Kakinada
-
కోతుల బెడదను పట్టించుకోరా?
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు కష్టపడి పండించిన పంటలను కోతుల బెడద నుంచి రక్షించాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీకి చెందిన పలువురు జెడ్పీటీసీ సభ్యులు మండిపడ్డారు. గతంలో అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్తు స్థాయీ సంఘ సమావేశాలు గురువారం జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. 1,2,4,7 స్థాయి సంఘాల చైర్మన్ వి.వేణుగోపాలరావు అధ్యక్షతన, 3వ స్థాయి సంఘం వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు అధ్యక్షతన, 5వ స్థాయి సంఘ జేడ్పీటీసీ సభ్యురాలు రొంగల పద్మావతి అధ్యక్షతన, 6వ స్థాయీ సంఘం సమావేశం జెడ్పీ వైస్ చైర్మన్ మేరుగు పద్మలత అధ్యక్షతన నిర్వహించారు. వివిధ అంశాలు చర్చించి ఆమోదించారు. జెడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించి ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, వైద్యం, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జాతీయ ఉపాధి హామీ పథకం, హౌసింగ్, విద్యుత్, గ్రామీణ అభివృద్ధి తదితర అంశాలపై ఇప్పటివరకు జరిగిన పురోగతి, కొత్తగా ప్రతిపాదించిన పనుల వివరాలపై అధికారులతో చర్చించారు. వేసవి నేపథ్యంలో అన్ని మండలాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, చలివేంద్రాలు ఏర్పాట్లు చేయాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. జేడ్పీ సీఈవో లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో సభ్యుల ఆవేదన -
ఆపతాపాలు
● సుర్రుమనిపిస్తున్న సూరీడు ● ఉమ్మడి జిల్లాలో గుబులు ● వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు అవసరం ఇలా చేస్తే మేలు ● వేసవిలో రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచూ తాగాలి. ● లేత రంగు కలిగిన తేలికగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ● పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. రెండు పూటలా స్నానం చేయాలి. ● ఎండ తీవ్రత అఽధికంగా ఉన్నప్పుడు బయటకు వెళితే గొడుగు లేదా టోపీ ధరించాలి. లేకుంటే తలకు రుమాలు చుట్టుకోవాలి. ● ఇంట్లో కిటికీలు తెరిచి గదిలోకి గాలి వచ్చి చల్లబడే విధంగా చర్యలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా ప్రచారం వేసవికాలం దృష్టా సంభవించే వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్య, ఆశ సిబ్బందితో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. వడదెబ్బకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏరియా, ప్రభుత్వ, పీహెచ్సీల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచాం. –ఎం.సుమలత, అదనపు జిల్లా వైద్యాధికారి, కోనసీమ ఆలమూరు: వేసవి వచ్చేసింది.. మండే ఎండలను తెచ్చేసింది.. బయటకు వెళ్తే సుర్రుమనిపిస్తోంది.. ఈ ఏడాది మార్చి తొలి వారం నుంచే ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సాధారణంగా మే నెల ప్రథమార్థంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతుంది. ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు మూడు డిగ్రీల వరకూ అధికంగా నమోదు అవుతున్నట్లు వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే హెచ్చరించింది. రెక్కల కష్టం మీద జీవనం సాగించే సామాన్యులపై ఎండ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, మహిళలు, ఇటుక పరిశ్రమ, భవన నిర్మాణ కార్మికులు, రోగ నిరోధశక్తి తగిన మోతాదులో లేని అనారోగ్య తీవ్రత ఉన్నవారు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఉమ్మడి జిల్లాల్లోని అన్ని ఏరియా, ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఉన్న సమయంలో మానవుని శరీరంలోకి సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. వేడిగాలుల వల్ల వడదెబ్బ (హీట్ స్ట్రోక్), శరీరంలో లవణాలు కోల్పోవడం (డీహైడ్రేషన్)తో కలిగే దుష్ఫరిణామాలు వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరంలోని ప్రాథమిక అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వడదెబ్బకు కారణమవుతుంది. సత్వరం ప్రాథమిక చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వడదెబ్బ లక్షణాలు.. జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు పుట్టడం, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతోంది. మగత నిద్ర రావడం, కలవరింతలు పలకడం, పెదవులు తడిబారి పోవడం కనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందే విధంగా చూడాలి. త్వరగా నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలే విధంగా చేయాలి. శరీరం సాధారణ స్థాయి ఉష్ణోగ్రత వరకూ వచ్చే వరకూ మెత్తటి తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిగిన మజ్జిగ లేదా చిటికెడు ఉప్పు కలిపిన గ్లూకోజ్ లేక ఓఆర్ఎస్ను తాగించాలి. అపస్మారక స్థితికి వెళ్లిన రోగితో నీరు తాగించరాదు. వెంటనే ఆరోగ్య కేంద్రానికి తరలించి మెరుగైన చికిత్స అందించాలి. -
అట్టహాసంగా పట్టాల ప్రదానం
టాపర్లకు బంగారు పతకాలు అందజేస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్వర్సిటీ ప్రగతిని వివరిస్తున్న వీసీ ప్రసాద్బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జేఎన్టీయూలో గురువారం 12వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. అతిరథ మహారథుల మధ్య అత్యంత వైభవంగా కనుల పండువగా నిర్వహించారు. 18 సంవత్సరాల చరిత్ర కలిగిన జేఎన్టీయూ కాకినాడ ప్రాంగణం ఇందుకు వేదికగా నిలిచింది. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చాన్సలర్ హోదాలో హాజరయ్యారు. దీంతో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత ఏర్పాట్ల మధ్య పరిమిత సంఖ్యలో ఆహూతులతో కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది జూలై 4వ తేదీన వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకాగా మళ్లీ ఇప్పుడు ఎనిమిది నెలల తరువాత హాజరయ్యారు. బంగారు పతకాలు, పీహెచ్డీలు అందుకునేవారు సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడంతో ఆడిటోరియం కొత్త శోభను సంతరించుకుంది. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్.. శాంత బయోటెక్ అధినేత పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. ఒక గంట ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సందడి చేశారు. ప్రగతి వివరించిన వీసీ ఆడిటోరియంలోకి పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతించగా బయట ప్రత్యేకంగా ఎల్సీడీలు ఏర్పాటు చేసి లైవ్ ద్వారా వీక్షించేందుకు అవకాశం కల్పించారు. తొలుత పతకాలు, పట్టాల గ్రహీతలతో వీసీ ప్రసాద్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభించారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తన ప్రసంగంలో వర్సిటీ సాధించిన ప్రగతి వివరించారు. దాదాపు 20 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగించారు. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ ప్రేరణ కలిగించేలా ఆయన ప్రసంగం సాగింది. అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా జేఎన్టీయూ కాకినాడ స్థిరపడిందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలో యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు ఒడిసి పట్టాలని సూచించారు. ముఖ్యంగా ఫైనాన్స్, లాజిస్టిక్స్, మానవ వనరుల నిర్వహణ, విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించే ప్రాజెక్టులను ప్రొత్సహించాలన్నారు. యువత ఉద్యోగం కోసమే కాకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఆలోచించాలని కోరారు. అనంతరం గవర్నర్ చేతుల మీదుగా 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీలు ప్రదానం చేశారు. గ్రాడ్యుయేషన్ డే అంటే యూనివర్సిటీతో సంబంధం ముగించడం కాదని, కేవలం యూనివర్సిటీ నుంచి ప్రపంచంలోకి ప్రవేశించడమన్నారు. శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని అధ్యయనం చేస్తే ఇంజినీర్లు ప్రపంచాన్ని సృష్టిస్తారన్నారు. సైన్స్ రంగంలో పీహెచ్డీలు పొందిన సంఖ్యలో యూఎస్, చైనా తరువాత మూడో స్థానం భారతదేశం సాధించిందని, స్టార్టప్ల సంఖ్యాపరంగా కూడా 3వ స్థానంలో ఉన్నామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి, రెక్టార్ సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆర్.శ్రీనివాసరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వీ.ఎస్.ఎస్. కుమార్, కే.వీ.ఎస్.జీ మురళీకృష్ణ, రామలింగరాజు, పాలక మండలి సభ్యులు బెజవాడ వీరవెంకట సత్యనారాయణ, సంకురాత్రి చంద్రశేఖర్, వర్సిటీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. అందజేసిన పట్టాల వివరాలు 2024–25 విద్యా సంవత్సరానికి బీటెక్ 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎం ఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభించారు. అలా మొదలై.. ఇలా ముగిసి.. షెడ్యూల్ ప్రకారం స్నాతకోత్సవం ఉదయం 10.45 గంటలకు ప్రారంభం కావలసి ఉంది. గంటా మూడు నిమిషాల ఆలస్యంగా 11.48 గంటలకు కార్యక్రమం ప్రారంభించారు. 11.49 గంటలకు గవర్నర్ అనుమతితో కార్యక్రమం ప్రారంభం 11.55కు పీహెచ్డీ, గోల్డ్మెడల్ విజేతలతో ప్రతిజ్ఞ 12.00 గవర్నర్ అనుమతితో వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 12.05 బంగారు పతకాలు, పీహెచ్డీల ప్రదానం 12.30 ముఖ్య అతిథి వరప్రసాద్రెడ్డి ప్రసంగం 12.45 గవర్నర్ ప్రసంగం 12.50 వీసీ ప్రసాద్ చేతుల మీదుగా గవర్నర్, ముఖ్య అతిథులకు సత్కారం 1.00 గంటలకు రెక్టార్ సుబ్బారావు ధన్యవాదాలు, జాతీయ గీతంతో ముగింపు వైభవంగా జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం కులపతి హోదాలో హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం 39 బంగారు పతకాలు, 48 పీహెచ్డీలు ప్రదానం గంట ఆలస్యంగా ప్రారంభం -
కొండెక్కి కూర్చుంది!
● పులి మళ్లీ సీతానగరం మండలంలోకి.. ● భయాందోళన చెందుతున్న జనం రాజానగరం: సీతానగరం మండలంలోకి పులి మళ్లీ వచ్చింది.. కొండెక్కి కూర్చుంది.. ఏటిపట్టు ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. పులి సంచారంపై వస్తున్న సమాచారంతో తమ ప్రాణాలతో పాటు పశువులను ఏవిధంగా కాపాడుకోవాలో తెలియక జనం భయపడిపోతున్నారు. వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లేందుకు సంకోచిస్తున్నారు. పెద్ద పులి సీతానగరంలో ఉన్న చిట్టిబాబాజీ ఆశ్రమ గోశాల సమీపంలోని కొండపై ఉన్నట్టు తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు దానిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ శాఖ అధికారి హరీష్ విజ్ఞప్తి చేశారు. రామదుర్గంలోని పురాతన రామాలయం ఉన్న కొండపైకి చేరిన పులి బుధవారం రాత్రి సీతానగరంలోని చిట్టి బాబాజీ ఆశ్రమం గోశాలకు సమీపంలో ఉన్న కొండపైకి చేరుకున్నట్టు తెలుసుకున్నారు. పులి పగలంతా విశ్రాంతి తీసుకుని, చీకటి పడిన తరువాత వేటకు వెళ్తుంది. ఈ క్రమంలో గురువారం రాత్రి సమయంలో ప్రస్తుతం కొండపై నుంచి దిగి నేలకోట, రామవరపు ఆవ వైపు వెళ్లే అవకాశం ఉందని, లేకుంటే వచ్చిన మార్గంలోనే పెదకొండేపూడి వైపు దిగవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే పులి సంచారంపై ప్రజలను భయబ్రాంతులను చేసే విధంగా సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. అటువంటి వాటిపై శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రథోత్సవంలో అపశ్రుతి
భద్రతా వైఫల్యానికి యువకుడి బలి పిఠాపురం: అధికారుల భద్రతా వైఫల్యం ఓ అమాయకుడిని బలి తీసుకుంది. చేబ్రోలు జరిన రాములవారి రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథం కిందపడి శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన దుక్కా వెంకటేష్ (22) మృత్యువాత పడిన సంఘటన భక్తులను కలవరపాటుకు గురి చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి చేబ్రోలులో రాములవారి రథోత్సవం నిర్వహిస్తుండగా, చూడడానికి కత్తిపూడికి చెందిన యువకుడు దుక్కా వెంకటేష్ (శ్రీను) వచ్చాడు. రథం తాడు లాగే క్రమంలో ప్రమాదవశాత్తూ రథం తగిలి కింద పడ్డాడు. అతని పొట్ట మీదుగా రథం చక్రం నొక్కింది. వెంటనే అతనిని పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు మృతుడి తండ్రి దుక్క శ్రీను చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తెలిపారు. ఏర్పాట్లలో విఫలం దేవాలయ చరిత్రలో వందల ఏళ్ల నుంచి శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించే రథోత్సవంలో ఇప్పటి వరకూ చిన్న సంఘటనలు తప్ప ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ప్రస్తుత రథోత్సవంలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించినట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. రథం చక్రాల వద్ద కేవలం రథాన్ని మలుపు తిప్పే శీలలతో ఉన్న వ్యక్తులు, పోలీసులు మాత్రమే ఉండాలి. అయితే జనాన్ని అదుపు చేయడంలో ఆలయ కమిటీ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అత్యంత భారీ జన సందోహం మధ్య సాగే రథయాత్ర జరిగే చేబ్రోలు మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ క్రమబద్దీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఆలయ కమిటీపై ఫిర్యాదు ఆలయ కమిటీ నిర్లక్ష్యం వల్ల రథోత్సవంలో తన కుమారుడు మృతి చెందాడని మృతుడి తండ్రి దుక్కా శ్రీను గొల్లప్రోలు పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో ఆలయ కమిటీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఆలయ కమిటీపై తగిన చర్యలు తీసుకుని, తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఇళ్ల స్థలాల భూమిని అన్యాక్రాంతం చేస్తే ఊరుకోం
● లబ్ధిదారులతో కలిసి ఆందోళనకు దిగుతాం ● వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత పిఠాపురం: స్థానికంగా నిరుపేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వెంటనే దానిని ఆపకపోతే ఆందోళనకు దిగుతామని వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీత హెచ్చరించారు. ఆమె గురువారం పిఠాపురం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పిఠాపురం మసీదు మాన్యంలో ఐదు ఎకరాల భూమిలో సుమారు 250 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించి రిజిస్ట్రేషన్లు చేసి మరీ అప్పగించిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వారికి ఇళ్లు కట్టించకపోగా ఆ భూమిని స్వాధీనం చేసుకుని అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్ల భూమి ఇళ్ల స్థలాలకు కేటాయిస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఇచ్చిన స్థలాలను లాక్కోడానికి చేస్తున్న ప్రయత్నాలను చూస్తూ ఊరుకునేది లేదన్నారు. పేదలకు అన్యాయం జరిగితే వారి తరఫున పోరాటం చేసి ఇళ్లు కట్టించే వరకు వారికి అండగా ఉంటామన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతీ పేదవాడి సొంతింటి కల నెరవేరాలనే సంకల్పంతో రూ.కోట్లు వెచ్చించి రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏకంగా కొత్త కాలనీలనే నిర్మించారన్నారు. కాని కూటమి నేతలు పేదల స్థలాలను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. అక్కడ ఆస్పత్రి.. ఇక్కడ కాలేజీ హాస్యాస్పదం కాకినాడలో మంజూరైన ఆయుష్ కాలేజీ నిర్మాణానికి పిఠాపురంలో మసీదు మాన్యం భూమిని కేటాయించడం దారుణమన్నారు. మసీదు మాన్యంలో వందల మంది పేదలు ఇళ్లు కట్టుకోడానికి సిద్ధపడుతుంటే వారికి అన్యాయం చేస్తు కాకినాడ కట్టాల్సిన కాలేజీని పిఠాపురంలో కట్టడానికి ప్రయత్నించడం పేదలకు అన్యాయం చేయడమే అవుతుందన్నారు. కాకినాడలో ఉన్న భూమిని తెలుగుదేశం నేతకు కట్టబెట్టడానికి అక్కడ కట్టాల్సిన కాలేజీని ఇక్కడకు మార్చారని ఆమె ఆరోపించారు. కాకినాడలో ఆయుష్ ఆస్పత్రిని తన హయాంలో నిర్మిస్తే రెండేళ్లు దానిని ప్రారంభించకుండా వదిలేశారన్నారు. ఆయుష్ ఆస్పత్రి ఉన్న చోటే ఆయుష్ కాలేజీ కూడా ఉండాలన్న విషయం పాలకులకు అర్థం కాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిరు పేదలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, ఉలవల భూషణం, పచ్చిమళ్ల జ్యోతి, సోమరౌతు లలిత, బొజ్జారామయ్య పాల్గొన్నారు. ఇంత బరి తెగింపా? పిఠాపురం: చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి కాకినాడలో రూ.కోట్ల విలువైన ఆయుష్ కళాశాల భూమిని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు కట్టబెట్టి, పిఠాపురంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూములను ఆయుష్ కళాశాలకు ప్రతిపాదించడం హేయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. గురువారం ఆయన పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో మీడియాతో మాట్లాడారు. కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ సమీపంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నిర్మాణానికి కేటాయించిన భూమిని తాజ్ హోటల్ పేరుతో మోసం చేస్తూ వర్మకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దీనిపై శనివారం కాకినాడలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని, హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యమేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. నెల రోజులుగా ఆయుష్ ఆసుపత్రిపై చర్చ జరుగుతున్నా స్పందించడం లేదన్నారు. -
కాలువలో పడి బాలుడి మృతి
మోతుగూడెం: కాలువలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధి సుకుమామిడి గ్రామానికి చెందిన కుత్తిమ ఆదిలక్ష్మి తన కూతురు, కుమారుడిని అంగన్వాడీ కేంద్రానికి పంపి కూలి పనులకు వెళ్లిపోయింది. సాయంత్రం వచ్చి చూడగా, కుమారుడు ఉత్తమ లక్ష్మణ్రెడ్డి (4) కనిపించలేదు. దీంతో గ్రామస్తుల సాయంతో వెతకగా ఆ బాలుడు గ్రామ సమీపంలోని కాలువలో నీటిలో తేలాడుతూ కనిపించాడు. ఈ సమాచారాన్ని ఎస్సై నాజీర్ హుస్సేన్కు తెలపడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతానికి ఎలక్ట్రీషియన్ మృతి ఏలేశ్వరం: విద్యుత్ షాక్కు గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. యర్రవరంలోని లేఅవుట్ సమీపంలో విద్యుత్ స్తంభం వద్ద గ్రామానికి చెందిన బిరుసు రాజు (40) మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో అతను వెంటనే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న రాజు మృతి చెందడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. రాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రైసుమిల్లు, గ్యాస్ ఏజెన్సీలో తనిఖీలు
సామర్లకోట: పెద్దాపురంలోని వెంకటేశ్వరా రైసుమిల్లులో గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసుమిల్లులో రేషన్ బియ్యం చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు సివిల్ సప్లయ్స్ కమిషనర్ కన్నబాబు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. రైసు మిల్లులో రైతుల నుంచి సేకరించిన ధాన్యం, బియ్యం నిల్వ వివరాలను నమోదు చేసుకున్నారు. రైసుమిల్లు సామర్థ్యం, కార్మికుల భద్రత, రైసు మిల్లుల నిర్వహణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనల అమలును జేసీ పరిశీలించారు. అంతకుముందు పట్టణ పరిధిలోని రేషన్ షాపులలో పేద ప్రజలకు బియ్యం ఏవిధంగా సరఫరా చేస్తున్నారో ఆరా తీశారు. షాపులలో బియ్యం నిల్వ, స్టాక్ రిజిస్టర్, సరకుల నాణ్యత, తూకం, బిల్లింగ్ వివరాలను పరిశీలించారు. అనంతరం మెయిన్రోడ్డులోని గాయత్రి గ్యాస్ ఏజెన్సీని క్షుణ్ణంగా పరిశీలించారు. నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ఆ గ్యాస్ ఏజెన్సీ వద్ద రోజూ వినియోగదారులు బారులు తీరడంతో ఏజెన్సీ ప్రతినిధి నుంచి పూర్తి వివరాలు సేకరించారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్లో బుకింగ్ లోపాలను అడిగి తెలుసుకున్నారు. బ్లాక్ మార్కెట్లో గ్యాస్ విక్రయం జరుగుతున్నట్టు గుర్తిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా సివిల్ సప్లయ్స్ అధికారి సత్యనారాయణరాజు, తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
ఏ ప్రమాదం జరుగుతుందో..
రామేశ్వరం నుంచి గుడిమూల శివాలయం వరకూ ఉన్న ఏటిగట్టు మార్గం పూర్తి అధ్వానంగా ఉంది. ఈ మార్గంలో అంతర్వేది క్షేత్రానికి వాహనాలపై వెళ్లే భక్తులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు – డి.మార్టిన్, సఖినేటిపల్లి ఈ మార్గం చాలా దగ్గర సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి రామేశ్వరం మీదుగా ఏటిగట్టు వెంబడి అంతర్వేదికి ఉన్న మార్గం చాలా దగ్గర. అయితే మధ్యలో అధ్వానంగా మారిన 4 కిలోమీటర్ల రోడ్డును బాగు చేస్తే మంచింది. ఇప్పుడు చుట్టూ తిరిగి మరో 4 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. – కోన ప్రభాకర్రావు, గుడిమూలప్రతిపాదనలు పంపించాం సఖినేటిపల్లి బోను సెంటర్ నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పు, రెండు వరుసల రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాం. రామేశ్వరం సరిహద్దు నుంచి గుడిమూల శివాలయం వరకూ ఎన్ఆర్జీఎస్లో పెట్టాం. అలాగే బోను వద్ద నుంచి అంతర్వేది వరకూ ఏటిగట్టు వెడల్పునకు కూడా అవసరమైన చోట్ల పనులకు పుష్కర గ్రాంటులో పెడుతున్నాం. నిధులు మంజూరైన పనులు మొదలు పెడతాం. –సురేష్, ఆర్అండ్బీ, జేఈ, రాజోలు -
2,818 కిలోల గంజాయి ధ్వంసం
అమలాపురం టౌన్: జిల్లాలో 77 కేసులకు సంబంధించి సీజ్ చేసిన 2,818 కిలోల గంజాయిని విశాఖపట్నం జిందాల్ పవర్ లిమిటెడ్ నిబంధనల ప్రకారం ధ్వంసం చేసినట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. విశాఖపట్నం జిందాల్ పవర్ ప్లాంట్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్పీ రాహుల్ మీనాతో పాటు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ మేరకు గంజాయి ధ్వంసం చేసిన విషయాలను ఎస్పీ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈగల్ టీమ్ల ద్వారా జిల్లాలో గంజాయి ముఠాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు ‘తిరుమల’లో అవగాహన సదస్సు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం తిరుమల క్యాంపస్లో తిరుమల విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ అండ్ నీట్పై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్ వంటి పరీక్షల ద్వారా ప్రసిద్ధ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, బిట్స్ లాంటి అత్యుత్తమ యూనివర్సిటీల్లో సీటు సంపాదించాలంటే ఏవిధంగా ప్రిపేర్ అవ్వాలి, తల్లిదండ్రుల తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలి, అలాగే వారికి ఉన్నత విలువలు ఎలా నేర్పాలో తెలియజేస్తారన్నారు. ఈ సదస్సుకు హాజరవ్వాలంటే ముందుగా తమ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఐఆర్యూఎంఏఎల్ఏఈడీయూ.సీవోఎం నందు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్టర్ చేసుకోని వారు అదే రోజు ఉదయం 9 గంటల లోపు క్యాంపస్లో రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. బాలిక అదృశ్యం నిడదవోలు రూరల్: పదో తరగతి పరీక్షకు వెళ్లిన తమ కుమార్తె తిరిగి ఇంటికి రాలేదని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. కోరుమామిడి గ్రామానికి చెందిన బాలిక (15) పదో తరగతి పరీక్ష రాసేందుకు గురువారం ఉదయం తాడిమళ్ల జెడ్పీ హైస్కూల్కు వెళ్లి తిరిగి రాలేదన్నారు. తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బెల్లం ఊట ధ్వంసం తాళ్లరేవు: కోరంగి మడ అటవీ ప్రాంతంలో సారా తయారీ స్థావరాలపై గురువారం అటవీ సిబ్బంది, ఎకై ్సజ్ పోలీసులు దాడి చేసి 5 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి ఎన్.రామచంద్రరావు, ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఫారెస్ట్, ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి 26 ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. వరప్రసాద్ మాట్లాడుతూ మడ అడవులలో ఎవరైనా చట్ట విరుద్ధంగా సారా కాస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తండ్రి మందలించాడని ఆత్మహత్య కొత్తపల్లి: తండ్రి మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కొత్తపల్లి మండలం ఉప్పాడ శివారు మాయాపట్నానికి చెందిన మెరుగు సత్తిరాజు (55) తన తండ్రి మందలించాడనే కోపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. కుటుంబ సభ్యులు సత్తిరాజును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కోళ్ల మేత మెషీన్పై పడి వ్యక్తి మృతి నిడదవోలు రూరల్: కోళ్లఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ, కోళ్ల మేత మెషీన్పై పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ నూతంగి సత్యానందం (33) ఎలక్ట్రికల్, ప్లంబింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. కాటకోటేశ్వరం గ్రామంలో కొత్తపల్లి వెంకటేశ్వరరావుకు చెందిన కోళ్లఫారంలో గురువారం మధ్యాహ్నం వాటర్షెడ్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తూ కోళ్ల మేత మెషీన్పై పడ్డాడు. ఈ నేపథ్యంలో సత్యానందం తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. భార్య కోట సత్తెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సత్యానందం మృతితో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
ఘనంగా సీతారాముల శ్రీచక్రస్నానం
అన్నవరం: రత్నగిరిపై నిర్వహిస్తున్న శ్రీరామనవమి వేడుకలలో భాగంగా ఎనిమిదో రోజు చైత్ర పౌర్ణిమ, గురువారం పంపా నదిలో సీతారాములకు శ్రీచక్రస్నానం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఎనిమిది గంటలకు పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు వెంట రాగా పల్లకీ మీద నవదంపతులు సీతారాములను పంపా తీరానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. అక్కడ వేదికపై నవదంపతులు సీతారాములను ఒక సింహాసనంపై, పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను మరో సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. తరువాత సీతారాములకు, శ్రీచక్రానికి పండితులు అవభృత స్నానం నిర్వహించారు. అనంతరం సీతారాముల విగ్రహాలను శ్రీచక్రాన్ని పండితుల మంత్రోఛ్చాటన మధ్య ఊరేగింపుగా పంపా నదికి తీసుకువెళ్లారు. తరువాత పంపా నదిలో శ్రీచక్రస్నానం నిర్వహించారు. స్నానం అనంతరం మళ్లీ సీతారాములను సింహాసనంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రత్నగిరి రామాలయంలో సీతారాములకు నాకబలి, దండియాడింపు కార్యక్రమాలను నిర్వహించారు. పెళ్లిపెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు సమక్షంలో నవదంపతులు సీతారాములుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చక స్వాములు సీతారాముల విగ్రహాలతో ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుంటూ నృత్యం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శుక్రవారం రాత్రి ఏడు గంటల నుంచి రామాలయంలో సీతారాములకు శ్రీపుష్పయాగం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. -
భక్తులకు సదుపాయాలు కల్పిస్తా
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దేవాలయాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా సదుపాయాలు కల్పిస్తానని జిల్లా దేవదాయశాఖాధికారి తలాటం వెంకట సూర్యనారాయణ అన్నారు. స్థానిక జిల్లా దేవదాయశాఖ కార్యాలయంలో తన చాంబర్లో గురువారం ఆయన జిల్లా దేవదాయశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సూర్యనారాయణకు జిల్లాలోని పలు దేవాలయాల ఈవోలు, సత్రాల ఈవోలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సూర్యనారాయణ కలెక్టర్ హరేందిరప్రసాద్ను కలెక్టరేట్లో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వాడపల్లి వెంకన్నకు వైభవోపేతంగా చక్రస్నానం ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆరో రోజు గురువారం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో గౌతమీ గోదావరిలో స్వామివారికి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు, అనంతరం హోమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే చక్రస్నానంలోనూ భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ అర్చక కమిటీ సభ్యులు వాడపల్లి శేషావతారం, కమిటీ సభ్యులు సిష్టా సూర్య కుటుంబరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆత్రేయపురం ఎస్సై ఎస్.రాము పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాయంత్రం గౌతమీ గోదావరి తీరంలో చోర సంవాదం జరిగింది. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి అమలాపురం రూరల్: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పదవి నుంచి బర్త్రఫ్ చేయాలంటూ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూషి జాన్ మోషే ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ గెడ్డం సంపదరావు మాట్లాడుతూ శ్రీరామ నవమి రోజు ఆకివీడు గ్రామంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు వ్యవహరించిన తీరు అత్యంత దారుణమన్నారు. అనంతరం ఏవోకు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జుత్తిక సత్యనారాయణ, కార్యదర్శి కోణాల ప్రకాష్, కోశాధికారి కాండ్రేగుల గంగరాజు, అమలాపురం ఇన్చార్జి పొలమురి మోహన్ బాబు పాల్గొన్నారు. -
పట్టాభిషేకానికి సిద్ధం
● నేడు జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవం ● హాజరుకానున్న వర్సిటీ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): బీటెక్ నాలుగేళ్లు, ఎంటెక్ రెండేళ్లు చదివినవారికి యూనివర్సిటీ అందజేసే పట్టాల వేడుకలకు జేఎన్టీయూ కాకినాడ వేదిక అవుతోంది. వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఉన్న వారికి సైతం పట్టా అందుకోవడానికి ఆహ్వానాలు పంపారు. అతిరథ మహారథుల చేతుల మీదుగా స్నాతకోత్సవ సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు పట్టా (ఒరిజనల్ డిగ్రీ) తీసుకోవడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీవితంలో మధురానుభూతిగా నిలిచే ఈ వేడుకలకు అర్హులైనవారు తమ వివరాలు వర్సిటీకి పంపించారు. గత ఏడాది డిసెంబర్లో స్నాతకోత్సవానికి నోటిఫికేషన్ జారీచేసి గవర్నర్ అనుమతితో గురువారం నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు వర్సిటీ వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. 12వ స్నాతకోత్సవంలో భాగంగా 2024–25 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైనవారికి పట్టాలు అందజేస్తున్నారు. బీటెక్ విభాగంలో 32,170, బిఫార్మశీ 1,450, ఎంటెక్ 679, ఎంబీఏ 1,326, ఎంసీఏ 1,115, ఎంఫార్మశీ 116, బీబీఏ 28, ఫార్మడీ 944, బీఆర్క్ 70 ఓడీలు (ఒరిజనల్ డిగ్రీ) విద్యార్థులు పొందనున్నారు. వివిధ సబ్జెక్టుల్లో ప్రతిభ చూపిన 39 మందికి బంగారు పతకాలు, 48 మందికి పీహెచ్డీలు అందజేయనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా డిజిటల్ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ విధానంలో విద్యార్థుల ఓడీలను వారికి చెందిన డీజీ లాకర్లో భద్రపరిచే విధానాన్ని గవర్నర్ చేతుల మీదుగా రాష్ట్రంలో తొలిసారిగా యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నారు. శాంత బయోటెక్ అధినేత వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ స్నాతకోత్సవం సందర్భంగా శాంతా బయోటెక్ అధినేత, పద్మభూషణ్ డాక్టర్ కే.ఐ.వరప్రసాద్రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. 1948 నవంబర్ 17న నెల్లూరు జిల్లాలో జన్మించిన ఈయన శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన తరువాఈ జేఎన్టీయూకేలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ, జర్మనీలో కంప్యూటర్ సైన్స్ డిప్లమా చేశారు. 1993లో తన తల్లి శాంతమ్మ పేరుతో శాంత బయోటెక్ ప్రారంభించి ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో తమ వ్యాపారాన్ని విస్తరించారు. హైపటైటిస్ బీ–టీకా వంటి ప్రాణరక్షణ టీకాలను తక్కువ ఖర్చుకే అందించేలా కృషి చేశారు. భారతీయులకు టీకాను అందుబాటు ధరలోకి తీసుకువచ్చారు. ప్రజారోగ్య రంగాలకు ఆయన చేసిన సేవలకు 2005లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దేశంలో పేరొందిన యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లతోపాటు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును బయోటెక్ రంగంలో ఆయన సాధించారు. -
రెండేళ్లయినా సమస్యలు పరిష్కరించలేదు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రెండేళ్లు గడిచినా చంద్రబాబు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించ లేదని యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణకుమారి అన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవారం యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రణభేరి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. పీఆర్సీ కమిషన్ను నియమించడం లేదని, ఐఆర్ ప్రకటించడం లేదన్నారు. పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయడం లేదన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ సూరిబాబు, కేవీపీ నగేష్బాబు మాట్లాడుతూ హైస్కూల్లో నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను చాలా చులకనగా చూస్తున్నారన్నారు. రేషనలైజేషన్ పేరుతో వేలాది పోస్టులు తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి తమ హామీలను నెరవేర్చే వరకూ ఈ పోరాటం ఆగదన్నారు. అసోసియేషన్ నాయకులు గోవిందరాజులు, నాగమణి, పీవీ సత్యనారాయణ, వీవీ రమణ, జి నాగరాజు, జి ప్రభాకరవర్మ పాల్గొన్నారు. యూటీఎఫ్ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణకుమారి -
ఘనంగా సీతారాముల వన విహారోత్సవం
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారాముల దివ్య కల్యాణ మహోత్సవాలలో భాగంగా ఏడో రోజు బుధవారం సీతారాముల వన విహారోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి వెంట రాగా నవ దంపతులు సీతారాములను ఊరేగింపుగా కొండదిగువన దేవస్థానం ఉద్యానవనం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక సింహాసనంపై నవదంపతులు, సీతారాములను, మరో ఆసనం మీద పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. నవదంపతులకు నూతన పట్టువస్త్రాలను దేవస్థానం అధికారులు అందజేశారు. విఘ్నేశ్వరపూజ, తదితర కార్యక్రమాలనంతరం అర్చకస్వాములు నీరాజనమంత్రపుష్పాలు సమర్పించగా, పండితులు వేదాశీస్సులు అందజేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. నేడు చక్రస్నానం ఉత్సవాల ఎనిమిదో రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు పవర్హౌస్ వద్ద గల పంపా నది వద్ద సీతారాములకు చక్రస్నానం నిర్వహించనున్నట్లు పండితులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రామాలయంలో నాకబలి, దండియాడింపు నిర్వహిస్తారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలో బుధవారం పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యురాలు, మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి కొత్త కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో నడిపిస్తానని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. జిల్లా నూతన కలెక్టర్గా ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తన కార్యాలయ చాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయన విశాఖపట్టణం నుంచి అన్నవరం చేరుకుని రమా సత్యనారాయణస్వామివారిని దర్శించి, అర్చన, ఆశీర్వాద కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఉదయం 9.30 గంటలకు కాకినాడ జిల్లా కలెక్టరు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జేసీ అపూర్వ భరత్, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, డీఆర్వో డి.తిప్పేనాయక్, జిల్లా అధికారులు, వేద పండితులు పూర్ణకుంభం, మేళతాళాలతో స్వాగతం పలికారు. కలెక్టర్ చాంబర్లో ఆయన పదవీ బాధ్యతలు చేపడుతూ సంతకం చేసి, పండితుల వేదస్వస్తి, ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ విశాఖపట్నంలో కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్గా పనిచేసిన అనుభవంతో కాకినాడ జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అన్నవరం దేవస్థానం బడ్జెట్ రూ.179.71 కోట్లు అన్నవరం: అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 179,71,20,000 బడ్జెట్ను ఆమోదిస్తూ దేవదాయ, ధర్మాదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ బడ్జెట్లో సిబ్బంది జీతభత్యాలకు రూ.33.50 కోట్లు, పింఛన్లు, గ్రాట్యుటీకి రూ.15 కోట్లు, కొనుగోళ్లకు రూ.33.20 కోట్లు, ఉత్సవాలకు రూ.1.50 కోట్లు, పురోహితుల రెమ్యునరేషన్ రూ.16.80 కోట్లు, ప్రసాదం ప్యాకర్లు, బార్బర్స్ రెమ్యునరేషన్ రూ.4.70 కోట్లు, శానిటేషన్కు రూ.పది కోట్లు, వాటర్ వర్క్స్ కు రూ.2.5 కోట్లు, భద్రతా సిబ్బందికి రూ.5.50 కోట్లు, శాట్యుటరీ పేమెంట్స్కు రూ.20 కోట్లు, ఇంజినీరింగ్ వర్క్స్ కు రూ. ఏడు కోట్లు, అన్నదాన పథకానికి రూ.5.5 కోట్లు, గో సంరక్షణకు రూ.75 లక్షలు కేటాయించారు. 2025–26లో రాబడి రూ.157.54 కోట్లు 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆలయానికి రూ.157.54 కోట్ల రాబడి వచ్చినట్లు ఈఓ త్రినాథరావు తెలిపారు. గతేడాదికన్నా సుమారు రూ.తొమ్మిది కోట్లు పెరిగిందన్నారు. -
కమిషనర్ను విధుల నుంచి తొలగించాలి
పిఠాపురం: పట్టణంలోని పదో సచివాలయం శానిటేషన్ సెక్రటరీ గుమ్మడి సుధీర్పై ఫోనులో దుర్భాషలాడిన పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావుపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మండిపడ్డారు. బాధిత దళిత ఉద్యోగి సుధీర్ను రాయడానికి వీలు లేని బూతులు తిట్టిన కమిషనర్ ఆడియో సామాజిక మాధ్యమాల్లో సోమవారం హల్చల్ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ విపర్తి నిఖిల్కృష్ణ ఆధ్వర్యాన సచివాలయ ఉద్యోగులు మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైఠాయించి, నినాదాలు చేశారు. కమిషనర్ను బేషరతుగా విధుల నుంచి తొలగించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మహిళలను సైతం కమిషనర్ కనకారావు దుర్భాషలాడుతున్నారని, ఆయన ఉంటే విధులు నిర్వహించలేమని పలువురు మహిళా సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. థర్డ్ జెండర్ను పిలిచే బృహన్నల అనే పదంతో మహిళా ఉద్యోగుల్ని కమిషనర్ దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు బాధిత ఉద్యోగి సుధీర్ మాట్లాడుతూ కింది స్థాయి ఉద్యోగులను కమిషనర్ పురుగుల కంటే హీనంగా చూస్తూంటారని ఆరోపించారు. ఇప్పటికే చాలా మంది చిరుద్యోగులపై బూతులతో విరుచుకుపడ్డారని, బదిలీపై వచ్చినప్పటి నుంచీ తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. తనను దుర్భాషలాడటంతో పాటు తన తల్లిని కించపరిచేలా తిట్టడం మానసిక వేదనకు గురి చేసిందన్నారు. వృత్తికి సంబంధం లేకుండా తనను వ్యక్తిగతంగా దూషించిన కమిషనర్ను వెంటనే సస్పెండ్ చేయాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసి, చర్యలు తీసుకోవాలి అసోసియేషన్ రాష్ట్ర నేత విప్పర్తి నిఖిల్కృష్ణ, ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ దారపురెడ్డి తాతాజీరావు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు షేక్ మహబూబ్ బాషా మాట్లాడుతూ కింది సిబ్బంది సరిగ్గా పని చేయకపోతే పై అధికారిగా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, ఇలా వ్యక్తిగత దూషణలకు పాల్పడటమేమిటని ప్రశ్నించారు. కమిషనర్ తీరును తీవ్రంగా ఖండించారు. కనకరావును వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఉద్యోగులు, అక్కడున్న అంబేడ్కర్, గాంధీజీ విగ్రహాలకు వినతిపత్రం అందజేశారు. ఆందోళన నిర్వహిస్తున్న క్రమంలో మహిళా ఉద్యోగి నాగమణి భావోద్వేగానికి గురై స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం, పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయానికి ప్రదర్శగా చేరుకుని, పీడీ ఎన్వీ శివరామ్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని వారికి ఆయన హామీ ఇచ్చారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడైన శానిటేషన్ సెక్రటరీ సుధీర్ మున్సిపల్ కమిషనర్పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జాన్ క్రిష్టఫర్, ఉపాధ్యక్షుడు పి.కన్నారావు, పిఠాపురం మున్సిపాలిటీ అధ్యక్షుడు బి.రాఘవులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.రాంబాబు, ఉపాధ్యక్షులు వి.సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి ఏవీడీ మోహన్ తదితరులు పాల్గొన్నారు. ·˘ í³u>ç³#Æý‡… Ð]l¬°Þç³ÌŒæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª E§øÅVýS$ÌS B…§øâýæ¯]l ·˘ MýS¯]lM>Æ>Ð]l# º*™èl$ ç³#Æ>׿…Oò³ «§ýlÓf… ·˘ ´ëyé ï³yîlMîS ѯ]l†ç³{™èl… ·˘ ´ùÎçÜ$ÌSMýS$ »ê«¨™èl E§øÅW íœÆ>ŧýl$ -
బంగారు ఆభరణాల చోరీ
అనపర్తి: లక్ష్మీనరసాపురం గ్రామంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను సోమవారం అర్ధరాత్రి దొంగలు దోచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సురకాసుల గోపి వ్యవసాయ కూలీగా పనిచేస్తుంటాడు. అతడికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానిక కనకదుర్గమ్మ గుడి పక్కనే రెండు అంతస్తుల భవనం నిర్మించుకున్నాడు. పగలంతా కుటుంబ సభ్యులందరూ ఆ భవనంలోనే ఉంటారు. రాత్రి పడుకోవడానికి దాని వెనుక ఉన్న పాత బిల్డింగ్లోకి వెళతారు. గోపి తల్లిదండ్రులు కూడా కొత్త భవనం పైఅంతస్తులో ఉంటున్నారు. ప్రతి రోజూ మాదిరిగానే సోమవారం అర్ధరాత్రి పడుకోవడానికి పాత భవనానికి వెళ్లారు. మంగళవారం ఉదయం కొత్త ఇంటికి వచ్చేసరికీ తలుపు తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువాలోని 4 కాసుల బంగారు నల్లపూసలు, రెండు కాసుల జిగిని, 4 కాసుల చైను ఉంగరాలు, ఒక కాసు విలువైన చెవి రింగులు, మ్యాటీలు కలిపి.. మొత్తం 11 కాసుల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. -
‘అమ్మచెక్కిన బొమ్మ’కు ప్రథమ బహుమతి
ఏలేశ్వరం: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా గొల్లపల్లి చెల్లయ్య మోమోరియల్ నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో మండలంలోని పెద్దనాపల్లి గ్రామంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. కళాపరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి (బుజ్జి) ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు ఆసక్తికరంగా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ వారి అమ్మచెక్కిన బొమ్మ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికై ంది. గోవాడ వెంకట్ దర్శకత్వం వహించగా, జ్యోతిరాజ్ భీశెట్టి రచన అందించారు. ఉత్తమ ద్వితీయ ప్రదర్శనగా గుంటూరు అభినయ ఆర్ట్స్ వారి ఇంద్రప్రస్థం, ఉత్తమ తృతీయ ప్రదర్శనగా గుంటూరు కరణం మహేష్ మోమోరియల్ తరమెల్లిపోతున్నదో ఎంపిక చేసి, నగదు పురస్కారాలు అందజేశారు. ఉత్తమ నటుడిగా సురభి నిఖిలేష్ (అమ్మచెక్కిన బొమ్మ), ఉత్తమ నటిగా జీఎన్డీ కుశమసాయి (ఇంద్రప్రస్థం), ఉత్తమ దర్శకుడుగా ఎన్.రవీంద్రరెడ్డి(ఇంద్రప్రస్థం) ఎంపికయ్యారు. కళాపరిషత్ అఽధ్యక్షుడు గొల్లపల్లి బుజ్జి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. -
ఉత్తమ నాటికగా ‘ఇంద్రప్రస్థం’
అమలాపురం టౌన్: అమలాపురం రస వాహిని సాంస్కృతిక వేదిక నిర్వహణలో కేఎన్ మూర్తి నాటక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం షాదీఖానా భవన ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ మూడు రోజుల్లో ప్రదర్శించిన నాటికల్లో సోమవారం రాత్రి ప్రదర్శితమైన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రూ.30 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రేమించుకున్న జంట ఒక వైపు, వారి తల్లిదండ్రులు మరోవైపు, వారి వాదనలు, చివరకు ఉభయుల అంగీకారంతో పెళ్లి జరగడంతో నాటిక ముగుస్తుంది. పోటీల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్లు హాజరయ్యారు. రసవాహని సంస్థ అధ్యక్షుడు, కేఎన్ మూర్తి నాటక పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి మహ్మద్ షెహన్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కొండాబత్తుల వేణుగోపాలరావు, కేఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి డాక్టర్ గోదశి గంగరాజు, అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, పరిషత్ కో ఆర్డినేటర్ ఎంవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ప్రతినిధులు కొండాబత్తుల నరసింహమూర్తి, కొండాబత్తుల శ్రీరాములును రస వాహిని రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. అలాగే డాక్టర్ కె.సాంబశివరావు, మల్లాది శివన్నారాయణ, నాయుడు గోపి, దేవిశెట్టి రామకోటేశ్వరరావు, నటకుమారిలను దివంగత నల్లా సత్యనారాయణ రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ ప్రతినిధి నల్లా శ్రీధర్, రమణ పాల్గొన్నారు. -
మూడో బిడ్డను కంటేనే..
