breaking news
Kakinada
-
పద్యంలా ఘోషించే గోదావరి!
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గోదావరి తీరం తెలుగు శతక పద్య పఠనంతో, వందేమాతరం గీతాలాపనతో మారు మోగింది. 1,008 మంది విద్యార్థులతో గోదావరి గట్టు చాంబర్ భవనంలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలుగు బాల శతక పద్య సహస్రాధిక గళ ధారణ, దశ సహస్ర వందేమాతర గీతాలాపన కార్యక్రమాలు జరిగాయి. మాతృ భాష పరిరక్షణ సమితి పెరవలి, ఆంధ్ర కేసరి యువజన సమితి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. 40 పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు భారతమాత, తెలుగు తల్లి వేషధారణలతో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి జంధ్యాల పాపాయ్య శాస్త్రి (కరుణశ్రీ) కుమారుడు వెంకట రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 80 ఏళ్లు జీవించిన తన తండ్రి 80 తెలుగు సాహితీ గ్రంథాలను అందించారని ఆయన తెలిపారు. ఎక్కువ శాతం తెలుగు బాల సాహిత్య గ్రంథాలనే అందించిన ఘనత కరుణశ్రీ దే అన్నారు. శాసనమండలి సభ్యులు సోమ వీర్రాజు మాట్లాడుతూ 150 ఏళ్ల వందే మాతర గీతాన్ని వెయ్యి సార్లు ఆలపించడం ఆనందదాయకమన్నారు. నగర ప్రముఖులు తోట సుబ్బారావు, పంతం కొండలరావు, ఇయ్యపు మురళీధర్, లక్కోజు వీరభద్రరావు అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్ర కేసరి యువజన సమితి ప్రతినిధులు మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి తెలుగు శతక పద్య విశిష్టతను వివరించారు. జంధ్యాల పాపయ్య శాస్త్రి కుమారుడు వెంకటరమణకు ఈ సందర్భంగా నిర్వాహకులు సత్కారం చేశారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవాలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించినట్టు అధికారులు అంచనా వేశారు. స్వామివారి వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తిరుచ్చి వాహనంలో ఉంచి ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి, అమ్మవార్లకు అర్చకుడు యడవిల్లి వేంకటేశ్వరరావు పూజలు చేసిన అనంతరం దేవస్థానం ఈఓ వీ త్రినాథరావు కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రొచ్ఛాటన మధ్య, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగిస్తారు. -
బాబు సర్కారుది దుర్మార్గం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజలకు ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని, అటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యని పలువురు వక్తలు పేర్కొన్నారు. నిరుపేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యం వస్తే వెళ్లేది ప్రభుత్వ ఆసుపత్రికేనన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజలకు అందుబాటులో ఉంటే నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పేదలకు వైద్య విద్యను దూరం చేస్తుందని, ఇది నూరుశాతం సబబు కాదని ఏకకంఠంతో ఖండించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద వర్ణిక ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ, ఆమ్ఆద్మీ పార్టీ, బీఎస్పీ, జై బీమ్ పార్టీ, 19 ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయొద్దు సమావేశంలో వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని ఖూనీ చేయవద్దన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు వైద్య విద్యను దూరం చేయవద్దని, వైద్య రంగాన్ని పీ–4 పేరుతో ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గత ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టిందన్నారు. బడ్జెట్ నిధులు కేటాయించి, మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలోనే కొనసాగించిందన్నారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో కుటుంబాలు తమ ఆదాయంలో అత్యధిక భాగాన్ని నాణ్యమైన విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయన్నారు. ప్రభుత్వం పార్టీ ప్రయోజనాల కోసం అనేక సంక్షేమ పథకాలు మంజూరు చేస్తుందని, అవి చేసినా, చేయకపోయినా పేద వాళ్లకు వైద్యాన్ని మాత్రం దూరం చేయవద్దన్నారు. ఇప్పటికే ప్రభుత్వ సామాన్య, వైద్య విధాన, ఏరియా, సీహెచ్సీ, పీహెచ్సీ ఆసుపత్రులలో మందులు, పరికరాలు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. అటువంటిది ప్రభుత్వ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాలను దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని, దీనివల్ల మధ్యతరగతి, పేద ప్రజలకు తీవ్రతర ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు ఈ కళాశాలలు ఇస్తే వైద్య చికిత్సలు ఖరీదవుతాయని చెప్పారు. ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడిని రాబట్టుకోవడానికి రోగులపై అధిక భారాన్ని మోపుతారన్నారు. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు దోపిడీకి గురవుతారన్నారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రైవేటు యజమానులు సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటారని చెప్పారు. గత కోవిడ్ సమయంలో ప్రయివేటు ఆసుపత్రులు మూసివేస్తే ప్రభుత్వాసుపత్రులు మాత్రమే ఆ భారాన్ని మోశాయన్నారు. 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి ప్రభుత్వ ఆస్తులు మాజీ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వ భూములు, భవనాలు, కాలేజీలు, ఆసుపత్రులు దాదాపు 60 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయని తెలిపారు. దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య విద్య అందని ద్రాక్ష వలె మారడమే కాకుండా వైద్య విద్యలో పారదర్శకత లోపించే ప్రమాదం ఉందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో పీపీపీ విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని అనుకోవడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు. సామాజిక వర్గాల అభ్యున్నతికి భంగం కలిగించే చర్య అన్నారు. సీపీఎం సీనియర్ నాయకులు దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నంబర్ 590ను జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యానందరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతి మయంగా మారిందని చెప్పారు. ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వం వెంటనే జీవో నంబర్ 590 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఏ దేశంలోనైనా విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలోనే ఉందన్నారు. రాష్ట్రంలో మాత్రం మెడికల్ కళాశాలలను చంద్రబాబు సామాజిక వర్గానికి తాకట్టు పెట్టేందుకే ఈ ప్రభుత్వం పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. జై భీమ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తోందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాగా నేడు వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి కే బోడకొండ, జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కిర్ల కృష్ణారావు, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ చొల్లంగి వేణుగోపాల్, 93 కులాల ఐక్యవేదిక నాయకులు మాదిరెడ్డి గణేష్బాబు, గాంధీనగర్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్, , ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కోశాధికారి జి.రవికుమార్, ఐఎన్టీయూసీ ఏపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి రాజు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొబ్బిలి శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా నాయకులు పలివెల వీరబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాకా రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రభుత్వమే మెడికల్ కళాశాలలను నిర్వహించాలి ప్రైవేటీకరిస్తే సహించేది లేదు సీపీఐ రౌండ్టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ -
అందని కందిపప్పు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రేషన్కార్డుల ద్వారా నూనె, కందిపప్పు, గోధుమపిండి, రాగులు పంపిణీ చేస్తామని, సరకులు నెల మొత్తం అందుబాటులో ఉంచుతా మని పౌరసరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్ హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ప్రజలకు కందిపప్పు కష్టాలు తప్పడం లేదు. చంద్రబాబు ప్రభు త్వం వచ్చిన తర్వాత రేషన్ దుకాణాల్లో సక్రమంగా కందిపప్పు ఇవ్వడం లేదు. కార్డుదారులు నెలనెలా రేషన్దుకాణాల వద్ద డీలర్లను కందిపప్పు కోసం అడు గుతున్నా వారి దగ్గర సరైన సమాధానం ఉండడం లేదు. వచ్చే నెలలో వస్తుందని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు మార్కెట్లో కందిపప్పు కొనలేక రేషన్షాపుల్లో ఎప్పు డు కందిపప్పు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. కాకినాడ జిల్లాలో 6.50 లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. వీరందరికీ ప్రతి నెలా కిలో చొప్పున పంపిణీ చేయాలంటే 655 టన్నుల కందిపప్పు సరఫరా చేయాలి. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలు మాత్రమే ఈ విధంగా ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో చివరిగా కందిపప్పు ఇచ్చారు. తొమ్మిది నెలలుగా రేషన్షాపుల ద్వారా కందిపప్పు సరఫరా చేయడం లేదు. రెండు నెలల క్రితం దసరా, దీపావళి వంటి పండగల్లో నిరుపేద ప్రజలు కందిపప్పు కోసం ఎదురుచూశారు. అయినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది. ఈ నెలలో క్రిస్మస్ పండగ నేపథ్యంలో కందిపప్పు ఇస్తారని కార్డుదారులు రేషన్షాపులకు వెళ్లినా అక్కడ నిరాశ తప్పలేదు. కార్డుదారులు కేవలం బియ్యం మాత్రమే తీసుకొని ఉసూరుమంటూ వెనుతిరగాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో కొందామంటే నాణ్యతను బట్టి కిలో రూ.110 నుంచి రూ.130 వరకూ విక్రయిస్తున్నారు. రాగులు, జొన్నలు కూడా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం నెలనెలా ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వకపోవడంతో నిరుపేదలు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే సరకులు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇంటి వద్దనే నిత్యావసర వస్తువులను అందించేందుకు ఎండీయూ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వచ్చి సరకులు సరఫరా చేసేవారు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రేషన్ షాపులకు వెళ్లి గంటల తరబడి క్యూ లో నిలబడినా బియ్యం, పంచదార తప్ప ఇంకేమీ దొరకడం లేదు. ఈ నెలలో కపంచదార కూడా పూర్తిగా సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు తీవ్ర అంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పట్టణాల్లో ఎలా ఉన్నా గ్రామాల్లో ప్రజలు కందిపప్పు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కిరణా షాపుల్లో కొనాలంటే రేటు ఎక్కువ కావడంతో ప్రభుత్వమే రేషన్షాపుల ద్వారా ఇవ్వాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వినియోగదారులకు అదనపు భారం ప్రభుత్వం గతంలో కిలో రూ.67 కే రేషన్షాపుల ద్వా రా కందిపప్పు సరఫరా చేసేది. దీంతో సాధారణ, మఽ ద్యతరగతి ప్రజలు కిలో కందిపప్పును నెలరోజుల పా టు పొదుపుగా వాడుకొనేవారు. తొమ్మిది నెలలుగా రేషన్షాపులో కందిపప్పు ఇవ్వకపోవడంతో ప్రజలు బయట మార్కెట్లోనే కందిపప్పు కొనుగోలు చేసుకొంటున్నారు. దీంతో వినియోగదారులు సుమారు రూ. 50 నుంచి రూ.60 అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ప్రజలకు తప్పని అవస్థలు నిత్యావసర ధరలు పెరిగిన నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలు కడుపునిండా అన్నం తిందామన్నా కుదరని పరిస్థితి నెలకొంది. ప్రతీ నెలా 20వ తేదీ లోపు తమ షాపు పరిధిలోని కార్డుదారులకు కావాల్సిన బియ్యం, కందిపప్పు, పంచదార కోసం డీలర్లు డీడీలు తీస్తారు. రేషన్డీలర్లు డీడీలు తీసినా కందిపప్పు, పంచదార కూడా సరఫరా చేయడం లేదు. తొమ్మిది నెలలుగా కార్డుదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొందని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేయకపోయినా కార్డుదారులు తమను నిలదీస్తున్నారని, ప్రతి నెలా కార్డుదారులకు సమాధానం చెప్పడం చాలా కష్టంగా ఉందని రేషన్డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము డీడీలు తీసినా ఉపయోగం లేకపోవడంతో డీలర్లు డీడీలు తీయడం మానివేశారు. ప్రభుత్వం ఎప్పుడు కందిపప్పు ఇస్తే అప్పుడే డీడీలు తీయాలని నిర్ణయించుకొన్నారు. తొమ్మిది నెలలుగా రేషన్ దుకాణాలకు సరఫరా బంద్ బహిరంగ మార్కెట్లో కిలో రూ.120 ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలు ప్రకటలనకే పరిమితమైన నాయకులు జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 6,50,716 ప్రతి నెలా 655 టన్నులు అవసరం ఈ నెలలో కూడా కేటాయించలేదు ఈ నెలలో కూడా జిల్లాకు కందిపప్పు ప్రభుత్వం కేటాయించలేదు. కేవలం అంగన్వాడీ కేంద్రాలకు మాత్రమే కందిపప్పు వచ్చింది. రేషన్షాపులకు కందిపప్పు కేటాయించలేదు. ప్రభుత్వం స్టాకు విడుదల చేయకపోవడంతో రేషన్షాపుల్లో కందిపప్పు పంపిణీ చేయడం కుదరలేదు. – దేవులానాయక్, డీఎం, జిల్లా పౌరసరఫరాలశాఖ బయట మార్కెట్లో ధరలు పెంచుతున్నారు ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేయకపోవడంతో బయట మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా బయట మార్కెట్లో ధరలు పెంచుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి నెలా కందిపప్పు సరఫరా చేయాలి. – ఏలూరి రాణి, గృహిణి, కాకినాడ -
శృంగార వల్లభ స్వామి ఆలయం కిటకిట
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసియున్న శృంగారవల్లభస్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కాలినడకన ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. సుమారు 14వేల మంది స్వామిని దర్శించుకున్నట్టు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,42,290 అన్నదాన విరాళాలు రూ.67,143, కేశ ఖండన ద్వారా రూ.5,239, తులాభారం ద్వారా రూ.300, లడ్డు ప్రసాదం విక్రయం ద్వారా రూ.19,635 ఆదాయం వచ్చిందని చెప్పారు. 3,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని ఈఓ తెలిపారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. నవోదయ ఆరవ తరగతిలో ప్రవేశానికి 7,140 మంది దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం ఉమ్మడి జిల్లాలో 32 సెంటర్లు ఏర్పాటు చేసినట్టు నవోదయ ప్రిన్సిపాల్ బి సీతాలక్ష్మీ తెలిపారు. ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 6,034 హాజరయ్యారన్నారు. టెట్కు 1,588 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్–25)కు కాకినాడ జిల్లావ్యాప్తంగా మూడు కేంద్రాల్లో పరీక్ష శనివారం నిర్వహించారు. పరీక్షకు ఉదయం 795 మంది, మధ్యాహ్నం 793మంది హాజరు కాగా 143 మంది గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఽఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. అన్ని కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్టు తెలియజేశారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. అర్చకులు స్వామి, అమ్మవార్లకు వివిధ రకాల పూలతో విశేష అలంకరణ చేశారు. కోనసీమ జిల్లా పెదపూడి గ్రామానికి చెందిన పోలిశెట్టి సూర్యావతి కుటుంబం ఇచ్చిన ఆర్థిక సహాయంతో 9,500 మందికి అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. రాజీయే రాజమార్గం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజీ పడడమే రాజమార్గమని, ప్రతీ ఒక్కరూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జాతీయ లోక్ అదాలత్ శనివారం జరిగింది. ఆమె మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్కు 46 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ చలానా కేసులు, ఎకై ్సజ్ విభాగానికి చెందిన డ్యూటీ పెయిడ్, నాన్ డ్యూటీ పెయిడ్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించామన్నారు. కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, తక్కువ ఖర్చుతో న్యాయం అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. గత మూడు జాతీయ లోక్ అదాలత్లలో 10,700 కేసులు పరిష్కరించి రూ.100.99 కోట్ల ్టపరిహారం చెల్లించామన్నారు. నాలుగో జాతీయ లోక్ అదాలత్లో ఉమ్మడి జిల్లా పరిధిలో రాత్రి 9 గంటల వరకు 16,873 కేసులు పరిష్కరించగా రూ.27.32 కోట్ల పరిహారం చెల్లించామన్నారు. -
చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?: కన్నబాబు
సాక్షి, కాకినాడ జిల్లా: రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అప్పులకుప్పగా మార్చిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర అప్పులపై ప్రజలకు చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్ర అప్పులపై టీడీపీ నేతలు దుర్మార్గంగా ప్రచారం చేశారన్నారు.‘‘ఎఫ్ఆర్బీఎం నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. టీడీపీ నేతలకు వైఎస్ జగన్ సీఎంగా ఉంటే ఒక రాజ్యాంగం.. చంద్రబాబు సీఎంగా ఉంటే మరో రాజ్యాంగం ఉంటుందా?’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు. వైఎస్ జగన్ చేసిన అప్పులపై రాష్ట్రం శ్రీలంక అవుతోందని గ్లోబెల్ ప్రచారం చేశారు. చంద్రబాబు ఈ 18 నెలల కాలంలో రూ.2,66,175 కోట్లు అప్పు చేశారు. జగన్ అప్పు చేస్తే శాపం అని.. చంద్రబాబు చేస్తే వరం అని సొంత మీడియా బాకా కొట్టుకుంటుంది...కోవిడ్ వంటి కష్టకాలంలో వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఆపలేదు. చెప్పిన అబద్దం చెప్పకుండా వైఎస్ జగన్పై పచ్చి అబద్దాలను ప్రజల చెవుల్లోకి ఎక్కించారు. చంద్రబాబు తెచ్చిన అప్పులు ప్రజల సొమ్ముల్లో వేశారా అంటే? అదీ లేదు. రూ.5,400 కోట్లు ఎక్సైజ్ భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. ఏపీ బేవరేజ్ ద్వారా అప్పు తీసుకురావాలని వైఎస్ జగన్ భావిస్తే.. కేంద్రానికి లేఖ రాసి, కోర్టులో కేసులు వేశారు. వైఎస్ జగన్ చేసిన అప్పులు రాజ్యంగ విరుద్దం అన్నారు. ఇప్పుడు అవే అప్పులు మీరు చేస్తుంటే రాజ్యాంగం ఏమైనా మారిందా?..చంద్రబాబు చేసే అప్పులకు ఏపీ సౌత్ సూడాన్లా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ 18 నెలల కాలంలొ చంద్రబాబు చేసిన అప్పు.. వైఎస్ జగన్ చేసిన అప్పుకంటే 80 శాతం ఎక్కువ. చంద్రబాబు చేసిన అప్పులు ఏమవుతున్నాయి?. చంద్రబాబు చేసిన అప్పులు సంపద సృష్టి ఎలా అయ్యింది?. చంద్రబాబు లేకపోతే రాష్ట్రం అదోగతి అయిపోతుందని ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంది. పరిమితికి మించి అప్పులు చేయమని చంద్రబాబుకు ఏ చట్టం చెప్పింది. అమరావతి కోసం మరో 7,8 వేల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. మీరు చేస్తున్న అన్యాయాలపై ఎవరైనా ప్రశ్నిస్తే.. రెడ్ బుక్ ద్వారా కేసులు పెడతారు. రోడ్డు మీద గోతులు పూడ్చడం లేదు కానీ.. గ్రోత్ ఇంజన్లు, గ్రోత్ కారిడార్ల కోసం మాట్లాడుతున్నారు’’ అంటూ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. -
కుదిరిన ఎంఓయూ
భువనేశ్వర్: ఒడిశా, ఆంధ్రప్రదేశ్లోని సెంచూరియన్ యూనివర్సిటీ, చత్తీస్గఢ్ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ మధ్య అకడమిక్, పరిశోధన భాగస్వామ్యానికి ఎంఓయూ కుదిరింది. ఎస్ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ ఎస్సీ ద్వివేది, సెంచూరియన్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిత పాత్ర ఈ మేరకు సంతకాలు చేశారు. ల్యాబ్ సదుపాయాలు, శాసీ్త్రయ నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడం, సంయుక్త శిక్షణ–పరిశోధన కార్యక్రమాలు ఈ ఎంఓయూ లక్ష్యాలు. విద్యా పరిశోధన–ప్రాయోగిక ఫోరెన్సిక్ సేవల మధ్య అంతరం తగ్గించి, నైపుణ్యాభివృద్ధికి బలమైన వేదిక సృష్టిస్తామని ద్వివేది అన్నారు. విద్యార్థులు ఫోరెన్సిక్ రంగంలో పోటీ సామర్థ్యం, ఉపాధి అవకాశాలు పొందుతారని అనిత తెలిపారు. సెంచూరియన్ను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. -
వేతనాలు పెంచాలి
● యాప్ల భారం తగ్గించాలి ● అంగన్వాడీల డిమాండ్బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్యకర్తలకు వెంటనే వేతనాలు పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మ డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు. ఆరేళ్లుగా వేతనాలు పెరగలేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం తక్షణం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ మినీ కేంద్రాలను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ ఆదేశాలు మాత్రమే ఇచ్చారని, మెయిన్ సెంటర్ సిబ్బంది వేతనాలను వెంటనే మినీలకు కూడా చెల్లించాలని కోరారు. యాప్ల పేరుతో పెంచిన పని భారం తగ్గించాలని, అన్నింటినీ కలిపి ఒకే యాప్గా మార్చాలని, అంగన్వాడీ కేంద్రాలను పాఠశాలల్లో విలీనం చేయడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనానంతరం అంగన్వాడీ చిన్నారులకు స్నాక్స్ వెంటనే పునరుద్ధరించేందుకు బడ్జెట్ పెంచాలని కోరారు. ఎన్నికల ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు అనేక హామీలు, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప, అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తలు దశల వారీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ధర్నాలో యూనియన్ కార్యదర్శి ఏరుబండి చంద్రవతి, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక మంత్రికి మా గోడు వినిపించదా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ మంత్రికి భవన నిర్మాణ కార్మికుల గోడు వినిపించదా అని ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక పీఆర్ భవన్లో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికులకు బతుకు భారమైందని, సొంత ఊర్లో పనులు లేక వలసలు వెళ్లే పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110 కోట్ల భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ కై ్లమ్ ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని అనేకసార్లు వినతి పత్రం అందజేసినా ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. కార్మికులకు పథకాల అమలు చేయాలంటే నిధులు లేవని కానీ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.70 కోట్లు విడుదల చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు తానువ్యతిరేకం కాదని, కానీ భవన నిర్మాణ కార్మికుల కోసం చెల్లిస్తున్న సెస్ నిధులు ఖర్చు చేయకుండా ప్రభుత్వ నిధులు కేటాయించి స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘాలను, కలిసొచ్చే ఇతర సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు తాటిపాక మధు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటాలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాల అమలుపై భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు. సదస్సులో ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.సత్తిబాబు, అమలాపురం యూనియన్ అధ్యక్షుడు బోనం చిన్న, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ కె.రాంబాబు పాల్గొన్నారు. ఏపీ బిల్డింగ్, కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ -
ఏం బ్యాగోలేవు
శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ప్రభుత్వం కంటే నాణ్యమైన స్కూల్ బ్యాగులు, బూట్లు ఇచ్చి విద్యా వ్యవస్థను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. తీరా చూస్తే ఇదంతా వట్టి ప్రచారార్భాటమేననే చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన స్కూల్ బ్యాగ్లను చూస్తే ఇట్టే అర్థమైపోతోంది. ఆరు నెలలు కూడా గడవకుండానే ఇచ్చిన బ్యాగులు నాసిరకమైనవనే విషయం తేటతెల్లమైపోయింది. చాలా వరకూ బ్యాగులకు జిప్లు ఊడిపోతున్నాయి. చివికిపోయి, చిరిగిపోతున్నాయి. కాస్త ఎక్కువ పుస్తకాలు పెడితే బ్యాగ్ పూర్తిగా చిరిగిపోయి, అన్నీ నేలపైకి జారిపోయే పరిస్థితి. తమ పిల్లలకు మరీ ఇంత నాణ్యత లేని బ్యాగులను ప్రభుత్వం ఇస్తుందని అస్సలు ఊహించలేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. జిల్లాలో శుక్రవారం ఏ స్కూల్కు వెళ్లి పరిశీలించినా విద్యార్థుల వీపులపై నాణ్యత లేని బ్యాగులే దర్శనమిచ్చాయి. కొన్ని పాఠశాలల్లో గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతో పాటు తాజాగా చంద్రబాబు సర్కార్ ఇచ్చిన స్కూల్ బ్యాగులతో వచ్చిన విద్యార్థులు కనిపించారు. నాడు జగన్ ప్రభుత్వం అందజేసిన నీలి రంగు బ్యాగులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించాయి. అదే ఆరు నెలలు క్రితం చంద్రబాబు ప్రభుత్వం అందించిన బ్యాగులు నాణ్యత లోపానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిచ్చాయి. భారీ ఆర్భాటం వేసవి సెలవుల అనంతరం గత జూన్లో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందజేస్తామని అధికార పార్టీ నేతలు చెప్పారు. మాటలైతే చెప్పారు కానీ ఆచరణలో మాత్రం జూలై నెలాఖరు వరకు కూడా బ్యాగులు ఇస్తూనే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని 1,280 పాఠశాలల్లో 1,28,988 మంది విద్యార్థులున్నారు. ఈ మేరకు జూన్ నెలలో 1,28,988 స్కూల్ బ్యాగుల కోసం విద్యా శాఖ ఇండెంట్ పెట్టింది. అయితే, జూన్ 20 నాటికి 20,850 బ్యాగులు మాత్రమే జిల్లాకు వచ్చాయి. అంత తక్కువగా వచ్చినా పార్టీ నేతలతో వాటిని పంపిణీ చేయడానికి భారీ ఆర్భాటమే చేశారు. మిగిలినవి కూడా జూలై రెండో వారానికి విడతల వారీగా వచ్చాయి. వేలాది మందికి మొండిచేయి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ స్కూల్ బ్యాగులు ఇవ్వడానికి బాబు సర్కార్కు చేతులు రాలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆక్షేపిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా 5,600 మంది విద్యార్థులు చేరారు. వీరిలో ఏ ఒక్కరికీ ఇప్పటి వరకూ స్కూల్ బ్యాగులు ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండెంట్ పెట్టనందువల్లనే వారికి బ్యాగులు రాలేదని విద్యా శాఖ చెబుతోంది. మూడు నెలలకే ముక్కలు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాసిరకం కావడంతో ఇచ్చిన రెండు మూడు నెలలకే చిరిగిపోయాయి. కొన్ని బ్యాగులకై తే ఎక్కడికక్కడ జిప్లు వదిలేశాయి. వాటికి పిన్నీసులు పెట్టుకుని విద్యార్థులు వెళ్తున్న పరిస్థితి. కొన్నింటికై తే తాళ్లు తెగిపోయాయి. దీంతో, ఆ బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకుని పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కాస్త స్తోమత ఉన్న వారైతే తమ పిల్లలకు సొంత డబ్బులతో మార్కెట్లో వేరే బ్యాగులు కొంటున్నారు. ప్రతి 100 బ్యాగుల్లో 25 చిరిగిపోవడంతో వాటిని మూలన పడేసి, కొత్తవి కొనుక్కున్నామని చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా రాజకీయ సభల్లా నిర్వహించిన మెగా పేరెంట్స్ – టీచర్స్ కమిటీ సమావేశాల్లో సైతం పలువురు తల్లిదండ్రులు స్కూల్ బ్యాగ్లు చిరిగిపోయాయంటూ అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో నాణ్యమైన కానుక గత జగన్ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే విద్యార్థులందరికీ జగనన్న విద్యా కానుక పేరిట నాణ్యమైన బ్యాగ్లు, షూ, మూడు జతల యూనిఫామ్ రెండు జతల సాక్స్లు, బెల్ట్ అందజేశారు. అలాగే, ఆరు నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు, ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు పిక్టోరియల్ డిక్షనరీలు అందజేశారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 1.59 లక్షల మందికి పైగా విద్యార్థులకు సుమారు రూ.30 కోట్ల వ్యయంతో విద్యా కానుక అందించారు. జగన్ ఇచ్చిన బ్యాగే వాడుతున్నాడు మా మనవడు ప్రవీణ్ కుమార్ తాళ్లూరు హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన స్కూల్ బ్యాగ్ జిప్లు ఊడిపోయాయి. అక్కడక్కడ బ్యాగ్ చిరిగిపోయింది. దీంతో, దానిని పక్కన పెట్టేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వంలో ఇచ్చిన స్కూల్ బ్యాగ్ ఇప్పటికీ బాగుంది. ఆ బ్యాగ్లోనే మా మనమడు పుస్తకాలు పెట్టుకుని స్కూల్కు వెళ్తున్నాడు. – బూరా అబ్బులు, తాళ్లూరు, గండేపల్లి మండలం 6 నెలలు గడవకుండానే.. ఆరు నెలలు కూడా గడవకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి. ఎస్ఎఫ్ఐ సభ్యులు స్కూళ్లకు పరిశీలనకు వెళ్లినప్పుడు విద్యార్థులు వద్ద చిరిగిన బ్యాగులు చూశాం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈ రోజుకు కూడా బ్యాగులు ఇవ్వలేదు. టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్లో కూడా తల్లిదండ్రులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకూడదంటూ సర్కులర్ జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇంకోవైపు పాఠశాలల్లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ సమావేశాలకు పార్టీ కార్యకర్తలను పంపించి రాజకీయ ప్రసంగాలు ఇప్పించింది. విద్యార్థి సంఘాల కార్యకలాపాలు, జెండాలు వద్దని చెబుతూనే వారి పార్టీ కార్యకర్తలతో ఈ సమావేశాలు నిర్వహించారు. – సీహెచ్ లోవరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ విద్యార్థులకు నాసిరకం స్కూల్ బ్యాగుల పంపిణీ జిప్పులు ఊడిపోయి, చిరిగిపోయిన వైనం ఆర్భాటం గొప్ప.. నాణ్యత దిబ్బ అంటూ విమర్శలు -
బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 28న రావులపాలెం సమీపంలోని ఈతకోట గ్రామంలో నిర్వహించే బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడలో బీసీ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు నివాసంలో శుక్రవారం బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రిజర్వేషన్లను పెంచి ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించాలన్నారు. సమగ్ర కులగణన చేయాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పునః సమీక్షించాలన్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రి గోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాకిరెడ్డి భాస్కర్ గణేష్బాబు మాట్లాడుతూ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. సమావేశంలో యనమదల రవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, మట్టపర్తి సూర్యచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు, రాయుడు సుధాకరరావు, పంపన రామకృష్ణ, బీసీ చైతన్య వేదిక నాయకులు పెంకే రాజు, పెంకే శివ, పెంకే వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
అన్నింటా మహిళల ముందంజ
కాకినాడ రూరల్: అన్ని రంగాల్లో మహిళలు ముందంజ వేస్తున్నారని, ముఖ్యంగా పాఠశాలల నుంచి కళాశాలల వరకూ బాలికలు, యువతుల విద్యాభ్యాసం పెరిగిందని నన్నయ యూనివర్సిటీ వీసీ, ప్రొఫెసర్ ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని నన్నయ ఎంఎస్ఎన్ పీజీ సెంటర్లో శుక్రవారం అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. పీజీ సెంటర్ ఇంగ్లిష్ డిపార్ట్మెంట్ ఆధ్యర్యంలో జరిగిన సదస్సును వీసీ ప్రారంభించారు. 55 శాతం మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని వీసీ అన్నారు. సదస్సుకు వచ్చిన వివిధ కళాశాలల విద్యార్థులకు శ్రీలంకకు చెందిన డాక్టర్ జేఎస్ రోహన్, అల్గిరీయాకు చెందిన డాక్టర్ నావెల్ ఆన్లైన్ ద్వారా భౌగోళిక మార్పులు, సమకాలీన సామాజిక దృక్కోణాలు, ప్రదర్శనలపై వివరించారు. ఎథియోపియా నుంచి హాజరైన ప్రొఫెసర్లు టెస్సెమా గేబ్రే కీమిసో, టెస్ఫాహున్ టెగెర్న్ సోర్సా తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. ప్రొఫెసర్లు రమేష్, జ్యోతి పలు సూచనలు అందించారు. మాణిక్రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యరెడ్డి, లయన్ గరికపాటి నమశ్శివాయలు వీసీ ప్రశాంతిశ్రీని సన్మానించి, మహాత్మా గాంధీ సేవారత్న పురస్కారాన్ని అందజేశారు. అనంతరం సావనీర్ను ఆవిష్కరించారు. ఆంగ్ల విభాగాధిపతి ఎం.పోచయ్య, రాధామాధవి, డాక్టర్ శ్రీదేవి, మనోజ్దేవా తదితరులు పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం
● 52 వేల ఎకరాల్లో ‘మోంథా’ పంట నష్టం ● పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ● నెలలు గడుస్తున్నా అందని సాయం ● రబీ పెట్టుబడికి రైతుల ఎదురుచూపులుపిఠాపురం: కాలువల ఆధునీకరణ పేరుతో కూటమి నేతల దోపిడీ తప్ప అసలు పని సక్రమంగా జరగలేదు. ఫలితంగా పంటలకు పూర్తి స్థాయిలో నీరు అందలేదు. ఈ ఇబ్బందుల నడుమ అప్పులు చేసి.. పెట్టుబడులు పెట్టి.. సాగు ఆరంభిస్తే.. ఎరువుల కొరత వెంటాడింది. యూరియా కోసం అన్నదాతలు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాగోలా గట్టెక్కుతున్నామనుకుంటున్న తరుణంలో అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను నిండా ముంచేయడంతో జిల్లావ్యాప్తంగా వేలాదిగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరిహారం ఇచ్చి ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రోజులు, నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదు. దీంతో, రబీ సాగుకు పెట్టుబడులు లేక మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. పడిపోయిన దిగుబడులు జిల్లాలో ఇప్పటికే 70 శాతం వరకూ ఖరీఫ్ వరి కోతలు పూర్తయ్యాయి. ఎకరా వరి సాగుకు రైతులు రూ.30 వేల వరకూ పెట్టుబడులు పెట్టారు. 35 బస్తాల వరకూ ధాన్యం దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. కానీ, మోంథా తుపాను ప్రభావంతో కోతల అనంతరం 15 నుంచి 20 బస్తాల దిగుబడి మాత్రమే వస్తోంది. వేలాది మంది రైతులు ఎకరాకు 5 నుంచి 10 బస్తాల వరకూ నష్టపోయి, అయోమయానికి గురవుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతుల నుంచి ప్రభుత్వం కనీసం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్రైవేటు వ్యాపారులకే తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. పరిహారం కోసం పడిగాపులు గత అక్టోబర్ ఆఖరు వారంలో వచ్చిన మోంథా తుపాను కాకినాడ తీరంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ తొలుత అంచనా వేసింది. కానీ, అది అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద తీరం దాటింది. అయితే, దీని ప్రభావంతో వీచిన పెనుగాలులు, కురిసిన వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంటలు నీట మునిగాయి. తుపాను వల్ల దెబ్బ తిన్న వరికి ఎకరాకు రూ.10 వేలు, మిగిలిన పంటలకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అన్ని పంటలూ కలిపి జిల్లావ్యాప్తంగా రైతులు రూ.150 కోట్ల పైనే నష్టపోగా ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగా తేల్చింది. తుపాను అనంతరం 10 రోజుల్లో వ్యవసాయ అధికారులు నష్టం అంచనాలను ప్రభుత్వానికి నివేదించారు. కానీ, అయితే నేటి వరకూ నయాపైసా కూడా పరిహారం అందించలేదు. ఖరీఫ్ నష్టాలను రబీలోనైనా కొంత భర్తీ చేసుకుందామని పలువురు ఆశ పడుతున్నారు. ఇచ్చే అరకొర పరిహారమైనా ప్రభుత్వం త్వరితగతిన ఇస్తే సాగు పెట్టుబడికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపరిహారం విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. పరిహారం అందక ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులను అధిగమించి పంటలు సాగు చేశాం. వారం రోజుల్లో పంట చేతికందుతుందనుకునే లోపు మోంథా తుపాను పూర్తిగా తుడిచిపెట్టేసింది. తీవ్ర నష్టాల పాలయ్యాం. రబీ పంటకు పెట్టుబడులు లేక, పంట నష్ట పరిహారం వస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. నెలలు గడుస్తున్నా పరిహారం ఇవ్వడం లేదు. మళ్లీ అప్పులు చేసి పంటలు సాగు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే పరిహారం అందించాలి. – సకినాల అబ్బాయి,రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం దారుణం మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో వరితో పాటు బొప్పాయి, అరటి, పూలతోటలు, కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిది. ప్రభుత్వం పంట నష్టం నమోదు చేయించింది కానీ, పరిహారం ఇవ్వకపోవడం దారుణం. రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుకు వెంటనే పంట నష్టపరిహారం ఇచ్చి, ఆదుకోవాలి. అన్ని పంటలకూ బీమా సౌకర్యం కల్పించాలి. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం జిల్లాలో ఖరీఫ్ పంట నష్టాలు ఇలా.. వరి సాగు విస్తీర్ణం 2.23 లక్షల ఎకరాలు నష్టం 49,473 ఎకరాలు ఇతర పంటల విస్తీర్ణం సుమారు 70 వేల ఎకరాలు నష్టం 52 వేల ఎకరాలు నష్టపోయిన రైతులు 46,929 రావాల్సిన పరిహారం రూ.52 కోట్లు -
భారీగా గంజాయి పట్టివేత
● 24,690 కిలోల సరకు స్వాధీనం ● విలువ రూ.13,29,500 ● ఏడుగురి అరెస్టు కిర్లంపూడి: కాకినాడ జిల్లా కిర్లంపూడి పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు ఈ వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 16వ నంబర్ జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో బూరుగుపూడి గ్రామ శివారున మాటు వేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి కాకినాడ జిల్లా పెద్దాపురం వైపు మూడు మోటార్ సైకిళ్లపై వెళ్తున్న ఏడుగురు అనుమానితులను తనిఖీ చేశారు. వారి నుంచి 17 ప్యాకెట్లలో ఉంచి తరలిస్తున్న రూ.13,29,500 విలువ చేసే 24,690 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అల్లూరి జిల్లా హకుంపేటకు చెందిన జోగ్ నకుల్సింగ్, పంజా దుర్గాప్రసాద్, పెద్దాపురానికి చెందిన పంచదార స్వామి, వనపర్తి రాజేష్, సప్పా అశోక్, లంక శ్రీకల్యాణ్, గొంపు అప్పారావులుగా గుర్తించారు. గంజాయి తరలింపులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నకుల్సింగ్ను ఏ1గా, జంపా దుర్గాప్రసాద్ ఏ2, పంచదార స్వామి ఏ3, వనపర్తి రాజేష్ ఏ4గా పేర్కొన్నారు. గతంతో వీరిపై ఎన్డీపీఎస్ కేసులు ఉన్నాయి. ఏ5 సప్పా అశోక్పై హత్య కేసు ఉంది. నిందితులపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. వారి నుంచి మూడు మోటార్ సైకిళ్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టించిన ఈగల్ టీమ్ను, ఎస్సైని, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. విలేకర్ల సమావేశంలో సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై సతీష్ కూడా పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● మోటారు సైకిల్ను ఢీకొన్న కారు ● మరొకరికి తీవ్రగాయాలు జగ్గంపేట: జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్ఎల్ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. నర్సీపట్నం గ్రామానికి చెందిన వేమూరి మురళీకృష్ణ (60), తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్ సమీపంలో ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి (35)కి, మురళికృష్ణకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరం లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఈ–కామర్స్ డెలివరీ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఈ–కామర్స్ డెలీవరీ అసోసియేట్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.గోపీకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ చదివిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు వారు దీనికి అర్హులన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు కాకినాడ ప్రభుత్వ ఐటీఐ లేదా స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ రేవతిని 86399 51441 నంబరులో సంప్రదించాలని సూచించారు. రూ.3.73 లక్షల హుండీ ఆదాయంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రెండు నెలలకు గాను రూ.3,72,809 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఉండవల్లి వీర్రాజు తెలిపారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్రకుమార్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్ 3, ఆడియో మెట్రీషియన్ 4, టీబీ హెల్త్ విజిటర్ 5, ఫార్మసిస్ట్ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్ 3, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్ 2, పబ్లిక్ అండ్ ప్రైవేట్ మిక్స్ కో ఆర్డినేటర్ ఫర్ టీబీ 1, అకౌంటెంట్ 2, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కౌన్సిలర్ 1, ఎల్జీఎస్ 8 పోస్టులను నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్లోడ్, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు. జిల్లా సైనిక సంక్షేమాధికారిగా కృష్ణారావు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా సైనిక సంక్షేమాధికారిగా మజ్జి కృష్ణారావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లాలో పని చేసిన ఆయన సాధారణ బదిలీల్లో భాగంగా కాకినాడ వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నేటి నుంచి ఢిల్లీ విమానం కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎన్కే శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్ తెలిపారు. టెట్కు 45 మంది గైర్హాజరు రాయవరం: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 45 మంది గైర్హాజరయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బుధవారం నుంచి టెట్ ప్రారంభమైంది. ముమ్మిడివరం మండలం చెయ్యేరు పరిధిలోని శ్రీనివాస ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్స్లో 300 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 278 మంది హాజరై, 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే అమలాపురం భట్లపాలెంలోని బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో ఉదయం, మధ్యాహ్నం సెషన్స్లో 205 మంది హాజరు కావాల్సి ఉండగా 182 మంది హాజరై 23 మంది గైర్హాజరయ్యారు. -
కోనసీమపై చలి పంజా..
● కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నమోదు ● గజగజలాడుతున్న జిల్లా ప్రజలు ● ఉదయం 8 దాటినా వీడని మంచు తెరలు ఐ.పోలవరం: చలి పులి పంజాకు కోనసీమ ప్రజలు గజగజలాడుతున్నారు. జిల్లాలో గురువారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున మూడు డిగ్రీల చొప్పున పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 గంటలకే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. మరోవైపు ఈ వాతావరణం శీతల రోగాలకు, వ్యాధులకు కారణమవుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న మంచులో తిరుగుతున్న వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధ్యమైనంత వరకూ మంచులో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పొద్దు పొడవక ముందే పనులకు వెళ్లాల్సిన వారు ముందున్న దారి కనపడక తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ వాతావరణం వల్ల ఖరీఫ్ కోతలు, రబీ సాగు నారుమడులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 9 గంటలైతే తప్ప వరి చేలల్లో పనులకు కూలీలు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితి రైతులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది. ఉదయం పూట దట్టంగా కమ్ముకుంటున్న మంచులో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాకింగ్ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉదయం నడిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారు జామున వాకింగ్ మంచిదే అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా మంచులో తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి వాతావరణంతో గుండె సమస్యలు పెరుగుతాయని, గుండైపె ఒత్తిడి పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. పలువురికి ఆస్తమా లేదా బ్రాంకైటిస్ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచులో నడకకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాలని, వీలైతే, సూర్యరశ్మి భూమికి తాకే సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మంచులోనే మార్నింగ్ వాక్ -
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గం
అమలాపురం టౌన్: ఏపీ ఎన్జీవో సంఘం కోనసీమ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు స్థానిక ఏవీఆర్ నగర్లోని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ భవనంలో గురువారం ఏకగ్రీవంగా జరిగాయి. కార్యవర్గంలోని 17 పోస్టులకు సంబంధించి ఒక్కో పోస్టుకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా బి.సత్యనారాయణరెడ్డి వ్యవహరించారు. సంఘం నూతన అధ్యక్షుడిగా ఎం.వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్.రామారావు, కార్యదర్శిగా కోలా పీవీఎన్బీ కృష్ణ, ఉపాధ్యక్షులుగా జె.మల్లికార్జునుడు, సీహెచ్ చిట్టిబాబు, సీహెచ్ సూర్యారావు, టి.ఏసుబాబు, ఆర్వీ నరసింహరాజు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కె.లోవలక్ష్మి, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎం.శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శులుగా ఎంవీ సీతారామరాజు, బి.రామకృష్ణ, జి.వెంకటేశ్వరరావు, ఎస్వీ రామారావు, డి.పృథ్వీరాజ్, మహిళా సంయుక్త కార్యదర్శిగా ఎస్. కృష్ణవేణి, కోశాధికారిగా జి.సురేష్సింగ్ ఎన్నికయ్యారు. ఎన్నికలకు అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా పి.రమేష్, అబ్జర్వర్గా టి.జానకి వ్యవహరించారు. కార్యవర్గాన్ని ఉమ్మడి జిల్లా సంఘం పూర్వ అధ్యక్షులు, ఉమ్మడి జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. -
వైఫల్యాలను మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవ రం రూరల్): వైఫల్యాలను సై తం మహాత్ములు అవకాశాలుగా మలచుకుంటారని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశ ర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాస భారత ప్రవ చనాన్ని గురువారం ఆయన కొ నసాగించారు. ‘శిథిలమై, గొప్ప కోటలు, ఇతర రక్షణ మార్గాలు లేని ఖాండవప్రస్థాన్ని ఏలుకోమని ధర్మరాజుకు ధృతరాష్ట్రుడు సూచిస్తాడు. అయితే, పాండవు లు ఖాండవప్రస్థాన్ని కృష్ణునితో కలసి వెళ్లి, విశ్వకర్మతో సుందర నగరాన్ని నిర్మించుకున్నారు’ అని చె ప్పారు. హస్తినకు వచ్చిన ద్రౌపదిని చూసి గాంధారి ఆమె తన పుత్రుల పాలిట మృత్యుదేవతగా కనిపిస్తున్నట్లు భావించినదన్నారు. పాండవుల కోసం విశ్వకర్మ నిర్మించిన అద్భుతమైన నగరం ‘ఇంద్రప్రస్థం’గా పే రొందిందని, వాణిజ్యవేత్తలు, వివిధ భాషలకు చెంది న ప్రజలు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నారని చె ప్పారు. ‘అంత్య కాలంలో కూడా నీవే మాకు గతి’ అంటూ కృష్ణుని పాండవులు ప్రార్థించారని, ‘నిన్ను స్మరింపజేసే విపత్తులు ఎన్ని కలిగినా చింత లేదంటూ కృష్ణుని కుంతి ప్రార్థించిందని అన్నారు. ‘విష్ణుని విస్మరించడమే విపత్తు. స్మరించడమే సంపద’ అని వ్యాసుడు చెప్పాడన్నారు. ‘వంద మంది కౌరవులు, ధృతరాష్ట్రు డు తదితర అనేక మంది శత్రువులున్న ధర్మరాజును అజాత శత్రువుగా ఎలా అంటారని కొందరు అడుగు తారు. ధర్మరాజు పట్ల ఎందరో వైరి భావం కలిగి ఉండవచ్చు. కానీ, ఆయనకు ఎవరి పట్లా శత్రు భావం లేదు. అందుకే ఆయన అజాతశత్రువు’ అని వివరించా రు. సోదరుల మధ్య ఏర్పాటు చేసుకున్న నియమానికి భంగం కలగడంతో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తాడని, వాటిని పరిశీలిస్తే, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు, గంగ నుంచి కావేరి వరకూ అఖండ భారతం ఒకటేనని, ఒకే ధర్మం ఉండేదని తెలిపారు. వేదాల్లానే ఆగమాలు కూడా ప్రాచీనమని, మన దేశంలో ఆలయ వ్యవస్థ అనాదిగా ఉన్నదేనని చెప్పారు. ఆర్య, ద్రావిడ తేడాలు కొందరు కుహనా చరిత్రకారుల కల్పితాలేనన్నారు. సుభద్రార్జునుల వివాహం, ఖాండవ వన దహనం, వరుణుడు, అగ్నిదేవుడి నుంచి కృష్ణార్జునులు దివ్యాయుధాలు పొందిన వైనాన్ని సామవేదం వివరించారు. తొలుత భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు స్వాగతవచనాలు పలుకుతూ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహా పురుష సంశ్రయం దుర్లభమంటూ పెద్దలు చెబుతారని, భారత ప్రవచనాలు వినడంలో ఈ మూడూ ఉన్నాయని అన్నారు. -
అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలి
రాజానగరం: సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధనకు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.విజయ భాస్కరరావు అన్నారు. అమరావతిలోని ఏపీ స్పేస్ అకాడమీ (ఏపీఎస్ఏ), ఆదికవి నన్నయ యూనివర్సిటీ, హైదరాబాద్లోని అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్ (ఏఎస్టీసీ) సహకారంతో ‘విశ్వంపై జిజ్ఞాసను పెంపొందించడం – అంతరిక్ష సంస్కృతికి ఉత్ప్రేరకం’ అనే అంశంపై వర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా విజయ భాస్కరరావు మాట్లాడుతూ, రానున్న 25 ఏళ్లలో దేశ వనరులు, సవాళ్లు, భూమిపై రిమోట్ సెన్సింగ్ సామర్థ్యాలను వివరించారు. వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, కొత్త ఆలోచనలను అన్వేషించే వేదికను యువ అభ్యాసకులకు అందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అన్నారు. స్సేస్ అకాడమీ ఉపాధ్యక్షుడు, ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ వి.శేషగిరిరావు మాట్లాడుతూ, స్పేస్ టెక్నాలజీలో విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని చెప్పారు. ఏపీ స్పేస్ అకాడమీ కార్యనిర్వాహక కార్యదర్శి కేవీ రమణ, రిజిస్ట్రార్ కేవీ స్వామి, ప్రిన్సిపాల్ పి.విజయనిర్మల, కో ఆర్డినేటర్ ఎస్.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
కొండలను కొల్లగొట్టి కాసుల పంట
గోపాలపురం: మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంపాదనే ధ్యేయంగా కొందరు దళారులు మండలంలోని పోలవరం కుడి ప్రధాన కాలువ, తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు కొల్లగొట్టి మట్టి అక్రమంగా తవ్వేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, గోపాలపురం, చిట్యాల, చెరుకుమిల్లి, రాజంపాలెం, గంగోలు, యర్రవరం గ్రామాలలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి సుమారు 70 శాతం మట్టిని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకున్నారు. వారికి స్థానిక నాయకుల అండదండలు ఉండడంతో జేసీబీలతో రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. తాడిపూడి, చింతలపూడి కాలువ గట్లు ఇప్పటికే మాయమైపోయాయి. కాలువ తవ్వకాల సమయంలో రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పొందిన రైతులు మిగులు భూములపై కన్నేసి ఆ భూమిలోని మట్టిని విక్రయించి చదును చేసి పంటలు సాగు చేస్తున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వం సేకరించిన భూమిని ఎటువంటి ఆధారాలు లేకుండా మళ్లీ సాగులోకి తెస్తున్నారు. కొవ్వూరుపాడు, గోపాలపురం, గుడ్డిగూడెం గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ కొండలను సైతం అక్రమార్కులు తవ్వేసి ఇళ్లకు, ఎత్తు పల్లాల నేలల చదునుకు మట్టిని విక్రయిస్తున్నారు. కొండలు పిండి చేస్తున్నారు రాత్రీపగలు తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కొండలను పిండి చేస్తున్నారు. మట్టి ట్రాక్టర్ ఇంటి వద్ద వేయాలంటే దూరాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ. 1500కు విక్రయిస్తున్నారు. భవిష్యత్తులో మట్టి దొకడం కష్టంగా ఉంటుంది. కొండలు పిండి చేస్తున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు కానీ, రెవెన్యూ అఽధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలి. – సరంగి మోసియ్య, చిట్యాల ఆగని మట్టి అక్రమ తవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు స్థానిక నాయకుల అండతో రేయింబవళ్లు మట్టి తరలింపు గోపాలపురం మండలంలో విడ్డూరం -
నూతన సత్రం నిర్మాణానికి అడుగులు
● సీతారామ సత్రం కూల్చివేత ప్రారంభం ● అక్కడే తొలి దశలో 105 గదులతో మరో సత్రం నిర్మాణం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శిధిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రం కూల్చివేత పనులు ఎట్టకేలకు ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా ఈ పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సుమారు 38 సంవత్సరాల క్రితం 100 గదులతో సీతారామ సత్రాన్ని నిర్మించారు. దీనిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో నిర్మించడంతో వివాహాలకు కూడా వీలుగా ఉండేది. ఒక్క ముహూర్తంలోనే ఇక్కడ దాదాపు 30, 40 వివాహాలు జరిగేవి. ఇది రెండేళ్ల క్రితమే శిథిలావస్థకు చేరింది. తాత్కాలిక మరమ్మతులు చేసి, భక్తులకు గదులు అద్దెకు ఇచ్చేవారు. అద్దె రూ.200 మాత్రమే కావడంతో పేద, మధ్య తరగతి భక్తులు ఎక్కువగా ఇక్కడ బస చేసేవారు. అయితే, సత్రం పరిస్థితి చూసి ఆందోళనకు గురయ్యేవారు. 2023 నవంబర్లో దేవస్థానం ఇన్చార్జి ఈఓగా బాధ్యతలు చేపట్టిన ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈ సత్రం శిథిలావస్థకు చేరిన విషయం గమనించారు. దీని ఫిట్నెస్పై నివేదిక ఇవ్వాలని ఆర్అండ్బీ అధికారులను అప్పట్లోనే కోరారు. వారు పరిశీలించి, ఈ సత్రం శిథిలావస్థకు చేరినందున కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా సీతారామ సత్రం కూల్చివేసి, ఆ వ్యర్థాలను తొలగించేందుకు టెండర్ పిలిచి ఖరారు చేశారు. అలాగే, ఆ స్థలంలోని సగ భాగంలో ఎ–బ్లాక్ పేరిట 105 గదులతో నూతన సత్రం నిర్మించేందుకు గత ఏడాది మే నెలలో రూ.8.82 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచారు. దీనిని 19.80 శాతం తక్కువగా రూ.7.07 కోట్లకు డీడీ గిరి కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. ఆ తరువాత గత ఏడాది నవంబర్లో రామచంద్ర మోహన్ విజయవాడకు బదిలీ అయ్యారు. సలహాదారు సూచనతో.. ఇదిలా ఉండగా గత ఫిబ్రవరిలో దేవదాయ శాఖ సలహాదారు కొండలరావు సీతారామ సత్రాన్ని పరిశీలించి, మరమ్మతులు చేస్తే సరిపోతుందని సిఫారసు చేశారు. దీంతో, గందరగోళం తలెత్తింది. సలహాదారు సూచనల ప్రకారం సత్రం మరమ్మతులకు సుమారు రూ.2 కోట్లు అవుతుందని అంచనా వేశారు. అయితే, ఆ తరువాత కూడా సత్రం కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై జూన్ 26న ‘సత్యదేవా చూడవయ్యా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పందించారు. సత్రాన్ని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయూ–కాకినాడ ప్రొఫెసర్లను కోరారు. ఆ మేరకు సీతారామ సత్రం గదులు, శ్లాబ్, గోడలను గత ఆగస్టు 13న జేఎన్టీయూకే ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నం పరిశీలించారు. దీనికి మరమ్మతులు చేసినా ఉపయోగం ఉండదని, కూల్చివేయాలని నివేదిక ఇచ్చారు. దాని ఆధారంగా ఈ సత్రాన్ని కూల్చివేసి, కొత్త సత్రం నిర్మాణానికి గతంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థను కోరారు. కార్తిక మాసంలోనే ఈ సత్రాన్ని కూల్చివేయాలని అనుకున్నా.. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో వాయిదా వేశారు. ప్రస్తుతం రద్దీ తక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుని సత్రాన్ని కూల్చివేస్తున్నారు. 18 నెలల్లో పూర్తి చేస్తాం దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సీతారామ సత్రం కూల్చివేత పనులు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా కూల్చివేత పూర్తవుతుంది. అనంతరం మంచి ముహూర్తంలో నూతన సత్రం నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతుంది. అనంతరం, మూడంతస్తుల్లో 105 గదులతో నూతన సత్రం నిర్మిస్తాం. దీనిని 18 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
నమ్మకం.. నిజాయతీలదే విజయం
కపిలేశ్వరపురం: స్థానిక ఎంపీపీగా తాతపూడి ఎంపీటీసీ సభ్యురాలు జిత్తుక వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నిక నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి పర్యవేక్షణలో ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరుకాగా, టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీకి మారిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. కోరంకు సరిపడ 10 మందికి మించి సభ్యులు ఉండడంతో ఎన్నిక నిర్వహించారు. ఎంపీపీ స్థానానికి వెంకటలక్ష్మిని కేదారిలంక ఎంపీటీసీ సభ్యుడు యర్రంశెట్టి నాగేశ్వరరావు ప్రతిపాదించగా నేలటూరు ఎంపీటీసీ సభ్యురాలు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి బలపరిచారు. దీంతో వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా గెలుపొందినట్టు జేసీ నిషాంతి, ఎన్నికల అధికారి వి.విజయలక్ష్మి ధ్రువీకరణ పత్రం అందజేశారు. నూతన ఎంపీపీ వెంకటలక్ష్మికి ఎంపీడీఓ హెచ్.భానోజీరావు, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ జి.రాజేంద్రప్రసాద్, సిబ్బంది, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ పుట్టపూడి అబ్బు, సహచరులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రలోభాలకు లొంగక.. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజం. ప్రజా జీవితంలోకి వచ్చాక వ్యక్తిగత ఇష్టాలు, ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలే మిన్న అంటూ జీవించాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రలోభాలకు లొంగకుండా గెలుపు అవకాశాన్ని ఇచ్చిన పార్టీ బాటలో నడచి, చేయిపట్టి నడిపించిన నాయకుడి నమ్మకాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. మండల పరిషత్ ఎన్నికల్లో అదే జరిగింది. వైఎస్సార్ సీపీకి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నమ్మకానికి 12 మంది ఎంపీటీసీ సభ్యులు కట్టుబడి నిలబడ్డారు. దీంతో టీడీపీ ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి మళ్లిన ఎంపీటీసీ సభ్యులు గైర్హాజరయ్యారు. అంతిమంగా నిజాయతీ మరోసారి ఎంపీపీ స్థానాన్ని దక్కించుకుంది. మండలంలో 19 మంది ఎంపీటీసీ స్థానాలుండగా గత పరిషత్ ఎన్నికల్లో 15 వైఎస్సార్ సీపీ, రెండు టీడీపీ, మరో రెండు జనసేన గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు ప్రలోభాలకు లొంగినప్పటికీ మిగిలిన 12 మంది నిజాయతీగా నిలిచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించారు. ఓటింగ్లో ఎంపీపీ జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రుద్రాక్షుల వీరగౌరీ కుమారి, పెందుర్తి శిరీష, పలివెల మధు, గుణ్ణం భాను ప్రసాద్, అడ్డాల శ్రీనివాస్, మేడిశెట్టి దుర్గారావు, మేడిశెట్టి సత్యవేణి, ఉమ్మిడిశెట్టి వీరవేణి, గొల్లపల్లి సోనియా, యర్రంశెట్టి నాగేశ్వరరావు, సాకా శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం తనతో సహా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులంతా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మండల పరిషత్లో ఉన్న సుమారు 70 లక్షల నిధులను మండలంలోని 19 గ్రామాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే తీర్మానాలు చేశాం. వివిధ దశల్లో ఎమ్మెల్యే వేగుళ్ల ప్రోద్బలంతో అవన్నీ నిలిచిపోయాయి. ఇప్పటికీ తామంతా పరిషత్ నిధులను పార్టీలకు అతీతంగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. – జిత్తుక వెంకటలక్ష్మి, ఎంపీపీ సభ్యులకు కృతజ్ఞతలు: ఎమ్మెల్సీ తోట కపిలేశ్వరపురం ఎంపీపీ ఎన్నికలో నిజాయతీగా నిలబడిన వైఎస్సార్ సీపీకి చెందిన 12 మంది ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. అప్పట్లో రెండున్నరేళ్ల తర్వాత మరో బీసీ మహిళకు అవకాశం ఇవ్వాలని సభ్యులు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు జరగడం, టీడీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం, సభ్యులను ప్రలోభాలకు గురి చేయడం తదితర కారణాలతో వారు కుదుర్చుకున్న ఒప్పందం అమలు ఆలస్యమైందన్నారు. ఒప్పందానికి కట్టుబడి మేడిశెట్టి సత్యవేణి రాజీనామా చేయడం, జిత్తుక వెంకటలక్ష్మి ఎన్నికకు 12 మంది సభ్యులు ఏకతాటిపై నిలవడం వైఎస్సార్ సీపీ పట్ల, తన పట్ల ఎంపీటీసీ సభ్యులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 2024లో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన కొద్ది రోజులు తర్వాత మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని టీడీపీలోకి చేర్చుకోబోమని, ఎవరైనా రాదలిస్తే తమ పదవులకు రాజీనామా చేసి చేరవచ్చని ప్రగల్బాలు పలికారన్నారు. రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధులను టీడీపీలోకి చేర్చుకున్నారని, వారంతా వారి వారి పదవులకు రాజీనామా చేయించి చేర్చుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేని నేత అని ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేగుళ్ల తీరు సైతం అలానే ఉందన్నారు. నియోజకవర్గంలో పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, కౌన్సిలర్లను ఎమ్మెల్యే వేగుళ్ల ప్రలోభాలకు గురి చేస్తూ నిస్సిగ్గుగా టీడీపీలో చేర్చుకున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని, నిజాయతీ, అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్యే వేగుళ్ల తెలుసుకోవాలని ఎమ్మెల్సీ తోట అన్నారు. కపిలేశ్వరపురం ఎంపీపీగా విజయలక్ష్మి ఏకగ్రీవం అండగా నిలచిన 12 మంది వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు ప్రలోభాలకు లొంగని వైనం కృతజ్ఞతలు తెలిపిన తోట త్రిమూర్తులు ఎన్నికను పర్యవేక్షించిన జేసీ నిశాంతి -
వాడపల్లి క్షేత్రంలో టెండర్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రానికి వివిధ సామగ్రి సరఫరా, పాత సామగ్రి తీసుకువెళ్లేందుకు ఏడాది కాలానికి గురువారం వేలం, టెండర్లు నిర్వహించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. గృహ సంకల్పం కింద ఇటుకల పాటను దొడ్డ లక్ష్మణరావు రూ.59,09,999కు దక్కించుకున్నారు. గతంలో ఈ టెండరు ద్వారా రూ.35,66,999 రాగా ఈ సారి రూ. 23,43,000 ఆదాయం పెరిగింది. దేవస్థానం పచ్చి గో గ్రాసం అమ్ముకునే హక్కును అడపా వరప్రసాద్ రూ.10,09,999కు దక్కించుకున్నారు. గత ఏడాది దీనికి రూ.1.25 లక్షల ఆదాయం రాగా ఈసారి రూ.8,84,999 అదనంగా ఆదాయం వచ్చింది. గుమ్మటాలుకు సంబంధించి గత శిస్తు రూ.2,14,999 ఆదాయం రాగా ప్రస్తుతం రూ.75,333 వచ్చింది. ఆ విధంగా ఈసారి రూ 1,39,666 ఆదాయం తగ్గింది. 26 షాపులకు పాట పెట్టగా అందులో ఐదు మాత్రమే వేలానికి వెళ్లాయి. వాటిని రూ.50,709కు పొందారు. గత ఏడాది కంటే ఈసారి రూ.5,300 ఆదాయం పెరిగింది. ఆలయంలో సెక్యూరిటీ సేవలు శ్రీస్కంధ బౌన్సర్లు రూ.వెయ్యికి, శ్రీకృష్ణప్రసాద్ రూ.369కి టెండరు పొందారు. కార్యక్రమంలో గ్రేడ్ – 3 ఈఓ ఎం.సత్యనారాయణ, దేవస్థానం సిబ్బంది తధితరులు పాల్గొన్నారు. -
రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు.. మరోసారి బట్టబయలు
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రిలో టీడీపీ లిక్కర్ రాజకీయాలు మరోసారి బట్టబయలయ్యాయి. రాజమండ్రి ఎమ్మెల్యే, లిక్కర్ సిండికేట్ బాగోతాలను మరో టీడీపీ నేత బర్ల బాబురావు బట్టబయలు చేశారు. గతంలో వరుసగా టీడీపీ నేతలు మద్యం సిండికేట్ల ముడుపుల గురించి మాట్లాడిన ఆడియోలను బాబురావు విడుదల చేశారు. ఎక్సైజ్ సీఐ ముడుపుల దందా ఆడియోను సైతం బర్ల బాబురావు బయటపెట్టారు. తాను విడుదల చేసిన ఆడియోలు ఏఐ క్రియేషన్ కాదని, టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధమంటూ బాబురావు సవాల్ చేశారు. బర్ల బాబురావుతో బహిరంగ చర్చకి వచ్చేందుకు టీడీపీ నేతలు ముఖం చాటేశారు.కాగా, గతంలో కూడా రాజమండ్రిలో టీడీపీ నేత మద్యం అక్రమ దందా ఆడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆడియోలో ఎక్కడెక్కడ బెల్ట్ షాపులు ఉంచాలి.. ఎక్సైజ్ అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి.. ఎవరెవరికి ఎంత కమీషన్ ఇవ్వాలనేది మాట్లాడుతున్నారు. దీంతో, ఈ ఆడియో తీవ్ర కలకలం సృష్టించింది.రాజమండ్రి అర్బన్, రూరల్లో ఉన్న 39 షాపులను సిండికేట్ చేసేందుకు మద్యం షాపు నిర్వాహకుడితో రాజమండ్రి సిటీ టీడీపీ ఇన్చార్జ్ మజ్జి రాంబాబు మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మార్పికంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయించి మందుబాబులను దోచేసే పన్నాగం బయటపడింది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడైన టీడీపీ రాజమహేంద్రవరం నగర అధ్యక్షుడే నగరంలోని సిండికేట్లో ఉన్న లిక్కర్ షాపుల యజమానుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. -
వినాయకుని వెండి ఆభరణాల చోరీ
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలం ఆర్పీపట్నం గ్రామంలోని శ్రీలక్ష్మీ గణపతి ఆలయంలో చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన వెండి ఆభరణాలను దొంగలు దోచుకుపోయారు. బుధవారం ఉదయం అర్చకులు, ఆలయ కమిటీ నాయకులు వచ్చేసరికీ గుడి తలుపులు తెరచి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా ఆలయంలో ఏడు కేజీల వెండి ఆభరణాలు దొంగతనానికి గురైనట్టు గుర్తించారు. వెంటనే పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మౌనిక తన సిబ్బందితో వచ్చి సమాచారం సేకరించారు. వేలి ముద్ర నిపుణులు, డాగ్ స్వ్కాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి గండేపల్లి: జాతీయ రహదారిపై మురారి సమీపంలో పోలవరం కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు బుధవారం గుర్తించారు. గండేపల్లి ఎస్సై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి ఒంటిపై మెరున్ కలర్ నిక్కరు, లేత రంగు చొక్కా ఉన్నాయన్నారు. అతడి వయసు సుమారు 75 ఏళ్లు ఉంటుందని, దాదాపు 5.3 అడుగుల ఎత్తు ఉన్నట్టు తెలిపారు. కుడికాలి పాదానికి మైకా కవర్ కట్టి ఉందని, మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
అంకితభావంతో పనిచేస్తే తప్పక గుర్తింపు
ముమ్మిడివరం: అంకిత భావంతో విధులు నిర్వర్తించే ప్రతి ఉద్యోగికీ గుర్తింపు లభిస్తుందని జిల్లా రవాణాశాఖాధికారి దేవిశెట్టి శ్రీనివాస్, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖాధికారి దుర్గారావు దొర అన్నారు. బదిలీపై వెళ్తున్న డీఈవో షేక్ సలీం బాషాకు బుధవారం ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. డీఈఓ కార్యాలయ ఏడీ నక్కా సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీటీసీ శ్రీనివాస్, డీఎంహెచ్వో దుర్గారావు దొర మాట్లాడుతూ విధి నిర్వహణను ప్రథమ కర్తవ్యంగా భావించే ఉద్యోగులు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తారన్నారు. అలాంటి వారిలో డీఈవో సలీం బాషా ప్రథమస్థానంలో నిలుస్తారన్నారు. డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు, ఉపవిద్యాశాఖాధికారులు పి.రామలక్ష్మణమూర్తి, గుబ్బల సూర్యప్రకాశరావు, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, సమగ్ర శిక్షా ఏఎంవో పి.రాంబాబు తదితరులు డీఈవో బాషా సేవలను కొనియా డారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. జిల్లాలో వివిధ పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం ● జీజీహెచ్లో చికిత్స అందిస్తున్న వైద్యులు ● ప్రిన్సిపాల్ బెదిరింపులే కారణమని పోలీసులకు వాంగ్మూలంకాకినాడ క్రైం: జీజీహెచ్లోని నర్సింగ్ స్కూల్లో చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడి ప్రభుత్వ వసతి గృహంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలివీ.. కాకినాడ అశోక్ నగర్కు చెందిన కర్రి ధర్మతేజ అనే 23 ఏళ్ల విద్యార్థి జీజీహెచ్ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం హాస్టల్లోని తన గదిలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న సహ విద్యార్థులు అతడిని జీజీహెచ్లోని అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడి ఐసీయూ ఏఎంసీయూ–1లో ధర్మతేజకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు విషయం తెలుసుకున్న కాకినాడ వన్ టౌన్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో ధర్మతేజకు వద్దకు వెళ్లి వాంగూల్మం తీసుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ అన్నే విమల తనను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయిస్తున్నారని, చేయకపోతే పరీక్షల మార్కులు తన చేతిలో ఉంటాయి జాగ్రత్త అని బెదిరించారని వాపోయాడు. తన భవిష్యత్తును ఏం చేస్తారోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డానని తెలిపాడు. ఆపరేటర్గా పనిచేయిస్తుండడం వల్ల చదువు దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశాడు. నవంబర్లో కొన్ని కంప్యూటర్ పరికరాలు పోతే తనను ప్రిన్సిపాల్ ప్రశ్నించారని, తాను బాధ్యుడ్ని కాదని చెప్పానన్నాడు. తాను ఎందుకు పనిచేయాలని ప్రిన్సిపాల్ని ప్రశ్నించానని, అందుకు ఆమె ‘నాకే ఎదురు చెబుతావా, నీ పరీక్షల మార్కులు నా చేతిలో ఉంటాయి, నాకు తెలుసు ఏం చేయాలో’ అన్నారని వాపోయాడు. ప్రిన్సిపాల్ చేతిలో తన భవిష్యత్తు ఏమైపోతుందోనన్న ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించినట్లు ధర్మతేజ తెలిపాడు. -
సందడిగా ‘శ్రీ ప్రకాష్ సినర్జీ’ వార్షికోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ 11వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం స్కూల్ ప్రాంగణంలోని సీతా నరసింహక్షేత్ర ఆడిటోరియంలో బ్లిట్జ్–25 పేరుతో వేడుకలు నిర్వహించారు. విలువలే ప్రధానం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ఆకట్టుకుంది. యోగా, జిమ్నాస్టిక్స్, త్వైకాండో, కలరీయపట్టు, కర్రసాము వంటి వాటిని ప్రదర్శించి అందరినీ అలరించారు. ముఖ్యంగా బుర్రకథ కళారూపాలు ఆకట్టుకున్నాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్ కళాశాల విభాగాధిపతి డాక్టర్ వడ్లమూడి రవీంద్ర సారథి మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మరో ముఖ్య అతిథి డాక్టర్ వెల్లంకి సుమలత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నత విలువలను పెంచుతున్న శ్రీ ప్రకాష్ స్కూల్కు మంచి ఆదరణ ఉందన్నారు. పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలు, సంస్కృతి, ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యాబోధన సాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, సినర్జీ ప్రిన్సిపాల్ ఎం.శ్రీదేవి, ప్లస్ వన్, టూ కో ఆర్డినేటర్ కె.విశ్వనాథ్, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి ˘
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలిసి రూరల్ మండలం వాకలపూడి నుంచి అన్నవరం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి భూ సేకరణ పురోగతి, కాకినాడ సెజ్ భూములను రైతుల పేరున బదిలీ చేసే ప్రక్రియపై రెవెన్యూ, కేఎస్ఈజెడ్, నేషనల్ హైవే అధికారులతో ఆయన సమీక్షించారు. కాకినాడ పోర్టును జాతీయ రహదారులకు అనుసంధానం చేసే ప్రక్రియలో భాగంగా వాకలపూడి నుంచి అన్నవరం వరకు నిర్మించిన జాతీయ రహదారికి అవసరమైన భూ సేకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఎస్ఈజెడ్ లిమిటెడ్ కింద కాకినాడ డివిజన్, పెద్దాపురం డివిజన్ పరిధిలో ప్రత్యామ్నాయ భూమి 259.040 ఎకరాలు, రైతులు వదిలేసిన భూమి 930.176 ఎకరాలను 1,545 మంది రైతులకు బదిలీ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, కాకినాడ, పెద్దాపురం ఆర్డీవోలు ఎస్.మల్లిబాబు, కె.శ్రీరమణి పాల్గొన్నారు. టెట్కు 334 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్)–25 పరీక్ష కాకినాడ జిల్లాలో మూడు కేంద్రాలలో బుధవారం నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. పరీక్షకు 365 మంది హాజరుకావలసి ఉండగా 334 మంది హాజరయ్యారని తెలియజేశారు. అన్ని పరీక్ష కేంద్రాలలో పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామన్నారు. పాదగయ హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు పిఠాపురం: రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ హుండీ ఆదాయం రూ.24.73 లక్షలు సమకూరినట్లు ఈఓ కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు. దేవదాయ ధర్మదాయ శాఖ డీఈఓ కనపర్తి నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్, పర్యవేక్షణలో బుధవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 68 రోజులకు హుండీల ద్వారా రూ. 23,32,155, అన్నదానం ద్వారా రూ.1,41,215 మొత్తం రూ.24,73,370 ఆదాయం వచ్చిందని తెలిపారు. ర్యాలిలో వైభవంగా పవిత్రోత్సవాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలోని జగన్మోహినీ కేశవ, గోపాలస్వామి వారి క్షేత్రంలో పవిత్రోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా కొనసాగాయి. ఆలయ ఈఓ భాగవతుల వెంకట రమణ మూర్తి పర్యవేక్షణలో ప్రముఖ ఆగమ శాస్త్ర పండితుడు శ్రీనివాసుల వెంకటాచార్యులు బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు జరిపారు. -
ఫొటోలు కాదు.. రైతులను ఆదుకోండి
● డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మధు ధ్వజం ● పిఠాపురంలో రైతులతో కలసి ధర్నా పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ రైతులతో ఫొటోలు దిగడం కాకుండా వారి సమస్యలు పరిష్కరించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయం వద్ద సీపీఐ, రైతు సంఘం సంయుక్తంగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, సీడ్ బిల్లు ముసాయిదాపై జాతీయ రైతు సంఘాలు వ్యవసాయ కార్మికసంఘాలు, రైతు మార్కెట్ కమిటీలు, వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి వారి సలహాలు సూచనలు పరిగణనలోకి తీసుకున్నాకే పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న పంటలకు అదనంగా బోనస్ కలిపి కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మార్కెట్ ధరలు పడిపోయిన అరటి, బత్తాయి, నిమ్మ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, కౌలు రైతులకు అన్నదాత సుఖీ భవ అమలు చేయాలని కోరారు. మెంథా తుపాను, అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక పర్యాయం వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని, ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ ఎక్స్గ్రేషియా చెల్లించాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నియోజకవర్గ కార్యదర్శి సాకా రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ ఏడీఏ పి.స్వాతికి వినతి పత్రం అందజేశారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుష్ట పన్నాగం
● ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ విజయవంతం ● ప్రజల నుంచి అనూహ్య స్పందన ● మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకు చంద్రబాబు నాయుడు దుష్ట పన్నాగం పన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు దుయ్యబట్టారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ముగియడంతో బుధవారం ఆ పత్రాలను కన్నబాబు ఆధ్వర్యంలో రమణయ్యపేట వైద్యనగర్ క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి జిల్లా కార్యాలయంలో అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం పేదలు, ప్రజల కోసం ఆలోచిస్తూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 వైద్య కళాశాల నిర్మించాలని సంకల్పించారన్నారు. అప్పటి వరకు కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే రాష్ట్రంలో ఉన్నాయని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 వైద్య కళాశాలలు తీసుకువచ్చి, అందులో ఐదింటిని పూర్తిచేసి అడ్మిషన్లు ప్రారంభించి, రెండింటిలో అడ్మిషన్లకు సిద్ధం చేశారన్నారు. మిగతా పది కళాశాలలు వివిధ దశల్లో ఉండగా ప్రభుత్వం మారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుపరం చేయాలని దుష్టపన్నాగం పన్నారన్నారు. ఆ సమయంలో జగన్ ప్రజా ఉద్యమం చేపడతామని స్పష్టంగా చెప్పారని, ఆ ప్రకారమే అక్టోబరు 9న నర్సీపట్నం వద్ద నిర్మించిన వైద్య కళాశాల పరిశీలనకు వచ్చారన్నారు. ఆ రోజు శ్రీకారం చుట్టి ఈ రోజుకు దాదాపు 60 రోజులు అయ్యిందన్నారు. పార్టీ నాయకులు, శ్రేణులు కోటి సంతకాల కోసం ప్రజల్లోకి వెళ్లారని, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65 వేల సంతకాలు సేకరించామని, వీటిని జిల్లా కార్యాలయానికి అందిస్తున్నామన్నారు. 15వ తేదీన జిల్లాలో భారీ ర్యాలీని అన్ని నియోజకవర్గ ప్రజలతో నిర్వహించి కేంద్ర పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలను తరలిస్తామన్నారు. 17న తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను గవర్నర్కు సమర్పిస్తామన్నారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదని, సంతకాల సేకరణ అంటే సాధారణంగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టడం కాదని, వారి డేటా కూడా అందులో ఉంటుందన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరచి ప్రజల ఆకాంక్ష మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేయాలన్నారు. సంతకాలు పెట్టిన వారిలో టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిటిస్టు పార్టీల వారితో పాటు అన్ని వర్గాలు ఉన్నాయన్నారు. సంతకాల సేకరణను వైఎస్సార్ సీపీ కార్యక్రమంలా చూసి రాజకీయం చేయకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళితే 2029లో తమ నాయకుడు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని వెనక్కి తీసుకుని ప్రభుత్వమే నిర్వహిస్తుందని కన్నబాబు హెచ్చరించారు. కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గం పార్టీ నాయుకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శనానికి మరో సుపథం
అన్నవరం: సత్యదేవుని రత్నగిరికి వెళ్లేందుకు మొదటి ఘాట్రోడ్ వద్ద టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు రూ.90 లక్షలతో నిర్మించిన రెండో మెట్లదారి పనులు పూర్తయ్యాయి. సుమారు 450 నున్నటి మెట్లతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పూర్వపు ఈఓ, ప్రస్తుత కమిషనర్ రామచంద్రమోహన్ చొరవతో 2010 సంవత్సరంలో ఆలయ ఈఓగా పనిచేసిన ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో టూరిస్ట్ బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడ నుంచి కాలినడకన ఆలయానికి వెళ్లే భక్తులు సుమారు అర కిలోమీటరు దూరంలోని తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి స్వామివారి ఆలయానికి 400 మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చేది. భక్తులకు ప్రయాసతో కూడిన వ్యవహారం. ఈ మేరకు వారికి మార్గం సుగమం అయ్యేలా మెట్ల దారి నిర్మాణానికి ఆయన నడుం కట్టారు. అన్నవరం దేవస్థానం నుంచి ఆయన 2012లో బదిలీ కావడంతో ఆ ప్రతిపాదన మూలన పడింది. 2023లో మళ్లీ ఆలయ ఈఓగా రామచంద్రమోహన్ రావడంతో మెట్ల దారి నిర్మాణానికి టెండర్లు పిలిచి ఖరారు చేసి 2025 ఏప్రిల్లో పనులు ప్రారంభించారు. రెండు మలుపులు, 410 మెట్లు ఈ మెట్ల దారిని రెండు మలుపులతో 410 మెట్లతో నిర్మించారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి ఇది ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల మధ్య రోడ్డులో ముగుస్తుంది. అక్కడి నుంచి సత్యదేవుని ఆలయం 200 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. మెషీన్తో కట్ చేసిన రాళ్లతో.. రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన అధునాతన మెషీన్తో కట్ చేసిన గ్రానైట్, మార్బుల్ రాళ్లను ఈ నిర్మాణానికి వినియోగించారు. మొదటి మెట్ల దారికి ఉపయోగించిన రాళ్లను 50 ఏళ్ల క్రితం శిల్పులు చేతితో చెక్కగా పలకల్లా అమర్చారు. సంతృప్తిగా నిర్మాణం కాగా, గత నవంబర్లో ఆలయానికి వచ్చిన రామచంద్రమోహన్ మెట్ల నిర్మాణాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మార్గం మధ్యలో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ల్యాండింగ్ వద్ద విశ్రాంతి షెడ్లు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని, అలాగే మెట్లకు ఇరువైపులా పిట్టగోడ నిర్మించాలని ఆదేశించారు. ఈ పనులు పూర్తయ్యాక ఈ దారిని ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. రత్నగిరికి రెండో మెట్లదారి సిద్ధం మొదటి ఘాట్ రోడ్ నుంచి ఆలయం వరకు మార్గం సుగమం రూ.90 లక్షల వ్యయంతో 410 మెట్ల నిర్మాణం ఆర్చి, పిట్టగోడలు పూర్తయ్యాక ప్రారంభం ఆర్చి, పిట్టగోడ నిర్మాణానికి టెండర్లు మెట్లదారికి ఇరువైపులా పిట్టగోడ నిర్మాణంతో పాటు ప్రారంభంలో ఆర్చి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నాం. ఆ పనులను వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తున్నాం. – వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం -
కొరతకు కట్టడి
● పశుగ్రాసం కొరతకు పరిష్కారం ● అందుబాటులోకి స్ట్రా బేలర్ యంత్రం ● ఎండుగడ్డిని కట్టలుగా కడుతున్న వైనం ● రైతులకు అదనపు ఆదాయం ఆలమూరు: వ్యవసాయంలో అనేక ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. వీటివల్ల పని సులభం కావడంతో పాటు కొన్ని సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతోంది. ఇలాంటి వాటిలో గడ్డి సేకరణ యంత్రం (స్ట్రా బేలర్) ఒకటి. ఇప్పటి వరకూ పాడి రైతులను వేధించిన పశుగ్రాసం సమస్యకు దీని ద్వారా చెక్ పడింది. వరి పంట కోతకు ప్రస్తుతం మెషీన్లనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన గడ్డిని కట్టలుగా కట్టడానికి స్ట్రా బేలర్ ఉపయోగపడుతుంది. లాభదాయకం యంత్రాలతో పంటను కోసిన వరి పొలాల్లో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని గతంలో రైతులు తగులబెట్టేవారు. దీనివల్ల కాలుష్యం విపరీతంగా పెరగడంతో పాటు భూసారం తగ్గిపోయే పరిస్థితి ఉత్పన్నమయ్యేది. ఈ స్ట్రాబేలర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఎండుగడ్డి కొరత సమస్యకు పరిష్కారం లభించింది. ట్రాక్టర్కు దమ్ము చక్రాలు అమర్చే విధంగానే స్ట్రా బేలర్ యంత్రాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా గడ్డి సేకరణ జరపడంతో ఇటు పాడి రైతులకు, అటు కొనుగోలు దారులకు లాభదాయకంగా మారింది. ఉమ్మడి జిల్లాలో.. ఇటీవల పొలాల్లో వ్యర్థంగా పడి ఉన్న ఎండుగడ్డిని స్ట్రా బేలర్ సాయంతో మోపులుగా కట్టి తీసుకువెళుతున్నారు. దీనివల్ల పాడి రైతులకు, గో సంరంక్షణ కేంద్రాలకు, డెయిరీ ఫాంలకు, పేపర్ మిల్లులకు ఎండుగడ్డి సేకరణ మార్గం సుగమమైంది. అలాగే ట్రాక్టర్ యజమానులు ఈ యంత్రాలను కొనుగోలు చేసి మరింత ఆదాయాన్ని పొందుతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 250 వరకూ స్ట్రా బేలర్ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాడి ఉమ్మడి జిల్లాలో సాగు చేసిన 4.69 లక్షల ఎకరాల్లో సుమారు 80 శాతం మేర వరి కోత యంత్రాలతో కోసిన గడ్డిని స్ట్రా బేలర్ యంత్రాలతోనే ఒబ్బిడి చేసుకున్నారు. అదనపు ఆదాయం స్ట్రా బేలర్ యంత్రంతో సేకరించే పొలంలో ఎకరాకు దాదాపు 1.5 టన్నుల గడ్డి లభిస్తుంది. ఒక్కో గడ్డి మోపు సుమారు 20 కేజీలు ఉంటుంది. ఇలా ఎకరాకు దాదాపు 75 వరకూ గడ్డి మోపులు లభిస్తున్నాయి. ఒక్కొక్క గడ్డిమోపునకు రూ.35 చొప్పున పలకడంతో ఎకరాకు రూ.2,625 ఆదాయం లభిస్తుంది. గతంలో నిరుపయోగంగా మారిన ఎండుగడ్డిని ఈ స్ట్రా బేలర్ యంత్రంతో ఒబ్బిడి చేసుకుని రైతులు అదనపు ఆదాయం పొందుతున్నారు. గతంలో రైతులు ఎండుగడ్డి కోసం కూలీలలో వరి పంటను కోయించేవారు. ప్రయోజనాలివే.. ● పొలాల్లో నిరుపయోగంగా ఉన్న గడ్డిని తగులబెట్టకుండా ఉంచుతున్నారు. దీనివల్ల భూసారం బాగుంటుంది. భూమిలో పోషక విలువలు పెరిగేందుకు, అధిక దిగుబడికి దోహద పడుతుంది. ● వరికోత యంత్రంతో పంటను కోయించిన రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. ● ఎండుగడ్డి సేకరణ సులభతరం కావడంతో కూలీల కొరతను అధిగమించవచ్చు. గడ్డివాములను సులువుగా వేసుకునేందుకు అవకాశం కలుగుతుంది. ● అగ్ని ప్రమాదాల నివారణకు, కాలుష్య నియంత్రణకు దోహదపడుతుంది. పశుగ్రాసం కొరత అధిగమించడంతో పాటు వాయు కాలుష్యాన్ని నివారించొచ్చు. రైతునేస్తాలు ఎండుగడ్డి సేకరణకు అందుబాటులోకి వచ్చిన స్ట్రా బేలర్ యంత్రాలు రైతు నేస్తాలుగా మారాయి. దీనివల్ల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మాదిరిగా పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టే విధానాన్ని వదిలేశారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని నివారించడంతో పాటు పశుగ్రాసం కొరత రాకుండా చేసే అవకాశం ఏర్పడింది. ట్రాక్టర్ ఉపకరణ పనిముట్లు మాదిరిగానే ఈ స్ట్రాబేలర్ యంత్రం కూడా మార్కెట్లో లభ్యమవుతోంది. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయశాఖ ఏడీ, ఆలమూరు -
సరదాగా చోరీ.. ప్రవృత్తిగా మారి..
● బైక్లను చోరీ చేస్తున్న యువకుడు ● అరెస్టు చేసిన పోలీసులు ● రూ.17.40 లక్షల విలువైన మోటారు సైకిళ్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సరదాగా తిరిగేందుకు బైక్ను దొంగతనం చేసిన ఆ యువకుడు.. ఆ తర్వాత బైకుల చోరీయే తన ప్రవృత్తిగా మార్చుకున్నాడు. చివరకు రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కపెడుతున్నాడు. రాజమహేంద్రవరం త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్, త్రీటౌన్ సీఐ వి.అప్పారావు ఈ వివరాలు వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేటకు చెందిన సబ్బు వీరబాబు చిన్నతనంలో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాడు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఓ హోటల్లో నైట్బాయ్గా పనిచేసేవాడు. పగటి సమయాల్లో వెల్డింగ్ పనులు చేసేవాడు. అతడికి బైక్ లేకపోవడంతో ఏదో విధంగా బైక్ సంపాదించాలని పథకం వేశాడు. పుష్కర్ ఘాట్ వద్ద పార్కింగ్ చేసిన బైక్పై అతడి కన్ను పడింది. తన వద్ద ఉన్న పాత తాళంతో ప్రయత్నించగా లాక్ వచ్చేయడంతో అది తీసుకుని ఉడాయించాడు. అనంతరం నగరంలో పలు ప్రాంతాల్లో మోటార్ బైకులను చోరీ చేశాడు. వాటిని తనకు పరిచయమున్న భీమవరానికి చెందిన కోసూరి పవన్ కుమార్, గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన జార్గాని అప్పన్నలకు తక్కువ ధరకు విక్రయించేవాడు. అలా వచ్చిన సొమ్ములతో జల్సాలు చేసేవాడు. ప్రత్యేక నిఘా నగరంలో బైక్ చోరీలు ఎక్కువ కావడంతో ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీనిలో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో అనుమానాస్పదంగా పట్టుబడిన సబ్బు వీరబాబును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాల చిట్టా బయట పెట్టాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి, అతడు పుష్కర్ ఘాట్, కోటగుమ్మం, మల్లయ్యపేట, సుబ్రహ్యణ్య మైదానం, లాలాచెరువు రోడ్డు, ఇస్కాన్ గుడి, ఆత్రేయపురం మండలం వాడపల్లి వరిసర ప్రాంతాలలో చోరీ చేసిన 29 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.17.40 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. నిందుతుడి నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వారిపైనా కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వి.అప్పారావు ఎస్సై ఎండీ జుబేరు, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్కుమార్, కె.పవన్ కుమార్, ఆర్.సుబ్రహ్మణ్యంలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
విద్య, ఉద్యోగాల్లో క్రీడాకారులకు ప్రాధాన్యం
● వాలీబాల్ ఫెడరేషన్ ఆలిండియా ఉపాఽధ్యక్షుడు గణవెంకటరెడ్డి ● జేఎన్టీయూకేలో టోర్నమెంట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): క్రీడాకారులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని వాలీబాల్ ఫెడరేషన్ ఆలిండియా ఉపాఽధ్యక్షుడు, వైజాగ్ వెస్ట్ ఎమ్మెల్యే పి.గణవెంకటరెడ్డి నాయుడు అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సహకారంలో జేఎన్టీయూకేలో ఐదు రోజుల పాటు నిర్వహించే సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ వాలీబాల్ టోర్న్మెంట్ను బుధవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. క్రీడాకారులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, తద్వారా చదువుతో పాటు క్రీడల్లో రాణించగలరన్నారు. మాజీ అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, అర్జున్ అవార్డు గ్రహీత పి.వెంకట రమణ మాట్లాడుతూ క్రీడలలో చివరి వరకూ పోరాటం చేసేవారు విజయం సాధిస్తారన్నారు. గెలుపే లక్ష్యంగా పోరాడాలి కలెక్టర్ షన్మోహన్ మాట్లాడుతూ వాలీబాల్లో సౌత్ ఇండియా రాష్ట్రాలకు కాకినాడ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి టీమ్ గెలుపే లక్ష్యంగా పోటీపడి ఆడాలన్నారు. జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలను జేఎన్టీయూకేకు అప్పగించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి జట్టుకు పూర్తి సహాయ సహకారాలు అందజేసి ఐదు రోజుల పాటు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తామన్నారు. జేఎటీయూకేతో పాటు అచ్చంపేట రాజీవ్ గాంధీ కళాశాల, సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో పోటీలు కొనసాగుతాయన్నారు. ఫైనల్ పోటీలను జేఎన్టీయూకే మైదానంలో నిర్వహిస్తామన్నారు. తొలి రోజు 40 మ్యాచ్లు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, అబ్జర్వర్ త్రిమూర్తులు, రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, స్పోర్ట్స్ కౌన్సెల్ కార్యదర్శి బి.శ్యామ్ కుమార్, ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ జీపీ రాజు పాల్గొన్నారు. -
అన్నవరం దేవస్థానం ఈఓగా త్రినాథరావు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఫుల్ అడిషనల్ చార్జి)గా వి.త్రినాథరావు బుధవారం సాయంత్రం 4.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. తొలుత రత్నగిరిపై సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. అనంతరం దర్బారు మండపంలో పండితుల మంత్రోచ్ఛారణ మధ్య ప్రస్తుత ఈఓ వీర్ల సుబ్బారావు నుంచి బాధ్యతలు స్వీకరించారు. దేవదాయశాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ)గా పనిచేస్తున్న వి.త్రినాథరావును ఈఓగా నియమిస్తూ మంగళవారం ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. దేవస్థానం అభివృద్ధికి కృషి అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఈఓ త్రినాథరావు అన్నారు. సత్యదేవుని ఆశీసులతో ఈ పదవి చేపట్టడం ఇది నాలుగోశారని, ఆ అనుభవంతో దేవస్థానంలో భక్తులకు అవసరమైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాగా.. డిప్యూటీ కలెక్టర్ హోదాలో సుమారు ఏడాది పాటు డిప్యూటేషన్పై అన్నవరం దేవస్థానం ఈఓగా పనిచేసి, తిరిగి రెవెన్యూ విభాగానికి వెళుతున్న వీర్ల సుబ్బారావును దేవస్థానం సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయనకు శాలువా కప్పి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను నూతన ఈఓ త్రినాథరావు అందజేశారు. -
ప్రైవేటీకరణపై ప్రజాగ్రహం
కాకినాడ సిటీ కార్యాలయం నుంచి వెళ్తున్న ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావుకిర్లంపూడిలో పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, శివకుమారి తదితరులు వైద్య కళాశాలల అంశంపై ప్రజల్లో పెల్లుబికిన అసంతృప్తి వర్గాలకు అతీతంగా సంతకాలు నియోజకవర్గాల నుంచి వైఎస్సార్ సీపీ జిల్లా కేంద్ర కార్యాలయానికి ప్రతులు జాతరలా తరలి వచ్చిన పార్టీ నాయకులు, శ్రేణులు ‘బాబు’ ప్రైవేటు జపంపై నీళ్లు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ రంగంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించే చంద్రబాబు సర్కార్ కుట్రలపై ప్రజాగ్రహం పెల్లుబికింది. వారి ఆగ్రహాన్ని సంతకాల రూపంలో బాక్సుల్లో భద్రపరచారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో కాకినాడ జిల్లాలో పార్టీ శ్రేణులన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సుమారు 40 రోజుల పాటు జరిపిన అవిశ్రాంత కృషి బుధవారం నాటికి ఫలించింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో విభిన్న వర్గాల ప్రజలు నాలుగు లక్షల పై చిలుకు సంతకాలతో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాన్ని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో నూరుశాతం పూర్తి చేశారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో సేకరించిన సంతకాల ప్రతులను కట్టలుగా కట్టి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ప్రత్యేక వాహనాల్లో పార్టీ కో ఆర్డినేటర్లు దగ్గరుండి కాకినాడ పైడావారి వీధిలో పార్టీ జిల్లా కార్యాలయానికి బుధవారం పంపించారు. ఈ ప్రక్రియను నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఒక పండుగ వాతావరణంలో పూర్తి చేయడం పార్టీకి మంచి ఊపునిచ్చింది. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రజల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను బాక్సుల్లో భద్రంగా ఉంచి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యాన గవర్నర్కు అందచేసేందుకు సిద్ధం చేశారు. జిల్లాలో సుమారు నాలుగు లక్షల సంతకాలతో కూడిన పత్రాలను ఏడు నియోజకవర్గాల నుంచి కాకినాడ పార్టీ కార్యాలయంలో భద్రపరిచారు. ఐదారు వారాలుగా ప్రజల మద్దతుతో సేకరించిన సంతకాల ప్రతుల బాక్సులను దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలతో, కొన్ని నియోజకవర్గాల్లో సెంటిమెంట్కు తగ్గట్టు పూజలుచేసి జిల్లా కేంద్రానికి తరలించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో సెంటిమెంట్గా కోటనందూరు మండలం తాటిపాక నుంచి సంతకాల ప్రతుల తరలింపు ప్రారంభించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో మోటార్ సైకిల్ ర్యాలీ ఉరకలెత్తింది. దాడిశెట్టి రాజా బుల్లెట్పై ముందు వరుసలో ఉండి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తాటిపాక నుంచి తొండంగి మీదుగా కాకినాడకు చేరుకుని సంతకాల ప్రతుల బాక్సులను పార్టీ జిల్లా కార్యాలయానికి అందజేశారు. పార్టీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి, రూరల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్, కరప మండలాలతో పాటు సిటీలోని 8 డివిజన్ల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమీకరించిన సంతకాల ప్రతులను వెంటబెట్టుకుని పెద్ద సంఖ్యలో తరలి వెళ్లే మార్గం పార్టీ జెండాలతో కోలాహలంగా మారింది. జనసందోహంతో జాతరను తలపించింది. కాకినాడ 2వ డివిజన్ పరిధిలోని రమణయ్యపేట వైద్యనగర్లోని రూరల్ పార్టీ కార్యాలయం వద్ద సంతకాలు పత్రాల వాహన ర్యాలీని కన్నబాబు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన బుల్లెట్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. వైద్యనగర్, సర్పవరం జంక్షన్, బోట్క్లబ్, నాగమల్లితోట మీదుగా జిల్లా పార్టీ కార్యాలయానికి సంతకాలు పత్రాలు తరలించారు. ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి తదితరులు వెంట ఉన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నగరంలో కోటి సంతకాల ఉద్యమం విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలిరాగా సంతకాల ప్రతులతో కూడిన బాక్సులతో బయలుదేరిన వాహనాన్ని సిటీ కార్యాలయం వద్ద ద్వారంపూడి, పరిశీలకుడు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి టూటౌన్ బ్రిడ్జి, భానుగుడి సెంటర్ మీదుగా పైడావారి వీధిలో జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ద్వారంపూడి, విప్పర్తి మాట్లాడుతూ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ఎంతో ప్రజాదరణ లభించిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జిల్లా యువత అధ్యక్షులు రాగిరెడ్డి బన్ని, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు అల్లి రాజబాబు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులు కలిగిన బాక్సులతో కూడిన వాహనాన్ని మాజీ మంత్రి, పార్టీ కో ఆర్డినేటర్ తోట నరసింహం జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కాకినాడకు చేరుకుంది. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరామ్, పార్టీ పరిశీలకుడు కొప్పన శివ, పార్టీ నేతలు రామకుర్తి జగాల్, రావుల గణేష్రాజా తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ కోఆర్డినేటర్, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగా గీత ఆధ్వర్యంలో సంతకాల ప్రతులను 50 బాక్సులలో భద్రపరిచారు. ప్రత్యేక వాహనాన్ని గీత జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి కోటగుమ్మం సెంటర్, ఉప్పాడ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి వరకు గీత ముందు వరుసలో ఉండి నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి. అక్కడి నుంచి సంతకాల ప్రతులను పార్టీ కాకినాడ జిల్లా కార్యాలయానికి తరలించారు. గండేపల్లి బాబి, తలిశెట్టి వెంకటేశ్వరరావు, మొగిలి అయ్యారావు తదితరులు పాల్గొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో సంతకాల ప్రతులతో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రకు నియోజకవర్గంలో విశేష స్పందన లభించింది. సంతకాల ప్రతులతో కూడిన వాహనాలకు దొరబాబు సెంటిమెంట్గా భావించే తిరుపతి శృంగార వల్లభ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి కాండ్రకోట వరకు పాదయాత్ర జరిపారు. సంతకాల ప్రతులతో కూడిన వాహనానికి ఆయన జెండా ఊపి ప్రారంభించి కాకినాడకు తరలించారు. కార్యక్రమంలో పరిశీలకులు వాసిరెడ్డి జమీలు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, పెంకే సత్యవతి, జెడ్పీటీసీ గవరసాని సూరిబాబు, జిల్లా పంచాయతీ విభాగం అధ్యక్షుడు మోరంపూడి శ్రీ రంగనాయకులు తదితరులు ఉన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో సేకరించిన సంతకాల ప్రతులను 17 బాక్సులలో సిద్ధం చేశారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని కిర్లంపూడిలో మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం పార్టీ జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి పార్టీ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు వెంట రాగా ర్యాలీగా ప్రత్యేక వాహనాల్లో జిల్లా కార్యాలయంలో అందజేశారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దాపురం, తుని నియోజకవర్గాల పరిశీలకుడు వాసిరెడ్డి జమీల్, పార్టీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకుమారి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి బొదిరెడ్ల గోవిందు, జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, జెట్పీటీసీ గొల్లు చిన దివాణం తదితరులు పాల్గొన్నారు. -
స్క్వాష్ పోటీలకు రాష్ట్ర జట్టు పయనం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ నెల 10 నుంచి 15 వరకు జరిగే జాతీయ స్థాయి ఎస్జీఎఫ్ఐ స్క్వాష్ పోటీలకు రాష్ట్ర జట్టు పయనమైందని ఎస్జీఎఫ్ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి బుధవారం తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే 10 మంది క్రీడాకారులకు ఎస్జీఎఫ్ఐ తరఫున క్రీడా కిట్లను డీఈఓ పి.రమేష్ చేతుల మీదుగా అందజేశామన్నారు. జట్టుకు కోచ్, మేనేజర్గా నాగమణి, మంగతాయారు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీను, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ మాట్లాడుతూ క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలలో రాణించి రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. -
‘కోటి’ గళాల గర్జన
సాక్షి, విశాఖపట్నం, నెట్వర్క్: చంద్రబాబు సర్కారు కక్షపూరిత విధానాలతో ప్రభుత్వం కొత్త మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడం.. ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను బుధవారం నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు, మీడియా సమావేశాలు నిర్వహించి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి ఆయా జిల్లా కేంద్రాలకు తరలించారు. నియోజకవర్గ పార్టీ కార్యాలయాల వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు జెండా ఊపి కోటి సంతకాల వాహనాలను ప్రారంభించారు. పలుచోట్ల మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కోటి సంతకాల వాహనాలకు హారతి పట్టారు. ఇకనైనా చంద్రబాబు సర్కారుకు కనువిప్పు కలగాలని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవుడిని ప్రార్థించారు. యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 10న రచ్చబండగా మొదలై మారుమూల గిరిజన గూడేల నుంచి నగరాల దాకా ఉద్ధృతంగా ఈ కార్యక్రమం సాగింది. కాకినాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళుతున్న యువత, నాయకులు, పార్టీ శ్రేణులు అన్ని మండలాలు, అన్ని పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రెండు నెలలుగా మహోద్యమంలా సాగిన కోటి సంతకాల సేకరణలో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా, భారీగా పాల్గొన్నారు. నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. కోటి సంతకాల మహా ఉద్యమంతో చంద్రబాబు సర్కార్కు ఇకనైనా కనువిప్పు కలగాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబు సర్కార్కు బుద్ధి చెప్పేందుకు ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. సంతకాల పత్రాలతో విశాఖలో భారీ బైక్ ర్యాలీ చేపడుతున్న ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ⇒ ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాలను బుధవారం జిల్లా కేంద్రానికి ర్యాలీగా తరలించారు. దర్శి నుంచి ఒంగోలుకు వాహనాల ర్యాలీని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ జెండా ఊపి ప్రారంభించారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గిద్దలూరులో కేపీ నాగార్జునరెడ్డి, మార్కాపురంలో అన్నా రాంబాబు, కొండపిలో ఆదిమూలపు సురేష్, సంతనూతలపాడులో మేరుగు నాగార్జున, కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ ర్యాలీలను ప్రారంభించారు. ఒంగోలు నియోజకవర్గంలో సేకరించిన 62 వేల సంతకాలను పార్టీ జిల్లా కార్యాలయానికి చేర్చినట్లు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు తెలిపారు. ⇒ పశ్చిమ గోదావరి జిల్లాలో కోటి సంతకాలతో వాహనాల ర్యాలీలను భారీ ఎత్తున నిర్వహించారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేశారు. తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, నరసాపురంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఆచంటలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరంలో నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుడాల శ్రీహరిగోపాలరావు, ఉండిలో నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ర్యాలీలు జరిగాయి. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపేలా చంద్రబాబు బుద్ధి మార్చాలని దేవుడిని కోరుతూ తణుకు నియోజకవర్గం వేల్పూరు, అత్తిలిలో మహిళలు సంతకాల ప్రతులకు మంగళ హారతులిచ్చి సాగనంపారు. ⇒ తిరుపతి, చిత్తూరు జిల్లాలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులను తిరుపతి వైఎస్సార్సీపీ కార్యాలయంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించారు. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతుల ప్రత్యేక వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గంగాధర నెల్లూరులో మాజీ మంత్రి నారాయణస్వామి, నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, చిత్తూరులో విజయానందరెడ్డి, శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వెంకటగిరిలో నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గూడూరులో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, నాయుడుపేటలో కిలివేటి సంజీవయ్య, నాగలాపురంలో నూకతోటి రాజేష్, తవణంపల్లిలో డాక్టర్ సునీల్కుమార్, పలమనేరులో వెంకటేగౌడ్, కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ప్రతులను ప్రత్యేక వాహనంలో తిరుపతికి తరలించారు. ⇒ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నియోజకవర్గ కేంద్రాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల పత్రాల బాక్సులను తరలించారు. పోలీసులు అడ్డుకున్నా వెనకడుగు వేయకుండా ర్యాలీలు నిర్వహించారు. పలాస నియోజకవర్గంలో మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో పత్రాలను తరలించారు. ⇒ విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో సుమారు 10 లక్షల సంతకాలు సేకరించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయానికి అన్ని నియోజకవర్గాల నుంచి వాహనాల్లో కోటి సంతకాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు కేకే రాజు అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, వాసుపల్లి గణేష్కుమార్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్రెడ్డి, మొల్లి అప్పారావు, నియోజకవర్గం పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల సమన్వయకర్తలతో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్ గణేష్, కంబాల జోగులు, అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పాడేరులోని పార్టీ కార్యాలయానికి వ్యానుల్లో సంతకాల పత్రాల బాక్స్లు చేరుకున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు మత్సరాస విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వాటిని సేకరించారు. కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు నూతన ఈఓ
అన్నవరం దేవస్థానం అన్నవరం: దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ) అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి(ఈఓ)గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం.హరి జవహర్లాల్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ వీర్ల సుబ్బారావును తిరిగి ఆయన మాతృ శాఖ రెవెన్యూలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన డిప్యూటేషన్ ఈ నెల 13తో పూర్తి కానుంది. నాలుగు రోజులు ముందుగానే ఆయనకు స్థానచలనం కలిగింది. నూతన ఈఓ త్రినాథరావు బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పోస్టులో ఆయన నియమితులవడం ఇది నాలుగోసారి. 2019లో జనవరి నుంచి మార్చి వరకూ.. ఆ తరువాత అదే సంవత్సరం ఆగస్టు నుంచి 2022 వరకూ, తిరిగి 2024 నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 వరకూ త్రినాథరావు అన్నవరం దేవస్థానం ఈవోగా పని చేశారు. ఫలించని ప్రయత్నాలు కాణిపాకం, శ్రీశైలం దేవస్థానం ఈఓలుగా గత ఏడాది నియమితులైన డిప్యూటీ కలెక్టర్లను మరో ఏడాది కొనసాగిస్తూ ప్రభుత్వం గత నెల 29న ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరో ఏడాది కొనసాగేందుకు ప్రస్తుత ఈఓ సుబ్బారావు కూడా ప్రయత్నాలు చేశారు. అయితే, ఆయనను సిఫారసు చేసేందుకు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ముందుకు రాలేదు. కనీసం నాలుగు నెలలైనా తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వ్యక్తిగతంగా కోరినా ప్రయోజనం లేకపోయిందని అంటున్నారు. ఏడాది కాలంగా దేవస్థానాన్ని ప్రజాప్రతినిధుల చేతిలో పెట్టారన్న విమర్శలు.. పలు వివాదాల నేపథ్యంలో ఆయనను కొనసాగించేందుకు ఉన్నతాధికారులు విముఖత చూపారని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం ఈఓలుగా గతంలో డిప్యూటీ కలెక్టర్లు ఎన్వీ శేషగిరిబాబు, ఎస్.సత్యనారాయణ, ప్రసాదం వెంకటేశ్వర్లు, కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర పని చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. వివాదాస్పద నిర్ణయాలు గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానం ఎన్నో వివాదాలకు కేంద్రంగా మారింది. వీటిపై ‘సాక్షి’లో పలు కథనాలు వచ్చాయి. ఫ దేవస్థానంలో నీటి సమస్య పరిష్కారానికి గాను సత్రాల్లోని ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ ఈఓ కుమారుని వ్యవహార శైలిపై ఏప్రిల్ 16న ‘చినబాబొచ్చారు బహుపరాక్!’ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం దేవదాయ శాఖలో తీవ్ర సంచలనం రేపింది. ఫ తమను ఈఓ వేధిస్తున్నారంటూ పలువురు అధికారులు సెలవు పెట్టడం, కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకోవడం కలకలం రేపింది. ఈ విషయాన్ని ‘నీ కొలువుకు సెలవు స్వామీ’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఫ ఈ అంశాలపై విచారణకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రకుమార్ను కమిషనర్ కె.రామచంద్ర మోహన్ నియమించారు. ఆయన ఏప్రిల్ 23న అన్నవరం వచ్చి, సిబ్బందిని విచారించారు. ఈఓ తమను ఏవిధంగా ఇబ్బంది పెట్టారో సిబ్బంది ఆయన వద్ద ఏకరవు పెట్టారు. ఈ అంశాలను క్రోడీకరిస్తూ చంద్రకుమార్ ఏప్రిల్ 26న కమిషనర్కు నివేదిక సమర్పించారు. ‘సాక్షి’ కథనాలు వాస్తవమేనని నిర్ధారించారు. ఈ నివేదిక ఆధారంగా అప్పట్లోనే సుబ్బారావును బదిలీ చేస్తారని అనుకున్నారు. అయితే, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధుల సిఫారసులతో ఆయన బదిలీ నిలిచిందని అంటారు. ఫ సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచిస్తూ జూలై నెలలో కమిషనర్ ఒక మెమో జారీ చేశారు. ఒక ఈఓకు కమిషనర్ మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం. ఫ పారిశుధ్య సిబ్బందికి ఆరు నెలలుగా ఏ ఒక్కసారీ సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’ కథనాలు ప్రచురించిన అనంతరం స్పందించి, నెలాఖరున చెల్లించారు. దీనిని కూడా పాలనా వైఫల్యంగా ఉన్నతాధికారులు భావించారు. ఫ రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో అన్నవరం గత ఫిబ్రవరిలో చివరి స్థానంలో నిలిచింది. దీంతో, జిల్లా కలెక్టర్ దేవస్థానంలో తనిఖీలు చేసి, పరిస్థితి చక్కదిద్దారు. ఆ తరువాతి నెలలో ఒకటో స్థానం వచ్చినా తిరిగి ఐదు, ఆరు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. గత నెలలో కూడా ఆరో ర్యాంకు రావడంతో కలెక్టర్ మళ్లీ సమీక్షించి, పలు ఆదేశాలిచ్చారు. ఫ సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే ఆవు నెయ్యిని గత ఏడాది ఆగస్టు నుంచి సహకార డెయిరీల ద్వారా కొటేషన్పై కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ ఏడాది జూన్ నుంచి టెండర్ ద్వారా మాత్రమే నెయ్యి కొనుగోలు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ గత నెలాఖరు వరకూ కూడా కొటేషన్ పైనే కొనుగోలు చేయడంతో ఈఓపై దేవదాయ శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్రినాథరావు ఫ ఈ పోస్టులో నాలుగోసారి ఆయన నియామకం ఫ నేడు బాధ్యతల స్వీకరణ ఫ ప్రస్తుత ఈఓ సుబ్బారావు కొనసాగింపునకు నో ఫ 4 రోజుల్లో ముగియనున్న ఆయన డిప్యూటేషన్ ఫ మాతృ శాఖ రెవెన్యూకు రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు -
జాతి మీడియాకు, జాతీయ మీడియాకు ఒకటే పాటా!
