతలు, అనుబంధ విభాగా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉపసంహరించేంత వరకూ ఉద్యమం వైద్య విద్యను ప్రైవేటీకరించే జీఓను ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. పేద కుటుంబాలపై చంద్రబాబు ఎందుకంత కక్ష కట్టారో అర్థం కావడం లేదు. ఇప్పుడు 33 ఏళ్లు లీజు అంటున్న కూటమి పాలకులు కొన్ని రోజులు గడిచాక 99 ఏళ్లు లీజులంటారు. పేద, దళిత కుటుంబాల్లో పిల్లలకు వైద్య విద్య అందకూడదనే కుట్రతోనే ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారు. మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో మంజూరయ్యేవంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు సీఎంగా పని చేసిన అన్ని సంవత్సరాల్లో ఒక్క వైద్య కళాశాలైనా తీసుకువచ్చారా? – శెట్టిబత్తుల కుమార్రాజా, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుఫ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఆగ్రహం ఫ వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యాన నిరసన ఫ జీఓ ఉపసంహరించాలని డిమాండ్ ఫ లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక ‘బాబు’ దివాళాకోరుతనానికి నిదర్శనం వైద్య విద్యను పేదలకు, దళితులకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం దేశంలోనే ఒక చరిత్ర. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ రంగంలో ఐదు మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి, వైద్య విద్యను పేదల దరి చేర్చారు. అటువంటి నాయకుడి వారసుడిగా జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఏకకాలంలో ఏకంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు. సుదీర్ఘ కాలం సీఎంగా చేశానని గొప్పగా చెప్పుకునే చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురాగలిగారా? అటువంటిది సొంత వారికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో దాదాపు 80 శాతం నిర్మాణం పూర్తయిన కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనుకోవడం చంద్రబాబు దివాళాకోరుతనానికి నిదర్శనం. ప్రైవేటీకరణపై చినబాబు, పెదబాబు మనసు మార్చుకోవాలి. ప్రైవేటీకరణపై కూటమి వెనక్కు తగ్గేంత వరకూ ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుంది. – అంగూరి లక్ష్మీశివకుమారి, మాజీ ఎమ్మెల్సీచంద్రబాబు దళిత వ్యతిరేకి జగన్ దళితుల పక్షపాతిగా నిలిచిపోతే.. చంద్రబాబు దళితుల వ్యతిరేకిగా ఉన్నారు. ఇంగ్లిషు విద్యను పేదలు, దళితులకు చంద్రబాబు దూరం చేయాలనుకుంటే.. వాటిని ఆ వర్గాలకు జగన్ మరింత దగ్గర చేశారు. వైద్య విద్యను పేదలకు దూరం చేయాలనే కుట్రలతోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది. – గుల్లా ఏడుకొండలు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి -
కాజేసిన మొత్తం రూ.95 లక్షలు
కరప: కూరాడలో వేళంగి ఎస్బీఐ బ్యాంకింగ్ కరస్పాండెంట్ (బీసీ) చిన్నం ప్రియభారతి మొత్తం రూ.95 లక్షల మేర మహిళాశక్తి సంఘాల సొమ్మును కాజేసినట్లు నిర్ధారణ అయ్యిందని వెలుగు ఏపీఎం ఎంఎస్బీ దేవి మంగళవారం రాత్రి తెలిపారు. ఈ వ్యవహారంలో మొత్తం 66 గ్రూపుల సభ్యులు బాధితులుగా ఉన్నారని చెప్పారు. కూరాడ గ్రామస్తులతో కలసి ఏపీఎం సోమవారం 39 గ్రూపులను తనిఖీ చేయగా బీసీ రూ.52 లక్షలు కాజేసిందని గుర్తించారు. మిగిలిన గ్రూపుల అకౌంట్లను మంగళవారం ఏపీఎం తనిఖీ చేశారు. కూరాడలో 106 మహిళాశక్తి సంఘాలున్నాయి. వీటిలో 40 గ్రూపుల వారు వేళంగిలోని యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ బ్రాంచిల్లో తాము తీసుకున్న రుణాల వాయిదా, పొదుపు సొమ్ము జమ చేశారు. అక్కడకు వెళ్లలేని మిగిలిన 66 గ్రూపుల వారు కూరాడలోని ఎస్బీఐ బీసీ పాయింట్లో సొమ్ము చెల్లించేవారు. ఈ బీసీ పాయింట్ను ఆ గ్రామానికి చెందిన చెందిన ప్రియభారతి నిర్వహిస్తోంది. యానిమేటర్గా ఉన్న తన తల్లి మంగ సహకారంతో మహిళాశక్తి సంఘాలు చెల్లించే పొదుపు, వాయిదాల సొమ్మును పథకం ప్రకారం ఆమె కాజేసింది. ఎన్ని రోజులైనా రుణం తీరకపోగా ఇంకా బాకీ ఉన్నట్లు బ్యాంకు అధికారులు మహిళాశక్తి సంఘాల సభ్యులకు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. దీనిపై వారు గగ్గోలు పెట్టడంతో ఈ నెల 27న శ్రీమహిళాశక్తి సంఘాల సొమ్ము గోల్మాల్శ్రీ, 30న శ్రీతవ్వేకొద్దీ వెలుగు చూస్తున్న అక్రమాలుశ్రీ శీర్షికలతో శ్రీసాక్షిశ్రీ కథనాలు ప్రచురించింది. ఈ మేరకు ఏపీఎం సోమ, మంగళవారాల్లో ఆ గ్రామంలోని అన్ని గ్రూపుల అకౌంట్లను తనిఖీ చేశారు. కాజేసిన సొమ్ముతో బీసీ తాళ్లరేవు మండలం చొల్లంగిపేటలో ఒక ఇల్లు, కాకినాడలో ఒక ఇంటి స్థలం కొనుగోలు చేసినట్టు కూరాడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అకౌంట్లను తనిఖీ చేసి స్వాహా అయిన సొమ్ము లెక్క తేల్చామని, తప్పులేమైనా ఉంటే సవరించి, ఎంత మేర అక్రమాలు జరిగాయో తుదిగా నిర్ధారించి, అన్ని ఆధారాలతో కరప పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేస్తామని ఏపీఎం దేవి తెలిపారు. ఫ బాధితులు 66 గ్రూపుల సభ్యులు ఫ కూరాడ బీసీ అవినీతిని వెల్లడించిన ఏపీఎం -
మహా సంకల్పం.. పరిపూర్ణం
కాకినాడ రూరల్: దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని కాకినాడ శ్రీపీఠంలో నిర్వహిస్తున్న మహాశక్తి యాగంలో భాగంగా వంద కోట్ల కుంకుమార్చనలు మంగళవారం పూర్తయ్యాయి. పీఠంలో సెప్టెంబర్ 22 నుంచి లలితా నహస్ర నామాలు పఠిస్తూ వేలాదిగా మహిళలు పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యాన కుంకుమార్చనలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేశామని, మూడేళ్లలో మూడు వందల కోట్ల కుంకుమార్చనలు చేశామని ఈ సందర్భంగా స్వామీజీ తెలిపారు. వెయ్యి కోట్ల కుంకుమార్చనలు లక్ష్యంగా శ్రీపీఠంలో మహాశక్తి యాగం కొనసాగిస్తున్నామని ప్రకటించారు. అష్టమి మంగళవారం రావడంతో దీనిని మంగళాష్టమి, జయ అష్టమి అని పిలుస్తామని చెప్పారు. అష్టమి తిథి నాడు అమ్మవారిని పూజిస్తే గొప్ప ఫలితం ఉంటుందని అన్నారు. శ్రీకృష్ణుడు అష్టమి తిథినాడు పుట్టడంతో కష్టాలు అనుభవించాడని, కానీ అమ్మవారు ఆయనకు కష్టాలను భరించే శక్తిని ఇచ్చారని చెప్పారు. అమ్మను అందరూ ఆరాధించాలని, ఈ క్రమంలో మనం ఒకరి కీడు కోరుకోకూడదని హితవు పలికారు. శ్రీపీఠంలో ఐశ్వర్యాంబిక అమ్మవారు బగళాముఖిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం దేవీ కవచం, బగళాముఖి హోమం నిర్వహించారు. వేలాదిగా తరలిచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అన్న ప్రసాదం అందించారు. ఫ మహాశక్తి యాగంలో వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తి ఫ వేలాదిగా పాల్గొన్న మహిళలు -
ప్రాణాలు తీసిన బాణసంచా
● భార్యాభర్తల మృత్యువాత ● విలస గ్రామంలో విషాద ఛాయలు అయినవిల్లి: దీపావళి పండగకు కిరాణా సామగ్రితో పాటు బాణసంచా అమ్ముకుని నాలుగు రూపాయలు వెనుక వేసుకుందామనే ఆశ ఆ భార్యాభర్తలను బలిగొంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కోనసీమ జిల్లాలోని అయినవిల్లి మండలం విలస గ్రామంలో బాణసంచా పేలి కంచర్ల శ్రీనివాసరావు (51). అతని భార్య సీతామహా లక్ష్మి(46) మృత్యువాత పడ్డారు. కిరాణా షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న ఆ దంపతులు గతేడాది దీపావళికి అమ్మగా మిగిలిన బాణసంచా సామగ్రిని ఇంటి అటక పై నుంచి తీసి శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి వారి ఇంటిపై శ్లాబు, ప్రహరీ కూలింది. పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృత్యు ఒడికి చేరారు. వారి కుమారుడు ప్రదీప్ గాయపడ్డాడు. అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అమలాపురం ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలిని ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ సుంకర మురళీకృష్ణ, సీఐ ఆర్. భీమరాజు, ఎస్ఐ హరికోటి శాస్త్రి పరిళీలించారు. శిథిలాల కింద చిక్కుకున్న భార్యాభర్తల మృతదేహాలను అంబులెన్స్లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయినవిల్లి ఎస్సై హరికోటిశాస్త్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోవాలి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని పి.గన్నవరం నియోజక వర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. లైసెన్సు కలిగిన గోడౌన్స్లోనే బాణసంచా భద్రపరచాలి: ఎస్పీ బాణసంచా సామగ్రి లైసెన్సు పొందిన గోడౌన్స్లోనే భద్రపరచాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. లైసెన్సు లేకుండా బాణసంచా సామాగ్రి నిలువ ఉంచడం, తయారు చేయడం నేరమన్నారు. జాగ్రత్తలు కూడా తీసుకోవాలని సూచించారు. లైసెన్స్ లేకుండా ఇలా బాణసంచా నిలువ ఉంచితే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయని ఆయన హెచ్చరించారు. శిథిలాల మధ్య ఉన్న కంచర్ల శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటకు తీసి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్న పోలీసులు, స్థానికులు పేలుడు శబ్దానికి కూలిన ఇంటి శ్లాబు, ప్రహరీ ప్రమాద స్థలంలో గుమిగూడిన గ్రామస్తులు -