పిఠాపురం: పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ పేరిట ప్రతి జంటా ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఇందుకు తగినట్టుగానే ప్రజలు జనాభా నియంత్రణ విధానాలకు స్వస్తి చెప్పాలని, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా చెప్పారు. దీనిపై స్పష్టమైన ఆదేశాలేవీ ఇంకా రాకముందే ప్రభుత్వాస్పత్రులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. జనాభా నియంత్రణ పేరిట ఇప్పటి వరకూ ఒకటి లేదా రెండు కాన్పులకే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవారు. అటువంటిది ఇప్పుడు మూడో బిడ్డను కంటేనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేస్తామంటూ పలు ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు షరతులు పెడుతున్నారు. దీంతో, ప్రభుత్వాస్పత్రుల్లో కు.ని. శస్త్రచికిత్సలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఉదాహరణకు పిఠాపురం సామాజిక ఆరోగ్య కేంద్రం(సీహెచ్సీ)లో గత ప్రభుత్వ హయాంలో ఏటా సుమారు 1,100 కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగేవి. దీని ప్రకారం ప్రతి నెలా దాదాపు 91 శస్త్రచికిత్సలు చేసేవారు. అటువంటిది గత జనవరి నుంచి నెలకు 25కు మించి ఆపరేషన్లు జరగడం లేదు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్తోమత లేదన్నా.. సాధారణంగా నిరుపేదలు ఎక్కువ శాతం ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే పురుడు పోసుకుని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటూంటారు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు బిడ్డల్ని కన్న తల్లులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వస్తే.. మూడో బిడ్డను కనే వరకూ ఆపరేషన్ చేయబోమని కరాఖండీగా చెప్పేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇది బాలింతలకు శాపంగా మారింది. పేదరికం, ఇతర కారణాలతో మూడో బిడ్డను పోషించే ఆర్థిక స్తోమత తమకు లేదని, ఇద్దరు బిడ్డలతో సరిపెట్టుకుంటామని ఎంత వేడుకుంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్యులు వినడం లేదని తల్లులు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక కొంత మంది తల్లిదండ్రులు కు.ని. శస్త్రచికిత్సల కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ ఇదే అదనుగా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెర లేపుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు బాలింతలు వాపోతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో అన్నీ ఉచితం కాగా.. ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్కు అయిన ఖర్చు కంటే ఆస్పత్రిలో ఉన్నందుకు అవుతున్న ఖర్చులు తడిపి మోపెడవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. దీంతో, అప్పులు చేసుకుని ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. లూప్ వేస్తున్నాం పిఠాపురం ప్రభుత్వాసుపత్రిలో నార్మల్ డెలివరీలు, రెండో కాన్పు సిజేరియన్ జరిగిన వారికి ట్యూబెక్టమీ ఆపరేషన్లు చేస్తున్నాం. ప్రస్తుతం ఎటువంటి అధికారిక ఆదేశాలూ లేనప్పటికీ.. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం వచ్చేవారికి లూప్ వేస్తున్నాం. ఆపరేషన్లు చేయడం లేదు. – ఎం.కీర్తి, సూపరింటెండెంట్, సీహెచ్సీ, పిఠాపురం ·˘ A糚yól MýS$.°. Bç³Æó‡çÙ¯ŒS ·˘ {糿¶æ$™éÓçܵ{™èl$ÌZÏ Mö™èl¢ °º…«§ýl¯]lË$ ·˘ Ô>ç³…V> Ð]l*ǯ]l çÜÆ>PÆý‡$ Ñ«§é¯]l… ·˘ »êÍ…™èlÌS B…§øâýæ¯]l అంత స్తోమత లేదు మాది నిరుపేద కుటుంబం. ఇద్దరు పిల్లలను పోషించడమే కష్టం. అయినా సంతానంపై ఉన్న మమకారంతో ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాను. ఉన్నంతలో ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రాయపడుతూ, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి వెళ్లాను. మూడో బిడ్డను కనే వరకూ ఆపరేషన్ చేయబోమని చెప్పారు. మాకు ముగ్గురు బిడ్డలను పోషించే స్తోమత లేదని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదు. ప్రైవేటు ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకునే స్తోమత లేదు. ఏం చేయాలో తెలియక నానా యాతనా పడుతున్నాం. ప్రభుత్వం ఇలాంటి రూలు ఎందుకు పెట్టిందో అర్థం కావడం లేదు. – జి.శివరత్నం, బాలింత, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
ఎక్కడికో ఈ పయనం..
● అధికారులను పరుగులు పెట్టిస్తున్న పులి ● చిక్కకుండా సంచారం దేవీపట్నం: రెండు నెలలుగా అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న పులి గమ్యం ఎటువైపో అంతుచిక్కడం లేదు. నాలుగు రోజుల నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో తిష్ట వేసి, కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో సంచరిస్తూ వెనుకకు, ముందుకు పయనిస్తుందే తప్ప స్పష్టమైన మార్గం వైపు వెళ్లడం లేదు. శనివారం సాయంత్రం జోడుమామిళ్ల వద్ద గోకవరం దండంగి ఆర్అండ్బీ రహదారిని దాటి, పరగసానిపాడు, పూడిపల్లి వద్ద కొండపైకి చేరింది. సోమవారం ఉదయం బోడిగూడెం, డి.రావిలంక గ్రామాల వరకూ సంచరించి, రాత్రికి పరగసానిపాడుకు చేరింది. మంగళవారం నాగళ్లపల్లి ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా సంచరిస్తే నాగళ్లపల్లి, గొందూరు గ్రామాల వద్ద తూర్పు వైపుగా కొండ దాటితే దేవారం పంచాయతీలోని చిన్నారిగండి మరలే అవకాశం ఉంది. ఒకవేళ గోదావరిని దాటేందుకు ప్రయత్నిస్తే పోలవరం ప్రాజెక్టు స్పిల్వే దిగువన గల అంగుళూరు, పురుషోత్తపట్నం వైపునకు వెళ్లి, గోదావరిని దాటవచ్చు. ఒకవేళ అదే జరిగితే పులి పయనం ప్రారంభమైన మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యంలోకి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను దాటుకుని వచ్చిన దారిలోనే వెళ్లే అవకాశం ఉంది. కాగా.. పులి సంచారంపై రంపచోడవరం సబ్ డీఎఫ్ఓ అనూష, వైల్డ్లైఫ్ రేంజి అధికారి కొండలరావు, సిబ్బంది రేయింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం పులి సంచరించే ప్రాంతాల్లోని తమ పశువులు దాని బారిన పడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆదాయానికి పాతర
కాకినాడ లీగల్: ప్రభుత్వ సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ట్రెజరీ (ఖజానా) కార్యాలయంలోనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల ఉదాసీనత వల్ల లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి తుప్పు పట్టిపోతోంది. కొత్త భవనంలోకి మారడానికి ఉత్సాహం చూపిన అధికారులు.. పాత సామగ్రిని మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లుగా పార్కింగ్లోనే.. స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్స్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తోంది. ఈ భవనంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు సబ్ ట్రెజరీ వంటి ఇతర విభాగాలు కొలువుదీరాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభమైన సమయంలో కోట్లాది రూపాయలతో సరికొత్త టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పాత కార్యాలయం నుంచి తీసుకొచ్చిన టేబుళ్లు, కుర్చీలు, ఇనుప బీరువాలు, కంప్యూటర్ భాగాలు వీటన్నింటినీ భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో ఒక మూలన పడేశారు. నిబంధనలు ఇవే.. సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడని పాత సామగ్రి జాబితాను ఎప్పటికప్పుడు తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ద్వారా వచ్చే నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నాలుగేళ్లనా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. పలు ఆరోపణలు ఏటా పాత ఫర్నిచర్ లెక్కలు చూడకపోవడంతో విలువైన వస్తువులను కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడాలంటే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పాత కార్యాలయం నుంచి ఇక్కడకు ఎన్ని వస్తువులు తరలించారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అనే విషయాలపై సమగ్రంగా తనిఖీ జరగాలి. పనికిరాని వస్తువులను వెంటనే వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తిని దుర్వి నియోగం చేసిన అధికారులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి లెక్క కూడా పక్కాగా ఉండాలి. కానీ ఇక్కడ కళ్ల ముందే విలువైన ఫర్నిచర్ పాడవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. పాత సామగ్రిపై అధికారుల నిర్లక్ష్యం నిబంధనల మేరకు వేలం వేయని వైనం కాకినాడ జిల్లా ట్రెజరీలో తుప్పు పడుతున్న బీరువాలు, కుర్చీలు ప్రభుత్వ ఆదాయానికి గండి -
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
సామర్లకోట: హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ గోపు సతీష్ రాజాపై 2016 మే 15వ తేదీ రాత్రి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని రాజుగారి కాంప్లెక్స్ వద్ద గల శ్రీరామా ఎంటర్ప్రైజెస్ షూమార్టు సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వై.సతీష్ కేసు నమోదు చేయగా సీఐ కె.శ్రీధర్ కుమార్ దర్యాప్తు చేసి 2016 మే 28న కొప్పిరెడ్డి అచ్చిరాజు (ఏ1), అతడి కుమారులు రాంబాబు (ఏ2), రాజేష్ (ఏ3)లను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ వీరయ్య గౌడ్ చార్జిషీట్ ఫైల్ చేశారు. వాదోపవాదాలు పూర్తయిన తర్వాత ఏడో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు జడ్జి జి.చంద్రమౌళీశ్వరి ఈ కేసులో తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితులకు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐలు కె.శ్రీధర్ కుమార్, వీరయ్య గౌడ్, అప్పటి డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రస్తుత ఇన్చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఇటీవల బదిలీ అయిన సీఐ పి.విజయ్ శంకర్, ఎస్సై మౌనిక, కోర్టు లైన్ ఆఫీసర్, ఏఎస్సై బీవీ నారాయణలను ఎస్పీ బిందు మాధవ్ ప్రత్యేకంగా అభినందించారు. పీపీలుగా గన్నం వినయతేజ, ఎం.జయరావు వాదించారు. ఏసీబీ వలలో శానిటరీ ఇన్స్పెక్టర్ కాకినాడ క్రైం: ఏసీబీ వలకు ఓ శానిటరీ ఇన్స్పెక్టర్ చిక్కాడు. కాకినాడ మున్సిపాలిటీ కొత్తపేట మార్కెట్ సర్కిల్ 10లో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న వంగల రాజేంద్ర ప్రసాద్ రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ పరిధిలో ఓ దుస్తుల దుకాణానికి ట్రేడ్ లైసెన్సు మంజూరు చేసేందుకు సూరంపూడి అరవింద్ను రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. మంగళవారం సాయంత్రం 5.43 గంటలకు తన కార్యాలయంలో లంచం తీసుకుంటూండగా రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. లంచం సొత్తు రూ.15 వేలే కాక, మరో రూ.18,640 లెక్కలో లేని మొత్తాన్ని అతడి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. లంచం కోసం రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న వేధింపులను తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారు సూరంపూడి అరవింద్ తెలిపారు. ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.2 లక్షల విరాళం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మైక్రో బయాలాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ఎం.భారతి తన తల్లి లోలాక్షి జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.రెండు లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు అందజేశారు. ఈ సొమ్మును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే ఆదాయంతో ఏటా మైక్రోబయాలాజీలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారిని బంగారు పతకంతో సత్కరించాలని కోరారు. ఆ పని కోసమే తన తల్లి పేరుతో ఈ మొత్తాన్ని వినియోగించాలని భారతి విజ్ఞప్తి చేశారు. తన తల్లి వైద్య విద్యను ఎంతో ప్రోత్సహించేవారని, అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కెనడీ, వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు. లారీ డ్రైవర్ మృతి గండేపల్లి: ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్ మృతి చెందాడు. గండేపల్లి పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు బొగ్గు లోడుతో వెళుతున్న ఓ లారీ తెల్లవారుజాము 3 గంటల సమయంలో మండలంలోని మురారి శివారుకు వచ్చే సరికి సడన్గా స్లో అయ్యింది. దీంతో ఆ లారీని వెనుక వస్తున్న గ్రావెల్ లోడు లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రావెల్ లోడు లారీ డ్రైవర్ మేడవలిమి యోగయ్య అలియాస్ దావీదు (50) క్యాబిన్లో ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలేనికి చెందిన వాడని, కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. అతడి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96624, 94407 96584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
వైభవంగా దివ్య కల్యాణ మహోత్సవాలు
ఆత్రేయపురం: ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఐదో రోజు మంగళవారం వేద పండితులు ఆగమ శాస్త్రానుసారం సదస్యం నిర్వహించారు. ఉదయం స్వామివారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్య ఉపాసన, వేద పారాయణ, సాయంత్రం సదస్యం జరిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. రాత్రి రాజమహేంద్రవరం సత్య శ్రావణి బృందం ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈవో భాగవతుల వెంకట రమణ మూర్తి తదితరులు వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఆలయ అర్చకులు, బృందం సభ్యులు సదస్యంలో పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి అనపర్తి: మండలంలోని మహేంద్రవాడ గ్రామ శివారులో పేకాడుతున్న వారిని పట్టుకున్నామని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. మార్చి 29న సాయంత్రం 6 గంటలకు తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి దాడి నిర్వహించామన్నారు. ఈ దాడిలో పొలమూరు గ్రామానికి చెందిన అల్లక ఉమామహేశ్వరరావు, గుత్తుల హరి దుర్గ, ద్వారంపూడి ప్రభాకర రెడ్డి, ద్వారంపూడి ఈశ్వరరెడ్డి, దాసరి వీర వెంకట సత్యనారాయణ చౌదరి, కొవ్వూరి కాశీవిశ్వనాథరెడ్డి, బిక్కిన శ్రీనుబాబు, అమరపు దుర్గప్రసాద్ పేకాట ఆడుతూ పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.18,130, రెండు సెట్ల కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
● కష్టబడి చదువుతూ..
చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బీరువాలు మోస్తున్న విద్యార్థులు విద్యార్థులకు చదువు చెప్పి, ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే వారి చేత పనులు చేయిస్తున్న సంఘటన చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఆలస్యంగా మంగళవారం వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. సుమారు వారం రోజుల క్రితం పాఠశాలకు నూతన ఫర్నిచర్ వచ్చింది. బరువైన బీరువాలు, ఇతర సామగ్రి ఉన్న ఆ ఫర్నిచర్ను విద్యార్థులు ఆపసోపాలు పడుతూ మోశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన పలువురు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఎంఈఓలు ఉన్నా పాఠశాలల పర్యవేక్షణ కనిపించడం లేదని విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – చాగల్లు -
నేడు నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేందిర ప్రసాద్ నియమితులైన విషయం తెలిసిందే. ఆయన బుధవారం ఉదయం 9 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. గవర్నర్ పర్యటనకు పక్కా ఏర్పాట్లు చేయాలి ˘ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 2న కాకినాడలో పర్యటించనున్నందున సంబంధిత ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు గవర్నర్ వస్తున్నారన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో హెలిపాడ్ను సిద్ధం చేసి, రూట్ బారికేడింగ్ చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. కాన్వాయ్, రూట్ క్లియరెన్స్, గార్డ్ ఆఫ్ ఆనర్ వంటివి పోలీస్ శాఖ చేపట్టాలన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు : ఎస్పీ కాకినాడ రూరల్: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణే లక్ష్యంగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ జి.బిందుమాధవ్ అన్నారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సమగ్ర నిఘా ప్రాజెక్టును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓఎన్జీసీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద అందించిన నిధులతో 19 కీలక ప్రాంతాల్లో 64 సీసీ కెమెరాలను, జెమినీ ఎడిబుల్స్ – ఫ్యాట్స్ ఇండియా సంస్థ సహకారంతో 9 ప్రధాన కూడళ్లలో 18 ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్) కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అత్యాధునిక కెమెరా వ్యవస్థ ద్వారా సర్పవరం పరిధిలోని రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రదేశాల్లో 24 గంటలూ నిఘాకు అవకాశం కలిగిందని అన్నారు. ముఖ్యంగా ఏఎన్పీఆర్ కెమెరాల ద్వారా చోరీ అయిన వాహనాలను పట్టుకోవడం సులభమవుతుందన్నారు. నేరాలకు పాల్పడి, పరారయ్యే వారిని త్వరితగతిన గుర్తించవచ్చని తెలిపారు. ఈ 82 కెమెరాలు సర్పవరం పోలీస్ స్టేషన్లోని కేంద్ర నియంత్రణ గదికి అనుసంధానమై ఉంటాయని, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది వీటిని పర్యవేక్షిస్తారని చెప్పారు. మహిళల రక్షణ, రాత్రి నిఘా, రహదారి భద్రతను మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్ట్ కీలకమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఇన్చార్జి డీఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, ఓఎన్జీసీ ఈడీ, అసెట్ మేనేజర్ ప్రబల్సేన్ గుప్తా, జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ జీఎం గురుప్రసాద్, సీఎస్ఓ వీరయ్య, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, సర్పవరం, రూరల్ సీఐలు పెద్దిరాజు, చైతన్యకృష్ణ, ఎస్సై శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా దేవదాయ శాఖాధికారిగా సూర్యనారాయణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖాధికారిగా తలాటం వెంకట సూర్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ జిల్లా దేవదాయ శాఖాధికారిగా పని చేస్తున్న కనపర్తి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నియమితులైన సూర్యనారాయణ ప్రస్తుతం కరకుదురు గ్రూపు టెంపుల్ ఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. -
కొరత లేకుండా వంట గ్యాస్ ఇవ్వాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కొరత లేకుండా వంట గ్యాస్ సరఫరా చేయాలని, చిరు వ్యాపారులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద మంగళవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇరాన్పై జరుగుతున్న యుద్ధం వల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర పెరగడం, సరఫరా నిలిచిపోవడం వల్ల చిన్న చిన్న వ్యాపారులు షాపులు మూసుకోవాల్సి వచ్చిందన్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఆహారం కోసం అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా – గోదావరి (కేజీ) బేసిన్ డి–6 బ్లాక్లో చమురు, గ్యాస్ నిక్షేపాలు భారీగా వెలికితీసి, గుజరాత్, మహారాష్ట్రలకు తరలిస్తున్నారని చెప్పారు. ఇందులో సగం మన రాష్ట్ర అవసరాలకు కేటాయించేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ప్రసాదరావు డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగుబాటు వైఖరి ప్రదర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బ తీస్తుందని అన్నారు. ఇరాన్తో పాటు సరిహద్దు దేశాలతో కూడా కేంద్రం సత్సంబంధాలు కొనసాగిస్తే మన దేశానికి మేలు జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాకు లొంగిపోవడమే కాకుండా ఇజ్రాయిల్ వంటి దురాక్రమణ దేశానికి మద్దతు ప్రకటించడం దేశ ప్రతిష్టను దిగజారుస్తోందని అన్నారు. అమెరికా షరతులను వ్యతిరేకించి దేశ ప్రయోజనాల కోసం కేంద్రం నిలబడాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, జిల్లా కమిటీ సభ్యుడు కేఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఫ కేజీ బేసిన్లో సగం గ్యాస్ మన రాష్ట్రానికే కేటాయించాలి ఫ సీపీఎం డిమాండ్ -
ఎల్లో మీడియా రోత రాతలు
తుని: సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పని చేయాల్సిన మీడియా రోత రాతలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని మండలం ఎస్.అన్నవరంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియాలో కీలకంగా వ్యవహరించే ఈనాడులో ప్రచురితమైన వార్తలు చూస్తే బాధ కలుగుతోందన్నారు. ఎవరి మెప్పు కోసం రోత రాతలు రాస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేళ్ల క్రితం అప్పట్లో తన వద్ద గన్మన్గా పని చేసిన వ్యక్తికి, తనకు మధ్య అసత్య ఆరోపణలు వండి వార్చడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ గన్మన్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వద్ద పని చేస్తున్న విషయాన్ని దాచి, తనపై విమర్శలు చేయడం ద్వారా పత్రికా విలువలను తుంగలో తొక్కిందని అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు ఇబ్బంది కలిగే రీతిలో ఈనాడు వార్తలు రాస్తోందని మండిపడ్డారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో గన్మన్ వల్ల వచ్చిన ఆరోపణలపై స్పందించి, అతడిని ఎస్పీ ఆఫీసుకు సరెండర్ చేసిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. తాజాగా మళ్లీ తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడుకు నైతికత లేదని, అధికార పార్టీ నాయకులు తప్పులు చేసినా వీరికి కనిపించకపోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారని, పోలీస్ స్టేషన్కు పిలిపించి, రోజంతా కూర్చోబెట్టి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు. సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులను టార్గెట్ చేయడం తగదన్నారు. ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదని, ఇప్పుడు చేస్తున్న దానికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు అనుభవించక తప్పదని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల తనకు పదవి కావాలని ఎప్పుడూ అడగలేదని చిలక పలుకులు పలికారని, రాజ్యసభ సీటు కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని రాజా ప్రశ్నించారు. ఫ వ్యక్తిత్వ హననానికి దిగజారిన ఈనాడు ఫ ఎప్పుడో వెళ్లిన గన్మన్కు లింకు పెట్టి తప్పుడు రాతలు ఫ ప్రస్తుతం డిప్యూటీ సీఎం వద్ద అతడి విధులు ఫ మాజీ మంత్రి దాడిశెట్టి రాజా -
‘మీరు రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని..’
కాకినాడ: ఎల్లో మీడియా అసత్య వార్తలను పదే పదే డ్రైవ్ చేస్తోందని వైఎస్సార్సీపీ నేత దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తన వద్ద గన్మెన్గా పని చేసి, ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా పనిచేస్తున్న వ్యక్తి గొడవలను తనపై రుద్దాలని చూస్తున్నారని మండిపడ్డారు. తన వద్ద గన్మెన్గా పనిచేసిన వ్యక్తి.. గత 20 నెలలుగా పవన్ కళ్యాణ్ వద్ద గన్మెన్గా చేస్తున్నారని, కానీ ఇంకా తన మాజీ గన్మెన్ అని ఎల్లోమీడియా వార్తలు రాయడంపై దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈనాడు పత్రిక రాయాల్సింది పవన్ కళ్యాణ్ గన్మెన్ అని రాయాలని సవాల్ చేశారు. తనపై వార్తలు రాసిన వాళ్లు నోటికి అన్నం తింటే తన కౌంటర్ను కూడా ప్రచురించాలని చాలెంజ్ చేశారు. ఏదో రకంగా తప్పుడు వార్తలను రాయడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. -
వైభవంగా బ్రహ్మోత్సవాలు
ఆత్రేయపురం: ప్రసిద్ధి గాంచిన ర్యాలీ జగన్మోహినీ కేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు సోమవారం ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు, సేవలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చనలు, నిత్య ఉపాసన, బలిహరణ, నీరాజన మంత్ర పుష్పాలు, వేద పారాయణ అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. అనంతరం కరప కళాకారుల బృందంచే సుందరకాండ, తోలు బొమ్మలాట ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ చైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు, ఆలయ ఈఓ భాగవతుల వెంకటరమణమూర్తి పర్యవేక్షించారు. హైదరాబాద్కు చెందిన వెంకట మహాదేవ కుమార్ దంపతులు రూ.5,116, కాకినాడ వాస్తవ్యులు గంగరాజు దంపతులు రూ.5,116 విరాళం సమర్పించారు. దాతలకు స్వామివారి ఫొటోలను సిబ్బంది అందజేశారు. ర్యాలిలో జగన్మోహినీ కేశవస్వామి -
రికార్డులు లేని నగదు స్వాధీనం
యానాం: యానాం శాసనసభా నియోజకవర్గానికి వచ్చే నెల 9న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పు గోదావరి, యానాం సరిహద్దుల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక హనుమాన్ దాబా సమీపంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ఓ కారులో రూ.2.50 లక్షలను కనుగొన్నట్లు ఎన్నికల సిబ్బంది తెలిపారు. ఆ నగదుకు సంబంధించి అకౌంట్ల వివరాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసి యానాం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి స్వాధీనం చేసినట్లు సిబ్బంది తెలిపారు. -
11 మంది కార్మికులకు అస్వస్థత
రౌతులపూడి: మండలంలోని ఉప్పంపాలెం సమీపంలో ఓ స్టోన్ క్రషర్లో పనిచేస్తున్న 11 మంది బీహార్ కార్మికులు సోమవారం అస్వస్థతకు గురై స్థానిక సీహెచ్సీలో చేరారు. ఇందులో నలుగురు వాంతులు, విరోచనాలు, మరో ఏడుగురు ఒళ్లు, కడుపు నొప్పి వంటి సమస్యతో బాధపడుతున్నారు. వీరికి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని సీహెచ్సీ వైద్యాధికారి ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు. ఆరుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయగా, మిగిలిన ఐదుగురిని పూర్తిగా కోలుకునే వరకూ వైద్యులు పర్యవేక్షిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం స్టోన్ క్రషర్ సమీపంలో రోగులు తీసుకున్న ఆహార దినుసులను, చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పరిశీలన చేసినట్లు ఆయన వివరించారు. డాక్టర్లు రాజాజీ, సరోజ, సౌమ్మశ్రీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆదుకోండి.. ప్రాణం నిలపండి కుమారుడి కోసం తల్లిదండ్రుల మొర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన నాలుగేళ్ల కుమారుడి వైద్యానికి సాయం చేసి ఆదుకోవాలని బాధిత తల్లిదండ్రులు కోరారు. కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లికి చెందిన కోసూరి బాలాజీ కుమారుడు మోజెస్రాజు (4) ఎస్ఎంఎస్ టైప్ టూ వ్యాధి తో బాధపడుతున్నాడు. స్థానికంగా ఓ చెప్పులు దుకాణంలో బాలాజీ పనిచేస్తున్నాడు. అతని జీతం రూ.18 వేలు, ప్రస్తుతం మోజెస్రాజుకు ప్రతి నెలా వైద్యానికి రూ. 50 వేలకు పైగా ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో తమ కుమారుడిని ఆదుకోవాలని కోసూరి బాలాజీ సోమవారం పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్కు వినతిపత్రం అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్న తన కుమారుడిని ఇప్పటికే చాలా ఆసుపత్రులు తిప్పానని తెలిపారు. ఈ వ్యాధి నయం కావడానికి రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్లు చే యాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారని బాలా జీ అన్నారు. ప్రభుత్వం, దాతలు సహకరించి తన కుమారుడిని ఆదుకోవాలని ఆయన కోరారు. దాతలు సహాయం చేయాలనుకుంటే 92905 96660 నంబరులో సంప్రదించాలన్నారు. -
నిబంధనలు పాటించాలి
ప్రతి ప్రైవేటు విద్యా సంస్థా ప్రభుత్వ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులూ పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అలాగే, విద్యా సంస్థ పక్కా రిజిస్ట్రేషన్తో పాటు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొంది ఉండాలి. ఆకట్టుకునేలా ప్రైవేటు సంస్థలు చేసే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా గుర్తింపు పొందిన పాఠశాలల వివరాలు తెలియజేస్తాం. – పిల్లి రమేష్, జిల్లా విద్యా శాఖాధికారి, కాకినాడ -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
శంఖవరం: కత్తిపూడి– రౌతులపూడి రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్ శివారులో కత్తిపూడి సీతారామా కళాశాల బస్సు విద్యార్థులతో శృంగవరం వెళ్తుండగా, రౌతులపూడి నుంచి వస్తున్న గ్రావెల్ లారీ బలంగా ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినులు టి.సంధ్య అనురాధ, డి.వరలక్ష్మి, శృంగవరం గ్రామానికి చెందిన స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.అభిరామ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఈ రోడ్డులో అధిక బరువుతో గ్రావెల్ లారీలు తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చదరంగం పోటీల్లో ప్రతిభ
అమలాపురం రూరల్: అమలాపురంలో జరిగిన కోనసీమ జిల్లా అండర్–9 చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో అమలాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థినీ బి.శాన్వి ప్రథమ స్థానం, ఓపెన్ కేటగిరీ నుంచి మోక్స్ సైనీ తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారని కోచ్ వి.శ్రీనుబాబు సోమవారం తెలిపారు. వీరు వచ్చే నెల 18, 19 తేదీల్లో అన్నవరంలో జరిగే అండర్ –9 రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనున్నారు. ఎనిమిదేళ్ల శాన్వి మొదటి స్థానం సాధించి జిల్లా చాంపియన్గా నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయమని పలువురు కొనియాడారు. చదువుతో పాటు చదరంగంలో రాణిస్తున్న విద్యార్థినులను స్కూల్ చైర్మన్ నాయుడు, డైరెక్టర్ పిన్సిపాల్ నంద్యాల మనువిహార్ అభినందించారు. -
విద్యార్థులపై వల
● ప్రైవేటు పాఠశాలల సిబ్బంది గ్రామాల బాట ● అడ్మిషన్ల కోసం ఇంటింటా జల్లెడ ● తల్లిదండ్రులు జాగరూకతతో ఉండాలి ● విద్యావేత్తల సూచనబాలాజీచెరువు (కాకినాడ సిటీ): కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి దాదాపు మరో మూడు నెలల సమయం ఉంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఒంటి పూట తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ముందస్తు అడ్మిషన్ల కోసం ఇప్పటి నుంచే వల వేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ తమ సిబ్బందిని గ్రామాలకు పంపిస్తూ పిల్లల కోసం జల్లెడ పడుతున్నాయి. దీంతో, వారు బృందాలుగా ఇంటింటికీ తిరుగుతున్నారు. ‘మీ ఇంట్లో ఎంత మంది పిల్లలున్నారు.. ఏం చదువుతున్నారు.. మా స్కూల్లోనే చేర్పించండి’ అంటూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాస్త పేరొందిన ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలైతే సొంత వాహనాల్లోనే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు మంచి విద్యాలయాల కోసం చూస్తున్నారనే సమాచారం ఉంటే చాలు.. వారికి దాదాపు గంట పాటు కౌన్సెలింగ్ ఇచ్చి, ఏదో ఒక విధంగా అడ్మిషన్లు ఓకే చేసుకుంటున్నారు. ఇదే సమయంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చాలా విద్యా సంస్థలు ప్రభుత్వ గుర్తింపు, రిజిస్ట్రేషన్ లేకుండానే అడ్మిషన్ల పర్వానికి తెర తీస్తున్నాయి. ఆకర్షణీయమైన బ్రోచర్లు, ప్రకటనలు, ప్రచారాలతో తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అడ్మిషన్లు తీసుకోవడానికి ముందే తల్లిదండ్రులు జాగరూకతతో వ్యవహరించాలని, ఆయా విద్యా సంస్థలకు అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. పాఠశాలలకు అనుమతి ఇలా.. నిబంధనల ప్రకారం కొత్తగా ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యా శాఖ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాతే పాఠశాలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యా శాఖ రీజినల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ నుంచి అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. అను‘మతి’ లేకుండానే.. కొన్ని విద్యా సంస్థలు ఎలాంటి అనుమతులూ తీసుకోకుండానే నడుస్తున్నాయి. పిఠాపురం డివిజన్లో ఇటీవలే కొత్తగా మూడు పాఠశాలలు వెలిశాయి. వాటి బోర్డులపై రిజిస్ట్రేషన్ పొందిన సంస్థ అని రాస్తున్నారు కానీ, వాటిలో కొన్ని ప్రభుత్వం నుంచి ఎటువంటి గుర్తింపూ లేకుండానే నడుస్తున్నాయి. కొన్ని పాఠశాలలు సీబీఎస్ఈ అనుమతులున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. అలాంటి పాఠశాలలు ఏడాది చివరిలో ఇతర విద్యా సంస్థల పేరిట విద్యార్థులతో పరీక్షలు రాయించి మమ అనిపించేస్తున్నాయి. ఆ విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే తప్ప రెగ్యులర్ విద్యార్థిగా పరిగణించదు. మరికొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బ్రాంచీల పేరిట వేరే చోట పాఠశాలలు, కళాశాలలను నిర్వహిస్తూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తున్నాయి. అధికారుల చర్యలు అంతంత మాత్రంగానే ఉండటంతో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతోంది.ఈ జాగ్రత్తలు తప్పనిసరి పిల్లలకు అడ్మిషన్లు తీసుకునే తల్లిదండ్రులు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. సంబంధిత ప్రైవేటు పాఠశాల అనుమతి ప త్రాలను ముందుగానే నిశితంగా పరిశీలించుకోవాలి. ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉందో లే దో తెలుసుకున్న తరువాతే అడ్మిషన్ తీసుకోవాలి. సదరు పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, క్రీడా ప్రాంగణం, గాలి, వెలుతురు సక్రమంగా వచ్చే భవనాలు తదితర మౌలిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించడం మంచిది. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చే వాహనాల కండిషన్, వాటిని పాఠశాలే సమకూర్చుతోందా, బయటి నుంచి ఏర్పాటు చేసుకోవాలా అనే విషయాలపై ఆరా తీయాలి. ఒక్కో తరగతి గదిలో ఎంతమంది విద్యార్థుల ను కూర్చోబెడతారు? విద్యార్థుల సంఖ్యకు అ నుగుణంగా అన్ని సబ్జెక్టులకూ ఉపాధ్యాయులున్నారా, లేరా అనే విషయం తెలుసుకోవాలి. జీ+1 భవనమైతే అగ్నిమాపక నిబంధనలు పాటిస్తున్నారా, అవసరమైన పరికరాలు, సామగ్రి సిద్ధంగా ఉంచారా తదితర అంశాలను పరిశీలించాలి. ప్రభుత్వ గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసుకుని, తగు నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచే విద్యార్థులను చేర్పించాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అన్ని ఫ్రీ అంటూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే, పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేర్పించాలంటూ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు కూడా సూచించడంతో కళాశాలల అధ్యాపకులు కూడా గ్రామాల బాట పడుతున్నారు. -
సమాచార శాఖ డీడీగా తిమ్మప్ప
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్గా నియమితులైన తిమ్మప్ప సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను, జిల్లా రెవెన్యూ అధికారి తిప్పేనాయక్ను కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలిశారు.బాలబాలాజీ స్వామికి ‘లక్ష్మీ’కటాక్షంమామిడికుదురు: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. 68 రోజులకు స్వామి వారికి ద్వారా రూ.56.08 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. 17 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని భక్తులు హుండీల్లో కానుకలుగా సమర్పించారన్నారు. అమలాపురం గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఆర్.శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన హుండీ లెక్కింపులో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మొల్లేటి లక్ష్మీనారాయణ, స్థానికులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అశోక్పై దాడికి యత్నం
త్రుటిలో తప్పించుకున్న వైనం యానాం: స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్పై కొంతమంది దాడికి యత్నించడంతో త్రుటిలో ఆయన తప్పించుకున్నారు. తీర ప్రాంత మత్స్యకార గ్రామమైన సావిత్రినగర్కు ఓ పుట్టినరోజు కార్యక్రమానికి ఆయన వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారు వద్దకు వెళుతుండగా, ఒక్కసారిగా సుమారు 50 మంది రాళ్లు పట్టుకుని దాడికి యత్నించారని, దాని నుంచి త్రుటిలో తప్పించుకున్నానని ఎమ్మెల్యే అశోక్ విలేకరులకు తెలిపారు. తాను ముందస్తు అనుమతితో సావిత్రినగర్కు వెళ్లానని, అక్కడ ఉన్న ఎన్నికల అధికారి గొంతియ్యకు సైతం తెలిపానని, అయితే తనను గొంతియ్య ఏకపక్షంగా నువ్వు అంటూ సంబోధించడం ఎంతవరకు సబబు అని అన్నారు. ఇంటింటికీ ప్రచారానికి రాలేదని తెలిపానన్నారు. అయితే ఇదే అదనుగా కొంతమంది ఒక్కసారి తన వైపునకు రాళ్లతో వచ్చారని, మరోవైపు తన అనుయాయులు ఆపినప్పటికీ ముందుకు రావడంతో తాను కారులో తిరిగి యానాంకు వచ్చేశానన్నారు. తనపై ఎన్ని దౌర్జన్యాలకు దిగినా తనదే విజయమని ఆయన అన్నారు. ఘటనపై పుదుచ్చేరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తానన్నారు. -
పాత్ర రోజులొచ్చాయ్..
కుమ్మరి చక్రంపై మట్టితో కూజా తయారు చేస్తున్న కార్మికుడు పిఠాపురం: ఆరోగ్యమే మహాభాగ్యం.. అలాంటి ఆరోగ్యంపై అందరికీ శ్రద్ధ పెరిగింది.. ఆధునికతతో వస్తున్న ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కొత్తది వద్దు.. పాతదే ముద్దు అనే పరిస్థితి వచ్చింది. అందుకే ఎలాంటి హాని లేని మట్టి పాత్రలపై మోజు పెరుగుతోంది. దీంతో వీటికి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రతి ఇంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ వస్తువులదే అగ్రభాగం అయ్యింది. ఆధునిక పద్ధతులతో పాటు అంతే వేగంగా వ్యాధుల ముప్పు ఆందోళన కలిగిస్తోంది. ఉదయం వంట సాయంత్రానికే పాడవుతోంది. అదే మట్టి పాత్రలో వండితే వండినవి వండినట్లే ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాల సౌలభ్యం. అందుకే మట్టి పాత్రలకు మళ్లీ మంచి రోజులొచ్చాయి. సాధారణంగా మట్టి పాత్రల ప్రాధాన్యం తగ్గిపోయాక కుమ్మర్లు కుల వృత్తిని వీడి ఇతర వృత్తులకు చేరువయ్యారు. అక్కడక్కడా కొందరు మట్టి పాత్రలు తయారు చేసినా, కేవలం కొందరు మాత్రమే అదీ వేసవిలో మంచినీటికి, శుభకార్యాల్లో సంప్రదాయాలకు మాత్రమే వీటిని ఉపయోగించేవారు. ఇలా వీటి తయారీ తగ్గిపోయింది. కానీ ప్రకృతి వైద్యం ఆయుర్వేదం వంటి ఆరోగ్య సూచనలు పెరగడంతో ఎక్కువ మంది ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మట్టి పాత్రలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పూర్వ వైభవం వచ్చింది. తద్వారా వీటి తయారీ ఊపందుకుంది. మళ్లీ కుమ్మర్లకు చేతినిండా పని వచ్చింది. జిల్లాలో 500 కుటుంబాలు ప్రస్తుతం మట్టి పాత్రల తయారీ చేస్తుండగా, క్రమంగా వీటి సంఖ్య పెరుగుతోంది. ఆ‘పాత్ర’మధురాలు పూర్వం పాలు తాగినా, నీళ్లు తాగినా, అన్నం తిన్నా, పెరుగు తోడెట్టినా అన్నీ మట్టి పాత్రలోనే జరిగేవి. శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందన్నట్టుగా మట్టి పాత్రలో వేసిన ప్రతీది ఒక అద్భుతంగా మారేది. మట్టి పాత్రలు కేవలం వంట పాత్రలు లేదా నిల్వ పాత్రలు మాత్రమే కాదు. అవి మన సంస్కృతీ సంప్రదాయం, గ్రామీణ జీవన విధానానికి ప్రతిబింబం. భారతీయ సంస్కృతిలో మట్టి పాత్రలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పూర్వం నుంచి మట్టి కుండల్లో నీరు నిల్వ చేయడం, ఆ పాత్రల్లో వంట చేయడం అనేది సాధారణం. పండగలు, ఉత్సవాలు, వివాహాలు, పూజలలో కూడా మట్టి పాత్రలు ముఖ్య పాత్ర పోషించేవి. దీపావళి సందర్భంగా వెలిగించే ప్రమిదలు, గ్రామీణ దేవాలయాలలో ఉపయోగించే మట్టి పాత్రలు ఇవన్నీ మన సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనాలు. వీటి తయారీ అనేది ఒక సాధారణ పనికాదు. ఇది అనుభవం, నైపుణ్యం, సహనం కలిసిన కళ. సరైన మట్టిని సేకరించాక శుభ్రపరిచి, నీటితో కలిపి మృదువుగా చేయడం, కుమ్మరి చక్రంపై చేతులతో ఆకారమివ్వడం, సూర్యరశ్మిలో ఆరబెట్టడం, అగ్నిలో కాల్చి దృఢంగా మార్చడం, కొన్నిసార్లు రంగులు వేసి అలంకరించడం ఇలా ఈ ప్రతి దశలో శ్రద్ధ అవసరం. ఒక చిన్న పొరపాటు మొత్తం పాత్ర రూపాన్ని మార్చేస్తుంది. కొన్ని గ్రామాల్లో వీటి తయారీకి ప్రత్యేకంగా ఒక వీధి ఉంటుంది. ఆ వీధిని స్థానికంగా కుమ్మర వీధి అని పిలుస్తారు. ఈ వృత్తినే నమ్ముకుని అక్కడ అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కుండ బిర్యానీకి మంచి గిరాకీ ప్రస్తుతం ‘సస్టైనబుల్ లివింగ్’ అనే భావన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ నేపథ్యంలో మట్టి పాత్రల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. నగరాల్లో కూడా ఇప్పుడు మట్టి పాత్రలను ఉపయోగించే అలవాటు తిరిగి వస్తోంది. రెస్టారెంట్లు, ఆర్గానిక్ స్టోర్లు, హోమ్ డెకర్ రంగంలో కూడా మట్టి వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా బిర్యానీ ప్రియులు కుండ బిర్యానీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. బిర్యానీ ప్రేమికుల అభిరుచికి తగినట్టుగా చిన్న చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు సైతం తమ వద్ద కుండ బిర్యానీ లభిస్తుందంటూ ప్రచారం చేస్తున్నారు. కుండలు, కూజాలు, వాటర్ బాటిళ్లు వంట పాత్రలు ఇలా అనేక రకాల మట్టి పాత్రల తయారీ ఊపందుకుంది. ఆదరణ పెరుగుతోంది మా తాతల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాం. రాను రాను వివాహాలు, ఇతర కార్యక్రమాల్లో తప్ప మట్టి పాత్రలను వినియోగించడం మానేశారు. ఈ పాత్రలను వినియోగించడం మన ఆ రోగ్యానికి, పర్యావరణానికి చాలా మంచిదని తెలుసుకున్న తరువాత వీటికి ఆదరణ పెరిగింది. ము ఖ్యంగా బిర్యానీ వంటి వంటకాలకు వీటిని వినియోగించడం వల్ల మాకు చేతి నిండా పని దొరుకుతోంది. –ఎస్.అప్పారావు, మట్టి పాత్రల తయారీ కార్మికుడు, పిఠాపురం ఆరోగ్యానికి, ప్రకృతికి మేలు మట్టి పాత్రలు వినియోగించడం వల్ల మన ఆరోగ్యానికి ఇటు ప్రకృతికి మేలు జరుగుతుంది. మట్టి బిందెల్లో నిల్వ చేసిన నీరు సహజంగా చల్లగా ఉంటుంది. ఆహారం మెల్లగా వండబడటం, రసాయనాలు లేని సహజ వంట విధానం వల్ల పోషక విలువలు నిలుస్తాయి. పూర్తిగా సహజ పదార్థం మట్టితో తయారు చేయడం కారణంగా పర్యావరణానికి మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడకాన్ని వీడడంతో కాలుష్యం తగ్గుతుంది. ఫ మట్టి పాత్రలకు పెరుగుతున్న ఆదరణ ఫ కుమ్మర్లకు చేతినిండా పని ఫ గడిలో పడిన బతుకు చక్రం -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలేశ్వరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా పెద్దనాపల్లి గ్రామంలో గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ అధ్యక్షుడు, ఎంపీపీ గొల్లపల్లిబుజ్జి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల నాటికల పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం వెలగలేరు థియేటర్స్ వారి ఉరి నాటిక ఆలోచింపజేసింది. నేటి సమాజంలో మనిషికి ఇగో ఉంటే చివరికి ఎంతో నష్టపోతాడో సవివరంగా ప్రదర్శించారు. దీనికి రచన, దర్శకత్వం పోలుదాసు శ్రీనివాసరావు అందించారు. రెండో ప్రదర్శనగా కాకినాడ జీవీకే క్రియేషన్స్ వారి కన్నీటికి విలువెంత నాటిక ఆకట్టుకుంది. ఒక మహిళ డాక్టర్ తన స్వార్థంతో చేసిన పనిని తోటి మహిళలు తిరగబడి బుద్ధి చెప్పిన కథాంశంతో నాటిక ఆసక్తికరంగా సాగింది. దీనికి మూలకథ డి.కామేశ్వరి, నాటకీకరణ డి.ఉమాశంకర్ అందించగా, దర్శకత్వం డి.వినయ్ నిర్వహించారు. నాటిక ప్రదర్శనలు తిలకించేందుకు అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
ఎడాపాడా బదిలీలు !
