breaking news
Kakinada
-
అంతా సౌజన్యే చేసింది!
కాకినాడ రూరల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న కాకినాడకు చెందిన షేక్ సాధిక్ ఖాన్ ఈ నేరానికి సంబంధించి పోలీసుల ప్రశ్నలకు వరుసగా రెండవరోజూ ఎప్పటిలాగే ‘తనకేం తెలియదు, తన తప్పేంలేదు’ అని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ‘తప్పంతా జగదీశ్వరరెడ్డి భార్య సౌజన్యదే’ అంటూ ఆమెపై నెట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. మూడు రోజుల విచారణ నిమిత్తం సాధిక్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం మొదటిరోజు మంగళవారం విచారణలో 60 ప్రశ్నలు సంధించిన పోలీసులు, బుధవారం రెండోరోజూ పలు కీలకమైన అంశాలపై 70 ప్రశ్నలతో సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశారు. బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ సీఐ గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో న్యాయవాది సమక్షంలో సాధిక్ను ప్రశ్నించారు. జగదీశ్వరరెడ్డి హత్యకుగాను సాధిక్కు సైనేడ్ ఎలా వచ్చిందనే కోణంలో హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు సర్పవరం స్టేషన్కు రప్పించి సాధిక్ సమక్షంలో విచారించారు. ఈ క్రమంలో ఒకరు సైనేడ్ ఇచ్చిన విషయం ఒప్పుకున్నట్టు తెలిసింది. ఉదయం విచారణలో అదనపు ఎస్పీ మహంతి కిశోర్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు. ముఖ్యంగా సౌజన్యతో పరిచయం ఎలా ఏర్పడింది, ఆమె భర్త జగదీశ్వరరెడ్డి హత్య, అందుకు వినియోగించిన రసాయనాలు, నూకరాజు కుటుంబానికి వేధింపులు, వారి ఆస్తులపై కన్ను, నకిలీ సర్టిఫికెట్లతో రైఫిల్ షూటింగ్ అకాడమీ నిర్వహణ తదితర అంశాలపై సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. సాధిక్ విచారణ కోసం మొదటి నుంచీ సేకరించిన ఆధారాలు, సూసైడ్ నోట్లలోని అంశాల ఆధారంగా సుమారు 200 ప్రశ్నలతో జాబితా సిద్ధం చేసుకున్న పోలీసులు ఆ విధంగానే ముందుకు సాగుతున్నారు. -
ఓటర్ల జాబితా కచ్చితత్వంతో రూపొందించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితాను కచ్చితత్వంతో రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడు, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియను గడువులోగా పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రక్రియలను అక్టోబర్ 5వ తేదీలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓల పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. అక్టోబర్ 9న ఓటర్ల తుది జాబితా ప్రచురణకు అవసరమైన అన్ని సన్నాహాలూ ముందుగానే పూర్తి చేయాలని అన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లాలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 88.15 శాతం, వివిధ నోటీసుల జారీ ప్రక్రియ 100 శాతం పూర్తయ్యాయని తెలిపారు. హియరింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుందని, ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులను మరో రెండు రోజుల్లోగా పరిష్కరిస్తామని చెప్పారు. -
ఓ మై డాగు
సాక్షి, అమలాపురం: ఒకప్పుడు పనికిరాదని పక్కన పడేసిన కుళ్లిన (డాగు) కొబ్బరి కాయకే ఇప్పుడు బంగారంలాటి ధర పలుకుతోంది. ఉత్తరాదిలో విపరీ తమైన డిమాండ్ ఏర్పడటంతో కోనసీమ నుంచి డాగు కొబ్బరి నేరుగా అక్కడకు తరలిపోతోంది. ఫలితంగా కొబ్బరికి పుట్టినిల్లయిన అంబాజీపేటలోనే డాగు కొబ్బరి కనిపించని పరిస్థితి ఏర్పడింది. లేదు. ‘డాగు’ ఎందుకొస్తుందంటే.. గతంలో దెబ్బ తిన్న (కుళ్లిన – డాగు పడిన) కొబ్బరిని స్థానిక వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేసేవారు. రైతులు కొబ్బరి కాయను ఒలిచి కురిడీగా తయారు చేసేందుకు అటకల మీద, ప్యాక్ హౌస్లలో నిల్వ చేస్తారు. మార్కెట్లో ధర లేనప్పుడు కొబ్బరి కాయను నేరుగా నిల్వ చేస్తూంటారు. ఈ క్రమంలో లేత కాయలతో పాటు మరికొన్ని కుళ్లిపోతాయి. దీనినే డాగు పడటమని అంటారు. ఈ కొబ్బరిని చిరు వ్యాపారులు కొనుగోలు చేసి, తొక్క తీసి, డాగు నూనె తయారు చేస్తారు. దీనిని దీపాలు వెలిగించేందుకు, సబ్బుల తయారీ, ఇతర పరిశ్రమల్లో వినియోగిస్తూంటారు. ఉత్తరాదిలో డిమాండ్ ఉత్తరాది రాష్ట్రాల్లో మరణించిన తమవారి దహన సంస్కారాలకు డాగు కొబ్బరిని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బిహార్లోని గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వహించే అంత్యక్రియల సందర్భంగా ఈ కుళ్లిన కొబ్బరిని వినియోగించడం ఆనవాయితీగా మారింది. దీంతో, ఆయా రాష్ట్రాలకు కుళ్లిన కొబ్బరి కాయలు నేరుగా ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్నంటడంతో కురిడీ కొబ్బరి ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో వెయ్యి కురిడీ కాయల ధర రూ.21 వేల నుంచి రూ.24,500 వరకూ పలుకుతోంది. దీంతో, ఉత్తరాదిలోని ఆలయాల్లో, ముఖ్యంగా గంగార్పణం వంటి కార్యక్రమాల్లో సామాన్యులు, పేదలు తక్కువ ధరకే దొరికే ఈ డాగు కొబ్బరిని కురిడీ కొబ్బరికి ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల కూడా దీనికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. కర్ణాటక నుంచి కూడా డాగు కొబ్బరి వస్తున్నప్పటికీ అక్కడ తయారవుతున్న డాగు నూనెకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటోంది. దీంతో, వ్యాపారులు ఇక్కడి కొబ్బరిని పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం డాగు కొబ్బరి ఉత్తరాదికి తరలిపోవడం స్థానిక ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జిల్లా అంతటా డాగు కొబ్బరి వ్యాపారం జరుగుతున్నా, పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లోని ముంజవరం, పొత్తాయలంక వంటి ప్రాంతాల్లో ఇది ఒక కుటీర పరిశ్రమలా ఉంది. సుమారు 300 కుటుంబాల వారు ప్రత్యక్షంగా, వెయ్యి కుటుంబాలు పరోక్షంగా ఈ వ్యాపారంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకూ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కాయ దొరకక వీరికి ఉపాధి లేకుండా పోయింది. అంబాజీపేట మార్కెట్లో దొరకని డాగు కొబ్బరి ఉత్తరాదికి నేరుగా ఎగుమతి గతంలో వంద కాయల ధర రూ.85 నేడు రూ.800కు పెరుగుదల స్థానికంగా నిలిచిన నూనె ఉత్పత్తి పాలకొల్లు నుంచి కోనసీమ వరకూ.. డాగు కొబ్బరి ఎగుమతులు తొలుత పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మొదలయ్యాయి. ఇప్పుడు కోనసీమ జిల్లా నుంచే నేరుగా, జోరుగా ఎగుమతులు జరుగుతున్నాయి. ధరల విషయానికి వస్తే గతంలో వంద డాగు కాయల ధర రూ.25 నుంచి రూ.85 మాత్రమే ఉండేది. అంటే కాయకు పావలా నుంచి 85 పైసల వరకూ ధర వచ్చేది. ఇప్పుడు అదే వంద కాయల ధర రూ.500 నుంచి రూ.800కు ఎగబాకింది. ఇందులో రెండో రకమైన ఖచ్చం రకం కాయ ధర అయితే ఏకంగా రూ.950 వరకూ పలుకుతోంది. -
కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలి
అమలాపురం టౌన్: పాతికేళ్లుగా అసంపూర్తిగా, నత్తనడకన సాగుతున్న కోనసీమ రైల్వే ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్ఎస్ఎస్) ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అంబాజీపేట మండల పర్యటనకు బుధవారం వచ్చిన సీఎంకు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రైల్వే లైన్కు అవసరమైన భూ సేకరణలో ఎదురవుతున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం చక్కదిద్దాలని కోరారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రూ.1,200 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భూ సేకరణకు సంబంధించి అన్ని కేసులపై స్టేలను కోర్టులు తొలగించినందున ఈ రైల్వే ప్రాజెక్ట్కు సమస్యలు దాదాపు తొలగినట్లేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైల్వే లైన్ను తొందరగా పూర్తి చేసి, ఈ ప్రాంత వాసుల చిరకాల కోరికను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, సప్పా నాగేశ్వరరావు, ఎరగర్త వెంకటేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ తదితరులు సీఎంకు వినతిపత్రం అందించారు. -
నిరుద్యోగులపై అక్రమ కేసులా!
కాకినాడ రూరల్: ఉద్యోగాల కోసం కాకినాడలో శాంతియుతంగా ధర్నా చేసిన నిరుద్యోగులపై పోలీసు నిర్బంధాన్ని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమేమిటని, వాటిని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగాల కోసం నిరసన తెలిపితే, వారికి నోటీసులు ఇవ్వడం సమంజసం కాదని పేర్కొన్నారు. నిరసనలో పాల్గొన్న 20 మందిపై కేసులు నమోదు చేయడంతో పాటు నోటీసులతో వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు శిక్షణ అందిస్తున్న శ్యామ్ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు జి.శ్యామ్పై కేసు పెట్టడం సరి కాదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని నాగమణి డిమాండ్ చేశారు. జీఓ ప్రకారం జీతాలివ్వాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులకు జీఓ ప్రకారం జీతాలివ్వాలని ఏపీఎస్ ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు మలకా వెంకట రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి కె.రమేష్కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కాకినాడ, పెద్దాపురం, ఏలేశ్వరం, తుని, పిఠాపురం తదితర ప్రాంతాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి జీఓ ప్రకారం వేతనాలు చెల్లించడం లేదన్నారు. మరోవైపు జీతాలను కార్మికుల బ్యాంకు ఖాతాలో కాకుండా నగదు రూపంలో ఇస్తున్నారని, ఆ సమయంలో కాంట్రాక్టర్లు ఎక్కువ మొత్తంలో కోతలు పెడుతున్నారని తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో స్వీపర్లకు, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు, వాషింగ్లో పని చేసే వారికి జీతాల్లో బాగా కోతలు పెడుతున్నారని చెప్పారు. తక్షణమే వేతనాల కోతను నిలుపు చేయాలని, గుర్తింపు కార్డులు, యూనిఫాం, ఇతర భద్రతా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకుడు మేడిశెట్టి వెంకట రమణ కూడా పాల్గొన్నారు. ధాన్యం సేకరణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా, రైతులకు అనుకూలంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ గడువులోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్లో బుధవారం జరిగిన జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం సేకరణకు రైతు సేవా కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతులు, పరికరాలు, ఇంటర్నెట్, కంప్యూటర్లు, ప్రింటర్లు, తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే పరికరాలు వంటివన్నీ పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. సేకరణ ప్రారంభానికి ముందే క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించి, లోపాలుంటే వెంటనే సరి చేయాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లుల పరిధిలోని వే బ్రిడ్జిలను తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేసి, అవసరమైన స్టాంపింగ్ పూర్తి చేయాలని అన్నారు. అవసరమైన సిబ్బందిని ముందుగానే నియమించి, శిక్షణ అందించాలని సూచించారు. గోనె సంచులు, గోదాములు, తగినంత మంది హమాలీలను అందుబాటులో ఉంచాలని జేసీ అన్నారు. స్విమ్స్లో అరుదైన శస్త్ర చికిత్స తిరుపతి తుడా: తిరుపతిలోని స్విమ్స్ కార్డియాలజీ విభాగం ఆధ్వర్యాన ఓ పేద రోగికి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వివరాలివీ.. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలానికి చెందిన బి.వెంకట సూరిబాబు (50) మూడు నెలలుగా గుండె జబ్బుతో బాధ పడుతున్నాడు. పలు రకాల మందులు వాడుతున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడలేదు. దీంతో, అతడు స్విమ్స్ ఆసుపత్రిని సంప్రదించారు. సూరిబాబును వైద్యులు పూర్తి స్థాయిలో పరీక్షించి ప్రాణదానం పథకం కింద ఎంపిక చేసి, సీఆర్టీ–డీ పరికరం అమర్చారు. లక్షల రూపాయల విలువైన శస్త్ర చికిత్సను ఉచితంగా విజయవంతంగా చేశారు. టీటీడీ, స్విమ్స్ అధికారులకు, వైద్యులకు రోగితో పాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీల పాలిట తెగులు టీడీపీ
● వారిని ఎదగకుండా చేశారు ● మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు రాజమహేంద్రవరం రూరల్: టీడీపీ బీసీలను ఎదగనీయకుండా చేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పచ్చ పత్రికలో ఇచ్చిన ప్రకటనలో తెలుగు బీసీలు అన్నారని, నిజానికి బీసీల పాలిట తెగులుగా టీడీపీ తయారైందని విమర్శించారు. నాడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, బీసీలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారని వేణు విమర్శించారు. ఈ తెగులు వల్లనే 1997లో ఐటీ రంగంలో బూమ్ వచ్చినా బీసీలు ఆ రంగంలోకి రాలేకపోయారని అన్నారు. బీసీలను కులవృత్తులుగా, పనిముట్లుగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో విద్యకు దూరం చేశారని ఆరోపించారు. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పెడితే బీసీ విద్యార్థులు చదువుకుని ఐటీ రంగంలో ఎదిగారని చెప్పారు. అలాగే, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 34 శాతానికి మించి 40 శాతం వరకూ రిజర్వేషన్ ఇచ్చి, వారికి పదవులు దక్కేలా చర్యలు చేపట్టి, స్థానిక ఎన్నికలకు వెళ్లారని వేణు పేర్కొన్నారు. కొన్నిచోట్ల 45 శాతం కూడా వారికి ప్రయోజనం కలిగిందని, అయితే దానిని 24 శాతానికి జగన్ తగ్గించేసినట్లు నాడు టీడీపీ దుష్ప్రచారం చేసిందని మండిపడ్డారు. మరి ఇప్పుడెలా 34 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ 105 జీఓ ఇచ్చారని వేణు ప్రశ్నించారు. న్యాయస్థానాల తీర్పును అధిగమించి మరీ హామీ ఇచ్చేసి, ప్రజలను మోసగిస్తారా అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటె 52 శాతం ఉన్న బీసీలకు 34 శాతం కాకుండా కనీసం 40 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలను కులవృత్తులకు పరిమితం చేయడానికి మొదటి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు పెట్టి, కనీసం రూ.వెయ్యి కూడా ఖర్చు చేయలేదని వేణు అన్నారు. రెండో బడ్జెట్లోనూ అలాగే పెట్టి రూ.2 వేలు కూడా ఇవ్వలేదన్నారు. మూడో బడ్జెట్లోనూ అలాగే పెట్టి సగం కాలమైనా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లున్న బీసీలకు పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రలోభాలు ఎర వేసి తమ పార్టీలోని బీసీ నాయకులను టీడీపీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. వీటన్నింటినీ ఎండగట్టడానికి టీడీపీ వెన్నుపోటు గురించి ప్రాంతీయ సమావేశాలు పెట్టాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించిందని వేణు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు పాల్గొన్నారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
● నిరుద్యోగ యువతపై వేధింపులు ఆపాలి ● పోలీసు శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి ● డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు శ్యామ్ సంస్థపై అక్రమంగా పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యాన, డీవైఎఫ్ఐ నాయకుడు టి.రాజా అధ్యక్షతన స్థానిక సుందరయ్య భవన్లో బుధవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వెంటనే అక్రమ కేసులు ఉపసహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ యువతపై పోలీసు వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 11,639 పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని, అందులో భాగంగానే కాకినాడ కొండయ్యపాలెం బ్రిడ్జి నుంచి సోమవారం శాంతియుతంగా ప్రదర్శన చేసుకుంటూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారని చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెట్టడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. హోంమంత్రి విడుదల చేసిన వీడియోలో అబద్ధాలు చెప్పారని అన్నారు. తొలుత 20 మంది నిరుద్యోగ అభ్యర్థులపై కేసులు పెట్టారని, తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారని అన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహ కార్యదర్శి వై.బాబీ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ మాట్లాడుతూ, నిరుద్యోగులకు మద్దతుగా వెళ్లిన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులతో పాటు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్పై కాకినాడ త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసులు బనాయించడం అన్యాయమని అన్నారు. ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ కొద్ది రోజులుగా నిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారని అన్నారు. తక్షణమే పోలీసు కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు జి.ప్రభాకర్వర్మ మాట్లాడుతూ నిరుద్యోగ అభ్యర్థుల ఆందోళనకు మద్దతు ఇచ్చిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని అన్నారు. అనంతరం అడిషనల్ ఎస్పీ కిశోర్ కుమార్కు నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, డీవైఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి పెద్దింశెట్టి రామకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యం, లోవరాజు తదితరులు పాల్గొన్నారు. -
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు.ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సా«ధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాం«దీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహమాన్ సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహమాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. -కాకినాడచదవండి: బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు -
ఉద్యోగాలడిగారని ఉక్రోషం.. నిరుద్యోగ గుండెలపై దమనకాండ
కాకినాడ క్రైం: నిరుద్యోగ గుండెలపై ఖాకీలు దమనకాండ సాగించారు. ఉద్యోగాలివ్వమని అడిగిన పాపానికి ఉగ్రవాదుల్లా చూశారు. రాత్రంతా కాళరాత్రి కళ్లకుకట్టారు. మంగళవారం తెల్లవారుజామున నిద్రలో ఉండగా పోలీస్ శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల హాస్టళ్లలోకి ముష్కర మూకలు తెగబడినట్టు పోలీసులు గుంపులుగా దూసుకొచ్చారు. తలుపులు కొట్టి, బలవంతంగా నెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. ఎవడ్రా ఇక్కడ నిరసనలో పాల్గొన్నదని కళ్లెర్రజేశారు. నిరుద్యోగులపైనా, వారంతా చదువుతున్న విద్యాసంస్థ యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. భవిష్యత్ను నాశనం చేస్తాం.. ఖబడ్దార్.. అంటూ హెచ్చరించి మరీ వెళ్లారు. అసలేం జరిగింది... రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పోలీస్ నిరుద్యోగులంతా ఏకమయ్యారు. దశల వారీగా వివిధ జిల్లాల్లో చేపడుతున్నట్టుగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోలీసు ఉద్యోగాలన్నీ భర్తీచేయాలని, తక్షణం ఉద్యోగ ప్రకటన విడుదల చేయాలనే డిమాండ్లతో సోమవారం కాకినాడలో భారీ నిరసన చేపట్టారు. శారదాదేవి జంక్షన్కు సోమవారం ఉదయం సుమారు 1,000 మంది నిరుద్యోగులు చేరుకుని అక్కడి నుంచి భానుగుడి కూడలి వరకు నిరుద్యోగ భృతి కాదు.. ఉద్యోగాలు కావాలని డిమాండ్ చేస్తూ సీఎం బాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితల తీరును నిరసించారు. 12 వేలకుపైగా ఖాళీలు ఉంటే కేవలం 1500కు అటుఇటుగా పోస్టులు విడుదల చేస్తారన్న విషయం తెలియవచ్చిందని, అదే జరిగితే తమ భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని ఆవేదన వెళ్లగక్కారు. నోటిఫికేషన్లు ఇవ్వడం ఆలస్యమవుతుండడం వల్ల వయోపరిమితి మినహాయింపునివ్వాలని డిమాండ్ చేశారు. భానుగుడి వరకు భారీ ప్రదర్శనగా వెళ్లి అక్కడి నుంచి కలెక్టరేట్ ఆవరణను చేరుకొని ధర్నా చేపట్టారు., పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అణగదొక్కాలని హుకుంసోమవారం కాకినాడలో జరిగిన నిరసన ప్రదర్శన జిల్లా పోలీస్ శాఖకు సవాల్ విసిరినట్టయింది. రాష్ట్రంలో మరెక్కడా జరగనంత ఉధృతంగా కాకినాడలో ఈ నిరసన జరగడంతో పోలీసులే కంగుతిన్నారు. ఇది పాలకులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ప్రభుత్వం జిల్లా పోలీసుల తలంటింది. తక్షణం ఆందోళన చేసిన వారిని అణగదొక్కాలని, మళ్లీ నిరసన చేపట్టాలంటే భయపడేలా చేయాలని హుకుం జారీచేసింది. దీంతో పోలీసులు పేట్రేగిపోయారు. పైశాచికత్వానికి పదునుపెట్టారు. నిరుద్యోగులు, వారు శిక్షణ తీసుకుంటున్న సంస్థలపై సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు తమ ప్రతాపాన్ని చూపించారు. హాస్టళ్లలోకి చొరబడి భయానక వాతావరణం సృష్టించారు. రాత్రంతా ప్రత్యక్ష నరకం.. సోమవారం రాత్రి నుంచే పోలీసులు హాస్టళ్లపై దాడులు చేపట్టారు. విద్యుత్ నగర్లో ఉన్న శ్యామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్లే దారులన్నింటిలోనూ పోలీసులు మోహరించి తమ జీపులను నిలిపారు. అటుగా వెళుతున్న విద్యార్థులు ప్రతి ఒక్కరినీ ఆపి ఆరా తీశారు. గుర్తింపు కార్డులను పరిశీలించి వ్యక్తిగత ఆరాలూ తీశారు. ఎందుకని ప్రశ్నిస్తే తాటతీస్తామని హెచ్చరించారు. రాత్రి అంతా ఇన్స్టిట్యూట్ చుట్టూ, అలాగే అక్కడి విద్యార్థులు ఉంటున్న హాస్టళ్ల చుట్టూ కలియదిరిగారు. మఫ్టీలో మాయ చేసి, సెల్ఫోన్ కెమెరాలతో అటుగా వెళుతున్న ప్రతి ఒక్కరి కదలికలను రికార్డు చేశారు. కర్ఫ్యూ వాతావరణాన్నే సృష్టించారు. కాళరాత్రిని కళ్లకు కట్టారు. తెల్లవారుజామున హాస్టళ్లలోకి చొరబడ్డారు. తలుపులు బాదుతూ, నెడుతూ నిరుద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు. ఆడా మగా తేడా లేకుండా విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. మహిళా అభ్యర్థులు నైట్ డ్రెస్లలో ఉండగానే పోలీసులు ఫొటోలు తీశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ సహా గుర్తింపు కార్డుల ఫొటోలు తీసుకున్నారని పేర్కొన్నారు, వ్యక్తిగత అంశాలనూ ప్రశ్నించి వెకిలిచేష్టలతో నరకం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరసనల్లో పాల్గొంటే భవిష్యత్ నాశనం చేస్తామని హెచ్చరించి వెళ్లారని విమర్శించారు. ఈలోపు శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ అక్కడికి వచ్చి తనిఖీలకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నిస్తే, అవసరం లేదని పోలీసులు మరింత చెలరేగిపోయారు. నలుగురిపై కేసులు నమోదు.. ఉద్యోగ ప్రకటన పేరుతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్డెక్కించారని, ఇందులో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నేతలు భాగమయ్యారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గుంటూరి శ్యామ్తో పాటు డీవైఎఫ్ఐ జిల్లా నాయకుడు తొట్టిపూడి రాజా, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మదిన గంగా సూరిబాబు, డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజేష్ లపై కేసులు నమోదు చేసినట్టు కాకినాడ త్రీటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మొత్తం ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత కన్నీటి పర్యంతం తమ సంస్థ హాస్టల్లో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు దాడులు చేయడంపై శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాకు తమ సంస్థకు సంబంధం లేదన్నా.. పోలీసులు వినలేదని కన్నీటిపర్యంతమయ్యారు. చెబితే విని నిరసనలు చేయడానికి నిరుద్యోగులు చిన్నపిల్లలేం కాదని, డిగ్రీలు, పీజీలు చదివిన వారని, ఎంతోకాలంగా శిక్షణ పొందినా ఉద్యోగం రాలేదనే ఆవేదనతోనే నిరసన బాట పట్టి ఉంటారని పేర్కొన్నారు. ఇప్పుడు అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులూ ఒక్కప్పుడు ఉద్యోగాల కోసం వేదన పడ్డవారేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. జిల్లాలో ఏ నేరం జరిగినా తమ సంస్థలో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల మీదకే నెట్టడం వారి భవితను కాలరాయడమేనని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పు చేస్తున్న వారు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. పోలీసులు సోమవారం మధ్యాహ్నం తమ విద్యార్థులను పోలీసుస్టేషన్కు పిలిచి విచారణ పేరుతో రాత్రి వరకు ఉంచారని, మళ్లీ తెల్లవారుజామున దాడులకు తెగబడ్డారని ఆక్రోశించారు. తమ సంస్థలో శిక్షణ పూర్తిచేసుకున్న వారు ఒకే గదిలో ఇద్దరు, ముగ్గురు ఉంటూ తినీతినక కష్టాలు పడుతున్నారని వారి వేదన చూడలేక సీఎం చంద్రబాబును కలిసి పోలీసు శాఖలో ఉద్యోగాలు పెంచాలని కోరానని గుర్తుచేశారు. అనుమతిలేకుండా ర్యాలీ నిరుద్యోగులను రెచ్చగొట్టి దురుద్దేశంతో రోడ్డెక్కించారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న సెంట్రల్ మైక్లో నిరసనల సమాచారం పంచుకున్నారు. ఈ విషయం అధినేత శ్యామ్కు తెలిసే జరిగింది. నిరుద్యోగులపై కేసులేవీ పెట్టలేదు. శ్యామ్ సహా మరో ముగ్గురు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులపై కేసులు నమోదు చేశాం. పోలీసుల అనుమతి తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడూ డిప్యూటీ సీఎం కారును శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు అడ్డుకోబోయారు, అలాగే, పలు నేరాల్లో కూడా కొందరు భాగమవుతున్నారు. వీటి వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకే హాస్టళ్లలో తనిఖీలు నిర్వహించాం. మేం ఎవరినీ ఉగ్రవాదుల్లా పరిగణించలేదు, నిబంధనలకు లోబడే తనిఖీలు చేశాం. – మహంతి కిషోర్కుమార్, ఇన్చార్జి ఎస్పీ, అదనపు ఎస్పీ, కాకినాడ జిల్లా -
ఫ నేల దున్నితే.. మాకు పండగే..
రైతన్నలు కాడి కట్టి, మేడి పట్టి, నేల దున్నే సమయంలో.. పుడమి తల్లి గర్భంలో ఉన్న రకరకాల పురుగులన్నీ బయట పడుతూంటాయి. సరిగ్గా అదే సమయంలో ఎవరో కబురు చెప్పినట్లు.. ఆ పురుగులను కడుపారా ఆరగించేందుకు ఎక్కడెక్కడో ఉన్న కొంగలు.. రెక్కలు కట్టుకు వచ్చి మరీ వాలిపోతాయి. కోటనందూరు మండలం ఎల్డీ పేట వద్ద వరి నాట్లు వేసేందుకు రైతు ట్రాక్టర్తో దమ్ము చేస్తూండగా.. వందలాదిగా కొంగలు అలానే తరలి వచ్చాయి. దమ్ము చేస్తున్నంతసేపూ అక్కడే తిష్ట వేసి.. పురుగులను పట్టుకుని కడుపు నింపుకొన్నాయి. ‘ఒక జీవికి ఆకలి వేసిందా.. ఇంకో జీవికి ఆయువు మూడిందే’ అంటూ ఓ సినీ కవి చంద్రబోస్ తన పాటలో చెప్పిన భావన ఇక్కడ అక్షరాలా ఆవిష్కృతమైంది. – కోటనందూరు -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
నిడదవోలు రూరల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని సమిశ్రగూడెం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జువ్వలపాలేనికి చెందిన మరపట్ల రాజ్కుమార్, రాజమహేంద్రవరం చర్చిపేట ప్రాంతానికి చెందిన చిప్పాడ ప్రవీణ్ కుమార్లు గతంలో వేర్వేరు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లారు. అక్కడ వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలైన వీరిద్దరూ కలిసి సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో నిడదవోలు మండలం సమిశ్రగూడెం లోహియా నగర్ వద్ద కవర్లో పెట్టి గంజాయి విక్రయిస్తూండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2.080 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. రాజ్కుమార్పై ఇప్పటికే తాడేపల్లిగూడెం, నిడదవోలుతో పాటు పలు స్టేషన్లలో దొంగతనం కేసులు నమోదయ్యాయి. ప్రవీణ్ కుమార్పై గంజాయి విక్రయాలకు సంబంధించిన కేసులున్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ విజేతకు సత్కారం
కొత్తపేట: అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ చాంపియన్షిప్ విజేతగా నిలిచిన ఉండ్రాజపు విలియం కేరీని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యాన ఘనంగా సత్కరించారు. ఆలమూరు మండలం మడికి గ్రామానికి చెందిన కేరీ గత నెల 24 నుంచి 27వ తేదీ వరకూ భూటాన్లో జరిగిన అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ పోటీల్లో పాల్గొన్నాడు. ఈ పోటీలో భారత్ జట్టు భూటాన్పై విజయం సాధించింది. భారత్ జట్టులో ప్రతిభ చూపి, విజేతగా నిలిచిన విలియం కేరీని రావులపాలెం సీఆర్సీలో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో జగ్గిరెడ్డి, పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు ఘనంగా సత్కరించారు. అతడి తల్లిదండ్రులు రాజామణి, సుందర విజయంలను అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు చోరీపై డీఎస్పీ విచారణ
కాజులూరు: గొల్లపాలెంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ)లో జరిగిన చోరీపై కాకినాడ డీఎస్పీ మహంతి కిశోర్ కుమార్ విచారణ చేపట్టారు. రెండు రోజుల కిందట దొంగలు ఈ బ్యాంకులో ఏటీఎం పగులగొట్టి, అందులోని రూ.4,35,500 నగదు చోరీ చేశారు. దీంతో పాటు ఏటీఎం గదికి ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి బ్యాంకు లోపలకు ప్రవేశించి, బ్రాంచి మేనేజర్ మొబైల్ ఫోన్ను, ఒక డిబ్బీని అపహరించుకుపోయారు. ధ్వంసమైన ఏటీఎంను, బ్యాంకును డీఎస్పీ మంగళవారం పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బ్యాంకు చోరీపై కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశామని, సాధ్యమైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని కిశోర్ కుమార్ చెప్పారు. ఆయన వెంట ఎస్సై ఆర్వీఎన్ మూర్తి తదితరులున్నారు. అమ్మ మీద బెంగతో ఆగిపోయా.. మలికిపురం: ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను అమ్మ మీద బెంగతోనే విరమించుకున్నానని సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్ కుమార్ చెప్పాడు. మలికిపురం మండలం దిండి – చించినాడ వంతెన వద్ద అతడు సోమవారం ఉదయం మోటార్ సైకిల్ ఉంచి, దానిపై ఒక లేఖ పెట్టి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీంతో, తరుణ్ వశిష్ట గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడేమోనని అందరూ భావించారు. అతడి కోసం బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. మద్యం తాగి వంతెన కింద పడుకుని ఉన్న అతడిని మంగళవారం తెల్లవారుజామున 2 గంటల తరువాత గుర్తించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. తనకు అప్పులున్నాయని తీర్చలేకే ఇలా చేశానని, నదిలో దూకుదామనుకున్న సమయంలో అమ్మ గుర్తుకు వచ్చి, ఆ ప్రయత్నం విరమించుకున్నానని తల్లిదండ్రులు, పోలీసుల సమక్షంలో తరుణ్ చెప్పాడు. పోలీసులు అతడిని తల్లిదండ్రులకు అప్పగించారు. -
వ్యాన్ దొంగ అరెస్టు
తాళ్లరేవు: కోరంగిలోని డివైన్ ఎంటర్ప్రైజెస్కు చెందిన వ్యాన్ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 30న మెండా వెంకటేశ్వరరావుకు చెందిన బొలేరో వాహనం అపహరణకు గురైంది. ఈ నెల 8న కోరంగి వంతెన వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఆ వాహనాన్ని పోలీసులు గుర్తించి, అందులోని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా పెద బొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన పాలెపు సతీష్ ఆ వాహనాన్ని అపహరించినట్లు గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరచి, రిమాండుకు తరలించారు. -
జీవితాలకు దర్పణాలు.. కన్నీటి సంతకం కథలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రముఖ కవి, రచయిత, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ రచించిన కన్నీటి సంతకం కథల పుస్తకాన్ని వేదిక అంతర్జాతీయ ప్రతినిధి, పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ జేమ్స్వాట్ కొమ్ము ఆవిష్కరించారు. నగరంలోని సోన్స్ సాఫ్ట్వేర్ కార్యాలయంలో కళావేదిక జాతీయ కో ఆర్డినేటర్ కేతా శ్రీనివాస్ అధ్యక్షతన మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ సినీ హాస్య నటుడు భద్రం మాట్లాడు తూ, ప్రతాప్ కుమార్ రాసిన కథలు ఎందరివో జీవితాలకు దర్పణాలని అన్నారు. ఈ కథలు చ దువుతూంటే మనసు ద్రవిస్తుందని, మన చుట్టూ ఉన్న మనుషుల జీవితాల్లోని భావోద్వేగాలను, బాధలను, మానవీయ సంబంధాలను ఈ కథలు కళ్ల ముందు నిలబెడతాయని అన్నారు. జేమ్స్ వాట్ మాట్లాడుతూ, కన్నీటి సంతకం కథలు నేటి జీవన విధానానికి అద్దం పడుతున్నాయన్నారు. కనుమరుగవుతున్న మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు, మనిషిలోని ఆర్ధ్రత, సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులు ఈ కథల్లో సజీవంగా కనిపిస్తాయని అన్నారు. -
రూఫ్ దాటితే.. సేఫ్ కాదు
రాయవరం: ఆధునిక, లగ్జరీ కార్లకు సన్రూఫ్ ఉండాలని పిల్లల నుంచి పెద్దల వరకూ కోరుకుంటున్నారు. కారులో వెళ్తున్నప్పుడు సరదాగా సన్రూఫ్ తెరచి.. గాల్లో తేలినట్టు ఆనందంగా ప్రయాణించడాన్ని పలువురు ఆస్వాదిస్తున్నారు. అయితే, ఈ ఆనందం మాటున ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందువలన సన్రూఫ్ తెరచి ప్రయాణించే వారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు, రవాణా అధికారులు సూచిస్తున్నారు. అజాగ్రత్తగా ఉండే ప్రమాదమే.. u సన్రూఫ్లలో ప్రయాణం కొన్నిసార్లు ప్రాణాంతకమవుతుంది. u ఇరుకు, రద్దీ రోడ్లలో ఓవర్ లోడుతో ఎత్తయిన వాహనాలు వెళ్లకుండా పోలీసులు ఓవర్ హెడ్ బారికేడ్లు ఏర్పాటు చేస్తూంటారు. ఇలాంటి రహదారుల్లో సన్రూఫ్లో నిలబడి ప్రయాణించకూడదు. అలాగే, విద్యుత్ వైర్లు, టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు, ఇతరత్రా సన్నని తీగలు, చెట్ల కొమ్మలు రోడ్లపై వేలాడుతూంటాయి. ఇటువంటి వాటిని డ్రైవర్లు సాధారణంగా ఒక్కోసారి గమనించలేరు. దీంతో, సన్రూఫ్లో ప్రయాణించే వారికి ఇవి తగిలి మెడ, తల, మొండెం భాగాలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదం ఉంది. u అలాగే, నడుం భాగం వరకూ బయట పెట్టి చేతులు ఊపుతూ ప్రయాణిస్తున్న క్రమంలో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే సన్రూఫ్లో ఉన్నవారికి పట్టు దొరకదు. దీంతో, సన్రూఫ్ ఫ్రేమ్ తగిలి పక్కటెముకలు, ఊపిరితిత్తులకు గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. పొత్తి కడుపులో బలంగా తగిలితే తీవ్ర రక్తస్రావం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. u వంకలు, మూల వంపులు అధికంగా ఉన్న రోడ్లలో అయితే, ఏకంగా కారులో నుంచి కింద పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. u ఇతర వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము, ధూళి నేరుగా శ్వాస వ్యవస్థలోకి చేరి రోగాలకు కారణమవుతాయి. స్కూటర్ డిక్కీలో డబ్బులు మాయం ఫ కారు సన్రూఫ్లతో జాగ్రత్త ఫ అప్రమత్తత లోపిస్తే ప్రాణాలకే ప్రమాదం ఫ వేలాడే వైర్లు, ఓవర్హెడ్ బారికేడ్లతో ముప్పు జాగ్రత్తలు తీసుకోవాలి వేగంగా ప్రయాణించే సందర్భంలో సడన్ బ్రేక్ వేస్తే సన్రూఫ్ నుంచి కిందకు పడే అవకాశం ఉంటుంది. సన్రూఫ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. –బి.విద్య, ఈస్ట్జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం ప్రమాదకరం సన్రూఫ్ తెరచుకుని చిన్నారులతో ప్రయాణించడం శ్రేయస్క రం కాదు. ఈ విషయంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలి. సెల్ఫీ లు, ఫొటోలు కారు పూర్తిగా ఆగిన తర్వాత తీసుకుంటేనే మంచిది. –ఆర్.సురేష్, తూర్పు గోదావరి జిల్లా రవాణా శాఖ అధికారిసన్రూఫ్ ఎందుకంటే.. ఫ సహజమైన గాలి ప్రసరణ (వెంటిలేషన్) కోసం సన్రూఫ్ ఏర్పాటు చేస్తారు. ఫ అత్యవసర పరిస్థితుల్లో కారు డోర్లు లాక్ అయిపోతే సన్రూఫ్ నుంచి బయటకు వెళ్లిపోవచ్చు. ఫ వేసవిలో ఎండలో నిలిపి ఉంచినప్పుడు కారు క్యాబిన్ చాలా వేడెక్కిపోతుంది. అటువంటి సమయంలో ఏసీ ఆన్ చేసి, సన్రూఫ్ తెరిస్తే కారులోని వేడి గాలి బయటకు వెళ్లి, కారు క్యాబిన్ త్వరగా చల్లబడుతుంది. -
మళ్లీ చివరాఖరుకే..
అన్నవరం: భక్తులకు సేవలు అందించే విషయంలో అన్నవరం దేవస్థానం ర్యాంకు మళ్లీ చివరాఖరుకు దిగజారిపోయింది. రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ప్రభుత్వం గత ఆగస్టు 5 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ భక్తుల నుంచి ఐవీఆర్ఎస్, వాట్సాప్ యాప్ సర్వే నిర్వహించింది. ఇందులో 66.6 శాతంతో అన్నవరం దేవస్థానం చివరి స్థానంతో సరిపెట్టుకుంది. ఏకంగా 33.4 శాతం మంది భక్తులు.. అంటే దేవస్థానానికి వచ్చిన ప్రతి ముగ్గురు భక్తుల్లో ఒకరు ఇక్కడి సేవలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. గత ఏడాది ఏప్రిల్లో కూడా చివరి స్థానంలోనే నిలిచింది. ఆ సందర్భంగా అప్పటి కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించారు. సిబ్బంది అందరూ మెరుగైన సేవలందించడం ద్వారా దేవస్థానాన్ని మొదటి స్థానంలో నిలపాలని ఆదేశించారు. ఆ తరువాత కొంత మెరుగుదల సాధించి, ఒక దశలో మొదటి స్థానానికి చేరింది. ఆ తరువాత 4, 5 స్థానాలకే పరిమితమవుతూ వస్తోంది. దాదాపు ఏడాదిన్నర తరువాత అన్నవరం దేవస్థానం మళ్లీ ఆఖరి స్థానానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అన్ని దేవస్థానాలపై అసంతృప్తి సర్వే నిర్వహించిన ఏడు దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై భక్తులు కాస్త అధికంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం సంతృప్తిగా జరిగిందా అనే ప్రశ్నకు గత సర్వేలో 70.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా ఈసారి అది 69.8 శాతానికి తగ్గింది. తాగునీటి వసతుల్లో గత సర్వేలో సంతృప్తి శాతం 65.6 శాతం కాగా, తాజాగా 62.7 శాతానికి పడిపోయింది. ప్రసాదాలపై గతంలో సంతృప్తి శాతం 76.9 కాగా ఈసారి 75.1 శాతానికే పరిమితమైంది. పారిశుధ్యంపై గత సర్వేలో సంతృప్తి శాతం 64.4 కాగా, ఈసారి అది 61.4 శాతానికి తగ్గింది. ఫ ప్రభుత్వ సర్వేలో దిగజారిన ర్యాంకు ఫ అన్నవరం దేవస్థానం.. 66.6 శాతంతో ఆఖరి స్థానం -
కూటమి అరాచకాలపై పోరాడదాం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అకృత్యాలను స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ చూడలేదని, ప్రతిరోజూ పేపర్, టీవీలో కూటమి అరాచకాలే దర్శనమిస్తున్నాయని, వాటిపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త, నేతలపై ఉందని శాసనమండలి ప్రతిపక్ష నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వక్షతన వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డికి నివాళులర్పించిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీదే గెలుపని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తంగా ఉండాలన్నారు. ప్రతి స్థానంలో పోటీ చేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఇంకో రెండేళ్లలో కూటమికి ఓటమి ఖాయమని, మరోసారి జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మన హయాంలో ప్రజలకు మంచి పాలన అందిద్దామని ఆయన చెప్పారు. డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులా? డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నించినందుకు కూటమి ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందని, కేసులను తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. టెట్ ఎన్నిసార్లయినా రాసుకోవచ్చని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే విషయంపై సమాధానం చెప్పడం లేదని దుయ్యబట్టారు. పురుషోత్తపట్నం నుంచి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశీ నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. అపర భగీరథుడు అంటే గుర్తువచ్చే పేరు మహానేత వైఎస్సార్ అని చెప్పారు. రాబోయేది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, కష్టపడిన కార్యకర్తలు, నేతలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. సమావేశంలో కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, రాష్ట్ర కార్యదర్శి ఒమ్మి రఘురాం, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వారి అజెండా టీడీపీ అకృత్యాలపై పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుదాం కష్టపడిన వారికి వైఎస్సార్ సీపీలో సముచిత స్థానం శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికల్లో గెలుపుపై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం -
క్రౌన్ ఆఫ్ కాకినాడ కిడ్స్.. విజేత గ్రీష్మ
బోట్క్లబ్: స్థానిక డి కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన క్రౌన్ ఆఫ్ కాకినాడ పోటీల్లో జూనియర్ కిడ్స్ విభాగంలో కాకినాడకు చెందిన ఎస్.గ్రీష్మ విజేతగా నిలిచింది. వివిధ విభాగాలు నిర్వహించిన పోటీల్లో పలువురు బాలికలు పాల్గొనగా గ్రీష్మ తన ప్రతిభను చాటుకుంది. కార్యక్రమ నిర్వాహకులు అడ్డాల సతీష్ విజేతకు బహుమతులు అందజేశారు. బహుమతి సాధించిన గ్రీష్మను పలువురు అభినందించారు. గ్రీన్ కై ్లమేట్ ఫండ్ ప్రాజెక్ట్ పురోగతిపై సమీక్ష బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో గ్రీన్ కై ్లమేట్ ఫండ్ (జీసీఎఫ్) ప్రాజెక్టు పురోగతిపై కలెక్టర్ హరేంధిరప్రసాద్ ప్రాజెక్టు బృందం, వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జీసీఎఫ్ ఆధ్వర్యంలో ఈసీఆర్ఐసీసీ ప్రాజెక్ట్ ద్వారా తీరప్రాంత ప్రజల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలపై ఈ సందర్భంగా సమీక్షించారు. మడ అడవుల పునరుద్ధరణ, పర్యావరణ వ్యవస్థల పరిరక్షణ, తీర ప్రాంత ప్రజల కోసం ప్రతిపాదిత జీవనోపాధి కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా అలంకార చేపల పెంపకం, సముద్రపు నాచు (సీవీడ్) సాగు, సముద్రంలో కేజ్ కల్చర్ వంటి ప్రత్యామ్నాయ ఉపాధి యూనిట్ల ఏర్పాటుపై సమీక్ష చేశారు. ప్రతిపాదిత కార్యక్రమాలను సంబంధిత శాఖల మధ్య సమర్థవంతమైన సమన్వయంతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలన్నారు. నిరుద్యోగులపై కక్షపూరిత చర్యలా? బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కానిస్టేబుల్, ఎస్సై తదితర పోలీస్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న నిరుద్యోగులను కాకినాడ పోలీసులు వెంటాడి వేధించడాన్ని సీపీఎం తీవ్రంగా తప్పు పట్టింది. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు మంగళవారం డీఆర్వో తిప్పేనాయక్కు వినతి పత్రం ఇచ్చారు. సోమవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నిరుద్యోగులు ప్రభుత్వం ప్రకటించిన ఖాళీ పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ హామీ మేరకు పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడలో కూడా వేలాదిమంది భారీ ఊరేగింపు, కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారన్నారు. నిరుద్యోగులు రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా తమ విజ్ఞప్తిని ప్రకటించారన్నారు. కడు నిరుపేదలైన నిరుద్యోగ యువతీయువకులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్లెక్కి తమ డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడాన్ని సహించలేకపోయిన కాకినాడలోని ప్రభుత్వ యంత్రాంగం నిరుద్యోగులపై కక్షపూరిత చర్యలకు దిగడాన్ని తీవ్రంగా నిరసించారు. పోలీసుల తీరుపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ ప్రేరేపిత చర్యా? పోలీసుల అత్యుత్సాహమా? శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్తో పాటు అనేక మంది నిరుద్యోగులు, విద్యార్థి సంఘం నాయకులపై కేసులు నమోదు చేయడం ప్రభుత్వ ప్రేరేపిత చర్యా లేక పోలీసు అత్యుత్సాహమా? లేక ఇతర శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయా? అనే కోణంలో కూడా పూర్తి విచారణ జరపాలని సీపీఎం నాయకులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు, నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ కోసం ప్రదర్శన, ధర్నాలు చేయకూడదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాస్తారా అని నిలదీశారు. ఈ చర్య వెనక ఉన్న ఉద్దేశాలు బహిర్గతం కావాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరంలో హత్యలు, గంజాయి మాదకద్రవ్యాల వ్యాపారాలు పెరిగిపోయాయని, పోలీసులు వాటిపై దృష్టి సారిస్తే సమాజానికి ఉపయోగమని సీపీఎం నేతలు హితవు పలికారు. శ్యామ్పై, నిరుద్యోగులు, సంఘాల నాయకులపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, జరిగిన పరిణామాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా జరిగిన పోలీసు చర్యపై దీనికి తగిన కారణాలు తెలుసుకోవడానికి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. డీఆర్వోను కలిసిన అనంతరం శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యాన్ని, నిరుద్యోగులను సీపీఎం ప్రతినిధి బృందం పరామర్శించి ధైర్యం చెప్పింది. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు పెద్దింశెట్టి రామకృష్ణారావు, చింతపల్లి అజయ్ కుమార్, తొట్టిపూడి రాజా పాల్గొన్నారు. -
మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఎరువుల కొరత, ధాన్యం కొనేవారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కమిటీలతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తున్నాం. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు కలసికట్టుగా స్థానిక సంస్థల్లో నడవాలి. – వంగా గీత, మాజీ ఎంపీ కూటమిది రాక్షస ప్రభుత్వం కూటమిది రాక్షస ప్రభుత్వం. ప్రజలకు చేస్తున్న అరాచకాలపై అవగాహన కల్పించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ వాగ్దానం నెరవేరడం లేదు. కూటమిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. కూటమి పాలన, టీడీపీ నేతలపై ప్రజలు మండిపడుతున్నారు. నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి. అన్ని స్థానాల్లో పోటీ చేసి గెలుపొందాలి. – తోట నరసింహం, మాజీ మంత్రి జగన్ను సీఎం చేయడమే లక్ష్యం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలన్న లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. కార్యకర్తలపై కూటమి నాయకులు ఎన్ని కేసులు పెడుతున్నా భయపడకుండా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్నారు. ఇదే తీరుతో కూటమి నేతల అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి. – దవలూరి దొరబాబు, పెద్దాపురం కోఆర్డినేటర్ ఐక్యతతో విజయం సాధిద్దాం వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించారు. వైఎస్ జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని, గెలుపు సాధించాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వార్డుల సభ్యుల నుంచి మేయర్ వరకు పార్టీ నుంచి పోటీ చేద్దాం. సమష్టిగా కష్టపడి విజయం సాధిద్దాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ బీసీ రిజర్వేషన్ కుదించే కుట్ర బీసీల రిజర్వేషన్ 24 శాతానికి కుదించే కుట్రలో భాగంగానే ప్రతాప్రెడ్డితో కోర్టులో కేసు వేయించారు. గత స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు వదిలేశాడు. కార్యకర్తలను పట్టించుకోలేదు. పోరాటానికి వెన్నుచూపనని చెప్పిన నేత మాజీ సీఎం వైఎస్ జగన్. జగన్ అంటేనే ఒక పవర్. ఆయన్ను తలచుకుని పోటీ చేయండి. ఇచ్చిన హామీలను చంద్రబాబు తుంగలో తొక్కాడు. – చెల్లుబోయిన వేణు, మాజీ మంత్రి -
తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..