శ్రీ దుర్గాదేవిగా మాణిక్యాంబ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో దసరా మహోత్సవాల్లో భాగంగా 9వ రోజు మంగళవారం మాణిక్యాంబా అమ్మవారి మట్టి ప్రతిమకు శ్రీ దుర్గాదేవి అలంకరణ చేశారు. సరస్వతీదేవి, ఐశ్వర్యలక్ష్మిగా..అయినవిల్లి: మండలంలోని నల్లచెరువు గ్రామంలో కొలువైన శ్రీ పద్మావతి, గోదాదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పద్మావతి అమ్మవారు మంగళవారం సరస్వతీదేవి, ఐశర్యలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ వేద పండితులు ఉదయం అమ్మవారిని పెన్నులతో సరస్వతీదేవిగా అలంకరించారు. మధ్యాహ్నం అమ్మవారిని రూ.10లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ అలంకరణకు రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లను ఉపయోగించారు. నోట్ల పెళపెళ.. లక్ష్మీ కళకళ! పిఠాపురం: మండలంలోని రాపర్తిలో వేంచేసియున్న దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని రూ.15 లక్షల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
పి.గన్నవరం: స్థానిక ఏటిగట్టు సెంటర్లో మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై బి.శివకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మిర్యాలగూడకు సమీపంలోని బట్టాయగూడెంనకు చెందిన షేక్ నాగూర్ మీరా (50) 15 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి డీఎస్ పాలెంలో నివసిస్తున్నాడు. మంగళవారం, శుక్రవారాల్లో అతడు షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఏటిగట్టు సెంటర్లో షాపుల వద్ద సాంబ్రాణి పొగ వేసి, మూడు రోడ్ల సెంటర్కు సైకిలుపై వస్తుండగా అతడిని వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో అతడి తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లిపోవడంతో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద స్థానికులు అడ్డుకుని లారీని ఆపారు. మృతదేహం వద్ద అతడి భార్య జీ బాషా బోరున విలపించింది. అందరితో కలివిడిగా ఉండే నాగూర్ మీరా ప్రమాదంలో మృతి చెందడంతో స్థానిక వ్యాపారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకృష్ణ వివరించారు. రైల్వే ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి.. తుని రూరల్: అన్నవరం రైల్వే రెండవ ప్లాట్ఫాంపై గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్టు గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ తుని ఎస్సై పి.వాసు మంగళవారం తెలిపారు. ప్లాట్ఫాంపై బెంచీ కింద మరణించి ఉన్న వ్యక్తి శరీరంపై నలుపు రంగు టీ షర్టు, నీలం రంగు ట్రాక్ ఉన్నాయన్నారు. మృతుడికి కొంతదూరంలో కాఫీ రంగు బ్యాగ్ ఉందన్నారు. ఎవరైన గుర్తిస్తే జీఆర్పీకి 9490619020 నంబరుకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. హెచ్సీ మోహన్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాం తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామన్నారు. పాము కాటుకు మహిళ.. ప్రత్తిపాడు: ప్రత్తిపాడు మండలంలోని బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని ధారపల్లిలో పాము కాటుకు గురైన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. స్థానిక పోలీసుల కథనం మేరకు బురదకోట గిరిజన గ్రామ పంచాయతీలోని బాపన్నధారకు చెందిన బుట్టారి సన్యాసిరావు, లోవకుమారిలకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు ధారపల్లిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే సోమవారం రాత్రి బుట్టారి లోవకుమారి తన ఇంటిలోనే నేలపై నిద్రపోయింది. మంగళవారం తెల్లవారుజామున పాము కాటుకు గురైంది. ఆమెను బంధువులు ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు భర్త బుట్టారి సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహానైవేద్యం సమర్పయామి
గొల్లప్రోలు మండలం దుర్గాడ శివాలయంలో శ్రీ లలితా దేవికి, గర్భాలయంలో సూర్యదేవునికి, ఉమాదేవి అమ్మవార్లకు, లక్ష్మీనారాయణులకు, గణపతికి, పరమేశ్వరునికి మంగళవారం ఏకకాలంలో అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, మహన్యాస పారాయణ, 27 ద్రవ్యాలతో, 27 కలశాలతో అభిషేకాలు చేశారు. అమ్మవారికి 108 రకాల పిండి వంటలతో మహాభోగ నివేదన చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. – పిఠాపురం దేవీ శరన్నవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకుని, గొల్లప్రోలు మండలం తాటిపర్తి అపర్ణాదేవి ఆలయంలో అమ్మవారిని పసుపు కొమ్ముల మాలలతో మంగళవారం మంగళప్రదంగా అలంకరించారు. సమస్త మంగళాలను ప్రసాదించే అమ్మవారు మహాగౌరీదేవిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. – పిఠాపురం -
గురువు మార్గదర్శకత్వం అవసరం
సహస్రావధాని గరికపాటి రాయవరం: సన్మార్గం వైపు అడుగులు వేసేందుకు ప్రతి ఒక్కరికీ గురు మార్గదర్శకత్వం అవసరమని, అప్పుడే దైవానుగ్రహానికి దగ్గరవుతామని సాగరఘోష కవి, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి ఆధ్మాత్మిక ప్రసంగం చేస్తూ తల్లి, తండ్రి, గురువు తర్వాతే దైవం అన్నారు. తల్లిదండ్రులను, గురువును ఆరాధించడం భగవంతుడిని ప్రార్థించడం కంటే గొప్పదన్నారు. ఐశ్వర్యం, భోగభాగ్యాలు అశాశ్వతమని, గురువు చూపిన మార్గంలో పయనిస్తే దైవానుగ్రహానికి దగ్గరవుతారన్నారు. విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) చూపిన దారిలో భక్తులు నడవాలన్నారు. మరో సాహితీవేత్త మహామహాపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ అమ్మతత్వాన్ని వివరించారు. పీఠంలో ఆర్డీవోల పూజలు కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీవోలు శ్రీకర్, అఖిల దంపతులు మంగళవారం విజయదుర్గా పీఠాన్ని సందర్శించారు. అనంతరం పీఠంలో విజయదుర్గా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పీఠాన్ని సందర్శించినట్లు తెలిపారు. విజయదుర్గా అమ్మవారి ఆశ్శీస్సులు అందరిపై ఉండాలని, అందరికీ మంచి జరగాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు. -
డీఎస్సీలో విజయం సాధించిన హాకీ క్రీడాకారులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): డీఎస్సీ–2025లో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో హాకీ కోర్టులో కోచ్ రవిరాజు వద్ద తర్ఫీదు పొందుతున్న నలుగురు క్రీడాకారిణులు పీఈటీలుగా ఉద్యోగాలు సాధించారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన జి.వరలక్ష్మి, డీఎస్ సింధు దేవి, ఎస్.పరంజ్యోతి, కె.భారతి ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. వీరు అనేకసార్లు రాష్ట్ర చాంపియన్షిప్ సాధించిన జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగాలు సాధించిన క్రీడాకారిణులను, తర్ఫీదునిచ్చిన కోచ్ రవిరాజును డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్ మంగళవారం డీఎస్ఏలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. -
విరిసిన ధరలు!
