Kakinada
-
పుణ్యక్షేత్రాల్లో పట్నా హైకోర్టు న్యాయమూర్తి
అన్నవరం/సామర్లకోట: బిహార్ రాజధాని పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం అన్నవరం, సామర్లకోట ఆలయాలను సందర్శించారు. అన్నవరంలో సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలను ఏఈఓ ఎల్.శ్రీనివాసరావు అందజేశారు. సామర్లకోటలోని పంచారామ క్షేత్రమైన శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయాన్ని కూడా జస్టిస్ అభిషేక్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించి, పూజలు చేశారు. కాలభైరవ స్వామి, ధ్వజస్తంభం, పెద్ద నంది, ఉపాలయాలు, మూలవిరాట్టును, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ పండితులు ఆశీర్వచనాలు.. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను ఈఓ బళ్ల నీలకంఠం అందజేశారు. -
అబ్బో.. సేనా..తన ధర్మమే!
పిఠాపురం: దేశంలోని పంచ మాధవ క్షేత్రాల్లో ఒకటైన పిఠాపురం కుంతీమాధవ స్వామి సాక్షిగా జనసేన నేతలు తీవ్ర అపచారానికి ఒడిగట్టారు. కుంతీమాధవస్వామి వారి కోనేరు అభివృద్ధి పనులకు జనసేన నేతలు శుక్రవారం సాయంత్రం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కుంతీమాధవ స్వామి వారికి గ్రామోత్సవం నిర్వహించారు. స్వామి వారిని మేళతాళాలతో ఊరేగింపుగా కోనేరు వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జనసేన నేతలు స్వామి వారి ఊరేగింపును వదిలేసి, జనసేన నేత, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ మేళం రామకృష్ణ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు అక్కడ ఉండగానే.. పవిత్రమైన కోనేటి ప్రాంగణంలో కేకులు కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. ఈ పుట్టిన రోజు వేడుకలను జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు దగ్గరుండి మరీ నిర్వహించడం గమనార్హం. సనాతన ధర్మం అంటూ నిత్యం ప్రసంగాలు దంచే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో.. అదే పార్టీకి చెందిన నాయకులు ఆ సనాతన ధర్మాన్ని కోనేటిలో కలిపేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ కుంతీమాధవ స్వామి ఊరేగింపులో అపచారం ఫ పవిత్ర కోనేరులో జనసేన నేత పుట్టిన రోజు వేడుకలు ఫ దేవుని ఊరేగింపు వదిలేసి.. కేక్ కట్ చేసి, కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు -
రత్నగిరి.. అగ్నిఝరి
మార్తాండుని ప్రచండ తాండవంతో రత్నగిరి శుక్రవారం అగ్ని‘ఝరి’ని తలపించింది. 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఎండ వేడిని తట్టుకోలేక సత్యదేవుని దర్శనానికి వేలాదిగా వచ్చిన భక్తులు అల్లాడి పోయారు. ఎండ వేడికి పెనంలా మారిన నేలపై నడవలేక చిన్నారులు, మహిళలతో పాటు పలువురు భక్తులు నీడ కోసం పరుగులు తీశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్లు, విశ్రాంతి మండపాలు, చెట్ల నీడన సేద తీరారు. సూర్య ప్రతాపం ప్రభావంతో సత్యదేవుని మెట్ల దారి, టోల్గేట్, పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న ప్రాంగణం, ఘాట్ రోడ్లు దాదాపు నిర్మాన్యుషంగా దర్శనమిచ్చాయి. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, ఎండ కూడా 40 డిగ్రీలకు పైబడే అవకాశం ఉందని. ఎండ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. – అన్నవరం విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సుల కోసం భక్తుల ఎదురుచూపులు కొండ దిగువనా అదే పరిస్థితి: దేవస్ధానం టోల్ గేటు కానరాని జనసంచారం -
పోతులూరులో కలుషిత నీటి కలకలం
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని పోతులూరులో తాగునీరు కలుషితం కావడం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని రక్షిత మంచినీటి పథకం ద్వారా గురువారం సరఫరా అయిన నీటి నుంచి పురుగు మందుల వాసన, నీరు రంగు మారి నురగలు రావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎంపీడీఓ ఎంవీఆర్ కుమార్బాబుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు పోతులూరులోని రక్షిత మంచినీటి పథకాన్ని పరిశీలించారు. తాగునీటి సరఫరాను తక్షణం నిలిపివేశారు. నీరు కలుషితమవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. నీటి నమూనాలు సేకరించి, ల్యాబ్కు తరలించారు. కలుషితమైన ఈ నీటిని ఎవ్వరూ తాగవద్దని, ఇతర అవసరాలకు వినియోగించవద్దని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు గ్రామంలో దండోరా వేయించారు. ప్రజలు తాత్కాలికంగా ప్రత్యామ్నాయ నీటి వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ల్యాబ్లో నీటి పరీక్షల ఫలితాల అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వాటర్ ట్యాంకును బ్లీచింగ్తో రెండుసార్లు శుభ్రం చేసి, నీటిలో బ్లీచింగ్ వేసి, నాలుగు గంటల పాటు ఉంచి, శుక్రవారం సాయంత్రం తాగునీటిని సరఫరా చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు. -
‘సర్’ పటిష్టంగా నిర్వహించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. జిల్లాలో సర్ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఈ నెల 14వ తేదీ వరకూ ఓటరు నమోదు అధికారులు, బూత్ స్థాయి అధికారులకు నిర్వహణ సన్నద్ధత, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. సమగ్ర శిక్షణ అనంతరం, ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ప్రతి ఇంటినీ సందర్శించి ఓటర్ల ఎన్యూమరేషన్ చేపట్టాలని సూచించారు. సర్ ప్రక్రియ గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయడం, అనర్హులను, డూప్లికేట్ ఎంట్రీలను, చనిపోయిన, వేరొక ప్రాంతానికి తరలిపోయిన వారిని తొలగించడం లక్ష్యంగా ‘సర్’ను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ డి.తిప్పేనాయక్ కూడా పాల్గొన్నారు. నేటి నుంచి తెలుగు సాహితీ మహాసభలు రాజానగరం: వెలుగుబంద సమీపంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ(జీజీయూ)లో రెండు రోజుల పాటు జరిగే ఏడో ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు శనివారం ప్రారంభం కానున్నాయి. సాహిత్య, సాంస్కృతిక విభాగాలు, రంగస్థల ప్రదర్శనలు, జానపద కళారూపాలు, ప్రాచీన కవుల వారసుల ప్రత్యేక ప్రదర్శనలు వీటిలో ముఖ్య ఆకర్షణలుగా ఉంటాయని నిర్వాహకులు కేవీవీ సత్యనారాయణరాజు, కత్తిమండ ప్రతాప్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ను బర్తరఫ్ చేయాలి నిడదవోలు: రాష్ట్రంలోని 1.10 కోట్ల మంది దళితులు, దళిత క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. దళిత సంఘాలు, దళిత క్రైస్తవ ప్రతినిధులతో నిడదవోలులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రఘురామ కృష్ణరాజుకు అల్టిమేటం ఇవ్వడానికి, ప్రభుత్వ పెద్దలకు గుణపాఠం చెప్పడానికి ఈ నెల 28న ఏలూరులో లక్ష మంది దళితులు, దళిత క్రైస్తవులతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రం నలుమూలల నుంచి, దళితులు, దళిత క్రైస్తవులు తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ రాష్ట్రంలోని 113 చర్చిలను, చర్చిలపై మైకులను తొలగించాలంటూ రఘురామ కృష్ణరాజు ఏ అధికారంతో డీజీపీకి లేఖ రాశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఏ మతానికి, సంప్రదాయానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు వద్దని చెబుతున్న రఘురామ కృష్ణరాజు.. వారు కడుతున్న పన్నును జీతంగా ఎలా తీసుకుంటారని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తీసుకున్న జీతాన్ని రఘురామ ప్రభుత్వానికి జమ చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సొరంగ మార్గంలో ప్రయాణం ప్రమాదకరం దేవీపట్నం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా గొందూరు నుంచి ఎడమ కాలువ, నావిగేషన్ కెనాల్కు నీరందించేందుకు కొండను తవ్వి నిర్మించిన సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని దేవీపట్నం ఎస్సై షరీఫ్ తెలిపారు. ఇటీవల గండిపోశమ్మ ఆలయానికి వచ్చేందుకు పురుషోత్తపట్నం వైపు నుంచి ఉన్న రహదారిని ప్రాజెక్టు అధికారులు మూసివేశారు. అయితే, ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా చేసుకుని రీల్స్ చేసేందుకు కొంతమంది పురుషోత్తపట్నం, నేలకోట వైపు నుంచి సొరంగ మార్గంలో గొందూరు చేరుకుంటున్నారన్నారు. ఈ మేరకు సొరంగ మార్గంలో ప్రయాణించడం ప్రమాదకరమని తెలిపే ఫ్లెక్సీలు పెట్టి, పహారా ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఈ మార్గంలో ప్రయాణిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సస్పెండ్ చేసిన కండువా
అన్నవరం: ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అంటూ ఇంద్ర సినిమాలో చిరంజీవి చెప్పిన డైలాగ్ చాలా పాపులర్. ఇప్పుడు రత్నగిరిపై ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఆ ఏవుందిలే.. మామూలు కండువాయే కదా అని అధికారులు, సిబ్బంది పట్టించుకోలేదు. ఇప్పుడా కండువాయే వారిపై సస్పెన్షన్ వేటు వేయించింది. ఈ సంఘటన వివరాలివీ.. రత్నగిరిపై సత్యదేవుని నిత్య కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్లతో వ్రతాలాచరించే భక్తులకు చాలా సంవత్సరాలుగా అంచు మీద జరీతో స్వామివారి నామం ముద్రించిన కండువాలను అందించేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్ దక్కించుకున్న కొత్త టెండర్దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు రోజుకో డిజైన్, రంగు కలిగిన కండువాలు ఇవ్వడంపై భక్తుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ శీర్షికన ‘సాక్షి’ గురువారం కథనం ప్రచురించింది. ఈ కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. వెంటనే సత్యదేవుని నామం ముద్రించిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్దారుపై అధికారులు ఒత్తిడి తేవడంతో గురువారం 900 కండువాలు పంపించాడు. వీటిని గురు, శుక్రవారాల్లో భక్తులకు అందజేశారు. అయితే, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించారన్న అభియోగంపై సెంట్రల్ స్టోర్స్ విభాగం సూపరింటెండెంట్ తాడి గుర్రాజును ఆ విభాగం నుంచి గోశాల, గార్డెన్కు బదిలీ చేశారు. అలాగే, జూనియర్ అసిస్టెంట్ కె.రమణబాబును సత్యగిరి సత్రాల శానిటరీ సూపర్వైజర్గా బదిలీ చేశారు. తాజాగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఈఓ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంలో వారం రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు.·˘ Æý‡™èl²WÇOò³ çÜ*ç³Ç…sñæ…yðl…sŒæ, గుమాస్తాలపై వేటు ·˘ ÐéÆý‡… ÆøkÌZÏ సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం -
దివ్య క్షేత్రం.. వైద్యం పూజ్యం
● రత్నగిరిపై భక్తులకు అందని అత్యవసర వైద్యం ● గుండెపోటుతో ఆరు నెలల్లో ఇద్దరి మృతి ● అలంకారప్రాయంగా కార్పొరేట్ ఆసుపత్రి సేవా కేంద్రంఅన్నవరం: అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందించే అవకాశం రత్నగిరిపై లేకపోవడం భక్తులకు ప్రాణసంకటంగా మారుతోంది. కొండపై అందుబాటులో ఆస్పత్రి, అంబులెన్సు వంటి సదుపాయాలు లేవు. దీంతో, ఊహించని విధంగా అస్వస్థతకు గురైన కొంత మంది భక్తులు చికిత్సలో జాప్యం జరిగి ప్రాణాలు కోల్పోతూండటం.. వారి కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తోంది. ముఖ్యంగా 50 సంవత్సరాల వయస్సు నిండిన భక్తులు ఉపవాసంతో, ఎంతో భక్తితో సత్యదేవుని వ్రతాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని, ఆలయం వెలుపలకు రాగానే డీహైడ్రేషన్తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రస్తుత వేసవిలో ఈ ఇబ్బంది మరింతగా ఉంటోంది. గుండెపోటు, షుగర్, బీపీ తదితర వ్యాధులున్న వారు అస్వస్థతకు గురైతే తక్షణ వైద్యం అందించే అవకాశం దేవస్థానంలో లేదు. కొండ దిగువన ఉన్న దేవస్థానం వైద్యశాలకు తరలించినా, అక్కడ సరైన వైద్యం అందడం లేదు. కొంతమందిని తుని ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. కానీ, ఆయా ఆసుపత్రులకు తరలించే లోపే అత్యవసర చికిత్స అందక భక్తులు మార్గం మధ్యలోనే మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గడచిన ఆరు నెలల వ్యవధిలో ఈవిధంగా ఇద్దరు భక్తులు గుండెపోటుతో ఆలయం వెలుపల మృతి చెందారు. గత నవంబర్లో పెద్దాపురం మండలం దివిలికి చెందిన వెన్నా సత్యనారాయణ, గత మంగళవారం అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఇద్దరికీ కూడా తక్షణ వైద్య సహాయం అందకపోవడం గమనార్హం. వైద్య శాలలో అరకొర సేవలు అన్నవరం దేవస్థానం కొండ దిగువన గత 60 ఏళ్లుగా ఉచిత వైద్యశాలను నిర్వహిస్తోంది. వైద్యపరంగా అన్నవరం గ్రామానికి ఒకప్పుడు ఇదే పెద్ద దిక్కు. తగినంత మంది సిబ్బంది ఉన్నప్పటికీ కాలక్రమేణా భక్తులకు తగిన వైద్య సహాయం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సిబ్బంది సకాలంలో వస్తున్నా వైద్యాధికారి మాత్రం ఆలస్యంగా విధులకు హాజరవుతూండటంతో అరకొర వైద్యమే అందుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు. వైద్యాధికారి కోసం ఎదురు చూసి వెళ్లిపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దేవస్థానంలో కనీస వైద్య సదుపాయం అందే పరిస్థితి లేదు. ఓ కార్పొరేట్ ఆసుపత్రి సిబ్బంది రత్నగిరి రామాలయం ఎదురుగా ఓ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ కనీసం తలనొప్పి మాత్రలు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. ఈ చర్యలు మేలు ● భక్తులు ఉపవాసంతో కాకుండా టీ, కాఫీ, పాల వంటి ద్రవ పదార్థాలు తీసుకోవచ్చని, అలాగే, బీపీ, షుగర్ బాధితులు తగిన మందులు వేసుకుని, వ్రతాలు, దర్శనం చేసుకోవచ్చని మైకులో ప్రచారం చేయాలి. ● కార్తిక మాసం, స్వామివారి కల్యాణోత్సవాల్లో మాత్రమే ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను నిత్యం కొనసాగించాలి. పీహెచ్సీ, దేవస్థానం ఆసుపత్రి సిబ్బంది రత్నగిరిపై పగలు, రాత్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించే మందులు, గుండెనొప్పి వస్తే తక్షణం పని చేసే మందులను రత్నగిరిపై అందుబాటులో ఉంచాలి. ● డీహైడ్రేషన్కు గురవకుండా భక్తులకు తగిన వైద్య సహాయం అందించాలి. ● రత్నగిరిపై ఉన్న కార్పొరేట్ ఆసుపత్రి కేంద్రంలో అనుభవజ్ఞులైన సిబ్బందితో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. ● రత్నగిరికి ప్రత్యేకంగా అంబులెన్సు ఉండేలా చర్యలు తీసుకోవాలి. భక్తులు గుండెపోటుకు గురైతే అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి సకాలంలో ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేయాలి. -
అన్ని వర్గాలకూ వెన్నుపోటు
● రెండేళ్ల పాలనలో చంద్రబాబు చేసింది శూన్యం ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తదితర అన్ని వర్గాలూ వెన్నుపోటుకు గురయ్యాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలో గురువారం జరిగిన ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం, అభివృద్ధి చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. నేడు గ్రామం, పట్టణం అనే తేడా లేకుండా విధ్వంసకర పాలన కనబడుతోందని చెప్పారు. ఎంతో కష్టపడి డీఎస్సీ పరీక్షలు రాసి ర్యాంకులు సాధించినా ఉద్యోగం ఇవ్వని విషయం సాక్ష్యాధారాలతో బయటపడిందని అన్నారు. అయినప్పటికీ ఆ విషయాన్ని డైవర్ట్ చేసేలా కూటమి మంత్రులు, నాయకులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల మధ్య పవన్ చిచ్చు రాష్ట్రం విడిపోయి పన్నెండేళ్లవుతున్నా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్వేషాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజా విమర్శించారు. తెలంగాణలో కోట్ల మంది వ్యాపారులు, ఉద్యోగులు జీవనోపాధి పొందుతున్నారన్నారు. సమయం, సందర్భం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడటం ధర్మమేనా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేసిన సందర్భంగా సభ పెట్టుకుంటే.. అదే రోజు తెలంగాణలో సభ పెట్టడానికి యత్నించిన పవన్ కల్యాణ్.. అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ‘ఒక రోజు ముందో, తర్వాతో పెట్టుకుంటే ఇబ్బందులుండేవి కావు కదా? అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు చిచ్చు పెడుతున్నారు?’ అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంచివాళ్లని మీరే చెబుతున్నారు కదా! ఇక మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో పోటీ చేస్తానంటున్నారు. చేయండి. మిమ్మల్నెవరు అడ్డుకున్నారు? గతంలో పోటీ చేసి ఏం సాధించారు? మీ వ్యక్తిగత అజెండా కోసం రెండు రాష్ట్రాల ఐక్యతను దెబ్బ తీయవద్దు’ అని పవన్కు రాజా హితవు పలికారు. -
ఇన్చార్జి డీపీటీఓగా మనోహర్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి ప్రజా రవాణా అధికారి(డీపీటీఓ)గా కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఎంయూవీ మనోహర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇక్కడ డీపీటీఓగా పని చేసిన శ్రీనివాసరావు విజయవాడ బదిలీ కావడంతో మనోహర్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మనోహర్ను పలువురు ఆర్టీసీ అధికారులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సకాలంలో ఇంజినీరింగ్ పనులుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ ఇంజినీరింగ్ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. ఆయా పనుల పురోగతిపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్అండ్బీ, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్, ఏపీఎంఎస్ఐడీసీ, ఏపీఈడబ్ల్యూఐడీసీ వంటి ముఖ్య ఇంజినీరింగ్ శాఖల పరిధిలో జరుగుతున్న పనుల స్థితిగతులపై ఆయా అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం మంజూరైన అన్ని పనుల గ్రౌండింగ్ తక్షణమే పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ కాలువలకు నీరు వదలడానికి ముందే పూడికతీత, షట్టర్లు, స్లూయిజ్ల మరమ్మతులు తదితర పనులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల మరమ్మతులు, సామాజిక భవనాలు, పీఎంశ్రీ పాఠశాలల్లో లైబ్రరీలు, ల్యాబ్లు, కంప్యూటర్ ల్యాబ్ల నిర్మాణాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రంగరాయ వైద్య కళాశాల పీజీ బాలికల వసతి గృహం, పిఠాపురం ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీని వేగవంతం చేయాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని మిల్లర్లు కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) డెలివరీ వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రబీలో 2.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, సీఎంఆర్ నిమిత్తం జిల్లాలోని మిల్లులకు ఇచ్చామన్నారు. అయితే, మిల్లింగ్ చేసిన బియ్యం సకాలంలో ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా నుంచి ఏపీ పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ 15 వేల మెట్రిక్ టన్నుల ముడి బియ్యం, 85 వేల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. వీటిని మిల్లర్లు ఇస్తే సకాలంలో కేంద్ర పరిధిలోని పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సరఫరా చేయగలమని చెప్పారు. గడువు లోగా మిల్లర్లు సీఎంఆర్ బియ్యం సరఫరా చేయకపోతే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ మేనేజర్ దేవుల నాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లూరి సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. రఘురామ కృష్ణరాజును బర్తరఫ్ చేయాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గత ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయని, 164 సీట్లతో ఒక ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించిన రాష్ట్ర ప్రజలకు నిరాశే ఎదురైందని జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ అన్నారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో, ఎంత చెడు చేసిందో ప్రజలు విశ్లేషించుకుంటున్నారని చెప్పారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి.. దళిత క్రైస్తవుల హక్కులను హరించేలా వ్యవహరిస్తున్న శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం ఈ నెల 28న ఏలూరులో నిర్వహిస్తున్న దళిత క్రైస్తవ సమర శంఖారావం బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
వెన్నుపోటు చంద్రబాబు నైజం
పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి రాష్ట్రంలోని సాధారణ ప్రజల వరకూ వెన్నుపోటు పొడవడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటు. నిత్యం ప్రజలను మోసం చేస్తూ అధికారాన్ని అనుభవిస్తున్నారు. అబద్ధపు హామీలిచ్చి, ప్రజలను వంచించి, అధికారాన్ని చేజిక్కించుకుని, జీవితం సాగిస్తున్న ఇలాంటి ముఖ్యమంత్రిని గతంలో ఎన్నడూ చూడలేదు. – వాసిరెడ్డి జమీలు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, రౌతులపూడి నిరుద్యోగ భృతి పేరుతో మోసం యువతకు 20 లక్షల ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. దీంతో కూటమికి ఓట్లు వేశాం. అయితే, రెండేళ్లు గడచినా ఇప్పటి వరకూ ఉద్యోగాల్లేవు సరికదా.. నిరుద్యోగ భృతిపై ఆలోచించిన దాఖలాలే లేవు. రెండేళ్లకు రూ.72 వేల నిరుద్యోగ భృతి రావాల్సి ఉంది. – ఉప్పెటి ప్రసాద్, నిరుద్యోగి, పెద్దాపురం -
ఎట్టకేలకు సత్యదేవుని నామంతో కండువాలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధికి.. ఆ స్వామి నామం ముద్రించిన కండువాలు ఎట్టకేలకు వచ్చాయి. దేవస్థానంలో చాలా ఏళ్ల నుంచి స్వామివారి కల్యాణం, రూ.2 వేలు, రూ.1,500 టిక్కెట్తో వ్రతాలాచరించే భక్తులకు.. అంచు మీద జరీతో ‘శ్రీ సత్యదేవాయ నమః’ అనే నామం ముద్రించిన కండువాలు అందజేసేవారు. అయితే, కండువాల సరఫరా టెండర్ దక్కించుకున్న కొత్త టెండర్దారు రెండు వారాలుగా స్వామివారి నామం ఉన్న కండువాలు సరఫరా చేయడం లేదు. దీంతో, దేవస్థానం అధికారులు స్వామివారి నామం లేకుండా రోజుకో డిజైన్, రంగు కండువాలను ఇస్తూండటంతో భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీనిపై ‘నీ నామమెంతో రుచిరా!’ ‘సాక్షి’ గురువారం ప్రచురించిన కథనం దేవస్థానంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు వెంటనే స్పందించారు. తక్షణం స్వామివారి నామంతో కూడిన కండువాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఆ మేరకు టెండర్దారుపై అధికారులు ఒత్తిడి తీసుకుని రావడంతో అంచుపై సత్యదేవుని నామం, శంఖచక్రాలు ముద్రించిన 900 కండువాలు రత్నగిరికి గురువారం చేరాయి. వీటిని ఆయా భక్తులకు అందజేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి శుక్రవారం వరకూ సరిపోతాయని, శనివారం నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం 2 వేల కండువాలు పంపించాలని టెండర్దారును అధికారులు ఆదేశించారు. -
సిలబస్ భారం
సిలబస్ భారం వల్ల విద్యార్థులకు సమగ్ర అవగాహన కలగడం లేదు. ఉపాధ్యాయుల బోధనలో కూడా నాణ్యత లోపిస్తుంది. పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం విద్యార్థులకు కష్టంగా ఉంటోంది. సాంఘిక శాస్త్ర సిలబస్ను హేతుబద్ధీకరించాలి. – కేఎస్వీ కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం, రావులపాలెం పని భారం సాంఘిక శాస్త్రంలో సిలబస్ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది మారిన నూతన పాఠ్య పుస్తకాలలో మరింత పెరిగింది. ఇది ఉపాధ్యాయుల పనిభారాన్ని విపరీతంగా పెంచుతోంది. విద్యార్థులకు కూడా ఇబ్బందికరమే. కాబట్టి సిలబస్ను తగ్గించాలి. – కుడుపూడి మురళీధర్, సోషల్ టీచర్, పుల్లేటికుర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠాలు ఎక్కువ పదో తరగతిలో సైన్స్కు 13 పాఠాలు ఉండగా, సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉండటం, అలాగే ఆరు నుంచి 9 తరగతుల్లోనూ అధిక పాఠ్య భారం కొనసాగడం ఆందోళనకరం. సమాజం, రాజ్యాంగం, చరిత్ర, పౌర బాధ్యతలపై విద్యార్థులకు అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో సిలబస్ రూపొందించాలి. – కేవీ శేఖర్, ప్రధాన సంపాదకులు, రాష్ట్ర ఎస్టీయూ ఉపాధ్యాయవాణి, రావులపాలెం -
పాఠాలు : 89పేజీలు : 2553తరగతులు : 5టీచర్ : ఒకరు
కొత్తపేట: రాష్ట్రంలో ఆరు నుంచి పదో తరగతి వరకూ సాంఘిక శాస్త్ర సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అత్యధికంగా ఉంటోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లింది. పాఠ్యాంశాలపై పునఃసమీక్ష జరిపి, సిలబస్ భారం తగ్గించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఎం.వెంకట కృష్ణారెడ్డికి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించింది. ప్రస్తుత పాఠ్యాంశాల నిర్మాణాన్ని పరిశీలిస్తే, ఒకే సబ్జెక్టులో చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌర శాస్త్రం, ఆర్థిక శాస్త్రం వంటి విభిన్న అంశాలను బోధించాల్సి వస్తోంది. దీనివల్ల విద్యార్థులపై అధిక విద్యాభారం పడటమే కాకుండా, బోధనా నాణ్యతపై కూడా ప్రభావం పడుతోంది. దీంతో సిలబస్ తగ్గించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠాలు అధికం ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో పాఠాలను గణనీయంగా తగ్గించారు. కానీ సాంఘిక శాస్త్రంలో మాత్రం ఇప్పటికీ అత్యధిక పాఠాలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్ సబ్జెక్టులో బయాలజీ 5, ఫిజిక్స్ 4, కెమిస్ట్రీ 4.. కలిపి మొత్తం 13 పాఠాలున్నాయి. వీటిని వేర్వేరు ఉపాధ్యాయులు బోధించే అవకాశం కూడా ఉంటుంది. అదే పదో తరగతి సాంఘిక శాస్త్రంలో 22 పాఠాలు ఉన్నాయి. వీటిని ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం పదో తరగతికి మాత్రమే పరిమితం కాదు, మిగిలిన తరగతులకూ వర్తిస్తోంది. వీటి బోధనకు ఉపాధ్యాయులు, చదవటానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.ఫ ఉపాధ్యాయుల ఆవేదన ఫ సిలబస్ తగ్గించాలని డిమాండ్ ఫ విద్యార్థులకూ కష్టమని వివరణ ఫ పునఃసమీక్ష చేయాలని వినతి -
MìSMŠS »êMìSÞ…-VŠæÌZ ˘ షణ్ముఖనాయుడుకు రజతం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరుకు చెందిన యువకుడు పుప్పాల చేతన్షణ్ముఖనాయుడు ఒడిశాలో గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల మూడవ తేదీ వరకు జరిగిన జూనియర్ నేషనల్ కిక్బాక్సింగ్ చాంపియన్ షిప్లో అండర్–17 విభాగంలో ద్వితీయస్థానం సాధించి రజత పతకం సాధించాడు. ఈ మేరకు ఏపీ స్టేట్ కిక్బాక్సింగ్ ప్రెసిడెంట్ జి.ఆనందబాలు ఓ ప్రకటనలో తెలిపారు. రజత పతకం సాధించిన షణ్ముఖనాయుడుని జిల్లా కిక్బాక్సింగ్ చైర్మన్, వైఎస్సార్ సీపీ రాష్ట్రకార్యదర్శి గొందేశి శ్రీనివాసులరెడ్డి, ప్రెసిడెంట్ ఎం.గణేష్, సెక్రటరీ ఎన్.గిరివెంకటరమణ, కోశాధికారి ఎం.భవానిశంకర్, సంయుక్త కార్యదర్శి అపర్ణనాగప్రియ అభినందించారు. -
విద్యార్థుల స్థాయికి మించి..