కాకినాడ క్రైం / కాకినాడ రూరల్ : తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. సర్పవరం పోలీసుల తొలిరోజు విచారణలో నిందితుడు సాధిక్ఖాన్ ఇచ్చిన సమాధానాలు దాదాపుగా ఇవే. పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు అనుమానాస్పద మృతిలో కీలక నిందితుడు సాధిక్ ఖాన్ను మంగళవారం కస్టడీకి తీసుకున్న సర్పవరం పోలీసులు తొలిరోజు విచారణ ప్రారంభించారు. అతడి న్యాయవాది సమక్షంలో అదనపు ఎస్పీ మహంతి కిషోర్కుమార్ ఆధ్వర్యంలో రూరల్ పీఎస్ ఆవరణలో ఉన్న ప్రత్యేక గదిలో అతన్ని విచారిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన విచారణ, రాత్రి 9.30 సమయానికి కూడా కొనసాగుతోంది. పోలీసు వర్గాల నుంచి తెలిసిన సమాచారం మేరకు.. సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నలతో జాబితాను సిద్ధం చేసుకున్న పోలీసులు తొలిరోజు 60 ప్రశ్నలు అడిగారు. అందులో ఎక్కువ మేరకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సాధిక్ సమాధానం ఇవ్వడం గమనార్హం. సాంకేతిక ఆధారాలతో సాధిక్ను అడిగిన ప్రశ్నలకు వాస్తవ సమాధానాలు కనిపెట్టే యోచనలో పోలీసులు ఉన్నారు. విచారణకు పూర్తి స్థాయి సహకారం లేకపోవడం వల్ల సాంకేతిక అంశాలపై ఆధారపడి కేసు విచారణ కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. మీరట్లో ఏం జరిగింది... సాధిక్ మీరట్ వెళ్లడం వెనుక కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కకుండా సాధిక్ అక్కడి పోలీసుల ద్వారా అరెస్టయ్యాడని తెలిసింది. స్థానిక పోలీసులు అరెస్టు చేయడం వల్లే ఆంధ్రా పోలీసులు వెళ్లి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా తీసుకురావలసి వచ్చిందని స్పష్టమైంది. ఆంధ్ర పోలీసులకు చిక్కే సమయానికి సాధిక్కు చెందిన స్థానికులు మీరట్ పోలీసులకు సమాచారం అందించి కావాలనే అరెస్టు చేయించారని, నేరుగా ఆంధ్రా పోలీసులకు చిక్కితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే గుర్తించిన సాధిక్ తన మార్గదర్శి ద్వారా ఈ పన్నాగం పన్నాడని చెబుతున్నారు. అతడి వెనకున్నదెవరు అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏ మూల ఉన్నా నిందితులను పోలీసులు ఆయా ప్రాంతాలను వెళ్లి అరెస్టు చేసి జిల్లాకు తీసుకువస్తారు. కాని సాధిక్ విషయంలో అలా జరగలేదు. ట్రాన్సిట్ వారెంట్ తప్పనిసరి అయింది. అవును రసాయనం తెచ్చాను... సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యకు వినియోగించాడని చెబుతున్న ప్రాణాంతక రసాయనం ఏంటి, ఎక్కడి నుంచి తెచ్చావన్న ప్రశ్నకు రసాయనం తేవడం నిజమేనని అంగీకరించినట్టు తెలిసింది. అయితే, ఆ రసాయనం ఉపయోగించి తాను చంపలేదని చెబుతున్నాడు. ఈ విషయాన్ని నిరూపించడం పోలీసులకు ఓ సవాల్గా మారింది. ఇప్పటికే జగదీశ్వర్రెడ్డి చికిత్స పొందిన ఆసుపత్రుల నుంచి ఆరోగ్య నివేదికలు సేకరించారు. వాటిని నిపుణుల పరిశీలనకు పంపారు. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో.. మంగళవారం నాటి విచారణలో పోలీసులు కీలక విషయం రాబట్టారు. మోసం చేయడం ఆది నుంచి సాధిక్కు ఓ అలవాటైన విషయమని మరోసారి నిర్ధారించుకున్నారు. ఇంత డాబు, దర్పాన్ని ప్రదర్శిస్తున్న సాధిక్ కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. నకిలీ సర్టిఫికెట్ ఒకటి తయారు చేయించుకొని వివిధ పోటీలలో పాల్గొనడం దగ్గర నుంచి, కోచ్గా పాఠశాలల్లో చేరడం వరకు చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని స్వయానా సాధిక్ అంగీకరించాడు. ఇద్దరు సెంటు వ్యాపారస్తుల విచారణ... సాఽధిక్ ఖాన్ను కస్టడీకి తీసుకొచ్చే కొద్ది రోజుల ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. జగదీశ్వర్రెడ్డిని హతమార్చేందుకు సాధిక్ సర్వ ప్రయత్నాలు చేశాడన్న విషయం రూఢీ అయింది. అందులో భాగంగా రాజమహేంద్రవరం గాంధీపురంలో ఉన్న ఓ సెంటు వ్యాపారస్తుడు అబ్దుర్ రెహ్మాన్ను సాధిక్ సంప్రదించాడు. తనకు హానికారక రసాయనం కావాలని, ఒక వ్యక్తిని హతమార్చాలని చెప్పాడు. అది ప్రస్తుతం తన వద్ద లేదని చెప్పిన రెహ్మాన్ హైదరాబాద్కు చెందిన అబ్దుల్ ఖాదిర్ను సంప్రదించాలని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చాడు. పోలీసులు వీరిద్దరినీ విచారిస్తుండగా వారి న్యాయవాది వచ్చి విడుదల చేయించారని, విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి తీసుకెళ్లారని తెలిసింది. సాధిక్ విచారణ కొనసాగుతుండడంతో వారిద్దరినీ మరో మారు పిలిపించే అవకాశం ఉంది. ఆ పార్సిల్లో ఏముంది? అబ్దుల్ ఖాదిర్ హైదరాబాద్ నుంచి సెంట్ల తయారీలో వినియోగించే ఓ హానికర రసాయనాన్ని సాధిక్కు పంపాడని సమాచారం. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు పంపిన మార్గాన్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఓ ట్రావెల్ బస్సులో కొద్ది రోజుల క్రితం సాధిక్కు ఓ పార్సిల్ అందిందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో డీఎంహెచ్వో కాార్యాలయం ఎదురుగా ఉన్న సదరు ట్రావెల్స్ ఆఫీసులో విచారణ చేశారు. అక్కడి వారు పార్సిల్ రావడం నిజమేనని నిర్ధారించారు. ఆ పార్సిల్లో ఏమొచ్చిందో పోలీసులకు అంతుబట్టడం లేదు. అది ఖాదిర్ పంపిన విషపూరిత రసాయనం అయి ఉండొచ్చన్న అనుమానాలు పోలీసులలో ఉన్నాయి. మీరట్ వెళ్లడం వెనుక మర్మం ఏమిటి? అక్కడ పోలీసులకు పట్టుబడమని చెప్పింది ఎవరు? రసాయనం ఎక్కడిది? సాధిక్ను విచారించేందుకు 200 ప్రశ్నల జాబితా తొలి రోజు 60 ప్రశ్నలు పూర్తి ప్రారంభమైన సాధిక్ ఖాన్ విచారణ -
చంద్రబాబుది వెన్నుపోటు పార్టీ
వెన్నుపోటు పార్టీ నడుపుతున్న చంద్రబాబు ప్రతి ఒక్కరినీ పోట్లు పొడుచుకుంటూ వెళుతున్నాడు. షాడో సీఎంగా లోకేష్ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. స్థానిక సంస్థల్లో ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబును ప్రశ్నించగలిగిన దమ్ము, ధైర్యం వైఎస్ జగన్కే ఉంది. కష్టాలు చెప్పుకొనేందుకు ఎవరికై తే గళం ఉండదో వారి తరపున పోరాడతామని మాజీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. విద్యార్థులు, సచివాలయ ఉద్యోగులపై కేసులు పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఎకరం రూ.99 పైసలకే చంద్రబాబు అమ్మేస్తున్నాడు. – కురసాల కన్నబాబు, మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్రంలో నియంత పాలన రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోంది. యువత బయటకు వస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. విద్యుత్ చార్జీలు తడిసిమోపెడయ్యాయి. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలు మొదలయ్యాయి. పంట చేలకు సాగునీరు లేదు. చంద్రబాబు పొడిచిన పోట్లకు ఏ వర్గం కూడా తేరుకోలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పరిపాలనను దిగజార్చారు. రెండేళ్ల కూటమి పాలనలో ప్రజలు విసిగిపోయారు. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వైఎస్సార్సీపీ జెండా ఎగరాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలిపించుకున్న అభ్యర్థులను కూటమి కిడ్నాప్ చేసి తమ పార్టీలో కలిపేసుకుంటోంది. రాబోయే ఎన్నికల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ నేరుగా ఎన్నుకునే అవకాశం ఉంది. గడప గడపకు వైఎస్సార్ అని ప్రతి ఇంటి తలుపు తట్టాం. కానీ కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలు గట్టిగా పది ఇళ్లు కూడా తిరగలేకపోతున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలి. – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
శ్రమ దోపిడీకి గురవుతున్నాం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో పారామెడికల్ ఉద్యోగుల నిరసన కొనసాగుతోంది. మంగళవారం విధుల విరామ సమయంలో నల్ల మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగులు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేశారు. నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు ఉద్యోగులమంతా శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికి వస్తాయో తెలియని అరకొర జీతాలతో బతుకీడుస్తున్నామని వాపోయారు. కాకినాడ జీజీహెచ్లో మొత్తం 600 మంది నర్సులు ఉంటే వారిలో 450 మంది కాంట్రాక్టు ఉద్యోగులేనని తెలిపారు. వీరికి అదనంగా ఒప్పంద విధానంలో ఫార్మసిస్టులు, ఎల్టీలు పనిచేస్తున్నారన్నారు. ఉద్యోగ భద్రత నుంచి ఆరోగ్య భద్రత వరకు ఏ ఒక్కటీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వేదనను పరిగణించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. నెల రోజుల గడువు పేరుతో కాలయాపన చేసి డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రాచపల్లిలో.. ప్రత్తిపాడు రూరల్ : కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చేపట్టిన ఆందోళనలకు రాచపల్లి పీహెచ్సీ సిబ్బంది సంఘీభావం తెలిపారు. మంగళవారం పీహెచ్సీ వద్ద సూపర్వైజర్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఇతర సిబ్బంది, ఆశ కార్యకర్తలు కాంట్రాక్ట్ ఉద్యోగులకు మద్దతుగా నిలిచారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని, అప్పటివరకు 100 శాతం గ్రాస్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగి మృతి చెందిన సందర్భంలో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. హెల్త్ కార్డులు, బదిలీల సౌకర్యం కల్పించాలని జేఏసీ డిమాండ్లకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ కన్వీనర్ ఎం.అజయ్కుమార్తో పాటు పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. నల్ల మాస్కులు ధరించి పారామెడికల్ ఉద్యోగుల నిరసన -
‘స్థానిక’ ఎన్నికలకు మనమంతా సన్నద్ధంగా ఉండాలి: బొత్స
కాకినాడ: స్థానిక సంస్థల ఎన్నికలకు మనమంతా సమాయత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. ప్రతీ స్థానంలోనూ పోటీ చేయాలని, పోరాటం చేసి విజయం సాధించాలన్నారు. కాకినాడ జిల్లా వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో బొత్స మాట్లాడారు. కూటమి పాలనలో జరుగుతున్న ఆకృత్యాలను ఎన్నడూ చూడలేదని, వారి ఆకృత్యాలన్నీ టీవీ, పేపర్లు చూస్తూ కనిపిస్తాయన్నారు. ‘ టెట్ ఎన్ని సార్లు అయిన రాసుకోవచ్చు అని చంద్రబాబు, లోకేష్ ప్రజల చెవ్వుల్లో పువ్వులు పెడుతున్నారు. టెట్ రాయకుండా టీచర్ ఉద్యోగం ఇవ్వొచ్చా లేదా అనే దాని పై చెప్పడం లేదు. డీఎస్సీ అక్రమాల పై ప్రశ్నించినందుకు మాపై కేసులు పెడితే తేల్చుకుంటాం. ఆంద్రాలో ప్రజలు తిండిలేకుండా ఉంటే...ఢిల్లీలో బియ్యం కౌంటర్లు ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం నుండి నీళ్లు తోడి పోలవరం కాలువలో వదులుతారా?, గ్రావెటీతో కాకుండా ఎన్నాళ్ళు నీళ్ళు ఇస్తారు. పోలవరం ప్రాజెక్టు నాణ్యత కోసం విదేశి నిపుణులు ఏం చెప్పారో చంద్రబాబు చెప్పాలి. అపర భగీరధుడు అంటే వైఎస్ఆర్. సున్నా వడ్డీ డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ఎందుకు తీసేశాడు?, నిరుద్యోగ భృతి ఏది అని నిరుద్యోగులు అడిగితే వాళ్ళపై కేసుల పెడతారు.. అసలు సూపర్ సిక్స్ అమలు చేయకుండానే సూపర్హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటు’ అని ధ్వజమెత్తారు. ‘టెట్ లేకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారు?’ -
బాబూ.. జాబ్ ఎక్కడ?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పోలీసు అభ్యర్థులు కాకినాడలో కదంతొక్కారు. బాబూ.. జాబ్ ఎక్కడ అంటూ సర్కారును నిలదీశారు. మెగా పోలీస్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఢిల్లీ జెన్జీ ఉద్యమ తరహాలో మహోద్యమం తప్పదని హెచ్చరించారు. పోలీసు ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న నిరుద్యోగులు సోమవారం యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కాకినాడలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. శారదా దేవి గుడి సర్కిల్కు చేరుకుని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. కొడుకు లోకేశ్కు మంత్రి పదవి కట్టబెట్టిన చంద్రబాబూ.. మాకు జాబ్ ఎక్కడ అంటూ నిలదీశారు. తక్షణం మెగా పోలీసు నోటిఫికేషన్ విడుదల చేయాలి అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా సర్కారు తాత్సారం చేస్తోందని ధ్వజమెత్తారు. వయోపరిమితిపైనా అభ్యర్థులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామంటూ ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారని, కానీ ఈ రెండేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. పీజీలు, డిగ్రీలు చదువుకున్న తాము నిరుద్యోగులుగా మిగిలిపోతుంటే.. ఇంటర్ ఫెయిలైనవారూ ఈ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్కారు తక్షణం స్పందించకుంటే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలో జెన్జీ చేపట్టిన ఉద్యమ తరహా పోరాట స్ఫూర్తితో చలో విజయవాడ పేరుతో మహోద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ హరేంధిర ప్రసాద్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, రాజేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. గంగా సూరిబాబు, అధిక సంఖ్యలో నిరుద్యోగులు పాల్గొన్నారు. -
మతం, కులం మార్చేసి.. మెగా డీఎస్సీలో పోస్టింగ్!
పిఠాపురం: డీఎస్సీ అక్రమాల చిట్టా చాంతాడులా పెరుగుతోంది. నష్టపోయిన ప్రతిభావంతులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఇన్నాళ్లూ ఒంటరిగా కుమిలిపోయిన బాధిత అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. డీఎస్సీ ముసుగులో సర్కారు నిర్వాకాలపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఏకంగా మతం, కులం మార్చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టినట్లు తేలడం నివ్వెరపరుస్తోంది. తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఈ బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. మెగా డీఎస్సీ 2025లో కుల ధ్రువీకరణ పత్రం విషయంలో జరిగిన అవకతవకలపై విచారించి మెరిట్లో ఉన్న తనకు న్యాయం చేయాలని కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన షేక్ అమీరుద్దీన్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి... ఇదీ జరిగింది..! బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన షేక్ అమీరుద్దీన్ డీఎస్సీ–2025లో తెలుగు స్కూల్ అసిస్టెంట్ మెరిట్ జాబితాలో 1,014వ ర్యాంకు సాధించాడు (హాల్టికెట్ నంబర్ ఎంఎస్సీ 0015369). అయితే బీసీ ‘బి’ కేటగిరీకి చెందిన సక్కు లక్ష్మీ సునీత.. బీసీ ‘ఈ’ (మైనారిటీ) కేటగిరీలో టీచర్ ఉద్యోగం పొందారు. కాట్రేనికోన మండలం కందికుప్ప జెడ్పీ హైస్కూల్లో ఆమెను నియమించారు. దీంతో బీసీ ‘ఈ’ కేటగిరీలో తనకు రావాల్సిన ఉద్యోగాన్ని షేక్ అమీరుద్దీన్ కోల్పోయాడు. లక్ష్మీ సునీత ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యాసంస్థల రికార్డుల్లో బీసీ ‘బి’(హిందూ అచ్చుకట్టువారు)గా నమోదైనట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. 1998లో జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రంలోనూ ఆమెను బీసీ ‘బి’గా పేర్కొన్నారు. అయితే 2025 ఆగస్టు 18న పెద్దాపురం తహసీల్దారు నుంచి లక్ష్మీ సునీత బీసీ–ఈ ధ్రువీకరణ పత్రం పొందారు. -
ఎంతో కీలకంగా..
కొన్ని రకాల సర్జరీల అనంతరం ఫిజియోథెరపీ కీలకం అవుతుంది. ఆపరేషన్ తర్వాత వ్యాయామం లేకుంటే కండరాల్లో ఫైబ్రోసిస్ అభివృద్ధి చెంది వంకర్లు పోతాయి. ఎక్కువ రోజులు మంచంపై ఉంటే కాళ్లలో రక్తం గడ్డకట్టి ఎంబాలిజం వచ్చి గుండె, మెదడుకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఆపరేషన్తో పాటు రోగి సాధారణ స్థితికి త్వరగా రావడానికి ఫిజియోథెరపీ చాలా అవసరం. –కె.వెంకటరామన్, ఫిజియోథెరపిస్ట్, రాజమహేంద్రవరం మొండి నొప్పులకు ఉపశమనం మా వద్దకు తీవ్రమైన నొప్పులతో వస్తుంటారు. అలాంటి వారికి సమస్యను గుర్తించి అవసరమైన థెరపీల ద్వారా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాం. సమస్యను బట్టీ ఒక్కొక్కరికి నెల నుంచి రెండు నెలల కూడా సమయం పడుతుంది. నడుము, మోకాలు, మెడ, భుజం నొప్పులతో ఎక్కువ మంది వస్తున్నారు. వారిని సాధారణ స్థితికి తీసుకు వచ్చిన తర్వాత జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తాం. –కె.వెంకటేష్, ఫిజియోథెరపిస్టు, కాకినాడ ● -
బాంబుల మోతతో హడల్
● పచ్చని పొలాల్లో ఉన్నట్టుండి పేలుడు శబ్దాలు ● ఉలిమేశ్వరం, తిరుపతి గ్రామాల్లో ఆందోళన ● ఓఎన్జీసీ కార్యకలాపాలేనని నిర్ధారణ ● ఊపిరి పీల్చుకున్న రెండు గ్రామాల ప్రజలు పెద్దాపురం: మండలంలో నిత్యం ప్రశాంత వాతావరణంలో ఉండే ఉలిమేశ్వరం – తిరుపతి గ్రామాల నడుమ.. పచ్చని పొలాల్లో.. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి పెద్ద పెట్టున వినిపించిన బాంబుల శబ్దాలు స్థానికులను హడలెత్తించాయి. ఏలేరు ప్రధాన కాలువను ఆనుకుని ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా వరుసగా పేలుళ్ల శబ్దాలు రావడంతో ఆ గ్రామాల్లో కలకలం రేగింది. ఏం జరిగిందోనని ఆ రెండు గ్రామాల ప్రజలు హడలెత్తారు. శబ్దాలు వస్తున్న వైపు పరుగుపరుగున వెళ్లారు. అక్కడ పొలాల్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు భూమిలో పేలుడు పదార్థాలు పెట్టి పేల్చుతున్నట్లు కనిపించడంతో ఆందోళన చెంది, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, పెద్దాపురం పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ఆరా తీశారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఓఎన్జీసీ కాంట్రాక్టు సంస్థ ఈ ప్రాంతంలో రిగ్గు వేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడి భూగర్భంలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నట్టు స్థానిక అధికారులు గుర్తించారని, దాని కోసం మట్టి నమూనాలు సేకరించడానికే పేలుడు పదార్ధాలు వాడామని ఓఎన్జీఎస్ అధికారులు వెల్లడించారు. దీంతో, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముందస్తు సమాచారం లేకుండానే.. అయితే, సాధారణంగా ఎక్కడైనా చమురు అన్వేషణ కార్యకలాపాలు చేపడితే, ముందుగానే ఆ ప్రాంతాల వారికి ముందుగా సమాచారం ఇస్తారు. స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తారు. కానీ, ఉలిమేశ్వరం, తిరుపతి గ్రామాల ప్రజలకు ఆవిధంగా సమాచారం ఇవ్వకుండానే చమురు అన్వేషణకు సర్వే ప్రారంభించడం ఈ ఆందోళనకు కారణమైంది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ తీరుపై ఉలిమేశ్వరం గ్రామస్తులు మండిపడ్డారు. సమాచారం ఇవ్వకుండా పనులు ఏవిధంగా మొదలు పెడతారంటూ ఆ సంస్థ సిబ్బందిని నిలదీశారు. అయితే, రిగ్గు వేస్తున్న ఆ సంస్థ సిబ్బందికు ఇక్కడి భాష రాకపోవడంతో అంతా గందరగోళ వాతావరణం ఏర్పడింది. చివరకు అధికారులు వచ్చి, సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. మొత్తం మీద ఉలిమేశ్వరం, తిరుపతి, చదలాడ, కాండ్రకోట తదితర గ్రామాల్లో భూగర్భంలో చమురు, సహజవాయువు నిక్షేపాలున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఓఎన్జీసీ కాంట్రాక్టు సంస్థ సిబ్బందిని నిలదీస్తున్న ఉలిమేశ్వరం గ్రామస్తులుబాంబు పేలుడు ధాటికి పొలంలో లోతుగా ఏర్పడిన గొయ్యి -
అదనపు కోటా కోసం ఎదురుచూపులు
● 35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి ● అనుమతికి మించి సాగు దేవరపల్లి: పొగాకు బోర్డు 2025–26 పంట కాలంలో అనుమతించిన ఉత్పత్తి కంటే అదనంగా పండించిన పొగాకు అమ్మకాల కోటా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే బోర్డు ఇచ్చిన కోటా మేరకు విక్రయాలు పూర్తి కావడంతో అదనంగా పండిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. బ్యారన్కు 35 క్వింటాళ్ల చొప్పున పంట పండించడానికి బోర్డు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు అధికారులు బ్యారన్ల రిజిస్ట్రేషన్ చేశారు. టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల పరిధిలో 50.87 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, సుమారు 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ఇచ్చిన కోటా ప్రకారం రైతులు బ్యారన్కు 35 క్వింటాళ్ల చొప్పున అమ్మకాలు పూర్తి చేశారు. బ్యారన్కు 15 నుంచి 20 క్వింటాళ్ల అదనపు పంట రైతుల వద్ద ఉండిపోయింది. ఈ పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలని రైతులు అధికారులను కోరుతున్నారు. రీజియన్ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోలు అదనపు పొగాకు ఉంది. ఒడుదొడుకుల్లో మార్కెట్ పొగాకు పండించి దాదాపు ఎనిమిది నెలలు కావడంతో రంగుమారి, నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ ఒడుదొడుకుల్లో కొనసాగుతుండడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో పంటను అమ్ముకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో అమ్మకాలు నత్తనడకన జరుతుండడంతో ఎక్కువ రోజులు పొగాకు రైతుల ఇళ్ల వద్ద నిల్వ ఉండిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో బ్రైట్ గ్రేడు ధర ఆశాజనకంగా ఉండడంతో అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి ఇస్తే, కొంత వరకు కోలుకొనే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. 23.44 మిలియన్ల కిలోల విక్రయం రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకు రూ. 581.45 కోట్ల విలువ గల 23.44 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. కిలో గరిష్ఠ ధర రూ. 325, కనిష్ఠ ధర రూ.150, సగటు ధర రూ. 248.71 లభించింది. బ్రైట్ గ్రేడు పొగాకు ధర కొంత వరకు ఆశాజనకంగా ఉన్నప్పటికి ఎక్స్ గ్రేడు, మీడియం గ్రేడు పొగాకు ధర గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఎక్స్ గ్రేడు గత ఏడాది కిలో రూ. 260 ధర పలకగా, ప్రస్తుతం రూ. 150 నుంచి 160 ఉంది. లోగ్రేడు పొగాకు అమ్ముడుపోని పరిస్థితి నెలకొంది. 10 నుంచి 15 శాతం లోగ్రేడ్, 30 శాతం ఎక్స్ గ్రేడు, 20 శాతం మీడియం. 35 శాతం బ్రైట్ గ్రేడు పొగాకు పండినట్టు రైతులు అంచనా వేస్తున్నారు. -
సకాలంలో ఆదుకోవాలి
అదనంగా పంట పొగాకు అమ్మకోవడానికి కోటా విడుదల చేయాలి. రీజియన్ పరిధిలో సుమారు 35 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. బోర్డు ఇచ్చిన కోటాలు పూర్తి కావడంతో అదనపు పంట అమ్ముకోవడానికి దారిలేదు. ఎక్కడ పొగాకు అక్కడే ఉంది. రంగు మారి నాణ్యత దెబ్బతింటుంది. సకాలంలో అమ్ముకోకపోతే నష్టపోతాం. కిలో రూ. 350 ధర ఉంటే గిట్టుబాటు అవుతుంది. –వల్లభనేని సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు, గోపాలపురం ఉత్తర్వులు రావాలి అదనపు పొగాకు కొనుగోలుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రావాలి. అదనపు పొగాకు విక్రయాలకు విధివిధానాలు ఖరారు కావాలి. దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలో సుమారు 4 మిలియన్ల పొగాకు అదనంగా ఉత్పత్తి జరిగింది. కిలో గరిష్ఠ ధర రూ.325 పలుకుతుంది. వచ్చే ఏడాదికి పరిమితికి లోబడి పంట సాగు చేయాలి. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. –పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి ● -
వివాహిత దుర్మరణం
రాజోలు: మోటార్ సైకిల్ ఢీకొట్టిన ఘటనలో ఓ వివాహిత మృతి చెందింది. రాజోలు ఎస్సై మల్లికార్జునరెడ్డి కథనం ప్రకారం.. సోంపల్లి గ్రామానికి చెందిన కొల్లు దుర్గాప్రసాద్, పూజ (28) దంపతులు. వీరు రాజోలు నుంచి సోంపల్లిలో తమ ఇంటికి మోటార్ సైకిల్పై వెళ్తూ రోడ్డు దాటుతున్న సమయంలో వెనుక నుంచి మొండెపులంక గ్రామానికి చెందిన ఒక యువకుడు మోటారు సైకిల్తో బలంగా ఢీకొట్టాడు. దీంతో కొల్లు పూజ రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆమెను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య రాజానగరం: దివాన్చెరువు నుంచి శ్రీరామపురం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డులో ఉన్న ఓ లేఅవుట్లో గుర్తు తెలియని ఒక వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విషయం తెలుసుకున్న బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని, మృతుని వివరాల కోసం అన్వేషించారు. 50 ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఉన్న అతను చేతికి స్టీల్ కడియం, చేతిపై ‘లవ్’ సింబల్, మరో చేతిపై ‘హాయ్’ అనే హిందీ అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయి. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 94407 96587, 93477 41118 నంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. -
ఫిజియోథెరపీ.. ఆరోగ్యానికి హ్యాపీ
● దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం ● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం రాయవరం: వైద్య రంగంలో నేడు ఫిజియోథెరపీ కీలకంగా మారింది. దీనిద్వారా అనేక నొప్పులు, వ్యాధులకు ఉపశమనం కలిగిస్తున్నారు. గుండె సర్జరీ, కీళ్ల మార్పిడి సర్జరీ, సిజేరియన్ వంటివి చేసిన తర్వాత మజిల్స్ సాధారణ స్థితికి రావడానికి ఇది దోహదపడుతుంది. ఇప్పుడు ప్రతి ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టు ఉంటున్నారంటే వారి ప్రాధాన్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ కథనం. ఫిజియోథెరపీ ద్వారా దీర్ఘకాలిక సమస్యలైన స్పాండిలైటిస్, ప్రోజెన్ షోల్డర్, టెన్నిస్ ఎల్బో తదితర ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఫోన్లు, కంప్యూటర్ల వాడకంతో భుజాలు, మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. గంటల తరబడి కూర్చుని ఉద్యోగం చేసే సందర్భంలో వారి శరీరాకృతిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి వారికి మందుల వాడకం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ బాధ లేకుండా ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరం. గర్భిణులు తెలిసీ తెలియకుండా వాడే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వారికి జన్మించే చిన్నారులు జన్యులోపంతో బాధపడుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామం చేయాలనే దానిపై ఫిజియోథెరపిస్ట్లను సంప్రదించడం ఉత్తమం. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ప్రతి మండలంలో భవిత కేంద్రం ఉంది. ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు భవిత కేంద్రం ద్వారా అవసరమైన ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నారు. ప్రతి మూడు మండలాలకు ఒక ఫిజియోథెరపిస్టు చొప్పున జిల్లాలో 21 మంది ఫిజియోథెరపిస్టులు సేవలందిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు 10 వేల మంది ఫిజియోథెరపిస్ట్లు ఉన్నారు. ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యం పెరగడంతో ఈ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ కూడా పెరుగుతున్నాయి. -
కాయ్ రాజా కాయ్
● జిల్లాలో జోరుగా పేకాట ● కూటమి నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో నిర్వహణ ● రూ.లక్షల్లో పందేలు కాస్తున్న జూదరులు ● కట్టడి చేయడంలో అధికారులు విఫలం సాక్షి ప్రతినిధి, కాకినాడ: జూదం జడలు విప్పుతోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ జిల్లావ్యాప్తంగా అనధికార పేకాట శిబిరాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలు, పట్టణాలు, నగరాల నుంచి జూదరులను తీసుకొచ్చి మరీ ఆడిస్తున్నారు. శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఈ జూదక్రీడ మరింత జోరుగా సాగుతోంది. ప్రతి రోజూ రూ.కోట్లలో చేతులు మారుతున్నాయి. టీడీపీ నేతలు, కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఈ అడ్డగోలు వ్యవహారం జరుగుతూండటంతో అడ్డుకునేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు. విషయం తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారనే విమర్శలున్నాయి. పైగా, కొంత మంది పోలీసులు ఆమ్యామ్యాలు దండుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తద్వారా పేకాట స్థావరాల నిర్వహణకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు విమర్శలున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపింది. పేకాట క్లబ్బులను మూయించివేసింది. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ అసాంఘిక క్రీడకు గేట్లు తెరిచేయడంతో పరిస్థితి శ్రీఆడిందే ఆట.. పాడిందే పాటశ్రీగా మారింది. ఎక్కడెక్కడంటే.. ● కాకినాడ నగరంలో కల్పన వంతెన, అన్నమ్మ ఘాటీ సెంటర్, దుమ్ములపేట, సంతచెరువు, ఎంఎస్ఎన్ చారిటీస్ కళాశాల వెనుక ప్రాంతం, మహాలక్ష్మి నగర్, బీచ్ రోడ్డు, సూర్యారావుపేట, ఏడీబీ రోడ్డు తదితర ప్రాంతాల్లో అనధికారిక పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. ప్రతి రోజూ ఇక్కడ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని తెలుస్తోంది. పోలీసులు ప్రతి నిత్యం ఈ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నా.. జూదాలను మాత్రం అదుపు చేయలేకపోతున్నారు. ● కాకినాడ రూరల్లో శశికాంత్ నగర్, సురేష్ నగర్, రాయుడుపాలెం, రమణయ్యపేట, వలసపాకల, గుడారిగుంట తదితర ప్రాంతాల్లో కూటమి నేతల కనుసన్నల్లో పేకాట యథేచ్ఛగా సాగుతోంది. రాయుడుపాలెంలోని ఓ భవంతిలో పేకాట భారీగా స్థాయిలో జరుగుతోంది. ఇక్కడ ప్రముఖులు కూడా ఆడుతున్నారని, ప్రతి రోజూ రూ.లక్షల్లో చేతులు మారుతున్నాయని సమాచారం. దీనిని టీడీపీ నేతలే నిర్వహిస్తూండటంతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ● తుని నియోజకవర్గం తేటగుంట, కోటనందూరు, తొండంగి మండలంలో కోడిపందేలు, పేకాట, బెండపూడి తదితర ప్రాంతాల్లో అనధికారిక జూదం జరుగుతున్నాయి. ఇదంతా టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోంది. దీంతోపోలీసులు తూతూమంత్రంగా హడావుడి చేయడానికే పరిమితమవుతున్నారనే విమర్శలున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇక్కడ జూదక్రీడీలను నియంత్రించలేకపోతున్నారు. ● పెద్దాపురం నియోజకవర్గం మేడపాడు, వేట్లపాలెం, పెదబ్రహ్మదేవం తదితర ప్రాంతాల్లోని పంట పొలాల్లో పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. పండగలు, ఆదివారాల్లో ఇక్కడ జూడక్రీడలకు అడ్డూ అదుపూ ఉండటం లేదు. పేద బతుకులతో పేకాట విచ్చలవిడిగా సాగుతున్న జూదక్రీడ పేద, మధ్య తరగతి ప్రజల బతుకులతో శ్రీపేకాటశ్రీ ఆడుకుంటోంది. జూద వ్యసనానికి బానిసలైన కొంత మంది రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బును జూద క్రీడలకు తగలేస్తున్నారు. ఆటలో ఓటమి చెంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. తిరిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకునే ఆశతో అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తిరిగి పాత రోజులు తీసుకువస్తోందని మహిళలు ఆవేదన చెందుతున్నారు. దాడులు చేస్తున్నా.. పేకాట కేంద్రాలపై పోలీసులు అప్పుడప్పుడు దాడులు చేస్తున్నా.. ఎక్కువగా చిన్న స్థాయి నిర్వాహకులు లేదా ఆడేవారి పైనే కేసులు నమోదు చేస్తున్నారనే విమర్శలున్నాయి. అసలు శిబిరాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని, అందువల్లనే ఈ జూదక్రీడాకు అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులుగా ఉన్న పెద్ద నాయకులు ఆయా పోలీసు స్టేషన్లకు నెలవారీ మామూళ్లు ముట్టజెబుతూ, తమ జోలికి రాకుండా చూసుకుంటున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. -
ఇద్దరు టీచర్లకు ఉద్వాసన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థినులపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు ఉపాధ్యాయులకు ఉద్వాసన పలికినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి పిల్లి రమేష్ సోమవారం తెలిపారు. ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పీఎస్ ఉపాధ్యాయుడు శ్రీరెడ్డి శ్రీనివాసరావు, ఉప్పాడ కొత్తపల్లి మండలం మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎస్ ఉపాధ్యాయుడు జోగా సురేష్లను విధుల నుంచి తొలగించామని తెలిపారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా రమేష్బాబుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా ఎన్.రమేష్బాబు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తూ పదోన్నతిపై ఆయన ఇక్కడకు వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్గా పని చేసిన నందాజీ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో రమేష్ నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్ హరేంధిర ప్రసాద్ను, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా అధికారులు ప్రతి అంశంలోనూ వంద శాతం లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో కలసి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, క్షేత్ర స్థాయి సిబ్బందితో కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మండలాల వారీగా ప్రాధాన్య అంశాల పురోగతిపై సమీక్షించారు. రీ–సర్వే 4,5 దశల పురోగతి, పీఓడీ సబ్ డివిజన్ అసైన్మెంట్ ప్రక్రియలను గడువులోగా పూర్తి చేసి ఆన్లైన్లో సమర్పించాలని ఆదేశించారు. ప్రతి నెలా 2 నుంచి 9వ తేదీ వరకూ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా హియరింగ్, బుక్ ఏ కాల్ ఫిర్యాదుల విచారణ త్వరగా పూర్తి చేసి, తుది ప్రచురణకు సిద్ధం చేయాలని సూచించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాలకు తహసీల్దార్లు స్థలాలను ఎంపిక చేసి, పంచాయతీరాజ్ ఏఈలకు అప్పగించాలన్నారు. స్థలాలు లేని చోట దాతలు లేదా జలవనరుల శాఖ భూములను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొత్త (పచ్చి) కాయ (వెయ్యి) 20,000 – 21,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
ప్రదక్షిణ పదేపదే
● పీజీఆర్ఎస్కు పదేపదే విన్నపాలు ● అయినా ఫలితం లేదంటున్న ప్రజలు ● సమస్య పరిష్కారమవక అవస్థలు పింఛను ఇవ్వాలి మా కుమారుడికి చిన్నతనం నుంచీ ఎదుగుదల లేదు. మాట్లాడలేడు, నడవలేడు. పింఛను కోసం రెండేళ్లుగా దరఖాస్తు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మా అబ్బాయికి ఎనిమిది సంవత్సరాల వయస్సు. పింఛను ఇచ్చి ఆదుకోవాలి – నాగిరెడ్డి మంజుల కత్తిపూడి శంఖవరం మండలం ఆన్లైన్లో నా భూమి తొలగించారు మా గ్రామంలో మాకు రెండెకరాల భూమి ఉంది. వాస్తవానికి నా భూములు పోలవరం కాలువలో సమీపంలో కూడా లేవు. అయినప్పటికీ నా భూమి పోలవరం కాలువలో పోయిందని పేర్కొంటూ అధికారులు ఆన్లైన్లో తొలగించారు. ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ఆన్లైన్లో నమోదు చేయడం లేదు. రెండేళ్లుగా తిరుగుతూనే ఉన్నాను. – ఎరికిరెడ్డి చంద్రరాయుడు, కొడవలి, గొల్లప్రోలు మండలం నా భూమి పక్కవారి పొలంలో కలిపేశారు మా గ్రామంలో నాకు నాలుగున్నర సెంట్ల కొబ్బరి తోట ఉంది. ఇది మా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి. దాని పక్కనే ఉన్న రైతు పొలంలో నా భూమిని అధికారులు ఆన్లైన్లో నమోదు చేశారు. దీంతో, ఆ భూమి తమదేనంటూ పక్క రైతు గొడవ పెడుతున్నారు. ఆరు నెలలుగా తిరుగుతూనే ఉన్నా అధికారులు స్పందించడం లేదు. – వంకాయల వీర వెంకట సూర్య సుబ్రహ్మణ్యం, పి.మల్లవరం, తాళ్లరేవు మండలం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీలు అందిస్తున్నా పరిష్కారానికి మాత్రం నోచడం లేదని ప్రజలు వాపోతున్నారు. సమస్య చిన్నదైనా పరిష్కరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల కార్యాలయాల్లో ఇచ్చిన అర్జీలకు అధికారులు స్పందించకపోవడంతో దూర ప్రాంతమైన కాకినాడ వచ్చి అర్జీలు ఇవ్వాల్సి వస్తోందని, అయినప్పటికీ సరైన న్యాయం జరగడం లేదని ఆవేదన చెందుతున్నారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాధి, ఉద్యోగాల కల్పన, ఇళ్లు, ఇళ్ల స్థలాల మంజూరు, భూ సమస్యలు, రీసర్వే, ఆన్లైన్లో భూ రికార్డుల నమోదు, తాగునీరు, పారిశుధ్యం, మురుగు కాలువల్లో పూడికల తొలగింపు, సదరం సర్టిఫికెట్ల మంజూరు, రోడ్లు, ప్రభుత్వ పథకాల లబ్ధి తదితర సమస్యలపై అర్జీలు సమర్పిస్తున్నారు. ఆ సందర్భంగా అధికారులు ఇస్తున్న హామీలు విని, తమ సమస్య పరిష్కారమైపోతుందని సంబరపడుతూ ఇంటిముఖం పడుతున్నారు. కానీ, రోజులు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉండటంతో అసంతృప్తి చెందుతున్నారు. అర్జీదారుల సమస్యలను క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వారు సంతృప్తి చెందేవిధంగా పరిష్కరించాలని కలెక్టర్ పదేపదే ఆదేశిస్తున్నా ప్రయోజనం ఉండటం లేదని అంటున్నారు. అధికారులు క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలించకుండానే సమస్య పరిష్కరించినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. కలెక్టరేట్లో ఈ సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు 311 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. కౌలు రైతులకు రుణాలివ్వడం లేదు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ రుణాలు ఇవ్వకపోవడంతో కౌలు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కౌలు కార్డులు ఇచ్చినా ఏ బ్యాంకులోనూ రుణాలు ఇవ్వడం లేదు. దీంతో, పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు కౌలు రైతులు అప్పు తెచ్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి, కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి. – ఎం.రాజశేఖర్, కౌలు రైతుల సంఘ జిల్లా కార్యదర్శి -
అక్షరాలా తడబాటు!
● అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో నిర్లక్ష్యం ● ఉమ్మడి జిల్లాలో ఇంకా వెనుకబాటే ● నేడు ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం రాజమహేంద్రవరం: అభివృద్ధితో పాటు అక్షరాస్యతలోనూ జిల్లా వెనకబడుతోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాల అమలులో లోపాలు.. పల్లెల్లో అవగాహనా రాహిత్యంతో అక్షర సుమాలను వెదజల్లలేకపోతోంది. ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు కానీ మహిళలే వెనుకబడిపోతున్నారు. నేటికీ జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రజల్లో పలువురు వేలిముద్రలు వేసే స్థాయిలోనే ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మంగళవారం ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. జిల్లా వంద శాతం అక్షరాస్యత సాధించడంలో పూర్తిగా తడబడుతోంది. 2011 లెక్కల ప్రకారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనాభా 51.54 లక్షలు ఉండగా, వారిలో 25.69 లక్షల మంది పురుషులు, 25.84 లక్షల మంది మహిళలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. పురుషుల అక్షరాస్యత 74.51 శాతం, మహిళల అక్షరాస్యతా 67.52 శాతంగా ఉంది. ప్రస్తుత జనాభా 54.50 లక్షలు ఉండవచ్చనేది అంచనా. గతంతో పోలిస్తే అక్షరాస్యతలో కొంత పెరుగుదల కనిపిస్తున్నా, జిల్లాలో వంద శాతం సాధించడంలో వెనుకబడిపోతున్నాం. ప్రధానంగా పేదరికం, వలసలే కారణం. ప్రజల వెనుకబాటు తనానికి చాలా సందర్భాల్లో నిరక్షరాస్యతే కారణమవుతోంది. సంపూర్ణ అక్షరాస్యత కోసం జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతున్నా, చర్యలు నేటికీ తడబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం.. అత్యంత అవశ్యం తరం.. మనిషి ఆలోచనా విధానం మారింది. సమాజం సాంకేతికంగా దూసుకుపోతోంది. మనిషి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అడుగు ముందుకు వేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఉన్న ప్రతి చిన్నారి తల్లిదండ్రుల ఆలోచనా విధానం మారింది. గతంలో దీనికి భిన్నంగా ఉండేది. ఇప్పుడు తమ పిల్లలను ఉన్నతంగా చదివించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మంచి పాఠశాలలను ఎంపిక చేసుకుని మరీ పంపిస్తున్నారు. అయితే కొంతమందికి చదువు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా వెనుకడుగు మాత్రం వేయడం లేదు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మనబడి నాడు–నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలగరాదనే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టి, చిన్నారులను బడికి పంపించిన తల్లిదండ్రుల ఖాతాల్లో ఏటా రూ.15 వేలు ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. వయోజనులు సైతం కొద్దిపాటి అక్షర జ్ఞానంతో కొన్నింటిని అందిపుచ్చుకుంటున్నారు. ఈ తరుణంలో చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గ్రామంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాల్సిన అవసరం ఉంది. మనకెందుకులే అనే ధోరణిని వదిలి సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఉపాధి క్షేత్ర సహాయకులు, డ్వాక్రా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, యువత, సేవా సంస్థలు దీనిపై దృష్టి సారించి, సంపూర్ణ అక్షరాస్యత దేశంగా మార్చేందుకు కృషి చేయాలి. ఉల్లాస్ పేరుతో ముందుకు.. గతంలో వయోజనులైన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసేందుకు సాక్షరతా మిషన్ ద్వారా చర్యలు చేపట్టారు. రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) పేరుతో నవ భారత సాక్షరత కార్యక్రమాన్ని 2024లో ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి 2029లోగా వీరిని అక్షరాస్యులుగా చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో డీఆర్డీఏ, డ్వామా, పట్టణ ప్రాంతాల్లో మెప్మా సంస్థల ద్వారా నిరక్ష్యరాస్యులను గుర్తించి వారిని అక్షరాస్యులుగా చేసే కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. ఉల్లాస్ ప్రోగ్రామ్ రెండేళ్లలో జిల్లాల వారీగా నిరక్షరాస్యులు, వారిలో అక్షరాస్యులుగా మారిన వారు, ఇంకా మిగిలిన వారు.. జిల్లా నిరక్షరాస్యులు అక్షరాస్యులు మిగిలిన వారు కాకినాడ 3,52,025 1,09,081 2,42,944 కోనసీమ 1,34,176 59,625 74,551 తూర్పుగోదావరి 2,56,000 88647 1,67,353 పోలవరం 86,811 38,392 48419 -
డ్రైన్లో పడి వ్యక్తి గల్లంతు
మలికిపురం: మేజర్ డ్రైన్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గొల్లపాలేనికి చెందిన ఉండ్రాసి దుర్గాప్రసాద్ (38) కొబ్బరి దింపు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం గ్రామంలో వినాయక చవితి పందిరి పనులు చూసి, అనంతరం దింపు పనులకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గొల్లపాలెం వంతెన నుంచి శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఒడ్డున బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఈ మేరకు అతని తండ్రి ఉండ్రాసి సత్యనారాయణ తెలిపారు. దుర్గాప్రసాద్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
మోటార్ సైకిళ్ల చోరీ నిందితుడి అరెస్ట్
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయ ఆవరణలోని పార్కింగ్ ఏరియాలో మోటార్ సైకిళ్లు దొంగిలిస్తున్న నిందితుడిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాల ప్రకారం.. స్థానిక ఎస్సై ఎస్.రాము తన సిబ్బందితో లొల్ల కొత్త వంతెన వద్ద సోమవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి లంక గ్రామ అడ్డపుంతకు చెందిన అంబటి సత్యనారాయణ (49) రావులపాలెం వైపు నుంచి వేగంగా వస్తూ పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. నిందితుడిని ఎస్సై రాము తమ సిబ్బందితో పట్టుకుని విచారించి, అతని నుంచి 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సత్యనారాయణను అరెస్టు చేసి, కొత్తపేట కోర్టుకు తరలించినట్లు ఎస్సై వివరించారు. -
నష్టాల్లో కూరుకుపోయాం
● రాష్ట్ర స్థాయి బతుకు పోరాట సభలో ఆక్వా రైతులు ● వై.జంక్షన్ నుంచి భారీ ర్యాలీ ● ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ● శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ తరలి వచ్చిన రైతులు ● ఆక్వా రైతుల ఆందోళనకు అగ్నికుల క్షత్రియులు, కార్మిక సంఘాల మద్దతు ● సాగు విధానం మార్చుకోవాలని పిలుపు సాక్షి, అమలాపురం: ఆక్వా రంగంలో వనామీ రొయ్యల సాగు తమను సునామీలా ముంచేసిందని, రైతులు కష్టాలు, నష్టాల్లో కూరుకుపోయారని రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు బతుకు పోరాట సభ ఆవేదన వ్యక్తం చేసింది. ఏపీ స్టేట్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు భగవాన్రాజు అధ్యక్షతన అమలాపురంలో సోమవారం ఈ సభ జరిగింది. తమ డిమాండ్లను ఈ నెలాఖరుకు తీర్చకుంటే రైతులతో చర్చించి, సాగుసమ్మె చేస్తామని ఈ సందర్భంగా ఆక్వా రైతు సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగుసమ్మెతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో రొయ్యల పెంపకాన్ని తగ్గించుకోవాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ‘‘మనం ఎన్నాళ్లిలా అడుక్కుందాం? సాగు విధానం సరిగ్గా లేదు. ఇంత పెద్ద ఎత్తున సాగు చేసి నష్టపోతున్నాం. ఫీడ్, సీడ్, రొయ్యల కొనుగోలు కంపెనీలను పోషిస్తున్నాం. క్రాప్ హాలిడే కంటే సాగు తగ్గించడం మేలు. గతంలో 30 కౌంట్ గురించి మాట్లాడేవాళ్లం. ఇప్పుడు 100 కౌంట్ వస్తే చాలనే పరిస్థితి వచ్చింది’’ అని రైతులు వాపోయారు. ‘‘ఈక్వెడార్లో రైతులే రొయ్య పిల్లలను, మేతను, మందులను ఉత్పత్తి చేసుకుంటున్నారు. అందువలన అక్కడ ఉత్పత్తి ధర తక్కువగా ఉంది. అదే విధానంలో మనం కూడా సాగు చేయాలి’’ అని అభిప్రాయపడ్డారు. మనలో ఆశలు పెరిగితే.. కంపెనీలకు దురాశ పెరిగిందని, అసలు మైరెన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా) ఉందనే విషయమే రైతులకు తెలియడం లేదని రైతు ప్రతినిధులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) సమావేశం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఏయే విషయాలు చర్చిస్తున్నారో కూడా రైతులకు అవగాహన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటుతున్నా రైతుకు అర్ధరూపాయి కూడా ప్రయోజనం చేకూరలేదని టీడీపీ, జనసేన పార్టీ అనుకూల రైతులే బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడం గమనార్హం. అంతకు ముందు స్థానిక వై.జంక్షన్ నుంచి సభా ప్రాంగణం వరకూ 2 కిలోమీటర్ల మేర ఆక్వా రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, ఫీడ్ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకూ ఆక్వా రైతులు ఈ సభకు తరలి వచ్చారు. వారి ఆందోళనకు అగ్నికుల క్షత్రియులు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. మేత ధర పెంపు, రొయ్యల ధర తగ్గింపు అన్యాయం మేత ధరలో మార్పునకు 40 రోజులు, రొయ్య ధరల్లో మార్పునకు 15 రోజుల గడువు ఉంది. అయినప్పటికీ పట్టించుకోకుండా మేత ధరలు పెంచేస్తూ, రొయ్యల ధరలు తగ్గించేయడం చాలా అన్యాయం. – జాన్ డేవిడ్, ఏపీ స్టేట్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధి సభకు తరలివచ్చిన ఆక్వా రైతులురైతులకు సంఘీభావం తెలుపుతున్న ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులురైతుల ప్రమేయం లేకుండానే మేత ధరల పెంపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం ఇస్తున్నది మేమే. మా ప్రమేయం లేకుండానే మేత ధరలు పెంచారు. మేత తయారీలో కొత్తగా వినియోగిస్తున్న ఫార్ములాకు రూ.130 అవుతుందని చెప్పడం తప్పు. మేము వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా కంపెనీలు ధరలు పెంచాయి. ప్రభుత్వం, అప్సడా, రైతుల అనుమతి లేకుండా ఈ పెంపును ఒప్పుకోం. – భగవాన్రాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ స్టేట్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ పరిశ్రమగా ఎందుకు గుర్తించరు? ఫీడ్ కంపెనీలు మాట తప్పి రాత్రికి రాత్రే ధరలు పెంచుతున్నాయి. రెండు నెలల్లో కిలోకు రూ.25 పెంచడం చాలా దారుణం. పరిశ్రమలను ప్రోత్సహించే పేరుతో రూ.100 కోట్ల స్థలాన్ని వాటికి ఒక్క రూపాయికే ఇస్తున్నారు. అక్కడ వంద మందికి కూడా ఉపాధి రావడం లేదు. మేం ఏటా రూ.18 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఇస్తూ, లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. దీనిని ఎందుకు పరిశ్రమగా గుర్తించి, రాయితీలివ్వరు? – త్సవటపల్లి నాగభూషణం, ప్రధాన కార్యదర్శి, ఏపీ స్టేట్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ -
లేఖ రాసి.. బైక్పై ఉంచి
దిండి వంతెనపై యువకుడి గల్లంతు మలికిపురం: అమ్మా, నాన్న క్షమించండి.. సారీ హరి.. నాకు ఈ ఆప్షన్ తప్ప మరొకటి కనిపించడం లేదంటూ ఓ యువకుడు తన బైక్పై లేఖ రాసి పెట్టి గల్లంతైన ఘటన దిండి వంతెనపై జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లిలంక గ్రామానికి చెందిన దారపురెడ్డి తరుణ్కుమార్ (22) దిండి – చించినాడ వంతెనపై తన మోటార్సైకిల్ ఉంచి కనిపించకుండా పోయాడు. సోమవారం ఉదయం మలికిపురంలోని షాపులో పని చేసేందుకు వెళ్లిన అతను, ఆ తర్వాత కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దిండిలో వంతెన వద్ద తన బైక్, దానిపై ఓ లేఖను పోలీసులు, బంధువులు గుర్తించారు. అసలు కారణం తెలియలేదు. ఆ యువకుడు నదిలో దూకాడా, ఎక్కడికై నా వెళ్లిపోయాడా అనేది తేలాల్సి ఉంది. తరుణ్కుమార్ సొంత ఊరు నర్సాపురం. సఖినేటిపల్లిలంకలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
కాకినాడ రూరల్: రాష్ట్రంలోనే అతి పెద్దదైన డీఎస్సీ ఉద్యోగ నియామకాల స్కామ్పై సీబీఐ విచారణకు ఆదేశించాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై తమ పార్టీ తొలి నుంచీ పోరాడుతోందని అన్నారు. ఇటీవల కొన్ని మీడియా చానళ్లు ఆధారాలతో సహా ఈ అక్రమాల పుట్టను వెలికి తీయడంతో ప్రజలకు వాస్తవాలు స్పష్టమవుతున్నాయని చెప్పారు. పెద్దాపురానికి చెందిన సక్కు లక్ష్మీ సునీత బీసీ–బి నుంచి బీసీ–ఈ కేటగిరీలోకి తన కులాన్ని మార్చుకుని కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్పలో తెలుగు టీచర్గా ఉద్యోగం పొందారని తెలిపారు. ఈ వ్యవహారంపై షేక్ అమీరుద్దీన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారని, కానీ, అధికారులు ఇప్పటికీ ఆమె సర్టిఫికెట్లను పరిశీలించకపోవడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. దీనినిబట్టి ఈ స్కామ్లో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు తలెత్తుతున్నాయని నాగమణి అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రభాకర్ మొదలు, శ్రీకాకుళం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు రావడం వెనుక కూటమి ప్రభుత్వ అవినీతి ఉందన్నారు. అర్హత లేని వారిని అడ్డదారుల్లో నియమిస్తే విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. ఈ అంశంపై గతంలో ప్రభుత్వాధికారులు వివరణ ఇచ్చారని, ఇప్పుడు వారు సైతం వెనకాడుతున్నారని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన అన్ని నియామకాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ అకాడమీలు, అసోసియేషన్లు ఇచ్చే సర్టిఫికెట్లు ఉద్యోగార్హతకు ఏవిధంగా ప్రామాణికం అనే విషయంలో ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లో వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇకనైనా ఆయన మౌనం వీడాలని నాగమణి సూచించారు. -
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
పిఠాపురం రూరల్: రాజమహేంద్రవరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆర్చరీ పోటీల్లో పిఠాపురానికి చెందిన 10 మంది క్రీడాకారులు పథకాలు సాధించారని కోచ్లు పి.కృష్ణ, లక్ష్మణరావు తెలిపారు. జె.ఐశ్వర్య, బి.జైదీప్ స్వర్ణ పథకాలు సాధించగా, జె.అరుణ్. పి.లోకేష్ రజిత పథకాలు, కె.హరిణి, లాస్య, యశస్విన్, తరుణ్, అమీదా, అలీ కాంస్య పథకాలు సాధించారన్నారు. వీరంతా జూనియర్ విభాగంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు విజయనగరం జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పాల్గొంటారన్నారు. సీనియర్ విభాగంలో ఎంపికై న వారు వచ్చే నెల 4 వతేదీ నుండి 7 తేదీ వరకు భీమవరంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఆర్చరీ సీనియర్స్ విభాగంలో పాల్గొంటారని వారు తెలిపారు. -
మళ్లీ పులి భయం
రంపచోడవరం: ఆరునెలల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి నాలుగు జిల్లాల పరిధిలోనే సంచరిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో మత్తు మందు ఇచ్చి పులిని మొదటి నెలలోనే బంధించారు. తదనంతరం దానిని విశాఖ జూకు తరలించి, కొన్ని రోజులు సంరక్షణలో ఉంచిన తరువాత పోలవరం జిల్లా పరిధిలోని పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలో వదలిపెట్టారు. కొద్ది రోజులు అక్కడే ఉన్న పెద్దపులి ఆ తరువాత గిరిజన గ్రామాల వైపు వడివడిగా అడుగులు వేసింది. పశువులపై దాడి చేసి హతమార్చడం మొదలుపెట్టింది. రంపచోడవరం, గంగవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, దేవీపట్నం మండలాల్లో పులి సంచరించింది. అలాగే కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోనూ కొన్నాళ్లు పులి సంచరించింది. ఇప్పటి వరకు పులి ఆరు నెలలుగా ఒకే రూట్లో ప్రయాణం కొనసాగిస్తోంది. ప్రస్తుతం పులి అడ్డతీగల మండలం డి.కృష్ణవరం, గడిచిన్నంపాలెం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. పులి సంచారంపై అటవీశాఖ అధికారులు గ్రామాల్లో అప్రమత్తం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నాలుగు జిల్లాల భూగంలోనే సంచారం సాధారణంగా పులిని కొత్త అటవీ ప్రాంతంలో వదిలినప్పుడు కొంత భూభాగాన్ని తన నివాస ప్రాంతంగా ఎంచుకొంటుంది. అందుకోసం పులి కొన్ని గుర్తులను కూడా పెట్టుకొంటుంది. పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలో వదిలిపెట్టిన పెద్దపులి తన భూభాగాన్ని కాకినాడ, పోలవరం, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసుకున్నట్లు తేటతెల్లమవుతుంది. మగ టైగర్ సాధారణంగా 20 స్క్వేర్ కిలోమీటర్లు పరిధి భూభాగాన్ని తన పరిధిగా నిర్ధారించుకొంది. పాపికొండలు నేషనల్ పార్కు పరిధిలోని కొండమొదలు ప్రాంతంలో పులిని వదలిపెట్టిన తరువాత రంపచోడవరం మండలంలోని రామన్నవలస, సున్నంపాడు మీదుగా రంప, పెద్దకొండ, తాళ్లపాలెం వెళ్లింది. అక్కడ నుంచి గంగవరం మండలంలో కుసుమరాయి నుంచి ఏలేరు రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లింది. అలాగే రాజవొమ్మంగి, శంఖవరం మండలాల అటవీ ప్రాంతంలో సంచరించింది. తరువాత తిరిగి అదే రూట్లో వెనక్కి వచ్చి దేవీపట్నం మండలం దండంగి వాగు, రామదుర్గం, కోరుకొండ మండలంలోని గ్రామాలకు వెళ్లి తిరిగి దండంగి ప్రాంతానికి వచ్చింది. ఈ క్రమంలో పులిని బంధించేందుకు ప్రయత్నాలు చేశారు. ఎక్కడ సాధ్యపడలేదు. తరువాత పులి గోదావరి దాటి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. రెండు రోజులు క్రితం పోలవరం ప్రాజెక్టు ఏరియా వద్దకు వచ్చిన పులి సింగనపల్లి వద్ద గోదావరి దాటి దేవీపట్నానికి చేరుకుంది. గతంలో ప్రయాణించిన రూట్లో తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది. పులి తిరిగిన ప్రాంతంలో నీరు పుష్కలంగా లభిస్తుండడం, అడవిలో కష్టపడి వేట సాగించే అవకాశం లేకుండా పశువులు ఉండడంతో ఆహార సేకరణ సులభతరమవుతుంది. అటవీ అధికారులు పులి సంచారంపై కాలర్ ఐడీ చూడడం తప్ప అటవీ అధికారులు చేస్తోంది శూన్యమే. పులి సంచారంతో గిరిజనుల్లో భయం మళ్లీ నెలకొంది.ఫ మళ్లీ పోలవరం జిల్లాలోకి పులి ప్రవేశం ఫ పశువులపై దాడి చేస్తుందేమోనని జనం భయం ఫ గిరిజనుల్లో మొదలైన అలజడి -
నేడు ఆక్వా రైతుల చలో అమలాపురం
మేత ధరల పెంపుపై ఆగ్రహంతో ఉన్న ఆక్వా రైతులు కంపెనీలు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబుతో తేల్చుకుంటామని హెచ్చరించిన రైతులు.. సాగు సమ్మె చేసే యోచనలో కూడా ఉన్నామంటున్నారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించేందుకు కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం క్షత్రియ కళ్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు నిర్వహించనున్నారు. సాక్షి, అమలాపురం: అమలాపురంలో నిర్వహించనున్న ఆక్వా రైతుల రాష్ట్రస్థాయి సదస్సుకు కోనసీమ జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వనామీ సాగు చేసే రైతులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు మేత ధరలు పెంచడంపై రైతులు భగ్గుమంటున్నారు. గత నెల చివరిలో టన్నుకు రూ.5,700 పెంచుతున్నామని కంపెనీలు లేఖలు ఇచ్చి, అమలులోకి వచ్చేసరికి రూ.9 వేల నుంచి రూ.12 వేల వరకు పెంచాయి. గడచిన రెండు నెలల్లో టన్నుకు రూ.21 వేల వరకు పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన మేత ధరల వల్ల కోనసీమ జిల్లాలో రైతులపై రూ.260 కోట్ల భారం పడనుందని అంచనా. ఈ నేపథ్యంలో రైతులు పలు డిమాండ్లను ముందుకు తెచ్చారు. చర్చించే అంశాలు ఇవే... ● వనామీ, టైగర్ పెంచిన మేత ధరలను వెనక్కి తీసుకోవాలని, ఆక్వా అభివృద్ధి సంస్థ కమిటీతో చర్చించకుండా కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● చెరువు వద్ద రొయ్య ధరలను పది రోజుల పాటు స్థిరంగా ఉంచాలని, 100 నుంచి 20 కౌంట్ వరకు శాసీ్త్రయ ధరల వ్యత్యాసాన్ని మార్చకూడదని డిమాండ్ చేస్తున్నారు. ● జీవో నంబర్ 57 ప్రకారం యూనిట్కు రూపాయిన్నర విద్యుత్ రాయితీని జూలై నుంచి అమలు చేయాలని, అర్హత లేని రైతులకు పత్రాలు ఇచ్చేందుకు రెండు మూడు నెలల గడువు ఇచ్చి అర్హత పొందిన వారికి కూడా అదే తేదీ నుంచి రాయితీ వర్తింపజేయాలని కోరుతున్నారు. ● కేంద్ర సంస్థ ద్వారా నేరుగా రొయ్యల కొనుగోలు విధానం ఏర్పాటు చేసి మధ్యవర్తులను తొలగించాలని, దీని వల్ల కిలోకు రూ.20 నుంచి రూ.30 అదనపు లాభం నేరుగా రైతులకే అందేలా చూడాలని కోరుతున్నారు. అవసరమైతే ‘సాగు సమ్మె’.. రాష్ట్రస్థాయి సదస్సులో ఆక్వా రైతులు అవసరమైతే సాగు సమ్మైపె చర్చించనున్నారు. మేత ధరలు పెరుగుతున్న తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కనీసం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)లో చర్చించకుండా ఏకపక్షంగా మేత కంపెనీలు ధరలు పెంచడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. అవసరమైతే సాగు సమ్మె చేయడానికి కూడా వారు వెనకాడటం లేదు. ఈ నెల తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆక్వా రైతుల సదస్సులో తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ను కలిసి వినతిపత్రం ఇచ్చే సమయంలో ఆక్వా రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే. సమస్యలపై రాష్ట్రస్థాయి సదస్సు అవసరమైతే పంట విరామంపైనా చర్చ హాజరుకానున్న వనామీ సాగు రైతులు ఫీడ్ రేట్లు నెల వ్యవధిలో రెండుసార్లు పెంచడంపై ఆగ్రహంతో ఉన్న వైనం ఈ నెల 9న సీఎం కోనసీమ పర్యటన ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై ఉత్కంఠ ఇప్పటికే సీఎంతో తేల్చుకుంటామని రైతుల అల్టిమేటం -
రేపు కాకినాడలో వైఎస్సార్ సీపీ సమావేశం
తుని: స్థానిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా సమావేశం మంగళవారం కాకినాడలో నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆదివారం తెలిపారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ పైడా వారి వీధిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, ఉమ్మడి గోదావరి జిల్లా రీజనల్ కోఅర్డినేటర్ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా కమిటీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని కోరారు. ముగ్గురు దేవస్థానం ఉద్యోగులకు పదోన్నతులు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతి లభించింది. సూపరింటెండెంట్ కృష్ణప్రసాద్ ఏఈఓగా, సీనియర్ అసిస్టెంట్లు పోల్నాటి లక్ష్మీనారాయణ, జి సుబ్రహ్మణ్యేశ్వరరావు (విష్ణు)లకు సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందారు. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఏకగ్రీవంగా రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఏక్రగీవంగా ఎన్నికై ంది. రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికలో ఒక్కొక్క దరఖాస్తు చొప్పున మాత్రమే రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారి వీఎస్ దివాకర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సామర్లకోట తహసీల్దార్ కె.చంద్రశేఖరరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడిగా డి.కృష్ణ, ఉపాధ్యక్షులుగా జేవీఆర్ రమేష్, కె.సాయికిరణ్, కేఎస్వీ సుబ్బారావు, ఎన్.చందన, కార్యదర్శిగా ఎస్.రామ్మోహన్, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఎంటీఆర్ ప్రసాద్, క్రీడా విభాగ కార్యదర్శిగా డీఆర్కే రాజు, జాయింట్ సెక్రటరీలు, కోశాధికారి, ఈసీ సభ్యులుగా మరికొందరు ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పితాని త్రినాథరావు, జేఏసీ మాజీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా వీటీ రామారావు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా వీటీ రామారావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న ఆయన కాకినాడకు బదిలీపై వచ్చారు. ఆత్మ పీడీగా పనిచేస్తున్న రాబర్ట్ పాల్ ఇప్పటివరకు ఇన్చార్జి వ్యవసాయ శాఖాధికారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. బాల్య వివాహం.. ఇరు కుటుంబాలపై కేసు నమోదు గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): గత నెల 31న మైనర్ బాలికకు బాల్య వివాహం జరిపించిన ఘటనలో వరుడితో పాటు ఇరు కుటుంబాలు, సహకరించినవారిపై కేసు నమోదు చేసినట్టు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 31న ఉదయం 11 గంటల సమయంలో జగ్గయ్యచెరువు ప్రాంతానికి చెందిన మైనర్ బాలికకు గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో వివాహం జరుగుతున్నట్టు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా అధికారులకు సమాచారం అందింది. బాల్య వివాహాల నిరోధక కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విచారణలో మైనర్ బాలికకు మొయిళ్ల కృష్ణ అనే యువకుడితో వివాహం జరిగినట్టు గుర్తించారు. వన్నెపూడి గ్రామ పంచాయతీ కార్యదర్శి అందించిన నివేదిక ఆధారంగా యువకుడు మొయిళ్ల కృష్ణ, అతని తల్లిదండ్రులు మొయిళ్ల రాంబాబు, ఏసమ్మ, బాలిక తల్లిదండ్రులు నాగళమూడి మంగరాజు, గాయత్రి, వివాహానికి సహకరించిన అనిశెట్టి యాకోబురెడ్డి తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై తెలిపారు. -
ఇనుప కంచెలో ‘ఎలుగు’
పామాయిల్ తోటలోకి వెళ్లేందుకు యత్నించిన ఎలుగు బంటి ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. ఏలేశ్వరం మండలం పరిమితడక గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. యర్రవరం గ్రామానికి చెందిన తోట వీరగోపాలకృష్ణ అనే రైతు పరిమితడకలో పామాయిల్ సాగు చేస్తున్నాడు. సమీపంలో ఉన్న కొండ నుంచి వచ్చిన ఎలుగుబంటి తోటలోకి వెళ్లేందుకు యత్నించి తోట చుట్టూ ఏర్పాటుచేసిన ఇనుప కంచెలో ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు దానికి మత్తు మందు ఇచ్చి బంధించారు. అనంతరం దానిని విశాఖపట్నంలోని జూకు తరలించారు. – ఏలేశ్వరం -
రత్నగిరిపై ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథసేవ ఆదివారం ఆలయ ప్రాకారంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య టేకు రథంపై ప్రతిష్ఠించి తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ అర్చకుడు సుధీర్, పరిచారకుడు గణేష్ తదితరులు స్వామి అమ్మవార్లకు హారతి ఇచ్చారు. మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ఆలయానికి చేర్చారు. ట్రస్ట్ బోర్డు గౌరవ సలహాదారులు ఎం.సత్యప్రసాద్, ఎంఎస్ రెడ్డి, ఆలయ ఏఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పాలు, పెరుగు అమ్మినట్టు టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: డీఎస్సీలో అక్రమాలు గురించి గతం నుంచి చెబుతూనే వచ్చామని.. మూడున్నర లక్షల మంది అభ్యర్థులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన మాత్రం ప్రభుత్వానికి రావటం లేదన్నారు. డీఎస్సీలో అక్రమాలపై ప్రభుత్వం ప్రజలకు సంజాయిషి చెప్పాలని డిమాండ్ చేశారు.‘‘దేశ చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో గత ప్రభుత్వ హయాంలో ఒకటిన్నర లక్షల ఉద్యోగాల రిక్రూట్మెంట్ నిర్వహించాం. హెరిటజ్లో పాలు, పెరుగు అమ్మినట్టు రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలు అమ్మేశారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రావటం విద్యార్థులకు శాపం. టెట్కి, డీఎస్సీకి ఒకరినే కన్వీనర్గా పెట్టడం దగ్గర నుంచి.. సంతలో బర్రెలు అమ్మినట్టు టీడీపీ నేతలు ఉద్యోగాలు అమ్మేసేంతవరకు ప్రతి విషయాన్ని ప్రజలకు వివరించాం. మీకు చిత్తశుద్ధి ఉంటే సీబిఐ విచారణ జరిపించండి’’ అని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.కుల విద్వేషాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ వ్యవహారంపై ఎందుకు సీబిఐ విచారణ జరపటం లేదు. సీబీఐ విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. యువగళం పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారో బయట పడుతుంది. ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని ఉద్దేశంతోనే ధైర్యం చేయడం లేదు. కనీసం గ్రౌండ్లో అడుగుపెట్టని వారికి సైతం స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చేశారు.. డబ్బు కోసం అక్రమ సంపాదన కోసం ఎటువంటి నీచమైన పని చేయడానికైనా ప్రభుత్వం దిగజారి పోతుంది. ఆడియో టేపులు బయటకు వచ్చినా ప్రభుత్వంలో స్పందన ఉండటం లేదు.డీఎస్సీ వ్యవహారంలో ఎందుకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేకపోయారు. సోషల్ మీడియా హ్యాండిల్స్ నిలుపు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ సర్వీసెస్ పరీక్షలపై మీరు చేసిన ఆరోపణలపై, ప్రస్తుత డీఎస్సీపై సిబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వండి. మీరు చేసిన తప్పుడు నియామకాలు బయటపడతాయి. సాక్ష్యాలు ఉన్నా ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరించడం దారుణం. లోకేష్ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. తక్షణమే లోకేష్ రాజీనామా చేయాలి. ఈ వ్యవహారంలో కోర్టులు కూడా జోక్యం కల్పించుకోవాలి’’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. -
ఇక జెడ్పీకి కొత్త రూపు!
నాలుగుగా విడిపోనున్న ఉమ్మడి జిల్లా పరిషత్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నో దశాబ్దాల రాజకీయ చరిత్రకు వేదికగా నిలిచిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ఇప్పుడు నాలుగు జిల్లాల పరిధిలోకి విభజన కానుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ పరిధిలో నాలుగు వేర్వేరు జిల్లా పరిషత్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత జిల్లా పరిషత్ పాలకవర్గ గడువు ఈ నెల 24 వరకు ఉంది. ఆ తర్వాత ఆయా కొత్త జిల్లాల పరిధిలో జిల్లా పరిషత్ల ఏర్పాటు ప్రక్రియ అమల్లోకి వచ్చే అవకాశముంది. కొత్త పరిపాలనా వ్యవస్థకు అనుగుణంగా జిల్లా పరిషత్ల నిర్వహణ కోసం అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణం, జనాభా, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతంలో జిల్లాల విభజన జరిగింది. దీంతో ఒకే జిల్లా పరిషత్ పరిధిలో కొనసాగిన స్థానిక సంస్థల వ్యవస్థ ఇప్పుడు నాలుగు జిల్లాలుగా విడిపోనుంది. కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పోలవరం జిల్లా పరిషత్లుగా రూపాంతరం చెందనున్నాయి. ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా జిల్లా పరిషత్ వ్యవస్థలు ఏర్పడటం ద్వారా స్థానిక పరిపాలన మరింత వికేంద్రీకరణ అవుతుందని భావిస్తున్నారు. కొత్త జిల్లా పరిషత్ల పరిపాలన కోసం జెడ్పీ సీఈవోతో పాటు ఇతర పరిపాలనా అధికారుల నియామకానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దశాబ్దాలుగా కొనసాగిన ఉమ్మడి జిల్లా పరిషత్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. రాజకీయ నాయకులకు నర్సరీగా ఉమ్మడి జెడ్పీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కేవలం స్థానిక సంస్థ మాత్రమే కాదు, రాష్ట్ర, జాతీయ రాజకీయాలకు అనేక మంది ప్రముఖ నాయకులను అందించిన రాజకీయ వేదికగా కూడా గుర్తింపు పొందింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిలో పనిచేసిన పలువురు నాయకులు అనంతరం రాష్ట్ర, జాతీయ స్థాయిలో కీలక పదవులను అధిరోహించారు. ఈ జాబితాలో ప్రముఖంగా గుర్తుకొచ్చేది జీఎంసీ బాలయోగి. జిల్లా పరిషత్ రాజకీయాల నుంచి ఎదిగి దేశ అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఒకటైన లోక్సభ స్పీకర్గా సేవలందించి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వంగా గీత కూడా జిల్లా పరిషత్ రాజకీయాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుల్లో ఒకరు. ఆమె రాజ్యసభ సభ్యురాలిగా, అనంతరం పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత పొందారు. భాస్కర రామారావు వంటి నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులను అధిరోహించారు. ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేయడం ఉమ్మడి జెడ్పీ రాజకీయ ప్రస్థానానికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తోంది. కొత్తగా ఏర్పడనున్న నాలుగు జిల్లా పరిషత్లు స్థానిక సంస్థల రాజకీయాల్లో ఎలాంటి కొత్త నాయకత్వాన్ని తీర్చిదిద్దుతాయన్నది ఆసక్తికరంగా మారింది. -
ఆలయాలపై నేతల పెత్తనం
మామూళ్ల కోసం ఒత్తిళ్లు ఆలయ కమిటీ సభ్యులకు సాధారణంగా గౌరవ వేతనం ఉండదు. అయినా కొందరు సభ్యులు తమకు నెలవారీగా నిర్దిష్ట మొత్తంలో మామూళ్లు ఇవ్వాలని ఈవోలపై పట్టుబడుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశామని, తమకు ఏదైనా రావాలని చెబుతూ ఒత్తిడి చేస్తున్నారు. కొన్నిచోట్ల నెలకు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఒక సత్రానికి సంబంధించిన కమిటీ సభ్యులు నెలకు రూ.5 వేల చొప్పున ఇవ్వాలని సంబంధిత అధికారిపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. తాను నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఇవ్వలేనని, అలా చేస్తే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుందని సంబంధిత అధికారి చెప్పినప్పటికీ ఒత్తిళ్లు కొనసాగుతున్నట్టు సమాచారం. ● మాట వినకుంటే బదిలీ చేస్తామంటూ బెదిరింపులు ● నెలనెలా మామూళ్లు ఇవ్వాలంటూ వేధింపులు ● ఆలయాలు, సత్రాల్లో కమిటీ సభ్యుల పేరుతో అధికారులపై ఒత్తిళ్లు ● తలలు పట్టుకుంటున్న ఈవోలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లావ్యాప్తంగా అనేక దేవాలయాలు, సత్రాలకు నూతన పాలక మండళ్లు, కమిటీ సభ్యులను నియమించారు. జిల్లాలో 526 ఆలయాలు, 83 సత్రాలు ఉన్నాయి. ఇటీవల కమిటీ సభ్యులుగా నియమితులైన కొందరు రాజకీయ నాయకులు, కార్యకర్తలు తమ పరిధిని దాటి ఆలయాలు, సత్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ మాట వినకపోతే బదిలీలు చేయిస్తామని, ఇబ్బందులు తప్పవంటూ ఈవోలు, సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి దేవాలయాల పాలనలో కమిటీ సభ్యులకు నిర్దిష్ట బాధ్యతలు ఉన్నప్పటికీ, రోజువారీ పరిపాలన, అధికారిక ఆర్థిక వ్యవహారాలు దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పరిధిలోనే ఉంటాయి. కొందరు కమిటీ సభ్యులు మాత్రం ఇక్కడ పెత్తనం మాదే.. మా మాటే వినాలి.. అన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఆలయాల్లో చిన్నపాటి ఖర్చు చేయాలన్నా తమ అనుమతి తీసుకోవాలని, తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలూ తీసుకోకూడదని కొందరు కమిటీ సభ్యులు ఈవోలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. తమ మాట వినకుంటే ఉన్నత స్థాయి నాయకులతో మాట్లాడి బదిలీ చేయిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పలువురు ఈవోలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా లెక్కల్లో చూపలేని ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి వస్తే ఏం చేయాలో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. ఆలయాల్లో రోజంతా మకాం కొందరు కమిటీ సభ్యులు ఉదయం నుంచి రాత్రి వరకు ఆలయాలు, సత్రాల్లోనే మకాం వేస్తూ ఫ్యాన్లు, ఏసీలు వినియోగించడం, టిఫిన్లు, భోజనాలు తెప్పించుకోవడం, ప్రసాదాలు ఇవ్వాలని సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. తమతో పాటు బంధువులను కూడా తీసుకొచ్చి ప్రసాదాలు, భోజనాల కోసం ఇబ్బందులు కలిగిస్తున్నారని సమాచారం. శ్రావణ శుక్రవారాల సందర్భంగా జిల్లాలోని పలు ఆలయాల్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో కూడా కమిటీ సభ్యులు అంతా తామై వ్యవహరించారు. పాసుల పంపిణీలో తమ అనుచరులు, బంధువులు, రాజకీయ నాయకులకు ప్రాధాన్యం ఇచ్చి, సాధారణ భక్తులను అసలు పట్టించుకోలేదు. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కాకినాడ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానం, దేవాలంవీధిలోని భీమేశ్వరస్వామి ఆలయంలో సాధారణ భక్తులను అసలు పట్టించుకోకుండా తమకు కావాల్సినవారికి ఆయా ఆలయ కమిటీ సభ్యులు పాస్లు పంపిణీ చేశారు. తమ మాట వినకుంటే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతుండటంతో ఈవోలు మౌనంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అధికారిక విధులు నిర్వహించాలా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాలా అన్న సందిగ్ధ పరిస్థితిలో వారు పనిచేస్తున్నారని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటీవల దేవాదాయ శాఖ అధికారి వద్ద ఒక ఈవో తమ బాధను చెప్పుకోగా, ఆయా కమిటీ సభ్యులపై అధికారికంగా ఫిర్యాదు చేస్తే నివేదికను దేవదాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత కమిటీని రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. అలా చేస్తే తనపై కక్షసాధింపులుకు పాల్పడి ఇబ్బందులు పెడతారని ఆ ఈవో ఫిర్యాదు చేసేందుకు నిరాకరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. భక్తికి, భగవదారాధనకు నిలయాలుగా ఉండే ఆలయాల్లో పలువురు నేతలు తిష్ట వేసి.. అక్కడి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. ఆలయ అధికారులు, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ.. తమ మాట వినకుంటే బదిలీ చేయిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. నెలనెలా మామూళ్లు ఇవ్వాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే మరీ బరితెగించి.. హుండీ ఆదాయంలో ఖర్చుల పేరిట తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈవోలు తలలు పట్టుకుంటున్నారు. హుండీ ఆదాయంలోనూ వాటా ఇవ్వాలట! మరికొన్ని ఆలయాల్లో హుండీ ఆదాయం లెక్కించే సమయంలో కొంత నగదును ఖర్చుల పేరుతో పక్కన పెట్టాలని కమిటీ సభ్యులు సూచిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అది సాధ్యం కాదని ఈవోలు స్పష్టం చేయడంతో వారి మధ్య విభేదాలు తలెత్తుతున్నట్టు సమాచారం. ఆదాయం అధికంగా వచ్చే పెద్ద ఆలయాల్లో పరిస్థితి ఒకలా ఉండగా ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న చిన్న ఆలయాలు, సత్రాల్లో మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలంటూ ఈవోలు కమిటీ సభ్యుల వద్ద మొరపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అయినప్పటికీ తమకు డబ్బులు ఇవ్వాల్సిందేనని కొందరు పట్టుబడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనది
కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమాజంలో ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 84 మందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ప్రత్యేక స్థానముందని చెప్పారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో రక్తదాన శిబిరం బోటక్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్తులైన చిన్నారులకు అండగా నిలవాలనే ప్రధాన సంకల్పంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి డి.తిప్పేనాయక్ పర్యవేక్షించారు. సీపీవో పి.త్రినాథ్, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, గ్రామ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు. ఈ శిబిరంలో మొత్తం 37 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. రక్తదాతలకు డీఆర్వో తిప్పేనాయక్, రెడ్క్రాస్ సంస్థ కార్యదర్శి కె.శివకుమార్తో కలసి సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకుంటారా?ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారత రిజర్వు బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా పదవిలో కొనసాగుతున్న ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ పదవి నుంచి కోళ్ల అచ్యుత రామారావు (బాబు)ను వెంటనే తప్పించాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ డిమాండ్ చేశారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా చిట్స్, వడ్డీ వ్యాపారాలు చేసే వారు ఆర్యాపురం, ఇన్నీసుపేట, జాంపేట బ్యాంకుల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, ఆయా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక శ్యామలా సెంటర్లో ఉన్న ఇన్నీసుపేట కో ఆపరేటివ్ బ్యాంక్ వద్ద భరత్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు శనివారం ధర్నా చేశారు. 2025లో పార్లమెంట్ చట్టం ప్రకారం కో ఆపరేటివ్ రంగంలో పదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న చైర్మన్, డైరెక్టర్లు పదవులకు అనర్హులని, రిజర్వ్ బ్యాంక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసి 13 నెలలు కావస్తున్నా ఇంతవరకు వారిని పదవుల నుంచి తప్పించకపోవడం దారుణమన్నారు. దీనిపై సహకార శాఖ అధికారులను బాధ్యులుగా చేయాలని హైకోర్టును ఆశ్రయించనున్నామని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు చైర్మన్ కోళ్ల బాబుతో పాటు జామి వెంకట రమణమూర్తి, ఆదిరెడ్డి శ్రీనివాసరావు, కటారి శ్రీనివాస కన్నా, పంచకట్ల శివను వెంటనే తొలగించకపోతే తాము ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బాబు గత 27 ఏళ్లుగా అక్కడ ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. ఇన్నీసుపేట, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్లు స్వయంగా ఈవీఎం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బంధువులని, వారంతా చిట్స్, వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు. ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్పై ‘51 ఎంకై ్వరీ’ నడుస్తోందని, తాజాగా ఇన్నీసుపేట బ్యాంక్ చైర్మన్ బాబు అక్రమాలు, అరాచకాలపై కూడా సమగ్ర విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. కుటుంబ ఆస్తులను పంచుకున్నట్టు బ్యాంకుల ఆస్తులను పంచుకునే హక్కు వారికి ఎవరు ఇచ్చారని నిలదీశారు. ఈ అక్రమాలను తాము సహించబోమని, వీటిపై ఉద్యమించి అవినీతికి అడ్డుకట్ట వేస్తామన్నారు. అనంతరం బ్యాంక్ సీఈఓకు వినతి పత్రం అందచేసి రిజర్వ్ బ్యాంక్ ఉత్తర్వుల కాపీలను అందజేశారు. కార్యక్రమంలో ఇన్నీసుపేట బ్యాంక్ డైరెక్టర్లు గుత్తుల భాస్కర్, అందనాపల్లి సత్యనారాయణ, డిపాజిటర్ యజ్జరపు మరిడయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు కానుబోయిన సాగర్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, రొక్కం త్రినాథ్, బిల్డర్ చిన్నా, నల్లా రామాంజనేయులు, తిరగటి దుర్గ, కృష్ణవేణి, సేపేని మునీశ్వరరావు, యజ్జవరపు శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీల్లో కూటమి నేతల దోపిడీ
● జగ్గంపేట నియోజకవర్గంలో రూ.150 కోట్ల అవినీతి ● దోషులను వెంటనే శిక్షించాలని రైతు కూలీ సంఘం డిమాండ్ జగ్గంపేట: జిల్లాలో సహకార పరపతి సంఘాలను దోచుకుంటున్న కూటమి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్టారు. జగ్గంపేట శివారు రంగవల్లి నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో సహకార పరపతి సంఘాల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు కూటమి నేతల హస్తం ప్రధానంగా ఉంటోందని, దీనికి వారే బాధ్యత వహించాలని సంఘ ప్రధాన కార్యదర్శి కె.వీరాంజనేయులు డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలోని రాజపూడి, గండేపల్లి, కిర్లంపూడి తదితర సంఘాల్లో నేటి వరకు రూ.150 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా అనేక సంఘాల్లో మరిన్ని కోట్లు దోచుకుతిన్నారన్నారు. బాధ్యులు కూటమి నేతలు కావడం వల్లే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో అనేక వనరుల దోపిడీ పెరిగిందన్నారు. ప్రధానంగా పోలవరం కాలువ మట్టి, కొండలు, గుట్టలను వదలకుండా మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని, కోట్ల రూపాయలు దోచుకుతింటోందని తెలిపారు. అయినా ఏ ప్రభుత్వ శాఖా స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు డాన్ శ్రీను, కొండేపూడి మంగయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తుల తాకిడి భారీగా పెరిగింది. సుమారు 50 వేల మంది స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు నాలుగు వేలు జరిగాయని చెప్పారు. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టిందని వివరించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సత్యదేవుని అన్న ప్రసాదాన్ని ఆరు వేల మంది భక్తులు స్వీకరించారని చెప్పారు. వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. -
అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లో శనివారం జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ మూడో దఫా సమావేశం కమిటీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపాదించిన దరఖాస్తులపై కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులతో పరిశీలించి సూచనలు ఇచ్చారు. అర్హులైన జర్నలిస్టులపై సమావేశంలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. కారు, ఆటో ఢీ : నలుగురికి గాయాలుకొత్తపల్లి: బీచ్రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు శనివారం ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులో ఎస్పీజీఎల్ సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరు కాకినాడ, మరో ఇద్దరు పిఠాపురం ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కారు డ్రైవరు అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వాహనం అదుపుతప్పి యువకుడి మృతి తాళ్లరేవు: గాడిమొగ రహదారిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాడి వెంకట కాశి (23) దుర్మరణం పాలయ్యాడు. కోరంగి పోలీసులు తెలిపిన వివరాల మేరకు యానాం సావిత్రినగర్కు చెందిన కాశి చేపలవ్యాపారం చేస్తుంటాడు. రోజూ మాదరిగానే ద్విచక్రవాహనంపై మట్లపాలెం మార్కెట్కు వెళ్లి తిరిగి వస్తుండగా గాడిమొగ రిలయన్స్ కంపెనీ వద్ద మలుపులో ప్రమాదవశాత్తూ అదుపుతప్పి పడిపోయాడు. దీంతో కాశి తలకు తీవ్రగాయమై రక్తస్రావమైంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందివచ్చిన కుమారుడు అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని.. రాజానగరం: రోడ్డుపై నడచి వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. జాతీయ రహదారిపై దివాన్చెరువు పండ్ల మార్కెట్ సమీపంలో శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన బొమ్మూరు సీఐ పి.కాశీవిశ్వనాథ్ తెలిపిన వివరాలిలావున్నాయి. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని రాజమహేంద్రవరంలోని సుబ్బారావుపేటకు చెందిన మారేడుపూడి విశ్వేశ్వర శ్రీనివాసాచార్యులు (49) గా గుర్తించామన్నారు. అలాగే అతనిని ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిన కారును కూడా గుర్తించి, పట్టుకున్నామని చెప్పారు. కేసును ఎస్సై కె.రమేష్ దర్యాప్తు చేస్తున్నారు. వాహనం ఢీకొని..అమలాపురం రూరల్: చిందాడగరువు బైపాస్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి గాయపడి అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. రోళ్లపాలెం గ్రామానికి చెందిన జల్లి ప్రసాద్ (40) మోటార్ సైకిల్పై బైపాస్ రోడ్డులో వెళ్తుండగా వెనుక నుంచి అశోక్ లేలాండ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుటాహుటిన అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రసాద్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. 22 కిలోల గంజాయి స్వాధీనంకంబాలచెరువు(రాజమహేంద్రవరం): గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు అంతరాష్ట్ర వ్యక్తులతో పాటు ఒక స్థానికుడిని ప్రకాశం నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆదేశాల మేరకు ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, సంబంధిత పోలీసు అధికారుల పర్యవేక్షణలో సీఐ ఆర్ఎస్.బాజీలాల్, ఎస్సైలు జి.సతీష్, ఎస్ఐ కె.నవీన్ కుమార్ గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఏవీ అప్పారావు రోడ్డులోని స్కాచ్ బ్యారెల్ సమీపంలో ఐదుగురు నిందితులను వారు అదుపులోకి తీసుకుని 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు జాఫర్ చీకు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అదుపులోకి తీసుకున్న వారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన రహత్ అలీ, హర్యానా రాష్ట్రానికి చెందిన ఇర్ఫాన్, సుమిత్ కుమార్ మిశ్రా, బీహార్కు చెందిన సందీప్ కుమార్, రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన షేక్ సాధక్ అలీ ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో కిర్లంపూడి వాసి మృతికొణిజర్ల: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో కాకినాడ జిల్లా కిర్లంపూడి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయం సమీపంలో శనివారం జరిగిన ఈ ఘటనలో కిర్లంపూడి మండలం ముక్కొల్లు గ్రామానికి చెందిన మల్లా మురళీకృష్ణ (31) రైస్ మిల్లు మెకానిక్గా పనిచేస్తున్నాడు. వీఎం బంజరలోని ఓ మిల్లులో మరమ్మతులు చేసిన ఆయన హైదరాబాద్ బస్సు ఎక్కేందుకు ద్విచక్ర వాహనంపై బొద్దపు శివకుమార్తో కలిసి బయలుదేరాడు. కొణిజర్ల మండల పరిషత్ కార్యాలయం సమీపాన శివకుమార్ మూత్ర విసర్జన కోసం దిగగా మురళీకృష్ణ ద్విచక్ర వాహనాన్ని రోడ్డుపైకి తీసుకువచ్చే క్రమంలో వైరా వైపు నుంచి ఖమ్మం వైపు వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటననలో తలకు తీవ్రగాయాలైన మురళీకృష్ణను ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు కొణిజర్ల ఎస్సై జి.సూరజ్ వెల్లడించారు. -
పిచ్చికుక్క కాటుకు రిన్తో శుభ్రం చేస్తారా?