● ఏడాదిలో ఎనిమిది మంది పీడీల బదిలీ ● అభివృద్ధిపై కానరాని శ్రద్ధ ● ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్వహణకే పరిమితం పిఠాపురం: పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక హబ్గా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు. దానిని అమలులో పెట్టడానికి ఒక అధికారిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఘనంగా ప్రకటించారు. ఈ మేరకు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని (పాడా) ఏర్పాటు చేస్తూ జీఓ విడుదల చేయించారు. అనంతరం, ఒక ఐఏఎస్ అధికారితో పాటు 17 మంది సిబ్బంది నియమిస్తూ మరో జీఓ ఇచ్చారు. పాడా కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా పీడీల నియామకంలో బదిలీల పర్వం చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం ఒక్క ఏడాదిలోనే ఎనిమిది మంది పీడీలను బదిలీ చేయడంతో అసలేం జరుగుతోందో అర్థం కాక పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కల్యాణ్ నెగ్గినప్పటి నుంచీ 20 నెలల వ్యవధిలో సొంత నియోజకవర్గ ప్రజలకు 20 రోజులు కూడా అందుబాటులో లేరనే విమర్శలున్నాయి. ఇప్పటికే ఇన్చార్జిలతో పాలన సాగిస్తున్న ఆయన.. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను ఆపే ప్రయత్నంలో భాగంగానే పాడా ఏర్పాటు చేశారనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ ఇన్చార్జి నాయకుడితో అన్నీ చక్కబెడుతున్న పవన్.. రానున్న రోజుల్లో అధికారులతో పరిపాలన చేయించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తాము నెగ్గించుకున్న నాయకుడు ఎక్కడో ఉండి.. ఇక్కడ ఎవరితోనో పాలన చేయిస్తుంటే తాము ఆయనను ఎందుకు గెలిపించామో అర్థం కావడం లేదంటూ స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి నెలల తరబడి రాకపోవడంతో ఇప్పటికే స్థానికుల్లో పవన్ కల్యాణ్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానిని తప్పించుకోవడానికి పాడా ఏర్పాటు చేసినప్పటికీ ప్రయోజనం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. బది‘లీలలు’ పాడా ఏర్పాటు చేసిన మొదట్లో ప్రత్యేక కలెక్టర్ శ్రీధర్ను ఇన్చార్జి పీడీగా నియమించి కార్యకలాపాలు ప్రారంభించారు. మిగిలిన అధికారులు, సిబ్బందిని ఇతర శాఖల నుంచి తీసుకువచ్చి ఇక్కడ నియమించారు. కొంత కాలానికే డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న చైత్రవర్షిణిని పాడా పీడీగా పూర్తి బాధ్యతలతో నియమించారు. కొంత కాలానికే ఆమెను బదిలీ చేసి వరుసగా ఇన్చార్జి పీడీలతో నెట్టుకొస్తున్నారు. ఇటీవల కొత్తగా భవానీ శంకర్ను రెగ్యులర్ పీడీగా ప్రభుత్వం నియమించింది. కానీ, కనీసం వారం రోజులు కూడా ఇక్కడ పని చేయకుండానే ఆయనను బదిలీ చేశారు. అనంతరం శివరాం ప్రసాద్ను పీడీగా నియమించారు. గ్రీవెన్స్కే పరిమితం పాడా పీడీలుగా నియమితులవుతున్న అధికారులు పట్టుమని పది నెలలు కూడా పని చేయకుండా బదిలీ అవుతున్నారు. కేవలం పాడా కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించి, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించడం తప్ప ఏమీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. కేవలం ప్రతి సోమవారం గ్రీవెన్స్ నిర్వహించడం, అర్జీలు స్వీకరించడం తప్ప వాటి పరిష్కారంపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. దీంతో పాడా కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్కు జనం రావడం మానేశారనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటి వరకూ పాడా పీడీలుగా పని చేసిన అధికారులు శ్రీధర్, చైత్రవర్షిణి, వేణుగోపాల్, సత్యనారాయణ, మల్లిబాబు, శ్రీనివాసరావు, భవానీ శంకర్, శివరాం ప్రసాద్ (ప్రస్తుతం) -
లోవ హుండీ ఆదాయం రూ.27.16 లక్షలు
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.27.16,159 ఆదాయం లభించిందని లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తూండటంతో దేవస్థానంలో హుండీలను సోమ వారం తెరచి నగదు, కానుకలు లెక్కించారు. మొత్తం 35 రోజులకు గాను నోట్ల రూపంలో రూ.25,12,560, నాణేలు రూ.2,03,599, బంగారం 11.100 గ్రాములు, వెండి 672 గ్రాములు వచ్చాయని ఈఓ వివరించారు. ఎంఎస్ఎన్ ఛారిటీస్ సహాయ కమిషనర్ సీహెచ్ సురేష్నాయుడు పర్యవేక్షణలో హుండీల ఆదాయం లెక్కించామన్నారు. నగదు లెక్కింపులో శ్రీవారి సేవకులు, బ్యాంకు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.పీజీఆర్ఎస్కు 534 అర్జీలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవా రం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 534 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్తో పాటు వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, సంక్షేమ పథకాలు లబ్ధి వంటి అంశాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలను గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మరిడమ్మ తల్లికి రూ.7.20 లక్షల ఆదాయంపెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మరిడమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.7,20,433 ఆదాయం వచ్చినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, ఆలయ ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యాన హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. గత ఏడాది డిసెంబరు 24 నుంచి ఈ నెల 30 వరకూ మొత్తం 95 రోజులకు గాను అమ్మవారి హుండీల ద్వారా రూ.6,40,303, అన్నదాన హుండీ ద్వారా రూ.80,130 వచ్చాయని ఈఓ వివరించారు. హుండీల ఆదాయాన్ని ట్రస్టు బోర్డు, భక్త మండలి సభ్యులు లెక్కించారు. పెద్దాపురం గ్రూప్ టెంపుల్స్ ఈఓ కె.జగదీశ్వరరావు, వీఆర్ఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్వేది స్వామికి రూ.37,08,338 రాబడిసఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ హుండీల ఆదాయాన్ని సోమవారం లెక్కించారు. భక్తుల నుంచి కానుకలుగా మొత్తం రూ.37,08,338 ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 30 వరకూ 53 రోజులకుగాను పై ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయంలో మెయిన్ హుండీల ద్వారా రూ.35,93,457 ఆదాయం, గుర్రాలక్క ఆలయ హుండీల ద్వారా రూ.27,872, అన్నదాన హుండీల ద్వారా రూ.87,009 చొప్పున సమకూరినట్టు ఈవో ఎంకేటీఎన్వీ ప్రసాద్ వివరించారు. -
రాజధాని పేరుతో చంద్రబాబు డ్రామా
● రానున్న రోజుల్లో ప్రజలే చెక్ పెడతారు ● రాజధాని, పోలవరం చంద్రబాబుకు ఏటీఎంలు ● ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని, ఆయన చర్యలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత తెస్తూ తీర్మానం చేసినట్టు కూటమి నేతలు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారన్నారు. తర్వాత ఎవరొచ్చినా రాజధానిని మార్చలేని విధంగా చట్టం చేసినట్టు గొప్పలు చెబుతున్నారని, అలాంటప్పుడు ఇప్పటి వరకూ అమరావతి రాజధాని కాదని అంటారా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హంగామా చేస్తున్న చంద్రబాబు ఆ చట్టమేదో నవ్యాంధ్రకు తొలిసారి సీఎం అయ్యినప్పుడు ఎందుకు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి పేరుతో చేస్తున్న జపమంతా చంద్రబాబు, కూటమి నేతలు రూ.లక్షల కోట్లు దోచుకోవడానికి చేస్తున్న జిమ్మిక్కులని ఆయన ఆరోపించారు. రాజధానిని అభివృద్ధి చేశామని చెబుతున్న చంద్రబాబు మాటలు మసిపూసి మారేడుకాయ చేసినట్టున్నాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేశానని చెబుతున్న తీర్మానాలు కేవలం విపక్షాన్ని విమర్శించడానికి తప్ప అందులో రాష్ట్ర ప్రయోజనాలేవీ లేవన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను చంద్రబాబు ఏటీఎంలుగా మార్చుకున్నారని గతంలో ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. అమరావతిలో రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న పేరుతో తన అనుచరులకు టెండర్లు ఇచ్చుకుంటున్నారని అన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీలకు పింఛను ఇస్తామని, ప్రతి మహిళకు నెలకు రూ.15 వందలు ఇస్తామని, చేనేత కార్మికులకు ఏడాదికి రూ.25 వేలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీటన్నింటిపై నిలదీస్తారనే భయంతోనే విపక్ష నేతలను విమర్శిస్తూ కూటమి నేతలు కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. ఎన్టీఆర్ను సీఎం కుర్చీ నుంచి దించేసి క్షోభ పెట్టారని, అలాంటి చంద్రబాబు సామాన్య ప్రజలకు మేలు చేస్తారన్నది అభూత కల్పన అని తోట త్రిమూర్తులు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లా వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగ్రుంట అయ్యప్ప, మాజీ కౌన్సిలర్లు మందపల్లి రవికుమార్, మెండు బాపిరాజు, పోతంశెట్టి ప్రసాద్, ముమ్మిడివరపు బాపిరాజు, నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు పలివెల మధు పాల్గొన్నారు. -
వాడవాడలా వేంకటేశు నామమే..
● వాడపల్లి క్షేత్రంలో వైభవంగా శ్రీవారి కల్యాణం ● గోవింద ఘోషతో మార్మోగిన పుర వీధులు ● కోలాహలంగా రథోత్సవం కొత్తపేట/ఆత్రేయపురం: కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో కొలువైన శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి కల్యాణం, రథోత్సవం ఆదివారం వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రం నలుమూలల నుంచీ తరలి వచ్చిన భక్తులతో వాడపల్లి క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల గోవింద ఘోషతో క్షేత్రం మార్మోగింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన ఆలయ పాలక మండలి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచీ ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు వివిధ పూజలు, హోమం, ఇతర వైదిక క్రతువులు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రథోత్సవాన్ని ప్రారంభించారు. వేలాది భక్త జనసందోహం నడుమ మాడ వీధుల్లో స్వామివారు ముందుకు సాగిపోయారు. కల్యాణం.. కన్నుల వైకుంఠం వాడపల్లి ఆలయంలోని విశాల ప్రదేశంలో పంచ ద్రవ్యాలు, సుగంధ పరిమళాలు, సువాసనలు వెదజల్లే పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణ మండపంలో స్వామివారి కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టు వస్త్రాలు, బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించిన శ్రీ, భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ విగ్రహలను పుష్పాలంకృతమైన పల్లకిలో ఉంచి, వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణ వేదిక వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ కల్యాణ మూర్తులను ఆశీనులను చేశారు. కల్యాణ తిలకంతో స్వామివారు, బుగ్గన చుక్కతో సిగ్గులొలుకుతూ ఉభయ దేవేరులు భక్తజనానికి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నడిపూడికి చెందిన వేద పండితుడు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, వేద పండితులు, అర్చకుల వేద మంత్రాల ఘోష నడుమ సాయంత్రం 6.15 గంటలకు కల్యాణాన్ని వైభవంగా ప్రారంభించారు. దేవస్థానం తరఫున శ్రీవారికి ఈఓ సూర్యచక్రధరరావు, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితర ప్రముఖులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బందోబస్తు నిర్వహించారు. కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక, వాయిద్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.భక్తుల కోలాహలం నడుమ సాగుతున్న రథోత్సవం -
పేలుళ్లతో ఇళ్లు ధ్వంసం
నెహ్రూ నగర్ వాసుల ఆందోళన తుని రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేసేందుకు కట్రాళ్ల కొండపై చేపడుతున్న బాంబు పేలుళ్లతో తమ ఇళ్లు ధ్వంసమవుతున్నాయని తుని ఒకటో వార్డు నెహ్రూ నగర్ వాసులు ఆందోళన చేపట్టారు. కట్రాళ్ల కొండ వద్ద ఆదివారం టెంట్ వేసి, ఆందోళనకు దిగారు. కొన్నాళ్లుగా చేపడుతున్న భారీ బాంబు పేలుళ్లతో తమ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని, సీలింగులు ధ్వంసమవుతున్నాయని, పునాదులు దెబ్బ తింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే నాలుగైదుసార్లు రెవెన్యూ అధికారులకు, కాంట్రాక్టు సిబ్బందికి ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసినప్పుడు నాలుగైదు రోజులు బాంబుల తీవ్రత తగ్గుతోందని, తర్వాత మళ్లీ భారీ బాంబుల మోత మోగుతోందని చెప్పారు. కలెక్టర్, ఆర్డీఓ తదితర అధికారులు వచ్చినా తమకు న్యాయం జరగలేదన్నారు. పోలవరం కాలువ పనులు పూర్తవుతున్నా తమ గోడు పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. అధికారులు స్పందించి ధ్వంసమైన ఇళ్లను పరిశీలించాలని, న్యాయపరంగా నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఆందోళన చేస్తామని బాధితులు హెచ్చరించారు. రేపటితో ముగుస్తున్న దరఖాస్తుల గడువు తుని రూరల్: హంసవరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏపీ మోడల్ స్కూల్లో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు మంగళవారంతో ముగియనుంది. ప్రిన్సిపాల్ టీవీ శివలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఐదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏప్రిల్ 12న జరిగే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని సూచించారు. లోవకు పోటెత్తిన భక్తులు తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం వేలాదిగా భక్తులు లోవ దేవస్థానానికి తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో వచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,62,135, పూజా టికెట్లకు రూ.1,98,740, కేశఖండన శాలకు రూ.13,640, వాహన పూజలకు రూ.10,130, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.54,360, విరాళాలు రూ.40,315 కలిపి మొత్తం రూ.4,79,320 ఆదాయం సమకూరిందని వివరించారు. ఘనంగా వేద సదస్యం అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకులు సీతారాముల కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజయిన ఆదివారం వేద సదస్యం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయంలో సాయంత్రం 4 గంటలకు నవ దంపతులు సీతారాములను వెండి సింహాసనం మీద, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని మరో ఆసనం మీద వేంచేయించి, పండితులు పూజలు చేసి, వేదాశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు సీతారాముల ముందు నాలుగు వేదాలను పఠించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, వడపప్పు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, గంగాధరభట్ల గంగబాబు, ముష్టి పురుషోత్తం, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకుడు సుధీర్, రామాలయ అర్చకుడు కోట వంశీ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఏఈఓ కృష్ణారావు పర్యవేక్షించారు. -
రత్నగిరి కిటకిట
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది ● 2,800 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిటకిటలాడింది. చైత్ర శుద్ధ ఏకాదశి, ఆదివారం సెలవు కలసి రావడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు వందలాది వాహనాల్లో తరలి వచ్చారు. సత్యదేవుని సన్నిధిలోను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,800 మంది ఆచరించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ లక్ష తులసి పూజ ఘనంగా నిర్వహించారు. -
నూతన కలెక్టర్గా హరేందిర ప్రసాద్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా నూతన కలెక్టర్గా ఎంఎన్ హరేందిర ప్రసాద్ నియమితులయ్యారు. ఆయన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గతంలో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్ గా, పశ్చిమ గోదావరి ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిగా, కడప జాయింట్ కలెక్టర్గా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా పని చేశారు. ప్రస్తుతం విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా పని చేస్తున్న ఆయనను ప్రభుత్వం కాకినాడ జిల్లా కలెక్టర్గా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ షణ్మోహన్ సగిలి అమరావతి ఆర్థిక మండలి సీఈఓగా బదిలీ అయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల అనంతరం 2024 జూన్లో జిల్లా కలెక్టర్గా నియమితులైన ఆయన ప్రస్తుతం బదిలీపై వెళ్తున్నారు. నేత్రపర్వం.. శృంగార వల్లభుని కల్యాణం సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై రాత్రి 10 గంటలకు అర్చకులు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, సుముహూర్తం, మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్పర్సన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి, ఈఓ వడ్డీ శ్రీనివాసరావుల ఆధ్వర్యాన కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. -
ఇక ఆషామాషీ కాదు
● అంపశయ్యపై ఆరోగ్యశ్రీ ● రూ.100 కోట్ల బకాయి పెట్టిన ప్రభుత్వం ● వెంటనే చెల్లించాలని నెట్వర్క్ ఆసుపత్రుల డిమాండ్ ● ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతకాకినాడ క్రైం: పేదల అపర సంజీవనిగా ఖ్యాతికెక్కిన ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కారు అంపశయ్య మీదకు చేరుస్తోంది. ఈ పథకం పేరును డాక్టర్ ఎన్టిఆర్ వైద్య సేవగా మార్చిన ప్రభుత్వం.. అందుకు తగిన రీతిలో నిధులు విడుదల చేయకుండా నిర్వీర్యం చేస్తోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదు. ఫలితంగా చంద్రబాబు అధికారం చేపట్టిన దాదాపు రెండేళ్ల వ్యవధిలో ఈ పథకం సేవలు రెండుసార్లు పూర్తి స్థాయిలో సేవలు నిలిచిపోయిన పరిస్థితులు తలెత్తాయి. బకాయిలపై ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆషా) ప్రతినిధులు పదులసార్లు సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. ఈ విషయం తేల్చకుండానే ఎన్టీఆర్ వైద్యసేవకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించేందుకు సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ తీరుతో విసుగు చెందిన నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ విషయాన్ని ఇక ఆషామాషీగా తీసుకోరాదనే నిర్ణయానికి వచ్చాయి. హామీలు తుంగలో తొక్కిన ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో జిల్లావ్యాప్తంగా 36 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. వీటితో పాటు మరో 9 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ సేవలు కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద ఇప్పటి వరకూ అందించిన చికిత్సలకు గాను ఈ 36 ఆసుపత్రులకే ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అయితే ఏకంగా రూ.3 వేల కోట్ల మేర బకాయిలున్నాయి. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల వేళ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను సైతం కూటమి నేతలు రకరకాల హామీలతో మభ్యపెట్టారు. బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని చెప్పారు. కానీ, అధికారం చేపట్టాక ఆ హామీని తుంగలో తొక్కడంతో నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు అనేకసార్లు విజ్ఞప్తులు చేశాయి. ఫలితం లేకపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవలను రెండుసార్లు నిలిపివేశారు. దీంతో, వారిని బుజ్జగించేందుకు గత ఏడాది డిసెంబర్ నాటికే బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. వన్టైం సెటిల్మెంట్ అంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. కానీ, షరా మామూలుగానే డిసెంబర్ వచ్చినా పట్టించుకోలేదు. ఆ గడువు దాటి మూడు నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించడం లేదు. ఇక గత్యంతరం లేక ఎన్టీఆర్ వైద్యసేవలను ఏప్రిల్ 1 నుంచి నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. ధరల పెంపుదలేదీ? ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలోని నెట్వర్క్ ఆసుపత్రులు కనీస ప్రమాణాలు పాటించాలి. దీనికిగాను ప్రతి ఆసుపత్రికీ ఏటా రూ.లక్షల వ్యయం అవుతుంది. ఏటా అన్ని ధరలూ పెరుగుతున్నా ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ చికిత్సల చార్జీలను పెంచడం లేదు. 2017లో నిర్ణయించిన ధరలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ధరలు పెంచాలని కూడా నెట్వర్క్ ఆసుపత్రులు కోరుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇకపై యూహెచ్సీ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనల నుంచి ఊపిరి పోసుకున్న పథకం ఆరోగ్యశ్రీ. దీనిని ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత విస్తృతం చేశారు. చికిత్సల సంఖ్యను 938 నుంచి ఏకంగా 3,275కు పెంచారు. చికిత్స పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచారు. వైఎస్సార్కు, వైఎస్ జగన్కు ఎంతో పేరు తెచ్చిన ఈ పథకానికి ఉరి బిగించే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవ స్థానంలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (యూహెచ్సీ) పేరిట ఆరోగ్య బీమా పథకం అమలుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రూ.2.5 లక్షల కంటే అధిక ఖర్చయ్యే చికిత్సలను ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు నిర్వహించనుంది. అంతకంటే తక్కువ చికిత్సలన్నీ యూహెచ్సీ పరిధిలోకి వస్తాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ నెట్వర్క్ ఆసుపత్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ముందు తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రమాదంలో పేదల ఆరోగ్యం ప్రభుత్వ నిర్లక్ష్యంతో పేదల ఆరోగ్యం ఇక ప్రమాదంలో పడనుంది. ప్రాణ రక్షణ కోసం చేసే కీలకమైన శస్త్రచికిత్సల నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా అక్కడ పెద్ద శస్త్రచికిత్సలకు అవసరమైన ఏర్పాట్లు లేని పరిస్థితి. కాకినాడ జీజీహెచ్లో కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ వంటి అనేక కీలక వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో లేవు. దీంతో, ఇప్పటి వరకూ ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచితంగా జరిగిన ఈ శస్త్రచికిత్సలకు ఇక నుంచి పేదలు రూ.లక్షల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఎదురు కానుంది.ప్రభుత్వ వైఖరితో ప్రజలకు నష్టం బకాయిలు చెల్లించకుండా మాకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. రూ.3 వేల కోట్లంటే మాటలా. ఇదంతా మా చేతి డబ్బు. కొందరైతే అప్పులు చేసి మరీ నిర్వహిస్తున్నారు. పదేళ్ల నుంచి వైద్య ఖర్చులు పెంచలేదు. నిర్వహణ భారం నానాటికీ అధికమవుతోంది. డిసెంబర్ నాటికే వన్ టైం సెటిల్మెంట్ అన్నారు. ఆ గడువు పూర్తయ్యి మూడు నెలలైంది. కేవలం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించే ఇన్నాళ్లూ సేవల నిలుపుదల నిర్ణయం తీసుకోలేదు. గత్యంతరం లేకే ఇప్పుడు సేవల నిలుపుదలకు పిలుపునిచ్చాం. కీలక వైద్య సేవలు నిలిచిపోతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తే తదనంతర పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. – కె.విజయ్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశా) -
ప్రజల ఆస్తిని వర్మకు ధారాదత్తం చేస్తారా?
● రూ.కోట్ల విలువైన భూమిని కట్టబెడతారా? ● జీఓ–17 తక్షణం రద్దు చేయాలి ● సీపీఎం నేతల డిమాండ్బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అసంతృప్తిని చల్లార్చేందుకు కాకినాడ నగరంలోని రూ.కోట్ల విలువైన ప్రజల ఆస్తిని కట్టబెట్టడం బాధాకరమని సీపీఎం నాయకులు అన్నారు. నగరంలోని చీడీలపొర గర్ల్స్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించిన ప్రాంతంలో వారు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ, జనసేన నాయకుడు నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడం వల్ల వర్మ అసంతృప్తితో ఉన్నారని అన్నారు. దీనిని చల్లార్చడానికి వర్మకు చెందిన ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్కు విలువైన భూమిని ధారాదత్తం చేయడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు జీఓ నంబర్ 17 ఇచ్చారన్నారు. ఈ జీఓను తక్షణమే రద్దు చేయకపోతే సీపీఎం ఆధ్వర్యాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ, కాకినాడలో ఆయుర్వేద ఆసుపత్రి నిర్మించడం అభినందనీయమన్నారు. దీని పక్కనే ఆయుర్వేద కళాశాల కూడా ఉండాలని, కానీ, ఇది పిఠాపురంలో మంజూరైందంటూ పక్కదోవ పట్టించడం సరికాదని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఆయుర్వేద ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి, దీనికి అనుబంధంగా ఆయుర్వేద కళాశాల కూడా నిర్మించాలని డిమాండ్ చేశారు. పర్యాటకాభివృద్ధి పేరుతో గత టీడీపీ పాలనలో ఎన్టీఆర్ బీచ్ పార్క్, రిసార్ట్స్, అతిథి గృహం నిర్మించారన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నిర్మాణాలు శిథిలావస్థకు వస్తున్నాయన్నారు. పర్యాటకాభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే బీచ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని హితవు పలికారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో భూముల ధారాదత్తంపై విమర్శలు చేసిన అధికార పార్టీ పెద్దలు ఇప్పుడు చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు మలక వెంకట రమణ, దుంపల ప్రసాద్, కె.నాగజ్యోతి, మేడిశెట్టి వెంకట రమణ పాల్గొన్నారు. -
‘అప్పుల్లో చంద్రబాబు రికార్డు సాధించారు’
సాక్షి, కాకినాడ జిల్లా: ‘‘2014-19 కాలంలో చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం అని చెప్పేవారు.. 2024 తరువాత ప్రతి మంగళవారం అప్పుల వారం అంటున్నారు’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేస్తూ.. అప్పు చేసి పప్పుకూడు అనే కార్యక్రమం చేస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.‘‘అప్పుల్లో చంద్రబాబు రికార్డ్ సాధించారు. ఈ 22 నెలల కాలంలో రూ.3 లక్షల 40,621 కోట్లు అప్పులు తెచ్చి ప్రజల నెత్తిన భారం పెట్టారు. కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు. అవసరమైన చోట అప్పులు చేసి సంక్షేమం.. అభివృద్ధిని సమానం తీసుకువెళ్ళి పాలన చేశారు. వైఎస్ జగన్ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రచారం చేశారు. ఐదేళ్లలో జగన్ చేసిన అప్పులతో సమానంగా ఈ 22 నెలల్లోనే చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేస్తున్న అప్పులతో రాష్ట్రం ఇవాళ శ్రీలంక అవ్వడం లేదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు అప్పులు చేస్తే సంపద సృష్టి.. నిధులు సమీకరణ అని కొన్ని పత్రికలు రాస్తున్నాయి. జగన్ అప్పులు చేస్తే రుణ భారం.. అప్పుల మోత అని ఆవే పత్రికలు రాశాయి. ఇప్పుడా పత్రికలకు సమ్మగా ఉంది. ఆ పత్రికలకు సామాజిక బాధ్యత లేదు?. తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నావ్ అని చంద్రబాబు ను అడిగేవాడు లేడు. చంద్రబాబు చేసిన అప్పులు చూసి కాగ్ ముక్కున వేలు వేసుకుంటుంది. కేంద్రం మా సపోర్ట్తో ప్రభుత్వాన్ని నడుపుతుంది కనుక మేము ఏం చేసిన చెల్లుబాటు అవుతుందన్న ధోరణీ కనిపిస్తుంది. అదే ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ఉన్న మీరు కేంద్రం నుండి సాధించిన గ్రాంట్లు ఏమైనా ఉన్నాయా?. మీ సంపద సృష్టి ఎంత వరకు వచ్చింది?. ఏ రూపంలో రాష్ట్రాన్ని అప్పుల భారం పడకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?..ఏపీ బేవరేజస్ నుండి వైఎస్ జగన్ అప్పులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే మీరు అడ్డుకున్నారు. ఇప్పుడు అదే సంస్థ నుండి మీరు రూ.17,600 కోట్లు అప్పులు చేశారు. అమరావతి నిర్మాణం కోసం మీరు కేంద్రం నుండి ఎంత గ్రాంట్ తీసుకువచ్చారు?. అమరావతిని మీరు అమితంగా ప్రేమిస్తున్నారు కదా?. ఆ ప్రేమకు కేంద్రం ఇచ్చిన కానుక ఎంత?. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేని మీరు.. సూపర్ సిక్స్ను అమలు చేయలేని మీరు రాష్ట్రాన్ని అప్పులతో అధోగతిపాలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్్గా మారుస్తున్నారని ప్రజలు అనుకునే పరిస్థితికి తీసుకువచ్చారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
రాజధాని రైతులను మభ్యపెట్టేందుకే అసెంబ్లీ తీర్మానం
కాకినాడ రూరల్: రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారడీలు నిరంతరం కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా తాత్సారం చేస్తున్నారని చెప్పారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే శాశ్వత రాజధాని తీర్మానం అంటూ మరోసారి అసెంబ్లీ నిర్వహించడాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో చేసిన తీర్మానం మండలికి పంపించకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిని బట్టి చట్టసభలపై చంద్రబాబుకు ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. ఏళ్లు గడుస్తున్నా ఏ ఒక్కరికీ ప్లాట్లు ఇవ్వకపోవడంతో అక్కడి రైతులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పారు. మంత్రి నారాయణ సమక్షంలో తన భూమిపై ప్రశ్నించిన రైతు రామారావు కుప్పకూలి మృతి చెందిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. 2014–19 మధ్య సింగపూర్ సంస్థలకు నిర్మాణ కాంట్రాక్టుల పేరిట కాలయాపన చేసిన చంద్రబాబు.. తాత్కాలిక నిర్మాణాలను కూడా పూర్తి చేయలేకపోయారని నాగమణి విమర్శించారు. చంద్రబాబు గారడీలను నాడు కేంద్రంలో ఉన్న బీజేపి గ్రహించినందువల్లనే రాజధానికి సహకరించలేదని అన్నారు. అభివృధ్ధి వికేంద్రీరణ జరగాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని తీసుకువచ్చారని, తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా కాకుండా చర్యలు చేపట్టారని అన్నారు. శనివారం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కేవలం జగన్ను దూషించడానికే అన్నట్టుగా ఉందన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో గతంలో చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు, అస్మదీయులకు కాంట్రాక్టులు అప్పగించి ప్రజాధనం దుర్వినియోగం చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అమరావతికి వ్యతిరేకం అని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయడంతో పాటు, నిర్మాణ భారం ప్రజలపై పడకుండా చర్యలు చేపట్టాలన్నదే జగన్ ఆకాంక్ష అని నాగమణి స్పష్టం చేశారు. -
ఊరంతా కన్నీరై..
● దుఃఖసాగరంలో తిమ్మాపురం ● రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడి మృతి ● జీజీహెచ్ నుంచి ఊరేగింపు కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడి ప్రాణాల్ని కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తిమ్మాపురానికి చెందిన సవరం బెన్నీ సుశాంత్ (14) వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి.. చివరకు ప్రాణాలు విడిచిపెట్టాడు. దీంతో, తల్లిదండ్రుల పుత్ర శోకానికి అంతే లేకుండా పోయింది. తిమ్మాపురం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసి ఈ సంఘటన వివరాలివీ.. పిఠాపురం – కాకినాడ రోడ్డులో తిమ్మాపురం సాయిబాబా గుడి ఎదురుగా ఈ నెల 22న జరిగిన రెండు బైక్లను కారు ఢీకొన్న ప్రమాదంలో మొత్తం ఏడుగురు గాయపడ్డారు. పిఠాపురం వైపు వస్తున్న కారు వేగంగా ఢీకొట్టడంతో తల్లిదండ్రులతో స్కూటీపై తిమ్మాపురం వస్తున్న సుశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచీ నాగమల్లితోట జంక్షన్ వద్ద ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు శుక్రవారం మృతి చెందాడు. కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం అనంతరం సుశాంత్ మృతదేహాన్ని శనివారం ఊరేగింపుగా తిమ్మాపురం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రమాదంలో బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు విజేత, అరుణ్ కుమార్తో పాటు గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. సుశాంత్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుశాంత్ మృతి బాధాకరమని, ఈ విషాదం నుంచి తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని సంతాపం వ్యక్తం చేశారు. -
చాలా దారుణం
మేం ప్రజాసామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గాం. రాజ్యాంగం ప్రకారం మాకు ఐదు సంవత్సరాలు పరిపాలించే అధికారం ఉంది. కానీ, ఈ ప్రభుత్వం ఈ నెల 25 నుంచే నా చెక్పవర్ నిలిపివేసింది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ సర్పంచ్లను ఇబ్బందులు పెడుతోంది. గతంలో 18వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకుండా ఇబ్బందులు పెట్టింది. ప్రస్తుతం ఇంకా పదవీ కాలం ఉండగానే మా చెక్పవర్ రద్దు చేసింది. – సాదే ఆశాజ్యోతి, సర్పంచ్, కరప గ్రామ పంచాయతీ -
ఆయుర్వేద కళాశాల అక్కడే నిర్మించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలోని ఆయుర్వేద ఆసుపత్రి పక్కనే కళాశాల కూడా నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు డిమాండ్ చేశారు. చీడీలపొర గర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణం వద్ద ఉన్న ఆసుపత్రిని సీపీఐ నాయకులు శనివారం పరిశీలించారు. అనంతరం, ఆయుర్వేద వైద్య కళాశాలను ఇక్కడి నుంచి పిఠాపురానికి తరలించే ప్రయత్నాలను నిలిపివేయాలని కోరుతూ కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, గర్ల్స్ పాలిటెక్నిక్ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు రూ.15 కోట్లతో 50 పడకల ఆయుర్వేద ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యి ఏడాది దాటిందన్నారు. దీనిని ఇప్పటికీ ప్రారంభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ నేషనల్ ఆయుష్ ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్లతో కళాశాల నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చిందన్నారు. విద్యా సంస్థల కోసం పిఠాపురం మహారాజా దానం చేసిన ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు బడాబాబులు ఆసుపత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రారంభం కాకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని ఆరోపించారు. హోటల్ నిర్మాణానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఇక్కడే 3.5 ఎకరాలు ఇవ్వడం దారుణమని మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టు పక్కల మహిళా కళాశాల, మహిళా హాస్టల్, విద్యా సంస్థలు, ఇళ్లు ఉన్నచోట సామాన్యుడికి ఉపయోగం లేని హోటళ్లు ఏవిధంగా పెడతారని ప్రశ్నించారు. రాజకీయ నాయకుల వ్యాపారాల కోసం కూటమి ప్రభుత్వం ఈ స్థలాన్ని లీజుకు కేటాయించిందన్నారు. నిజంగా పర్యాటకాభివృద్ధి కోసమే అయితే బీచ్ రోడ్డులోనో, ఏడీబీ రోడ్డులోనో హోటల్ పెట్టుకోవాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా ముందుకు వెళితే ఆ స్థలంలో నిరాహార దీక్షలు చేస్తామని మధు హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పద్మ, సహాయ కార్యదర్శి కేత అరుణ తదితరులు పాల్గొన్నారు. -
అదిగదిగో అరుంధతి
సీతారాములకు ఘనంగా అరుంధతీ నక్షత్ర దర్శనం అన్నవరం: శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నవ దంపతులు సీతారాములకు పండితులు శుక్రవారం రాత్రి అరుంధతీ నక్షత్ర దర్శనం చేశారు. రాత్రి ఏడు గంటలకు వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ సీతారాములను ఊరేగింపుగా రామాలయం వెలుపలకు తీసుకువచ్చారు. అక్కడ పూజలు చేసిన అనంతరం, ఆకాశంలో అరుంధతీ నక్షత్రం వైపు చూపించారు. అనంతరం ఆలయానికి తీసుకువెళ్లారు. శనివారం ఉదయం స్థాలీపాక హోమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వేద పండితుడు గొల్లపల్లి ఘనపాఠి, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, రామాలయ అర్చకుడు కోట వంశీ, పురోహితుడు పాలంకి పట్టాభి, పరిచారకుడు ముత్య వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువై యున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారికి ఇచ్చిన తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,66,160, అన్నదాన విరాళాలు రూ.61,218, కేశఖండన ద్వారా రూ.6,920, తులాభారానికి రూ.450, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.14,955 కలిపి మొత్తం రూ.2,49,703 ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు. అప్పనపల్లిలో భక్తుల రద్దీ మామిడికుదురు: అప్పనపల్లి బాలబాలాజీ స్వామి ఆలయానికి శనివారం భారీగా భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ, తొలి హారతిని అర్చకులు ఘనంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఎం.రాంబాబురెడ్డి మాట్లాడుతూ, ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,54,430 ఆదాయం వచ్చిందన్నారు. స్వామివారిని 6,200 మంది భక్తులు దర్శించుకున్నారని, 2,800 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు రూ.1,01,437 విరాళాలుగా అందించారని తెలిపారు. -
‘మరి వైజాగ్లో ఐటీ కంపెనీలకు ఎలా అనుమతిస్తున్నారు?’
కాకినాడ: పదకొండేళ్ల క్రితం హైదరాబాద్ను వదిలేసి వచ్చి అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పుకొచ్చారని, ఇప్పుడు మళ్ళీ ఎవరిని మభ్య పెట్టడానికి అసెంబ్లీ లో అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేయడం వెనుక కారణాలు ఏంటని వైఎస్సార్సీపీ నేత కురసాల కన్నబాబు ప్రశ్నించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాట్లు ఇంత వరకు ఇవ్వలేదని, ఇప్పుడు అమరావతి పేరుతో కట్టు కధలు చెప్పి రానున్న మూడేళ్ళు గడిపేయడానికి ఈ డ్రామా అని ధ్వజమెత్తారు కురసాల. మీరు మళ్ళీ అధికారంలో ఉంటామన్న నమ్మకం మీకు లేదా?, రైతులకు ఒక్క రిటన్ బుల్ ఫ్లాట్ ఇచ్చారా?, రాజధాని రైతు చనిపోతే కనీసం మీరు పరామర్శించారా?, చారిత్రాత్మక రాజధాని అని మీరు చెప్పినప్పుడు సమిధలు అవుతున్న రైతులను పరామర్శించరా?, ఇప్పటికీ రాజధానికి సరైన కనెక్టింగ్ రోడ్డులు ఉన్నాయా?, కనీసం ఆస్తులు ఉండీ అమ్ముకునే దుస్ధితి అమరావతి రైతులకు లేదు. రాజధానికి అప్పులు ఎక్కడ నుండి తెస్తున్నారో తెలియదు. రాజధాని భవనాలకు అడుగు నిర్మాణానికి రూ. 11 వేలు అవినీతి కాదా?, డిజైన్లకు కొత్తగా రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇడ్లీ పాత్ర..ఉప్మా గిన్నెల్లా భవనాలను డిజైన్ చేయించారు.రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఎలాంటి అభివృద్ధి లేదు. అమరావతిని సెల్ప్ ఫైనాన్స్ నగరం అని చెప్పి ఇప్పటి వరకు నిధులు ఏమైనా సమీకరించారా?, రాజధాని లో ఇవాళ్టీకి భూములు తుప్పలుగా ..పరలు పరలుగా కనిపిస్తున్నాయి.హైపర్ లూప్, ఒలింపిక్స్ అంటూ అమరావతిని బాగా మార్కెటింగ్ చేస్తున్నారు. అమరావతి ని ఒక మహ నగరంగా తీర్చిదిద్దుతారన్న నమ్మకం ఎవరికీ లేదు.అప్పుడు సునామీలన్నారు.. ఇప్పుడు ఐటీ కంపెనీలకు అనుమతి ఎలా?రాష్ట్రంలో అతి పెద్ద సిటీ వైజాగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి వైజాగ్ను పరిపాలన రాజధాని చేస్తానంటే.. సునామీలు వస్తాయని టీడీపీ తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయించింది. మరీ వైజాగ్లో ఇప్పుడు ఐటీ కంపెనీలకు ఏలా అనుమతి ఇస్తున్నారు. అమరావతి మీరు క్రియేట్ చేసిన ఇల్యూజన్లా కనిపిస్తుంది.అమరావతిని ఎవరికి స్వర్గంలా చేసేందుకు నిర్మిస్తున్నారు. అమరావతి లో పేదలకు చోటు లేదా? ఎవరి కోసం నిర్మాణం’ అని ప్రశ్నించారు. -
2న వాటర్ స్పోర్ట్స్ జిల్లా స్థాయి ఎంపికలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన వచ్చే నెల 2న రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) లీగ్ వాటర్స్పోర్ట్స్లో జిల్లా స్థాయి ఎంపికలు జరగనున్నాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సబ్ జూనియర్స్ అండర్–15, జూనియర్స్ అండర్–18 విభాగాల్లో కెనాయింగ్, క్యాకింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్లలో ఎంపికలుంటాయని వివరించారు. స్థానిక వివేకానంద పార్కు ఆవరణలో ఆ రోజు ఉదయం 8 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఆసక్తి ఉన్న వారు సొంత క్రీడా పరికరాలతో హాజరు కావాలన్నారు. క్రీడా యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుని, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరు కావాలని సూచించారు. శిల్పారామంలో స్టాల్స్కు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ రూరల్: బీచ్ రోడ్డులోని శిల్పారామంలో ఖాళీగా ఉన్న స్టాల్స్ను సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్ర వ్యాపారానికి కేటాయించేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పరిపాలనాధికారి మోహన్తేజ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. స్థానిక హస్తకళలను ప్రోత్సహించడంలో భాగంగానే వీటిని కేటాయిస్తున్నామన్నారు. ఆట వస్తువులతో పాటు ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఆసక్తి ఉన్న వారు ఏప్రిల్ 6వ తేదీలోగా శిల్పారామం కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని కోరారు, మంగళసూత్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ అన్నవరం: రత్నగిరిపై శుక్రవారం నిర్వహించిన సీతారాముల కల్యాణానికి బి.రామతీర్థ దంపతులు (విశాఖపట్నం) రూ.70 వేల విలువైన బంగారు మంగళసూత్రాలు, స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు సమక్షంలో ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మకు వీటిని అందజేశారు. నేడు పోలవరం తొలి కలెక్టర్ బాధ్యతల స్వీకరణ రంపచోడవరం: పోలవరం జిల్లా తొలి కలెక్టర్గా నియమితులైన కె.దినేష్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జాయింట్ కలెక్టర్ బచ్చు స్మరణ్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. -
రత్నగిరిపై కన్నుల పండువగా..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడు వెలసిన రత్నగిరి క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల దివ్యకల్యాణ మహోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత సేవతో వైదిక కార్యక్రమాలకు పండితులు శ్రీకారం చుట్టారు. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకుని తెల్లవారుజామున 4 గంటలకు సీతారాములకు పంచామృతాభిషేకం, అనంతరం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. వధూవరులుగా అలంకృతులైన సీతారాములను వెండి ఆంజనేయ వాహనం పైన, పెళ్లి పెద్దలైన సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకీ మీద ఉదయం 7 గంటలకు అన్నవరం గ్రామంలో ఊరేగించారు. అనంతరం ఊరేగింపుగా రత్నగిరి రామాలయం వద్ద ఉన్న వార్షిక కల్యాణ వేదిక వద్దకు తీసుకుని వచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదిక మీద ప్రత్యేక సింహాసనంపై మంత్రోచ్చారణల నడుమ సీతారాములను, ఆ పక్కనే మరో ప్రత్యేక ఆసనంపై పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అమ్మవార్లను వేంచేయించారు. కల్యాణ క్రతువు జరిగిందిలా.. ఉదయం 10.30 గంటలకు విఘ్నేశ్వర పూజతో కల్యాణ క్రతువు ప్రారంభించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల వంశీకుల విశిష్టతను వివరిస్తూ.. ప్రవరను కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు చెప్పారు. అనంతరం, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహా సంకల్పం, యుగఛిద్రాభిషేకం, తదితర కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిల్లగ్నంలో సీతారాముల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. అనంతరం మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు పండితులు వేదాశీస్సులందజేశారు. సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పును భక్తులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, గ్రామస్తులు కన్నులారా తిలకించి, పులకించిపోయారు. కల్యాణోత్సవాన్ని దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, చిట్టి శివ, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, రామాలయం అర్చకుడు కోట వంశీ, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తుశర్మ, సుధీర్, పవన్, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి తదితరులు నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఏఈఓ కృష్ణారావు, సూపరింటెండెంట్ రమణ తదితరులు పర్యవేక్షించారు. మధ్యాహ్నం సత్యదేవుని నిత్య కల్యాణం సీతారాముల కల్యాణానంతరం అదే వేదికపై మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకూ సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహించారు. దీనిని ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకూ స్వామివారి నిత్యకల్యాణ మండపంలో నిర్వహిస్తారు. ఆ కల్యాణానికి సీతారాములు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. అయితే, శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కల్యాణానికి సత్యదేవుడు, అమ్మవారు పెళ్లి పెద్దలుగా వ్యవహరించడంతో సత్యదేవుని నిత్యకల్యాణం ఆలస్యంగా నిర్వహించారు. నవదంపతులైన సీతారాములు ఈ కల్యాణానికి పెళ్లి పెద్దలుగా వ్యవహరించడం విశేషం. రమణీయంగా రాములోరి దివ్య కల్యాణం -
ప్రమాదాలు తక్కువ
పీఎన్జీలో మీథేన్ ఉంటుంది. అంటే దీని అణుభారం 16 యూనిట్లు. అదే సాధారణమైన గాలి అయితే అణుభారం 32 యూనిట్లు. అంటే పీఎన్జీ మనం పీల్చే గాలి కన్నా తక్కువ బరువు ఉంటుంది. అందువలన లీకైనా తొందరగా గాలిలో కలిసిపోతుంది. ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువ. కానీ, ఎల్పీజీలో బ్యూటేన్ కలిసి ఉంటుంది. దీని అణుభారం 58 వరకూ ఉంటుంది. గాలి కన్నా బరువు ఎక్కువ. అందువలన లీకేజీ సమయంలో ఎక్కువ సమయం కిందనే ఉండిపోతుంది. దీనివలన ప్రమాదాలు జరిగితే తీవ్రత అధికంగా ఉంటుంది. – పెచ్చెట్టి కృష్ణకిషోర్, కోనసీమ కాలుష్య అధ్యయనకర్త, అమలాపురం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం మా ఇంటికి పైపులైన్, మీటర్లు బిగించి ఆరేళ్లు దాటుతోంది. ఇప్పటి వరకూ గ్యాస్ సరఫరా మొదలు కాలేదు. దీని వల్ల ఎల్పీజీ సిలిండర్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. గ్యాస్ ఇబ్బందులు ఎదురవుతున్న ఈ సమయంలో పీఎన్జీ ఉంటే వినియోగదారులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వానికి సరఫరా భారం తగ్గుతుంది. – మట్టపర్తి వీర వెంకట సత్యనారాయణ, విశ్రాంత ఏఎస్సై, పోలీసు క్వార్టర్స్, అమలాపురం -
కమనీయం.. రామయ్య కల్యాణం
ఫ వైభవంగా కోదండ రాముని పరిణయ వేడుక ఫ గొల్లల మామిడాడకు వెల్లువెత్తిన భక్తజనం పెదపూడి: వేద పండితుల సుస్వర మంత్రోచ్చారణలు.. మార్మోగుతున్న మంగళవాయిద్యాల ఘోష.. భక్తుల ‘జై శ్రీరామ్’ నినాదాల నడుమ.. పంచభూతాలు సాక్షిగా.. ఆకాశమంత పందిరిలో.. భూదేవంత పీటపై.. కోదండ రాముని కల్యాణం కమనీయంగా, కన్నుల పండువగా జరిగింది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శుక్రవారం జరిగిన కోదండ రాముని కల్యాణోత్సవాన్ని.. వేలాదిగా వచ్చిన భక్తులు కన్నులారా తిలకించి పులకించిపోయారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయ సమీపంలోని కోనేటికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. వెల్లువలా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. వేడుక నిర్వహణ ఇలా.. ఉదయం 11.30 గంటలకు స్వామి, అమ్మవార్లను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పండితులు కల్యాణ సంకల్పం ప్రారంభించారు. మధ్యాహ్నం 12.45 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 1.25 గంటలకు స్వామి, అమ్మవార్ల కరకమలాలకు రక్షబంధనం గావించారు. యజ్ఞోపవీత ధారణ అనంతరం, వధూవరులను సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరించారు. మిథిలాధిపతి జనక మహారాజు తరఫున అర్చక స్వామివారు మధ్యాహ్నం 2.05 గంటలకు సీతమ్మ తల్లిని శ్రీరామచంద్రునికి ఇచ్చి కన్యాదానం చేశారు. మధ్యాహ్నం 2.20 గంటల సుముహూర్తంలో కల్యాణమూర్తుల శిరస్సులపై అర్చకులు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. స్వామి, అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, హారతి ఇచ్చారు. వరుడు కోదండ రాముని తరఫున అర్చకుడు మధ్యాహ్నం 2.45 గంటలకు సీతమ్మవారికి మాంగల్యసూత్రధారణ గావించారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు పోసి, కల్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. తలంబ్రాలు, పట్టువస్త్రాలు అంతకు ముందు వధూవరులైన సీతారాములకు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గం కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కూడా నూతన వస్త్రాలు సమర్పించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ద్వారంపూడి వెంకటరెడ్డి, పలువురు భక్తులు సైతం స్వామివారికి తలంబ్రాలుగా మంచి ముత్యాలు సమర్పించారు. ఉదయం 11.45 గంటలకు ఆలయ ధర్మకర్త ఇంటి నుంచి మంచి ముత్యాలు, తలంబ్రాలు, తొమ్మిది రకాల పండ్లు, పుష్పాలు, పట్టు వస్త్రాలను పల్లకీలో ఊరేగింపుగా వేదిక వద్దకు తీసుకొచ్చారు. జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, భువన దంపతులు కూడా స్వామివారిని దర్శించుకుని, కల్యాణోత్సవాన్ని తిలకించారు. కోదండ రాముని కల్యాణోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే పిల్లల వేలంపాట తంతు ఆనవాయితీగా జరిగింది. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ముత్యాల తలంబ్రాలు, అక్షతలు పంపిణీ చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్తో పాటు ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైల పర్యవేక్షణలో 106 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
వధూవరులుగా సీతారాములు