కాకినాడ రూరల్: జాతి మీడియాకు జాతీయ మీడియాకు ఒకటే పాట పాడితే అర్నాబ్ గోస్వామి వంటి వ్యక్తి తగులుతాడని టీడీపీ అధికార ప్రతినిధులు ఊహించలేకపోయారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ జర్నలిస్టు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక్కడేదో వార్ రూమ్ ఉన్నట్టు.. మొన్నటి మోంథా తుపానును చంద్రబాబు నాయుడు చేయి అడ్డు పెట్టి ఆపినట్టు.. వుమెన్ క్రికెట్ను లోకేష్ గెలిపించినట్టు ఆయన జాతి మీడియా జాకీలు వేసి లేపిందని.. అదే ట్రిక్ ఇండిగో సంక్షోభంపై ప్లే చేద్దామని చూస్తే తలకిందులైందని ఎద్దేవా చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడుకు యర్రన్నాయుడి తనయుడిగా గౌరవం ఉండేదని, మంత్రిగా 18 నెలల్లో రాష్ట్రానికి ఆయన ఉపయోగపడిందేమీ లేదని, విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టు వద్ద ఫొటోలు, రీల్స్తో బిల్డప్ ఇవ్వడం తప్ప ఆయన మార్క్ ఏమీ లేదని విమర్శించారు. లోకేష్ను చంద్రబాబు ఒక శక్తిగా చూపడానికి, పైకి లేపడానికి బూటక యత్నాలు సాగిస్తున్నారన్నారు. సొంత పత్రికలు, చానల్స్ ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు చూపుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత సాక్షి చానల్ ప్రసారాలను, కొద్దోగొప్పో న్యూట్రల్గా ఉన్న ఎన్టీవీ, టీవీ–9లను ఆపేశారని మండిపడ్డారు. చంద్రబాబును పొగడటమే పనిగా పెట్టుకున్న చానల్స్, లోకేష్ను జాకీ పెట్టుకుని లేపడమే పనిగా పెట్టుకున్న చానల్స్ తప్ప మరో చానల్ ఏదీ రాష్ట్రంలో ఉండకూదడనేది చంద్రబాబు ప్రయత్నమన్నారు. ఆయనంత దుర్మార్గమైన పరిపాలన దేశంలో ఎవరూ చేయరని, ప్రచార యావ తప్ప ఆయనకు ఇంకేమీ లేదని దుయ్యబట్టారు. అర్నాబ్ గోస్వామికి సమాధానం చెప్పలేక జాతీయ మీడియాను బ్యాన్ చేయడమేమిటని కన్నబాబు ప్రశ్నించారు. ఎంత కాలం బ్యాన్ చేస్తారని, సాక్షి మాదిరిగా జాతీయ మీడియాను బ్యాన్ చేస్తే చెల్లుబాటవుతుందని అనుకుంటున్నారా అని నిలదీశా రు. ఇదీ సోషల్ మీడియా యుగమని, ఇప్పుడు ఎవ్వరి వాయిస్ ఆపలేరని, చంద్రబాబును జాకీలు ఎత్తి లేపే కార్యక్రమంలో ఏబీఎన్, ఈనాడు శక్తిమంతంగా పని చేస్తున్నాయని, టీవీ–5 ఒక అడుగు ముందే ఉంటుందని విమర్శించారు. అర్నాబ్ గో స్వామిపై ఎందుకు మాట్లాడటం లేదని, ఇక్కడి మాదిరిగా అక్కడ కూడా రెడ్బుక్ వాడేందుకు దమ్ము సరిపోవడం లేదని ఆక్షేపించారు. ‘ఢిల్లీలో మీ చక్రం తిరుగుతోంది కదా అన్నారు. నిజాయితీగా ఒక వార్త రాస్తే రాష్ట్రంలో బతకనివ్వబోమని కంకణం కట్టుకున్నట్టుగా ఉన్నారని మండిపడ్డారు. లోకేష్ వార్ రూమ్ ఏమిటి, మంత్రి ఎవరు? రామ్మోహన్నాయుడు కదా.. ఆయనెందుకు ప్రజలకు సమాధానం చెప్పడని అర్నాబ్ గోస్వామి నేరుగా అడుగుతున్నారన్నారు. రాజ్యసభ, లోక్సభలో రామ్మోహన్నాయుడు మాట్లాడితే ఎలివేట్ చేస్తున్నారని అన్నారు. పౌర విమానయానం 91 శాతం రెండు సంస్థల చేతిలో ఉండిపోయిందని, రాజమండ్రి నుంచి, విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.10 వేల నుంచి రూ.15 వేలు అవుతోందని, విమానయానంలో మన దేశంలో జరుగుతున్నంత దోపిడీ ఎక్కడా జరగదని కన్నబాబు అన్నారు. విమానం ఎప్పుడు క్యాన్సిల్ అవుతుందో తెలియదన్నారు. దేశంలోని అన్ని శాఖలకూ సకల శాఖ మంత్రిగా లోకేష్ వ్యవహరిస్తున్నారని, రామ్మోహన్నాయుడిని పని చేయనివ్వరా అని ప్రశ్నించా రు. ఇక్కడ వార్ రూమ్తో విమానాలన్నింటినీ నడిపించే శక్తి లోకేష్కు ఉందా అని ప్రశ్నించారు. అర్నా బ్ గోస్వామి చేతిలో వీరు దొరకపోతే లోకేషే అన్నీ నడిపిస్తున్నట్టు ప్రచారం చేస్తారని, ఇంత అరాచకం జరుగుతూంటే ప్రజలు చూస్తారనే భయంతో సాక్షి గొంతు నొక్కేస్తారా అని కన్నబాబు నిలదీశారు. ఫ అర్నాబ్ గోస్వామి లాంటి వారు తగులుతారని ఊహించి ఉండరు ఫ భోగాపురం ఎయిర్పోర్టు రీల్స్తో రామ్మోహన్నాయుడి బిల్డప్ ఫ మాజీ మంత్రి కన్నబాబు విమర్శ -
ఎస్టీయూ నూతన కార్యవర్గం
సత్యనారాయణ రామకృష్ణ రామ్తేజబాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎస్టీయూ జిల్లా 79వ కౌన్సిల్ సమావేశం రామారావుపేటలోని ఎస్టీయూ భవన్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శేశెట్టి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా పోతు రామకృష్ణ, ఆర్థిక కార్యదర్శిగా గుమ్మపు రామ్తేజలు ఎన్నికయ్యారు. వారిని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మోర్త శ్రీనివాస్, కుసుమంచి కాశీ విశ్వనాథ్, పీవీ సత్యనారాయణరాజు, శ్రీను, రాజు, వెంకటేశ్వరరావు అభినందించారు. వెంటనే 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ను నియమించి, ఉద్యోగ, ఉపాధ్యాయులకు తక్షణం 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సరెండర్ లీవు బకాయిలతో పాటు పదో తరగతి వంద రోజుల ప్లానింగ్లో సెలవుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ సందర్భంగా తీర్మానించారు. -
జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్లో 3 పతకాలు
సామర్లకోట: జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్లో సామర్లకోటకు చెందిన యాతం నాగబాబు 3 పతకాలు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఆది, సోమవారాల్లో ఈ పోటీలు జరిగాయి. ఇందులో 1,500 మీటర్ల పరుగులో ఒక రజతం, 800, 400 మీటర్ల పరుగులో రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 1,254 మంది అథ్లెట్లు పాల్గొన్నారని నాగబాబు ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి ఈ ఏడాది వరకూ జరిగిన వివిధ జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ ఓపెన్ మీట్ పరుగు పందెంలో 100, 200, 400, 800, 1,500 మీటర్లతో పాటు రిలే విభాగాల్లో 68 పతకాలు సాధించానని వివరించారు. వీటిలో 20 బంగారు, 23 రజత, 25 కాంస్య పతకాలున్నాయని తెలిపారు. 55 ఏళ్ల వయస్సులోను పతకాలు సాధిస్తున్న నాగబాబును పలువురు అభినందించారు. ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైద్య, ఆరోగ్య శాఖ మలేరియా విభాగంలో పని చేస్తున్నారు. నేటి నుంచి సౌత్ జోన్ వాలీబాల్ పోటీలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీలు బుధవారం నుంచి కాకినాడలో ఐదు రోజుల పాటు జరగనున్నాయి. అసోషియేషన్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ ఆధ్వర్యాన నిర్వహించే ఈ పోటీలకు జేఎన్టీయూకే వేదిక కానుంది. వర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 14 వరకూ జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం నుంచి 138 జట్లు పాల్గొంటున్నా యని వివరించారు. ఈ జట్లను నాలుగు పూల్స్గా విభజించామన్నారు. పూల్–ఎ, బి మ్యాచ్లు జేఎన్టీయూకే, పూల్–సి అచ్చంపేట రాజీవ్గాంధీ కళాశాల, పూల్–డి సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో జరుగుతాయని వివరించారు. రాత్రి వేళ ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో సైతం మ్యాచ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ పోటీల్లో 1,960 మంది క్రీడాకారులతో పాటు 360 మంది కోచ్లు, మేనేజర్లు, వాలీబాల్ టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ టోర్నీలో ప్రతిభ చూపిన వారు మణిపాల్ జైపూర్ యూనివర్సిటీలో నిర్వహించే ఆలిండియా అంతర్ వర్సిటీ పోటీలకు అర్హత సాధిస్తారని వీసీ ప్రసాద్ చెప్పారు. పీఎంజీఎస్వైతో గ్రామాలకు మేలు ˘ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) గ్రామాలకు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఈ పథకం ప్రారంభించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యాన జేఎన్టీయూకేలో వర్సిటీ సహకారంతో ఏర్పాటు చేసిన రెండు రోజుల సెమినార్ మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం కింద 2000 సంవత్సరంలో ప్రారంభించిన రోడ్లను, ఇతర ప్రాజెక్టులను ఇప్పుడు తిరిగి పరిశీలించాలన్నారు. ప్రస్తుత జనాభా, అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీలైనింగ్, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. పంచాయతీరాజ్ సీఈ బాలునాయక్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆరేకే ప్రసాద్ కూడా ప్రసంగించారు. -
కదలివచ్చిన జనకోటి
ఇది ఆరంభం మాత్రమే చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తికి నిలువెత్తు నిదర్శనం కోటి సంతకాల సేకరణ నూరు శాతం విజయవంతం కావడం. ప్రజలు మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 4 లక్షలకు పైబడి వచ్చిన సంతకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రజాధనంతో 80 నుంచి 90 శాతం పూర్తయిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడమనేది దేశంలో ఎప్పుడూ వినలేదు. ప్రజల సొమ్ముతో పూర్తయ్యే దశలో ఉన్న మెడికల్ కళాశాలలను సొంతవారికి దోచిపెట్టే కుట్రను గ్రామగ్రామానా ప్రజలు తమ సంతకాలతో తిరస్కరించారు. ఇది ఆరంభం మాత్రమే. పాలన ఇలాగే కొనసాగితే ప్రజాందోళన ఉధృతమయ్యే రోజులు ఎంతో దూరంలో లేవు. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఉద్యమంలా సంతకాల సేకరణ పార్టీలకతీతంగా ప్రజలు ప్రధానంగా యువతీయువకులు, విద్యార్థులు కోటి సంతకాల సేకరణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పేదలకు వైద్య విద్యను దూరంచేసే చంద్రబాబు కుయుక్తులను ప్రజలు ఛీత్కరించుకుంటున్న విషయం ఈ సందర్భంగా ప్రస్ఫుటమైంది. అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునందుకుని పార్టీ కార్యకర్తలు, నేతలు ఉద్యమంలా సంతకాలు సేకరించారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించడం చూస్తూంటే చంద్రబాబు పాలనపై ఎంత వ్యతిరేకత ఉందో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలని.. ప్రజలందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలనే సమున్నత లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ అధినేత, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా సంతకాలు చేసి, ప్రభుత్వ నిర్ణయంపై తమ వ్యతిరేకతను చాటారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తద్వారా ఈ ఉద్యమాన్ని నూరు శాతం విజయవంతం చేశారు. ఉద్యమించారిలా.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంపై వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్లకు దిశానిర్దేశం చేశారు. అది మొదలు దాదాపు రెండు నెలలు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన నేతలు, కార్యకర్తలు సంతకాలు సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, అనుయాయులకు దోచిపెట్టే ఎత్తులను గణాంకాలతో సహా ప్రజల ముందుంచారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆయా నియోజకవర్గ కో ఆర్డినేటర్లను సమన్వయం చేసుకుంటూ సంతకాల సేకరణను విజయవంతం చేయడంలో కృతకృత్యులయ్యారు. కో ఆర్డినేటర్లు, ఆయా నియోజకవర్గాల పరిశీలకులుగా నియమితులైన పార్టీ రాష్ట్ర కార్యదర్శులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తూ ముందుండి నడిపించారు. చంద్రబాబు పాలన తీరుపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు రావడం కలసి వచ్చింది. యువత, విద్యార్థులు, మేధావులు.. ఇలా ఎవరిని కదిపినా కోటి సంతకాల ఉద్యమం పైనే ప్రధాన చర్చ జరిగింది. జిల్లావ్యాప్తంగా సేకరించిన సంతకాల ప్రతులను కట్టలుగా కట్టి, పెట్టెల్లో భద్రపరచి, పార్టీ నేతలు బుధవారం ర్యాలీగా కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుని కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, తుని నియోజకవర్గ కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా అక్టోబర్ 16న తొండంగి మండలం పెరుమాళ్లపురంలో శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 54 పంచాయతీలు, తుని పట్టణంలోని 30 వార్డుల్లో సంతకాల సేకరణ నూరు శాతం పూర్తి చేశారు. ఈ నియోజకవర్గానికి 60 వేల సంతకాలు లక్ష్యం కాగా, తుని శ్రీరామ థియేటర్ సెంటర్లో సోమవారం సాయంత్రం నిర్వహించిన రచ్చబండ ద్వారా నూరు శాతం పూర్తి చేశారు. కాకినాడ రూరల్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అక్టోబర్ 16న తూర్పు సెంటిమెంటుగా నేమాం గ్రామం నుంచి కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. ఆ మర్నాటి నుంచి నియోజకవర్గంలోని 41 గ్రామ పంచాయతీలు, కాకినాడ సిటీలోని 8 డివిజన్లలో స్థానిక నాయకులు ఉత్సాహంగా ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. 60 వేల మందికి పైగా ప్రజలు సంతకాలు చేయడం ద్వారా ప్రైవేటీకరణపై తమ అసంతృప్తిని స్పష్టం చేశారు. మిగిలి ఉన్న కొద్దిపాటి సంతకాలను బుధవారం పూర్తి చేయనున్నారు. పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సైతం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. లక్ష్యానికి అనుగుణంగా 50 వేల సంతకాలను మంగళవారం నాటికే విజయవంతంగా పూర్తి చేశారు. పిఠాపురం 1, 30 వార్డుల్లో పార్టీ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలోని 50 వార్డులు, 60 గ్రామాల్లో సంతకాలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చారు. గ్రామ కమిటీల నేతలు సైతం వీధుల్లో పర్యటిస్తూ సంతకాలు సేకరించారు. పిఠాపురం పట్టణంలో మూడు వార్డులు కలిపి ఉన్న జగ్గయ్య చెరువులో సంతకాల సేకరణను ముగించారు. జగ్గంపేట మాజీ మంత్రి తోట నరసింహం కో ఆర్డినేటర్గా జగ్గంపేట నియోజకవర్గంలో 90 శాతం సంతకాలు పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసే పనిలో పార్టీ శ్రేణులు తలమునకలై ఉన్నాయి. మంగళవారం నాటికి 72 గ్రామాల్లో 50 వేల సంతకాలు పూర్తి చేశారు. సరిగ్గా నెల రోజుల క్రితం తోట శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా చివరి దశకు చేరుకుంది. కాకినాడ సిటీ పార్టీ శ్రేణులు, ప్రజలు, విభిన్న వర్గాల మేధావులు పెద్ద ఎత్తున తరలి రాగా స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంతకాల సేకరణను ప్రారంభించారు. మొత్తం 42 డివిజన్లలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ తమతమ క్లస్టర్ల పరిధిలోని మాజీ కార్పొరేటర్లు, పార్టీ నేతలను సమన్వయం చేసుకుని, 60 వేల సంతకాల లక్ష్యాన్ని పూర్తి చేశారు. కాకినాడ జగన్నాథపురంలో ఈ కార్యక్రమం ముగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్, పార్టీ పరిశీలకుడు విప్పర్తి వేణుగోపాలరావు వెన్నంటి నిలిచారు. పెద్దాపురం నియోజకవర్గంలో సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలకు అక్టోబర్ 10న సామర్లకోటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన శ్రీకారం చుట్టారు. అదే రోజు సాయంత్రం పెద్దాపురం మున్సిపాలిటీ 13వ వార్డు నుంచి సంతకాల సేకరణ ప్రారంభించారు. నియోజకవర్గలోని జంట మున్సిపాలిటీలతో పాటు రూరల్ మండలాల్లో పోటాపోటీగా సంతకాలు సేకరించారు. మంగళవారం ఉదయానికి 50 వేల సంతకాలు పూర్తి చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు వాసిరెడ్డి జమీలు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యాన అక్టోబర్ 24న ప్రత్తిపాడులో సంతకాల సేకరణ ప్రారంభించారు. నియోజవర్గంలోని 75 పంచాయతీలు, ఏలేశ్వరం నగర పంచాయతీ 20 వార్డుల్లోనూ సంతకాలు సేకరించారు. లక్ష్యం 64 వేల సంతకాలకు గాను 54 వేలు పూర్తి చేశారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం వెంట ఉన్నారు. రెండు నెలలుగా సేకరించిన సంతకాలను డిజిటలైజ్ చేస్తున్నారు. ఫ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి విశేష స్పందన ఫ వైద్య కళాశాలల ప్రై‘వేటు’పై సర్వత్రా ఆగ్రహం ఫ నిర్ణయం ఉపసంహరించుకోవాలని బాబు సర్కారుకు డిమాండ్ ఫ నేడు వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి సంతకాల ప్రతులు -
చేప పిల్లలను మింగేశారు
● మత్స్యకారుల సంతకాలు ఫోర్జరీ చేశారు ● మత్స్యకారుల సంఘ నాయకుల ఆరోపణ ధవళేశ్వరం: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో గోదావరిలో విడుదల చేసినట్లు చెబుతున్న చేప పిల్లలను వదలకుండా ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను జిల్లా మత్స్యశాఖ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నార ని ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ మత్స్యకారుల కులా ల సమాఖ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కరుకు ఇ మ్మానియేల్ ఆరోపించారు. ధవళేశ్వరం బోట్మెన్, ఫిషర్మెన్ సొసైటీ నాయకులతో కలిసి సోమవా రం విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమక్షంలో చేపపిల్లలను మత్స్యశాఖ అధికారులు గోదావరిలో విడుదల చేశారన్నారు. మొత్తం 52లక్షల చేప పిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ అధికారులు ప్రకటించారని, వాస్తవానికి కేవలం 30వేల చేపపిల్లలను మత్రమే విడుదల చేశారన్నారు. మత్య్సకారుల జీవనోపాధి పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన గోదావరిలో చేపపిల్లల విడుదలను చేపట్టకుండా విడుదల చేసినట్లు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. రికార్డులలో మత్స్యకారుల సంతకాలను సైతం ఫోర్జరీ చేశారన్నారు. సమగ్ర విచారణ చేపట్టి చేప పిల్లలను మింగేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధవళేశ్వరం బోట్మెన్, ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు మెరుగ సత్తిబాబు, ఉపాధ్యక్షుడు సావదాల కామేశ్వరరావు, కార్యదర్శి కరుకు హరిప్రసాద్, కోశాధికారి బొడ్డు శ్రీను డిమాండ్ చేశారు. -
సొసైటీలకు తాళాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘ ఉద్యోగులు సోమవారం జిల్లాలోని అన్ని సహకార సంఘాలు మూసివేసి తమ డిమాండ్ల సాధన కోసం ధర్నా చేశారు. జిల్లాలో ఉన్న 71 సహకార సంఘాల్లో పనిచేస్తున్న 220 మంది ఉద్యోగులు యూనియన్ పిలుపు మేరకు డీసీసీబీ బ్రాంచ్ల వద్ద ధర్నాలో పాల్గొన్నారు. దీంతో అన్ని సహకార సంఘాలకు తాళాలు పడ్డాయి. దీంతో సహకార సంఘాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తప్పలేదు. కాకినాడ జిల్లాలో సహకార సంఘాల ద్వారా ప్రతీ రోజు సుమారు రూ.40 కోట్లు లావాదేవీలు జరుగుతుంటాయి. సమ్మె కారణంగా ఆయా లావాదేవీలు నిలిచిపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. జిల్లాలో 71 సహకార సంఘ పరిధిలో 1.80 లక్షల మంది సహకార సంఘ సేవలు వినియోగించుకొంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వచ్చారు. సహకార సంఘాలకు తాళాలు వేసి ఉండడంతో ఊసురుమంటూ వెనుతిరిగి రావాల్సి వచ్చింది. ప్రతీ సహకార సంఘానికి ప్రతీ రోజూ 30 నుంచి 50 మందికి పైగా రైతులు వచ్చి లావాదేవీలు జరుపుతారు. ప్రతీ సహకార సంఘంలో నిత్యం రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ లావాదేవీలు జరుగుతుంటాయి. సామర్లకోట మండలం నవర సహకార సంఘం పరిధిలో ప్రతీ రోజూ రూ.18 లక్షలకు పైగా లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రతీ రోజు 35 మంది రైతులు ఇక్కడ సహకార సంఘాలు సేవలు వినియోగించుకొంటారు. బంగారంపై రుణాలు తీసుకొనే రైతులకు అవస్థలు రైతులు బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకొంటారు. రూ.88 పైసల వడ్డీకే సహకార సంఘాల్లో రైతులకు రుణాలు ఇస్తుంటారు. దీంతో రైతులు అధికంగా బంగారు నగలు తాకట్టుపెట్టి రుణాలు పొందుతారు. సోమవారం సహకార సంఘాల్లో సిబ్బంది లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య బ్యాంకులు చాలా తక్కువగా ఉంటాయి. మండల కేంద్రాల్లో తప్ప వేరే గ్రామాల్లో వాణిజ్య బ్యాంకులు దాదాపు లేవు. దీంతో రైతులు తమ అవసరాల కోసం ఎక్కువగా సహకార సంఘాలను వినియోగించుకొంటారు. కానీ ధర్నా కారణంగా సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో రైతులు పడ్డ బాధలు వర్ణనాతీతం. డిమాండ్లు ఇవే.. వేతన సవరణ చేపట్టాలి, అప్పటి వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యూటీకి సీలింగ్ విధించి రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. అలా కాకుండా గ్రాట్యూటీ చట్టాన్ని అమలు చేసి చెల్లింపులు చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమాను కల్పించాలి. ప్రతీ ఉద్యోగికి రూ.20 లక్ష టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి. అనేక సంఘాల్లో ఉద్యోగుల జీతభత్యాలను డ్యూ టు పద్దులో ఉంచారు. ఈ డ్యూ టు పద్దులను రద్దు చేయాలి. 2019 తర్వాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి. వారికి జీవో నంబర్ 36 అమలు చేయాలి. డీసీసీబీల ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకార సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. సంఘాలు చెల్లించిన షేరు ధనంపై కనీసం 6 శాతం డివిడెండ్, కనీస వడ్డీ 6 శాతం చెల్లించాలి. ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. 71 సహకార సంఘాల్లో నిలిచిన సేవలు సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యోగుల ధర్నా ఆందోళనలో పాల్గొన్న 220 మంది ఒక్కరోజుకు నిలిచిన లావాదేవీలు రూ.40 కోట్లు అవస్థలు పడ్డ రైతులు -
స్క్రబ్ టైఫస్ వ్యాధిపై ఆందోళన వద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్క్రబ్ టైఫస్ ‘పురుగు‘ (కీటకం) కుట్టడం వల్ల వ్యాపించే వ్యాధి వల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ఈ వ్యాధిపై సోమవారం కలెక్టరేట్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పురుగు కుట్టడం గమనించినట్లయితే సమీప ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. స్క్రబ్ టైఫస్ ఇది వైరస్ కాదని, ఓరింటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందన్నారు. ఈ బ్యాక్టీరియా సోకిన చిన్న కీటకాలు మనుషులను కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుందన్నారు. ముఖ్యంగా ఎలుకలు సంచరించే ప్రదేశాలలో ఉండే కీటకాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు. పొదలు, గడ్డి ఉన్న ప్రదేశాలలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎలుకలు ఇంట్లోకి రాకుండా నిరోధించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలన్నారు. చికిత్స కోసం స్థానిక ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు. వదంతులు నమ్మవద్దని సరైన చికిత్స తీసుకుంటే త్వరితగతిన కోలుకొంటారన్నారు. డీఎంహెచ్ఓ జె.నరసింహ నాయక్, కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ లావణ్య కుమారి, ఇతర వైద్యులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్త హత్య దారుణం
కిర్లంపూడి: వైఎస్సార్ సీపీ, దళిత నాయకుడు కాకర అప్పారావును టీడీపీకి చెందిన కూళ్ల రాజబాబు తన సోదరుడు, మరికొంత మందితో కలసి, హత్యచేయడం దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట కో ఆర్డినేటర్ తోట నరసింహం అన్నారు. వీరవరంలో ఆయన నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ భూపాలపట్నం దళితపేటలో వైఎస్సార్ సీపీలో రాజకీయంగా ఎదుగుతున్నాడనే ఉద్దేశంతో అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరంరెడ్డి కాశీబాబు తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న కూళ్ల రాజబాబు, అతని సోదరుడు కూళ్ల రాజేష్ మరికొంతమందితో హత్యకు కారణమయ్యాడని తెలిపారు. పోలీసు అధికారులు దీనిని దృష్టిలో వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగిన నాలుగు రోజుల తరువాత కూళ్ల రాజబాబును అరెస్టు చేసి, మరో నిందితుడు దొరకలేదని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. రాజకీయ కక్షతో ప్లాన్ ప్రకారం హత్య చేశారన్నారు. మెట్ట ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడూ జరగలేదని ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ మార్చి అసలైన నిందితులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. లేని పక్షంలో పార్టీ తరఫున న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, నాయకులు తోట బాబ్జీ, గుల్ల ఏడుకొండలు, రామకుర్తి మూర్తి, తోట అయ్యన్న, అరిశ సత్యనారాయణ, ఓలేటి రాజు, గంగరాజు పాల్గొన్నారు. -
నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది
సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మఅల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): లక్క ఇంటిలో పంచపాండవులు కుంతితో సహా దహనమయ్యారన్న వార్త విని ధృతరాష్ట్రుడు బిగ్గరగా ఏడిచాడు. సహజంగా ఏడిచేవాడి ఏడుపు కన్నా, నటించేవాడి ఏడుపు బిగ్గరగా ఉంటుంది’ అని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ వ్యాఖ్యానించారు. వేదవ్యాస భారతంపై ఆయన హిందూ సమాజంలో సోమవారం 12వ రోజు ప్రవచనాన్ని కొనసాగించారు. ధృతరాష్ట్రుడు వారణాశికి పాండవులను పంపడానికి గల కారణాలను ఆయన వివరించారు. అర్జునుడు భీముని తోడుగా తీసుకుని రాజ్యాన్ని విస్తరింపజేశాడు. ధర్మరాజు యశస్సు నింగినంటుతోంది, పాండు సుతుల విజయగాథలను ప్రజలు వేనోళ్లా ప్రశంసించడం ఆయనకు కంటగింపయింది. అసూయతో రగిలిపోయాడు. ఆ సందర్భంగా కణికుడు అనే మంత్రిని పిలిపించి, తాను యుధిష్టరునితో సంధి చేసుకోవాలా, సంగ్రామానికి సిద్ధపడాలా అని ప్రశ్నిస్తాడు. కణికుడు రాజనీతిని ఉపదేశిస్తాడు–శత్రువును ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించరాదు. తన కన్నా బలవంతుడయితే, అతనిని కానుకలతో మంచి చేసుకోవాలి, వినయశీలుడిలా శత్రువు వద్ద నటించాలి, అదను చూసి దెబ్బతీయాలి. శత్రువు తన కన్నా బలహీనుడయి శరణుజొచ్చినా, ఉపేక్షించరాదని కణికుడు చెబుతాడు. దుర్యోధనాదుల ఆలోచనలకు ఆమోదం తెలిపి, పాండవులను వారణావత నగరానికి పంపుతాడని సామవేదం అన్నారు. కౌరవుల కుటిల నీతిని పసిగట్టిన విదురుడు సంకేత పదాలతో ధర్మరాజును అప్రమత్తం చేస్తాడు. కార్చిచ్చు అడవిని దహనం చేసినా, కలుగులోని ఎలుకకు అపాయం ఉండదని, రాత్రివేళ సైతం పాండుసుతులు అప్రమత్తులయి, పరిసరాలను గమనించాలని హితవు చెబుతాడు. సుయోధనుడు పురోచనుడు అనే విశ్వాసపాత్రుడిని పిలిచి, లక్కయింటిని నిర్మించమని, అదను చూసి నిప్పు పెట్టమని ఆదేశిస్తాడు. అయితే పురోచనుడి ఆలోచనను పసిగట్టిన పాండవులు ఒక రాత్రివేళ లక్క ఇంటికి తామే నిప్పు అంటించి, కలుగు మార్గం ద్వారా అడవుల్లోకి వెడతారని సామవేదం వివరించారు. ‘దుర్యోధనుడు’, ‘దుశ్శాసనుడు’ వంటి చెడు పేర్లను వ్యాసుడు ఎంత పక్షపాతి అయినా, ఎలా పెట్టాడని కొందరు అడుగుతారు. ఆ పదాలకు సరి అయిన అర్థాలను తెలుసుకోవాలి, దుర్భేద్యము అన్న పదం లాగే, దుర్యోధనుడు అంటే ఓడించడానికి వీలు పడని పరాక్రమం కలవాడని, దుశ్శాసనుడు అంటే శాసించడానికి వీలు పడని వాడనీ అర్థమని సామవేదం అన్నారు విదురుడు ఇంగితజ్ఞుడు, లాక్షాగృహ దహనంలో పాండుసుతులు అగ్నిపాలు కాకుండా విలువైన సూచనలు ఇవ్వడమే కాకుండా, సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ఒక విశ్వాసపాత్రుడిని పంపాడని ఆయన అన్నారు. ముందుగా భాగవత విరించి డాక్టర్ నారాయణరావు సభకు స్వాగతం పలికారు. -
కోటసత్తెమ్మ నిండుగా.. కనుల పండువగా..
● వైభవంగా ముగిసిన అమ్మవారి తిరునాళ్లు ● అలరించిన బాణసంచా వెలుగులు నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు కనుల పండువగా నిర్వహించారు. ఐదు రోజులుగా నిర్వహిస్తున్న తిరునాళ్లు సోమవారం రాత్రి వైభవంగా ముగిశాయి. ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ పర్యవేక్షణలో ఆలయం వద్ద ఉదయం చండీపారాయణ, సాయంత్రం హోమాలు, ఊయలసేవ నిర్వహించారు. ప్రధాన అర్చకులు అప్పారావు శర్మ కోటసత్తెమ్మకు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పూల గరగలు ఆకట్టుకున్నాయి. విలస గ్రామానికి చెందిన మానేపల్లి సత్యనారాయణ సన్నాయి మేళం, గరగ నృత్యాలు, నందన డ్యాన్స్ ఆకాడమీ తణుకు వారి కూచిపూడి, జానపద నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. కేరళ చందామేళం, కాళికా డ్యాన్స్, కోలాట కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం భారీగా బాణసంచా కాల్చడంతో ఆలయ పరిసరాలు వెలుగులు విరజిమ్మాయి. అమ్మవారిని దర్శించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి గరగలు ఎత్తుకున్నారు. -
కలెక్టర్ను కలిసిన జేసీ
బోట్క్లబ్ (కాకినాడసిటీ): జాయింట్ కలెక్టర్గా శనివారం బాధ్యతలు స్వీకరించిన అపూర్వ భరత్ సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. మాతృభాష పరిరక్షణకు శ్రద్ధ తీసుకోవాలిరాజానగరం: మాతృభాష పరిరక్షణకు పౌరులతోపాటు ప్రభుత్వాలు కూడా శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు సూచించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ‘భారతీయ భాషలలో ఏకరూప శాసీ్త్రయ సాంకేతిక పదజాలం’ అనే అంశంపై రెండురోజులపాటు నిర్వహించే నేషనల్ వర్క్షాప్ని దీపారాధనతో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నేడు దేశంలో అనేక ఉన్నత స్థానాలలో ఉన్న వారంతా ఒకప్పుడు మాతృభాషలో చదువుకున్న వారేననే విషయాన్ని మరువరాదన్నారు. అమ్మ అనే పిలుపులో ఉండే మాధుర్యం మమ్మీ, డాడీ పదాలలో ఉండవన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృభాషలలోనే చదువుకున్నారన్నారు. మాతృభాషను గౌరవిస్తూ, సోదర భాషలను అవసరాల మేరకు ఉపయోగించుకోవాలన్నారు. మాతృభాషలో మాట్లాడటం నామోషీగా భావించే విష సంస్కృతికి అంతా దూరంగా ఉండాలని హితవు పలికారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా భాషలో ప్రామాణిక పదాల వినియోగం ఉండాలన్నారు. ఆత్రేయపురం పూతరేకు, తాపేశ్వరం కాజా వంటి వాటిని నేటీకి ఆ విధంగానే పిలుస్తున్నామని, వాటికి ఇంకా ఇంగ్లిష్ పేర్లు పెట్టకపోవడం ఆనందించదగిన పరిణామంగా పేర్కొన్నారు. భాష ఒక జీవనది వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ భాష అనేది ఒక జీవనది వంటిదని, తరాలతోపాటు కాలానుగుణంగా వచ్చే మార్పులకు తగినట్లుగా ముందుకు సాగుతుందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం, భావజాలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రచయితలు రచించిన మూడు పుస్తకాలను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. భారతీయ భాషా సమితి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (న్యూఢిల్లీ) సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్గా డాక్టర్ తలారి వాసు వ్యవహరించగా, తెలుగు – సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్డీ విల్సన్, తానా పూర్వాధ్యక్షుడు డాక్టర్ తోటకూర ప్రసాద్, భారతీయ భాషా సమితి అకడమిక్స్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.గిరిధరరావు, డాక్టర్ కేవీఎన్డీ వరప్రసాద్, పాల్గొన్నారు. -
సాగనంపడం ఏంచేసారూ!
రామచంద్రపురం: మున్సిపాలిటీలో చక్రం తిప్పుతూ.. అనుకున్న పనులే చేస్తూ.. ఎవరినీ లెక్కచేయకుండా, అన్నీ తానై ఓ ఇంజినీరింగ్ అధికారి వ్యవహరిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆరోపణలు చేయడం రామచంద్రపురంలో చర్చనీయాంశమైంది. అన్ని పార్టీలు ఏకమై ఆ అధికారిని సాగనంపాలని కోరుతుండటం చూస్తుంటే, పరిస్థితి ఎక్కడ వరకూ వెళ్లిందో చెప్పకనే అర్థమవుతోంది. స్థానిక మున్సిపాలిటీలో ఉన్నత స్థానంలో ఉన్న ఆ అధికారి చర్యలతో వేడిరాజుకుంది. ఆయన్ని సాగనంపాలని కోడై కూస్తున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, కాంట్రాక్టర్లంతా కలసి ఈ అధికారి మాకొద్దు బాబోయ్ అంటున్నా నియోజకవర్గ ప్రజాప్రతినిధి మాత్రం పట్టించుకోవడం లేదు. ఎంత మంది ఎదురు తిరిగితే నాకేంటి నేను ‘డాడీ గారి’ సేవలో ఉంటే చాలు అంటూ ఆ ఉద్యోగి ఏ మాత్రం జంకు లేకుండా ఉంటున్నారని కౌన్సిలర్లు, సిబ్బంది, కాంట్రాక్టర్లు అంటున్నారు. ప్రస్తుతం రామచంద్రపురం మున్సిపాలిటీలో పార్టీలకు అతీతంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ, జనసేన కౌన్సిలర్లు చైర్ పర్సన్తో కలసి ఆ అధికారిపై స్థానికంగా ఉన్న మంత్రి వాసంశెట్టి సుభాష్కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అతనిపై కౌన్సిలర్లతో పాటు తన తోటి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. ఈయన వ్యవహార శైలి బాగోలేదని, మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని అభియోగాలు మోపారు. టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టు పనులు చేయించడం, ఎం బుక్లు సైతం ఆయనే రాయిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్లకు నోడ్యూస్ సర్టిఫికెట్లను తన వారికే జారీ చేయడంతో పాటు టెండర్లు, నోడ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోనే పర్సంటేజీలు మాట్లాడుకోవడం జరిగిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌంటర్ ఓచర్లు సైతం అతను ఇష్టానుసారంగా పెడుతుంటే, దానికి సంబంధించిన సెక్షన్ అధికారి వాటిని తిప్పి పంపడం, అవి ‘డాడీ గారి’ వద్ద పంచాయితీ పెట్టడం ఇలా ఎన్నో తంతులు మున్సిపాలిటీలో జరుగుతున్నాయని కాంట్రాక్టర్లు, సిబ్బంది వాపోతున్నారు. ఏడాది కాలంగా ఇలా ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకూ ఆయన్ని బదిలీ చేయకపోవడం వెనుక మర్మమేమిటో ఫిర్యాదు చేసిన వారికి అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. గతంలోనూ ఇంతే.. సదరు అధికారి గత చరిత్రను పరిశీలిస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మున్సిపాలిటీలో ఉండగా అక్కడ కూడా ఇదే తరహాలో కౌన్సిలర్లు వ్యతిరేకించారు. వారు మున్సిపాలిటీలో కాకుండా ఒక కల్యాణ మండపంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడంతో దిగి వచ్చిన ప్రభుత్వం అతన్ని రీకాల్ చేసింది. మున్సిపాలిటీ నుంచి వేరే శాఖకు బదిలీ చేసిన అనంతరం కూడా కొన్నేళ్లు విధులకు దూరంగా ఉన్న సదరు అధికారిని తీసుకువచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చారని కౌన్సిలర్లు చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన్ని ఇక్కడకు ఏ కారణంగా ‘డాడీ గారు’ తీసుకువచ్చారోనని గుసగుసలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే టెండర్లు ఆమోదం పొందేలా చూసి మిగిలిన వారిని పక్కన పెట్టి పర్సంటేజీలు దండేస్తున్నారనే ఆరోపణలతో పాటు తనను ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఆ అధికారి వ్యవహరిస్తున్న తీరు అందరిలో మంట రేపుతోంది. -
జగనన్న పేరంటేనే ఝడుపా!