కడియం: మండలంలోని కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్లో దసరా సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాల అలంకరణలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నేపథ్యంలో పువ్వుల ధరలు గతం కంటే మెరుగ్గా ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ముఖ్యంగా దసరా అలంకరణలో వినియోగించే బంతి, చామంతి తదితర రకాల ధరలు పెరిగాయని వివరించారు. స్థానికంగా పువ్వుల దిగుబడులు స్వల్పంగానే ఉన్నాయంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువగా పువ్వులు దిగుమతి అయ్యాయని వ్యాపారులు తెలిపారు. మంగళవారం కడియపులంక పువ్వుల మార్కెట్లో కేజీ చామంతులు రూ.150 నుంచి రూ.200 ధర పలికాయి. లిల్లీలు రూ.400, మల్లెపువ్వులు రూ.1,500, జాజులు రూ.1,000, కాగడాలు రూ.1,100, బంతి రూ. 100 నుంచి రూ.130, కనకాంబరం బారు రూ.270–రూ.300 ధర పలికాయి. -
యువకుడి బలవన్మరణం
సీతానగరం: జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై డి.రామ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సీతానగరం మండలం మునికూడలికి చెందిన మురాల అనిల్దేవ (22) వెల్డర్గా పని చేస్తున్నాడు. తల్లి కువైట్లో ఉండటంతో అమ్మమ్మ నూకతట్ల సుభద్రమ్మ వద్ద ఉంటున్నాడు. ఉదయం పనిపై వేరే వీధిలోకి సుభద్రమ్మ వెళ్లగా, ఇంట్లో ఫ్యాన్కు అనిల్దేవ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుభద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
భవనంపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ కాకినాడ క్రై: గంజాయి క్రయ, విక్రయాలతో పాటు తరలింపులో ఆరితేరిన ముగ్గురు నేరస్తులను కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎస్పీ బిందుమాధవ్ సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 23న విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు ఒక ఇన్నోవా వాహనం అనుమానాస్పద రీతిలో పోలీసులను, టోల్ ప్లాజా సిబ్బందిని ఢీకొని దూసుకుని వెళ్లినట్టు ఆ వాహనం కదలికలపై నిఘా ఉంచాలని విశాఖ జిల్లా పోలీసులు కాకినాడ జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. విశాఖ పోలీసులు తెలిపిన వాహనాన్ని జగ్గంపేట సర్కిల్ పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఈ నెల 23న మధ్యాహ్నం గుర్తించారు. కారును ఆపే క్రమంలో డ్రైవర్ కారులో నుంచి పోలీసులతో పోరాడాడు. ఈ క్రమంలో కారు అద్దాలు బద్దలైనా లెక్కచేయకుండా ప్రత్తిపాడు వైపు వేగంగా దూసుకుపోయాడు. అయితే ఈ పెనుగులాటలో పోలీసులకు డ్రైవర్ సెల్ఫోన్ లభ్యమైంది. ఆ వాహనంలో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు, వెనుక సీట్లో పోలీస్ యూనిఫాం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాహనంపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని రాసి ఉందని నిర్ధారించుకున్నారు. ప్రత్తిపాడు వైపు వెళుతున్న ఆ వాహనాన్ని వెంబడించగా, కొంత దూరంలో ఆ వాహనం మిస్సైంది. ఇదిలా ఉంటే టోల్ప్లాజా వద్ద ఘటన జరిగిన కొద్ది గంటల తర్వాత కిర్లంపూడిలో పైడితల్లి అమ్మవారి గుడి పక్కన ఉన్న రోడ్డుపై వెళుతున్న కారు నుంచి పడిపోయిన రెండు గంజాయి ప్యాకెట్లను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ పూటేజీల ఆధారంగా టోల్ప్లాజా వద్ద రచ్చ చేసిన కారు నుంచే ఈ ప్యాకెట్లు పడ్డాయని పోలీసులు నిర్ధారించుకున్నారు. సాంకేతికత, ఈగల్ టీమ్ సహకారంతో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కారును ట్రాక్ చేసే పనిలో పడింది. పోలీసుల కష్టం ఫలించి కారు కిర్లంపూడి మండలం రాజుపాలెం సమీపంలో ఒక రావిచెట్టు వద్ద లభ్యమైంది. కారుతోపాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు రాజస్థాన్కు చెందిన వారని విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని జి.మాడుగలకు వ్యాపారం నిమిత్తం వచ్చారని గుర్తించారు. వ్యాపారం ముసుగులో విశాఖ, ఒడిశా నుంచి గంజాయిని సేకరించి రాజస్థాన్ తరలిస్తున్నట్టు నిర్ధారించారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. అలాగే జొన్నాడ టోల్ ప్లాజా వద్ద సిబ్బంది, పోలీసులను గాయపరిచిన ఘటనలో భీమునిపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యిందన్నారు. నిందితుల నుంచి సుమారు రూ.20 లక్షల విలువ చేసే 175 కిలోల గంజాయితో పాటు ఇన్నోవా కారు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నేరంలో ఏడుగురు భాగస్వాములు అయినట్టు గుర్తించామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ వివరించారు.సామర్లకోట: స్థానిక జయలక్ష్మీ థియేటర్ సమీపంలోని ఒక భవనానికి పెయింటింగ్ వేస్తూ జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట పెన్షన్లైన్కు చెందిన అరవ అరుణ్కుమార్ (37) పెయింటింగ్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోజూ మాదిరిగానే రెండు అంతస్తుల భవనానికి పెయింటింగ్ వేస్తున్న సమయంలో తాడు జారిపోవడంతో అరుణ్కుమార్ కింద పడిపోయాడు. అతని తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు హుటాహుటిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏనుగమ్మా... ఏనుగు
ఫ గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రసిద్ధి ఫ దసరా రోజున భారీ ఊరేగింపు ఫ పోటీపోటీగా ఉత్సవాల నిర్వహణ కాజులూరు: దసరా.. ప్రతి పల్లెకూ ప్రత్యేకతే. అచ్చం అలానే కాజులూరు నియోజకవర్గం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం ప్రఖ్యాతి గాంచింది. ఏటా విజయ దశమిని పురస్కరించుకుని ఇక్కడ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా ప్రతి గ్రామంలో శరన్నవరాత్ర ఉత్సవాల్లో దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తుంటారు. అయితే గొల్లపాలెంలో పాత మార్కెట్ సెంటర్ వద్ద రామాలయం సమీపంలో మాత్రం శరన్నవరాత్ర రోజుల్లో భేతాళునికి పూజలు నిర్వహించడం విశేషం. చివరి రోజు దసరా పండగ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ గ్రామ వీధుల్లో చిన్న ఏనుగు ప్రతిమను, రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ట్రాక్టరుపై పెద్ద ఏనుగు ప్రతిమను ఊరేగిస్తుంటారు. సుమారు రెండు వందల ఏళ్ల నుంచి ప్రతి ఏటా ఈ సంబరం నిర్వహిస్తుండడం విశేషం. ఐరావతాన్ని తలపించేలా తెల్లని వస్త్రం, ఎండు గడ్డితో తయారు చేసిన ఏనుగు ప్రతిమలకు పెద్ద, పెద్ద చావిళ్లు నిర్మించి ఏడాది పొడవునా స్థానికులు వాటిని పరిరక్షిస్తుంటారు. విజయ దశమికి 10 రోజుల ముందు ఏనుగు ప్రతిమలను బయటకు తీసి శుభ్రం చేసి మెరుగులు దిద్ది ప్రత్యేక పూజలు చేసి సంబరం చేస్తారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ గ్రామంలోని వెలమ కులస్తుల ఆధ్వర్యంలో చిన్న ఏనుగు సంబరం, కాపు, బలిజ కులస్తుల సారథ్యంలో పెద్ద ఏనుగు సంబరం చేస్తుంటారు. చిన్న ఏనుగును ఎడ్లబండి మాదిరి బండిపై ఉంచి భక్తులు జేజేలు పలుకుతూ తోసుకుంటూ ముందుకు సాగుతారు. పెద్ద ఏనుగునైతే ట్రాక్టర్పై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఎండు గడ్డి, తెల్లని వస్త్రం, తదితర వస్తువులతో తయారు చేసిన భారీ ఏనుగుల ప్రతిమలను ఊరేగించే సమయంలో వేలాది మంది ముందుకు సాగుతుంటారు. భేతాళుని రూపంలో భక్తులు ఏనుగుల ప్రతిమలకు పూజలు చేస్తుంటారు. గరగ నృత్యాలు, కోయ డ్యాన్సులు, గారడీ, బ్యాండ్ మేళాలతో ఈ ఊరేగింపు కోలహలంగా సాగుతోంది. ఇరువర్గాల వారూ పోటీపోటీగా సంబరం నిర్వహిస్తుండడం ఇక్కడ ప్రత్యేకత. గతంలో ఈ సంబరాల్లో ఘర్షణలు జరిగేవి. పెద్దలు సఖ్యత కుదర్చడంతో ఇటీవల ప్రశాంతంగా జరుగుతున్నాయి. పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి ఉత్సవాలను తిలకిస్తుంటారు. అలాగే బాణసంచా కాల్పులకు ప్రత్యేకత ఉంది. రాత్రి మిరుమిట్లు గొలిపేలా ఇక్కడ సంబరాలు నిర్వహిస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచారం గొల్లపాలెంలో ఏనుగుల సంబరం అనాదిగా వస్తుంది. గ్రామంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు సైతం ఈ పండగకు తిరిగి గ్రామానికి వస్తుంటారు. –టేకుమూడి దుర్గారావు, స్థానికుడు సంప్రదాయాలను కొనసాగిస్తూ.. ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కాస్త తీరిక దొరికితే సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతుంటారు. పండగలు, సంబరాలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలో మన ఆచారాలను తెలిపేలా పురాతన సంప్రదాయాలు కొనసాగిస్తూ నేటికీ ఏనుగుల సంబరాలు నిర్వహించడం అభినందనీయం. –జొన్నకూటి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు -
ఈవీఎంలతో ఓట్ల దుర్వినియోగం
ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు రుద్రరాజు అమలాపురం టౌన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఓట్ల దుర్వినియోగానికి పాల్పడుతుందని ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏవీఎంల విధానం వద్దు.. దాని స్థానే మాన్యువల్ విధానమైన బ్యాలెట్ పత్రాలతోనే ఓటింగ్, పోలింగ్ జరపాలని డిమాండ్ చేస్తోందని చెప్పారు. పలు రాష్ట్రాల్లో జరిగిన ఓట్ల అక్రమాలను కాంగ్రెస్ పార్టీ అనేక ఆధారాలతో బయట పెట్టినప్పటికీ ప్రధాని మోదీ పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి కొమ్ముకాస్తూ ఓట్ల అక్రమాల్లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భాగస్వామ్యం అయ్యిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పరంగా వైఎస్సార్ సీపీకి జరిగిన అన్యాయాన్ని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా ప్రస్తావించారని ఆయన గుర్తు చేశారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ సంతకాలను సేకరిస్తూ ప్రజల నుంచి మద్దతు కూడగడుతోందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, ముషిణి రామకృష్ణారావు, యార్లగడ్డ రవీంద్ర, కుడుపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చివరగా అమలాపురం ప్రెస్క్లబ్ భవనంలో ఫర్నీచర్ కొనుగోలు నిమిత్తం రుద్రరాజు రూ.25 వేల చెక్కును ప్రెస్క్లబ్ ప్రతినిధులకు అందజేశారు. -
ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘ ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖోఖో సంఘ అధ్యక్షుడిగా సీనియర్ పీడీ కె.పట్టాభిరామ్ ఎన్నికయ్యారు. సోమవా రం కాకినాడలోని కుడుపూడి రామ్కుమార్ క్రీడాభవన్లో జిల్లా ఖోఖో సంఘ ఎన్నికలు రాష్ట్ర ఖోఖో సంఘ అధ్యక్షుడు టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలకు జిల్లా ఒలింపిక్ సంఘ నుంచి వి.రవిరాజు, డీఎస్ఏ పరిశీలకులుగా పాపారావు హాజరయ్యారు. అలాగే ఎన్నికల పరిశీలకుడిగా అడ్వకేట్ ఎం.సత్యనారాయణ వ్యవహరించారు. ఉమ్మడి తూర్పుగోదావరి అధ్యక్షుడిగా కె.పట్టాభిరామ్, కార్యదర్శిగా ఎం.శ్రీనివాస్ కుమార్, కోశాధికారిగా కె.రాంబాబు, ఉపాధ్యక్షులుగా ఎల్.గోవిందరాజులు, కె.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా మాచరరావు, ఎండీ ఇబ్రహీం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా పి.సూర్యనారాయణ, డి.సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులు టీవీఎస్ రంగారావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్, కోశాధికారి నాగు, చీఫ్ టెక్నికల్ అడ్వయిజర్ సాయిప్రసాద్, బంగార్రాజులు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించి మరోసారి ఖోఖో సంఘ ఐక్యతను చాటి చెప్పారని కొనియాడారు. ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో పోస్టులు సాధించిన ఖోఖో క్రీడాకారులు వై.జగదీష్, బి.ఆదినారాయణ, వై.సతీష్లను సంఘ సభ్యులు అభినందించారు. -
అంతర పంటగా అశ్వగంధను సాగు చేయొచ్చు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆయిల్పామ్ తోటల్లో మూడేళ్ల వరకూ అశ్వగంధను అంతర పంటగా సాగు చేయవచ్చని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆయిల్ సీడ్ ఫెడరేషన్ సంస్థ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని నిర్కాను సందర్శించి అశ్వగంధ పంటను ఆయిల్పామ్లో అంతర పంటగా సాగు చేయడానికి, అధిక దిగుబడులు పొందడానికి, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఉన్న అవకాశాలను విశ్లేషించడానికి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేషుమాధవ్ మాట్లాడుతూ అన్ని నేలల్లో అశ్వగంధ వేయవచ్చని తెలిపారు. అంతే కాకుండా అశ్వగంధ సాగుకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికి సహకరిస్తామన్నారు. అశ్వగంధ పంట మార్కెటింగ్, బైబ్యాక్ విధానాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం, ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. పలు అంశాలను విశ్లేషించి ఆయిల్ఫెడ్ సలహాదారుడు ఎ.కిరణ్కుమార్ ఆధ్వర్యంలో ముసాయిదాను రూపొందించడానికి నిర్ణయించారు. నిర్కా సంస్థ పరిధిలో చేస్తున్న మిరప, పసుపు పంట ఉత్పత్తులను తెలంగాణ ఆయిల్ఫెడ్ వారి విజయబ్రాండ్ స్టోర్స్లో చేర్చి అమ్మడానికి ఉన్న అవకాశాలను చర్చించి ఎంఓయూ ఏర్పాటు చేసి సంయుక్తంగా ముందుకెళ్లాలని రెండు సంస్థలు నిర్ణయించారు. సమావేశంలో తెలంగాణ ఆయిల్ఫెడ్ అధికారులు టి.సుధాకరరెడ్డి, ఎన్.శ్రీకాంత్రెడ్డి, అభ్యుదయ రైతులు భాస్కర్, అప్పారావు, నిర్కా సంస్థ విజన్ హెడ్స్ కె.సరళ, రాజశేఖర్, ఎల్కే ప్రసాద్, ప్రిన్సిపాల్ శాస్త్రవేత్తలు కస్తూరి, సుబ్బయ్య, సుమన్కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ గ్రూపు నుంచి బయటకు..
సచివాలయ సెక్రటరీల నిరసన అమలాపురం టౌన్: వలంటీర్ల మాదిరిగా తమను ఇంటింటికీ పంపించి పథకాలపై ప్రచారం చేయిస్తూనే, సర్వే చేయమని ఒత్తిడి తెస్తున్న పరిణామాలపై అమలాపురం మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల సెక్రటరీలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ సర్వేలను వ్యతిరేకిస్తూ మున్సిపాలిటీ అధికారిక వాట్సాప్ గ్రూప్ నుంచి సోమవారం వార్డు సెక్రటరీలు లెఫ్ట్ అవడం మొదలు పెట్టారు. మున్సిపాలిటీలోని 15 వార్డు సచివాలయాల్లో 139 మంది వివిధ విభాగాల సెక్రటరీలుగా పనిచేస్తున్నారు. ఇందులో సోమవారం రాత్రికి 80 మందికి పైగా సెక్రటరీలు గ్రూప్ నుంచి లెఫ్ట్ అయ్యారు. మంగళవారం కూడా మరికొంత మంది సెక్రటరీలు బయటకు రానున్నారని ఓ వార్డు సచివాలయ సెక్రటరీ చెప్పారు. మున్సిపాలిటీ అఫీషియల్ వాట్సాప్ గ్రూపు ప్రతి మున్సిపాలిటీకి ఉంటుంది. ఇందులో మున్సిపాలిటీకి చెందిన కమిషనర్తో పాటు అన్ని విభాగాల అధికారులు ఉంటారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి చేసే పనులను తమకు అప్పగించడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల పదో తేదీన విజయవాడలో చేపట్టనున్న రాష్ట్ర స్థాయి మార్చ్పాస్ట్కు మున్సిపాలిటీలోని సెక్రటరీలు వెళ్లి నిరసన తెలిపేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇంటింటికీ వెళ్లి పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రచారం, సర్వే భారాన్ని మోపడాన్ని వార్డు సచివాలయ సెక్రటరీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. -
సరస్వతీ కటాక్షంతో విజయం తథ్యం
విజయదుర్గా పీఠం పీఠాధిపతి ‘గాడ్’ రాయవరం: సరస్వతీ కటాక్షం ఉంటే విజయం తథ్యమని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) అన్నారు. పీఠానికి వచ్చిన భక్తులనుద్దేశించి గాడ్ ఆధ్యాత్మిక ప్రసంగిస్తూ.. జ్ఞానప్రదాయినిగా ఉన్న సరస్వతీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగడం పూర్వజన్మ సుకృతమని అన్నారు. జ్ఞాన సంపన్నులుగా మెలగాలంటే మంచి వాక్శుద్ది లభించాలన్నారు. అమ్మవారి దయకు పాత్రులు కావాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పీఠం కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు పీఠంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించి పీఠాధిపతి గాడ్ ఆశీస్సులు పొందారు. పీఠంలో విజయదుర్గమ్మ వారిని సరస్వతీమాత అవతారంలో అలంకరించారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్వో వేణుగోపాల్, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకట కామేశ్వరి, పెదపాటి సత్యకనకదుర్గ, బలిజేపల్లి రమా తదితరుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. సరస్వతీదేవికి పూజలు చిన్నారులకు విద్యాబుద్ధులు కలగాలని ఆకాంక్షిస్తూ విజయదుర్గా పీఠంలో సరస్వతీ పూజలు నిర్వహించారు. చీమలకొండ వీరావధాని, శివ, చక్రవర్తుల మాధవాచార్యులు, గండికోట సూర్యనారాయణ అర్చకత్వంలో చిన్నారులు సరస్వతీ అష్టోత్తర సహస్రనామాలతో సామూహిక సరస్వతీ పూజలు చేశారు. అనంతరం విద్యార్థులకు సరస్వతీదేవి ప్రతిమను, రక్షాబంధనాన్ని ప్రసాదంగా అందజేశారు. -
భర్త ఆత్మహత్య
సీతానగరం: భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని హెడ్ కానిస్టేబుల్ రేలంగి శ్రీనివాస్ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నాగంపల్లికి చెందిన గుడాల ప్రసన్న కుమార్ (34) భార్యపై అనుమానం పెంచుకుని మనస్తాపంతో ఉన్నాడు. ఇంట్లో దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పనిలోకి వస్తానని చెప్పి రాకపోవడంతో స్థానికులు మధ్యాహ్నం ఇంటికి వెళ్లగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అల్లంపల్లి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు -
ఆటాడుకుంటున్నారు