అన్నవరం: రత్నగిరి రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు పెళ్లి పెద్దలుగా విచ్చేయగా.. రామాలయంలో సీతారాములను వధూవరులను చేసే కార్యక్రమం గురువారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. సాయంత్రం 4 గంటలకు సీతారాముల మూర్తులకు పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల ఘోష నడుమ వధూవరులగా అలంకరించారు. వధూవరులైన సీతారాములకు అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, రామాలయం అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు ముత్య వేంకట్రావు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు తదితరులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. నేడు కల్యాణోత్సవం శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శుక్రవారం ఉదయం 7 గంటలకు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లి పెద్దలు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకీపై గ్రామంలో ఊరేగిస్తారు. అనంతరం, రామాలయం పక్కనే ఉన్న సత్యదేవుని వార్షిక కల్యాణ వేదికపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సీతారాముల దివ్య కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో మాంగల్యధారణ జరుగుతుంది. కల్యాణానంతరం భక్తులకు ప్రసాదం, వడపప్పు పానకం పంపిణీ చేస్తారు. రోజుకో వేడుకతో రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ మూడో తేదీ రాత్రి 7 గంటలకు రామాలయంలో జరిగే సీతారాముల శ్రీపుష్పయాగ మహోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. -
సాంకేతికతను భక్తులు సద్వినియోగం చేసుకోవాలి
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానంలో ఏర్పాటు చేస్తున్న సాంకేతిక సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. లోవ దేవస్థానానికి గురువారం వచ్చిన ఆయనకు ఈఓ పి.విశ్వనాథరాజు ఆధ్వర్యాన వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేసిన కలెక్టర్.. పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆన్లైన్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కరూర్ వైశ్యా బ్యాంకు అందజేసిన మూడు కియోస్క్లను ప్రారంభించారు. దేవస్థానంలో మూడేళ్లుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇంకా రూ.4.50 కోట్లతో ఎస్కలేటర్లు, రూ.1.60 కోట్లతో 1.5 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయని ఈఓ వివరించారు. ఈ పనులు వేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఈఓను, ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.మరిడియ్య తదితరులు పాల్గొన్నారు. -
దళిత క్రైస్తవులపై సుప్రీం తీర్పును పునఃపరిశీలించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, సామాజిక హక్కుల వేదిక చైర్మన్ తాటిపాక మధు కోరారు. క్రైస్తవం స్వీకరించిన వారు ఎస్సీల కిందకు రారంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ సీపీఐ, సామాజిక హక్కుల వేదిక జిల్లా శాఖల ఆధ్వర్యాన స్థానిక గాంధీనగర్ పార్క్ నుంచి ప్రతాప్ నగర్ బ్రిడ్జి వరకూ గురువారం ర్యాలీ నిర్వహించారు. కొద్దిసేపు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, హిందూ, బౌద్ధ, సిక్కు మతాల వారు మినహా ఏ మతాల వారూ ఎస్సీల కిందకు రారంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం విచారకరమన్నారు. షెడ్యూల్డు కులాల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈ తీర్పు వెలువరించిందన్నారు. ఇది దళిత క్రిస్టియన్ల మనుగడకు గొడ్డలిపెట్టువంటిదన్నారు. మతం మారినంత మాత్రాన అంటరానితనం పోదనేది వాస్తవమన్నారు. పైగా బౌద్ధ, సిక్కు మతాల్లో చేరిన వారికి మాత్రం ఎస్సీ హోదా వర్తిస్తుందని, క్రిస్టియన్లకు మాత్రం ఆ హోదా పోతుందని చెప్పడం సరైంది కాదన్నారు. క్రమంగా రిజర్వేషన్లు ఎత్తివేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. దీనిపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఒకవైపు న్యాయపోరాటం, మరోవైపు ఆందోళనలు నిర్వహిస్తామని మధు చెప్పారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు ఎంఎస్ నారాయణ, ఎస్సీ సంఘాల నేతలు కొల్లబతుల రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీరామ వైభవం
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026● నేడు కోదండ రాముని కల్యాణ వేడుక ● ముస్తాబైన జి.మామిడాడ ● పూర్తయిన ఏర్పాట్లు పెదపూడి: మరో భద్రాద్రిగా పేరొందిన సుప్రసిద్ధ దివ్య క్షేత్రం జి.మామిడాడ కల్యాణోత్సవ శోభను సంతరించుకుంది. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా.. ఇక్కడ కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. సీతారాముల కల్యాణ క్రతువును కన్నులారా తిలకించి, తరించేందుకు వేలాదిగా భక్తులు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో దీనికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో కొలువుదీరిన కోదండ రాముని కల్యాణోత్సవాలు ఏటా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి దీటుగా జి.మామిడాడలోని ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి తూర్పు, పశ్చిమ దిశల్లో ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా అత్యంత ఎత్తున నిర్మించిన గోపురాలు భక్తులను ఎంతో ఆకట్టుకుంటాయి. వీటిపై భాగవత, రామాయణాల్లోని అపురూప ఘట్టాలను ప్రతిబింబించేలా రకరకాల శిల్పాలను ఎంతో మనోహరంగా తీర్చిదిద్దారు. తూర్పు గోపురం దాదాపు 160 నుంచి 170 అడుగులు, పశ్చిమ గోపురం సుమారు 200 అడుగుల ఎత్తున అనేక అంతస్తుల్లో నిర్మించారు. గోపురం చివరి అంతస్తు నుంచి చూస్తే దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. ఉత్సవం నిర్వహిస్తారిలా.. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారిని తెల్లవారుజామున 3.30 గంటలకు మేల్కొల్పుతారు. ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయం సుమారు 11.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ప్రారంభమవుతుంది. జానకి రాముల పరిణయానంతరం స్వామి వారి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తారు. రామ నామ తలంబ్రాలు సీతారాముల కల్యాణోత్సవంలో ప్రధాన వేడుక తలంబ్రాలు. దీనికి మంచి ముత్యాలను సిద్ధం చేశారు. అలాగే, జి.మామిడాడ గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు, ఫిజికల్ డైరెక్టర్ ద్వారంపూడి యువరాజారెడ్డి 16వ పర్యాయం శ్రీరామ నామ లిఖిత తలంబ్రాలను, కల్యాణ కొబ్బరి బొండాలను సిద్ధం చేశారు. 1,01,001 బియ్యపు గింజలపై ఎటువంటి సూక్ష్మ పరికరాలూ లేకుండా మార్కర్ సాయంతో తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రామ నామాన్ని లిఖించి ఈ తలంబ్రాలను సిద్ధం చేశారు. అలాగే, రాములోరి కల్యాణంలో వినియోగించే కొబ్బరి బొండాలను కుటుంబ సభ్యుల సహకారంతో శంఖ, చక్ర, నామాలతో తీర్చిదిద్దారు. వీటిపై పెళ్లి కొడుకు రామయ్య, పెళ్లి కుమార్తె సీతమ్మ నామాలను లిఖించి కల్యాణోత్సవంలో అందజేయనున్నారు. విస్తృతంగా ఏర్పాట్లు సీతారాముల కల్యాణానికి జి.మామిడాడలో భారీ ఏర్పాట్లు చేశారు. వేలాదిగా భక్తులు తరలి రానున్నందున, స్వామివారి దర్శనానికి ప్రత్యేక క్యూలు, ఇతర ఏర్పాట్లు చేశారు. సుమారు 106 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్ తెలిపారు. వీరిలో ముగ్గురు సీఐలు, ఎనిమిది మంది ఎస్సైలు, 20 మంది మహిళా పోలీసులు, మిగిలిన వారు ఇతర కానిస్టేబుళ్లు ఉన్నారని వివరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రాంతాల్లోనూ గట్టి నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. -
పుష్కలంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ నిల్వలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 175 బంకులలో జిల్లా అవసరాలకు సరిపడా పెట్రోలు, డీజిల్ నిల్వలున్నాయన్నారు. అలాగే, 42 ఎల్పీజీ ఏజెన్సీల వద్ద వంట గ్యాస్ సిలిండర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న అసత్య వార్తలు, వదంతులను నమ్మవద్దని, అవసరం ఉన్నప్పుడే కొనుగోళ్లు, బుకింగ్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ సరఫరాల నిరంతర పర్యవేక్షకు జిల్లా స్థాయిలో పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కలిపి 88869 03611 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. మండల స్థాయిల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు పని చేస్తున్నాయన్నారు. సోషల్ మీడియా వదంతుల కారణంగా వినియోగదారుల్లో కలిగిన ఆందోళన కారణంగా మాత్రమే రీఫిల్ బుకింగ్స్ తాత్కాలికంగా పెరిగాయన్నారు. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ స్టాళ్లలో వివిధ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారని, గత 12 రోజుల్లో వాణిజ్య వినియోగానికి ఉపయోగిస్తున్న 210 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, 124 కేసులు నమోదు చేశారని వివరించారు. గత వారం జగ్గంపేట మండలంలో తాత్కాలికంగా ఆందోళనకర పరిస్థితి ఏర్పడగా, వెంటనే ఆయిల్ కంపెనీలను సమన్వయం చేసి, సరఫరా పెంచి, సమస్యను పరిష్కరించామని జేసీ భరత్ చెప్పారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణరాజు కూడా పాల్గొన్నారు. పిల్లల జోలికెళితే ఉపేక్షించొద్దు కాకినాడ క్రైం: దురుద్దేశాలతో పిల్లల జోలికెళ్లే నేరస్తుల్ని ఉపేక్షించవద్దని అధికారులకు ఎస్పీ బిందుమాధవ్ సూచించారు. కల్లాకపటం తెలియని బాలలపై నానాటికీ అకృత్యాలకు పెరుగుతూండటం ఆవేదన కలిగిస్తోందన్నారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం జరిగిన నేర సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. హత్యలు, మహిళలు, బాలలపై నేరాలు, ఆస్తి సంబంధిత నేరాలు, ఎన్డీపీఎస్ కేసులు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసుల స్థితిగతులపై సమీక్షించారు. కేసుల దర్యాప్తు వేగవంతంగా చేపట్టి నిర్దిష్ట సమయానికి చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలు, సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా కొనసాగాలన్నారు. వివాదాస్పద రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. వాహన తనిఖీలు, నైట్ పెట్రోలింగ్, సీఏఎస్ఓ తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. సమీక్షలో డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
కక్ష సాధింపే తండ్రీకొడుకుల అజెండా
● పాలన గాలికొదిలేసిన సర్కార్ ● కూటమి పతనానికి రోజులు దగ్గర పడ్డాయి ● చంద్రబాబుపై అంబటి రాంబాబు ఫైర్ సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి/కాకినాడ రూరల్: పరిపాలనను గాలికొదిలేసి వైఎస్సార్ సీపీ నేతలపై కక్ష సాధింపే అజెండాగా తండ్రీకొడుకులు రాష్ట్రంలో రెడ్బుక్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పాలన అంటే వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులపై అక్రమంగా పోలీసులు కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం అనుకుంటున్నారని ఆక్షేపించారు. అప్రజాస్వామిక విధానాలు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వంపై రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగిందని, చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం కూటమి కూలిపోతుందని చెప్పారు. కిర్లంపూడి, కాకినాడల్లో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ ఎంపీ వంగా గీత, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలను గురువారం అంబటి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ, తనను జైలుకు పంపడం అన్యాయమనే విషయం అందరికీ అర్థమైందన్నారు. తాను పొరపాటున నోరు జారిన కొద్ది వ్యవధిలోనే క్షమాపణ చెప్పానని, అయినప్పటికీ తన ఇంటిపై దాడి చేస్తే దగ్గరుండి పోలీసులు దాడికి సహకరించారని అన్నారు. లోకేష్ రాసిన రెడ్ బుక్కు తన కుక్క కూడా భయపడదు అన్నందుకా లేక సంక్రాంతి పోటీల్లో సరదాగా పాటలకు వేసిన స్టెప్ల కోసమే తనపై కక్ష కట్టారా అని రాంబాబు ప్రశ్నించారు. కూటమి కక్ష సాధింపులకు భయపడేది లేదన్నారు. అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తానన్నారు. నీతికి, నిజాయితీకి ముద్రగడ పద్మనాభం మారు పేరని, అటుంటి నేత కుటుంబాన్ని చంద్రబాబు గతంలో చిత్రహింసలకు గురి చేశారని గుర్తు చేశారు. తరువాత 2019లో జరిగిన ఎన్నికల్లో తరువాత చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పతనమైందని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవ్వడం ఖాయమని అన్నారు. తాను క్షణాల వ్యవధిలోనే క్షమాపణలు చెప్పినప్పటికీ తనపై దౌర్జన్యానికి ఒడిగట్టారని అంబటి అన్నారు. కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు నిలయంగా నిలుస్తారని, తడిగుడ్డతో గొంతు కోసే నైజం ఆయన సొంతమని విమర్శించారు. 20 నిమిషాల పాటు తన ఇంటి ముందు టీడీపీ గూండాలు కరాళ నృత్యం చేశారన్నారు. పెట్రోల్ తెచ్చి ఇంటిని తగులబెట్టి, కార్లు పగులగొట్టిన వాడికి స్టేషన్ బెయిల్ ఇచ్చి, తాను తిట్టానంటూ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపారని అన్నారు. తండ్రీకొడుకులు రాష్ట్రంలో అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగానికి తన కుక్క కూడా భయపడదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆ సీఐలను విచారించండి చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తనను పోలీసు కస్టడీలో కొట్టిన ఇద్దరు సీఐలను సస్పెండ్ చేసి మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించాలని అంబటి డిమాండ్ చేశారు. అలాగే తన ఇంటిని విధ్వంసం చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకోకుంటే తాను న్యాయస్థానం మెట్లు ఎక్కి తగిన గుణపాఠం చెబుతానని అంబటి హెచ్చరించారు. చంద్రబాబు, కొడుకు ఇక్కడ దోచిన సొమ్మును హైదరాబాద్లో దాచుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ప్రాణాలకు తెగించి పోరాడతానని చెప్పారు. కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత గడచిన 19 నెలల కూటమి అరాచ పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని అంబటి రాంబాబు అన్నారు. ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకతే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో 40 శాతం ఓటు బ్యాంకు కల్గిన వైఎస్సార్ సీపీ బలం మరింత పెరిగిందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరింత బలపడుతుందని, వైఎస్సార్ సీపీ 2029లో మళ్లీ అధికారంలోకి వస్తుందని అంబటి చెప్పారు.న్యాయం జరిగే వరకూ పోరాడతా గొప్ప రాజకీయ చరిత్ర, వ్యక్తిత్వం కలిగిన ముద్రగడ పద్మనాభం కాపు కులంలో పుట్టినందుకు ఆ సామాజిక వర్గీయులందరూ గర్వపడాలని అంబటి అన్నారు. అటువంటి నేత ఆశీర్వాదం తీసుకోవడానికే వచ్చానని చెప్పారు. ముద్రగద పద్మనాభం, తన అభిమానులు, కాపు కులస్తుల సహకారంతో తనకు న్యాయం జరిగే వరకూ కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కిర్లంపూడిలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, భీమవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ చిన్నమిల్లి వెంకట్రాయుడు, నాయకులు యనమల కృష్ణుడు, గణేశుల బాబ్జీ, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడలో ఘన స్వాగతం కాకినాడ రమణయ్యపేట వైద్యనగర్లోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన అంబటి రాంబాబుకు మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆధ్వర్యాన వైఎస్సార్ సీసీ రూరల్ నేతలు, కార్యకర్తలతో పాటు సిటీ నియోజకవర్గ నేతలు ఘన స్వాగతం పలికారు. వారందరినీ కన్నబాబు పరిచయం చేయగా, అంబటి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జి చిన్నమిల్లి వెంకట్రాయుడు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) మాజీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న, మాజీ డిప్యూటీ మేయర్ పసుపులేటి వెంకటలక్ష్మి, రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మాల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశివకుమారి, మాజీ మేయర్ సరోజ, సర్పంచ్ రామదేవు సూర్యప్రకాశరావు, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్నీ, నల్లబిల్లి సుజాత, వడ్డి మణికుమార్, పార్టీ నేతలు కడియాల చిన్నా, ఈశ్వరరావు, ఇసుకపట్ల కుమారి, నల్లా రాణి, కరీం బాషా, సారా రాజేష్, మోకా కృష్ణంరాజు, పంతం ఇందిర తదితరులు పాల్గొన్నారు. -
కాసుల గలగలలు
అన్నవరం: వరుస వివాదాలు, పలుమార్లు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిన ఉదంతాలతో గత ఏడాది సతమతమైన అన్నవరం దేవస్థానంలో పరిస్థితులు క్రమంగా కుదుట పడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు పడటంతో పాటు సత్యదేవుని దర్శనానికి వస్తున్న భక్తుల సంతృప్తి శాతంలో కూడా మెరుగుదల కనిపించింది. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అందిస్తున్న సేవలపై ఐవీఆర్ఎస్, వాట్సాప్ ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరించి ఏడాది నుంచి ప్రభుత్వం ర్యాంకులు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల అన్నవరం దేవస్థానం తొలిసారిగా ప్రథమ స్థానంలో నిలవడం అధికారుల్లో ఆనందాన్ని నింపింది. ముఖ్యంగా స్వామివారి ఆదాయంలో వృద్ధి నమోదవుతోంది. హుండీల ద్వారా సత్యదేవునికి 2025–25 ఆర్థిక సంవత్సరంలో రూ.18,79,39,198 ఆదాయం వచ్చింది. 2025–26లో చివరిసారిగా హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించగా రూ.42,86,788 వచ్చింది. దీనిని కూడా కలిపితే ఈ ఆర్థిక సంవత్సరంలో హుండీల ద్వారా సత్యదేవునికి రూ.19,55,754,810 ఆదాయం సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.76 లక్షలు అదనం. ఇందులో గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ నెల 26 వరకూ అంటే.. కేవలం నాలుగు నెలల్లోనే సుమారు రూ.6.50 కోట్లు రావడం విశేషం. గత డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకూ మూఢమి కారణంగా శుభకార్యాలు లేక భక్తుల సంఖ్య తగ్గింది. అయినప్పటికీ హుండీ ఆదాయం పెరగడం విశేషం. ఇతర విభాగాల ద్వారా వచ్చే ఆదాయం కూడా ఈ ఏడాది భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి సుమారు రూ.20 కోట్ల పైగానే పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. హుండీల్లో దండిగా ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.19.55 కోట్లు గత ఏడాది కంటే రూ.76 లక్షలు అధికం సత్యదేవుని సన్నిధిలో కుదుట పడుతున్న ఆర్థిక పరిస్థితి సేవలకు, ఆదాయం పెంపునకు ప్రాధాన్యం భక్తుల సంతృప్తికరమైన సేవలు అందించడం ద్వారా ఏడు ప్రముఖ దేవస్థానాల్లో అన్నవరం ప్రథమ స్థానం పొందింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటాం. అలాగే, దేవస్థానం హుండీల ఆదాయం కూడా గత ఏడా ది కన్నా రూ.76 లక్షలు అదనంగా వచ్చింది. అవసరమైన చోట్ల మరిన్ని హుండీలు పెట్టి, ఎక్కువ ఆదాయం వచ్చేలా చర్యలు చేపడతాం. అలాగే, భక్తులకు మరిన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. – వి.త్రినాథరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ముద్రగడను కలిసిన మాజీ మంత్రి అంబటి
సాక్షి, కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభంను మాజీ మంత్రి అంబటి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు, లోకేష్కు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. నాకు జరిగిన అన్యాయంపై న్యాయ స్థానం ద్వారా పోరాడతాను. ఇప్పటికే హై కోర్టులో రెండు రిట్ పిటిషన్లు వేశాను. త్వరలోనే మరో రెండు రిట్ పిటిషన్లు వేస్తాను’’ అని అంబటి పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ మా వెంట ఉన్నాడు.. ఇక కాపుల్ని ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నారు. అంబటి రాంబాబును కొట్టినా పర్వాలేదు. ముద్రగడ కుటుంబాన్ని తిట్టిన పర్వాలేదు అనుకుంటున్నారు. ఇది తప్పు.. అక్రమం.. అన్యాయం.. ఈ అన్యాయాలను ఎదుర్కోవడానికి నా కులం, నా పార్టీ సిద్ధంగా ఉంది’’ అని అంబటి రాంబాబు చెప్పారు. -
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్హెచ్ఆర్సీ పేర్కొంది.గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ స్పష్టం చేసింది. -
చురుగ్గా ‘పంపా’ బ్యారేజీ కొత్త గేట్ల పనులు
అన్నవరం: తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలోని సుమారు 12,500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే పంపా ప్రాజెక్ట్ బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చే పనులు చురుకుగా జరుగుతున్నాయి. బ్యారేజీ పాత ఐదు గేట్ల స్థానంలో కొత్త గేట్ల ఏర్పాటు పనులు ఈ నెల పదో తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్యారేజీలోని ఒకటి, రెండో నంబర్ గేట్లు పూర్తిగా తొలగించారు. ఆ గేట్ల మీద ఉన్న ఐరన్ స్ట్రక్చర్, గేట్లు పైకి కిందకు ఎత్తే యంత్రాలు అన్నింటినీ కూడా తొలగించారు. ఈ గేట్ల ఏర్పాటు కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీ నిపుణులు ఇప్పటికే రెండు కొత్త గేట్లు పంపా బ్యారేజీ వద్దకు తీసుకువచ్చారు. సుమారు 25 అడుగుల పొడవు కలిగిన ట్రాలీ ద్వారా ఈ గేట్లను పంపా ప్రాజెక్ట నదీ గర్భంలోకి తీసుకువచ్చారు. వీటిని అమర్చేందుకు సుమారు వంద అడుగుల ఎత్తయిన 50 టన్నుల కెపాసిటీ గల క్రేన్ను తీసుకువచ్చారు. ఆ క్రేన్ సహకారంతో ఈ కొత్త గేట్లు అమర్చే పనులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అంకురార్పణ వరదలు, తుపాన్ల సమయంలో ఈ గేట్లు ఎత్తడం, దింపడం చాలా కష్టం. సుమారు రెండు దశాబ్దాలుగా ఈ బ్యారేజీ గేట్లు నిర్వహణ ఇబ్బందిగా మారడంతో మార్చాలనే డిమాండ్ ఉంది. పంపా ప్రాజెక్ట్ బ్యారేజీకి కొత్త గేట్లు అమర్చేందుకు 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. అయితే 2024 లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదు. 2024 ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ విపత్తు రక్షణ నిధుల నుంచి రూ.3.36 కోట్లను 2024 డిసెంబర్లో కొత్త గేట్లు ఏర్పాటుకు మంజూరు చేసింది. 2025లో ఈ గేట్లు అమర్చడానికి మూడుసార్లు టెండర్లు పిలిచారు. ఎట్టకేలకు 2025 ఏప్రిల్లో టెండర్లు ఖరారు చేశారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు ఏప్రిల్ 15 వ తేదీకల్లా పూర్తవుతుందని ఈఈ శేషగిరిరావు తెలిపారు. -
ఈ ఉల్లి మరీ ఘాటు!
● బయట మార్కెట్లో కేజీ రూ.18లోపే ● రైతుబజార్లో రూ.23! ● పట్టించుకోని మార్కెటింగ్ శాఖ అధికారులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతుబజార్లో తక్కువ రేటుకు ఉల్లిపాయలు దొరుకుతాయని వస్తున్న వినియోగదారులు అక్కడ రేట్లు చూసి భయపడుతున్నారు. బయట మార్కెట్లో కేజీ ఉల్లిపాయలను రూ.15 నుంచి రూ.18లోపు విక్రయిస్తుండగా రైతుబజార్లో రూ.23కు విక్రయిస్తున్నారు. వీధి వెంబడి తిరిగే వ్యాపారులు ఆరు కేజీల ఉల్లి రూ.100కు విక్రయిస్తున్నారు. రైతుబజార్లో ఆరు కేజీలు రూ.138కు విక్రయిస్తున్నారు. ఇలా వినియోగదారుల వద్ద నుంచి రూ.38 తక్కువ కాకుండా అధికంగా లాగేసుకొంటున్నారు. కేజీ ఉల్లిపాయలు కొనుగోలు చేసుకొన్న సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి రూ.3 అదనంగా తీసుకొంటున్నారు. దీంతో రైతుబజారుకు వచ్చే వినియోగదారుల జేబులకు కన్నం పడుతోంది. ఇంటిలో ఏ కూర వండుకున్నా ఉల్లిపాయల వినియోగం సాధారణం కాబట్టి వారానికి సరిపడా సుమారు 5 కేజీలకు పై పడే ప్రతి వినియోగదారు కొనుగోలు చేస్తారు. రోజూ 10,000 కిలోల విక్రయం జిల్లాలోని మూడు రైతుబజార్లు ఉన్నాయి. పెద్దాపురం, కాకినాడ గాంధీనగర్, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ఈ రైతు బజారులు ఉన్నాయి. ఒక్క కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతుబజార్లో రోజూ 7,000 కేజీల ఉల్లిపాయలు విక్రయిస్తారు. ఇక పెద్దాపురం, గాంధీనగర్ రైతుబజార్లో సుమారు 3,000 కేజీలు పైబడి ఉల్లిపాయలు విక్రయిస్తుంటారు. బయట మార్కెట్లో రోజురోజుకీ ఉల్లిపాయల రేటు తగ్గుతున్నా రైతుబజార్లో మాత్రం తగ్గించడం లేదు. రెండు మూడు నెలలుగా ఇదేవిధంగా వినియోగదారుల నుంచి అధికంగానే వసూలు చేస్తున్నారు. చూసీచూడనట్టు.. రెండు, మూడు నెలలుగా ఉల్లిపాయలు రేట్లు తగ్గాయే తప్ప పెరగలేదని హోల్సేల్ వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ నెల 23న సైతం రైతుబజార్లో కేజీ రూ.24కు విక్రయించారు. వారం పదిరోజుల నుంచి ఇదే రేటుకు ఉల్లిపాయలు రైతుబజార్లో విక్రయిస్తున్నారు. మంగళవారం రూ.23 రేటును రైతుబజార్ ఎస్టేట్ అధికారులు నిర్ణయించారు. కానీ పెద్ద సైజు ఉల్లిపాయలు సైతం హోల్సేల్ వ్యాపారస్తుల వద్ద తక్కువ రేటు కు కొనుగోలు చేసి కేజీ రూ.20కి విక్రయించడం కాకినాడలోఅనేక ప్రాంతాల్లో కనిపించింది. హోల్సేల్ మార్కెట్లో పెద్ద సైజు ఉల్లిపాయలు రూ.14 నుంచి రూ.16కు మాత్రమే విక్రయిస్తున్నారు. రైతు బజార్లో అక్కడ అధికారులు రేట్లు ఎక్కువగా విక్రయిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని హోల్ సేల్ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అయినప్పటికీ జిల్లా అధికారులు ఈ విషయంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. బయట మార్కెట్లో విక్రయిస్తున్న పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు కేజీల పెద్ద ఉల్లిపాయలను రూ.వందకు విక్రయిస్తున్న వ్యాపారివ్యాపారులతో అధికారుల కుమ్మక్కు! వాస్తవంగా కూరగాయలు, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటివి బయట మార్కెట్ కంటే రూ.3 నుంచి రూ.5 తక్కువకు రైతుబజార్లో విక్రయిస్తారు. ఉల్లి రేటు దిగివచ్చినా రైతుబజార్ అధికారులు వ్యాపారులతో కుమ్మకై ్క అధిక రేట్లు నిర్ణయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఒక హోల్సేల్ ఉల్లి వ్యాపారి ఉన్నాడని, అతని దగ్గర స్టాక్ ఉంటే రేటు ఎక్కువగా పెడుతున్నారని అతని వద్ద స్టాక్ తక్కువగా ఉన్నప్పుడు కేజీకి రూ.రెండు మూడు రూపాయలు తగ్గించి పెడుతున్నారని రైతు బజార్లో ఉల్లిపాయలు విక్రయించే వ్యాపారులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ప్రతిరోజూ రైతులు విక్రయించే కూరగాయలతో సహా రైతుబజార్ ఎస్టేట్ అధికారులు హోల్సేల్ వ్యాపారులతో మాట్లాడి రేట్లు నిర్ణయిస్తారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో ఇద్దరు ఎస్టేట్ అధికారులు, గాంధీనగర్ రైతుబజార్లో ఒక ఎస్టేట్ అధికారి ఉన్నారు. వారానికి ఐదు రోజులు ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ ఎస్టేట్ అధికారులు, రెండు రోజులు గాంధీనగర్ ఎస్టేట్ అధికారి ఈ కూరగాయల ధరలు నిర్ణయిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎస్టేట్ అధికారులు అక్కడ వ్యాపారి చెప్పినట్లుగా ఉల్లిపాయల రేట్లు నిర్ణయించడం కారణంగానే తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతుబజార్ సమీపంలోనే కొందరు వ్యాపారులు ఆటోలతో తక్కువ రేట్లకు ఉల్లిపాయలు విక్రయిస్తున్నా ఇక్కడ రేట్లు మాత్రం తగ్గించడం లేదు. కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని ఎస్టేట్ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లిన వారు పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. బయట పెద్ద సైజు ఉల్లిపాయలు తక్కువకు బయట మార్కెట్లో విక్రయిస్తున్న పెద్ద సైజు ఉల్లిపాయల సైతం ఐదు నుంచి ఆరు కేజీలు రూ.100కు విక్రయిస్తుండగా రైతుబజార్లో ఇదే సైజు ఉల్లిపాయలు కేజీ 23 రూపాయలకు విక్రయిస్తున్నారు. కేవలం చిన్న సైజు ఉల్లిపాయలు మాత్రమే కేజీ రూ.18కు రైతుబజార్లో విక్రయిస్తున్నారు. అదే చిన్నసైజు ఉల్లిపాయలు బయట వ్యాపారస్తులు కేజీ రూ.13 నుంచి రూ.15కు విక్రయిస్తున్నారు.ధర తగ్గించాలి కూరగాయలు తక్కువ రేట్లకు దొరకడంతోపాటు నాణ్యమైన ఉంటాయని దూర ప్రాంతాల నుంచి సైతం రైతు బజార్కు వస్తున్నాం. కానీ కొన్నిరోజులుగా ఉల్లిపాయల రేటు మాత్రం బయట మార్కెట్ కంటే కేజీ రూ.3 నుంచి రూ.4 అధికంగానే ఉంటోంది. ఇక్కడ వ్యాపారులు అడిగితే బయట అమ్మే ఉల్లిపాయలు నాసిరకమని చెబుతున్నారు. నిజానికి బయట విక్రయించే ఉల్లిపాయలు పెద్దగా ఉంటున్నాయి. నాణ్యత కూడా బాగుంటోంది. – బొద్దపాటి వెంకట గౌతమి, కాకినాడ హోల్సేల్ కన్నా రూ.2 అధికం హోల్సేల్ ధరల కన్నా కిలోకు రూ.2 అధికంగా పెట్టి ప్రతీ రోజు ఉల్లిపాయలు ధరలు నిర్ణయిస్తున్నాం. రైతు బజార్లో విక్రయించే వ్యాపారులు సైతం హోల్సేల్ వ్యాపారస్తుల వద్ద కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తుంటారు. బయట తక్కువ రేట్లకు విక్రయిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. – కృష్ణారావు, ఎస్టేట్ అధికారి, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ రైతుబజార్ -
నేటి నుంచి రాములోరి పెళ్లి వేడుకలు
రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు జరుగనున్న శ్రీరామనవమి అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారామచంద్రస్వామివారి శ్రీరామనవమి వేడుకలు చైత్ర శుద్ధ అష్టమి, గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా దేవస్థానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రత్నగిరి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ఈ నెల 21వ తేదీన రామాలయం వద్ద ఘనంగా పందిరి రాట ముహూర్తం చేసిన విషయం తెలిసిందే. వధూవరులను చేయడంతో నేడు వేడుకలు ప్రారంభం గురువారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు రత్నగిరి పై నిర్వహించనున్నారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా పూజలందుకుంటున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా నిర్వహించడం ఆనవాయితీ. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులను చేస్తారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 28 తేదీన ప్రత్యేక పూజలు, 29 తేదీన పండిత సదస్యం, 30, 31 తేదీలలో సీతారాములకు ప్రత్యేక పూజలు, ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల వారి వన విహారోత్సవం, రెండో తేదీన శ్రీ చక్రస్నానం, దండియాడింపు, మూడో తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి. -
సమన్వయంతో ధాన్యం సేకరణ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా సేకరిస్తామని, ఈ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జిల్లాలో రబీ ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. రబీలో ధాన్యం సేకరణకు 227 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్లో మొత్తం 75197 హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేపట్టగా , సుమారు 6,76,774 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుందని అంచనా వేశామన్నారు. దీనిలో 67,677 మెట్రిక్ టన్నులు ధాన్యం స్థానిక వినియోగానికి పోను 6లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సాధారణ రకం క్వింటాకు రూ.2,369, ఏ గ్రేడ్ కు రూ.2,389 మద్దతు ధరగా ప్రకటించామన్నారు. జిల్లాలోని రైస్ మిల్లులు బ్యాంకు గ్యారంటీలు సమర్పించే చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, డీటీసీ ఎన్.శ్రీధర్, లీగల్ మెట్రాలజీ డీసీ జనార్ధన్, ఎఫ్సీఐ మేనేజర్ సీహెచ్ గంగాధర్ పాల్గొన్నారు. 2న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఏప్రిల్ 2న ఉదయం 10.30 గంటలకు నిర్వహిస్తారు. వీటిని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. నేడు సత్యదేవుని హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. చివరగా హుండీ ఆదాయం ఈ నెల 16వ తేదీన లెక్కించారు. అయితే ఈ నెల 31వ తేదీ తో ఆర్థిక సంవత్సరం ముగియనున్నందున పది రోజుల వ్యవధిలోనే రెండో సారి హుండీ ఆదాయం లెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్కు సహకారం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఆర్ఆర్ఆర్, ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులకు సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఒక హాటల్లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ప్రాజెక్టు పెండింగ్ డిజైన్లకు అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలన్నారు. కాంతారావును కలెక్టర్ కలెక్టర్ కీర్తి మర్యాద పూర్వకంగా కలిశారు. 28న జాబ్మేళా కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ పాసైన, ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు 30 కంపెనీలతో జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, సరిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల జేకేసీ విభాగంలో సంప్రదించవచ్చన్నారు. -
నిందితులను వదిలే ప్రసక్తి లేదు
● బాధితురాలికి అండగా ఉంటాం ● మానవ హక్కుల చైర్పర్సన్ శైలజ తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు బలమైన గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, ఒక వ్యక్తి ఇంతటి దారుణానికి పాల్పడి ఉండటం అసాధ్యమన్నారు. పోలీస్శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. గిరిజన దివ్యాంగురాలిపై అఘాత్యానికి పాల్పడిన వ్యక్తులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
పురోహితుడిపై క్రమశిక్షణ చర్య
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వ్రత విభాగంలో ప్రథమ శ్రేణి వ్రత పురోహితునిగా పనిచేస్తున్న మల్లాది గురుమూర్తి భక్తుల వద్ద నుంచి కానుకలు డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై క్రమశిక్షణ చర్యగా రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసినట్లు ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. మంగళవారం ఆ మేరకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు. ఇప్పటికే గురుమూర్తిని వ్రతకథలు చెప్పవద్దని ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 20వ తేదీన అన్నవరం దేవస్థానం పురోహితులు ఆరుగురు, మరో ముగ్గురు అదనపు పురోహితులు ఏలూరు జిల్లా పాలకొల్లులో సత్యదేవుని సామూహిక వ్రతాలు నిర్వహించారు. సుమారు 500 మంది భక్తులు ఆ వ్రతాలలో పాల్గొన్నారు. వ్రతాలనంతరం పురోహితులు భక్తుల నుంచి రూ.201, రూ.501 కానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారని దేవదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి వీడియో సహితంగా భక్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ కే రామచంద్రమోహన్ ఆ పురోహితులపై చర్య తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆరుగురు పురోహితులను ఈఓ త్రినాథరావు సస్పెండ్ చేశారు. ఆ తరువాత అధికారులు నిర్వహించిన విచారణలో ప్రథమ శ్రేణి పురోహితుడు మల్లాది గురుమూర్తి వ్రతకథ చెప్పి కానుకలు డిమాండ్ చేసినట్టు తేలడంతో అతడు మినహా మిగిలిన పురోహితుల సస్పెన్షన్ ఉపసంహరించారు. మూడు నెలల అనంతరం మల్లాది గురుమూర్తిని మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. వ్రతకథలు చెప్పవద్దని ఆదేశించారు. అయితే గురుమూర్తి గతంలో పలుమూర్లు ఇదే విధంగా కానుకలు డిమాండ్ చేసి సస్పెన్షన్కు గురైనట్టు తేలడంతో అతడికి భవిష్యత్తులో వచ్చే రెండు ఇంక్రిమెంట్టు కట్ చేస్తూ ఈఓ ఆదేశాలిచ్చారు. భక్తులను కానుకలు డిమాండ్ చేసినట్టు రుజువవడంతో వ్రత కథ చెప్పవద్దని ఆదేశం రెండు ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఈఓ ఆదేశాలు -
సంపన్నకారి పథకం వరం లాంటిది
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్వయం సహాయక సంఘ సభ్యులతో అనుసంధానమై, వ్యాపార అభివృద్ధికి రూపొందించిన ‘సంపన్న కారి‘ పథకం ఒక వరం లాంటిదని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పథకం పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. చాలా వ్యాపారాలు ఒక స్థాయి తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి సరైన మార్గదర్శకం, ప్రణాళికలు, మార్కెట్పై అవగాహన లేకపోవడం, పెట్టుబడికి వనరులు లేకపోవడం వంటివి అవరోధంగా ఉంటాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి రూపొందించిన కార్యక్రమమే ‘సంపన్న కారి’ అన్నారు. రూ.12 లక్షలు పైబడి టర్నోవర్ చేస్తున్న (సర్వీస్ సెక్టార్, మ్యానుఫాక్చరింగ్ సెక్టార్) మహిళా సంఘ సభ్యురాలికి ఒక పద్ధతిగా రూపొందించిన ఇంక్యుబేషన్ సహాయం పూర్తిగా ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికై న వారికి కనీసం 18 నెలలు ఇంక్యుబేషన్ సహాయం అందించడంతో పాటూ రూ. లక్ష వరకు గ్రాంట్ లేక రూ.4 లక్షల వరకు సున్నా వడ్డీ సదుపాయం, వ్యాపారపరంగా శిక్షణ, మార్కెట్ అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. జిల్లాలో అర్హత కలిగిన సంఘ సభ్యులు ఏప్రిల్ 15వ తేదీలోగా వెలుగు మండల మహిళా సమాఖ్య ఆఫీస్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు జి.శ్రీనివాసరావు, అదనపు పథక సంచాలకులు జిలానీ పాల్గొన్నారు. -
ఉత్సాహంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో మంగళవారం మాస్టర్స్ అథ్లెటిక్స్ జిల్లా స్థాయి ఎంపిక పోటీలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ పోటీలను మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ అధ్యక్షుడు కృష్ణమూర్తి, కార్యదర్శి బాపిరాజు ప్రారంభించారు. అథ్లెటిక్స్లో రన్, జంప్, త్రోస్లో పోటీలు నిర్వహించారు. ఈ నెల 30, 31 తేదీలలో నన్నయ యూనివర్శిటీలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారన్నారు. విజేతలకు డీఎస్డీఓ వి.సతీష్కుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్స్ సంఘ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
బినామీ అప్పుల వల్లే ముప్పు
ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): బినామీ రుణాల కారణంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు సహకార సంఘాలు అధికారులపై మండిపడ్డారు. కాకినాడలోని డీసీసీబీ కార్యాలయంలో మంగళవారం టర్న్ ఎరౌండ్ యాక్షన్ ప్లాన్ – టీఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బినామీ వ్యవసాయ రుణాలు ఇచ్చి వాటిని వసూలు చేయడంలో జిల్లాలోని ఆరేడు సహకార సంఘాలు చూపిస్తున్న నిర్లక్ష్యం కారణంగా డీసీసీబీ బ్యాంకులో పనిచేస్తున్న సిబ్బంది, సహకార సంఘాల్లో పనిచేస్తున్న సుమారు రెండువేల మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఒత్తిళ్లు ఉంటే తమకు వ్యక్తిగతంగా చెప్పాలే కానీ బినామీ రుణాలు వసూలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోనసీమ, రాజమహేంద్రవరంలలో రికవరీలు బాగా ఉన్నాయని కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం, కిర్లంపూడి, గోకవరం తోపాటు పలు బ్రాంచ్ల్లో బినామీ రుణాలు ఇవ్వడంతో అక్కడ రికవరీ కష్టంగా మారిందన్నారు. సహకార సంఘాలకు వెళ్లి రికార్డులు ఎందుకు తనిఖీ చేయలేదని బ్యాంకు ఇన్చార్జి సీఈవో ప్రవీణ్కుమార్ను ఆప్కాబ్ చైర్మన్ నిలదీశారు. తాము వెళ్లినా అక్కడి సీఈవోలు రికార్డులు చూపించడం లేదని ప్రవీణ్కుమార్ తెలిపారు. ఏలేశ్వరం శాఖలో రెండువేల మందికి రైతులకు రుణాలు ఇవ్వగా 700 మందికి రుణాలు ఇచ్చిన ఫైల్స్ మాత్రమే ఉన్నాయన్నారు. మిగిలినవి తమకు ఇవ్వడం లేదని ఆప్కాబ్ చైర్మన్కు ప్రవీణ్ వివరించారు. నాబార్డు జీఎం కేవీఎస్ ప్రసాద్, అప్కాబ్ ఎండీ ఆర్.రామకృష్ణ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి ట్రెజరీ డీడీగా పాషా కాకినాడ లీగల్: ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ట్రెజరీ డీడీగా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ ఆర్.పాషాను నియమించారు. జిల్లా ట్రెజరీ డీడీ ఎ.గణేష్ వ్యక్తిగత కారణాల వల్ల ఏప్రిల్ 18వ తేదీ వరకు సెలవు పెట్టారు. మంగళవారం డీడీ గణేష్ బాధ్యతలు పాషాకు అప్పగించారు. ఉత్సాహంగా ఎంపికలు నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో క్రీడాప్రాధికార సంస్ధ ఆధ్వర్యంలో మంగళవారం శాప్ లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను డీఎస్డీఓ వి.సతీష్ కుమార్ ప్రారంభించారు. షాట్పుట్, లాంగ్ జంప్, డిస్కస్త్రో, జావలిన్తో, రన్నింగ్ విభాగాల్లో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించి రాష్ట్రస్థాయికి జిల్లా జట్టును ఎంపిక చేశారు. శృంగార వల్లభస్వామికి రూ.15 లక్షల ఆదాయం సామర్లకోట: పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శృంగారవల్లభస్వామి ఆలయానికి హుండీల లెక్కింపు ద్వారా రూ.15,10,845 ఆదాయం వచ్చిన్నట్లు ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 29 నుంచి స్వామి వారి కల్యాణ ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. 41 రోజులకు స్వామి హుండీ ద్వారా రూ.11,55,167, అన్నదాన హుండీ ద్వారా రూ.3,55,678 వచ్చిందన్నారు. పంచారామ క్షేత్ర ఈఓ బళ్ల నీలకంఠం, ఆలయ చైర్మన్ మొయిళ్ల సంధ్య పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవద్దు
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న జగ్గంపేట డ్రైవర్స్ కాలనీ ప్రజలుకలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతున్న తోట నరసింహంబోట్క్లబ్ (కాకినాడ సిటీ): పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకోవాలని చేస్తున్న కుట్రలను విరమించుకోవాలని వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం డిమాండ్ చేశారు. జగ్గంపేట గ్రామ పరిధిలోని డ్రైవర్ కాలనీ లబ్ధిదారులు తమ స్థలాలు ఎవరికీ ఇవ్వవద్దని ఏపీ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న తోట నరసింహం అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2010 సంవత్సరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో ఆనాటి ప్రభుత్వం డ్రైవర్లకు, ఆశా వర్కర్లకు, సెక్స్ వర్కర్లకు, ఇతర పేదలకు సుమారు 170 ఇళ్ల స్థలాలను కేటాయించిందని, ఆర్థిక ఇబ్బందుల వల్ల, మౌలిక వసతులు లేక ఆ స్థలంలో ప్రజలు పూర్తిస్థాయిలో ఇళ్లు నిర్మించుకోలేకపోయారన్నారు. చాలామంది బేస్మెంట్ లెవల్కు కట్టారని, కొంతమంది ఇళ్లు పూర్తి చేసుకుని, రేకు షెడ్లు నిర్మించుకొని నివసిస్తున్నారన్నారు. లబ్ధిదారులు రూ. 5,000 చొప్పున సమీకరించి కరెంటు వేయించుకున్నారని గుర్తు చేశారు. లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడానికి వెళుతుంటే ప్రస్తుతం రెవెన్యూ, పోలీస్ సిబ్బందితో అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు. ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేసి నిరుపేదలకు న్యాయం చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఏపీ రైతుకూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ఆ ప్రాంతంలో భూమి రేట్లు పెరగడంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది పెత్తందారుల కళ్లు పడ్డాయన్నారు. తమ అనుచరులకు ఆ భూములను కేటాయించుకోవడానికి లబ్ధిదారులైన పేదలను భూముల నుంచి ఖాళీ చేయించే కుట్రలు చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే పంచాయతీ తీర్మానం చేశారని విమర్శించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా లబ్ధిదారులను తమ స్థలాల్లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. తక్షణమే పంచాయతీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని, పేదలను ఆ స్థలాల్లో నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై కలెక్టర్ జోక్యం చేసుకొని విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పేదల ఇళ్ల స్థలాల కాలనీలో మౌలిక వసతులు కల్పించి వారికి న్యాయం చేయాలని కోరారు. జగ్గంపేట గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ బండారు రాజా, ప్రగతి శీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) జిల్లా నాయకులు రెడ్డి దుర్గాదేవి, ఏఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మడికి సత్యం పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం -
జగన్ హయాంలో జిల్లాల పునర్విభజన
వైఎస్సార్సీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2023లో జిల్లాల పునర్విభజన చేపట్టారు. పార్లమెంటు స్థానం ఒక జిల్లాగా తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం జిల్లాలు ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేయగా ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబు ప్రభుత్వం పోలవరం పేరుతో ప్రత్యేక జిల్లాగా చేసింది. ఇదిలా ఉండగా జగన్ హయాంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లాలోకి కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలు కలిశాయి. ఇలా ఏడేసి నియోజకవర్గాలతో ఒక జిల్లాను జగన్ ఏర్పాటు చేశారు. పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 22 అసెంబ్లీ స్థానాలు, కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. -
చంద్రబాబు ప్రభుత్వంలో కుల వివక్ష
పి.గన్నవరం: చంద్రబాబు ప్రభుత్వంలో దళితులపై దాడులు, కుల వివక్ష వంటి సంఘటనలు పెరిగాయని భారత రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి డీబీ లోక్ అన్నారు. కుందాలపల్లిలో కాట్రు శ్రీనివాస్ అనే దళితుడి మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలిస్తుండగా, అడ్డుకోవడం క్షమించరాని నేరమన్నారు. బాధిత కుటుంబాన్ని మంగళవారం ఆయన పరామర్శించారు. లోక్ మాట్లాడుతూ దీనిని ప్రత్యేకమైన సంఘటనగా గుర్తించి, కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు. వారికి న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామన్నారు. గ్రామంలో ఇరువర్గాలూ సంయమనం పాటించాలని, శాంతి భద్రతలను కాపాడాలని డీబీ లోక్ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట దళిత ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ ములపర్తి సత్యనారాయణ, బొక్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
ఫ చెరువులో ఈతకెళ్లిన ఆరుగురు స్నేహితులు ఫ ఇందులో ఇంటర్ విద్యార్థి మృతి కాకినాడ రూరల్: ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం తీసుకుంది.. తిమ్మాపురం పెద్ద చెరువులో ఈ ఘటన జరిగింది. ఈత కోసం ఆరుగురు స్నేహితులు వెళ్లగా ఇందులో ఇంటర్ విద్యార్థి ప్రాణాలను కోల్పోయాడు. తిమ్మాపురం పోలీసుల కథనం ప్రకారం.. రమణయ్యపేట పంచాయతీ పరిధి కొత్తూరు బర్మాకాలనీ చెందిన రెడ్డి మురళీకృష్ణ (16) మరో ఐదుగురు కలసి మంగళవారం మధ్యాహ్నం సరదాగా ఈత కొట్టేందుకు తిమ్మాపురం శివాలయం వద్ద ఉన్న పెద్ద చెరువు దగ్గరకు వెళ్లాడు. ఆ ఆరుగురు సరదాగా ఈత కొడుతుండగా, అంతతో ఊబిలో మురళీకృష్ణ మునిగిపోయాడు. స్నేహితులు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మిగతా స్నేహితులు ఒడ్డుకు చేరుకుని స్థానికులకు సమాచారం అందించారు. స్థానికులు, గ్రామస్తులు, సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ తదితరులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. తిమ్మాపురం పోలీసులు చెరువు వద్దకు చేరుకుని విద్యార్థి కోసం గాలించారు. అనంతరం కాకినాడ అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి తాళ్లు పట్టుకుని నీటి లోపల గాలించడంతో మురళీకృష్ణ మృతదేహం లభ్యమైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిమ్మాపురం ఎస్సై గణేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బర్మాకాలనీలో విషాదం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇటీవలే రాసి రెండో సంవత్సరంలోకి చేరుకున్న రెడ్డి మురళీకృష్ణ మృతితో కొత్తూరు బర్మాకాలనీలో విషాదం అలముకుంది. మురళీకృష్ణ తల్లిదండ్రులు మృతి చెందడంతో అమ్మమ్మ సంరక్షణలో ఉన్నాడు. ఈత కోసం తోటి స్నేహితులతో తిమ్మాపురం చెరువు వద్దకు వెళ్లి మనమడు మృతి చెందినట్టు తెలుసుకున్న అమ్మమ్మ, ఇతర కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. -
మెరిసిపోయి.. మురిసిపోయి
ఫ ఆధ్యాత్మిక కాంతుల్లో నిర్మలగిరి ఫ కనువిందు చేస్తున్న పుణ్యక్షేత్రం దేవరపల్లి: ఆధ్యాత్మిక కాంతులతో నిర్మలగిరి పుణ్యక్షేత్రం మెరిసిపోతోంది.. చూసిన భక్తుల మది మురిసిపోతోంది.. గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఉత్సవాల సందర్భంగా ఏర్పాటైన విద్యుత్ దీపకాంతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవులే కాకుండా ఇతర మతస్తులు కూడా పుణ్యక్షేత్రానికి తరలివచ్చి వీక్షిస్తున్నారు. పుణ్యక్షేత్రంలోని కలవర కొండపై ఉన్న క్రీస్తు ఆలయం, దిగువన ప్రార్థనా మందిరం, అఖండ దేవాలయం, ప్రధాన ద్వారం వద్ద మరియ తల్లి స్వరూపం, ప్రధాన ద్వారం ఎదురుగా ఫాతిమా టవర్ విద్యుత్ దీపకాంతులతో కొత్త శోభను అద్దుకున్నాయి. ఈ నెల 22న ప్రారంభమైన నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రార్థనలు చేస్తున్నారు. మరియ తల్లికి పూజలు చేసి కొబ్బరి కాయలు కొట్టి, తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఏసుక్రీస్తు ఆలయానికి మెట్లపై మెకాళ్లతో నడిచి వెళ్లి మొక్కులు చెల్లించురకుంటున్నారు. రెండు రోజుల నుంచి భక్తుల రద్దీ పెరిగింది. రాత్రి 8 గంటల నుంచి పుణ్యక్షేత్రం భక్తజన సంద్రం అవుతుంది. ఉత్సవాల చివరి రోజు బుధవారం భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. చివరి రోజు రాత్రి పుణ్యక్షేత్రంలో పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయ్ కుమార్, పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఎస్.జాన్పీటర్, వివిధ ప్రాంతాలకు చెందిన గురువులు, ఫాదర్లు సమిష్ఠి దివ్యబలిపూజ సమర్పిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు కథోలిక్ తొలి పీఠాధిపతులు, నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం వ్యవస్థాపకుడు మోస్ట్ రెవరెండ్ జాన్ ములగాడ స్వరూపాన్ని పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, విజయ్కుమార్ ఆవిష్కరిస్తారని పుణ్యక్షేత్రం డైరెక్టర్ జాన్పీటర్ తెలిపారు. -
భక్తి పతాక స్థాయిలో..