సామర్లకోట: ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీకి ఇంకా ఎన్నికల కోడ్ ముగిసినట్టు లేదు. కోడ్ నిబంధనల మేరకు వేసిన రంగులు నేటికీ తొలగించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కాలనీ పేరును పునరుద్ధరించడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం లే అవుట్లో సుమారు 50 ఎకరాల్లో అప్పటి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జగనన్న కాలనీ పేరిట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 2023 అక్టోబరు 12న ప్రారంభించారు. ప్రత్తిపాడు రహదారికి ఇరువైపులా ఉన్న ఈ కాలనీకి రెండు వైపులా రెండు ముఖద్వారాలు ఏర్పాటు చేసి కౌన్సిల్ తీర్మానంతో జగనన్న కాలనీగా పేరు పెట్టారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముఖద్వారాలపై ఉన్న జగనన్న పేరుపై నలుపు రంగు వేశారు. నాడు వేసిన రంగులు నేటికీ తొలగించపోవడం విమర్శలకు తావిస్తోంది. జగనన్న పేరు పునరుద్ధరణపై నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు మున్సిపల్ కమిషనర్కు వివరించినా ప్రయోజనం కనిపించలేదు. కాగా ఈ కాలనీకి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవడానికి యతి్నస్తున్నట్టు తెలిసింది. ఇదే జరిగితే శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉంది. పేదలకు ఎంతో విలువైన స్థలాలు ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం రహదారుల కూడలిలో రోడ్డు మార్జిన్లో ఈ కాలనీలో ఇప్పటికే అనేక మంది ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా పార్కులతో కాలనీని సుందరంగా తీర్చిదిద్దుకున్నారు. దీంతో వైఎస్సార్ సీపీకి ఆదరణ పెరుగుతుందనే కక్షతో ముఖద్వారాలపై పేర్లు రాయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్రెడ్డి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వడంతో ఆయన పేరు చరిత్రలో గుర్తుండిపోతుంది. అటువంటి ముఖ్యమంత్రి పేరును రాయించడానికి మున్సిపల్ అధికారులకు ఎందుకు చేతులు రావడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీ బీసీఎల్ వైపు ఉన్న కాలనీ ముఖద్వారంపై పేరు కనపడకుండా పూర్తిగా వేసిన రంగు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం ఈటీసీ లే అవుట్లోని వైఎస్సార్ జగనన్న కాలనీ ముఖద్వారంపై ఉన్న పేరుకు రంగులు తొలగించాల్సిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. అనేక కౌన్సిల్ సమావేశాలలో అధికారులను ప్రశ్నించాం. గతంలో తాను పని చేసిన ప్రదేశాల్లోని భవనాలకు రంగులు వేయలేదని, కేవలం పేపర్లు అతికించామని కమిషనర్ చెప్పారు. గతంలో ఉండేలా పేర్లు రాయిస్తానని హామీ ఇచ్చి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ విషయాన్ని కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు దృష్టికి తీసుకువెళ్లాం. ఆయన స్వయంగా పరిశీలించి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. – ఆవాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్, సామర్లకోటజగనన్న కాలనీపై కుట్ర జరుగుతోంది జగనన్న కాలనీపై ఏదో కుట్ర జరుగుతోంది. ఆ ప్రాంతంలో పారిశుధ్య పనులు సక్రమంగా చేయడం లేదు. ఎన్నికల కోడ్ సమయంలో జగనన్న కాలనీ ముఖద్వారానికి వేసిన రంగుల స్థానంలో పేర్లు రాయించాలని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య దృష్టికి తీసుకు వెళ్లాం. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్ధం కాలేదు. మా నాయకుడు దొరబాబుతో చర్చించి ఏంచేయాలో ఆలోచిస్తాం. – ఉబా జాన్మోజెస్, మున్సిపల్ వైస్ చైర్మన్, సామర్లకోట -
లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానం ఆదివారం కిక్కిరిసిపోయింది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చిన 15 వేల మంది భక్తులు క్యూలో అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.2,00,455, పూజా టికెట్లకు రూ.2,25,280, కేశఖండన శాలకు రూ.12,400, వాహన పూజలకు రూ.7,890, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.61,070, విరాళాలు రూ.49,366 కలిపి మొత్తం రూ.5,56,451 ఆదాయం సమకూరిందని వివరించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు. -
హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పరాదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): హింసా ప్రవృత్తి ఉన్నవారికి అస్త్రవిద్య నేర్పకూడదని, అది ప్రపంచానికి ప్రమాద హేతువుగా మారవచ్చని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో వ్యాసభారత ప్రవచనాన్ని ఆదివారం ఆయన కొనసాగించారు. ‘ద్రోణుడు పక్షపాతి కాడు, ధర్మజ్ఞుడు. అస్త్రాలు మంత్రస్వరూపాలు. అవి నేర్చుకోవడానికి కొన్ని వ్రతాలుంటాయి. నేర్చుకోవడానికి ఉపనయనాది సంస్కారాలు ఉండాలి’ అని చెప్పారు. ఏకలవ్యుడు నిషాదుడని, పశుపక్ష్యాదులను వేటాడటమే వృత్తిగా కలవాడని చెప్పారు. తనను చూసి మొరిగిన కుక్కపై ఏడు బాణాలు ప్రయోగించి, అది మూతి తెరవకుండా చేశాడని, ఉత్తముడు తను నేర్చుకున్న విద్యను శునకాదులపై ప్రయోగించరాదని చెప్పారు. రాజోచితమైన విద్యను బోయవానికి నేర్పడానికి ద్రోణాచార్యుడు తిరస్కరించడంలో కులవివక్ష లేదని, ఎవరో ఒకరు ప్రభుత్వ సంస్థకు వచ్చి తనకు క్షిపణుల ప్రయోగం, అణువిద్య నేర్పమంటే నేర్పుతారా? అని సామవేదం ప్రశ్నించారు. మంత్రం సిద్ధించిన తరువాతనే అస్త్రవిద్య పని చేస్తుందన్నారు. గురుముఖతః నేర్చుకున్న విద్య మాత్రమే ఫలప్రదమవుతుందని, దొంగచాటుగా నేర్చుకుంటే అది బ్రహ్మస్తేయమనే పాపంగా పరిణమిస్తుందని చెప్పారు. కురుపాండవులకు అస్త్రవిద్య నేర్పడానికి స్థాపించిన విద్యాలయం నేటి డెహ్రాడూన్ ప్రాంతంలో ఉన్నట్లు పరిశోధనలు నిరూపిస్తున్నాయన్నారు. కానీ, విదేశీయులు ఈ గడ్డ మీద ముందుగా పేర్లు మార్చారని చెప్పారు. మార్చినవి పేర్లే కదా అని కొందరు ఉదారవాదులు అంటున్నారని, అయితే, వాటినే ఎందుకు మార్చారంటూ వారిని మనం ప్రశ్నించాలని అన్నారు. ధనం కోసమే ఒక సాధనంగా విద్యను భావించడంతో క్షీణదశ ప్రారంభమైందని, కానీ, విద్య కోసమే విద్య అని భావించినది మహర్షుల కాలమని చెప్పారు. విద్యార్థుల్లో స్పర్థలుండాలే తప్ప ద్వేషభావం తగదని హితవు పలికారు. భారతం చదవడం ఒక యోగమని, తెలుసుకోవడం ఒక మహాయోగమని సామవేదం అన్నారు. -
ఎరియర్లు చెల్లించాలి
కాంట్రాక్ట్ అధ్యాపకుల డిమాండ్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ–కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలలో పని చేస్తున్న 120 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు వెంటనే ఎరియర్లు చెల్లించాలని అధ్యాపకుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022లో విడుదల చేసిన జీఓ 110 ప్రకారం పీజీ, పీహెచ్డీ అర్హతలున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు రూ.35 వేలు, సెట్, నెట్ అర్హత ఉన్న వారికి రూ.40 వేల చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. జీతభత్యాల చెల్లింపులో జాప్యం చేస్తూ తమను వర్సిటీ అధికారులు మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి 2022 నుంచి రావలసిన ఎరియర్ల చెల్లింపునకు ప్రొసీడింగ్స్ జారీ చేశారని, అధ్యాపకుల విషయంలో మాత్రం కాలయాపన చేస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేస్తానని వీసీ పలుమార్లు హామీ ఇచ్చారే తప్ప నేటికీ స్పష్టత లేదని అన్నారు. వృత్తి కోర్సులు అభ్యసించే అధ్యాపకులకు ఎటువంటి ఇన్సెంటివ్లూ ఇవ్వకపోగా, రావలసిన ఎరియర్లు కూడా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. యాప్లతో ఉపాధ్యాయులు బోధనకు దూరం ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్ అయినవిల్లి: బోధనేతర పనులు, యాప్లతో ఉపాధ్యాయులను ప్రభుత్వం బోధనకు దూరం చేస్తోందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ముక్తేశ్వరంలోని వైవీఎస్ అండ్ బీఆర్ఎం కళాశాల ప్రాంగణంలో ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం పోతంశెట్టి దొరబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చి, ఇప్పుడు అమలుకు తాత్కారం చేస్తోందన్నారు. ఉపాధ్యాయులకు బదిలీలు లేకుండా చేశారని, కొన్నిచోట్ల బదిలీలు చేసి రిలీవ్ చేయలేదని అన్నారు. డీఏ బకాయిలు చెల్లించలేదని, పదోన్నతులు ప్రకటించలేదన్నారు. పీఆర్సీ కమిటీ తక్షణమే నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) నుంచి సర్వీసులో ఉన్న ఉపాధాయులకు సడలింపు ఇవ్వాలని కోరారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగిరెడ్డి శివప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ నల్లి ప్రసాద్, బోనం వెంకట గంగాధర్, కేవీఎస్ ఆచారి, మట్టా నాగరాజు, ఉమ్మడి జిల్లా ఎస్టీయూ మాజీ అధ్యక్షుడు కేవీ శేఖర్, ఉద్యమ నాయకులు కేకేవీ నాయుడు, ఎస్వీ నాయుడు, నేరేడిమిల్లి సత్యనారాయణ, పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు. రూ.లక్ష విరాళం కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి నిత్యాన్నప్రసాద పథకానికి గూడూరు వీర వెంకట గోవర్ధన్, భారతి దంపతులు (భీమవరం మండలం గునుపూడి) రూ.1,00,116 విరాళం సమర్పించారు. అసోసియేషన్ ఎన్నికలు కొత్తపేట: ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఎన్జీఓ) జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 18న నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ విషయాన్ని కొత్తపేట తాలూకా ఎన్జీఓ నాయకులు ఆదివారం తెలిపారు. ఈ ప్రక్రియకు ఎన్నికల అధికారిగా ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు డి.సత్యనారాయణరెడ్డి, సహాయ ఎన్నికల అధికారిగా ఆ జిల్లా కార్యదర్శి పి.రమేష్, పరిశీలకురాలిగా రాష్ట్ర ప్రచార కార్యదర్శి డి.జానకిని నియమించారు. ప్రెసిడెంట్, అసోసియేట్ ప్రెసిడెంట్, ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లు, ఒక ఉమెన్ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఐదుగురు జాయింట్ సెక్రటరీలు, ఉమెన్ జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్తో మొత్తం 17 పోస్టులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రచురణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తయ్యింది. కాగా, ఈ నెల 11న నామినేషన్లు వేయడం, పరిశీలన, ఆమోదం, ఉపసంహరణ, నామినేషన్ల తుది జాబితా విడుదల ఉంటుంది. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్, రెండు గంటల నుంచి కౌంటింగ్, అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. అమలాపురం పంచాయతీరాజ్ కాటన్ గెస్ట్ హౌస్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎన్జీఓ నాయకులు తెలిపారు. -
హంతకులను అరెస్టు చేయాలి
కిర్లంపూడి: మండలంలోని భూపాలపట్నంలో దళిత నాయకుడు కాకర అప్పారావు హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్టు చేయాలని దళిత బహుజన, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు, డీబీఫ్ జాతీయ కో ఆర్డినేటర్ తోటి చెంగలరావు ఆధ్వర్యాన దళిత సంఘాల నాయకులు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దళిత నాయకుడైన హతుడు అప్పారావు భూపాలపట్నంలో దళితులను చైతన్యపరచడంతో పాటు దళిత సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అదే గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన ఓ వ్యక్తి తన అధికారానికి అడ్డు వస్తున్నాడని భావించి గ్రామం వదిలి వెళ్లిపోవాలంటూ అప్పారావును అనేకసార్లు హెచ్చరించారని అన్నారు. దీనిని ఖాతరు చేయకపోవడంతో అప్పారావును తన కారు డ్రైవర్తో హతమార్చేందుకు ఆ వ్యక్తి పథకం రచించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ కారు డ్రైవర్, అతడి సోదరుడు, మరి కొంత మంది కలిసి అప్పారావును ఇనుప రాడ్లతో కొట్టి చంపారని అన్నారు. హత్యకు కారకుడైన ఆ వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని, అప్పారావుకు ప్రాణహాని ఉందని ముందుగానే పోలీసులకు తెలిపినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన స్థానిక పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ప్రాసిక్యూట్ చేయాలని, ఎఫ్ఐఆర్లో అవకతవకలను సవరించాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. కఠినంగా శిక్షించాలి వైఎస్సార్ సీపీ కార్యకర్త కాకర అప్పారావును హతమార్చిన వారు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం డిమాండ్ చేశారు. అప్పారావు హత్య విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. అప్పారావు హంతకులను పట్టుకుని శిక్షించాలని, పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఫ పథకం ప్రకారమే కాకర అప్పారావు హత్య ఫ దళిత నేతల డిమాండ్ ఫ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా -
ఈ విధులు.. సారా టార్చర్
కాకినాడ క్రైం: పొరుగు జిల్లాల నుంచి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఎకై ్సజ్ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భార్యాబిడ్డలను, కుటుంబాన్ని వదిలి.. ఊరు కాని ఊరు వచ్చి.. 15 రోజుల చొప్పున ఇక్కడే ఉంటూ వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. రోడ్ల పక్కనే కడుపాకలి తీర్చుకుంటూ.. స్నేహితుల గదుల్లోనే తల దాచుకుంటూ సర్దుకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. అధికారులు తమపై పెత్తనం చేయడమే తప్ప కనీస వసతులైనా కల్పించడం లేదని ఆవేదన చెందుతున్నారు. కనీసం భోజనమైనా పెట్టకపోవడం.. నిలువ నీడయినా కల్పించకపోవడం.. డ్యూటీ అడ్వాన్సులు సైతం చెల్లించకపోవడంతో రెండు నెలలుగా టార్చర్ అనుభవిస్తున్నామని వాపోతున్నారు. 40 మంది సిబ్బంది కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో సారా తయారీ, క్రయ విక్రయాలు మితిమీరి సాగుతున్నాయంటూ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ కొద్ది రోజుల క్రితం నివేదిక అందించింది. దీంతో, ఈ రెండు జిల్లాల్లో సారా తయారీ, రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పొరుగు జిల్లాల నుంచి సమర్ధులైన ఎకై ్సజ్ సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించాలని రాష్ట్ర ఎకై ్సజ్, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 40 మంది సిబ్బందిని కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించారు. వీరిలో ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు కూడా ఉన్నారు. వీరు ప్రతి 15 రోజులకో బ్యాచ్ చొప్పున రెండు జిల్లాల్లోనూ పని చేస్తున్నారు. సారా తయారీ, రవాణా, అమ్మకాలపై సమాచారం అందిన వెంటనే అధికారుల ఆదేశాల మేరకు వీరు రంగంలోకి దిగుతున్నారు. పలుచోట్ల సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. సారా తయారీకి వినియోగించే బెల్లపు ఊటను, సారా డెన్లను ధ్వంసం చేయడం, తయారీ, రవాణా, అమ్మకందార్లకు అరదండాలు బిగించడం వంటి విధులు నిర్వహిస్తున్నారు. కమిషనర్ ఆదేశాలు బుట్టదాఖలు! ఇదిలా ఉండగా రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ శ్రీధర్బాబు మూడు నెలల క్రితం రాష్ట్ర స్థాయిలో పని చేస్తున్న అడిషనల్, జాయింట్, డెప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో నియమించిన 40 మంది సిబ్బందికి నిబంధనల ప్రకారం చెల్లింపులు చేయాలని ఆ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. తద్వారా వారి విధి నిర్వహణ, వసతి, రోజువారీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే, ఏకంగా కమిషనర్ ఆదేశాలే బుట్టదాఖలైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆదేశాల అమలును ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నెలలో 15 రోజుల పాటు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉంటూ పడరాని పాట్లు పడుతున్నా అధికారులు కనీసంగా కూడా స్పందించడం లేదని ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది వాపోతున్నారు. వసతి సంగతి దేవుడెరుగు.. కనీసం డ్యూటీ అడ్వాన్సులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతే కాకుండా, ఈ రెండు జిల్లాల్లోనూ ఆ శాఖ ఉన్నతాధికారులు అజమాయిషీ ధోరణితో వ్యవహరిస్తూ తమకు ప్రత్యక్ష నరకం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకూ డ్యూటీ ప్రయోజనాలేవీ ఇవ్వకపోగా, 15 రోజులు గడిచిన తర్వాత రిలీవ్ చేయాల్సి ఉన్నా, ఆ ఊసే లేకుండా బలవంతంగా విధుల్లో కొనసాగిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాము అడుగుతున్నా స్పందించడం లేదని, ఎప్పటికో స్పందించినా తాము చెప్పేంత వరకూ రిలీవ్ చెయ్యొద్దంటూ కింది స్థాయి అధికారులకు ఆదేశాలిస్తున్నారని వాపోతున్నారు. ఆ డబ్బులేమయ్యాయో! క్షేత్ర స్థాయి సిబ్బందికి నయా పైసా కూడా ఇవ్వకుండా చుక్కలు చూపిస్తున్న అధికారులు వారికి నిబంధనల ప్రకారం జరగాల్సిన చెల్లింపులకు చెల్లు చీటీ రాసేశారు. ఈ ఏడాది అక్టోబర్లో కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మద్యం దుకాణాల కేటాయింపులు జరిగాయి. దీనికోసం వేలం పాటలు నిర్వహించారు. ప్రతి దరఖాస్తుకు రూ.5 లక్షల చొప్పున ఎకై ్సజ్ శాఖ నాన్ రిఫండబుల్ రుసుం వసూలు చేసింది. ఇందులో దరఖాస్తుకు రూ.10 వేల చొప్పున ఆయా జిల్లాల ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారుల ఆధ్వర్యాన ఎకై ్సజ్ ఫండ్ పోగేశారు. సారా నివారణకు అమలు చేస్తున్న నవోదయ 2.0 కార్యక్రమం కోసం ప్రిన్సిపాల్ కమిషనర్ చొరవతో ఈ ప్రత్యేక ఫండ్ ఏర్పాటైంది. ఈ నిధులను సారా నివారణకు చేపట్టే ఏ చర్యకై నా వినియోగించవచ్చని ఆదేశిస్తూ, వీటి నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర కమిషనర్కు అప్పగించారు. అయితే, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన ఈ నిధులు ఏమయ్యాయోనన్న ఆ శాఖలో చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నిధులే కనుక ఉండి ఉంటే తమకు డ్యూటీ అడ్వాన్సులే ఇచ్చి ఉండేవారు కదా అనే అభిప్రాయం సిబ్బందిలో వ్యక్తమవుతోంది. నిధుల లెక్కలపై ఉన్నతాధికారులు ఆరా తీసి పక్కదారి పడితే చర్యలు తీసుకోవాలని, ఖాతాలోనే ఉంటే తమకు చెల్లింపులు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు. ఫ సారా నియంత్రణకు 4 జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది ఫ డెప్యూటేషన్పై డ్యూటీలు వేసిన ప్రభుత్వం ఫ కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో విధులు ఫ ఆహారం, నిలువ నీడకు కానరాని ఏర్పాట్లు ఫ డ్యూటీ అడ్వాన్సులూ లేక ఇక్కట్లు ఫ 2 నెలలుగా ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఆవేదన -
తేలని పంచాయితీ
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుపై అధికార కూటమిలో నడుస్తున్న ‘పంచాయితీ’ ఎటూ తేలడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు కాలపరిమితి గత ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసింది. అంటే, పాత ట్రస్ట్ బోర్డు రద్దై 10 నెలలవుతోంది. ఇప్పటికీ కొత్త ట్రస్ట్ బోర్డు నియామకంపై కూటమిలోని మూడు పార్టీల మధ్య పంచాయితీ ఓ కొలిక్కి రావడం లేదు. ట్రస్ట్ బోర్డుకు దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ చైర్మన్గా ఉంటారు. ఆయనతో పాటు మరో 17 మంది సభ్యులను నియమించాల్సి ఉంది. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న తమ నుంచి ఇద్దరేసి చొప్పున సభ్యులను నియమించాలని బీజేపీ, జనసేన కోరుతున్నాయి. టీడీపీ మాత్రం ఆ రెండు పార్టీల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే అవకాశం ఇవ్వాలని, మిగిలిన 15 మందీ తమవారే ఉండాలని పట్టుబడుతోంది. ఈ వివాదం తేలకపోవడంతో ట్రస్ట్ బోర్డు నియామకం వాయిదా పడుతోంది. దీంతో, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ మాత్రమే ట్రస్ట్ బోర్డు తరఫున దేవస్థానం ఈఓతో సమావేశమై తీర్మానాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల నుంచేనా! ఫ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికగా టీడీపీ నుంచి 13 నుంచి 15 మందిని నియమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ పెద్దాపురం నుంచి దాత, శ్రీ లలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ను రెండోసారి కూడా దాత కోటాలో సిఫారసు చేసినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనను ట్రస్ట్బోర్డు సభ్యునిగా నియమించారు. సత్యప్రసాద్ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు రూ.2.5 కోట్ల వ్యయంతో వజ్ర కిరీటాలు చేయించారు. అలాగే, రూ.5 కోట్లతో సత్యదేవుని ప్రసాద తయారీ భవనం, మరో రూ.2 కోట్ల విలువైన పూజా సామగ్రి సమర్చించడంతో పాటు పలు భవనాలు నిర్మించారు. ఫ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, పాయకరావుపేట ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి ట్రస్ట్ బోర్డులో చోటు దక్కే అవకాశం ఉంది. ఫ కోనసీమ నుంచి ఒకరు, మిగిలిన ఇద్దరు గుంటూరు, విశాఖకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఫ నాయీ బ్రాహ్మణ వర్గాల నుంచి ఒకరిని నియమించనున్నారు. అలాగే, ప్రధానార్చకుడిని కూడా నియమిస్తారని చెబుతున్నారు. ఫ జగ్గంపేట నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక హోటల్ యజమానిని అక్కడి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాదించినట్లు సమాచారం. ఫ తుని నుంచి నాయీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. గతంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమీప బంధువుకు ట్రస్ట్ బోర్డులో స్థానం దక్కింది. ఈసారి కూడా ఆయన ఆశించినా ఫలితం దక్కలేదని సమాచారం. ఫ ప్రత్తిపాడు నుంచి ఒక బీసీ మహిళ, మరో ఓసీకి అవకాశమివ్వాలని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ఇక్కడి నుంచి బీజేపీకి అవకాశం ఇస్తే ఒకరికి మాత్రమే ప్రాతినిధ్యం దక్కనుంది. ఫ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని నియమించాలని కోరుతున్నారు. అయితే, జనసేన తరఫున ప్రతిపాదించిన పిఠాపురం మండలానికి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో టీడీపీ నాయకుల మీద, జనసేనలోని ఒక వర్గం నాయకుల మీద అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కొంతమంది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు స్క్రీన్ షాట్లు తీసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేయాలని ఆ నియోజకవర్గ ఫైవ్ మెన్ కమిటీకి పవన్ సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిపై పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఫ అలాగే, రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు నుంచి బీజేపీ తరఫున కూడా ఒక్కొక్కరిని నియమించాలని పట్టు పడుతున్నారు. ఫ కోనసీమ నుంచి ఎస్సీ లేదా శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాతినిధ్యం కల్పించనున్నట్టు సమాచారం. ఫ ఇదిలా ఉండగా ప్రభుత్వ పెద్దలు ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు నియామకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం కూడా నడుస్తోంది. ఇప్పుడు మూఢం కావడంతో ఫిబ్రవరి లేదా మార్చిలో దీనిపై ఆలోచిద్దామని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఫ అన్నవరం ట్రస్ట్ బోర్డుపై కూటమిలో కుదరని ఏకాభిప్రాయం ఫ ఎక్కువ మంది తమవారే ఉండాలని టీడీపీ పట్టు ఫ పాత ధర్మకర్తల మండలి రద్దై 10 నెలలు ఫ ఇప్పటికీ ఏర్పాటు కాని నూతన మండలి ఏకాభిప్రాయం కుదరక.. ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని టీడీపీ అధిష్టానం గత జూలైలోనే ఆదేశించింది. దీంతో మంత్రులు, ఆయా ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లను అధిష్టానానికి అందజేశారు. వీరిలో ఎవరిని తొలగించాలి, ఎవరిని ఉంచాలనే దానిపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. దీనికి తోడు బీజేపీ, జనసేనల నుంచి ఎంత మందిని నియమించాలనే దానిపై కూడా మూడు పార్టీల సఖ్యత కుదరడం లేదని సమాచారం. కొత్త ట్రస్ట్ బోర్డులో 18 మంది కొత్త ట్రస్ట్ బోర్డులో చైర్మన్ సహా 18 మంది సభ్యులు ఉంటారని సమాచారం. దేవదాయ శాఖ చట్టం ప్రకారం దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ ఈ బోర్డుకు చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా 17 మందిని నియమిస్తారు. వీరిలో సుమారు 12 లేదా 13 మంది పురుషులు, నలుగురైదుగురు మహిళలు ఉంటారని తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కూడా స్థానం కల్పించాల్సి ఉంది. అలాగే, దేవస్థానం తరఫున ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో సామాజిక సమతుల్యం పాటించారు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఏడుగురు మహిళలు, ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారు. వ్యవస్థాపక ధర్మకర్తతో కలిపి మొత్తం 16 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లాల్సిన ఆవశ్యకత చంద్రబాబు ప్రభుత్వంపై పడింది. ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు. -
పుష్కర కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రత్తిపాడు రూరల్: కాలువలో పశువులను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫిట్స్ వచ్చి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాచపల్లిలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. శనివారం సాయంత్రం ఒమ్మంగికి చెందిన దొండపాటి సింహాచలం తన పశువులను రాచల్లి అడ్డురోడ్డు వద్ద పుష్కర కాలువలోకి మళ్లించాడు. కాలువలో పశువులను కడుగుతుండగా సింహాచలానికి ఫిట్స్ రావడంతో నీటిలో పడిపోయాడు. దీనిని గుర్తించిన స్థానికులు ఆయన్ని ఒడ్డుకు చేర్చి సపర్యలు చేశారు. అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఇక్కట్ల సాగరం..
● బాక్స్ బద్దలు.. అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తులు తమకు కలిగే ఇబ్బందులపై అధికారులకు ఫిర్యాదు చేయడానికి పెట్టిన ఫిర్యాదుల పెట్టె ఇది. దీనిని పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేశారు. ఈ పెట్టె తలుపు విరిగిపోయి లోపలకు పోయింది. ఇందులో వేసిన ఫిర్యాదులు, సలహాలు, సూచనల పేపర్లు కింద పడిపోతున్నాయి. విశేషమేమిటంటే దీనికో తాళం వేశారు. స్పందన దేవుడెరుగు.. ముందు ఫిర్యాదు పెట్టైనెనా మార్చండని భక్తులు అంటున్నారు. –అన్నవరం ● సంగోతి తెలుసా! కడియం హైస్కూల్ సమీపంలో గోతులతో జనం నరకం చూస్తున్నారు. ఇటుగా వెళ్తున్న ఓ యువకుడు రోడ్డుపై ఉన్న గోతులను పూడ్చేందుకు తన ఇంటి వద్ద నుంచి కాంక్రీట్ను మోటారు సైకిల్పై తీసుకువచ్చి భారీ గోతులు పూడ్చడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. సదరు యువకుడిపై సోషల్ మీడియాలో ప్రశంసలు జల్లు కురిసింది. అదే సమయంలో కడియం వయా వీరవరం నుంచి దుళ్ల రోడ్డులో ప్రయాణం నరకంలా మారిందని ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తున్నాయి. –కడియం ● అపురూపం.. ఆ నాణెం ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా విడుదలైన రూ.150 వెండి నాణేన్ని అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ముంబయి టంకశాల ఈ వెండి నాణేన్ని విడుదల చేసింది. నాణెంపై ఓ వైపు ముఖ విలువ, రెండో వైపు సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రాన్ని ముద్రించారు. –అమలాపురం టౌన్ అంబాజీపేట కొబ్బరి మార్కెట్ కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 ఫ కానరాని పర్యాటక అభివృద్ధి ఫ బీచ్లో మౌలిక వసతులు కరవు ఫ సేద తీరేందుకు షెల్టర్లు లేక ఇబ్బంది సఖినేటిపల్లి: ఎగసిపడే అలలు.. కనువిందు చేసే ఇసుక తిన్నెలు.. మరోపక్క ఆధ్యాత్మిక పరవళ్లు.. ప్రకృతి సోయగం నడుమ సాగర తీరాన ఆ హాయి వర్ణనాతీతం.. అలాంటి చోట పర్యాటక అభివృద్ధి కానరాకుంది.. అంతర్వేది బీచ్కు నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు, భక్తులు వస్తుంటాయి. ఇక్కడకు జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి తరలివస్తాయి. అలాంటి చోట సౌకర్యాల కల్పనకు పర్యాటక శాఖ నిర్లక్ష్యం చూపుతోంది. అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. అందుకే ఇక్కడకు వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి కల్యాణోత్సవాల సమయంలో లక్షల్లో భక్తజనం వస్తుంది. ఈ ఆలయానికి అతి సమీపంలో ఈ బీచ్ ఉంటోంది. అందుకే ఆధ్యాత్మికంగా, ఆహ్లాదం కోసం ఇక్కడి వచ్చేవారు వేలాదిగా ఉంటారు. ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న అంతర్వేది బీచ్పై పర్యాటక శాఖ ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. పర్వదినాల్లో లక్షల్లో, సాధారణ రోజుల్లో వేలల్లో వచ్చే సందర్శకులకు తగ్గట్టు సౌకర్యాలు లేక ఇబ్బంది ఎదురవుతోంది. గూడు పోయి.. శిథిలాలు మిగిలాయి అంతర్వేది బీచ్లో గతంలో సరుగుడు తోటలకు చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన హట్లు అధికారుల ఆలనా పాలన లేక పూర్తిగా కనుమరుగయ్యాయి. తీరానికి వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం పర్యాటక శాఖ ద్వారా విడుదలైన నిధులతో 2018లో ఈ పనులు పూర్తి చేశారు. ఇందులో భాగంగా బీచ్లో దాత పెన్మెత్స సత్యనారాయణరాజు ఉచితంగా ఇచ్చిన ఇరవై సెంట్ల స్థలంలో పర్యాటక నిధులతో అప్పట్లో జమ్ముగడ్డి, తాటిపట్టెలతో కూడిన హట్స్, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హట్స్ చివికిపోయి ఆ ప్రాంతంలో తాటిపట్టెలు, దూలాలు మిగిలాయి. ఇసుకపైనే కూర్చుని.. కార్తిక మాసం, ఇతర పర్వదినాల్లో బీచ్లో సరదాగా గడపడానికి, వెంట తెచ్చుకునే భోజన పదార్థాలు తినడానికి వసతులు లేక పర్యాటకులు పడుతున్న వెతలు వర్ణనాతీతం. బీచ్లో పిల్లాపాపలతో సేద తీరేందుకు షెల్టర్లు లేక, తాగడానికి గుక్కెడు నీరు లేక వెనుతిరిగే పరిస్థితి నెలకొంది. ఇసుకపైనే కూర్చొని, అరచేతిలోనే ఆకులు పెట్టుకుని భోజనంచేసే పరిస్థితులు ఉన్నాయి. ● కనీసం నీడ లేక.. అంతర్వేది బీచ్కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేవు. పిల్లాపాపలతో వస్తున్న వారు సేద తీరేందుకు నీడ లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ప్రధానంగా షెల్టర్లు, తాగునీటి వసతి కల్పించాలి. ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అంతర్వేదికి ప్రాధాన్యం ఉంది. దానిని కాపాడే చర్యలు అవసరం. –రావి దుర్గ ఆలేంద్రమణి, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు, అంతర్వేది రక్తపింజర హతం పి.గన్నవరం: మండలంలోని ఆర్.ఏనుగుపల్లి గ్రామంలో శనివారం వరి చేలలో 10 అడుగుల రక్త పింజర హల్చల్ చేసింది. కోత కోసిన చేనులో కూలీ లు వరి పనలను కట్టలు కడుతుండగా ఈ పాము కనిపించింది. దీంతో కూలీలు భయబ్రాంతులకు గురై, పరుగులు తీశారు. ఎట్టకేలకు కూలీలు దానిని హతమార్చడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే చేనులో వరి కోతలు కోస్తుండగా ఈ పాము కనిపించిందని కూలీలు వివరించారు. ఎర్ర కంకర లోడుతో వస్తున్న లారీల ద్వారా రక్త పింజర పాములు మన ప్రాంతాలకు వస్తున్నాయని భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ జంపన గణేష్వర్మ తెలిపారు. ఈ పాము లు అత్యంత ప్రమాదకరమని, వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 0000670326-000001-Punjab National 14.00x12.00 Punjab National Bankసర్వం బుగ్గి ఫ నాలుగు పూరిళ్లు దగ్ధం ఫ రూ.20 లక్షల ఆస్తి నష్టం ప్రత్తిపాడు రూరల్: పెద్దిపాలెం గ్రామంలోని నూకాలమ్మ తల్లి గుడి వెనుక శనివారం తెల్లవారుజామున మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాళ్ల అప్పారావు ఇంట్లో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించేలోపే ఆ మంటలు రాళ్ల రాజు, రాళ్ల ఆనందరావు, నైనపు గోవింద్, అప్పలనర్సమ్మ ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా, ఒక ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి. ఇళ్లలో విలువైన గృహోపకరణలు, వంట సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. నిరుపేద కుటుంబాలు కావడంతో సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఆ కుటుంబాలను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించారు. భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా ఇళ్లపై నుంచి వెళ్తున్న సర్వీస్ వైర్లను తొలగించాలని విద్యుత్ డీఈ, ఏఈలను కోరారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఆ కుటుంబాలకు రూ.ఐదు వేల చొప్పున నగదు, బియ్యాన్ని అందజేశారు. ఎంపీపీ గోళ్ల కాంతి సుధాకర్, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు, పార్టీ మండల కన్వీనర్ రామిశెట్టి బులిరామకృష్ణ, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీను, నాయకులు మాకా చంటిబాబు, విత్తనాల నాగేశ్వరరావు, దేవర రాధాకృష్ణ, లొండ బాబు, దేవ లక్ష్మణ్, ఏనుగు జాన్ తదితరులు ఉన్నారు. అద్దె గదులు కష్టమే.. సుదూర ప్రాంతాల నుంచి అంతర్వేదికి వచ్చి ఒకటి, రెండు రోజులు గడుపుదామనుకునే వారికి వసతి గదులు అద్దెకు తీసుకోవడం కష్టమే. దేవస్థానానికి తగిన సంఖ్యలో వసతి గదులు లేకపోవడం, క్షేత్రంలో ప్రైవేట్ వసతి గదులు ఆశ్రయించడం ఆర్థికంగా భారంగా మారుతోంది. ప్రైవేటు వ్యక్తులు గది ఒక్కంటికి రోజుకు సాధారణ రోజుల్లో రూ.1,500, పర్వదినాల్లో రూ.2 వేలు డిమాండ్ చేస్తుండడం వారికి పెనుభారంగా పరిణమిస్తోంది. పర్యాటక శాఖ ఈ ఇబ్బందులు తీర్చేందుకు తగిన సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. సందర్శనీయ స్థలాలు అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం అనంతరం భక్తులు, పర్యాటకులకు ప్రముఖమైన సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. అశ్వరూడాంబికా, వశిష్ట ఆశ్రమం, సాగర సంగమం, లైట్హౌస్ సమీపంలో మడ అడవులు ఉన్నాయి. అయితే వీటి సందర్శనకు సరైన సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బీచ్, సాగర సంగమం వద్దకు అనేమంది వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రధానంగా బీచ్లో షెల్టర్లు, మౌలిక వసతులు లేక నిరుత్సాహానికి గురవుతున్నారు. ఏటా కార్తిక, మాఘ మాసాల్లో సుమారు 5 లక్షల వరకూ, సాధారణ రోజుల్లో 15 వేల మంది బీచ్ను సందర్శిస్తారు. వెనుతిరుగుతున్న పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బీచ్కు సందర్శకులు వస్తున్నారు. ఇక్కడి పరిస్థితి చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది అయితే బాబోయ్ అంటూ వెనుతిరుగుతున్నారు. వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అంతర్వేది బీచ్లో సౌకర్యాలు మెరుగుపర్చితే పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. –ఉండపల్లి వరలక్ష్మి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు, కేశవదాసుపాలెం -
అదుపుతప్పిన వ్యాన్
రాంగ్ రూట్లో వెళ్లి లారీని ఢీకొన్న వైనం గండేపల్లి: వాహన రాకపోకలతో రద్దీగా ఉండే హైవేపై ఐషర్ మినీ వ్యాన్ హడలెత్తించింది. ఒక్కసారిగా రాంగ్ రూట్లోకి వేగంగా వెళ్లి ప్రమాదానికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఐషర్ వ్యాన్ గండేపల్లికి వచ్చేసరికి డివైడర్ వద్ద రాంగ్ రూట్లోకి మారిపోయి వేగంగా ప్రయాణిస్తూ లారీని ఢీకొంది. ఈ సంఘటనలో లారీ, ఐషర్ క్యాబిన్లు ఇరుక్కుపోవడంతో హైవే క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో ఐషర్ వ్యాన్ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఎండీ హపీజ్, క్లీనర్ నిమైలను బయటకు తీయించి చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్కు బ్రేక్లు ఫెయిల్ అయినట్టు డ్రైవర్ చెబుతుండగా, డ్రైవర్ మద్యం తాగి ఉన్నాడా అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేశారు. ముందుగా ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ లారీని రోడ్డుపై నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది. రేపు బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక అంబాజీపేట: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అండర్–17 బాలుర క్రికెట్ జట్టును అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో ఆదివారం ఎంపిక చేయనున్నట్లు డీఈఓ షేక్ సలీం బాషా ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ క్రీడలో పాల్గొనే విద్యార్థులు ఉదయం 9 గంటల్లోపు స్థానిక హైస్కూల్కు చేరుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఎస్జీఎఫ్ కార్యదర్శులు కొండేపూడి ఈశ్వరరావు– 93469 20718, ఎఎస్ఎస్ రమాదేవి 94400 94984 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
యువకుడి దుర్మరణం
నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన పుల్లలపాడు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రంపల్లికి చెందిన శాయలి శివరామకృష్ణ (20) ఏలూరులో సీఆర్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. అదే కళాశాలలో చదివే స్నేహితుడి బంధువు దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన అంకెం సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గ దంపతులు ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భీమడోలు బస్టాండ్కు వచ్చేసరికి రాత్రి కావడంతో వారిని యాదవోలులో దించమని స్నేహితుడు కోరాడు. శివరామకృష్ణ తన బైక్పై భీమడోలు వచ్చి వారిద్దరినీ తీసుకు వెళుతుండగా పుల్లలపాడు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో శివరామకృష్ణ తలకు గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యం, శ్రీదుర్గలను హైవే పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై మోహనరావు తెలిపారు. -
ఫ నిమజ్జనోత్సవ వైభవం
కిర్లంపూడి మండలం చిల్లంగి గ్రామంలో భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించే గౌరీశంకరుల ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్వామి, అమ్మవార్లను గ్రామస్తులు రెండు నెలలుగా ప్రతి రోజూ భక్తిశ్రద్ధలతో పూజించారు. అనంతరం, శనివారం నిమజ్జనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో గ్రామానికి చెందిన మహిళా భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా గౌరీశంకరుల మూర్తులను బాణసంచా కాల్పులు, డప్పు వాయిద్యాల సందడి నడుమ గ్రామంలో ఊరేగించి, స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. – కిర్లంపూడి -
10 నుంచి టెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్ (టెట్) ఈ నెల 10న ప్రారంభం కానుంది. జిల్లాలోని సూరంపాలెం ఆదిత్య కళాశాలలో 3, కాకినాడ అచ్యుతాపురం, రాయుడుపాలెం కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలు ఈ నెల 21తో ముగుస్తాయి. జిల్లావ్యాప్తంగా 9,600 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్లతో పాటు ఏదో ఒక ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పకుండా తీసుకుని వెళ్లాలి. ఆన్లైన్లో జరిగే ఈ పరీక్షకు అరగంట ముందే ఆయా కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. దివ్యాంగ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనపు సమయం ఇస్తారు. ఆన్లైన్లో మాక్ టెస్ట్ దరఖాస్తుదారులకు ఆన్లైన్ పరీక్షపై అవగాహన కల్పించేందుకు గత నెల 25 నుంచి ఆన్లైన్లో మాక్ టెస్ట్ అందుబాటులో ఉంచారు. సీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ మాక్ టెస్ట్లో పాల్గొనవచ్చు. హాల్ టికెట్లను కూడా ఇదే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. టెట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు.అంబేడ్కర్ సేవలు స్ఫూర్తిదాయకం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేశానికి బాబా సాహెబ్ బీఆర్ అంబేడ్కర్ అందించిన దృఢమైన రాజ్యాంగం, ఆయన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కలెక్టర్తో పాటు పలువురు అధికారులు శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డీఎంఈ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీమ్ ఆర్కెస్ట్రా బృందం అంబేడ్కర్ జీవిత విశేషాలతో చేసిన గీతాలాపన అందరినీ అలరించింది. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. రద్దీగా సత్యదేవుని సన్నిధి అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని సన్నిధి వేలాదిగా వచ్చిన భక్తులతో శనివారం రద్దీగా మారింది. సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవార్లకు తిరుచ్చి వాహనంపై ప్రాకార సేవ నిర్వహించారు. -
ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో చంద్రబాబు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత ప్రస్ఫుటమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. జిల్లావ్యాప్తంగా సంతకాలు సేకరించడం ద్వారా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించే కార్యక్రమంపై ఏడు నియోజకవర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో కాకినాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులతో ర్యాలీలు నిర్వహించి, ఈ నెల 13న పార్టీ జిల్లా కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందజేస్తామని చెప్పారు. సమావేశం అనంతరం రాజా మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సంతకాలు చేసి, వ్యక్తం చేసిన ప్రజాభిప్రాయంపై అధికార పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. ఏవైనా అనుమానాలుంటే డిజిటలైజ్ చేసిన సంతకాలను, వారి ఫోన్ నంబర్ల ఆధారంగా పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. జిల్లాలో సేకరించిన 4 లక్షల పై చిలుకు సంతకాల పత్రాలను పార్టీ అధినేత జగన్ ద్వారా గవర్నర్కు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి 20 వేల మందికి తక్కువ కాకుండా సిద్ధం కావాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. అన్ని వర్గాలకూ వంచన పరిపాలన తీరు చూస్తూంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని రాజా అన్నారు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలనూ ప్రభుత్వం వంచిస్తోందని ధ్వజమెత్తారు. మోంథా తుపాను దెబ్బకు రైతులు అధోగతి పాలైతే ఇంతవరకూ ఒక్క పైసా కూడా పరిహారం ఇవ్వని ప్రభుత్వాన్ని ఏమనాలని ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉండగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు 33 శాతం పైబడి పంటకు నష్టం జరిగితే వారం తిరగకుండానే ఇన్పుట్ సబ్సిడీ, నష్టపరిహారం అందించిన విషయాన్ని గుర్తించాలని, వెంటనే రైతులను ఆదుకుని చంద్రబాబు ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. జగన్ హయాంలో మాదిరిగా చంద్రబాబు ప్రభుత్వం రైతులకు సాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతుల వద్దకు మంత్రులు వెళ్తూ వారి గోడు విన్నాక తాము ముఖ్యమంత్రులం కాదని చెబుతున్నారంటే పాలన ఎటువైపు పోతోందో అర్థం కావడం లేదని విమర్శించారు. మంత్రులంటేనే ప్రభుత్వమనే విషయం వారికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆక్షేపించారు. రాజకీయ స్టంట్ మెగా పీటీఎం పేరిట తల్లిదండ్రులను పిలిపించి రాజకీయ సమావేశాలు పెట్టడం, వీటిల్లో పార్టీ నేతలు కూర్చోవడం రాజకీయ స్టంట్లా కనిపించిందని రాజా విమర్శించారు. పెద్ద పెద్ద ఈవెంట్ల మాదిరిగా రూ.కోట్లు ఖర్చు చేసినట్టుగా ఈ సమావేశాలున్నాయన్నారు. ఏడాదిన్నర కాలంలో పట్టుమని ఒక క్లాస్ రూముకు రూ.వెయ్యి వెచ్చించారా అని నిలదీశారు. తొండంగి మండలం బెండపూడి జెడ్పీ హైస్కూల్లో ఆంగ్ల మాధ్యమంలో అదరగొట్టిన విద్యార్థినులను నాడు సీఎంగా జగన్ పిలిపించుకుని, వారితో కలిసి భోజనం చేసి ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఇప్పుడదే స్కూల్లో పీటీఎం సమావేశాలను రాజకీయాలకు వేదికగా చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు డి.సత్యనారాయణరాజు, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, ప్రచార విభాగం ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, యువజన విభాగం సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ఫ దీనికి అద్దం పట్టిన కోటి సంతకాల ఉద్యమం ఫ జిల్లాలో 4 లక్షల పైగా సంతకాలు ఫ అనుమానాలుంటే చెక్ చేసుకోండి ఫ అధికార పక్షానికి దాడిశెట్టి రాజా సవాల్ -
చెల్లించిన సొమ్ముకే ఇళ్లు స్వాధీనం చేయాలి
సామర్లకోట: ఇప్పటికే చెల్లించిన సొమ్ముతోనే టిడ్కో ఇళ్లు వెంటనే స్వాధీనం చేయాలని, రుణ వాయిదాలు చెల్లించలేని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉప్పువారి సత్రం, జగ్గమ్మగారిపేటలోని టిడ్కో గృహ సముదాయం వద్ద వారు శనివారం ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు తమ ఇళ్ల వద్దకు వచ్చి రుణాలు చెల్లించవద్దంటూ చెప్పారని అన్నారు. తీరా ఇప్పుడు బ్యాంకుల నుంచి నోటీసులు వస్తున్నాయని, వారం రోజుల్లో రుణ వాయిదాలు చెల్లించకపోతే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామంటూ మున్సిపల్ అధికారులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రూ.500 చెల్లించిన వారికి ఉచితంగా ఇచ్చారని, ఈ నేపథ్యంలో రూ.50 వేలు, రూ.లక్ష చెల్లించిన వారికి వెంటనే ఇళ్లు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా నిర్మించడంతో టిడ్కో ఇళ్లలో వర్షపు నీరు దిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల క్రితం లబ్ధిదారుల ఎంపిక సమయంలో జి+1 పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తామని చెప్పి, జి+3 నిర్మాణాలు చేశారని ఆరోపించారు. తమ వాటా చెల్లించిన అనేక మందికి ఇప్పటికీ ఇళ్లు స్వాధీనం చేయలేదన్నారు. అలాగే, బ్యాంకు రుణాలు మంజూరు చేసిన ఇళ్లు కూడా స్వాధీనం చేయలేదని చెప్పారు. దీనివలన లబ్ధిదారులు అప్పులకు వడ్డీలతో పాటు బయట ఇళ్ల అద్దె కూడా చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. బ్యాంకు అధికారులు 20 ఏళ్ల పాటు నెలకు రూ.4,200 నుంచి రూ.4,900 వరకూ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. 20 ఏళ్ల పాటు బ్యాంకుకు వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కూలి పని చేసుకునే వారు ఏం తినాలని ప్రశ్నించారు. ఇప్పటికే తమ సమస్యను టీడీపీ నాయకులు, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినా స్పందన లేదని అన్నారు. తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమని హెచ్చరించారు. టిడ్కో ఇళ్లు ఉచితంగా ఇస్తారనే ఆశతోనే చంద్రబాబుకు ఓట్లు వేశామని, అయితే ఆయన వలన తమకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రూ.లక్ష చెల్లించి పదేళ్లయ్యిందని, దీనికి వడ్డీగా రూ.4 లక్షల వరకూ చెల్లించామని వాపోయారు. ధర్నాకు కె.వరలక్ష్మి, దగ్గు పద్మ, దుర్గాలక్ష్మి, కందుకూరి కిరణ్కుమార్ తదితరులు నాయకత్వం వహించారు.ఫ రుణాలు చెల్లించవద్దని గతంలో టీడీపీ నాయకులే చెప్పారు ఫ ఇప్పుడు బ్యాంకులు, అధికారుల బెదిరింపు తగదు ఫ అప్పులు చెల్లించలేమని లబ్ధిదారుల ఆవేదన ఫ టిడ్కో గృహ సముదాయం వద్ద ధర్నా -
జిల్లాలో 2019 నుంచి రిజిస్ట్రేషన్ల వివరాలు
ఫ పడకేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఫ కానరాని కొనుగోలుదార్లు ఫ పెట్టుబడులు రావడం లేదని రియల్టర్ల గగ్గోలు ఫ బోల్తా కొట్టిన బాబు విజన్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు విజన్ బోల్తా కొట్టింది. గద్దెనెక్కితే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానంటూ ఎన్నికల సమయంలో బాబు చెప్పిందంతా మాటల గారడీయేనని తేలిపోతోంది. సర్కారు వారి విధానాలతో ఏ రంగం చూసినా దాదాపు తిరోగమనంలోనే పయనిస్తూండగా.. ఆ కోవలో రియల్ ఎస్టేట్ కూడా చేరిపోయింది. సాధారణంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మూడు వెంచర్లు.. ఆరు ప్లాట్లు అన్నట్టుగా జరుగుతుంటాయి. ఏడాదిన్నర క్రితం వరకూ అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ప్రోత్సాహంతో కొనుగోళ్లు, అమ్మకాలతో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడింది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంలో నడిపించిన నాటి జగన్ పాలనా కాలంలో ఇలా వెంచర్ వేస్తే.. అలా ప్లాట్లు అమ్ముడయ్యేవని రియల్టర్లు చెబుతున్నారు. ఆరేడు నెలలకే ప్లాట్లు అమ్ముకుని సొమ్ము చేసుకునే వారమని, ఏడాది తిరగకుండానే వెంచర్లపై పెట్టిన పెట్టుబడి, ఆశించిన లాభం చేతికొచ్చేదని, ఇప్పుడంతా తలకిందులైందని అంటున్నారు. జిల్లా కేంద్రం కాకినాడ నగరంతో పాటు కాకినాడ రూరల్, తుని, అన్నవరం, పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో లే అవుట్లు వేసి ప్లాట్లు విభజించి ఏడాది పైనే అవుతున్నా కొనేవారే కనిపించడం లేదని వాపోతున్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు తమ చేతికి సొమ్ము రాని పరిస్థితి సృష్టించారని, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు చెల్లించలేక నానా పాట్లూ పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు. భూముల విలువ పెంపుతో.. అనుకున్నదొకటి అయ్యినదొకటి అన్న చందంగా చంద్రబాబు సర్కారు వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతో ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల ఉన్నట్లు కనిపిస్తోందే తప్ప.. వాస్తవంగా చూస్తే ఈ రంగం చతికిలపడింది. చంద్రబాబు గద్దెనెక్కాక ఈ ఏడాది ఫిబ్రవరిలో భూముల మార్కెట్ విలువను పెంచారు. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 5 నుంచి 20 శాతం, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఏకంగా 60 శాతం వరకూ పెంచారు. దీనివలన దండిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావించగా.. ఈ నిర్ణయమే రియల్ ఎస్టేట్ రంగాన్ని దారుణంగా దెబ్బ తీసింది. భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో అడపాదడపా ప్లాట్లు కొందామనుకున్న వారు కూడా వాయిదా వేసుకుంటున్నారు. పడిపోయిన రిజిస్ట్రేషన్లు భూముల ధరలు పెరగడంతో నిర్దేశిత లక్ష్యాల మేరకు రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని ప్రభుత్వం ఆశించింది. కానీ, వాస్తవానికి రిజిస్ట్రేషన్లు మాత్రం పెద్దగా పెరిగింది లేదు. జగన్ ఐదేళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ రంగం కళకళలాడింది. జరిగిన రిజిస్ట్రేషన్లు, వచ్చిన ఆదాయమే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చివరకు కోవిడ్ సమయంలో సైతం రిజిస్ట్రేషన్లు ఆశాజనకంగానే జరిగి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ ఆదాయం గణనీయంగా పెరిగింది. గత ప్రభుత్వంలో రోజువారీగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతూండేవి. ప్రస్తుతం అవి పదుల సంఖ్యకే పరిమితమయ్యాయి. కాకినాడ రూరల్ ఏడీబీ రోడ్డు, సర్పవరం, రమణయ్యపేట, తిమ్మాపురం, పెనుమర్తి, చీడిగ, ఇంద్రపాలెం, కరప మండలం నడకుదురు, పెనుగుదురు, శంఖవరం మండలం అన్నవరం, తుని పట్టణంతో పాటు తుని రూరల్లో వెంచర్లు వేసి ఏడాది కావస్తున్నా ప్లాట్లు అమ్ముడవ్వక రియల్టర్లకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏడాదిన్నర బాబు పాలనలో రియల్ ఎస్టేట్ బోర్లా పడింది. లే అవుట్ కోసం వ్యవసాయ భూములను వ్యవసాయేతరంగా మార్చేందుకు రెవెన్యూకు దరఖాస్తు చేయడం మొదలు అడుగడుగునా ఆమ్యామ్యాలతో పెట్టుబడి తడిసి మోపెడవుతోందని గొల్లుమంటున్నారు. డ్రైన్లు, 30, 60 అడుగుల రోడ్లు వేసినా కొనేవారే లేకుండా పోయారు. ఆ ప్లాట్లు కనీసం ఏడాదిలోపు అమ్ముడైతే స్వల్ప లాభాలతోనైనా గట్టెక్కుతామని, ఇందుకు భిన్నంగా ఒక పక్క ప్లాట్ కూడా అమ్ముడవక, రూ.లక్షల్లో తెచ్చిన అప్పులకు మరోపక్క వడ్డీలు చెల్లించలేక నానా పాట్లూ పడుతున్నామని వాపోతున్నారు. బాబు ప్రభుత్వం ఈ రంగానికి కనీస ఊతమిచ్చి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఎదురయ్యేది కాదని ఈ రంగంలో స్థిరపడ్డ రియల్టర్లు అంటున్నారు. చంద్రబాబు సంపద సృష్టి మాటలు వట్టి బూటకంగా మారాయని భూముల క్రయ విక్రయదారులు ఆక్షేపిస్తున్నారు. కరపలో లే అవుట్ సంవత్సరం ఆదాయం సాధించినది సాధించిన రిజిస్ట్రేషన్లు లక్ష్యం (రూ.కోట్లు) (రూ.కోట్లు) లక్ష్యం (శాతం) 2019–20 284.17 203.78 71.71 70,802 2020–21 266.93 222.07 83.19 68,736 2021–22 332.78 351.10 105.50 1,12,808 2022–23 460.16 363.42 78.98 72,898 2023–24 544.27 382.05 70.19 94,384 2024–25 615.39 386.54 62.81 91,243 అంతకు ముందు ఐదేళ్లతో పోలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ లక్ష్య సాధన నమోదైంది. అలాగే, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ ఆదాయం లక్ష్యం రూ.355.71 కోట్లు కాగా, రూ.299.68 కోట్లు మాత్రమే సమకూరింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉండగా ఇంతవరకూ 57,299 దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరగడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చంద్రబాబు ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువ పెంచిందిలా (చదరపు గజానికి రూ.లలో) గ్రామం పాత ధర పెరుగుదల పనసపాడు 7,000 9,000 తిమ్మాపురం 6,000 8,000 నేమాం 6,000 8,000 పండూరు 4,000 6,000 వాకలపూడి 9,000 12,000 వలసపాకల 9,000 15,000 కట్టమూరు 11,000 18,000 ఆనూరు 1,200 1,800 నాయకంపల్లి 1,100 1,600రియల్ ఎస్టేట్ దిగజారింది రియల్ ఎస్టేట్ వ్యాపారం దిగజారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమ్మకాలు, కొనుగోళ్లు చాలా వరకూ తగ్గిపోయాయి. రియల్ ఎస్టేట్ పుంజుకునే విధానాలను ప్రభుత్వం చేపట్టడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మనుగడే కష్టం. ఈ రంగంపై ఆధారపడి చాలా మంది జీవనోపాధి పొందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో లే అవుట్లపై కూడా బాబు ప్రభుత్వం 18 నెలల కాలంలో నోటీసులిచ్చి ఇబ్బందులకు గురి చేస్తోంది. అమ్మకాలు జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. – కొప్పిశెట్టి గణేష్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాకినాడ రూరల్ -
‘తల్లికి వందనం’ ఎక్కడయ్యా?