ఏరియా ఆస్పత్రిలో వైద్య విధానంపై వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ ఆగ్రహం అమలాపురం టౌన్: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పిచ్చి కుక్క దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ శనివారం పార్టీ నాయకులతో కలసి వచ్చి పరామర్శించారు. ఆ సమయంలో పిచ్చి కుక్క కరిచిన పిల్లల గాయాలకు హైడ్రోజన్ ఫైరాకై ్సడ్, స్పిరిట్, బెటాడిన్, నార్మల్ సైలన్ వంటి వాటితో కాకుండా సరైన వైద్య విధానాలు పాటించకుండా చికిత్స చేస్తున్న తీరను చూసి డాక్టర్ శ్రీకాంత్ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయాలను దుస్తులు ఉతికే రిన్ సబ్బుతో శుభ్రపరిచే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. కుక్క కరిచిన బాధిత చిన్నారుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య నిబంధనల ప్రకారం బాధితులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడడంపై ఆయన మండిపడ్డారు. చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంటే స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు పట్టదా...? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రిన్ సబ్బుతో వైద్యం చేస్తున్న తీరును, వైద్యులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. -
వయోవృద్ధులకు వారింటనే ఆశ్రయం
● కొడుకు, కోడలు వెళ్లగొట్టడంపై ఆర్డీఓకు ఫిర్యాదు ● చట్ట ప్రకారం చర్యలు తీసుకున్న అధికారులు ● ఇంటిలోని సామగ్రి సైతం వేరు చేసి అప్పగింత పిఠాపురం రూరల్: తమ కొడుకు కోడలు తమను ఇంటి నుంచి వెళ్లగొట్టారని గత జూన్లో ఆర్డీఓకు చేసిన ఫిర్యాదుపై అధికారులు స్పందించి చట్ట ప్రకారం తమ ఇంటిలోనే ఒక పోర్షన్ను వారికి కేటాయించి న్యాయం చేశారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కుమారపురానికి చెందిన పెంకే యేసులక్ష్మి, ఆమె భర్త రాంబాబు తమ కుమారుడు పెంకే లోవప్రసాద్, కోడలు పద్మ తమ ఇంటిని ఆక్రమించుకుని బయటికి పంపేశారని జూన్ 15వ తేదీన ఆర్డీవో మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఆర్డీఓ, సబ్ డివిజనల్ మేజిస్టేట్ (తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమం ట్రిబ్యునల్) ఉత్తర్వులను అనుసరించి శనివారం పిఠాపురం తహసీల్దార్ పి.గోపాలకృష్ణ, రూరల్ ఎస్సై జాన్ బాషా ఆధ్వర్యంలో యేసులక్ష్మికి చెందిన ఇంటిలోని రెండు పోర్షన్ల (పోర్షన్ కి 4గదులు) డాబా ఇంటిని, అందులోని సామగ్రిని ఆ దంపతులకు, కొడుకు దంపతులకు వేరు చేసి అప్పగించారు. ఆ సమయంలో కొడుకు, కోడలు అక్కడ లేకపోవడంతో వారి సామగ్రి జాబితాను తయారు చేసి అదే పోర్షన్లో ఒక గదిలో వేసి సదరు సామగ్రిని అప్పగించే సమయంలో ప్రైవేట్ ఫొటోగ్రాఫర్ ద్వారా వీడియో చిత్రీకరించినట్టు తహసీల్దార్ తెలిపారు. వయోవృద్ధులైన తల్లితండ్రులను చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని, తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దారు గోపాలకృష్ణ తెలిపారు. -
శనివారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
అనుమతి లేకుండా.. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఓ రియల్టర్ సర్వే నంబర్ 180లో 1.80 ఎకరాల్లో లే అవుట్ వేసేశారు. అనుమతులు లేకుండా ప్లాట్లుగా విభజించేశారు. నంబర్ రాళ్లు సైతం పాతేశారు. ప్లాట్ల విభజన జరుగుతున్నప్పుడు కట్టడి చేయాల్సి క్షేత్ర స్థాయి అధికారులు ఆమ్యామ్యాలు తీసుకుని మిన్నకుండిపోయారు. ఇటీవల ప్లాట్ల తనిఖీలు చేపట్టిన కౌడా అధికారులు దీనిని అక్రమ లే అవుట్గా గుర్తించారు. కన్నెత్తి కూడా చూడటం లేదు తొండంగి మండలం బెండపూడిలో సర్వే నంబర్ 59–4ఏలో 0.84 ఎకరాల్లో అనధికారిక లే అవుట్ వెలసింది. ఏకంగా విద్యుత్ స్తంభాలు, అంతర్గత రహదారులు సైతం ఏర్పాటు చేశారు. ఇంత జరుగుతున్నా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలాలు లేవు. కౌడా అధికారులు దీనిని ఇటీవల అక్రమ లే అవుట్గా గుర్తించారు. -
బీచ్ రోడ్డులో ఆటోను ఢీకొన్న కారు
కొత్తపల్లి: ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ నుంచి ఉప్పాడ వైపు వెళుతున్న కారు జగనన్న కాలనీ సమీపంలో ఉప్పాడ నుంచి కాకినాడ వెళుతున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులకు, ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం కాకినాడ, పిఠాపురం తరలించారు. కారు డ్రైవర్ అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఇంకా సమాచారం అందలేదన్నారు. ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్ట్ చాగల్లు: రాత్రి సమయాల్లో ఇళ్లలో బంగారం, వెండి వస్తువులను దొంగలిస్తున్న అంతర జిల్లా దొంగలను అరెస్ట్ చేసినట్టు కొవ్వూరు రూరల్ సీఐ కె.విజయబాబు తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 17 కేసులకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.24 లక్షలు విలువ చేసే 160 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మేరకు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ కేసుల్లో కొవ్వూరు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన భూపతి అశోక్, లెప్రసీ కాలనీకి చెందిన కండవల్లి గణేష్, కోతాడ నాగశివసాయి కుమార్(సాయి)ను అరెస్ట్ చేశామన్నారు. వీరిపై కొవ్వూరు రూరల్, చాగల్లు, తాడేపల్లిగూడెం రూరల్, రాజమహేంద్రవరం త్రీటౌన్, తణుకు రూరల్, కడియం, అనపర్తి, మండపేట టౌన్, సమిశ్రగూడెం, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయన్నారు. నిందితులను కొవ్వురు శివారు కొత్త హైవే రోడ్డులో అండర్ పాస్ వద్ద కొవ్వూరు రూరల్ ఎస్సై కె.శ్రీహరి అరెస్ట్ చేశారన్నారు. ప్రమాదవశాత్తూ గోదావరిలో గల్లంతు ఆత్రేయపురం: బొబ్బర్లంక గ్రామ పరిధిలోని పిచ్చుకలంక వద్ద గోదావరిలో శుక్రవారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రాజమహేంద్రవరంలోని బాలాజీ పేటకు చెందిన రాజేష్ కుమారుడు వెలగలేటి సుజన్ తేజ (16) మరో ఇద్దరితో కలిసి సరదాగా పిచ్చుకలంక ప్రాంతానికి వచ్చాడు. ఈ క్రమంలో మధ్యాహ్న సమయంలో గోదావరిలో కాళ్లు కడుక్కుంటుండగా తేజ ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఆ సమయంలో మిగిలిన వారు నది ఒడ్డున ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు ఆ యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. అతడి తల్లి వెలగలేటి శ్రీకన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.రాము తెలిపారు. -
చీరల పంపిణీ పేరుతో.. చీటింగ్!
● చీటీలు ఇచ్చారు.. చీరలు ఎత్తుకెళ్లారంటూ ఆందోళన ● జనసేన నేతల తీరుపై మండిపడిన మహిళలు ● పవన్ ఇలాకాలో రసాభాసగా వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ పిఠాపురం: చీటీలు ఇచ్చారు.. చీరలు ఇస్తామన్నారు.. చివరకు చీరలు లేవంటూ చేతులెత్తేశారు.. తద్వారా మండుటెండలో గంటల తరబడి క్యూలో పడిగాపులు పడిన మహిళలకు చుక్కలు చూపించారు.. దీంతో, వారు జనసేన నాయకులకు శాపనార్థాలు పెట్టారు. దీంతో, పాదగయ క్షేత్రంలో జనసేన నాయకులు ఆర్భాటంగా నిర్వహించ తలపెట్టిన సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రసాభాసగా మారాయి. ఏం జరిగిందంటే.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇలాకా పిఠాపురం పాదగయ క్షేత్రంలో.. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు జనసేన నాయకులు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో మహిళలను రప్పించడానికి ఉచితంగా చీరలు ఇస్తున్నామంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులకు పవన్ కల్యాణ్ పసుపు, కుంకుమ, 12 వేల చీరలు పంపించారంటూ హడావుడి చేశారు. తొలుత 12 వేల చీరలన్నారు.. తర్వాత 10 వేల చీరలు సిద్ధం చేశామని విస్తృతంగా ప్రచారం చేశారు. చీరల పేరుతో పలువురు మహిళలకు చీటీలు కూడా ఇచ్చారు. దీంతో, ఇటు పుణ్యం దక్కడంతో పాటు అటు చీరలు కూడా పొందవచ్చనే ఆశతో పెద్ద సంఖ్యలో మహిళలు పాదగయకు చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి చేరుకుని భారీగా బారులు తీరారు. చీరలు పట్టుకుపోయారు అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా జనసేన నాయకులు చివరకు 6 వేల మందికి కూడా చీరలు పంపిణీ చేయలేదు. మరోవైపు అధికారులు కేవలం కొంత మందితోనే వ్రతాలు చేయించారు. మిగిలిన వారికి చీరలు మాత్రమే ఇస్తామని, వ్రతాలు ముగిసిపోయాయని చెప్పారు. దీంతో, అప్పటికే ఇంకా క్యూ లైన్లలో పడిగాపులు పడుతున్న మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు వ్రతాలకు వచ్చిన మహిళల్లో కొంత మందికి మాత్రమే జనసేన నాయకులు చీరలు పంపిణీ చేశారు. అనంతరం, చడీచప్పుడు లేకుండా వారు, ఆలయ అధికారులు బయటకు వెళ్లిపోయారు. దీంతో, సుమారు వెయ్యి మంది మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్యూ లైన్లలో పడిగాపులు పడ్డారు. పవన్ కల్యాణ్ 12 వేల చీరలు పంపించారని ప్రచారం చేసిన జనసేన నేతలు 6 వేల మందికే వాటిని అందించారని, మిగిలినవి దొడ్డిదారిన పట్టుకుపోయారని మహిళలు ఆరోపించారు. వ్రతం చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆశ పడి వచ్చామని, చివరకు వ్రతాలు చేయించకపోవడంతో పాటు చీరలు కూడా ఇవ్వకుండా పట్టుకుపోతారా అంటూ జనసేన నాయకుల వారు మండిపడ్డారు. చీరల్లేవ్.. చీటీలతో సరి! పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆడపడుచులకు మాత్రమే చీరలు అని జనసేన నేతలు ప్రచారం చేయగా.. ఈ వ్రతాలకు వచ్చిన వారిలో మూడొంతులకు పైగా పెద్దాపురం, కాకినాడ రూరల్కు చెందిన మహిళలే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 4 వేల వరకూ మాత్రమే చీటీలు పంపిణీ చేయగా మిగిలినవన్నీ పెద్దాపురం, కాకినాడ రూరల్ నేతలు పట్టుకుపోయి, తమ నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్లు పిఠాపురం జనసేన నేతలు, మహిళలు మండిపడుతున్నారు. తమకు చీటీలు తప్ప చీరలు మిగలకపోవడంతో పిఠాపురానికి చెందిన మహిళలు శాపనార్థాలు పెట్టారు. తమకోసం పంపించిన చీరలను ఇతర నియోజకవర్గాల నేతలు ఎలా పట్టుకుపోతారని దుయ్యబట్టారు. ఈ వ్రతాల నిర్వహణకు పెద్దాపురం, కాకినాడ జనసేన నేతలు తప్ప పిఠాపురానికి చెందిన నేతలు పెద్దగా హాజరు కాకపోవడం కొసమెరుపు. మండుటెండలో ఆపసోపాలు పడుతూ మహిళల పడిగాపులుగొంతెండిపోతున్నా.. మరోవైపు సామూహిక వ్రతాలకు వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపించారు. విడతల వారీగా వ్రతాలు నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో మహిళలు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఆ క్యూ లైన్లలో నిలబడి గొంతెండిపోతున్నా.. తాగేందుకు గుక్కెడు మంచినీరు కూడా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయలేదు. దీంతో, మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రసాదాలు సైతం పూర్తిగా అందించలేదంటూ వ్రతాల్లో పాల్గొన్న భక్తులు ఆందోళనకు దిగారు. దీంతో, పాదగయ క్షేత్రంలో ఉద్రిక్తత నెలకొంది. విరిగిపోయిన బారికేడ్లు వ్రతాల నిర్వహణకు సంబంధించి చేసిన ఏర్పాట్లలో లోపాలు ఇక్కడకు వచ్చిన మహిళలకు చెమటలు పట్టించాయి. వేలాది మందిని క్యూ లైన్లలోకి వదిలిన కొద్దిసేపటికే బారికేడ్లు విరిగిపోయి, తొక్కిసలాటకు దారి తీసింది. క్యూ లైన్లలో మహిళలు ఉండగానే బారికేడ్లను తిరిగి ఏర్పాటు చేయడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు ప్రమాదకరంగా మారాయి. -
మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
గోకవరం: వ్యాన్లో తరలిస్తున్న మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ, తూనికలు, కొలతలు అధికారులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం ఓ వ్యాన్ను వెంబడించారు. అది గాదెలపాలెంలో అయ్యప్ప ట్రేడర్స్ రైసుమిల్లు వద్దకు చేరుకోవడంతో అక్కడి సీజ్ చేసి, దానిలోని 60 బస్తాల్లో ఉన్న సుమారు మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్పై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన బియ్యాన్ని కోరుకొండ ఎమ్ఎల్ఎస్ పాయింట్కు, వ్యాన్ను గోకవరం పోలీస్స్టేషన్కు తరలించారు. పట్టుబడిన రేషన్ బియ్యం విలువ సుమారు రూ.1.44 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే రైసుమిల్లులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ దాడిలో విజిలెన్స్ సీఐలు శేఖర్బాబు, గోపాలకృష్ణ, ఏఎస్ఓ నాగాంజనేయులు, ఎమ్ఎస్ఓ శాంతి, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. రుణం పేరుతో సైబర్ మోసం ద్వారకా తిరుమల: ఓ ఫైనాన్స్ కంపెనీ పేరుతో వచ్చిన ఫేక్ కాల్ను నమ్మిన ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి పంచాయతీ ద్వారకానగర్కు చెందిన గాంచి కిషోర్ కుమార్కు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో కాల్ వచ్చింది. ఆయనకు రూ.50 వేల రుణం మంజూరైందని, అప్లికేషన్ ప్రాసెసింగ్ కోసం ముందుగా రూ.650 పంపాలని, ఆ తర్వాత రూ.2,975 చెల్లిస్తే రుణం విడుదల అవుతుందని చెప్పారు. ప్రాసెసింగ్ కోసం చెల్లించిన సొమ్మును కూడా కలిపి ఇస్తామని చెప్పారు. దీంతో కిషోర్కుమార్ రెండు దఫాలుగా వారు పంపిన స్కానర్కు డబ్బు చెల్లించాడు. కొద్దిసేపటికి రూ.50,520 రుణం మంజూరైనట్టు సైబర్ ఫోన్కు ఫేక్ మెసేజ్ వచ్చింది. అయితే నగదు విడుదల కావాలంటే జీఎస్టీ కోసం మరో రూ.5 వేలు చెల్లించాలని సూచించారు. దీంతో అనుమానం కలిగిన కిషోర్ కుమార్ సాయంత్రం భీమడోలు పోలీసులను ఆశ్రయించాడు. అప్పుడే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్టు తెలుసుకుని లబోదిబోమన్నాడు. పోలీసులు సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేశారు. బాల్య వివాహ ఘటనపై కేసు కోటనందూరు: మండల పరిధిలో జరిగిన ఓ బాల్య వివాహ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో బాలికకు వివాహం జరగబోతున్నట్లు అందిన సమాచారంతో మహిళా సంరక్షణ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది బాలిక కుటుంబ సభ్యులతో మా ట్లాడారు. బాల్య వివాహం నేరమని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. కానీ ఆగస్టు 30న బాలికకు కుటుంబ సభ్యులు వివాహం చేసేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు బాలిక కుటుంబ సభ్యులకు నోటీసులిచ్చారు. -
తిరుగు ప్రయాణం.. తీరని విషాదం
ఫ కొబ్బరిచెట్లను ఢీకొన్న కారు ఫ స్వగ్రామానికి వస్తూ అన్నదమ్ముల మృతి ఫ శోక సంద్రంలో లక్కవరం మలికిపురం: అన్నదమ్ములైన వారిద్దరూ ఒకే మాట, ఒకే బాటగా పెరిగారు. వ్యవసాయం, వ్యాపారం ఇలా అన్ని విషయాల్లో కలిసికట్టుగా ముందుకు సాగారు. చివరకు కారులో కలిసి వస్తూనే మృత్యుఒడికి చేరారు. లక్కవరంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. లక్కవరానికి చెందిన ముదునూరి గోపాలకృష్ణంరాజు దంపతులకు రామభద్రరాజు (రాంబాబు రాజు), వెంకట సుబ్బరాజు (శ్రీనివాసరాజు) కుమారులు. వీరిలో రాంబాబు రాజు, విజయలక్ష్మి మాధురి దంపతులు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బంధువుల ఇంట గురువారం రాత్రి జరిగిన పెళ్లికి వెళ్లారు. అలాగే శ్రీనివాసరాజు, శారద దంపతులు తమ కుమార్తెను బెంగళూరులో అమెరికా విమానం ఎక్కించేందుకు వెళ్లి గురువారం రాత్రి రైలులో భీమవరం బయలుదేరారు. ఈ నేపథ్యంలో పెళ్లి పూర్తయిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున రాంబాబు రాజు దంపతులు కారులో భీమవరం రైల్వే స్టేషన్కు వెళ్లి, బెంగళూరు నుంచి వచ్చిన శ్రీనివాసరాజు దంపతులను ఎక్కించుకుని, లక్కవరం బయలు దేరారు. మరో ఒక్క నిమిషంలో ఇంటికి చేరతామనగా స్వగ్రామంలోనే ప్రధాన రహదారి ప్రక్కనే కొబ్బరి చెట్లను కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో అన్నదమ్ములిద్దరి తలలకు బలమైన గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాల పాలైన తోడికోడళ్లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రాంబాబు రాజు, శ్రీనివాసరాజు మృతదేహాలను రాజోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజోలు సీఐ వి.సురేష్ బాబు, మలికిపురం ఎస్సై మోహన్ కుమార్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి మార్చురీకి తరలించారు. విదేశాల్లో పిల్లలు : రామభద్రరాజుకు సందీప్, పృథ్వీరాజ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నాయి. వీరు వివాహాలు చేసుకుని అమెరికాలో ఉంటున్నారు. శ్రీనివాసరాజుకు సాహితి, మహితి ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఇరువురూ కెనడాలో నివాసం ఉంటున్నారు. ప్రమాద విషయం తెలిసిన వీరంతా విదేశాల నుంచి తమ స్వస్థలానికి బయలు దేరారు. కాగా.. వీరిలో మహితి ఇటీవల తల్లిదండ్రుల వద్దకు రావడంతో తిరిగి ఆమెను కెనడా పంపేందుకు శ్రీనివాసరాజు దంపతులు బెంగళూరు విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ఆమె గురువారం విమానం ఎక్కిన తర్వాత తల్లిదండ్రులు బెంగళూరులో ట్రైన్ ఎక్కి ఇంటికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున ఆమె విమానం అక్కడ దిగగా, అదే రోజు ఉదయం ఆమె తండ్రి శ్రీనివాసరాజు ప్రమాదంలో చనిపోయారు. -
వరలక్ష్మీ వ్రతాలను రాజకీయ జాతరలా మార్చారు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ నగరంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆలయాలు రాజకీయ వేదికలుగా మారాయని భోగి గణపతి పీఠం వ్యవస్థాపకుడు దూసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పీఠంలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను పూర్తి రాజకీయ జాతరగా మార్చారని విమర్శించారు. దీనివలన భక్తుల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. రాజకీయ పార్టీల పెత్తనం లేకుండా ధర్మకర్తల నిర్వహణలోనే ఆలయం పని తీరును మెరుగు పరచాలని సూచించారు. రాజకీయ వర్గాల ఆధిపత్యంతో దేవాలయాలు భ్రష్టు పట్టడం క్షమించరానిదన్నారు. ఈ వ్రతాలకు ఇచ్చిన 2 వేల కూపన్లలో రోజువారీ భక్తులకు 100 ఇచ్చి, మిగిలిన 1,900 పార్టీ శ్రేణులకు ఇవ్వడం అధికారుల బాధ్యతా రాహిత్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలకు దేవదాయ శాఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ దేవాలయాల వద్ద రాజకీయ ఆధిపత్య ప్రచార బోర్డులు ఏర్పాటు చేయడం, పార్టీ శ్రేణులు సమావేశాలు పెట్టడాన్ని పూర్తిగా కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధోరణితో ఆలయాలు రాజకీయ శిబిరాలుగా మారాయన్నారు. నగరంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లో హిందుత్వాన్ని దెబ్బ తీసేలా ఏడాది పొడవునా దర్శనం టికెట్లు పెట్టడం, ధర్మదర్శనాన్ని భక్తులకు దూరం చేయడం ఇష్టారాజ్యంగా మారిందని రమణరాజు దుయ్యబట్టారు. 17 బస్సులపై కేసులు రావులపాలెం: ఈతకోట టోల్ ప్లాజా వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్ క్యాబిన్లో అనధికారిక బెర్త్ ఏర్పాటు, అత్యవసర ద్వారానికి అడ్డంగా సీట్ ఏర్పాటు, గడువు తీరిన అగ్ని ప్రమాద నిరోధక పరికరాన్ని బస్సులో ఉంచడం, మిరుమిట్లు గొలిపే కాంతిని వెదజల్లే హెడ్ లైట్లు అమర్చడం వంటి ఉల్లంఘనలను గుర్తించామని జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 42 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసి, ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నిబంధనలు పాటించని 17 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.69,400 అపరాధ రుసుం విధించామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, సురేష్ కుమార్, షణ్ముఖ్ శ్రీనివాస్, వరప్రసాద్ పాల్గొన్నారు. -
రియల్ దందా
● జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ లే అవుట్లు ● అనుమతులు లేకుండానే ప్లాట్ల విభజన ● ప్రభుత్వ భూములు, వివాదాస్పద స్థలాలనూ వదలని రియల్టర్లు ● కౌడా పరిధిలోనే 33 అక్రమ లే అవుట్ల గుర్తింపు ● నట్టేట మునుగుతున్న కొనుగోలుదారులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లావ్యాప్తంగా రియల్ మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలు తుంగలో తొక్కుతోంది. అనుమతులు లేకుండానే అనధికారిక లే అవుట్లు వేసేస్తోంది. రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజలకు అవస్థలు తెచ్చి పెడుతోంది. ఇదంతా తెలిసినా కొంత మంది అధికారులు రూ.లక్షల్లో మామూళ్లు దండుకుని చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో వెలసిన అనధికారిక లే అవుట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారు 100కు పైగా లే అవుట్లు ఉండగా.. వీటిలో 80 శాతం అనధికారికంగానే ఏర్పాటు చేశారంటే రియల్ దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ నగరా భివృద్ధి సంస్థ (కౌడా) అధికారులు ఇటీవల కొన్నిచోట్ల చేపట్టిన తనిఖీల్లో 33 లే అవుట్లు అక్రమమని గుర్తించారు. కొన్ని లే అవుట్లలో పాతిన రాళ్లను కౌడా అధికారులు తొలగించి, అక్కడితో మిన్నకుండిపోయారు. కూటమి నేతల అండతో.. రియల్ వ్యాపారంలో సింహభాగం కూటమికి చెందిన నేతలే ఉండటంతో అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండానే స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. అదేమని ప్రశ్నిస్తే తాము కూటమి నేతలమంటూ బెదిరిస్తున్నారు. కూటమి నేతలు తానా అంటే.. వారి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు అధికారులు తందానా అంటున్న పరిస్థితి నెలకొంది. లే అవుట్ స్థలాన్ని బట్టి ధర నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే తూతూమంత్రంగా దాడులు చేయడం.. అనంతరం మిన్నకుండిపోవడం పరిపాటిగా మారుతోంది. ఇదే అదునుగా రియల్ వ్యాపారులు అక్రమాలకు ఆజ్యం పోస్తున్నారు. కొందరైతే నీటి ప్రవాహాలు, చెరువులు, కాలువలు, సామాజిక స్థలాల వంటి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించి లే అవుట్లుగా మార్చి విక్రయించేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది వివాదాస్పద స్థలాలను సైతం వదలడం లేదు. ఇలాంటి లే అవుట్లకు కొంత మంది అధికారులు సైతం పర్సంటేజీలు తీసుకుని రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారని కొనుగోలుదార్లు వాపోతున్నారు. తెలియక కొనుగోలు చేసి, నిండా మునుగుతున్నామని వాపోతున్నారు. నోటీసులతో సరి అక్రమ లే అవుట్లపై అధికారులు రెండు రోజులు హడావుడి చేయడం.. నోటీసులు ఇచ్చామని చెప్పడం మినహా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వీటిపై ఏం చర్యలు తీసుకున్నారు.. కేసులు నమోదు చేశారా.. జరిమానా విధించారా.. అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. కత్తిపూడి లే అవుట్లో సర్వే రాళ్లు తొలగిస్తున్న సిబ్బందికౌడాలో గుర్తించిన అక్రమ లే అవుట్లు మండలం అక్రమ విస్తీర్ణం లే అవుట్లు (ఎకరాలు) శంఖవరం 2 4తొండంగి 3 5పెద్దాపురం 6 11జగ్గంపేట 7 14కాకినాడ రూరల్ 8 21కిర్లంపూడి 3 6బరి తెగిస్తున్నారిలా.. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పొలాలను ఇష్టానుసారం చదును చేసి లే అవుట్లుగా మార్చేస్తున్నారు. ప్లాట్లుగా విభజించి రూ.లక్షలకు అమ్మేస్తున్నారు. పట్టణాల్లోని ప్రధాన సెంటర్లు, హైవేల సమీపాన విలువ ఎక్కువగా ఉన్న భూములపై దృష్టి పెడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే భూములు చదును చేసి అనధికారంగా లే అవుట్లు వేసేస్తున్నారు. కొందరైతే మరీ బరితెగిస్తున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకు అనుమతులు సైతం తీసుకోవడం లేదు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ఎటువంటి నిబంధనలూ పాటించడం లేదు. వీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ, పంచాయతీ అధికారుల అనుమతులు తీసుకునేందుకు, బ్యాంక్ రుణాలు పొందేందుకు నానా అగచాట్లూ పడుతున్నారు. లే అవుట్ వేసే ముందు భూమిని వ్యవసాయేతర భూమిగా రెవెన్యూ అధికారుల వద్ద మార్పు (కన్వర్షన్) చేయాలి. అయితే, ఈ ప్రక్రియ దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. కన్వర్షన్ లేకుండానే లే అవుట్ వెలుస్తోంది. లే అవుట్లో అంతర్గత రహదారులు 30 అడుగులు ఉండాలి. కానీ, 15 నుంచి 20 అడుగుల రోడ్లు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. సామాజిక అవసరాలకు (పార్క్, కమ్యూనిటీ హాల్ వంటి వాటికి 10 శాతం స్థలాన్ని ఆ గ్రామ పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయించాలి. క్షేత్ర స్థాయిలో ఇవేమీ అమలు కావడం లేదు. 40 శాతం స్థలం పోతే తమకేమీ మిగలదన్న ఉద్దేశంతో రియల్టర్లు అనధికారికంగా విక్రయించేసి సొమ్ము చేసుకుంటున్నారు. -
21 కిలోల గంజాయి స్వాధీనం
ఫ ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ఫ కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన ఘటనలోనూ నిందితులు వీరే దేవరపల్లి: యర్నగూడెం గ్రామ శివారులో 16వ నంబర్ జాతీయ రహదారి సమీపంలోని పాత బ్రాందీ షాపు వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.2 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం సీఐ బి.నాగేశ్వర్ నాయక్ విలేకర్లకు తెలిపారు. గత నెల 31వ తేదీ ఉదయం కొందరు రెండు మోటారు సైకిళ్లపై రెండు బ్యాగుల్లో గంజాయిని తీసుకువచ్చారనే పక్కా సమాచారంతో ఎస్సై పి.మనోహర్ సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 21 కిలోల గంజాయి, రెండు మోటారు సైకిళ్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన పెద్దపారుపూడి మండలం కొర్నిపాడుకు చెందిన మోచర్ల హేమంత్ కుమార్, పెనమలూరు మండలం తాడిగడపలోని శ్రీనగర్కట్టకు చెందిన చామనపూడి చరణ్ దాస్ (చరణ్)ను అరెస్ట్ చేశారు. ప్రాథమిక దర్యాప్తులో వీరిద్దరూ గత నెల 31న ఉదయం యర్నగూడెం సమీపంలో హైవే మొబైల్ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావుపై కత్తితో దాడి చేసి పారిపోయిన కేసులో కూడా నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరిని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గత ఎన్నికల ముందు ఉద్యోగులకు కూటమి పెద్దలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ చిన్న, జీవీ సూరిబాబు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద శుక్రవారం వారు మాట్లాడుతూ, అధికారంలోకి రాగానే మెరుగైన పీఆర్సీ, బకాయిలు వెంటనే విడుదల చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారని అన్నారు. ఆ మాట తప్పినందున రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఏపీ జేఏసీ – అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఐక్య కార్యాచరణ ఉద్యమాలు చేస్తున్నారని చెప్పారు. అటువంటి నాయకుడిపై వీఆర్ఓ సంఘం నాయకుడు భూపతిరాజు రవీంద్రరాజు చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. న్యాయబద్ధంగా ఉద్యమాలు చేస్తూంటే మద్దతుగా ఉండకపోగా ప్రభుత్వనికి అనుకూలంగా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా న్యాయబద్ధమైన డిమాండ్లతో చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇచ్చి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఉద్యోగులతో పాటు వీఆర్ఓలు కూడా 15 వేల మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించి, వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, జిల్లా జేఏసీ వైస్ చైర్మన్ కె.శ్రీనివాస్, నాయకులు కాయల సత్యనారాయణ, నున్న సత్యనారాయణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కె.చిన్నారావు పాల్గొన్నారు. పెద్దపులి రీ ఎంట్రీ! గంగవరం: గత ఆరు నెలలుగా ఉమ్మడి తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో సంచరిస్తున్న పెద్దపులి పోలవరం జిల్లా గంగవరం మండలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. దొరమామిడి, పాత కొత్తాడ అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం పులి పాదముద్రలను చూసినట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీనిపై అడ్డతీగల సబ్–డీఎఫ్ఓ జేవీ సుబ్బారెడ్డిని సంప్రదించగా.. జిల్లాలోకి పులి ప్రవేశించిందని, ప్రస్తుతం రేడియో ట్రాకింగ్ పని చేయడం లేదని చెప్పారు.జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు రంపచోడవరం: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్ప గ్రామంలో క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల వల్ల గిరిజన బాలిక మడివి జమున మరణించడం, కొంత మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘానికి తాను శుక్రవారం ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన గ్రామాల్లో కొన్ని మలేరియా కేసులు నమోదైన తర్వాత ముందు జాగ్రత్త చర్యగా క్లోరోక్విన్ మాత్రలను పంపిణీ చేయడం చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వైద్యుల బృందం సలహా ఇచ్చే వరకూ ఈ ప్రక్రియను నిలిపివేయాలని, వ్యక్తిగతంగా పరీక్షలు నిర్వహించకుండా ముందస్తు క్లోరోక్విన్ మాత్రలు ఇవ్వకూడదని, ముందు జాగ్రత్త చర్యగా ఏజెన్సీలో ఈ మాత్రల వాడకంపై నిర్ణయం తీసుకోవడానికి నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడిని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశానని బాలు అక్కిస తెలిపారు. కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలి అమలాపురం టౌన్: ఈ నెల 9న అంబాజీపేట పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కోనసీమ రైల్వే ప్రాజెక్ట్పై స్పష్టమైన ప్రకటన చేయాలని కోనసీమ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ రైల్వే లైన్కు 25 ఏళ్ల కిందట అమలాపురంలో శంకుస్థాపన చేసిన ప్రాంతంలో జేఏసీ ప్రతినిధులు శుక్రవారం సమావేశమై, తమ డిమాండ్లపై నినాదాలు చేశారు. జేఏసీ కన్వీనర్ బండారు రామ్మోహనరావు మాట్లాడుతూ, కోనసీమ రైల్వే లైన్కు శంకస్థాపన జరిగి రెండున్నర దశాబ్దాలు గడుస్తున్నా పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణం, భూసేకరణపై సీఎం చంద్రబాబుతో పాటు కోనసీమ ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు. జేఏసీ ప్రతినిధులు డాక్టర్ రాయుడు శ్రీరామచంద్రమూర్తి, కరాటం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలు ఎరవేసి.. లక్షలు కాజేసి..
ఫ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం ఫ రూ.44,30,100, పది కాసుల బంగారం వసూలు ఫ కపిలేశ్వరపురం మండలం టేకిలో ఘటన ఫ అంగర పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు కపిలేశ్వరపురం: భర్తను కోల్పోయిన ఆపదలో ఉన్న మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పాడో మోసగాడు. ఆమెతో పాటు ఆమె మరిదికి సైతం ఆశ చూపి రూ.44,30,100, పది కాసుల బంగారు ఆభరణాలను కాజేశాడు. అంగర ఎస్సై జి.హరీష్ కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. 2022లో గుండె పోటు కారణంగా భర్తను కోల్పోయిన ఓ మహిళ తన పుట్టిల్లు టేకిలో ఉంటున్నారు. పింఛను కోసం దరఖాస్తు చేసుకునేందుకు గ్రామ సచివాలయానికి వెళ్లినప్పుడు అదే గ్రామానికి చెందిన గన్ని శ్రీనివాస్ ఆమెకు పరిచయమయ్యాడు. పింఛను మంజూరు కోసం హౌస్ హోల్డ్ మ్యాప్లో నుంచి ఆమె భర్త పేరును తొలగించేందుకు రూ.10 వేలు తీసుకుని మోసగించాడు. వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగం ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ చూపాడు. ఆ ఉద్యోగానికి డిగ్రీ సర్టిఫికెట్ చేయించేందుకంటూ ఆమె వద్ద 2025 మార్చి 21న కొంత నగదు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించే ప్రక్రియలో కదలిక వచ్చిందంటూ 2025 మార్చిలో పలు విడతలుగా మరికొంత వసూలు చేశాడు. అనంతరం వెల్ఫేర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని రికమెండేషన్ కారణంగా వేరే వాళ్లకు ఇచ్చేశారని నాటకం ఆడాడు. మండపేట మండల పరిషత్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టు ఇప్పిస్తానని, అందుకు రూ.36 లక్షలు ఖర్చు అవుతుందని, ఖర్చుకు తగ్గట్టే పెద్ద జీతం వస్తుందని నమ్మబలికాడు. బాధిత మహిళతో పాటు ఆమె మరిదికి కూడా ఉద్యోగం ఇప్పిస్తానంటూ అతడి వద్ద కూడా నగదు తీసుకున్నాడు. ఇద్దరి ఉద్యోగాలు కోసం అంటూ పలు విడతలుగా రూ.44,30,100, పది కాసుల బంగారం తీసుకున్నాడు. అయితే.. డబ్బులు, బంగారం ఇచ్చినా ఉద్యోగాలు రాకపోవడంతో విసిగిపోయిన బాధితులు ఈ ఏడాది ఆగస్టు 25న శ్రీనివాస్ను నిలదీశారు. చివరకు ఈ నెల 2న అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అక్షర శిల్పి.. విజ్ఞాన జ్యోతి
ఫ ఆచార్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫ రాజమహేంద్రవరంతో అనుబంధం ఫ రెండేళ్ల పాటు ఆర్ట్స్ కళాశాలలో విధులు ఫ నేడు ఆయన జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సీటీఆర్ఐ/కంబాలచెరువు(రాజమహేంద్రవరం): చిన్నారుల జీవితంలో అక్షర జ్యోతులు వెలిగించి, ఆ ప్రకాశంలో ఉన్నత శిఖరాలకు, గొప్ప పదవులకు, దేశం గర్వించే పౌరులుగా ఎదగడానికి దారి చూపే మార్గదర్శి ఉపాధ్యాయుడు. ఓనమాల నుంచి ఉన్నత చదువుల వరకు అనునిత్యం వెన్నంటి ఉండి, తప్పొప్పులను చెప్పి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగేలా ఉపదేశించే రుషి. అందుకే ఆచార్య దేవోభవ అంటూ గురువుకు మన పెద్దలు అత్యంత ముఖ్యమైన స్థానం ఇచ్చారు. ఏటా సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటాం. ఈ సందర్భంగా ఆచార్యుడి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్తో మన అనుబంధం గురించి తెలుసుకుందాం. తమిళనాడులో జననం ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త, మేధావి, భారత రాష్ట్రపతిగా సేవలు అందించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో జన్మించారు. ఆయన పుట్టిన రోజును ఏటా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. దేశంలోనే ప్రముఖ వ్యక్తుల్లో ఒకరైన ఆయనకు రాజమహేంద్రవరంతో ఎంతో గొప్ప అనుబంధం ఉంది. నగరంలో ఆయన నివసించింది కేవలం సుమారు 18 నెలలు మాత్రమే అయినా, ఆయన హృదయంలో రాజమహేంద్రవరం జ్ఞాపకాలు చివరి వరకూ పదిలంగానే ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి సందర్శకులు ఎవరు ఆయనను కలసినా, ఈ నగరం గురించి గుచ్చి గుచ్చి అడిగే వారని చెప్పారు. రాధాకృష్ణన్ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి పదోన్నతిపై రాజమహేంద్రవరానికి వచ్చి, ఆర్ట్స్ కళాశాలలో తత్వశాస్త్రం (ఫిలాసపి)లో ప్రొఫెసర్గా పనిచేశారు. గోదావరి ప్రశాంత వాతావరణం, ఇక్కడి సాంస్కృతిక వైభవం ఆయనను విశేషంగా ఆకట్టుకున్నాయి. తన ప్రసిద్ధ గ్రంథాలలో ఒకటైన ‘ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్‘ పుస్తకానికి సంబంధించిన ప్రధాన ఆలోచనలు, రచనలు రాజమహేంద్రవరంలో ఉన్నప్పుడే రూపుదిద్దుకున్నాయని ఆయన తన గ్రంథంలో వివరించారు. మా అదృష్టం సర్వేపల్లి రాధాకృష్ణన్ 1917–19లో రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా సేవలందించారు. ఆయన పనిచేసిన కళాశాలలోనే మేమూ విధులు నిర్వర్తించడం ఎంతో గర్వకారణం. రాధాకృష్ణన్ వంటి మహనీయుల వారసత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాం. – డాక్టర్ రామచంద్ర ఆర్కే, ప్రిన్సిపాల్, ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి) దిక్సూచి ఉపాధ్యాయుడే విద్యార్థుల ప్రగతికి బంగారు బాటలు వేసేవాడు ఉపాధ్యాయుడు. తల్లితండ్రుల తర్వాత ఉపాధ్యాయునికే ప్రాధాన్యత, విద్యార్థులకు అక్షరాలు నేర్పడమే కాకుండా నడవడిక, నడత నేర్పే దిక్సూచి ఉపాధ్యాయుడు. – వి.అన్నపూర్ణ, ప్రిన్సిపాల్, ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాల వెలకట్టలేనిది గురువు స్థానం వెలకట్టలేనిది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అందుకు ఉదాహరణ. ఆయన పాఠాలను జీవితానికి ముడిపెట్టి చెప్పేవారు కాబట్టే విద్యార్థులు ఎంతో అభిమానించేవారు. – రాజనాల రాజేశ్వరి, సంస్కృత అధ్యాపకురాలు, ఎస్కేఆర్ మహిళా డిగ్రీ కళాశాల చరిత్ర విస్మరించిన సత్యం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1917– 19 మధ్య కాలంలో ఆర్ట్స్ కళాశాలలో ఫిలాసఫీ బోధించారు. ఆ రోజు ల్లో ఈ కళాశాల నేటి గూడ్స్షెడ్కు ఎదురుగా ఉండేది. అక్కడ నుంచి ప్రస్తుత ప్రాంగణానికి మారాక, అక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాలగా మిగిలింది. రాధాకృష్ణన్ టి.నగర్లోని కొక్కొండ వారి వీధిలోని అరిపిరా ల పాపారావు పంతులు గారి ఇంటిలో నెలకు రూ.15 అద్దెతో నివసించేవారు. వసురాయకవితో గోదావరీ తీరంలో మెట్లపై కూర్చుని అనేక విషయాలు చర్చించుకునేవారు. అయితే ఆయన గురించి వెలువడిన అనేక గ్రంథాల్లో రాజమహేంద్రవరంలో నివసించిన విషయాన్ని నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం మన దురదృష్టకరం. తెలుగు అకాడమీ వారి తెలుగు వెలుగులు పుస్తకంలో కూడా ఆయన మీద ప్రచురించిన వ్యాసంలో ఈ ప్ర స్తావన లేదు. ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు దివంగత వై ఎస్ నరసింహారావు మాత్రం తన స్వీయచరిత్ర ‘నరసింహావలోకనం’లో ఈ అంశాలను పేర్కొన్నారు. ఆచార్య రత్నం సర్వేపల్లి రాధాకృష్ణన్ను అందరూ ఆచార్య రత్నం అని గౌరవంగా పిలిచేవారు. ఆయన బోధనా శైలికి విద్యార్థులు ముగ్ధులయ్యేవారు. సంస్కృతం, ఆంగ్ల భాషల్లో ఆయనకున్న పట్టు, భావాలను సరళంగా వివరించే విధానం వల్ల కాలేజీలో అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యాపకుడిగా పేరుగాంచారు. రాజమహేంద్రవరం నుంచి మైసూర్ యూనివర్సిటీకి బదిలీపై వెళ్లే సమయంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. -
కాపాడితేనే అభ్యున్నతి
ఫ పాడి పశువులను జాగ్రత్తగా సంరక్షించాలి ఫ యాజమాన్య పద్ధతులతో పశుగణాభివృద్ధి ఆలమూరు: పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సమతుల్య పోషకాహారాన్ని అందించడం, సమీకృత దాణాను అందుబాటులో ఉంచడం, యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా పశుగణం దినదినాభివృద్ధి చెందుతుంది. పశువులకు దూడలు జన్మించిన నాటి నుంచి యుక్త వయసుకు వచ్చి సంపర్కం జరిగి చూడి కట్టే వరకూ పాడి రైతులు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మేరకు రైతులకు జిల్లా పశుసంవర్థక శాఖ డీడీ ఎల్.అనిత పలు సూచనలు చేశారు. సకాలంలో చూడి పరీక్షలు గేదె ఈనిన మూడు నుంచి నాలుగు నెలల లోపు చూడి కట్టించడం ద్వారా పశువు వట్టిపోయే లోపు మళ్లీ ఈతకు వచ్చి పాల దిగుబడినిస్తుంది. ఈపక్రియ వల్ల పశువు వట్టిపోయే కాలం అసాధారణంగా తగ్గుతుంది. దేశవాళీ పశువుల కంటే సంకర జాతి పశువులు త్వరితగతిన యుక్త వయసుకు రావచ్చు. అలాగే యుక్త వయసుకు రాని పశువులను మేపడం రైతుకు భారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశువు యుక్త వయసుకు రాగానే చూడి కట్టించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీని వల్ల ప్రతి పాడి పశువు ఏడాదికి ఒక దూడకు జన్మనివ్వడంసులభతర మవుతుంది. యాజమాన్య పద్ధతులు u పెయ్యదూడ వయసు నుంచే పోషణ నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి. దూడలకు ముర్రి పాలు పట్టడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా పెయ్య దూడ త్వరితగతిన యుక్త వయసుకు చేరుకుని దూడలకు జన్మిస్తుంది. u కౌమార దశలో ఉన్న పశువులకు తప్పనిసరిగా సమతుల్య ఆహారాన్ని, ఖనిజ లవణ మిశ్రమాన్ని తగు మోతాదులో అందించాలి. u పశువుల్లో తరచూ సంభవించే వ్యాధుల నివారణకు సకాలంలో సరైన మోతాదులో నట్టల నివారణ మందులను అందించాలి. వ్యాధి నోరోధక టీకాలను కాలానుగుణంగా సకాలంలో అందించాలి. u పశువులకు అధిక వేడిమి, వేడి గాలుల నుంచి రక్షణ కల్పించాలి. యుక్త వయసుకు త్వరగా రాని పశువులను కొంత కాలం కోడె పశువులతో కలిపి ఉంచడం వల్ల సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. u యాజమాన్య పద్ధతులు ఫలించక పోయినా రైతులు నిరుత్సాహ పడకుండా తమ పశువులకు పశు వైద్యుడిచే పరీక్షలు చేయించి చికిత్సను అందిస్తే సత్ఫలితాలను సాధించవచ్చు. ఈతల మధ్య వ్యవధిని తగ్గించాలి పశువులు తొలి ఈత తర్వాత నిర్దిష్ట సమయంలో ఈతకు ఈతకు మధ్య వ్యవధిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన దూడలతో పాటు అధిక పాల దిగుబడిని ఆశించవచ్చు. సాధారణంగా ఉత్తమ జాతి ఆవు లేదా గేదె 300 రోజుల పాటు ఏకధాటిగా పాలిస్తుంది. అనంతరం ఆ పశువు పాల ఉత్పత్తి కొంచెం మందగించి చివరకు వట్టిపోయే దశకు చేరుకుంటుంది. దీని వల్ల పాడి పశువులకు ఈత మధ్య ఎడం తగ్గించడం లాభదాయకంగా ఉంటుంది. -
పరిశోధనా స్థానం భూమిని బదలాయించొద్దు
వైఎస్సార్ సీపీ రైతు విభాగం నేత జిన్నూరి బాబీ సాక్షి, అమలాపురం: అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సా ర్ ఉద్యాన పరిశోధన స్థానం (హెచ్ఆర్ఎస్) భూమిని ఎంఎస్ఎంఈ పార్కుకు బదలాయించవద్దని, కేవలం పరిశోధనలకే వినియోగించాలని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు (బాబీ) ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాసినట్టు అమలాపురంలో శుక్రవారం ఆయన మీడియాకు చెప్పారు. 1972లో స్థాపించిన ఈ పరిశోధన స్థానం 5 దశాబ్దాలుగా కొబ్బ రి అభివృద్ధిలో కీలకంగా ఉందన్నారు. హైబ్రీడ్ వంగడా ల మూల్యాంకనం, జెర్మ్ ప్లాజం పరిరక్షణ, చీడపీడల నివారణలో శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. గోదావరి జిల్లాల్లో దీనికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందన్నారు. నేషనల్ హార్టికల్చర్ బోర్డు రికార్డుల ప్రకారం ఇక్కడ 24 హెక్టార్లలో (59.3 ఎకరాలు) కొబ్బరి నర్సరీ ఉందని, ఇందులో ఉన్న మదర్ పామ్స్, బ్రీడింగ్ మెటీరియల్, దీర్ఘకాలిక ప్రయోగ తోటలు వెలకట్టలేని వనరులని తెలిపారు. పాత తోటల స్థానంలో అధిక దిగుబడినిచ్చే హైబ్రీడ్ మొక్కలకు డిమాండ్ పెరిగిందని, వీటి కోసం రైతులు ఎక్కువ కాలం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అందువల్ల సామర్థ్యాన్ని తగ్గించడం కాకుండా విస్తరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ఎంఈ పార్కు ముఖ్యమే అయినప్పటికీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేయాలని సూచించారు. హెచ్ఆర్ఎస్ భూమిని పూర్తిగా కాపాడాలని, రానున్న 25 నుంచి 50 ఏళ్లకు అవసరమైన భూమిపై శాసీ్త్రయ అంచనా వేయాలని, హైబ్రీడ్ ఉత్పత్తి పెంచి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా తీర్చిదిద్దాలని కోరారు. నిర్ణయం తీసుకునే ముందు వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఐసీఏఆర్ శాస్త్రవేత్తలు, రైతుల అభిప్రాయం తీసుకోవాలని సీఎంను బాబీ కోరారు. -
పొగాకు నాణ్యతకు ప్రాధాన్యమివ్వండి
దేవరపల్లి: పంట నియంత్రణ పాటిస్తూ పొగాకు నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత రైతులకు సూచించారు. వేలం కేంద్రం పరిధిలోని గోపాలపురం మండలం చెరుకుమిల్లిలో రైతు ఉండవల్లి రమేష్ బ్యారన్ల వద్ద శుక్రవారం నారుమడి నియంత్రణ, యాజమాన్య పద్ధతులు, పంట నియంత్రణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హేమస్మిత మాట్లాడుతూ నారుమడి పెంపకం, తెగు ళ్లు నివారణ, పురుగు మందుల వినియోగం, నారు విక్రయ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. బోర్డు నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పొందిన రైతులకు మాత్రమే నారు విక్రయించాలని ఆమె సూచించారు. నారుమడి వేసిన రైతులు తప్పనిసరిగా బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వర్కింగ్ క్యాపిటల్ పథకం కింద బ్యారన్కు రూ.50 వేల రుణ సదుపాయం, రైతు సంక్షేమ నిధి, ఎరువుల కోసం దరఖాస్తు చేసే విధానాన్ని వివరించారు. పొగాకు అధిక ఉత్పత్తి కారణంగా పంటను రైతులు మంచి ధరకు అమ్ముకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తమకు కేటాయించిన పరిమాణానికి లోబడి పంట సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రైతులు, బోర్డు సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ వరలక్ష్మీ నమోస్తుతే..