సోషల్ స్టడీస్లో సిలబస్ విద్యార్థుల స్థాయికి మించి ఉంది. పాఠాల సంఖ్య కూడా మిగతా సబ్జెక్టులతో పోల్చిస్తే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిని తగ్గించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయాలి. విద్యార్థులపై సిలబస్ భారం మోపడం సరైన పద్ధతికాదు. – ఎస్.జ్యోతిబసు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, రావులపాలెం ఇబ్బందికరం ఆరు నుంచి పది తరగతులకు సోషల్ సిలబస్ బోధన, అభ్యసన అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంది. దీని నుంచి తప్పనిసరిగా కొన్ని పాఠ్యాంశాలను తొలగించాలి. సోషల్లో ఉండే నాలుగు అంశాలకు సంబంధించి ప్రతి రెండు అంశాలకు ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. – దీపాటి సురేష్ బాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కోకోకు ప్రమాణాల రూపకల్పన అవసరం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్రంలో కోకో సాగు నాణ్యతను మెరుగుపరచి అంతర్జాతీయ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు భారతీయ కోకో బీన్స్కు ప్రమాణాల రూపకల్పన అవసరమని ఏపీ రాష్ట్ర ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవి చౌదరి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరంలోని ఐసీఏఆర్–ఎన్ఐఆర్సీఏ(నిర్కా)లో నిర్వహించిన ‘ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియన్ కోకో బీన్స్ అంశంపై ఒకరోజు అవగాహన వర్క్షాప్ నిర్వహించారు. చిరంజీవి చౌదరి మాట్లాడుతూ, కోకో పంటకు ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా ఎదుగుతోందన్నారు. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తే అధిక ధరలు పొందే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఏపీఎఫ్పీఎస్ సీఈఓ గెడ్డం శేఖర్ బాబు మాట్లాడుతూ, కోకో రైతులను ప్రాసెసింగ్ పరిశ్రమలతో అనుసంధానం చేయడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం అందించడం సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. కోకోశాల (చైన్నె) వ్యవస్థాపకుడు, కన్సల్టెంట్ నితిన్ చోర్డియా సాంకేతిక సెషన్లో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో కోకో బీన్స్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రేడింగ్, నిల్వ విధానాల్లో పాటించాల్సిన శాసీ్త్రయ పద్ధతులను వివరించారు. చాక్లెట్, కోకో పౌడర్, కోకో బటర్ తదితర విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అవకాశాలపై రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. వక్తలు మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 38,671 హెక్టార్లలో కోకో సాగు జరుగుతోందని, ఏలూరు, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలు కోకో ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తున్నాయని వెల్లడించారు. కోకో సాగు, ప్రాసెసింగ్పై మార్గదర్శకాలకు 79950 87041 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను సంప్రదించాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఏపీఎఫ్పీఎస్ ఈడీ ఏ దుర్గేష్, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ యు.సుధ, ఐదు జిల్లాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ప్రతినిధులు, కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏపీ ఫుడ్ ప్రోసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ప్రధాన కార్యదర్శి చిరంజీవిచౌదరి -
వెన్నుదున్ను
ఆలమూరు: వ్యవసాయం లాభసాటిగా ఉండడంతో పాటు భూసారం పెరగాలంటే రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా రబీ, ఖరీఫ్లకు మధ్య వేసవిలో చేపట్టే దుక్కులతో భూసారం పెరుగుతుంది. ఇవి రైతులకు సాగులో వెన్నుదన్నుగా నిలిచి సాగులో పెట్టుబడి తగ్గించుకోవడానికి దోహదపడతాయి. నేడు ఆధునిక యంత్ర పరికరాలు అందుబాటులోకి రావడంతో ట్రాక్టర్ల సాయంతో చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సుమారు 4.69 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుంది. యాజమాన్య పద్ధతులు ఫ భూసార పరీక్షలు చేయించుకోవడం, భూమిని శుభ్రం చేసుకోవడం, లోతు దుక్కులు వంటి ముందస్తు చర్యలు చేపట్టడం ద్వారా ఖరీఫ్లో మంచి దిగుబడులు అందుకునే వీలుంటుంది. ఫ ఎండాకాలంలో భూములు ఖాళీగా ఉన్న సమయంలో లోతు దుక్కు చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముందుగానే ప్రారంభం కాబోతోంది. ఫ వేసవి దుక్కులు మెట్ట, చాగల్నాడు ప్రాంతాల రైతులకు ఎంతో ఉపపయోకరంగా ఉంటాయి. ప్రస్తుతం మైదాన ప్రాంతాల్లోనూ దుక్కులు చేపడుతున్నారు. ప్రయోజనాలు ఇవే.. ఫ వేసవి లోతు దుక్కులు చేపట్టడం వల్ల భూమి సారవంతమవుతుంది. భూమి కింద పొరల్లోని మట్టి పైకి రావడం, పై పొరల్లో మట్టి వెళ్లడం వల్ల ఎండ వేడికి అందులోని క్రిమికీటకాలు నశిస్తాయి. ఫ నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. వర్షం నీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకునే వీలుంటుంది. ఫ పొలాల్లో లోతుగా దున్నడం వల్ల భూమిలో నీరు ఇంకి పోయి, తేమ శాతం పెరిగి సేంద్రియ పదార్థాలు త్వరితగతిన కుళ్లిపోయి పోషకాలుగా మారతాయి. ఫ భూమిని అడుగు లోతు వరకూ దున్నితే విత్తనం వేగంగా మొలకెత్తి, వేళ్లు సులభంగా భూమిలో దిగి మొక్కకు సారం పెరుగుతుంది. ఫ దుక్కుల వల్ల కింద నుంచి పైకి వచ్చే పురుగులను పక్షులు తినడం ద్వారా తెగుళ్ల బెడద తప్పుతుంది. ఫ పొలాల్లో మట్టి గడ్డలు తొలగిపోయి సారవంతమైన నేల ఏర్పడుతుంది. తద్వారా నాణ్యమైన పంట పండించేందుకు దోహదపడుతుంది. భూసారం పెరుగుతుంది వ్యవసాయశాఖ సూచనలకు అనుగుణంగా పంట పొలాల్లో దుక్కు దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల తెగుళ్లను నివారించుకోవడం ద్వారా పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు, అధిక దిగుబడులకు ఆస్కారం కలుగుతుంది. రైతులందరూ క్రమం తప్పకుండా దుక్కుకు ప్రాధాన్యమివ్వాలి. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, ఆలమూరు డివిజన్ నిబంధనలు తప్పనిసరి ఖరీఫ్ పంటకు తెగుళ్ల బెడదను నివారించి, అధిక దిగుబడులు సాధించాలంటే వ్యవసాయశాఖ సూచనలతో పాటు కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలి. సాధారణ కల్టివేటర్ (ట్రాక్టర్కు వాడే మామూలు నాగలి)కు బదులు లోతు దుక్కు దున్నడానికి రెక్క నాగలి, బల్లెపు నాగలి, గునపపు నాగలి వాడాలి. దీని వల్ల నేల 30 నుంచి 75 సెంటీమీటర్ల లోతుకు దిగి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాలుకు అడ్డంగా దుక్కి చేయడం వల్ల భూమి కోతకు గురి కాకుండా తేమ ఎక్కువగా పెరుగుతుంది. ప్రస్తుతం పొలాలు ఖాళీగా ఉండటం వల్ల కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోతాయి. వాటి వల్ల వచ్చే పంటకు కలుపు బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వేసవి దుక్కులు చేసుకుంటే ఉపయోగం కలుగుతుంది. ఫ దుక్కి దున్నితే లాభాల పంటే ఫ వేసవి దుక్కులతో ఎంతో ప్రయోజనం ఫ ప్రాధాన్యత ఇస్తున్న రైతులు -
పద్మజ మూర్తి దంపతులకు జాతీయ అవార్డు
కొత్తపల్లి: స్ధానిక జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న యాళ్ల పద్మజను, మూలపేట జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నల్లం అచ్యుత రామచంద్రమూర్తి దంపతులు గురువారం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చంపారన్లో నిర్వహించిన కార్యక్రమంలో బిర్సా ముండా జాతీయ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టుల్లో చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డు ఇచ్చారు. అవార్డు గ్రహీతలను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శాస్త్రి, శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందించారు. రేషన్ బియ్యం పట్టివేత ● కేసు నమోదు ● విలువ రూ.6 లక్షలు దేవరపల్లి: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యర్రవరం గ్రామానికి అక్రమంగా రవాణా చేస్తున్న 14,470 కిలోల రేషన్ బియ్యాన్ని గురువారం దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవేపై అధికారులు పట్టుకున్నారు. వివరాలను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ ఎ.సత్యనారాయణ తెలిపారు. జంగారెడ్డిగూడెం నుంచి 14,470 కిలోల రేషన్ బియ్యం(326 బస్తాలు) లారీలో యర్రవరం పౌల్ట్రీకి తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో సివిల్ సప్లయ్ జిల్లా సహాయ అధికారి నాగాంజనేయులు ఆధ్వర్యంలో దేవరపల్లి వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నట్టు సత్యనారాయణ తెలిపారు. బియ్యంతో సహా లారీని సీజ్ చేసి, 6(ఎ), 7(1) కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ. 6 లక్షలు ఉంటుందన్నారు. తిరుమలాయపాలెంలో.. గోకవరం: మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 49 బస్తాల రేషన్ బియ్యాన్ని గురువారం ఎంఎస్ఓ శాంతిప్రియ స్వాధీనం చేసుకున్నారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని కంటే దుర్గకు చెందిన రేషన్షాపును తనిఖీ చేసి ఈ బియ్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని, షాపుపై 6ఏ కేసు నమోదు చేశామని ఎంఎస్ఓ తెలిపారు. గో మాంసం స్వాధీనంగొల్లప్రోలు (పిఠాపురం రూరల్): వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గోమాంసాన్ని గొల్లప్రోలు టోల్గేట్ సమీపంలో గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్తో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్వీర్యం చేశామన్నారు. 673 జీవోతో ప్రగతికి చేటు బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక సంస్థలకు చెందిన ముఖ్యకూడళ్లలోని ఖరీదైన ఖాళీ స్థలాలు, మైదానాలు, పార్కులు, మార్కెట్లు, దుకాణ సముదాయాలు, కమ్యూనిటీ హాళ్లను పీపీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే 673 జీవో విధానం ప్రగతికి చేటు తెస్తుందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్ల రమణరాజు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఖాళీ స్థలాల్లో గుడ్ విల్ యాక్షన్ విధానంలో జనతా దుకాణాల సముదాయాల నిర్మాణం చేపడితే ప్రజాహిత ప్రగతి పథంగా ఉంటుందన్నారు. పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ ప్రణాళిక వలన స్థానిక ఆస్తులు లీజుల ప్రక్రియ ఉచ్చులో కార్పోరేట్ దోపిడీకి గురవ్వక తప్పదన్నారు. ఆ జీవో వల్ల పారిశుధ్య పనులు, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, పార్కుల అజమాయిషీ, 14 రకాల పౌర సౌకర్యాల సేవలు మరింత భారంగా మారతాయన్నారు. -
చంద్రబాబు ఎన్నికల హామీలు అమలు చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి రామారావు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదన్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ సమస్యల పరిష్కారం, వైద్య భద్రత, పెన్షనర్ల సంక్షేమం వంటి అంశాలపై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలుకు కార్యాచరణ ప్రకటించలేదన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ పనిచేయడం లేదని, రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు క్యాష్లెస్ సేవలు అందించడం లేదని చెప్పారు. పీఆర్సీని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటీకరించే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఎంప్లాయిస్ పెన్షనర్స్ విభాగం కాకినాడ అర్బన్ అధ్యక్షుడు మహిపాల్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తుమ్మల నూకరాజు పాల్గొన్నారు. -
చోరీ కేసులో రూ.58 లక్షల సొత్తు స్వాధీనం
అనపర్తి: చోరీ కేసులో సుమారు రూ.58 లక్షల విలువైన వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు రాజమహేంద్రవరం ఈస్ట్జోన్ డీఎస్పీ బి విద్య తెలిపారు. అనపర్తి పోలీస్స్టేషన్లో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురం గ్రామంలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజమహేంద్రవరం క్రైం బృందంతో కలసి దర్యాప్తు చేశారన్నారు. పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెంకు చెందిన శిరపనశెట్టి సన్యాసిరావు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో మండలంలోని కొప్పవరం వంతెన వద్ద అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడన్నారు. అనపర్తిలోనే కాకుండా ఆలమూరులోను, రావులపాలెంలో రెండు చోట్ల, నర్శీపట్నం, కోరుకొండలలోను చోరీలకు పాల్పడినట్టు ఆమె తెలిపారు. మొత్తం ఆరు చోరీలలోను సుమారు రూ.58 లక్షల విలువైన 385 గ్రాముల బంగారు వస్తువులు, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5వేల నగదు స్వాధీనం చేసినట్టు డీఎస్పీ విద్య తెలిపారు. రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ డీఎస్పీ సుభాష్ ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన చేధించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన రాజమహేంద్రవరం క్రైమ్బ్రాంచ్ హెచ్సీ ప్రసాద్ రమణ సురేష్, విజయ్ అనపర్తికి చెందిన తమ్మారావు, రాజేష్, క్రైమ్ బ్రాంచ్ సీఐలు రాంబాబు, బాలాచారి, అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, ఎస్సై ఎల్ శ్రీనునాయక్లను డీఎస్పీ విద్య అభినందించారు. -
దగా చేయడమే చంద్రబాబు నైజం
అధికారం కోసం ఎన్ని హామీలైనా ఇచ్చి.. ఆనక దగా చేసే నైజం చంద్రబాబు సొంతమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. తుని పట్టణంతో పాటు రూరల్ మండల ప్రజలు, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎస్.అన్నవరంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాడిశెట్టి రాజా నాయకత్వాన కూటమి ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాలనపై రాజా నిప్పులు చెరిగారు. సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను నిలువునా ముంచేశారని దుయ్యబట్టారు. హామీలు అమలు చేయకుండా మోసం చేసిన చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మండల కేంద్రమైన కోటనందూరు బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరో మండల కేంద్రమైన తొండంగి సెంటర్లో జరిగిన నిరసన కార్యక్రమాన్ని రాజా ముందుండి నడిపించారు. సూపర్ సిక్స్ కరపత్రాలను మంటల్లో వేసి దహనం చేసి, టీడీపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణగౌడ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
చంద్రబాబుకు గుణపాఠం తప్పదుప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించి, మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. రౌతులపూడిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు ఆధ్వర్యాన జరిగిన కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఏలేశ్వరం పట్టణం బాలాజీ చౌక్ వద్ద, ఏలేశ్వరం రూరల్ సి.రాయవరం, శంఖవరం మండలం కత్తిపూడి, ప్రత్తిపాడుల్లో కూడా పార్టీ శ్రేణులు కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి, నిరసన తెలిపాయి. ఆయా కార్యక్రమాల్లో గొల్లు చినదివాణం, బెహరా రాజేశ్వరి, సామంతుల సూర్యకుమారి, సుంకర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నిరంకుశ పాలన నశించాలి వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యాన పెద్దాపురం, సామర్లకోటల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ పత్రాలు, ఆ హామీలపై పచ్చ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలు, బాండ్ల ప్రతులను దహనం చేశారు. పెద్దాపురం దర్గా సెంటర్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్ ఆధ్వర్యాన జరిగిన నిరసన ప్రదర్శన, ధర్నాలో దొరబాబు పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామర్లకోట గడియారం స్తంభం సెంటర్ నుంచి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ వరకూ మండుటెండలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, కూటమి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ నిరంకుశ పాలన నశించాలి, సీఎం డౌన్డౌన్’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్ కూడలిలో జన సందోహం నడుమ చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంతకాలతో ఉన్న బాండ్లు, ఎల్లో మీడియాలో ఇచ్చిన ప్రకటనల ప్రతులను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, మహిళా ఉపాధ్యక్షురాలు ఏలేటి అనంతలక్ష్మీ చౌదరి, కార్యదర్శులు ఊబా జాన్మోజెస్, గోపు మురళి తదితరులు పాల్గొన్నారు. 8 -
‘పీఎం కేర్’తో ఉజ్వల భవిత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల భవితకు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలుస్తుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ భరోసా ఇచ్చారు. కలెక్టరేట్ వివేకానంద హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘మిషన్ వాత్సల్య’ జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా ‘పీఎం కేర్స్’ లబ్ధిదారుల ముఖాముఖి బుధవారం నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ సీహెచ్ లక్ష్మి, చిన్నారులతో ఆయన ముచ్చటించారు. చిన్నారుల చదువు, ఆరోగ్యం, సంరక్షకుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ రకాల ఆర్థిక, విద్యా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. తద్వారా తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో మొత్తం 24 మంది పిల్లలు లబ్ధిపొందుతున్నారని, వీరి సంరక్షణను జిల్లా బాలల సంరక్షణ విభాగం పర్యవేక్షిస్తోందన్నారు. ఈ పథకం కింద వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు, రూ.5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ ఉచిత ఆరోగ్య బీమా అందుతుందని కలెక్టర్ తెలిపారు. ఐసీడీఎస్ పీడీ లక్ష్మి మాట్లాడుతూ ఈ పథకం కింద చిన్నారులకు 18 ఏళ్ల నుంచి నెలవారీ స్టైపెండ్, 23 ఏళ్లకు రూ.10 లక్షల కార్పస్ ఫండ్తో పాటు ఉచిత కేంద్రీయ విద్యాలయాల ప్రవేశాలు, ఉన్నత విద్యా రుణాలు, వైద్య సహాయం అందుతాయన్నారు. వేసవిలో 24.42 లక్షల ఉపాధి పని దినాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత వేసవి కాలంలో జిల్లాలో ఉపాధి కూలీలకు 24.42 లక్షల పనిదినాలు కల్పించినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ మధుసూదన్ తెలిపారు. కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 37.12 లక్షల పనిదినాల లక్ష్యం కాగా ఇప్పటి వరకూ 24.42 లక్షల పనిదినాలు పూర్తి చేశామని, ఈ నెలాఖరు నాటికి మిగిలిన 12 లక్షల పనిదినాలు కల్పించనున్నట్టు తెలిపారు. జిల్లాలో 92 వేల మంది ఉపాధి కూలీలకు రూ.52 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ కింద మరో రూ.39 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. పల్లె పండుగ 1, 2 ల్లో ప్రవేశపెట్టిన పనులు దాదాపు పూర్తయినట్లు చెప్పారు. మూడో విడత పనులకు కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 12 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. దీనిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు, ఏపీవోలు ఉన్నారన్నారు. జూలై ఒకటో తేదీ నుంచి జిల్లాలో ‘వీబీజీ రామ్జీ’ అమలు కానున్నట్లు చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలుచేయాలి ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి గణపతి కాకినాడ రూరల్: రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కే గణపతి డిమాండ్ చేశారు. కాకినాడ శశికాంత్ నగర్లో స్థానిక నాయకులతో బుధవారం ఆయన భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి వేతన సవరణ సంప్రదింపుల కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన మూడు వాయిదాల కరువు భత్యాన్ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఐదేళ్ల సర్వీసు దాటిన ఎనర్జీ అసిస్టెంట్లను జేఎల్ఎంలుగా చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మెనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన, మృతి చెందిన ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ.30 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చట్ట సవరణ 2025 బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని గణపతి కోరారు. వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి ప్రత్తిపాడు: వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన లంపకలోవ గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన లింగంపల్లి చక్రధరరావు (55) ఉపాధి కార్మికులతో పాటు ఆ గ్రామంలోని కోమటి చెరువు పూడిక తీత పనులకు వెళ్లాడు. పని ప్రదేశంలో వడదెబ్బ తగిలి కుప్పకూలిపోయాడు. తోటి వేతనదారులు సపర్యలు చేసి, స్థానిక ఆర్ఎంపీ వద్దకు తరలిస్తుండగా మృతి చెందాడని పంచాయతీ కార్యదర్శి బి.వీరబాబు తెలిపారు. చక్రధరరావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
మంటలతో బెంబేలు
కరప: కారు అడుగు భాగంలో చుట్టుకున్న ఎండుగడ్డితో మంటలు రేగి, కారు పూర్తిగా కాలిపోయింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన ఓ పాస్టర్ తన కారులో మరో ముగ్గురితో కలిసి రావులపాలెంలో జరిగే క్రైస్తవ సమావేశానికి బయలుదేరారు. మార్గం మధ్యలో కారు అడుగుభాగాన ఎండుగడ్డి చుట్టుకుంది. ఆ విషయాన్ని పాస్టర్ గమనించలేదు. కరప మండలం పెద కొత్తూరు గ్రామం వద్దకు వచ్చేసరికి వెనుక వస్తున్న మోటార్ సైక్లిస్ట్ వారిని ఆపాడు. కారు నుంచి మంటలు వస్తున్నాయని చెప్పి, అప్రమత్తం చేశాడు. కారు బ్రేక్ పనిచేయకపోవడంతో హ్యాండ్ బ్రేక్ వేసి పాస్టర్తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురూ బయటకు వచ్చేశారు. అనంతరం మంటలు కారు టైర్లు, సీట్లకు వ్యాపించారు. వాటిని చూసి సమీపంలోని గృహాల వారు బయటకు పరుగులు తీశారు. పెద కొత్తూరు గ్రామస్తులతో పాటు వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింతా ఈశ్వరరావు స్పందించి కాకినాడలోని అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
పెట్రో మంటలపై 9న రాస్తారోకో
ఉమ్మడి జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్లకు ఉద్యోగోన్నతిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు వామపక్ష నాయకులు తెలిపారు. స్థానిక న్యూ డెమాక్రసీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు అధ్యక్షతన వామపక్షాల సమావేశం జరిగింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ఇప్పటి వరకు నాలుగు సార్లు పెట్రో ధరలు పెరిగాయన్నారు. కమర్షియల్ గ్యాస్ ధర మరీ దారుణంగా రూ.వెయ్యికి పైగా పెంచారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతూ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై భారాలు వేస్తున్నారన్నారు. ఈ నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాలు నిర్వహించి, 9వ తేదీన రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు నాయకులు తెలిపారు. సీపీఎం నగర కమిటీ సభ్యుడు కె.సత్తిరాజు మాట్లాడుతూ మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో దేశంలో నిరుద్యోగం పెరుగుతూనే ఉందన్నారు. ఏడో తేదీ సాయంత్రం కాకినాడ మసీదు సెంటర్, బాలాజీ చెరువు సెంటర్లలో ప్రచారం నిర్వహించి, 9 వ తేదీ ఉదయం సామర్లకోట రోడ్డు–ఇంద్రపాలెం లాకుల వద్ద రాస్తారోకో చేస్తామన్నారు. సమావేశంలో సీపీఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు, న్యూ డెమోక్రసీ నాయకులు గరగ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. రెండు ఇసుక లారీల సీజ్ రావులపాలెం: జిల్లాలో జరుగుతున్న ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలపై బుధవారం తనిఖీలు చేసి గోపాలపురం హైవేపై రెండు ఇసుక లారీలను సీజ్ చేసి వాటికి రూ. 50 వేలు అపరాధ రుసుం విధించినట్టు గనుల శాఖ ఏడి అశోక్ కుమార్ తెలిపారు. అయితే ఈ తనిఖీలు నామమాత్రమేనా అన్నట్టుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలపై బుధవారం ‘సాక్షి’లో ‘అనదికార దందా’ పేరుతో కథనం ప్రచురితం అయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం గోపాలపురం హైవేపై గనుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే వందలాది లారీలు నిత్యం హైవే మీద తిరుగుతున్నా వారికి మాత్రం గోపాలపురం వద్ద రెండు లారీలే కనిపించడం పలు విమర్శలకు తావిస్తోంది. దీనిపై గనుల శాఖ ఏడీని సాక్షి వివరణ కోరగా తమకు వచ్చిన సమాచారంతో వెళ్లి నిఘా పెట్టగా రెండు లారీలను సీజ్ చేశామన్నారు. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తున్న 32 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ సీసీఎల్ స్పెషల్ సీఎస్ జయలక్ష్మి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాలో 14 మందికి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 6, తూర్పుగోదావరి జిల్లాలో 7, పోలవరం జిల్లాలో ఐదుగురు డిప్యూటీ తహసీల్దార్లు తహసీల్దార్లుగా ఉద్యోగోన్నతి పొందారు. మెరిట్, సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఉద్యోగోన్నతులు కల్పించినట్లు ఆమె పేర్కొన్నారు. సర్ అంటే ఏమిటి? సర్ అంటేనే ఏమిటో నాకు తెలీదు. నేను 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నాను. మళ్లీ నా ఓటు నిరూపించుకోవడమేమిటి? అసలు సవరణ చేయడం ఏమిటో కూడా నాకు తెలియదు. ఎవరు వస్తారో, ఎప్పుడు వస్తారో తెలీదు. వారు వచ్చిన సమయానికి మేం ఇంటి వద్ద ఉండాలి కదా! ముందుగా ఏం చేయాలో తెలియజేస్తే అన్నీ సిద్ధం చేసుకుంటాం. – పేపకాయల ప్రసాద్, పిఠాపురం అవగాహన కల్పించాలి సర్ కార్యక్రమం జరుగుతుందని తెలుసు తప్ప అదేమిటి.. మన ఓటు రద్దవకుండా ఎలా చూసుకోవాలనే విషయాలు చాలా మందికి తెలీదు. ఇప్పటి వరకూ నాకే తెలీదు. ఏయే అర్హతలు నిరూపించుకోవాలి.. ఏ ఆధారాలు చూపించాలో ముందుగానే చెప్పాలి. లేకపోతే బీఎల్ఓ వచ్చాక ఆధారాలు తెమ్మంటే చాలామంది తేలేకపోవచ్చు. అప్పుడు అర్హత ఉన్నా ఓటు హక్కు కోల్పోవలసి వస్తుంది. దీనిపై ఓటర్లకు పూర్తి అవగాహన కల్పించాలి. – కొండేపూడి శంకరరావు, మన ఊరు – మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, పిఠాపురం పిఠాపురం: ఎన్నికల సంఘం ఈ నెల 15 నుంచి చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – సర్) కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు రాజకీయ పార్టీలు తమ వారి ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూండగా.. ఈ ప్రక్రియపై సామాన్య ఓటర్లలో అవగాహన లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే సర్ అంటే ఏమిటో తెలియని వారు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో అధికారులు సరిపెట్టేస్తూండంతో.. అవగాహన లేక ఎక్కువ మంది తమ ఓటు హక్కు కోల్పోయే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్ కార్యక్రమం ఇలా.. అధికారుల లెక్కల ప్రకారం.. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ బూత్ల పరిధిలో 16.50 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకూ బూత్ లెవెల్ అధికారుల(బీఎల్ఓ)కు సర్ కార్యక్రమంపై శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం వీరు ఈ నెల 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. సర్కు అవసరమైన ఎన్యూమరేషన్ ఫామ్లు, ఇతర సామగ్రిని ఇప్పటికే సిద్ధం చేశారు. బీఎల్ఓలు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలోని ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫామ్ అందజేస్తారు. అందులోని వివరాలను ఓటర్లు పూర్తి చేసి, తిరిగి బీఎల్ఓలకు అందజేయాలి. దీని ఆధారంగానే ఓటు ఉండాలా, తొలగించాలా అనే నిర్ణయం తీసుకుంటారు. 2002 నాటి ఓటర్ల జాబితాను, ప్రస్తుత ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేయడం ద్వారా నకిలీ ఓట్లు, చనిపోయిన వారివి, ఒకరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నా ఆధారాలు చూపించని తొలగిస్తారు. అనంతరం, జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. జూలై 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను సెప్టెంబర్ 18లోగా పరిష్కరించి, అదే నెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. మ్యాపింగ్ ఇలా.. ‘సర్’ నిబంధనల ప్రకారం బీఎల్ఓ లింక్ ద్వారా 2025 ఓటర్ల జాబితాల్లో ఉన్న వారందరినీ 2002 ఓటర్ల జాబితాతో ఫ్యామిలీ ట్రీ మ్యాపింగ్ చేస్తారు. ఏ ఒక్క ఓటరుకు లింక్ కాకపోయినా, తగిన ఆధారాలు ఇవ్వకపోయినా వారి ఓటు పోతుంది. సాధారణంగా ఇటువంటి ఓటర్లు 43 ఏళ్లు పైబడే ఉంటారు. 18 నుంచి 43 ఏళ్ల వయస్సు ఓటర్లను వారి తల్లిదండ్రులు లేదా గార్డియన్తో లింక్ చేస్తారు. పెళ్లై అత్త వారింటికి వచ్చిన కోడళ్లు వేరే ఊరి నుంచి వచ్చి ఉంటారు కాబట్టి తమ వాళ్ల ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. మ్యాపింగ్లో లింక్ కాని వారు ఎన్యూమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాలి. గడువులోగా దానిని నింపి, ఆధారాలివ్వకపోతే ఓటు తొలగిస్తారు. ఈ ప్రక్రియ నిరక్షరాస్యులకే కాదు.. చదువుకున్న వారికి సైతం గందరగోళంగా మారే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి తమకు ఓటు హక్కు ఉందని.. ఇప్పటికే చాలాసార్లు ఓటు వేశామని భావిస్తున్న చాలా మంది ఇప్పుడు తమ హక్కును మళ్లీ ఎందుకు నిరూపించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సర్ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఫ 15 నుంచి ఎస్ఐఆర్ ఫ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం ఫ ఓటర్లలో అవగాహన అంతంతమాత్రం ఇబ్బంది ఉండదు ప్రతి బీఎల్ఓ తమకు కేటాయించిన బూత్ పరిధిలోని అన్ని ఇళ్లకూ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్ అందజేసి, వివరాలు తెలియజేస్తారు. కాబట్టి ఎటువంటి అవగాహనా లోపమూ ఉండదు. అర్హుల ఓట్లన్నీ ఉండేలా చూస్తారు. రాజకీయ పార్టీల ఏజెంట్లు కూడా సరి చూసుకుంటారు కాబట్టి సక్రమంగా ఉన్న ప్రతి ఓటూ ఉంటుంది. సామాన్యులకు ఏ ఇబ్బందీ లేకుండా బీఎల్ఓలు చూస్తారు. – గోపాలకృష్ణ, తహసీల్దార్, పిఠాపురం -
మండల కేంద్రాల్లో నేడు వైఎస్సార్ సీపీ నిరసన
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండేళ్ల వెన్నుపోటు పాలనకు నిరసనగా గురువారం మండల కేంద్రాల్లో సూపర్ సిక్స్ ప్రతులను దగ్ధం చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. తుని నియోజకవర్గానికి సంబంధించి కోటనందూరు, తొండంగి మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని, తుని మండలం, పట్టణానికి సంబంధించి తుని మండలం ఎస్.అన్నవరం పార్టీ కార్యాలయం వద్ద ఆ ప్రతులను దగ్ధం చేయనున్నట్టు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి -
డాక్టర్ అనిరుధ్కు 8 బంగారు పతకాలు
కాకినాడ క్రైం: వైద్య విద్యలో కాకినాడ కీర్తిపతాక రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడింది. రంగరాయ వైద్య కళాశాల(ఆర్ఎంసీ)లో 2024లో వైద్య విద్య పూర్తి చేసిన నగరానికి చెందిన వైద్య విద్యార్థి డాక్టర్ అత్తలూరి సాయి అనిరుధ్ ఏకంగా 8 బంగారు పతకాలు సాధించి, యూనివర్సిటీ టాపర్గా నిలిచారు. ఒకే విద్యార్థి ఇన్ని బంగారు పతకాలు సాధించడం ఆర్ఎంసీయే కాదు.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, వైస్ చాన్సలర్ చంద్రశేఖర్లు అనిరుధ్కు ఈ పతకాలను ప్రదానం చేశారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు అత్తలూరి విష్ణువర్ధన్, కాకినాడకు చెందిన ప్రసూతి వైద్యురాలు ఏఎల్ సత్యవతి దంపతుల కుమారుడైన అనిరుధ్ తల్లిదండ్రుల సమక్షంలో ఈ విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. నీట్లో మంచి ర్యాంకు సాధించిన ఆయన.. మణిపూర్లో తన తండ్రి పీజీ చదివిన ప్రతిష్టాత్మక కస్తూర్బా వైద్య కళాశాలలో ఎండీలో పీజీ సీటు సాధించి, ప్రస్తుతం ఫస్టియర్ చదువుతున్నారు. -
ఉష్ణ తాపం.. వరుణ రాగం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కరప: ఉదయమంతా ఉక్కపోత, వేడిగాలులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. మంగళవారం మధ్యాహ్నం కురిసిన వాన జల్లులతో సేద తీరారు. కాకినాడ నగరంతో పాటు కరప మండల ప్రజలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్రమైన ఎండ, వేడి గాలులతో ఆపసోపాలు పడ్డారు. ఈ తరుణంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీంతో, కరపలో పగలే చీకటిగా మారింది. ఉన్నట్టుండి చల్లని గాలులతో ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. చిన్నారులు బయటకు వచ్చి, కేరింతలు కొట్టారు. అయితే, వర్షం కారణంగా కాకినాడలోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి పడటంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో వాన నీరు పెద్ద ఎత్తున ప్రవహించడంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. -
రైతులకు కుచ్చుటోపీ!