కరప: నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. అంటూ పిల్లలు ఎంత మంది ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం వర్తింపజేసి ఒక్కొక్కరికి రూ.15 వేల వంతున ఇస్తామన్న చంద్రబాబు ఎన్నికల హామీ నెరవేరలేదంటూ ఓ తల్లి మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం)లో ఏకరువు పెట్టింది. కాకినాడ జిల్లా కరపలోని నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన పీటీఎం సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా కరప నక్కావారి ఎస్సీ వీధికి చెందిన కుడిపూడి శాంతి మాట్లాడుతూ.. తనకు ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు పుట్టారని, వారు ప్రస్తుతం కరప హైసూ్కలులో 8వ తరగతి చదువుతున్నారని, తల్లికి వందనం పథకంలో వారికి రూ.60 వేలు రావాల్సి ఉండగా, ఒక్కరికి కూడా రాలేదన్నారు. ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదని వాపోయారు. దీనిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే నానాజీ చెప్పుకొచ్చారు. -
ర్యాంకు మెరుగుపడాలి
అన్నవరం: సత్యదేవుని భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ రాష్ట్ర స్థాయిలో ర్యాంకును మెరుగు పరచుకోవాలని అన్నవరం దేవస్థానం సిబ్బందికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆయన సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. అనంతరం, దేవస్థానం అధికారులతో మాట్లాడుతూ, అన్నదానం హాలు వద్ద అదనంగా మరో షెడ్డు వేయాలని సూచించారు. పలు కీలక ప్రదేశాల్లో 30 టాయిలెట్లు నిర్మించాలన్నారు. దేవస్థానంలో ప్రసాద్ స్కీం నిర్మాణాలను పది నెలల్లో పూర్తి చేస్తామని ఆ విభాగం అధికారులు కలెక్టర్ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ప్రసాద్ స్కీములో పొందు పరచిన బ్యాటరీ కార్లను వెంటనే నడపాలని ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సీఎస్ ఆదేశాలతో.. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో సేవలపై నవంబర్ నెలలో ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో 67.8 శాతంతో అన్నవరం దేవస్థానం ఆరో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అన్ని దేవస్థానాల ఈఓలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మంగళవారం విజయవాడలో సమీక్షించారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ షణ్మోహన్ అన్నవరం దేవస్థానం ఈఓ, ఇతర అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం, కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తారనే సమాచారం అందడంతో శుక్రవారం ఉదయం నుంచీ దేవస్థానంలోని వివిధ విభాగాల సిబ్బంది ఫైల్స్ సిద్ధం చేసుకుని ఎదురు చూశారు. గత ఏప్రిల్లో అన్నవరం దేవస్థానానికి ఏడో ర్యాంకు వచ్చినపుడు కలెక్టర్ దేవస్థానానికి వచ్చి, అన్ని విభాగాలూ పరిశీలించి సిబ్బందికి ఆదేశాలిచ్చారు. ఇప్పుడు కూడా అలాగే చేస్తారని భావించగా, ఆయన సాయంత్రం వచ్చి, అరగంటలోనే వెళ్లిపోయారు. దీంతో, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో పలువురికి చోటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లా నుంచి పలువురికి అవకాశం కల్పించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సాపిరెడ్డి చంద్రరావు (తుని నియోజకవర్గం), జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా కుచిమంచి సూర్యప్రకాశరావు (ప్రత్తిపాడు), వైఎస్సార్ టీఎఫ్ జగ్గంపేట, పెద్దాపురం, తుని నియోజకవర్గాల అధ్యక్షులుగా వేమన లక్ష్మణస్వామి, మద్దిరాల శివనాగ కృష్ణ, చింతల దొరబాబులను నియమించారు. అన్నదాన పథకానికి రూ.లక్ష సామర్లకోట: కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి గెడ్డమనుగు లలిత ప్రసాద్, బాలసత్యశివశ్రీ, కాంటూరి శ్యామలరావు శుక్రవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. లక్ష్యాలు చేరుకోవాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా వార్షిక రుణ ప్రణాళిక కింద వివిధ రంగాలకు నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంక్ అధికారులు విధిగా చేరుకోవాలని డీఆర్ఓ జె.వెంకట్రావు కోరారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం కలెక్టరేట్ వివేకానంద హాలులో శుక్రవారం జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మాసాంతానికి వివిధ రంగాలకు, ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు రుణాల కల్పనపై సమీక్షించారు. రానున్న మూడు నెలల్లో అమలు చేయాల్సిన ప్రణాళికలపై చర్చించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో ఇప్పటి వరకూ 6,276 దరఖాస్తులు రాగా, వీటిలో 2,764 దరఖాస్తులకు రూ.23.41 కోట్ల రుణాలందించామని డీఆర్ఓ తెలిపారు. సమావేశంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ బీజీఆర్ నాయుడు, ఆర్బీఐ ఎల్డీఓ ఎ.రామకృష్ణ, నాబార్డ్ డీడీఎం వై.సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు.·˘ ¿ýæMýS$¢ÌSMýS$ Ððl$Æý‡$OVðS¯]l õÜÐ]lÌS…¨…^éÍ ·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l… సిబ్బందికి కలెక్టర్ సూచన -
రెట్టింపు పరిహారం ఇవ్వాలి
భారత్మాల రోడ్డుకు మా వద్ద 2.5 ఎకరాలు సేకరించారు. అలాగే, మా కుటుంబ సభ్యుల నుంచి రెండెకరాలు తీసుకున్నారు. వాళ్ల భూమి ఆరెంపూడి ఉండటంతో వారికి ఎకరానికి రూ.కోటి చొప్పున 2023లోనే చెల్లించారు. మా భూమి అన్నవరం గ్రామ పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. వాస్తవానికి ఇద్దరి భూములూ పక్కపక్కనే ఉన్నాయి. రికార్డుల్లో సర్వే నంబర్లు, గ్రామాలు మారాయని.. అందువలన ఎన్హెచ్ఏఐ అధికారులు కొర్రీ వేశారని చెబుతున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు గతంలో వినతిపత్రం ఇచ్చాం. అన్నవరం దేవస్థానానికి శుక్రవారం సాయంత్రం వచ్చిన సందర్భంగా కూడా కలెక్టర్కు మరోసారి వినతిపత్రం ఇచ్చాం. 2023లో పరిహారం అందుకున్న ఆరెంపూడి రైతులు ఆ మొత్తాలతో వేరేచోట భూములు కొనుక్కున్నారు. వాటి ధరలు ఇప్పుడు రెట్టింపయ్యాయి. అందువలన మాకు ఆరెంపూడి రైతులకు ఇచ్చిన దాని కన్నా రెట్టింపు పరిహారం ఇవ్వాలి. అలా ఇచ్చాకే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలి. – బండారు ముత్యాలరావు, రైతు -
ఫ ‘యమ’ డేంజర్
జిల్లాలోనే కీలకమైన రహదార్లలో ఒకటి కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డు. ఎగసి పడుతున్న కడలి అలలకు, వరుస తుపాన్లకు సాగర కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతూండటంతో ఈ రహదారి తరచుగా దెబ్బ తింటోంది. ప్రస్తుతం ఎటువంటి తుపాను ప్రభావమూ లేనప్పటికీ కడలి అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. దీంతో, ఈ రోడ్డు దారుణంగా కోతకు గురవుతూ, తీవ్రంగా ధ్వంసమవుతోంది. ఉప్పాడ శివారు ఎస్సీజీఎల్ సమీపాన బీచ్ రోడ్డు ఒకవైపు పూర్తిగా కోతకు గురవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ రహదారి మరమ్మతులపై దృష్టి సారించాలని కోరుతున్నారు. – కొత్తపల్లి ఒకవైపు పూర్తిగా కోతకు గురైన బీచ్ రోడ్డుప్రమాదకరంగా మారిన ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు -
పరిహారమేదీ?
అన్నవరం: కాకినాడ సమీపంలోని వాకలపూడి నుంచి అన్నవరం వరకూ సుమారు 41 కిలోమీటర్ల పొడవున కేంద్ర ప్రభుత్వ భారత్మాల రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికోసం పిలిచిన టెండర్లను త్వరలోనే ఖరారు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. అయితే, తమకు పరిహారం చెల్లించకుండానే జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) రోడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేసే ప్రయత్నంలో ఉండటంపై అన్నవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూములిచ్చిన తమకు పరిహారం విషయం తేల్చకుండా పనులు ప్రారంభిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. రూ.1,040 కోట్లతో.. సాగరతీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధి కోసం 40.621 కిలోమీటర్ల పొడవున ఎన్హెచ్–516ఎఫ్ పేరిట నాలుగు వరుసల్లో భారత్మాల పరియోజన ఫేజ్–1 రహదారి నిర్మించాలని 2020లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.1,040 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. ఎన్హెచ్ఏఐ 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి రద్దు చేసింది. తిరిగి గత జూలైలో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది. అప్పట్లో అరవిందో రియాల్టీ కంపెనీ టెండర్ లోయెస్ట్గా వచ్చింది. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో ఆ టెండర్ను రద్దు చేసి, తిరిగి గత ఆగస్టులో మళ్లీ టెండర్ పిలిచారు. మొత్తం 9 సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. వాటి సాంకేతిక అర్హతలు పరిశీలిస్తున్నారు. అనంతరం, అత్యంత తక్కువకు కోట్ చేసిన సంస్థను ఎంపిక చేసి, రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ అప్పగిస్తారు. ఆది నుంచీ వివాదం వాకలపూడి లైట్ హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా అన్నవరం వరకూ భారత్మాల రోడ్డు నిర్మించనున్నారు. దీని కోసం 2021లో అన్నవరం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం, ఆరెంపూడి గ్రామాల పరిధిలో 40 ఎకరాల భూమి సేకరించారు. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి. మిగిలిన 20 ఎకరాలు ఈ రెండు గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులకు చెందినది. రాజమహేంద్రవరం – విశాఖపట్నం మధ్య 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని సత్యదేవుని పాత నమూనా ఆలయ సమీపాన 20 ఎకరాల సేకరణపై అప్పట్లోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకున్న భూమే తక్కువని, అది కూడా రోడ్డుకు తీసేసుకుంటే తామెలా బతకాలని ఆవేదన చెందారు. వారికి ఎస్.. వీరికి నో.. ఆరెంపూడి గ్రామ పరిధిలో సర్వే నంబర్లు 177, 105, 108లలోని 20 మంది రైతుల నుంచి సుమారు 10 ఎకరాలు సేకరించారు. దీనికి గాను ఎకరాకు రూ.కోటి చొప్పున ఎన్హెచ్ఏఐ చెల్లించింది. అదే ప్రాంతంలో అన్నవరం గ్రామ పరిధిలో సర్వే నంబర్ 91–1లో మరో 20 మంది రైతుల నుంచి ఇంకో 10 ఎకరాలు సేకరించారు. వారికి మాత్రం ఇప్పటి వరకూ పరిహారం చెల్లించలేదు. గ్రామం పేరు, సర్వే నంబర్లు మారడంతో ఎన్హెచ్ఏఐ అధికారుల కొర్రీలు వేసినట్లు సమాచారం. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వాస్తవానికి అన్నవరంలో హైవేను ఆనుకుని ఎకరం భూమి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. తమకు పరిహారం ఇవ్వకుండా ఇప్పుడు రోడ్డు నిర్మాణానికి టెండర్ ఖరారు చేస్తూండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. · ¿êÆý‡™ŒæÐ]l*ÌS Æøyýl$z ˘ నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు ఫ త్వరలో టెండర్ ఖరారు! ఫ 2 గ్రామాల్లో 20 ఎకరాల సేకరణ ఫ ఆరెంపూడి రైతులకు చెల్లింపు ఫ అన్నవరంలో భూములిచ్చిన వారికి అందని పరిహారం ఫ రెండేళ్లుగా కానరాని పరిష్కారం అక్కడ సర్కులర్ ఫ్లై ఓవర్ వాకలపూడి – అన్నవరం భారత్మాల రోడ్డు అన్నవరం వద్ద సత్యదేవుని నమూనా ఆలయ సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారితో కలుస్తుంది. అక్కడ కత్తిపూడి హైవే సర్కిల్ మాదిరిగా అతి పెద్ద సర్కులర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఆ సర్కిల్ నుంచి చూస్తే రత్నగిరిపై సత్యదేవుని ఆలయం కనిపిస్తుంది. అందువలన ప్రయాణికులు ఆగేందుకు వీలుగా కూడా ఈ నిర్మాణం జరుగుతుందని చెబుతున్నారు. -
పీటీఏం వెలవెల
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ (పీటీఏం) 3.0కు జిల్లాలో స్పందన కరువైంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ విద్యా శాఖ, సమగ్రశిక్ష అధికారులు వారం రోజులుగా తీవ్ర స్థాయిలో కసరత్తు చేశారు. డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్ఎంలపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇంత చేసినా తల్లిదండ్రుల నుంచి స్పందన పెద్దగా రాకపోవడంతో చాలాచోట్ల ఈ కార్యక్రమం వెలవెలబోయింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కూలీలు వరి కోతలు, పనులు మానుకుని వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. స్థానిక ఎమ్మెల్యేలు విధిగా పాల్గొనాలని విద్యా శాఖ మంత్రి లోకేష్ ఆదేశించారు. అయినప్పటికీ కాకినాడ రూరల్, జగ్గంపేట, తుని, ప్రత్తిపాడుల్లో మాత్రమే ఆయా ఎమ్మెల్యేలు ఒక్కో పాఠశాలలో పాల్గొన్నారు. మిగతా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. విద్యార్థుల అభివృద్ధి, పురోగతిపై చర్చ కంటే కూడా కార్యక్రమం నిర్వహించామా.. ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేశామా.. పనైపోయిందా.. అన్నట్టుగానే ఈ సమావేశాలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 1,280 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ తెలిపారు. తొలుత తరగతుల వారీగా ఉపాధ్యాయులు తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించారన్నారు. కాకినాడ పేర్రాజుపేట మున్సిపల్ పాఠశాల, ఇంద్రపాలెం జెడ్పీ హైస్కూల్లో జరిగిన సమావేశాల్లో కలెక్టర్ షణ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యాన్ని వివరించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్, ఎస్పీ బిందుమాధవ్లు ఏపీఎస్పీ, శ్రీనగర్ మున్సిపల్ పాఠఽశాలల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అసంతృప్తి.. ఆగ్రహం ఫ ప్రభుత్వ ప్రచారం కోసం తప్ప ఈ సమావేశాలు విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని తల్లిదండ్రులు నిట్టూర్చారు. ఫ కాకినాడ రూరల్ కరపలో తనకు నలుగురు పిల్లలుండగా ఒక్కరికి కూడా తల్లికి వందనం వేయలేదంటూ కుడుపూడి శాంతి అనే మహిళ ఎమ్మెల్యే పంతం నానాజీని నిలదీశారు. ఫ ‘నాడు–నేడు’ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినా కనీసం పట్టించుకోవడం లేదని కొన్నిచోట్ల మండిపడ్డారు. ఫ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ చైర్మన్లు ఆయా మండలాల్లోని పాఠశాలల్లో మెగా పీటీఎంలకు హాజరయ్యారు. దీంతో, పాఠశాలలో కుల రాజకీ యాలు ఏమిటంటూ విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫ మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం చాలీచాలని నిధులు కేటాయించడంతో అవి చాలక తమ జేబు నుంచి పెట్టుకోవాల్సి వచ్చిందని పలువురు హెచ్ఎంలు వాపోయారు. ఫ గ్రామీణ ప్రాంతాల్లో ఆసక్తి చూపని తల్లిదండ్రులు ఫ మొక్కుబడిగా నిర్వహణ -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి రద్దీగా మారింది. స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఆలయాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరచి పూజలు చేసి, వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. అప్పటి నుంచే స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని సుమారు 30 వేల మంది దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి, శంకరులు ఎటువంటి వస్త్రాలంకరణ, కిరీటాలు, ఆభరణాలు లేకుండా నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్మ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ చండీ హోమం నిర్వహించనున్నారు. భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. -
నియోజకవర్గాల్లో నిర్వహించారిలా..
ఎవ్వరూ రాలేదు రైతన్నా మీకోసం కార్యక్రమం అని ఒక రోజు హడావుడి చేసి వెళ్లిపోయారు. చాలా మంది రైతులను కలవలేదు. ఆ కార్యక్రమం ఏమిటో, ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదు. ఏ అధికారీ నన్ను కలవలేదు. ఏమీ చెప్పలేదు. దానివల్ల ఉపయోగమేమిటో తెలియడం లేదు. – సోడగం సూరిబాబు, రైతు, అరట్లకట్ట మా కోసం ఏం చేశారని? నేను ఐదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. ఖరీఫ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల దిగుబడి పూర్తిగా పడిపోయింది. పండిన ధాన్యం కొనే వారు లేక దళారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. తీవ్రంగా నష్టపోయాం. రైతన్నా మీకోసం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాకు తెలియనే తెలియదు. అయినా మాకు ఏం చేశారని వస్తారు? ముందు మా సమస్యలు పరిష్కరిస్తే చాలు. – వీరంరెడ్డి అర్జునరావు, రైతు, రాపర్తి, పిఠాపురం మండలం సాక్షి ప్రతినిధి, కాకినాడ: చేతికంది వస్తున్న పంట నోటికందుతుందనుకుంటుని ఆశ పడుతున్న తరుణంలో.. అధిక వర్షాలు.. ఆపై మోంథా తుపాను బీభత్సం.. తీవ్ర పంట నష్టాలు.. తడిసిన ధాన్యం.. కొనుగోళ్లకు సవాలక్ష నిబంధనలు.. గత్యంతరం లేక దళారులకే అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్న దుస్థితి.. తాజాగా దిత్వా తుపాను.. నయాపైసా కూడా అందని పరిహారం.. ఉచిత పంటల బీమా ఎత్తివేత.. ఇతర పంటలకూ గిట్టుబాటు ధరలు లేకపోవడం.. ఇలా అన్నదాతలు పుట్టెడు కష్టాల్లో ఉన్న తరుణంలో.. ‘రైతన్నా మీకోసం’ పేరిట సర్కారు వారు చేపట్టిన కార్యక్రమం జిల్లాలో తూతూమంత్రంగా ముగిసిపోయింది. సమస్యలపై రైతులు ఎక్కడ తమను నిలదీస్తారోననే భయంతో కూటమి ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో మొక్కుబడిగానే పాల్గొన్నారు. దీంతో, వారం రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమం సీఎం చంద్రబాబు సందేశ పత్రాలు రైతులకు ఇచ్చేందుకు మాత్రమే పరిమితమైంది. రైతుల సమస్యలు విన్న, పరిష్కరించిన దాఖలాలు లేకుండా పోయాయి. లక్ష్యానికి దూరమై.. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, మద్దతు ధర తదితర అంశాలను ఆయా రైతు సేవా కేంద్రాల పరిధిలోని ప్రతి రైతు ఇంటికీ వెళ్లి సిబ్బంది, ప్రజాప్రతినిధులు వివరించాలన్నది ఈ కార్యక్రమ లక్ష్యం. సాగులో యాంత్రీకరణ, పంట మార్పిడితో మేలు, ఎరువుల అధిక వినియోగంతో అనర్థాలు తదితర సూచనలు, సలహాలు అందజేయాలి. రైతు సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. కానీ, ఈ కార్యక్రమం ఆచరణలోకి వచ్చేసరికి ఇవన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. అన్నదాతల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఫొటోలకు పోజులిచ్చి మొక్కుబడి తంతుగా నడిపించేశారు. రైతుల నుంచి స్పందన లేకపోవడంతో కాకినాడ రూరల్, జగ్గంపేట, తుని, పెద్దాపురం నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లతోనే ఈ కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది. రైతుకు అడుగడుగునా వంచన ఫ అన్నదాత సుఖీభవ కింద కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు అండ్ కో ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. మొదటి ఏడాది సాయానికి ఎగనామం పెట్టారు. రెండో ఏడాది కొంతమందికే అరకొరగా సాయం అందించి, చేతులు దులుపుకున్నారు. కౌలు రైతులనైతే పూర్తిగా గాలికొదిలేశారు. ఫ రైతుల మేలు కోరి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, ప్రీమియం భారాన్ని రైతులపై మోపింది. దీంతో, జిల్లాలోని 1,42,302 ఎకరాలకు చెందిన రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. ఫ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల బాధలు రైతులను వెంటాడుతున్నాయి. మరోవైపు కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో గోనె సంచుల కొరత వేధిస్తోంది. ధాన్యం అమ్మిన 24 గంటల్లోపే సొమ్ము చెల్లిస్తామని చెప్పి గత సీజన్ చివరలో దాదాపు నెలన్నర రోజులు జాప్యం చేశారు. ఈసారి ఖరీఫ్లో రైతుకు కనీస మద్దతు ధర ఏమాత్రం దక్కడం లేదు. వివిధ కారణాలతో ప్రతి బస్తాపై రూ.300కు తక్కువ కాకుండా దళారులు కోత పెడుతున్నారు. ఫ విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకూ రైతుకు అన్ని విధాలా అండగా నిలిచేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి పేరును కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. వీటిలో కొన్నింటిని ఇతర కార్యాలయాలకు వినియోగిస్తున్నారు. మరికొన్ని తాళం వేసి కనిపిస్తున్నాయి. దీంతో, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఫ ఏలేరు వరదతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పంటలన్నీ నీట మునిగిపోయాయి. 36 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే అరకొరగా కొందరికే సాయం అందించి, చేతులు దులుపేసుకున్నారు. ఏలేరుకు గండి పడి సుమారు 500 ఎకరాల్లో ఇసుక మేటలు వేయడంతో ఎకరాకు రూ.15 వేల సాయమన్నారు. కానీ, ఏ ఒక్కరికీ సాయం అందించిన దాఖలాలు లేవు. ఫ పంపా, పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ) పరిధిలోని రైతులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ, రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఈ సమస్యలను ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఫ ఇటీవలి మోంథా తుపానుతో జిల్లాలో 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంతవరకూ రైతుకు పైసా సాయం అందించలేదు. ఫ తమ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి, ప్రచారార్భాటానికి ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు.04పీటీపీ02: వీరంరెడ్డి అర్జునరావు ·˘ hÌêÏ ÐéÅç³¢…V> పుట్టెడు కష్టాల్లో కర్షకులు ·˘ "Ððl*…£é' ç³ÇàÆý‡… FõÜ Ìôæ§ýl$ ·˘ A…§ýlÇMîS A…§ýl° "A¯]l²§é™èl çÜ$T¿ýæÐ]l' ·˘ E_™èl ½Ð]l*MýS$ Ð]l$…VýSâýæ… ·˘ §ýlâêÆý‡$ÌS VýS$ò³µsZÏ «§é¯]lÅ… Mö¯]l$Vøâ¶æ$Ï ·˘ ÒsìæOò³ {ç³Õ²Ýë¢Æý‡¯ól B…§øâýæ¯]l™ø OÆð‡™èl$ÌS CâýæÏMýS$ ÐðlâýæÏ° MýS*rÑ$ ¯ól™èlË$ ·˘ Ððl¬MýS$PºyìlV> "OÆð‡™èl¯é² Ò$MøçÜ…' ఫ తుని ఎమ్మెల్యే యనమల దివ్య రైతులు తక్కువగా ఉన్న పైడికొండ పంచాయతీ ఆనూరులో ఈ కార్యక్రమంలో పాల్గొని మమ అనిపించారు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా వరి, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు తొండంగి మండలంలో ఉన్నారు. కొద్దిపాటి వర్షానికే పంపా రిజర్వాయర్ నిండిపోయి, మిగులు జలాలను విడుదల చేస్తున్న సందర్భంలో తొండంగి మండలం గోపాలపట్నం, ఎ.కొత్తపల్లి, పి.అగ్రహారం, కృష్ణాపురం, దానవాయిపేట, జీఎంపేట, వేమవరం, పైడికొండల్లో వందలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి. వరుస తుపాన్లతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. దీనికి తోడు ఖరీఫ్ ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ సమస్యలపై రైతులు ప్రశ్నిస్తారనే భయంతో ఎమ్మెల్యే దివ్య ఆనూరును ఎంచుకుని, ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఫ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గోకవరం, కిర్లంపూడి, గండేపల్లి మండలాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కేవలం జగ్గంపేట మండలానికే పరిమితమయ్యారు. ఈ మండలంలో 217 మంది, గోకవరంలో 345, కిర్లంపూడి మండలంలో 80, గండేపల్లి మండలంలో 216 మంది రైతులు తమకు అన్నదాత సుఖీభవ జమ కాకపోవడంపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే, పంట నష్టం పరిహారం, ఉచిత పంటల బీమా, కౌలు రైతులకూ ‘అన్నదాత సుఖీభవ’ అమలు గురించి పలు సమావేశాల్లో డిమాండ్ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని మాత్రమే చెప్పి, అధికారులు కూడా అక్కడి నుంచి బయటపడ్డారు. -
సముద్రంలోకి కెమికల్ వ్యర్థాలు
కాకినాడ రూరల్: ఫార్మా, ఇతర పరిశ్రమల్లోని కెమికల్ వ్యర్థాలను గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ సముద్రంలో కలపడాన్ని గుర్తించిన మత్స్యకారులు ఆందోళనకు దిగడంతో గురువారం ఉద్రిక్తత నెలకొంది. వాకలపూడి వద్ద బీచ్ రోడ్డును ఆనుకుని రొయ్యల ఫీడింగ్ కోసం నిర్వహించే ఒక షెడ్ ప్రస్తుతం మూతపడడంతో దానిని తమకు అనుకూలంగా మార్చుకుని పక్కనే ఉన్న కాల్వలోకి ట్యాంకర్లతో తీసుకువచ్చిన వ్యర్థాలను వదులుతున్నారు. షెడ్కు చుట్టూ ప్రహరీ, పెద్ద గేట్లు ఉండటంతో లోపల ఏం జరుగుతోందో బయటి వారికి తెలియని పరిస్థితి. ఏపీఐఐసీ ఏరియా నుంచి వచ్చే ఆయిల్ వ్యర్థాలతో కాల్వ నీరు నలుపు రంగులోకి మారిందని అందరూ భావిస్తారు. ఇదే అదునుగా కొన్ని నెలలుగా ఇతర ప్రాంతాల నుంచి కెమికల్ వ్యర్థాలతో కూడిన ట్యాంకర్లు షెడ్ లోపలికి వెళ్లి అక్కడ కాల్వ పక్కనే ప్రహరీకి అమర్చిన పైపు ద్వారా వ్యర్థాలను కాల్వలోకి వదులుతున్నారు. బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో ట్యాంకర్ షెడ్లోకి వెళ్లడం గమనించిన ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులు వాచ్మన్ను నిలదీసి లోపలికి వెళ్లి పరిశీలించగా కాలువలోకి కెమికల్ వ్యర్థాలు విడిచిపెట్టడాన్ని గుర్తించారు. వెంటనే నిర్వాహకుడిని ఫోన్లో నిలదీయగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అక్కడే రాత్రంతా కాపలా ఉండి, సూర్యారావుపేట, వాకలపూడి, షిషింగ్ హార్బర్పేట మత్స్యకారులు గురువారం బీచ్ రోడ్డుకు అడ్డంగా బైక్లు ఉంచి, బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సర్పవరం సీఐ పెద్దిరాజు, పోలీసులు అక్కడకు చేరుకుని వారితో మాట్లాడారు. సీఐ నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. విషయం తెలుసుకున్న మత్స్యశాఖ ఏడీ కరుణాకర్, ఏడీ గోపి, తహసీల్దార్ కుమారి, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు అక్కడకు చేరుకున్నారు. కాలువ ద్వారా సముద్రంలోకి విడిచిపెట్టిన ట్యాంకర్లోని వ్యర్థాల శాంపిల్స్ సేకరించారు. లారీని సర్పవరం పోలీసు స్టేషన్కు తరలించారు. కలెక్టర్కు నివేదిస్తామని, పీసీబీ అధికారులు శాంపిల్స్ పరీక్షించిన అనంతరం అందులోని రసాయనాలేమిటో వెల్లడవుతాయని తెలిపారు. ఈ వ్యవహారం కొన్ని నెలలుగా సాగుతున్నట్లు తమకు అనుమానాలున్నాయని, దీనిపై రాత్రి రెక్కీ నిర్వహించడంతో గుర్తించగలిగామని మత్స్యకారుడు పాలెపు శివకిషోర్ తెలిపారు. అనంతరం కాకినాడ రూరల్ మండల షరిషత్ కార్యాలయం వద్ద ఉన్న కలెక్టర్ షణ్మోహన్ను మత్స్యకారులు కలిసి సముద్రంలో కెమికల్ వ్యర్థాలు కలపడం వలన చేపలు చనిపోయి, తమ జీవనోపాధి దెబ్బ తింటోందని, ఇందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. లారీని సీజ్ చేశామని, యజమానిపై కేసు నమోదు చేశామని సీఐ పెద్దిరాజు తెలిపారు. షెడ్ నిర్వాహకుడు, ట్యాంకర్లో కెమికల్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారో వారిపై కేసులు పెడతామని సీఐ తెలిపారు. ·˘ M>MìS¯éyýl ½^ŒæÌZ VýS$r$tV> Ð]lÅÐ]làÆý‡… ·˘ Ð]l$™èlÞÅM>Æý‡$Ë B…§øâ¶æ¯]l ·˘ Ô>…í³ÌŒæÞ õÜMýSÇ…_¯]l M>Ë$çÙÅ °Ä¶æ$…{™èl׿ Ð]l$…yýlÍ A«¨M>Æý‡$Ë$ -
అరకొర నిధులతో ఎలా?
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (పీటీఎం) 3.0 పండగలా నిర్వహించాలంటూ ఏపీ విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ సమావేశాలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. పాఠశాల ప్రగతిని చాటి చెప్పాలి. ప్రతి విద్యార్థి ప్రగతిని వారి తల్లిదండ్రులకు తెలియజేయాలి. అయితే, అరకొర నిధులు మాత్రమే ఇచ్చి, ఈ కార్యక్రమాన్ని పండగలా చేయాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు. విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా నిధులు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ పేర్కొంది. ఉదాహరణకు 30 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో వారి తల్లిదండ్రులను, స్థానిక ప్రజాప్రతినిధులను పిలిచి, రూ.900తో భారీగా సమావేశం నిర్వహించి పండగలా జరపాలని పేర్కొంటోంది. జిల్లాలోని 1,280 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సుమారు 1.30 లక్షల మంది ఒకటి నుంచి పదో తరగతి వరకూ చదువుతున్నారు. పీటీఎం నిర్వహణకు గాను జిల్లాలోని మొత్తం పాఠశాలలకు ప్రభుత్వం రూ.33,44,150 కేటాయించింది. ప్రస్తుత ధరల ప్రకారం ఈ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన నిధులు ఏమాత్రం చాలవని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మెగా పీటీఎం సమావేశాలకు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని డీఈఓ పిల్లి రమేష్ ఆదేశించారు.ఫ నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎం ఫ 1,280 స్కూళ్లకు రూ.30 లక్షలు మాత్రమే కేటాయింపు ఫ పండగలా చేయాలన్న సర్కారు ఆదేశాలపై ఉపాధ్యాయుల ఆగ్రహం పాఠశాలల వారీగా నిధుల మంజూరువిద్యార్థుల స్కూల్స్ యూనిట్ నిధులు సంఖ్య కాస్ట్ (రూ.) 0–30 541 900 4,86,900 31–100 392 2,250 8,82,000 101–250 169 4,500 7,60,500 251–1,000 173 6,750 11,67,750 వెయ్యికి పైగా 5 9,000 45,000 మెగా పీటీఎంతో ఇబ్బందులు మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఏమాత్రం సరిపోవు. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలకు చాలా ఇబ్బందులున్నాయి. దీనికి తోడు ఈ సమావేశం తేదీని హడావుడిగా ప్రకటించారు. అలాగే ఆరో తేదీ నుంచి పదో తరగతి విద్యార్థుల వంద రోజుల షెడ్యూలు ప్రకటించారు. ఇవన్నీ ఉపాధ్యాయులకు తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నాయి. – చింతాడ ప్రదీప్ కుమార్. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు -
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని గురువారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించి, నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. 40 మంది భక్తులు రూ.750 టికెట్టుతో ఈ హోమంలో పాల్గొన్నారు. వెయిట్ లిఫ్టింగ్లో ద్వితీయం తుని రూరల్: ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మండలంలోని హెచ్.కొత్తూరుకు చెందిన ములికి సత్యవతి అండర్–14 విభాగంలో ద్వితీయ స్థానం సాధించింది. కేరళలోని త్రిసూర్లో ఆస్మిత వెయిట్ లిఫ్టింగ్ (ఖేలో ఇండియా) పోటీలు ఈ నెల 1 నుంచి 5 వరకూ జరుగుతున్నాయి. రాష్ట్రం నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న సత్యవతి ఈ ఘనత సాధించినట్టు తండ్రి సూరిబాబు తెలిపారు. ఆమెకు ప్రశంసా పత్రం, మెడల్తో పాటు రూ.8 వేల నగదు బహుమతి లభించింది. సత్యవతి ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలోని వైఎస్సార్ క్రీడా అకాడమీలో సత్యవతి ప్రస్తుతం పదో తరగతి చదువుతూ శిక్షణ పొందుతోంది. 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి, ప్రతిభ చూపిన బాలిబాలికలను వైఎస్సార్ క్రీడా అకాడమీకి ఎంపిక చేశారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి నాలుగో తరగతి చదువుతున్న సత్యవతి ఒక్కరే ఎంపికై ంది. అప్పటి నుంచీ అక్కడే చదువుకుంటూ క్రీడల్లో తర్ఫీదు పొందుతోంది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బంగారు, రజత పతకాలు సాధించిన సత్యవతి ఖేలో ఇండియా వెయిట్ లిఫ్టింగ్లో ద్వితీయ స్థానం సాధించడంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు డిజిటల్ ప్రోగ్రెస్ కార్డులు గురజనాపల్లి ఉపాధ్యాయుని వినూత్న ఆవిష్కరణ కరప: గురజనాపల్లిలోని పబ్బినీడి పాపారావు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ ప్రోగ్రెస్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. హెచ్ఎం ఎ.సాయి మోహన్ కథనం ప్రకారం.. ఇక్కడి భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెలుగుబంట్ల వెంకట రమణమూర్తి ఏఐ టూల్స్ ఉపయోగించి వెబ్సైట్ రూపొందించారు. అందులో విద్యార్థుల ర్యాంకుల జాబితాను గురువారం ప్రదర్శించారు. ఏఐ ఆధారిత విద్యార్థుల ట్రాకింగ్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రగతి తెలుసుకోవచ్చు. రమణమూర్తి మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రోగ్రెస్ అడిగితే విద్యార్థి పేరు యాప్లో నమోదు చేసిన వెంటనే వస్తుందన్నారు. ఏ పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయి.. పాఠశాలకు ఎన్ని రోజులు హాజరైంది, ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు తదితర వివరాలు వెంటనే చెప్పేస్తుందన్నారు. వెనకబడిన సబ్జెక్టులో ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా సూచిస్తుందన్నారు. గూగుల్ జెమినీ అప్లికేషన్ ఉపయోగించి, పాఠశాల విద్యార్థుల డేటాను కొన్ని కమాండ్స్, కోడ్స్ రూపంలో ఇచ్చామని చెప్పారు. ఏదైనా పరీక్ష అయిన వెంటనే విద్యార్థులు సాధించిన మార్కులను ఉపాధ్యాయులు ఆన్లైన్లో నమోదు చేస్తారన్నారు. ఈ అప్లికేషన్కు రాష్ట్రంలోని విద్యార్థులందరి డేటాను అనసంధానం చేస్తే లక్షలాది మంది తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యాప్రగతిని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని రమణమూర్తి వివరించారు. -
కార్పొరేట్లో ప్రాక్టికిల్స్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పుస్తకాల్లోని పాఠ్యాంశాలు నూరు శాతం బుర్రకెక్కాలంటే ప్రయోగాలు తప్పనిసరి. అందుకనుగుణంగా విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వాటిని విద్యార్థులతో చేయించాలి. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు ఇలాంటి ప్రయోగాలను అటకెక్కిస్తున్నాయి. ప్రాక్టికల్స్ను పక్కన పెట్టి.. ఆ పీరియడ్లను థియరీకి వినియోగిస్తున్నాయి. ప్రాక్టికల్స్కు సంబంధించి ద్వితీయ సంవత్సరం చివరిలో, అది కూడా ప్రాక్టికల్ పరీక్షలు మరో 20 రోజులుండగా ల్యాబ్ గదులు తెరుస్తున్నారు. ఆయా పరికరాలకున్న బూజులు దులిపి విద్యార్థులతో అరకొర ప్రాక్టికల్స్ చేయిస్తుస్తారు. వీటిని తనిఖీ చేయాల్సిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల్లో ప్రాక్టికల్కు సంబంధించిన ప్రమాణాలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో దాదాపు 37 వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అన్ని యాజమాన్య కళాశాలల్లోనూ.. జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్య జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ అకడమిక్ ప్రారంభం నుంచే థియరీకి సమాంతరంగా ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించాల్సి ఉంది. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. థియరీ బోధనకు సమయం చాలదని ప్రాక్టికల్స్కు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. ప్రభుత్వ యాజమాన్య కళాశాలల్లో మాత్రం సెకండియర్ విద్యార్థులకు పీరియడ్లను కేటాయించి, ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహిస్తూ విద్యార్థులతో ప్రయోగాలను చేయిస్తున్నారు. స్కోర్ పెరుగుదలకు.. ప్రాక్టికల్స్ పరీక్షలకు సంబంధించి కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్స్, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కోదానికి 30 మార్కులుండటంతో వాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. సెకండియర్లో మార్కుల స్కోర్ పెరగడానికి ప్రాక్టికల్స్ మార్కులు బాగా దోహదపడతాయి. జిల్లావ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియెట్ నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడ్డదారుల్లో మార్కులు తెచ్చుకునే వెసులుబాటుకు అలవాటు పడిన యాజమాన్యాలు ప్రాక్టికల్స్ పీరియడ్లను పక్కన పెట్టేశాయని మండిపడుతున్నాయి. కళాశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. ఈ రోజుకు విద్యార్థులతో ఒక్క ప్రయోగం కూడా నిర్వహించలేదని సమాచారం. చోద్యం చూస్తున్న యంత్రాంగం ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సిలబస్, తరగతులు, పరీక్షల నిర్వహణపై తనిఖీలు నామమాత్రంగా ఉన్నాయనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండడం, అదే పార్టీకి చెందిన పెద్ద మనిషి మంత్రి పదవిలో ఉండటంతో.. కార్పొరేట్ కళాశాలలపై ఇంటర్మీడియెట్ అధికారుల చోద్యం చూడటం మినహా చేసేదేమీ లేదనే విమర్శలూ లేకపోలేదు. దీనికితోడు ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా వసూలు చేసి, ఆ సొమ్మును ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు వచ్చే సిబ్బందికి ముడుపులుగా ఇస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. జిల్లాలో జూనియర్ కళాశాలలు ఎయిడెడ్ 3 ప్రభుత్వ 14 కేజీబీవీ 4 ఆదర్శ 2 ప్రైవేట్ 125 ల్యాబ్లు సక్రమంగా ఉండాలి జిల్లాలోని ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చాలావరకూ ల్యాబ్లు లేవు. ఉన్న కొద్దిపాటి గదుల్లో లెక్కకు మించి విద్యార్థులను ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకే గదులు సక్రమంగా లేకపోతే.. ఇక ల్యాబ్లకు ఎక్కడ సౌకర్యం ఉంటుంది. ఆయా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి. – బి.సిద్ధూ, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్యూ తనిఖీలు చేసి.. చర్యలు తీసుకుంటాం ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తప్పనిసరిగా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. దీనిపై జిల్లాలోని అన్ని యాజమాన్య కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతుల నిర్వహణపై తనిఖీలు చేస్తాం. ప్రాక్టికల్స్ నిర్వహించని ఆయా కళాశాలల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటాం. – ఐ.శారద, డీఐఈఓ, కాకినాడ జిల్లా ఇంటర్మీడియెట్ కళాశాలల్లో బూజు పట్టిన ల్యాబ్లు అటకెక్కిన పరికరాలు, రసాయనాలు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో కాగితాలకే పరిమితం చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం -
ప్రతిభ చూపితే స్కాలర్షిప్ మీదే
● విద్యార్థులకు మంచి అవకాశం ● ఈ నెల 7న ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి జిల్లాలో కేంద్రాల ఏర్పాటు ● సర్వం సిద్ధం చేసిన విద్యాశాఖ రాయవరం: ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉపకార వేతనాలు అందిస్తోంది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పేరుతో ఏటా ప్రతిభ చూపిన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు (తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ పూర్తయ్యే వరకు) ఆర్థిక సాయం చేస్తోంది. దీని ద్వారా నెలకు రూ.1,000 వంతున ఏడాదికి రూ.12 వేల ఉపకార వేతనం ఇస్తోంది. ఈ ఏడాది కూడా ఉపకార వేతనాలకు అర్హత పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష సమీపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో ఈ నెల 7వ తేదీ ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 10,557 మంది ఏటా నిర్వహించే ఈ పరీక్షకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 10,557 మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షకు రెడీ అవుతున్నారు. దీనిలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం ఇలా.. ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షలో 180 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 90 మార్కులకు రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్ ఉండగా, మరో 90 మార్కులకు 7వ తరగతి, ఎనిమిదో తరగతి గణితం, సైన్స్, సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రశ్నలుంటాయి. పరీక్ష రాసేందుకు మూడు గంటల సమయం ఇస్తారు. మొదటి పేపరు మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ నాన్ వెర్బల్) పేపరు 90 మార్కులకు ఉంటుంది. నంబర్ సిరీస్ 10, సింపుల్ అర్థమెటిక్ 10, మిస్సింగ్ క్యారెక్టర్లు 10, వర్డ్ ఎనాలజీ 10, లెటర్ సిరీస్ 10 మార్కులు ఉంటాయి. నాన్ వెర్బల్ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. రెండో పేపరు రెండో పేపరు కూడా 90 మార్కులకు ఉంటుంది. ఇందులో గణితం 20 మార్కులు, సైన్స్లో పీఎస్కు 10, కెమిస్ట్రీ 10, బయాలజీ 10, సోషల్ సబ్జెక్టులో భూగోళం 10, చరిత్ర 10, పౌరశాస్త్రం 10, అర్థశాస్త్రం నుంచి 10 మార్కులుంటాయి. ఏడవ తరగతి పూర్తిగా, 8వ తరగతిలో నవంబర్ వరకూ పూర్తయిన సిలబస్ వరకు చదవాలి. కొన్ని జనరలైజ్డ్ బిట్లు, సబ్జెక్టు మీద, అదనపు సమాచారం, కరెంట్ ఎఫైర్స్పై కూడా తగిన జ్ఞానం కలిగి ఉండాలి. బబ్లింగ్ విధానంలో.. విద్యార్థులు 180 నిమిషాల్లో 180 బిట్లకు సమాధానం రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో సమయాన్ని సద్వినియోగం చేసుకుని వేగంగా సమాధానాలు రాసి, అక్కడ మిగిలిన సమయాన్ని పేపర్–2లో గణితానికి వినియోగించుకుంటే విజయం సాధించడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్న పత్రంలో 60 మార్కులకు సులభంగా, 60 మార్కులకు మధ్యస్థంగా, 60 మార్కులకు కఠినంగా ఇచ్చే అవకాశముంది. కనీసం 130 మార్కులు దాటిన వారికి విజయావకాశాలు మెండుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఓఎంఆర్ షీటుపై బబ్లింగ్ విధానంలో సమాధానాలు రాయాలి. పరీక్షా కేంద్రాల వివరాలు జిల్లా కేంద్రాలు విద్యార్థులు కోనసీమ 15 3,106 కాకినాడ 20 4,578 తూర్పుగోదావరి 13 2,873 మొత్తం 48 10,557 పకడ్బందీ ఏర్పాట్లు ఎన్ఎంఎంఎస్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాం. ఈ మేరకు సీఎస్, డీవోల నియామకం పూర్తి చేశాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చూస్తున్నాం. – షేక్ సలీం బాషా, డీఈవో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆదేశాలు జారీ చేశాం ఎన్ఎంఎంఎస్ పరీక్షను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులను ఉపాధ్యాయులు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ -
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా..?