20 ఏళ్లుగా పని చేస్తున్నాను నేను 20 సంవత్సరాలుగా అమలాపురం బాలయోగి స్టేడియంలో వాచ్మన్గా పని చేస్తున్నాను. రూ.వెయ్యి జీతానికి ఉద్యోగంలో చేరాను. తరువాత రూ.3 వేలు, రూ.6,700, రూ.12 వేలకు జీతం పెంచారు. ఇప్పుడు రూ.15 వేలకు జీతం పెరిగింది. కానీ, 13 నెలలుగా ఆ జీతం ఇవ్వకపోగా తాజాగా దీనిని రూ.8 వేలకు కుదించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. – ఆకుల వీరబాబు 2017లో టాలీ ఆపరేటర్గా చేరా.. శాప్ అనుమతి, కలెక్టర్ ఆదేశాల మేరకు నేను 2017లో కాకినాడ డీఎస్ఏలో టాలీ ఆపరేటర్గా తాత్కాలిక ప్రాతిపదికన చేరాను. ఇప్పుడు శాప్ అనుమతి లేదని నా పేరు తీసేశారు. డీఎస్ఏ అధికారులు న్యాయం చేయాలి. – తేజ రూ.15 వేల నుంచి రూ.6 వేలకు.. నేను 20 ఏళ్లుగా డీఎస్ఏలో స్వీపర్గా పని చేస్తున్నాను. ప్రస్తుతం నా జీతం రూ.15 వేలు. దానిని రూ.6 వేలకు కుదించారు. ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో రూ.6 వేలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి? – గుబ్బల జ్యోతి ● డీఎస్ఏలో సిబ్బంది జీతాల కుదింపు ● సగానికి సగం కోత ● శాప్ బోర్డు మీటింగ్ సాకునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచుతారనే విషయం అందరికీ తెలిసిందే. కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) తీరే వేరు. ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తున్న చిరుద్యోగుల జీతాల్లో సగానికి సగం కోత పెట్టింది. వారి జీవితాలతో ఆటాడుకుంటోంది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇస్తున్నదే చాలీచాలని జీతమైతే.. అందులోనూ కోత పెడితే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. 2003 నుంచి.. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్ఏ)లో 2003 నుంచి తాత్కాలిక ప్రాతిపదికన సుమారు 20 మంది చిరుద్యోగులు పని చేస్తున్నారు. వీరందరినీ అప్పట్లో జిల్లా కలెక్టర్, శాప్ అనుమతితోనే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. వీరిలో కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఇళ్ల భీమేశ్వరరావు (బాస్కెట్బాల్ కోచ్), నల్లా కామేశ్వరరావు (గ్రౌండ్స్మన్), ఆకుల వీరబాబు (నైట్ వాచ్మన్), కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జి.జ్యోతి (స్వీపర్), కె.లోవ (స్వీపర్), జి.పుల్లారావు (నైట్ వాచ్మన్), ఎం.లక్ష్మీనారాయణ (టెన్నిస్బాల్ పిక్కర్), ఎస్.నారాయణరావు (బ్యాడ్మింటన్ కోచ్), అబ్దుల్ వదూద్ (సీని యర్ అసిస్టెంట్), ఎన్.సత్యకృష్ణ (డేటా ఎంట్రీ ఆపరేటర్), శ్రీను, ఎన్వీ సాగర్ (గ్రౌండ్స్మన్) తదితరులున్నారు. 13 నెలలుగా.. వీరిలో ఆఫీస్ సిబ్బందికి ప్రతి నెలా రూ.18 వేల నుంచి రూ.21 వేలు, మిగిలిన వారికి రూ.15 వేల చొప్పున జీతాలు ఇచ్చేవారు. అయితే గత 13 నెలలుగా వీరికి ఒక్క రూపాయి కూడా జీతం ఇవ్వడం లేదు. గత ఆగస్టులో జరిగిన శాప్ బోర్డు మీటింగ్లో ఆఫీస్ సిబ్బందికి రూ.15 వేలు, గ్రౌండ్స్మన్, వాచ్మన్ల్కు రూ.8,000, స్వీపర్లకు రూ.6,000 చొప్పున జీతాలు కుదించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఆయా డీఎస్ఏలను ఆదేశించారు. దీంతో, ఈ చిరుద్యోగులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇరవయ్యేళ్లకు పైబడి పని చేస్తూంటే.. ఇప్పుడిలా అన్యాయం చేయడమేమిటంటూ జిల్లా క్రీడాభిృద్ధి అధికారుల (డీఎస్డీఓ) వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, శాప్ నుంచి ఆదేశాలు వచ్చాయని, తామేమీ చేయలేమని వారు చెప్పారు. కాకినాడ డీఎస్ఏలో 2017లో టాలీ ఆపరేటర్ను నిమించాలని శాప్ ఆదేశించింది. ఆ మేరకు తేజ అనే వ్యక్తిని ఆ పోస్టులో నియమించారు. అయితే, ఇప్పుడు శాప్ అనుమతి లేకుండా నియమించారని పేర్కొంటూ మొత్తం అతడి పేరును తొలగించారు. అసలుకే ఎసరు పెట్టేలా.. రెండు దశాబ్దాలకు పైగా సర్వీసు ఉన్న తమను ఆయా ఉద్యోగాల్లో పర్మినెంట్ చేసి, జీతాలు పెంచాల్సింది పోయి, సగానికి సగం కోత పెట్టడమేమిటని ఆ చిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికై నా పర్మినెంట్ అవుతుందన్న ఆశతో పని చేస్తూండగా అసలుకే ఎసరు పెట్టినట్టు శాప్ వ్యవహరిస్తోందని వాపోతున్నారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతున్న తరుణంలో ఇప్పటికే చాలీచాలని జీతాలతో కుటుంబాలు భారంగా నెట్టుకొస్తున్నామని, తమకు అన్యాయం చేయవద్దని వేడుకుంటున్నారు. సోమవారం కాకినాడ వచ్చిన శాప్ డైరెక్టర్ల బృందం ఎదుట వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే, వారి జీతాలు తగ్గించిన విషయం తమకు తెలియదని శాప్ డైరెక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడం ఈ ఎపిసోడ్లో కొసమెరుపు. చివరకు సమస్య అర్థం చేసుకుని, ఆ చిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇచ్చారు. -
పీజీఆర్ఎస్కు 365 అర్జీలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 365 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా తదితరులు అర్జీలు స్వీకరించారు. వీటిపై సత్వరం సమగ్ర విచారాణ చేపట్టి, తగిన పరిష్కారం అందించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జీఎస్టీ తగ్గింపు లబ్ధిపై అవగాహన కల్పించాలి బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జీఎస్టీ తగ్గింపు వలన కలిగే లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నా రు. ఈ అంశంపై డివిజన్ స్థాయి అధికారులతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, ని యోజకవర్గ, మండల, వార్డు, సచివాలయ స్థా యిల్లో జీఎస్టీ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో జీఎస్టీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్ 19 వరకూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ సోమవారం నిర్వహించారు. కాకినాడ, జగ్గంపేటల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో మిగిలిస 43 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి సీట్లు కేటాయిస్తామని అడ్మిషన్ల కన్వీనర్ జీవీకే వర్మ తెలిపారు. లంకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అమలాపురం రూరల్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరుగుతుండడంతో జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని, మంగళవారం రెండో ప్రమాద హెచ్చరికకు వరద నీరు చేరుకునే అవకాశం ఉందన్నారు. దీంతో గోదావరి తీరం వెంబడి తీర ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తం కావాలని సూచించారు. ఇప్పటికే కొన్ని గ్రామాల కాజ్ వేలపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయని, బోట్ల సహకారంతో అత్యవసర పనులు ఉన్నవారిని మాత్రమే తరలించాలని అధికారులకు సూచించారు. ప్రత్యేక అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
పోలియో ఫండ్కు రూ.లక్ష విరాళం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ రోటరీ పోలియో ఫండ్కు క్లబ్ మాజీ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు సోమవారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు గోపీనాథ్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు అంతర్జాతీయ రోటరీ కృషి చేస్తోందని చెప్పారు. ఫలితంగా నేడు పోలియో రహిత ప్రపంచంగా ప్రకటించడం గర్వకారణమని అన్నారు. ఇటీవల కొన్ని పోలియో కేసులు నమోదవడం పట్ల అంతర్జాతీయ రోటరీ ఆందోళన వ్యక్తం చేసిందని, ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితంగా వ్యాక్సిన్ వేయాలన్న దృక్పథంతో ఏటా రెండుసార్లు పల్స్పోలియో కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి రోటరీ సభ్యులు విరాళాలు ఇప్పించాలని కోరారు. డాక్టర్ రావు విరాళం అందించడం పట్ల గోల్డెన్ జూబ్లీ క్లబ్ కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సాన, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి, నయన శ్రీరామ్ అభినందించారు. -
ఎంపీ మిథున్రెడ్డికి ఘన స్వాగతం
● సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ● ఎయిర్పోర్ట్ వరకూ భారీ బైక్ ర్యాలీసాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ అక్రమ కేసులో అరెస్టయ్యి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పత్రాలను పరిశీలించిన జైలు అధికారులు మిథున్రెడ్డిని సాయంత్రం 5.55 గంటలకు విడుదల చేశారు. ఎంపీ విడుదల విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు. మిథున్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నేతృత్వంలో భారీ బైక్, కార్ల ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ జైలు నుంచి మధురపూడి ఎయిర్పోర్ట్ వరకూ ఈ ర్యాలీ సాగింది. మిథున్రెడ్డికి స్వాగతం పలికిన వారిలో ఆయన తండ్రి, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ మంత్రి, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కొవ్వూరు, అనపర్తి కో ఆర్డినేటర్లు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్ల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, కోనసీమ, కాకినాడ జిల్లాల నేతలు పాల్గొన్నారు. మిథున్రెడ్డి అరెస్టు పైశాచిక ఆనందం ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు కూటమి ప్రభుత్వ పైశాచిక ఆనందానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడరు. లిక్కర్ అక్రమ కేసులో కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిన వారందరూ కడిగిన ముత్యాల్లా బయటకు వస్తారు. – జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు శాడిజం మిథున్రెడ్డిపై కూటమి ప్రభుత్వం పెట్టినది మ్యానేజ్డ్ కేసు అనే విషయాన్ని మొదటి నుంచీ చెబుతున్నాం. బెయిల్ పత్రాలు వచ్చినా కావాలనే విడుదల ఆలస్యం చేశారు. ఇది చంద్రబాబు శాడిజానికి నిదర్శనం. చంద్రబాబు ఎప్పుడూ హింసించి ఆనందం పొందుతారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బాబు ఎవరు? – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ ముమ్మాటికీ కక్ష సాధింపే పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధించేందుకే ఎంపీ మిథున్రెడ్డి అరెస్టు. ఆయన జైలు నుంచి బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. న్యాయం ఎప్పటికీ గెలుస్తుంది. – డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అనపర్తి కో ఆర్డినేటర్ -