పొలంలో వంటావార్పు చేపట్టిన రైతులుమోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలుపుతున్న రైతులుపిఠాపురం రూరల్: కౌలు, తనఖా పేరుతో బత్తిన పద్మరాజు అనే వ్యక్తి తమను మోసం చేశాడని మండలంలోని మల్లాం, జల్లూరు గ్రామాలకు చెందిన కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పద్మరాజుకు చెందిన పదెకరాల పొలంలో సుమారు 50 మంది రైతులు మంగళవారం వంటావార్పు నిర్వహించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మల్లాం గ్రామానికి చెందిన పద్మరాజు ఒకే భూమిని పలువురి వద్ద తనఖా పెట్టి.. ఒక్కొక్కరి వద్ద రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ వసూలు చేశాడని ఆరోపించారు. తిరిగి అదే భూమిని వేరొకరికి కౌలుకు ఇచ్చాడని, ఇలా సుమారు రూ.2.50 కోట్లకు పైగా వసూలు చేసి, కాకినాడ రూరల్ ప్రాంతానికి పరారయ్యాడని తెలిపారు. డబ్బులివ్వాలని ఎన్నిసార్లు అడిగినా ఇవ్వడం లేదని, పైగా తమ పైనే బెదిరింపులకు దిగాడని చెప్పారు. దీనిపై నాలుగేళ్లుగా సీఐ నుంచి కలెక్టర్ స్థాయి అధికారి వరకూ ఆశ్రయించినా.. సివిల్ వివాదమంటూ ఎవ్వరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బును పెట్టుబడిగా పెట్టామని, ఇదిగో అదిగో అంటూ ఏళ్ల తరబడి తమను ముప్పుతిప్పలు పెడుతున్నాడని, ఈ మోసం కారణంగా తాము తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని, మోసం చేసిన వ్యక్తిపై తగు చర్యలు తీసుకుని, తమ డబ్బు ఇప్పించాలని అధికారులను వేడుకుంటున్నామని అన్నారు. ఫ ఒకే భూమి పలువురికి కౌలుకు.. ఫ మోసపోయిన రైతులు ఫ పొలంలోనే వంటావార్పు -
రెండేళ్ల పాలన.. వెన్నుపోటుకే సరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల పాలన ప్రజలకు వెన్నుపోటు పొడవడంతోనే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి, డైవర్షన్ పాలిటిక్స్తో నిలువునా మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుపై సమరశంఖం పూరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. అడుగడుగునా ప్రజలను వంచించేందుకు కుట్రలు, కుతంత్రాలే అజెండాగా సాగుతున్న కూటమి రెండేళ్ల వెన్నుపోటు పాలనపై ముందున్నదంతా ఇక పోరుబాటేనని ప్రకటించారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్, బుక్లెట్లను పార్టీ జిల్లా నేతలతో కలసి కాకినాడలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రశ్నించినా, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత భావాలను వ్యక్తం చేసినా.. పోలీసులను అడ్డం పెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు వెన్నుపోటుకు నిరసనగా.. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకూ దశలవారీ ఆందోళనలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టోను దహనం చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై యువత, రైతులు, మేధావులు, బాధితులు, మహిళలతో ఈ నెల 8న నియోజకవర్గ కేంద్రాల్లో ఇండోర్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు జనం విసుగెత్తిపోయారన్నారు. వివిధ సమస్యలపై వైఎస్సార్ సీపీ ఇస్తున్న పిలుపునకు స్పందించి, ఊహించిన దానికంటే రెట్టింపు జనాలు తరలి వస్తూండటమే దీనికి నిదర్శనమని చెప్పారు. 2019–24 మధ్య వైఎస్సార్ సీపీ అందించిన జనరంజక పాలనను కాదని.. అధికారం కోసం కూటమి కట్టి వచ్చిన పార్టీలకు పట్టం కట్టి చాలా తప్పు చేశామనే అభిప్రాయంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని అన్నారు. హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని రాజా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జగ్గంపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్ తోట నరసింహం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ జిల్లా బూత్ కమిటీల పర్యవేక్షకుడు ఒమ్మి రఘురామ్, యువజన విభాగం గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ తోట శ్రీరాంజీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, లక్ష్మీప్రియ తదితరులు పాల్గొన్నారు.బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026ఫ సమరశంఖం పూరించేందుకు ప్రజలు సిద్ధం ఫ 4న మండల కేంద్రాల్లో టీడీపీ మేనిఫెస్టో దహనం ఫ 8న నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు ఫ 12న నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఫ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ పోస్టర్ ఆవిష్కరణ -
పొమ్మన లేక కొరివి
పేదలు నివాసం ఉండటానికి వీలు లేకుండా చేయడానికే మా స్థలాల్లో చెత్త నుంచి విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమకు అనుమతి ఇచ్చారు. 2,300 మంది ఒకేచోట ఇళ్లు నిర్మించుకుంటే అదో ఊరుగా మారుతుంది. దాంతో జగన్కు పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ పని చేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తాం. – లయిశెట్టి అమ్మోజీ, మర్లావ, పెద్దాపురం మండలం పరిశ్రమను తొలగించాలి మా స్థలాల వద్ద ఏర్పాటు చేస్తున్న చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి పరిశ్రమను వెంటనే తొలగించాలి. ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలి. – సీత, బి.తాటిపర్తి, పెద్దాపురం మండలం -
పెళ్లి రోజు నాడే తిరిగిరాని లోకాలకు..
అన్నవరం: వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని సన్నిధికి వచ్చిన ఓ భక్తుడు.. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. అత్యంత విషాదకరమైన ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. దేవస్థానం వర్గాల సమాచారం ప్రకారం.. అన్నవరం సమీపంలోని బెండపూడికి చెందిన మద్దుకూరి బుచ్చిబాబు (55) పెళ్లి రోజు మంగళవారం. ఆ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి రత్నగిరికి ఆయన వచ్చారు. సత్యదేవుని వ్రతమాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, పశ్చిమ రాజగోపురం వెలుపలి ప్రాంగణంలోకి రాగానే గుండెపోటు రావడంతో కింద పడిపోయారు. భార్య, కుమార్తె భయాందోళనతో గట్టిగా కేకలు వేయడంతో ఓ భక్తుడొకరు వచ్చి ఆయన ఛాతీపై గట్టిగా నొక్కుతూ సీపీఆర్ చేశారు. పరిస్థితిని గమనించిన దేవస్థానం సెక్యూరిటీ అధికారి ఆకుల ప్రసాదరావు 108కు ఫోన్ చేశారు. నిమిషాల వ్యవఽధిలోనే కొండ దిగువ నుంచి వచ్చిన అంబులెన్సులో బుచ్చిబాబును కొండ దిగువ దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది.. ఆయన మార్గం మధ్యలోనే మృతి చెందినట్టు తెలిపారు. బుచ్చిబాబుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతదేహాన్ని బెండపూడిలోని నివాసానికి తరలించారు. రత్నగిరిపై భక్తుల రద్దీ అన్నవరం: రత్నగిరికి మంగళవారం సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయంలో రద్దీ ఏర్పడింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సాధారణంగా స్వామి సన్నిధికి మంగళవారం భక్తులు తక్కువగా వస్తారు. కానీ, విద్యా సంస్థలకు త్వరలో వేసవి సెలవులు ముగియనుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. జోసా కౌన్సెలింగ్పై అవగాహన రాజమహేంద్రవరం రూరల్: కాతేరులోని తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన జోసా/సి–శాబ్ కౌన్సెలింగ్ 2026 అవేర్నెస్ ప్రోగ్రామ్కు సుమారు 4000 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారని చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, బీఐటీఎస్ లాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో తమ రాజమహేంద్రవరం క్యాంపస్ నుంచి 780 మంది విద్యార్థులు అడ్మిషన్లు సాధించగలరన్నారు. జోసా కౌన్సెలింగ్లో ఆప్షన్లు ఎలా పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్లలో సీట్లు వస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, తాడేపల్లిగూడెం ఎన్ఐటీ డీన్ డాక్టర్ వీరేష్ కుమార్ పాల్గొన్నారు.ఫ సత్యదేవుని సన్నిధిలో భక్తుడికి గుండెపోటు ఫ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి -
జనసేన నేత కాబట్టే చర్యలు లేవా?
పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
చంద్రబాబు రెండేళ్ల పాలన అట్టర్ఫ్లాప్
తుని: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల పాలన సూపర్హిట్ కాదని, అట్టర్ఫ్లాప్ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా చెప్పారు. చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలు, అసత్యాలు అని ప్రజలు తెలుసుకున్నారన్నారు. అందుకే కాకినాడ జిల్లా తుని మండలం చామవరంలో సోమవారం నిర్వహించిన సభలో నుంచి మహిళలు మధ్యలోనే వెళ్లిపోయారని చెప్పారు. రాజా సోమవారం తుని మండలం ఎస్.అన్నవరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ రెండేళ్లలో రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేశారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. విధ్వంసం తప్ప అభివృద్ధి లేని చంద్రబాబు రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. సభలో చంద్రబాబు మాట్లాడిన 10 నిమిషాల్లోనే మహిళలు బయటకు వెళ్లిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవాలన్నారు.ప్రజల కోసం ఏం చేశారో చెప్పుకొనే అవకాశం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వకపోగా ఆరులక్షల మందికి పింఛన్లు తొలగించారని చెప్పారు. ఆడబిడ్డ నిధి, రైతుభరోసా తదితర పథకాలను ఇవ్వలేదన్నారు. ప్రజలకు నిజాలు చెప్పకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఎందుకని ప్రశ్నించారు. మంచి చేయకపోగా గత ప్రభుత్వంపై బురద చల్లడాన్ని ప్రజలు గమనించారన్నారు. వైఎస్సార్సీపీ అంటే చంద్రబాబుకు భయమని, అందుకే పదేపదే గొడ్డలి పార్టీ అంటూ ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. -
తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు
గొల్లప్రోలులో పర్యటించిన పబ్లిక్ హెల్త్ అధికారులు పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ హెల్త్ ఎస్ఈ రత్నాకర్ రెడ్డి, ఈఈ శేషగిరిరావు తెలిపారు. ‘సాక్షి’లో ‘పవన్ ఇలాకాలో పానీ పాట్లు’ శీర్షికన సోమవారం వెలువడిన వార్తకు అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా అధికారులు గొల్లప్రోలులో ఏలేరు పంప్ హౌస్ దగ్గర నీటి నిల్వలను పరిశీలించారు. తాగునీటి ఎద్దడి ఏఏ ప్రాంతాల్లో ఉంది, దానికి తీసుకోవాల్సిన చర్యలపై స్థానికులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు. ఏలేరు నుంచి నీటిని తీసుకురావడానికి అవసరమైన చర్యలపై కలెక్టర్తో చర్చిస్తామని తెలిపారు. మున్సిపల్ ఏఈ ఆలీషా పబ్లిక్ హెల్త్ ఏఈ రామ్మోహన్ తదితరులు ఉన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీప్రకాష్ విద్యార్థి ప్రతిభ తుని: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థి జె.మోనిష్ కుమార్ ఓబీసీ కేటగిరిలో 167 ర్యాంకు, జనరల్ కేటగిరిలో 974 ర్యాంకు సాధించాడని ప్రిన్సిపాల్ వివిఎస్ఎస్.భానుమూర్తి సోమవారం తెలిపారు. శ్రీప్రకాష్లో స్కూల్ లెవెల్ నుంచి ఇస్తున్న పొసైటీ ఫర్ ప్రమోటింగ్ ఎకడమిక్ ఎక్స్లెన్స్ ఇన్ స్కూల్ (స్పేసెస్), శ్రీప్రకాష్ అచీవర్స్ అకాడమీ(స్పా) ఇంటిగ్రేటేడ్ ప్రోగ్రాం ద్వారా తమ విద్యార్థులు విజయాలు సాధిస్తున్నారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకె. నరసింహరావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్, ఉపాధ్యాయులు అభినందించారు. -
నా ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు
● జనసేన నాయకుడిపై కోడలి ఆరోపణ ● కుమార్తెతో కలిసి పాడా కార్యాలయం ఎదుట నిరసన పిఠాపురం రూరల్ : తనకు రావాల్సిన ఆస్తి అడుగుతుంటే తన మామ, జనసేన నాయకుడు అయిన గరగ సత్యానందం వేధింపులకు గురి చేస్తున్నారని పిఠాపురం మండలం గోకివాడకు చెందిన గరగ కృష్ణ స్వాతి ఆరోపించారు. తనకు న్యాయం కావాలని, తన కుమార్తెతో కలిసి పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చట్టబద్ధంగా తనకు రావలసిన ఆస్తి హక్కులను కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భర్త గరగ జగన్నాథ్ 2021లో కోవిడ్తో మరణించారని, భర్త మరణానంతరం తనను మానసికంగా, ఆర్థికంగా మామ సత్యానందం వేధిస్తున్నారని ఆరోపించారు. ఆయన పిఠాపురం జనసేన నాయకుడు కావడంతో జనసేన కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కుమార్తెను పోషించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కృష్ణ స్వాతి తెలిపారు. భర్త చనిపోయిన సమయంలో తన వద్ద నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, మామగారే కదా అని నమ్మి సంతకం పెట్టానని, ఆస్తి కోసం ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఊహించలేదని కంటతడి పెట్టారు. స్థానిక జనసేన నాయకులు తనకు అండగా నిలవకుండా మామ సత్యానందానికే మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి, చేబ్రోలులోని పార్టీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేశానని, హైదరాబాద్లో పవన్ నివాసానికి రెండుసార్లు వెళ్లానని అయినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన చిన్న కుమార్తెకు రక్షణ కల్పించి జీవన భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపారు. వినతి పత్రం ఇస్తామంటే 8 గంటలు నిర్బంధించారు – ఎస్ఎఫ్ఐ నాయకుల ఆవేదన తుని రూరల్: విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తామంటే తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఈ మేరకు జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు, సహాయ కార్యదర్శి సీహెచ్ లోవరాజు, ఎం.గంగాసూరిబాబు, పి.సత్యం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎంను కలసి వినతి పత్రం అందించేందుకు పోలీసులను అనుమతి కోరామన్నారు. అందుకు అంగీకరించని పెద్దాపురం డీఏస్పీ ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దుర్మార్గమని, రాజ్యాంగ విరుద్దమన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి జిల్లాలో ఉన్న సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించాలని, కోటనందూరు, తొండంగి, రౌతులపూడి, ప్రత్తిపాడు, యు.కొత్తపల్లి, పెదపూడి మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆదికవి నన్నయ్య పీజీ సెంటర్ను కాకినాడలో మినీ యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేసి అన్ని కోర్సులు ఏర్పాటు చేయాలన్నారు. తుని, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలలో పీజీ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలు, కళాశాలల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు సంవత్సరం మొత్తానికి బస్పాసులు జారీ చేయాలన్నారు. -
తప్పుడు పనిపై నిప్పులు
● మెగా డీఎస్సీనా...దగా డీఎస్సీనా? ● బాబు సర్కార్పై నిరసన గళం ● కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు ● భారీ ప్రదర్శన, కలెక్టరేట్ వద్ద ధర్నా ● తొలుగ కలెక్టరేట్లోకి అనుమతించని పోలీసులు ● పట్టుబట్టి లోపలికి వెళ్లిన పార్టీ నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ/బాలాజీచెరువు: మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేసిన చంద్రబాబు సర్కార్పై వైఎస్సార్ సీపీ శ్రేణులు నిప్పులు చెరిగాయి. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ఎత్తున పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు ధర్నా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా పార్టీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫ్లెక్స్లు, బ్యానర్లతో ఆర్డీఓ కార్యాలయం, కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. దారి పొడవునా మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ప్రదర్శనగా వచ్చిన పార్టీ నేతలు కలెక్టరేట్ గేటు బయట రోడ్డుపై బైఠాయించారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ధర్నాకు పోలీసులు నిలువరించినా పార్టీ నేతలు మూకుమ్మడిగా నిరసనను కొనసాగించారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో చోటు చేసుకున్న అవకతవకలు, అంతులేని అక్రమాలు, స్కాంలు, డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్థులకు చివరి వరకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు. ప్రభుత్వంలో పెద్దలు డీఎస్సీని అడ్డంపెట్టుకుని వ్యాపారం చేశారని నినదించారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు మిన్నంటాయి. ఈ కుంభకోణంపై వాస్తవాలు ప్రజల ముందుంచాలంటే సీబీఐ లేదా హైకోర్టు సిటింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు రావాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా అధికారులకు విజ్ఞాపన అందచేసేందుకు కలెక్టరేట్ గేట్ వద్ద వెళ్లే సరికి పోలీసులు అడ్డుకుని ప్రధాన గేటు వేసేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ మల్లా కిషోర్ తదితరులు ఆధ్వర్యంలో గేటును తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి వెళ్లారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఉద్యోగాలు అమ్మేశారు ఈ సందర్బంగా చంద్రకళాదీప్తికుమార్ మాట్లాడుతూ కూటమి నాయకులు నోట్ల కట్టలకు ఆశపడి అనర్హులకు ఉద్యోగాలు అమ్మేశారని ధ్వజమెత్తారు. హోంమంత్రి అనిత యువత కోసం ఉద్యోగాలు ఎదురుచూస్తున్నాయంటూ వాస్తవ విరుద్ధంగా మాట్లాడటం అన్యాయమన్నారు. ఉద్యోగాలు తామే ఇస్తామని గొప్పలు చెప్పడం కాదు, డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు చిత్తశుద్ధితో న్యాయంచేస్తే అదే పదివేలన్నారు. సమాజ భవిష్యత్కు దిక్సూచిలా నిలిచే ఉపాధ్యాయులను తయారుచేసే డీఎస్సీలో చోటు చేసుకుంటోన్న అక్రమాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. టాలెంట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం చేస్తే ఆ ఉసురు ప్రభుత్వానికి తగలకుండా పోదన్నారు. భవిష్యత్లో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే సామర్థ్యం డీఎస్సీలో అక్రమ మార్గంలో వచ్చే ఉపాధ్యాయులకు ఉంటుందా అని రాగిరెడ్డి ప్రశ్నించారు. మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోననే విషయాన్ని సమాజంలో మేధావి వర్గం ఆలోచించాలన్నారు. విద్య విషయంలో భవిష్యత్ తరాలకు చంద్రబాబు ప్రభుత్వం ఏమి చెప్పాలనుకుంటోందని ఆమె నిలదీశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలుసున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో మీకు మేమున్నాం అని నీతులు చెప్పిన ప్రభుత్వం కోసం కూటమి కట్టిన నేతలు డీఎస్సీలో జరుగుతున్న అవకతవకలను నిలదీస్తుంటే బూతుల్లా వినపడుతున్నాయా అని ప్రశ్నించారు. ‘నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలి’– డీఎస్సీ అవకతవకలను వెంటనే సరిదిద్దాలి’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేసి కలెక్టరేట్లో మెమోరాండం అందించారు. ఆందోళన కార్యక్రమంలో ప్రచార సెల్ రాష్ట్ర కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు అల్లి రాజబాబు, పసుపులేటి చంద్రశేఖర్, కంపర బాబీ, పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, దాసం వెంకటేష్, యాసలపు పవన్, యువజన విభాగం సెక్రటరీ లక్ష్మీకాంత్, నేతలు హేమంత్, ఉలవల భూషణం, వాసిరెడ్డి చిన్ని, చిన్నారెడ్డి, బొమ్మరిల్లు రమేష్, గుత్తుల శ్రీనివాస్, పెదిరెడ్ల కృష్ణ, కురందాసు సతీష్, గుత్తు గుర్రాజు, మాగాపు గోపి, గరగ సురేష్ పాల్గొన్నారు. కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద ధర్నా చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ తదితరులుకోర్టు ఉత్తర్వులు లెక్క చేయడం లేదు డీఎస్సీ కుంభకోణంపై రాష్ట్ర వ్యాప్తంగా గళమెత్తిన వైఎస్సార్ సీపీకి వ్యతిరేకంగా టీడీపీ సమావేశాలు నిర్వహిస్తోంది. వైఎస్సార్ సీపీకి మద్దతు పలికి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం తప్పును ఒప్పుకోకపోగా తిరిగి ఆసత్య ఆరోపణలు చేస్తోంది. కోర్టు ఉత్తర్వులను సైతం లెక్కచేయకుండా పాలన చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – కురపాటి రమేష్, యువజన విభాగం నేత, వైఎస్సార్ సీీపీ డీఎస్సీలో అవకతవకలపై నిగ్గు తేల్చాలి డీఎస్సీలో జరిగిన అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం నిగ్గు తేల్చాలి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి టీచర్లతో రాజకీయ సభ నిర్వహించి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తప్పు జరగలేదని విద్యాశాఖ కమిషనర్ పాత్రికేయలు సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉంది. శాప్ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు అంతా సక్రమమంగానే జరిగిందని ఉపన్యాసాలు ఇస్తున్నారు. – రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రచార సెల్. ఆధారాలున్నా అడ్డంగా బకాయింపు మెగా డీఎస్సీ–25లో అవకతవకలకు పాల్పడి ఉక్కిరిబిక్కిరి అవుతున్న చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా కథలు చెబుతోంది. కుంభకోణంపై ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పక్కా ఆధారాలను చూపిస్తున్నా సరైన సమాధానం ఇవ్వడం లేదు. విద్యాశాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్లో సరైన సమాధానం లభించడం లేదు. శాప్కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు ఆర్టీఐ ద్వారా సమాచారం కొరితే ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేస్తూ పిటషనర్లను బెదిరిస్తున్నారు. – అల్లి రాజబాబు, మాజీ చైర్మన్, స్మార్ట్సిటీ కార్పొరేషన్, కాకినాడ -
ప్రమాణాలు పాతాళంలో..
● టెన్త్లో 3,942 మంది ఫెయిల్ ● సైన్స్, మ్యాథ్స్, సోషల్లోనే ఎక్కువ మంది వెనుకబాటు ● అమ్మ భాషలోనూ అపజయమే బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి ఫలితాలను విశ్లేషిస్తే మన విద్యా వ్యవస్థలోని డొల్లతనం బయట పడక మానదు. ప్రత్యేక తరగతులు, వంద రోజుల ప్రణాళిక అంటూ ఎంత హడావుడి చేసినా ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్స్లో ఫెయిలయ్యారు. చివరకు అమ్మ భాష అయిన తెలుగులో సైతం తక్కువ మార్కులే పొందారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో తెలుసుకోవచ్చు. చదవలేని, రాయలేని స్థితిలో చాలా మంది విద్యార్థులున్నట్లు ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఫెయిలైన విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యా ప్రమాణాలు పతనమవుతున్నట్లు స్పష్టమవుతోంది. కారణమేమిటో! గత నెలలో విడుదలైన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో జిల్లావ్యాప్తంగా 3,942 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. వీరిలో ప్రైవేటు విద్యా సంస్థలకు చెందిన వారు 458 మాత్రమే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అంతమంది విద్యార్థులు ఎందుకు వెనుకబడ్డారనే అంశం విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. సరైన పర్యవేక్షణ లేకపోవడమా లేక బోధనా పద్ధతుల్లో లోపమా అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది విద్యార్థులు సైన్స్, గణితం, సోషల్, తెలుగు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ప్రాథమిక అవగాహన లేకపోవడమే విద్యార్థులు ఫెయిలవడానికి ప్రధాన కారణమని, బట్టీ పట్టే పద్ధతికి అలవాటు పడటంతో అప్లికేషన్ మెథడ్ ప్రశ్నలకు సమాధానాలు రాయలేకపోయారని విద్యావేత్తలు చెబుతున్నారు. చివరకు అమ్మ భాషలో సైతం ఎక్కువ మంది ఉత్తీర్ణులు కాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్షర దోషాలు లేకుండా తెలుగులో రాయలేకపోవడం, వాక్య నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో భాషా సబ్జెక్టుల్లో మార్కులు తగ్గుతున్నాయని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల కంటే మెరుగైన సౌకర్యాలు, ట్యూషన్ సెంటర్లు ఉండే పట్టణ ప్రాంతాల్లోనే విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తించారు. స్మార్ట్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండటం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వంటి కారణాలతో పట్టణ ప్రాంత విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ విద్యా రంగం తిరోగమనంలో పయనిస్తోందని విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులు ఫెయిలవడానికి మూలకారణాలను ఇప్పుడైనా సరిగ్గా గుర్తించి, సరి చేయకుంటే ప్రభుత్వ విద్యా రంగం మరింత అధోగతి పాలయ్యే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) -
లో వోల్టేజీ సమస్య పై ప్రకంపనలు
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో విద్యుత్ సమస్యపై సాక్షి దినపత్రికలో ఆదివారం ‘రత్నగిరి పై కరెంటు కష్టాలు’ శీర్షికన ప్రచురితమైన వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రాష్ట్ర విద్యుత్ శాఖ తూర్పు డివిజన్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) సీఎండీ ఫృథ్వీతేజ్ స్పందించి, కాకినాడ జిల్లా విద్యుత్ శాఖ అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ నాణ్యమైన విద్యుత్నే దేవస్థానానికి సరఫరా చేస్తోందని దేవస్థానం కేబుల్స్లోనే సమస్య ఉండ వచ్చునని సీఎండీకి విద్యుత్ శాఖ కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ జీ ప్రసాద్ వివరణ ఇచ్చారు. విద్యుత్ సమస్యను దేవస్థానం అధికారులే పరిష్కరించుకోవాలని దేవస్థానం సబ్స్టేషన్ కు నిర్ధేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. దీంతో దేవస్థానంలో విద్యుత్ లో వోల్టేజీ సమస్యకు కారణమెవరు అనే దానిపై గందరగోళం ఏర్పడింది. విద్యుత్ విజిలెన్స్ అధికారుల తనిఖీలు దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య పై అటు దేవస్థానం, ఇటు విద్యుత్ శాఖ అఽధికారులు భిన్న వాదనలు వినిపిస్తుండడంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు దేవస్థానంలో విద్యుత్ సరఫరాపై తనిఖీలు చేయాలని విద్యుత్ విజిలెన్స్ అధికారులను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఫృద్వీరాజ్ ఆదేశించారు. దీంతో సోమవారం విజిలెన్స్ అధికారులు రత్నగిరి సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరాపై తనిఖీలు నిర్వహించారు. లో వోల్టేజీ సమస్య పై దేవస్థానం, విద్యుత్ శాఖ అధికారులు రత్నగిరి సబ్ స్టేషన్లో ఉమ్మడిగా మంగళవారం తనిఖీలు నిర్వహించనున్నారు. -
సంపద కాదు.. అప్పులు సృష్టించారు
● సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమం అందించడంలో విఫలం ● హత్యా రాజకీయాలు, కక్ష సాధింపుతో డైవర్షన్ పాలిటిక్స్ ● చంద్రబాబుపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు తొండంగి: సంపద సృష్టిస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా అప్పులు మాత్రమే సృష్టిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) కార్యక్రమంపై మండలంలోని పైడికొండ, అద్దరిపేట, వేమవరం, పి.అగ్రహారం గ్రామాల్లో బూత్ లెవెల్ ఏజెంట్ల(బీఎల్ఏ)తో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, ఇష్టానుసారం అప్పులు చేస్తూ ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేసి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తు చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రూ.3.60 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి, సంపదకు బదులు అప్పులు సృష్టించారని దుయ్యబట్టారు. సూపర్ సిక్స్ హామీలు, సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారన్నారు. వీటికి సమాధానం చెప్పలేక హత్యా రాజకీయాలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యల వంటి వాటిటో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్పణం పెరిగిందని, కానీ, ఇంటింటికీ సంక్షేమం అందించినట్టు చంద్రబాబు సొంత మీడియా ద్వారా కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. జూన్ 12న నిర్వహిస్తున్న శ్రీవెన్నుపోటుకు రెండేళ్లుశ్రీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఓట్లు తొలగించే కుట్రకు అవకాశం కూటమి పాలనపై ప్రజలు రెండేళ్లకే విసుగు చెందారని, స్థానిక సంస్థలతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని రాజా అన్నారు. ప్రజల విశ్వాసం పొందని నేపథ్యంలో సర్ ప్రక్రియను అవకాశంగా తీసుకుని వైఎస్సార్ సీపీ అనుకూల ఓట్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసే అవకాశం ఉందని అన్నారు. అందువలన సర్ కార్యక్రమం సందర్భంగా బూత్ లెవెల్ అధికారులతో పాటు బీఎల్ఏలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి, అర్హులైన ప్రజల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకుని వస్తే ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రాజా చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడదా హేమంత్, పార్టీ తొండంగి మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల బాబీ, పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, వేమవరం మాజీ సర్పంచ్ మారేటి కృష్ణ, అద్దరిపేట మాజీ సర్పంచ్ కోడా వర్మ, రైతు విభాగం మండల అధ్యక్షుడు గోసుల సత్యనారాయణ, నియోజకవర్గ కల్చరల్ వింగ్ అధ్యక్షుడు మురాలశెట్టి సత్యనారాయణ, ఆర్టీఐ వింగ్ మండల అధ్యక్షుడు వీసం రామకృష్ణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీలో చేరిన టీడీపీ నేతలు కూటమి పాలనపై విసుగుతో పైడికొండ పంచాయతీ ఆనూరు గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు రాజా సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఊటకోటి వరహాలు, ఊటకోటి రాజేష్ తదితరులకు రాజా పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, ఉపాధ్యక్షుడు మేడిశెట్టి దారబాబు, నాయకులు కాశిందేవుల శ్రీనివాస్, జక్కా వరహాలు తదితరులు పాల్గొన్నారు. -
పవన్ ఇలాకాలో పానీపాట్లు
● పిఠాపురం నియోజకవర్గంలో తాగునీటికి కటకట ● గొంతెండుతున్న పలు కాలనీల ప్రజలు క్యూ కట్టిన మంచినీటి డ్రమ్ములు ఈ చిత్రంలో ఉన్న ట్యాంకులు, డ్రమ్ములను చూశారా! ఇవి ఏదో నిల్వ చేసుకోడానికి ప్రజలు తమ ఇళ్ల ముందు ఏర్పాటు చేసుకున్నవని అనుకుంటే పొరపాటే. గొల్లప్రోలు నగర పంచాయతీలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడింది. ఎప్పుడు వస్తుందో తెలియని మున్సిపల్ ట్యాంకర్ కోసం పడిగాపులు పడలేక పట్టణంలోని కొత్త కాలనీ వాసులు.. ఇళ్లపై పెట్టుకునే వాటర్ ట్యాంకులను, డ్రమ్ములను ఇలా తమ ఇళ్ల ముందు పెట్టుకున్నారు. మున్సిపల్ ట్యాంకర్ వచ్చి ఆయా ట్యాంకులు, డ్రమ్ముల్లో నీరు నింపితే.. వాటిని స్థానికులు బిందెలతో తమ ఇళ్లకు మోసుకుంటున్నారు. పవన్ ఇలాకాలో తీవ్రమైన మంచినీటి సమస్యకు ఈ చిత్రం నిదర్శనం. పిఠాపురం: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది పిఠాపురం నియోజకవర్గ పరిస్థితి. పేరుకు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గం. రూ.వందల కోట్లతో అభివృద్ధి చేశామని ఇక్కడి జనసేన నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, నియోజకవర్గంలోని పలు ప్రాంతాల ప్రజలు గుక్కెడు మంచినీళ్లు దొరకక నరకం చవి చూస్తున్నారు. రోజూ డబ్బులు పెట్టి తాగునీరు కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్ప డిందని వాపోతున్నారు. పిఠాపురం మండలం కుమారపురం; కొత్తపల్లి మండలం ఉప్పాడ, సుబ్బంపేట; గొల్లప్రోలు మండలం కొడవలి, చెందుర్తి, గొల్లప్రోలు నగర పంచాయతీ 20వ వార్డు ఈబీసీ కాలనీ, జగనన్న కాలనీల వాసులు తాగునీటికి అల్లాడుతున్నారు. పలు ప్రాంతాల్లోని కుళాయిల నుంచి వారం రోజులుగా నీరు రావడం లేదు. ట్యాంకర్ పంపించాలని అధికారులకు విన్నవించుకున్నా ఫలితం శూన్యం. గొల్లప్రోలు ఈబీసీ కాలనీ జనాభా సుమారు 2,500. ఈ ప్రాంతంలో ఇంతమంది జీవిస్తున్నా తాగునీరు సక్రమంగా అందించకపోతే ఎలాగని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు జగనన్న కాలనీలో ఇళ్లపై ఉండాల్సిన నీటి ట్యాంకులతో పాటు డ్రమ్ములను ఇళ్ల ముందు పెట్టుకుని, వాటర్ ట్యాంకు రాక కోసం ఇంటిల్లిపాదీ పడిగాపులు పడాల్సి వస్తోంది. అలాగే, 13 వేల జనాభా ఉన్న ఉప్పాడ గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రమవడంతో స్థానికులు ఇటీవల ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు నిర్మించిన ఓవర్హెడ్ ట్యాంకులు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్యన కుళాయిల నుంచి నీరు వదులుతున్నారని, అది కూడా మురికిగా వస్తోందని, ఏ రోజు ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని కాలనీ వాసులు ఆవేదన చెందుతున్నారు. అసలే వేసవి కాలం కావడం.. ఓవైపు కరెంట్ కోతలు, మరోవైపు తాగునీటి సమస్యతో నియోజకవర్గ ప్రజలు నానా అవస్థలూ పడుతున్నారు. గొల్లప్రోలు ఈబీసీ కాలనీలో ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న మహిళలు కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించిన మహిళలువారం రోజులుగా ఇబ్బందులు కుళాయిల నుంచి నీరు అస్సలు రావడం లేదు. మా కాలనీకి మంచినీటి ట్యాంకర్ కూడా రావడం లేదు. వారం రోజులుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాంం. అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. కనీసం తాగునీరైనా ఇప్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – కట్టోజు కృష్ణకుమారి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు రాత్రి వేళ ఇస్తున్నారు మా కాలనీలో కొద్ది రోజులుగా కుళాయిలు రావడం లేదు. ట్యాంకర్తో కూడా నీరు ఇవ్వడం లేదు. అప్పుడప్పుడు కుళాయిల నుంచి రాత్రి వేళల్లో నీరు ఇస్తున్నారు. అవి కూడా మురికిగా వస్తున్నాయి. పగటి పూట మంచినీరు ఇవ్వాలి. తాగునీరు లేక చిన్న పిల్లలతో ఇబ్బందులు పడుతున్నా. – టి.కామాక్షి, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు ఎదురుచూపులే.. కూలి పనులు చేసుకుని జీవిస్తున్నాం. కుళాయి లేకపోతే మంచినీటి ట్యాంకర్ ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూడాల్సిన పరిస్థితి. పనికి సమయానికి వెళ్లాలి. నీటి కోసం ఎదురు చూస్తూంటే పనులకు ఎప్పుడు వెళ్లాలో అధికారులే చెప్పాలి. అర్ధరాత్రి కుళాయిలు ఇస్తున్నారు కానీ, అవి మా వరకూ చేరడం లేదు. – మలిరెడ్డి అమ్ములు, ఈబీసీ కాలనీ, గొల్లప్రోలు -
అలా.. హామీల జెల్ల
● ఉమ్మడి జిల్లాకు పలు సందర్భాల్లో చంద్రబాబు వాగ్దానాలు ● నేటికీ అతీగతీ లేని వైనం ● నేడు చామవరంలో సీఎం పర్యటన సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగాను, ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తరువాత చంద్రబాబు నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆ సందర్భంగా ఎడాపెడా అనేక హామీలు ఇచ్చారు. అవేవీ ఆచరణకు నోచుకున్న దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో సోమవారం ఆయన పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి వస్తున్నారంటే జనం గంపెడాశతో ఎదురు చూస్తూంటారు. ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడి నుంచి వెళ్లిన నెలకో, రెండు నెలలకో కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తారు. కానీ, గతంలో పలు సందర్భాల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ అమలుకు నోచలేదు. సీఎం పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇలా తమకు జెల్ల కొట్టడం మాని, ఈసారైనా ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని ఉమ్మడి జిల్లా వాసులు కోరుకుంటున్నారు. కాకినాడ జిల్లాకు జెల్ల గతంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సీహెచ్సీ) 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఒక్క ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కాకినాడ తీరంలో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తామని చెప్పారు. కానీ, ఒక్క పరిశ్రమ కూడా ఇప్పటి వరకూ పట్టాలెక్కిన దాఖలాల్లేవు. కాకినాడ ఎస్ఈజెడ్లో పరిశ్రమలు తెస్తానన్న హామీ కూడా గాల్లో కలిసిపోయింది. కోనసీమ.. ఒట్టి మాటలేనమ్మా..! సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం వచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, కొబ్బరి అనుబంధ పరిశ్రమలు తెస్తామని ఘనంగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా ఇటు పర్యాటక అభివృద్ధీ లేదు.. అటు కొత్తగా కొబ్బరి అనుబంధ పరిశ్రమల ఊసూ లేదు. పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగానే ఉండటంతో ‘సీమ’ ప్రజలు పెదవి విరుస్తున్నారు. సీఎం అయిన తరువాత చంద్రబాబు గత ఏడాది మే 31న కాట్రేనికోన మండలం చెయ్యేరులో జరిగిన పీ4 కార్యక్రమానికి వచ్చారు. ఆ సందర్భంగా చెయ్యేరు చెరువు అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ నిధులు రూ.3 కోట్లతో చేపట్టిన పనులు ఏడాదవుతున్నా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. స్వయంగా సీఎం చెప్పిన పనులకే దిక్కూమొక్కూ లేకుండా పోతే ఎలాగని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ‘తూర్పు’ తిరిగి దండమే.. గత ఏడాది ఏప్రిల్ 18న, ఈ ఏడాది చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయా సందర్భాల్లో నిడదవోలులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. నిడదవోలు పట్టణం పాటు ఆ మండలంలోని 23, చాగల్లు మండలంలోని 10 గ్రామాల ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ ఆసుపత్రి నిర్మాణంపై ఇప్పటికీ ఎటువంటి స్పష్టతా లేదు. ఎర్ర కాలువపై కంసాలపల్లి – మాధవరం వంతెన, టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. చంద్రబాబు హామీ ఎప్పుడు అమలవుతుందా అని 1,152 మంది టిడ్కో లబ్ధిదారులు ఇప్పటికీ ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు. వంతెన నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో నిడదవోలు మండలం కంసాలపల్లి, తాడేపల్లిగూడెం మండలం మాధవరం తదితర గ్రామాల రైతులు నిరాశ చెందుతున్నారు. అలాగే, గత ఏడాది జూలై 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా 5 ఎత్తిపోతల పథకాల మోటార్లు, పంపుల మరమ్మత్తులకు నిధుల మంజూరు, కొవ్వూరు డిగ్రీ కాలేజీకి భవనాలు, మౌలిక వసతుల కల్పన, కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేయడం వంటి హామీలిచ్చారు. అలాగే, చెంతనే గోదావరి ప్రవహిస్తున్నా కొవ్వూరు నియోజకవర్గ ప్రజలకు ఆ నది నీరు గుక్కెడు కూడా అందని సమస్యపై సానుకూలంగా స్పందించారు. కానీ, ఇవేవీ నేటికీ ఆచరణకు నోచుకోలేదు. గతంలో ఇచ్చిన హామీలేమయ్యాయని జనం అడుగుతున్నారు సార్!ఇంకా.. సార్వత్రిక ఎన్నికల సమయంలో 2024 జనవరి 10న కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. ఆ సందర్భంగా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై లేనిపోని నిందలు మోపారు. మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని, రూ.50 బాటిల్ను రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు. కానీ, ఆయన గద్దెనెక్కిన రెండేళ్లుగా బీరు, బ్రాందీ, విస్కీ ఇలా ఏ బ్రాండ్ మద్యమైనా ప్రతి బాటిల్పై మద్యం మాఫియా రూ.10 నుంచి రూ.20 వరకూ అదనంగా దోచుకుంటున్నా కనీస స్పందన కూడా లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తామని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో చంద్రబాబు పదేపదే హామీ ఇచ్చారు. కానీ, ఆయన గద్దెనెక్కిన తరువాత ఆ హామీ కాస్తా గాల్లో కలసిపోయిందని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉద్యోగాలు, అటు భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని నిలదీస్తున్నారు. తాజా పర్యటన సందర్భంగా గత హామీలపై చంద్రబాబు ఏం చెప్తారో.. కొత్తగా ఏ మాటల గారడీతో మభ్యపెడతారోనని అంటున్నారు. -
మండుటెండలో.. నిండైన భక్తితో..