పిఠాపురం: నియోజకవర్గంలో రోజుకో దారుణం జరుగుతోంది, ప్రాణాలు పోయాల్సిన ఆస్పత్రుల్లో ప్రాణా లు పోతున్నాయి, కుల వివక్ష పెరిగిపోతోంది.. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడం దారుణంగా ఉందంటూ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీత తీవ్రంగా మండిపడ్డారు. ఆమె బుధవారం పిఠాపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, పిఠాపురం సీహెచ్సీలో వైద్య సేవలు దిగజారి ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. కొన్ని నెలలుగా వరుస దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుని, రోగులు, గర్భిణులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. తాజాగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సిన ఆస్పత్రికి తాళాలు వేసి ఉంచడంతో, వైద్యం అందక ఓ వ్యక్తి నిండు ప్రాణం బలైందన్నారు. ఆస్పత్రి మూసి ఉంచడంతో పాటు, సకాలంలో 108 చేరక ప్రాణం పోయిందని, బాధ్యులెవరో ప్రభుత్వ పెద్దలు తేల్చాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108 వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేసి, పీహెచ్సీలను బలోపేతం చేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని దుయ్యబట్టారు. గతంలో మల్లాంలో కుల బహిష్కరణ జరగగా, మరోవైపు కొత్తపల్లి మండలం యండపల్లి పాఠశాలలో కుల వివక్ష ఘటన తీవ్ర కలవరానికి గురి చేసిందన్నారు. ఆయా విషయాలపై అధికార పార్టీల నేతలు నోరు మెదపకపోవడం చూస్తుంటే అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న భయాందోళన ప్రజలకు కలుగుతోందన్నారు. సమస్యలతో సతమతమవుతున్న అధికారులు ప్రజలకు ఎలా సేవలు అందించగలరని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరుగున పడ్డాయని, సిబ్బంది కొరత తీవ్రంగా ఉందన్నారు. వైద్య సేవలు గాడి తప్పడంతో ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోందన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా గొప్ప పేరున్న పిఠాపురంలో దారుణాలను వెంటనే ఆపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కోరారు. ఆస్పత్రుల్లో జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వెంటనే స్పందించి విచారణ జరిపించాలని, పిఠాపురంలో పర్యటించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిపై దృష్టి సారించకపోతే ప్రజల తరఫున వైఎస్సార్ సీపీ శ్రేణులు ఉద్యమిస్తారని హెచ్చరించారు. పార్టీ నేతలు రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, ఉలవల భూషణం, ముమ్మిడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో పరిణామాలపై పవన్ దృష్టి సారించాలి వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వెంటనే ఆస్పత్రులు పరిశీలించాలి పట్టించుకోకపోతే ప్రజల తరఫున ఆందోళన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ వంగా గీత -
నర్సును బలి చేశారు
తొలగింపు చర్యలు తగవన్న ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ కాకినాడ క్రైం: తుని ఏరియా ఆస్పత్రిలోని సర్జరీ ఘటనలో నర్సును బలి చేశారని, ఆమెను ఉద్యో గం నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తున్నామని ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అన్నారు. యూనియన్ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ స్వామిబాబు ఆధ్వర్యంలో నాయకుల బృందం అధికారులను కలిసి ఆ చర్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. కలెక్టరేట్లో డీఆర్వో వెంకట్రావును కలిశారు. స్టాఫ్ నర్సుగా పద్మావతి పనిచేసిన 13 ఏళ్లలో మచ్చలేదన్నారు. డాక్టర్ల ఆదేశాల మేరకే నర్సులు పనిచేస్తారన్న విషయాన్ని డీఆర్వో దృష్టిలో పెట్టారు. ఆమె ఉద్యోగాన్ని తొలగించడం సరికాదన్నారు. విధి నిర్వహణలో ఆమె నిబద్ధత, కుటుంబ నేప థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఉద్యోగ తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం వైద్య, ఆరోగ్య సేవల జిల్లా సమన్వయాధికారి డాక్టర్ కె.మహేశ్వరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో ఏలేశ్వరం, జగ్గంపేట, తుని, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, పెదపూడి, ప్రత్తిపాడు, రౌతులపూడి, తాళ్లరేవు ఆస్పత్రి సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఈసీ సభ్యులు ఉన్నారు. అడ్మిషన్లకు గడువు పెంపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి టెన్త్, ఇంటర్మీడియెట్ అడ్మిషన్లకు ఈ నెల ఆరో తేదీ వరకూ గడువు పెంచినట్టు జిల్లా విద్యా శాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. గతంలో రెగ్యులర్ పదో తరగతి ఓల్డ్ సిలబస్ రాసి ఫెయిలైన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చని చెప్పారు. -
ప్రభుత్వ వైఖరితో రైతు కంట కన్నీరు
● రైతుల సమస్యలపై 10న పిఠాపురంలో ఆందోళన ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు పిఠాపురం: ఏ రైతును కలిసినా పిఠాపురం నియోజకవర్గంలో మోంథా తుపాను సాయం అందలేదని చెబుతున్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని రైతులు, కౌలు రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సీపీఐ, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల పదో తేదీన పిఠాపురంలో ఆందోళన చేపట్టనున్నట్టు తెలిపారు. బుధవారం పిఠాపురం మండలంలోని పలు గ్రామాల్లో సీపీఐ, రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, గత 18 నెలలగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసిందని, రైతులను రాజును చేయడమేమో కానీ, బికారిని చేయవద్దన్నారు. రైతుల అభివృద్ధికి పంచసూత్రాలను ప్రచారం చేస్తుందని, అదికారంలోకి వచ్చాక పంచ పాపాలు చేసి రైతులను దగా చేసిందని దుయ్యబట్టారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కనీసం గోనె సంచులను అందించడంలోనూ విఫలమైందని, తేమ శాతం పేరుతో అనేక ఆంక్షలు పెడుతున్నట్టు విమర్శించారు. తుపాను ప్రభావం నేపథ్యంలో కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. కొనుగోలు నిబంధనలు సడలించాలని కోరారు. మంత్రి నాదెండ్ల మనోహర్ పేపర్లకే పరిమితమయ్యారని, ఆచరణలో శూన్యమని విమర్శించారు. రైతులు ధాన్యాన్ని అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంథా తుపానుతో రూ.5,500 కోట్లకు పైగా నష్టం జరిగితే, ప్రభుత్వ గణాంకాలు మాత్రం రూ.వెయ్యి కోట్లేనని చెబుతున్నాయన్నారు. ఎన్యూమరేషన్ పూర్తయి నెల రోజులైనా రైతులకు నష్ట పరిహారం అందించకపోవడం చంద్రబాబు ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పంటల బీమా ప్రీమియం భారంగా ఉండటంతో రైతులు అందులో చేరలేకపోయారన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రబీ నుంచైనా ఉచిత పంటల బీమా అమలు చేయాలని కోరారు. ఈ పర్యటనలో ఇంకా సీపీఐ నాయకులు కె.బోడకొండ, తోకల ప్రసాద్, సాక రామకృష్ణ, సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
16 మందితో హ్యాండ్ బాల్ జిల్లా జట్టు
సామర్లకోట: కర్నూల్ డీఎస్ఏ స్టేడియంలో గురువారం నుంచి ఆరో తేదీ వరకూ జరిగే రాష్ట్ర స్థాయి పురుషుల హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టును బుధవారం ఎంపిక చేశారు. ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ దుర్గాప్రసాద్ వివరాలు తెలిపారు. సామర్లకోట మండలం పనసపాడులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వీరికి పోటీలు నిర్వహించి 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వీరు అంతర్ జిల్లాల హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొంటారు. జిల్లా జట్టును సంఘ సభ్యులు ప్రభాకర్, రవికుమార్, చంద్రశేఖర్, శివ, వెంకట్, ఏసు ఎంపిక చేశారు. ఈ జట్టు బుధవారం సాయంత్రం కర్నూల్కు బయలుదేరింది. -
ఎట్టకేలకు శానిటరీ సిబ్బందికి జీతాలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య(శానిటరీ) సిబ్బందికి అక్టోబర్ జీతాలు ఎట్టకేలకు బుధవారం వారి బ్యాంకు ఖాతాలకు జమయ్యాయి. గతంలో గుంటూరుకు చెందిన కనకదుర్గా సంస్థ శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహించినపుడు ఇలాగే జీతాలు ఆలస్యమయ్యేవి. ప్రస్తుతం దేవస్థానం శానిటరీ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సంస్ధ అక్టోబర్ నుంచి నిర్వహిస్తోంది. ఈ సంస్థ నవంబర్ 24వ తేదీ వచ్చినా శానిటరీ సిబ్బందికి అక్టోబర్ వేతనాలు చెల్లించలేదు. దీనిపై గత నెల 25న ‘సాక్షి’లో ‘పేరు మారినా తీరు మారలేదు’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ సంస్థపై ఒత్తిడి తేవడంతో సిబ్బంది జీతాలు జమ చేశారు. ఈ నెల 413 మందికి జీతాల కింద లేబర్కు రూ.10,555, మేసీ్త్రకి రూ.15,575 వంతున సుమారు రూ.60 లక్షలు చెల్లించారు. -
వక్ఫ్ ఆస్తులను పోర్టల్లో నమోదు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమయం చాలా తక్కువగా ఉన్నందున వక్ఫ్ ఆస్తుల వివరాలను పోర్టల్లో వీలైనంత త్వరగా అప్లోడ్ చేయాలని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి హసన్ షరీఫ్ బుధవారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల ఐదు లోపు ఆస్తుల వివరాలను ఉమిద్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. వారం రోజులుగా పోర్టల్ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. ఆస్తుల వివరాల నమోదుకు ప్రభుత్వం సమయం పెంచాల్సి ఉండగా, పట్టించుకోవడం లేదన్నారు. వీరేశ్వరస్వామికి రూ.9.96 లక్షల ఆదాయం ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.9.96 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ 45 రోజులకు గాను ఆలయంలో ప్రధాన హుండీ ద్వారా రూ.9,87,354, అన్నదాన హుండీ ద్వారా రూ.8,849 వెరసి రూ.9,96,203 సమకూరినట్లు తెలిపారు. వీటితో పాటు 5 విదేశీ రియాల్స్ వచ్చాయన్నారు. హుండీ ఆదాయం సొమ్మును దేవస్థానం ఖాతాకు జమ చేస్తున్నట్టు వివరించారు. తొలుత ఆలయ అర్చకులు యనమండ్ర సుబ్బారావు, యనమండ్ర సత్య సీతారామ శర్మ, పేటేటి శ్యామల కుమార్ హుండీలకు హారతి ఇచ్చి, లెక్కింపును లాంఛనంగా ప్రారంభించారు. -
పింఛన్ సొమ్ము నుంచే ఇంటి పన్ను వసూళ్లు
తుని రూరల్: సామాజిక భద్రతగా అందించాల్సిన పింఛన్ల సొమ్ము నుంచి ఇంటి పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వంపై లబ్ధిదారులు తిరుగుబాటు చేశారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. స్థానికుల సమాచారం మేరకు..ఈ నెల 1న కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పంచాయతీ కార్యదర్శి స్వామి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ చేపట్టారు. పింఛన్లు పొందుతున్న కొంతమంది నుంచి ఇంటి పన్ను సొమ్ము మినహాయించి మిగతాది ఇచ్చారు. ఇంటి పన్ను కట్టకపోతే ప్రభుత్వం పింఛన్ నిలిపివేస్తుందన్న భయంతో కొంతమంది ఇంటి పన్ను చెల్లింపునకు అంగీకరించారు. పలివెల దేవుడమ్మ పింఛన్ నుంచి ఇంటి పన్ను వసూలు చేస్తుండగా ఆమె కుమార్తె తీవ్రంగా వ్యతిరేకించి సచివాలయ సర్వేయర్ సురేష్ను నిలదీసింది. మిగిలిన పింఛన్దారులు ఆమెకు మద్దతు పలికారు. దీంతో పింఛన్ డబ్బు చెల్లించి సర్వేయర్ వెనుతిరిగారు.అలాగే, యండగుడ నూకాలమ్మ నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్ను రూ.243 మినహాయించుకుని పింఛన్ ఇచ్చినట్లు బాధితురాలు చెప్పారు. మరికొంతమంది నుంచి పింఛన్ డబ్బులోనుంచే ఇంటి పన్నులు మినహాయించుకుని రశీదులు ఇచ్చినట్లు తెలిసింది. కొడుకు ఇంటి పన్ను చెల్లించలేదని అతని తల్లికి పింఛన్ 2 రోజులు నిలిపివేసినట్లు ఆరోపించారు. కాగా, ఇంటి పన్నులు గత నెల నుంచీ వసూలు చేస్తున్నామని, కొంతమంది ఒకటో తేదీకి కడతామని చెప్పడంతో అడిగినట్లు సచివాలయ కార్యదర్శి స్వామి తెలిపారు. ఎవరి నుంచీ తమ సిబ్బంది బలవంతంగా ఇంటి పన్నులు వసూలు చేయలేదని, పింఛన్ డబ్బు నుంచి మినహాయించుకోలేదని అన్నారు. -
పెన్షన్ నగదు కోతపై గ్రామస్తుల ఆగ్రహం
కాకినాడ జిల్లా: తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్ నగదు పంపిణీ సమయంలో ఒక ఉద్యోగి ఇంటి పన్ను బకాయిలను తగ్గించుకుని డబ్బులు ఇచ్చిన ఘటన వివాదానికి దారితీసింది. పెన్షన్ డబ్బులు తమ హక్కు అని, వాటిని ఇతర బకాయిలకు ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. ఇంటి పన్ను మా ఇష్టము వచ్చినప్పుడు కడతాం, పెన్షన్ డబ్బులు కట్ చేయవద్దు అంటూ ఒక మహిళ.. సదరు ఉద్యోగిని నిలదీసింది.కాగా, బాధితురాలు మాట్లాడుతూ.. పెన్షన్ నగదు ప్రజల హక్కు అని, దానిని ఇతర బకాయిలకు జమ చేయడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ మాటలతో ఆగ్రహించిన ఉద్యోగి, తనని ఎందుకు వీడియో తీస్తున్నారని ప్రశ్నిస్తూ స్థానికులతో వాగ్వాదానికి దిగారు. గ్రామస్తులు పెన్షన్ డబ్బులు కట్ చేయడం అన్యాయం అని, ఇది ప్రజల హక్కులను ఉల్లంఘించడం అని ఆరోపించారు. -
ప్రాణం పోసే చోటే ప్రాణాలు పోతున్నాయి
వైద్య వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పట్టించకోవడం మానేసింది. ప్రభుత్వాస్పత్రికి వెళ్తే ప్రమాదమనే భయాందోళనలను ప్రజల్లో కలిగించింది. ఇటీవల జరిగిన అన్ని సంఘటనల్లోనూ ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పర్యవేక్షణ కొరవడటంతో ప్రభుత్వాస్పత్రుల్లోని కొంత మంది వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నిరుపేదలు ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యం వారి ప్రాణాలు తీస్తోంది. ప్రాణాలు నిలపాల్సిన ఆస్పత్రిలోనే ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం చాలా దారుణం. 24 గంటలూ వైద్యం అందాల్సిన పీహెచ్సీలకు తాళాలు వేయడం చూస్తేనే వైద్య సేవలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. ఈ విషయాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. చర్యలు తీసుకోపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం. వైద్యులు చేయాల్సిన పనిని సెక్యూరిటీ గార్డులతో చేయించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే. ఈ సంఘటనలపై విచారణ జరిపించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
‘విజనరీ’ పాలనలో ఆర్థిక పరిస్థితి తిరోగమనం
కాకినాడ రూరల్: విజనరీ చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. చంద్రబాబు పరిపాలిస్తున్నది ఆంధ్రప్రదేశ్నా లేక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా అనే అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి గతి తప్పిందని, దాన్ని గాడిలో పెట్టాలంటే సంపద సృష్టించాలని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరిగిన విషయం కాగ్ నివేదికలో వెల్లడైందన్నారు, 2025–26 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తే అది అక్టోబర్ నాటికే రూ.47 వేల కోట్లు దాటిందని వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో రూ.3.31 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేస్తే.. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 18 నెలలకే రూ.2.5 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. రానున్న మూడున్నరేళ్లలో ఇంకెంత అప్పు చేస్తారోనని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో జీఎస్టీ, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తగ్గాయని తెలిపారు. అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్రాన్ని దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని నాగమణి ధ్వజమెత్తారు. కార్తిక ఆదాయం రూ.1.05 కోట్లు సామర్లకోట: కార్తిక మాసంలో పంచారామ క్షేత్రానికి రూ.1,05,75,051 ఆదాయం వచ్చినట్లు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. దేవదాయ శాఖ తనిఖీదారు వడ్డీ ఫణికుమార్ ఆధ్వర్యాన ఆలయంలో మంగళవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.22,37,942, దర్శనం టికెట్ల ద్వారా రూ.36,29,398, కానుకలు రూ.38,015, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.12,86,855, ఆర్జిత సేవల ద్వారా రూ.3.20 లక్షలు, స్వామి వారి ఫొటోల విక్రయం ద్వారా రూ.11,540, ఆన్లైన్ విరాళాలు రూ.7,94,876, అన్నదాన విరాళాలు రూ.22,29,398 చొప్పున ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. కార్యక్రమంలో ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు, సభ్యులు, ఉత్సవాల ప్రత్యేకాధికారి కె.సూర్యనారాయణ, సామర్లకోట రెవెన్యూ సిబ్బంది, శ్రీసత్యదుర్గ హరిహర సేవా సంఘం, జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం, సామర్లకోట శ్రీరామ సేవా సంఘం, భక్త సంఘం సభ్యులు పాల్గొన్నారు. రైతులను అయోమయంలోకి నెట్టిన పవన్ వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి మలికిపురం: డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ పర్యటన ఇక్కడి రైతులను అయోమయంలోకి నెట్టిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జున్నూరి రామారావు (బాబి) అన్నారు. మంగళవారం ఆయన కేశనపల్లిలో రైతులు, పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ శంకరగుప్తం మేజర్ డ్రైన్ మరమ్మతుల పనులను రూ.22.62 కోట్లతో అధికారులు ఆమోదించి, ఫైనాన్స్ కమిషన్కు పంపారని, ఇక నిధులు మంజూరవుతాయని రైతులు భావిస్తున్న సమయంలో ఆ క్రెడిట్ పవన్ ఖాతాలో పడుతుందనే ఉద్దేశంతో ఎవరో ఆ ఫైల్ తొక్కి పెట్టారని తాము భావిస్తున్నామన్నారు. పవన్ తన పర్యటనలో అసలు ఈ నిధులు వస్తాయని కానీ రావని కాని చెప్పలేదన్నారు. 45 రోజుల సమయం అంటూ సమస్యను మొదటికి తీసుకెళ్లే విధంగా పవన్ వ్యాఖ్యానించారని బాబి అన్నారు. శంకరగుప్తం డ్రైన్ మరమ్మతులు మొదటి నుంచి చివరి వరకూ ఒకేసారి చేస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. ఇలా పలు భాగాలుగా నిర్వహిస్తే ప్రయోజనం ఉండదని నివేదికలు చెబుతుండగా రూ.22.62 కోట్లతో ఒక భాగం మరమ్మతులకు ప్రతిపాదించడం తగదన్నారు. ఇంకా నిధులు పెంచి డ్రైన్ అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త తరహా రాజకీయాలు చేస్తానని చెప్పే పవన్ 2019లో వైఎస్సార్ సీపీని ఈ సమస్యలపై ఎందుకు అడగలేదని రైతులను ప్రశ్నిస్తూ మూస రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ద్వారా రూ.3,320 కోట్లతో కోనసీమలో ఇరిగేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభించగా 30 శాతం పూర్తయ్యాయని చెప్పారు. వైఎస్సార్ మరణానంతరం టీడీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదన్నారు. ఆయన వెంట నాయకులు గుబ్బల రమేష్, ఇందుకూరి సత్యనారాయణరాజు, దొంగ నాగ సత్యనారాయణ, యెనుముల నారాయణస్వామి ఉన్నారు. -
ఖర్మాస్పత్రులు
ఫ వైద్యానికి తాళాలుఫ ప్రభుత్వాస్పత్రుల్లో పడకేసిన వైద్యం ఫ పిఠాపురం నియోజకవర్గంలో పీహెచ్సీలకు రాత్రి వేళ తాళాలు ఫ సకాలంలో వైద్య సేవలందక ప్రాణాలు కోల్పోతున్న రోగులు ఫ సీహెచ్సీలో సెక్యూరిటీ గార్డుతోనే వైద్య సేవలు ఫ భయాందోళనలకు గురవుతున్న ప్రజలు పిఠాపురం: ఎవరైనా అస్వస్థతకు గురైతే ప్రతి క్షణం ఒక యుగంలా మారుతుంది. గోల్డెన్ అవర్స్లో వైద్యం అందితే నిండుప్రాణం నిలబడే చాన్స్ ఉంటుంది. అదే క్షణం ఆలస్యం చేస్తే ఆ ప్రాణదీపం కొడిగట్టిపోయే ప్రమాదం ఉంటుంది. కాస్త స్థితిమంతులైతే కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తారు. కానీ నిరుపేదలకు ప్రభుత్వ ధర్మాస్పత్రులే దిక్కు. కానీ, నేడు అక్కడకు వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యులు లేక వైద్యం అందకపోవడం ఒక ఎత్తయితే.. తీరా వెళ్లినా ఆస్పత్రులకు తాళాలు వేసి ఉండటంతో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సంఘటన పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలవరపెడుతోంది. 24 గంటలూ వైద్య సేవలందించాల్సిన పీహెచ్సీలు సాయంత్రం 4 గంటలు దాటితే చాలు.. మూత పడుతున్నాయి. ఈ నియోజకవర్గానికే పెద్దాస్పత్రి అయిన పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)తో పాటు కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లోని పీహెచ్సీలు వైద్య సేవల్లో ప్రగతి చూపాల్సింది పోయి నానాటికీ దిగజారిపోవడం.. సేవా లోపాలతో వీటి ప్రతిష్ట మసకబారిపోవడం వంటి సంఘటనలు ఇటీవల చోటు చేసుకుంటున్నాయి. నిత్యం ఏదో ఒక అనర్థం జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా లేని వైద్య సేవలు తీసుకొస్తున్నామంటూ పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు నెరవేరతాయో లేదో తెలీదు కానీ, సరైన వైద్య సేవలందక రోగులు నిత్యం నరకం చూస్తున్నారు. దిగజారిన సేవలు ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తమ వైద్య సేవలు అందించడం ద్వారా పిఠాపురం సీహెచ్సీ రాష్ట్ర స్థాయిలో అనేక అవార్డులు అందుకుంది. అటువంటి సీహెచ్సీ పరిస్థితి కొన్నాళ్లుగా దిగజారింది. ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేయించుకున్న బాలింతలకు ఇక్కడి వైద్యులు వణుకు పుట్టిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన ఆపరేషన్లను తూతూమంత్రంగా పూర్తి చేసి, కుట్లు వేసే పనిని ఎటువంటి శిక్షణ, అవగాహన లేని కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తున్నారు. దీంతో, ఆ కుట్ల వద్ద ఇన్ఫెక్షన్ వచ్చిందంటూ బాలింతలు, వారి బంధువులు గత సెప్టెంబర్లో ఆందోళన చేశారు. ● పిఠాపురం మండలం విరవకు చెందిన గర్భిణి ఉమామహేశ్వరి తొమ్మిది నెలలుగా ఈ ఆస్పత్రిలోనే వైద్య సేవలు పొందింది. తొమ్మిది నెలలు పూర్తవుతూండగా ఆస్పత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన ఇక్కడి వైద్యురాలు సుజాత స్కానింగ్ చేయించి, రెండు రోజుల అనంతరం పురుడు కోసం కాకినాడ ఆస్పత్రికి వెళ్లాలని రిఫర్ చేశారు. కాకినాడ ఆస్పత్రిలో చేరిన తరువాత రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులోనే చనిపోయిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేసి, చనిపోయిన బిడ్డను బయటకు తీసి తల్లిని రక్షించారు. ● గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన నిండు గర్భిణి దొండపాటి శ్రీదుర్గ(25)కు వైద్యల పర్యవేక్షణలో పురుడు పోయాల్సి ఉంది. అయితే, వైద్యులు బలవంతంగా నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నించి, ఆమె మృతికి కారకులయ్యారని బంధువులు ఆరోపించి, ఆందోళనకు దిగారు. ● మరీ దారుణంగా పిఠాపురం సీహెచ్సీలో వైద్యులు చేయాల్సిన పనిని కాపలా కాసే సెక్యూరిటీ గార్డుతో చేయించడం రోగులను తీవ్రంగా కలవరపెట్టింది. ఏకంగా మార్చురీలో పోస్టుమార్టం కూడా సెక్యూరిటీ గార్డే చేయడం చూస్తేనే ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు ఏవిధంగా దిగజారయో అర్థం చేసుకోవచ్చు. ● తాజాగా సోమవారం రాత్రి గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఇమంది మాణిక్యం అనే వ్యక్తి అస్వస్థతకు గురవగా స్థానికులు చేబ్రోలు పీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండటంతో 108కి ఫోన్ చేశారు. అది కూడా గంట అయినా రాకపోవడంతో సకాలంలో వైద్యం అందక మాణిక్యం మృతి చెందాడు. ● ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం చేతులు దులిపేసుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రులపై పర్యవేక్షణ పెంచి, పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించి ఉంటే రోగుల ప్రాణాలతో చెలగాటమాడే పరిస్థితి ఉండేది కాదని పలువురు అంటున్నారు. -
చికిత్స అందక వ్యక్తి మృతి
పిఠాపురం: 24 గంటలూ పనిచేయాల్సిన పీహెచ్సీకి సిబ్బంది కొరతతో తాళాలు వేయడంతో అర్ధరాత్రి గుండెనొప్పితో అత్యవసరస్థితిలో వచ్చిన ఓ వ్యక్తి సకాలంలో చికిత్స అందక మరణించిన హృదయవిదారక ఘటన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చేబ్రోలులో జరిగింది. ప్రత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన ఇమంది మాణిక్యం (56) చేబ్రోలులోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అతడు సోమవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గుండెనొప్పిగా ఉందంటూ సహచరులకు చెప్పాడు. హోటల్ నిర్వాహకులు అతడిని చేబ్రోలు పీహెచ్సీకి తరలించారు. అక్కడకు వెళ్లేసరికి పీహెచ్సీకి తాళాలు వేసి ఉండడంతో 108కి కాల్ చేశారు. కానీ, 108 వాహనం కూడా గంట తరువాత వచ్చింది. అందులోని సిబ్బంది మాణిక్యాన్ని పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సకాలంలో వైద్యం అందకే మాణిక్యం మృతి చెందినట్లు అతడి బంధువులు ఆరోపిస్తున్నారు. పీహెచ్సీ తీసి ఉంటే, ప్రథమ చికిత్స అంది ఉండేదని, మాణిక్యం బతికేవాడన్నారు. డీఎంహెచ్వో విచారణ ఈ ఘటన నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జె.నరసింహ నాయక్ మంగళవారం చేబ్రోలు పీహెచ్సీలో విచారణ జరిపారు. సిబ్బందిని, స్థానికులను అడిగి మాణిక్యం మృతికి కారణాలు తెలుసుకున్నారు. ఆస్పత్రికి తాళాలు వేసి ఉండకూడదన్నారు. ఇక్కడ సిబ్బంది కొరతపై ఆరు నెలలుగా డీఎంహెచ్వోకు వినతులిచ్చామని, వాట్సాప్ సందేశాలు పంపించామని, అయినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదని స్థానికులు ఆయనను నిలదీశారు. దీనిపై డీఎంహెచ్వో స్పందిస్తూ వైద్య సిబ్బంది సెలవుల పైన, డిప్యూటేషన్లో ఉండటం వల్ల ఇబ్బంది కలిగి ఉండవచ్చని, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్కు విచారణ నివేదిక అందజేస్తామని తెలిపారు. వైద్యుడి సస్పెన్షన్ డ్యూటీ రోస్టర్ వేయడం, అత్యవసర విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను చేబ్రోలు పీహెచ్సీ వైద్యుడు సాయిరతన్ను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ తెలిపారు. చేబ్రోలు పీహెచ్సీలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు ఉన్నారని, వీరిలో ఒకరైన డాక్టర్ వి.నిఖిల్ సెలవులో ఉన్నారని, రెండో మెడికల్ ఆఫీసర్ సాయిరతన్ను సస్పెండ్ చేశామని, స్టాఫ్ నర్సుకు షోకాజు నోటీసు ఇచ్చామని వివరించారు. తాళ్లరేవు వైద్యాధికారి ఎల్.సురేష్ కుమార్ను డిప్యూటేషన్పై చేబ్రోలు పీహెచ్సీకి పంపించామన్నారు. డిప్యూటేషన్పై ఉన్న స్టాఫ్ నర్స్ను చేబ్రోలు పీహెచ్సీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ఇదిలా ఉంటే చంద్రబాబు పాలనలో పీహెచ్సీల్లో సిబ్బందినీ నియమించలేని దుస్థితి నెలకొందని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మూడు జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ అధికం
సాక్షి, అమరావతి: నల్లిని పోలిన స్క్రబ్ టైఫస్ కీటకం కుట్టడం ద్వారా సోకే జ్వరాలు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది కాకినాడ, విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కేసులు అధికంగా నమోదయ్యాయి. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 380కుపైగా కేసులు వెలుగు చూశాయి. విశాఖ, కాకినాడ జిల్లాల్లో 270కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల స్క్రబ్ టైఫస్ జ్వరంతో విజయనగరంలో ఒక మహిళ మృతిచెందింది. ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో 736 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు వైద్యశాఖ నిర్ధారించింది.ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యశాఖ మంగళవారం ఒక ప్రకటనలో సూచించింది. 2023లో 579 కేసులు, 2024లో 803 కేసులు బయటపడినట్టు వెల్లడించింది. డెంగీ, మలేరియా తరహాలో ఇది కూడా ఓ సాధారణ జ్వరం లాంటిదేనని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. శరీరంపై చిన్న నల్లమచ్చ కనిపించి, జ్వరం వచ్చినట్లయితే స్క్రబ్ టైఫస్గా అనుమానించవచ్చన్నారు. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోవచ్చని తెలిపారు. -
పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం..
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ సెక్యూరిటీ గార్డు డాక్టర్ అవతారం ఎత్తాడు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డే డాక్టర్గా వైద్యం చేయడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు విస్తుపోతున్నారు. పోస్ట్ మార్టం చేసిన మృతదేహాలకు కుట్లు వేయడంతో పాటు గాయాలతో వచ్చిన రోగులకు సెక్యూరిటీ గార్డ్ చికిత్స చేస్తున్నాడు. గేటు బయట కాపలాగా ఉండాల్సిన గార్డ్ వైద్యం చేయడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్గా మారాయి.వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు. అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు. -
‘అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప బాబు చేసిందేమీ లేదు’
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి సర్కార్ పోకడలు చూస్తే.. ఇది ప్రజాస్వామ్యమా? అనిపిస్తుందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మనం బాగుండాలనే స్వలాభమే కనిపిస్తుంది తప్ప.. ప్రజల బాగు కోసం ఆలోచించడం లేదు’ అని చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘గత చంద్రబాబు పాలనలో లిక్కర్ స్కామ్ అవినీతి జరిగిందని 2023లో సీఐడీ కేసు పెట్టింది. ఇప్పుడు అదే సీఐడీ అధికారులు ఈ కేసుకు, మాకు సంబంధం లేదని వాంగూల్మం ఇచ్చారు. చంద్రబాబు తన మీద కేసును తానే విచారించుకుని.. తానే తీర్పు ఇచ్చేస్తున్నాడు. క్యాబినెట్ తీర్మానం.. ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా మద్యం విషయంలో అప్పట్లో నిర్ణయాలు జరిగాయి. తన మీద కేసును ఆయనే కొట్టేసుకుంటున్నారు...నిజంగా చంద్రబాబు నిరాపరాధి అయితే.. ఈ కేసును ఎందుకు కోర్టు ద్వారా విచారించుకోవడం లేదు. ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు పోరాటం.. ఆరాటం ఎందుకు జరుగుతుంది?. ప్రభుత్వ సొమ్ముతో సిద్దార్ధ లూథ్రా అనే న్యాయవాధికి ఫీజులు ఇచ్చి కేసులు వాదించుకుంటున్నాడు. చంద్రబాబు హయం లో స్కిల్ స్కామ్, ఇన్నర్ రోడ్డు వంటి పలు కేసులు ఉన్నాయి...చంద్రబాబుది ఎప్పుడు డబుల్ యాక్షనే. ఎన్నికలకు ముందు ఒక యాక్షన్.. ఎన్నికలు అయ్యాక మరో యాక్షన్. అప్పులు.. గొప్పలు.. అబద్ధాలు తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు చేసే ఒక్క రోజు అప్పుతో ఒక మెడికల్ కళాశాల పూర్తవుతుంది. ఒక అరటిపండు అర్ధ రూపాయికి అమ్ముకునే పరిస్థితి రైతులకు దాపురించింది. వైఎస్ జగన్ హయంలో టన్ను అరటి రూ.25 వేలకు అమ్ముడు పోయింది. చంద్రబాబు రియల్ ఇంటిలెన్స్ ఏమైపోయింది?. చౌకగా వైజాగ్లో భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నాడు. గత 18 నెలల కాలంలో కొత్తగా ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చెప్పాలి’’ అంటూ కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ స్కూళ్లలో 4 వేల మంది విద్యార్థులు తగ్గారు
పిఠాపురం: ఈ ఏడాది జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఏకంగా 4 వేల మంది విద్యార్థులు తగ్గిపోయారని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ అన్నారు. నాణ్యమైన విద్య అందించకుండా ఇదే పరిస్థితి కొనసాగితే ఉపాధ్యాయులు దారుణమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ కాలేజీలో మండల స్థాయిలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు దారుణంగా పడిపోయాయన్నారు. ఏ ఒక్క విద్యార్థికీ అక్షరం వచ్చినట్లు కనిపించడం లేదన్నారు. ‘మీ పిల్లలకు రూ.10 వేల జీతం పొందే ప్రైవేటు ఉపాధ్యాయుల వద్ద చదువు చెప్పిస్తూ.. అక్కడ చదువు సక్రమంగా లేకపోతే నిలదీస్తారు. మరి వేలకు వేలు జీతం తీసుకునే మీరు చదువు చెప్పకపోతే పిల్లల తల్లిదండ్రులు నిలదీయరా?’ అని తీవ్రంగా ప్రశ్నించారు. ఎలిమెంటరీ పాఠశాలల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో అక్షర పరిజ్ఞానం అందించకపోతే ఉన్నత తరగతులకు వెళ్లేకొద్దీ చదువులో వెనకబడి వారి అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడే విద్యార్థి అభివృద్ధికి పిల్లర్ నిర్మించాలని, అలా లేనందువల్లనే ఏటేటా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు తగ్గుతూ వస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం తెలుసుకోవాలని సూచించారు. ప్రైవేటు స్కూలులో ఉన్నదేమిటో, ప్రభుత్వ స్కూల్లో లేనిదేమిటో అందరికీ తెలిసేలా చేయాలని అన్నారు. విద్యార్థికి ఆదర్శంగా నిలవాలని, కానీ తరగతి గదిలో ఉపాధ్యాయుల నడవడిక, సెల్ ఫోన్లో మాట్లాడుతూ గడపడం వంటి విషయాలను విద్యార్థులు గమనిస్తారనే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ఇంటికెళ్లి తమ టీచర్ ఏమీ చెప్పడం లేదని, ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటున్నారని పిల్లలు చెబితే ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. దీనివల్ల ఉద్యోగ భద్రత కూడా కరువవుతుందన్నారు. పిల్లలకు వారి పేర్లు రాసుకోవడం కూడా రావడం లేదని, చిన్నచిన్న పదాలు కూడా రాయలేని పరిస్థితి నెలకొందంటే ఉపాధ్యాయుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి పాఠశాలలను రక్షించుకోవాలన్నారు. విద్యార్థిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని స్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయి విద్యను దుర్వినియోగం చేయవద్దని, విద్యార్థి బంగారు భవిష్యత్తుకు ప్రాథమిక దశలోనే పునాది వేయాలని ఉపాధ్యాయులకు డీఈఓ రమేష్ సూచించారు. విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చకపోతే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచకపోతే ఉపాధ్యాయుల మనుగడకే ప్రమాదం తెచ్చుకున్నవారవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాస్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫ ఇదే పరిస్థితి కొనసాగితే టీచర్ల పరిస్థితి దారుణంగా మారుతుంది ఫ డీఈఓ రమేష్ -
ఈ జాగ్రత్తలు మేలు
ఫ రైతులు, అడవుల్లో పని చేసేవారు, వ్యవసాయ కూలీలు, పొదలు, గడ్డి ప్రాంతాల్లో సంచరించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ సంచరించడం, పని చేయడం అనివార్యమైనప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులే ధరించాలి. ఫ చిగ్గర్ మైట్స్ నివారణకు అవసరమైన పురుగు మందులు పొదలు, గడ్డి ప్రాంతాల్లో పిచికారీ చేయాలి. ఫ ఏ ప్రదేశంలోనూ నేలపై నేరుగా కూర్చోకూడదు. ఫ ఇల్లు, కార్యాలయాల చుట్టుపక్కల ఉన్న గడ్డి, పొదలు, తుప్పల్ని తొలగించాలి. ఫ బ్యాక్టీరియా వ్యాప్తికి చల్లదనం, వర్షాలు అత్యంత అనుకూలం. జనవరి నుంచి ఈ కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పటి వరకూ రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర వర్గాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. -
రూ.200, రూ.150 నాణేల సేకరణ
అమలాపురం టౌన్: స్వామి దయానంద సరస్వతి జన్మించి 200 సంవత్సరాలు, ఆర్య సమాజ స్థాపన జరిగి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోల్కతా టంకశాల రూ.200, రూ.150 నాణేలను ముద్రించి విడుదల చేసింది. ఈ నాణేలను అమలాపురానికి చెందిన నాణేల సేకరణ కర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ సేకరించారు. 1824 ఫిబ్రవరి 12న జన్మించిన స్వామి దయానంద సరస్వతి అజ్ఞానాంధకారం, దారిద్య్రం, అన్యాయాలను ఎదిరించి పోరాడిన ఓ మహర్షి. 1875 ఏప్రిల్ 10న ముంబై నగరంలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. స్వామి దయానంద సరస్వతి ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా ఆర్య సమాజాన్ని నెలకొల్పారు. దేశంలో మొట్టమొదటి సారిగా ఈ నాణేలను నికెల్ సిల్వర్తో రూపొందించారు. ఈ నాణేలు ఒక్కొక్కటి 32 గ్రాముల బరువు ఉండి 60 శాతం రాగి, 20 శాతం నికెల్, మరో 20 శాతం జింక్ కలిగి ఉంటాయి. స్వామి దయానంద సరస్వతి ముఖచిత్రంతో రూ.200 నాణెం, ఆర్య సమాజం ముద్రతో రూ.150 నాణేన్ని ముద్రించారని సేకరణ కర్త కృష్ణ కామేశ్వర్ తెలిపారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వెలికితీత
కిర్లంపూడి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంపై సోమవారం కేసు నమోదైనట్టు హెడ్ కానిస్టేబుల్ మూర్తి తెలిపారు. మండల పరిధి వేలంకలోని విద్యుత్ సబ్ స్టేషన్ పక్కనే ఉన్న కాలువలో స్థానికులకు మృతదేహం కనబడడంతో వీఆర్ఓ ఇప్పర్తి దేవ సహాయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి 35–45 వయసు ఉంటుంది. బ్లూ టీషర్టు, షార్టు దుస్తులు వేసుకున్నట్లు తెలిపారు. వీఆర్ఓ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని ప్రత్తిపాడు పీహెచ్సీకు తరలించారు. వీరేశ్వరస్వామి నిత్య కల్యాణం టిక్కెట్ల విడుదల ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి 2026 జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన నిత్య కల్యాణాల టిక్కెట్లను సోమవారం విడుదల చేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ లాంఛనంగా విడుదల చేశారు. మొత్తం 58 రోజులకు సంబంధించి 6,728 కల్యాణాలకు గాను ఆన్లైన్లో 5,220, కార్యాలయంలో 1,508 అందుబాటులో ఉంటాయన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి నిత్య, మాస, వార్షిక పూజలు, రుద్ర హోమం, చండీ హోమం, లక్ష పత్రి పూజ, మహా శివరాత్రికి ద్వాదశ పుష్కర నదీ జలాభిషేకం టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
ఎక్కడుంది లోపం!