ఇనుగంటివారిపేటలో నాలుగు రోడ్ల కూడలి మధ్య ధ్వజస్తంభం ఫ ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఫ ఆలయాలు లేకుండానే ఏర్పాటు ఫ అక్కడ కోరిన కోర్కెలు తీరతాయని ప్రజల నమ్మకం ఫ ప్రత్యేకతను చాటుతున్న వైనం సీతానగరం: ఆలయాల్లో ధ్వజస్తంభం ఎంతో పవిత్రమైంది.. ఇది గర్భగుడికి ఎదురుగా ఉంటోంది.. భక్తుని చూపుని నేరుగా దేవునిపై పడేలా చేస్తోంది. మూలవిరాట్కు, భక్తులకు మధ్య వారధిగా ఉంటోంది. ఆలయానికి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఆ గ్రామంలో ధ్వజస్తంభానికి ఎంతో విశిష్టత ఉంది. ఇది ఆలయానికి ఎదురుగా కాకుండా, ఊరి మధ్యలో ఉండడం ప్రత్యేకతను చాటుతోంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఇనుగంటివారిపేటలో ఊరి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఆధ్యాత్మికతను చాటుతుంది. ఆ విశేషమేమిటో తెలుసుకుందాం రండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ గ్రామంలో లేని విధంగా సీతానగరం మండలం ఇనుగంటివారిపేట గ్రామం నడిబొడ్డున కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. దీనిని తొంభై మూడేళ్ల్ల కిందట ప్రతిష్ఠించారు. కాలానుగుణంగా అది శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 జూన్లో పునర్నిర్మించారు. ఇక్కడి ధ్వజస్తంభానికి విశిష్టత ఉంది. ఏ గ్రామంలోనైనా ఆలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏ ఆలయమూ ఉండదు. నాలుగు రోడ్ల కూడలి మధ్యలో ధ్వజస్తంభం ఉంటోంది. ప్రధానంగా విష్ణాలయం, శివాలయం, రామాలయం వంటి పలు దేవాలయాల వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠిస్తారు. అయితే ఇనుగంటివారిపేటలో పలు ఆలయాలున్నా, వాటి వద్ద ధ్వజస్తంభం మాత్రం లేదు. గ్రామం నడిబొడ్డున మాత్రం ఉంటోంది. ఆలయాలు ఉన్నా.. ఇనుగంటివారిపేట గ్రామం మధ్యలో ఉన్న పెరుమాళ్ల ధ్వజస్తంభానికి ఉత్తర, దక్షిణ దిక్కుల్లో రామాలయాలు, తూర్పున శ్రీశాంతి దుర్గమ్మ వారి ఆలయం, పడమర దిక్కున శ్రీలంకాలమ్మ వారు కొలువై ఉన్నారు. ఇవే కాకుండా గ్రామంలో శ్రీలక్ష్మీ గణపతి ఆలయం, షిర్డీసాయిబాబా ఆలయం, భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉన్నా, ఏ ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ఠించలేదు. పదహారేళ్ల క్రితం ముగ్గళ్ల పంచాయతీ నుంచి విడిపోయి ఇనుగంటివారిపేట పంచాయతీగా మారింది. 1933లో ప్రతిష్ఠించిన పెరుమాళ్ల ధ్వజస్తంభం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల సహకారంతో 2019 జూన్ 20న తిరిగి పునః ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తితో కొలిస్తే అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఇక్కడ పూజలు చేస్తుండడం ఆచారంగా వస్తోంది. ఎందుకు నెలకొల్పారంటే.. పూర్వ కాలంలో ముగ్గళ్ల, ఇనుగంటివారిపేట గ్రామాలు ఇనుగంటి మహారాజు పాలనలో ఉండేవి. అయితే ముగ్గళ్లలో శివాలయం ఉన్నందున, అక్కడ ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. శైవ, వైష్ణవ ఆగమాలను అనుసరించి ఏ గ్రామంలోనైనా శివాలయం, లేకుంటే ధ్వజస్తంభం ఉండాలి. ఇనుగంటివారిపేటలో శివాలయం లేనందున 1933లో గ్రామ పెద్దలు గ్రంథి పుల్లయ్య, సత్యం మావయ్యకాపు, బిక్కిన వెంకట్రావులు ఆగమాలను అనుసరించి, ఆ గ్రామ నడిబొడ్డులో ఉన్న కూడలి మధ్యలో పెరుమాళ్ల ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభం ఉన్న గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని, సకల దేవతలు కొలువై ఉంటారని, విజయానికి సంకేతమని ఆ రోజుల్లో ప్రజలు విశ్వసించి గ్రామం మధ్వలో ఈ ధ్వజస్తంభం నెలకొల్పారు. ఎంతో విశిష్టమైంది తొంభై మూడేళ్ల్ల కిందట గ్రామం మధ్య కూడలి వద్ద పెరుమాళ్ల ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు. దానిని 2019 జూన్లో పునః ప్రతిష్ఠించారు. పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్దకు వచ్చి అనుకుంటే ఏ పనైనా జరుగుతుందని, విజయం చేకూరుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామం మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఎంతో విశిష్టమైంది. –ఆరాధ్యుల వెంకట నారాయణ, ఇనుగంటివారిపేట కోరిన కోర్కెలు నెరవేరతాయి పెరుమాళ్ల ధ్వజస్తంభం వద్ద కోరిన కోర్కెలు నెరవేరతాయి. గ్రామంలో శివాలయం లేకుంటే ధ్వజస్తంభం లేని గ్రామాలు ఏమీ ఉండవు. ఆనాటి పెద్దలు ఆలోచించి శివాలయం లేని కారణంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ పూజలు అందుకుంటుంది. ప్రతి ఏడాది కార్తిక మాసంలో ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –సత్యం రాంపండు, సర్పంచ్, ఇనుగంటివారిపేట -
ప్రేమ పేరుతో మోసం
యువకుడిపై పోక్సో కేసు నమోదు ఐ.పోలవరం: ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను మోసగించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఐ.పోలవరం ఎస్సై రవీంద్రబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండలం పరిధి ఎదుర్లంక గ్రామానికి చెందిన బాలిక (17)ను అదే గ్రామానికి చెందిన యువకుడు కమిడి హరినారాయణ ప్రసాద్ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పలుసార్లు శారీరకంగా దాడి చేసినట్టు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. దీనిపై అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఐ.పోలవరం పోలీస్ స్టేషన్కు వచ్చి విచారించారు. నిందితుడిని అరెస్ట్ చేస్తామని డీఎస్పీ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. పనిముట్లు ధ్వంసం చేస్తున్న ముఠా అరెస్ట్ నల్లజర్ల: సింగరాజుపాలెంలో ఈ నెల 23న అర్ధరాత్రి కొఠారు నారాయణరావుకు చెందిన పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు పొలంలో చొరబడి పంటను, వ్యవసాయ పనిముట్లను ధ్వంసం చేస్తున్న సమయంలో కాపలాదారులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇదే గ్రామానికి చెందిన కొఠారు ప్రదీప్ చక్రవర్తి, ఉంగుటూరుకు చెందిన జీవరత్నం, రాంబాబుతో పాటు మరో ఆరుగురు ఆటోపై వచ్చి నారాయణరావు పొలంలో దోసపాదులు, ఆయిల్పామ్ మొక్కలు, బొప్పాయి తదితర పంటలను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పొలం కాపలాదారులు ఇందులో ఆరుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. -
సృజనమేవ జయతే
ఆలోచనకు సృజన తోడైతే.. పనికిరాని పుల్లలతోనూ అద్భుత కళాఖండాలు తయారు చేయవచ్చు.. అందరితో ఔరా అనిపించుకోవచ్చు. రాజానగరం మండలం వెలుగుబంద జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు బి.పవన్కుమార్ సారథ్యంలో విద్యార్థులు పనికిరాని వస్తువులతో వివిధ బొమ్మలను తీర్చిదిద్దారు. పారేసిన ఐస్క్రీం పుల్లలు, స్ట్రాలతోపాటు అగ్గి పుల్లలు, ధారం, అట్టముక్కలను ఉపయోగించి అందమైన బొమ్మలను చేసి అబ్బురపరిచారు. ‘నో కాస్ట్, నో లాస్’ విధానంలో బోధనోపకరణాలను కూడా రూపొందించవచ్చని పవన్కుమార్ అన్నారు. పాఠశాలలో ప్రతి శనివారాన్ని ‘నో బ్యాగ్ డే’గా అమలు చేస్తున్న తరుణంలో విద్యార్థులచే ఇటువంటివి తయారు చేయించడం ద్వారా సృజనాత్మకతను వెలికితీయవచ్చని అంటున్నారు. –రాజానగరం -
కాకినాడతో నాకు ఎంతో అనుబంధం
ప్రముఖ సినీ నేపథ్య గాయని సుశీల బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడతో నాకు ఎంతో అనుబంధం ఉందని ప్రముఖ సినీ నేపథ్య గాయని పి.సుశీల అన్నారు. సత్కళావాహిని సంస్థ 55 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమెను సోమవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుశీల మాట్లాడుతూ 92 సంవత్సరాలు వయసులో తాను కాకినాడపై అభిమానం, సత్కళావాహిని సంస్థతో ఉన్న అనుబంధంతో మూడవసారి ఇక్కడకు వచ్చానన్నారు. కళల కాణాచి కాకినాడలో అభిమానుల ప్రేమకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. 55 సంవత్సరాలుగా సత్కళావాహిని సంస్థ సంగీతానికి చేస్తున్న సేవ అభినందనీయమన్నారు. సత్కళావాహిని వ్యవస్థాపకులు ఈవీ కృష్ణమాచార్యులు పి.సుశీలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుశీలతో పాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణీజయరాం, ఎస్పీ శైలజ, పీబీ శ్రీనివాసు, బాలమురళీకృష్ణ వంటి దిగ్గజ గాయనీ గాయకులు, సంగీత విద్వాంసులు సత్కళావాహినిలో కార్యక్రమాలు నిర్వహించడం తమకెంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని అధ్యక్షుడు గోపాల నర్సరాజు, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాల్సేన్ గుప్తా, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ మేయర్ సుంకర పావని గాయని సుశీలను సత్కరించారు. వాట్సాప్ గవర్నెన్స్పై అవగాహన పెంచాలి – మంత్రి నారాయణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వాట్సాప్ గవర్నెన్స్ సేవల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జరిగింది. శాఖల వారీగా మంత్రి అధికారులతో సమీక్షించి లక్ష్యాల సాధనకు కార్యాచరణ సూచించారు. అనంతరం మీడియా సమావేశంలో వివిధ అంశాలను వివరించారు. జిల్లాలో పంటలకు నీటి అవసరం పూర్తయినందున నీటి విడుదల ముందే ఆపి, నిర్వహణ పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించామని తెలిపారు. జిల్లాలో పట్టణ ఆవాసాల్లో 1,70,523 కుటుంబాలు ఉండగా ఇప్పటికి 28,223 కుటుంబాలు మాత్రమే వాట్సాప్ గవర్నెన్స్ వినియోగిస్తున్నాయని మిగిలిన వారికి అవగాహన పెంపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ప్యానెళ్లు ఏర్పాటు చేస్తున్నామని, జిల్లాలో 19,593 కుటుంబాలు ఉండగా ఇప్పటికి 524 మంది ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారని, మిగిలినవారు లబ్ధి పొందేలా చూడాలని ఆదేశించామన్నారు. కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీఆర్వో తిప్పేనాయక్ పాల్గొన్నారు. -
జాబ్ క్యాలెండర్తో దగా
● కేవలం 10వేల పోస్టులతో భారీ ప్రచారం ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అరుణ్కుమార్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: జాబ్ క్యాలెండర్ పేరుతో యువత పట్ల నయ వంచనకు పాల్పడుతున్న చంద్రబాబు కుతంత్రాలపై ప్రజలు పోరుకు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్ (బన్ని) పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1.72 లక్షల పోస్టులు ఖాళీ ఉంటే కేవలం 10,060 పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ జారీ చేసి నిరుద్యోగులకు.. ఉద్యోగ అవకాశాలు కల్పించామని ప్రచారం ఊదర కొట్టిందన్నారు. ఈ పోస్టులు కూడా నాలుగు విడతల్లో వచ్చే అక్టోబర్ వరకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించి మరో మోసం చేసిందన్నారు. ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు చొప్పున ఐదేళ్ల కాలంలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు హామీ ఇచ్చింది. ఉద్యోగం ఇచ్చేంతవరకు నెలకు రూ. 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. గద్దెనెక్కిన 22 నెలల కాలంలో ఏ ఒక్క నిరుద్యోగికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి తూతూ మంత్రంగా ఇటీవలే క్యాలెండర్ విడుదల చేశారని విమర్శించారు. ఆ క్యాలెండర్కు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు పొంతనలేకుండా ఉందన్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అత్యధిక ఉద్యోగాల హామీ కల్పనగానే మిగిలిందన్నారు. ఎంఎస్ఎమ్ఈ సెక్టార్లకు ప్రోత్సాహం అందిస్తామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి నిలువునా నిరుద్యోగులను దగా చేశారన్నారు. నిరుద్యోగం తాండవిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఇంకా లడ్డూ వివాదం మీదే పబ్బం గడుపుతోందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో చూపిస్తోన్న చొరవ ప్రజలకు గ్యాస్ కొరత తీర్చే విషయంలో చూపడం లేదన్నారు. హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులకు, బయట పీజీ హాస్టల్స్లో ఉండి చదువుకునేవారికి ప్రస్తుతం ఎక్కడా హోటల్స్ అందుబాటులో లేకపోవడంతో తిండిలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి విద్యార్థులు, నిరుద్యోగులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
ఎప్పటికో ధాన్యోస్మి!పిఠాపురం: అరచేతిలో స్వర్గం చూపించడం అలవాటైన ప్రభుత్వం అన్నదాతలను అవస్థలకు గురి చేస్తోంది. పుణ్యకాలం పూర్తయ్యాక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం అలవాటుగా మార్చేసింది. ధాన్యం అందుబాటులోకి వచ్చే సరికి సిద్ధంగా ఉండాల్సిన కొనుగోలు కేంద్రాలు సగం అమ్మకాలు పూర్తయ్యే వరకు ప్రారంభించకపోవడం అన్నదాతలను అష్టకష్టాల పాలు చేస్తోంది. కేవలం ప్రైవేటు వ్యాపారులకు మేలు చేయడానికే అన్నట్టుగా ఉంది అధికారుల తీరు. జిల్లాలో ఇప్పటికే రబీ ఽవరి కోతలు ప్రారంభమయ్యాయి. మరో పది రోజుల్లో కోతలు ముమ్మరం కానున్నాయి. కానీ ఎక్కడా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. తద్వారా తక్కువ ధరకు అమ్ముకుని ఆర్థికంగా నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రకటనలపై రైతుల విమర్శలు ఈ ఏడాది రబీ సీజన్లో 227 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 1.87 లక్షల ఎకరాల్లో రైతులు ఈసారి రబీ సాగు చేపట్టారు. దాదాపుగా 6.76 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గడచిన ఖరీఫ్లో 3.02 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించారు. అయితే ఈ రబీకి 2,101 వాహనాలను, సుమారు 40 లక్షల గోనె సంచులు, 3,400 మంది హమాలీలు, 259 తేమ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 990 మంది సిబ్బందిని నియమిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఒకపక్క జిల్లాలో మెట్ట ప్రాంతమైన గండేపల్లి మండలంలో ఇప్పటికే రబీ వరి కోతలు ప్రారంభం కాగా మిగిలిన ప్రాంతాల్లో రబీ పంట కోతలకు సిద్ధమవుతోంది. అయినా ఇంకా అధికారులు ప్రణాళికలు, ఏర్పాట్లు అంటూ ప్రకటనలు చేయడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలతో అవస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేంద్రాల ద్వారా ధాన్యాన్ని అమ్ముకోవాలంటే రైతులు ఏటా అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం విధిస్తున్న సవాలక్ష నిబంధనలతో కేంద్రాల వలన ఉపయోగం లేకుండా పోతోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో పలుచోట్ల దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకోవడం వలన గిట్టుబాటు ధరను కోల్పోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రాకుండా పోతున్నాయనే విమర్శలు పలువురి రైతుల నుంచి తరచూ వినిపిస్తున్నాయి. తేమ శాతం తదితర అనేక నిబంధనలు విధించడంతో ఈ కేంద్రాల్లో అమ్ముకోలేక అనేకమంది దళారులనే ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. 24 గంటల లోపే ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామంటూ చెబుతున్నారు. కానీ ఎక్కువ మంది రైతులకు సకాలంలో సొమ్ము జమ కావడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మద్దతు ధర దక్కకుండా దళారులు రైతులను మభ్య పెడుతున్నారు. మరోవైపు వాతావరణం భయపెడుతోంది. ప్రకృతి విపత్తుల నడుమ, కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల వల్ల దళారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. 8దళారుల దోపిడీ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 600 ఎకరాలలో కోతలు పూర్తయినట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి. యంత్రాల ద్వారా కోసిన ధాన్యాన్ని వెనువెంటనే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తుండడం వలన రైతులు వారికే మద్దతు ధర కంటే తక్కువకు అమ్మకాలు సాగిస్తున్నారు. గత ఏడాది మద్దతు ధర ప్రకారం 75 కిలోలకు సాధారణ రకానికి రూ.1,725, ఏ గ్రేడ్ రకానికి రూ.1,740లు రైతుకు అందాల్సి ఉంది. కానీ ప్రస్తుతం గండేపల్లి మండలంలో పచ్చి ధాన్యాన్ని 75 కిలోలు రూ.1,600 నుంచి రూ.1,650 మధ్యలో ప్రైవేటు వ్యాపారులకు విక్రయాలు జరుపుతున్నామని అక్కడి రైతులు చెబుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం సాధారణ రకం క్వింటాకు రూ.2,300, ఏ గ్రేడ్ రకానికి రూ 2,320 మద్దతు ధరగా ప్రకటించింది. కానీ ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి వారు చెప్పిన ధరకే అన్నట్లుగా దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వలన రంగు మారడంతో గతేడాది పలువురు 75 కిలోలు రూ.1,400కే అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక్కో బస్తాపై రూ 340 నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలా ఈసారి అటువంటి సమస్యలు లేకుండా కొనుగోళ్లను ప్రారంభించాలని పలువురు రైతులు కోరుతున్నారు. రబీ కోతలు ప్రారంభం.. తెరచుకోని కొనుగోలు కేంద్రాలు ధాన్యం సేకరణకు ఇంకా ప్రణాళికలలోనే యంత్రాంగం ప్రైవేటు వ్యాపారులదే హవా రైతుల ఆందోళన ఎప్పుడూ ఆలస్యమే.. గత ఏడాది ఖరీఫ్, రబీ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లలోనూ ఇదే తంతు నడిచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం అంటూ ప్రకటనలు ఇవ్వడం తప్ప కోతలు ప్రారంభమయ్యే నాటికి మాత్రం ఏర్పాటు చేయడం లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం సేకరణ ప్రారంభించే నాటికి సగం ధాన్యం అమ్మకాలు పూర్తయిపోతుంటాయి. జిల్లాలో సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే ప్రభుత్వం కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించింది. అంటే పండిన ధాన్యంలో సగం ప్రైవేటు వ్యాపారులే కొనుగోలు చేసినట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రబీ సీజన్లో కూడా అదే పరిస్థితి నెలకొననుందని రైతులు ఆరోపిస్తున్నారు. -
నారికేళం.. వేళాకోళం!
● యుద్ధం పేరుతో జిల్లాలో ధరకు కోత ● గత నెలలో రూ.20 వేలు ఉండగా నేడు రూ.13 వేల నుంచి రూ.14 వేలు ● ఇష్టారాజ్యంగా దళారుల వ్యవహారం ● మండిపడుతున్న కొబ్బరి రైతులు సాక్షి, అమలాపురం/అంబాజీపేట: బోడి గుండుకు.. మోకాలికి ముడి పెట్టడం అంటే ఇదే. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి వనామీ రొయ్యల ధరలను తగ్గించినట్టుగానే తాజాగా దళారులంతా ఏకమై కొబ్బరి కాయ ధరలు తగ్గించేశారు. శుభకార్యాలు.. పండుగలు లేవంటూనే... మరో వైపు యుద్ధ ప్రభావం వల్ల ఇతర దేశాలకు ఎగుమతులు నిలిచాయంటూ ధరలకు కోత పెట్టారు. వారం రోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి కొబ్బరికాయల ధరను రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు తగ్గించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో కొబ్బరి కాయల ధరలు గణనీయంగా తగ్గాయి. వెయ్యి కొబ్బరికాయల ధర (పచ్చికాయ, నీటికాయ) ప్రస్తుతం రూ.13 వేల నుంచి రూ.14 వేలు పలుకుతోంది. యుద్ధం ప్రారంభానికి ముందు దీని ధర రూ.16 వేల నుంచి రూ.17 వేల వరకు ఉండేది. యుద్ధం పేరుతో ఏకంగా రూ.మూడు వేల వరకు కోత పెట్టారు. గత నెలలో ఇవే రోజులలో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.19 వేల నుంచి రూ.20 వేల వరకు పలికేది. దానితో పోల్చుకుంటే వెయ్యి కాయలకు రూ.ఆరు వేలు తగ్గినట్టు అంచనా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతుండగా, ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఏడాదికి సగటున 91 కోట్ల కొబ్బరి కాయల దిగుబడిగా వస్తోంది. మొత్తం మార్కెట్ పచ్చికొబ్బరి కాయ ధర మీదనే ఆధారపడుతోంది. కొబ్బరి కాయ ధర గత ఏడాది కొంత వరకు ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొబ్బరికి మంచి ధర వచ్చింది. పండగలు పూర్తయినా శుభ కార్యక్రమాలు జరుగుతున్నందున కొబ్బరికి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ ఉమ్మడి తూర్పు నుంచి రోజుకు 70 లారీల వరకు పచ్చి కొబ్బరి ఎగుమతి అవుతోంది. అయినా యుద్ధాన్ని బూచిగా చూపి దళారులు ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు. అయితే గత నెలతో పోల్చుకుంటే గుజరాత్, మహారాష్ట్రాలకు పచ్చి కొబ్బరికాయ ఎగుమతులు తగ్గాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. వేసవి సీజన్ ఆరంభం అవుతుండడంతో కొబ్బరి బొండాలకు డిమాండ్ వస్తోంది. కోనసీమ జిల్లా నుంచి ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, తూర్పు గోదావరి జిల్లాలోని చాగల్లు, దేవరపల్లి, కొవ్వూరు, కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి కొబ్బరి బొండాల రవాణా పెరిగింది. ఇక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ, గుంటూరుకు బొండాల ఎగుమతి జోరందుకున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎగుమతులు మరింత పెరుగుతాయి. పండగలు లేకపోవడం వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు తగ్గినా ఆ లోటును కొబ్బరి బొండాలు తీరుస్తాయి. ఈ విధంగా చూసినా ఇప్పుడు యుద్ధం సాకుతో ధరలు తగ్గించడాన్ని చూసి రైతులు మండిపడుతున్నారు. కురిడీ ధరలు రివర్స్ కొబ్బరి పచ్చికాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. గత నెలలో కురిడీ కొబ్బరి పాతకాయ గండేరా (పెద్దకాయ) వెయ్యి కాయల ధర రూ.31,500, గటగట (చిన్నకాయ) ధర రూ.29 వేల వరకు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.25 వేలకు, గటగట రూ.22 వేలకు తగ్గింది. ఇక కొత్తకాయ కురిడీ గత నెలలో గండేరా రూ.25 వేలు, గటగట రూ.22 వేలు ఉండగా, ఇప్పుడు గండేరా రూ.24 వేలు, గటగట రూ.21 వేలకు తగ్గింది. కొబ్బరి కాయతో పాటు కురిడీ కొబ్బరి ధరలు కూడా తగ్గడంతో అంబాజీపేట కొబ్బరి మార్కెట్లో నిరుత్సాహ వాతావరణం అలముకొంది. -
ప్రభుత్వ ఆస్తులను కాపాడండి
మంత్రి నారాయణకు సీపీఐ వినతి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తాజ్ హోటల్ పేరుతో కాకినాడలో ప్రభుత్వ స్థలం కాజేస్తున్నారని వెంటనే జీవో నంబర్ 17 రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణకు కలెక్టరేట్లో సోమవారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ టూరిజం శాఖ ఇంత దిగజారి రాజకీయాలు చేస్తుందని అనుకోలేదని మధు పేర్కొన్నారు. అసలు తాజ్ హోటల్ నిర్మాణమే ఇక్కడ లేదని, ఇప్పటివరకు తాజ్ హోటల్ ఒక ప్రకటన కూడా విడుదల చేయలేదని, ఇదంతా టూరిజం ఆడుతున్న నాటకమన్నారు. కోట్లాది రూపాయల విలువైన ఇన్ని ఎకరాలు భూమిని రాజకీయ స్వప్రయోజనం కోసం కేటాయించి ప్రభుత్వ రాయితీలు ఇవ్వడం మరీ ఘోరమన్నారు. టూరిజం శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 17 రద్దయ్య వరకు సీపీఐ పోరాటం ఆగదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్యను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు తోకల ప్రసాద్, కేశవరపు అప్పలరాజు పాల్గొన్నారు. న్యాయసేవలు వినియోగించుకోండి కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ (సీనియర్ సివిల్ జడ్జి) ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కాకినాడ స్పెషల్ సబ్జైలును సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆర్యోగ పరిస్థిఽతులు, వసతులు, భోజనం ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్స్, సేవలపై అడిగి తెలుసుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు మాట్లాడుతూ మాకు కేసులో రెండు షూరిటీలతో బెయిల్ అనుమతి వచ్చిందని, రెండు షూరిటీలు పెట్టుకునే స్థామత లేదని ఒక్క షూరిటీకి అనుమతి ఇప్పించాలని అడిగారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ ఎం.వీరబాబు, సబ్జైలు డిప్యూటీ జైలర్ జోసఫ్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
డీసీసీబీని లాభాల బాట పట్టించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): డీసీసీబీని లాభాల బాటలో నడిపించేలా సహకార సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు కోరారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ 131వ మహాజన సభ సోమవారం స్థానిక జీ కన్వెన్షన్ హాల్లో జరిగింది. అధికారులు బినానీ రుణాలు ఇస్తే దానికి సహకార సంఘ అధ్యక్షులు సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నా బార్డు రుణాలు ఇవ్వడం లేదని కేవలం ఆప్కాబ్ ఇచ్చే రుణాలు రైతులకు ఇస్తున్నామన్నారు. డీసీసీబీలో 298 సహకార సంఘాలు ఉండగా వీటిలో 263 సంఘాల్లో ఓవర్ డ్యూలు పెరిగిపోయాయన్నారు. వీటిలో రూ.939 కోట్ల ఓవర్ డ్యూ ఉందన్నారు. ఓవర్ డ్యూలు ఉంటే ఆప్కాబ్ కూడా అప్పులు ఇవ్వడం మానివేస్తుందన్నారు. డీసీసీబీ ఇన్చార్జ్ సీఈఓ ప్రవీణ్ కుమార్ అజెండాలోని అంశాలను వివరించగా సొసైటీల అధ్యక్షులు సమ సందేహాలను తీర్చాలని పట్టుబట్టారు. సహకార సంఘాల్లో బినామీ పేరుతో భూములు కూడా లేకుండా రుణాలు ఇవ్వడంతో ప్రస్తుతం ఆ రుణాలు తాము రికవరీ చేయలేకపోతున్నామని పలువురు సహకార సంఘం అధ్యక్షులు వాపోయారు. ఈ రుణాలు ఇచ్చే విషయంలో అధికారులు పాత్ర కూడా ఉందని మండిపడ్డారు. -
షర్మిల ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మ
– వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణికాకినాడ రూరల్: రాజకీయ ఉనికి కోసం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మ అవతారం ఎత్తారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఎద్దేవా చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని అంతర్గత వ్యవహారానికి సంబంధించిన లేఖ తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీలో ముందుగా ప్రత్యక్షమవడాన్ని చూస్తుంటే షర్మిల తన రాజకీయ అవసరాల కోసం కుటుంబాన్ని బజారున పడేశారన్నది స్పష్టం అవుతోందన్నారు. రాజకీయాల్లో మాట తప్పని నైజం ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన బాటలో కుమారుడు జగన్మోహన్రెడ్డి పయనిస్తుంటే అదే కుటుంబం నుంచి వచ్చిన షర్మిల మాత్రం దిగజారుడు రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబానికి ఉన్న చరిష్మాను, పరువును షర్మిల మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ను నేరుగా ఢీకొట్టలేని కూటమి ప్రభుత్వం మహిళలను అడ్డం పెట్టుకుని కుటుంబాల జోలికి వెళ్లడంపై నాగమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని భారతమ్మను లక్ష్యంగా చేసుకుని జనసేన మహిళా కార్యకర్త సుభాషిణి అసభ్య పదజాలంతో దూషించడం సరికాదన్నారు. సభ్యత సంస్కారం లేకుండా ఓ మాజీ ముఖ్యమంత్రి భార్యను దూషించినా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీన్ని బట్టీ కావాలనే పవన్ కళ్యాణ్ సదరు జనసేన వీర మహిళలతో అలా మాట్లాడించారా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. మరోవైపు అంకెల గారడీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రాపకం కోసం సామాన్యులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపాదిత వ్యయానికి రాబడి మధ్య రూ.10, 500 కోట్ల వ్యత్యాసం ఉందని కాగ్ తన నివేదికల్లో స్పష్టం చేస్తున్నా బాబు గారి అంకెల గారడీ మాత్రం ఆగడం లేదన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయుల నియామకాల చేపట్టి ఏం లాభమని ప్రశ్నించారు. అవసరాన్ని బట్టీ కాకుండా తమ జేబులు నింపుకునేందుకు ఉపాధ్యాయుల నియామకాలను చేపట్టారా అన్న అనుమానాన్ని ఆమె వ్యక్తం చేశారు. -
పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్ దగ్ధం
సురక్షితంగా వాహనచోదకులు పి.గన్నవరం: పోతవరం గ్రామ శివారులో ఉన్న బంకు వద్ద ఒక మోటారు సైకిల్ కాలిపోయింది. దానిపై ఉన్న ముగ్గురు ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం సుంకరపాలెం గ్రామానికి చెందిన బాలు అనే విద్యార్థి పదో తరగతి పరీక్షలను అమలాపురం రూరల్ మండలం బండారులంక హైస్కూల్లో ప్రైవేట్గా రాస్తున్నాడు. ఈక్రమంలో సోమవారం జరిగిన సైన్స్ పరీక్షకు ఆ విద్యార్థిని తండ్రి గంగులూరి రాజు, తల్లి జ్యోతి మోటారు సైకిల్పై బండారులంకకు తీసుకువచ్చారు. పరీక్ష రాసిన అనంతరం మోటారు సైకిల్పై స్వగ్రామానికి తిరిగి బయల్దేరారు. పోతవరంలోని బంకు వద్ద పెట్రోల్ కొట్టించుకుని తిరిగి మోటారు సైకిల్ స్టార్ట్ చేస్తుండగా, సీటు కింద నుంచి మంటలు వ్యాపించాయి. దీంతో రాజు మోటారు సైకిల్ను బంకు నుంచి కాస్త ముందుకు తీసుకువెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బంకు సిబ్బంది ఏబీసీ ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. దీంతో అమలాపురం నుంచి వచ్చిన ఫైరింజన్ మంటలను అదుపు చేసింది. మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోవడంతో బాధితుడు రాజు కన్నీటి పర్యంతమయ్యాడు. బంకు వద్ద సరైన ఫైర్ సేఫ్టీ లేదని, నాలుగు ఏబీసీ ఎక్విప్మెంట్స్లో రెండు మాత్రమే పనిచేశాయని, మంటలు ఆర్పేందుకు వాటర్ పైపు కూడా లేదని, దీంతో మోటారు సైకిల్ పూర్తిగా కాలిపోయిందని బాధితుడు రాజు ఆరోపించాడు. -
తప్పు ఎవరిది.. శిక్ష ఎవరికి?