తుని రూరల్: ఓవైపు ఎండ మండిపోతున్నా గుండెల నిండా నింపుకొన్న భక్తితో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 26 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,73,895, పూజా టికెట్లకు రూ.4,66,290, తలనీలాలకు రూ.20 వేలు, వాహన పూజలకు రూ.6,390, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.88,965, విరాళాలు రూ.17,335 కలిపి మొత్తం రూ.7,72,875 ఆదాయం సమకూరిందని వివరించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల తర్వాత క్యూ లైన్లపై పూర్తి స్థాయిలో షెడ్లు నిర్మించలేదు. దీంతో, పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు ఆలయం చుట్టూ మండుటెండలో నిలబడలేక విలవిలలాడిపోయారు. చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షెడ్లు వేయకపోతే వేసవిలోనే కాకుండా వర్షాకాలంలో సైతం ఇబ్బందులు తప్పవని, వెంటనే వీటిని నిర్మించాలని భక్తులు కోరారు. నేడు సీఎం పర్యటన తుని రూరల్: పింఛన్ల పంపిణీ, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుని మండలం చామవరంలో సోమవారం పర్యటించనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవిల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి 10.50 గంటలకు చామవరం చేరుకుంటారు. ప్రజావేదిక సమావేశం, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. పింఛన్దార్లతో 10 నిమిషాలు మాట్లాడుతారు. తరువాత స్థానిక నాయకులతో సమావేశమై, 4.25 గంటలకు హెలికాప్టర్లో ఉండవిల్లికి బయలుదేరుతారు. నేటి పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను ఈ సోమవారం రద్దు చేశారు. తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుని పర్యటిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘రంగరాయ’ ప్రిన్సిపాల్గా బాధ్యతల స్వీకరణ కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ప్రిన్సిపాల్గా డాక్టర్ ప్రయాగ ఉషాకిరణ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్ఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతిగా సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు తాజాగా వైద్య విద్య అదనపు సంచాలకుడిగా (ఏడీఎంఈ) ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఆయనను కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సత్యదేవుని ఆలయం.. భక్తజన సంద్రంఅన్నవరం: సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన సంద్రమే అయ్యింది. వందలాది వాహనాల్లో భక్తులు ఉదయం నుంచీ రావడంతో రత్నగిరి, సత్యగిరి పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఘాట్ రోడ్డుకు ఇరువైపులా సైతం వాహనాలను నిలిపివేయడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 3 వేల వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సూర్య భగవానుడు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడిన ఉష్ణోగ్రతతో చెలరేగిపోవడంతో భక్తులు అల్లాడిపోయారు. చెట్ల నీడన, విశ్రాంతి మండపాల్లోను సేద తీరారు. ఆలయం చుట్టూ గ్రీన్ షేడ్ ఏర్పాటు చేసినప్పటికీ ఉష్ణోగ్రత 30 డిగ్రీలకు పైబడితే వేడి దిగిపోయి, భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. ఆలయం చుట్టూ షెడ్డు నిర్మిస్తే ఉపశమనంగా ఉంటుందని, అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుతున్నారు. -
దేవస్థానమే పరిష్కరించుకోవాలి
● రత్నగిరి విద్యుత్ సమస్యపై వివరణ కోరిన ఈపీడీసీఎల్ సీఎండీ ● నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్న ఎస్ఈ ● కేబుల్స్ సరి చూసుకోవాలని దేవస్థానానికి సూచన అన్నవరం: ‘రత్నగిరిపై కరెంటు కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’ ఆదివారం ప్రచురించిన కథనానికి ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) సీఎండీ పృథ్వీతేజ్ స్పందించారు. ఈ సమస్యపై జిల్లా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన ఆదివారం సమీక్షించారు. లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు నాణ్యమైన విద్యుత్నే సరఫరా చేస్తున్నామని, దేవస్థానం కేబుల్స్లోనే సమస్య ఉండవచ్చునంటూ సీఎండీకి వివరణ ఇచ్చినట్టు ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్కు నిర్దేశించిన 11 కేవీ విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని, లో ఓల్టేజీ లేదని అన్నారు. అందువలన రత్నగిరిపై విద్యుత్ సమస్యను దేవస్థానమే పరిష్కరించుకోవాలని సీఎండీకి వివరించామని తెలిపారు. దేవస్థానం సబ్ స్టేషన్కు హంసవరంలోని సబ్ స్టేషన్ నుంచి నేరుగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. కావాలంటే తమ వద్ద రికార్డు అయిన విద్యుత్ సరఫరా డేటాను దేవస్థానానికి అందజేస్తామని తెలిపారు. సబ్ స్టేషన్ మీటర్లో కూడా 11 కేవీ విద్యుత్ వస్తోందని తెలిపారు. అక్కడి నుంచి దేవస్థానంలోని వ్రత మండపాలకు, లిఫ్టుకు లో ఓల్టేజీ సరఫరా కావడానికి దేవస్థానం కేబుల్స్లో లోపం కారణమై ఉండవచ్చని సీఎండీకి చెప్పామన్నారు. దేవస్థానం అధికారులు ఇప్పటికై నా తమ కేబుల్స్ సరి చూసుకోవాలని ప్రసాద్ సూచించారు. కొనసాగిన లో ఓల్టేజీ సమస్య సత్యదేవుని ఆలయంలో రూ.2 వేల వ్రత మండపాల్లో లో ఓల్టేజీ కారణంగా ఆదివారం కూడా ఏసీలు పని చేయలేదు. దీంతో, ఆ వ్రతాలాచరించిన భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెంట్రల్ ఏసీ పని చేయకపోతే కనీసం తాత్కాలికంగా స్ల్పిట్ ఏసీలైనా బిగించాలని కోరుతున్నారు. -
డీఎస్సీలో అక్రమాలపై రేపు వైఎస్సార్సీపీ ధర్నా
రాజమహేంద్రవరం సిటీ: డీఎస్సీ–2025లో అవకతవకలు, మోసాలపై జూన్ 1న వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. డీఎస్సీపై సీబీఐ, సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేస్తామన్నారు.డీఎస్సీ నిర్వహణలో ప్రతిభ కలిగిన అర్హులకు అన్యాయం చేయడం, హైకోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ నిర్వహణలో పారదర్శకత లోపించడం, విస్తుగొలిపే అక్రమాలు వెలుగు చూడడం, మెరిట్ లిస్టులు వెబ్సైట్ నుంచి మాయం చేయడం, రోల్ ఆఫ్ రిజర్వేషన్ సక్రమంగా పాటించకపోవడం, పోస్టులు అమ్ముకోవడం వంటి ఆరోపణలు బయటికి రావడం, స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకంలో అక్రమాలు వెలుగు చూడడం వంటి అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. -
పల్లెవించని పాలన
● పంచాయతీ ఎన్నికలు జరపని సర్కారు ● ప్రత్యేకాధికారుల పాలనతో ఇబ్బందులు ● సమస్యలతో గ్రామీణులు సతమతం సాక్షి ప్రతినిధి, కాకినాడ: రెండేళ్ల చంద్రబాబు సర్కారు పాలనపై దాదాపు అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతోంది. దీంతో, పాలక వర్గాల పదవీ కాలం ముగిసి 2 నెలలు దాటిపోయినా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సాహసం చేయలేకపోతోంది. పల్లెల్లో ప్రత్యేకాధికారుల పాలన తీసుకు వచ్చింది. మండల కేంద్రాల్లో వివిధ శాఖల్లో పని చేస్తున్న ఒక్కో అధికారికి రెండు మూడు గ్రామ పంచాయతీలు సైతం అప్పగించారు. ఇప్పటికే శాఖా పరమైన పనులతో సతమతమవుతున్న వారికి.. అద నంగా అప్పజెప్పిన పల్లె పాలనపై దృష్టి సారించే వీలు చిక్కడం లేదు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తప్పని ప్రదక్షిణలు పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీల్లో ఏ చిన్న పనికై నా గ్రామ కార్యదర్శికే బాధ్యత ఉంటోంది. అయితే, గ్రామ సర్పంచ్లకుండే చెక్పవర్, సీఎంఎఫ్ఎస్ లాగిన్ను ప్రభుత్వం ప్రత్యేకాధికారులకు అప్పగించింది. ఫలితంగా కార్యదర్శులు చిన్నచిన్న పనులకు బిల్లులు, చెక్కులు తీసుకుని మండల కేంద్రా ల్లో ఉంటున్న ప్రత్యేకాధికారుల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. వారు అందుబాటులో లేకపోతే కాళ్లరిగేలా ప్రదక్షిణలు తప్పడం లేదు. పంచాయతీలో నిధులున్నా ప్ర త్యేకాధికారులు సకాలంలో ఆమోదం తెలియజేయకపోవడంతో ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. ఏదైనా పనిపై వెళ్తే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. చివరకు రూ.100 ఖర్చు చేయాలన్నా ప్రత్యేకాధికారి వద్దకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్థిక పరిపుష్టి కలిగిన గ్రేడ్–1 (మేజర్) గ్రామ పంచాయతీలు సొంత నిధులతో నెట్టుకొస్తున్నాయి. గ్రేడ్–2, గ్రేడ్–3 కేటగిరీల్లోని చిన్న పంచాయతీల్లో కనీసం డ్రైన్లు, మంచినీటి ట్యాంకులు, పైపులైన్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి పనులు కూడా చేయలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. స్థానికులు పదేపదే తమ దృష్టికి వివిధ సమస్యలు తెస్తున్నా ఏమీ చేయలేక వారు చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న సమస్యకు మండల కేంద్రాలకు వెళ్లడం భారంగా మారిందని స్థానికులు మండిపడుతున్నారు. కొన్ని సమస్యలివిగో.. ● ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పైపులైన్లు దెబ్బ తిన్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు. అమీనాబాద్, నాగులాపల్లి తదితర గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. ● ఇదే మండలం యండపల్లిలో విద్యుత్ లో ఓల్టేజీ సమస్యకు పరిష్కారమే లభించడం లేదు. దీనిని నిరసిస్తూ అక్కడి ప్రజలు కొత్తపల్లి సబ్ స్టేషన్ను ముట్టడించారు. ● కరప మండలం సిరిపురంలో ఇటీవల మంచినీటి మోటార్ కాలిపోయింది. పంచాయతీలో నిధులు లేకపోవడంతో స్థానికంగా యువకులు చందాలు వేసుకుని మరమ్మతులు చేయించాల్సి వచ్చింది. ● జగ్గంపేట, గండేపల్లి, పిఠాపురం, కరప తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో, పారిశుధ్య పరిస్థితులు దిగజారాయి. కార్యదర్శుల పైనే భారం పాలక వర్గాలున్నప్పుడు పంచాయతీ నిధులు, రాబడి మాటెలా ఉన్నా ప్రజా వ్యతిరేకతకు భయపడి సర్పంచులు, వార్డు సభ్యులు సొంత నిధులు వెచ్చించే వారు. తరువాత వచ్చే బిల్లులు డ్రా చేసుకుని సర్దుబాటు చేసుకునే వారు. ఇప్పుడు పాలక వర్గాలు లేకపోవడంతో పాలన భారమంతా కార్యదర్శుల పైనే పడింది. మూడు నెలల వేతన బకాయిలు చెల్లించకపోతే పని చేయబోమని పారిశుధ్య కార్మికులు చెప్తే.. ఒక్కొక్కరికి రూ.వెయ్యి, రూ.2 వేలు చేతిలో పెట్టి ప్రస్తుతానికి సరిపెట్టుకోండంటూ వారు బుజ్జగిస్తున్న పరిస్థితి. మంచినీటి పైపులైన్ల మరమ్మతులు, బ్లీచింగ్, ఫినాయిల్ తదితర అవసరాలకు సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. చిన్న పంచాయతీలకు స్వల్ప ఖర్చులతో బయట పడుతున్నారు. కానీ, గ్రేడ్–1 పంచాయతీలకు ప్రతి నెలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ఖర్చవుతోంది. కొన్ని సందర్భాల్లో వడ్డీకి అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టాల్సి వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. రెండు నెలలుగా జీతం సొమ్ము ఇంటికి తీసుకెళ్లిన పరిస్థితి లేకుండా పోయిందని కరప మండలంలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పంచాయతీ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లాలో గ్రామ పంచాయతీలు గ్రేడ్–1 76 గ్రేడ్–2 70 గ్రేడ్–3 80 గ్రేడ్–4 39 గ్రేడ్–4 (అడిషనల్) 30 గ్రేడ్–5 (500 జనాభా మినహా) 89 500 కంటే తక్కువ జనాభా 1 మొత్తం 385 ఒరిగిందేమీ లేదు ప్రత్యేకాధికారులతో గ్రామాలకు ఒరిగిందేమీ లేదు. వారు గ్రామాల్లో అడపాదడపా కనిపిస్తున్నారు. ప్రజల కనీస సమస్యలు కూడా గుర్తించడం లేదు. గ్రామ కార్యదర్శులు వీధులను శుభ్రం చేయించడం, డ్రైన్లలో చెత్త తీయించడంతో సరిపెట్టేస్తున్నారు. ఏదైనా సమస్య చెప్తే నిధుల్లేవు, కొత్త పాలకవర్గం రావాలని అంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. – చింతా బుజ్జి, పెదకొత్తూరు, కరప మండలం తాగునీటి సమస్యకు పరిష్కారమే లేదు కుళాయిల నుంచి తాగునీరు సక్రమంగా రావడం లేదు. వారంలో రెండు మూడు రోజులు వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. ఒకవేళ వచ్చినా అది మురికి నీటితో కలుషితమై వస్తోంది. గత్యంతరం లేక ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచే నీరు తెచ్చుకుంటున్నాం. ఈ సమస్యపై గ్రామ, మండల అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. ప్రత్యేకాధికారుల పాలన అంటే ఇదా? – ఆలపు సుధారాణి, ఎండపల్లి, ఉప్పాడ కొత్తపల్లి మండలం -
ఊ.. అంటారా.. ఊహూ అంటారా?