అన్నవరం: రాష్ట్రంలోని ఏడు ప్రముఖ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వస్తున్న భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం దేవస్థానం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో భక్తులకు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత అక్టోబర్ 25 నుంచి నవంబర్ 25వ తేదీ వరకూ వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 72.2 శాతంతో శ్రీకాళహస్తి ప్రథమ, 66 శాతంతో విజయవాడ దేవస్థానం ఏడు స్థానాల్లో నిలిచాయి. అన్నవరం దేవస్థానంలో అందిస్తున్న సేవలపై దాదాపు 32 శాతం మంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏప్రిల్లో నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానం ఆఖరు స్థానంలో నిలవడంతో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. అన్నవరం దేవస్థానంలో తనిఖీలు చేశారు. మెరుగైన సేవలందించి దేవస్థానాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ తరువాత కొంత మెరుగుదల కనిపించినా మళ్లీ ఆరో స్థానానికి దిగజారింది. దీంతో, అసలు లోపం ఎక్కడుందనే చర్చ దేవస్థానంలో నడుస్తోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలవడం కూడా దేవస్థానం ప్రతిష్ట మసక బారడానికి కారణంగా చెబుతున్నారు. తీవ్ర అసంతృప్తి అక్కడే.. ఫ దేవస్థానంలో పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపైనే ఎక్కువ మంది భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానంలో శానిటరీ టెండర్ చిత్తూరుకు చెందిన పద్మావతి సంస్థ దక్కించుకుంది. అక్టోబర్ 1 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే ఆ సంస్థ దేవస్థానంతో నవంబర్ నెలాఖరున అంటే దాదాపు 55 రోజుల తరువాత ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా పారిశుధ్య సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. పాత సిబ్బందిలో సూపర్వైజర్లందరినీ తప్పించారు. ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు కొత్తవారిని నియమిస్తున్నారు. ఇందులో పని చేతకాని వారు కూడా సూపర్వైజర్లుగా నియమితులవుతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఫలితంగా ఎక్కడికక్కడ అపరిశుభ్రత కనిపిస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. ఫ సామాన్యులు కూడా తమ ఇళ్లల్లో దుస్తులను వాషింగ్ మెషీన్లతో ఉతుకుతున్నారు. కానీ, అన్నవరం దేవస్థానం సత్రాల గదుల్లోని మంచాలపై వేసే దుప్పట్లు, గలేబులు తదితర వస్త్రాలను ఇంకా చేత్తోనే ఉతుకుతున్నారు. సాధారణంగా భక్తుడు వసతి గది ఖాళీ చేసిన వెంటనే ఆ దుప్పట్లు మార్చాలి. ప్రస్తుతం అలా జరుగుతోందా అనేది అనుమానమేనని పలువురు అంటున్నారు. గతంలో కేఎల్టీసీ సంస్థ శానిటేషన్ కాంట్రాక్ట్ నిర్వహించేటపుడు మెషీన్లతోనే ఉతికేవారు. ఫ సత్రాల ఆవరణ, బాత్రూములు, సత్రాల క్లీనింగ్ వంటి వాటికి ఉపయోగిస్తున్న మెటీరియల్ కూడా కాంట్రాక్టర్ అరకొరగానే సరఫరా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రసాదం విషయంలో కొంత ఊరట స్వామివారి ప్రసాదం విషయంలో 78 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయడం కొంత ఊరట కలిగిస్తోంది. వాస్తవానికి నూరు శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాల్సినంత నాణ్యతగా గోధుమ నూక ప్రసాదం ఉంటుంది. కానీ దీనిపై కూడా అసంతృప్తికి కారణమేమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. ఎక్కువసేపు దర్శనం క్యూలో నిలుచోవడం.. మౌలిక వసతులు, పారిశుధ్యం సరిగా లేకపోవడం వంటి వాటి వలన కలుగుతున్న అసంతృప్తి ప్రసాదంపై కూడా పడుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మెషీన్లతో ఉతికించాల్సి ఉంది సత్రాల గదుల్లోని దుప్పట్లను చేత్తోనే ఉతికి ఆరేస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్ట్ పొందిన సంస్థ గత అక్టోబర్ నుంచి ఇలాగే చేస్తోంది. ఆ సంస్థ మెషీన్లతో ఉతికించాల్సి ఉంది. అందుకు అవసరమైన వాషింగ్ మెషీన్లు త్వరలోనే తెస్తామంటున్నారు. వీటిని అమర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం ·˘ A¯]l²Ð]lÆý‡… §ólÐ]lÝ릯]l…Oò³ భక్తుల్లో తగ్గని అసంతృప్తి ·˘ ¯]lÐ]l…ºÆŠ‡ çÜÆó‡ÓÌZ¯]l* õÜÐ]lË$ »êVøÌôæÐ]l¯]l² 32 Ô>™èl… Ð]l$…¨ ·˘ Æ>çÙ‰…ÌZ BÆø Ý릯]l…™ø çÜÇ ఆరు నెలలుగా వివిధ సేవలపై భక్తుల సంతృప్తి శాతంనెల సత్యదేవుని మౌలిక గోధుమ నూక పారిశుధ్యం దర్శనం వసతులు ప్రసాదం జూన్ 73 66 77 70 జూలై 74 65 78 68 ఆగస్ట్ 75.8 64.9 76.9 66.5 సెప్టెంబర్ 74.1 66 79.2 64.5 అక్టోబర్ 68 63 76 63 నవంబర్ 69.7 61.6 77.6 64.2 మొత్తంగా నవంబర్ నెలలో వచ్చిన భక్తుల్లో 67.8 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా 32.2 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసంతృప్తి తగ్గించడానికి అధికారులు తీసుకుంటున్న చర్యలు పెద్దగా సత్ఫలితాలనివ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సత్యదేవునికి రూ.40 లక్షల ఇల్లు విరాళం
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానానికి లింగంపల్లి వేంకట సూర్య సత్యనారాయణ స్థానిక ఈరంకి వారి వీధిలోని రూ.40 లక్షల విలువైన ఇంటిని సోమవారం విరాళంగా సమర్పించారు. ఆ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావుకు ఇంటి పత్రాలు అందజేశారు. 98,51 చదరపు గజాల స్థలంలోని పెంకుటిల్లును ఆయన అందజేశారు. సత్యనారాయణ తండ్రి సోమన్నదొర గతంలో దేవస్థానంలో ఉద్యోగిగా సేవలందించారు. దాతను ఈఓ ఘనంగా సత్కరించారు. సామర్లకోట మీదుగా శ్రీశైలానికి బస్సు సామర్లకోట: ఇప్పటి వరకూ సామర్లకోట మీదుగా శ్రీశైలానికి బస్సు లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారు. వారి సమస్యను పరిష్కరించేలా కాకినాడ ఆర్టీసీ డిపో నుంచి సామర్లకోట మీదుగా శ్రీశైలం వెళ్లడానికి ప్రత్యేక బస్సు సర్వీసును అధికారులు ప్రవేశపెట్టారు. ఈ బస్సు ప్రతి రోజూ రాత్రి 7.45 గంటలకు కాకినాడలో బయలుదేరి, సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్కు 8.15 గంటలకు వస్తుంది. ఈ బస్సు పెద్దాపురం, రంగంపేట, రాజానరం, రాజమహేంద్రవరం మీదుగా మర్నాడు ఉదయం 9 గంటలకు శ్రీశైలం చేరుతుంది. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు. టిక్కెట్ల రిజర్వేషన్కు 99592 25564 నంబర్లో సంప్రదించాలని కోరారు. బస్సుకు సరిపడే భక్తులుంటే వారు కోరిన చోటుకు బస్సును పంపిస్తామని తెలిపారు. కాకినాడ వైద్యులకు అవార్డు కాకినాడ రూరల్: భారతీయ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ (ఐఎస్సీసీఎం) నుంచి 2025–26 సంవత్సరానికి గాను అత్యున్నత ప్రెసిడెన్షియల్ సిటేషన్ అవార్డుకు కాకినాడకు చెందిన వైద్యులు సిరిపరపు రామకృష్ణ, ఎస్ఎస్సీ చక్రరావు ఎంపికయ్యారు. క్రిటికల్ కేర్ వైద్య రంగంలో అందించిన సేవలకు గాను డాక్టర్ రామకృష్ణకు ఈ అవార్డు ప్రకటించినట్టు ఐఎస్సీసీఎం అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ సామవేదం తెలిపారు. అలాగే, సీపీఆర్ ప్రోగ్రామ్ ద్వారా జీవ రక్షణపై అవగాహన పెంపొందిస్తున్న డాక్టర్ చక్రరావుకు కూడా అవార్డు లభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న చైన్నెలో జరిగే కార్యక్రమంలో వారు ఈ అవార్డు స్వీకరించనున్నారు. రామకృష్ణ, చక్రరావులను ఐఎస్సీసీఎం కాకినాడ బ్రాంచి చైర్మన్ లక్ష్మీనారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు. పీజీఆర్ఎస్కు 388 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 388 అర్జీలు సమర్పించారు. వారి నుంచి డీఆర్ఓ జె.వెంకటరావుతో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి తదితర అంశాలు పరిష్కరించాలని ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు డీఆర్ఓ సూచించారు. -
బడోపేతానికి కసరత్తు
● ఆందోళనకరంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ● 5న మెగా పీటీఎం 3.0 ● ఏర్పాట్లలో విద్యాశాఖ నిమగ్నం రాయవరం: ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల బలోపేతం, విద్యార్థుల నమోదు లక్ష్యంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. దీనికి మెగా పీటీఎం 3.0గా నామకరణం చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేందుకు, సమాజ భాగస్వామ్యం పెంచేందుకు, విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు వేసేలా అవసరమైన సూచనలను తల్లిదండ్రుల నుంచి సేకరించడం, పాఠశాలల అభివృద్ధికి దాతల సహకారం అర్థించడం వంటి అంశాల ప్రాతిపదికగా ఈ సమావేశాలు నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ నెల 5వ తేదీ ఈ సమావేశాన్ని జిల్లా వ్యాప్తంగా 1,582 ప్రభుత్వ, మున్సిపల్, ఎయిడెడ్, ఏపీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సమావేశాలను ఉప విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా సెక్టోరల్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేయనున్నారు. విద్యార్థుల ప్రగతి నివేదికలు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇప్పటికే రెండు ఫార్మేటివ్, సమ్మేటివ్–1 పరీక్షలు నిర్వహించారు. వీటిలో విద్యార్థులు సాధించిన మార్కులను ప్రగతి నివేదికల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందించనున్నారు. ఈ ప్రగతి నివేదికల్లోనే విద్యార్థుల హాజరు, క్రీడా ప్రగతి, వ్యక్తిగత ఆరోగ్యాంశాలు పొందుపరచనున్నారు. విద్యార్థులు సెల్ఫోన్ అధికంగా వినియోగించకుండా తల్లిదండ్రులకు ఈ సమావేశాల వేదికగా అవగాహన కల్పించనున్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు మహిళా పోలీసుల ద్వారా అవగాహన కల్పిస్తారు. ఇదే సందర్భంలో విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేస్తారు. విద్యార్థులతో పాటుగా మెగా పీటీఎం రోజు తల్లులకు రంగవల్లులు పోటీలు, తండ్రులకు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించనున్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పూర్వ విద్యార్థులను ఆహ్వానించి వారు సాధించిన విజయాలను తెలియజెప్పేలా చర్యలు తీసుకుంటారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాలు మధ్యాహ్నం ఒంటిగంటకు సహ ఫంక్తి భోజనంతో ముగియనున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మొబైల్ యాప్లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లలో నిమగ్నం మెగా పీటీఎం ఏర్పాట్లలో భాగంగా పాఠశాలల్లో అవగాహనా సమావేశాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశాలను నిర్వహించేందుకు ఉన్నతాధికారులు అదేశాలు ఇచ్చారు. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టాలి విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెగా పీటీఎంను అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు డీవైఈవోలు, ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాం. స్థానిక పరిస్థితులను అంచనా వేసుకుని అందుకనుగుణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు సమావేశాలకు హాజరయ్యేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యా శాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
హెచ్ఎం కులవివక్ష చూపుతున్నారని ఆందోళన
● ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ● విద్యాశాఖాధికారి హామీతో నిరసన విరమణ కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ తల్లిదండ్రులను కూడా చులకన చేసి మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన కారులకు సీఐటీయూ నాయకులు మద్దతు పలికారు. మండలంలోని ఎండపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లల పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, కులం పేరుతో దూషిస్తున్నారంటూ తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న జి.సురేష్ బోస్ పాఠశాలలో విద్యార్థుల మధ్య కుల వివక్ష చూపుతూ అగ్రకులాలకు చెందిన విద్యార్థులతో చులకనగా మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారులు వేణుగోపాల్, పైడిరాజు, ఎస్సై వెంకటేష్ పాఠశాల వద్దకు చేరుకుని ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. దీనిపై పూర్తిస్ధాయిలో విచారణ చేపడతామని, వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
గుర్తుతెలియని మృతదేహం స్వాధీనం
ఆలమూరు: మండలంలోని జొన్నాడ రావులపాలెం మధ్య ఉన్న గౌతమీ గోదావరి నదిలో గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం గోదావరి మధ్యలో సుమారు 50 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికుల కంటపడింది. వారు ఇచ్చిన సమాచారంతో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ నేతృత్వంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నీలం రంగ నిక్కరు, బనియను ధరించి ఉన్నాడు. అతనికి ఎడమ చేయి లేదు. కాళ్లు, చేతి వేళ్లు కొరికినట్టు ఉన్నాయి. ఈ మృతదేహాన్ని జంతువులు కొరికివేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మండపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 4న వాలీబాల్ ఎంపికలు అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన రాజమహేంద్రవరం ఆర్ట్స్ క్రీడా మైదానంలో జూనియర్స్ బాలుర, బాలికల ఎంపికలు జరుగుతాయని ఉమ్మడి జిల్లా వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి కుంచె యశ్వంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్ట్స్ మైదానంలో డాక్టర్ పరి మి రామచంద్రరావు మెమోరియల్ వాలీబాల్ కో ర్టులో ఈ ఎంపిక పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. జూనియర్స్ కేటగిరిలో పాల్గొనే బాల బాలికలు 2008 జనవరి 1వ తేదీ తర్వాత పుట్టినవారు ఈ పోటీలకు అర్హులు. ఈనెల 4వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డును సమర్పించాలని సూచించారు. వివరాలకు 99595 07330, 92472 59703 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని యశ్వంత్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరిపై కేసు కోటనందూరు: ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేసిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో తుని నుంచి నర్సీపట్నం బస్సు బయలుదేరింది. తుని మండలం రేఖవానిపాలెంలో దిగేందుకు దిమిటి రాజు డబ్బులిచ్చి టిక్కెట్ ఇమ్మని కండక్టర్ సలాది వరలక్ష్మిని అడిగాడు. చిల్లర లేదని ఫోన్ పే చేయమని కండక్టర్ చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బస్సు డ్రైవర్ను కాలర్ పట్టుకుని తోసేశాడు. రేఖవానిపాలెంలో బస్సు దిగిపోయిన దిమిటి రాజు కొంతమంది యువకులతో కలిసి కోటనందూరు సెంటర్లో బస్సును అడ్డగించి డ్రైవర్పై దాడి చేశాడు. ఇద్దరినీ ప్రయాణికులు విడదీయడంతో నర్సీపట్నంలో నీ సంగతి చూస్తామంటూ హెచ్చరించి వెళ్లిపోయారు. దీనిపై కండక్టర్ సలాది వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
ఉద్యోగుల నిర్వాకం.. దివ్యాంగులకు శాపం
● సదరం సర్టిఫికెట్ల కోసం పడిగాపులు ● ఉదయం 9 నుంచి ఒంటి గంట వరకూ నిరీక్షణ ● చివరకు అక్కడ ఈ సౌకర్యం లేదని చెప్పిన సిబ్బంది గోపాలపురం: గ్రామ పంచాయతీ, సచివాలయాల ఉద్యోగుల నిర్వాకం వల్ల దివ్యాంగులు అవస్థలు పడ్డారు. సదరం సర్టిఫికెట్ల కోసం గోపాలపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు ఉదయం 9 గంటలకు రావాలంటూ ఆయా గ్రామ పంచాయతీ, సచివాలయాల్లో దివ్యాంగులకు కాగితాలు అందజేశారు. గోపాలపురం నియోజకవర్గంలోని గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల నుంచి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు 10మంది దివ్యాంగులు వచ్చారు. కానీ అక్కడ వారికి చుక్కెదురైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ వేచి ఉన్నా సర్టిఫికెట్ ఇచ్చే వైద్యులు రాకపోవడంతో ఆకలితో అలమటించిపోయారు. అప్పటికి స్పందించిన సీహెచ్సీ సిబ్బంది ఈ ఆసుపత్రిలో సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని, ఇక్కడకు డాక్టర్లు రారని చెప్పడంతో నిరాశతో దివ్యాంగులు వెనుతిరిగారు. దీనిపై ఆసుపత్రి సూపర్రింటెండెంట్ డాక్టర్ చైతన్యరాజును వివరణ కోరగా సదరం సర్టిఫికెట్ల స్లాట్ బుకింగ్ ఇక్కడ లేదని, విశాఖ జిల్లా గోపాలపట్నంలో సదరం సర్టిఫికెట్లు ఇచ్చే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజమహేంద్రవరం, అనపర్తి ఆసుపత్రులకు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయన్నారు. గత నెలలో కూడా గ్రామ సచివాలయాలకు సూచించినప్పటికీ గోపాలపురం ఆసుపత్రికి పంపుతున్నారని తెలిపారు. -
భార్యపై అనుమానంతో హత్య
● ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఘటన ● కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కాకినాడ రూరల్: పచ్చని సంసారంలో అనుమానమనే జాడ్యం చిచ్చురేపింది. బతుకు తెరువు కోసం ఊరు గాని ఊరు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నింపింది. కష్ట సుఖాల్లో కడ వరకూ తోడు ఉంటానని ఏడు అడుగుల సాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్తే దారుణంగా సహధర్మ చారిణిని కడతేర్చాడు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఇంద్రపాలెం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇంద్రపాలెం పిల్ల కాల్వ ప్రాంతంలో అద్దెకు నివాసం ఉంటున్న బేతా మల్లీశ్వరి(47) భర్త గంగరాజు చేతిలో హత్యకు గురయ్యింది. మల్లీశ్వరి, గంగరాజు దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిది నర్సీపట్నం సమీపంలోని వేమూలపూడి గ్రామం. కూతురుకు కాకినాడ రూరల్ స్వామినగర్కు చెందిన వ్యక్తితో వివాహం జరిపించారు. కొడుకు మెకానిక్గా పనిచేస్తున్నాడు. పనీపాటూ లేకుండా ఇంటి వద్ద గడిపే గంగరాజు తరచూ భార్యను వేధించడంతో గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో కూతురు స్వామినగర్లో ఉండడంతో వారు కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు నెలన్నర కిత్రం మకాం వచ్చారు. అప్పటి నుంచి ఇంద్రపాలెం పిల్ల కాల్వ రోడ్డులో ఉంటున్నారు. మల్లేశ్వరి ఇంటింటా పాచి పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండగా, కొడుకు మెకానిక్గా పనిచేస్తున్నాడు. గంగరాజు భార్యపై అనుమానంతో ఆదివారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో కొడుకు తన సోదరి ఇంటికి వెళ్లాడు. మల్లీశ్వరితో గొడవ పెరిగి తీవ్ర వాగ్వాదం జరగడంతో నాపరాయితో తలపై గట్టిగా మోదాడు. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చిన కుమారుడు తల్లి గాయాలతో పడి ఉండడం చూసి ఇరుగుపొరుగు వారి సాయంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఇంద్రపాలెం ఎస్సై వీరబాబు కేసు నమోదు చేయగా సీఐ చైతన్య కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
నేటి నుంచి సత్రం గదుల అద్దె పెంపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్రాల అద్దెలు మంగళవారం నుంచి పెరగనున్నాయి. ఆయా సత్రాల్లో గదుల అద్దెల వివరాలు (జీఎస్టీతో కలిపి రూ.లలో) సత్రం గదులు పాత తాజా అద్దె అద్దె హరిహర సదన్ 84 (ఏసీ) 950 1,500 హరిహర సదన్ 51 (జనరల్) 600 800 ప్రకాష్ సదన్ (ఏసీ) 999 1,260 న్యూ సీసీ సత్రం 48 500 700 ఓల్డ్ సీసీ సత్రం 48 500 700 -
జీజీహెచ్లో ప్రత్యేక వైద్య సేవలు
స్క్రబ్ టైఫస్ బాధితుల చికిత్సకు కాకినాడ జీజీహెచ్ మెడికల్ వార్డులో నిష్ణాతులైన వైద్య నిపుణులు సేవలందిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ఆందోళనకు గురి కావద్దు. జీజీహెచ్లో ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నాం. కార్పొరేట్ వైద్యాన్ని ఆశ్రయించి, ఆర్థిక భారాన్ని తెచ్చిపెట్టుకోవద్దు. అనుమానితులకు ఆసుపత్రిలోని వీఆర్డీఎల్ ల్యాబ్లో ఇలీసా టెస్ట్ చేస్తున్నాం. స్క్రబ్ టైఫస్ సోకిన నలుగురు ప్రస్తుతం జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. – డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ అవగాహనతో అప్రమత్తం స్క్రబ్ టైఫస్పై అవగాహన పెంపొందించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అజిత్రోమైసిన్, డాక్సీసైక్లిన్ మాత్రలు అందుబాటులో ఉంచాం. విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. నవంబర్ నెలలోనే జిల్లా వ్యాప్తంగా 232 మంది అనుమానితులకు పరీక్షలు చేశాం. దీనిపై భయం వద్దు. అలాగని అతి విశ్వాసం నిర్లక్ష్యానికి దారి తీయవచ్చు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. – డాక్టర్ నరసింహ నాయక్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి, కాకినాడ -
విద్యార్థులతో కలిసి చిందులేసిన స్టార్స్
రాజానగరం: సినిమా ప్రమోషన్స్లో భాగంగా స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ)కి సోమవారం వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలో నటీనటులు కాలేజీ విద్యార్థులతో కలసి కొంతసేపు సందడి చేశారు. హీరోయిన్లు ఆషిక రంగనాథ్, డింపుల్ హయాతీ చిత్రంలోని పాటలను విడుదల చేస్తూ, ఆయా పాటలకు అనుగుణంగా విద్యార్థులతో కలసి స్టెప్స్ వేస్తూ, కేరింతలు కొట్టించారు. విద్యార్థులతో సెల్ఫీలు తీసుకున్నారు. తొలుత దర్శకుడు కిషోర్ తిరుమల ఆధ్వర్యంలో యూనివర్సిటీకి వచ్చిన చిత్ర బృందానికి జీజీయూ చాన్సలర్ కేవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) ఆహ్వానం పలికారు. -
అవగాహన, ఆచరణలే రక్ష
కాకినాడ క్రైం: ఎయిడ్స్ వ్యాప్తిని నివారించేందుకు అవగాహన, ఆచరణలే రక్ష అని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్ఓ) జె.నరసింహ నాయక్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అనుబంధ ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆధ్వర్యాన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో బెలూన్లు ఎగరవేశారు. అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాలాజీ చెరువు సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ అవగాహన నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో డీఎంహెచ్ఓ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ మనీష, రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ, ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన విస్తృతమవుతున్న కొద్దీ కేసులు తగ్గుతాయని అన్నారు. హెచ్ఐవీ బారిన పడిన బాలలతో అధికారులు సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ చలమయ్య, డీసీహెచ్ఎస్ మహేష్, రంగరాయ వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగాధిపతి ప్రసన్న కుమార్, జీజీహెచ్ సీఎస్ ఆర్ఎంవో కోమల తదితరులు పాల్గొన్నారు. -
పిఠాపురం సీహెచ్సీలో సెక్యూరిటీ గార్డే వైద్యుడు
పిఠాపురం: కాకినాడ జిల్లా పిఠాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) వైద్యులు రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేటు బయట కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డుతో రోగులకు వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఈ సీహెచ్సీలో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు గర్భిణి ప్రాణాలు పోయాయంటూ బాధితులు ఆందోళన చేశారు. దీనిపై విచారణ జరిపి, ఆస్పత్రి సూపరింటెండెంట్ను సరెండర్ చేసినా... ఆస్పత్రి వర్గాల్లో ఏ మార్పూ కనిపించడం లేదు. వైద్యులు కబుర్లతో కాలక్షేపం చేస్తుంటే... కాపలా కాయాల్సిన సెక్యూరిటీ గార్డు వైద్య సేవలు అందిస్తున్నాడు. అంతేకాకుండా వైద్యులు, శిక్షణ పొందిన తోటీలు చేయాల్సిన పోస్టుమార్టం ప్రక్రియను కూడా ఆ సెక్యూరిటీ గార్డుతోనే చేయిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళ గాయాలు, ఇతర అనారోగ్య సమస్యలతో వస్తే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డే వైద్యసేవలు అందిస్తున్నారు. గాయాలకు కుట్లు వేయడం వంటివి చేస్తున్నారు. దీంతో రోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో వేలాది మంది రోగులకు వైద్యసేవలు అందించాల్సిన ఆస్పత్రిలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో దిగజారిన ప్రభుత్వ వైద్యసేవలకు ఈ ఆస్పత్రి ఒక నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ కీర్తిప్రియను ‘సాక్షి’ వివరణ కోరగా... తమ ఆస్పత్రిలో తోటీలు లేనందున సెక్యూరిటీ గార్డుతో పోస్టుమార్టం విధులు చేయిస్తున్నట్లు తెలిపారు. -
‘జల’సౌందర్యం
అసలే గిలిగింతలు పెడుతున్న చలికాలం.. ఆపై నీలాల నింగిని ఆవరించిన మేఘమాలికలు.. అది చాలదా అన్నట్లు నేలమ్మపై అపార జలరాశి.. గాలి తరగలకు సుతారంగా కదులుతున్న చిన్నిచిన్ని అలలు.. ఈ అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించడానికి రెండు కన్నులూ చాలవేమోననే అనుభూతికి లోనయ్యారు.. ఏలేరు జలాశయాన్ని ఆదివారం సందర్శించిన వారు. ప్రస్తుతం రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 859 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీని పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, ఆదివారం 85.67 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను 22.30 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ఆయకట్టుకు, తిమ్మరాజు చెరువుకు నీటి సరఫరాను నిలిపివేశారు. విశాఖకు 175 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. – ఏలేశ్వరం -
వైద్యుడి సస్పెన్షన్
ఫ విధుల నుంచి స్టాఫ్ నర్స్ తొలగింపు తుని: స్థానిక ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసిన అనంతరం ఓ యువకుడి కాలు లోపలే సర్జికల్ బ్లేడ్ ఉంచి కుట్లు వేసిన ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ సంఘటనపై ‘బోల్టు తొలగించమంటే.. బ్లేడు వదిలేసి కుట్టేశారు’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్తకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని జిల్లా వైద్యాధికారి చక్రధర్బాబును ఆదేశించారు. ఆ మేరకు చక్రధర్బాబు ఆసుపత్రిలో ఆదివారం విచారణ చేపట్టారు. ఆపరేషన్ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్స్ పద్మావతి నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్ధారించారు. ఈ మేరకు ఇచ్చిన నివేదిక ఆధారంగా వారిద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలే.. అల్కాట్ గార్డెన్స్ (రాజమహేంద్రవరం రూరల్): వరాలు, శాపాలు దేవతల ప్రణాళికలేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన స్థానిక హిందూ సమాజంలో నిర్వహిస్తున్న వ్యాస భారత ప్రవచనాల్లో భాగంగా నాలుగో రోజైన ఆదివారం ఆయన గరుత్మంతుని ఆవిర్భావం, మహిమలను వివరించారు. ‘ఉచ్చైశ్రవం అనే అశ్వం తోకకు చుట్టుకుని, నల్లగా కనపడేటట్లు చేయాలని కద్రువ తన సంతానమైన సర్పాలను ఆదేశించింది. అలా చేయడానికి తిరస్కరించిన కొన్ని సర్పాలను జనమేజయుడి సర్ప యాగంలో ఆహుతి కమ్మని శపించింది. అయితే, ఈ సర్పాలు అత్యంత తీవ్రమైన విషాన్ని, మానవ జాతిని నాశనం చేసే శక్తి కలిగినవి. వినత తొందరపాటుతనంతో ఒక అండాన్ని పగులగొట్టినందుకు, పూర్తి అంగాలు ఏర్పడని ఒక కుమారుడు కలిగాడు. అతనే సూర్యుని రథసారథిగా వెళ్లిపోయాడు. మరో అండం నుంచి గరుత్మంతుడు వెలువడ్డాడు. అతడు వేద స్వరూపుడు. వేదంలోని ఛందస్సులు ఆయన రెక్కలు. వేదంలో సౌపర్ణ సూక్తాలు కనపడతాయి. వీటిని చదవలేని వారి కోసం వేదవ్యాసుడు 12 శ్లోకాలతో దేవతలు చేసిన గరుడ స్తుతిని మనకు అందించారు. గరుత్మంతుని స్తోత్రంలో విష్ణుపరమైన నామాలు, విష్ణు సహస్రంలో ‘సుపర్ణ’ ఇత్యాది గరుత్మంతుని నామాలు కనబడతాయి’ అని సామవేదం వివరించారు. ‘తల్లి దాస్య విముక్తికి సుర లోకం నుంచి అమృతాన్ని తీసుకువచ్చిన గరుత్మంతుడు దర్భలపై ఆ కలశాన్ని ఉంచాడు. స్నానం చేసి రావడానికి సర్పాలు వెళ్లాక, ఇంద్రుడు వచ్చి అమృత కలశాన్ని తీసుకువెళ్లిపోయాడు. వచ్చిన సర్పాలు దర్భలను నాకడం వలన వాటి నాలికలు రెండుగా చీలిపోయాయి. దర్భలు పవిత్రమైనవిగా భావించడానికి కారణం– వాటిపై గరుత్మంతుడు అమృత కలశాన్ని ఉంచడమే. విషసర్పాలకు అమృతం ఇవ్వడం ప్రమాదకరమని భావించి, ఇంద్రుడు ఈ కార్యానికి పూనుకున్నాడు. గరుత్మంతుడు, ఆయన తల్లి దాస్యవిముక్తులయ్యారు’ అని సామవేదం వివరించారు. కష్టాన్ని సహించడమే తపస్సు అని చెప్పారు. విద్య అంటే సమాచార సేకరణ కాదని, ఒక దివ్యమైన శక్తి అని, మనది విద్యల దేశమని, ఇక్కడున్నన్ని విద్యలు మరెక్కడా లేవని అన్నారు. నిలబడి ఆచమనం చేయరాదని, ఆచమనం చేసేటప్పుడు చప్పుడు చేయరాదని, ఆచమన జలం మీసాలకు తగలరాదని, వేడిగా ఉండరాదని చెప్పారు. పనికిమాలిన చరిత్ర పుస్తకాలు చదివే మనం మహర్షులు రాసిన సత్యాలను నమ్మకపోతే ఎలాగని సామవేదం ప్రశ్నించారు. బ్యాంకుల ప్రైవేటీకరణను అడ్డుకోవాలి రాజమహేంద్రవరం సిటీ: నూతన కార్మిక చట్టాల వల్ల కార్మికులకు తీవ్రమైన నష్టం పొంచి ఉందని యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం, ఆంధ్ర, తెలంగాణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. నగరంలో ఆదివారం జరిగిన యూనియన్ బ్యాంక్ అవార్డు ఉద్యోగుల సంఘం ప్రాంతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్యాంకుల ప్రైవేటీకరణను అన్ని విధాలా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాలంతో పాటు బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి, సమస్యలపై పోరాటం సాగించాలని సూచించారు. యూనియన్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఉదయ కుమార్ మాట్లాడుతూ, రోజువారీ బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. ఈ సందర్భంగా నూతన ప్రాంతీయ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
కాకినాడ లీగల్: క్రీడలతో శారీరక దృఢత్వం, మానసికోల్లాసం పెరుగుతాయని కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. స్థానిక రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో జరుగుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదుల క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆనంది మాట్లాడుతూ, ఇలాంటి పోటీలు స్నేహభావాన్ని పెంచుతాయని అన్నారు. చివరి రోజు సెమీ ఫైనల్స్లో న్యాయవాది కాకర వెంకటేశ్వరరావు జట్టుపై మరో న్యాయవాది జి.మోహన్ మురళీ జట్టు విజయం సాధించింది. న్యాయవాది పేపకాయల రామకృష్ణ జట్టుపై న్యాయవాది ఏలూరి సుబ్రహ్మణ్యం జట్టు విజయం సాధించింది. ఫైనల్స్లో టాస్ గెలిచిన జి.మోహన్ మురళి జట్టు బ్యాటింగ్ ఎంచుకుని, 148 పరుగులు చేసింది. అనంతరం, 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఏలూరి సుబ్రహ్మణ్యం జట్టు 58 పరుగులు చేయగా, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో నెట్ రన్ రేట్ ప్రకారం మోహన్ మురళి జట్టు విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది సీరీస్గా విప్లవజ్యోతి, మ్యాచ్లో ఆల్ రౌండర్గా కాకినాడ మూడో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కె.మోతీలాల్ ఎంపికయ్యారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
పిఠాపురం: ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ 30వ మహాసభల ముగింపు సందర్భంగా రెండో రోజైన ఆదివారం స్థానిక రథాలపేటలోని అంబేడ్కర్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలులో ప్రతినిధుల సభ నిర్వహించారు. తొలుత ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షురాలు జి.చిన్ని స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో కూడిన జెండా ఎగురవేశారు. స్వాతంత్ర సమర యోధులు భగత్సింగ్, అల్లూరి సీతారామరాజు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రటాలకు రామ్మోహన్, ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కమిటీ కన్వీనర్ చిన్ని, జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన ప్రతినిధులతో నిర్వహించిన మహాసభలో రామ్మోహన్ మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ 55 సంవత్సరాలుగా నిరాటంకంగా పోరాడుతోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీఓ 77ను తక్షణమే రద్దు చేయాలని, రూ.6,400 కోట్ల ఫీజ్ రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 9 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కనీస సౌకర్యాలు లేవని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలుల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నూతన భవనాలు తక్షణం నిర్మించాలని, యు.కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో పీజీ కళాశాల లేక విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. అందువలన డిప్యూటీ సీఎం తక్షణమే స్పందించి నియోజకవర్గంలో ప్రభుత్వ పీజీ కళాశాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల సమయానికి అనుగుణంగా విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్ఎఫ్ఐ నాయకులు జి.శ్రీకాంత్, సీహెచ్ సాహిత్, అమృత, లోవరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా పలువురు నాయకులు పాల్గొన్నారు.సమావేశంలో మాట్లాడుతున్న రామ్మోహన్ పతాకావిష్కరణ చేస్తున్న నాయకులు0000669853-000001-VJA ADSALES SPO 10.00x8.00 VJA ADSALES SPOT PAYMENT ACCOUNTఫ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ ఫ ముగిసిన జిల్లా మహాసభలు -
అన్నప్రసాద పథకానికి విరాళం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో నిత్య అన్నప్రసాద పథకానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు జేపీనగర్కు చెందిన పీసపాటి సూర్యనరసింహ శ్రీనివాస్, సత్యసూర్య పూర్ణిమ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళంగా సమర్పించారు. దాతలకు దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
AP: ‘మా సీట్లో నువ్వు కూర్చుంటావా’..?
కాకినాడ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం రగడ చోటు చేసుకున్న ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. ప్రయాణికుడ్ని జట్టుపట్టుకుని చితకబాదారు మహిళా ప్రయాణికులు. తాము కర్చీఫ్ వేసుకున్న సీట్లో పురుష ప్రయాణికుడు కూర్చోవడంతో గొడవ ఆరంభమైంది. మాటామాటా పెరగడంతో ఆ పురుష ప్రయాణికుడ్ని జట్టు పట్టుకుని చితకబాదారు. ఆ దాడితో బస్సులోని మిగతా ప్రయాణికులు నివ్వెరపోయారు. ఏం చేయాలో తెలియక, ఈ గొడవ ఎటు తిరిగి ఎటు పోతుందోననే భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఇది తుని-నర్సీపట్నం మధ్య నడిచే ఆర్టీసి బస్సులో జరిగింది. ఇదిలా ఉంచితే, ఇటీవల విజయవాడ మార్గంలో మహిళల మధ్య సీటు కోసం వాగ్వాదం చోటు చేసుకుని శారీరకంగా దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పెనుగంచిప్రోలు నుండి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు సీటు కోసం వాగ్వాదం ప్రారంభించారు అది ఆ తర్వాత సోడా బాటిల్తో దాడి చేయడం వరకు వెళ్లింది. మహిళల మధ్య తీవ్ర తగాదామరో సంఘటనలో మహిళలు ఒకరినొకరు జుట్టు లాగడం, చెంపదెబ్బలు కొట్టుకోవడం వంటి హింసాత్మక చర్యలకు దిగారు. ప్రయాణికులు వీడియో తీసి ఆన్లైన్లో షేర్ చేయడంతో ఈ ఘటన కూడా పెద్ద చర్చకు దారితీసింది..* -
ముళ్లకు నెలలు బ్రేక్
3అన్నవరం: మూడు ముళ్లబంధంతో కొత్త జంటలు ఒక్కటవ్వడానికి మూడు నెలలు బ్రేక్ పడనుంది. ప్రాగస్తమిత శుక్ర మూఢమి ఆదివారం ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఫిబ్రవరి 13న మాఘ బహుళ ఏకాదశి నాడు ముగుస్తుంది. దీంతో, సుమారు మూడు నెలల పాటు వివాహాది శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. తిరిగి ఫిబ్రవరి 19 నుంచి వివాహాలు జరగనున్నాయి. కొద్ది నెలలుగా వివాహాది శుభకార్యాలతో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సందడిగా మారింది. గత ఆశ్వయుజం, కార్తిక మాసాల్లో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ప్రస్తుత మార్గశిర మాసంలో కూడా గత తొమ్మిది రోజులూ పెళ్లిళ్లు జోరుగానే జరిగాయి. ఈ వివాహాల కారణంగా కార్తిక మాసం అనంతరం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొంది. అటువంటిది నేటి నుంచి మూఢమి ప్రారంభ కానుండటంతో ‘మాంగల్యంతంతునానేనా..’కు విరామం కలగనుంది. మాఘంలో కూడా వివాహాలు లేనట్టే.. ఈసారి వచ్చే జనవరి 19న ప్రారంభమయ్యే మాఘ మాసంలో కూడా పెద్దగా వివాహాలు లేవు. ఆ నెలలో సుమారు 20 రోజుల పాటు శుక్ర మూఢమి కొనసాగడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఆ తరువాత కూడా వివాహ ముహూర్తాలు లేవు. తిరిఇ ఫాల్గుణ మాసంలోనే పెళ్లి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 18న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. అదే నెల 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలున్నాయి. అప్పటి నుంచి మార్చి 17వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. మార్చి 19న పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి వివాహాలు మళ్లీ మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఏటా మార్గశిరం, మాఘ మాసాల్లో రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది శుక్ర మూఢమి కారణంగా ఫిబ్రవరి 13 వరకూ వివాహాలు లేకపోవడంతో వివాహ మండపాలు, పురోహితులు, క్యాటరింగ్, సన్నాయి మేళం, ఫ్లవర్ డెకరేషన్ తదితర రంగాల వారి ఉపాధికి కొంత ఇబ్బందే కలగనుంది. నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకూ శుక్ర మూఢమి వివాహాది శుభకార్యాలకు ఆటంకం మళ్లీ ఫిబ్రవరి 19 నుంచే ‘మాంగల్యంతంతునానేనా..’ -
నిబంధనలకే ప్రాధాన్యం
● అన్నదాతలకు ‘తేమ’ ఇక్కట్లు ● 17 శాతం లోపు ఉంటేనే కొంటున్న మిల్లర్లు ● ఇదే అదనుగా దళారుల దందా ● బస్తాకు రూ.400 వరకూ కోత ● నష్టపోతున్న రైతులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం తరచుగా చెబుతూనే ఉంది. కానీ, క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుల నుంచి ఆవిధంగా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. ముఖ్యంగా తేమ శాతం నిబంధనలు అన్నదాతలకు తలనొప్పిగా మారాయి. మరోవైపు గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వానికి విక్రయిస్తే ధాన్యం డబ్బులు వెంటనే రావనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఈ బాధలు పడలేక, మరో గత్యంతరం లేక ఎక్కువ మంది రైతులు దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. తేమ శాతం సాకుతో.. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్లో రైతులు 2.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇప్పటి వరకూ 1.60 లక్షల ఎకరాల్లో వరి కోతలు జరిగాయి. సామర్లకోట, పిఠాపురం, కరప, కొత్తపల్లి, గొల్లప్రోలు, తుని, శంఖవరంతో పాటు పలు మండలాల్లో ఇప్పటికే కోతలు దాదాపు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని రైతులు రోడ్లు, కళ్లాల్లో ధాన్యం ఆరబోసుకొంటున్నారు. సాధారణ రకం ధాన్యం బస్తాకు (75 కేజీలు) రూ.1,777, సన్న రకాలకు రూ.1,792 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. తీరా కొనుగోలుకు వచ్చేసరికి ఆవిధంగా జరగడం లేదు. సంప్రదాయ పద్ధతిలో కోతలు కోస్తే పెట్టుబడి ఎక్కువైపోతున్నందున జిల్లాలోని అత్యధిక శాతం రైతులు యంత్రాలతోనే వరి కోతలు చేపడుతున్నారు. కోతలు పూర్తయిన రెండు మూడు రోజుల తర్వాత రైతు సేవా కేంద్రాలకు (ఆర్ఎస్కే) ధాన్యం తీసుకువెళ్తున్నారు. అక్కడి సిబ్బంది ఆ ధాన్యాన్ని సమీప రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడకు వెళ్లిన తర్వాత రైతులకు అసలు కష్టాలు మొదలవుతున్నాయి. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబోసి మళ్లీ తీసుకు రావాలని చెబుతున్నారు. దీంతో, రైతులకు రవాణా ఖర్చులు అదనపు భారంగా మారుతున్నాయి. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేస్తున్నారు. రైతుల నుంచి బస్తా ధాన్యానికి రూ.300 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో వాతావరణం కూడా రైతులను కలవరపెడుతోంది. ధాన్యం ఆరబోసిన సమయంలో అనుకోకుండా వర్షం కురిస్తే మొదటికే మోసం వస్తుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. ఈ కష్టాలకు ఎదురీదలేక దళారులు చెప్పిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అధికారుల అంచనా. ఇందులో 3 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సర్కారు కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరబెట్టడానికి అదనపు ఖర్చు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉండాలంలంటే రైతులు కుప్పలు వేసి కనీసం వారం, పది రోజులు పైగా నిల్వ ఉంచాలి. లేదంటే యంత్రాలతో పంట కోతల తరువాత వారం రోజులు పైగా కళ్లాలు, రహదారులపై ధాన్యం ఎండబోయాలి. ఇలా చేయాలంటే కూలి ఖర్చుల వంటి రూపాల్లో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రతి గింజా మద్దతు ధరకే కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులెప్పుడొస్తాయో..! గత ఏడాది ఖరీఫ్లో ధాన్యం అమ్మిన రైతులకు సుమారు రెండు నెలలు గడచినా కూడా ప్రభుత్వం డబ్బు జమ చేయలేదు. దీంతో, అప్పట్లో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూడా ఒకవేళ మద్దతు ధరకు ఆశ పడి ఆర్ఎస్కేల ద్వారా మిల్లుకు తరలించినా.. గతానుభవం దృష్ట్యా అమ్మిన ధాన్యానికి ప్రభుత్వం ఎప్పటికో కానీ డబ్బులివ్వదేమోనని రైతులు భయపడుతున్నారు. మిల్లుకు ధాన్యం తరలించిన 24 గంటల్లో తమ ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని చెప్పడమే తప్పా నెలల తరబడి ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయాలకు వారు సంకోచిస్తున్నారు. వచ్చేది తక్కువే అయినా మరో దారి లేక దళారులకే అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.90 వేల టన్నుల కొనుగోలు ఇప్పటి వరకూ 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ధాన్యంలో తేమ శాతం 17 లోపు ఉంటే మద్దతు ధర తప్పకుండా వస్తుంది. కోసిన వెంటనే కాకుండా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని ఆర్ఎస్కేల్లో మాత్రమే విక్రయించాలి. దళారులను నమ్మి తక్కువ రేటుకు విక్రయించవద్దు. – దేవుల నాయక్, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ ‘మద్దతు’ దక్కడం లేదు వారం పది రోజులు ఆరబెడితే మాత్రమే మద్దతు ధర ఇస్తామని అంటున్నారు. అందుకే బయటి వ్యక్తులకు బస్తా రూ.1,550కి అమ్ముకున్నాం. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలి. – సామన గంగారావు, రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం 75 రోజులు పట్టింది గత ఏడాది ఖరీఫ్లో ఆర్ఎస్కేల ద్వారా మిల్లుకు ధాన్యం విక్రయించాను. సంబంధిత డబ్బు నా ఖాతాలో జమ చేయడానికి 75 రోజులు పట్టింది. దీంతో, రబీలో బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేసి, సాగు చేయాల్సి వచ్చింది. అందుకే, ప్రభుత్వానికి ధాన్యం అమ్మాలంటే భయపడాల్సి వస్తోంది. – కర్నీడి వీర్రాజు, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలం -
నూతన విద్యా విధానం.. పేదలకు చదువులు దూరం
● ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ ● పిఠాపురంలో ఆ సంఘం జిల్లా మహాసభలు పిఠాపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేద, మధ్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా 30వ మహాసభలు పిఠాపురంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ ప్రసంగించారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ధోరణిని చొప్పించేందుకే నూతన జాతీయ విద్యా విధానం, ఎల్ఓసీఎఫ్ విధానాలు అమలు చేస్తోందని అన్నారు. తద్వారా విద్యార్థులో శాసీ్త్రయ దృక్పథానికి బదులు అశాసీ్త్రయ భావాలు చొప్పిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తన భుజాన వేసుకుని అమలు చేస్తోందని అన్నారు. కేంద్రం విధానాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల విలీనం, మోడల్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలను అనుమతించబోమంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల రాజ్యాంగపరమైన హక్కుకు ఈ ఉత్తర్వులు విఘాతంగా మారాయన్నారు. అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఆ హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీఓ నంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం నాడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి, విద్యార్థులందరూ రాజకీయ నాయకులుగా తయారు కావాలని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే నిర్వహించాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని విద్యారంగ సమస్యలను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ తానే పరిష్కరిస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పిఠాపురంలోని ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి, ఎప్పుడు మీద కూలుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని, ఇక్కడ నూతన భవనాలు కట్టించకపోవడం దుర్మార్గమని అన్నారు. పిఠాపురం నియోజవర్గంలోని గొల్లప్రోలు జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి, నూతన భవనం నిర్మించాలని, కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షురాలు జి.చిన్ని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కె.సిద్ధు, జిల్లా నాయకులు సాయిత్, అమృత, నాని, సంతోష్, జైరామ్, వడ్డి కాసులు తదితరులు పాల్గొన్నారు. -
భారీగా వదిలిన ‘నేతి’చమురు
● టెండర్ ద్వారా కొనాలని గత ఆగస్టులో కమిషనర్ ఆదేశం ● ఇప్పటికే కొటేషన్ ద్వారానే కొనుగోళ్లపై ఆగ్రహం ● అన్నవరం దేవస్థానంపై సుమారు రూ.50 లక్షల భారం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నేతిని టెండర్ ద్వారా కాకుండా కొటేషన్ పద్ధతిపై కొనుగోలు చేయడంపై దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయమై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్లాల్, కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓ వీర్ల సుబ్బారావును ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని గత ప్రభుత్వ హయాంలో టెండర్ ద్వారా పిలిచి ఖరారు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లు రద్దు చేసి, సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి కొనాలని ఆదేశించింది. ఆ ప్రకా రం సంగం, విజయ డెయిరీల నుంచి కిలో సుమా రు రూ.590కి కొంటున్నారు. అయితే, గత ఆగస్టు లో టెండర్ పిలిచి, ఆవు నెయ్యి కొనుగోలు చేయా లని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ, దేవస్థానంలో పాత పద్ధతిలోనే కొటేషన్ల ద్వారా ఇప్ప టి వరకూ సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి, 60 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. అదే టెండర్ ద్వారా అయితే కేజీ నెయ్యి రూ.50 నుంచి రూ.100 తక్కువకు వచ్చేదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. తద్వారా దేవస్థానంపై రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ భారం తగ్గేద ని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఈఓను ఉన్నతాధికారులు ఆదేశించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. మూడు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని 6 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. దశమి తిథి కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆన్లైన్లో సత్యదేవుని సేవా టికెట్లు అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం కొనుగోలు, వసతి గదుల కేటాయింపు తదితర సేవల కు ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చునని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామివారి అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు కూడా ఆన్లైన్లో చెల్లించవచ్చునని తెలిపారు. ఆన్లైన్ టికెట్ల కోసం APTEMPLES.ORG వెబ్సైట్ ద్వారా అన్నవరం దేవస్థానాన్ని సంప్రదించాలన్నారు. అలాగే, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా నిర్దేశిత మొత్తం చెల్లించి పై సేవలు పొందవచ్చని తెలిపారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ తదితర యూపీఐ యాప్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు. -
● దిగంబరా.. దిగంబరా.. శ్రీపాద వల్లభ దిగంబరా..