నిత్యం సత్యదేవుని నామం మార్మోగే రత్నగిరిపై.. వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామస్మరణ ప్రతిధ్వనించింది. శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా.. సత్యదేవుని సన్నిధిలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుని వార్షిక, నిత్య కల్యాణ మండపంతో పాటు 4, 5 నంబర్ల వ్రత మండపాల్లో ఈ వ్రతాలు జరిగాయి. వార్షిక కల్యాణ మండపంలో రెండు, మిగిలిన మూడు మండపాల్లో నాలుగు బ్యాచ్ల చొప్పున మొత్తం 12 బ్యాచ్లలో 12,230 మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. దీంతో, ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి మహిళలతో కిటకిటలాడింది. – అన్నవరం -
రూ.2.50 లక్షల విలువైన ఫోన్ల రికవరీ
రంపచోడవరం: సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్న, చోరీకి గురైన 20 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్ పోర్టల్ సాయంతో పోలీసులు రికవరీ చేశారు. వాటిని శుక్రవారం యజమానులకు అందజేశారు. సుమారు రూ.2.50 లక్షల విలువైన ఆ ఫోన్లను స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ ఓఎస్డీ జవాలి అల్ఫాన్సా, రంపచోడవరం డీఎస్పీ, ఎస్డీపీఓ పి.అష్రఫ్ అలీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరాలు, మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రంపచోడవరం సీఐ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్ను బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు. ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
పవన్పై అభిమానం వారి పాలిట శాపం
కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఇద్దరు జన సైనికులు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన అడపా మల్లేష్ బాబి (27) ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సాయంత్రం ముమ్మిడివరం నుంచి నిర్వహిస్తున్న మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొని మహిపాల చెరువు నుంచి సీహెచ్ గున్నేపల్లిలోని మిగిలిన జన సైనికులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రీవంగా గాయపడిన బాబిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ పవన్కల్యాణ్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. కోనసీమలో జరిగిన రెండు ఘటనలూ బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అభిమాన హీరో కోసం ఒకరిని చూసి ఒకరు చేస్తున్న వేడుకలు కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. చదవండి: డామిట్.. సభ అడ్డం తిరిగింది..! -
ఊరు నీరై.. బతుకు గోదారై!
సాక్షి ప్రతినిధి, కాకినాడ / రంపచోడవరం/దేవీపట్నం: ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని వారంతా కష్టాలను, అనుబంధాన్ని దిగమింగుకుని సర్వస్వం త్యాగం చేశారు. పుట్టిన గడ్డతో దశాబ్దాలుగా పెంచుకున్న మమకారాన్ని ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. ఇళ్లు, సారవంతమైన వ్యవసాయ భూములను అప్పగించి నిర్వాసిత కాలనీల్లో తలదాచుకున్నారు. ఇలా పోలవరం కోసం సర్వం కోల్పోయిన నిర్వాసితులు పునరావాస కాలనీల్లో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి స్థాయిలో అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక దయనీయంగా బతుకీడుస్తున్నారు. పొట్ట కూటి కోసం కూలీలుగా మారిపోయి కిలోమీటర్లు వెళ్లి వస్తున్నారు. పోలవరం జిల్లాలోని ప్రాజెక్టు నిర్వాసిత కాలనీల్లో గడుపుతున్న వారి దుస్థితి ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చింది. కాలనీల్లో కన్నీటి కష్టాలు.. పోలవరం పరిధిలోని గిరిజనులకు ఇందుకూరుపేట, పోతవరం, ఇందుకూరు, పెదబియ్యంపల్లి పరిసర ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మించారు. గిరిజనేతరులకు మైదాన ప్రాంతంలో నిర్మించారు. వీటిలో సుమారు 7,344 మందికి పైగా నివసిస్తున్నారు. ‘సాక్షి’ బృందం తాళ్లూరు, తెలిపేరు, కొండమొదలు, నాగళ్లపల్లి, దండంగి తదితర కాలనీలను పరిశీలించగా గోకవరం మినహా మిగిలిన అన్ని చోట్లా కుప్పలు తెప్పలుగా సమస్యలు బహిర్గతమయ్యాయి. » తాళ్లూరు గ్రామస్తులు రెండేళ్ల క్రితం ఊరు ఖాళీ చేసి నిర్వాసిత కాలనీకి తరలి వచ్చారు. వారి విన్నపాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మింంచిన కాలనీలో అడుగడుగునా నాసిరకం నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. » భూమి చదును చేయకుండా నిర్మాణాలు చేపట్టారు. ఇళ్లు 12 అడుగుల ఎత్తుకు బదులు 11 అడుగులతో సరిపెట్టేశారు. » మరుగుదొడ్లు 7 అడుగుల ఎత్తుకు గాను 5 అడుగుల్లోనే నిర్మించడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. » ఇళ్ల స్లాబ్లు వర్షపు నీటికి లీకవుతున్నాయి. వర్షం పడితే నీళ్లన్నీ ఇంట్లోకి చేరుతున్నాయి. దీనిపై నిర్వాసితులు గ్రామానికి వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ డైరెక్టర్లకు ఫిర్యాదు చేయడంతో తూతూమంత్రంగా స్లాబ్పై ఇసుక, చిప్స్ వేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో పరిస్థితి మళ్లీ యథాతథంగా మారింది. » మురుగు కాలువల నిర్మాణం దారుణంగా ఉంది. ఎత్తు పల్లాలు చూడకుండా కట్టేయడంతో ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వృద్ధి చెంది నిర్వాసితులు రోగాల బారిన పడుతున్నారు. » ఇళ్ల నిర్మాణానికి భూమి చదును చేయకుండానే రూ.40 లక్షల వరకూ నిధులు స్వాహా చేసినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. » గొందూరు, నేలకోట, నాగళ్లపల్లి, డి.రావిలంక, బోడుగూడెం నిర్వాసితులకు నిర్మించిన కాలనీల్లో మరుగుదొడ్లు నిర్మించలేదు. నిర్వాసితులే సొంతంగా బాత్రూములు కట్టుకున్నా డబ్బులు ఇవ్వలేదు. » కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బోర్లలో నీరు రావడం లేదు. కాలనీలకు సత్యసాయి పథకం కింత తాగునీరు సరఫరా చేస్తామన్న హామీని నెరవేర్చలేదు. నీటి కోసం నిర్వాసితులు పక్క గ్రామం పోతవరం వెళ్లాల్సి వస్తోంది.పొలం పోయి.. ఉపాధి దూరమైచిత్రంలో కనిపిస్తున్న కుర్ల రామిరెడ్డి పోలవరం నిర్వాసితుడు. దేవీపట్నం మండలం తాళ్లూరులో ఆయనకున్న అరెకరం భూమి, ఇల్లు ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవడంతో రెండేళ్ల క్రితం తాళ్లూరు పునరావాస కాలనీకి వచ్చారు. నిబంధనల మేరకు బాధితుడికి భూమికి బదులు భూమి ఇవ్వాలి. అది సాగుకు యోగ్యమైనదిగా ఉండాలి. కానీ, తామిచ్చిన భూమే తీసుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూమి కోల్పోడంతో నలుగురు ఉంటున్న కుటుంబాన్ని పోషించేందుకు 50 కి.మీకు పైగా ప్రయాణించి రాజమహేంద్రవరంలో కూలి పనులకు వెళ్లి బతుకుబండి లాగుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సహకరించక ఆయన కుమార్తె డిగ్రీ చదువు మధ్యలో ఆగిపోయింది. సాగు భూమి ఇవ్వాలని కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే లేడని రామిరెడ్డి వాపోతున్నాడు. తల్లి కుర్ల చెల్లాయమ్మకు రావాల్సిన ప్యాకేజీ సైతం అందలేదని చెబుతున్నాడు.అలాంటి భూములే ఇవ్వమంటున్నాం.. గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస కాలనీకి వచ్చాం. మా ఊరి రైతుల భూమి 30 ఎకరాల వరకూ పోలవరం ముంపులో పోయింది. ఇప్పటి వరకూ ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదు. సాగుకు పనికిరాని భూమి ఇస్తామంటే వద్దని చెప్పాం. మేం రెండు పంటలు పండే భూములు ఇచ్చాం. అలాంటి భూములే కావాలని అడుగుతున్నాం. ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలనీలు అధ్వానంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నాసిరకంగా నిర్మించారు. – పాములేటి శ్రీనివాస్రెడ్డి, తాళ్లూరు పునరావాస కాలనీ డీ–పట్టాకు పరిహారం ఏది? దండంగి, సీతారం, గంగంపాలెం గ్రామాల్లో 300 ఎకరాల డీ–పట్టా భూమి ఉంది. గ్రామాన్ని ఖాళీ చేసినా ఆ భూమికి ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. ఆ భూమి సాగు చేసుకునేందుకు వెళ్దామంటే చుట్టూ వరద నీరు ఉంటోంది. గ్రామాల్లో ఉపాధి లేక పనుల కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి. – సోదే వెంకన్నదొర, నాగళ్లపల్లి కాలనీపరిహారం ఇవ్వలేదు.. తెలిపేరు నుంచి 2019లో తాళ్లూరు కాలనీకి వచ్చాం. ఇక్కడ ఐదు మంది ఉంటున్నాం. ముగ్గురు పిల్లలున్నారు. మాకు ఇంతవరకూ పరిహారం ఇవ్వలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. ఉపాధి కోసం రాజమహేంద్రవరం, ఇందుకూరుపేట వెళ్లాల్సి వస్తోంది. – పుల్ల కాంతమ్మ, తాళ్లూరు కాలనీ నోటిఫై అయినా పరిహారం లేదు.. గంగన్నపాలెంలో రెండెకరాల డీ–పట్టా భూమి పోలవరం ముంపులో పోయింది. నోటిఫై చేసినా పరిహారం అందడం లేదు. అదేమని ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం లేదు. భూమి సాగు చేసుకుందామనుకుంటే ముంపులో ఉంది. భూమికి బదులు భూమి ఇస్తారా అంటే అదీ లేదు. పొట్టకూటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. – కోసి సోమన్నదొర, గంగంపాలెం41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో..పోలవరం ముంపు గ్రామాలు 172 పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన కుటుంబాలు 38,060ఇంకా పునరావాసం కల్పించాల్సినవి 20,799నిర్మించాల్సిన పునరావాస కాలనీలు 121నిర్మించిన కాలనీలు 26ఇంకా నిర్మించాల్సినవి 95 -
భక్తుల విరాళాలతో శిఖరం స్వర్ణమయం
● నిర్ణయించిన అన్నవరం ట్రస్ట్బోర్డు ● డొనేషన్ల కోసం స్కీం ఏర్పాటు అన్నవరం: రత్నగిరిపై వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయ విమాన గోపురానికి భక్తుల విరాళాలతో బంగారు తాపడం చేయించాలని దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) తీర్మానించింది. ఇందుకోసం డోనేషన్ స్కీం ప్రారంభించాలని నిర్ణయించింది. దేవస్థానం ట్రస్ట్బోర్డు చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన బుధవారం ట్రస్ట్బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించి తీర్మానించారు. సత్యదేవుని నూతన ఆలయం నిర్మించి 14 ఏళ్లు పూర్తి కావస్తుండగా విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుత దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ 2011లో దేవస్థానం ఈఓగా పనిచేసినపుడు స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆలయ నిర్మాణంలో అంతా గ్రానైట్ రాయినే వాడినప్పటికీ ఆలయ గోపురం మాత్రం స్వర్ణరేకు తాపడం చేయాలన్న ఆలోచనతో ఇటుకతో నిర్మించారు. 2024లో దేవస్థానం ఈఓగా కె.రామచంద్రమోహన్ ఆలయ శిఖరానికి స్వర్ణ రేకు తాపడం చేసేందుకు సుమారు 12 కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు. అప్పుడు కేజీ బంగారం రూ.60 లక్షలు ఉండగా అన్ని ఖర్చులు కలిపి సుమారు రూ.ఎనిమిది కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం బంగారం కేజీ రూ.1.60 కోట్లు ఉంది. దీంతో సుమారు రూ.20 కోట్లు అవుతుందని అంచనా. కాగా.. సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడంపై మే 16 వ తేదీన సాక్షి దినపత్రికలో ‘స్వర్ణం స్వప్నమేనా!’ శీర్షికతో వార్తా కథనం ప్రచురితమైంది. ఆ వార్త దేవదాయశాఖ ఉన్నతాధికారులలో చర్చనీయాంశమైంది. తాజాగా జరిగిన ట్రస్ట్బోర్డు సమావేశంలో భక్తుల విరాళాలతో సత్యదేవుని ఆలయ శిఖరం స్వర్ణ తాపడం చేయాలని నిర్ణయించడంతో మరలా దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇతర తీర్మానాలు ● నవంబర్ పదో తేదీ నుంచి ప్రారంభం కానున్న కార్తికమాసంలో సత్యదేవుని ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రూ.కోటి వ్యయంతో ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు. ఇందులో సత్యదేవుని తెప్పోత్సవం, గిరిప్రదక్షణ కొరకు చేపట్టాల్సిన ఏర్పాట్లు కోసం టెండర్లు పిలిచేందుకు రూపొందించిన అంచనాలను ఆమోదించారు. ● సత్రాల గదులలో మంచాలపై వేసేందుకు గాను వివిధ సైజుల బెడ్షీట్లు 1,500 కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. ● దేవస్థానానికి చెందిన రత్నగిరి మీద 0.5 ఎకరం, కొండ దిగువన ఎకరం మొత్తం 1.5 ఎకరాలను టూరిజం డిపార్ట్మెంట్కు 33 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు వచ్చిన ప్రతిపాదనను తిరస్కరిస్తూ తీర్మానం చేశారు. ● 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా రూ.63 లక్షలతో రత్నగిరి నుంచి కొండదిగువకు అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేసేందుకు తీర్మానించారు. ● దేవస్థానంలో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వైద్యసేవలు అందిస్తున్న సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పాండురంగారావుకు నెలకు రూ.50 వేల వేతనం చెల్లించేందుకు తీర్మానించారు. -
ఆర్టీసీ బస్సుల ఢీ
డ్రైవర్లకు గాయాలు, ప్రయాణికులు సురక్షితం తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని చొల్లంగి గొడౌన్ల వద్ద బుధవారం ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు కాకినాడ డిపో నుంచి అమలాపురం వెలుతున్న నాన్స్టాప్ బస్సు, అమలాపురం నుంచి కాకినాడ వస్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రెండు బస్సుల ముందుభాగాలు నుజ్జయ్యాయి. దీంతో ఇద్దరు డ్రైవర్లు నక్కా వెంకటరమణ, బాల నాగసత్య ఉమానాగేంద్రలకు గాయాలయ్యాయి. వీరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కోరంగి ఎస్ఐ పి.సత్యనారాయణ బృందం ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ 10 గ్రాముల బంగారు రూపులు, 30 గ్రాముల వెండి అపహరణ అమలాపురం టౌన్: పట్టణంలోని బుచ్చెమ్మ అగ్రహారంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలో చోరీ జరిగింది. అగ్రహారంలో నివసిస్తున్న కాలనాధభట్ల రామచంద్రమూర్తి తనకు ఎవరూ లేకపోవడంతో అతని ఇంటికి పక్కనే నివసిస్తున్న సోదరుడు కాలనాధభట్ల సాయిరామ్ ఇంటిలో ఉంటుంటాడు. కానీ ప్రతి రోజూ తన ఇంటికి నిత్య పూజా విధులకు వెళ్లి పూజ పూర్తయిన తరువాత ఇంటి తలుపులకు తాళం వేసి మళ్లీ సోదరుడి ఇంటికి వచ్చేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో తన ఇంటికి వెళ్లగా తాళం బద్దల కొట్టబడి ఇంటిలోని 10 గ్రాముల బంగారు రూపులు, 30 గ్రామల వెండి పూజా సామగ్రిని దొంగలు దోచుకున్నట్టు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.లక్ష వరకూ ఉంటుందని ఆ సోదరులు తెలిపారు. రామచంద్రమూర్తి సోదరుడు సాయిరామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. -
మళ్లీ వచ్చిన బెబ్బులి
దేవీపట్నం: అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన పెద్దపులి మళ్లీ దేవీపట్నానికి చేరింది. ఈ ఏడాది తొలకరి ఆరంభంలో పోలవరం జిల్లాలోని పాపికొండల అభయారణ్య ప్రాంతమైన దేవీపట్నం, పూడిపల్లి తదితర ప్రాంతాల్లో తిష్టవేసిన పెద్దపులి ఎట్టకేలకు జూన్లో గోదావరి దాటుకుని ఏలూరు జిల్లాలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి సుమారు రెండు నెలలకు పైబడి తెలంగాణ వరకూ సంచరించి ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చేరింది. రెండు రోజుల క్రితం పోలవరం ప్రాజెక్టు సమీపాన సంచరించిన పెద్దపులి మంగళవారం అర్ధరాత్రి సింగనపల్లి వద్ద గోదావరి దాటుకుని పోలవరం జిల్లాలోని దేవీపట్నం ఎగువ ప్రాంతానికి చేరింది. పెద్దపులి మెడకు అమర్చిన రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా పులి గమనాన్ని పరిశీలిస్తున్న అటవీ అధికారులు దేవీపట్నం పరిసర గ్రామాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని ఇందుకూరు అటవీ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో అభయారణ్యంలో సంచరించిన పెద్ద పులి ఒక దూడను హతమార్చి, మరో దూడను గాయపరచిందని పోలవరం అటవీ శాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ తెలిపారు. మహిళా సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలి సామర్లకోట: మహిళా సంఘాలు ఆర్థిక ప్రగతి సాధించాలని మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కె.శైలజ అన్నారు. స్థానిక మెప్మా కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి అర్బన్ మహిళా సమాఖ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళా సంఘాలు చేస్తున్న పొదుపు ఆధారంగా వారికి బ్యాంకు రుణాలు అందజేయడంతో పాటు వాటిని సద్వినియోగం చేసుకొని వ్యాపారవేత్తలుగా రాణించేలా తయారు చేయాలని సూచించారు. డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం బ్రాండ్ను బలోపేతం చేయాలన్నారు. మహిళా సంఘాల తక్షణ ఆర్థిక అవసరాల కోసం సీ్త్రనిధిని ఉపయోగించుకోవాలని చెప్పారు. పురమిత్ర యాప్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించాలన్నారు. సాంకేతిక నిపుణుడు పి.రవిశంకర్, జిల్లా అర్బన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు డి.బుజ్జమ్మ కూడా మాట్లాడారు. సమీక్ష అనంతరం 11వ వార్డులోని భీమవరం మురికివాడలోని నవజ్యోతి సంఘ సమావేశానికి శైలజ హజరయ్యారు. పురమిత్ర యాప్ను పరిశీలించి, సభ్యులకు అవగాహన కల్పించారు. -
చినుకు పలకరింత.. పుడమి పులకరింత..
అంబాజీపేట: పొద్దెక్కినా భానుడు రాడేమని బయటకు వచ్చి చూసిన ప్రజలు వినీలాకాశంలో నీలి మబ్బుల చినుకు స్పర్శకు మురిసిపోయారు. ఒక్కసారిగా చినుకులల్లా భారీ వర్షంలోకి మారడంతో వారి సంతోషం అంతా ఇంతా కాదు. ఎల్నినో ప్రభావంతో వాన చినుకుకు కరువు వాచిన ప్రజలు బుధవారం 8 గంటల నుంచి కురిసిన భారీ వర్షానికి కొంత సేద తీరారు. కారు మబ్బులకు, భారీ వర్షానికి దారి కనిపించక వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. వర్షానికి వారపు సంతలో వ్యాపారులు, కొనుగోలుదారులు అసౌకర్యానికి గురయ్యారు. -
కాకినాడలో వ్యక్తి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సొంత ఇంట్లోనే ఎనిమిది కత్తి పోట్లకు గురికావడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇందిరా కాలనీలోని సెవెన్ హిల్స్ రోడ్డులో గండి గిరిధర్ (37) తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి తండ్రి బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం చేస్తూ విరమణ పొంది, కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. గిరిధర్కు భార్యతో నాలుగేళ్ల క్రితం విడాకులు అయ్యాయి. కాగా.. మంగళవారం గిరిధర్ తల్లి ద్రాక్షారామంలో బంధువుల ఇంటికి వెళ్లింది. రాత్రి గిరిధర్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. తల్లి బుధవారం ఉదయం 9 గంటల సమయంలో కుమారుడికి ఫోన్ చేసింది. స్పందించక పోవడంతో పక్కింటి వారికి చేసి ఫోన్ ఇమ్మని కోరింది. పక్కింటి వ్యక్తి ఉదయం తొమ్మిదే కదా అయింది, నిద్రలోనే ఉండి ఉంటాడు అని చెప్పేసరికి ఊరుకుంది. 11 గంటల సమయంలో మరో సారి కాల్ చేసినా గిరిధర్ స్పందించలేదు. దీంతో అదే పక్కింటి వ్యక్తికి చెబితే ఆయన కిటికీ తలుపు తీసి చూశాడు. గిరిధర్ మంచంపై రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించి కంగారు పడ్డాడు. తక్షణమే 112కి ఫోన్ చేసి పోలీసులకు, తల్లికి చెప్పాడు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు త్రీ టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించి పోస్ట్మార్టం నిర్వహించారు. యువతి కోసమేనా! గిరిధర్ హత్యకు ఓ యువతి నేపథ్యమే కారణమని తెలుస్తోంది. అతడికి స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు స్థానికంగా నివసిస్తుంటారు. మంగళవారం రాత్రి ఇంట్లో తల్లి లేదని గిరిధర్ స్నేహితులను ఇద్దరినీ పిలిపించి మద్యం తాగాడు. కాసేపటికి గిరిధర్ ఫోన్లో ఇద్దరిలో ఓ వ్యక్తి తన ప్రియురాలితో చనువుగా ఉన్న ఫొటోలు చూశా డు. తనతో ఎందుకు అలా ఉన్నావని ఆగ్రహంతో ఊడిపోయాడు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర పెనుగులాట జరిగింది. దీంతో మరో స్నేహితుడు కూడా గిరిధర్పై దాడికి దిగాడు. ఇద్దరి దాడిలో బాధితుడు నేలకు ఒరగగా అక్కడే ఉన్న చాకుతో పొడిచి ఇంటి వెనుక తలుపు నుంచి బయటికి వచ్చి గడియపెట్టి వెళ్లిపోయారు. అనుమానితులు ఇద్దరూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా త్రీ టౌన్ పోలీస్స్టేషన్లో విచారిస్తున్నారు. హత్య మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో జరిగితే, బుధవారం ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. -
సమస్యలు పరిష్కరించకుంటే
ఉద్యమమే● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సభ్యులు ● డీఆర్వోకు వినతిపత్రం అందజేత బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా కార్యవర్గ సభ్యులు హెచ్చరించారు. ఏపీ జేఏసీ అమరావతి పిలుపు మేరకు బుధవారం నాయకులు డీఆర్వోను కలిసి వినతి పత్రం అందజేశారు. తమ 29 డిమాడ్లను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు ఇవ్వాలని, ధరలు పెంపునకు అనుగుణంగా పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, పీఆర్సీ కమిషన్ను పునరుద్ధరించాలని, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలను పోషించుకోవడానికి అవసరమైన జీత భత్యాలు పెంపు చేయాలన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులను వినియోగంలోకి తేవాలన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈ నెల 3, 5 తేదీల్లో కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఉద్యోగులు తరలి రావాలన్నారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి కాకినాడ జిల్లా చైర్మన్ పితాని త్రినాథ్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో దుండగుడు
వైఎస్సార్ విగ్రహానికి నిప్పుపెట్టిన కేసుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగుడిని మూడో పట్టణ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్ విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటనపై స్థానిక వైఎస్సార్ సీపీ శ్రేణులు విగ్రహం వద్దకు చేరుకుని నినాదాలు చేసి, నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి విగ్రహానికి నిప్పు పెట్టింది ఆల్కాట్గార్డెన్స్ సమీపంలోని ఉల్లితోట వీధికి చెందిన టైల్స్ పనిచేసే గిరాడ చంద్రశేఖర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ భరత్ ఫిర్యాదు జరిగిన సంఘటనపై మాజీ ఎంపీ భరత్రామ్ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతికి ముందురోజు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంటే ఎవరో కావాలనే చేశారని తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అడుగడునా సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతమైన కోటగుమ్మం వద్ద ఇటువంటి చర్యకు పాల్పడ్డ ఘటనపై తమ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారని తెలిపారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఇకపై మహానీయుల విగ్రహాల జోలికి రాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
మేడపై జారిపడి విద్యార్థినికి గాయాలు
చెరువులో పడి వ్యక్తి మృతి కొత్తపల్లి: ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ చెరువులో పడి మృతి చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వాకతిప్ప గ్రామానికి చెందిన వాసంశెట్టి వెంకటరమణ (55) విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఉన్న చెరువులో దిగిన గేదెలను బయటకు కొట్టేందుకు గట్టు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గట్టు జారిపోవడంతో చెరువులో పడిపోయాడు. స్థానికులు బయటకు తీసి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం 108లో పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రంపచోడవరం: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థిని మేడపై కాలు జారిపడిపోవడంతో గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుకుల బాలికల కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నైని పాప అనే బాలిక సాయంత్రం కళాశాల తరగతులు ముగిసిన తరువాత కళాశాల భవనం మేడపైకి వెళ్లి అక్కడ కాలు జారి పడిపోయింది. దీంతో కళాశాల సిబ్బంది వెంటనే ఆమెను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికి కాలు విరిగిందని వైద్యులు నిర్థారించారు. ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను జేసీ ప్రశాంత్కుమార్ పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. -
కరాటే మాస్టర్ రమణకు గిన్నిస్ రికార్డు
జగ్గంపేట: స్థానిక కరాటే మాస్టర్ టీవీవీ రమణ గిన్నిస్ బుక్లో చోటు సాధించారు. బ్లాక్ బెల్ట్ 6డాన్గా వున్న రమణ ఆ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిర్ణీత వ్యవధిలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. 2026 ఏప్రిల్ 26న హైదరాబాద్లో ఆ సంస్థకు రిజిస్టర్ చేసుకున్న అనంతరం వారు ఆయన నైపుణ్య ప్రదర్శనను తిలకించారు. ఈ మేరకు ఈ నెల ఒకటో తేదీన ఖమ్మంలో ఖమ్మం కలెక్టర్ దివాకర్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి! ప్రత్తిపాడు: స్థానిక జాతీయ రహదారిపై లారీ నిలిపి, నిద్రపోయిన డ్రైవర్ మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పోలీసులు తెలిపిన కథనం మేరకు పరవాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ట్యాంకర్ను తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా రాయనగూడేనికి చెందిన డ్రైవర్ గుండు లింగరాజు (40) స్థానిక జాతీయ రహదారిపై ధర్మవరం పెట్రోల్ బంకు వద్ద నిలిపి క్యాబిన్లో నిద్రపోయాడు. ట్యాంకర్ వెనుక వచ్చే మరో లారీ డ్రైవర్ వచ్చి చూసేసరికి లింగరాజు మృతి చెంది ఉన్నాడు. లారీ డ్రైవర్ సమాచారం మేరకు లింగరాజు భార్య నాగలక్ష్మి సాయంత్రం ప్రత్తిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిద్రలో గుండెపోటు రావడంతో అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృత దేహాన్ని శవపరీక్షకై స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఏసుబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గోల్షాట్ బాల్ చాంపియన్ కేరీకి ఘన స్వాగతం
ఆలమూరు: అంతర్జాతీయ గోల్షాట్ బాల్ ఛాంపియన్షిప్ (2026) పోటీలకు సంబంధించి ఇటీవల భూటాన్తో జరిగిన పోటీల్లో ఇండియా విజయం సాధించింది. ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించి తన సహచర జట్టు క్రీడాకారులతో కలిసి అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి దేశానికి స్వర్ణ పతకం సాధనలో కీలకపాత్ర పోషించిన ఉండ్రాసపు విలియం కేరీ స్వగ్రామం ఆలమూరు మండలం మడికికి బుధవారం చేరుకున్నారు. ఆయనకు గ్రామస్తులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం స్థానిక బస్టాండు సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన సభలో ఆయనను సత్కరించారు. కేరిని తీర్చిదిద్దిన తల్లిదండ్రులు సుందర విజయం, రాజమణిని అభినందించారు. -
కిళ్లీ బడ్డీని ఢీకొన్న కారు
మద్యం మత్తులో పవన్ కల్యాణ్ అభిమానుల వీరంగం అంబాజీపేట: మద్యం మత్తులో కారు నడుపుతున్న ఇద్దరు యువకులు గంగలకుర్రు అగ్రహారం పెదపాలెం వద్ద కిళ్లీబడ్డిని ఢీ కొట్టారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని కొందరు యువకులు కారులో మద్యం తాగి, కేరింతలు కొడుతూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ పెదపాలేనికి చెందిన మట్టపర్తి శ్రీనివాస్ కిళ్లీ బడ్డీని బలంగా ఢీ కొట్టారన్నారు. బడ్డీని ఢీ కొటిన వెంటనే ఆ యువకులు అక్కడ నుంచి పరారయ్యారన్నారు. కారులో మద్యం సీసాలు ఉన్నాయని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. -
కొబ్బరితో ఆర్థిక రక్షణ
● ఉపకులపతి డాక్టర్ ధనంజయరావు ● ఘనంగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం అంబాజీపేట: వాతావరణ మార్పులు, మార్కెట్ ఒడిదొడుకులు ఎదురైనా ఆహార, ఇంధన, ఆర్థిక రక్షణ కల్పించే ఏకైక పంట కొబ్బరి సాగు అని ఉప కులపతి డాక్టర్ కె.ధనంజయరావు అన్నారు. అంబాజీపేట డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని కేంద్రం అధిపతి పి.అశోక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. సాగులో శాసీ్త్రయ పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనంజయరావు మాట్లాడుతూ ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారతదేశ 31.24 శాతం వాటాతో ఉత్పాదకతలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో కొనసాగుతోందన్నారు. భూమి వినియోగ సామర్థ్యం హైబ్రిడ్ వంగడాల ప్రాముఖ్యత ప్రాసెసింగ్ సాంకేతికాలపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. పరిశోధన సంచాలకురాలు డాక్టర్ ఎస్.సూర్యకుమారి మాట్లాడుతూ ఎల్నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కొబ్బరి నీటి ఆవశ్యకతను, వాతావరణ మార్పులను తట్టుకునే సరికొత్త రకాలను నాటుకోవాలన్నారు. సహాయ సంచాలకుడు డాక్టర్ డి.వెంకటస్వామి మాట్లాడుతూ వర్జిన్ కొబ్బరి నూనె, కొబ్బరి పాలు వంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ప్లాంట్ పేథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ బి.నీరజ కొబ్బరిలో తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యంపై అవగాహన కల్పించారు. డాక్టర్ ఎం.జానకి, ఏంటమాలజీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ అనూష తదితరులు సాగుపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారులు దిలీప్ కుమార్, జి.కోటేశ్వరరావు, అభ్యుదయ రైతులు ముత్యాల జమీల్, ఉప్పు గంటి భాస్కరరావు, వరప్రసాద రావు, హార్టీ కల్చర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు. -
పవన్పై అభిమానం వారి పాలిట శాపం
చికిత్స పొందుతూ యువకుడి మృతి ముమ్మిడివరం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లలో భాగంగా వేర్వేరు ఘటనల్లో మృతి చెందిన ఇద్దరు జన సైనికులు వారి కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చారు. ముమ్మిడివరం మండలం సీహెచ్ గున్నేపల్లి సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన అడపా మల్లేష్ బాబి (27) ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సాయంత్రం ముమ్మిడివరం నుంచి నిర్వహిస్తున్న మోటారు సైకిల్ ర్యాలీలో పాల్గొని మహిపాల చెరువు నుంచి సీహెచ్ గున్నేపల్లిలోని మిగిలిన జన సైనికులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. త్రీవంగా గాయపడిన బాబిని అమలాపురం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమలాపురం నియోజకవర్గం బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ పవన్కల్యాణ్ ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. కోనసీమలో జరిగిన రెండు ఘటనలూ బాధిత కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. అభిమాన హీరో కోసం ఒకరిని చూసి ఒకరు చేస్తున్న వేడుకలు కన్నవారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. -
నిమ్మదిగా పదింతలై..