● చంద్రబాబును కలవనున్న ఎయిర్పోర్టు బాధిత రైతులు ● ఆయన స్పందనపై సర్వత్రా ఆసక్తితొండంగి: అన్నవరం పుణ్యక్షేత్రానికి కూతవేటు దూరంలో ప్రతిపాదించిన ఎయిర్పోర్టును ఇక్కడి నుంచి మరోచోటుకు తరలించాలని బాధిత గ్రామాలైన అన్నవరం, బెండపూడి, పీఈ చిన్నాయపాలెం రైతులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం తుని మండలం హంసవరం రానున్న సీఎం చంద్రబాబును వారు కలవనున్నారు. మూడు గ్రామాల్లో రెండు పంటలు పండే దాదాపు 1,200 ఎకరాల భూములు సేకరించి, ఎయిర్పోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ మూడు గ్రామాల రైతులు సాగరమాల, రైల్వే లైన్, పుష్కర, పోలవరం కాలువలతో పాటు జాతీయ రహదారి బైపాస్కు భూములిచ్చి నష్టపోయారు. ఇప్పుడు మళ్లీ ఎయిర్పోర్టు నిర్మాణం పేరిట తమ భూములు లాక్కొనే ప్రయత్నాలను నిరసిస్తూ బాధిత రైతులు ఉద్యమబాట పట్టారు. వాస్తవానికి ఇక్కడ ఎయిర్పోర్టు ప్రతిపాదన లేదంటూ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్తో పాటు ఈ ప్రాంత కూటమి నాయకులు గత ఏడాది ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఏడాది ఈ ప్రతిపాదన మళ్లీ తెర పైకి రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.కోట్లలో ఉంది. ఈ నేపథ్యంలో రైతులందరూ తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతకు ఎకరాకు రూ.లక్ష చొప్పున ‘తాంబూలం’ చెల్లించుకుని మరీ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా తమ భూములను కమర్షియల్ కన్వర్షన్లు చేసుకున్నారు. బెండపూడి, పీఈ చిన్నాయపాలెం ప్రాంతాల్లో భారీగా లే అవుట్లు కూడా ఏర్పాటయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ ఎయిర్పోర్టు ప్రతిపాదన రావడంతో వారు కలవరపడుతున్నారు. ఎయిర్పోర్టు ఏర్పాటును వ్యతిరేకిస్తూ బాధిత రైతులు కలెక్టర్, స్థానిక తహసీల్దార్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే వినతిపత్రాలు సమర్పించారు. ఇటీవల రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జగ్గంపేట రానున్నారని తెలియడంతో ఆయనను కలిసేందుకు సన్నద్ధమయ్యారు. అయితే, ఆయన పర్యటన రద్దయ్యింది. కాగా, సోమవారం హంసవరం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి తమ గోడు వినిపించుకోవాలని బాధిత రైతులు నిర్ణయించారు. సీఎం రైతుల మొర ఆలకించి ఊ.. అంటారా.. లేక ఉఉ.. అంటారా అనేది వేచి చూడాల్సిందే. అధికారుల్లో సందిగ్ధత! ఎయిర్పోర్టు ప్రతిపాదిత భూములకు పోలవరం, పుష్కర కాలువలతో పాటు దక్షిణాన రైల్వే లైను, తూర్పున సాగరమాల ప్రాజెక్టు రహదారి, ఉత్తరాన జాతీయ రహదారి సరిహద్దులుగా ఉన్నాయి. దీంతో పాటు అన్నవరం పుణ్యక్షేత్రం నో ఫ్లై జోన్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటుకు ప్రతికూల అంశాలే ఎక్కువగా ఉన్నాయనే ఆలోచనలో అధికార యంత్రాంగం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 40 వేల మంది భక్తులు రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. 2,200 వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సుమారు 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. పవన్ వైఖరి ప్రచారార్భాటమే.. రాజమహేంద్రవరం సిటీ: పేపర్ మిల్లు రసాయన వ్యర్థాల నుంచి గోదావరి జలాలను, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైఖరి ఒట్టి ప్రచారార్భాటమేనని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని ఆ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ, గోదావరిని ప్రక్షాళన చేస్తానన్న పవన్ కల్యాణ్.. రాజమహేంద్రవరం దాటిన వెంటనే మాట మార్చారన్నారు. 262 పంచాయతీలను మురుగు రహితంగా తీర్చిదిద్దాలనడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదన్నారు. పేపర్ మిల్లు తెరచి ఉండగా కాలుష్య రహిత పుష్కరాలు సాధ్యమేనా అనే విషయం పవన్కు అర్థం కాలేదన్నారు. ఈ మాత్రం దానికి మంత్రి, కలెక్టర్లపై విరుచుకుపడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఒకలా.. అమరావతిలో మరోలా మాట్లాడటానికి కారణమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పవన్ మాటలు వింటూంటే పేపర్ మిల్లు యాజమాన్యం ఆయనను రహస్యంగా కలిసిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. గోదావరి జల, వాయు కాలుష్యాలు పవన్ శాఖ పరిధిలోనివేనని, కానీ, పర్యాటక మంత్రి దుర్గేష్పై చిర్రుబుర్రులాడటం ఆయనకే చెల్లిందని విమర్శించారు. గోదావరి జల, వాయు కాలుష్యం ప్రక్షాళనకయ్యే మొత్తం ఖర్చును పేపర్ మిల్లు యాజమాన్యమే భరించాలని, ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గోదావరి డెల్టాకు నేటి నుంచి సాగునీరు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఖరీఫ్ సాగు నిమిత్తం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి గోదావరి కాలువలకు ఆదివారం నుంచి నీరు విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది. కాలువల మరమ్మతుల పరిస్థితిని బట్టి దశల వారీగా నీరు విడుదల చేయనున్నారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ధవళేశ్వరం బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ చర్యలకు సుమారు రూ.148 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఇరిగేషన్ ఎస్ఈ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఖరీఫ్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి ఉండదని చెప్పారు. అక్టోబర్ 31వ తేదీ వరకూ సాగు, తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
కమ్మని చిలుకదుద్దు పండ్లు
రాజవొమ్మంగి: చిట్టడవుల్లో సహజ సిద్ధంగా కనిపించే అనేక రకాల పండ్లలో చిలుకదుద్దు ప్రధానమైంది. ఇవి ఎరుపు రంగులో చెర్రీ పండ్ల మాదిరిగా ఉంటాయి. తీయగా.. కొంత వగరుగా ఉండే ఈ పండ్లు అంటే గిరిజన చిన్నారులకు ఎంతో ఇష్టం. అడవి పనులకు వెళ్లేవారు తమ పిల్లల కోసం వీటిని సేకరించి ఇంటికి తీసుకొస్తారు. సాధారణంగా రక్షిత అటవీ ప్రాంతంలో వేసవి మొదలు తొలకరి ప్రవేశించే వరకూ లభించే రకరకాల పండ్లలో చిలకదుద్దు ఒకటి. ప్రకృతి సిద్ధంగా అడవిలో లభించే రకరకాల పండ్ల జాతి చెట్లు రానురాను అంతరించిపోతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది. పిల్లలకే కాదు, ఎన్నో అరుదైన పక్షుల ఆహార కొరతను తీర్చే ఈ పండ్ల చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -
రత్నగిరిపై కరెంటు కష్టాలు
● సబ్ స్టేషన్ ఉన్నా తప్పని ఇబ్బంది ● లో ఓల్టేజీతో పని చేయని ఏసీలు, లిఫ్టు ● కాలిపోతున్న మోటార్లు ● భక్తులకు ఇక్కట్లు అన్నవరం: సత్యదేవుని భక్తులకు విద్యుత్ కష్టాలు తప్పడం లేదు. దేవస్థానంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉన్నప్పటికీ లో ఓల్టేజీ సమస్యతో ఒక్కోసారి సత్రాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఏసీలు సైతం పని చేయడం లేదు. దేవస్థానం ఏటా రూ.1.30 కోట్ల మేర విద్యుత్ బిల్లు చెల్లిస్తోంది. గతంలో ఈ బిల్లు రూ.3 కోట్ల వరకూ ఉండేది. అయితే, సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేశాక సగానికి పైగా బిల్లు భారం తగ్గినా.. భక్తులకు మాత్రం విద్యుత్ కష్టాలు పెరిగాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇవీ సమస్యలు ● ఓవైపు వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్కు పైబడి నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూ.2 వేల వ్రతాలు చేయించుకుంటున్న భక్తులు.. ఆ మండపాల్లో ఏసీలు పని చేయకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్రతం టికెట్టు రూ.1,500, ఏసీ ఖర్చు రూ.500 అని చెప్పి వసూలు చేస్తున్నా ఏసీలు పని చేయకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ● వృద్ధులు, దివ్యాంగుల కోసం సత్యదేవుని ప్రధానాలయం వెనుక లిఫ్టు ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ కారణంగా ఆ లిఫ్టు ప్రస్తుతం సరిగ్గా పని చేయడం లేదు. తరచుగా మధ్యలో ఆగిపోతూండటంతో భక్తులు భయాందోళనలు చెందుతున్నారు. శనివారం రెండుసార్లు ఇలాగే జరిగింది. విద్యుత్ సరఫరాను ఆపి, మళ్లీ ఆన్ చేయడంతో లిఫ్టు పని చేసింది. ● పంపా నది ఒడ్డున ఉన్న బోర్ల నుంచి నిత్యం రత్నగిరిపై ఉన్న వాటర్ ట్యాంకులకు నీటిని పంపింగ్ చేస్తూంటారు. ఈ మోటార్లు లో ఓల్టేజీ కారణంగా కాలిపోతున్నాయి. ఈ వేసవి మొదలయ్యాక ఇప్పటి వరకూ ఆరు మోటార్లు ఈవిధంగా కాలిపోయాయి. దీంతో రత్నగిరిపై నీటి సమస్య ఉత్పన్నమవుతోంది. వ్యవసాయ అవసరాలకు మళ్లింపు గతంలో కూడా దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్య తలెత్తింది. అప్పట్లో రత్నగిరిపై సబ్ స్టేషన్ నిర్మిస్తే ఈ సమస్య తీరుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు. ఆ మేరకు దేవస్థానం స్థలం ఇవ్వడంతో మూడేళ్ల క్రితం తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మించింది. దాని పైన విద్యుత్ శాఖ అధికారులు అతిథి గృహం కూడా నిర్మించుకున్నారు. సబ్ స్టేషన్ ఏర్పాటుతో దేవస్థానానికి విద్యుత్ సమస్య ఉండదని అందరూ భావించారు. కానీ, సమస్య యథాతథంగా కొనసాగుతోంది. ఈ సబ్ స్టేషన్లో నాలుగు ఫీడర్లున్నాయి. వీటిలో రెండు ఫీడర్ల నుంచి మాత్రమే దేవస్థానానికి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మిగిలిన రెండు ఫీడర్ల నుంచి పగలంతా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేవస్థానం అవసరాలకు విద్యుత్ చాలడం లేదని దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, రత్నగిరిపై ఉన్న 33/11 కేవీ సబ్ స్టేషన్కు ప్రస్తుతం అన్నవరంలోని సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. దీంతో, తమకు అవసరమైనప్పుడు వారు రత్నగిరికి సరఫరా కావాల్సిన విద్యుత్ను వాడుకుంటున్నారు. అలా కాకుండా రత్నగిరికి నేరుగా విద్యుత్ సరఫరా చేస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని దేవస్థానం అధికారులు చెబుతున్నారు. పగటి పూట దేవస్థానానికి సుమారు 400 ఓల్టుల సామర్థ్యంతో విద్యుత్ సరఫరా జరగాలి. కానీ, 370 ఓల్టులు మాత్రమే వస్తోందని అధికారులు అంటున్నారు. అందువల్లనే రత్నగిరిపై పగటి వేళ విద్యుత్ సమస్య ఉత్పన్నమవుతోందని, రాత్రి వేళ ఇబ్బంది ఉండటం లేదని చెబుతున్నారు. ఈపీడీసీఎల్ ఎస్ఈకి లేఖ దేవస్థానంలో లో ఓల్టేజీ సమస్యపై ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకి లేఖ రాశాం. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించాలని కోరాం. దేవస్థానం విద్యుత్ అధికారులు కూడా దీనిపై నేరుగా ఎస్ఈని కలిసి ఫిర్యాదు చేయాలని ఆదేశించాను. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఇళ్ల స్థలాలు కబ్జా చేస్తే ఉద్యమం
● వైఎస్సార్ సీపీ నేత దవులూరి దొరబాబు ● రామేశం మెట్టపై పేదలకిచ్చిన స్థలాల పరిశీలన సామర్లకోట: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తే ప్రజా ఉద్యమం చేస్తామని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు హెచ్చరించారు. పెద్దాపురం మండలంలోని 12 గ్రామాలకు చెందిన 2,300 మంది పేదలకు అప్పట్లో రామేశం మెట్ట వద్ద ఇళ్ల స్థలాలిచ్చారు. ఆ స్థలాలను ఆక్రమిస్తూ కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారనే సమాచారం మేరకు.. లబ్ధిదారులతో కలిసి దొరబాబు శనివారం ఆ భూములను పరిశీలించారు. అక్కడికి సమీపంలోనే చెత్తతో విద్యుదుత్పత్తి చేసే జిందాల్ కంపెనీ నిర్మాణం జరుగుతూడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదలకిచ్చిన స్థలాల్లో ఏవిధంగా పరిశ్రమ నిర్మిస్తారని ఆ కంపెనీ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వ అనుమతి మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని వారు చెప్పారు. ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇచ్చారని, దానిలో టీడీపీ, జనసేన, వైఎస్సార్ సీపీకి చెందిన లబ్ధిదారులున్నారని దొరబాబు తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎంగా, నేడు ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప ఒక్క సెంటు భూమి కూడా పేదలకు ఇప్పించకపోగా.. పేదలకు రిజిస్ట్రేషన్ చేసిన భూములను పరిశ్రమకు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. పరిశ్రమకు కేటాయించిన భూములతో పాటు పేదల ఇళ్ల స్థలాల్లోని రాళ్లను సైతం తొలగించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ చెత్త వేయడంతో ఏవిధంగా ఇళ్లు నిర్మించుకుని జీవించగలమని ప్రశ్నించారు. ఈ సందర్భంగా దొరబాబు విలేకర్లతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో 2,300 మంది లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి, పట్టాలు ఇచ్చామని చెప్పారు. ప్రతి లబ్ధిదారు స్థలం విలువ రూ.10 లక్షలుంటుందన్నారు. పరిశ్రమ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల స్థలాలే కావలసి వచ్చాయా అని ప్రశ్నించారు. కాలుష్య పరిశ్రమతో ఆ ప్రాంతంలో పేదలు ఇళ్లు నిర్మించుకుని, జీవించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ మరోచోట అనువైన స్థలాలు ఇచ్చేంత వరకూ తాము ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అనంతరం, దొరబాబు లబ్ధిదారులతో కలసి రామేశం మెట్ట నుంచి పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆర్డీఓ లేకపోవడంతో పరిపాలనాధికారి కేవీ మాధవరావుకు సమస్య వివరించి, వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు గోపు మురళి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఇనకొండ విష్ణుచక్రం, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, జిల్లా సహాయ కార్యదర్శి నరాలశెట్టి త్రినాథ్, సీనియర్ నాయకులు గోలి రామారావు, ఆకుల వీరబాబు, పల్లా గంగారావు, పరిమి శ్రీనివాస్, బోనాసు గుర్రాజు, ఆనూరి స్వామి, కనపర్తి సీమదొర, పాగా సురేష్ కుమార్, ఇరుసుమళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు. పేదల స్థలాలే దొరికాయా? జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇటీవల కుటుంబ సభ్యులతో కలసి వెళ్తే.. అక్కడ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. మా స్థలాల్లోకి వెళ్లడానికి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమతించలేదు. ఈ దారుణాన్ని అడ్డుకోవాలి. పరిశ్రమ నిర్మాణానికి పేదల స్థలాలే దొరికాయా? – దువ్వాడ మణి, బి.తాటిపర్తి, పెద్దాపురం మండలం ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు పేదలకిచ్చిన ఇళ్ల స్థలాల్లో చెత్త వేశారు. అక్కడ భరించలేని చెడు వాసన వస్తోంది. పరిశ్రమ సమీపంలో ఇళ్లు కట్టుకుని జీవించలేని పరిస్థితి. జగన్బాబు మాకు రిజిస్ట్రేషన్ చేసి మరీ స్థలాలు ఇచ్చారు. సొంతిల్లు లేని మాకు ఇంటి స్థలం వచ్చిందనే ఆనందం కూడా లేకుండా చేస్తున్నారు. న్యాయం చేయాలి. – గుర్లింకల కుమారి, సిరివాడ, పెద్దాపురం మండలం -
ఏపీ పీజీ సెట్లో శ్రీప్రకాష్ విద్యార్థుల ప్రతిభ
తుని: ఏపీ పీజీ సెట్లో శ్రీ ప్రకాష్ విద్యా ర్థులు ఉత్తమ ప్రతిభ చూపా రని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణారెడ్డి శనివారం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కెమిస్ట్రీ విభా గంలో ఈ.వాసు 8, ఎన్.నాగేశ్వరి 45, పి.మైథిలి 99, లైఫ్ సైన్స్లో కె.స్నేహ 48, ఫిజిక్స్లో వై.దీప్తి 69, జువాలజీలో వై.పావని 94, ఎస్.లోకేశ్వరి 98వ ర్యాంకులు సాధించారన్నారు. కళాశాలలో డిగ్రీతో పాటు పోటీ పరీక్షలకు ఇస్తున్న శిక్షణ ద్వారా ఈ విజయాన్ని సాధించారని రామకృష్ణారెడ్డి కొనియాడారు. ప్రతిభ చూపిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత సీహెచ్వీకే నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్ప్రకాష్ అభినందించారు. -
దొంగల భయంతో యువకుల గస్తీ
తుని రూరల్: ఎస్.అన్నవరం శివారు శేషాద్రి నగర్ కాలనీలో ఇటీవల తరచూ దొంగతనాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, పంపనబోయిన రాజబాబు (చంటి) ఆధ్వర్యంలో 15 మంది యువకులు బృందాలుగా ఏర్పడి రాత్రి వేళల్లో కర్రలతో వీధుల్లో తిరుగుతూ కాపలా కాస్తున్నారు. 15 రోజుల నుంచి ఇదే విధంగా కాపలా ఉంటున్నట్టు కనకాల వీరభద్రరావు, తేనే లోవరాజు, నడిమింటి ఎల్లంనాయుడు, దుంగ దారబాబు, పోలిశెట్టి చందు తదితరులు తెలిపారు. కొందరు దైవదర్శనాలకు, శుభకార్యాలకు రెండు, మూడు రోజులు ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళుతున్నారని, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు చోరీలకు పాల్పడుతున్నారన్నారు. -
వెలి ఘటనపై తహసీల్దార్ విచారణ
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పాత కోరంగికి సంబంధించిన వెలి ఘటనపై శనివారం తహసీల్దార్ పితాని త్రినాథరావు విచారణ నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ విచారణకు ఒకే సామాజిక వర్గానికి చెందిన గ్రామ పెద్దలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాధితుడు టేకుమూడి త్రిమూర్తులు మాట్లాడుతూ గ్రామపెద్దలు తమ కుటుంబానికి రూ.లక్ష జరిమానా విధించి, వెలివేశారని తెలిపాడు. గత మూడేళ్లుగా తమ కుటుంబాన్ని శుభ కార్యక్రమాలకు పిలవడం లేదని వాపోయాడు. తన కుమార్తె వివాహాన్ని కూడా చెడగొట్టారని, తాను పండించిన ధాన్యాన్ని కూడా కొనకుండా చేసి నష్టపరిచారన్నాడు. తప్పు కట్టాలని, లేకుంటే ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారని వాపోయాడు. దీనిపై గతంలో కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా శాంతి కమిటీ వేసి సమస్యను పరిష్కరించారని, అయితే గ్రామ పెద్దల తీరులో మార్పు రాలేదన్నాడు. దీంతో గత ఏడాది అక్టోబర్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్టు తెలిపాడు. కాగా.. సమస్యను గ్రామంలో తేల్చుకుంటామని, రెండు రోజులు సమయం ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ను గ్రామ పెద్దలు కోరారు. ఈ నేపథ్యంలో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. సమస్య పరిష్కారం కాకుంటే చట్టం తన పని తాను చేసుకుని పోతుందని తహసీల్దార్ హెచ్చరించారు. సమావేశంలో శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ టేకుమూడి లక్ష్మణరావు, ఎంపీడీఓ కె.సత్యనారాయణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకుడు టేకుమూడి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని మహిళ మృతి
ఫ మరొకరికి తీవ్ర గాయాలు ఫ శృంగవరంలో ఘటన రౌతులపూడి: మండలంలోని రౌతులపూడి – కత్తిపూడి ఆర్అండ్బీ రహదారిలో శృంగవరం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శృంగవరానికి చెందిన యలమంచిలి అమ్మాజీ, యలమంచిలి చక్రవేణి గుడికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కడానికి గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రోడ్డుపైకి వెళ్లారు. అదే సమయంలో కత్తిపూడి వైపు నల్ల కంకరరాయి లోడుతో వెళుతున్న లారీ రోడ్డుపై ఉన్న వీరిని ఢీకొంది. తీవ్ర గాయాలైన ఇద్దరినీ అంబులెన్స్లో కాకినాడ తరలిస్తుండగా మార్గం మధ్యలో అమ్మాజీ (52) మృతి చెందింది. చక్రవేణి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం తెలిసిన వెంటనే ఎస్సై వెంకటేశ్వరరావు వెళ్లి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అతి వేగంతో అదుపు తప్పిన కారు
ఫ కంటైనర్ను ఢీకొన్న వైనం ఫ ముగ్గురికి తీవ్ర గాయాలు దేవరపల్లి: అతి వేగంతో వెళుతున్న కారు అదుపు తప్పి, డివైడర్ను దాటి ఓ కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గు రికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గుండుగొలను – కొవ్వూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై యర్నగూడెం వద్ద శనివారం అతి వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి డివైడర్ను దాటి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న కంటైనర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్తో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ఏలూరు వైపు వెళుతున్న కారు అదుపు తప్పింది. ఆ సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. కాగా.. కారు ఢీకొనడంతో కంటైనర్ అదుపు తప్పి ఫ్లై ఓవర్ వంతెన గోడను ఢీకొని ఆగింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కాగా.. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై పి.మనోహర్ తెలిపారు. -
చెరువులో పడి యువకుడి మృతి
కొత్తపల్లి: మోటారు సైకిల్పై వస్తూ ప్రమాదవశాత్తూ చెరువులో పడి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పిఠాపురం – పాత ఇసుకపల్లి రహదారిలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ముగ్గురు యువకులు మైటారు సైకిల్పై అన్నవరం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కోనపాపపేట, మూలపేట, పాత ఇసుకపల్లి మీదుగా పిఠాపురం వస్తుండగా ప్రమాదవశాత్తు పాత ఇసుకపల్లి శివారు ఉన్న చెరువులో పడ్డారు. ఈ ప్రమాదంలో సాఖా సాయిరాం (16) మృతి చెందగా, గాయపడిన ఇద్దరు యువకులను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.20 లక్షల బంగారం దొరికినా.. ఆశపడలేదు!
తూర్పుగోదావరి (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
శభాష్ లక్ష్మణా..
● నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచిన యువకుడు ● రూ.20 లక్షల బంగారు ఆభరణాలు పోగొట్టుకున్న మహిళ ● భద్రంగా అందజేసిన యువకుడు కపిలేశ్వరపురం (మండపేట): మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్నవాడూ.. అనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఓ యువకుడు నిజాయతీకి నిలువుటద్దంలా నిలిచి.. పది మందితో శభాష్ అనిపించుకున్నారు. మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం మండలంలోని ఏడిద గ్రామానికి చెందిన పేరిచర్ల శ్రీలేఖ తన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో ఓ శుభకార్యానికి బయల్దేరారు. ఈ క్రమంలో రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను పోగొట్టుకున్నారు. ఆ బ్యాగ్ ఏడిద గ్రామ శివారు దేవుడు కాలనీ సమీపాన అదే గ్రామానికి చెందిన యువకుడు నామాల లక్ష్మణరావుకు దొరికింది. అదే మహద్భాగ్యమనుకుని ఆ ఆభరణాలను పట్టుకుపోవాలనే దుర్బుద్ధికి అతడు లోనవలేదు. ఆ ఆభరణాల పట్ల ఎలాంటి వ్యామోహాన్నీ పెంచుకోకుండా.. పోగొట్టుకున్న వారికే తిరిగి అందజేయాలని తపన పడ్డాడు. బ్యాగ్లో ఉన్న ఆధార్ కార్డులోని అడ్రస్కు సమాచారం అందించారు. సీఐ దొరరాజు, ఎస్సై వి.కిశోర్ సమక్షంలో బాధితురాలు శ్రీలేఖకు ఆ ఆభరణాల బ్యాగ్ను అప్పగించారు. నిజాయతీగా వ్యవహరించిన లక్ష్మణరావును పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు, ప్రజలు అభినందించారు. -
3 నెలలు.. 300 శాతం లాభాలు
● నమ్మించిన సైబరాసురుడు ● మోసపోయిన దంపతులు సామర్లకోట: మూడు నెలల్లో ఏకంగా 300 శాతం లాభాలు వస్తాయంటూ ఓ సైబరాసురుడు విసిరిన ఆన్లైన్ వలలో పెద్దాపురానికి చెందిన దంపతులు చిక్కుకున్నారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే కేవలం 3 నెలల్లోనే 300 శాతం లాభాలు వస్తాయంటూ.. ఆనంద్ లాఠీ షేర్ అండ్ స్టాక్బ్రోకర్ లిమిటెడ్ మేనేజర్ పేరుతో ఓ సైబర్ నేరగాడు.. పెద్దాపురం పట్టణంలోని వర్జుల వారి వీధికి చెందిన సూరే వేణు దంపతులకు వల విసిరాడు. ఆ మాటలు నమ్మి వేణు దంపతులు అతడి వాట్సాప్ గ్రూపులో చేరారు. తమ యూజర్ ఐడీ ద్వారా విడతల వారీగా ఏకంగా రూ.85 లక్షలు ఆ సైబర్ నేరగాడికి డిపాజిట్ చేశారు. అనంతరం, ఆ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా అతడు అకౌంట్ బ్లాక్ చేశాడు. ఆ తరువాత అతడి నుంచి స్పందన లేకపోవడంతో తాము మోసపోయామని వేణు దంపతులు గ్రహించి, పెద్దాపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. సైబర్ నేరాలపై తరచూ అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారని, అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్ ఆఫర్లను నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.దాడి చేసిన వారిని అరెస్టు చేయాలిబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జీజీహెచ్ మహిళా సెక్యూరిటీ గార్డులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ, జీజీహెచ్లో మహిళా సెక్యూరిటీ గార్డులపై మార్చి 6న జరిగిన దాడిపై కలెక్టర్ స్పందించాలని, ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని, ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు చేర్చి, తక్షణం అరెస్టు చేయాలని అన్నారు. ధర్నా అనంతరం డీఆర్ఓ తిప్పేనాయక్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు భజనకే మహానాడుకాకినాడ రూరల్: టీడీపీ మహానాడు చంద్రబాబు నాయుడి భజన కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. గైగోలుపాడులోని తన నివాసంలో శుక్రవారం ఆమె మీ డియాతో మాట్లాడారు. ఆత్మస్తుతి, జగన్పై విమ ర్శలు తప్ప.. ప్రజలకు ఏం మేలు చేస్తారనే ప్రస్తావనే మహానాడులో లేకుండా పోయిందని, ఇది దగానాడు అని దుయ్యబట్టారు. ఆద్యంతం చంద్రబాబు, లోకేష్, దేవాన్ష్ భజనకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ ఫలాలను ఎందుకు నిలిపివేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా రిజర్వేషన్ల పట్ల ఎంతో చిత్తశుద్ధితో వ్యవహరించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశు ద్ధి ఉన్నా రాజ్యసభ సభ్యుల ఎంపిక, క్యాబినెట్లో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఫింఛన్ల లబ్ధిదారులను 6 లక్షలకు పైగా ఎందుకు తొలగించారో, 50 ఏళ్లు దాటిన బీసీ వర్గాల ప్రజలకు పింఛన్లు ఇస్తామనే హామీని ఎందుకు విస్మరించారో చెప్పాలని నాగమణి నిలదీశారు. మెగా డీఎస్సీ పేరిట అర్హులైన యువతకు చేసిన అన్యాయంపై నోరు మెదపకపోవడంపై ఆమె మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై చూపుతున్న నిర్లక్ష్యంపై మహానాడులో చర్చ జరగలేదని, కూటమి వంచనపై పెదవి విప్పకుండా, జగన్పై మాత్రం విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అంటూ తప్పుడు మాటలు మాట్లాడటం తప్ప, రెండేళ్ల పాలనలో సాధించిందేమీ లేదని అన్నారు. ఎన్టీఆర్ నుంచి టీడీపీని లాక్కున్న తీరును ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అని నమ్మించి సూపర్ మోసం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్కు భారతతర్న ఇవ్వకుండా అడ్డుపడిన చంద్రబాబు.. ఇప్పుడు దీనిపై తీర్మానం ప్రవేశపెట్టడం హాస్యాస్పదమని అన్నారు. డిజిటల్ మహానాడులు అట్టర్ఫ్లాప్ అయ్యాయని, క్లస్టర్ల వారీగా సభా ప్రాంగణాలు వెలవెలబోయాయని నాగమణి పేర్కొన్నారు. -
● వడగళ్ల సందళ్లు
కొన్ని రోజులుగా సూర్యుడి సెగభగలతో అల్లాడుతున్న ప్రజలు శుక్రవారం ఉదయం కురిసిన వడగళ్ల వానతో ఉపశమనం పొందారు. సామర్లకోట పట్టణంతో పాటు కరప గ్రామంలో ఉదయం ఆకాశాన దట్టమైన మబ్బులు కమ్ముకుని ఈదురు గాలులు, ఉరుములతో ఒక్కసారిగా వర్షం కురిసింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు సేద తీరుతున్నారు. అదే సమయంలో రేకుల షెడ్లు, పెంకుటిళ్లపై రాళ్లు పడుతున్న శబ్దాలు రావడంతో ఏం జరిగిందోనని పలువురు బయటకు వచ్చారు. వర్షంతో పాటు వడగళ్లు పడుతూండటంతో పలువురు ముఖ్యంగా చిన్న పిల్లలు వాటిని సేకరిస్తూ.. ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. వడగళ్లు చిన్న సైజు ముత్యాల్లా పడుతూండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. కరపలో చాలా ఎక్కువగా వడగళ్లు పడ్డాయి. ఇన్ని వడగళ్లు ఎప్పుడూ చూడలేదంటూ ప్రజలు వాటిని ఏరుకుంటూ కనిపించారు. – సామర్లకోట/కరప -
అనే నేను
వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని.. అధికారంలోకి వచ్చిన తరువాత వారి బతుకుల్ని ఏవిధంగా బాగు చేయాలో తెలుసుకునేందుకు.. 3,648 కిలోమీటర్ల మేర ప్రజాసంకల్ప యాత్ర చేసి.. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతీకగా.. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజున.. అంటే 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన తండ్రి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టించారు. కోవిడ్ వంటి మహావిపత్తు ముంచుకొచ్చినా.. తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన మాటకు కట్టుబడి పేదల సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చూశారు. కారణాలేవైనా.. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో.. అప్పటి వరకు జగన్ అందించిన సంక్షేమ పాలనకు దూరమయ్యామనే ఆవేదన రెండేళ్లుగా జనానికి తప్పడం లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై విసిగి వేసారుతున్న ప్రజలు మళ్లీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలని, ‘జగన్ అనే నేను’ మాటను మరోసారి వినాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కొత్త పుంతలు తొక్కిందనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు. సంక్షేమ సిరులు ● అప్పటి వరకూ రూ.2 వేలుగా ఉన్న సామాజిక భద్రతా పింఛన్ను ఇచ్చిన మాట మేరకు రూ.2.250కి పెంచుతూ నాడు జగన్ తొలి సంతకం చేశారు. ఆ తరువాత ఏటా రూ.250 చొప్పున పెంచుతూ చివరి సంవత్సరానికి పింఛను మొత్తాన్ని రూ.3 వేలు చేశారు. 2019 మే 30 నాటికి ఉమ్మడి జిల్లాలో 5,81,827 మంది వివిధ రకాల సామాజిక పింఛన్లు పొందుతున్నారు. జగన్ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లాలో మరింత మందికి లబ్ధి చేకూరింది. ● 2019కి ముందు టీడీపీ పాలనలో రేషన్ కార్డు కోసం అర్హులైన వారు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. జగన్ పాలనలో అరగంటలోనే రేషన్ కార్డు మంజూరు చేసి అందించడం ఓ సెన్సేషన్. ● ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పరిపుష్టం చేసి, ఈ పథకం పరిమితిని తొలుత రూ.5 లక్షలకు, ఆపై ఏకంగా రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. అంతేకాదు.. ఏకంగా 3,200కు పైగా ప్రొసీజర్లను ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. ● వైఎస్సార్ కంటి వెలుగు పథకం ద్వారా పాఠశాల విద్యార్థులకు, అవ్వాతాతలకు కంటి పరీక్షలు, కళ్లజోళ్లు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు ఉచితంగా అందించారు. ● వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతిని రూ.10 వేలకు పెంచే కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. ● జగనన్న అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద ఉమ్మడి జిల్లాలోని లక్షలాది మంది విద్యార్థుల తల్లులకు ఏటా క్రమం తప్పకుండా ఆర్థిక సాయం అందించారు. జగనన్న విద్యా కానుక, గోరుముద్ద వంటి వినూత్న పథకాలు అమలు చేశారు. ప్రభుత్వ బడుల్లో ట్యాబులు, డిజిటల్ విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం వంటి వాటికి శ్రీకారం చుట్టారు. ● వైఎస్సార్ ఆసరా, చేయూత, డ్వాక్రా మహిళల రుణమాఫీ (ఆసరా), 45–60 ఏళ్ల లోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి ఏటా ఆర్థిక సాయం అందించారు. ఓసీ మహిళలకు కూడా దీనిని వర్తింపజేశారు. ● వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద అన్నదాతలకు ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించారు. అంతేకాదు.. ప్రకృతి విపత్తులు సంభవించి, పంట నష్టం వాటిల్లితే సీజన్ దాటకుండానే పరిహారం అందించడం ఓ రికార్డు. ● పేదల సొంతింటి కలను నిజం చేసేలా అక్కచెల్లెమ్మల పేరిట వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించడమే కాదు.. ఇళ్ల నిర్మాణానికి సైతం సాయం అందించారు. జగనన్న కాలనీల పేరిట ఏకంగా ఊళ్లే నిర్మించారు. ప్రజల వద్దకే పాలన ఉమ్మడి జిల్లాలో 2019 నాటికి 779 క్లస్టర్ల పరిధిలో 1,072 గ్రామ పంచాయతీలుండేవి. కానీ, 539 క్లస్టర్లకు మాత్రమే కార్యదర్శులుండేవారు. 230 క్లస్టర్ల పరిధిలో కార్యదర్శుల కొరత ఉండటంతో ఆ ప్రభావం ప్రభుత్వ సేవలపై పడి ప్రజలు తీవ్ర అవస్థలు పడేవారు. జగన్ అధికారంలోకి వచ్చాక పరిపాలనను ప్రజల చెంతకే చేర్చేలా గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు 2019 అక్టోబర్ 2న కాకినాడ జిల్లా కరపలో శ్రీకారం చుట్టారు. ప్రతి సచివాలయంలోను దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతినిధులుగా 11 మంది ఉద్యోగులను నియమించి, దేశ విదేశాలకు సైతం ఆదర్శంగా నిలిచే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలకు నాంది పలికారు. అంతే కాదు.. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్ను ప్రజల ఆమోదంతో నియమించి, సచివాలయ వ్యస్థకు అనుసంధానం చేశారు. దీంతో, ప్రజలకు 500కు పైగా ప్రభుత్వ సేవలు వారి ముంగిటనే ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సులభంగా అందేవి. పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమగా పునర్వ్యవస్థీకరించారు. కరపలో పైలాన్ ఆవిష్కరించి, సచివాలయ వ్యవస్థను ప్రారంభిస్తున్న అప్పటి సీఎం వైఎస్ జగన్ (ఫైల్)శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అనే నేను’ అంటూ సరిగ్గా ఇదే రోజు జననేత జగన్ చేసిన ప్రమాణం.. నవ్యాంధ్ర ప్రదేశ్ చరిత్రలో నవశకాన్ని లిఖించింది. ఆ శుభదినాన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ చూడని రీతిలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించారు. ప్రజల ముంగిటకు చేర్చి, దేశానికే ఆదర్శంగా నిలిపారు. అవ్వాతాతలకు బిడ్డలా.. అక్కచెల్లెమ్మలకు సోదరుడిలా.. పిల్లలకు మేనమామలా.. కనీవినీ ఎరుగని సంక్షేమ పథకాలతో భరోసానిచ్చారు. ఇంటివద్దకే పింఛన్లు, రేషన్ సరకులు.. అమ్మ ఒడి.. విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన.. రైతు భరోసా వంటి వినూత్న పథకాలతో పేదలకు చేయూతనిచ్చారు. ఆరోగ్యశ్రీ, కంటివెలుగు వంటి పథకాలతో ప్రజల ఆరోగ్యానికి అండగా నిలిచారు. తమ జీవితాలను మలుపు తిప్పిన ఆ రోజును ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటున్నారు.అభివృద్ధి మెరుపులు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన బడి నాడు–నేడు పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. మొదటి విడత ఆధునీకరించిన పాఠశాలలను ఉమ్మడి జిల్లాలో పి.గన్నవరం మండలం పోతవరం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అంకితం చేసి, రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేదల పిల్లలు సైతం డాక్టర్లు కావాలనే ఆకాంక్షతో రాజమహేంద్రవరం, అమలాపురాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. రాజమహేంద్రవరం కళాశాలలో ఇప్పటికే బోధన ప్రారంభమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నల్లజర్ల మండలంలో రూ.250 కోట్లతో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ యూనిట్కు శ్రీకారం చుట్టారు. తద్వారా 25 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు 1,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో బయో–ఇథనాల్ ప్లాంట్ నిర్మాణానికి 2022 నవంబర్లో జగన్ భూమిపూజ చేశారు. తొండంగి మండలంలో కాకినాడ గేట్వే పోర్టు నిర్మాణం జరగడానికి నాడు జగన్ దార్శనికతే కారణమని చెప్పాలి. మత్స్యకారుల కోసం సుమారు రూ.230 కోట్లతో ఉప్పాడలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జగన్ శ్రీకారం చుట్టారు. నేడు.. సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన రోజు నేడు.. అవధి లేని సంక్షేమానికి నాంది పడిన రోజు నేడు.. అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన రోజు నేడు.. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు -
దగా డీఎస్సీని రద్దు చేయాలి
● మెగా డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి ● వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన నాయకుల డిమాండ్ ● కాకినాడలో నిరసన బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. మెగా డీఎస్సీ–2025 నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యాన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన దగా డీఎస్సీని వెంటనే రద్దు చేయాలని, డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. నిరుద్యోగులతో ఆటలు ఆడుతూ, దగా చేసిన ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏటా డీఎస్సీ ఉంటుందని ప్రగల్భాలు పలికి.. రెండేళ్లకు ఒక్కసారి మాత్రమే నిర్వహించారన్నారు. ఇది కూడా పూర్తి అవినీతి మయంగా తయారైందన్నారు. ఉద్యోగాలకు కల్పించకుంటే నిరుద్యోగులకు భృతి ఇస్తామని ఎన్నికల్లో గొప్పగా చెప్పి.. ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగులను అన్ని విధాలా మోసం చేసిందన్నారు. తొలుత అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు నీలి ఆనంద్, పూసల అనిల్, ఉయ్యూరి నాని, గంగవరపు రాజేష్, మామిడాల గౌతమ్తేజ, కరణం భానునాయుడు, డి.శివకుమార్, జె.పృథ్వీరాజ్, నల్లమిల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. -
నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు
పెదపూడి: మండలంలో చింతపల్లి – జి.మామిడాడ గ్రామాల మధ్య ఆర్అండ్బీ రోడ్డులో గురువారం ఉదయం వీచిన ఈదురు గాలులకు సుమారు 50 భారీ వృక్షాలు, 20 విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. దీంతో, ఉదయం 10 గంటల నుంచి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల తాకిడికి రాజుపాలెం, గండ్రేడు గ్రామాల్లో రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా రాజుపాలెం, పైన, వేండ్ర గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ, ఇతర అధికారులు, స్థానికుల సహాయంతో రోడ్డుపై విరిగి పడిన భారీ వృక్షాలను తొలగించారు. -
పెద్దాపురం ఆర్డీఓగా కృష్ణమూర్తి
సామర్లకోట: పెద్దాపురం ఆర్డీఓగా పి.కృష్ణమూర్తి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో గత ఫిబ్రవరి 28వ తేదిన జరిగిన భారీ విస్ఫోటంలో 28 మంది మృతి చెందిన విషయం విదితమే. అప్పట్లో సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు రెవెన్యూ, పోలీసు, కార్మిక, అగ్నిమాపక శాఖల అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా అప్పటి వరకు పెద్దాపురం ఆర్డీఓగా ఉన్న కె.శ్రీరమణిని సస్పెండ్ చేశారు. ఇన్చార్జి ఆర్డీఓగా ఎన్.శ్రీధర్ను నియమించారు. ఇన్చార్జిల పాలనతో ఇబ్బందులు ఏర్పడుతూండటంతో.. కోనసీమ జిల్లాలో కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న కృష్ణమూర్తిని పూర్తి స్థాయి ఆర్డీఓగా నియమిస్తూ ఈ నెల 25న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఆయా శాఖల్లో సస్పెండ్ అయిన వారి సస్పెన్షన్ను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. విద్యార్థినికి అబార్షన్పై డీఎంహెచ్ఓ విచారణ అమలాపురం టౌన్: స్థానిక నల్ల వంతెన ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్ విద్యార్థినికి అబార్షన్ చేసిన ఘటనపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) ఎం.దుర్గారావుదొర, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ భరతలక్ష్మి విచారణ చేపట్టారు. ఆ ఆస్పత్రికి వెళ్లి విద్యార్థినికి అబార్షన్ చేసిన విధానం, కేస్ షీటు తదితర అంశాలను పరిశీలించారు. అబార్షన్కు వాడిన మందులు, కేస్షీటులో పేర్కొన్న మందులకు పొంతన లేదని గుర్తించారు. విచారణ అంశాలను కలెక్టర్ మహేష్కుమార్కు వివరించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ జి.మమ్మీ, డీఎంహెచ్ఓ దుర్గారావుదొర, ఐసీడీఎస్ పీఓ కె.నాగమణి తదితర అధికారులతో కలెక్టర్ ఓ కమిటీని నియమించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. విచారణ నివేదికను కలెక్టర్కు రెండు రోజుల్లో అందజేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ దుర్గారావుదొర తెలిపారు. మూతపడిన ఆస్పత్రి ఈ ఘటనతో విద్యార్ధినికి అబార్షన్ చేసిన ఆస్పత్రిని తాత్కాలికంగా మూసివేయాలని డీఎంహెచ్ఓ ఆస్పత్రి వైద్యురాలు శిరీషను ఆదేశించారు. ఆస్పత్రిలో అబార్షన్ అయి, చికిత్స పొందుతున్న విద్యార్థినికి మాత్రమే వైద్యం అందించాలని సూచించారు. కొత్తగా పేషెంట్లను పరీక్షించడం గాని, చేర్చుకోవడం గాని వద్దని ఆదేశించారు. ఈ ఘటనపై నిందితులపై కేసులు నమోదు కాలేదు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటారని తెలిసింది. ఆస్పత్రి వద్ద మోటారు సైకిళ్లు వదిలేసి విద్యార్థిని ప్రియుడు, అతని స్నేహితులు పరారయ్యారు. ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రి నిర్వహణను ప్రభుత్వ వైద్యాధికారిణి పర్యవేక్షిస్తున్న తీరును విచారణ కమిటీ తప్పు పడుతోంది. -
కె–ట్యాక్స్ పేరిట టీడీపీ నేతల దోపిడీ
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కాకినాడలో కె–ట్యాక్స్ పేరిట టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్సార్ సీపీ మాజీ కార్పొరేటర్ ఎంజీకే కిషోర్ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చిన్న క్రీడా మైదానం చదును చేయడానికి సంబంధించి రూ.93 లక్షలకు టెండర్ మంజూరు కాగా ఇందులో రూ.50 లక్షల గోల్మాల్ జరిగిందని ఆరోపించారు. ఈ సొమ్ము, కె–ట్యాక్స్ సొమ్మంతా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు)కు వెళ్తోందని ఆరోపించారు. ఈ విధంగా నెలకు రూ.1.14 కోట్ల అవినీతి సొమ్ము చేరుతోందన్నారు. నగరంలోని మద్యం షాపుల ద్వారా ప్రతి బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారని, ఆశీలు పాట ద్వారా కె–ట్యాక్స్, రేషన్ బియ్యం కొనుగోలు, జూదం నంబర్ గేమ్లు ఆడించడం, సరకు రవాణా బార్జీకి ఉచితంగా చేసే రెన్యువల్కు రూ.లక్ష వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్నాథపురంలోని ఎంఎస్ఎన్ చారిటీస్ క్రీడా స్థలాన్ని తమ హయాంలో ఉచితంగా చదును చేశామని చెప్పారు. పాత ఇంటికి సంబంధించి మట్టితో అక్కడ ప్లాస్టిక్ కవర్లు వచ్చాయన్నారు. అంతే కానీ ఆ మట్టి చెత్తాచెదారాలకు సంబంధించింది కాదని స్పష్టం చేశారు. దీనిపై తమ స్థానిక నాయకులు అప్పటి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పారని, ఈలోగా ఎన్నికలు రావడంతో అది చేయలేకపోయామని తెలిపారు. ఉచితంగా చదును చేయాల్సిన క్రీడా మైదానానికి టెండర్ పిలిపించి, రూ.93 లక్షలు మంజూరు చేశారని, అందులో రూ.50 లక్షలు చేతులు మారాయని కిషోర్ ఆరోపించారు. జగన్నాథపురం చిన్న మార్కెట్లో తాను కొన్ని దుకాణాలు తీసుకున్నానని, వాటిని తన అనుచరులకిచ్చి వ్యాపారం సాగిస్తున్నామని అంటూ తనపై అక్కడి స్థానిక నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. అక్కడ ఐదు దుకాణాలను వివిధ కారణాలతో చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకిచ్చి ఆదుకున్నామని కిషోర్ చెప్పారు. తన పైన, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పైన ఆధారాలు లేని ఆరోపణలు చేసి, అభాసు పాలు కావద్దని స్థానిక టీడీపీ నాయకులకు హితవు పలికారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు చక్క చక్రవర్తి, వాసిరెడ్డి చిన్ని, పృథ్వి పాల్గొన్నారు. -
కూతంత జోరందుకోవాలి
సామర్లకోట: జిల్లాలోనే కీలకమైన రైల్వే జంక్షన్ సామర్లకోట. చైన్నె – కోల్కతా మార్గంలో ఉన్న ఈ స్టేషన్ మీదుగా గూడ్సు రైళ్లతో కలిపి నిత్యం 160 నుంచి 180 వరకూ రైళ్లు రాకపోకలు సాగిస్తూంటాయి. ప్రయాణికులకు సంబంధించి ప్రతి రోజూ దాదాపు 90 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. కాకినాడ, పెద్దాపురం, కిర్లంపూడి, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, ఏలేశ్వరంతో పాటు తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, అనపర్తి, బిక్కవోలు తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 17 వేల మంది నిత్యం సామర్లకోట రైల్వే స్టేషన్ పైనే ఆధారపడతారు. ఎక్కువ మంది విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాలకు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. ఆన్లైన్ టికెట్లతో బుకింగ్ కౌంటర్ ఆదాయం తగ్గిపోయినప్పటికీ.. ప్రయాణికుల నుంచి ప్రతి రోజూ సుమారు రూ.5 లక్షల ఆదాయం వస్తుంది. నెలకు రూ.1.50 కోట్లు, ఏటా దాదాపు రూ.18 కోట్ల మేర ఆదాయం లభిస్తుంది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకం కింద ఎంపిక చేసింది. గతంలో వైఎస్సార్ సీీపీకి చెందిన వంగా గీత కాకినాడ ఎంపీగా ఉన్న సమయంలో ఈ పథకం కింద రూ.25 కోట్లు మంజూరు చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈ పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్లాట్ఫామ్ల అభివృద్ధి, షెడ్ల నిర్మాణం, నూతన కార్యాలయ, విశ్రాంతి భవనాలు, ప్రయాణికుల సౌకర్యాలతో పాటు మూడు ప్లాట్ఫామ్లను కలుపుతూ రెండో ఫుట్ ఓవర్ బ్రిడ్జి(కాలి బాట వంతెన)తో పాటు ఎస్కలేటర్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, కొన్నాళ్లుగా ఈ పనులు ఎక్కడిక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలోనే హంసపాదు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2, 3 ప్లాట్ఫామ్లను కలుపుతూ ఎస్కలేటర్ నిర్మాణాన్ని ప్రారంభించి ఆరు నెలలైంది. ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ఈ పనులు ప్రారంభ దశలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎస్కలేటర్ పనుల కోసమం 1, 3 నంబర్ ప్లాట్ఫామ్లపై రిజర్వేషన్ బోగీలను సూచించే డిస్ప్లే బోర్డులను తొలగించారు. దీంతో, ఏ బోగీ ఎక్కడ వస్తుందో తెలియక రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్ఫామ్లపై పరుగులు తీస్తున్న దుస్థితి నెలకొంది. చివరకు ఏదో ఒక బోగీ ఎక్కి, తమ సీట్లకు చేరుకోవాల్సి వస్తోంది. విశాఖపట్నం వైపు వెళ్తే వారు ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ పైన, విజయవాడ వైపు వెళ్లే వారు మూడో నంబర్ ప్లాట్ఫామ్లపై వేచి ఉంటారు. అయితే, ప్లాట్ఫామ్ల చివరి వరకూ అభివృద్ధి పనులకు సంబంధించిన రేకులు పడేయడంతో ప్రయాణికులు ఒకరి వెనుక ఒకరు నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. రైలు కోసం ఏ మాత్రం అజాగ్రత్తగా పరుగు తీసినా ప్రమాదాలు జరిగే అవకాశం పొంచి ఉంటోంది. ఆరుబయటే వాహనాల పార్కింగ్ రైల్వే స్టేషన్ ఆవరణలో ద్విచక్ర వాహనాలు, కార్లు పార్కింగ్ చేసుకోవడానికి ఓపెన్ ఆక్షన్ ద్వారా లీజుకు ఇస్తారు. ద్విచక్ర వాహనం పార్కింగ్కు గంటకు రూ.10 చెల్లించాలి. గంట దాటితే అదనపు చార్జీ వసూలు చేస్తున్నారు. అయితే, పార్కింగ్ ప్రదేశంలో షెడ్లు లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నప్పటికీ కనీస సదుపాయాలు కల్పించకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరుగులు తీయాల్సి వస్తోంది రిజర్వేషన్ బోగీలు ఎక్కడున్నాయో తెలియక ప్లాటఫామ్పై పరుగులు తీయాల్సి వస్తోంది. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. బోగీల సమాచారాన్ని మైకులో ప్రకటిస్టున్నా అర్థం కావడం లేదు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి, ప్రయాణికుల ఇబ్బందులను తొలగించాలి. ద్విచక్ర వాహనాలకు షెడ్లు లేకపోవడం దారుణం. ఎండలకు పెట్రోలు ఆవిరైపోతోంది. – కాళ్ల లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, సామర్లకోట -
పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేత!
● విధులకు హాజరు కావాలంటూ కార్మికులకు ఫోన్లు ● ఆ 70 మందికి నో అంటున్న యాజమాన్యం! కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్ ఎత్తివేసినట్లు తెలుస్తోంది. యాజమాన్యం మొండి వైఖరి కారణంగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు సమ్మెకు దిగిన విషయం విదితమే. ఆఖరి దశ చర్చల్లో పర్మినెంట్ కార్మికులు 11 మంది, కాంట్రాక్టు కార్మికులు 59 మంది మినహా మిగి లిన వారందరూ విధులకు హాజరు కావచ్చంటూ యాజమాన్యం తరఫున కొద్ది రోజులుగా అనధికారిక రాయబారాలు కొనసాగిస్తున్నారు. అయితే, రాజమహేంద్రవరంలో గురువారం 11 మంది పర్మినెంట్ కార్మికులపై విచారణ జరిగింది. ఈలోపునే మిల్లులోని డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి లాకౌట్ ఎత్తివేసినట్లు పర్మినెంట్ కార్మికులకు ఫోన్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. శుక్రవారం నుంచి విధులకు రావాలని చెబుతున్నారని అంటున్నారు. ఇదిలా ఉండగా నిష్కారణంగా లాకౌట్ ప్రకటించి, ఇప్పుడు ఎత్తివేస్తున్నట్లు కూడా చెబుతూండటంపై కార్మి క వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలూ లేకపోవడాన్ని కార్మికులు విమర్శిస్తున్నారు. యాజమాన్యం తీరు ఎప్పుడూ ఇలా ఏకపక్షంగానే ఉంటోందని, ప్రభుత్వ యంత్రాంగం దీనిపై సమగ్రంగా దృష్టి పెట్టి, తమ హక్కులు కాపాడాలని వారు కోరుతున్నారు. అయితే, 11 మంది పర్మినెంట్, 59 మంది కాంట్రాక్టు కార్మికులను కూడా అనుమతిస్తేనే విధులకు హాజరు కావాలని కార్మికులు నిర్ణయించినట్లు సమాచారం. యాజమాన్యం పిలుపునకు కార్మికులు ఎంతవరకూ స్పందిస్తారో వేచి చూడాలి. -
అందుకే జాప్యం
దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోటకు అమృత భారత్ స్టేషన్ నిధులు రూ.25 కోట్ల వరకూ మంజూరయ్యాయి. ప్రాధాన్య క్రమంలో కొన్ని రైల్వే స్టేషన్లలో పనులు నిర్వహిస్తున్నారు. దీంతో, ఇక్కడి పనుల్లో కొంత వరకు జాప్యం జరుగుతోంది. రెండు, మూడు విడతల్లో నిధులు వస్తాయి. ఎస్కలేటర్ నిర్మించే చోట మూడు బోగీలకు చెందిన డిస్ప్లే బోర్డులు తొలగించారు. దీంతో, రైళ్లు వచ్చే సమయంలో బోగీల వివరాలను మైకులో ప్రకటిస్తున్నాం. ఎస్కలేటర్ పనులు జరుగుతున్న ప్రదేశంలోని బోగీల సమాచారంపై ప్రత్యేకంగా ప్రచారం చేయిస్తాం. పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు షెడ్ల కోసం దరఖాస్తు చేస్తే డీఆర్ఎంకు పంపుతాం. – ఎం.రమేష్, మేనేజర్, సామర్లకోట రైల్వే స్టేషన్ -
ఊళ్లలోనే టైఘర్
● వెనుకే అధికారుల పరుగు ● ఐదు నెలలుగా ఇదే తంతు ● ఇప్పటి వరకూ 20 మూగజీవాలపై పంజా రాజవొమ్మంగి: ఐదు నెలలుగా అదే పరుగు... ఎక్కడా అలుపు లేదు.. వెనక్కి తగ్గిందీ లేదు.. జనావాసాలు, ఆపై అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూనే ఉంది. పట్టుకుంటామంటూ, దీని వెనుక అధికారులు పరుగులు తీస్తూనే ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోకి పెద్ద పులి సుమారు ఐదు నెలల కిందట ప్రవేశించింది. అప్పటి నుంచి అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. బుధవారం ఒక్క రోజే ఏడు మూగజీవాలను పొట్టనబెట్టుకుంది. ఈ ఏడాది జనవరి 31న తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ఈ పులి ప్రవేశించింది. అక్కడి నుంచి దివాన్చెరువు, రాజానగరం మండలం జి.ఎర్రంపాలెం, ఆ తరువాత అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో తిరిగింది. ఫిబ్రవరి 6న తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురంలో అటవీ అధికారులకు చిక్కింది. దానిని అక్కడి నుంచి విశాఖపట్నం జూ పార్క్కు తరలించారు. కొన్నాళ్ల తర్వాత మెడలో రేడియో కాలర్ అమర్చి దానిని పాపికొండలు అడవుల్లో తిరిగి వదిలిపెట్టారు. మళ్లీ పులి తన పయనం మొదలుపెట్టింది. ఫిబ్రవరి మూడో వారంలో రంపచోడవరం, రాజవొమ్మంగి, ఏలేశ్వరం, అడ్డతీగల ప్రాంతాల మీదుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, శంఖవరంలో ప్రవేశించింది. తిరిగి వెనుకకు మళ్లి, దేవీపట్నం మండలంలో గోదావరి ఈదుకుంటూ అవతలి ఏలూరు జిల్లా పోలవరం మండలంలో సంచరించింది. అంతలోనే తిరిగి తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ అటవీ ప్రాంతానికి చేరింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, కొత్తవీధి, బూరుడుబంద గ్రామాల సమీపంలోని దట్టమైన అడవులకు చేరింది. ఆ తరువాత ఫోక్స్పేటలో పులి జాడను అటవీ అధికారులు కనుగొన్నారు. దాడి చేస్తూ.. ముందుకు సాగుతూ గత 15 రోజులుగా ఈ పులి రాజవొమ్మంగి అడవుల్లోనే తిరుగుతోంది. బుధవారం ఒక్కరోజే చికిలింత, గర్రంగి గ్రామాల్లో 9 మూగజీవాలపై పంజా విసిరింది. ఇప్పటి వరకూ 20 పశువులను హతమార్చింది. అధికారుల చర్యలు విఫలం ఇంత జరుగుతున్నా పులిని పట్టుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి భయంతో అడవి, పొలం పనులకు వెళ్లలేక పోతున్నామని వాపోతున్నారు. తొలకరి వర్షాలు కురుస్తుండడంతో రెండు, మూడు రోజుల్లో ఖరీఫ్ పనులు మొదలు పెట్టాలని, పులి తమ చుట్టూ తిరుగుతుంటే పనులు ఎలా చక్కబెట్టుకోవాలని గురువారం ఆయా గ్రామాల్లో పర్యటించిన రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ను గిరిజనులు ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పులి రాజవొమ్మంగి మండలం ఉర్లాకులపాడు అటవీ ప్రాంతంలో ఉందని, తడోబా, నాగార్జున టైగర్ రెస్క్యూ టీములు వస్తాయని, త్వరలోనే దీనిని బంధిస్తామని ఆయన చెప్పారు. -
వెనుకస్తేనా!
పిఠాపురం: ఎప్పటిలాగే వ్యవసాయ శాఖ ముందస్తు సాగు పల్లవి అందుకుంది. ఖరీఫ్ సాగు ముందుగా చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఆ మేకు రైతులకు అవగాహన కల్పిస్తోంది. ఏటా ఖరీఫ్ చివరన నవంబర్, డిసెంబర్ నెలల్లో వస్తున్న అధిక వర్షాలు, తుపానుల ప్రభావంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు నష్టపోతున్నారు. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ముందస్తు సాగు చేపట్టాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎక్కడికక్కడే సమస్యలు ఎదురొస్తున్నాయి. ప్రధానంగా సాగునీటి కాలువల ఆధునీకరణ, నిర్వహణ పనులను ప్రభుత్వం గాలికొదిలేసింది. జిల్లాలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టు అయిన ఏలేరు అభివృద్ధికి నిధులు కేటాయించలేదు. మరోవైపు పెట్రో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం పడనుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు సాధ్యం కాదని, ‘వెనుక’స్తు సాగు తప్పదని రైతులు అంటున్నారు. ఈ రకాలు వద్దు రానున్న ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా రైతులు 2.36 లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగు చేయనున్నారు. సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సాగు ఆరంభానికి ముందే పీఆర్–126, ఎస్ఎల్–10, ఎంటీయూ–1153, ఎంటీయూ–1156 రకాల ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ అధికారులు ప్రచారం చేస్తున్నారు. ఖరీఫ్లో వర్షాలను తట్టుకుని, అధిక దిగుబడులిచ్చే రకాలు మాత్రమే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నారు. అమూల్య, అంకుర్, ఎంటీయూ–7029, సాధన, ఓం సాయి, ఆర్జీఎల్–2537 సోనాం, సంపద సువర్ణ, రేవతి, బీపీటీ–5204 రకాల విత్తనాలు వేయాలని చెబుతున్నారు. పంటకు పెట్రో మంట పెరిగిన కూలి రేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వంటి వాటి ధరలతో ఇప్పటికే రైతులకు సాగు భారమవుతోంది. పుండుపై కారం చల్లినట్లు ఇటీవల పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం వారిపై మరింత భారాన్ని మోపనుంది. కొన్నేళ్లుగా సాగులో యంత్రాల వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో దుక్కి దున్నడం, దమ్ము, నాట్లు, కోతలు, ధాన్యం ఇంటికి చేర్చడం వరకూ అన్నింటికీ ఎక్కువ మంది రైతులు యంత్రాల పైనే ఆధారపడుతున్నారు. పెట్రో ధరల పెంపుతో ఈ యంత్రాల అద్దె భారీగా పెరిగి, సాగుకు అదనపు పెట్టుబడి అవుతుందని రైతులు వాపోతున్నారు. గతంలో ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి కాగా, ఇప్పుడు రూ.50 వేల వరకూ ఖర్చవుతుందని చెబుతున్నారు. ఎరువు.. బరువు ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను సైతం భారీగా పెంచింది. కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ.300 పెంచింది. దీంతో, ఒక్కో బస్తా కాంప్లెక్స్ ఎరువుకు రూ.2 వేలు పైనే ఖర్చవనుంది. ఓవైపు పెట్టుబడి విపరీతంగా పెరుగుతూండగా.. క్వింటాల్ ధాన్యానికి కేవలం రూ.70 మాత్రమే మద్దతు ధరను పెంచి ప్రభుత్వం చేతులు దులుపుకొందనే విమర్శలు రైతుల నుంచి వస్తున్నాయి. ఇటువంటి సమస్యల నడుమ ముందస్తు సాగు ఏవిధంగా చేపట్టగలమని వ్యవసాయ అధికారులను రైతులు ప్రశ్నిస్తున్నారు.అస్తవ్యస్తంగా పంట కాలువలు కాలువల ఆధునీకరణ పనులు సక్రమంగా జరగలేదు. దీంతో, సాగునీరు సకాలంలో అందే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు సాగు ఏవిధంగా సాధ్యం? ఎండలున్న సమయంలో కాలువ పనులు చేయడం లేదు. వర్షాలు కురిశాక చేయడం వల్ల ఆ పనులు సక్రమంగా జరగక సాగు నీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. – వి.గోవిందరాజులు, రైతు, భోగాపురం, పిఠాపురం మండలం పెరగనున్న పెట్టుబడులు గతం కంటే ఈ ఏడాది వ్యవసాయ పెట్టుబడులు బాగా పెరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా పెట్రో ధరల పెంపు వల్ల మరింత భారం పడుతుంది. రైతుకు ప్రభుత్వం ఎటువంటి సహకారమూ ఇవ్వడం లేదు. అన్నీ ప్రకటనలే తప్ప క్షేత్ర స్థాయిలో రైతును ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ముందస్తు సాగు అని ప్రకటించడం కాదు.. దానికి తగ్గ సహకారం కూడా ఉండాలి. – పి.ప్రసాద్, రైతు, తాటిపర్తి, గొల్లప్రోలు మండలం ఆగస్టు 15 లోగా నాట్లు పూర్తి చేయాలి ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులు ఆగస్టు 15వ తేదీ లోగా నాట్లు పూర్తి చేయాలి. జూన్ ఒకటో తేదీన పిఠాపురం బ్రాంచి కెనాల్ నుంచి, జూలై 1న ఏలేరు నుంచి సాగు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆలోగా రైతులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. విత్తనాలు సిద్ధం చేస్తున్నాం. – పి.స్వాతి, వ్యవసాయ శాఖ ఏడీ, పిఠాపురం ముందస్తు సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు అన్నదాతకు ఎదురొస్తున్న సమస్యలు అధ్వానంగా పంట కాలువలు పెట్రో ధరల పెంపుతో రైతులపై అదనపు భారం -
ఉష్ణోగ్రతలతో పెరిగిన విద్యుత్ వినియోగం
● అంతరాయాల నివారణకు కంట్రోల్ రూమ్లు ● విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ ప్రసాద్ సాక్షి, పాడేరు: కొద్దిరోజులుగా ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరగడంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని అల్లూరి సర్కిల్ విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అకాల గాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. తమ సర్కిల్ పరిధిలోని ఈ రెండు జిల్లాల వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా సిబ్బంది పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పాడేరులోని సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజినీర్ (టెక్నికల్) ఆధ్వర్యంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వినియోగదారులు వెంటనే కంట్రోల్ రూమ్ నంబరును సంప్రదించాలని ఎస్ఈ కోరారు. సెంట్రలైజ్డ్ టోల్ఫ్రీ నంబర్ 1912, సర్కిల్ స్థాయి కంట్రోల్ రూమ్ నంబర్లు పాడేరు డివిజన్ 9440812491 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్), పోలవరం జిల్లా పరిధిలో 73825 85554, 94906 10027 (ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు. -
పట్టపగలే సంచోరిస్తూ..
● అదును చూసి దొంగతనాలు ● నిందితుడిని పట్టుకున్న సర్పవరం పోలీసులు కాకినాడ రూరల్: పట్టపగలే దొరలా వస్తాడు.. అదును చూసి దోచుకుపోతాడు.. ఇలా కొన్నేళ్లుగా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపించాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలను గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2024, 2025, 2026లో ఆరు పగటి పూట చోరీ కేసులు నమోదయ్యాయి. ఇందులో నిందితుడు కాకినాడ అర్బన్ రేచర్లపేట బర్మాకాలనీకి చెందిన ములపర్తి దుర్గాప్రసాద్ (నాని) అనే ప్రసాద్ను సర్పవరం పోలీసులు ఆర్టీఓ కార్యాలయం రోడ్డులోని కోటయ్య కన్వెన్షన్ హాలు వద్ద గురువారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.32 లక్షల విలువైన 225 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి నిందితుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడన్నారు. మూడేళ్లుగా దొంగతనాలకు పాల్పడతుండగా పోలీసులకు మాత్రం చిక్కడం ఇదే మొదటి సారి అన్నారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తాళాలు బయటకు కనపడేలా వేయరాదని, ఇళ్లకు ఇన్నర్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ (ఎల్హెచ్ఎంఎస్) అనే పోలీస్ అప్లికేషన్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు యాప్లో రిక్వెస్ట్ పెట్టడం ద్వారా ఉచిత పోలీసు సర్వీస్ను ఉపయోగించుకుని, నేరాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. సర్పవరం సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్సై ఏసుబాబు, క్రైం ఎస్సై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేడు, రేపు డీఎస్ఏలో ఐపీఎల్ ప్రత్యక్ష ప్రసారం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురు, శుక్రవారాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను ఎల్ఈడీ స్క్రీన్స్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త గురువారం తెలిపారు. స్థానిక కృషీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫ్యాన్ పార్స్క్ను నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులకు ఫ్యాన్ పార్కు ఒక పెద్ద పండుగ లాంటిదన్నారు. స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు తమ నగరంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తుందన్నారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, చిల్ట్రన్స్ గేమ్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు ద్వారకాతిరుమల: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసి, పిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే. మండలంలోని దేవినేనివారిగూడేనికి చెందిన కావేరికి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, రేమెల్ల గ్రామానికి చెందిన కొనకాల ఉమామహేశ్వరరావుతో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో కావేరి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. 5 లక్షలు, 30 సెంట్ల భూమి, బంగారు ఆభరణాలను ఇచ్చారు. మద్యానికి అలవాటుపడిన భర్త తనను చిత్రహింసలు పెట్టడంతో పాటు, అదనపు కట్నం కోసం అతని తల్లిదండ్రులు కొనకాల సావిత్రి, దుర్గారావులు వేధిస్తున్నారని కావేరి పేర్కొంది. గతేడాది జూన్ 8న తనను కొట్టి, పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు కావేరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పెరవలి (కొవ్వూరు): ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొవ్వూరు రూరల్ ఎస్సై శ్రీహరి కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన మణికంఠ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి తెలిపాడు. ఆ అమ్మాయితో వివాహం చేయాలని తెలపడంతో వారు నిరాకరించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది మోటార్ సైకిల్పై కొవ్వూరు మండలం మద్దూరు వద్ద గోదావరి బ్యారేజీ వద్దకు వచ్చి, అక్కడి నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు గోదావరిలో దూకిన సమయంలో బ్యారేజీ తలుపులపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం మృతదేహం పైకి తేలడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. మద్యం మానుకోమన్నందుకు కుమారుడి ఆత్మహత్య తుని: మద్యం అలవాటు మానుకోవాలని తండ్రి చెప్పిన మాటలకు మనస్తాపం చెందిన కొడుకు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ త్రినాథరావు కథనం ప్రకారం. తొండంగి మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన పులుగు పెద్దిరాజుకు ఇద్దరు కుమారులు, కుమార్తె. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు పులుగు అనిల్కుమార్ (25) లారీ డ్రైవర్. వీరు ఉంటున్న పాత ఇంటిని పడగొట్టి కొత్త ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా మద్యం అలవాటు ఉన్న అనిల్కుమార్ను తండ్రి పెద్దిరాజు మద్యం తాగడం మానేసి ఇంటి నిర్మాణానికి సహకరించాలని చెప్పాడు. దీంతో అనిల్కుమార్ బుధవారం రాత్రి మోటారు సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి రావికంపాడు – అన్నవరం మధ్యలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నవరం రైల్వే స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ త్రినాథరావు తెలిపారు. బావిలో పడిన అప్పన్నెద్దు బయటకు తీసిన స్థానికులు తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం ప్రధాన రహదారిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చెంతన ప్రమాదవశాత్తూ అప్పన్నెద్దు బావిలో పడింది. ఇరుకుగా ఉన్న బావిలో పడడంతో సుమారు రెండు గంటలకుపైగా అప్పన్నెద్దు నరకయాతన అనుభవించింది. అటుగా వెళుతున్న ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. హుటాహుటిన స్థానికులు, యువకులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని చాలాసేపు తాళ్లతో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఎంతకీ రాకపోవడంతో స్థానిక కాంట్రాక్టరు మంథా కృష్ణమూర్తి (నాని) జేసీబీని తీసుకువచ్చి బావికి సమాంతరంగా తవ్వారు. తరువాత బావి వరను పగులగొట్టి అప్పనెద్దును జాగ్రత్తగా బయటకు లాగారు. మానవత్వంతో అప్పన్నెద్దును బయటకు తీసి కాపాడిన వారందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఊరగాయాలే..