క్రీడా అకాడమీలు పునఃప్రారంభిస్తాం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): వివిధ క్రీడా అకాడమీలను త్వరలో పునఃప్రారంభిస్తామని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) బోర్డు సభ్యుడు, అకాడమీస్ కమిటీ సభ్యుడు, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎ.రమణారావు తెలిపారు. ఆయనతో పాటు శాప్ సభ్యులు ఎ.రమణారావు, పేరం రవీంద్రనాథ్, కె.జగదీశ్వరి, పీబీవీఎస్ఎన్ రాజు, శాప్ క్రీడాధికారి జూని గాలియోట్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) శ్రీనివాస్కుమార్తో కూడిన అకాడమీస్ కమిటీ సోమవారం కాకినాడలోని జిల్లా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ) క్రీడా ప్రాంగణాన్ని సందర్శించింది. క్రీడా అకాడమీల ఏర్పాటుకు ఉన్న వసతులు, కావలసిన సౌకర్యాలపై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా డీ ఎస్ఏ కార్యాలయంలో రమణారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూ రు, తిరుపతి డీఎస్ఏలలోని అకాడమీలను నెల రోజుల్లోగా పునఃప్రారంభించే అంశంపై తమ కమిటీ శాప్ కు నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. వివిధ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మెరుగైన క్రీడా శిక్షణ ఇచ్చేందుకు 100 మంది కోచ్ల నియామకానికి శాప్ ప్రభుత్వ అనుమతి కోరిందన్నారు. 14 నుంచి 16 రకాల క్రీడాంశాల్లో సుమారు 100 మంది క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని వసతులూ అకాడమీల్లో కల్పిస్తామని చెప్పారు. -
ఘనంగా త్రికోటి మహా సరస్వతీ పూజ
కాకినాడ రూరల్: శరన్నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని శ్రీపీఠం విద్యార్థులతో కళకళలాడింది. జిల్లా నలుమూలల నుంచీ వేలాదిగా వచ్చిన విద్యార్థులతో పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి త్రికోటి మహా సరస్వతి పూజ చేయించారు. సరస్వతీ కటాక్షం కలగాలనే సంక్పలంతో కుంకుమ పూజ నిర్వహించారు. పూజ కోసం విద్యార్థులకు సరస్వతీదేవి ఫొటో, పెన్ను, కుంకుమను అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చన్నారు. ఒక్కో వయసులో ఒక్కో సంకల్పం ఉంటుందని, విద్యార్థులకు విద్య మాత్రమే మహా సంకల్పమని చెప్పారు. విద్యతో కుటుంబ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములవుతారని, మనను లీనం చేసుకుని చదువు యజ్ఞం కొనసాగించాలని ఆకాంక్షించారు. పూజ అనంతరం విద్యార్థులు సరస్వతీ దేవి అలంకరణలో ఉన్న ఐశ్వర్యాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఇదిలా ఉండగా మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు 8వ రోజుకు చేరుకున్న సందర్భంగా మేథా సూక్త, సరస్వతీ హోమం నిర్వహించారు. మంగళవారం నాటికి వంద కోట్లకు చేరువవుతామని, దసరా వరకు కుంకుమార్చనలు జరుగుతాయని స్వామీజీ తెలిపారు. ఆ రోజు మహా పూర్ణాహుతి ఉంటుందన్నారు.సరస్వతీ పూజకు హాజరైన విద్యార్థులు -
హడలెత్తిస్తున్న ధార్గ్యాంగ్
రాజమహేంద్రవరం రూరల్: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు షాపులో ఒక గోల్డుషాపులో దుండగులు ఈ నెల 23వ తేదీన షట్టర్ పైకి వంచి అద్దాలు పగలు గొట్టి 11 కిలోల వెండి దొంగతనం చేశారు. ● తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల జంక్షన్ వెనుక ఒంటరిగా నివసిస్తున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి ఈ నెల 24వ తేదీ రాత్రి నలుగురు దుండగులు వెళ్లి రాళ్లతో ఆమైపె దాడి చేసి 15 కాసుల బంగారం అపహరించుకు పోయారు. ● అంతకు ముందు నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో సైతం ఈ తరహా చోరీలకు పాల్పడ్డారని సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు ఈ చోరీలకు పాల్పడుతన్న వ్యక్తులు మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్గా గుర్తించారు. చోరీలకు పాల్పడిన ప్రదేశాలలో ఒకరి వేలిముద్రలు మధ్యప్రదేశ్కు చెందిన నేరస్తుడి వేలిముద్రలతో సరిపోవడంతో పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. మధ్యప్రదేశ్కు చెందిన ధార్గ్యాంగ్ ఈ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ధార్గ్యాంగ్లో నలుగురి నుంచి ఆరుగురు వరకు సభ్యులు ఉంటారన్నారు. వీరికి రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళలు, శివారు ప్రాంతాలతో పాటు, తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్. ఉదయం సమయంలో ఆటోల్లో రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి సమయాల్లో నలుగురు నుంచి ఆరుగురు వెళ్లి చోరీలకు పాల్పడతారు. ఒకవేళ ఇంటిలో ఎవరైనా ఉంటే వారిపై విచక్షణా రహితంగా దాడులు చేసి సొత్తును చోరీ చేస్తుంటారు. అవగాహన కల్పిస్తున్న జిల్లా పోలీసులు పోలీసు అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆయా పోలీస్ స్షేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్లు,ఎస్సైలు శివారు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలు ఒంటరిగా తిరగవద్దని, ముఖ్యంగా అర్ధరాత్రుళ్లు ఎవరైనా తలుపు తడితే తీయవద్దని, వచ్చిన వారు ఎవరో నిర్ధారించుకోవాలన్నారు. దోపిడీలకు, దాడులకు పాల్పడే మధ్యప్రదేశ్కి చెందిన ధార్ గ్యాంగ్ తూర్పు గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల్లో తిరుగుతోందని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ధార్ గ్యాంగ్ గ్రామాల శివారు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించారు. రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. క్రైమ్ పోలీసుల హెచ్చరిక అమలాపురం టౌన్: మధ్యప్రదేశ్కు చెందిన ధార్ గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కోనసీమ జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆదివారం హెచ్చరించింది. ధార్గ్యాంగ్తోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లకు చెందిన గ్యాంగ్లు కూడా రాష్ట్రంలోకి వచ్చినట్టు సమాచారం ఉందని పేర్కొంది. ఈ గ్యాంగ్ ఒంటరిగా ఉన్న మహిళలను, ఇళ్లను టార్గెట్ చేస్తుందని క్రైమ్ పోలీస్ స్టేషన్ సీఐ గజేంద్రకుమార్ తెలిపారు. ధార్గ్యాంగ్లోని ఎనిమిది మంది ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఒంటరి మహిళలు, తాళాలు వేసిన ఇళ్లు, శివారుప్రాంతాలే టార్గెట్ నల్లజర్ల, ప్రత్తిపాడుతో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన వైనం ప్రజలను అప్రమత్తం చేస్తున్న పోలీసులు -
రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలి
రావులపాలెం: నూతనంగా ఎన్నికై న చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వ్యాపారుల సమస్యలు పరిష్కరించడంతోపాటు, రావులపాలెం అభివృద్ధికి కృషి చేయాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. స్థానిక సీఆర్సీ ఫంక్షన్ హాల్లో ఆదివారం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం పూర్వపు అధ్యక్షుడు కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా పోతంశెట్టి కనికిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కర్రి శ్రీనివాస్రెడ్డి, మామిడిశెట్టి సోమరాజు, ఆకుల శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా మల్లవరపు సూరిబాబు, సంయుక్త కార్యదర్శులుగా కొవ్వూరి వంశీకృష్ణారెడ్డి, మన్యం ప్రదీప్, మల్లూరి నీలకంఠ దుర్గారావు, కోశాధికారిగా మండవిల్లి నగేష్, సహ కోశాధికారిగా కండిచర్ల వీర వెంకట నాగరాజుతో ఎమ్మెల్యే బండారు ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని అభినందించారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అభినందించారు. కనికిరెడ్డికి ఆయన శాలువా కప్పించి అభినందించారు. మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ రెడ్డి అనంత కుమారి, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, సర్పంచ్ తాడేపల్లి నాగమణి, ఉప సర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి పాల్గొన్నారు.చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం -
ఇద్దరు భవానీ మాలధారుల మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు● వెనుక నుంచి ఢీకొట్టిన కారునల్లజర్ల: జాతీయ రహదారిపై నల్లజర్ల మండలం పుల్లలపాడు వద్ద ఆదివారం ఉదయం కాలినడకన విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న భవానీ మాలధారులను వెనుక నుంచి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోశలపాడు గ్రామానికి చెందిన పక్కురి శివ, పక్కుర్తి శ్రీను, పక్కురి శేశీలు, కోనాగోవిందు భవానీ మాలలు ధరించి ఈ నెల 24న తమ స్వగ్రామం నుంచి ఇరుముళ్లు కట్టుకొని విజయవాడలోని దుర్గమ్మ సన్నిధికి పాదయాత్రగా బయలు దేరారు. వీరంతా ఆదివారం ఉదయం పుల్లలపాడు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి విశాఖపట్టణం నుంచి హైదరాబాదు వెళ్తున్న పశ్చిమబెంగాల్కు చెందిన కారు వీరిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ సంఘటనలో శివ చక్రాల కింద, గాలిలోకి ఎగిరి పక్కనే పంటబోదెలోకి పడిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా శేశీలుకు రెండు కాళ్లూ విరిగిపోయాయి. ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోవిందు ఫోన్ మాట్లాడుతూ దూరంగా ఉండటంతో క్షేమంగా బయటపడ్డాడు. మృతిచెందిన శివకు భార్యదేవి, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. శ్రీను అవివాహితుడు కాగా వీరంతా వ్యవసాయ కూలీలే. మృతదేహాలను కోసం తాడేపల్లిగూడెం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. -
గుండె లయ తప్పుతోంది