దిగుబడులపై ఎల్నినో ప్రభావం నిమ్మ దిగుబడులపై ఈ ఏడాది ఎల్నినో ప్రభావం పడింది. వర్షాకాలం ప్రారంభమై దాదాపు మూడు నెలలు కావొస్తున్నా, కనీస వర్షపాతం నమోదు కాలేదు. దీంతో నీటి తడులు అందక నిమ్మతోటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉంటుంది. ఈ సీజన్లో కాయలు కొనేవారు లేక చెట్ల కిందే నిమ్మపండ్లు పడి ఉంటాయి. ఈ ఏడాది కాపులు లేకపోవడంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. కాయ సైజు పెరగడం లేదు. పిందె దశలోనే కాయలు గిడసబారిపోతున్నాయి. పూతలు దెబ్బతినడం వల్ల కాపులు నిలబడడంలేదు. మంగు, గజ్జి తెగులు, బంక వంటి చీడపీడలు తోటలకు ఎక్కువగా ఆశిస్తున్నాయి. ఫ నిమ్మకాయల ధర కిలో రూ.100 ఫ గత నెలలో కిలో రూ.8 నుంచి రూ.10 ఫ తగ్గిన దిగుబడితో రైతన్న దిగాలు దేవరపల్లి: నిమ్మకు ‘పంట’గొచ్చింది.. మార్కెట్లో ధర అదరగొడుతోంది. ధర బాగున్నా దిగుబడులు లేక రైతులు నిరాశ చెందుతున్నారు. ఒకపక్క మార్కెట్లో కాయల ధర రోజురోజుకు పెరుగుతుండగా, దీనికి తగ్గట్టుగా తోటల్లో కాపులు లేకపోవడంతో పెట్టుబడులు రావడం కష్టమని రైతులు వాపోతున్నారు. కౌలు రైతులకు పంట గిట్టుబాటు కాని పరిస్థితి. మంగళవారం యాదవోలు నిమ్మ మార్కెట్లో కిలో కాయలు రూ.100 పలికాయి. కిలోకు కాయ పరిమాణాన్ని బట్టి 25 నుంచి 30 కాయలు తూగుతున్నాయి. రెండు వారాల క్రితం కిలో రూ. 60 నుంచి రూ.70 పలకగా, ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 90 నుంచి రూ.100 పలుకుతున్నట్టు రైతులు తెలిపారు. జూలైలో కిలో కాయలు రూ.10 నుంచి రూ.15 రాగా, ఈ నెల నుంచి మార్కెట్లో ధర క్రమేపీ పుంజుకుని రూ.100కు చేరుకుంది. కొవ్వూరు డివిజన్లోని మెట్ట ప్రాంతంలో దేవరపల్లి మండలం యాదవోలు నిమ్మ మార్కెట్ రైతులకు అనుకూలంగా ఉంటుంది. చుట్టపక్కల గ్రామాల నుంచి రైతులు ఏ రోజు కోసిన కాయలు ఆ రోజు మార్కెట్కు తీసుకు వచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ రైతులే వ్యాపారులుగా మారి తోటి రైతుల వద్ద నుంచి కాయలు కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. సాధారణంగా మార్కెట్లో కాయలు అమ్మినందుకు వ్యాపారులు కమీషన్ వసూలు చేస్తారు. అయితే యాదవోలులో రైతుల మార్కెట్ కావడంతో ఎటువంటి కమీషన్ తీసుకోకుండా కాయలు కొనుగోలు చేస్తారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నిమ్మకాయల సీజన్ ఉంటుంది. వేసవిలో పండిన పంటకు రైతులకు మంచి ఆదాయం వస్తుంది. వర్షాకాలం, సీతాకాలంలో నిమ్మ వినియోగం తక్కువగా ఉంటుంది. దీంతో ఎగుమతులు లేక అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ రెండు సీజన్లలో కిలో కాయలు రూ. 8 నుంచి 10 పలుకుతాయి. దీంతో కాయలు కోత కూలి డబ్బులు రాక రైతులు చెట్ల కిందనే కాయలు వదిలివేస్తారు. 8,560 ఎకరాల్లో సాగు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 8,560 ఎకరాల్లో నిమ్మ సాగు జరుగుతుంది. గోపాలపురం నియోజకవర్గంలో దాదాపు 2,600 ఎకరాల్లో పంట సాగులో ఉంది. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో నిమ్మ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. గోపాలపురం, నల్లజర్ల, నిడదవోలు మండలాల్లో కూడా రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ ప్రాంతాల్లో సాగు ఉంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి యాదవోలు మార్కెట్ నుంచి ఒడిశా, కోల్కతా, బీహార్, ఉత్తరప్రదేశ్, నేపాల్, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, రాజమహేంద్రవరం ప్రాంతాలకు నిమ్మకాయలు ఎగుమతి జరుగుతుంది. సీజన్లో కాపులు బాగుంటే రోజుకు 100 నుంచి 150 టన్నుల వరకు నిమ్మకాయలు ఎగుమతి జరుగుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రస్తుతం ఇక్కడ మార్కెట్ నుంచి రాజమహేంద్రవరం, అనకాపల్లి, యలమంచిలి, వైజాగ్, నర్సీపట్నం, కాకినాడ, తణుకు, భీమవరం, సత్తుపల్లి, ఖమ్మం ప్రాంతాలకు ఎగుమతి జరుగుతున్నాయి. మార్కెట్ బాగుంది నిమ్మ మార్కెట్ బాగుంది. నెల రోజుల క్రితం కిలో నిమ్మకాయలు రూ.8 ధర ఉండగా, ప్రస్తుతం రూ. 90 నుంచి 100 ధర పలుకుతుంది. సాధారణంగా వర్షాకాలంలో నిమ్మ దిగుబడి ఎక్కువగా ఉండి, కిలో రూ. 8 నుంచి 10 ధర ఉంటుంది. ఈ ఏడాది వర్షాలు లేక చిన్నపిందె ఎదగడం లేదు. మార్కెట్ బాగున్నా, కాయలు లేవు. ఈ రోజుల్లో మార్కెట్కు 50 టన్నుల కాయలు వచ్చేవి. ప్రస్తుతం 10నుంచి 15 టన్నుల కాయలు వస్తున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నిమ్మ వినియోగం పెరిగింది. –అనిశెట్టి సూర్యచంద్రం, రైతు, వ్యాపారి, యాదవోలు, దేవరపల్లి మండలం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పింఛన్ సొమ్ముతో పారిపోలేదు
అమలాపురం రూరల్: పింఛన్ సొమ్ముతో తాను పారిపోలేదని రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల పింఛన్ల పంపిణీకి రాలేకపోయినట్టు బండారులంక సచివాలయం –1 డిజిటల్ అసిస్టెంట్ శివశంకర్ అధికారులు బుధవారం లేఖ పంపించారు. మంగళవారం ఉదయం పెన్షన్ల పంపిణీకి యానాం నుంచి వస్తుండగా వాహన్ అదుపు తప్పి గాయాలయ్యాయని, ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందానని పేర్కొన్నారు. సెల్ఫోన్ డిస్ప్లే పోవడంతో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేకపోయానని, పెన్షన్ సొమ్ములు పంపే ప్రయత్నం చేసినా కుదరలేదని తెలిపారు. మా చిన్నమ్మకు ఆ సొమ్ములు పంపుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. ఈ సమాచారం అందుకున్న ఎస్సై చైతన్యకుమార్ మాట్లాడుతూ అతని బంధువుల ద్వారా పెన్షన్ల సొమ్ము రూ.3.11 లక్షలను పోలీసుల సమక్షంలో బండారులంక కార్యదర్శి శ్రీనివాస్కు అందజేసినట్టు తెలిపారు. అనంతరం డీఆర్డీఏ పీడీ దుడ్డి రాంబాబు, మాజీ ఉప సర్పంచ్ పిచ్చిక శ్యామ్కుమార్ సచివాలయ ఉద్యోగులు ద్వారా పెన్షన్ సొమ్ములు పంపిణీ చేశారు. -
వెలుగు చూస్తున్న గౌస్ మొహిద్దీన్ దారుణాలు
● ఇప్పటికే మూడుసార్లు జైలుకు ● అయినా మారని తీరు కాకినాడ క్రైం: ఆరుగురు మహిళలతో సహజీవనం చేస్తూ, వారి మతాలు మార్చిన ప్రబుద్ధుడు కాకినాడకు చెందిన షేక్ గౌస్ మొహిద్దీన్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. జగన్నాథపురం జె.రామారావుపేట చిన మార్కెట్లో మటన్ దుకాణం నిర్వహించే గౌస్ మటన్లో బీఫ్ కలిపి అమ్మేవాడని అతడి బాధితులు చెబుతున్నారు. ఈ పంచాయితీ పోలీసుల వద్దకు కూడా వెళ్లింది. మిలిటరీ రోడ్డులోని ఓ హోటల్కు మటన్లో బీఫ్ కలిపి రోజూ పంపిణీ చేసేవాడని, వంట చేసే వ్యక్తులు గుర్తించి, యజమాని అయిన యువతికి చెప్పడంతో ఆమె నిలదీసిందని సమాచారం. దీంతో, ఆమైపె నడిరోడ్డు మీద దాడి చేశాడని తెలిసింది. దీనిపై బాధితురాలు కాకినాడ టూ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో గౌస్ అరెస్టయి జైలు పాలయ్యాడు. అంతకు ముందు కూడా ప్రేమ పేరుతో వంచించడంతో బాధిత మహిళల ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంలో కూడా రెండుసార్లు జైలు ఊచలు లెక్క పెట్టాడు. ఇదిలా ఉండగా గౌస్ను వివాహం చేసుకున్న రమ్యశ్రీ ఫిర్యాదు మేరకు, కాకినాడ వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో వారెంటు వేసి గౌస్ను విచారించేందుకు సిద్ధమవుతున్నారు. గౌస్కు కానిస్టేబుల్ అండ! నిందితుడు గౌస్కు ఓ కానిస్టేబుల్ అండగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వన్టౌన్ నుంచి టూటౌన్కు బదిలీ అయిన అతడు ఎక్కడ పని చేస్తే ఆ పరిధిలోని హిందూ మహిళలపై గౌస్ పక్కా ప్రణాళికతో కన్ను వేసేవాడని తెలిసింది. ఆ కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్ పరిధిలోని హోటళ్ల నుంచి అతడి సిఫారసుతో మటన్ ఆర్డర్లు తీసుకునేవాడని సమాచారం. ఏ తేడా వచ్చినా గౌస్కు ఆ కానిస్టేబుల్ అండగా నిలిచేవాడని తెలిసింది. గౌస్పై గతంలో ఫిర్యాదు చేసేందుకు ఆయా స్టేషన్లకు వెళ్లిన మహిళలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించడం గమనార్హం. జీజీహెచ్ సూపరింటెండెంట్గా నరేష్ కుమార్ కాకినాడ క్రైం: జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ నరేష్ కుమార్ పాట్నీడి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ లావణ్య కుమారి నెల రోజుల వ్యక్తిగత సెలవుపై వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో డాక్టర్ నరేష్ కుమార్ను నియమిస్తూ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ సర్జరీ విభాగాధిపతిగా ఉన్న నరేష్ కుమార్ పూర్తి అదనపు బాధ్యతల్లో సూపరింటెండెంట్గా కొనసాగనున్నారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు
అన్నవరం: సత్యదేవునికి ఆగస్టు నెలలో హుండీ ఆదాయం దండిగా సమకూరింది. గత 33 రోజులకు గాను రూ.1,81,04,918 ఆదాయం వచ్చిందని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ ఎన్.సూర్యచక్రధరరావు మంగళవారం తెలిపారు. నగదు రూ.1,71,50,672, చిల్లర నాణేలు రూ.9,54,246 మేర వచ్చాయని వివరించారు. శ్రావణ మాసం, పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం, వేలాదిగా భక్తులు తరలి రావడంతో వారు సమర్పించిన కానుకలతో హుండీలు నిండిపోయాయి. సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. ఖతార్ రియల్స్ 105, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 100, కెనడా డాలర్లు 20, అమెరికన్ డాలర్లు 20, మలేషియా రింగిట్స్ 2, యూరోలు 10, సౌదీ సెంట్రల్ బ్యాంక్ రియల్స్ 15, ఇంగ్లండ్ పౌండ్లు 30, న్యూజిలాండ్ డాలర్లు 40, సింగపూర్ డాలర్లు 24, వియత్నాం కరెన్సీ 2 లక్షల డాంగ్స్, రష్యా రూబుల్స్ 50, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 200, నేపాల్ రూపాయలు 25, స్విస్ ఫ్రాంక్స్ 50 చొప్పున లభించాయని చైర్మన్, ఈఓ వివరించారు. ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలికంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో వైద్య విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపుతూ 2026– 27 విద్యా సంవత్సరానికి వైద్య విద్య ఫీజులను పెంచాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.కిరణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే ఆశలను ఈ ఫీజుల పెంపు నిర్ణయం దెబ్బతీస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో విద్యార్థులు, యువత భవిష్యత్తుకు పెద్దపీట వేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులపై వరుసగా ఆర్థిక భారాలు మోపడం దారుణమన్నారు. విద్య అనేది ప్రతి విద్యార్థి హక్కని, డబ్బున్న వారికి మాత్రమే దక్కే వ్యాపార వస్తువు కాదన్నారు. యూజీ వైద్య విద్య ఫీజులను 10 శాతం, పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజులను 15 శాతం పెంచే ప్రయత్నం చేయడం ద్వారా ప్రభుత్వం సామాన్య కుటుంబాలపై మరింత భారం మోపుతోందన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ముందుగా విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడం ఏంటన్నారు. పేద విద్యార్థులు డాక్టర్లు కావాలనే కలలు కనడం తప్పా, డబ్బులు లేవని ప్రతిభ ఉన్న విద్యార్థులు వైద్య విద్యకు దూరం కావాలా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
బుధవారం శ్రీ 2 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● సంక్షేమ, అభివృద్ధి ప్రదాత వైఎస్సార్ ● జిల్లా అభివృద్ధిలో కీలక భూమిక ● పుష్కర ఎత్తిపోతల పథకంతో అన్నదాతకు వెన్నుదన్ను ● ప్రతిష్టాత్మక జేఎన్టీయూ–కాకినాడ ఏర్పాటు ● ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్తో పేదలకు మేలు ● నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి –8లో..రాజా ది గ్రేట్సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంక్షేమ, అభివృద్ధి ప్రదాతగా.. ప్రజలకు ఆత్మీయుడిగా.. మెట్ట రైతులకు ఆప్తబంధువుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీర్తిప్రతిష్టలు గడించారు. తన పాలనా కాలంలో ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి, ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్నారు. వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రైతుల సంక్షేమానికి సింహభాగం నిధులు కేటాయించారు. ఆరోగ్యశ్రీ ద్వారా వేలాది మందికి ఖరీదైన కార్పొరేట్ స్థాయి వైద్యం అందించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎంతో మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్ త దితర ఉన్నత విద్యను అందించారు. తన సుదీర్ఘ పాదయాత్రలో తెలుసుకు న్న సమస్యలకు అధికారంలోకి వచ్చాక పరిష్కారం చూపారు. నేడు ఆ మహానేత వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. జిల్లా ప్రగతికి ఆ మహనీయుడు అందించిన సేవలను స్మరించుకుందాం రండి.. ప్రగతి కాంతులివిగో.. ● జిల్లాలోని మెట్ట ప్రాంతంలో దాదాపు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం వద్ద రూ.600 కోట్లతో తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని వైఎస్సార్ నిర్మించి, ప్రారంభించారు. తద్వారా మెట్ట ప్రాంతానికి ఆయన అపర భగీరథుడిగా నిలిచారు. ● గోదావరి డెల్టా స్థిరీకరణతో పాటు జిల్లాలోని మెట్ట ప్రాంతానికి, ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగునీరందించే లక్ష్యంతో గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఎడమ ప్రధాన కాలువ నిర్మాణాన్ని సైతం ఆయన హయాంలోనే చాలా వరకూ పూర్తి చేశారు. ● రూ.52 కోట్లతో తాండవ ప్రాజెక్టును వైఎస్సార్ ఆధునికీకరించి, కుడి, ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపారు. తద్వారా 30 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించారు. తుని వద్ద తాండవ నదిపై భూమి, ముఠా మినీ ఆనకట్టలను రూ.5 కోట్లతో నిర్మించి, పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి తెచ్చారు. ● 2004 ఎన్నికలకు ముందు గోకవరం వచ్చిన వైఎస్ అక్కడి రైతుల కగడండ్లు చూసి చలించిపోయారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 22 వేల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో రూ.205 కోట్లతో రంపచోడవరంలో ముసురుమిల్లి ప్రాజెక్టు నిర్మించారు. తద్వారా గోకవరం మండలంలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించారు. ● ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు 2009లో రూ.132 కోట్లతో వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ● పిఠాపురం బ్రాంచ్ కెనాల్ను రూ.120 కోట్లతో ఆధునికీకరించారు. ● ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంతో ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలను కడతేర్చిన నేతగా వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటు ● వైఎస్సార్ అధికారంలోకి వచ్చేనాటికి జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) పరిధిలో కాకినాడలో ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాల ఉండేది. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులకూ అత్యున్నత సాంకేతిక విద్యను అందుబాటులోకి తీసుకు వచ్చే లక్ష్యంతో జేఎన్టీయూను విభజించారు. ఇందులో భాగంగా కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలను జేఎన్టీయూ–కాకినాడగా ఏర్పాటు చేశారు. ● జిల్లాకో విశ్వవిద్యాలయం ఉండాలనే లక్ష్యంతో అప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వద్ద ఆదికవి నన్నయ పేరిట యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ● సముద్ర కోత నుంచి ఉప్పాడ తీరాన్ని రక్షించేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జియో ట్యూబ్ రక్షణ గోడ నిర్మించింది. ● సామర్లకోట, పెద్దాపురం జంట మున్సిపాలిటీల్లో రూ.15 కోట్లతో తాగునీటి ట్యాంకులు నిర్మించి, లక్ష మంది దాహార్తిని తీర్చారు. ● రూ.12 కోట్లతో పెద్దాపురంలో రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణానికి 13 ఎకరాలు కొనుగోలు చేశారు. కాకినాడలో కూడా వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను రాజీవ్ గృహకల్పతో సాకారం చేశారు. ● కాకినాడ నగరంలోని సినిమా రోడ్డులో వైఎస్ నిర్మించిన ఫ్లై ఓవర్తో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. కాకినాడలో సాంబమూర్తి నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి కూడా వైఎస్సార్ చలవే కారణం. దీని నిర్మాణం ఫలితంగా రాజీవ్ గృహకల్ప, పోర్టు ప్రాంతాలకు నేడు ప్రయాణం సాఫీగా సాగుతోంది. తుని పట్టణంలో సైతం ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ● రూ.2కే కిలో బియ్యం పథకాన్ని 2004కు ముందు చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేసి, పేదల కడు పు కొట్టింది. ఈ పథకాన్ని వైఎస్సార్ పునరుద్ధరించి, లక్షలాది మంది పేదల ఆకలి తీర్చారు. నేడు సేవా కార్యక్రమాలు దివంగత మహానేత వైఎస్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలు, ప్రజలపై ఆయనకున్న అభిమానాన్ని మరోసారి గుర్తు చేసుకునేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సన్నద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కన్నబాబు హౌస్ అరెస్టు
● మారికవలస వెళ్లకుండా అడ్డుకున్న సర్పవరం పోలీసులు ● దుర్మార్గమని మండిపడిన మాజీ మంత్రికాకినాడ రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును పోలీసులు మంగళవారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు. విశాఖ జిల్లా మారికవలసలోని గురుకుల పాఠశాలను చంద్రబాబు ప్రభుత్వం మరోచోటుకు తరలిస్తోంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్ సీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేయిస్తోంది. దీనిలో భాగంగా కాకినాడ వైద్య నగర్లోని తన నివాసంలో ఉన్న కన్నబాబును హౌస్ అరెస్టు చేస్తున్నట్లు సర్ప వరం సీఐ సీహెచ్ ప్రకాష్ నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టు చేయడం చాలా దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మారికవలసలో 480 మంది విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో గిరిజన గురుకులం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం హఠాత్తుగా జీఓ–69 జారీ చేసి మారికవలసతో పాటు మరికొన్ని గురుకులా లను తొలగిస్తోందని అన్నారు. విద్యార్థులను బలవంతంగా వేరే పాఠశాలలకు తరలించడాన్ని తల్లిదండ్రు లు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఎవరి ప్రయోజనాల కో సం గురుకులాలను తరలిస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని కన్నబాబు విమర్శించారు. కాకినాడ లో ఎస్పీ కార్యాలయం సమీపాన ఇటీవల అర్ధరాత్రి 2 గంటలకు ఓ వ్యక్తిని చాలా అమానుషంగా చంపేశార ని, సాధిక్ అనే వ్యక్తి వలన ఒక కుటుంబం ఆత్మహత్య కు పాల్పడిందని, కొంత మంది యువకులు మద్యం తాగి గ్రూపులుగా ఏర్పడి కొట్టుకుంటున్నారని, గంజాయి, మద్యం వలన శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోందని చెప్పారు. ఎవరైనా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఏ పార్టీ అని అడుగుతున్నారన్నారు. పోలీసులు చేయవలసిన పని కాకుండా హౌస్ అరెస్టులు చేయడం సరికాదని హితవు పలికారు. -
గంజాయి సమాచారమిస్తే గిఫ్ట్
కాకినాడ క్రైం: గంజాయి విక్రయం, వినియోగం, తయారీపై సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు జిల్లా పోలీసు శాఖ తరఫున బహుమతి అందిస్తామని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో రైజ్ ఎగైనెస్ట్ గంజా పేరుతో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గంజాయి వినియోగం యువత భవితను నాశనం చేస్తుందన్నారు. ఇది కుటుంబంతో పాటు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలిపారు. గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. 1972, 112, పోలీస్ వాట్సాప్ 94949 33233 ద్వారా గంజాయి సమాచారాన్ని అందించాలని, మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. -
గంజాయి పంజా
● గ్రామాల్లో చాప కింద నీరులా విస్తరణ ● మత్తుకు చిత్తవుతున్న బాల్యం ● పాఠశాలల నుంచి చెరశాలలకు వెళ్తున్న పిల్లలు ● కూలిపోతున్న కుటుంబాల ఆశలుసరదాగా మొదలుపెట్టి.. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన మణికంఠ పదో తరగతి చదువుకుంటున్నాడు. స్నేహితుల ద్వారా గంజాయి తాగడానికి అలవాటు పడ్డాడు. తొలుత సరదాగా తాగినప్పటికీ క్రమంగా ప్రతి రోజూ తాగకపోతే ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దాని కోసం ఏ పని చేయడానికై నా సిద్ధమైన అతడు.. చివరకు పోలీసులకు పట్టుబడి, జువైనల్ హోమ్కు వెళ్లాడు. బెయిల్పై వచ్చినా గంజాయి అలవాటు అతడిని నేర ప్రవృత్తి వైపు మళ్లించింది. దీంతో, దొంగతనాలకు తెగించాడు. మరో ఇద్దరితో కలసి కొత్తపల్లి మండలం గోర్సలోని ఓ ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు దోచుకుపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి మళ్లీ ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇలాగే మరో బాలుడు అతడితో కలసి గంజాయి తాగి, దొంగతనంలో పాలు పంచుకుని పోలీసులకు దొరికిపోయాడు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇటీవల జరుగుతున్న చాలా వరకూ దొంగతనాలు ఎవరో పేరు మోసిన దొంగలు చేస్తున్నవి కావు.. కేవలం గంజాయికి అలవాటు పడిన పిల్లలు చేస్తున్నవే ఎక్కువగా ఉండటం సమాజాన్ని కలవరపరుస్తోంది. పిఠాపురం: పెన్ను పట్టుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన ఆ పసి చేతులు.. నేడు గంజాయి కూరిన సిగరెట్లు పట్టుకుంటున్నాయి. ప్రపంచం అంటే ఏమి టో పూర్తిగా తెలియని వారు.. ఆటపాటలతో హుషారుగా గడపాల్సిన వయసులోనే మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోతున్నారు. పాఠశాలల్లో చదువుకోవాల్సిన వయసులో చెరశాలలో శిక్ష అనుభవించాల్సిన దుస్థితిలో కూరుకుపోతున్నారు. ఇంతకుముందు పెద్దలు, కళాశాల స్థాయి యువతకే పరిమితమైన ఈ మత్తు మహమ్మారి.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది. నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్న ఈ గంజాయి ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తును కూడా కబళిస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. మానసిక రుగ్మతలు ● గంజాయి వాడకం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దారుణంగా దెబ్బ తింటోంది. ● ఆ పిల్లలు తీవ్రమైన ఉద్రేక స్వభావానికి లోనవుతున్నారు. చిన్న విషయాలకే విపరీతంగా కోప్పడటం, తల్లిదండ్రులపై సైతం దాడికి దిగడం లేదా వస్తువులు పగులగొట్టడం చేస్తున్నారు. ● మత్తుకు అలవాటు పడిన పిల్లలు గంజాయి కోసం ఏం చేయడానికై నా వెనుకాడటం లేదు. చాలామంది నేరాల బాట పడుతున్నారు. మత్తు పదార్థాల కొనుగోలుకు ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే దాడులు చేయడం, లేదా దొంగిలించడం చేస్తున్నారు. కొంతమంది చైన్ స్నాచింగ్ వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం గంజాయి, దొంగతనం కేసుల్లో దొరుకుతున్న బాలలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నారు. ● గంజాయి తాగడం వల్ల జ్ఞాపక శక్తి మందగిస్తోంది. చదువుపై ఏకాగ్రత లోపిస్తోంది. దీంతో, ఆ పిల్లలు బడికి డుమ్మా కొట్టి, తమ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిందే.. తమ పిల్లలు మత్తుకు అలవాటు పడుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ముందుగానే గుర్తించవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజూ కంటే భిన్నంగా విపరీతమైన కోపం, నిద్ర లేమి, అర్ధరాత్రి వరకూ ఫోన్ వాడకం, ఇంట్లో నుంచి అనుమానాస్పదంగా డబ్బులు లేదా విలువైన వస్తువులు మాయమవడం, స్కూల్, కాలేజీకి డుమ్మా కొడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడపడం, చేతులు, కాళ్లు వణకడం లేదా కళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉండటం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అవసరమైతే మానసిక వైద్య నిపుణులను సంప్రదించి పిల్లలు మత్తు అలవాటు నుంచి బయటపడేలా చూడాలి. ఇలా చేస్తే మేలు గంజాయి మత్తు వ్యాప్తిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందనే విమర్శలున్నాయి. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ అవగాహన సదస్సులతో సరిపెట్టడం తప్ప.. గంజాయిని పక్కాగా అరికట్టేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి స్థాయి ఫలితాలనివ్వడం లేదు. ముఖ్యంగా విద్యా సంస్థల సమీపంలోని బల్లలు, పాన్ షాపులు, నైట్ పాయింట్లలో నిరంతరం తనిఖీలు నిర్వహించాలి. మత్తుకు బానిసలైన పిల్లలను నేరస్తుల్లా కాకుండా కౌన్సెలింగ్, చికిత్స అందించి, సాధారణ జీవితంలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలి. గ‘మ్మత్తు’గా చిత్తు.. మత్తు మాఫియా బడి పిల్లలనే తన టార్గెట్గా మార్చుకుంటోంది. చిన్న వయసులోనే ఉచితంగా అలవాటు చేసి, ఆ తర్వాత వారి ద్వారానే ఇతర పిల్లలకు విక్రయించే ఏజెంట్లుగా మార్చుకుంటున్నారు. ఒక్కసారి ఆ మత్తుకు అలవాటు పడితే.. ఇక దాని నుంచి బయటపడటం అరుదుగా మారిపోతోంది. పాకెట్ మనీకి అందుబాటులో ఉండే ధరకే చాక్లెట్లు, సిగరెట్లు, రోల్స్ రూపంలో గంజాయిని ఆ మాఫియా విచ్చలవిడిగా అందిస్తోంది. ఒక్కసారి ట్రై చేయి, కేకులా ఉంటుందని స్నేహితులు చెప్పే మాటలకు తొలుత ఆకర్షితులవుతు న్న పిల్లలు.. ఆపై దానికి అలవాటు పడుతున్నారు. గంజాయి అందుబాటులో లేకపోతే వైట్నర్లు, పెయింట్ థిన్నర్లు, నెయిల్ పాలిష్, గమ్ ట్యూబులను పీల్చి మత్తులో మునగడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసుల విచారణలో తేటతెల్లమవుతోంది. -
జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి హత్యపై ఎందుకీ మౌనం?
● కటౌట్ శ్రీను పాత్రపై నోరు మెదపరేం? ● నిందితులను తక్షణం అరెస్టు చేయాలి ● మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తన భర్త హత్య వెనుక టీడీపీ నాయకుడు కటౌట్ శ్రీను పాత్ర ఉందని జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి భార్య జయశ్రీ స్వయంగా ఆరోపించారని, దీనిపై పోలీసులు ఇప్పటి వరకూ ఎందుకు చర్య తీసుకోలేదని వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రశ్నించారు. ప్రశాంతతకు మారుపేరైన కాకినాడలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున భానుగుడి సెంటర్లో జరిగిన సతీష్రెడ్డి దారుణ హత్యే దీనికి ప్రధాన నిదర్శనమన్నారు. ఈ దారుణ హత్యకు సంబంధించి కటౌట్ శ్రీను వెనుక ఉన్న రాజకీయ శక్తులెవరని ప్రశ్నించారు. ఈ హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా, అతడిపై చర్యల విషయంలో పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని నిలదీశారు. ఎవరి ఒత్తిడి వల్ల నిందితులను కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఒక్క సతీష్రెడ్డి హత్యే కాకుండా గడచిన కొద్ది రోజులుగా కాకినాడలో శాంతిభద్రతల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు జరుగుతున్నప్పటికీ చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితికి కారణమేమిటని నిలదీశారు. హతుడు సతీష్రెడ్డి భార్య జయశ్రీ గర్భిణిగా ఉండి కూడా స్వయంగా బయటకు వచ్చి, ఆందోళన చేసి నిందితుల పేర్లు బహిరంగంగా ప్రకటిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే ఆరోపణలు ఎదుర్కొంటున్న కటౌట్ శ్రీను, ఇతర నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నేరాలను అదుపు చేసే విషయంలో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోతే పరిస్థితి మరింత అదుపుతప్పి, ప్రశాంత కాకినాడ అశాంతికి నిలయంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిందితులను కాపాడాలని చూస్తే వైఎస్సార్ సీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ద్వారంపూడి హెచ్చరించారు. -
హత్యకేసులో అనుచరుడిని రక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు యత్నాలు
కాకినాడ క్రైం: కాకినాడలో ఈ నెల 23న జరిగిన జిమ్ట్రైనర్ కొడమటి సతీష్రెడ్డి హత్యకేసులో పోలీసుల తీరు పలు అనుమానాలు కలిగిస్తోందని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ, కుటుంబసభ్యులు చెప్పారు. కాకినాడ అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు అనుచరుడైన బోను శ్రీను అలియాస్ కటౌట్ శ్రీను ఈ హత్య చేయించాడని ఆరోపించారు. శ్రీనుని రక్షించేందుకు ఎమ్మెల్యే కొండబాబు పోలీసులతో మంతనాలు జరుపుతున్నారన్నారు. జయశ్రీ, సతీష్ రెడ్డి తల్లి ఈశ్వరి, కుటుంబసభ్యులు, బంధువులు, సతీష్ రెడ్డి స్నేహితులు సోమవారం హత్యాస్థలంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ హత్య జరిగిన వెంటనే ఘటనా స్థలంలో రక్తపు మరకలు లేకుండా పోలీసులే కడిగేయడం పలు అనుమానాలు కలిగిస్తోందని చెప్పారు. అర్ధరాత్రి రెండుగంటల సమయంలో హత్య జరిగితే మూడు గంటలకే.. అంటే గంట వ్యవధిలోనే శుభ్రం చేసేశారని తెలిపారు. పోలీసులు క్రైం సీన్ ప్రొటెక్షన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హత్య జరిగిన చోట మార్కింగ్, డు నాట్ ఎంటర్ బ్యాండ్లు ఏర్పాటు చేయలేదని చెప్పారు. ఉదయానికి చూస్తే అసలు అక్కడ హత్య జరిగిందన్న ఆనవాళ్లు కూడా లేవన్నారు.ఈ హత్యచేయించాడని తాము అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడైన బోను శ్రీనును ఇప్పటివరకు ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. తాము కటౌట్ శ్రీను పేరు చెబితే ఓ అధికారి మీడియాకు ఆ పేరు చెప్పొద్దని ఒత్తిడి చేశారన్నారు. శ్రీను ప్రణాళికతోనే సాయికిరణ్ బృందం హత్యచేసిందన్నారు. ఎమ్మెల్యే అనుచరుడైనందువల్లే పోలీసులు కటౌట్ శ్రీను గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. పోలీసులు న్యాయం చేస్తారనే నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదునెలల గర్భిణిని అయిన తాను, గుండె సమస్యతో బాధపడుతున్న తన అత్త ఈశ్వరి న్యాయం కోసం ఇలా తిరుగుతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు. కటౌట్ శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించాలని, హంతకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొండబాబు అర్థం చేసుకుని కటౌట్ శ్రీనును రక్షించడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీ కార్యాలయానికి తరలింపు ఉదయం నుంచి నిరసన చేపట్టిన జయశ్రీ, ఆమె కుటుంబసభ్యులతో పోలీసులు చర్చించారు. మధ్యాహ్నం వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఎస్పీని కలిసిన అనంతరం బాధితులు ఆయన సూచనమేరకు కాకినాడ టూటౌన్ పోలీస్స్టేషన్కు వెళ్లి స్టేట్మెంట్ ఇచ్చారు.కటౌట్ శ్రీనును విచారించిన పోలీసులుటీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీనును సోమవారం పోలీసులు విచారించారు. హత్యకు కారకుడని మృతుడు సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సాంకేతిక సాయం తీసుకుంటున్నామని సీఐ అప్పలనాయుడు తెలిపారు. -
ప్రయాణికుల పడిగాపులు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో రైళ్ల రాకపోకల్లో తీవ్ర జాప్యం నెలకొనడంలో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. కూర్చునేందుకు సైతం బెంచీలు లేక వృద్ధులు, చిన్నారులు, మహిళలు అవస్థలు ఎదుర్కొన్నారు. సోమవారం సింహాచలం నుంచి కొండపల్లి బొగ్గు లోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు కొవ్వూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది. దీంతో, పలు రైళ్లు గంటలకొద్దీ ఆలస్యంగా నడిచాయి. తాము ఎక్కాల్సిన రైళ్ల రాక కోసం ప్రయాణికులు ఎదురుతెన్నులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్లో కూర్చునేందుకు బెంచీలు సైతం లేక ప్లాట్ఫామ్పై, ఫుట్వే బ్రిడ్జి మెట్లపై కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్, బొకారో ఎక్స్ప్రెస్, స్వర్ణ జయంతి, తిరుపతి – కాకినాడ సికింద్రాబాద్ – అనకాపల్లి, కోణార్క్ ఎక్స్ప్రెస్లు మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా నడిచాయి. విజయవాడ వైపు వెళ్లే సంత్రాగచ్చి – తిరుపతి, కోరమండల్, ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు 3 నుంచి 6 గంటలు ఆలస్యంగా చేరుకున్నాయి. విజయవాడ వైపు వెళ్లాల్సిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12703) ఏకంగా పదిన్నర గంటలు ఆలస్యంగా నడిచింది. గూడ్స్ రైలు వ్యాగన్ పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకల్లో ఆలస్యం ఏర్పడటంతో రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు రైల్వే సీటీ సుంకర చంద్రమౌళి తెలిపారు.ఫ కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ ఫ ఆలస్యంగా నడిచిన పలు రైళ్లు ఫ రాజమహేంద్రవరంలో ప్రయాణికులకు కష్టాలు -
15 ఏళ్ల అమ్మాయి.. 29 ఏళ్ల అబ్బాయి
పిఠాపురం: అధికారుల చొరవతో బాల్య వివాహానికి అడ్డుకట్ట పడింది. వివరాలివీ.. పిఠాపురానికి చెందిన 15 ఏళ్ల బాలికకు, గొల్లప్రోలు మండలం వన్నెపూడికి చెందిన 29 ఏళ్ల యువకుడితో బాల్య వివాహం జరుగుతుందన్న సమాచారం అధికారులకు అందింది. దీంతో, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సీహెచ్ వెంకటరావు ఆదేశాల మేరకు.. సీడీపీఓ మోకా శ్రీకళ ఆధ్వర్యాన బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ బి.దుర్గారాణి, ఐసీడీఎస్ అధికారులు వన్నెపూడిలోని వరుడి ఇంటికి సోమవారం చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని పరిశీలించి, బాలిక తల్లిదండ్రులు, వరుడు, రెండు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దలతో మాట్లాడారు. బాలిక తల్లిదండ్రులు, వరుడు దగ్గరి బంధువులు కావడంతో, కట్నం లేకుండా వివాహానికి ముందుకు వచ్చారని, దీంతో, ఈ పెళ్లి చేస్తున్నామని వారు తెలిపారు. అయితే, తనకు ఇష్టం లేకుండానే ఈ వివాహం చేస్తున్నారని, తాను పదో తరగతి చదువుతున్నానని, చదువు కొనసాగించాలని కోరుకుంటున్నానని ఆ బాలిక అధికారులకు తెలిపింది. తనకు సురక్షితమైన వసతి కల్పించాలని కోరింది. దీంతో, అధికారులు ఆ బాలికతో పాటు ఇరు కుటుంబాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 18 సంవత్సరాల వయస్సు నిండని బాలికకు వివాహం చేయడం బాల్య వివాహ నిషేధ చట్టం–2006 ప్రకారం నేరమని స్పష్టం చేశారు. బాలిక మైనర్ కావడంతో పరిస్థితులకు అనుగుణంగా పోక్సో చట్టం–2012 నిబంధనలు కూడా వర్తించే అవకాశం ఉందని హెచ్చరించారు. బాలికను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్ విధానంలో హాజరు పరిచారు. కమిటీ సూచనల మేరకు తాత్కాలిక రక్షణ, వసతి కోసం ఆ బాలికను కాకినాడ వన్స్టాప్ సెంటర్కు తరలించారు. ఆ బాలికకు 18 ఏళ్లు పూర్తయ్యే వరకూ వివాహం చేయబోమని, చదువుకు ఆటంకం కలిగించబోమని ఇరు కుటుంబాల నుంచి అంగీకార పత్రాలు తీసుకున్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని అధికారులు సూచించారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ·˘ Ð]l¯ðl²ç³NyìlÌZ బాల్య వివాహానికి యత్నం ·˘ A«¨M>Æý‡$ÌS ^öÆý‡Ð]l™ø Ayýl$zMýSrt ·˘ Æý‡„ýS׿ MýS͵…^éÌS° MøÇ¯]l »êÍMýS ·˘ Ð]l¯ŒSÝët‹³ òÜ…rÆŠ‡MýS$ ™èlÆý‡Í…ç³# -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని ఏపీ జేఏసీ–అమరావతి జిల్లా శాఖ చైర్మన్ పితాని త్రినాథ్, ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ఆర్కే దుర్గా ప్రసాద్, రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ స్పష్టం చేశారు. ఏపీ జేఏసీ–అమరావతి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కలెక్టర్, ఆర్డీఓలకు నాయకులు సోమవారం ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందించారు. 12వ పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని, మధ్యంతర భృతి ప్రకటించాలని, డీఏ బకాయిలు చెల్లించాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, పాత పింఛన్ విధానం అమలు చేయాలని, ఉద్యోగుల హెల్త్ కార్డులను వెంటనే వినియోగంలోకి తీసుకు రావాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, వారికి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, 2010 ముందు నియమితులైన ఉపాధ్యాయిలకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు 29 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పి.దుర్గాప్రసాద్, మహిళా చైర్పర్సన్ శిరీష, ప్రధాన కార్యదర్శి ముంతాజ్, జిల్లా ట్రెజరర్ సీవీవీ సత్యనారాయణ, వీఆర్ఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నా, రెవెన్యూ డివిజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర ఆల్ డ్రైవర్స్ జేఏసీ ఏర్పాటు
కాకినాడ రూరల్: దేశ, రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న వివిధ వాహనాల డ్రైవర్లను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆల్ డ్రైవర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకూ వివిధ డ్రైవర్ల యూనియన్లతో కూడిన జేఏసీకి కాకినాడలో సోమవారం అంకురార్పణ జరిగింది. తిమ్మాపురంలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో వాసు ఏలేటి అధ్యక్షతన జరిగిన జేఏసీ ఆవిర్భావ సమావేశానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లారీ, ట్రక్కులు, ప్రైవేటు బస్సులు ఇతర ప్రైవేటు వాహనాల డ్రైవర్లు తరలి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో డ్రైవర్లు, ఆయా అసోసియేషన్ల నాయకులు ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు రక్షణ లేదని, సంక్షేమం అందడం లేదని అన్నారు. ఒడిశా, కర్ణాటక మాదిరిగా మన రాష్ట్రంలో కూడా సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన వాసు ఏలేటిని జేఏసీ చైర్మన్గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రైవర్లకు ఇచ్చిన వందలాది హామీలను నెరవేర్చకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని అన్నారు. గత ఎన్నికల్లో డ్రైవర్లకు రూ.10 లక్షల ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని, ప్రతి డ్రైవర్ను ఓనర్ను చేస్తామని, డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, వీటిల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అన్నారు. పొరుగున ఉన్న ఒడిశా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు డ్రైవర్ల వెల్ఫేర్ బోర్డులు ఏర్పాటు చేశాయని, అలా ఇక్కడ ఎందుకు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డ్రైవర్ల సంక్షేమంపై చంద్రబాబు ఎందుకు దృష్టి పెట్టడం లేదని నిలదీశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు లక్ష్యంగానే జేఏసీ ఏర్పాటు జరిగిందని చెప్పారు. సమావేశంలో చంద్రశేఖర్, యోహాను, మనోజ్ సాహు (విశాఖ), అన్వర్ బాషా (కర్నూలు), జిలాని (చిత్తూరు జిల్లా పలమనేరు), ఎస్కే మస్తాన్ (దేవరపల్లి) తదితరులు పాల్గొన్నారు. ఫ కాకినాడలో ఆవిర్భావ సమావేశం ఫ ప్రభుత్వం తమను మోసం చేస్తోందని నాయకుల ఆవేదన ఫ చైర్మన్గా వాసు ఏలేటి ఎన్నిక -
ఫ జగన్నాథుని ఆలయానికి ‘జలధి’ గండం
సాగరుడు అలల కరవాలాలతో విరుచుకుపడుతూండటంతో జగన్నాథుని ఆలయం ముప్పు అంచున కొట్టుమిట్టాడుతోంది. యు.కొత్తపల్లి మండలం మూలపేటలో 1999లో నిర్మించిన ఈ ఆలయానికి విశిష్ట నేపథ్యం ఉందని స్థానిక మత్స్యకారులు చెబుతారు. ఒడిశాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిలో రథోత్సవం అనంతరం సుభద్ర, బలభద్రుడు, జగన్నాథుని దారు విగ్రహాలను నిమజ్జనం చేయగా.. అవి ఉప్పాడ తీరానికి చేరుకుని, ఇక్కడి మత్స్యకారుల వలలకు చిక్కాయి. దీంతో, పూరిలోని మూలమూర్తులకు ప్రతిరూపాలుగా భావిస్తూ.. స్థానికులు విరాళాలతో మూలపేటలో ఆలయం నిర్మించి, ఆ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. దీని అభివృద్ధికి ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో ఈ ఆలయం పూర్తి శిథిలావస్థకు చేరింది. దీనికితోడు, సముద్ర కెరటాలు విరుచుకుపడుతూండటంతో ఆలయ మండపం కుప్పకూలిపోయింది. రానున్న రోజుల్లో ఈ ఆలయం పూర్తిగా సముద్ర గర్బంలో కలిసే ప్రమాదం ఉందని, ఇప్పటికై నా దాతలు, అధికారులు దీని అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. – కొత్తపల్లి -
పీజీఆర్ఎస్కు 284 అర్జీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 284 అర్జీలు సమర్పించారు. అలాగే, రెవెన్యూ క్లినిక్కు 38 అర్జీలు అందజేశారు. వారి నుంచి కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్, డీఆర్ఓ తిప్పేనాయక్, డ్వామా పీడీ మధుసూదన్, ట్రైనీ కలెక్టర్ ప్రియ, జిల్లా స్థాయి అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలపై అధికారులు సత్వరం సమగ్ర విచారణ చేపట్టి, నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. కుక్కల సమస్య పరిష్కరించాలి మా డివిజన్లో కుక్కల సమస్య చాలా ఎక్కువగా ఉంది. రాత్రి, పగలు తేడా లేకుండా కుక్కలు గుంపులు గుంపులుగా చేరి ప్రజలను గాయపరుస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. రాత్రి వేళ ఒంటరిగా నడిచి వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్రవాహనాలపై వెళ్తున్నవారిని కూడా కుక్కలు గాయపరుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలి. – గోడి సత్యవతి, మాజీ కార్పొరేటర్ -
కొత్త కష్టాలు మాకొద్దు
● రేషన్ డీలర్ల ఆవేదన ● క్యూఆర్ కోడ్ విధానంపై విముఖత ● సాంకేతిక సమస్యలు తప్పవని గగ్గోలు అంబాజీపేట: ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం తమకు తలనొప్పిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. క్యూఆర్ కోడ్ పద్ధతితో తలనొప్పి తప్పడం లేదని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ విధానానికి శ్రీకారం చుట్టింది. సంబంధిత ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ డీలర్లు తీసుకెళ్లే బియ్యానికి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలి. ఆపై దుకాణాల వద్దకు సరఫరా అయ్యే బియ్యానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే బియ్యాన్ని డీలర్లకు ఇవ్వాలి. దీన్ని సెప్టెంబర్ నుంచి జిల్లా వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అమలు చేయనుంది. అయితే ఈ కొత్త విధానం తమకు ఇబ్బందిగా మారిందని రేషన్ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 779 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా 4,58,874 మంది రేషన్ కార్డుదారులు సరుకులు తీసుకుంటున్నారు. డీలర్ల వ్యతిరేకత గోడౌన్ల నుంచి స్కానింగ్ ద్వారా రేషన్ షాపులకు బియ్యం చేరుతుంది. డీలర్లు స్కాన్ చేసి ఆపై తమ పీపీఎస్ (పెడ్డీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్) యాప్ ద్వారా సబ్మిట్ చేసి ఈ–పాస్ ద్వారా ఆర్వో జనరేట్ చేసి ట్రాక్ షీట్ చేపట్టాలి. ఇదంతా కష్టతరమని డీలర్లు చెబుతున్నారు. ఎందుకంటే కొందరు డీలర్లకు స్మార్ట్ ఫోన్లు లేవు. వీరు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే కొత్త లింకును పంపిస్తున్నారు. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో వారికి అవగాహన లేదు. అలాగే బియ్యం బస్తాలను షాపుల వద్దకు దించే హమాలీలు ప్రతి మూటను స్కానింగ్ చేసేందుకు గంటల సమయం పడుతుంది. బస్తాలపై ఉన్న క్యూఆర్ కోడ్లు చిరిగిపోయి ఉంటే మరింత ఇబ్బందిగా మారుతుంది. పెరిగిన పనిభారం చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిగా రేషన్ డీలర్లపై విపరీతమైన పని భారం పెంచింది. రకరకాల నిబంధనలు విధించడంతో వారందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రతి బియ్యం బస్తాను రెండు సార్లు స్కానింగ్ చేయాలంటూ కొత్తగా నిబంధన తీసుకువచ్చారు. కానీ కిలోకు రూపాయి కమిషన్ తప్ప ఒక్క పైసా కూడా పెంచలేదు. -
రంగు పేరుతో కక్ష సాధింపు!
దేవరపల్లి: నల్లజర్ల మండలం దూబచర్లలో వైఎస్సార్ వసంత్ నగర్ ద్వారం రంగుల వివాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో వైఎస్సార్ వసంత్ నగర్ పేరున గతంలో పార్టీ శ్రేణులు ద్వారం ఏర్పాటు చేశారు. దానికి వైఎస్సార్ సీపీ రంగులు వేశారు. కానీ అనివార్య కారణాలతో అప్పటి నుంచి ఆ ద్వారం ప్రారంభోత్సవం కాలేదు. అలాగే అక్కడే వైఎస్సార్ విగ్రహం, బస్షెల్టర్ కూడా నిర్మించారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ద్వారం, విగ్రహం, బస్షెల్టర్ ప్రారంభోత్సవానికి వైఎస్సార్ సీపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని నాలుగు రోజులుగా కొత్తగా వైఎస్సార్ సీపీ రంగులు వేసి సిద్ధం చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ చేబ్రోలు చిన వెంకటేశ్వరరావు(కొండ), మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మండల మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ మునాఫ్, గ్రామ కమిటీ అధ్యక్షులు దోవా సాయి ఆధ్వర్యంలో నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అడ్డుకున్న పోలీసులు ద్వారానికి వైఎస్సార్ సీపీ రంగులు తొలగించి, తెలుపు రంగు వేయాలని పోలీసులు పార్టీ నాయకులకు సూచించారు. ద్వారానికి తెలుపు రంగు వేయడానికి పంచాయతీ సిబ్బంది రంగు డబ్బాలతో అక్కడకు చేరుకోగా, వైఎస్సార్ సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గతంలో వేసిన రంగులనే మళ్లీ వేశామని, రంగు మార్చడానికి వీలు లేదని పోలీసులకు పార్టీ నాయకులు తెలిపారు. దీంతో వారి మధ్య సోమవారం వాగ్వాదం జరిగింది. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున దూబచర్ల చేరుకుని ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు ద్వారం వద్ద ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్లజర్ల సీఐ రవికుమార్, ఎస్సై ఆంజనేయబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు ద్వారానికి పార్టీ రంగులు వేయవద్దంటూ ఆదేశాలు గతంలో వేసిన వాటికే మెరుగు పెడుతున్నా అడ్డగింపు దూబచర్లలో ఉద్రిక్తత -
చట్ట సభల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలి
అమలాపురం టౌన్: స్థానిక సంస్థలు, చట్ట సభల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగ మహా సంఘటన్ జాతీయ అధ్యక్షుడు నండూరి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పర్సన్ విత్ డిజబిలిటీ (పీడబ్ల్యూడీ) ఫెడరేషన్, దివ్యాంగ మహా సంఘటన్, కోనసీమ జిల్లా దివ్యాంగ జేఏసీ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రమేష్ హాజరయ్యారు. పీడబ్ల్యూడీ ఫెడరేషన్ సంయుక్త కార్యదర్శి దొడ్డిపట్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకట ప్రసాద్, దివ్యాంగుల మహా సంఘటన్ రాష్ట్ర అధికార ప్రతినిధి నిమ్మకాయల సురేష్ మాట్లాడుతూ దివ్యాంగుల స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 50 శాతం రాయితీపై ఏ విధమైన బ్యాంక్ హామీలు లేకుండా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన హక్కులు, రాయితీలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల జేఏసీ చైర్మన్ పెనుమాల నాగరాజు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు కొమ్ముల కోటేశ్వరరావు, నల్లమాటి లంకరాజు, కానూరు శంకరరావు, కె.సుబ్రహ్మణ్యం, జి.కొండలరావు పాల్గొన్నారు. -
రాఖీ కట్టడానికి వచ్చి వివాహిత అదృశ్యం
నిడదవోలు రూరల్: రాఖీ పండగ రోజు సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చిన ఓ వివాహిత అదృశ్యమైంది. సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. చాగల్లు మండలం బ్రాహ్మణగూడెం గ్రామానికి చెందిన తొట్టా వీర వెంకట సత్యనారాయణ, భార్య భారతీ ఏసురాణి (24) ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం బైక్పై మునిపల్లి గ్రామానికి వచ్చారు. భారతీ రాణి తన సోదరుడికి రాఖీ కట్టేందుకు అక్క ఇంటి దగ్గర ఉండిపోయింది. సత్యనారాయణ ఆమెను అక్కడ దించి తిరిగి బ్రాహ్మణగూడెం వెళ్లిపోయాడు. అయితే భర్త వదిలి వెళ్లినప్పటి నుంచి భార్య భారతీ ఏసురాణి ఆచూకీ లభించలేదు. సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టూరిస్ట్ బస్సు ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ మృతి కరప: పెనుగుదురులోని ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి మృతి చెందాడు. కరప ఎస్సై తోట సునీత తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ వెంకటనగర్కు చెందిన యాళ్ల శేఖర్ కె.గంగవరం మండలం కుందూరు పీహెచ్సీలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. తన స్నేహితులతో కలిసి బిర్యానీ తినేందుకు ఆదివారం పెనుగుదురులోని డాబా రెస్టారెంట్కు వెళ్లాడు. తిరిగి వస్తూ మోటార్ సైకిల్పై రోడ్డు దాటుతుండగా కాకినాడ నుంచి సిరిపురం వెళుతున్న టూరిస్ట్ బస్ వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెచ్సీ గంగాధర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. శేఖర్ మృత దేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృడినికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 16,000 – 17,000 కొత్త కొబ్బరి (రెండో రకం) 15,000 – 16,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 24,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 23,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
సత్యదేవునికి ధరల భారం!
అన్నవరం: పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నెలవారీ బడ్జెట్ తలకిందులు కావడంతో ఏమి చేయాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఈ భారం రత్నగిరిపై సత్యదేవునికీ తప్పేలా లేదు. ప్రసాదం తయారీతో పాటు అన్నదాన పథకం నిర్వహణకు ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో ఏటా నిత్యావసరాల కొనుగోళ్లకు సుమారు రూ.25 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తుండగా, ఈ సారి పెరిగిన ధరలతో మరో రూ.ఆరు కోట్ల వరకు ఆదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. పంచదార, యాలకులు, గోధుమల ధర పెరగడంతో సత్యదేవుని ప్రసాదం తయారీకి ఖర్చు ఎక్కువ కానుంది. అలాగే పెరిగిన బియ్యం, నూనెల ధరలతో నిత్యాన్నదాన ప్రసాదంలో భోజనం తయారీ వ్యయం పెరుగుతుంది. ఆరు నెలలకు టెండర్ అన్నవరం దేవస్థానంలో ఉపయోగించే బియ్యం, పప్పులు, నూనె, కందిపప్పు, పంచదార, నెయ్యి, గోధుమలను ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్ కం వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ఈసారి అక్టోబర్ ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు టెండర్ వేయడానికి సెప్టెంబర్ 3ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత ఆయా టెండర్లను తెరచి, తక్కువ ధరకు కోట్ చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారు. మరి ఈ సారి ఎంతకు టెండర్ వెళుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా.. ఏటా రూ.25 కోట్ల బడ్జెట్ కేటాయింపులో సత్యదేవుని ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులు, గ్యాస్కు రూ.15 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో, నివేదనశాలకు అవసరమైన బియ్యం, కందిపప్పు, పామాయిల్, కూరగాయలకు రూ.2.5 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక స్వామివారి వ్రతాల విభాగంలో ఉపయోగించే దీపాల నూనె, అగరవత్తులు, హారతి కర్పూరం, పసుపు, కుంకుమ, గావంచాలు, జాకెట్ ముక్కల కొనుగోలుకు మరో రూ.మూడు కోట్లు వరకు ఖర్చు చేస్తున్నారు. పెరిగిన ధరలు దేవస్థానంలో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు ఆరు నెలల క్రితానికి ఇప్పటికి దాదాపు 30 శాతం పెరిగాయి. ఆ మేరకు సెప్టెంబర్ మూడో తేదీన తెరవనున్న టెండర్లులో కూడా ఆ మేరకు సప్లయిదారులు కోట్ చేసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిత్యావసర పరిమాణం టెండర్ ధర మార్కెట్ రేటు వస్తువులు (6 నెలలకు) (6 నెలల క్రితం) (ప్రస్తుతం) కేజీ రూ.బియ్యం 180 టన్నులు 42 50 – 60 గోధుమలు 400 టన్నులు 32.50 45 – 50 పంచదార 500 టన్నులు 44 68 – 72 కందిపప్పు 25 వేల కేజీలు 129 160 – 180 పామాయిల్ 2 వేల కేజీలు 130 165 – 170 యాలకులు 800 కేజీలు 2,800 4000 ప్రసాదం, భోజనం తయారీకి ఏటా రూ.25 కోట్ల కేటాయింపు ఇప్పుడు మరో రూ.6 కోట్లు పెరిగే అవకాశం 3 వరకు టెండర్కు గడువు ఈసారి ఎంత వెళుతుందోనని ఉత్కంఠ -
గజం స్థలం కోసం గొడవ
● అస్వస్థతకు గురై వ్యక్తి మృతి ● చేబ్రోలులో ఘటన పిఠాపురం: ఇంటి సరిహద్దులో గజం స్థలం కోసం జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందాడు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో సోమవారం జరిగిన ఈ ఘటనపై ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇవీ.. చేబ్రోలులోని కొత్తపేటకు చెందిన ఉలవకాయల సత్తిబాబు (65)కు పక్కింటి దూళిపూడి మహేష్కు ఇటీవల ఇంటి సరిహద్దులో గజం స్థలంపై వివాదం నెలకొంది. ఇది గ్రామ పెద్దల వద్దకు చేరడంతో వారు.. స్థలాన్ని సర్వే చేయించి, హద్దులు తేల్చుతామని, అప్పటి వరకు గొడవలు పడొద్దని చెప్పారు. అయితే సోమవారం సాయంత్రం ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ మాటామాటా పెరిగింది. ఈ వివాదంలో తన తల్లిని తిట్టాడని ఆరోపిస్తూ ఉలవకాయల సత్తిబాబుతో దూళిపూడి మహేష్ గొడవ పడి, చేయి చేసుకున్నాడు. ఇంతలో స్థానికులు అక్కడకు వచ్చి, ఇద్దరినీ విడదీసి పంపించి వేశారు. కొంతసేపటికి సత్తిబాబు తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి మృతి చెందాడు. మహేష్ కొట్టడం వల్లే సత్తిబాబు మృతి చెందాడని మృతుడి బంధువులు పోలీసులు ఫిర్యాదు చేశారు. -
నీట్ పీజీ పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో నీట్ పీజీ పరీక్షను అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నిర్వహించినట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లాలో ఆదివారం జరిగిన నీట్ పీజీ పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సాఫ్ట్ టెక్నాలజీ, ఐయాన్ డిజిటల్ జోన్ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతున్న తీరును, వసతుల కల్పన, విద్యార్థుల హాజరు ఇతర భద్రత ఏర్పాట్లను నేరుగా పరిశీలించి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్ష ముగిసిందని ఆయన తెలిపారు. ఈ పరీక్షకు కాకినాడ జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో 1159 మందికి గాను 1147 మంది విద్యార్థులు హాజరయ్యారని, 98.95 శాతం హాజరు నమోదైందని కలెక్టర్ చెప్పారు. కాపు విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ అమలాపురం టౌన్: కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు అందిస్తున్న ఆర్ధిక సాయం ప్రశంసనీయమని కాకినాడ జిల్లా ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, జిల్లా వ్యవసాయ అధికారి మాధవవరపు వెంకట రామారావు అన్నారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవ సమితి ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ వేదిక వద్ద అదివారం నిర్వహించారు. కోనసీమ కాపు ఉద్యోగ సేవా సమితి అధ్యక్షుడు నల్లా రామకష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 120 మంది కాపు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5,000 చొప్పున రూ.6 లక్షలు ఆర్థిక ప్రోత్సాహకాన్ని అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మెట్ల రమణబాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్కుమార్, రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టర్ దేశంశెట్టి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా అందజేశారు. -
సూర్యుడే సమయ సూచిక..