● చుక్కల్లో మామిడి ధర ● ఆవకాయ రుచికి దూరం ● భారీగా పెరిగిన ముడిసరకు ● నిల్వ పచ్చళ్ల తయారీపై ప్రభావం ఆలమూరు: ఘుమఘుమల సమ్మేళనం ఆవకాయ గొప్పదనం.. మామిడి కాయలు, గుంటూరు కారం, ఉప్పు, ఆవ పిండి, మెంతులు, పప్పు నూనె కలిపి తయారు చేసే ఆవకాయకు అమృతపు రుచి వస్తోంది.. వేసవిలో ప్రతి ఇంటా ఈ తయారీ మొదలవుతుంది. తెలుగువారి నోట ఆవకాయ ముద్ద పడందే తృప్తి ఉండదు. దేశాలు దాటినా ఆవకాయ వాసన మాత్రం తెలుగువారిని తనవైపు లాక్కుంటుంది. ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి అన్నట్లు తెలుగువారి సంస్కృతిలో ఒదిగిపోయిన ఈ పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి కలుపుకొని తింటే ఆ అనుభూతి వేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసుల ప్రతి ఒక్కరి మదిలో ఈ రుచి పెనవేసుకుంది. నోరూరించే ఈ ఊరగాయలను తయారు చేసుకోవడం పెను భారమైంది. వంద మామిడి కాయలు కొనుగోలు చేస్తే సుమారు ఐదు కుంచాల ముక్కలు అవుతాయి. ఒక్కో కుంచం పచ్చడికి రూ.నాలుగు వేల వరకూ ఖర్చు అవుతుంది. వందకాయల ఆవకాయ పచ్చడి పెడితే దాదాపు రూ.20 వేల వరకూ ఖర్చు పెట్టాల్సిందే. ప్రస్తుతం అన్నిచోట్ల పచ్చళ్ల సీజన్ ఊపందుకుంది. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఎండుమిర్చి, మెంతులు, ఆవాలు, వెల్లుల్లి, వేరుశెనగ, గానుగ నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దిగుమతులు నిలిచిపోవడంతో ముడిసరకు కొరత అధికమైంది. ఈ ప్రభావం పచ్చళ్ల తయారీపై పడింది. తగ్గిన వ్యాపారం ఆలమూరు మండలం మడికి జాతీయ రహదారి పక్కన ఉన్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్లో, రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ, తుని, మండపేటలోని తదితర హోల్సేల్ మార్కెట్లో పచ్చడికి ఉపయోగించే మామిడికాయల ఽవ్యాపారం ఈ ఏడాది తగ్గిపోయింది. ఆ మార్కెట్లకు ప్రతి రోజూ నూజివీడు, కత్తిపూడి, జగ్గంపేట తదితర చాగల్నాడు, మెట్ట ప్రాంతాల నుంచి పచ్చళ్ల తయారీకి వినియోగించే మామిడి రకాలు గతంలో వందల టన్నుల్లో రాగా, ప్రస్తుతం పదుల సంఖ్యలోకి పడిపోయింది. గ్రామీణ ప్రాంత వ్యాపారులు అక్కడ నుంచి కొనుగోలు చేసుకున్న మామిడికాయలను పరిసర ప్రాంతాల్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారులు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. మామిడికాయ రకాన్ని బట్టి ధర నిర్ణయించ బడుతుంది. ఎంతో ఇష్టంగా.. ఆవకాయ, మాగాయ, ఉల్లి ఆవకాయ తదితర పచ్చళ్లు అంటే అందరూ ఇష్టపడతారు. తొలి ఏడాది అత్తవారింటికి కోడలు తప్పనిసరిగా పచ్చళ్లు కావడి పంపించడం ఆనవాయితీగా వస్తుంది. పచ్చళ్ల కావళ్లు స్థోమతను బట్టి ఉంటుంది. పెరిగిన ధరల ప్రభావం పెళ్లింట కూడా పడింది. పెళ్లిళ్లలో ఇటీవల తరచూ ఆవకాయ అన్నం, ఆవకాయ ఫ్రైడ్రైస్, ఆవకాయ పులిహోర, ఆవకాయ బిర్యానీ వంటి వంటకాలు చేయడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తెలుగింటి లోగిళ్లలో ఏ శుభకార్యం జరిగినా ఆవకాయను వడ్డించకుండా ఉండలేని పరిస్థితి ఉంది. ఈ ఆవకాయ తెలుగువారి కీర్తిని దశదిశలా చాటుతోంది. పచ్చళ్ల తయారీలో ఉపయోగించే ముడిసరకుల ధరలు ఇలా సరకులు గత ఏడాది ఈ ఏడాది కిలో ధర కిలో ధర అవకాయ కారం 400 650 మాగాయ కారం 310 550 గానుగ నూనె 380 450 వేరుశెనగ నూనె 180 270 ఆవాలు 150 220 మెంతులు 120 170 వెల్లుల్లి 200 250 ఉప్పు 12 20 పరిమితంగానే తయారీ పెరిగిన మామిడికాయ, ముడి సరకుల ధరతో ఊరగాయ పెట్టడం పెనుభారంగా మారింది. దీనివల్ల పరిమితంగానే ఆవకాయ, మాగాయి పచ్చళ్లు పెట్టుకున్నాం. వచ్చే ఏడాది వరకూ ఈ పచ్చళ్లు సరిపోవు. మార్కెట్ ముడి సరకుల ధరలు ఎప్పుడూ ఇంతలా పెరగలేదు. –పి.శివకల్యాణి, నార్కెడిమిల్లి, ఆత్రేయపురం మండలం -
అక్రమార్జనకు అడ్డదారి
ఫ శివశివాసాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవుడి గుడి నిర్మిస్తామంటూ చందాలు వసూలు చేయడం చూస్తూంటాం. ఆలయ నిర్మాణం పూర్తయిపోయాక ఇక చందాల వసూలు ఆపేస్తారు. కానీ, తెలుగు తమ్ముళ్ల రూటే సెపరేటు. ఆలయ నిర్మాణం పేరుతో అక్రమ వసూళ్లకు తెర తీశారు. ఆ నిర్మాణం పూర్తయిపోయినా ఇప్పటికీ దేవుడి పేరుతో వసూళ్ల దందా సాగిస్తూనే ఉన్నారు. ఈ దోపిడీ ఎక్కడో కుగ్రామంలో జరుగుతోందనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్టే. కోల్కతా – చైన్నె 16వ నంబర్ జాతీయ రహదారిపై కృష్ణవరం టోల్గేటు సాక్షిగా అక్రమార్జనకు తెగబడుతున్నారు. టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే ఈ అక్రమ వసూళ్లు సాగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కృష్ణవరం టోల్గేటుకు ప్రత్యామ్నాయంగా తెలుగు తమ్ముళ్లు అనధికార టోల్గేటు వంటిది పెట్టి.. ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏడాదిన్నర కాలంగా దేవుడి గుడి ముసుగేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు. బహిరంగంగానే ఈ దోపిడీ సాగుతున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి టెండర్ ప్రక్రియలో టోల్గేటును దక్కించుకున్న నిర్వాహకులు కూడా టీడీపీ నేతలకు అడ్డు చెప్పలేక చేతులెత్తేశారు. ఏం జరుగుతోందంటే.. కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద జాతీయ రహదారిపై ఎప్పట్నుంచో అధికారికంగా టోల్గేటు ఉంది. రాజమార్గమైన ఈ టోల్గేటు మీదుగా వెళ్తే పోలీసు, రవాణా, రెవెన్యూ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో.. ఇసుక, మట్టి, గ్రావెల్ టిప్పర్లు, లారీలు ఇక్కడ అడ్డదారిలో వెళ్తున్నాయి. బూరుగుపూడి శివారున పోలవరం కాలువ గట్టు, కృష్ణవరం మీదుగా దోపిడీదారులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని చిన్నచిన్న వీధుల్లో సుమారు 60 నుంచి 65 టన్నుల ఇసుక, మట్టి లోడు టిప్పర్లు, లారీలు తిరుగుతున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక, మట్టి టిప్పర్లు యథేచ్ఛగా తిరుతూండటంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. వాటి ధాటికి ఇళ్ల గోడలు కూడా బీటలు వారుతున్నాయని, ఎవరికి మొర పెట్టుకున్నా ఫలితం ఉండటం లేదని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు టన్నులకొద్దీ బరువైన లారీలు తిరుగుతూండటంతో గ్రామంలోని సీసీ రోడ్లు ధ్వంసమైపోతున్నాయి. కృష్ణవరం ‘తమ్ముడి’ దందా సరిగ్గా ఇక్కడే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. కృష్ణవరం టోల్గేటుకు సమాంతరంగా ఇసుక, మట్టి అక్రమ రవాణాదారులు రాకపోకలు సాగిస్తున్న అడ్డదారిలో గ్రామ శివారును అనధికారికంగా మరో టోల్గేటు వంటిది తెరిచారు. శివాలయం కడుతున్నామనే పేరుతో ఇక్కడ అనధికారికంగా రోజువారీ వసూళ్లకు తెగబడుతున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నేతకు కృష్ణవరంలో ఉన్న ముఖ్య అనుచరుడు, అతని అనుయాయులే ఈ దందాకు పాల్పడుతున్నారు. అఽధికారిక టోల్గేటుకు ఆదాయం రాకుండా చేసి, దొడ్డి దారిన డైలీ రూ.లక్షలు దోచుకుంటున్నారు. అక్కడ ఒక పాక ఏర్పాటు చేసి, ఇసుక, గ్రావెల్ టిప్పర్లు, ఇతర వాహనాల నుంచి దౌర్జన్యంగా డబ్బులు గుంజుతున్నారు. ఇర్రిపాక, సోమవరం, కృష్ణవరం ఏలేరు కాలువ నుంచి నిత్యం ఇసుక, మట్టి లోడుతో ఈ మార్గంలో రాజమహేంద్రవరం వైపు 150 వరకూ టిప్పర్లు, లారీలు వెళ్తూంటాయి. ఈ మార్గంలో వెళ్తే ఆ వాహనాలకు అధికారుల అనుమతులు, అదనపు లోడుతో వెళ్తే అడ్డుకుంటారనే భయం ఉండదు. పైగా, ఈ మార్గానికి పచ్చ నేతల అండదండలు కూడా ఉండటంతో గుట్టు చప్పుడు కాకుండా దొడ్డిదారిలో మట్టి, ఇసుక పెద్ద ఎత్తున తరలించుకుపోతున్నారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు ఈ మార్గంలో భారీ వాహనం నుంచి రూ.1,000కి తక్కువ కాకుండా అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈవిధంగా నెలకు రూ.అర కోటి పైగా వసూలు చేస్తున్నారన్నది అంచనా. ఇలా అక్రమంగా వస్తున్న సొమ్మును సంబంధిత ‘కృష్ణవరం తమ్ముడు’ నెలకోసారి లెక్క తేల్చి ముఖ్య నేతలకు తలా రూ.10 లక్షల చొప్పున దేవుడి హుండీలో మాదిరిగా ముడుపు మూటగట్టి ముట్టజెబుతున్నారని ఆ గ్రామం కోడై కూస్తోంది. దౌర్జన్యం అడ్డదారిలో వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు బూరుగుపూడి సమీపాన అధికారిక టోల్ప్లాజా నిర్వాహకులు గతంలో బ్యారియర్లు ఏర్పాటు చేశారు. అయితే, అక్రమార్జనకు అలవాటు పడిన తెలుగు తమ్ముళ్లు ఈ బ్యారియర్లను రాత్రి పూట పొక్లెయిన్లతో రెండు మూడు పర్యాయాలు దౌర్జన్యంగా తొలగించేశారు. దీంతో, చేసేది లేక టోల్ప్లాజా నిర్వాహకులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు.కొసమెరుపు ఈ దందాలో బిగ్ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. కృష్ణవరం ఏలేరు నది ఒడ్డున శ్రీ విజయేశ్వరి సమేత విశ్వనాథస్వామి, గ్రామ దేవత శ్రీమంట్లమ్మ అమ్మ ఆలయాల పేరు చెప్పి తెలుగు తమ్ముళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కానీ, ఆ ఆలయాల నిర్మాణాలు ఎప్పుడో 2018లోనే పూర్తి కావడం, అక్కడకు భక్తులు నిత్యం వచ్చి దర్శించుకుంటూ, పూజలు కూడా చేస్తూండటం కొసమెరుపు. అయినప్పటికీ, ఆ ఆలయాల నిర్మాణం పేరుతో ఏడాదిన్నర కాలంగా తెలుగు తమ్ముళ్లు అడ్డూ అదుపూ లేకుండా దోపిడీకి పాల్పడుతూండటం.. కళ్ల ముందే ఇదంతా జరుగుతున్నా అధికారులు మిన్నకుండిపోవడం విచిత్రం. ఫ దేవుడి పేరిట నిలువు దోపిడీ ఫ తమ్ముళ్ల దందా ఫ కృష్ణవరంలో నకిలీ టోల్గేటు ఫ నిర్మాణం పూర్తయిన ఆలయాల పేరిట వసూళ్లు ఫ నెలకు అరకోటి వసూళ్లు ఫ ఏడాదిన్నరగా యథేచ్ఛగా దందా -
బాలురే డ్రైవర్లు!
● మట్టి మాఫియా మాయాజాలం ● పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం పి.మల్లవరం పంచాయతీ రాంజీనగర్ రహదారిలో మట్టి ట్రాక్టర్ నడుపుతున్న బాలుడుపి.మల్లవరంలో జేసీబీని ఆపరేట్ చేస్తూ ట్రాక్టర్లో మట్టిని వేస్తున్న బాలుడుతాళ్లరేవు: మండలంలో మట్టి మాఫియా ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్లు.. మట్టిని తరలిస్తూ బిజీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవర్లు దొరక్క బాలురతో ట్రాక్టర్లను నడిపించేస్తున్నారు. ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ట్రాక్టర్లతోపాటు భారీ వాహనాలైన జేసీబీలను కూడా పట్టుమని పదేళ్లయినా నిండని పిల్లలతో డ్రైవింగ్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం పి.మల్లవరం పంచాయతీ పెదపేటలో మట్టిని ట్రాక్టర్లతో తరలించారు. ఆ మట్టిని తవ్వి ట్రాక్టర్లలో నింపే జేసీబీ డ్రైవర్ ఒక బాలుడు కావడం గమనార్హం. 14 ఏళ్ల లోపు ఉండే ఆ బాలుడు ప్రమాదకర రీతిలో జేసీబీని ఆపరేట్ చేయడాన్ని ‘సాక్షి’ కెమెరా క్లిక్మనిపించింది. సాధారణంగా 18 ఏళ్లు దాటితేనే తప్ప టూవీలర్ లైసెన్స్ మంజూరు చేయరు. అలాంటిది 14 ఏళ్ల లోపు బాలుడు జేబీసీని ఆపరేట్ చేయడం గమనార్హం. మట్టి ట్రాక్టర్లను కూడా లైసెన్స్లేని బాలురు నడుపుతున్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
బతుకు పోరులో మృత్యువేట
● ఆటోను లారీ ఢీకొని ఇద్దరి మృతి ● ఘటన స్థలంలో మహిళ.. ఆస్పత్రిలో ఆటో డ్రైవరు.. ● మరో ఐదుగురు మహిళలకు గాయాలు సామర్లకోట/కొత్తపల్లి: స్థానిక కాకినాడ రోడ్డులోని ఐదు తూముల వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం బుధవారం ఉప్పాడ శివారు కొత్తపేటకు చెందిన ఆరుగురు మత్స్యకార మహిళలు, రామిశెట్టిపేటకు చెందిన ఎరిపల్లి ప్రేమకుమార్ (38) ఆటోలో ఉదయం మట్లపాలెంలో చేపలు కొనుక్కుని అక్కడి నుంచి సామర్లకోటలో విక్రయించేందుకు వస్తున్నారు. వారి ఆటోను తాడేపల్లిగూడెం నుంచి సామర్లకోట మీదుగా కాకినాడ వెళుతున్న లారీ ఐదు తూముల వద్ద ఢీకొంది. ఈ సంఘటనలో గంపల చిట్టెమ్మ (35) అక్కడిక్కడే మృతి చెందగా మిగిలిన వారంతా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అడపా గరగారావు క్షతగాత్రులను ఆటోలో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రేమకుమార్ మృతి చెందాడు. కాగా గరికిన సింహాద్రి, రామిశెట్టి నాగమణి, వెరిపల్లి చిట్టెమ్మ, మేకల పోరిమేరీ, దొడ్డి సత్యవతి చికిత్స పొందుతున్నారు. వీరిలో గరికిన సింహద్రి పరిస్థితి విషమంగా ఉన్నదని పోలీసులు తెలిపారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చిట్టెమ్మ మృతదేహాన్ని పెద్దాపురం సీహెచ్సీకి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఉప్పాడలో విషాదఛాయలు ఈ ప్రమాదంలో ఇద్దరు ఉప్పాడ వాసులు మృతి చెందడంతో వారి స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆటో డ్రైవర్ ప్రేమకుమార్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. అతడికి భార్య, కవల కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అతడి మృతితో వారితో పాటు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా చిట్టెమ్మ భర్త ఇటీవలే మృతి చెందాడు. చేపలు విక్రయంతో వచ్చిన సంపాదనతోనే తన ముగ్గురు కుమార్తెలకు వారు వివాహాలు చేశారు. కొంతకాలంగా చేపల వ్యాపారం మానేసిన ఆమె ఇటీవల 15 రోజులుగా వ్యాపారానికి వెళ్తోంది. ఆమె ఈ ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. -
ఐపీఎల్ ఫీవర్!
పల్లెల్లో సైతం అదే క్రేజ్ క్రికెట్కు పల్లెల్లో సైతం క్రేజ్కు తక్కువేమీ లేదు. చిన్న పిల్లలు సైతం బ్యాట్, బాల్, మూడు నాలుగు కర్రముక్కలు పట్టుకుని మైదానాల బాట పడుతున్నారు. పగటి పూట మైదానంలో సాధన.. రాత్రి పూట టీవీల్లో ఐపీఎల్ వీక్షణగా సాగుతున్నాయి పల్లె యువత వేసవి సెలవులు. క్రీడల ప్రోత్సాహానికి చిన్నారుల కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తే నాణ్యమైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. – ముత్యాల పవన్ కిశోర్, పీడీ, జెడ్పీ ఉన్నత పాఠశాల, ముక్కామల ● పగలు సాధన.. రాత్రి వీక్షణ.. ● పల్లెల్లో సందడి చేస్తున్న యువత ● ఉత్సాహంగా వేసవి సెలవులు కొత్తపేట: కళ్లు చెదిరే ఫోర్లు.. ఆకాశాన్నంటే సిక్సులు.. మిరుమిట్లు గొలిపే లేజర్ షో.. చీర్ గళ్స్ చిందులు.. ప్రపంచ క్రికెట్లో మేటి ఆటగాళ్ల ఏకై క వేదిక ఐపీఎల్. ప్రపంచంలో ఏ క్రీడకూ లేని క్రేజ్ క్రికెట్ సొంతం. ఐపీఎల్ 19వ సీజన్ చివరి అంకానికి చేరింది. అభిమాన జట్ల విజయాలు.. అభిమాన క్రికెటర్ల బ్యాటింగ్, బౌలింగ్ ప్రతిభకు ఈలలు, చప్పట్లు, అరుపులు కేకలతో మజాను ఆస్వాదిస్తున్నారు. వేసవి సెలవుల్లో.. పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. మార్చి నెలాఖరులో ఐపీఎల్ ప్రారంభమైంది. అన్నీ కలిసొచ్చాయి. క్రికెట్ కిట్లు తీశారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు మైదానాల్లో టీమ్లుగా విడిపోయి క్రికెట్ మ్యాచ్లు. రాత్రి ఇళ్లలో ఐపీఎల్ మ్యాచ్ల సందడి. -
విద్యుదాఘాతంతో గడ్డి టెక్కీల దగ్ధం
అనపర్తి: విద్యుత్ తీగ తెగిపడి ఎండు గడ్డి టెక్కీలు అగ్నికి ఆహుతయ్యాయి. బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 1200 ఎండు గడ్డి టెక్కీలు దగ్ధమైనట్టు బాధిత రైతులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల సమయంలో విద్యుత్ లైన్కు సంబంధించిన తీగ తెగి రోడ్డు పక్కన నిల్వ ఉంచిన గడ్డి టెక్కీలపై పడడంతో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వీటిలో కొర్ల శ్రీనివాస్కు చెందిన ఐదు వందల టెక్కీలు, మందనక్క సత్యనారాయణకు చెందిన 300, కోరాడ రాఘవ 180, మహిపాల చంద్రరావుకు చెందిన 190 టెక్కీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న రామచంద్రపురం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అమ్మమ్మను హత్య చేసిన మనవడికి యావజ్జీవ జైలు తొండంగి: దురలవాట్లకు బానిసైన మనుమడు మద్యం మత్తులో డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసిన కేసులో మనుమడికి యావజ్జీవ శిక్ష పడిందని సీఐ చెన్నకేశవరావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దానవాయిపేట పంచాయతీ నర్శిపేటకు చెందిన బెనుగు దీనమ్మ (75)ను మనుమడు గోసల జాన్ 2025 జూలై 12న మద్యం మత్తులో డబ్బులు ఇవ్వాలని గొడవపడి హత్య చేశాడు. ఈ ఘటనపై దీనమ్మ కుమార్తె, జాన్ తల్లి గోసల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిఠాపురం ఏడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో జాన్కు జడ్డి పి.భాస్కరరావు యావజ్జీవ శిక్ష విధించారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 23,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,000 గటగట (వెయ్యి) 22,500 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 15,000 – 16,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)15,000 – 16,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 5,000 కిలో 350 -
పథకాల అమలుకు నిరంతర పర్యవేక్షణ
● ఆర్జేడీ నాగమణి ● డీవైఈఓ, ఎంఈఓలకు ఒకరోజు శిక్షణ రాజమహేంద్రవరం రూరల్: పాఠశాలల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, నాణ్యమైన బోధనా పద్ధతులు మెరుగు పరచడానికి నిరంతర పర్యవేక్షణ అవసరమని జోన్–2 ప్రాంతీయ విద్యా సంచాలకురాలు జి.నాగమణి పేర్కొన్నారు. పాఠశాలల పర్యవేక్షణపై జోన్–2 పరిధిలోని డీవైఈవోలు, ఎంఈవోలకు బుధవారం స్థానిక ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్సనలైజ్డ్ అడాప్ట్ లెర్నింగ్ (పాల్ ) ఎలా నిర్వహించాలి.. విద్యార్థుల సామర్ాధ్యలను ఎలా బలోపేతం చేయాలన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పటిష్ట అమలుకు నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. రాష్ట్ర పాల్ సమన్వయకర్త కిశోర్ బాబు, సీమాట్ సీనియర్ లెక్చరర్ ఎస్.ప్రసాద్, సమగ్ర శిక్ష సీనియర్ ఫ్యాకల్టీ మాధవీలత ఈ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఓ కంది వాసుదేవరావు, జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, తూర్పుగోదావరి జిల్లా అకాడమిక్ మోనిటరింగ్ ఆఫీసర్ లక్ష్మణ్ కుమార్, సుమారు 200 మంది ఎంఈవోలు, డీవైఈఓలు, మానిటరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
వరుణరాగం
కొత్తపల్లిలో కురుస్తున్న భారీ వర్షంఎడారిలో దిక్కు తోచక తిరుగుతున్న వారికి ఒయాసిస్సు కనిపించినట్టు.. కొన్నాళ్లుగా చండప్రచండంగా ఎండలు మండిపోతున్న వేళ.. ఉన్నట్టుండి ‘వరుణ’ రాగం వినిపించింది. తొండంగి తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి వర్షం కురిసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపా అన్నట్టు కాకినాడ, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఆకాశాన దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. సుమారు గంట పాటు కురిసిన ఈ వర్షం ప్రజలకు సూర్యప్ర‘తాపం’ నుంచి రోజంతా ఉపశమనాన్నిచ్చింది. వానకు ఈదురు గాలులు కూడా తోడవడంతో అక్కడక్కడ చెట్లు నేల కూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. కాకినాడలో ఆర్టీఓ కార్యాలయం వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో వలసపాకల వైపు వెళ్లే వాహనాలు కొద్దిసేపు ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి వచ్చింది. దీంతో, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా కొత్తపల్లి మండలం కొమరగిరి శివారు నాగపేటలో తాటిచెట్లు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో, మూడు విద్యుత్ స్తంభాలు, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నేలకొరిగాయి. దీంతో, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది చెట్లను తొలగించి, విద్యుత్ స్తంభాలు వేసి, సరఫరాను పునరుద్ధరించారు. – కాకినాడ రూరల్/కొత్తపల్లి -
తలుపులమ్మ తల్లికి రూ.54.44 లక్షల ఆదాయం
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారికి హుండీల ద్వారా రూ.54,44,339 ఆదాయం సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. దేవదాయ శాఖ జిల్లా అధికారి వి.వెంకటేశ్వరరావు, గ్రేడ్–1 ఈఓ ఎం.మురళీ వీరభద్రరావు పర్యవేక్షణలో దేవస్థానంలోని హుండీలను బుధవారం తెరచి నగదు లెక్కించారు. మొత్తం 58 రోజులకు నాణేల రూపంలో రూ.3,46,308, నోట్ల రూపంలో రూ.50,98,031 ఆదాయం లభించిందని ఈఓ విశ్వనాథరాజు వివరించారు. హ్యాండ్బాల్ పోటీలకు జిల్లా జట్టు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో గురు, శుక్రవారాల్లో జరిగే రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్టు బుధవారం పయనమైంది. జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంవీవీ దుర్గాప్రసాద్ ఈ విషయం తెలిపారు. జట్టులో పవన్ గణేష్, సోమరాజు, ఎంఎస్ రాజు, పాల్జోన్స్, హేమంత్సాయి, వెంకట గణేష్, కుర్షద్, భవిక్, కె.నరూన్, చరణ్తేజ, వీరేంద్ర, ప్రజ్వల్, నిశాంత్రెడ్డి, చైతన్య, సూర్యకుమార్ ఉన్నారని వివరించారు. రెండు వర్కింగ్ వుమెన్ హాస్టళ్ల మంజూరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రెండు వర్కింగ్ వుమెన్ హాస్టళ్లను మంజూరు చేసింది. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం ఈ విషయం తెలిపారు. ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళల కోసం కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ‘సఖి నివాస్’ పథకంలో భాగంగా వీటిని కేంద్రం ఏర్పాటు చేస్తోందని వివరించారు. ఒక్కోచోట 30 మంది మహిళలకు వసతి కల్పిస్తారన్నారు. నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే గోకవరం: నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని, సంబంధిత మంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరంజనేయులు డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీపై సంఘం ఆధ్వర్యాన శివరామపట్నంలో బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కర్నాకుల మాట్లాడుతూ, గతంలో కూడా అనేకసార్లు పేపర్ లీకవడంతో వందలాది మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదని విమర్శించారు. ఈ ఏడాది కూడా నీట్ పేపర్ లీకవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివిన సుమారు 15 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం కలచివేసిందన్నారు. నీట్ పరీక్షల నిర్వహణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కర్నాకుల డిమాండ్ చేశారు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉచిత న్యాయ సహాయ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని 9వ అదనపు జిల్లా జడ్జి జి. షణ్ముఖరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యార్లగడ్డ శ్రీలక్ష్మిక్ష పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో బుధవారం మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. దీనికి హాజరై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానల్ న్యాయవాదులు, డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులతో సమీక్ష నిర్వహించారు. వివిధ కేసులలో ఉచిత న్యాయ సహాయం అందించేందుకు నియమితులైన న్యాయవాదులతో ఆయా కేసుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. -
‘జల్ జీవన్’ పనులు వేగవంతం చేయాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమగ్ర సమీక్షలో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ పనులు, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం, నీటి వనరుల పరిరక్షణ, భూగర్భ జలాల అభివృద్ధి, మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్, పారిశుధ్య పనులు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల పురోగతి, తాగునీటి ట్యాంకులకు స్థల సేకరణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వంటి అంశాల ప్రగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని ప్రతి గ్రామాన్ని 2028 నాటికి హర్ ఘర్ జల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నారు. రౌతులపూడి మండలంలో రూ.356 లక్షల అంచనాతో చేపట్టనున్న 18 పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, ఇరిగేషన్, వ్యవసాయం, డ్వామా, గ్రౌండ్ వాటర్, ఐసీడీఎస్, డీఆర్డీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● వెనుక చూపేదీ?