ఫ 18 మంది పురోహితులకు నోటీసులపై వివాదం ఫ దేవస్థానం చైర్మన్, ఈఓలను కలిసిన వైనం అన్నవరం: స్థానిక సత్యదేవుని దేవస్థానం వ్రత విభాగంలో వ్రత పురోహితుడు చేతివాటం ప్రదర్శించి, రూ.రూ.58.39 లక్షలు కాజేసిన వ్యవహారంలో తమ పాత్ర ఉందని దేవస్థానం అధికారులు నోటీసులు ఇవ్వడంపై 18 మంది పురోహితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు ఈఓ వి.త్రినాథరావు ఈ నెల 17న నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వివరాల్లోకి వెళ్తే.. దేవస్థానం వ్రత విభాగంలో పురోహితుల పారితోషికం చెల్లింపు వ్యవహారం చూడాల్సిన ఆ సెక్షన్ గుమస్తా విధులను అనధికారికంగా ఒక పురోహితుడు చాలా ఏళ్లుగా నిర్వహిస్తూ, రూ.58.39 లక్షల అవకతవకలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ సెక్షన్ గుమస్తా, సూపరింటెండెంట్, ఆపై ఏఈఓ, తదితర అధికారులు ఆ పురోహితుడు తయారు చేసిన పారితోషికం బిల్లులపై సంతకాలు చేసేవారు. ఇది ఆసరాగా తీసుకున్న ఆ పురోహితుడు 2024 జనవరి నుంచి 2025 నవంబర్ వరకూ అవకతవకలకు పాల్పడ్డాడు. ఆ పురోహితుడు 18 మంది వ్రత పురోహితులకు వారి పారితోషికం కన్నా సుమారు రూ.25 లక్షలు ఎక్కువగా వారి అకౌంట్లకు జమ చేయించాడు. ఆ తరువాత మీ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయ్యిందని చెప్పి, తిరిగి ఆ మొత్తాన్ని తన అకౌంట్కు జమ చేయించుకున్నాడు. అధికారులు ఈ విషయం గుర్తించి అతడిని నిలదీయడంతో ఆ మొత్తంలో రూ.28 లక్షలు చెల్లించాడు. తరువాత గత డిసెంబర్లో అతను చనిపోయాడు. ఇదిలా ఉంటే అధికారులు తిరిగి రూ.25 లక్షలు కట్టాలని 18 మంది వ్రత పురోహితులకు నోటీసులు ఇచ్చారు. అదనంగా పంపిన మొత్తాన్ని ఆ పురోహితుడికి పంపేశామని వారు ఆధారాలు చూపించారు. అయితే మీరు చెల్లించాల్సింది దేవస్థానానికి తప్ప ఆ పురోహితునికి కాదని దేవస్థానం అధికారులు చెప్పడంతో వారంతా తిరిగి రూ.25 లక్షలు దేవస్థానానికి చెల్లించారు. దీంతో వ్యవహారం ముగిసిపోయిందని అంతా భావించారు. కుమ్మక్కు అయ్యారంటూ.. అవకతవకలకు పాల్పడిన పురోహితునితో కుమ్మక్కు అయ్యారంటూ 18 మంది పురోహితులకు ఈ నెల 17న నోటీసులు ఇవ్వడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరు శనివారం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ను, సోమవారం ఈఓ త్రినాథరావును కలసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ అకౌంట్లలో ఎక్కువ మొత్తం జమ అయిన విషయం వాస్తవమేనని, వెంటనే ఆ పురోహితునికి చెల్లించేశామని, విషయం వెలుగులోకి వచ్చాక తిరిగి దేవస్థానానికి కూడా చెల్లించామని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వారంటున్నారు. చేతివాటం ప్రదర్శించిన పురోహితుడితో కుమ్ముక్కై తమ అకౌంట్లలో ఎక్కువ పారితోషికం జమైనా అధికారులకు తెలపలేదనే అభియోగంపై పురోహితులకు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నోటీసులిచ్చామని ఈఓ త్రినాథరావు తెలిపారు. వారి జవాబులను బట్టి తదుపరి చర్యలు ఉంటాయన్నారు. -
పక్కకు దిగపడి
రోడ్డు దిగబడుతోంది.. ఏ క్షణాన ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన కలిగిస్తోంది. పెదపూడి మండలం చింతపల్లి పరిధిలో ఆర్అండ్బీ రోడ్డు బెర్ములు పెద్ద కాలువలోకి జారిపోతున్నాయి. నిత్యం చింతపల్లి గ్రామం మీదుగా అటు కాండ్రేగుల, కరప, కాకినాడ.. ఇటు రామచంద్రపురం, జి.మామిడాడ గ్రామాలకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలకు గురవుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. –పెదపూడి ఏముందీ బురదే.. నిత్యం రద్దీగా ఉండే గోపాలపట్నం – తొండంగి ప్రధాన రహదారిలో గుంతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోపాలప ట్నం శివారులో భారీ గుంతలు పడ్డాయి. ఇక్కడ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కొద్ది నెలల క్రితం అధికారులు తాత్కాలికంగా మరమ్మతులు చేసినా మళ్లీ మామూలే అయ్యింది. గ్రావెల్, బండ రాళ్లతో టిప్పర్లు వెళ్తుండడంతో కొద్ది రోజులకే ఇలా పాడవుతోంది. రెండు రోజుల క్రితం కొద్దిపాటి చినుకులకే ఇలా బురదగా మారింది. –తొండంగి -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఫ బాలుడి మృతి ఫ ఎనిమిది మందికి గాయాలు కాకినాడ రూరల్: పుట్టిన రోజు వేడుకలో వారంతా సరదాగా గడిపారు.. తిరిగి తమ ఇళ్లకు బయలు దేరారు.. ఈ నేపథ్యంలో అనుకోని ప్రమాదం ఓ బాలుడిని బలి తీసుకుంది. అలాగే మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. కాకినాడ – సామర్లకోట రోడ్డులో ప్రతాప్నగర్ వంతెన వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఇందులో బాలుడు పలివెల అక్షంత్ (10) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి ఆటోలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు 9 మంది ఆటోలో కాకినాడకు వచ్చారు. కాకినాడలో రెండు గదులు అద్దెకు తీసుకుని, అక్కడ వేడుకల అనంతరం వారు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ప్రతాప్నగర్ వంతెన వద్దకు వచ్చేసరికి వారి ఆటోను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సామర్లకోట బళ్ల మార్కెట్ ప్రాంతానికి చెందిన అక్షంత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా, ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వీరబాబు తెలిపారు. -
ఆగని గాండ్రింపులు
ఫ వేములోవలోనే పెద్ద పులి సంచారం ఫ అప్రమత్తంగా ఉండాలని అధికారుల ప్రచారం గంగవరం: పెద్ద పులి ఎక్కడా ఆగడం లేదు.. రోజుకోచోట ప్రత్యక్షమవుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. ప్రస్తుతం గంగవరం మండలంలో దాని జాడలను అధికారులు గుర్తిస్తున్నారు. మూడు రోజులుగా గంగవరం మండలం వేములోవ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు చెబుతున్నారు. శనివారం రాత్రి ఓ ఆవు దూడను హతమార్చింది. సోమవారం పెద్దపులి గంగవరం మండలం వేములోవ రిజర్వు ఫారెస్ట్లోని ఉయ్యాలమడుగు, గొరగుమ్మి, వేములోవ అటవీ ప్రాంతంలోనే సంచరించినట్లు అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు ట్రాకింగ్ ద్వారా పులి సంచారాన్ని కనుగొన్నామని, అటవీ ప్రాంతంలోనే ఉందని ప్రజలు భయాందోళన చెందనవసరం లేదన్నారు. వేములోవ – ఉయ్యాలమడుగు, గొరగుమ్మి అటవీ ప్రాంతంలోనే సంచరిస్తుందన్నారు. బంధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. దీనికోసం శ్రీశైలం నుంచి ప్రత్యేక బృందం వచ్చిందని ఆయన వెల్లడించారు. ప్రజలు రాత్రిళ్లు ఒంటరిగా బయటకు రావొద్దని ప్రచారం నిర్వహించారు. ఫోక్స్పేట ఫారెస్ట్ రేంజర్ పి.శ్రీనివాసరావు, అటవీ శాఖ సిబ్బంది ఉన్నారు. జీడిమామిడి రైతుల్లో గుబులు గంగవరం మండలంలో జీడిమామిడి సాగు చేసే రైతులు ఆ తోటల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆర్డీ పురం, పిడతమామిడి, వడ్డిచెరువు, పెదగార్లపాడు, చినగార్లపాడు, చిన్నంపాలెం, గొరగుమ్మి, లక్కొండ, గంగవరం తదితర గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు జీడి పిక్కలు సేకరించేందుకు వెళ్లడం లేదు. దీంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఫ రూ.20 లక్షల విలువైన ఆభరణాలు మాయం ఫ సామర్లకోటలో సంఘటన సామర్లకోట: స్థానికంగా ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సామర్లకోట అంబటివారి తోటలోని తన ఇంట్లో విశ్రాంత ఉపాధ్యాయురాలు మట్టిపల్లి లక్ష్మీదేవి (82) ఉంటున్నారు. ఈ నెల 13న ఇంటికి తాళం వేసి బంధువులతో కలసి హైదరాబాద్లో పెళ్లికి వెళ్లారు. బంధువులు తిరిగి సామర్లకోట వచ్చినప్పటికీ లక్ష్మీదేవికి జ్వరంగా ఉండడంతో హైదరాబాద్లో ఉండిపోయారు. రోజూ పని మనిషి సాయంత్రం వచ్చి ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుంది. సోమవారం సాయంత్రం ఇంటి ఆవరణ శుభ్రం చేస్తుండగా, ప్రధాన ద్వారం తెరిచి ఉండటం గమనించింది. వెంటనే సమీపంలోని లక్ష్మీదేవి బంధువు వజ్జులు మాస్టారుకు సమాచారం ఇచ్చింది. ఇంటి వద్దకు చేరుకున్న ఆయన దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ ఎ.కృష్ణభగవాన్, ఎస్సై రాజా, క్రైం ఎస్సై కృష్ణారావు, సిబ్బంది సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. సీఐ కృష్ణభగవాన్ హైదరాబాద్లో ఉన్న లక్ష్మీదేవికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 140 గ్రాముల బంగారు, మూడు కిలోల వెండి, రూ.50 వేల నగదు బీరువాలో ఉంచినట్లు ఆమె వివరించారు. దొంగలు సీసీ కెమెరాలు పని చేయకుండా చేసి, ఇంటి తాళాలు బద్దలు కొట్టి బీరువాలోని వెండి, బంగారం, నగదును తస్కరించారు. సుమారు ఏడాది క్రితం తన భర్త వెంకట్రావు చనిపోవడంతో ఆయన పేరున బ్యాంకు లాకరులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఇటీవల ఇంటికి తీసుకువచ్చి బీరువాలో భద్రపరిచినట్లు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి నిమిత్తం కొన్ని బంగారు ఆభరణాలను వెంట తీసుకువెళ్లానన్నారు. వేలిముద్ర నిపుణులు వచ్చి వివరాలు సేకరించారు. బాధితురాలి ఇంటి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆ ప్రాంతానికి వచ్చిన కొత్తవారి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగలను గుర్తించే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దగ్గురలో ముప్పు
ఫ క్షయను నిర్లక్ష్యం చేయొద్దు ఫ సకాలంలో చికిత్సతో వ్యాధి నయం ఫ డాట్స్ థెరపీతో నివారణ సాధ్యం ఫ నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం ఆలమూరు/ రాయవరం: దగ్గరలోనే ముప్పు ఉంది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లొంగదీసుకుంటోంది. క్షయ వ్యాధిని ముందుగా గుర్తించి సకాలంలో చికిత్స చేస్తే నివారణ సాధ్యమవుతోంది. ఈ ప్రాణాంతక ట్యూబర్ క్యులోసిస్ (క్షయ) వ్యాధిని నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. క్షయ (టీబీ) వ్యాధి రహిత సమాజమే లక్ష్యంగా జాతీయ వైద్యారోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. 2028 నాటికి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు డబ్ల్యూహెచ్ఓ తగిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. మంగళవారం ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ట్యూబర్ క్యులోసిస్ అనే సూక్ష్మక్రిమి ద్వారా టీబీ వస్తుందని 1882 మార్చి 24న జర్మనీ శాస్త్రవేత్త రాబర్ట్కాక్ కనుగొన్నాడు. అప్పటి నుంచి ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు ఈ బ్యాక్టీరియా గాలిలో కలసి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ప్రతి లక్ష మంది జనాభాలో 203 మందికి క్షయ వ్యాధి సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 123 గ్రామీణ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 52.86 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇప్పటి వరకూ నమోదైన సుమారు ఐదు వేల కేసులకు సంబంధించి క్షేత్ర స్థాయిలోని ఆరోగ్య, ఆశ సిబ్బంది రోగుల వద్దకు వెళ్లి మందులు సక్రమంగా వాడే విధంగా చైతన్యం నింపుతున్నారు. దీంతో వ్యాధి త్వరితగతిన తగ్గుముఖం పట్టి ఏటా రోగుల సంఖ్య తగ్గుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ గణాంకాలు తెలుపుతున్నాయి. ఇదిలా ఉంటే తూర్పు గోదావరి జిల్లాలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ 2,601 మంది క్షయ బాధితులను గుర్తించారు. ఇందులో 1,780 మంది పూర్తి వైద్యం పొందగా, 821 మంది ఇప్పటికీ చికిత్స అందిస్తున్నారు. 549 మందికి దాతల ద్వారా ఫుడ్ బాస్కెట్ పేరుతో పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో సీబీ నాట్ మిషన్ ఉంది. నమోదవుతున్న కేసుల్లో చాలామందికి డాట్స్ కీమో థెరపీ ద్వారా నయం చేయడం జరుగుతుంది. మూడు రకాలు క్షయ శరీరంలోని ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి మూడు రకాలుగా ఉంటుంది. అందులో ద్రవాల తడితో కూడిన (వెబ్ టైప్) మొదటి రకం కాగా, ఉదరకోశ కండరాలను ముద్దలా చేసే పొడిరకపు (డ్రై టైప్) రెండో రకం, శరీరంలో కంతుల మాదిరిగా సంభవించే (ఒమెంటమ్) మూడో రకంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్షయ వ్యాధికి గురైన వ్యక్తి తుమ్మినప్పుడు కాని దగ్గినప్పుడు కాని నోటి, ముక్కు నుంచి వెలువడే గాలిలోని తుంపర్ల ద్వారా బ్యాక్టీరియా కారకాలతో ఇతరులకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. డాట్ చికిత్స ద్వారా కాని నూతనంగా ప్రవేశపెట్టిన ఎఫ్డీసీ విధానంలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ● వ్యాధి గుర్తింపు ముఖ్యం క్షయ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, వైద్యుల సూచనలు పా టించి పూర్తి కాలం వైద్యం తీసు కుంటే నయం అవుతుంది. ఈ వ్యాధిని గుర్తించకుంటే ఆ రోగి ఏడాదికి 10–15 మందికి వ్యాధిని కలగజేస్తాడు. క్షయ వ్యాధికి అవసరమైన మందులు ప్రతి పీహెచ్సీలో ఉచితంగా అందజేస్తారు. డయాబెటిక్ రోగులతోపాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. –ఎన్.వసుంధర, జిల్లా క్షయ నివారణ అధికారి, రాజమహేంద్రవరం ● నివారణకు ప్రత్యేక చర్యలు క్షయ వ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి సత్వరమే మెరుగైన చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం సమకూర్చిన విలువైన మందులను అందిస్తున్నాం. క్రమం తప్పకుండా ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేసేలా చూస్తుంన్నాం. అలాగే పోషకాహార కిట్లను పంపిణీ చేస్తున్నాం. –ఎం.సుమలత, అడిషనల్ డీఎంహెచ్ఓ, కొత్తపేట వ్యాధి లక్షణాలివే.. క్షయ సోకిన రోగికి రెండు వారాలకు మించి ఎడతెరిపి లేకుండా దగ్గు వస్తుంది. అప్పుడే క్షయగా అనుమానించాలి. సాయంత్రం పూట జ్వరం రావడం, నిద్ర పట్టకపోవడం, ఛాతిలో నొప్పి, బరువు తగ్గడం, ఉమ్మిలో రక్తం పడడం, ఆయాసం, త్వరగా అలసిపోవడం తదితర కారణాలతో రోగి నీరసించిపోతాడు. క్షయ క్రిమి శరీరంలోకి ప్రవేశించిన వెంటనే వ్యాధి రూపం దాల్చదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో వ్యాధి తొందరగా వస్తుంది. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు క్షయ తొందరగా వచ్చే అవకాశం ఉంది. ఎయిడ్స్ వ్యాధికి గురైన వారిలో మూడో వంతు క్షయ వ్యాధితోనే మరణిస్తున్నారు. క్షయ వ్యాధి దగ్గినా, తుమ్మినా, ఉమ్మినా, మాట్లాడిన సమయంలో వ్యాధికారక క్రిములు గాలిలోకి సన్నని తుంపర్లగా బయటకు వస్తాయి. ఈ తుంపర్లను ఆరోగ్యవంతులు శ్వాస ద్వారా పీల్చినప్పుడు క్షయ వ్యాధికి గురవుతారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫ పుట్టిన బిడ్డకు వెంటనే బీసీజీ టీకాను అందించాలి. ఫ దగ్గు వచ్చినప్పుడు నోటికి వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకోవాలి. ఫ వ్యాధి సంక్రమించిన వ్యక్తి నిర్ధేశించిన సమయం వరకూ మందులు వాడాలి. ఫ వ్యాధి సోకిన వ్యక్తి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరికీ పరీక్షలు చేయాలి. -
సేవలకు సుస్తీ
● జిల్లాలో 104 సేవలు అస్తవ్యస్తం ● ద్విపాత్రధారులుగా ఉద్యోగులు ● మందుల కొరత, ఫేక్ ఓపీ ఎంట్రీలు ● అంతంత మాత్రంగా వైద్య పరీక్షలుకాకినాడ క్రైం: డ్రైవర్లే ల్యాబ్ టెక్నీషియన్లు.. డేటా ఎంట్రీ ఆపరేటర్లే (డీఈఓ) ఫార్మసిస్టులు, ఎంఎల్హెచ్పీలే డాక్టర్లు.. కదిలే చికిత్సాలయంగా పేరు పొందిన గ్రామీణ సంచార వైద్యశాల 104లో ఇటువంటి ద్విపాత్రభినయాలు నిత్యకృత్యమయ్యాయి. తగినన్ని నియామకాల్లేవు.. అరకొర మందులు.. కొరగాని వైద్య సదుపాయాలు.. ఉత్తుత్తి డేటాలు, నకిలీ ఎంట్రీలు, ల్యాబ్ టెస్ట్లకు తిలోదకాలు.. కాంట్రాక్ట్ సంస్థ వేధింపులు.. ఉద్యోగులకు ప్రత్యక్ష నరకం వెరసి జిల్లాలో 104 సేవల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. 104 ఎందుకంటే.. గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి ప్రాథమిక స్థాయి వైద్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు ఇవ్వడం, గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహణ, అవసరాన్ని అనుసరించి రోగులను సమీప ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయడం, దగ్గర్లో ఆసుపత్రి సదుపాయం లేని ప్రజలకు, గర్భిణులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్య సంరక్షణ, పర్యవేక్షణకు 104 వాహన సేవలు దోహదం చేస్తాయి. 21 వాహనాలు జిల్లాలో 104 వాహనాలు బఫర్తో కలిపి మొత్తం 21 ఉన్నాయి. ఇవి జిల్లాలోని 410 విలేజ్ హెల్త్ క్లినిక్స్లకు నెలకు రెండుసార్లు చొప్పున వెళ్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సేవలందిస్తారు. సచివాలయం లేదా కమ్యూనిటీ హాళ్లలో ఈ శిబిరాలు నిర్వహిస్తారు. వైద్య సేవల్లో డ్రైవర్, డీఈఓ, ఏఎన్ఎం, ఆశా, ఎంఎల్హెచ్పీ, మెడికల్ ఆఫీసర్, అంగన్వాడీ టీచర్ పాలు పంచుకుంటారు. స్థానిక పీహెచ్సీ నుంచి మెడికల్ ఆఫీసర్ అక్కడకు చేరుకుంటారు. ఉద్యోగుల గగ్గోలు జిల్లాలోని 21 వాహనాల్లో నిబంధనల ప్రకారం 42 మంది సిబ్బంది ఉండాలి. కానీ, సుమారు 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే, ల్యాబ్ టెక్నీషియన్లను (ఎల్టీ) నియమిస్తామని, 20కి పైగా టెస్ట్లు చేస్తామని చెప్పి, ఒక్కో వాహనానికి నెలకు గతం కంటే సుమారు రూ.లక్ష చొప్పున అధికంగా కాంట్రాక్టు సంస్థ ప్రభుత్వం నుంచి వసూలు చేస్తోందని సిబ్బంది చెబుతున్నారు. కాంట్రాక్టు పొంది పది నెలలు గడచినా ఇప్పటికీ ఒక్క ఎల్టీని కూడా నియమించలేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించకపోవడంతో ఉన్నవారు సెలవు పెడితే సేవలు నిలిచిపోవడం సర్వసాధారణమవుతోంది. ప్రత్యేక పరిస్థితుల్లో తాత్కాలికంగా ఎవరో ఒకరిని తీసుకొస్తున్నారు. ఆ రోజుకు వారికిచ్చే మొత్తాన్ని కూడా సెలవు పెట్టిన సిబ్బంది జీతం నుంచే కోత పెడుతున్నారనే ఆరోపణలున్నాయి. క్యాజువల్ లీవ్స్ వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వడం లేదు. సెలవు వాడుకుంటామంటే జీతంలో కోత పెడుతున్నారని సిబ్బంది వాపోతున్నారు. సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏకంగా ఉద్యోగాలు తీసేస్తున్నారని, ఈవిధంగా మూడు నెలల్లో నలుగురిని తొలగించారని చెబుతున్నారు. కాంట్రాక్ట్ సంస్థ అధిపతి మంత్రి నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడని అంటున్నారు. అందువలన లోకేష్ జోక్యం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించి, 104 సేవలకు పూర్వ వైభవం తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. మెడికల్ ఆఫీసర్ల ఎగనామం 104 వాహనాలు వెళుతున్న ప్రతి చోటుకూ స్థానిక మెడికల్ ఆఫీసర్ (ఎంఓ) వెళ్లాలి. కానీ, చాలా మంది ఎంఓలు రాకుండానే వచ్చినట్లు ఫేక్ హాజరు చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రోగులకు ఎంఎల్హెచ్పీలు తమకొచ్చిన వైద్యం చేసి పంపిస్తున్నారు. హెవీ వెహికల్ లైసెన్సు లేని డ్రైవర్లకు వాహనాలను ఇస్తూ 104 సేవలను ప్రమాదంలోకి నెడుతున్నారు. చాలా వాహనాల్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో, ఈసీజీ సహా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం క్లిష్టతరంగా మారింది. ఉక్కపోతతో ఉడికిపోతూ ఎంత త్వరగా పరీక్ష పూర్తవుతుందా, వాహనం నుంచి బయటపడతామా అనే పరిస్థితి నెలకొంది. నిండు గర్భిణుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కొన్ని వాహనాల్లో పరికరాలు లేక వైద్య పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుంటే, కొన్ని వాహనాల్లో అవి ఉన్నా వాడటం లేదు. రెండేళ్లుగా చాలా వాహనాల్లో ఆర్థోస్కోప్ల సీలు కూడా విప్పలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు రోగిని పరీక్షించేందుకు వినియోగించే టార్చ్లైట్లలో కనీసం బ్యాటరీలు కూడా లేని దుస్థితి నెలకొంది.ఫేక్ ఎంట్రీలు! చాలాచోట్ల 104 వాహనాల్లో ఓపీకి రోగులు రాకుండానే వచ్చినట్టు ఫేక్ ఎంట్రీలు చూపుతున్నారనే ఆరోపణలున్నాయి. నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవడానికే ఈ అడ్డదారి తొక్కుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అలాగే, తప్పనిసరిగా చేయాల్సిన క్లోరినేషన్ టెస్ట్ల ఊసే లేదు. స్థానిక సచివాలయ ఇంజనీర్ ఆయా గ్రామాల్లోని వాటర్ ట్యాంకుల్లో నీటిని పరీక్షించి పీహెచ్ విలువలివ్వాలి. వీటిని సంబంధిత పోర్టల్లో 104 డీఈఓ అప్లోడ్ చేయాలి. కానీ, ఈ పరీక్షలు జరగకపోవడంతో చేతికొచ్చిన తప్పుడు విలువలు నమోదు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తప్పుడు లెక్కల ఆధారంగానే ప్రభుత్వం తదుపరి కార్యాచరణ సిద్ధం చేస్తూండటం ఆందోళన కలిగిస్తోంది. -
యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమే
ఏలేశ్వరం: ప్రస్తుతం జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ దేశాలన్నింటికీ నష్టమేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వి.రాంభూపాల్ అన్నారు. యూటీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు అప్పారి వెంకటస్వామి 26వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి స్మారకోపన్యాసం పట్టణంలో ఆదివారం నిర్వహించారు. యూటీఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యాన, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు అధ్యక్షతన ‘అమెరికా యుద్ధోన్మాదం – అంతర్జాతీయ పరిణామాలు’ అనే అంశంపై రాంభూపాల్ ప్రసంగించారు. 23 రోజుల క్రితం మొదలైన ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్, ఆమెరికాలు ఇరాన్పై ఏకపక్షంగా యుద్ధం చేస్తూ సామాన్య ప్రజానీకంపై పెనుభారం మోపుతున్నాయని అన్నారు. ఇరాన్ ఉన్మాద స్థితికి చేరుకుంటే ప్రపంచానికే నష్టమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ, కరోనా ముందు ప్రభుత్వ పాఠశాలల్లో 46 లక్షల మంది విద్యార్థులుండగా ప్రస్తుతం 31.50 లక్షల మంది ఉన్నారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు. తొలుత యూటీఎఫ్ మండల శాఖ భవనాన్ని వెంకటేశ్వర్లు, ప్రసాద్ ప్రారంభించారు. యూటీఎఫ్ సభ్యులకు ఉచిత ఆరోగ్య శిబిరం, వివిధ విభాగాలను ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు కేఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యమ గీతాలు ఆలపించారు. అనంతరం, యుద్ధం ఆపాలంటూ పట్టణంలోని పలు వీధుల్లో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, నగేష్, జిల్లా నాయకులు జట్ల సోమరాజు, కె.రవి, ఆదివిష్ణు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో దళితులపై దాడులు
● దీనికి పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలి ● చంద్రబాబు కేసులన్నీ రీ ఓపెన్ చేయిస్తాం ● జడ శ్రావణ్ కుమార్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దళిత, బహుజనులపై దాడులు పెరిగిపోయాయని జైభీమ్రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ విమర్శించారు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో దళితులపై అమానుష దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాకినాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. పి.గన్నవరం నియోజకవర్గంలో దళితుని మృతదేహాన్ని తన ఇంటి ముందు నుంచి తీసుకెళ్లకూడదంటూ ఓ వ్యక్తి దురహంకారానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలలో మార్పు తెస్తానని చెప్పి, ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ కల్యాణ్ అదే ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై ఇప్పటి వరకూ ఎటువంటి కేసులూ నమోదు కావడం లేదని చెప్పారు. అప్పుడే శిక్షించి ఉంటే.. పిఠాపురం మండలం మల్లాం సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించి ఉంటే ఉప్పాడ కొత్తపల్లిలో మరో సంఘటన జరిగి ఉండేది కాదని శ్రావణ్ కుమార్ అన్నారు. ఇలా శిక్షలు పడనందువల్లనే దళితులపై దాడులు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. వీటన్నింటి వెనుక పవన్ కల్యాణ్ హస్తం ఉందని ఆరోపించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో హెడ్మాస్టర్, ఇన్చార్జ్ హెడ్మాస్టర్ ఎస్సీ పిల్లలను అనేక ఇబ్బందులకు గురి చేసినా.. ఆ పిల్లల తల్లిదండ్రులు రోజుల తరబడి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా కేసు నమోదు చేయకుండా సీఐ క్లీన్చిట్ రిపోర్టు ఇవ్వడాన్ని శ్రావణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఎస్సీ, ఎస్టీ కేసులను డీఎస్పీ స్థాయి అధికారి విచారించాలని, సీఐ కాదని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకే న్యాయం చేయని పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని ప్రజలకు ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు. తల్లిదండ్రులు రాజీ పడితే తానేమీ చేయలేనని, నిలబడితే కేసును ఎంతవరకూ అయినా తీసుకువెళ్తానని చెప్పారు. వారు కోర్టుకు రావాల్సి ఉంటుంది జిల్లా కలెక్టర్ పిఠాపురం నియోజకవర్గానికి కలెక్టర్లా వ్యవహరిస్తున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. జిల్లాలో ఎక్కడ దళితులపై దాడులు జరుగుతున్నా కేసులు నమోదు కాకుండా చూస్తున్నారని, త్వరలో కలెక్టర్, ఎస్పీ కూడా హైకోర్టుకు రావాల్సి ఉంటుందని అన్నారు. దళితులపై దాడులు జరుగుతూంటే కండిషన్ బెయిల్ ఇప్పించే పాత్రను వీరు తీసుకుంటున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లు పని చేసే అధికారులకు తిప్పలు తప్పవని అన్నారు. పవన్ మాటలు సిగ్గుచేటు జిల్లాలో 20 మందికి పైగా అగ్ని ప్రమాదంలో చనిపోతే వారికి చెక్కులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకొందని శ్రావణ్ కుమార్ విమర్శించారు. ఒక కుటుంబం పెద్ద వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి తెలియదని అన్నారు. రాష్ట్రంలో 67 శాతం పరిశ్రమలకు పొల్యూషన్కు సంబంధించి అనుమతుల్లేవని, వాటిని తీసుకుని ఫ్యాక్టరీలు నడపాలంటే ఉపాధి కల్పించలేమని అసెంబ్లీలో పవన్ కల్యాణ్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పొల్యూషన్, ఫైర్ శాఖలకు చెరో రూ.10 లక్షలు లంచాలివ్వాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనితపై ఆరోపణలు చేసి రూ.10 కోట్లకు పైగా తన సంపదను పెంచుకున్నారని, కలెక్టర్లకు, ఎస్పీలకు ఫోన్ చేసి కేసులు కట్టవద్దనే స్థాయికి పవన్ కల్యాణ్ దిగజారిపోయారని విమర్శించారు. రెండున్నరేళ్లలో సంవత్సరం కాలం పాటు షూటింగ్లకు కేటాయించిన ఆయన రాష్ట్ర ప్రజలకు ఏ న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దేశంలో ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ షూటింగ్లలో పాల్గొనే ఏకై క వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసులన్నీ రీ ఓపెన్ చేయించే పనిని తమ పార్టీ తీసుకుంటుందని,, దానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభించామని తెలిపారు. గంటకు రూ.కోటి చెల్లించి వాదించే సుప్రీంకోర్టు లాయర్లను చంద్రబాబు తీసుకొస్తున్నారని, తనకు ఎవరైనా ఫర్వాలేదని, చేస్తున్న పాపాల నుంచి ఆయన తప్పించుకునే ప్రసక్తే లేదని అన్నారు. విజయవాడ వరకూ వచ్చి తనను కలవలేని వారెవరైనా సరే కాకినాడలోని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, న్యాయవాది జగ్గారపు మల్లికార్జునను కలవవచ్చని శ్రావణ్ కుమార్ చెప్పారు. పేదల పక్షాన పోరాడటమే తమ పార్టీ లక్ష్యమన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తమ అనుచరులను నియమిస్తామన్నారు. సమావేశంలో జగ్గారపు మల్లికార్జున, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరస సురేష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గిలపు హరీష్, జిల్లా ఉపాధ్యక్షుడు దడాల బాబ్జీ పాల్గొన్నారు. -
ఆ ప్రాభవం..మధు'రాతి'మధురం
పిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్షి్మ.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి ‘పాత రాతి యుగం’ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది. ఆ రుచే వేరు పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది ‘ఆ రుచే వేరు’ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి. అంతా రెడీమేడ్ పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి. గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆరోగ్యానికి మేలు గతంలో రోలు, రోకలి, తిరగలి, రుబ్బురోలు వంటి లేకుండా మనిషి ఆహార అవసరాలు తీరేవి కావు. పొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు కొట్టుకోవడం వంటివన్నీ నిత్య కృత్యాలు. విసరడం, దంచడం, నూరడం వెనుక శారీరక శ్రమ ఉంటుంది. కాబట్టి, వీటిని ఉపయోగించే వారికి మోకాలు, నడుము, భుజాలు, మెడ వంటి నొప్పులు ఉండేవి కావని అంటారు. అలాగే, రక్తపోటు (బీపీ), డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు కూడా చాలా అరుదుగా వచ్చేవి. ఆయా పనిముట్లు ఉపయోగించే వారిలో చేతులు, కాళ్ల మీద కాకుండా పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. దీనివలన గర్భిణులకు సుఖప్రసవం జరుగుతుందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని పాతతరం వారు నమ్ముతారు. రాతి రోళ్లు, తిరగలి వాడకం వల్ల స్త్రీలు 43 సంవత్సరాల తర్వాత వచ్చే మెనోపాజ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే, అధిక బరువుతో బాధ పడేవారికి, కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆధునిక రూపంలో.. రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు. రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు. పెళ్లిళ్లలోనే ప్రాధాన్యం వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకల్లో రాతి రోళ్లకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ప్రతి శుభకార్యానికీ పసుపు కొట్టడం ఆనవాయితీ. వీటితో ధాన్యం దంచడం, కొటా్నలు వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇళ్లల్లో చాన్నాళ్లుగా పక్కన పెట్టేసిన వీటిని శుభకార్యాల్లో మాత్రం తప్పనిసరిగా బయటకు తీస్తారు. కొందరైతే రెడీమేడ్ పనిముట్లతో శుభకార్యాలు పూర్తి చేస్తున్నారు. పెళ్లితంతులను బట్టి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే తాళి»ొట్టును రోకలికి, కాడికి కట్టి, పాలు పోస్తూం చేసే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది. – వెలిది రమేష్ శర్మ, పురోహితుడు, కొత్తపల్లి, కాకినాడ జిల్లా -
ఘనంగా పందిరి రాట ముహూర్తం
అన్నవరం: ఈ నెల 26న ప్రారంభం కానున్న రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామ నవమి వేడుకలకు, వచ్చే నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు శనివారం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయం వద్ద పండితులు విఘ్నేశ్వర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి, మంత్రోచ్చారణల నడుమ ఉదయం 10.25 గంటలకు పందిరి రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు చైర్మన్, ఈఓల కన్నా ముందుగానే పందిరి రాటను ముట్టుకునేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈఓ దంపతుల మధ్య నుంచే ఒక మహిళ చేయిపెట్టి పందిరి రాటను పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే ప్రకటించినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బందిపై ఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు 150 మంది వరకూ దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్నారు. కానీ, ఈ కార్యక్రమం వద్ద కనీసం నలుగురు సెక్యూరిటీ గార్డులు కూడా లేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పొరుగున ఉన్న సింహాచలం, ద్వారకా తిరుమల దేవస్థానాల్లో అత్యంత వైభవంగా జరిగే వైదిక కార్యక్రమాలతో పోలిస్తే అన్నవరంలో కార్యక్రమాలు తూతూమంత్రంగానే నిర్వహిస్తున్నారు. అలా నిర్వహించే కార్యక్రమాల్లో కూడా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయకపోవడం మరింత విమర్శలకు తావిస్తోంది. -
రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోనూ శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో ఒక్క వ్రతాల విభాగం ద్వారానే రూ.20 లక్షలు రాగా, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలతో ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ సమస్యలు పరిష్కారానికి ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సత్యదేవుని దర్శించిన చీనాబ్ రైల్వే బ్రిడ్జి ఇంజినీర్ ˘ అన్నవరం: జమ్మూ కశ్మీర్లో చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ–బెంగళూరు) ప్రొఫెసర్ గాలి మాధవీలత తన కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రొఫెసర్ మాధవీలతను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. జేఎన్టీయూలో విద్యాభ్యాసం మాధవీలత కాకినాడ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో 1992లో బీటెక్, తరువాత వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో ఎంటెక్ చదివారు. ఐఐటీ మద్రాస్లో సివిల్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ చేశారు. తరువాత ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తూనే బెంగళూరు ఐఐఎస్సీలో డాక్టోరియల్ రీసెర్చ్ చేశారు. అనంతరం మెకానిక్స్ ఆఫ్ సోయిల్ అండ్ గ్రౌండ్ ఎన్ఫోర్స్మెంట్లో పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీనాబ్ నదిపై వంతెన నిర్మించేందుకు అక్కడి నేల, కొండల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ తరువాత ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకూ మాధవీలత అక్కడే ఉండి పర్యవేక్షించారు. -
సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సి వస్తోంది
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాజకీయాల్లో సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి దాపురించిందని మాజీ శాసనసభ ఉప సభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ‘మహాపురుషుడు మండలి’ నాటకంతో పాటు ఆంధ్ర విశ్వ విద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ కె.మలయవాసినికి దంటు భాస్కరరావు జీవిత సాఫల్య పురస్కార ప్రదాన కార్యక్రమంలో ఆయన శనివారం గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివిసీమ గాంధీగా పేరొందిన తన తండ్రి, మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు సాధారణ కార్యకర్తగా, ఎన్నికలకు డిపాజిట్ కట్టలేని పరిస్థితిలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరావు పిలిచి మరీ బందరు టికెట్టు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, నేడు ప్రజాస్వామ్యంలో సీట్లు, ఓట్లు కొనుక్కోవాల్సి రావడం బాధాకరమని అన్నారు. తాను నాలుగోసారి ఎమ్మెల్యేనయ్యానని, ఈ విషయంలో ప్రతి రోజూ బాధ పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష, సాహిత్యానికి విశేష కృషి చేసిన శ్రీకృష్ణదేవరాయలు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. రాజరాజ నరేంద్రుడు తన పాలనలో రాజ్యంలో అశాంతి ఉన్నప్పటికీ తెలుగు భాష అభ్యున్నతికి పాటు పడ్డారని బుద్ధప్రసాద్ చెప్పారు. -
పాత రాతియుగం
● రాతి పనిముట్లకు తగ్గుతున్న ఆదరణ ● శుభకార్యాలకే పరిమితమవుతున్న రోళ్లు, సన్నికల్లు, తిరగళ్లు ● ఆధునికత మేళవింపుతో అక్కడక్కడా అమ్మకాలుపిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి ‘పాత రాతి యుగం’ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది. ఆ రుచే వేరు పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది ‘ఆ రుచే వేరు’ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి. అంతా రెడీమేడ్ పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి. గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఆరోగ్యానికి మేలు గతంలో రోలు, రోకలి, తిరగలి, రుబ్బురోలు వంటి లేకుండా మనిషి ఆహార అవసరాలు తీరేవి కావు. పొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు కొట్టుకోవడం వంటివన్నీ నిత్య కృత్యాలు. విసరడం, దంచడం, నూరడం వెనుక శారీరక శ్రమ ఉంటుంది. కాబట్టి, వీటిని ఉపయోగించే వారికి మోకాలు, నడుము, భుజాలు, మెడ వంటి నొప్పులు ఉండేవి కావని అంటారు. అలాగే, రక్తపోటు (బీపీ), డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక రోగాలు కూడా చాలా అరుదుగా వచ్చేవి. ఆయా పనిముట్లు ఉపయోగించే వారిలో చేతులు, కాళ్ల మీద కాకుండా పొట్ట మీద ఒత్తిడి పడుతుంది. దీనివలన గర్భిణులకు సుఖప్రసవం జరుగుతుందని, తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని పాతతరం వారు నమ్ముతారు. రాతి రోళ్లు, తిరగలి వాడకం వల్ల సీ్త్రలు 43 సంవత్సరాల తర్వాత వచ్చే మెనోపాజ్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే, అధిక బరువుతో బాధ పడేవారికి, కచ్చితంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆధునిక రూపంలో.. రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు. రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు. ఇళ్ల వద్ద మూలకు చేరిన రాతి రోళ్లు నాపరాతితో తయారు చేసిన స్మార్ట్ రుబ్బురోలు స్మార్ట్ రాతి పరికరాలు -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైయున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,875, అన్నదాన విరాళాలు రూ.84,972, కేశఖండన ద్వారా రూ.6,760, తులాభారం ద్వారా రూ.550, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.22,095 కలిపి మొత్తం రూ.3,54,147 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. ఏడు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు. -
మూల్యాంకనానికి సర్వం సిద్ధం
● నేటి నుంచి ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ● కాకినాడ పీఆర్ జూనియర్ కళాశాలలో నిర్వహణబాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఆదివారం ప్రారంభం కానుంది. దీనికి కాకినాడ బాలాజీచెరువు సెంటర్ వద్ద ఉన్న పీఆర్ జూనియర్ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన ద్వారంతో పాటు మూల్యాంకనం జరుగుతున్న అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు ఎగ్జామినర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ అధికారులు స్పష్టం చేశారు. 1.57 లక్షల జవాబు పత్రాల చేరిక ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు సంబంధించి 1.57 లక్షల జవాబు పత్రాలు మూల్యాంక నం కోసం జిల్లాకు చేరాయి. మరో 20 వేలు వచ్చే అవ కాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మూల్యాంకనం రెండు విడతల్లో నిర్వహిస్తారు. మొదటి విడత ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ, రెండో విడత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. ఒక్కో ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ఈ మూల్యాకనం కోసం అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 110 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 83 మంది స్క్రూటినైజర్లు, 15 మంది ఏసీఓలను నియమించారు. స్పాట్ క్యాంపు ఆఫీసర్గా ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి (ఆర్ఐఓ) వ్యవహరిస్తారు. జనరల్–1, జనరల్–2, సీసీఓ–1, సీసీఓ–2గా పలు ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు వ్యవహరిస్తారు. అలసత్వం వహిస్తే చర్యలు మూల్యాంకన విధులకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా హాజరు కావాలి. ఈ అధ్యాపకులను ఆయా కళాశాలల నుంచి రిలీవ్ చేయాలని ప్రిన్సిపాల్స్ను ఆదేశించాం. మూల్యాంకన కేంద్రంలోకి సెల్ఫోన్ అనుమతి లేదు. పేపర్ల దిద్దుబాటులో అలసత్వం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎంతటి వారికై నా చర్యలు తప్పవు. – వి.కేశవరావు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి, కాకినాడ -
● ఈద్ ముబారక్
పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల అనంతరం జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరు తూ మసీదుల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. సంపాదించిన దానిలో పేదలకు కొంత దానధర్మాలు చేయాలని, అలా చేసే వారి పట్ల అల్లాహ్ దయ ఎన్నటికీ ఉంటుందని చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకే వద్ద ఈద్గా మైదానంలో వేలాదిగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో దువా నిర్వహించారు. మెయిన్ రోడ్డు లోని పెద్ద జామియా మసీదు ఇమామ్ అబ్దుల్ రజా క్ రిజ్వీ ఈద్ నమాజ్ నిర్వహించారు. ఆయనను నూరానీ జమాల్ తనయుడు బేర్ తరఫున నూరానీ కమిటీ సభ్యులు రెహ్మన్ఖాన్, లతీఫీఖాన్లు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జామియా మసీద్ అధ్యక్షులు ఎస్ఏ జాజుద్దీన్, ప్రముఖ న్యాయవాదులు ఎస్కే మొహీద్దీన్, జవహర్ ఆలీ, ప్రముఖ వ్యాపారులు అలీషా తదితరులు పాల్గొన్నారు. – బోట్క్లబ్ (కాకినాడ సిటీ) -
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు
కాకినాడ రూరల్: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ హెచ్చరించారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో బియ్యం గోదాములు, చెక్ పోస్టులను శనివారం ఆయన తనిఖీ చేశారు. పోర్టు ఏరియాలోని మొత్తం 29 గోదాములను ఆయన తనిఖీ చేశారు. తొలుత బొంబాయి కాటా వద్ద ఉన్న చెక్పోస్టును, గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం స్టాక్ వివరాలు, రవాణా రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఎలాంటి అక్రమాలు జరిగినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరగకుండా అధికారులు నిఘా ఉంచాలని ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మురం చేశామని, గోదాముల నిర్వహణ పారదర్శకంగా ఉండాలని అన్నారు. దాడుల్లో ఆర్డీఓ మల్లిబాబు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై రద్దీ
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శుక్రవారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరి పైన, పలు ప్రాంతాల్లోను గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తు లు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, క్యూలు, వ్రత మండపాలు కిటకిటలాడాయి. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. శని, ఆదివారాలు కూ డా రత్నగిరిపై రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో సుమారు 50 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. -
కాస్త మారిస్తే బెటర్
వనదుర్గ అమ్మవారి ఆలయం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో.. రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో నెల రోజుల కిందట ఖడ్గమాల పూజకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో ఈ పూజలను గత నెల 20న ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకూ ఈ పూజలు నిర్వహిస్తున్నారు. దుర్గా మాతకు చేసే ఖడ్గమాల పూజ చాలా విశిష్టమైనది. విజయవాడ దుర్గ గుడిలో ఈ పూజను చాలా విశేషమైనదిగా భావిస్తారు. అదే స్ఫూర్తితో అన్నవరం దేవస్థానంలో వనదుర్గ అమ్మవారి ఆలయంలో దీనిని ప్రవేశపెట్టారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ పూజ గురించి చేస్తున్న ప్రచారానికి తగిన రీతిలో దేవస్థానంలో ఏర్పాట్లు లేవన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. ఇవీ విమర్శలు సాధారణంగా ప్రతి పూజలోనూ భక్తులను స్వామి, అమ్మవార్లకు ఎదురుగా కాకుండా పక్కగా కూర్చోబెడతారు. కానీ, ఇక్కడ భక్తులను ఒకరి వెనుక ఒకరిని అమ్మవారికి ఎదురుగా కూర్చోబెట్టి పూజ చేయిస్తున్నారు. దీనివలన ముందున్న వారి పృష్ట భాగం వెనుక కూర్చున్న వారికి కనిపిస్తోంది. వారి వెనుక అమ్మవారి యంత్రానికి పూజ చేస్తూండటం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఇది సరైన విధానం కాదని భక్తులు అంటున్నారు. సత్యదేవుని వ్రతాలాచరించేటపుడు కూడా స్వామివారి చిత్రపటానికి ఎదురుగా కాకుండా పక్కగా భక్తులను వరుసలో కూర్చోబెడతారు. స్వామివారి నిత్య కల్యాణంలో కేవలం విఘ్నేశ్వర పూజ తప్ప మరే పూజా ఉండదు. అర్చకులు చేసే కల్యాణం తిలకించడమే. అందువలన అక్కడ భక్తులను ఎదురుగా కూర్చోబెడతారు. ఖడ్గమాల పూజలో మాత్రం యంత్రానికి సుమారు 45 నిమిషాల పాటు కుంకుమ పూజ చేయిస్తారు. ఖడ్గమాల పూజ టికెట్టు రూ.1,116. ఇంత మొత్తం తీసుకుంటున్న దేవస్థానం భక్తులు కూర్చునేందుకు కనీసం సరైన చాపలు కూడా వేయడం లేదు. చిరిగిన చాపలు వేస్తున్నారు. దీనికి బదులు దంపతులు కూర్చునేందుకు చిన్న తివాచీలు వేయొచ్చు. ఒక తివాచీ ఖరీదు సుమారు రూ.వెయ్యి ఉంటుంది. ఒకసారి కొంటే కనీసం నాలుగేళ్లు ఉపయోగపడుతుంది. కానీ, ఎందుకనో ఆ చాపలతోనే సరిపెడుతున్నారు. ఇంకో విచిత్రం ఏమిటంటే అమ్మవారి ఆలయంలో ఒక మూల పరుపులు గుట్టగా ఉంటున్నాయి. ఎవరైనా దేవస్థానం సిబ్బంది కానీ, వీఐపీలు కానీ పూజకు వస్తే ఆ పరుపులను వారికి వేస్తున్నారు. సామాన్య భక్తులు రూ.1,116 టికెట్టు తీసుకున్నా సరే వారికి చాపలే గతి. పూజ చేయించుకునే భక్తులకు రెండు పళ్లాలు ఇస్తున్నారు. ఒక పళ్లెంలో యంత్రంపై కుంకుమ పూజ, ఇంకో పళ్లెంలో పూజాద్రవ్యాలు ఉంచుతున్నారు. చివరిలో పులిహోర ప్రసాదం తెస్తే దానిని నేల మీద ఉంచుతున్నారు. దీనికి బదులు భక్తులకు ఇంకో పళ్లెం ఇచ్చి, అందులో ఉంచే ఏర్పాటు చేయాలని భక్తులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ పూజలో పది మందికి మించి పాల్గొనే అవకాశం లేదు. అందువలన మరో పది పళ్లాలు సమకూరిస్తే సరిపోతుంది. ఖడ్గమాల పూజతో పాటు శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం కూడా నిర్వహిస్తారు. అయినప్పటికీ అమ్మవారికి పెద్దగా అలంకరణ ఏమీ చేయడం లేదు. రోజూ ఇచ్చే పూలదండల కన్నా మరో రెండు దండలు మాత్రమే ఇస్తారు. మండపంలో అయితే మామిడి తోరణాలు తప్ప పెద్దగా అలంకరణ చేయడం లేదు. పూజ ఉదయం 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు తప్ప దూర ప్రాంతాల వారు ఆ సమయానికి హాజరయ్యే అవకాశం ఉండటం లేదు. అలాగని రెండో బ్యాచ్కు అవకాశం కూడా లేదు. పూజ సమయాన్ని మార్చడమో లేదా ఉదయం 9 గంటలకు రెండో బ్యాచ్ పూజ ప్రారంభించడమో చేస్తే బాగుంటుంది. ఖడ్గమాల పూజను ఇద్దరు వ్రత పురోహితులు మాత్రమే చేస్తున్నారు. వేద పండితుడు కూడా ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు వేద పండితులు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు లేదా అర్చకులు పూజ పూర్తయ్యేంత వరకూ ఉండేలా చూడాలి. అలాగే, పూజ సమయంలో ఆలయ సిబ్బంది ఎవరూ ఉండడం లేదు. కనీసం సూపరింటెండెంట్ లేదా గుమస్తా అయినా ఆ సమయంలో ఉండాలి. గతంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలకు పెద్దగా భక్తులుండేవారు కాదు. కానీ, 2014 నుంచి ఆ హోమాల పూర్ణాహుతి సమయంలో అప్పటి ఈఓలు కాకర్ల నాగేశ్వరరావు, జితేంద్ర తదితరులు వస్తూండటంతో వారితో పాటు సిబ్బంది కూడా వచ్చేవారు. క్రమంగా ఇది సంప్రదాయంగా మారింది. ఇప్పుడు ఆ హోమాల్లో భక్తులు కూడా విశేష సంఖ్యలో పాల్గొంటున్నారు. ఖడ్గమాల పూజకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఖడ్గమాల పూజ విషయంలో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని, మరింత ప్రచారం చేస్తే ఎక్కువ మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దీనిపై దేవస్థానం వైదిక కమిటీతో ఈఓ సమావేశమై తగు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఖడ్గమాల పూజ నిర్వహణ తీరుపై విమర్శలు టికెట్టు వెయ్యి నూట పదహార్లు చింకిచాపలు, చాలీచాలని పూజా సామగ్రితో సరి ఒకరి వెనుక ఇంకొకరిని కూర్చోబెట్టి పూజలు ఇది సంప్రదాయ విరుద్ధమంటున్న భక్తులు ఉదయం 7.30 గంటలకే ప్రారంభం ఆ సమయానికి హాజరు కాలేకపోతున్న స్థానికేతరులు -
వంటింట.. యుద్ధమంట
● జిల్లావాసులకు గ్యాస్ కష్టాలు ● బ్లాక్లో డొమెస్టిక్ సిలిండర్ల విక్రయాలు ● సామాన్యులకు సకాలంలో అందని దుస్థితి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పశ్చిమాసియాలో మూడు వారాల క్రితం మొదలైన యుద్ధం మన వంటింట్లో మంటలు పుట్టిస్తోంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా గత నెల 28 ప్రారంభించిన ఈ యుద్ధం కారణంగా సామాన్య ప్రజలతో పాటు, హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా కొంత మంది గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు.. అక్రమాలకు తెర లేపుతూ గ్యాస్ కొరతను క్యాష్ చేసుకుంటున్నారు. గృహ వినియోగదారులకు ఇవ్వాల్సిన డొమెస్టిక్ సిలిండర్లను దొడ్డిదారిన అధిక ధరకు కొంత మంది హోటల్ నిర్వాహకులకు విక్రయిస్తున్నారు. దీంతో, సామాన్యులు సకాలంలో వంట గ్యాస్ దొరకక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొరతతో ఇక్కట్లు జిల్లావ్యాప్తంగా 45 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో 6.5 లక్షలకు పైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లా గుమ్మళ్లదొడ్డి, కాకినాడ పోర్టు నుంచి ప్రతి రోజూ ఆయా కంపెనీల గ్యాస్ సిలిండర్లు జిల్లాకు సరఫరా అవుతూంటాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ప్రతి రోజూ 12 వేలకు పైగా సిలిండర్ల వినియోగం ఉంటుంది. ఆ మేరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వంట గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కూడా స్పష్టం చేస్తున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా మండల కేంద్రాల్లో గ్యాస్ సక్రమంగా లభించడం లేదని గృహ వినియోగదారులు వాపోతున్నారు. యుద్ధానికి ముందు బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లో గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేది. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. బుక్ చేసుకుని రోజులు గడుస్తున్నా సిలిండర్ ఇవ్వకపోవడంతో ఆయా గ్యాస్ ఏజెన్సీల వద్దకు క్యూ కడుతున్నారు. పట్టణ ప్రాంతాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో సైతం వినియోగదారులు చాలా ఏళ్లుగా వంటకు పూర్తిగా గ్యాస్ సిలిండర్ల పైనే ఆధారపడ్డారు. వారికి గృహ వినియోగదారులకు దాదాపు నెలకో సిలిండర్ అవసరమవుతుంది. కానీ, ప్రస్తుతం పట్టణాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో, గ్యాస్ అయిపోయిన వెంటనే సిలిండర్ దొరకక వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దొడ్డిదారిన హోటళ్లకు.. జిల్లా కేంద్రమైన కాకినాడలో ఫైవ్ స్టార్ హోటల్తో పాటు 20కి పైగా భారీ రెస్టారెంట్లు, సుమారు వెయ్యి హోటళ్లు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్నచిన్న హోటళ్లు మరో 2 వేలకు పైగా ఉన్నాయి. దీనికి తోడు ఇంటి వద్ద ఇడ్లీ, దోశలు వేసుకునే అమ్మేవారు మరో 700 మందికి పైగా ఉన్నారు. సుమారు 1,800 నుంచి 2,500 వరకూ టీ స్టాల్స్ ఉన్నాయి. రోడ్డు పక్కన తోపుడుబండ్ల మీద న్యూడిల్స్ పాయింట్లు, పకోడీ బండ్లు 300 పైనే ఉన్నాయి. ఒక్క స్టార్ హోటల్లోనే రోజుకు 10కి పైగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తారు. రెస్టారెంట్లలో నిత్యం 6 నుంచి 8 సిలిండర్లు అవసరం. యుద్ధం మొదలైన తరువాత గ్యాస్ కొరత తలెత్తడంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఇదే అదునుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాకినాడతో పాటు జిల్లాలోని సామర్లకోట, పిఠాపురం, తుని, గొల్లప్రోలు, జగ్గంపేట తదితర మండలాల్లోని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు సరఫరా నిలిపివేయడంతో హోటల్ నిర్వాహకులు అడ్డదారిలో డొమెస్టిక్ గ్యాస్ కొనుగోలు చేస్తున్నారు. వారికి కొన్ని గ్యాస్ ఏజెన్సీలు డొమెస్టిక్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి తెర లేపుతున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.958 కాగా, వీటిని కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు హోటళ్ల యజమానులకు రూ.2,500 వరకూ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అవస్థలు గ్యాస్ కొరత ప్రభావం విద్యార్థులు, నిరుద్యోగులపై కూడా పడుతోంది. దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు కాకినాడ వచ్చి, వివిధ కోచింగ్ సెంటర్లలో ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి వస్తున్న వీరు స్థానికంగా ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వీరితో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు కూడా కాకినాడలోని వివిధ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. వంటలు చేసుకునే సమయం ఉండకపోవడంతో వీరందరూ స్థానికంగా ఉన్న చిన్న హోటళ్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం బిర్యానీ, న్యూడిల్స్ వంటివి తింటూంటారు. పలు కోచింగ్ సెంటర్లు, విద్యా సంస్థల సమీపాన ఉన్న చిన్నచిన్న క్యాంటీన్లు, హాస్టళ్లలో నెలవారీగా టోకెన్లు తీసుకుని భోజనాలు చేస్తూంటారు. గ్యాస్ కొరత కారణంగా వీటిని మూసివేయడంతో వీరందరూ అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో టిఫిన్లు, భోజనాలు దొరుకుతున్నా రేట్లు అమాంతం పెంచేశారు. సాధారణ రోజుల్లో రూ.20కి ఇచ్చే టిఫిన్ ధర ప్రస్తుతం రూ.30కి పెంచారు. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు సైతం సాధారణ రోజులతో పోల్చితే రూ.20 అధికంగా వసూలు చేస్తున్నారు.ప్రజలపై భారం పడకుండా చూడాలి యుద్ధం నేపథ్యంలో సాధారణ, మధ్య తరగతి ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే డొమెస్టిక్ సిలిండర్ ధరను ప్రభుత్వం రూ.60 పెంచేసింది. ఇదే ఇబ్బందిగా ఉంటే గ్యాస్ దొరకక ప్రజలు మరిన్ని కష్టాలు పడుతున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్లు మూత పడుతున్నాయి. ఇదే అదనుగా హోటళ్లలో తినుబండారాల రేట్లు పెంచేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. పరిస్థితిని చక్కదిద్దాలి. – దూసర్లపూడి రమణరాజు, కన్వీనర్, కాకినాడ పౌర సంక్షేమ సంఘం చిన్న హోటళ్లపై ప్రభావం మరోవైపు పలు ప్రాంతాల్లో చిన్న హోటళ్లు, రోడ్డు పక్కన ఆహార వ్యాపారం చేసే వారిపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక చిన్న రెస్టారెంట్లు, హోటళ్లతో పాటు బండ్లపై చేస్తున్న న్యూడిల్స్, పానీపూరి, ఇడ్లీ, పకోడీ వంటి వ్యాపారాలు మూత పడ్డాయి. కాకినాడ విద్యుత్ నగర్, అశోక్ నగర్ గాంధీనగర్, రామారావుపేట, ఆర్టీసీ కాంప్లెక్స్, జగన్నాథపురం వంటి ప్రాంతాల్లో చిన్న హోటళ్లను వారం రోజులుగా తెరవడం లేదు. కొన్ని హోటళ్లలో కట్టెల పొయ్యి, ఊక పొయ్యిలతో పప్పు, సాంబారు, చారుతోనే భోజనాలు వడ్డిస్తున్నారు. పూర్తిగా గ్యాస్ సిలిండర్ పైనే ఆధారపడి టీ విక్రయించే దుకాణాలను కూడా పది రోజులుగా తెరచుకోవడం లేదు. కొన్ని టీ దుకాణాలు తెరచినా.. అధిక రేట్లకు టీ విక్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో టీ రూ.10 కాగా ప్రస్తుతం రూ.15 వసూలు చేస్తున్నారు. -
సత్యదేవునికి వెండి శఠగోపం
అన్నవరం: సత్యదేవునికి ఎన్కే కిరణ్మయి (హైదరాబాద్) తన కుటుంబ సభ్యులతో కలసి గురువారం 810 గ్రాముల బరువు, రూ.1.50 లక్షల విలువైన వెండి శఠగోపం, వెండి పళ్లెం సమర్పించారు. వీటిని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావులకు అందజేశారు. వీటిని స్వామివారి పూజా కార్యక్రమాల్లో ఉపయోగించాలని ఆమె కోరారు. ఆ మేరకు ఈఓ ఆదేశాలు జారీ చేశారు. గోకవరంలో అకాల వర్షం గోకవరం: మెట్ట ప్రాంతమైన గోకవరం మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకూ ఎండ ప్రభావం ఉంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. చల్లటి గాలులు వీయడంతో కొద్ది రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు సేద తీరారు. ఈ భారీ వర్షం కారణంగా మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోయారు. ప్రభుత్వాసుపత్రిలో తాగుబోతు వీరంగంసెక్యూరిటీ గార్డుపై అర్ధరాత్రి కత్తితో దాడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ఓ తాగుబోతు కత్తితో సెక్యూరిటీ గార్డుపై దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల సమక్షంలోనే అతడు దాడి చేస్తూంటే బాధితుడు చేయి అడ్డు పెట్టాడు. దీంతో, అతడి చేయి, తలపై కత్తి వేట్లు పడ్డాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సీటీఆర్ఐకి చెందిన కడగల సూర్యప్రకాశరావు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అతడు బుధవారం రాత్రి డ్యూటీలో ఉండగా.. దేశాబత్తుల చిన్నారావు అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువును చూసేందుకు అక్కడకు వచ్చాడు. అతను పదేపదే రోగి వద్దకు వెళ్లి, వస్తూండటంతో అక్కడ తిరగవద్దని సెక్యురిటీ గార్డు సూర్యప్రకాశరావు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆ రోగి బంధువులు ఆసుపత్రిలో ఫుల్గా మద్యం తాగారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సెక్యూరిటీ గార్డుకు, రోగి బంధువు చిన్నారావుకు మళ్లీ వాగ్వాదం జరిగింది. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆసుపత్రి గేటు బయట ఉన్న చిన్నారావును పిలుచుకు రావాలని వారు సెక్యూరిటీ గార్డుకు చెప్పారు. అతడు వెళ్లి పిలుస్తూండగానే.. ముందుగానే వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో అతడిపై చిన్నారావు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డును వెంటనే ఆసుపత్రిలో చేర్చి వైద్య చికిత్సలు అందించారు. నిందితుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
ఊరించి.. ఉసూరుమనిపించి..
● రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులు 90 వేలు ● గతంలో అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం ● ఇప్పుడు 10 వేల పోస్టులతోనే జాబ్ క్యాలెండర్ ● మండిపడుతున్న నిరుద్యోగులుపిఠాపురం: ‘ఎన్ని పట్టాలు నాకొచ్చినా.. ఒక్క పూట బువ్వ నాకెట్టలే.. ఎంత ఇష్టంగా నే చదివినా నా కష్టమే తీర్చలే.. ఆశతో నేనెంతో చదువుకున్నా.. నిరాశతో నే బతుకుతున్నా..’ అంటూ నిరుద్యోగి ఆవేదనను తెలిపేలా ఓ గాయకుడు పాడిన పాట.. చంద్రబాబు సర్కారు తీరును చూస్తే నిజమనిపించక మానదు. ఉద్యోగం పురుష లక్షణం అనే వారు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం నిరుద్యోగం సీ్త్ర, పురుష లక్షణంగా మారింది. చదువుకోవడం తప్ప ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగ అవకాశాలపై పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప.. కొత్త ఉద్యోగాలివ్వడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇచ్చేది గోరంత.. ప్రచారం కొండంత అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉంది. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఒక ఏడాది గడచిపోగా.. రెండో ఏడాది కేవలం 10 వేల పోస్టులతో అరకొరగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 5.3 లక్షల నిరుద్యోగ సైన్యం ఉగాదికి కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అసెంబ్లీ సాక్షిగా 90 వేలకు పైగా ఖాళీ పోస్టులున్నట్లు ప్రకటించింది. తీరా చూస్తే అన్ని విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. జిల్లా జనాభా 22,47,680. జిల్లావ్యాప్తంగా 5,33,908 కుటుంబాలున్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసినా జిల్లాలో 5.3 లక్షల మందికి పైగానే నిరుద్యోగులున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత మంది నిరుద్యోగులుండగా.. రాష్ట్రమంతటికీ కలిపి కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల హామీ మేరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. కనీసం రూ.3 వేల భృతి వరకే తీసుకున్నా ప్రతి నెలా ప్రభుత్వం రూ.150 కోట్లకు పైగా చెల్లించకపోవడంపై కూడా నిరుద్యోగులు నిరసన గళం వినిపిస్తున్నారు. వలస బాట అటు ప్రభుత్వం వివిధ పోస్టులు భర్తీ చేయకపోగా.. ఇటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలు నామమాత్రంగానే దక్కుతున్నాయి. చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో అనేక మంది తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్, చైన్నై, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవాల్సి వస్తోంది. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు జరగడమే లేదు. వాటిల్లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది గత్యంతరం లేక ప్రైవేటు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర వేతనాలతోనే జీవనం సాగిస్తున్నారు. అన్ని పోస్టులూ భర్తీ చేయాలి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఇప్పుడు అరకొరగా కేవలం 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి అదే గొప్పగా చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. దీని ప్రకారం చూసినా ఇంకా 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టే కదా! ఏళ్ల తరబడి ఉద్యోగాలివ్వకపోవడంతో అనేక మంది జీవితాంతం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ చేయాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ బాబు వచ్చారు.. జాబు పోయింది జాబు కావాలంటే బాబు రావాలని, తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. వలంటీర్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేస్తున్న వారు, ఏపీ ఫైబర్నెట్, ఏపీఎండీసీ కాంట్రాక్టు వర్కర్లు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు, స్కూల్ ఆయాల వంటి వారు వీరిలో ఉన్నారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వలంటీర్లకు రూ.5 వేలు కాకుండా రూ.10 వేలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ల హామీ గాల్లో కలిసిపోయింది. సేవా సారథులుగా నిలిచిన వలంటీర్లను చివరకు రోడ్డు పైకి నెట్టేశారు. -
రత్నగిరిపై కియోస్క్ల ప్రారంభం
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో కరూర్ వైశ్యా బ్యాంక్ సమకూర్చిన కియోస్క్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు గురువారం ప్రారంభించారు. ఈ మెషీన్ల ద్వారా అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను భక్తులు త్వరితగతిన పొందవచ్చని తెలిపారు. వీటిని రోశయ్య మండపం వద్ద, పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి మండపం వద్ద ఏర్పాటు చేశారు. టిక్కెట్లు పొందాలిలా.. కియోస్క్ స్క్రీన్పై భక్తులు తమ ఫోన్ నంబర్ టైపు చేయాలి. అనంతరం అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం సేవలు దర్శనమిస్తాయి. వాటిలో ఏ సేవ కావాలో ఎంచుకుంటే ఎన్ని టికెట్లనే ఆప్షన్ వస్తుంది. దానిపై టిక్ చేశాక ఎంత చెల్లించాలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ ఒక ఫోన్పే నంబర్ కూడా వస్తుంది. ఆ నంబర్కు ఆ మొత్తం ఫోన్పే చేస్తే టికెట్లు వస్తాయి. ఈ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మాత్రం భక్తులకు ఇబ్బంది తప్పదు. అందువలన ఇక్కడ వీటి వినియోగం తెలిసిన ఓ ఉద్యోగిని ఉంచితే మేలనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన మెషీన్ల వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మనమిత్ర అని, దాని ఫోన్పే నంబర్ కనిపిస్తోంది. ఆ నంబర్కు అమౌంట్ పంపిస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. వీటిని అధికారులు సరి చేయాల్సి ఉంది. గేట్లో 84వ ర్యాంక్ సామర్లకోట: పట్టణానికి చెందిన తెలగరెడ్డి సాయి ప్రసన్న కుమార్ గేట్ 2026లో ఆలిండియా 84వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి దుర్గపూర్లో బీటెక్ చదువుతున్నాడు. గతంలో కేఎస్ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రసన్న కుమార్ గేట్లో 84వ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రసన్న కుమార్ తండ్రి వీరభద్రరావు రోజు కూలీగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. తల్లి భూచక్రవేణు గృహిణి. తమ కుమారుడు మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. -
గోదావరి.. కవితా ఝరి
గంగ– రుషుల నది.. యుమున– ప్రేమికుల నది.. కృష్ణ– శిల్పుల నది.. కావేరి– సంగీతకారుల నది అని చెబుతూ.. ప్రముఖ రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అడవి బాపిరాజు గోదావరిని ‘కవుల నది’గా అభివర్ణిస్తారు. వేదంలా ఘోషించే గోదావరి తీరాన.. ఆదికవి నన్నయ నడయాడిన ఈ నేలన.. శతాబ్దాలుగా కవితా ఝరులు పొంగి పొరలుతూనే ఉన్నాయి. పావన గోదారి నీరు తాగి పెరిగిన ఎంతోమంది అక్షర శిల్పులు.. అద్భుతమైన కవిత్వాన్ని సృజించారు. రేపు ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కొంత మంది గోదావరి కవులను చూసొద్దాం రండి..● ఉమ్మడి ‘తూర్పు’న వికసించిన కవితా సుమాలెన్నో.. ● సుప్రసిద్ధ కవులకు ఈ నేల పుట్టినిల్లు ● రేపు ప్రపంచ కవితా దినోత్సవం కపిలేశ్వరపురం: మానవ జీవితంలోని వెలుగునీడల్ని ప్రతిబింబించే కథ, కవిత్వం, నవల, నాటకం.. ఇలా ఏ ప్రక్రియ అయినా సమాజ అభ్యున్నతికి దోహదపడినవే. ప్రకృతి వర్ణనలు, భావావేశపు వెల్లువలు, దేశభక్తి, మానవ సంబంధాలు, ఎవ్వరూ పట్టించుకోని చీకటి కోణాల గురించి ఎంతో మంది కవులు తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపారు. అణువణువునా పావన గోదావరి జలాలతో పునీతమవుతున్న ఈ నేల.. అటువంటి ఎంతో మంది కవులకు జన్మనిచ్చింది. ● 1885 ఫిబ్రవరి 28న పిఠాపురంలో జన్మించిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా, ఆధ్యాత్మిక పీఠం ఆరో పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా పదహారేళ్ల చిరుత ప్రాయంలోనే తత్త్వవేత్తగా, కవిగా గుర్తింపు పొందార. ఆయన కవితలు అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చెందాయి. ● ఐ.పోలవరంలో పుట్టి.. 1947 నుంచి 1974 వరకూ రాజమహేంద్రవరం వీరేశలింగం ఆస్తికోన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా పని చేశారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి. ఒక్క అక్షరం ఎక్కువ, తక్కువ కాకుండా సమపాళ్లలో అక్షరాల పొందికతో కవిత్వాన్ని సృజియించడం ఆయన ప్రత్యేకత. ● పిఠాపురం ప్రాంతంలోని చంద్రపాలెంలో జన్మించిన దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ‘ధనిక సమాజం మారాలనుకోవడమే అభ్యుదయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ఆయన కలం నుంచి ‘మనసున మల్లెల మాలలు, కన్నులలో వెన్నెల డోలలూ’గేటట్లు భావ కవిత్వం అద్భుతంగా జాలువారింది. ‘మావి చిగురు తినగానే కోయిల పలికేనా’, ‘గోరింట పూచింది కొమ్మా లేకుండా’, ‘ఆరనీకుమా ఈ దీపం’, ‘ఆకులో ఆకునై పూవులో పూవునై’ వంటి ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రాశారు. ● మామిడికుదురులో 1911 సెప్టెంబర్ 19న జన్మించిన బోయి భీమన్న ‘కుల, మత, వర్గ విభేద రహితమైన భారతజాతి ఆవిర్భవించాలన్నదే నా ధ్యేయం’ అంటూ సాహిత్య కృషి చేశారు. ● 1865 ఫిబ్రవరి 11న సీతానగరంలో జన్మించిన కవిశేఖరుడు పానుగంటి లక్ష్మీ నరసింహారావు ‘సాక్షి’ పేరిట రాసిన వ్యాసాల ద్వారా నాటి సామాజిక పరిస్థితులను ఎండగట్టారు. ● పిఠాపురానికి చెందిన ఆవంత్స సోమసుందర్– నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటానికి మద్దతుగా ‘వజ్రాయుధం’ పేరిట వెలువరించిన కవితా సంకలనం.. ఓ సంచలనం. ఈ పుస్తకాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందంటే.. ఆయన ఎంతటి పదునైన పదాలతో ఈ కవిత్వాన్ని వెలువరించారో చెప్పనవసరం లేదు. ● రామచంద్రపురానికి చెందిన అదృష్ట దీపక్– ‘మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం’ వంటి సినిమా పాటలతో పాటు, అనేక అభ్యుదయ కవితలను రాశారు. ● కాకినాడకు చెందిన అద్దేపల్లి రామమోహనరావు విప్లవ కవుల ప్రభావంతో అభ్యుదయ కవిత్వానికి పెద్ద పీట వేశారు. సంఘం శరణం గచ్ఛామి, పొగచూరిన ఆకాశం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. ‘శ్రీశ్రీ కవితా ప్రస్థానం’ వంటి సమీక్షా పుస్తకాలు రాశారు. ● ఈ కోవలోనే ర్యాలి ప్రసాద్ వంటి అనేక మంది కవులు అనేక సమస్యలను అక్షరీకరిస్తూ తమ కవితల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపుతున్నారు. ‘అమ్మకు స్వరనీరాజనం’ ● మండపేటలోని సంగమం సాంస్కృతిక వేదిక నిర్వాహకులు చల్లా రవికుమార్ తన తల్లి లక్ష్మి మరణించిన వేళ దశదిన కర్మకాండలకు దూరంగా ఉంటూ ‘అమ్మకు స్వర నీరాజనం’ పేరిట కవితలు, పాటల కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు. ‘భూమిని చీల్చుకునే పుట్టే చెట్టుకు విత్తే కదరా అమ్మ, పురిటి చావుతో యుద్ధం చేసి అమ్మ ఇచ్చును మరుజన్మ’ అంటూ రవికుమార్ స్వయంగా అమ్మపై రాసిన పాటను గాయకుడు సురేష్ నిఖిలం స్వరపరిచారు. ● అలాగే, యుద్ధం ప్రభావాలపై ‘పుడమి గాయం, శోకసంద్రం దీనవదనం దిగులు గగనం! యుద్ధమా! ఇది యుద్ధమా?’ అంటూ నల్లి ధర్మారావు రాసిన గేయానికి రాజమహేంద్రవరానికి చెందిన గాయకుడు సురేష్ స్వరకల్పన చేయగా విశేషంగా ఆదరణ పొందింది. సాహితీ కృషీవలులెందరో.. సాహిత్యాన్ని సృజియించడమే కాదు.. ఆ ప్రవాహం తరువాతి తరానికి కూడా అందించేలా.. ఆ స్ఫూర్తిని కొనసాగించేలా అనేక సంస్థలు నిరంతర కృషి చేస్తున్నాయి. కవి సమ్మేళనాలు, కవుల జయంతులు, వర్ధంతులు, గ్రంథ సమీక్షల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లిపాలెంలోని ఆంధ్రీ కుటీరం, కాకినాడ కేంద్రంగా సాహితీ స్రవంతి, రామచంద్రపురంలో డాక్టర్ చెలికాని రామారావు స్మారక సమితి, మండపేటలో సంగమం సాంస్కృతిక వేదిక, అ.ర.సం వంటి సంస్థలు ఈ కృషిని కొనసాగిస్తున్నాయి. యుద్ధం, కరోనా, మహిళలపై వేధింపులు, వాణిజ్య, వ్యాపారాల ప్రభావం, మానవ వికాసం, విలాపం వంటి అనేక సామాజిక అంశాలపై కవితా గోష్టులు నిర్వహిస్తున్నాయి. కవులు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆలమూరు మండలం సంధిపూడికి చెందిన అంగర గోపాలకృష్ణాచార్యులు (కృష్ణశ్రీ) అంగర లక్ష్మీకాంతం ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట సాహిత్య పుస్తకాలు ముద్రిస్తున్నారు. సామర్లకోటకు చెందిన బసా బలరామకృష్ణ (శ్రమేరా) ‘సాహిత్య సహచరుల వేదిక’, కాకినాడకు చెందిన పెద్దింశెట్టి రామకృష్ణారావు ‘పుస్తకం’ పేరుతోనూ వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తున్నారు. పీడీఎఫ్ రూపంలోని కవితలు, సాహిత్య పుస్తకాలను పంచుకుంటున్నారు. సమాజ మార్పునకు దోహదం నా జీవన భాగస్వామి అమ్మాజీ మృతి చెందిన నాటి నుంచి ‘పోలిశెట్టి అమ్మాజీ స్మారక సమితి’ పేరిట ఆమె వర్ధంతి రోజున మూడేళ్ల నుంచి ఏటా పుస్తకాలు ముద్రించి ఉచితంగా పంచుతున్నాం. ఇప్పటి వరకూ ‘నేను–నా దేశం’, ఉక్కుపాదం’ పుస్తకాలను ప్రచురించి పంచాం. – పోలిశెట్టి కృష్ణ, ప్రజానాట్య మండలి కళాకారుడు, జగన్నాథగిరి, కాకినాడ జిల్లా -
సత్యదేవునికి జయము జయము
● పరాభవ నామ సంవత్సర ఫలితం భేష్ ● ఈ ఏడాది భక్తుల సౌకర్యాలకు భారీగా వెచ్చించే అవకాశంఅన్నవరం: రత్నగిరి వాసుడైన సత్యదేవునికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో సర్వత్రా జయం చేకూరుతుందని ప్రముఖ పంచాంగకర్త, అన్నవరం దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ తెలిపారు. ఆదాయ, వ్యయాలతో నిమిత్తం లేకుండా స్వామివారి ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుందన్నారు. రత్నగిరిపై సత్యదేవుని అనివేటి మండపంలో గురువారం నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన పంచాంగ పఠనం చేశారు. ఉదయం 8.30 గంటలకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి, సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో వేంచేయించారు. నూతన సంవత్సర పంచాంగ ప్రతులను స్వామి, అమ్మవార్ల చెంతన ఉంచి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ పరాభవ నామ పంచాంగ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం, పూర్ణప్రసాద్ సిద్ధాంతి నూతన సంవత్సర పంచాంగ ఫలితాలను చదివి వివరించారు. సత్యదేవునిది మఖ నక్షత్రం, సింహరాశి కావడంతో ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయన్నారు. ఈ రెండూ సమానమని అంటే ఈ ఏడాది దేవస్థానంలో అనేక సత్రాలు, నూతన నిర్మాణాలు, వివిధ అభివృద్ధి పథకాలు చేపట్టేందుకు వ్యయం చేస్తారని అర్థమన్నారు. భక్తుల సౌకర్యాలు కల్పనకు కూడా నిధులు వెచ్చిస్తారన్నారు. సింహరాశి వారికి రాజపూజ్యం, అవమానం 7 చొప్పున సమానంగా ఉన్నాయని, అయితే, ఇవి దేవతలకు వర్తించవని చెప్పారు. వైశాఖ మాసంలో సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాలతో పాటు ఇతర ఉత్సవాలు కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని వివరించారు. ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి ఆదాయం తక్కువ, వ్యయం ఎక్కువ ఉన్నప్పటికీ ప్రతికూల ఫలితాలుగా భావించరాదన్నారు. ఆస్తులు, వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసినా వ్యయంగానే భావించాలని తెలిపారు. దైవ ప్రార్థనలు, పూజలు, దానాల వలన ఆయా రాశుల వారికి అవి సానుకూల ఫలితాలుగా మారుతాయని ఆయన వివరించారు. పలువురికి సత్కారం పంచాంగ శ్రవణానంతరం భక్తులకు ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఉగాది వేడుకల్లో భాగంగా ప్రముఖ వేద పండితులు వెంపరాల సీతారామ అవధాని (అమలాపురం), సుందరరామ శ్రోతి(విజయవాడ)లను రూ.5,116 నగదు పారితోషికంతో చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించారు. పంచాంగ ఫలితాలను వివరించిన పూర్ణప్రసాద్ సిద్ధాంతిని కూడా సత్కరించారు. దేవస్థానం సీనియర్ వేద పండితుడు గంగాధరభట్ల గంగబాబు, సత్యదేవుని ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, సీనియర్ అర్చకుడు బులుసు సుబ్రహ్మణ్యేశ్వరశర్మలు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో గంగబాబు, ఇంద్రగంటిలను చైర్మన్, ఈఓలు ఘనంగా సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. అర్చకుడు బులుసు తరఫున ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ వీటిని స్వీకరించారు. ఉగాది వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాకారంలో స్వామివారి రథోత్సవం.. భక్తుల కోలాహలం, చిన్నారుల నృత్యాల నడుమ ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉగాది వేడుకల సందర్భంగా సత్యదేవుని ఆలయం, అనివేటి మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. -
మతాతీతం.. మరియారాధన..
దేవరపల్లి: ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలోని మేరీమాతను నిత్య నిష్కళంక మాతగా అన్ని మతాల వారు ఆరాధిస్తున్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు మేరీ మాత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏలూరు పీఠాధిపతి జయరావు పొలిమెర పర్యవేక్షణలో పుణ్యక్షేత్రం డైరెక్టర్ ఫాదర్ ఎస్.జాన్పీటర్, ఉత్సవాల నిర్వహణ కమిటీ, సహాయక ఫాదర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలం గౌరీపట్నం గ్రామానికి ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రం ఆవిర్భావానికి 1978లో అప్పటి ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ నాంది పలకగా పలువురు ఫాదర్లు పుణ్యక్షేత్రం అభివృద్ధికి పాటుపడ్డారు. ప్రస్తుత డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కులమతాలకు అతీతంగా భక్తులు మేరీమాతను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి తమ కొర్కెలను మరియతల్లికి విన్నవించుకుంటారు. 1976లో ఏలూరు క్యాథలిక్ పీఠం ఏర్పడింది. అప్పటికే ఏలూరులో బిషప్గా ఉన్న జాన్ ములగాడ 1978లో గౌరీపట్నంలో నిర్మలగిరి క్షేత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అనంతరం ఆయన కారులో విశాఖపట్నం వెళ్తూ గౌరీపట్నం వద్ద కారు మరమ్మతులకు గురవడంతో అక్కడ దిగి ఆ పరిసర ప్రాంతాన్ని పరిశీలించారు. ఎత్తైన కొండలు, కారుచీకటి, ముళ్లపొదలతో నిండి ఉన్న చిట్టడవి. భయంకర వాతావరణం. అంతలోనే ఆయన మనసులో ఈ ప్రాంతంలో ఆలయం నిర్మించవా అంటూ ప్రేరణ కలిగింది. కారు మరమ్మతులు చేయించుకుని విశాఖకు బయలుదేరారు. గౌరీపట్నం ప్రాంతంలో మేరీమాత ఆలయం నిర్మాణానికి సంకల్పించి 1979లో ఆలయాన్ని నిర్మించి ఫాదర్ మైకేల్ను తొలి డైరెక్టర్గా నియమించారు. 1982 నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 1992లో ఫాదర్ దిరిసిన ఆరోన్ పుణ్యక్షేత్రం డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. 1995లో అక్కడ ప్రేమసేవా ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. 25న పీఠాధిపతుల రాక ఈ నెల 25న ఉత్సవాల ముగింపు సందర్భంగా ఏలూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర, శ్రీకాకుళం పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ విజయకుమార్ రాయరాల, ఖమ్మం పీఠాధిపతి ప్రకాష్ సంగిలి ఉత్సవాలకు హాజరై సమష్టి దివ్యబలి పూజ నిర్వహిస్తారని జాన్ పీటర్ తెలిపారు. నిత్య అన్నదానం పుణ్యక్షేత్రానికి నిరంతరం వస్తున్న భక్తులకు దాతలు, భక్తుల సహకారంతో నిత్యం సుమారు 2 వేల మందికి ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం కాంట్రాక్టర్ కళ్లే నాగేశ్వరరావు పర్యవేక్షణలో జరుగుతుంది. సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు వస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, విశ్రాంతి పందిళ్లు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ప్రజా రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను నడపనుంది. సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు భక్తులు పుణ్యక్షేత్రానికి తరలి వస్తారు. భారీగా రానున్న భక్తులు ఉత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఒడిశా, కేరళ రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి కాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత. దీపకాంతుల నడుమ క్రీస్తు శిలువగౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రంలోని అఖండ దేవాలయం 2000లో అఖండ దేవాలయ నిర్మాణం క్షేత్రంలో అఖండ దేవాలయం నిర్మాణానికి 1992లో శంకుస్థాపన చేశారు. 2000లో అప్పటి పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ దిరిసిన ఆరోన్ ఆలయ నిరా్మాణాన్ని పూర్తి చేశారు. ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్థనలు చేసుకునేందురు వీలుగా దేవాలయాన్ని నిర్మించారు. క్షేత్రంలో పలు కట్టడాలను కళాత్మకంగా రూపొందించారు. వంద అడుగుల క్రీస్తు మందిరం నిర్మలగిరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుణ్యక్షేత్రానికి ఎదురుగా సుమారు 100 అడుగుల ఎత్తున సుందరమైన క్రీస్తు మందిరాన్ని నిర్మించారు. చరిత్రలోని వివిధ ఘట్టాలను కళాత్మకంగా గోపురంలో పొందుపరిచారు. 22 నుంచి మరియతల్లి పండగ ముస్తాబైన పుణ్యక్షేత్రం అగ్ర పీఠాధిపతుల రాక 10 లక్షల మంది వస్తారని అంచనా వివిధ ప్రాంతాల నుంచి {ç³™ólÅMýS BÈtïÜ ºçÜ$ÞË$ ˘ -
టీనేజీ గర్భధారణలు ఆందోళనకరం
ఐసీడీఎస్ ఆర్జేడీ సుజాతా రాణి కాకినాడ క్రైం: టీనేజీ గర్భ ధారణలు పెరుగుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సుజాత రాణి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయ ఆవరణలో ఫ్యాబిన్ కన్వెన్షన్లో శాఖ తరఫున పీడీ చెరుకూరి లక్ష్మి ఆధ్వర్యంలో టీనేజ్ గర్భ ధారణలు, బాల్య వివాహాల నిర్మూలనపై డివిజినల్ స్థాయి దిశానిర్దేశ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుజాత రాణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ చిన్న వయసులో గర్భధారణల వల్ల అమ్మాయిల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. బాల్య వివాహాల వల్లే ఈ దుస్థితి సంభవిస్తోందన్నారు. సరైన లైంగిక విద్య, కుటుంబం వ్యవస్థ, సమాజం పట్ల అవగాహన లేకపోవడం బాలికల భవితను చిదిమేస్తున్నాయన్నారు. వీటి నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయికి చేరకపోతే సిబ్బంది విఫలమైనట్లేనని అన్నారు. సమాజంలో కీలక వర్గాలన్నీ పని చేస్తేనే బాలికలను ఈ దురాగతాల నుంచి రక్షించగలమని సుజాత తెలిపారు. కార్యక్రమంలో పీడీ లక్ష్మి మాట్లాడుతూ బాల్య వివాహాలు, అందువల్ల కలుగుతున్న టీనేజీ గర్భధారణలు బాలికల హక్కులను కాలరాస్తున్నాయన్నారు. అవగాహన క్షేత్రస్థాయికి చేరేలా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్న వయసులో వివాహం జరిగితే చదువు మధ్యలో నిలిచిపోవడం, ఆర్థిక వెసులుబాటు లోపించడం, జీవితంలో స్వతంత్రత కోల్పోవడం, తల్లీ బిడ్డలకు పోషకాహార లోపం, మాతా శిశు మరణాలు సంభవించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు, వారి ఎదుగుదలలో లోపాలు, రక్తహీనత వంటి సమస్యలు వాటిల్లుతాయన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మాత్రమే ప్రజల్లో చైతన్యం కలుగుతుందని లక్ష్మి అన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు చేస్తున్నట్లు గుర్తిస్తే 1098, 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదుదారుల సమాచారం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మణమూర్తి, డీసీపీవో వెంకట్, డీఐవో డాక్టర్ సుబ్బరాజు, మెప్మా అసిస్టెంట్ పీడీ జిలానీ, డీఎస్డీవో గోపికృష్ణ, పారా లీగల్ అడ్వకేట్ హేమ పద్మజ సహా ఐసీడీఎస్ సిబ్బంది, గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, మెప్మా సిబ్బంది, సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ, వన్స్టాప్ సిబ్బంది పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి
కాజులూరు: మండంలోని పల్లిపాలెం చేపల చెరువుల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాజులూరి వెంకటనరసింహారెడ్డికి చెందిన చేపల చెరువులను కాజులూరు శివారు అగ్రికుల క్షత్రియుల పేటకు చెందిన రచ్చ గొల్లరాజు కౌలుకు సాగుచేస్తున్నాడు. బుధవారం రాత్రి సుమారు 60 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి చెరువుల వద్దకు వచ్చి గట్టుపై గల మంచంపై మృతి చెందాడు. మృతుడు చామనఛాయ కలిగి నీలం రంగు గళ్ల లుంగీ, క్రీమ్ కలర్ టీ షర్టు ధరించి ఉన్నాడు. ఎడమ చేయి దండపై ఒకటి, పొట్టపై బొడ్డు పక్కన ఒకటి, ఎడమ మోకాలిపై ఒకటి పుట్టుమచ్చలు ఉన్నాయి. వీఆర్వో జుత్తుక రాధాకృష్ణ పిర్యాదు మేరకు గొల్లపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు 94407 96559 నంబరుకు ఫోన్ చేసి సమచారమివ్వాలని ఎస్సై ఎం.మోహన్కుమార్ తెలిపారు. ఇష్టారీతిన తవ్వేస్తున్నారు పిఠాపురం: రెండు శాఖల అధికారుల సమన్వయలోపం కారణంగా ఇటీవల నిర్మించిన రోడ్డు పూర్తి కాకుండానే తవ్వేస్తున్నారు. ఇటీవల చేపట్టిన పిఠాపురం – ఉప్పాడ రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఏం చేసినా అడిగేవారు లేరన్నట్టు పిఠాపురం ఆర్అండ్బీ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వ్యవహరిస్తున్నారు. రోడ్డు పనులు పూర్తి కాకుండానే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నూతన పైపులైన్ నిర్మాణం పేరుతో ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. రూ.కోట్ల వ్యయంతో పిఠాపురం నుంచి ఉప్పాడ వెళ్లే ఆర్అండ్బీ రోడ్డు నిర్మించి రెండు రోజులు పూర్తికాకుండానే యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొత్తపల్లి మండలం వాకతిప్ప సూరప్ప చెరువులో నిర్మించిన నాగులాపల్లి ఏరియా రక్షిత గ్రామీణ మంచినీటి పథకానికి పిఠాపురం మండలం నవఖండ్రవాడ వద్ద ఉన్న పీబీసీ నుంచి నీటిని తరలించేందుకు కొత్తగా పైప్లైన్ నిర్మిస్తున్నారు. దీని కోసం రోడ్డు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కొత్తగా వేసిన రోడ్డు తవ్వేడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పైప్లైన్ పూర్తయ్యాక రోడ్డు నిర్మించాల్సిందని పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి చోద్యం ప్రజాధనం అంటే అంత చులకగా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కారు ఢీకొని వ్యక్తి మృతి అల్లవరం: బెండమూర్లంక ప్రధాన రహదారిపై అల్లవరం పొలం వద్ద రోడ్డు దాటుతున్న సైకిలిస్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోడి గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (60) అక్కడికక్కడే మృతి చెందారు. నాగరాజు గోడి నుంచి రెల్లుగడ్డకు సైకిల్పై వెళ్తుండగా అల్లవరం పొలం వద్ద దాటుతుండగా ఏపీ 28 డీజీ 9128 నెంబరు గల కారు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో నాగరాజు ఘటనా స్థలంలోనే మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. -
జాతీయ వాలీబాల్ పోటీలు ప్రారంభం
మలికిపురం: ఆల్ ఇండియా మహిళా ప్రీమియర్ లీగ్ వాలీబాల్ పోటీలు బుధవారం మండలం తూర్పుపాలెంలో ప్రారంభమయ్యాయి. స్థానిక అడబాల స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ జరగనున్న ఈ పోటీలను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. మార్క్ ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, ఎంపీపీ మేడిచర్ల వెంకట సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. 70 కిలోల గంజాయి స్వాధీనం బాలుడితో సహా ఐదుగురి అరెస్టు రాజవొమ్మంగి: మండలంలోని జడ్డంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమీనాబాద్ వద్ద వాహనాల తనిఖీలో 70 కిలోల గంజాయి పట్టుబడినట్లు ఎస్సై చినబాబు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు అల్లూరి జిల్లా చింతపల్లి ప్రాంతంలో కొనుగోలు చేసిన గంజాయిని ఐదుగురు వ్యక్తులు రెండు మోటారు సైకిళ్లపై మైదాన ప్రాంతానికి తరలిస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో దేవుడు అన్నవరానికి చెందిన పాకపర్తి శ్రీదేవి, రాజవొమ్మంగికి చెందిన పొట్నూరి వీరబాబు, అద్దేపల్లి వీరబాబు, పాడిశెట్టి శివాజీ, ఒక బాలుడు ఉన్నారన్నారు. వీరి నుంచి గంజాయి, ఆరు సెల్ ఫోన్లు, రూ.900 నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గెజిటెడ్, రెవెన్యూ అధికారుల సమక్షంలో గంజాయి తూకం వేసి పంచనామా పూర్తి చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. -
‘సువర్ణ’ బాధితులకు న్యాయం చేయాలి
సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు అమలాపురం రూరల్: ఏపీ, తెలంగాణలలో ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఎండీ, డైరెక్టర్లకు కోర్టు జైలు శిక్ష, జరిమానాలు విధించినా బాధితులకు న్యాయం జరగలేదని బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశి వెంకట్రావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక బుద్ధ విహార్లో జరిగిన ఏజెంట్లు, బాధితుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడుతూ 2011లో స్థానికంగా ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి 2014 వరకు సుమారు రెండు వేల మంది నుంచి రూ.12 కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేశారన్నారు. 2015లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టౌన్ సీఐ వైఆర్కే శ్రీనివాసరావు, డీఎస్పీ ఎల్.అంకయ్య చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు మండలం ఈదరపల్లి పంచాయతీ పరిధిలో రెండు భవనాలు, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో 25 సెంట్ల కొబ్బరి తోట, 8 సెంట్ల ఇంటి స్థలం. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో 4 ఏకరాల భూమి, శ్రీకాకుళంలో 10 ఎకరాలు భూమి, తెలంగాణ రాష్ట్రం నారాయణఖేడ్ ప్రాంతంలో 140 ఎకరాల భూమి. రాజోలు మండలం శివకోడులో వారు నివసిస్తున్న రూ.50 లక్షల విలువైన భవనం, సంస్థ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను 2016లో అప్పటి జిల్లా కలెక్టర్ సీజ్ చేశారు. కేసు విచారణ సమయంలో సీజ్ చేసిన ఆస్తులను కంపెనీ ఎండీ భూసిం నాగ వెంకట వేణు, డైరెక్టర్లు బినామీ పేర్లతో విక్రయించారు. ఈ కేసులో మార్చి 16వ తేదీన సంస్థ ఎండీ భూసి నాగ వెంకట వేణుకు ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, డైరెక్టర్లు రాజ్యలక్ష్మికి ఐదేళ్లు, గౌతమికి మూడేళ్ల జైలు శిక్షతో భారీ జరిమానా విధించారు. రూ.వెయ్యి డిపాజిట్ చేసిన బాధితులందరికీ న్యాయం చేయాలని కోర్టు అదేశించిందని, గతంలో కలెక్టర్ సీజ్ చేసిన సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లు, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెంట్లు సంఘం ప్రతినిధులు చింతా రత్నం రాజు, జల్లి ప్రసన్నవాణి, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సీఆర్సీ ఉగాది నాటిక పోటీలు
రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 26వ సిల్వర్ జుబ్లీ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్టు సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, రూపశిల్పి గొలుగూరి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి తెలిపారు. సీఆర్సీలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురువారం నుంచి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ పోటీల్లో ఏడు నాటికలు, సీఆర్సీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. 26 ఏళ్లుగా ఈ పోటీలు నిర్వహిస్తూ నాటికలకు పూర్వ వైభవం తీసుకు రావాలని కృషి చేస్తున్నామన్నారు. 19వ తేదీ మధ్యాహ్నం బాలబాలికల నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణి అందిస్తారన్నారు. తెలుగు రంగస్థలానికి మణిహారంగా పేరొందిన విశాఖపట్టణానికి చెందిన నటీమణి కె.విజయలక్ష్మిని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. పలువురు సినీ నటులు ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు. గురువారం హైదరాబాద్కు చెందిన గోవాడ క్రియేషన్స్ బృందం ‘అమ్మ చెక్కిన బొమ్మ’, కాకినాడకు చెందిన బీవీకే క్రియేషన్స్ బృందం ‘కన్నీటికి విలువెంత’ ప్రదర్శించనున్నారు. శుక్రవారం గుంటూరుకు చెందిన అభినయ ఆర్ట్స్ బృందం ‘సహాన’, విశాఖకు చెందిన తెలుగు కళా సమితి ‘చిటికెన వేలు’, చైతన్య కళా స్రవంతి ‘అసత్యం’, మూడో రోజు 21న కాకినాడకు చెందిన ఎస్వీ రంగారావు కళా స్రవంతి బృందం ‘ఆచమనం’, విశాఖకు చెందిన భద్రం ఫౌండేషన్ బృందం ‘దొందూ దొందే’ నాటికలతో పాటు చివరి రోజు సీఆర్సీ వారి ప్రత్యేక ప్రదర్శన ‘బంగారు లేడి’ ప్రదర్శించనున్నారు. ప్రతి నాటికకు రూ.25 వేలు పారితోషికం, వివిధ విభాగాల్లో వ్యక్తిగత బహుమతులు ఉంటాయన్నారు. అలాగే ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.75 వేలు, తృతీయ బహుమతిగా రూ.50 వేలు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో సీఆర్సీ ఉపాధ్యక్షుడు చిన్నం తేజారెడ్డి, కళా పరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్న బుజ్జి), కొవ్వూరి నరేష్కుమార్ రెడ్డి, నడింపల్లి వెంకట సుబ్బరాజు, కె.రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై నేడు ఉగాది వేడుకలు
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సన్నిధిన అనివేటి మండపంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8–30 గంటలకు నూతన పంచాంగాలను స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చకులు పూజలు చేస్తారు. తొమ్మిది గంటలకు దేవస్థానం ఆస్థాన సిద్దాంతి, పంచాంగ రచయిత తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ పంచాంగ పఠనం నిర్వహిస్తారు. అనంతరం ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదం, దేవస్థానం పంచాంగాలను భక్తులకు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. అమలాపురానికి చెందిన వేంపరాల సీతారామ అవధాని, విజయవాడకు చెందిన విశ్రాంత వేద పండితుడు సుందర రామ శ్రౌతిలను సన్మానించనున్నారు. ఉగాది పురస్కారం కింద రూ.ఐదు వేలు నగదు ఇస్తారు. ఆలయ ప్రాకారంలో ఉదయం 11 గంటలకు రథంపై, రాత్రి ఏడు గంటలకు అన్నవరం పుర వీధుల్లో వెండి గజవాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు. ఇక కియోస్క్ సేవలు అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేలా దేవస్థానంలో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను గురువారం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరూర్ వైశ్యా బ్యాంక్ వీటిని విరాళంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలకు ఎంపిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వివిధ రంగాల్లో విశేష సేవలందించినందుకు జిల్లాకు చెందిన పలువురికి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలు లభించాయి. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేస్తున్న కాకినాడకు చెందిన మార్ని జానకిరామ చౌదరి, ప్రముఖ రచయిత్రి పుప్పాల సూర్యకుమారి, రవిమంత్రి, గంటా సత్యకుమార్, నాటక రంగానికి సేవలందించిన పక్కి మణిబాల రాష్ట్ర స్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. గురువారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వీరు అవార్డులు అందుకోనున్నారు. మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టుల ఏర్పాటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మూడు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ షణ్మోహన్ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకూ 24 గంటలూ రొటేషన్ పద్ధతిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఈ చెక్పోస్ట్లు పనిచేస్తాయన్నారు. రెవెన్యూ, ఎకై ్సజ్, కమర్షియల్ టాక్స్ అధికారులను మల్లవరం, నీలపల్లి, సుంకరపాలెం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు వద్ద నియమించినట్లు చెప్పారు. షిఫ్ట్ ప్రాతిపదికన పైన పేర్కొన్న ప్రదేశాలలో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీని కోరారు. చెక్ పోస్ట్ల వద్ద టెంట్లు, కుర్చీలు, లైట్లు, నీరు ప్రాథమిక సౌకర్యాలను కాకినాడ రెవెన్యూ డివిజనల్ అధికారి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో జరిగే అవకతవకలను నివారించడానికి చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచాలన్నారు. హాస్టళ్ల అభివృద్ధికి ఏఎమ్ గ్రీన్ రూ.50 లక్షల సాయం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): hÌêÏÌZ° GïÜÞ, GïÜt, ½ïÜ, WÇ-f¯]l çÜ…„óSÐ]l$ Ð]lç܆ VýS–àÌSÌZ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*ÌS AÀÐ]l–-¨®MìS HGÐŒl$ {X¯ŒS çÜ…çܦ Æý‡*.50 ÌS„ýSÌS BǦMýS çÜàĶæ$… A…¨…-_¯]lr$t MýSÌñæMýStÆŠ‡ çÙ×ZÃ-çßæ¯ŒS º$«§ýlÐéÆý‡… {ç³MýS-r¯]lÌZ ™ðlÍ-´ëÆý‡$. Ð]lç܆ VýS–à-ÌSÌZ BÆøÓ ´ëÏ…r$Ï, ç³Æý‡$ç³#Ë$, r*Å»Œæ OÌñær$Ï, ¸ëů]l$Ï, Ð]l$íÜPsZ ¯ðlsŒæÞ, §ýl$ç³µr$Ï, ïÜïÜ MðSÐðl$Æ>Ë$, C¯]lÓ-Æý‡tÆŠ‡Þ Ð]l…sìæ Ð]l˜ÍMýS çܧýl$-´ë-Ķæ*ÌS¯]l$ HÆ>µr$ ^ólĶæ$-¯]l$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. ѧéÅ-Æý‡$¦ÌSMýS$ ÝûMýS-Æý‡ÅÐ]l…-™èl-OÐðl$¯]l Ð]lçÜ-†, BÆø-VýSÅ-MýSÆý‡-OÐðl$¯]l Ðé™é-Ð]l-Æý‡×æ… MýS͵…^èl-yýlÐól$ ÌS„ýSÅ…V> D ^èlÆý‡ÅË$ ^ólç³-yýl$-™èl$-¯é²-Ð]l$-¯é²Æý‡$. ѧéÅÆý‡$¦ÌS çÜ…„óS-Ð]l*-°MìS HG… {X¯ŒS Ð]l…sìæ çÜ…çܦË$ Ð]l¬…§ýl$MýS$ Æ>Ð]lyýl… AÀ-¯]l…-§ýl-±-Ķæ$Ð]l$° õ³ÆöP…r* «§ýl¯]lÅ-Ðé-§éË$ ™ðlÍ-Ķæ$-gôæÔ>Æý‡$.˘ ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి వి.కేశవరావు తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ–2 పరీక్ష నిర్వహించగా 15,603 మంది హాజరుకాగా 283 మంది పరీక్ష రాయలేదన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించామని, ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. మార్నీ జానకి రామ చౌదరి రచయిత్రి పుప్పాల సూర్యకుమారి -
టీడీపీ నేత ఇంటి వద్ద గ్యాస్ సిలిండర్ల పంపిణీ!