●రాయవరం: ఇటీవలి కాలంలో ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఎలా చనిపోయారు అని ప్రశ్నించగానే ఎక్కువగా వినిపించే సమాధానం గుండెపోటు. వయసుతో సంబంధం లేకుండా చోటు చేసుకునే మరణాల్లో హార్ట్ ఎటాక్తో జరిగేవే అధికం. మన శరీరానికి పెద్దదిక్కుగా వ్యవహరించే హృదయం లయ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం. సోమవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అతి ప్రధానమైన అవయవం మనిషి శరీరంలో పనిచేసే అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. దీనికి ప్రస్తుత పరిస్థితుల్లో భద్రత లేకుండా పోతోంది. వ్యాయామం లేకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం. పొగ తాగడం, ఒత్తిళ్లతో గుండెపోటుకు గురవుతున్నారు. మనుషుల్లో మారుతున్న అలవాట్లు, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలకు దారి తీయడంతోపాటు అంతిమంగా గుండైపె ప్రభావం పడుతోంది. అయితే మధుమేహం (సుగర్)తోనే అధిక ముప్పు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. యువకుల నుంచి వృద్ధుల వరకు రెండు దశాబ్దాల కిందట 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చే గుండెపోటు, మారిన జీవన శైలి కారణంగా నేడు 20 ఏళ్ల యువకుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు వస్తోంది. వీరిలో 30 ఏళ్ల వయసువారే ఎక్కువ మంది ఉంటున్నారు. దీనికి కారణం అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, సుగర్, ఫాస్ట్ ఫుడ్ , లావు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్, నిద్రలేమి, అధికంగా ఫోన్ చూడడం, ప్యాక్డ్ ఫుడ్ను అధికంగా తీసుకోవడం, మితిమీరి శీతలపానీయాలు తాగడం, తరచుగా ఆయిల్ ఫుడ్ను తీసుకోవడం. జిల్లాలో 14 శాతం బాధితులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు 14 శాతం ఉన్నట్లు అంచనా. ఆకస్మిక హృద్రోగ సమస్య ఎదురైన వారిలో 10 శాతం మంది మాత్రమే చికిత్స పొంది, కోలుకుంటున్నారు. హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడేవారు 1.06 లక్షల మంది, సుగర్ వ్యాధిగ్రస్తులు 43వేల మంది ఉన్నారు. కోవిడ్–19తో పెరిగిన కేసులు జిల్లాలో కోవిడ్ వైరస్ వల్ల గుండె సమస్యలు 50 నుంచి 60 శాతానికి పెరిగాయి. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, సుగర్, మద్యం, సిగరెట్ వల్ల ఈ సమస్య ఉండేది. గుండె నొప్పి, అధిక ఆయాసం ఉంటే వెంటనే కార్డియాలజిస్టును సంప్రదించి, చికిత్స తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించాలి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ఆహారంలో సాధ్యమైనంతవరకు పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 20 నుంచి 45 నిమిషాలు వ్యాయామం చేయాలి. బీపీని అదుపులో ఉంచుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాలను అధిగమించవచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పార్కులు, ఇతర ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించాలి. కరోనాతో మరింత పెరిగిన గుండెపోటు బాధితులు ఆహారపు అలవాట్లు అదుపు చేసుకుంటేనే మంచిది నేడు వరల్డ్ హార్ట్ డే -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
ఆలమూరు: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం సాయంకాలం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం 216 ఏ జాతీయ రహదారిపై జొన్నాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలగల సుజాత (45) మృతి చెందారు. కడియం మండలంలోని పొట్టిలంకకు చెందిన సుజాత తన భర్త సూరిబాబుతో కలిసి బైక్పై కపిలేశ్వరపురం వెళుతున్నారు. స్థానిక ఏటిగట్టు రోడ్డుకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న సైక్లిస్ట్ను తప్పించేందుకు సడన్ బ్రేక్ వేయగా వెనుక కూర్చున్న సుజాత రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో సుజాత అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై నరేష్ కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డివైడర్ ఢీకొని.. మండలంలోని చొప్పెల్లలో శనివారం రాత్రి జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పసుపులేటి వేణుగోపాలరావు (47) మృతి చెందారు. వివరాలలోకి వెళితే మోరంపూడికి చెందిన వేణుగోపాలరావు కొద్దికాలంగా పుణ్యక్షేత్రమైన వాడపల్లిలో రోజ్ మిల్క్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యాపారం చేసుకుంటున్నారు. శనివారం రాత్రి ఇంటికి వెళుతుండగా స్థానిక ఇరిగేషన్ లాకుల వద్దకు వచ్చేసరికి తాను నడపుతున్న బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణుగోపాలరావును హైవే, పోలీసు సిబ్బంది అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. -
వాడపల్లి వెంకన్నకు దసరా శోభ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా దాదాపు ఆ స్థాయిలో ఈ ఆదివారం భక్తజనంతో ఆ క్షేత్రం కిక్కిరిసింది. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా అత్యధికంగా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు, ఆదివారం కావడంతో అత్యధికంగా భక్తులు తరలివచ్చారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపించుకున్నారు. కొందరు స్వామివారి కల్యాణం చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ.8,90,146 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు.● అత్యధికంగా తరలివచ్చిన భక్తజనం ● ఒక్కరోజు రూ 8.90 లక్షల ఆదాయం -
గోదావడి..
కోటిలింగాల ఘాట్ వద్ద వరద గోదారితగ్గుతూ.. పెరుగుతూ..ధవళేశ్వరం: కొద్ది రోజులుగా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కాటన్ బ్యారేజీ వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. అయితే, ఎగువన నీటిమట్టాలు పెరుగుతూండటంతో ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి సోమవారం మరోసారి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడి ఫ్లడ్ కంట్రోల్ రూము నుంచి అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం ఉదయం 6 గంటలకు 12.50 అడుగులకు చేరుకుంది. అనంతరం క్రమేపీ రాత్రి 8 గంటలకు 12 అడుగులకు తగ్గింది. బ్యారేజీ నుంచి 10,09,208 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఇక్కడ నీటి ఉధృతి క్రమేపీ తగ్గుతూండగా మరోవైపు ఎగువన భద్రాచలంలో ఆదివారం సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతోంది. దీని ప్రభావంతో ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి సోమవారం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టా కాలువలకు 10,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సీజన్లో మూడోసారి.. ఈ సీజన్లో మూడుసార్లు వరదలు వచ్చాయి. గత నెల 21వ తేదీన ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటిమట్టం చేరింది. ఆ మర్నాడు.. అంటే గత నెల 22న బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి ఉధృతి చేరింది. ఆ సమయంలో అత్యధికంగా 14.30 అడుగులకు నీటిమట్టం చేరగా 13,57,119 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. రెండోసారి గత నెల 30వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి గోదావరి నీటి మట్టం చేరింది. ఆ సమయంలో నీటిమట్టం 13.10 అడుగులకు చేరుకోగా 11,79,236 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. మూడోసారి శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటిమట్టం చేరింది. గరిష్టంగా 12.50 అడుగులకు నీటిమట్టం చేరుకోగా 10,78,317 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 11.20 పేరూరు 15.89 దుమ్ముగూడెం 11.84 భద్రాచలం 43.40 (అడుగులు) కూనవరం 18.46 కుంట 9.75 కొయిదా 24.55 పోలవరం 12.01 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 16.08 ధవళేశ్వరం వద్ద స్వల్పంగా తగ్గిన ఉధృతి ఉదయం నీటిమట్టం 12.50 అడుగులు రాత్రి 12 అడుగులకు తగ్గుదల ఎగువన పెరుగుతున్న నీటిమట్టాలు కాటన్ బ్యారేజీ వద్ద వరద నేడు స్వల్పంగా పెరిగే అవకాశం -
స్టెత్ డౌన్.. సమ్మె సైరన్