స్థానిక శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అభిషేకాలు, ప్ర త్యేక పూజలతో ఈ వేడుకలకు శ్రీకారం చుట్టారు. తొ లి రోజు స్వామివారి పల్లకీ సేవ పుర వీధుల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తమ చెంతకే వచ్చిన స్వామిని కన్నులారా తిలకించి భక్తులు పులకించిపోయారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయ స్వామి అవతారంగా భక్తులు భావించే శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం కావడంతో పిఠాపురంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇక్కడకు దేశంలోని వివిధ ప్రాంతాలతో పా టు ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భ క్తులు తరలి వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరాఠీ భక్తులు ఈ వారం రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది సుమారు 30 వేల మంది మరాఠీ భక్తులు వచ్చే అవకాశం ఉందని ఆలయ ఈఓ ఆర్.సౌజన్య తెలిపారు. – పిఠాపురం -
కొబ్బరికి మూ‘ఢాం’
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడు నెలల క్రితం ధర ఎంత వేగంగా పెరిగిందో.. ఇప్పుడు అంతకంటే వేగంగా పతనమవుతోంది. కార్తీక మాసం పూర్తవడంతో ఉత్తరాదికి కొబ్బరి ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ధర పడిపోయింది. రెండున్నర నెలల పాటు ఉండే శుక్ర మౌఢ్యమి మొదలవుతుండటంతో ఎగుమతులు మరింత క్షీణించి.. ధర మరింత పతనమైంది. రాష్ట్ర మార్కెట్కు దిక్సూచిగా నిలిచే అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13,500 నుంచి రూ.14 వేలు మాత్రమే పలుకుతోంది. రెండు నెలల క్రితం పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.28 వేల వరకూ ఉండేది. గత నెలలో రూ.23 వేలకు పడిపోయింది. నాలుగు రోజుల క్రితం వెయ్యి కాయల ధర రూ.16 వేలకు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రూ.13,500కు పతనమైంది. నాలుగు రోజుల్లో రూ.2,500 వరకూ ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.ఎగుమతులు 20లోపు లారీలేదీపావళి, కార్తీక మాసం పూర్తవడం, తమిళనాడు, కేరళల్లో దిగుబడులు పెరగడంతో రాష్ట్రంలో పండిన కొబ్బరికి డిమాండ్ తగ్గింది. దీంతోపాటు శుక్ర మౌఢ్యమి కారణంగా ధరలు మరింత పడిపోయాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. రోజుకు 20 లారీలలోపు పచ్చి కొబ్బరి ఎగుమతి మాత్రమే జరుగుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ప్రభావం మార్కెట్పై పడుతోందని వారు చెబుతున్నారు. -
అట్టహాసంగా రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్
క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న ముఖ్య అతిథి డీఈఓ రమేష్ ● పోటీలను ప్రారంభించిన డీఈఓ రమేష్ ● చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమేనని విద్యార్థులకు పిలుపు ● పది జిల్లాల నుంచి 400 మంది హాజరు ● రేపటి వరకు పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ అన్నారు. శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ఐ అంతర్ జిల్లాల జిమ్నాస్టిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉపవిద్యాశాఖ అధికారి సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీఈఓ రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలకు క్రీడా సామగ్రిని అందిస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వాటిని అందించారని, త్వరలో కాకినాడ జిల్లాలోని పాఠశాలలకు ఆ సామగ్రి అందిస్తామన్నారు. జిల్లా ఎస్జీఎఫ్ఐ వారు ఈ ఏడాది 5 రాష్ట్ర స్థాయి మీట్లు తీసుకున్నారని, ఇది నాలుగో మీట్ అని, పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీనులను అభినందించారు. ఈ ఏడాది ఉపాధ్యాయులకు కూడా మండల స్థాయి నుంచి పోటీలు నిర్వహిస్తున్నామని, అవి శనివారం నుంచి ప్రారంభం కానున్నాయన్నారు. డీవైఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ గెలుపు ఓటముల కన్నా క్రీడాస్ఫూర్తి ప్రధానం అన్నారు. ఎస్జీఎఫ్ఐ అడ్మిన్ కార్యదర్శి సుధారాణి మాట్లాడుతూ ఈ నెల 30 వరకు జరిగే ఈ పోటీలకు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీలలో పాల్గొంటున్నారన్నారు. డీఎస్డీఓ సతీష్కుమార్ మాట్లాడుతూ స్టేడియంలో జాతీయస్థాయి ప్రమాణాలతో జిమ్నాజియం ఉందని, వచ్చే ఏడాది జాతీయస్థాయి ఎస్జీఎఫ్ఐ జిమ్నాస్టిక్స్ పోటీలను ఏదో ఒక విభాగంలో కాకినాడకు కేటాయించేలా చూడాలని డీఈఓను కోరారు. పెద్దాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు, జిమ్నాస్టిక్స్ సంఘ ప్రతినిధి విఠల్, కాకినాడ రూరల్ ఎంఈఓ రంగారావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, మాచరరావు, శ్రీప్రకాష్ విద్యాసంస్థల డైరెక్టర్ విజయ్ప్రకాష్, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి శ్రీను క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ జెండాను డీఈఓ రమేష్, ఎస్జీఎఫ్ఐ జెండాను డీఎస్డీఓ ఆవిష్కరించారు. వివిధ జిల్లాల క్రీడాకారులు కవాతు చేసి డీఈఓకు గౌరవ వందనం చేశారు. పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి బెలూన్లు ఎగురవేశారు. డీఈఓ క్రీడాజ్యోతిని వెలిగించారు. సెయింట్ అన్స్ ఎయిడెడ్ పాఠశాల విద్యార్థుల యోగాసనాలు ఆహూతులను ఆకట్టు కున్నాయి. కార్యక్రమంలో జిమ్నాస్టిక్స్ సంఘ అధ్యక్షుడు ఎం.విశ్వేశ్వరరావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, పీడీలు ప్రసాద్, హరిబాబు, సూరిబాబు, సురేష్రాజు, దీప్తి ఎస్తేరు, మౌని, త్రిపుల, దుర్గ, డీఎస్ఏ జిమ్నాస్టిక్స్ కోచ్ సురేష్, జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఎంపిక కమిటీ సభ్యులు శరత్చంద్ర, జిమ్నాస్టిక్స్ క్రీడాకారిణి యాసిన్, వివిధ జిల్లాల కోచ్లు, మేనేజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పిల్లల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించాలి
● సినీ గేయరచయిత భాస్కరభట్ల ● ఉత్సాహంగా ‘కేరింతలు’ కంబాలచెరువు: పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని ప్రముఖ సినీ గేయ రచయిత, కవి భాస్కరభట్ల రవికుమార్ అన్నారు. శ్రీ షిర్డీ సాయి విద్యా సంస్థల ఆధ్వర్యంలో కేరింతలు పేరుతో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తుకు విద్య ఒక్కటే కొలమానం కాదని, వారిలో విద్యతో పాటు ఏ ఇతర రంగాల్లో ఆసక్తి ఉందో గమనించి, దానికి అనుగుణంగా ప్రోత్సహించాలన్నారు. మరో ముఖ్య అతిథి 9వ అదనపు జిల్లా సివిల్ జడ్జి మాధురి మద్దాలి మాట్లాడుతూ తల్లితండ్రులు తమ పిల్లలకు కొంత సమయం కేటాయిస్తే బంధాలు బలపడతాయన్నారు. పిల్లలు చెప్పిన విషయాలను వింటూ, మంచి చెడులను వారికి తెలియజేయాలన్నారు. ముందుగా శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల వ్యవస్థాపకులు స్వర్గీయ పాలేశ్వరరావు సతీమణి నాగమణి చేతుల మీదుగా అతిథుల జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, సివిల్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీలేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న వాడపల్లి ఖ్యాతి
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం ఖ్యాతి దేశ వ్యాప్తంగా విస్తరిస్తుంది. రోజూ ముఖ్యంగా శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచీ అత్యధిక సంఖ్యలో భక్తులు వాడపల్లికి తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ‘ఏడు వారాల వెంకన్న దర్శనం–ఏడేడు జన్మల పుణ్యఫలం’ నానుడితో ‘ఏడు వారాల వెంకన్న’గా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం తిరుమల (పెద్ద తిరుపతి) తరహాలో వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రం నుంచి శుక్రవారం 16 మంది సభ్యుల భక్త బృందం వాడపల్లి క్షేత్రాన్ని సందర్శించి స్వామిని దర్శించుకున్నారు. వారు మాట్లాడుతూ ఓం నమో వేంకటేశాయనమః అని నమస్కరిస్తూ తాము అందరం ఒడిశా నుంచి వచ్చామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగులమని, దేశ వ్యాప్తంగా అనేక పుణ్య క్షేత్రాలు, ఆయా దేవతామూర్తుల గురించి తెలుసు.. కానీ ఈ వాడపల్లి క్షేత్రం, ఈ దేవుడి విశిష్టత గురించి ఇటీవలే తెలిసిందన్నారు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటామని వారన్నారు. -
అందరికీ చంద్ర గోల్డ్ టీ
● జనసేన కీలక నేతకు నజరానా ● రిటర్న్ గిఫ్ట్గా టీ టైమ్ మినీ మార్ట్లు ● జనం కోరుతున్న కందిపప్పునకు మంగళం ● డిసెంబర్ కోటాలో టీ పొడి అమ్మకాలు ● ఎవరూ అడగకపోయినా ప్రభుత్వం వింతపోకడ ● కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు చీర కొనిపెట్టాడనే సామెత చందాన చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగుతోందనే విమర్శలు వస్తున్నాయి. బాబు గద్దెనెక్కి ఏడాదిన్నర అవుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయాలని జనం నెత్తీనోరూ బాదుకుంటున్నా స్పందన లేదు. ప్రతి పేద కుటుంబానికీ అత్యవసరమైన కందిపప్పు సరఫరాకు మంగళం పాడేసిన సర్కార్.. ఏ ఒక్కరూ అడగని టీ పొడిని రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సరఫరా చేసేందుకు సిద్ధమవుతూండటం విస్మయం కలిగిస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లోని రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి అమ్మకాలను పైలట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. సర్క్యులర్ విడుదల ప్రజలపై ప్రేమతో రేషన్ షాపుల్లో టీ పొడి విక్రయాలు చేపడుతున్నారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ టీ పొడి సరఫరాకు టీ టైమ్ను వ్యాపార భాగస్వామిగా ఎంపిక చేసుకున్నారు. వాస్తవానికి రేషన్ షాపుల్లో ఏదైనా ఒక ఉత్పత్తి విక్రయం చేపట్టాలని అనుకుంటే ముందుగా సంబంధిత కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాలి. వాటిని మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయి కమిటీ పారదర్శకంగా ఖరారు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా ఉంది. టీ పొడి విక్రయాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈవిధంగా బహిరంగ టెండర్లు ఆహ్వానించి ఉంటే తాజ్మహల్, టాటా చక్రా గోల్డ్, త్రీ రోజెస్ తదితర జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన టీ ఉత్పత్తిదారులు పాల్గొనే అవకాశం ఉండేది. తద్వారా వారి మధ్య పోటీ నెలకొని నాణ్యమైన టీ పొడి సరసమైన ధరకే ప్రజలకు అందించే వీలు కలిగేది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో ఎటువంటి టెండర్లూ పిలవకుండానే టీ టైమ్ సంస్థకు ఏకపక్షంగా ఈ కాంట్రాక్ట్ అప్పగించేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల సర్క్యులర్ కూడా విడుదల చేసింది. రిటర్న్ గిఫ్ట్! ఎటువంటి టెండర్లూ లేకుండానే టీ టైమ్ సంస్థ ద్వారా టీ పొడి అమ్మకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. సార్వత్రిక ఎన్నికలప్పటి నుంచీ జనసేన పార్టీకి ఆర్థికంగా చేయూత ఇచ్చిన సంబంధిత నేతకు రిటర్న్ గిఫ్ట్గా ఈ భారీ నజరానా ఇచ్చారని అంటున్నారు. అనుకున్నదే తడవుగా.. కాకినాడ జిల్లాలో జనసేనకు అన్నీ తానై చక్రం తిప్పిన క్రియాశీలక నేతకు చెందిన కంపెనీకి అయాచిత లబ్ధి చేకూర్చేలా ఈ డీల్ కుదిరిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి రాష్ట్ర కేబినెట్లో పౌరసరఫరాల మంత్రిగా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. దీంతో, అనుకున్న పని సులువైపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీలర్లపై ఒత్తిళ్లు! రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లోనూ దశల వారీగా టీ పొడి విక్రయాలు ప్రారంభించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ మేరకు కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రయోగాత్మకంగా డిసెంబర్ 1న టీ పొడి అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కార్డుదారులకు టీ పొడి అమ్మాలంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఈ జిల్లాల్లోని రేషన్ డీలర్లపై అధికారుల నుంచి ఇప్పటికే ఒత్తిళ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసినప్పటి నుంచీ రేషన్ డీలర్లు రెండు రకాల టీ పొడి ప్యాకెట్లు విక్రయించాలని చెబుతున్నారు. ఈ నెల 30 లోగా ఏ రేషన్ షాపునకు ఎన్ని ప్యాకెట్లు కావాలనే ఇండెంట్ పంపించాలంటూ రెవెన్యూ, పౌర సరఫరాల అధికారుల నుంచి డీలర్లకు మౌఖిక ఆదేశాలు రావడం గమనార్హం. రేషన్ దుకాణాల ద్వారా టీ పొడి విక్రయించే డీలర్లు సంబంధిత కంపెనీకి రూ.5 వేలు చెల్లించాలి. టీ పొడి అమ్మిన తరువాత కమీషన్ ఇస్తామని ఆ ఉతర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్ నుంచే బియ్యం ఇతర నిత్యావసరాలతో పాటు టీ పొడి కూడా కోటా ప్రకారం విడుదల చేసుకోవాలి. టీ టైం మినీ మార్టుల పేరుతో రేషన్ షాపులను మినీ మార్టులుగా మారుస్తామని, రేషన్ షాపుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. టీ టైం మినీ మార్టులకు ఆ కంపెనీ చంద్ర గోల్డ్ టీ మాత్రమే సరఫరా చేస్తుంది. 20 గ్రాముల ప్యాకెట్ రూ.10, 40 గ్రాముల ప్యాకెట్ ధర రూ.20గా నిర్ణయించారు. ఒక్కో రేషన్ షాపునకు 10 గ్రాముల ప్యాకెట్లు 276, 20 గ్రాముల ప్యాకెట్లు 144 సరఫరా చేయనున్నారు. 10 గ్రాముల ప్యాకెట్లు అమ్మితే రూ.339, 20 గ్రాముల ప్యాకెట్లపై రూ.354 డీలర్కు లాభం ఉంటుందని చెబుతున్నారు. రూ.5 వేల విలువైన ప్యాకెట్లు అమ్మితే డీలర్కు రూ.693 ఆదాయం వస్తుందని అంటున్నారు. వాస్తవానికి జాతీయ, అంతర్జాతీయ టీ బ్రాండ్ ఉత్పత్తుల ధర కంటే ఈ ధరలు ఎక్కువని పలువురు అంటున్నారు. ప్రస్తుతానికి 10 గ్రాములు, 20 గ్రాముల ప్యాకెట్లని చెబుతున్నా రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో కార్డుదారులందరికీ అమ్మడమంటే వ్యవహారం రూ.కోట్లలోనే ఉంటుంది. టీ టైమ్ మినీ మార్టుల పైలట్ ప్రాజెక్టును భవిష్యత్తులో రాష్ట్రమంతా విస్తరించాలనే వ్యూహం ఇందులో లేకపోలేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మొదటి నెల వేతనానికి ఇబ్బంది లేదు
కొత్త టీచర్లకు ఎంప్లాయీ ఐడీతో మొదటి నెల వేతనం ఇచ్చేందుకు ఎటువంటి ఇబ్బందీ లేదు. రెండో నెల వేతనం మంజూరుకు మాత్రం ప్రాన్ ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రం వెంటనే ఆ నంబర్లు కేటాయిస్తున్నాం. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుంటే వెంటనే నంబర్లు కేటాయిస్తున్నాం. – బి.రామనాథం, జిల్లా ట్రెజరీ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాంకేతిక ఇబ్బందులు తొలగించాలి కొత్తగా ఎంపికైన టీచర్లకు వేతనాలు చెల్లించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. ట్రెజరీ అధికారులు సాంకేతిక ఇబ్బందులను తొలగించి వెంటనే వేతనాల చెల్లింపునకు చర్యలు చేపట్టాలి. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికారులు సకాలంలో స్పందించాలి ఉపాధ్యాయుల బిల్లుల చెల్లింపు విషయంలో ట్రెజరీ అధికారులు సకాలంలో స్పందించాలి. వారు సీఎఫ్ఎంఎస్, ప్రాన్ కేటాయింపులో అనవసరమైన కొర్రీలు వేయకుండా చూడాలి. సకాలంలో బిల్లులు పాస్ చేసి కొత్త ఉపాధ్యాయులు తొలి వేతనం తీసుకుని ఆనందం పొందేలా సహకరించాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
బోల్ట్ తొలగించమంటే బ్లేడు వదిలేసి కుట్టేశారు!
● ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం ● అదేమని ప్రశ్నిస్తే దాడి చేశారన్న బాధితుడు తుని: స్థానిక ఏరియా ఆసుపత్రి నిర్లక్ష్య వైఖరి రోగులను ఆందోళనకు గురి చేస్తోంది. ఓ వ్యక్తి కాలులో అమర్చిన ఐరన్రాడ్డు బోల్టు తొలగించి సిజేరియన్ బ్లేడును కాలులోనే ఉంచి కుట్టు వేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం ఎస్.అన్నవరం పంచాయతీ రామకృష్ణానగరానికి చెందిన వ్యక్తి ఏడాదిన్నర క్రితం కాలుకు గాయం కావడంతో ఏరియా ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. గాయం బలమైంది కావడంతో అప్పట్లో ఐరన్రాడ్డు సైతం అమర్చారు. ఐరన్ రాడ్డు బోల్టును తొలగిస్తే త్వరగా సర్దుకోవచ్చు అనే ఆలోచనతో శుక్రవారం ఏరియా ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రిలో సిబ్బంది ఆపరేషన్ చేసి రాడ్డు బోల్టు తొలగించారు. అయితే కాలులో సిజేరియన్ బ్లేడును ఒకటి ఉంచేసి కుట్లు వేసేశారు. ఇలా చేసారేంటని బాధితుడు సిబ్బందిని ప్రశ్నిస్తే దాడికి యత్నించారని రోగి వాపోయారు. -
తొలి జీతానికి తకరారు!
● ప్రానం పెట్టి పని చేయొద్దా..● ఒకటిన జీతాలియ్యకుంటే ఎలా? ● ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొత్త టీచర్లు ● ఐడీల కేటాయింపులో తీవ్ర జాప్యం ● ట్రెజరీ చుట్టూ ప్రదక్షిణలు ● వచ్చే నెల 15 తరువాత వచ్చే అవకాశం ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి సాక్షి, అమలాపురం: మెగా డీఎస్సీ.. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం నాడు ఈ ఫైల్పై సంతకం చేసినప్పటి నుంచి నియామకాలు పూర్తయ్యి తొలి జీతం ఇచ్చే వరకూ అంతా గందరగోళమే. కొలువుల్లో చేరి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ జీతమే లేదు. డిసెంబరు 1వ తేదీన జీతం అందే పరిస్థితీ కానరావడం లేదు. వచ్చే నెల 15వ తేదీ వరకూ వీరికి జీతాలు పడే అవకాశం కనిపించడం లేదు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని డీఎడ్, బీఎడ్ చదివి, పూర్తిచేసి ఎన్నో ఏళ్ల నిరీక్షణ అనంతరం వీరు డీఎస్సీ పరీక్షలు రాశారు. మంచి ర్యాంకులు తెచ్చుకుని ఉద్యోగాలు సాధించిన టీచర్లకు తొలి జీతం అందుకోవడంలో తిప్పలు తప్పడం లేదు. ప్రతి నెలా వేతనం చెల్లించేందుకు ట్రెజరీలో ఉద్యోగి ఐడీతో పాటు పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్ (ప్రాన్) జనరేట్ చేస్తారు. ఈ సంఖ్య కోసం కొత్త టీచర్లు ఇప్పటికీ ట్రెజరీ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో 1,351 మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1,349 మంది ఉపాధ్యాయులు కొత్తగా కొలువుల్లో చేరారు. అంతకు ముందు వారికి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఐదు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజనీరింగ్ కాలేజీలోని ఒక కేంద్రంలో ఇండక్షన్ ట్రైనింగ్ ఇచ్చారు. లాంగ్వేజ్, సైన్స్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్జీటీ.. ఇలా క్యాడర్ల వారీగా టీచర్లు శిక్షణ పొందారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చిన అనంతరం 13న విధుల్లో చేరారు. కొంత తర్జనభర్జనల అనంతరం శిక్షణ తీసుకున్న రోజు నుంచి విధుల్లో చేరినట్లుగానే భావించాల్సి ఉంది. తొలుత 3వ తేదీనా లేక 13వ తేదీనా అనే విషయం తేల్చడానికి సమయం పట్టింది. సర్వీస్ రిజిస్టర్(ఎస్ఆర్)లో జాయినింగ్ తేదీ నిర్థారిస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడానికి సమయం తీసుకోవడంలో ఏర్పడిన జాప్యంతో వేతనాల చెల్లింపులో కూడా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. తప్పని ఎదురుచూపులు కొత్త ఉపాధ్యాయులు వేతనం పొందాలంటే ఐడీ, ప్రాన్ తప్పనిసరి కావడంతో వాటిని క్రియేట్ చేయాల్సి ఉంది. ట్రెజరీ అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేస్తేనే వారికి డీడీఓలు వేతన బిల్లులు తయారు చేసి మళ్లీ ట్రెజరీకి పంపుతారు. అక్టోబర్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇండక్షన్ ట్రైనింగ్ పొందిన కొత్త టీచర్లు అదే నెల 13న విధుల్లో చేరారు. వారందరికీ మూడో తేదీ నుంచి వేతనాలివ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. విధుల్లో చేరే సమయానికి ట్రెజరీ ఐడీ, ప్రాన్ కేటాయించక పోవడంతో అక్టోబర్ నెల జీతం పొందలేకపోయారు. నవంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో సప్లిమెంటరీ బిల్లులు ట్రెజరీలో పొందుపరచే అవకాశం ఉన్నప్పటికీ అప్పటికి కూడా ట్రెజరీ ఐడీ, ప్రాన్ పూర్తి స్థాయిలో కేటాయింపు కాలేదు. ఈ నెల 15వ తేదీ నాటికి కొంతమందికి మాత్రం ఆయా నంబర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ అక్టోబర్ నెల బకాయి బిల్లు తీసుకుంటేనే కానీ నవంబర్ నెల రెగ్యులర్ బిల్లు చేయడానికి వీలు కాదు. దీంతో, డిసెంబర్ 1వ తేదీన తొలి వేతనం పొందే అవకాశం కొత్త టీచర్లకు చిక్కలేదు. డిసెంబర్ 6 నుంచి 11వ తేదీ మధ్యలో అరియర్ బిల్లులు సబ్మిట్ చేస్తే డిసెంబర్ 15 తర్వాత రెండు నెలల వేతనాలూ పొందే అవకాశముంటుంది. కొత్త ఉద్యోగం మొదటి జీతం కళ్ల చూద్దామంటే ట్రెజరీలో ఏర్పడ్డ సాంకేతిక ఇబ్బందులతో ఆ కల దూరమవుతోందని నూతన ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
జనవరి 24 నుంచి నాటిక పోటీలు
పెద్దాపురం (సామర్లకోట): ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటక పోటీలను జనవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు పెద్దాపురం మండలం దివిలి స్నేహా ఆర్ట్ నాటిక పరిషత్తు అధ్యక్షుడు గొందేసి రాజా తెలిపారు. పోటీల కరపత్రాలను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివిలి గ్రామంలో సప్తమ నాటిక పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 24న మమ్మల్ని బ్రతకనివ్వండి (విజయవాడ), గేమ్ (హైదరాబాద్), జనరల్ బోగీలు (కొలకలూరు) నాటికలు ప్రదర్శిస్తారని వివరించారు. జనవరి 25న అసత్యం (విశాఖపట్నం), ఆచమనం (కాకినాడ), మా ఇంట్లో మహాభారతం (చిలకలూరిపేట) నాటికలు ప్రదర్శితమవుతాయని తెలిపారు. జనవరి 26న అమ్మ చెక్కిన బొమ్మ (హైదరాబాద్), ఇది అతని సంతకం నాటిక ప్రదర్శనలు ఉంటాయని వివరించారు. కరపత్రాల ఆవిష్కరణలో నాటక పరిషత్తు సభ్యులు కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతల కీచకపర్వంతో మహిళలు కన్నీరు కాకినాడ రూరల్: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేని దుస్థితి నెలకొందని, టీడీపీ నేతల కీచకపర్వంతో మహిళలు కన్నీరు పెట్టుకుంటున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరవైందని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అఘాయిత్యాలకు పచ్చజెండా ఊపినట్టు కూటమి నేతలు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు ఎమ్మెల్యే అహ్మద్ నజీర్.. ఇలా ప్రజాప్రతినిధులే గాడి తప్పి ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా టీడీపీ నాయకులు కీచకులుగా మారి ఒంటరి మహిళలు, స్కూల్ పిల్లలు, కాలేజీ విద్యార్థినులు.. ఇలా ప్రతి ఒక్కరినీ లైంగికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి, విద్య, వైద్యం వంటి అవసరాల కోసం ప్రజాప్రతినిధులు, వారి అనుచరుల వద్దకు వెళ్తున్న వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం బాధాకరమన్నారు. మహిళలకు రక్షణ కోసం ఉద్యమించాల్సిన పరిస్థితి రాష్ట్రంలో దాపురిస్తోందని నాగమణి పేర్కొన్నారు. ఘనంగా చండీ హోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి గావించారు. హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి.. రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయ పరిచారకుడు చిట్టెం నరేష్ ఆధ్వర్యాన కనకదుర్గ అమ్మవారికి రుత్విక్కులు లక్ష కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. -
రత్నగిరి కిటకిట
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిటకిటలాడింది. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో స్వామివారి ఆలయంతో పాటు వ్రత మండపాలు, క్యూలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 25 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. పెద్దాపురం డివిజన్కు సామర్లకోట బోట్క్లబ్ (కాకినాడి సిటీ): ఇప్పటి వరకూ కాకినాడ రెవెన్యూ డివిజన్లో ఉన్న సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్కు బదిలీ చేస్తూ గెజిట్ విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఏవైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా తమ కార్యాలయానికి లిఖిత పూర్వకంగా సమర్పించాలని ప్రజలకు సూచించారు. వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు, అవసరమైన సదుపాయాలు, అధికారులు నిర్వహించిన తనిఖీల వివరాలపై కలెక్టరేట్లో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల నిర్వహణలో చిన్నచిన్న పొరపాట్లకు, అవకతవకలకు ఎటువంటి ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్ల నిర్వహణ పర్యవేక్షణకు ప్రభుత్వం హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని వసతి గృహాల్లో తప్పనిసరిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన 15 రోజులకు ఒకసారి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లలో ఆర్ఓ ప్లాంట్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వసతి గృహాల నుంచి బాలికలను తీసుకువెళ్లడానికి వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకుల ఫొటోలను ఒక ప్రత్యేక రిజిస్టర్లో అతికించి, ఎప్పటికప్పుడు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు లైంగిక విద్య, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అంశాలపై ప్రతి శనివారం రెండు గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. -
ఇద్దరు విద్యార్థుల వివాదం
పాఠశాల గేటుకు తాళం వేసిన విద్యార్థి తండ్రి కొత్తపల్లి: పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన వివాదంలో ఒక విద్యార్థి తండ్రి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేశాడు. పోలీసులు జోక్యం చేసుకుని వేసిన తాళం తీయించారు. వివరాల్లోకి వెళితే స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పది, ఆరో తరగతి విద్యార్థుల మధ్య నమస్కారం విషయంలో తగాదా ఏర్పడింది. దీంతో 6వ తరగతి విద్యార్థి జరిగిన వివాదాన్ని తన తండ్రికి చెప్పాడు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తండ్రి పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశాడు. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తాళం వేసిన వ్యక్తిని తీసుకువచ్చి తాళం తీయించారు. పాఠశాలలో సమస్య ఏర్పడినపుడు హెచ్ఎంలకు ఫిర్యాదు చేయాలేకానీ ఇలా తాళం వేయకూడదని హెచ్చరించి విద్యార్థి తండ్రిని మందలించారు. దీనిపై ఎంఈఓ వేణుగోపాల్ను వివరణ కోరగా పాఠశాల హెచ్ఎం సెలవులో ఉన్నారని దీనికి సంబంధించి సరైన వివరాలు లేవని తెలిపారు. విద్యార్థుల వివాదంపై శనివారం విచారణ నిర్వహిస్తామన్నారు. -
ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచనుందా? లేదా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను, జగనన్న కాలనీలను సీపీఐ జిల్లా సమితి బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం చాలా మందికి ఇళ్ల స్థలాలిచ్చిందని, డబ్బు లేక అప్పట్లో ఇళ్లు నిర్మించుకోలేని వారందరికీ ప్రభుత్వం వెంటనే రూ.6 లక్షల సబ్సిడీ ఇచ్చి, ఇళ్లు నిర్మించాలని మధు డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని సంవత్సరం కాలంగా సీపీఐ దరఖాస్తులు పూర్తి చేసి, ప్రభుత్వానికి ఇచ్చిందని, దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని అన్నారు. సూపర్ సిక్స్లో ప్రధానమైన ఇళ్ల స్థలాల హామీని చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అసలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచన ఉందా, లేదా అని ప్రశ్నించారు. నగరంలో 2,050 టిడ్కో ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా వెంటనే నిధులు మంజూరు చేసి, టిడ్కో ఇళ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. పేదల బస్తీలుగా ఉండాల్సిన టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయని మధు దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, పి.సత్యనారాయణ ఎ.భవాని, బొబ్బిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
భీమేశ్వరస్వామి ఆదాయం రూ.43.95 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి వారి హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 27 వరకూ 43 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.43,95,359 వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. అన్నదానం హుండీ ద్వారా రూ.52,682 వచ్చిందన్నారు. ఈ కార్యక్రమన్ని జిల్లా అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి వి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ, పోలీస్ శాఖ,సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
పరివాహన్ను సరి చేయరా?
కాకినాడ ఆర్టీఓ కార్యాలయంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): రవాణా శాఖలో దేశవ్యాప్తంగా ఒకే వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో పరివాహన్ పోర్టల్ ప్రవేశ పెట్టారు. ఈ పోర్టల్ ద్వారా 2024 జూలైలో కొన్ని సేవలు అందించారు. ఆ ఏడాది డిసెంబర్ నుంచి పూర్తిస్థాయిలో అన్ని సేవలూ అందించేలా ఆదేశాలు ఇచ్చారు. అయితే పోర్టల్ ప్రారంభించి ఏడాదిన్నర కావొస్తున్నా ఇంకా పురిటి కష్టాలు దాటలేదు. వాహనదారులకు అడుగడుగునా ఇబ్బందులు తప్పడం లేదు. ఏదైనా సమస్య వచ్చి జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే తమ పరిధి కాదంటున్నారు. రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే అక్కడ కొన్ని పనులు చేసి మరికొన్నింటి విషయంలో చేతులెత్తేస్తున్నారు. అదేమంటే పోర్టల్ ఢిల్లీ నుంచి ఆపరేట్ అవుతుందని చెబుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగెత్తిపోతున్నట్టు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ మొరాయింపు ప్రస్తుతం రవాణా కార్యాలయం నుంచి అందించే అన్ని సేవలు పోర్టల్ ద్వారానే పొందాల్సి ఉంది. వాహనాల రిజిస్ట్రేషన్, ఒకరి నుంచి మరొకరికి బదిలీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్లు పొందడం, రెన్యువల్ వంటి అన్ని రకాల సేవలు పరివాహన్ పోర్టల్ ద్వారానే అందిస్తున్నారు. దీంతో ఈ పోర్టల్ తరచూ మొరాయిస్తుండటంతో వాహనదారులు పనులు మానుకొని కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చేయి తడపాల్సిందే.. వాహనాల ఫిటెనెస్ తనిఖీని ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దాన్ని కాకినాడ సమీపంలోని అచ్చంపేట ఏడీబీ రోడ్డులో ఏర్పాటు చేశారు. అక్కడకు వాహనాలు తనిఖీ కోసం వెళ్లినప్పుడు ఏదో ఒక సాకు చూపి డబ్బు వసూలు చేస్తున్నట్టు వాహనదారులు చెబుతున్నారు. ‘అక్కడకు వెళ్లిన తర్వాత ఆ ప్రైవేటు సంస్థ డ్రైవర్ వాహనాన్ని లోపలికి తీసుకెళ్లి చెక్ చేస్తున్నారు. కారు అద్దానికి బీటలు పడ్డాయి, టాప్ సరిగా లేదు వంటి లోపాలు చూపుతూ ఫిట్నెస్ ఇచ్చేందుకు ముడుపులు వసూలు చేస్తున్నారు. ముడుపులు అందితే లోపాలున్నా ఫిట్నెస్ ఇచ్చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంద’ని వాహనదారులు కోరుతున్నారు. సమస్యలివే.. ● డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ప్రయత్నం చేస్తే కొందరి డేటా పోర్టల్లో ఉండటం లేదు. పది మందికి గాను ఇద్దరు, ముగ్గురికి ఇలా జరుగుతున్నట్లు చెబుతున్నారు. అలాంటి వారు రాష్ట్ర కార్యాలయానికి వెళ్తే కొందరికి సమస్య పరిష్కారం అవుతుండగా, మరికొందరికి పనికావడం లేదు. ● కారు మరొకరికి అమ్మినప్పుడు డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. కానీ, ఆధార్ లింక్లో అమ్మిన వారి పేరునే కారు ఉన్నట్లు చూపుతోంది. అలా కారు అమ్మిన ఏడాది వరకూ పోర్టల్లో మార్పు కాకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ● పోర్టల్లో కొన్ని పాత వాహనాల డేటా కనిపించడం లేదు. అలాంటి వారు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్తే, వాళ్లు తమకు సంబంధం లేదని చెబుతున్నారు. దీంతో రాష్ట్ర కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వస్తోంది. అక్కడ కూడా కొంతమందికే పని జరుగుతోంది. ● ఇన్సూరెన్స్ చెల్లించిన వారి వివరాలు కనిపించక పోవడం, రెన్యువల్కు అ వసరమైన డేటా లేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలా అ నేక రకాల సమస్యలతో వాహనదా రులు తీవ్ర ఇబ్బందులు పడుతూ కా ర్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. లారీ యజమానుల ఇబ్బందులు పరివాహన్ పోర్టల్లో లారీ ఓనర్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రాష్ట్రా ల్లో ఈ పోర్టల్ అప్డేట్ కాలేదు. దీంతో మన లారీలు ఆ రాష్ట్రానికి వెళ్లినప్పుడు నంబర్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లేదని జరిమానా విధిస్తున్నారు. ఇటీవల ఒక లారీకి సంబంధించిన ఆర్సీ బుక్లో ఒక లెటర్ తప్పుగా ఉంటే సరి చేయించుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. గతంలో లారీలు కొన్ని నెలలు ఆపినప్పుడు ఆ సమయానికి ట్యాక్స్ మినహాయించే వారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు రోజుల తరబడి లారీలను నిలపాల్సిన పరిస్థితి ఉంటుందని, ట్యాక్స్ మినహాయింపు లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవస్థలు పడుతున్నాం గతంలో పరివాహన్ సేవలు రాష్ట్ర పరిధిలో ఉండేవి. అప్పుడు సేవలు సక్రమంగా అందేవి. సేవలన్నీ కేంద్రం అధీనంలోకి వెళ్లి పరివాహన్ సైట్కు రవాణా సేవలు మార్చడం వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా వాహనాల ఫిట్నెస్ ప్రైవేటీకరణ చేయడంతో చాలా అవస్థలు పడుతున్నాం. – ఆర్.రాజా, వాహన యజమాని సాధ్యమైనంత వరకూ పరిష్కారం పరివాహన్ సైట్ ద్వారా సమస్యలు వస్తున్నమాట వాస్తవమే. మా పరిధిలో ఉంటే సమస్యను సాధ్యమైనంత వరకూ పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ మన సైట్లో మారినా పై స్థాయిలో మారకపోవడం వల్ల, గ్రామ సచివాలయాల్లో అప్డేట్ కాక ఇబ్బందులు పడుతున్నారు. – కె.శ్రీధర్, డీటీసీ, కాకినాడ పోర్టల్లో ప్రారంభించి ఏడాదైనా పూర్తి స్థాయిలో అందని సేవలు కనిపించని పాత వాహనాల వివరాలు, లైసెన్స్ డేటా ఇన్సూరెన్స్ది అదే పరిస్థితి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వాహనదారులు కమీషన్ ఇస్తేనే ఫిట్నెస్ -
మూలగ్రంథాలే సర్వదా ప్రామాణికం
● సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ ● సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ఆరంభం రాజమహేంద్రవరం రూరల్ : మూలగ్రంథాలే మనకు సర్వదా ప్రామాణికం, ధర్మాధర్మాల విచక్షణలో, వివేచనలో మూలగ్రంథాలనే అధ్యయనం చేయాలి. అనువాద రచనలలో సాహితీ సౌరభాలు ఉండవచ్చును, కానీ మూలగ్రంథాలే మనకు శిరోధార్యమని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం హిందూ సమాజంలో వేదవ్యాస భారత ప్రచవన యజ్ఞం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ ‘సంప్రదాయ విరుద్ధమైన మాట నా నోట రాకూడదని జగన్మాతను ప్రార్థిస్తున్నాను’’ అని చెప్పారు. భారతంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ, శాంత్యనుశాసన పర్వాలపై గతంలో 18 రోజులు ప్రవచనాలు అందించానని, సంపూర్ణ భారతంపై హైదరాబాద్లో 18 రోజులు ప్రవచించానని అన్నారు. పండిత వరేణ్యులు వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి, మల్లాది చంద్రశేఖరశాస్త్రి తదితరులు భారతానికి చక్కటి వ్యాఖ్యానాలు చేశారు. కొందరు కవులు, కొన్ని సినిమాల్లో అవగాహనా లోపంతో కువ్యాఖ్యానాలు చేశారు. వేద పురాణేతి హాసాలను కలిపి చూడాలి, అప్పుడే మనకు రామాయణ, భారత, భాగవతాదుల పట్ల సరి అయిన అవగాహన కలుగుతుందని సామవేదం అన్నారు. భారతంపై కొందరు కవుల రచనలలో అపోహలు, అపార్థాలతో పాటు నిందలు కూడా చోటు చేసుకోవడం శోచనీయమని అన్నారు. ప్రపంచ వాజ్ఞ్మయంలో ‘ఇలియట్’, ఒడిస్సీ వంటి అతి పెద్ద గ్రంథాలు లేకపోలేదు. కానీ భారతానికి వచ్చినన్ని వ్యాఖ్యానాలు ఇతర ప్రపంచ సాహిత్యంలో కానరావు. తెలుగు వారికి కవిత్రయ భారతంతో ఆత్మీయతానుబంధం ఉన్నదని సామవేదం అన్నారు. ప్రపంచ సాహిత్యంలో భారతం వంటి మరో గ్రంథం లేదని సామవేదం స్పష్టం చేశారు. మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ ఒంటి చేత్తో రామాయణ, భారత, భాగవతాలను రచించిన కవిసార్వ భౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి రాజమహేంద్రనగరానికి చెందిన వారే, అలాగే, రామాయణ, భారత, భాగవతాలను రాజమహేంద్రవరంలో ప్రవచనం చేసిన ఖ్యాతి సామవేదానికే దక్కిందన్నారు. కంచి, శృంగేరీ పీఠాల నుంచి ఆశీస్సులను, మంత్రాక్షతలను ఆయన అందజేశారు. భారతభారతి శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ వేదవ్యాసమహర్షి మూడు సంవత్సరాల కాలంలో భారతాన్ని నిర్మించారని, అధర్మం ఏదో తెలుసుకుని దానిని వదిలిపెట్టాలని భారతం మనకు చెబుతోందన్నారు. మహామహోపాధ్యాయ దోర్బల ప్రభాకర శర్మ, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి, ఘన సమ్రాట్ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠీ, హిందు సమాజం ట్రస్టీ న్యాపతి సుబ్బారావు తదితర ప్రముఖులు ప్రసంగించారు. భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు సభను నిర్వహించారు. -
సమగ్ర శాసీ్త్రయ కులగణన చేపట్టాలి
యానాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. యానాం గీతా మందిరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రతినిధుల సమావేశం మల్లాడి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారథన్ మహారాజు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్లు మాదిరిగా ఏపీలోనూ స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోని లోపాలను సరిదిద్ది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. జాతీయస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేపడతామని, త్వరలో ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గారమేష్, పెస్పింగి ఆదినారాయణ, గూడూరి వెంకటేశ్వరరావు, బీసీ రమణ, కర్రి చిట్టిబాబు, ఘంటసాల వెంకటలక్ష్మి, కడలి ఈశ్వరి, చొల్లంగి వేణుగోపాల్, మన్నే నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవాలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో బాటు పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు వేలాదిగా తరలి రావడంతో ఆలయం కిటకిటలాడింది. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో సత్యదేవుని ఆలయం, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా, స్వామివారి వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. -
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతులు
కాకినాడ రూరల్: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు 10 మంది, టైపిస్టులు 8మంది సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందారు. జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తున్న 18 మందికి గురువారం పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఉద్యోగులకు జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు అందజేశారు. పదోన్నతి పొందిన ఉద్యోగులను జెడ్పీ చైర్మన్ అభినందించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వడం ద్వారా ప్రజా సేవ చేయాలన్నారు. ఏపీపీఆర్ ఎంఈఏ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్ పాల్గొన్నారు. జాతీయ స్థాయి టెన్నికాయిట్ పోటీలకు ఎంపిక దేవరపల్లి: మండలంలోని రామన్నపాలెం జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థిని మిరియాల ప్రియదర్శిని రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికై నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంద్రనాథ్ గురువారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21, 22 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా సోంపూడిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఎంపికయింది. డిసెంబర్ 22 నుంచి 26 వరకు కేరళలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ఆయన తెలిపారు. ఆమె 9వ తరగతి చదువుతోందని, ఫిజికల్ డైరెక్టర్ టి.సరస్వతి విద్యార్థినికి శిక్షణ ఇచ్చినట్టు హెచ్ఎం చెప్పారు. -
క్రికెట్ ట్రోఫీకి శ్రీప్రకాష్ విద్యార్థులు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతిష్టాత్మకమైన బీసీసీఐ విజయ్ మర్పంట్ క్రికెట్ ట్రోఫీకి అండర్–16 విభాగంలో కాకినాడ శ్రీప్రకాష్ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పాఠశాల డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ గురువారం తెలిపారు. పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న జి.లక్ష్మీగౌతమ్, 10వ తరగతి విద్యార్థి కె.తమన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమన్నారు. తమ పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామనడానికి ఇదే నిదర్శమని తెలిపారు. భవిష్యత్తులో తమ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ఎంపికై రాణించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఎంపికై న విద్యార్థులను, కోచ్ దుర్గాప్రసాద్ను జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరిష్, కార్యదర్శి నక్కా వెంకటేష్, శ్రీప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ సమీరా అభినందించి, మెమెంటోలతో సత్కరించారు. -
దళారులకే
అమ్ముకోవాల్సి వస్తోంది ధాన్యం అమ్మాలంటే ముందుగా కనీసం రెండు రోజులపాటు ఆరబెట్టవలసి ఉంటుంది. కొనుగోలు కేంద్రాల్లో 17 శాతం కంటే తక్కువ తేమ ఉండాలనే నిబంధన శాపమైంది. దళారులకు రూ.1,550కు విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. సీఎంఆర్కు ఇచ్చే 75 కేజీల బస్తాకు రూ.1,777 ఇవ్వాలి. కానీ రూ.1,670 ఇస్తున్నారు. 33శాతం నష్టం అంచనాలతో ఇన్పుట్ సబ్సిడీ వస్తుందని చెబుతున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. – ఇంటి రమేష్, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం పంటను ప్రభుత్వం కొననంటే ఎలా? నాలుగు ఎకరాల పొలం సాగు చేస్తున్నాను. ఈ ఏడాది పంట ఏపుగా పెరగటంతో ఎకరానికి 40 బస్తాల వరకూ దిగుబడి వస్తుందనుకున్నాను. వర్షాల దెబ్బకు ఎకరానికి 30 బస్తాల చొప్పున నాలుగు ఎకరాలకు 120 బస్తాల దిగుబడి వచ్చింది. కొనుగోలు కేంద్రాలకు వెళితే ఎకరానికి 24 బస్తాల చొప్పున 96 బస్తాలే కొంటామంటున్నారు. అసలే ఈ ఏడాది తుపాను ప్రభావంతో మాసూళ్లకు పెట్టుబడులు అధికమవ్వటమే కాకుండా దిగుబడులు తగ్గిపోయాయి. వచ్చిన పంటను ప్రభుత్వం కొననంటే ఎలా? –పెంకే సత్యనారాయణ, రైతు కాజులూరు -
చికిత్స పొందుతూ ఖైదీ మృతి
కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే, గుంటూరు సమీపంలో అంకిరెడ్డిపాలేనికి చెందిన మెట్టు భాస్కర్రెడ్డి(53).. 30 ఏళ్ల క్రితం బాబాయి, కొడుకు హత్యలకు గురైన కేసులో నిందితుడిగా ఉన్నాడు. పాతికేళ్ల పాటు బెయిల్పై ఉండి, ఐదేళ్ల నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్ట్ 31న అనారోగ్యానికి గురయ్యాడు. రాజమహేంద్రవరం వైద్యుల సిఫార్సు మేరకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో ఆరోగ్యం విషమించి బుధవారం మధ్యాహ్నం మరణించాడు. దీనిపై కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.జాతీయ బ్యాడ్మింటన్లో హరికృష్ణ, చరణ్రామ్కు కాంస్యంసామర్లకోట: జాతీయ స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ అండర్–19 బాలుర డబుల్స్ విభాగంలో సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి హరికృష్ణ, చిత్తూరు జిల్లాకు చెందిన తిప్పన చరణ్రామ్ జంట తృతీయ స్థానం సాధించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరు రోజుల పాటు అరుణాచల్ప్రదేశ్ ఇటానగర్లో జరిగిన యోనెక్స్–సన్రైజ్ 48వ జూనియర్ నేషనల్ చాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన క్రీడాకారుల జంట ప్రతిభ చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో హరికృష్ణ–చరణ్రామ్ కాంస్య పతకాన్ని పొందారు. -
గోవుల మరణాలపై సమగ్ర విచారణ
రాజమహేంద్రవరం రూరల్: రాజమండ్రి సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో చనిపోయిన గోవులు ఎన్ని, ఏ కారణాల వల్ల చనిపోయాయి, గోశాల సామర్థ్యం ఎంత, సిబ్బంది, ఆహారం, నీటి నిల్వలు తదితర అంశాలపై సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్ ఆర్టీఐ కింద 2023 అక్టోబర్ 30న సమాచారాన్ని అడిగారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, గతేడాది జూన్లో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్లో సెకెండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ ఏడాది ఆగస్ట్ 12న విచారణ చేసిన ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గోశాలలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. గోశాల నిర్వహణలో లోపాలను గుర్తించింది. సీసీ కెమెరాలు పని చేయటం లేదని, రికార్డులను సరిగా నిర్వహించటం లేదని నివేదికలో పేర్కొంది. గోశాల నిర్వహణను ఎండోమెంట్ శాఖకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోవులను రెగ్యులర్గా పర్యవేక్షించేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ను నియమిస్తూ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళగిరి కమిషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విచారణకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ప్రత్యక్షంగా హాజరై, విచారణ నివేదిక కమిషనర్కు, దరఖాస్తుదారుకు సమర్పించారు. భగవాన్ మహావీర్ జైన్ గోశాల ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అఽధీనంలో లేదని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దృష్టికి తీసుకొచ్చారు. గోశాల ప్రైవేటు సంస్థ నిర్వహణ కింద ఉన్నప్పటికీ, గోవుల సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. గోశాలలో గోవుల మరణాల ఆరోపణలు, వాస్తవ పరిస్థితిపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.ఆదేశించిన ఆర్టీఐ కమిషనర్ -
నాలుగేళ్లుగా కోనసీమలో హెచ్ఐవీ కేసులు ఇలా..
సంవత్సరం హెచ్ఐవీ పాజిటివ్ కేసులు గర్భిణులకు పరీక్షలు పాజిటివ్ కేసులు 2022–23 47,291 358 30,320 2 2023–24 44,468 392 26,407 7 2024–25 45,913 311 17,866 9 2025–26 31,280 125 16,643 4 (అక్టోబర్ వరకు) రాయవరం: హెచ్ఐవీ నియంత్రణకు సరైన అవగాహన, ముందస్తు జాగ్రత్తలే శ్రేయస్కరం. సమాజంలో హెచ్ఐవీ, ఎయిడ్స్ మహమ్మారి దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధిగా వేళ్లూనుకుంది. గతంలో ఈ వ్యాధిపై నలుగురిలో మాట్లాడాలంటే సంశయించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. దశాబ్ద కాలానికి ముందు చాపకింద నీరులా విస్తరించిన ఎయిడ్స్ మహమ్మారి ఇప్పుడు వెనకడుగు వేస్తోంది. సురక్షితం కాని శృంగారం ఎంత ప్రమాదకరమో కరపత్రాల ద్వారా చాటి చెప్పడంతో క్రమంగా ప్రజల్లో చైతన్యం పెరిగింది. బహిరంగ చర్చ సాధారణం కావడంతో, కొన్నేళ్లుగా ఈ మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. డిసెంబరు ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా ప్రత్యేక కథనం. హెచ్ఐవీ అంటే.. హ్యూమన్ ఇమ్యునోడెఫిషియన్సీ వైరస్ (హెచ్ఐవీ) అనేది ఎయిడ్స్ (ఎకై ్వర్ ఇమ్యునోడెఫిషియన్సీ సిండ్రోమ్)ను కలగజేస్తుంది. లైంగికంగా, ఇన్ఫెక్షన్ సోకిన సూదులతో రక్తం ఎక్కించడం ద్వారా లేదా ఇన్ఫెక్షన్ సోకిన తల్లి నుంచి బిడ్డకు ఈ వైరస్ వ్యాపిస్తుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని ఈ వైరస్ బలహీనపరిచి, క్రమక్రమంగా ఆరోగ్యం క్షీణింపజేస్తుంది. క్రమంగా తగ్గుతున్న బాధితులు జిల్లాలో 2022–23లో 0.78 శాతం ఉన్న హెచ్ఐవీ వ్యాప్తి.. 2024–25 నాటికి 0.63 శాతంగా ఉంది. 2025–26లో అక్టోబర్ నాటికి 0.40 శాతంగా నమోదైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 31,280 మందిని పరీక్షించగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే 16,643 మంది గర్భిణులను పరీక్షించగా, వీరిలో నలుగురికి హెచ్ఐవీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది. గర్భిణుల్లో మాత్రం 2022–23 నుంచి గతేడాది వరకు కేసుల సంఖ్య పెరగడం గమనార్హం. ఈ ఏడాది నినాదమిదే.. ‘అంతరాయాన్ని అధిగమించడం.. ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. ఏటా డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినంగా పాటిస్తారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, ఎలా ఎదుర్కోవాలనే దానిపై విస్తృత అవగాహన కల్పిస్తారు. ఈ ఏడాది ఓవర్కమింగ్ డిజరప్షన్, ట్రాన్స్ఫార్మింగ్ ది ఎయిడ్స్ రెస్పాన్స్ నినాదంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. అందరితో పాటు హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులను సమానంగా చూడాలన్నదే దీని ఉద్దేశం. జిల్లాలో పరిస్థితి ఇలా.. హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు జిల్లాలో తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2000–2001లో 4,600 కేసులు నమోదు కాగా, 2005–06లో 6,107 కేసులు నమోదయ్యాయి. 2009–10లో ఈ సంఖ్య 8,933కు చేరింది. దీంతో జాతీయ స్థాయిలో హెచ్ఐవీపై ప్రకటించిన యద్ధం కారణంగా అన్ని స్థాయిల్లో అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో పలు స్వచ్ఛంద సంస్థల కృషి కూడా అభినందనీయం. 2020–21లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టి 3,933కు చేరింది. జిల్లాల విభజన అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 31,280 మందికి పరీక్షలు చేయగా, 125 మందికి పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. 2022 ఏప్రిల్ నుంచి 2023 ఏప్రిల్ వరకు 358 పాజిటివ్ కేసులు తేలాయి. 2023–24లో 392, 2024–25లో 311 పాజిటివ్ కేసులు గుర్తించారు. కోనసీమలో చికిత్స కేంద్రాలివే.. హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించేందుకు అమలాపురం, రామచంద్రపురంల్లో ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే రాజోలు, కొత్తపేట, మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు, కిమ్స్ ఆస్పత్రిలో ఐసీటీసీ కేంద్రాన్ని నెలకొల్పారు. ప్రతి ఆస్పత్రిలో హైరిస్క్ వ్యాధిగ్రస్తులకు హెచ్ఐవీ పరీక్షలు చేస్తున్నారు. హెచ్ఐవీ పాజిటివ్ వ్యాధిగ్రస్తులకు ప్రతి ఆరు నెలలకు వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రతి గర్భిణీకి హెచ్ఐవీ టెస్ట్లు చేస్తున్నారు. తగ్గుముఖం పట్టిన హెచ్ఐవీ కేసులు వ్యాధిగ్రస్తుల జీవన శైలి మెరుగుకు కృషి కోనసీమలో 2022–23లో 358 కేసులు.. ఈ ఏడాది ఇప్పటి వరకు 125 గుర్తింపు డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం కట్టడికి చర్యలు జిల్లాలో హెచ్ఐవీ సమస్య అదుపులోనే ఉంది. దీని తీవ్రత తెలుసుకున్న చాలా మంది అప్రమత్తంగా ఉంటున్నారు. హెచ్ఐవీ బాధితులకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాం. ఎయిడ్స్ నుంచి బాధితుల రక్షణకు చేస్తున్న కృషి ఫలిస్తోంది. గర్భిణుల నుంచి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాధి సోకకుండా కట్టడి చేస్తున్నాం. – డాక్టర్ భరతలక్ష్మి, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
మన రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పది
కాకినాడ లీగల్: భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల్లోనే గొప్పదని, ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది అన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కోర్టు హాలులో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలను రాజ్యాంగం పరిరక్షించేలా న్యాయవ్యవస్థ పనిచేస్తోందన్నారు. ఆరో అదనపు జిల్లా జడ్జి పి.గోవర్ధన్ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ప్రసాదించిందన్నారు. కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. రాజ్యాంగ దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టి.పృథ్వీరాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.మూడో అదనపు జిల్లా జడ్జి ఆనంది -
తైక్వాండో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు పతకాలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జరిగిన 41వ సీనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు ఐదు పతకాలు (4 కాంస్య, ఒకటి రజత) సాధించినట్టు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. వీరిలో పి.హరికిరణ్ రజత పతకం సాధించగా, వై.గంగాభవాని, జి.వంశీ, ఎల్ వెంకన్నదొర, ఎం హర్షవర్ధన్ కాంస్య పతకాలు సాధించినట్టు వివరించారు. ఈ టోర్నమెంట్కు కోచ్గా పి.భార్గవి, మేనేజర్గా ఆర్ మణికంఠ వ్యవహరించారన్నారు. సీనియర్ ఏపీ టీం జాతీయ స్థాయిలో రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్ను డీఎస్డీఓ సతీష్కుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి.వీరభద్రారెడ్డి, కార్యదర్శి జి.ఎలీషాబాబు, తైక్వాండో సంఘ అధ్యక్షుడు ఎ.మధుసూదన్రావు, కోచ్లు డీఎన్ సత్యనారాయణ, ఎన్ తులసి, కేవీ సత్యనారాయణ, ఎంపీ త్రిమూర్తులు, ఎన్ రత్న తదితరులు అభినందించారు. -
పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
తుని: పట్టణంలోని బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి త్రుటిలో ముప్పు తప్పింది. పాయకరావుపేటకు చెందిన ఓ పెళ్లి బృందం బాజా భజంత్రీలతో పెళ్లి వేడుక నిర్వహిస్తోంది. వీరంతా కల్యాణ మండపంలో భోజనాలు చేస్తుండగా, వసతి గదులున్న ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గదిలో ఉన్న ఏసీ నుంచి మంటలు చెలరేగి, కల్యాణ మండపం పొగతో కమ్మేసింది. దీంతో పెళ్లి బృందం వారికి ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. రెండు ఫ్లోర్లలోనూ పొగ కమ్మేయడంతో పెళ్లి బృందం అరుపులు కేకలతో పరుగులు తీశారు. గదిలో ఓ వృద్ధురాలు మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో పెళ్లి బృందం వారు మరింత ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి వృద్ధురాలిని కాపాడారు. మంటలను అదుపు చేయడంతో అంతా ఊరిపి పీల్చుకున్నారు.