ద్వారకాతిరుమల: చేతికి వాచ్.. సెల్ఫోన్లో డిజిటల్ టైమ్.. గోడకు క్లాక్.. ఇలా క్షణాల్లో సమయాన్ని తెలుసుకునే ఆధునిక రోజుల్లో సూర్యుడి నీడను చూసి కాలాన్ని లెక్కించిన పద్ధతి ఊహకే ఆశ్చర్యం కలిగిస్తుంది. గడియారాలు అందుబాటులోకి రాక ముందు మనిషికి సూర్యుడే సమయ సూచిక. ఆ సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన పరికరమే సన్ డయల్ (సూర్య ఘడియారం). కాలాన్ని కొలవడమే కాకుండా అప్పటి మనిషి ఖగోళ, గణిత పరిజ్ఞానానికి ఇవి అద్దం పడుతున్నాయి. చారిత్రక సాక్ష్యం సన్ డయల్ ప్రస్తావన వచ్చినప్పుడు అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆలయ తూర్పు రాజగోపురం సమీపంలో సూర్య ఘడియారం ఉంది. ఈ సన్ డయల్ను 1943 జూలైలో పునర్నిర్మించారు. ద్వారకా తిరుమలలోని శ్రీవారి క్షేత్రంలో ఆధునిక సన్ డయల్ ఉంది. 2011 సెప్టెంబర్ 10న ఏర్పాటు చేసిన ఈ ఆధునిక సూర్యయంత్ర పథక నిర్వహణలో శ్రీవేద భారతి సంస్థాపకులు డాక్టర్ రేమెళ్ల అవధానులు కీలక పాత్ర పోషించారు. -
రత్నగిరిపై జోరుగా వివాహాలు
రామాలయం వద్ద విశ్రాంతి మండపంలో వివాహాలు జరుగుతున్న దృశ్యం ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రత్నగిరిపై సాధారణంగా రాత్రి, తెల్లవారుజామున ముహూర్తాల్లోనే వివాహాలు జరుగుతాయి. ఆదివారం మాత్రం ఉదయం 11 గంటల ముహూర్తంలో వివాహాలు జరగడంతో అందరూ ఆసక్తితో తిలకించారు. రత్నగిరి రామాలయం వద్ద గల విశ్రాంతి షెడ్డులో పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడం విశేషం. శ్రావణ మాసం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఉండగా, వివాహ ముహూర్తాలు మాత్రం ఆరో తేదీ వరకు మాత్రమే ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో వివాహాది శుభకార్యాలు జరగవు. అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంబం కానుండటంతో మరలా వివాహాలు జరుగుతాయి. పోటెత్తిన భక్తులు సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. రత్నగిరి సత్యదేవుని సన్నిధిన, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారి వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించారు. దీంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేశారు. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఆరు వేల మంది స్వామివారి ఉచిత అన్నప్రసాదం స్వీకరించారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
కాకినాడ రూరల్: మండలంలోని వాకలపూడి గ్రామ పంచాయతీలోని పోలింగ్ కేంద్రాలను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే ఆదివారం సందర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా వార్డుల వారీగా విభజన, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితా తయారీపై అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, ఎంపీడీఓ పి.సతీష్, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీరామాంజనేయులు పాల్గొన్నారు. -
నిలువెత్తు నిర్లక్ష్యం
మిల్లుల్లో తనిఖీలు.. అధికారుల నిఘా ● సీఎంఆర్ బియ్యం ఎప్పుడిస్తారు? ● 47,500 టన్నులు పెండింగ్లోనే ● గడువు ముగుస్తున్నా పట్టించుకోని మిల్లర్లు మిల్లులకు నోటీసులు జారీ సీఎంఆర్ బియ్యం సరఫరా చేయాల్సిన మిల్లులకు నోటీసులు జారీ చేశాం. ఖరీఫ్ ధాన్యం సేకరణకు సన్నద్ధం కావడానికి ముందే రబీ సీఎంఆర్ను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. నిర్లక్ష్యం వహించే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మిల్లుల్లో నిల్వలు, ధాన్యం మిల్లింగ్ పరిస్థితి, సీఎంఆర్ సరఫరా వివరాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వానికి అందాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా అందించకపోతే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆనందరావు, జిల్లా మేనేజర్, పౌరసరఫరాల సంస్థ బోట్క్లబ్ (కాకినాడసిటీ): రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)గా మార్చి ప్రభుత్వానికి అప్పగించాల్సిన విషయంలో కొందరు రైస్ మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి సంబంధించి ఇప్పటికీ 47,500 టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉంది. పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ కొందరు మిల్లర్లు సీఎంఆర్ బియ్యం సరఫరాలో జాప్యం చేస్తుండటంపై పౌరసరఫరాల శాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే సొమ్ములు చెల్లించేందుకు పౌరసరఫరాల సంస్థలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అప్పులు, వడ్డీలతో నిధులు సమకూర్చి చెల్లింపులు చేపడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద రైస్ మిల్లులకు అప్పగించి, మిల్లింగ్ అనంతరం నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించే విధానం అమల్లో ఉంది. భారీ మొత్తంలో పెండింగ్లోనే.. గత రబీ సీజన్లో జిల్లాలో రైతుల నుంచి సుమారు 2.32 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసి వివిధ రైస్ మిల్లులకు సీఎంఆర్ కోసం కేటాయించింది. దీనికి సంబంధించి సుమారు 1.22 లక్షల టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందాల్సి ఉండగా, ఇప్పటివరకు 84,800 టన్నుల వరకు మాత్రమే మిల్లర్లు సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దీంతో ఇంకా సుమారు 47,500 టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావాల్సి ఉంది. దీని విలువ సుమారు రూ.218 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంత భారీ మొత్తంలో సీఎంఆర్ బియ్యం పెండింగ్లో ఉండటంతో పౌరసరఫరాల సంస్థ ఆర్థిక వనరులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 94 మిల్లులు.. 22 మాత్రమే పూర్తి జిల్లాలో మొత్తం 94 రైస్ మిల్లులు సీఎంఆర్ ప్రక్రియలో భాగస్వాములుగా ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు 23 మిల్లులు మాత్రమే వంద శాతం సీఎంఆర్ బియ్యాన్ని సరఫరా చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 72 మిల్లుల్లో కొన్నింటి నుంచి బియ్యం సరఫరా పూర్తికాకపోవడంతో పెండింగ్ పరిమాణం భారీగా పెరిగింది. సీఎంఆర్ బియ్యం సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న మిల్లర్లకు జిల్లా అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా పెండింగ్ సీఎంఆర్ను పూర్తిగా సరఫరా చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని మిల్లుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదు. అప్పుడు ఎగబడి.. ఇప్పుడు కుంటిసాకులు.. రబీ సీఎంఆర్ బియ్యం డెలివరీ, ఎఫ్సీఐ, పౌరసరఫరాల శాఖ గోడౌన్లకు తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రబీ ధాన్యం మిల్లర్లకు ఇచ్చి సుమారు నాలుగు నెలలు కావస్తోంది. అయినప్పటికీ బియ్యం ఇచ్చేందుకు మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రబీ ధాన్యం దక్కించుకోవడానికి మిల్లర్లు ఎగబడ్డారు. తీరా ధాన్యం తీసుకున్నాక మిల్లింగు చేయడానికి అనేక కుంటి సాకులు చెబుతున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది. సకాలంలో బియ్యం డెలివరీ కాకపోవడంతో చెల్లింపులు నిలిచిపోయాయి. కొందరు మిల్లర్లు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని దొడ్డిదారిన విక్రయించి, ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రైస్ మిల్లర్పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సీఎంఆర్ రైస్ మిల్లులపై ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తూ కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం నిల్వలు ప్రస్తుతం ఉన్నాయా, వాటిని మిల్లింగ్ చేశారా, మిల్లింగ్ చేసిన ధాన్యానికి సంబంధించిన బియ్యం ప్రభుత్వానికి ఎందుకు సరఫరా కాలేదు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలో సీఎంఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించి ప్రైవేటుగా తరలించినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మిల్లులకు కేటాయించిన ధాన్యం, మిల్లింగ్ చేసిన బియ్యం, ప్రభుత్వానికి అందించిన పరిమాణం తదితర వివరాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు త్వరలో ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభం కానున్న నేపథ్యంలో రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ బియ్యం మొత్తం సరఫరా చేయాల్సిన బాధ్యత మిల్లర్లపై ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రబీ సీఎంఆర్ పెండింగ్లో ఉంచి తిరిగి ఖరీఫ్ సీజన్లో సీఎంఆర్ కేటాయింపులు పొందేందుకు ప్రయత్నించే మిల్లులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. -
చట్టాలపై సమగ్ర అవగాహన అవసరం
అమలాపురం రూరల్: న్యాయవాదులు చట్టాల పట్ల సమగ్ర అవగాహన కలిగి ఉండాలని విశ్రాంత హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ బొలుసు శివశంకర్ అన్నారు. ‘ఆస్తి చట్టాలు–2018 సవరించబడిన స్పెసిఫిక్ రిలీఫ్ చట్టంపై ప్రత్యేక ప్రస్తావన’ అనే అంశంపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో సి.పద్మనాభరెడ్డి సెమినార్ హాల్లో ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆస్తి చట్టాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరిస్తూ వివరించారు. చట్ట సవరణలు, తీర్పుల పట్ల న్యాయవాదులు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవడం ద్వారా కక్షిదారులకు న్యాయం అందించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా జస్టిస్ బొలుసు శివశంకర్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజామ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాశి శేషారావు, బార్ కౌన్సిల్ సభ్యుడు సీహెచ్ అజయ్ కుమార్, ముప్పాళ్ళ సుబ్బారావు, సీనియర్ న్యాయవాది కూచిమంచి మళ్ళపరాజు, కె.శశిధర్ శ్రీరాం, అబ్బిరెడ్డి సురేష్, నల్లా ప్రభాకర్, నంబూరి మూర్తి, హమీద్ పాషా, బడుగు భాస్కర్ జోగేష్, మణి, లావణ్య, బ్లెస్సీ సాయి, యు.లక్ష్మణరావు, ముర్తుజా తదితరులు పాల్గొన్నారు. -
ఇష్టమైన వాడి కోసం భర్తను వదిలొచ్చి..
● అనుమానిస్తున్నాడని ఆత్మహత్య ● బంజారాహిల్స్లో ఘటన బంజారాహిల్స్: ఇష్టమైన వాడి కోసం కట్టుకున్న భర్తను వదిలి వచ్చిన ఓ యువతి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనుమానపు భర్తతో వేగలేక, అవమానాలు భరించలేక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ విజయ్ కొట్టూర్ తెలిపిన వివరాల ప్రకారం.. అన్నవరానికి చెందిన ఎం.రాజేశ్వరి (23) వివాహం 2023లో ముత్యాలరావుతో జరిగింది. అదే ఏడాది హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2 ఇందిరానగర్లో నివసించే అంతటి సాయికుమార్ (28)తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ముత్యాలరావుతో పెళ్లి జరిగిన నెల రోజులకే ఏప్రిల్లో ఫేస్బుక్లో సాయికుమార్కు రాజేశ్వరి పరిచయమైంది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారితీసింది. అదే ఏడాది జూన్లో సాయికుమార్ ప్రేమించిన యువతి రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఆమెను ఇందిరానగర్ తీసుకువచ్చి కాపురం పెట్టాడు. ఓ నగల షాపులో పనిచేస్తున్న రాజేశ్వరిని నెల రోజుల తర్వాత జూలైలో మొదటి భర్త ముత్యాలరావు వచ్చి తీసుకువెళ్లాడు. ఆగస్టు 13న సాయికుమార్ మళ్లీ వెళ్లి ఆమెను తిరిగి హైదరాబాద్ తీసుకువచ్చి ఆగస్టు 16న ఇందిరానగర్లోని అద్దె గదిలో తాళి కట్టాడు. అప్పటి నుంచి ఇద్దరూ భార్యాభర్తల్లాగా కాపురం పెట్టారు. నగల షాపులో సేల్స్గర్ల్గా పనిచేస్తున్న రాజేశ్వరి గత నాలుగైదు నెలల నుంచి ఇన్స్ట్రాగామ్లో మరో యువకుడితో చాటింగ్ చేస్తుండడం, ఫోన్లో మాట్లాడుతుండడాన్ని సాయికుమార్ గుర్తించాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. వేరే యువకుడితో ఆమె చేస్తున్న చాటింగ్ వల్ల ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఈ నెల 25వ తేదీ ఉదయం ఇదే విషయంలో రాజేశ్వరి, సాయికుమార్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అనుమానంతో సాయికుమార్ ఆమెను తిట్టడంతో పాటు తీవ్రంగా వేధించి మానసికంగా హింసించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఎవరి డ్యూటీలకు వారు వెళ్లిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంలో మళ్లీ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వివాదానికి దారితీసింది. ఈ అనుమానాన్ని, అవమానాన్ని భరించలేక రాజేశ్వరి బాత్రూమ్లోకి వెళ్లి షవర్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గంట గడిచినా ఆమె బాత్రూమ్లో నుంచి బయటకు రాకపోయేసరికి సాయికుమార్ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా షవర్ కొక్కానికి వేలాడుతూ కనిపించింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తల్లి సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడు సాయికుమార్పై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
సర్కారు పగాకు
● మెరుగుపడని వర్జీనియా పొగాకు ధర ● రూ.300 దిగువనే నాణ్యమైన రకం ● గిట్టుబాటు కాక కౌలురైతుల ఆందోళన ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం దేవరపల్లి: పొగాకు మార్కెట్ మందగమనంలో ఉంది. వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ప్రారంభమై దాదాపు 150 రోజులు దాటినా, ఆశించిన మేర ధర రాకుంది. కొనుగోళ్ల తీరును చూసి రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. వచ్చినకాడకు అమ్ముకుని చేసిన అప్పులు తీర్చుకుందామన్నా కొనుగోలు చేసే నాథుడు లేక నిరాశ చెందుతున్నారు. 2017–28 పంట సీజన్ ప్రారంభమై నారుమడులు పడుతుండగా, గత ఏడాది పండించిన పంటను ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. వచ్చే ఏడాదికి పొగాకు పంట వేయాలా? వద్దా? అనే సందిగ్ధంతో ఉన్నారు. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని దేవరపల్లి, జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల పరిధిలో 2025–26లో 85 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తి జరిగింది. ఇప్పటి వరకు కేవలం 20.56 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇంకా రైతుల వద్ద సుమారు 65 మిలియన్ల కిలోల కొనుగోలు చేయాల్సి ఉంది. రీజియన్ పరిధిలో 12,938 మంది రైతులు, 30,145 హెక్టార్లలో పొగాకు పంట సాగు చేశారు. టోబాకో బోర్డు 23,299 హెక్టార్లలో పంట సాగుకు అనుమతి ఇవ్వగా, అదనంగా సుమారు 7 వేల హెక్టార్లలో పంట సాగు చేశారు. 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తి చేయాల్సి ఉండగా, 85 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. ప్రంపంచ వ్యాప్తంగా ఈ ఏడాది పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరగడం, ఎగుమతి ఆర్డర్లు పూర్తి స్థాయిలో ఖరారు కాకపోవడంతో మార్కెట్ సంక్షోభంలో పడింది. ఆశలు ఆవిరి ఈ ఏడాది ఎన్నో ఆశలు పెట్టుకుని, అధిక ధరకు భూముల కౌలు, బ్యారన్ల అద్దెకు తీసుకుని చిన్న, సన్నకారు రైతులు పొగాకు సాగు చేశారు. కనీసం సెంటు కూడా సొంత భూమి లేనివారు 10 నుంచి 30 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. ఎకరాకు సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టారు. బ్యారన్ లైసెన్స్పై బ్యాంకులు బ్యారన్కు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ రుణాలు ఇచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలోకు సగటున రూ.240 పలకడంతో బ్యాంకు అప్పులు కూడా తీరే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. కిలోకు పెట్టుబడి రూ.300 కాగా, వచ్చే రాబడి రూ.240 ఉందని అంటున్నారు. కిలోకు రూ. 60 నుంచి రూ.70 నష్టం వస్తోందని ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతుల ఇళ్లలోనే బేళ్లు ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్ల పొగాకు రంగు, నాణ్యత దెబ్బతింటున్నట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదించి.. కోత విధించి 2026–27 పంట కాలానికి పొగాకు ఉత్పత్తిలో పొగాకు బోర్డు కోత విధించింది. ఈ మేరకు సాగు ప్రణాళికను ఖరారు చేసింది. 2025–26 పంట కాలంలో రీజియన్ పరిధిలో 50.87 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 85 మిలియన్ల కిలోలు ఉత్పత్తి జరిగింది. దీంతో వచ్చే ఏడాది 28.02 మిలియన్ల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. దీని ప్రకారం బ్యారన్కు రెండు ఎకరాల్లో పంట వేసి, 20 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాల్సి ఉంది. రాష్ట్రంలో 2025–26 పంట కాలంలో 143 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, 243 మిలియన్ల కిలోల ఉత్పత్తి జరిగింది. వచ్చే ఏడాది పంట పరిమాణాన్ని 81.02 మిలియన్ల కిలోలకు కుదించారు. దీనికి లోబడి పంట పండించాలని బోర్డు అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అనుమతి మేరకే సాగు చేయాలి బోర్డు అనుమతించిన మేరకే పొగాకు సాగు చేయాలి. బ్యారన్కు రెండు ఎకరాల విస్తీర్ణంలో పంట వేసి, 20 క్వింటాళ్ల ఉత్పత్తి చేయాలి. సాగు విస్తీర్ణం తగ్గించి పొగాకు నాణ్యతపై రైతులు దృష్టిపెట్టాలి. 2026–27 పంట ప్రణాళిక ప్రకారం ఉత్పత్తి తగ్గించారు. పొగాకు నారుమడులు వేసే రైతులు, వ్యాపారులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. –పి.హేమస్మిత, టొబాకో బోర్డు వేలం నిర్వహణాధికారి, దేవరపల్లి అదనపు అమ్మకాలకు అనుమతి ఇవ్వాలి బోర్డు ఇచ్చిన కోటా ప్రకారం బ్యారన్కు 35 క్వింటాళ్లు పొగాకు అమ్మకాలు పూర్తయిన రైతులకు అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వాలి. వాతావరణం కలిసి రావడం వల్ల బ్యారన్కు అదనంగా 10 నుంచి 20 క్వింటాళ్ల ఉత్పత్తి జరిగింది. గ్రేడింగ్లు పూర్తయి 6 నెలలు గడవడంతో రంగు, నాణ్యత దెబ్బతింటుంది. అదనపు పంట అమ్ముకోవాడానికి అనుమతి ఇవ్వాలి. –సుంకవల్లి శ్రీనివాస్, రైతు, సంగాయగూడెం, దేవరపల్లి మండలం -
పార్టీ పదవుల భర్తీ అన్నారు.. ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేనలో పార్టీ పదవుల భర్తీపై నాయకులు, కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆగస్టు 15లోగా అన్ని స్థాయిల్లో పదవులను భర్తీ చేస్తామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించినా ఆ దిశగా కదలిక లేదని జనసైనికులు మండిపడుతున్నారు. ఆరోగ్యం సరిగా లేదంటూ పదవుల భర్తీని వాయిదా వేయడం సరికాదని, ఇకనైనా దీనిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలంటే క్షేత్ర స్థాయి పదవుల భర్తీ కీలకమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిగా జతకట్టినప్పటి నుంచీ టీడీపీ ప్రయోజనాలు, ఆ పార్టీ విజయం, పల్లకీ మోసేందుకే జనసేన పరిమితం కావడంపై ఆ పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి. ‘సంస్థాగతంగా బలోపేతం అయ్యే ఆలోచనే లేదు. టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గవిభేదాలు నెలకొన్న సందర్భాల్లో పార్టీ అధినేత పవన్ స్వయంగా సర్దుకుపోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం నిరుత్సాహానికి గురిచేస్తోంది’ అని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు నూతన కమిటీలను ఏర్పాటు చేస్తామని పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. పదవులు ఆశిస్తున్న వారు తమ దరఖాస్తులనూ అధిష్టానానికి పంపారు. అయితే ఆగస్టు ముగుస్తున్నప్పటికీ దీనిపై అతీగతీ లేకపోవడంతో ఆశావహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. నిజానికి జనసేనలో పదవుల భర్తీ ప్రక్రియ చేపడతామని ఆరు నెలల క్రితమే ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించి వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా పార్టీలో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదన్న భావన జనసేన శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ పార్టీకి మొండిచేయి చూపారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
పులసా.. ప్చ్ రాట్లేదండీ!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘పుస్తెలు అమ్మయినా పులస పులుసు తినాల్సిందే’.. అన్నది గోదావరితో పాటు ఇతర ప్రాంత వాసుల నానుడి. పోషక విలువలు, జిహ్వకు రుచి దీనికి కారణం. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరికి వరదలు పోటెత్తేవి. జీవనదిలోకి ఎర్రటి నీరు భారీగా చేరేది. గోదాట్లో నీరు ఎరుపెక్కిందంటే ఇంకేముంది.. పులస వేటకు మత్స్యకారులు పోటెత్తేవారు. గోదావరి ప్రవాహానికి ఎదురీదుతూ ఏడాదికి ఒకసారి మాత్రమే లభ్యమయ్యే పులస కోసం యానాం, ఎదుర్లంక, ధవళేశ్వరం, రావులపాలెం, సిద్ధాంతం, నరసాపురం తదితర గోదావరి ప్రాంతాల్లో కోలాహలం ఉండేది. వేలం పాటలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొనేది. ముందస్తుగా అడ్వాన్సులు ఇచ్చిమరీ చేపను ఇంటికి తీసుకువెళ్లేవారు. ఇదంతా గతం. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షం జాడ లేదు. దీంతో భారీ వరద నెమ్మదించింది. ఈ పరిణామం మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసింది. ప్రస్తుత సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు యానాంలో మూడు, కోటిపల్లిలో ఒకటి చొప్పున నాలుగు పులసలు మాత్రమే లభ్యంకావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వాతావరణ పరిస్థితుల వల్ల బంగాళాఖాతం నుంచి పులస గోదావరిలోకి రాకుండా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు పయనిస్తోందని మత్స్య శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి (కేజీబేసిన్)లో చమురు కార్యకలాపాల్లో భాగంగా చేపడుతున్న డ్రెడ్జింగ్తో ధ్వని కాలుష్యం పెరిగిపోవడం కూడా పులసలు గోదావరిలోకి రాకపోవడానికి కారణమన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి. -
విద్యుత్ శాఖ నిర్వాకంతో చేపల మృత్యువాత
ఆక్వా రైతు ఆరోపణ కరప: చేపల చెరువుకు చెందిన విద్యుత్ సరఫరాను అధికారులు కట్ చేయడంతో చేపలు చనిపోయాయని ఆక్వా రైతు ఆరోపించారు. మండలం కొంగోడు గ్రామానికి చెందిన ఆక్వా రైతు వి.నారాయణరావు వేములవాడలో ఐదు ఎకరాల్లో చేపలు సాగు చేస్తున్నారు. ఈ చెరువులకు సంబంధించి రూ.52 వేల విద్యుత్ బిల్లు చెల్లించకపోవడంతో లైన్మన్ సరఫరా నిలిపివేశారు. దీంతో సరైన ఆక్సిజన్ అందక రూ.వేల విలువైన చేపలు చనిపోయినట్టు రైతు ఆరోపించారు. విద్యుత్ బిల్లు పూర్తిగా చెల్లించానని, అదనపు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లింపునకు రెండు రోజులు గడువు అడిగినా విద్యుత్ తొలగించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై విద్యుత్ ఏఈ సానా ఈశ్వరప్రసాద్ను వివరణ కోరగా ఈ నెల ఆరో తేదీకి కట్టాల్సిన బిల్లు ఆలస్యంగా చెల్లించారని, సెక్యూరిటీ డిపాజిట్ రూ.8 వేలు సైతం ఏప్రిల్ నుంచి అడుగుతున్నా చెల్లించకపోవడంతో శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు లైన్మ్యాన్ విద్యుత్ సరఫరా నిలిపివేశారని, మళ్లీ రెండు రోజులు గడువు అడగడంతో 3.20 గంటలకు సరఫరా పునరుద్ధరించారని, ఈ స్వల్ప వ్యవధిలో చేపలు చనిపోయాయనడం సరికాదని తెలిపారు. రెండురోజుల క్రితం నుంచి చేపలు చనిపోతున్నట్టు పక్కరైతులు తెలిపారన్నారు. -
రుడాకు కొత్త రూపం
● నగరపాలక సంస్థ, మూడు మున్సిపాలిటీలు, 314 పంచాయతీలు ● మొత్తం 2,838 కిలోమీటర్ల విస్తీర్ణం ● పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) పరిధిని ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. మొత్తం తూర్పుగోదావరి జిల్లాను రుడా పరిధిలోకి తీసుకొచ్చింది. జిల్లాలోని 22 మండలాల్లోని 314 పంచాయతీలతో పాటు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, కొవ్వూరు, నిడదవోలు, మండపేట మున్సిపాలిటీ వరకూ విస్తరించింది. ఫలితంగా 2,838 కిలోమీటర్ల మేర రుడా పరిధి మారింది. అదే సమయంలో ఇప్పటి వరకూ రుడా పరిధిలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రాంతాలను మినహాయించింది. విభజించిన జిల్లాల భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేసింది. కలసిన ప్రాంతాలు ఇవే.. గతంలో 17 మండలాల్లోని 207 గ్రామాలు, ఒక నగరపాలక సంస్థ, 3 పట్టణ స్థానిక సంస్థలు కలిసి మొత్తం 1566.442 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రుడా ఉండేది. జిల్లాల విభజనతో తూర్పుగోదావరిలో కలిసిన మండపేట మున్సిపాలిటీని ప్రస్తుతం రుడా పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇప్పటి వరకూ రుడాలో లేని కడియం మండలంలోని మూడు గ్రామాలు, గోకవరంలోని 15, అనపర్తిలోని ఆరు, బిక్కవోలులోని ఆరు, మండపేటలోని ఆరు, రాయవరంలోని మూడు, కపిలేశ్వరపురంలోని ఒక గ్రామాన్ని కలిపారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఏడు మండలాల్లోని 40 గ్రామాలను విలీనం చేశారు. దీంతో జిల్లాలోని రాజమహేంద్రవరం అర్బన్తో పాటు మిగిలిన 21 మండలాల్లోని 314 పంచాయతీలు, నాలుగు పట్టణ స్థానిక సంస్థలు రుడా పరిధిలోకి వచ్చేశాయి. మినహాయించినవి ఇవే.. ఇప్పటి వరకూ రుడా పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రపురం మున్సిపాలిటీని మినహాయించారు. అలాగే రామచంద్రపురం రూరల్ మండలంలోని 20 గ్రామాలు, కోటిపల్లి, గంగవరంలోని 24, ఆలమూరులోని 15, ఆత్రేయపురంలోని 15, రావులపాలెం మండలంలోని 11 గ్రామాలను రుడా నుంచి మినహాయించారు. గోపాలపురం నియోజకవర్గంలో భాగమైనప్పటికీ ఏలూరు జిల్లాకు చెందిన ద్వారకాతిరుమల మండలంలోని 36 గ్రామాలను కూడా తొలగించారు. మొత్తంగా ఒక మున్సిపాలిటీతో పాటు ఆరు మండలాల్లోని 121 పంచాయతీలను రుడా పరిధి నుంచి మినహాయించారు. ఈ మేరకు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సౌకర్యాలు మెరుగుకు అవకాశం ● తూర్పుగోదావరి జిల్లా మొత్తం రుడా పరిధిలోకి రావడంతో సౌకర్యాలు మెరుగుపడడంతోపాటు ఆస్తుల విలువలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సామాన్యులపై పన్నుల భారం పడనుంది. ● పంచాయతీల్లోని రోడ్లు, డ్రైనేజీలను నగర స్థాయి ప్రమాణాలతో నిర్మించే అవకాశం ఉంటుంది. వీధి దీపాలు, తాగునీటి సరఫరా మెరుగవుతుంది. ● గ్రామంలోని భూములు, ఇళ్ల విలువలు ఒక్కసారిగా పెరుగుతాయి. ● గ్రామాల్లోని ఇళ్లను ఇక నుంచి ప్రణాళికతో నిర్మించాల్సి ఉంటుంది. ● శివారు ప్రాంతాలకు కూడా రియల్ ఎస్టేట్ రంగం విస్తరిస్తుంది. ● పంచాయతీల్లో లేఅవుట్లు వేసేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెల్లించే రుసుములో నుంచి కొంత భాగాన్ని రుడా మళ్లీ పంచాయతీలకు అందిస్తుంది. ఫలితంగా ఆ నిధులతో అక్కడ అభివృద్ధి పనులకు అవకాశం ఉంటుంది.పన్నుల భారం.. అనుమతుల్లో జాప్యం రుడా పరిధిలోకి రావడంతో గ్రామాల్లోని వ్యవసాయ భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ప్లాట్లుగా మార్చే అవకాశం ఉంది. దీంతో పచ్చని పంట పొలాలు కాంక్రీట్ జంగిల్గా మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకూ పంచాయతీల్లో ఇల్లు కట్టుకోవాలంటే సర్పంచ్ లేదా కార్యదర్శి సంతకం సరిపోయేది. కానీ రుడా పరిధిలోకి వచ్చాక ఆన్లైన్ దరఖాస్తులు, బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్స్ కోసం రాజమహేంద్రవరంలోని కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేకంటే ఉన్న ఇల్లు విస్తరించాలన్నా రుడాకు లేఅవుట్ డెవలప్మెంట్ చార్జీలు, అప్రూవల్ ఫీజుల రూపంలో రూ.వేలు చెల్లించాలి. పంచాయతీ పన్నుల స్థానంలో అర్బన్ అథారిటీ స్థాయి పన్నులు అమలులోకి వస్తాయి. ఫలితంగా గృహ, నీటి పన్నులు గణనీయంగా పెరుగుతాయి. ఇది సామాన్యులకు ఆర్థిక భారం కానుంది. ప్రభుత్వ భూమి విలువ పెరగడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ భారం పడుతుంది. -
నారప్ప చెరువులో అక్రమ తవ్వకాలు
గర్భం గుల్లవుతున్నా పట్టించుకోని అధికారులు తుని రూరల్: డి.పోలవరం గ్రామానికి చెందిన నారప్ప చెరువు గర్భంలో రాత్రి వేళల్లో అక్రమ తవ్వకాలు చేస్తుండగా పగలు వీబీజీ రామ్జీ పథకం పనులు చేస్తున్నారు. చెరువు గర్భాన్ని ప్రమాదకరంగా ఇష్టానుసారం తవ్వేస్తూ ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టుకుపోతున్నా అధికారులు చూసిచూడనట్టు వ్యహరిస్తున్నారని రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండ రాత్రి వేళల్లో జేసీబీలతో తవ్వేసి విలువైన మట్టిని తరలించుకుపోతున్నారు. ముంపు నివారణకు అనువుగా పల్లపు భూములు ఎత్తు చేసుకునేందుకు ఎవరైన రైతులు ఇలా చేస్తే అధికారులు ఆగమేఘాలపై వాలిపోతారని, లే అవుట్లకు అనువుగా భూములను ఎత్తు చేసుకునేందుకు ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నట్టు తెలిపారు. వర్షాలు కురవకపోవడం, తాండవ రిజర్వాయర్ నుంచి చెరువుకు సాగునీరు చేరకపోవడంతో అక్రమార్కులకు చెరువు మట్టి బంగారంగా మారిందన్నారు. భవిష్యత్లో వర్షాలు కురిసినా, తాండవ నుంచి నీరు చేరినా చెరువులో బంటాలు (గుంతలు) ఏర్పడి ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. కాపరులు పశువులు కడిగేందుకు దిగితే ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ తవ్వకాలు నిలువరించి మెషీన్లను సీజ్ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు. -
అమ్మానాన్నకు ఏం చెప్పాలిరా?
గండేపల్లి: స్నేహితులను మించిన అన్నదమ్ముల అనుబంధం వారిది. అప్పటివరకు కలిసే ఉన్న వారి బంధంపై విధికి కన్ను కుట్టిందేమో.. ప్రమాద రూపంలో వెంటాడి విడదీసింది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో కళ్లముందే తమ్ముడు మృతిచెందడంతో అన్న పడిన వేదన వర్ణనాతీతం. ఇరవై రెండేళ్లు కలిసే ఉన్నాం కదరా.. నన్నొంటరిని చేసి వెళ్లిపోయావా తమ్ముడు.. అంటూ తోడబుట్టిన తమ్ముడి కోసం అన్న పడుతున్న వేదన చూపరులను కన్నీళ్లు పెట్టించింది. ఈ ప్రమాదంలో మణికట్టు తెగిపడి తానూ తీవ్ర గాయాలపాలైనప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూనే.. ‘నీకోసం అడిగితే.. అమ్మ నాన్నకు ఏం సమాధానం చెప్పాలిరా..’ అంటూ ఆ అన్న భోరున విలపించిన తీరు చూసి అంబులెన్స్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన గండేపల్లి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం కాగిత గ్రామానికి చెందిన రబ్బా రమణ కుటుంబం కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. రమణకు ఒక కుమార్తె, రబ్బా నవీన్, రబ్బా ప్రసాద్ (22) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. అన్నదమ్ములు ఇద్దరూ వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు బైక్పై గత ఆరు వారాలుగా ప్రతి శనివారం వచ్చి వెళుతున్నారు. ఏడో వారమైన ఈ శనివారం కూడా వాడపల్లికి వచ్చిన వీరు దర్శనానంతరం స్వగ్రామానికి బయలుదేరారు. సాయంత్రానికి మండలంలోని మురారి గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ బరోడా సమీపంలోకి వచ్చేసరికి ఇసుక లోడుతో ముందు వెళుతున్న టిప్పర్ లారీని తప్పించే ప్రయత్నంలో బైక్ హ్యాండిల్ లారీకి తగిలి అదుపుతప్పి వెనుక చక్రాల కింద పడిపోయారు. ఈ ఘటనలో ప్రసాద్ నడుము భాగం పైనుంచి లారీ దూసుకుపోవడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. నవీన్ కుడి చెయ్యి లారీ చక్రాల కింద చిక్కుకుని మణికట్టు వరకు తెగిపడింది. స్థానికుల సహాయంతో 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జెడ్ రాగంపేట సీహెచ్సీకి తరలించారు. ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న రోడ్డు సేఫ్టీ పోలీస్, హైవే సేఫ్టీ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి తక్షణ సహాయక చర్యలు చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ యూవీ శివనాగబాబు తెలిపారు. నన్నొంటరిని చేశావా తమ్ముడూ? 22 ఏళ్లు కలిసే ఉన్నాం కదరా! తీవ్రంగా గాయపడినా.. కళ్లముందే తమ్ముడి మృతిని తట్టుకోలేక అన్న ఆక్రోశం బైక్ అదుపుతప్పిన ఘటనలో తమ్ముడు మృతి మణికట్టు వరకు తెగిపడిన అన్న కుడి చెయ్యి దైవదర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ఘటన -
అయ్యో.. రొయ్యో!
ఒకవైపు మేత ధరల మంట.. మరోవైపు రొయ్యల కొనుగోలు ధరల కోత.. మధ్యలో ఆక్వా రైతు నలిగిపోతున్నాడు. రొయ్యల పెంపకానికి అవసరమైన మేత ధరను కంపెనీలు వరుసగా పెంచుతుండగా.. పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలుదారులు సిండికేటుగా మారి ధరలను తగ్గించేస్తున్నారు. పెట్టుబడులు పెంచేలా చేసి.. రాబడి తగ్గించే విధంగా కంపెనీలు చేస్తున్న పనులు ఆక్వా రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో నీలి విప్లవానికి కేరాఫ్ అడ్రస్గా మారిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పుడు ఆ సాగు రైతులకు అప్పులు మిగుల్చుతోంది. వరుస సంక్షోభాలతో డాలర్ పంట రైతుకు గిట్టుబాటు కాని వ్యవహారంగా మారిపోయింది. ఉమ్మడి తూర్పు పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 15 వేల ఎకరాలు, కాకినాడ జిల్లాలో మరో 8 వేల ఎకరాల్లో వనామీ సాగు జరుగుతున్నట్టు అంచనా. రెండు జిల్లాల్లో తొలి, రెండో, మూడో పంటలు కలిపి ఒకే ఏడాదిలో సుమారు 50,600 ఎకరాల్లో వనామీ సాగవుతోందని అంచనా. గతంలో టైగర్ సాగు ఉన్నా మధ్యలో దాదాపు నిలిచిపోయింది. పాలీ కల్చర్ (చేప, రొయ్యలు కలిపి పెంపకం)లో భాగంగా రైతులు సాగు చేస్తున్నారు. ఇటీవల టైగర్ రొయ్యల ధరలు పెరగడంతో కొంతమంది రైతులు దీని సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు రకాల సాగుతో స్థానిక రైతులు ఏటా వందల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్నారు. మరోసారి మేత ధరల పెంపు తాజాగా రొయ్యల మేతను ఆయా కంపెనీలు పెంచేశాయి. ఈసారి ఏకంగా వనామీ రొయ్యల మేత టన్నుకు రూ.5,700, టైగర్ మేతకు రూ.3,850 చొప్పున ధర పెంచుతూ ఆయా కంపెనీలు తమ డీలర్లకు లేఖలు రాశాయి. పెంచిన ధరలు సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటికే పెరిగిన ధరలకు మరోసారి భారం తోడైంది. గత ఆరు నెలల కాలంలో మేత ధరలు పెంచడం ఇది మూడోసారి. టన్ను మేత ధర సుమారు రూ.16 వేల వరకు పెరగ్గా.. తాజా పెంపుతో టన్ను ధర రూ.21,500కు చేరినట్టు రైతులు చెబుతున్నారు. ఆరు నెలల్లోనే మేత ధరలను మూడుసార్లు పెంచడంపై రైతులు మండిపడుతున్నారు. మరింత పెంచేందుకు యత్నం అసలు కంపెనీలు టన్నుకు రూ.15 వేల వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని సమాచారం. రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా తొలి విడతగా రూ.5,700 పెంచినట్టు తెలుస్తోంది. తరువాత దశల వారీగా ధరలు పెంచనున్నాయనే ప్రచారం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. చూసీచూడనట్టుగా ప్రభుత్వం తీరు.. వనామీ రొయ్యల మేత ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచేస్తున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. ధరల పెంపుపై కోనసీమ జిల్లాకు చెందిన రైతులు పలు దఫాలుగా ధర్నాలు, ఆందోళనలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మేత కంపెనీలకు, కొనుగోలుదారుల సిండికేటుకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వారికి పరోక్షంగా అనుకూలంగా మారిందని రైతులు మండిపడుతున్నారు. గతేడాది నుంచి వరుస కష్టాలు ఇంత భారం మోస్తున్న తమకు పంట అమ్మకంలోనూ ఊరట లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమెరికా సుంకాల ప్రభావం, తెగుళ్లతో నష్టపోయిన రైతులకు ఈ ఏడాది యుద్ధం పేరుతో కొనుగోలుదారులు కేజీ కౌంట్కు రూ.35 నుంచి రూ.40 వరకు ధర తగ్గించారు. తరువాత ధరలు పెంచినా అది రైతుల వద్ద రొయ్యలు లేనప్పుడు మాత్రమే. అమెరికా, యూరప్కు 30 నుంచి 70 కౌంట్ వరకు రొయ్యలు ఎగుమతి అవుతున్నప్పటికీ.. యుద్ధాన్ని సాకుగా చూపి ధరలు తగ్గించడం అన్యాయమంటున్నారు. 100 కౌంట్ నుంచి 69 కౌంట్ వరకు ధరలు తగ్గించివేయడం గమనార్హం. మరోసారి మేత దరువు మళ్లీ రొయ్యల మేత ధరలకు రెక్కలు వనామీ మేత టన్నుకు ఏకంగా రూ.5700 పెంపు రెండేళ్లలో టన్నుకు రూ.16 వేలకు పైగా పెంచిన వైనం తాజా పెంపుతో రూ.21,500కు చేరిన టన్ను మేత ధర పెట్టుబడిలో సగం మేతకే మేత కంపెనీల దోపిడీకి కొనుగోలుదారుల సిండికేటు తోడైందని ఆగ్రహం ప్రభుత్వ పెద్దల మౌనం దోపిడీదార్లకు అండగా మారిందంటూ రైతుల మండిపాటు సాగు చేయలేని పరిస్థితి టన్ను మేత ధరను రూ.21 వేలకు పైగా పెంచేశారు. ఎకరాకు అయ్యే పెట్టుబడిలో రూ.3 లక్షలు మేతకే అవుతోంది. కరెంటు బిల్లు, కూలి, మందులు అన్నీ కలిపితే పెట్టుబడులు భారీగా పెరిగాయి. పంట చేతికొచ్చేసరికి కౌంట్ పేరు చెప్పి కేజీకి రూ.40 కోత పెడుతున్నారు. మేత కంపెనీలు, కొనుగోలుదారులు ఇద్దరూ కలిసి మమ్మల్ని నిలువునా ముంచేస్తున్నారు. – వినికోటి శ్రీనివాస్, వనామీ రైతు, పటవల, తాళ్లరేవు భారం రూ.230.76 కోట్లు ఒక ఎకరా కల్చర్ ట్యాంకులో సుమారు రెండు లక్షల రొయ్య పిల్లలను వదులుతున్నారు. 50 కౌంట్ (కేజీకి 50 రొయ్యలు) చొప్పున దిగుబడి వస్తే పంటకు నాలుగు టన్నుల వరకు దిగుబడి వస్తోంది. అలా రావాలంటే టన్ను రొయ్యల ఉత్పత్తికి నాలుగు టన్నుల మేత చొప్పున సుమారు 16 టన్నుల మేత అవసరమవుతుందని రైతులు చెబుతున్నారు. తాజా పెంపుతో టన్నుకు రూ.5,700 అదనంగా చెల్లించాల్సి రావడంతో ఎకరాకు రూ.91,200 అదనపు భారం పడుతోంది. ఆరు నెలల్లో మొత్తం మేత ధర పెరుగుదల ప్రభావాన్ని లెక్కిస్తే ఎకరాకు సుమారు రూ.3.44 లక్షల వరకు పెట్టుబడి పెరిగింది. జిల్లాలో సగటు దిగుబడి 80 కౌంట్ అనుకుంటే ఏడాది కాలంలో వినియోగిస్తున్న మేతకు తాజాగా పెంచిన ధరల వల్ల రెండు జిల్లాల రైతులపై సుమారు రూ.230.76 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని అంచనా. -
బాల్య వివాహం నిలిపివేత
రంగంపేట: మండలంలోని ఈలకొలను గ్రామంలో 17 బాలికకు వివాహం చేసేందుకు జరుగుతున్న ఏర్పాట్లను ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు అడ్డుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈలకొలను గ్రామానికి చెందిన అంచూరి నాగేశ్వరరావు, లక్ష్మి దంపతుల 17 ఏళ్ల కుమార్తెకు అదే గ్రామానికి చెందిన కురుకూరి గవర్రాజు, మంగ దంపతుల కుమారుడు దుర్గాప్రసాద్తో శుక్రవారం రాత్రి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ స మయానికి చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి ఎం. నరేష్ బాబు, వీఆర్వో భాస్కరరావు తదితరులు వెళ్లి వివాహాన్ని నిలిపివేశారు. అనంతరం శనివారం ఉదయం ఐసీడీఎస్ రంగంపేట ప్రాజెక్టు అధికారి కె. కష్ణవేణి ఆధ్వర్యంలో సెక్టర్ సూపర్వైజర్ ఆర్.నందీశ్వరి, వీఆర్వో పి.భాస్కరరావు, కార్యదర్శి ఎంఎస్కే శ్రీలక్ష్మి, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలు గ్రామానికి చేరుకుని బాలిక, బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాలికకు 18 దాటకుండా వివాహం చేస్తే ఎదురయ్యే శారీరక, సామాజిక సమస్యలను వివరించి నిర్ణీత వయసులోపు వివాహం చేయబోమని అంగీకార పత్రం తీసుకున్నారు. బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098కు సమాచారం అందించాలని, బాలల భద్రత విషయంలో ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వికాసలో రేపు జాబ్మేళా బోట్క్లబ్: కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో సోమవారం ఉదయం 9 గంటలకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ లచ్చారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో పంజాబ్ నేషనల్ బ్యాంకు, మెట్లైఫ్ కంపెనీలో చీఫ్ ఇన్స్యూరెన్స్ మేనేజర్, ఏరియల్ టెక్ ఇన్నోవేషన్ కంపెనీలో ఆపరేషన్స్ అసిస్టెంట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టెలికాలర్, ఆఫీస్ అటెండర్, ఫీల్డ్ సపోర్ట్ అసిస్టెంట్, రాయల్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ (ఇండియా) ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో ఫైనాన్సియల్ అసోసియేట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, టెలీ కాలర్స్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్స్, ఫాక్స్ కాప్ కంపెనీలో మొటైల్ ఆపరేటర్, ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ లో టెక్నీషియన్ ఆపరేటర్, హెల్పర్లు, టీవీఎస్ (సుందరం ఫాస్ట్చెర్స్ లిమిటెడ్) కంపెనీలో టెక్నీషియన్ ఉద్యోగాలకు జాబ్మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ., డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకూ జీతం, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో పాల్గొనాలని పీడీ కోరారు. ● బాలిక తల్లిదండ్రులకు ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారుల కౌన్సెలింగ్ ● నిర్ణీత వయసు లోపు వివాహం చేయబోమని అంగీకారపత్రం స్వీకరణ -
నేరస్తులను ఉపేక్షించొద్దు
ఎస్పీ బిందుమాధవ్ కాకినాడ క్రైం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ నేరాలకు పాల్పడుతున్న, చేయిస్తున్న నేరస్తులను ఏమాత్రం ఉపేక్షించొద్దని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో నేరాల సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిసారించాలని చెప్పారు. స్పందన ద్వారా అందిన ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. బాలలు, మహిళలపై నేరాలకు పాల్పడుతున్నవారిని చట్టప్రకారం శిక్షించాలన్నారు. జిల్లాలో సీసీ కెమెరాల నిఘా, బీట్, గస్తీ మరింత ముమ్మరం చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దని చెప్పారు. రాత్రివేళ ఇళ్లు కొల్లగొడుతున్న నేరస్తులు, గంజాయి సహా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి, విక్రయిస్తున్నవారిపై పూర్తిస్థాయి నిఘా కొనసాగించాలని ఆదేశించారు. వీఆర్కు సీఐ! కాకినాడ క్రైం: ఈ నెల 23న అర్ధరాత్రి కాకినాడ భానుగుడి జంక్షన్లో జరిగిన కిరాతక హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ ఘటన జిల్లా పోలీసు వర్గాల్లో కాక రేపింది. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారుల ఆగ్రహానికి కారణమైంది. శాంతిభద్రతల వైఫల్యమంటూ, పోలీసుల చేతకాని తనమని తీవ్ర విమర్శలకు కారణమైంది. జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఘటన జరగడం, కమాండ్ కంట్రోల్ సిబ్బంది ఆ సమయంలో నిద్రపోతుండడం భద్రతా వైఫల్యాన్ని వేలెత్తి చూపించింది. ఈ నేపథ్యంలో శనివారం కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వయానా ఐజీ అశోక్కుమార్ జోక్యం చేసుకుని జూమ్ సమావేశంలో ఘటన జరిగిన పరిధికి చెందిన ఇన్స్పెక్టర్తోను, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తోను మాట్లాడారు. పోలీసుల భద్రతా వైఫల్యంతో పాటు మీడియాతో మాట్లాడి హత్యకు కారకుడని భావిస్తున్న కటౌట్ శ్రీను పేరు చెప్పబోతుండగా మృతుడి భార్యను అడ్డుకున్న పోలీసు అధికారి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఐని వీఆర్కు పంపించేందుకు ఆదేశించినట్టు తెలిసింది. నన్ను ఎవరో వెంటాడుతున్నారు హత్యకు గురైన సతీష్రెడ్డి భార్య జయశ్రీ కాకినాడ క్రైం: కాకినాడ భానుగుడి జంక్షన్లో దారుణ హత్యకు గురైన సతీష్రెడ్డి భార్య జయశ్రీ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు గడచిన మూడు రోజులుగా తనను వెంటాడుతున్నారని శనివారం మీడియా ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. తాను శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన చోట మీడియా ప్రతినిధులతో కలిసిపోయి ఒక మహిళ, ఒక పురుషుడు తన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారన్నారు. వారిద్దరూ శనివారం తన ఇంటి చుట్టూ తిరుగుతూ రెక్కీ నిర్వహించారని జయశ్రీ తెలిపారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. స్పెషల్ బ్రాంచ్ అధికారులు తనతో మాట్లాడి సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులు కేసు నమోదులో సహకరిస్తారని చెప్పారని వివరించారు. ఈ హత్య విషయంలో కటౌట్ శ్రీనుపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఆమె పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమంలో ఎస్పీని కలవనున్నట్టు చెప్పారు. పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఐసీడీఎస్ ద్వారా అమలుచేసే పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లా ప్రజా పరిషత్తు సమావేశ మందిరంలో ఎంపీ టి.ఉదయ్ శ్రీనివాస్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఐసీడీఎస్, డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, ఏపీఎంఐపీ, పశు సంవర్ధక, విద్య, వైద్య ఆరోగ్య, బ్యాంకింగ్, పోర్టు, పంచాయతీరాజ్, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖలపై సమీక్షించారు. ఈ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
రూ.16,500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఆత్రేయపురం : మండలంలోని ర్యాలి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) చొల్లంగి నాగేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలలో చిక్కారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసిన రైతు లక్ష్మీ ప్రసన్న నుంచి రూ.16,500 లంచం డిమాండ్ చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం పక్కా ప్రణాళికతో దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రాజమహేంద్రవరం ఏసీబీ అడిషనల్ ఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ర్యాలి గ్రామానికి చెందిన బాధిత రైతు చిన్నం లక్ష్మీ ప్రసన్నకు సర్వే నంబర్ 381/6లో తొమ్మిది ఎకరాల భూమికి సంబంధించిన మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ సమస్య పరిష్కరించేందుకు వీఆర్వో నాగేశ్వరరావు ఆమె నుంచి లంచం డిమాండ్ చేశారు. అందుకు అనుమతించిన లక్ష్మీ ప్రసన్న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారి సూచన మేరకు శనివారం ర్యాలి గ్రామ సచివాలయంలో వీఆర్వోకు రూ.16,500 నగదు అందించారు. ఆ మొత్తాన్ని ఆయన తీసుకొని తన చొక్కా జేబులో పెట్టుకున్నారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు భవ్యకిషోర్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ అధికారులు వి.భాస్కరరావు, గోవిందరాజులు, వాసు కృష్ణ, సతీష్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్వో నాగేశ్వరరావు స్వస్థలం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామ శివారు పాటిచెరువు. ఆయన ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని అపార్ట్మెంట్లో సొంత ఫ్లాట్లో ఉంటున్నారు. ఆయన భార్య రాజమమేంద్రవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. -
Kakinada: పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్ హత్య కేసు నిందితులు
కాకినాడ: నగరంలోని బానుగుడి సెంటర్లో మూడు రోజుల క్రితం జరిగిన జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్రెడ్డినిముగ్గురు స్నేహితులతో కలిసి సాయి కిరణ్ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న కాకినాడ టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉంచితే, సతీష్రెడ్డి హత్య వెనుక ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుని భార్య జయశ్రీ ఆరోపిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా తన భర్తపై కటౌట్ శ్రీను కక్ష పెంచుకున్నాడని, దాంతోనే ఈ హత్య జరిగిందని ఆమె అంటోంది. దీనిపై కటౌట్ శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ -
'నా భర్తని చంపేస్తానని బెదిరించి నాపై లైంగిక దాడి'
తూర్పు గోదావరి జిల్లా: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు.ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికైనా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా! -
సాధిక్ చేతిలో రూ.2 కోట్ల ఓడీ ఖాతా!