● ఉద్యమ పథంలో పీహెచ్సీ వైద్యులు ● నేటి నుంచి ఓపీ సేవల నిలిపివేత ● ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● పేదల వైద్య సేవలకు ఆటంకం కాకినాడ క్రైం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ) వైద్యులు స్టెతస్కోప్ కాసేపు పక్కన పెట్టి సమ్మె బాట పట్టారు. తొలి దశలో సోమవారం నుంచి ఓపీ సేవలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వం నిరంకుశ వైఖరి వీడి న్యాయపరమైన తమ డిమాండ్లు నెరవేర్చకపోతే పూర్తి స్థాయిలో విధుల బహిష్కరణకు సైతం వెనుకాడేది లేదని హెచ్చరిస్తున్నారు. ప్రజల కోసం ఆలోచించి సమ్మె నిర్ణయాన్ని పలుమార్లు వాయిదా వేస్తూ వస్తే అది తమ చేతకానితనంగా ప్రభుత్వం పరిగణించిందని మండిపడుతున్నారు. పీహెచ్సీ వైద్యుల సమ్మె పరిష్కారం దిశగా ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే జిల్లాలోని పేదల వైద్య సేవలకు ఆటంకం కలగనుంది. ఇవీ సమస్యలు ● సర్వీస్లో ఉన్న మెడికల్ ఆఫీసర్లకు గతంలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్ క్లినికల్ రిజర్వేషన్ ఉండేది. ప్రభుత్వం జీఓ నంబర్ 85 ద్వారా ఈ కోటాను 15, 30 శాతానికి కుదించేసింది. ● ఈ ఏడాది జీఓ నంబర్ 99 ద్వారా ఆరు బ్రాంచిల నిబంధన తెర మీదికి తెచ్చారు. దీని ప్రకారం, 15 శాతానికి కుదించిన క్లినికల్ సీట్ల రిజర్వేషన్ రేడియాలజీ, మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అనస్థీషియా బ్రాంచిలకు మాత్రమే వర్తింపజేసింది. ఈ అన్యాయాన్ని వైద్యులు ఏడాది కాలంగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదు. ● ఎంబీబీఎస్ చదివి వైద్యాధికారిగా నియమితులైన వారు పీజీ చదువుకోవడానికి ప్రభుత్వం అనేక షరతులు పెట్టింది. రూ.50 లక్షల ష్యూరిటీ ఇవ్వాలని, కనీసం పదేళ్లు ప్రభుత్వ సర్వీసులో అదే హోదాలో పని చేస్తామంటూ బాండ్ రాయాలని చెబుతోంది. అదీ కాక మెడిసిన్ చదివిన ఒరిజినల్ సర్టిఫికెట్ను కూడా ప్రభుత్వం తన వద్ద హామీగా పెట్టుకుంటోంది. వైద్య వృత్తిలో ఎదుగుదల లేదంటే పీజీ చదవడం దేనికని పీహెచ్సీల వైద్యులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలో చేరే ఉద్యోగికి కూడా ఇన్ని కఠిన షరతులు ఉండవని వాపోతున్నారు. ఈ నిబంధనలు సడలించాలని కోరుతున్నా ప్రభుత్వం మనసు కరగడం లేదు. ● డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పని చేస్తున్న ఎంతో మంది వైద్యాధికారులకు 20 ఏళ్లుగా పదోన్నతులు లేవు. వారికి పదోన్నతులిస్తామని ఎన్నికల వేళ అసోసియేషన్ నాయకులకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఇప్పుడు ఆ విషయం ప్రస్తావిస్తే కక్షసాధింపు చర్యలకు పూనుకుంటోందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గళమెత్తిన పలు జిల్లాల సంఘ నాయకులను ప్రభుత్వ పెద్దలు నేరుగా బెదిరించారని ఆరోపిస్తున్నారు. ● కోవిడ్ వేళ అత్యవసర పరిస్థితిలో చేరి, ప్రాణాలకు తెగించి మరీ రోగులకు వైద్య సేవలు అందించిన తమపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైద్యులు చెబుతున్నారు. 2020–22 మధ్య ఉద్యోగంలో చేరిన వైద్యులకు ఇప్పటికీ రూ.53,500 మాత్రమే జీతం ఇస్తున్నారు. 2023లో నియమితులైన ఫ్రెషర్లకు రూ.80 వేల నుంచి రూ.90 వేల పే స్కేల్ అమలు చేస్తున్నారు. ఇలా సీనియర్లు అన్యాయానికి గురవుతున్నారు. తమ జీతాలను తాజా పే స్కేల్తో సమానం చేసి, పెండింగ్ జీతాన్ని నోషనల్ ఇంక్రిమెంట్ల కింద చెల్లించాలని కోరుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ● గత ఏడాది ఇదే నెలలో వైద్యులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరిస్తామని అప్పట్లో కూటమి నాయకులు, అధికారులు చెప్పారు. తీరా నిరసన విరమించాక ఏమాత్రం పట్టించుకోలేదు. నాటి అనుభవంతో రగిలిపోతున్న మెడికల్ ఆఫీసర్లు ఈసారి అటువంటి మోసాలకు గురి కాబోమని స్పష్టం చేస్తున్నారు. ● చంద్రన్న సంచార చికిత్స వాహనంలో తిరిగి సేవలందిస్తున్నందుకు ప్రతి నెలా అదనంగా రూ.5 వేలు చెల్లించాలని కోరుతున్నారు. ● గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్న వైద్యుల భత్యానికి 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉండగా దానినీ గాలికొదిలేశారు. ● నోషనల్ ఇంక్రిమెంట్ల కోసం ఫైల్ పెట్టినా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. పైగా రిజెక్ట్ అయినట్లు చెబుతూ మభ్యపెడుతోంది. ● రాష్ట్రం విడిపోయి దశాబ్దం దాటినా ఇప్పటికీ స్థానికత వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడం వైద్యాధికారులకు శాపంగా మారింది. దశల వారీ ఆందోళన ఈ సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం (ఏపీపీహెచ్సీడీఏ) పిలుపు మేరకు వైద్యులు సమ్మె బాట పట్టారు. దీనిని దశల వారీగా నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ సందీప్ తెలిపారు. ఇందులో భాగంగా రెండు రోజులుగా నల్ల రిబ్బన్లతో వైద్యులు నిరసన తెలిపారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలిగారు. సోమవారం నుంచి ఓపీ సేవలు బహిష్కరించనున్నారు. అత్యవసర సేవలు మాత్రమే అందిస్తారు. మంగళవారం జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతారు. వచ్చే నెల 1న ప్లకార్డులు చేబూని జిల్లా కేంద్రంలో ర్యాలీ, ధర్నా నిర్వహిస్తారు. 2న విజయవాడకు దీక్షా యాత్ర నిర్వహిస్తారు. 3న నిరాహార దీక్షలు చేపడతారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా సహా తమ సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో ఉద్యమించనున్నారు. సార్ డెన్మార్క్ వెళ్తున్నారంటూ.. తమ సమస్యలు పరిష్కరించాలని పీహెచ్సీ వైద్యుల సంఘం నాయకులు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, అంతకుముందు కృష్ణబాబు, కమిషనర్ వీరపాండియన్, హెల్త్ డైరెక్టర్ పద్మావతితో పాటు నేరుగా ముఖ్యమంత్రికి సైతం తమ ఆవేదన చెప్పుకున్నారు. అయినప్పటికీ ఫలితం లేదు. తాజాగా సౌరవ్ గౌర్ డెన్మార్క్ వెళ్తున్నారని, నెల రోజుల వరకూ రారని, సమ్మె వాయిదా వేసుకోవాలని, సోమవారం నుంచి ఆయన స్థానంలో కృష్ణబాబు ఇన్చార్జిగా వ్యవహరిస్తారని, ఆయనకు ఎటువంటి అధికారాలూ ఉండవని ప్రభుత్వం చెబుతోంది. ఇదంతా తమను మరోసారి బురిడీ కొట్టించే వ్యూహమేనని పీహెచ్సీల వైద్యులు భావిస్తున్నారు. అన్ని వర్గాల మద్దతు వైద్యాధికారుల సమ్మెకు అన్ని వర్గాల మద్దతూ లభిస్తోంది. ఏపీ వైద్య విధాన పరిషత్ వైద్యులు, వైద్య సంఘాలతో పాటు నాన్ మెడికల్, పారా మెడికల్ సిబ్బంది సహకారం అందుతోంది. సమస్యలు పరిష్కరించే వరకూ వెనకడుగు వేయం. ప్రజారోగ్యం పట్ల మాకున్న శ్రద్ధ ప్రభుత్వానికి లేదు. తక్షణమే సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు సహకరించాలి. – డాక్టర్ సందీప్ పోల్సపల్లి, ఏపీపీహెచ్సీడీఏ జిల్లా సెక్రటరీ, పి.మల్లాపురం పీహెచ్సీ వైద్యాధికారి జిల్లాలో పీహెచ్సీల వివరాలు మొత్తం పీహెచ్సీలు 37 రెగ్యులర్ వైద్యాధికారులు 104 పీహెచ్సీల్లో రోజువారీ ఓపీ సుమారు 2,500 -
మహాచండీదేవిగా...
అన్నవరం దేవస్థానంలో కొలువు తీరిన దుర్గామాతలు కూడా మహాచండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రత్నగిరిపై సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీ దేవితో పాటు వనదుర్గమ్మ, తొలి పావంచా వద్ద కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవార్లకు అర్చకులు అష్టోత్తర శత సహస్ర నామార్చన, లక్ష కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆర్యవైశ్య సంఘం మహిళలు కనకదుర్గమ్మ ఆలయంలో లలితా పారాయణ చేశారు.– తొండంగిలోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారు శరన్నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకుని ఏడో రోజైన ఆదివారం భక్తులకు మహాచండీదేవిగా దర్శనమిచ్చారు. వేదపండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.– తుని రూరల్ -
వైభవంగా సత్యదేవుని ప్రాకార సేవ
తొండంగి: రత్నగిరిపై సత్యదేవుని ప్రాకార సేవ ఆదివారం వైభవంగా జరిగింది. ప్రధానాలయంలో మూలవిరాట్టుకు వేదమంత్రోచ్చారణతో అర్చకులు అభిషేకాలు, అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను పల్లకీపై రాజగోపురం వద్దకు తీసుకువచ్చి, తిరుచ్చి వాహనంపై వేంచేయించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ గావించారు. అనంతరం ఉత్సవమూర్తులను ప్రధానాలయంలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నేడు జయలక్ష్మి సొసైటీ మహాజన సభ కాకినాడ రూరల్: జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ నాలుగో మహాజన సభ సోమవారం కాకినాడలో జరగనుంది. సాంబమూర్తి నగర్ మున్సిపల్ కార్యాలయం వెనక దంటు కళాక్షేత్రంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సభ్యులందరూ హాజరు కావాలని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు కోరారు. పలు తీర్మానాలతో పాటు సభ్యులు ప్రతిపాదించిన అంశాలను సభ అజెండాలో ఉంచుతామన్నారు. మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం కాకినాడ రూరల్: మహాశక్తి యాగ ప్రాంగణంలో 64 అడుగుల అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. పీఠంలో మహాశక్తి యాగం వంద కోట్ల కుంకుమార్చనలు ఆదివారం ఏడో రోజుకు చేరుకున్నాయి. ఉదయం వారాహి, కీలక స్తోత్ర హోమం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారు వారాహి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కుంకుమార్చనల్లో వేలాదిగా పాల్గొన్న మహిళలనుద్దేశించి స్వామీజీ మాట్లాడుతూ, కోట్ల కుంకుమార్చనలు అందుకున్న అమ్మవారు మహాశక్తిగా అందరినీ కాపాడేందుకు మహాశక్తి దీపం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ మహాశక్తి దీపంలో 108 అడుగుల ఎత్తున ఒక మహాపర్వతం, దానిని ఆనుకుని 64 అడుగుల ఎత్తున అమ్మవారు ఉంటారని వివరించారు. అమ్మవారి చుట్టూ చండీ, భైరవి, మాతంగి, వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర తదితర 8 శక్తులు ఉంటాయన్నారు. దేశంలోని వన మూలికల వృక్షాలను అమ్మవారి చుట్టూ పెంచుతామన్నారు. అందరూ కూర్చుని హాయిగా పారాయణ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. లలితా సహస్ర నామ పారాయణతో 72 వేల నాడులు యాక్టివేట్ అవుతాయని స్వామీజీ చెప్పారు. ప్రతి ఒక్కరూ లలితా పారాయణ చేసుకోవాలని సూచించారు. మహాశక్తి యాగంలో మొదటి, రెండో సంవత్సరం పాల్గొన్న భక్తురాలికి వివాహమైన 14 ఏళ్లకు ముగ్గురు కుమార్తెలు శశిరేఖ, శశిప్రియ, శశికళ జన్మించారని, ఇది యాగ ఫలితమని పేర్కొంటూ వారిని ఒడిలోకి తీసుకుని ముచ్చటించి, భక్తులకు చూపించారు.