పిఠాపురం రూరల్: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి.తిమ్మాపురంలో స్థానిక టీడీపీ నాయకుని ఇంటి వద్ద బుధవారం చేపట్టిన గ్యాస్ పంపిణీపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీలోనూ రాజకీయమేనా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇరాన్ – ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో వంటగ్యాస్ సరఫరాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ పి.తిమ్మాపురంలో హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు సరఫరా చేసే సిలిండర్లను టీడీపీకి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బర్ల అప్పారావు ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే పంపిణీ చేయడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా గ్యాస్ బుక్ చేసుకుంటే ఇంటి వద్ద సిలిండర్ అందజేస్తారు. అయితే యుద్ధ వాతావరణం నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే బహిరంగ (పబ్లిక్) ప్రదేశాల్లో గ్యాస్ పంపిణీ జరగాల్సి ఉంటుంది. అలాకాకుండా గ్రామంలో ఒక టీడీపీ నాయకుడి ఇంటి వద్ద సరఫరా నిర్వహించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుని ఇంటి వద్ద ఖాళీ స్థలం లేకపోయినా అతని పబ్లిసిటీ కోసం ఇంటి ఎదుట నడిరోడ్డుపై నిలిపి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేశారు. దీంతో జనం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్యాస్ పంపిణీ రాజకీయ నేతల ఇళ్ల వద్ద నిర్వహించడం సరైంది కాదని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు, సరఫరా నిర్వాహకులు, అధికారులు భవిష్యత్తులోనైనా సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసి పంపిణీ చేపట్టాలని కోరుతున్నారు. -
‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
కాకినాడ క్రైం : దివ్యాంగ శక్తి పథకాన్ని కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం ప్రారంభించారు. జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ 40 శాతం వైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు తెలిపారు. సహాయకులకు 50 శాతం రాయితీ కల్పిస్తున్నామన్నారు. 21 రకాల అంగవైకల్యాలున్నవారికి ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందన్నారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణం ఉచితం కాగా, ఏసీ, డీలక్స్ బస్సుల్లో 50 శాతం రాయితీతో ప్రయాణించవచ్చన్నారు. ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎస్వివిఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు. కలెక్టర్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు దివ్యాంగులతో కలిసి ప్రయాణం చేసి వివేకానంద హాల్లో వారితో కలిసి భోజనం చేశారు. -
జీతమో... నారా చంద్రా!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విజ్ఞాన భాండాగారాలుగా పేర్కొనే గ్రంథాలయాలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరంలో ఉంటున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన కొత్త పుస్తకాలను అందించలేకపోతున్నాయి. డిజిటల్ గ్రంథాలయాలుగా సాంకేతికతను అందిపుచ్చుకోలేని దుస్థితి కొనసాగుతోంది. ప్రజలు చెల్లించే ఆస్తి పన్ను నుంచి గ్రంథాలయ సెస్సును చెల్లించకపోవడమే ఇందుకు కారణం. దీనికితోడు ప్రభుత్వం నుంచి నిధులు సైతం సక్రమంగా మంజూరుకాకపోవడం గమనార్హం. పేరు గొప్ప, ఊరు దిబ్బ అనే చందంగా ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయాలు ఉంటున్నాయి. రాష్ట్రంలోనే జిల్లా కేంద్రంలో తొలి డిజిటల్ గ్రంథాలయం ఏర్పడిందని గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎక్కడా సాంకేతిక పరిజ్ఞానమనేదే కనపడదు. నిధుల కొరత కారణంగా ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని స్థితి నెలకొంది. బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం గ్రంథాలయాల అభివృద్ధి అంశంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం కనబరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాలకు రూ.130 కోట్లు అవసరం కాగా 2025–26 బడ్జెట్లో కేవలం రూ.40 కోట్లు మాత్రమే విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం. నెలల తరబడి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉంటే.. సెస్సు వసూలు చేసుకుని తీసుకోండంటూ ఉచిత సలహా ఇచ్చి చేతులు ఎత్తేసింది. దీంతో సెస్సు బకాయిలు వసూలు కాక, ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ సరిపోక ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసంతృప్తిలో ఉద్యోగులు ఉమ్మడి తూర్పు జిల్లా పరిధిలో కేంద్ర గ్రంథాలయంతో కలిపి 102 గ్రంథాలయాలు ఉండగా, వీటిల్లో గ్రేడ్ –1లో కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, పెద్దాపురం, రామచంద్రపురం, తుని ప్రాంతాలు ఉండగా గ్రేడ్ –2లో 11, గ్రేడ్ –3లో 80 కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాక మరో 161 బీసీడీలు (పుస్తక నిక్షిప్త కేంద్రాలు) ఉన్నాయి. వీటన్నింటిలో 204 రెగ్యులర్ ఉద్యోగులకుగాను 55మంది పనిచేస్తుండగా మిగిలినని ఖాళీగా ఉన్నాయి. 64మంది ఔట్సోర్సింగ్ విధానంలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 175 మంది పెన్షన్దారులు ఉండగా వీరికి ప్రతి నెలా దాదాపు రూ.40లక్షలు అవసరం అవుతుంది. జీతాలతో పాటు కంటెంజెంట్, పేపర్, ఎలక్ట్రికల్, గ్రంథాలయ బిల్డింగ్ల అద్దె బిల్లులు తదితరాలకు కలిపి నెలకు దాదాపు రూ.కోటి వరకూ అవసరం. ఈ లెక్కన ఏడాదికి ఉమ్మడి జిల్లాలోని గ్రంథాలయాల అవసరాలకు రూ.12 కోట్లు అవసరం కాగా, ప్రభుత్వం కేంద్ర గ్రంథాలయానికి కేవలం రూ.5 కోట్లు లోపు నిధులు మాత్రమే విడుదల చేసింది. ఉద్యోగ విరమణ చేసిన వారికి కొంతకాలంగా ఎలాంటి బెనిఫిట్స్ అందడం లేదు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం కారణంగా ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కీలక పోస్టులో ఇన్చార్జి కీలకమైన గ్రంథాలయ సెక్రటరీ పోస్టు ఇన్చార్జితో నెట్టుకొస్తున్నారు. ఇప్పటి వరకూ పనిచేసిన ఉద్యోగి పదవీ విరమణ చేయడంతో విశాఖ జిల్లా అధికారిని ఇన్చార్జిగా నియమించారు. ఆస్తి పన్నులో 8 శాతం పంచాయతీలు, నగర, పురపాలికల్లో ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులోనే 8 శాతం గ్రంథాలయ సెస్సు విధిగా ఉంటుంది. వీటిని జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాకు జిల్లా పంచాయతీ శాఖ, నగర, పురపాలికలు జమ చేయాల్సి ఉంది. ఈ సెస్సు నిధులతోనే గ్రంథాలయాల్లో అభివద్ధి పనులు, మరమ్మతులు, అవసరమైన మేరకు శాశ్వత భవనాలు, గదుల నిర్మాణం చేపడుతుంటారు. దిన, వార, మాస పత్రికలు, కుర్చీలు, టేబుళ్లు, అట్టలు, పార్ట్ టైం ఉద్యోగుల జీతాలు, విద్యుత్తు బిల్లులూ చెల్లిస్తుంటారు. అయితే సెస్సు చెల్లింపుల్లో ఆయా సంస్థలు నిర్లక్ష్యం వహిస్తుండడంతో గ్రంథాలయాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. సెస్సు బకాయిలు రూ.43 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థలకు సెస్ బకాయి రూ.43 కోట్ల వరకూ ఉంది. కాకినాడ కార్పొరేషన్ రూ.8.5 కోట్లు, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ రూ.18 కోట్లు బకాయి ఉండగా పంచాయతీల నుంచి రూ.16.5 కోట్లు వసూలు కావలసి ఉంది. నెలనెలా జీతాలందక అల్లాడిపోతున్న గ్రంథాలయ ఉద్యోగులు ఏడాదికి రూ.12 కోట్లు అవసరం కాగా రూ.5 కోట్లు కూడా ఇవ్వని సర్కారు సెస్ వసూలు చేసి సర్దుబాటు చేసుకోమంటున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చి రెండు, మూడు నెలలు చెల్లించి హడావుడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం నేడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. రెండు, మూడు నెలలు బకాయిలు పెడుతూ వారిని నానా అవస్థలకు గురి చేస్తోంది. గ్రంథాలయ సంస్థల్లో పనిచేసే వారి పరిస్థితి అయితే మరీ ఘోరం. -
గ్యాస్ కొరతతో మహిళల ఇక్కట్లు
సామర్లకోట: గ్యాస్ కొరతతో సామాన్య, మధ్య తరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర అయ్యరక కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి అన్నారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సిలిండర్ అయిపోయి 10 రోజులు దాటినా గ్యాస్ రాక ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారన్నారు. గ్యాస్ ఏజెన్సీలకు బుకింగ్ కోసం ఫోన్ చేస్తే ఆ నంబర్లు పని చేయడం లేదన్నారు. దాంతో గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్లి బుకింగ్ కోసం పడిగాపులు పడవలసి వస్తోందన్నారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను ప్రశ్నిస్తే గ్యాస్ సరఫరా లేక పోవడం వలనే ఈ సమస్య ఏర్పడుతోందని చెబుతున్నారని తెలిపారు. అధికారులు మొక్కుబడిగా తనిఖీలు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. గ్యాస్కు బ్లాక్ మార్కెట్ లేకుండా అందరికీ సకాలంలో అందేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 20,12, 985 కనెక్షన్లు ఉండగా రోజు వారీ వినియోగం 38వేల సిలిండర్ల వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం రోజుకు 10వేల సిలిండర్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను మరుగునపెట్టి గ్యాస్ కొరత లేదంటూ అమాయక మహిళలను మభ్యపెట్టేలా ప్రభుత్వం ప్రచారాలు చేయడం దుర్మార్గమన్నారు. అయ్యరక కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ రాజేశ్వరి -
ఇక మున్సిపల్టీలే..
నాడు ఫ్యాన్ హవా రాష్ట్రవ్యాప్తంగా 2021లో నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో జిల్లాలోని పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో ఫ్యాన్ హవా వీచింది. వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్నిచోట్లా వైఎస్సార్ సీపీ పాలకవర్గాలు కొలువు తీరాయి. ఆయా పట్టణాల ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగించాయి. అభివృద్ధి చేసి చూపించాయి. ఫ ముగిసిన పాలక వర్గాల పదవీ కాలం ఫ ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం పిఠాపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తమ ఓటుతో ఎన్నుకున్న పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి వెనుకాడుతోంది. ఫలితంగా పట్టణ స్థానిక సంస్థలు (మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు) ఇక నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలు 2021 మార్చి 10న జరిగాయి. అదే నెలలో కొత్త పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. ఐదేళ్ల అనంతరం వీటి పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడంతో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలన్నీ ఇక నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే గత వారంలో మున్సిపాల్టీలకు ప్రత్యేకాధికారులను నియమించింది. ఇప్పటి వరకూ తమకు చేరువగా ఉండే కౌన్సిలర్లకు ఆయా వార్డుల్లోని ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనేవారు. వారి ద్వారా పరిష్కారానికి ప్రయత్నించేవారు. ఇప్పుడు వారి పదవీ కాలం ముగిసిపోవడంతో ఇక నుంచి ఏ సమస్య ఉన్నా అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. చంద్రబాబు ప్రత్యేక అధికారుల పాలనకే మక్కువ చూపిస్తారని, అందువలన మరో ఏడాది పాటు మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం లేదనే ప్రచారం కూటమిలో విస్తృతంగా జరుగుతోంది. చంద్రబాబు సర్కారు వచ్చాక.. గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్ సీపీ పాలకవర్గాలే అధికారంలో ఉన్నాయి. వాటిపై మున్సిపాలిటీలపై ప్రభుత్వం కన్ను వేసింది. ఆయా పట్టణాల అభివృద్ధికి నిధులివ్వాలన్నా, పనులు జరగాలన్నా తమ పార్టీలోకి రావాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారు. అయినప్పటికీ లొంగకపోవడంతో దమన నీతిని ఉపయోగించారు. పోలీసు కేసులు, గూండాగిరీతో భయపెట్టి, యుద్ధ వాతావరణం సృష్టించి, ప్రలోభాలకు గురి చేసి తుని మున్సిపాలిటీ, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో పైచేయి సాధించగలిగారు. కానీ, పిఠాపురం, పెద్దాపురం, గొల్లప్రోలుల్లో ఆ దుష్ప్రయత్నాలు ఫలించలేదు. అక్కడ వైఎస్సార్ సీపీ పాలకవర్గాలే కొనసాగడంతో వారికి ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరనే తప్ప ఎటువంటి సహకారమూ లభించలేదు. ప్రజాస్వామిక విలువలకు విరుద్ధంగా.. తమ అధికారాలను ప్రభుత్వం తుంగలో తొక్కి, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే పురపాలన సాగించిందని పాలక వర్గాలు ఆరోపించాయి. మూడేళ్ల పాటు మున్సిపాలిటీలను అభివృద్ధి పథంలో నడిపించిన పాలక వర్గాలు.. కూటమి నేతల అప్రజాస్వామిక ధోరణితో గత 20 నెలలుగా కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమవ్వాల్సిన దుస్థితి నెలకొంది. పదవీ కాలానికి చివరి రోజైన మంగళవారం ఆయా మున్సిపాలిటీ పాలక వర్గాలు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. పట్టణాలను అభివృద్ధి చేసే అవకాశాన్ని ప్రభుత్వం తమకు ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు సహకరించాలి. అలా కాకపోతే అభివృద్ధి ఎలా జరుగుతుంది? పదవీ కాలం అయిపోతే ఇక మాదే రాజ్యం అనుకోవడం కూడా పొరపాటే. పదవి ఉన్నా, లేకపోయినా ప్రజల తరఫున పోరాడతాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తలొగ్గకుండా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశాం. ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా మా బాధ్యతలు నిర్వర్తించాం. ఈ 20 నెలలూ ఇబ్బంది పడినా గత ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ అందించిన ప్రోత్సాహం, సహకారం చాలా సంతృప్తినిచ్చాయి. అదే సంతృప్తితో పదవీ విరమణ చేశాం. – గండేపల్లి సూర్యావతి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, పిఠాపురం అభివృద్ధి చేశామన్న సంతృప్తితోనే.. గడచిన ఐదేళ్లుగా ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలూ చేశామన్న సంతృప్తితోనే ఉన్నాం. వైఎస్సార్ సీపీ మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలోనే కొనసాగాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేశాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా అభివృద్ధి చేశామనే సంతృప్తితోనే పదవీ విరమణ చేశాం. – గండ్రేటి మంగతాయారు, మాజీ చైర్పర్సన్, గొల్లప్రోలు నగర పంచాయతీ ప్రత్యేకాధికారులు వీరే.. పిఠాపురం పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) ప్రాజెక్ట్ డైర్టెర్ పెద్దాపురం ఆర్డీఓ సామర్లకోట కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తుని కాకినాడ ప్రభుత్వాసుపత్రి పరిపాలనాధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గొల్లప్రోలు నగర పంచాయతీ ఫారెస్టు సెటిల్మెంట్ ఆఫీసర్ ఏలేశ్వరం నగర పంచాయతీ గృహ నిర్మాణ శాఖ పీడీ పిఠాపురంలో ఎమ్మెల్యే లేకుండానే.. సాధారణంగా మున్సిపల్ సమావేశాలకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా హాజరవుతూంటారు. ఆ సందర్భంగా కౌన్సిలర్లు ఆయా మున్సిపాలిటీల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించుకుని, అభివృద్ధి పనులు నిర్వహిస్తూంటారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ కూటమి ఎమ్మెల్యేల నుంచి సహాయ నిరాకరణ ఎదురైనప్పటికీ కౌన్సిల్ సమావేశాలకు మాత్రం వారు హాజరయ్యారు. కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు కనీసం ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీనిపై పలు సందర్భాల్లో పాలకవర్గ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. -
రుణాలు వేగంగా మంజూరు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు, స్వయం సహాయక సంఘాలు, యువతకు రుణాల మంజూరును వేగవంతం చేయాలని బ్యాంకు అధికారులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కోరారు. ప్రభుత్వ పథకాల లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టరేట్లో మంగళవారం జరిగిన జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.26,408 కోట్లు కాగా, ఇప్పటి వరకూ రూ.26,074.5 కోట్ల మేర రుణాలిచ్చి, 98.73 శాతం లక్ష్యం సాధించారని తెలిపారు. వ్యవసాయ రంగంలో స్వల్పకాలిక రుణాల లక్ష్యం రూ.13,733 కోట్లు కాగా, రైతులకు రూ.12,632 కోట్లు పంపిణీ చేశారన్నారు. రానున్న రోజుల్లో పంట రుణాల మంజూరును మరింత వేగవంతం చేయాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ (డీఆర్డీఏ) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 10,186 డ్వాక్రా సంఘాలకు రూ.1,298.71 కోట్లు, మెప్మా ద్వారా 2,737 పట్టణ సంఘాలకు రూ.420.52 కోట్ల మేర రుణాలు ఇచ్చారని తెలిపారు. 3,526 మంది మహిళా పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు రూ.55.55 కోట్ల రుణాలు అందించారని జేసీ తెలిపారు. అనంతరం, రూ.23,598 కోట్లతో నాబార్డ్ రూపొందించిన 2026–27 వార్షిక రుణ ప్రణాళికను ఎల్డీఎం, నాబార్డ్ ఎల్డీఎం తదితరులతో కలిసి ఆయన విడుదల చేశారు. నవోదయ ప్రవేశ పరీక్షలో 33వ ర్యాంక్ కరప: నవోదయ ప్రవేశ పరీక్షలో యండమూరు విద్యార్థిని గుబ్బల అవంతిక జిల్లా స్థాయిలో 33వ ర్యాంక్ సాధించింది. యండమూరులోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆమె ఇటీవల నవోదయ ప్రవేశ పరీక్ష రాసింది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆమె ఈ ర్యాంక్ సాధించిందని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎ.కామేశ్వరరావు, ఎంఏ అలీమ్ తెలిపారు. అవంతికను సర్పంచ్ మారెళ్ల శివ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. మహాశివరాత్రికి రూ.34.34 లక్షల ఆదాయం సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపురసుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయానికి మహాశివరాత్రి సందర్భంగా రూ.34,34,739 ఆదాయం వచ్చిందని ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 9 నుంచి మంగళవారం వరకూ 160 రోజులకు గాను దేవదాయ శాఖ తనిఖీదారు ఫణికుమార్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. హుండీల ద్వారా రూ.18,23,194, మహాశివరాత్రి నాడు స్వామి వారి దర్శన టికెట్ల ద్వారా రూ.8,65,140, కానుకలు రూ.33,701, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,43,825, ఆర్జిత సేవల ద్వారా రూ.36,116, స్వామి వారి ఫొటోల అమ్మకం ద్వారా రూ.105, అన్నదాన విరాళాలు రూ.3,32,658 వచ్చాయని ఈఓ వివరించారు. గత ఏడాది హుండీల ఆదాయంతో కలిపి రూ.29,66,406 ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆదాయం లెక్కింపులో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్రావు, ట్రస్టు బోర్డు సభ్యులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, భక్తసంఘ సభ్యులు, ఉండూరు, జగ్గంపేట సేవా సంఘం సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. సైకత శిల్పి శ్రీనివాస్కి జీవన సాఫల్య పురస్కారం రంగంపేట: స్థానిక సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ను ఉగాది జీవ న సాఫల్య పురస్కారం వరించింది. హైదరాబాద్ కు చెందిన విపంచి ఫౌండేషన్ ఉగాదిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాలలో నిష్ణాతులకు జీవన సాఫల్య పురస్కారాలను అందజేస్తోంది. సైకత శిల్ప కళ ద్వారా సమాజ చైతన్యానికి కృషి చేస్తున్నందుకు శ్రీనివాస్కు అందజేయనుంది. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఈ పురస్కారం శ్రీనివాస్ అందుకోనున్నారు. ఈ విషయాన్ని మంగళవారం సంస్థ జ్యూరీ కమిటీ వెల్లడించింది. -
30వ తేదీలోగా కమిటీలను పూర్తిచేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ సంస్థాగత కమిటీల నిర్మాణాన్ని ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కరరెడ్డి సూచించారు. మంగళవారం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పరిశీలకులు, ముఖ్యనేతల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న వజ్ర భాస్కరరెడ్డి మాట్లాడుతూ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గాలను రోల్మోడల్గా తీసుకుని సంస్థాగత కమిటీలను పూర్తి చేయాలన్నారు. కమిటీల నిర్మాణానికి కార్యాచరణ, రానున్న రోజుల్లో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కార్యకర్తలు కేంద్రంగా పనిచేసేలా రూపొందించిన విధి విధానాలు వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సంస్థాగత కార్యాచరణను వజ్ర భాస్కరరెడ్డి వివరించారు. అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ పార్టీ నిర్దేశించిన లక్ష్యం మేరకు కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రంలో ఆదర్శవంతంగా నిలవాలని ఇన్చార్జిలకు తెలిపారు. మాజీ మంత్రి తానేటి వనిత, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడిరాజా, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాస నాయుడు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నక్కారాజబాబు, గిరజాలబాబు, గొందేశి శ్రీనివాసులరెడ్డి, తోటరామకృష్ణ, రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 24న అథ్లెటిక్స్ మాస్టర్స్ ఎంపికలు అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్టాప్లిక్స్ 2026 కార్యక్రమంలో భాగంగా మార్చి 24న అమలాపురంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ జీఎంసీ బాలయోగి స్టే డియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ మాస్టర్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వీఆర్ రు ద్ర తెలిపారు. 35, 45 సంవత్సరాలు పైబడిన పురుషు లు, మహిళల విభాగాల్లో ఈ ఎంపికలు నిర్వహిస్తా రు. 100, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్ జ ంప్, హై జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జావలిన్ త్రో 400ఇన్టు100 మీటర్ల రిలే పోటీలు జరుగుతాయన్నారు. -
కదలదు.. వదలదు
ప్రత్తిపాడు రూరల్: వారం రోజులుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల్లోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ నెల 11న ప్రత్తిపాడు మండలం ధారపల్లిలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి నుంచి బవురువాక, తాడువాయి, శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో సంచరించింది. తిరిగి జి.కొత్తపల్లి మీదుగా మైదాన ప్రాంతాన్ని వీడి.. బవురువాకలోని చిటికెల కొండ రిజర్వ్ ఫారెస్టుకు మంగళవారం చేరిందని అధికారులు ధ్రువీకరించారు. దీంతో, బవురువాక, తాడువాయి, కొత్త అచ్చింపేట, సింగధార, డి.పోలవరం పరిసర గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. సరైన ప్రదేశంలో దీనిని బంధించేందుకు అన్ని అనుమతులూ తీసుకుని, సర్వసన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఏపీ అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు బవురువాకలో పర్యటించి అధికారులకు పలు సూచనలు చేశారు. అంచనాలకు అందకుండా.. మూడేళ్ల క్రితం ఈ ప్రాంతంలో సంచరించిన బెంగాల్ టైగర్ ఎక్కడైనా పశువుపై దాడి చేస్తే.. ఆ ప్రాంతంలో రెండు మూడు రోజుల పాటు ఉండి, ఆ పశు మాంసాన్ని ఆహారంగా స్వీకరించేది. ఎక్కువగా అటవీ ప్రాంతంలోనే సంచరించేది. జనావాసాల్లోకి వచ్చిన దాఖలాల్లేవు. అయితే, ప్రస్తుతం సంచరిస్తున్న పులి స్వభావం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. శంఖవరం మండలం జి.కొత్తపల్లి, శంఖవరం, మండపం, తాళ్లపాలెం గ్రామాల్లో ఈ పులి పూర్తిగా జనావాసాల్లోనే ఠీవిగా సంచరించింది. అయితే, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో దీనివలన ప్రజలకు ఎటువంటి హానీ కలగలేదు. ఈ పులి ఇప్పటి వరకూ ఏ ప్రాంతంలోనూ 24 గంటలకు మించి నివాసం ఉండలేదు. అధికారుల ట్రాప్లో పడకుండా రూటు మార్చుకుంటూ ముప్పుతిప్పలు పెడుతోంది. పాపికొండలు ప్రాంతం నుంచి ఈ పులి ఇప్పటి వరకూ సుమారు 250 కిలోమీటర్లు సంచరించి, దాదాపు 15 పశువులపై దాడి చేసినట్లు సమాచారం. ఆలయాల పరిసరాల్లో.. ఈ పులి సంచరిస్తున్న దాదాపు ప్రతి ప్రాంతంలోనూ ఏదో ఒక్క ఆలయం ఉండటం విశేషం. ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి ఈ నెల 10న ప్రత్తిపాడు మండలం ధారపల్లి జలాశయ ప్రాంతంలో ప్రత్యక్షమైన ఈ పులి అక్కడి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయం పరిసరాల్లో సంచరించింది. అక్కడి నుంచి బవురువాకలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంతానికి చేరింది. ఆ తరువాత శంఖవరం మండలం జి.కొత్తపల్లిలో పైడితల్లిమ్మవారి ఆలయ ప్రాంతంలో ఒక రాాత్రి, ఒక పగలు సంచరించింది. అక్కడి నుంచి శంఖవరంలో వేపాలమ్మతల్లి, తరువాత మండపంలో నూకాలమ్మ తల్లి ఆలయం ప్రాంగణాల్లో కనిపించింది. తిరిగి శంఖవరంలోని సత్మెమ్మ తల్లి, జి.కొత్తపల్లిలో నల్లకొండమ్మతల్లి ఆలయ ప్రాంగణాలకు చేరింది. అక్కడి నుంచి బవురువాకలోని వాక అటవీ ప్రాంతంలోని నల్లకొండమ్మతల్లి ఆలయ పరిసరాల్లో ఈ పులి మకాం చేసింది. హిందువులు పులిని అమ్మవారి వాహనంగా కొలుస్తారు. దానికి అద్దం పట్టేలా పులి సంచరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఫ పట్టుబడని పులి ఫ ప్రత్తిపాడు మండలంలోనే సంచారం ఫ బంధించేందుకు అనుమతులు తీసుకున్న అధికారులు -
టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడిని తొలగించాలి
ఫ తిరుమల ప్రతిష్టను మంటగలిపారు ఫ ఆయనపై చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం ఫ శాంతియుత నిరసన తెలిపితే దాడులు అమానుషం ఫ వైఎస్సార్ సీపీ నేతల ఆందోళన సాక్షి ప్రతినిధి, కాకినాడ: తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బ తీసిన బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తప్పించాలని వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. నాయుడిని ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. తిరుపతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తలపై టీడీపీ నాయకులు, గూండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ.. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ శ్రేణులు మంగళవారం ఆందోళన నిర్వహించాయి. ఇంద్రపాలెం వంతెన వద్ద మహిళలు, పార్టీ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించారు. పార్టీ నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు డౌన్డౌన్.. నాయుడిని తొలగించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ నాయుడిని ఆ పదవిలో కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. తప్పులు చేసేసి, వాటిపై ప్రశ్నిస్తున్న మహిళలపై దాడులకు దిగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. తిరుపతిలో మహిళలపై జరిగిన దౌర్జన్యమే దీనికి నిదర్శనమన్నారు. బీఆర్ నాయుడిని తక్షణమే టీడీపీ చైర్మన్ పదవి నుంచి తొలగించి, ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. పార్టీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ వంగా గీత, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాలన్నారు. ప్రశ్నించే వారందరినీ రెడ్బుక్ రాజ్యాంగంతో, పోలీసు అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మహిళల రక్షణ కోసం దిశ చట్టంతో పాటు అనేక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం, పెద్దాపురం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్జీ, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, మాకినీడి శేషుకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
వరిలో నకిలీలలు
కోరుకొండ: వ్యవసాయ రంగంలో రైతన్నకు నానాటికీ కష్టాలు పెరుగుతున్నాయి. కూటమి పాలనలో రైతు దగాకు గురవుతూనే ఉన్నాడు. విత్తన కంపెనీల కారణంగా నష్టాలపాలు కావాల్సి వస్తుంది. మెట్ట ప్రాంతమైన గోకవరం, సీతానగరం మండలాల్లో విత్తన కంపెనీల కారణంగా రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఈ ప్రాంతంలో 330 మంది రైతులు, 1,150 ఎకరాల్లో సాగుచేసిన వరి పంటకు అగ్గితెగులు సోకింది. ఖరీఫ్ సాగులో దిగుబడి తగ్గడంతో రబీసాగుపై నమ్మకం పెట్టుకున్న రైతులు సాగుకు ఉపక్రమించారు. కార్పొరేట్ విత్తన కంపెనీల రూపంలో రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. వ్యవసాయశాఖ కోరుకొండ సబ్–డివిజన్లో కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాలున్నాయి. ఈసబ్ డివిజన్లో 10,150 మంది రైతులు రబీ సీజన్లో 21,526 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. కాగా కోరుకొండ మండలంలో 5,621 ఎకరాలు, సీతానగరం మండలంలో 11,022 ఎకరాలు, గోకవరం మండలంలో 4,883 ఎకరాల్లో వరి సాగు చేశారు. అయితే అగ్గితెగులు కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన చెదుతున్నారు. గింజ పెరిగే దశలోని చేలల్లో, పుష్పగుచ్ఛానికి ఆహారం వెళ్లకుండా అడ్డుకుంటుందన్నారు. దీంతో తాలు, తప్ప గింజలు మాత్రమే రైతులకు దక్కుతాయని గగ్గోలు పెడుతున్నారు. ఈకారణంగా పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. ఈమేరకు ఇటీవల వ్యవసాయశాఖ ఏడీ శ్రీనివాసరావుకు ఫిర్యదు చేశారు. విత్తన దుకాణాల కారణంగానే నష్టపోయినట్టు రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. శాస్త్రవేత్తలకు పంపాం గోకవరం, సీతానగరం మండలాల్లోని రైతుల ఫిర్యాదు మేరకు విత్తనాల విషయమై శాస్త్రవేత్తలకు ఫిర్యాదులను పంపాము. వారు వచ్చి పంటపొలాలను పరిశీలిస్తారు. ఆ తర్వాతే నిర్ధారణ చేస్తారు. అలాగే సమస్యను వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. ఈ సమస్య నిర్దిష్టంగా తంటికొండ, గాదెలపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉంది. అగ్గితెగులు కారణంగా ఆశించినంత దిగుబడి రాదు. తాలు, తప్పలు మాత్రమే వస్తాయి. – డి.శ్రీనివాసరావు, వ్యవసాయశాఖ ఏడీ, కోరుకొండ నకిలీ విత్తనాలే కారణమంటున్న రైతులు గోకవరం, సీతానగరం మండలాల్లో 1,150 ఎకరాల్లో పంట నష్టం పొలాలను పరిశీలించిన అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఫిర్యాదు -
దర్జాగా నీటి చౌర్యం
తాళ్లరేవు: నీటి అవసరాలు పెరిగిపోవడంతో అక్రమార్కులు భూగర్భ జలాలను విచక్షణా రహితంగా వినియోగిస్తున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో నీటిని నిత్యం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, విద్యా సంస్థల అవసరాల కోసం భూగర్భ జలాలను యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రహదారుల చెంతన బోర్లను వేసి నీటిని తోడి ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నారు. పలుచోట్ల అనధికారికంగా బోర్లను వేసి నీటిని యథేచ్ఛగా తోడుతున్నారు. నిత్యం లక్షలాది లీటర్ల నీటిని తోడి తరలిస్తుండడంతో భూగర్భజలాల స్థాయి పడిపోతుందని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రమైన తాళ్లరేవు, పోలేకుర్రు తదితర పంచాయతీల్లో రహదారుల చెంతన బోర్లను వేసి ఇంజిన్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో పట్టి కంపెనీలకు, కళాశాలలకు తరలిస్తున్నారు. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నా మండల అధికారులుగాని, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గాని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతుల్లేకుండా ట్రాక్టర్లు, లారీ ట్యాంకర్లలో తరలింపు పట్టించుకోని భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న మంచినీటి బోర్లు అడుగంటుతున్న భూగర్భజలాలు -
కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకూ పోరాడతాం
ప్రకాశం నగర్: మున్సిపల్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే వరకు పోరాటం ఆగదని, పాలకులు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కష్టజీవులకు ఎరజ్రెండా అండగా ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక సుబ్రహ్మణ్య మైదానంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఆరవ మహాసభ నిర్వహించారు. అంతకు ముందు మున్సిపల్ స్టేడియం నుంచి కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తాడితోట సెంటర్, బైపాస్ రోడ్డు, దేవీచౌక్, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్య మైదానం వరకు సాగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎనిమిది గంటలు పని సమయాన్ని పెంచడం దారుణమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళపై భారం మోపేందుకే గ్యాస్ ధరలను అమాంతంగా పెంచారని, వంటగ్యాసుపై రూ.60, కమర్షియల్ గ్యాస్ బండపై రూ.115 పెంచడం దుర్మార్గమన్నారు. వచ్చే ఎన్నికల్లో మోదీకి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం మాత్రం ప్రజలు మరిచిపోరన్నారు. మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి ఎం.రాధాకృష్ణన్ మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ వ్యక్తులకు కార్మికుల శ్రమను దోచి పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని, దీనివల్ల యావత్ కార్మిక రంగానికి తీవ్రం నష్టం వాటిల్లే పరిస్థితి ఉందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ ఆప్కాస్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని గద్దెనెక్కిన లోకేష్ బాబు మాట మార్చి ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కుట్ర పన్నుతున్నారని ఆయన విమర్శించారు. మున్సిపాల్ కార్మిక నాయకులు తమ ఐక్యతను చాటారు. ఈ బహిరంగ సభకు యూనియన్ అధ్యక్షుడు అసుల రంగనాయకులు అధ్యక్షత వహించగా, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చలసాని రామారావు, ఏఐటీయూసీ నాయకులు ఏసు రత్నం, పోరుమామిళ్ల సుబ్బారాయుడు, తులసేంద్ర, నెక్కంటి సుబ్బారావు, కిర్ల కృష్ణరావు, తాటిపాక మధు, రేఖ భాస్కరావు తదితరులు పాల్గొన్నారు. -
మరణించిన విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమా
తాటిచెట్లపాలెం (విశాఖ): విధి నిర్వహణలో మరణించిన ఏపీఈపీడీసీఎల్ ఉద్యోగి కుటుంబానికి కార్పొరేట్ ప్రమాద బీమా కింద రూ.కోటి పరిహారాన్ని అందజేశారు. కాకినాడ సర్కిల్ పెద్దాపురం సెక్షన్లో జేఎల్ఎం గ్రేడ్–2గా పనిచేస్తూ గత ఆగస్టులో ప్రమాదవశాత్తూ మరణించిన ఆరుమిల్లి రామకృష్ణ కుటుంబానికి ఈ ఆర్థిక భరోసా లభించింది. సోమవారం విశాఖలోని సంస్థ కార్యాలయంలో సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి చేతుల మీదుగా మృతుని తల్లి సూర్యకుమారికి ఈ చెక్కు అందజేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ శాలరీ సేవింగ్స్ ఖాతాకు అనుబంధంగా ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం సమకూరింది. సీఎండీ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవడంలో బ్యాంక్ బీమా పథకాలు ఎంతో దోహదపడతాయని, సంస్థ ఎల్లప్పుడూ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ ఫైనాన్స్ డైరెక్టర్ ఎస్.హరిబాబు, ఎస్బీఐ అమరావతి డీజీఎం అశోక్ వి సోనునే, విశాఖ ఏజీఎం ఎస్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు ఎ.శ్రీనివాస్, ఎల్.అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్కు సీఐ రాంబాబు నల్లజర్ల: స్థానిక సీఐ వై.రాంబాబు వీఆర్కు వెళ్లారు. ప్రసుత్తం ఆ బాధ్యతలను దేవరపల్లి సీఐ నాగేశ్వరావునాయక్కు అప్పగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నల్లజర్ల పోలీస్ స్టేషన్లో సీఐలు, ఎస్ఐలు రావడం, పోవడం పరిపాటిగా మారింది. ఎవరు వస్తున్నారో.. ఎవరు ఇక్కడ పనిచేస్తున్నారనే విషయం స్థానికులకు సైతం తెలియకుండా పోయింది. అపుడే దాదాపు ఐదారుగురు సీఐలు, పది మందికి పైగా ఎస్ఐలు మారుతూనే ఉన్నారు. కారణం ఏమిటో తెలియడం లేదని స్ధానికులు అంటున్నారు. కోడిపందాలు, పేకాటలు, జూదాలు, డ్రగ్స్ మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక, మట్టి మాఫియా అన్నీ ఈ మండలంలోనే ఉన్నాయి. వీటన్నింటిని చూసీచూడనట్టు ఉంటేనే ఇక్కడ ఏ అధికారి అయినా ఉద్యోగం చేయగలుగుతారు. లేకుంటే మర్నాడే వేరే చోటికి బదిలీ కావాల్సిందేనన్న విమర్శలు బహిరంగంగా వినపడుతున్నాయి. ప్రస్తుత సీఐకు కూడా ఈవిధంగానే వీఆర్ జరిగిందా అన్న సందేహాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. సీఐ వీఆర్కు వెళ్లిన సంగతి ఇంతవరకు గోప్యంగానే ఉంది. పాఠశాలలో శిలాఫలకం ధ్వంసం ముమ్మిడివరం: కొమానపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు పనుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు పథకంలో సుమారు రూ.50 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మేరకు అప్పటి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. దీనికి సంబంధించి శిలాఫలకాన్ని పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. అయితే ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు శిలాఫలకాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఈ ఘటణకు కారకులైన వ్యక్తులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ సర్పంచ్ కాశి రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సోమవారం ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు సబ్రిజిస్ట్రార్గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కార్యాయలం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. కాకినాడ జిల్లా మార్కెట్ అండ్ ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న టి.గణేష్బాబును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట సబ్రిజిస్ట్రార్గా నియమించారు. కాకినాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ కార్యాయలంలో విధులు నిర్వహిస్తున్న సీహెచ్ శ్రీనివాసమూర్తిని పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు సబ్రిజిస్ట్రార్గా నియమించారు. -
మత్తు మందు జల్లి ఆభరణాలు చోరీ!
నల్లజర్ల: హైదరాబాద్ నుంచి నల్లజర్ల మండలం పోతవరానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ప్రయాణికురాలిపై అర్ధరాత్రి మత్తుమందు జల్లి ఆమె బ్యాగులో ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరగ్గా బాధితురాలు గద్దె భారతిలక్ష్మి మార్చి 2న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతవరంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పోతవరానికి చెందిన గద్దె భారతీలక్ష్మి ఫిబ్రవరి 20న హైదరాబాద్లో బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు గద్దె భారతీలక్ష్మి, బంధువు కరుటూరి నాగశిరోమణి కలసి 28న రాత్రి ఏయస్బీఆర్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. డ్రైవర్ వెనుక ఉన్న స్లీపర్లో వీరద్దరూ పడుకున్నారు. రాత్రి పడుకునే ముందు భారతీలక్ష్మి ఫోన్ బ్యాగ్లో పెట్టేటప్పుడు అందులో ఉన్న బంగారు ఆభరణాలు సరిచూసుకున్నారు. బస్సు ఎక్కడా ఆగలేదు. పోతవరం వచ్చాక బంధువులకు ఫోన్ చేసేందుకు బ్యాగులో చేయిపెడితే నగల ఆచూకీ లేదు. తలదగ్గర పెట్టుకున్న బ్యాగు పెట్టుకున్నట్టే ఉంది. కానీ అందులో నగలు లేవు. దీంతో కంగారు పడి బంధువులకు ఫోన్చేసి చెప్పారు. బస్సు ప్రయాణంలో తన నగలు బంగారు నెక్లెస్, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు మొత్తం 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్టు భారతీలక్ష్మి ఫిర్యాదు చేశారు. బస్సు సిబ్బందే తమపై మత్తుమందు చల్లి ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు పోలీసులు విచారణ చేపట్టక పోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. దీనిపై నల్లజర్ల ఎస్ఐ ఆంజనేయబాబును వివరణ కోరగా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అందుకే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్తో పాటు భారతీలక్ష్మితో పాటు ప్రయాణించిన 15 మంది ప్రయాణికులను విచారించామని ఈరోజు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 18,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధవళేశ్వరం: స్థానిక ప్రధాన రహదారి శాంతారామ్ హాస్పిటల్ సమీపాన సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కొవ్వూరు మండలానికి చెందిన యర్రంశెట్టి శ్రీనివాస్ (58) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బేబీ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నారు. సంఘటనకు సంబంధించి ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొవ్వూరు మండలం మద్దూరులంకకు చెందిన భార్యాభర్తలు యర్రంశెట్టి శ్రీనివాస్, బేబి గ్రామంలో త్వరలో జరగనున్న ఉత్సవాలకు కొత్తబట్టలు కొనుక్కునేందుకు సోమవారం షాపింగ్కు వెళ్లారు. షాపింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ధవళేశ్వరం శాంతారామ్ హాస్పిటల్ సమీపానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మృతుని భార్య బేబిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బేబి అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు శ్రీనివాస్ ఆటోపై ఉల్లిపాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరిపై సిరుల వాన
● సత్యదేవునికి రూ.1.23 కోట్ల హుండీ ఆదాయం ● వివాహాల సీజన్తో పెరిగిన రాబడిఅన్నవరం: వివాహాల సీజన్ కావడంతో రత్నగిరిపై సిరుల వాన కురిసింది. గడచిన 21 రోజులకు గాను హుండీల ద్వారా సత్యదేవునికి రూ.1,23,68,424 ఆదాయం సమకూరింది. దేవస్థానంలో హుండీలను సోమవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. నగదు రూ.1,14,11,009, చిల్లర నాణేలు రూ.9,57,415 లభించాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు తెలిపారు. వీటితో పాటు బంగారం ఏడు గ్రాములు, వెండి 320 గ్రాములు లభించాయని చెప్పారు. అలాగే, యూఎస్ఏ డాలర్లు 126, సింగపూర్ డాలర్లు 2, ఖతార్ రియల్స్ 82, కువైట్ దీనార్లు 3, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీరామ్స్ 120, సౌదీ రియల్స్ 20, ఆస్ట్రేలియా డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 2, కెనడా డాలర్లు 5, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ దీనార్లు 3 వేలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ లిబియా దీనార్లు 10, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 500, నరోడ్నా బ్యాంక్ స్రర్జీ దీనార్లు 10, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ రియల్స్ 1 చొప్పున లభించాయని వివరించారు. మొత్తం 21 రోజులకు గాను హుండీల ద్వారా సగటున రోజుకు రూ.5,88,972 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ బాబూరావు, అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, దేవస్థానం సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. వివాహాల జోరుతో.. సుమారు మూడు నెలల మూఢమి తరువాత గత నెల 18 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభమయ్యాయి. దీంతో, రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో వివాహాలు జోరుగా జరుగుతున్నాయి. అలాగే, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకుంటున్నవారు కూడా సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. స్వామివారి హుండీల్లో దండిగా కానుకలు సమర్పిస్తున్నారు. ఫలితంగానే హుండీల ఆదాయం పెరిగిందని భావిస్తున్నారు. తగ్గిన బంగారు కానుకలు ఏడాది కాలంగా బంగారం ధరకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంతో సత్యదేవుని హుండీల్లో భక్తులు సమర్పిస్తున్న బంగారు కానుకలు కూడా బాగా తగ్గిపోయాయి, ఈసారి హుండీల్లో బంగారం 7 గ్రాములు మాత్రమే వచ్చింది. గత నెల 5న జరిగిన హుండీల ఆదాయం లెక్కింపులో 11.5 గ్రాములు, 23న 12 గ్రాములు వచ్చింది. సత్యదేవుని హుండీల్లో భక్తులు సమర్పించే బంగారు కానుకలు మామూలుగానే తక్కువగా ఉంటాయి. అటువంటిది బంగారం ధర పెరుగుదలతో ఇది మరింతగా తగ్గింది. -
మహానీయుడు పొట్టి శ్రీరాములు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ఆత్మార్పణం చేసిన గొప్ప మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ మూల పురుషుడు అయిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా స్థానిక సీబీఎం స్కూల్ సెంటర్ వద్ద ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కలెక్టర్ సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు బాటలు వేసి, తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 33 పోస్టులకు 452 దరఖాస్తులుకాకినాడ క్రైం: గత ఏడాది డిసెంబర్ 15న రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్, అల్లైడ్ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్కు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం పది కేటగిరీల్లోని 33 పోస్టులకు 452 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ప్రొవిజినల్ మెరిట్ లిస్టును ఆన్లైన్లో పొందుపరిచామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్తలూరి విష్ణువర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు apego@nic.in, rmckakinada.com వెబ్సైట్లలో అప్లోడ్ చేసిన మెరిట్ లిస్టులో తమ పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే తగిన పత్రాలతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. మంగళవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ వారం రోజుల పాటు తమ కళాశాలలో పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య అభ్యంతరాలు స్వీకరిస్తామని డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. పీజీఆర్ఎస్కు 498 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు 498 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, వివిధ శాఖల అధికారులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డుల మంజూరు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, పూడికల తొలగింపు, పారిశుధ్యం, వివిధ సంక్షేమ పథకాల లబ్ధి వంటి వాటిపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఈ అర్జీలను గడువులోగా పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 24¯]l A£ðlÏ-sìæMŠS G…í³MýSË$నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 24న జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్ఏ)లో నిర్వహిస్తున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) వి.సతీష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 35, 45 సంవత్సరాలు పైబడిన విభాగంలో పురుషులు, మహిళలకు ఈ ఎంపికలు జరుగుతాయన్నారు. 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావలిన్త్రో, 4ఘ400 మీటర్ల రిలేలో ఎంపికలు నిర్వహిస్తామని వివరించారు. అర్హులైన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తామన్నారు. కాకినాడ డీఎస్ఏలో ఆ రోజు ఉదయం 7 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయని తెలిపారు. వివరాలకు 94400 31601 నంబరులో సంప్రదించాలని కోరారు. -
టెన్త్ పరీక్షలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 28,551 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా తొలి రోజు తెలుగు పరీక్షకు 28,373 మంది హాజరయ్యారు. 178 మంది పరీక్ష రాయలేదని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 8.45 గంటల నుంచే విద్యార్థులను గేటు వద్ద పూర్తి స్థాయిలో తనిఖీ చేసి, ఆయా కేంద్రాల లోపలకు అనుమతించారు. బ్యాగులు, ఎలక్ట్రానిక్స్ పరికరాలను అనుమతించలేదు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 35, డీఈఓ 5, అసిస్టెంట్ ఎగ్జామినేషన్స్ కమిషనర్ 4 కేంద్రాల్లో తనిఖీలు చేశారు. గత ఏడాది జరిగిన పదో తరగతి పరీక్షల్లో సరైన సౌకర్యాలు లేక దివ్యాంగ విద్యార్థులు అవస్థలు పడ్డారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు డీఈఓను ముందుగానే సంప్రదించచారు. దీంతో, వారికి గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. ఓపెన్ స్కూల్ టెన్త్కు 1,538 మంది హాజరు ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు సోమవారం తెలుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,130 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 1,538 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. 592 మంది గైర్హాజరయ్యారని డీఈఓ రమేష్ తెలిపారు. -
రోజుకో చోటు.. మారుతున్న రూటు
డ్రోన్ కెమెరాకు చిక్కిన పులి సంచారం● పులి దోబూచులాట ● రంగంలోకి 11 హనుమాన్ బృందాలు ● ఏ క్షణంలోనైనా బంధించే అవకాశం ● ఏప్రత్తిపాడు రూరల్/శంఖవరం: పులి దోబూచులాటకు తెర పడటం లేదు. రోజుకో రూటు మారుస్తూండటంతో దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించడం లేదు. దీంతో, ఎడతెగని సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ పులి శంఖవరం నుంచి ఆదివారం తాళ్లపాలెం, మండపం గ్రామాల మధ్య ఉన్న కొండ పైకి చేరింది. అక్కడ ఓ గేదె దూడను హతమార్చింది. అక్కడి నుంచి సోమవారం జి.కొత్తపల్లి నల్లకొండమ్మ తల్లి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండ పైకి చేరింది. అక్కడి నుంచి తిరిగి మాసంపల్లి వైపు వెళ్లిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జి.కొత్తపల్లి, మాసంపల్లి, రాజారం, గొంది, అచ్చింపేట తదితర గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. నిరంతర పర్యవేక్షణ కొన్నాళ్లుగా ప్రత్తిపాడు, శంఖవరం మండలాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న ఈ పులిని ఎలాగైనా పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, అటవీ దళాల అధిపతి పీవీ చలపతిరావు, ప్రధాన అటవీ సంరక్షణాధికారి శ్రీకంఠనాథరెడ్డి, జిల్లా అటవీ అధికారి ఎన్.రామచంద్రరావు స్వీయ పర్యవేక్షణలో పులి కదలికలను 11 హనుమాన్ బృందాలు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. వీటిలో 3 ట్రాంక్విలైజింగ్, 2 డ్రోన్, వీహెచ్ఎఫ్ సిగ్నల్ స్వీకరణ బృందాలతో పాటు రాజమహేంద్రవరం, ఏలేశ్వరం, కాకినాడలకు చెందిన నాలుగు ర్యాపిడ్ రెస్పాన్స్ – రెస్క్యూ బృందాలున్నాయి. పులిని బంధించేందుకు అది సంచరిస్తున్న ప్రాంతంలో ఈ బృందాలు మోహరించాయి. విశాఖపట్నంలోని జూ పార్కు నుంచి తీసుకువచ్చిన వన్యప్రాణి అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచారు. పులి సంచరిస్తున్న పరిసర గ్రామాల్లో పర్యటించి ఒకవైపు ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా, మరోవైపు పులి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేయడంలో భాగస్వాములవుతున్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు చలపతిరావు, శ్రీకంఠనాథరెడ్డి ఆయా ప్రాంతాలను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సరైన సమయం, సరైన ప్రదేశంలో పులిని సురక్షితంగా పట్టుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. పులి కదలికలపై రాత్రి వేళ కూడా డ్రోన్లతో నిఘా కొనసాగిస్తున్నారు. ఏలేశ్వరం, కాకినాడ అటవీ రేంజ్ అధికారులు దుర్గా రాంప్రసాద్, శ్రీదీప్తి, కోరంగి వైల్డ్ లైఫ్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అటవీ అధికారులు, సిబ్బంది భారీ ఎత్తున తరలివచ్చి పరిస్థితిని సమీక్షించారు.