కాకినాడ క్రైం: పంచాయతీరాజ్ శాఖ పిఠాపురం ఏఈ టి.నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన సాధిక్ ఖాన్ వ్యవహారంలో తవ్వుతున్నకొద్దీ విస్తుపోయే నిజాలు బయట పడుతున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్రెడ్డికి చెందిన కరూర్ వైశ్యా బ్యాంక్(కేవీబీ)కు సంబంధించి రూ.2 కోట్ల ఓడీ పరిమితి ఉన్న ఖాతా సాధిక్ ఖాన్ చేతికి చిక్కిందనే కీలక విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేవీబీ భానుగుడి బ్రాంచికి శుక్రవారం వెళ్లి మేనేజర్ను ఆ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరారు. తనకు, జగదీశ్వరరెడ్డికి చెందిన ఖాతాల్లో తన ఫోన్ నంబర్ మార్చి, వాటి ఆర్థిక లావాదేవీలను సాధిక్ ఖాన్ తన చేతుల్లో పెట్టుకున్నాడన్న నూకరాజు కుమార్తె సౌజన్య ఆరోపణలపై లోతైన విచారణ చేపట్టారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. మరింత స్పష్టత కోసం బ్యాంకుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అలాగే, సాధిక్ సోదరి, తల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకు ఖాతాలపై పరిశీలన మొదలు పెట్టారు. సౌజన్య దగ్గర నుంచి సాధిక్ తీసుకున్న సొత్తును వారికి బదలాయించాడన్న ఆరోపణలపై నిజానిజాలను నిగ్గు తేల్చే పనిలో పోలీసులున్నారు. ఇదిలా ఉండగా సాధిక్ను కోర్టు సోమవారం తమ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉన్నందున ప్రశ్నల వర్షం కురిపించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు సమాయత్తమవుతున్నారు. అంతకు ముందే పూర్తి వివరాలు, సాక్ష్యాధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.సాధిక్ ఖాన్ కస్టడీ పిటిషన్పైవిచారణ వాయిదా కాకినాడ లీగల్: పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో నిందితుడైన రైఫిల్ ఘాటింగ్ శిక్షకుడు షేక్ సాధిక్ ఖాన్ను పలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. దీనిని న్యాయస్థానం వచ్చే నెల రెండో తేదీకి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్పై శుక్రవారం మొబైల్ కోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు పూర్తి కాకపోవడంతో విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. చదవండి: నా బిడ్డకు తండ్రి నువ్వే.. డీఎన్ఏ పరీక్షకు సిద్ధం! -
నా భర్తను హత్యచేయించింది టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడే
కాకినాడ క్రైం: కాకినాడలో మంగళవారం రాత్రి తన భర్త, జిమ్ ట్రైనర్ సతీష్ ను హత్యచేయించింది కాకినాడ నగర టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడు బోను శ్రీను అలియాస్ కటవుట్ శ్రీను అని సతీష్ భార్య జయశ్రీ ఆరోపించారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పనివ్వడంలేదన్నారు. కాకినాడ ట్రెజరీ కాలనీలోని ఇంటివద్ద శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. శ్రీను.. తన భర్త సతీష్ కు, తన భర్తను హత్యచేసిన సాయికిరణ్కు స్నేహితుడని చెప్పారు. గర్భవతిని కావడంతో తాను ఇబ్రహీం కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు తెలిపారు. జూలై రెండోవారంలో ఒకరోజు అర్ధరాత్రి తాను అన్నయ్యగా పిలిచే సాయికిరణ్ తమ ఇంటికి వచి్చ, తన భర్త కటవుట్ శ్రీను భార్యతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పాడన్నారు. శ్రీను, అతడి భార్య విడాకుల విషయం కోర్టులో ఉందని చెప్పాడని తెలిపారు. అతడు మాట్లాడుతూ ఉండగానే కటవుట్ శ్రీను మరో గుర్తుతెలియని వ్యక్తితో వచ్చి తన భర్తను చంపేస్తానని బెదిరించి వెళ్లాడన్నారు. శ్రీను భార్యపై కన్నేసిన సాయికిరణ్ తన భర్తపై చాడీలు చెప్పి శ్రీనుని రెచ్చగొట్టాడన్నారు. అనంతరం శ్రీను పథకం మేరకు సాయికిరణ్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్తను హత్యచేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కటవుట్ శ్రీను (ఫైల్) రాత్రి 2 గంటలకు హత్య జరిగితే.. 3 గంటలకు ఆస్పత్రిలో చేరిన శ్రీనుతన భర్తను కటవుట్ శ్రీను హత్యచేయించాడని చెప్పినా పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కొండబాబు ఒత్తిడితో పోలీసులు ఈ కేసు నుంచి కటవుట్ శ్రీనును తప్పిస్తున్నారని ఆరోపించారు. జీజీహెచ్ మార్చురీ వద్ద తాను శ్రీను పేరు మీడియాకు చెప్పేందుకు ప్రయత్నిస్తే పోలీసులు వారించారని, సాయి కిరణ్ పేరు మాత్రమే చెప్పాలన్నారని తెలిపారు. రాత్రి రెండు గంటలకు హత్య జరిగితే, మూడు గంటలకు శ్రీను తనకు లేని అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. హత్య జరిగి మూడురోజులు గడుస్తున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్న కటవుట్ శ్రీనుని విచారించకపోవడం, అదుపులోకి తీసుకోకపోవడం చూస్తే పోలీసులు ప్రలోభాలకు లోనయ్యారని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని తెలుస్తోందని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబసభ్యులకు శ్రీను, అతడి అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కటవుట్ శ్రీనును అదుపులోకి తీసుకుని హత్యకు కారణాలను బయటపెట్టి నిందితులను శిక్షించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. -
శ్రీపాదుడే రక్షగా!
● ఘనంగా రాఖీ పౌర్ణమి ఉత్సవాలు ● దత్తాత్రేయుడి ఆలయాలకు పోటెత్తిన భక్తులు శ్రీపాద శ్రీవల్లభ స్వామికి రాఖీలు కట్టేందుకు తరలివస్తున్న మరాఠీ భక్తులు దత్తాత్రేయుడికి రాఖీలు కడుతున్న భక్తులు పిఠాపురం: దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుని జన్మస్థలం పిఠాపురంలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. వేలాది భక్తుల రాకతో దత్తాత్రేయుని ఆలయాలు కిటకిటలాడాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులతో పాటు సుమారు 50 వేల మంది మహారాష్ట్ర భక్తులు శుక్రవారం దత్తాత్రేయునికి రాఖీలు కట్టారు. దీంతో శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం భక్తులతో కిక్కిరిసింది. శ్రీపాదునికి రాఖీ పంపిన వాసవి అమ్మవారు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభునికి స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుంచి గ్రామోత్సవంగా సంస్థానానికి వెళ్లి అమ్మవారి రాఖీ సమర్పించారు. ఆయనకు సోదరిగా కన్యకా పరమేశ్వరి రాఖీ కట్టడం ఇక్కడ ఆనవాయితీ. అనంతరం ఈఓ ఆర్.సౌజన్య ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి శ్రీపాదుని తరఫున సారె సమర్పించారు. లక్ష మల్లెలతో అర్చన ఈ సందర్భంగా పాదగయ క్షేత్రంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి అర్చకులు ‘లక్ష మల్లెల అర్చన’ నిర్వహించారు. -
ఓడలరేవు మత్స్యకారులకు సర్పవరంలో స్వాగతం
కాకినాడ రూరల్: చేపల వేటకు వెళ్లి గల్లంతై తిరిగి వచ్చిన ఓడలరేవు మత్స్యకారులు శుక్రవారం ఉదయం కాకినాడ చేరుకున్నారు. వారికి రమణయ్యపేటలో సర్పవరం జంక్షన్ వద్ద ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంలో వారు స్నానాలు చేసి అల్పాహారం తీసుకున్న తరువాత కోనసీమ జిల్లాకు పయనమయ్యారు. వారికి ఆశ్రయం ఇచ్చి, వారితో పాటు వచ్చిన పశ్చిమ బెంగాల్కు చెందిన మత్స్యకారులు ఇద్దరినీ నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు కొపనాతి రామకృష్ణ, సంగాడి తాతారావు, కర్రి రాముడు, కొల్లాడి ఏసుదాసు, శ్రీనుబాబు, కాటాడి సతీష్, పాలెపు శాంతారావు మాట్లాడుతూ దేవుడి దయవల్ల తాము ప్రాణాలతో బయటపడ్డామన్నారు. సుముద్రంలో బోటు ఇంజిన్ చెడిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపామని, తీసుకువెళ్లిన రేషన్ను పొదుపుగా వాడుకుని, మాలోని ఇద్దరికి అన్నం పెట్టి గంజి తాగేవాళ్లమని తెలియజేశారు. పశ్చిమ బెంగాల్లోని శంకర జెట్టీ వద్ద లభ్యమైన తమను అధికారులు కాకినాడ తీసుకువచ్చారని తెలియజేశారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి స్వాధీనం
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ముగ్గురి అరెస్టు కోరుకొండ: ఒడిశా రాష్ట్రం మల్కన్గిరి నుంచి ఢిల్లీకి తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీసుస్టేషన్లో నార్త్ జోన్ డీఎస్పీ సీహెచ్ జీవన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గంజాయి రవాణాపై అందిన సమాచారం మేరకు బూరుగుపూడి జంక్షన్లోని పెట్రోల్ బంకు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు డిక్కీలో 3 బస్తాల్లో నింపిన 61 కిలోల గంజాయిని పోలీసులు గుర్తించారు. సరకుతో పాటు కారులోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తాండ, బాగవత్ ప్రాంతానికి చెందిన సదకత్, బార్కండి శామ్లి జిల్లాకు చెందిన సదాబ్, సల్మాన్లను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న సరకు విలువ రూ.30 లక్షలు ఉంటుందని, నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.10,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జీవన తెలిపారు. ఈగల్ టీమ్ సహకారంతోనే గంజాయి రవాణాను అడ్డుకోగలిగామని ఆమె తెలిపారు. ఈ కేసులో కృషి చేసిన కానిస్టేబుల్స్ రవికిరణ్, ప్రకాష్ రెడ్డి, రామచంద్రరావు, సుబ్రహ్మణ్యంలకు ఆమె రివార్డులు అందజే శారు. సమావేశంలో సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై సీహెచ్వీ రమేష్ పాల్గొన్నారు. వివాహితపై లైంగిక దాడి కడియం: నర్సరీలో తన భర్తతో పనిచేసే సురేంద్ర అలియాస్ చిన్న తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు బుర్రిలంకకు చెందిన 19 ఏళ్ల మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళ తన భర్తతో కలిసి బుర్రిలంక నర్సరీకి ఈ ఏడాది జూలైలో పని కోసం వచ్చారు. అప్పటి నుంచి నర్సరీలో పనిచేస్తూ కార్యాలయ భవనం పక్కన నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ఉదయం సుమారు 6:45 గంటలకు, ఆమె భర్త యథావిధిగా పనికి వెళ్లాడు. అనంతరం 7 గంటలకు అదే నర్సరీలో పనిచేస్తున్న సురేంద్ర అలియాస్ చిన్న ఆమె ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె తన భర్తకు చెపుతానని హెచ్చరించడంతో అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం 8.50 నిమిషాలకు మళ్లీ వచ్చి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఎవరికై నా చెప్తే భార్యాభర్తలిద్దరినీ చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తన భర్తకు ఆమె విషయాన్ని వివరించింది. దీంతో అతడు నర్సరీ యజమానికి ఆ విషయం చెప్పగా ఆయన సూచన మేరకు బాధితురాలు ఆమె బంధువులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చోరీ సొత్తు స్వాధీనం కొత్తపేట: స్థానిక ఆర్ఎస్ నగర్లో నివసిస్తున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఇంటిలో చోరీకి గురైన సుమారు రూ 25 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు నిందితుడిని అరెస్టు చేసినట్టు ఎస్సై జి.సురేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డీఎస్పీ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న చెల్లిబోయిన రాంబాబు ఈ నెల 18వ తేదీ రాత్రి తన భార్యతో కలిసి హాస్పిటల్ పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లి తిరిగి 20వ తేదీ ఉదయం 8 గంటలకు వచ్చారు. వారు వచ్చే సరికి ఇంటి తలుపు తాళం, లోపలి బీరువా పగలగొట్టబడి అందులోని సుమారు 23 కాసుల బంగారు, సుమారు 880 గ్రాముల వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. రాంబాబు ఫిర్యాదు మేరకు డీఎస్పీ సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో అమలాపురం సీసీఎస్ సీఐ ఎన్ కొండయ్య, సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి, రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ దర్యాప్తు చేశారు. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు పలివెల వంతెన వద్ద చోరీ కేసులో పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన నగరపు ఈశ్వరరావు అలియాస్ సింగనపూడి ఈశ్వరరావును సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి, అతని నుంచి చోరీ సొత్తు (సుమారు రూ.25 లక్షలు)ను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు అతడు ఉపయోగించిన మోటార్ సైకిలు, రెండు ఇనుప రాడ్లను సైతం స్వాధీనం చేసుకుని అతడిని కోర్టులో హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ అతడికి 15 రోజుల రిమాండ్ విధించినట్టు ఎస్సై తెలిపారు. -
వేటగాళ్ల ఉచ్చులో విదేశీ కొంగలు
మామిడికుదురు: బి.దొడ్డవరం మధ్యలంకలో విడిది చేసిన విదేశీ వలస పక్షులు ‘ఏషియన్ ఓపెన్ బిల్ స్కార్ట్స్’పై వేటగాళ్లు పంజా విసురుతున్నారు. మధ్యలంకలో తుమ్మచెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకున్న వీటిని వారు వేటాడి సొమ్ము చేసుకుంటున్నారన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. వాటిని పట్టుకుని ఇతర గ్రామాల్లో ఉన్న మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఒకొక్క కొంగను రూ.300 నుంచి రూ.400కు విక్రయిస్తున్నారని పక్షి ప్రేమికులు వాపోతున్నారు. అరుదైన పక్షుల రక్షణకు చర్యలు తీసుకుని, వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
టోల్గేట్లోనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలి!
● రత్నగిరిపైకి వాహనాల అనుమతిపై అధికారులకు ఎస్పీ ఆదేశం ● మద్యం సీసాలున్నా.. మద్యం తాగిన వారు ఉన్నా పంపొద్దుఅన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వచ్చే ప్రతి వాహనాన్ని టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేశాకే కొండ మీదకు అనుమతించాలని ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం ఆదేశించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ఇదేం పద్ధతి స్వామీ’ కథనంపై ఎస్పీ స్పందిస్తూ ఈ మేరకు ప్రత్తిపాడు సీఐ వి.సూర్య అప్పారావుకు ఆదేశాలు ఇచ్చారు. గత బుధవారం అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం తాగి పెళ్లి బృందాలపై దాడి చేయడం, రత్నగిరి అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో, వివాహాలు జరిగే సత్యగిరి తొండంగి పోలీసు స్టేషన్ పరిధిలో ఉండడం వల్ల వారి మధ్య సమన్వయం లేక ఏవైనా ఘటనలు జరిగినపుడు వారి స్పందనలో జాప్యం ఏర్పడుతోందన్న అంశాలపై ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం సీఐ అప్పారావు దేవస్థానానికి వచ్చి సెక్యూరిటీ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆలయానికి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి నిషేధిత వస్తువులు లేవని తేలిన తరువాతే కొండ పైకి పంపాలని ఆదేశాలు ఇచ్చారు. ఏవైనా దుస్సంఘటనలు జరిగితే సత్వరం తమకు వెంటనే సమాచారం ఇవ్వాలని, సీసీ కెమేరాల నిఘా పెంచి గొడవలు సృష్టించే వారిని, అనుమానితులను గుర్తించి తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం డ్రోన్ కెమేరా ద్వారా దేవస్థానం టోల్గేట్, ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. సమావేశంలో స్థానిక ఎస్ఐ హరిబాబు, దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్ర సహనానికి పరీక్ష!
● పరిమిత బస్సుల్లో అపరిమిత ప్రయాణాలు ● మౌలిక వసతులు పెంచని ప్రభుత్వం ● అవస్థలు పడుతున్న సాధారణ ప్రజలు కపిలేశ్వరపురం: గత ఏడాది ఆగస్టు 15న సీ్త్రశక్తి పేరుతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకం నేడు అస్తవ్యస్తంగా మారింది. ఆడపడుచుల సంక్షేమమే మా ప్రాధాన్యం అని ఘనంగా చెప్పుకొని ప్రారంభించిన ఈ పథకంలో అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి అనేక సర్వీసులను మినహాయించి కేవలం పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రం అనుమతించి వారిని అనేక ఇబ్బందులపాలు చేస్తున్నారు. ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రపురంలో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళలతో ముచ్చటించి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. తీరా చూస్తే నలభై మంది పట్టే బస్సులో 70 మంది దాకా కుక్కేసి నడిపేస్తున్నారు. మౌలిక వసతులు ఏ మాత్రం పెంచకుండా ప్రారంభించిన ఈ పథకాన్ని ఆయా బస్సుల డ్రైవర్లు సైతం పట్టించుకోవడం లేదు. పలు స్టాప్లలో ప్రయాణికులు ఉన్నా ఆపకుండా వెళ్లిపోతుండడం శోచనీయం. దివ్యాంగులకు దిక్కెవరు.. సీ్త్రశక్తి పథకం అమలయ్యాక దివ్యాంగులకు రిజర్వు చేసిన సీట్లు సైతం వారికి దొరకడం లేదు. దీంతో వారు బస్సు ఎక్కడానికి, ఎక్కాక సీటు సంపాదించడానికి చాలా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఫుట్బోర్డు ప్రయాణాలే.. రావులపాలెం డిపో పరిధిలో శనివారం వచ్చిందంటే ఉమ్మడి జిల్లాలోని చాలా మంది భక్తులు వాడపల్లికి వెళ్లేందుకు ఇక్కడికే వస్తారు. వారి డిమాండ్కు తగ్గ బస్సులు లేకపోవడంతో చాలా మంది భక్తులతో పాటు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు ఫుట్బోర్డుపై ఒక్క కాలు పెట్టడానికి చోటున్నా సరిపోతుందన్నట్టు వేలాడుతూ వెళ్తున్నారు. అత్త మీద కోపం దుత్తమీద.. ప్రయాణ అవస్థలను ఓర్చుకోలేని ప్రయాణికులు ప్రభుత్వం చూపాల్సిన కోపాన్ని ఎదురుగా కనపడుతున్న కండక్టర్, లేదా డ్రైవర్పై చూపుతున్నారు. 2025 సెప్టెంబర్ 16న గోకవరం బస్స్టాండ్లో టిక్కెట్ తీసుకునే క్రమంలో జరిగిన వాగ్వాదంలో కండక్టరు చేతి వేలు విరిగిపోయింది. కోరుమిల్లిలో జరిగిన వాగ్వాదంలో కండక్టర్ కాలు విరగ్గొట్టేశారు. వెలుగు చూడని ఇటువంటి ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. వ్యాపారాలపై ప్రభావం.. సీ్త్ర శక్తి పథకంతో మహిళల రాకపోకలు పెరిగి, కొనుగోళ్లు పెరిగి, వ్యాపారాలు లాభిస్తాయని చాలా మంది భావించారు. తీరా చూస్తే ఓ మోస్తరు సరుకులను కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర దూరపు ప్రాంతాలకు వెళ్లి కొంటున్నారు. అసలు ఎగ్గొట్టి కొసరు కల్పించి.. ఉచిత ప్రయాణాలతో మహిళలకు బస్సు చార్జీలు మిగులుతున్నాయి తప్ప వారి కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదని పలువురు అంటున్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో మొదటి ఏడాది తల్లికి వందనం ఎగ్గొట్టారు. ఫీజు రీయింబర్సుమెంట్ బకాయిలు చెల్లించలేదు. డ్వాక్రా రుణాలు, రాయితీలు ఇతర ప్రయోజనాల ఊసే లేదు. వీటిని ప్రశ్నించకుండా ఉండేందుకు సీ్త్రశక్తి పథకాన్ని కొనసాగిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. -
బ్యాట్ పడితే బాదుడే..
● ఇటు సెంచరీలు, అటు వికెట్లతో రాణింపు ● రాయలసీమ జెన్ స్టార్స్ జట్టుకు ఎంపికై న బొమ్మూరు యువతి లిఖిత రాజమహేంద్రవరం రూరల్: నాలుగేళ్ల క్రితం సాధన మొదలుపెట్టి అనతి కాలంలోనే విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్కు ఎంపికై ంది బొమ్మూరుకు చెందిన గారపాటి లిఖిత. 19 ఏళ్ల ఈమెను రాయలసీమ జెన్స్టార్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది. గారపాటి సర్వేశ్వరరావు, సౌజన్య దంపతుల చిన్నకుమార్తె లిఖిత. సర్వేశ్వరరావు వ్యాపారస్తుడు కాగా, సౌజన్య ప్రైవేటు ఇండస్ట్రీలో అకౌంటెంట్గా, ఆమె అక్క ఆశ్రిత సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. సర్వేశ్వరరావు కూడా క్రికెట్ ప్లేయర్. ఆయన ఆంధ్రా యూనివర్శిటీ స్థాయి వరకు క్రికెట్ ఆడి ఆ తరువాత వదిలేశారు. లిఖితకు ముందుగా రాజమహేంద్రవరంలో అఖిమ్ బాషా వద్ద క్రికెట్ శిక్షణ ఇప్పించారు. మూడేళ్లుగా సెంచూరియన్స్ క్రికెట్ అకాడమిలో కోచ్ సుమంత్ వద్ద శిక్షణ ఇప్పిస్తున్నారు. లిఖిత టాప్ ఆర్డర్ బ్యాటింగ్తో పాటు, రైట్హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్గా ప్రతిభ కనబరుస్తోంది. బ్యాటింగ్.. బౌలింగ్ రెండింట్లో.. గారపాటి లిఖిత విమెన్స్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్–2026 పోటీలలో విజయనగరం గ్రౌండ్లో తూర్పు గోదావరి జిల్లా తరఫునన శ్రీకాకుళం జిల్లాతో జరిగిన మ్యాచ్లో 112 నాటౌట్గా నిలిచింది. జేఎన్టీయూ తరఫున మైసూరులో టీ20 మ్యాచ్లో 124 నాటౌట్ నిలిచింది. 2025–26లో అండర్ 23 స్టేట్ తరఫున ఆడి వన్డే మ్యాచ్లలో వ్యక్తిగత స్కోరులో 169 నాటౌట్గా నిలిచి, ఆఫ్ స్పిన్నర్గా 25 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అబ్బురపరిచింది. ఆమె అత్యుత్తమ ప్రదర్శన 7 సెంచరీలు, 20కి పైగా ఆఫ్ సెంచరీలు, 120కి పైగా వికెట్లు సాధించింది. వచ్చేనెల 18వ నుంచి మంగళగిరిలో జరిగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో ఆమె పాల్గొననుంది. భారత్ మహిళా జట్టులో చోటు సాధించాలి నాలుగేళ్ల నుంచి క్రికెట్ సాధన మొదలు పెట్టాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విమెన్స్ ఆంధ్రా ప్రీమియర్లీగ్, అండర్–23 రాష్ట్ర జట్టు లోను, ఇతర పోటీలలో బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తున్నా. భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు సాధించడమే నా ధ్యేయం. వివ్ రిచర్డ్స్, అలెక్స్ ఫెర్రీ తన రోల్ మోడల్స్. – లిఖిత గారపాటి -
రియాన్ష్కు సంపూర్ణ రక్షణ కల్పిస్తాం
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి రావులపాలెం: కాకినాడ పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ విషాద ఘటనలో ప్రాణాలతో బయటపడిన మైనర్ రియాన్ష్ కార్తికేయరెడ్డికి పూర్తి రక్షణ కల్పించి, అతని భవిష్యత్తుకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. స్థానిక బాలుడి తాతయ్య కొవ్వూరి భాస్కరరెడ్డి ఇంటికి శుక్రవారం ఆయనతో పాటు కమిషన్ సభ్యులు వచ్చి రియాన్ష్ను పరామర్శించి మాట్లాడారు. విషాద ఘటన పూర్వాపరాలను తెలుసుకుని అతని రక్షణ, విద్య, భవిష్యత్తుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాలుడిని, ఆమె తల్లిని సాధిక్ ఖాన్ ఏ విధంగా వేధించినదీ తెలుసుకున్నామని తెలిపారు. కలెక్టరేట్లో ఈ మేరకు సమీక్షించి తదుపరి చర్యలకు ప్రభుత్వానికి, డీజీపీకి అవసరమైన సిఫార్సులు, ఆదేశాలు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కమిషన్ సభ్యురాలు డాక్టర్ పి.నాగ మానస మాట్లాడుతూ అతని భవిష్యత్తు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాధిక్ ఖాన్కు శిక్ష పడేలా చూస్తాం బోట్క్లబ్: రియాన్ష్ను రావులపాలెంలోని అతడి తాతయ్య ఇంటి వద్ద పరామర్శించిన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణ రాజు అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. కాకినాడలో పోలీస్, విద్యాశాఖ అధికారులతో పాటు బాలుడి పాఠశాల యాజమాన్యం, రైఫిల్ షూటింగ్లో శిక్షణ ఇచ్చిన స్పోర్ట్స్ అథారిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. కేవలం 10 ఏళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయేలా చేసి, బాలుడి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిన నిందితుడు సాధిక్ ఖాన్కు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఈ సమావేశంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు ఎం.రంగసూర్యనారాయణ పాల్గొన్నారు. -
ప్రభుత్వం తీరు దారుణం
పాలు, పెరుగు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచదార ధరలు విపరీతంగా పెరిగాయి. తీపి వస్తువులు తినాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వస్తోంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడం దారుణం. – వర్ధినీడి సుజాత, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బాదుడే బాదుడు ఎన్నికల ముందు చంద్రబాబు అండ్ కో బాదుడే బాదుడు అంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ధరలు విపరీతంగా పెరుగుతున్నా నియంత్రణను గాలికొదిలేశారు. – రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగరాభివృద్ధి సంస్థ మాజీ చైర్పర్సన్ -
పారా మెడికల్ సిబ్బంది నిరసన
కాకినాడ క్రైం: ఏపీ పారా మెడికల్ జేఏసీ పిలుపు మేరకు జీజీహెచ్లో పని చేస్తున్న కాంట్రాక్టు పారా మెడికల్ సిబ్బంది చేపట్టిన నిరసన కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో సాగిన వీరి నిరసన శుక్రవారం రెండో దశకు చేరింది. బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వర్తించడంతో పాటు ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది నిరసన ప్రదర్శన చేపట్టారు. తమని రెగ్యులర్ చేయాలని, నూరు శాతం గ్రాస్ వేతనం ఇవ్వాలని, ఉద్యోగి మరణిస్తే రూ.50 లక్షల పరిహారం ఇచ్చి, కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇవ్వాలని, ఈపీఎఫ్ సదుపాయం కల్పించి, కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, రిక్వెస్ట్, మ్యూచువల్ బదిలీలకు అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
బియ్యం.. కొందామంటేనే భయం
సన్నబియ్యం ధరలు గత మూడు నెలల్లో భారీగా పెరిగాయి. మే 1తో పోలిస్తే పాత బియ్యం 26 కిలోల బస్తాపై రూ.200 నుంచి రూ.300 వరకూ ధర పెరిగింది. క్వింటాల్ సన్నబియ్యం మే 1న రూ.5,600 నుంచి రూ.5,800 వరకూ విక్రయించేవారు. ప్రస్తుతం అది రూ.6,500 నుంచి రూ.7,500 వరకూ పలుకుతోంది. సాధారణ రకం బియ్యం ధర క్వింటాల్కు రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెరిగింది. బీపీటీ రకం క్వింటాల్కు రూ.4 వేల నుంచి రూ.5,750కు చేరింది. కిలో సన్న బియ్యం ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.70కి పైగా చెబుతున్నారు. చేదెక్కిన చక్కెర పండగల సీజన్ వేళ చక్కెర చేదెక్కింది. మొన్నటి వరకూ కిలో చక్కెర రూ.46 ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ.72కు పెరిగింది. దీనికి అనుగుణంగా బేకరీ తినుబండారాలు, స్వీట్ల ధరలు కూడా పెరిగాయి. ఉడకని పప్పులు కందిపప్పు ధర గతంలో రూ.140 వరకూ ఉండేది. ప్రస్తుతం అది రూ.164 పలుకుతోంది. పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు వంటి వాటి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ● కొండెక్కిన నిత్యావసరాలు ● భారిగా పెరిగిన బియ్యం రేట్లు ● కాగుతున్న వంటనూనెలు ● కొందామంటే కూరగాయాలే ● పండగల వేళ చుక్కలు చూస్తున్న జనం ● చోద్యం చూస్తున్న ప్రభుత్వం -
సాగునీరు సక్రమంగా అందించాలి
● రైతులు కష్టాలు గట్టెక్కించాలి ● ఉమ్మడి ‘తూర్పు’ జెడ్పీ చివరి సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుల డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు సరిగ్గా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని పలువురు జెడ్పీటీసీ సభ్యులు అన్నారు. పంటలకు సాగునీరు సక్రమంగా అందించి అన్నదాతల కష్టాలు గట్టెక్కించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఆఖరి సర్వసభ్య సమావేశం స్థానిక జెడ్పీ కార్యాలయంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఉమ్మడి జిల్లాలో సాగునీటి కోసం రైతులు పడుతున్న అగచాట్లను ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నినో ప్రభావంతో పంటలు పండించడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. పంట కాలువలపై అక్రమ నిర్మాణాలా? ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ, పలు పంట కాలువలను ఆక్రమించి ఇష్టానుసారం అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని, దీనివల సాగునీరు సక్రమంగా అందక ఇబ్బంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి అనుమతి ఎవరిచ్చారని అధికారులను నిలదీశారు. పంట కాలువలపై ఎటువంటి నిర్మాణాలకూ తాము అనుమతి ఇవ్వలేదని, అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తామని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. రంపచోడవరం జెడ్పీటీసీ సభ్యురాలు పండ్ర వెంకటలక్ష్మి మాట్లాడుతూ, ఏజెన్సీలోని పలు గ్రామాల్లో ప్రస్తుతం అసలు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులు తినేందుకు కూడా పంటలు పండించుకునే పరిస్థితి లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, శ్రీలంక అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని క్రమంగా రసాయనిక ఎరువులను తగ్గించి, ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. రైతులకు సాగునీరు ఇబ్బందులు రాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏలేశ్వరం మండలంలో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సమావేశాన్ని ఓ చర్చిలో నిర్వహించడంపై ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి అధికారులను నిలదీశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్ చెప్పారు. అసంపూర్తిగా జల్జీవన్ పనులు జల్జీవన్ మిషన్ పథకంలో ఇంటింటికీ కుళాయిలు వేసేందుకు చేపట్టిన పైపులైన్ పనులను అసంపూర్తిగా వదిలేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఆ పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారో చెప్పాలని పలువురు సభ్యులు అధికారులను నిలదీశారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మతిన్ స్పందిస్తూ, కాంట్రాక్టర్లకు పూర్తి స్థాయిలో బిల్లులు చెల్లించకపోవడంతో కొన్ని పనులను మధ్యలోనే నిలిపివేశారని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన వెంటనే వారికి బిల్లులు మంజూరు చేసి, పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తాగునీరేదీ? తొండంగి మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని జెడ్పీటీసీ సభ్యురాలు మెరుగు పద్మలత అన్నారు. అనేక గ్రామాల్లో మూడు నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోందని వాపోయారు. పలు పీహెచ్సీల్లో ప్రజలకు సరైన వైద్యం అందించడం లేదని, సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, పూర్తి స్థాయిలో మందులు కూడా లేకపోవడంతో ప్రజలు కాకినాడ, రాజమహేంద్రవరం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని పలువురు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల నిర్మాణం చేపట్టినా ప్రస్తుతం ప్రారంభించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోందని, దీనివలన ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లల్ని చేర్చాలంటే నిరుపేదలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేసేవారమని, రెండేళ్లుగా ఈ ప్రభుత్వం స్టడీ మెటీరియల్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ వేతనాలు ఎప్పుడు? తమకు రెండేళ్లుగా గౌరవ వేతనం చెల్లించడం లేదని, దీనిని వెంటనే మంజూరు చేయాలని పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు డిమాండ్ చేశారు. దీనిపై జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు స్పందిస్తూ, సభ్యులకు త్వరలోనే చెల్లించాల్సిన గౌరవ వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఎంపీపీల గౌరవ వేతనాన్ని ఆయా మండల పరిషత్ల నుంచి తీసుకోవాలని సూచించారు. అయితే, మండల పరిషత్ నిధుల నుంచి గౌరవ వేతనాలు ఇవ్వడానికి అనుమతులు లేవంటూ ఎంపీడీఓలు చెబుతున్నారని సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు పదవీ కాలంలో తాము చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా గత ఐదు సంవత్సరాలుగా పని చేశాం. 2021 నుంచి ఇప్పటి వరకూ 21 సర్వసభ్య సమావేశాలు నిర్వహించాం. జిల్లా అధికారులు, సభ్యుల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. మా పదవీ కాలం సెప్టెంబర్ 24 వరకూ ఉంది. త్వరలోనే సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తాం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ -
తగ్గుతున్నది
ఐ.పోలవరం: గోదావరి వరద పెరిగి, క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి బుధవారం 3,55,194 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. గురువారం ఉదయం 6 గంటలకు ఇది కాస్తా 5,17,171 క్యూసెక్కులకు పెరిగింది. ఇది శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 4,20,616 క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీ వద్ద వరద ఉధృతి తగ్గినప్పటికీ జిల్లాలో గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో ఆ ఉరవడి కొనసాగుతూనే ఉంది. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ వద్ద వరద నీరు ఉరకలేస్తూ సముద్రం వైపు పరుగులు తీస్తోంది. శివారున ఉన్న ఐ.పోలవరం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అల్లవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని ఆక్వా చెరువులను వరద మరోసారి ముంచెత్తింది. ఇప్పటికే ఈ నెల మొదటి వారంలో వచ్చిన వరదకే ఆక్వా చెరువులు పెద్ద ఎత్తున దెబ్బ తినడంతో, ఇప్పుడు ప్రభావం పెద్దగా లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుత వరదతో ఎలాంటి ముంపు ముప్పూ లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. -
జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి కేసులో కొత్త ట్విస్ట్
సాక్షి, కాకినాడ జిల్లా: జిమ్ ట్రైనర్ సతీష్రెడ్డి హత్యలో ఎమ్మెల్యే అనుచరుడి హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. హత్యలో ఎమ్మెల్యే అనుచరుడు కటౌట్ శ్రీను హస్తం ఉందని సతీష్రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు. కటౌట్ శ్రీను టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు. కేసు నుంచి శ్రీనును తప్పించాలని చూస్తున్నారని.. కటౌట్ శ్రీను నుంచి నాకు ప్రాణహాని ఉందని సతీష్రెడ్డి భార్య జయశ్రీ అన్నారు. ఏడాది క్రిందట జిమ్ ట్రైనర్ సతీష్ రెడ్డి తో జయశ్రీకి ప్రేమ వివాహం జరిగింది. ప్రస్తుతం జయశ్రీ ఐదు నెలల గర్భవతి.జయశ్రీ మాట్లాడుతూ.. ’’కొద్ది నెలల క్రితం కటౌట్ శ్రీను నుంచి అతని భార్య విడాకులు తీసుకుంది. అయితే భార్య విడాకులు ఇవ్వడానికి సతీష్ రెడ్డే కారణమని కటౌట్ శ్రీను భావించాడు. నేను నా పుట్టింట్లో ఉండగా సాయికిరణ్ను వెంట బెట్టుకుని కటౌట్ శ్రీను వచ్చి సతీష్ను చంపేస్తానని బెదిరించాడు. ఈ విషయం తెలుసుకుని సాయికిరణ్ను సతీష్ రెడ్డి కొట్టాడు. దీంతో ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్న సాయికిరణ్, సతీష్రెడ్డి కి మధ్య వివాదం నడుస్తుంది...మా ఇంట్లో అన్నం తిన్న సాయి కిరణే తన అనుచరులతో నా భర్తను కిరాతకంగా చంపాడు. అయితే ఈ హత్య చేయించింది మాత్రం కటౌట్ శ్రీనే. ఇదే విషయాన్ని పోలీసులకు చెబితే.. శ్రీను పేరు బయటకు చెప్పవద్దంటూ అతనిని తప్పిస్తున్నారు’’ అని సతీష్ రెడ్డి భార్య జయశ్రీ ఆరోపించారు.ఇదీ చదవండి: సాధిక్, సౌజన్య ఆన్లైన్లో ఏం ఆర్డర్ పెట్టారు? -
సినిమా చూసి ఇంటికెళ్తుండగా ఘోరం.. బైక్ను ఈడ్చుకెళ్లిన లారీ
కాకినాడ: ఆ కుటుంబ సభ్యులు అప్పటి వరకూ సినిమా చూసి, ఆనందంగా గడిపారు. అతడు భార్యాపిల్లలను ఇంటి దగ్గర దింపి, పలావ్ కొనుక్కుని వచ్చేందుకు బయల్దేరాడు. తిరిగి వెళ్తూండగా మృత్యుశకటంలా దూసుకొచ్చిన లారీ.. అతడి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘోర సంఘటన జగ్గంపేటలోని గోకవరం రోడ్డులో చోటు చేసుకుంది. ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నీలాపు సంతోష్ కుమార్ రెడ్డి (34) ప్రతిపాడులోని సీఎఫ్సీ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా పని చేస్తూ, 11 సంవత్సరాలుగా జగ్గంపేట బాలాజీ నగర్లో నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి భార్య శ్రీలిఖిత, కుమార్తెలు శాన్వి, లాస్య(చిన్న పిల్లలు)తో కలసి సినిమాకు వెళ్లారు. అనంతరం, భార్యాపిల్లలను సంతోష్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద దించి, పలావు కోసం గోకవరం రోడ్డులోని బిర్యానీ సెంటర్కు మోటార్ సైకిల్పై వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తూండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ అతడిని ఢీకొంది. దీంతో, సంతోష్ కుమార్ రెడ్డి బైక్ అదుపు తప్పి, ఎదురుగా వస్తున్న మరో మోటార్ సైకిల్ను ఢీకొంది. అందరూ కింద పడిపోగా ఆ లారీ సంతోష్ కుమార్ రెడ్డి బైక్ను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అతడి చెయ్యి నుజ్జునుజ్జయి ఊడిపోయింది. తీవ్ర గాయంతో రక్తస్రావం అవుతూండగానే సంతోష్ కుమార్ రెడ్డి మరో చేత్తో కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి మొబైల్ ఫోన్లో సమాచారం అందించడం స్థానికులను కలచివేసింది. అతడిని స్థానికులు, పోలీసులు, బంధువులు తొలుత స్థానిక సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలిస్తూండగా మార్గం మధ్యలో అతడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మోటార్ సైకిల్పై వెళ్తున్న వారు కూడా గాయపడ్డారు. సంతోష్ కుమార్ రెడ్డి భార్య శ్రీలిఖిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.చదవండి: ఫ్రెండ్ ప్రాణం తీసిన అక్రమ సంబంధం?