ప్రయాణమేదైనా లక్ష్యం వెనకున్నవారి శ్రేయస్సు కోసమే. ఆ ప్రయాణమే ప్రమాదకరంగా ఉంటే.. ఆ లక్ష్యానికి అర్ధం లేదు. ఇదిగో ఈ చిత్రాలే అందుకు నిదర్శనం. ఎన్నో కుటుంబాలు వారి రాకకోసమో.. క్షేమంగా చేరారన్న సమాచారం కోసమో వారిళ్లలో ఎదురు చూస్తుంటారు. అనుకోని ఘటనలో జరగరానిది జరిగితే వారిపై ఆధారపడి ఉన్నవారి జీవితాలు తలకిందులేగా..! ఎవరి జీవితాలను వారు తేలిగ్గా తీసుకుని ఇలా ప్రయాణాలు చేస్తుంటే అధికారులు సదస్సులు, అవగాహనలు పెట్టి ఏం లాభం? మండల పరిధిలో నిత్యం రద్దీగా ఉండే హైవేలో నిత్యం చిన్నో పెద్దో ప్రమాదాలు మామూలే. వాహన చోదకులకు కాదు.. ప్రయాణికులకు ‘వెనుక’ చూపు ఎంతో అవసరం. – గండేపల్లి -
వేంకటేశ్వర ఆలయంలో చోరీ
సామర్లకోట: మండల పరిధి అచ్చంపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రా చోరీ జరిగింది. స్వామివారికి నివేదన అనంతరం అర్చకుడు కృష్ణమాచార్యులు ఇంటికి వెళ్లిపోయారు. మళ్లీ తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు రాగా తెలుపులు తెరచి ఉన్నాయి. దీంతో స్వామివారి ఆభరణాలు పరిశీలించి చోరీ జరిగినట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్రైమ్, వేలిముద్ర నిపుణులు ఆలయానికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆలయ తాళాన్ని నకిలీ తాళంతో తెరిచినట్టు గుర్తించారు. సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ రమేష్బాబు, ఈఓ ప్రతాప్కుమార్ ఆలయానికి చేరుకుని స్వామి, దేవేరులకు అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్టు గుర్తించారు. మూడు కిలోల వెండి, మూడు కాసులు బంగారు ఆభరణాలు చోరీ జరిగిన్నట్లు అర్చకుడు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. ఆభరణాలకు బీమా చేయించినట్టు తెలిసింది. ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలోని సీసీ కెమెరాతో ఫుటేజీ స్టోర్ అయ్యే హార్డ్డిస్క్ సైతం చోరీకి గురైనట్టు గుర్తించారు. దీంతో ఆలయానికి సంబంధించిన వారే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. గ్రామంలోని సెల్ షాపులో చోరీ జరిగి 24 గంటలు గడువక ముందే ఆలయంలో చోరీ జరగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. రూ.13 లక్షల విలువైన సొత్తు అపహరణ -
శబరిలో మునిగి మహిళ మృతి
చింతూరు: మతి స్థిమితం లేని మహిళ స్థానిక శబరినదిలో మునిగి మృతిచెందిన సంఘటన మండలం చట్టిలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన లాడె కుమారి (55) మతి స్థిమితం లేకపోవడంతో పాటు క్షయవ్యాధితో బాధపడుతోంది. బుధవారం ఉదయం చింతూరు, వీఆర్ పురం ప్రధాన రహదారిలోని ఎయిర్టెల్ టవర్ వద్ద శబరినదిలో ఆమె మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెంది ఉండవచ్చని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సంతోష్కుమార్ తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి.. నిడదవోలు: స్థానిక రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 40 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. రైల్వే ట్రాక్ వెంబడి నడచి వస్తుండగా రాజమహేంద్రవరం నుంచి విజయవాడవైపు వెళ్తున్న రైలు ఢీకొని అతడు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు, చామన ఛాయలో ఉన్నాడు. నలుపు రంగు జీన్స్ ప్యాంటు, తెలుపు, నలుపు రంగుల చొక్కా ధరించి ఉన్నాడు. తాడేపల్లిగూడెం రైల్వే హెస్సీ డి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాముకాటుకు గురై..రాజానగరం: మండలంలోని తూర్పుగానుగూడేనికి చెందిన సిద్దాబత్తుల ధనలక్ష్మి (60) పాము కాటుకు గురై మృతి చెందింది. ఉపాధి కూలీ పనులు చేస్తూ జీవించే ఆమె మంగళవారం రాత్రి ఇంటి వద్ద బాత్రూంలో స్నానం చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో పాము కాటు వేసింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు వచ్చిన 108 వాహనంలో ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తూర్పు గానుగూడెం క్రైస్తవ సంఘ ప్రతినిధి జి.సుందరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ధనలక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోక్సో కేసు నమోదు దేవరపల్లి: నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఓ యువకుడిపై బుధవారం పోక్సో కేసు నమోదైంది. తన కుమార్తైపె అత్యాచారం చేసిన కొక్కిరిపాటి కిరణ్ కుమార్పై ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రవికుమార్ తెలిపారు. బాలుడి అక్రమ రవాణాకు చెక్ ● కిడ్నాప్నకు గురైన పశ్చిమబెంగాల్ బాలుడు ● రక్షించి తండ్రికి అప్పగించిన అధికారులు కాకినాడ క్రైం: పశ్చిమ బెంగాల్లో అక్రమ రవాణాకు గురైన 16 ఏళ్ల బాలుడ్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) సిబ్బంది, తుని రైల్వే పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే, ఓ గుర్తు తెలియని యువకుడు బాలుడికి మాయమాటలు చెప్పి ఈ నెల 24న పశ్చిమబెంగాల్లో రైలు ఎక్కించాడు. రైలు రాష్ట్రం సరిహద్దులు దాటే సరికి బాలుడికి భయం మొదలైంది. 25న ఆంధ్రప్రదేశ్లో తుని రైల్వేస్టేషన్కి చేరేసరికి రైలులో సాధారణ తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బాలుడి అనుమానాస్పద ప్రవర్తనను గుర్తించి వివరాలు ఆరా తీశారు. ఈ లోగా బాలుడిని తీసుకువచ్చిన యువకుడు పరారయ్యాడు. బాలుడి విషయాన్ని జిల్లా బాలల పరిరక్షణ అధికారి చదలవాడ వెంకట్రావుకు తెలియజేశారు. ఆయన జిల్లా పీడీ చెరుకూరి లక్ష్మి ఆదేశాల మేరకు, బాలుడి చిరునామాను గుర్తించి తండ్రి హరిద్దీన్ను పిలిపించి అప్పగించారు. -
ట్రాఫిక్ చలానా ఉంటే పిల్లనివ్వను
పెళ్లికాని అబ్బాయిలకు అలర్ట్. మీ బండిపై ట్రాఫిక్ చలానాలు ఉన్నాయా? అయితే మీకు పెళ్లి కాకపోవచ్చు. వెడ్డింగ్కు, ట్రాఫిక్ చలానా సంబంధంమేంటని బుర్ర గోక్కుంటున్నారా? పెళ్లి సంబంధాల్లో సహజంగా అమ్మాయి తల్లిదండ్రులు చూసేది అబ్బాయి గుణగణాలు, ఉద్యోగం, కుటుంబం, ఆస్తులు. కానీ ఇప్పుడు అబ్బాయి బండికి సంబంధించిన ట్రాఫిక్ చలానాలు కూడా చూస్తున్నారు. నమ్మకం కలగట్లేదా? అయితే ఇది చదవండి.ఈ చిత్రంలో కనిపిస్తున్న పెద్దాయనది కాకినాడలోని రాయుడుపాలెం.. ఈయనకు ఒక్కగానొక్క కూతురు. భార్య చనిపోవడంతో కూతురిని కంటికి రెప్పలా పెంచి పెద్దచేశాడు. ఎంబీఏ వరకు చదివించాడు. ఇప్పుడు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని నిశ్చయించాడు. అయితే అబ్బాయి గుణగణాలతోపాటు భవిష్యత్తులో తన కూతురి భద్రత, భవిష్యత్తు దృష్ట్యా అతడి ట్రాఫిక్ క్రమశిక్షణపైనా ఆరా తీయాలని సంకల్పించాడు.కాకినాడ ట్రాఫిక్–2 సీఐ దానేటి రామారావు వద్దకు వచ్చి తనకు కాబోయే అల్లుడి కారు, ద్విచక్రవాహనాల నంబర్లు చీటిపై రాసిచ్చి వాటిపై ట్రాఫిక్ ఉల్లంఘన కేసులేమైనా ఉన్నాయేమోనని చెప్పాలని కోరాడు. చలానాలు ఉంటే పిల్లనివ్వనని స్పష్టం చేశాడు. కూతురి భవిష్యత్తుపై పెద్దాయన చూపిస్తున్న తాపత్రయానికి ముగ్దుడైన సీఐ నిబంధనలకు లోబడి తప్పనిసరిగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. – కాకినాడ క్రైంచదవండి: కొత్త అల్లుడికి పసందైన విందు -
పల్లెడిల్లుతున్నది!
● అపరిశుభ్రతకు కేరాఫ్గా గ్రామాలు ● పట్టించుకోని ప్రత్యేక అధికారులు ● రోడ్ల పక్కన పేరుకుపోతున్న చెత్త ● మంచినీటికీ కటకట బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుతం పల్లెలు అధ్వానంగా ఉన్నాయి. రెండు నెలల క్రితం గ్రామ పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. చంద్రబాబు సర్కారు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రస్తుతం ఆయా గ్రామాలు.. ప్రజల కనీస అవసరాలు తీర్చేలేని పరిస్థితుల్లో ఉన్నాయి. పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరా, వీధిలైట్ల మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి నెలకొంది. కాకినాడ జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో మండల కేంద్రాల్లో ఉండే అధికారులను గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించారు. వారు ఎప్పుడో వీలు చూసుకొని వారానికో, 10 రోజులకో గ్రామాలకు చుట్టం చూపుగా వస్తున్నారు. దీంతో గ్రామాల్లో ప్రజలు వారి అవసరాలు తీరక అనేక అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. డ్రైనేజీల్లో సిల్ట్ పేరుకుపోయినా నెలల తరబడి తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లడంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం దుర్వాసన మధ్య జీవనం సాగించాల్సిన పరిస్థితి దాపురించింది. దోమల రొద డ్రైనేజీల నిర్వహణ అధ్వానంగా ఉండడంతో దోమల సమస్య ఎక్కువైంది. దీంతో ప్రజలు రాత్రి సమయాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఎండాకాలం కావడంతో గ్రామాల్లో ఆరుబయట పడుకుందామంటే అక్కడ దోమలతో సావాసం చేయాల్సి వస్తోంది. గ్రామాల్లో చెత్తతో సంపద తయారీ కేంద్రాలు పనిచేయడం లేదు. పలు గ్రామాల్లో చెత్తను రోడ్డు పక్కన వేసి పంచాయతీ సిబ్బంది తగలబెట్టడంతో రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు పొగతో అనేక అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైన కనీసం బ్లీచింగ్ కూడా చల్లడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. వీధి దీపాలు వెలగకపోయినా మరమ్మతులు కూడా చేయించలేని దుస్థితి నెలకొంది. గతంలో గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటే స్వయంగా గ్రామాల్లో పర్యటించి ఎక్కడ సమస్య ఉన్న వెంటనే సిబ్బందితో ఆయా పనులు పూర్తి చేయించేవారు. అవసరమైతే తమ సొంత నిధులు వెచ్చించి తర్వాత బిల్లులు తీసుకునేవారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారులు సంతకం లేనిదే నిధులు విడుదల చేసే అధికారం లేకపోవడంతో గ్రామ కార్యదర్శి గ్రామ పంచాయతీలో ఏ పని చేయాలన్న ఇబ్బందులకు పడాల్సిన పరిస్థితి నెలకొంది. తప్పని తాగునీటి సమస్య ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడంతో పలు గ్రామాల్లో మంచినీటి సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం శివారు ప్రాంతాలకు మంచినీటి ట్యాంకర్లు పంపడం నిలిపివేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో శివారు ప్రాంతాలకు మంచినీరు ట్యాంకర్ల ద్వారా పంపేందుకు జిల్లాకు నిధులు కేటాయించేవారు. చంద్రబాబు సర్కారు ఈ నిధులు నిలిపివేయడంతో గ్రామ పంచాయతీల ద్వారా శివారు ప్రాంతాలకు మంచినీరు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో నిధులు లేక జిల్లాలోని జగ్గంపేట, సామర్లకోట, కరప, రౌతులపూడి వంటి మండలాల్లో మంచినీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రత్యేకాధికారులు గ్రామాలకు రావడం లేదు ప్రత్యేకాధికారులు అసలు గ్రామాల వైపు తొంగి చూడడం లేదు. వారికి గ్రామస్తుల సమస్యలు కూడా తెలియడం లేదు. అత్యవసర పనులు చేసేందుకు కూడా వారాల సమయం తీసుకొంటున్నారు. మంచినీరు, విద్యుత్దీపాలు, పారిశుధ్య సమస్యలుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – సాదే ఆశాజ్యోతి, కరప మాజీ సర్పంచ్ -
జూలై నెలాఖరులోపు వరి నాట్లు
● జూన్ 1న సాగునీరు విడుదల ● స్వల్పకాలిక వరి వంగడాలే మేలు ● జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తూర్పు డెల్టా రైతులు జూలై నెలాఖరులోపు వరినాట్లు పూర్తి చేసుకోవాలని, అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావ సూచన నేపథ్యంలో నేరుగా విత్తే విధానం వద్దని, స్వల్పకాలిక వరి వంగడాల సాగే చేపట్టాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ రైతులకు సూచించారు. ఖరీఫ్ 2026 సీజన్లో కాకినాడ జిల్లాలో అన్ని సాగునీటి వ్యవస్థల కింద మొత్తం 3,70, 354 ఎకరాల పంటలకు సాగునీరు అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో తొలుత గోదావరి హెడ్ వర్క్స్ ఎస్ఈ జి.శ్రీనివాస్ జిల్లాలో వివిధ వ్యవస్థల కింద ఖరీఫ్ సాగుకు అందుబాటులో ఉండే నీటి నిల్వల వివరాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో చర్చించిన సాగునీటి ప్రణాళికకు అనుగుణంగా జిల్లాలో గోదావరి తూర్పు డెల్టా కింద జూన్ 1 నుంచే సాగునీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏలేరు, పంపా రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోనూ, పుష్కర లిఫ్ట్, తాండవ ప్రాజెక్టుల ద్వారా జూలై రెండో వారంలోను, వర్షాలు ప్రారంభమయ్యాక సుబ్బారెడ్డి సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆగస్టు రెండవ వారంలోను నీటిని విడుదల చేసేందుకు షెడ్యూల్ రూపొందించామన్నారు. జిల్లాలో గోదావరి తూర్పు డెల్డా కింద కాలువ శివారున ఉన్న పెదపూడి, సామర్లకోట, కాకినాడ రూరల్, అర్బన్, కరప, కాజులూరు, తాళ్లరేవు మండలాలకు జూన్ మొదటి వారానికి నీరు చేరనున్న నేపథ్యంలో జూన్ 10 నుంచి నెలాఖరులోపు నారుమళ్లు ముగించి, జాలై నెలాఖరు నాటికి వరినాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సేకరించని 1156, 1153, 1010, సీఆర్ 126 రకాల వంగడాలను సాగు చేయవద్దని సూచించారు. తక్కువ కాలపరిమితి గల వరి రకాల విత్తనాలను సిద్ధంగా ఉంచాలని వ్యవసాయశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సబ్సిడీ ఎరువుల పంపిణీని మరింత పారదర్శకం చేసేందుకు రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్గా కాకినాడ జిల్లాను ఎంపిక చేశారని, ’అగ్రి స్టాక్’ ద్వారా ఆన్లైన్ యూరియా కేటాయింపులను చేపట్టనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
సీలేరు నదిపై వేగంగా వంతెన నిర్మాణ పనులు
మోతుగూడెం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలను కలిపే వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సీలేరు నదిపై పొల్లూరు వద్ద వంతెన పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత ఐదేళ్ల క్రితం ఒడిశా ప్రభుత్వం వంతెన పనులు ప్రారంభించినప్పటికీ వివిధ కారణాల వలన నత్తనడకన పనులు సాగాయి. అయితే వచ్చే సంవత్సరం మూడేళ్లకు ఒకసారి వచ్చే మన్యంకొండ జాతర జరుగుతుండడంతో ఒడిశా అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మన్యం కొండ జాతరకు సీలేరు నది దాటి సుమారు లక్షకు పైగా ఒడిశా గిరిజనులు పొల్లూరు వాటర్ఫాల్స్ వద్దకు వచ్చి పూజలు నిర్వహిస్తారు. అయితే అప్పుడు తాత్కాలిక ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు చేస్తారు. అయితే వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చేశారు. ఇప్పటివరకు సుమారు ఏడు పిల్లర్లు పూర్తి కాగా మరో మూడు పిల్లర్ల పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ అంతరాష్ట్ర బ్రిడ్జి పనులు పూర్తయితే అటు ఒడిశాతో పాటు ఇటు ఆంధ్ర ప్రజల వ్యాపారాలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఒడిశా సరిహద్దు గ్రామ ప్రజలకు విద్య, వైద్యానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీలేరు నది సరిహద్దున ఉన్న ఒడిశా గిరిజనులు ప్రతి చిన్న అవసరానికి సీలేరు నది దాటి పొల్లూరు వస్తారు. ఇక్కడ నుంచి సీలేరు, ఇతర గ్రామాలకు రాకపోకలు సాగిస్తారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు ఒడిశా అధికారులు చర్యలు చేపడుతున్నారు. వంతెన నిర్మాణంతో మేలు పొల్లూరు వద్ద సీలేరు నదిపై వంతెన నిర్మాణంతో ఒడిశా గిరిజనులకు మేలు జరుగుతుంది. ప్రతి అవసరానికి పొల్లూరు, మోతుగూడెం వస్తారు. వంతెన నిర్మాణంతో పడవపై ప్రయాణించే ఇబ్బంది తప్పుతుంది. వ్యాపార లావాదేవీలు పెరుగుతాయి. – ప్రసాద్, మోతుగూడెం -
ఓటరు జాబితాపై శ్రద్ధ చూపాలి
సామర్లకోట: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇటీవల జరిగిన ప్రెస్మీట్లో అనేక ప్రశ్నలను సంధిస్తే ఒక్కదానికీ సమాధానం ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డీఎస్సీలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన దుర్మార్గంగా ఉన్నదని, వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రతీ నాయకుడు బీఎల్ఎలపై శ్రద్ధ చూపి ఓటర్లను కాపాడుకోవాలన్నారు. స్థానిక సంస్థలలో కూటమి పార్టీలు ఓటమి చెందితే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందనే ప్రచారం జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రతిపక్ష నాయకులు, సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందన్నారు. వచ్చే నెల నుంచి నెల రోజుల పాటు సర్పై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం నియమించిన బీఎల్ఓలు ఇంటింటా తిరిగే సమయంలో వారితో టచ్లో ఉండాలన్నారు. అర్హత ఉన్న వారి ఓట్లు తొలగిస్తే వెంటనే పార్టీ నాయకులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ 24 సంవత్సరాల తరువాత ఓటర్ల సవరణ జరుగుతున్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సర్ టాస్క్ఫోర్సు కమిటీ సభ్యుడు బీవీఆర్ చౌదరి మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో ఓట్లు తొలగించిన విధంగా రాష్ట్రంలో జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఒమ్మి రఘురాం బీఎల్ఎలకు శిక్షణ ఇచ్చారు. టాస్క్ఫోర్సు కమిటీ సభ్యులు వాసిరెడ్డి జమీల్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మండల పార్టీ అధ్యక్షుడు తలారి దొరబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్కుమార్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు వీరంరెడ్డి నాని పాల్గొన్నారు. బీఎల్ఎల అవగాహన సదస్సులో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాజా -
జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్ర స్థాయి అవార్డు
అమలాపురం రూరల్: సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్రస్థాయిలో టాప్ ఫెర్పార్మర్ అవార్డు లభించింది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఇంటర్, పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం ఆమెకు డివిజన్ సంక్షేమ అధికారులు భగవాన్, సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ప్రవీణ్, కోశాధికారి బీఎంవీ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్బాబు అభినందనలు తెలిపారు. జ్యోతిలక్ష్మీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఫలితంగా తనకు అవార్డు దక్కిందని స్పష్టం చేశారు. -
కేజీబీవీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన పోస్టులకు అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ పిల్లి రమేష్ మంగళవారం తెలిపారు. కేజీబీవీ కోటనందూరు పాఠశాలలో పీఈటీ, సీఆర్టీ (సోషల్) పోస్టులు ఒకటి చొప్పున, తొండంగిలో సీఆర్టీ(సోషల్)పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూన్ 5వ తేదీలోగా ఆసక్తి గల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు కాకినాడ సమగ్ర శిక్ష కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్గా డాక్టర్ ఉషాకిరణ్ కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ ప్రయాగ ఉషాకిరణ్ నియమితులయ్యారు. ఆర్ఎంసీ ఫార్మకాలజీ విభాగాధిపతిగా కొనసాగుతున్న ఆయనను కళాశాల ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. డాక్టర్ ఉషాకిరణ్ 1984 బ్యాచ్కు చెందిన వైద్య విద్యార్థి, కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అదే కళాశాలలో ఎండీ ఫార్మకాలజీ పీజీ చదివారు. హైదరాబాద్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో డీఎం క్లినికల్ ఫార్మకాలజీ చేశారు. 1997లో ప్రభుత్వ ఉద్యోగం సాధించి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు వచ్చారు. 2003లో అసోసియేట్ ప్రొఫెసర్గా, 2011లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. 2013 నుంచి ఫార్మకాలజీ హెచ్వోడీగా బాధ్యతలు చేపట్టి కొనసాగుతున్నారు. ప్రిన్సిపాల్గా కొనసాగుతున్న డాక్టర్ విష్ణువర్థన్ రాష్ట్ర డీఎంఈగా పదోన్నతి పొందడంతో డాక్టర్ ఉషాకిరణ్ కళాశాల ప్రిన్సిపాల్గా నియమితులయ్యారు. ఎయిడ్స్ నియంత్రణే లక్ష్యం కాకినాడ క్రైం: జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణే లక్ష్యంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్, ఎ.సుకుమార్, ఇన్చార్జి డీఎంహెచ్వో డాక్టర్ ఎస్.చలమయ్య అన్నారు. మంగళవారం కాకినాడలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ఎయిడ్స్ నియంత్రణ కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఏడాది కాలంలో జిల్లాలో వ్యాధి తీవ్రతను నియంత్రించేందుకు దశలవారీగా కృషి చేయాలన్నారు. స్వల్పకాలిక లక్ష్యాల ద్వారా నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోవచ్చని దిశానిర్దేశం చేశారు. లింగంపర్తి విద్యార్థినికి 3వ ర్యాంక్ ఏలేశ్వరం: ఏపీ ఎడ్సెట్లో మండలంలోని లింగంపర్తి గ్రామానికి చెందిన ముద్రగడ తేజస్వి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. చిత్తూరు లోని ద్రవిడియన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన ఏపీ ఎడ్సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. సోషల్ విభాగంలో తేజస్వీ ఈ ర్యాంక్ సాధించింది. సివిల్స్ సాధించడమే లక్ష్యమని ఆమె తెలిపింది. డీఈఓ కావడమే లక్ష్యం ఏపీ ఎడ్సెట్లో 9వ ర్యాంకర్ జయరాజు సామర్లకోట: డీఈఓ కావడమే తన లక్ష్యమని వాస ంశెట్టి జయరాజు తెలిపాడు. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన జయరాజు ఏపీ ఎడ్సెట్లో 9వ ర్యాంకు సాధించాడు. అతని తండ్రి పద్మరాజు వ్యవసాయ కూలీ కాగా తల్లి గృహిణి. ఓపెన్ స్కూలు పరీక్షలు వాయిదా కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ నెల 28న జరగాల్సిన పది, ఇంటర్ ఓపెన్ స్కూలు పరీక్షలు బక్రీదు కారణంగా వాయిదా వేసినట్టు డీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. తిరిగి ఈ పరీక్షలు జూన్ 2వ తేదీన జరుగుతాయన్నారు. టెన్త్ గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్ష, ఇంటర్లో ఆర్థిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సామాజిక శాస్త్రం పరీక్షలు జరుగుతాయన్నారు. ఇంటర్ థియరీ పరీక్షలను వచ్చే నెల 2కు వాయిదా వేసిన కారణంగా ప్రాక్టికల్ పరీక్షలు 7వ తేదీకి వాయిదా పడ్డాయన్నారు. -
సత్యదేవుని దర్శించుకున్న ఛత్తీస్గఢ్ సీజే రమేష్ సిన్హా
తొండంగి: ఛత్తీస్గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా రత్నగిరిపై మంగళవారం సత్యదేవుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం వేద పండితులు జస్టిస్ రమేష్ సిన్హా దంపతులకు పండితాశీర్వచనం చేయగా దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధర్రావు సత్యదేవుని ప్రసాదం, ఫొటోను అందజేశారు. ఆయన వెంట ఏపీఆర్వో గణపతి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
చేనేతను ప్రోత్సహించాలి
బోట్క్లబ్: చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ అన్నారు. స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25 నుంచి జూన్ 1 వరకు చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వస్త్ర ప్రదర్శనను సోమవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. 80 స్టాల్స్లో కాటన్, మెర్సిడైజేడ్, పట్టుచీరలు, సీకో చీరలు, మాధవరం, వెంకటగిరి, బందరు జరీ చీరలు, మంగళగిరి డ్రెస్ మెటీరియల్స్, ఉప్పాడ జంధాని చీరలు, కలంకారి వస్త్రాలు, పొందూరు ఖద్దరు, పెద్దాపురం సిల్క్ షర్టింగ్స్, ప్రఖ్యాతిగాంచిన బెడ్ షీట్స్, ఆకర్షణమైన వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె.పెద్దిరాజు పాల్గొన్నారు. పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తి సామర్లకోట : పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనకు సంబంధించి బాధ్యులుగా చేస్తూ అప్పటి ఆర్డీఓగా ఉన్న కే శ్రీరమణని సస్పెండ్ చేసిన విషయం విదితమే. అనంతరం ఎన్ శ్రీధర్ను ఇన్చార్జిగా నియమించారు. రెగ్యులర్ ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమించారు. ఉత్సాహంగా రేలా ఉత్సవాలు రంపచోడవరం: ఆదివాసీ రేలా ఉత్సవాలు రెండో రోజు ఉత్సహంగా జరిగాయి. రేలా ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్, జేసీ ప్రశాంత్కుమార్ హాజరయ్యారు. గిరిజనులతో కలసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సాయంత్రం ఏడు గంటలకు రేలా ఉత్సవాలు ప్రారంభించారు. -
గూడు తొలగించొద్దని వేడుకోలు
పాడా పీడీకి వినతి పత్రం అందించిన బాధితులుపిఠాపురం రూరల్: తమ గూడు తొలగించొద్దని పట్టణ పరిధి ఇందిరానగర్ కాలనీ వాసులు సోమవారం పాడాలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అధికారులను వేడుకున్నారు. అధికారులకు వినతి పత్రం అందించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్ శివారున 12 కుటుంబాలకు చెందినవారు 40 సంవత్సరాల పైబడి జీవిస్తున్నారు. వీరు నివసిస్తున్న ఇళ్లకు అధికారులు మున్సిపల్ పన్ను, కుళాయి పన్ను సైతం విధించారు. విద్యుత్ శాఖ కరెంట్ మీటర్ మంజూరు చేసింది. కొద్ది రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి 30 రోజుల్లోగా ఇళ్లను ఖాళీ చేయాలని లేని పక్షంలో జేసీబీలతో తామే తొలగిస్తామని హెచ్చరించారని బాధితులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్న తమను అర్ధంతరంగా ఖాళీ చేసి వెళ్లిపొమ్మనడం తగదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థలం సక్రమం కానప్పుడు, ఇంటి పన్ను, కుళాయి పన్ను, కరెంట్ మీటర్ ఎలా వేశారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు కట్టుకునే స్తోమత లేక పాకలు వేసుకుని జీవిస్తున్నామని, వేరే చోటకు పోవాలంటూ అధికారులు చెప్పడం తగదని, తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. -
అసమర్థ పాలనకు నిదర్శనం
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. నియంత్రణకు కమిటీని వేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ధరలు ఎందుకు ఎక్కువ. ఇది కూటమి అసమర్థ పాలనకు నిదర్శనం. – కర్నాకుల వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం, వాహనదారులు ఏమైపోవాలి ఈ పరిస్థితి చూస్తుంటే లీటర్ పెట్రోలు ధర రూ.130 దాటిపోతుందేమోనని ఆందోళనగా ఉంది. వాహనదారులు ఏమైపోవాలి. చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. – నేతల హరిబాబు, మాజీ కౌన్సిలర్, సామర్లకోట ఎన్నికలు అవ్వగానే పెంచేసింది రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న సమయంలో పెంచకుండా ఎన్నికల అయిన వెంటనే కేంద్రం ధరంలు పెంచేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ధరల నియంత్రణ చర్యలు, రాయితీలు ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. – తాటిపాక మధు, సీపీఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిత్యావసరాలు ఆకాశాన్నంటుతాయి ఈ ధరలు పెరుగుదలతో నిత్యావసరాలు ఆకాశాన్నంటే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు పెంచమని ప్రగల్భాలు పలికిన మంత్రి లోకేష్ ప్రస్తుతం పెరుగుతున్న ధరలపై ఎందుకు స్పందించడం లేదు. – బి సిద్దు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి, కాకినాడ -
కూటమి కుట్రలు తిప్పికొట్టండి
● ఎస్ఐఆర్పై అప్రమత్తం ● బూత్ లెవెల్ నేతలతో దాడిశెట్టి, ద్వారంపూడి సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పేరుతో వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లను తొలగించే కుట్రలను బూత్ స్థాయిలో తిప్పి కొట్టాలని ముఖ్య నేతలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బూత్ స్థాయిలో నేతలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. కాకినాడ డీ కన్వెన్షన్ సెంటర్లో పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ అధ్యక్షతన సోమవారం బూత్ స్థాయి పార్టీ నేతల సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ ఓట్ల తొలగింపులో జరిగే కుట్రలు, కుతంత్రాలను పార్టీలో బూత్ లెవెల్ నాయకులు సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమవ్వడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దీనిని అధిగమించేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు, కార్యకర్తల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశముందన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ వచ్చే నెల నుంచి బూత్ స్థాయి అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలిస్తారని చెప్పారు. బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. చంద్రబాబు, లోకేష్లు కలిసి జగన్పై చేస్తున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాకినాడలోని 6, 7, 8, 9, 13, 18, 19, 20, 21, 23, 30, 31, 32, 34, 35 డివిజన్లలో నాయకులు ఓటర్ల జాబితాలను జాగ్రత్తగా పరిశీలించాలని ద్వారంపూడి సూచించారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీవీఆర్ చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ నిర్వహణలో అనుసరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. పార్లమెంటు పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, కాకినాడ జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు ఒమ్మి రఘురామ్, కాకినాడ టాస్క్ఫోర్స్ సభ్యులు బి.వి.ఆర్.చౌదరి, కాకినాడ టాస్క్ఫోర్స్ ప్రతినిధి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, ప్రచార సెల్ ప్రతినిధి రావూరి వెంకటేశ్వరరావు, పార్టీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి పాల్గొన్నారు. -
సమస్యలు ఫుల్.. పరిష్కారం నిల్
● అర్జీలపై స్పందించని అధికారులు ● పదేపదే విన్నవిస్తున్నా పట్టించుకోని వైనం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పదేపదే తిరుగుతూ తమ సమస్యలను అధికారులకు మొర పెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వస్తున్న అర్జీలపై అధికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్లో ఒక సమస్యపై అనేక పర్యాయాలు తిరుగుతూ అర్జీలు అందజేస్తున్నా పరిష్కారం లభించడం లేదని పలువురు వాపోతున్నారు. కాకినాడ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో అర్జీలు అందించేందుకు ప్రజలు పోటెత్తారు. పింఛన్లు, భూసమస్యలు, భూ సర్వే, ప్రభుత్వ పథకాలు అందడం లేదని పలువురు అర్జీలు అందించారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్తోపాటు జిల్లా అధికారులు ప్రజల నుంచి 316 అర్జీలు స్వీకరించారు. -
ముగిసిన ఏసీఏ బౌలింగ్ టాలెంట్ హంట్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆంధ్రా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్ సంఘం సహకారంతో ఆర్ఎంసీ క్రీడామైదానంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఏసీఏ బౌలింగ్ టాలెంట్ హంట్ సోమవారంతో ముగిసింది. ఏసీఏ సీఓఓ గిరీష్ బౌలింగ్ స్వయంగా ఎంపికలను పర్యవేక్షించారు. ఏసీఏ కోచ్లు నగేష్, ఇజ్రాయేల్ రాజు ఎంపిక పోటీలు నిర్వహించారు. 600 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా కంచి సురేంద్ర గంటకు 132 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి హంట్లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. ఈ సందర్భంగా ఏసీఏ సీఓఓ గిరీష్ మాట్లాడుతూ జిల్లాలోని బౌలర్లు వేగంగా బౌలింగ్ చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు హరిష్, ఉపాధ్యక్షుడు నావాజ్, కార్యదర్శి వెంకటేష్, ఈసీ మెంబరు సత్యానందం పాల్గొన్నారు. సాంకేతిక లోపాలు సరి చేశాం!● కూలీలకు ఉపాధి కల్పనలో ఇబ్బంది లేకుండా చర్యలు పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సమస్యలు సరి చేసి కూలీలకు ఉపాధి కల్పనలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు డ్వామా పీడీ ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 22వ తేదీన ‘‘మీరు వైఎస్సార్ సీపీ వాళ్లు .. ఉపాధి పని ఇవ్వం ’’ అనే శీర్షికన వెలువడిన వార్తకు అధికారులు స్పందించారు. దుర్గాడ వెంకయ్య చెరువులో పనులు నిర్వహిస్తున్న 5 గ్రూపులకు చెందిన 120 మంది ఉపాధి కూలీలకు మస్తరు వేసే క్రమంలో ఎన్ఎంఎంఎస్ యాప్ లాగిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారికి ఉపాధి పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో కూలీలు ఆందోళనకు దిగారని ఈ గ్రూపుల కూలీలందరికీ మేట్ల ద్వారా మస్తర్లు వేసే ఏర్పాట్లు చేశామని, ఎటువంటి రాజకీయ వ్యత్యాసాలు లేవని అధికారులు తెలిపారు. ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు లాంగ్వేజ్ పరీక్షలో భాగంగా తెలుగు, కాంపోజిట్ తెలుగు పేపర్–1నిర్వహించారు. ఈ పరీక్షకు 1,445 మంది హాజరుకాగా 272మంది గైర్హాజరయ్యారు. ఓపెన్ స్కూల్ పరీక్షల్లో భాగంగా తెలుగు పరీక్ష నిర్వహించగా 799మంది హాజరుకాగా 168 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్ ఇంగ్లిష్ పరీక్షకు 1,201మంది హాజరుకాగా 174మంది గైర్హాజరయ్యారు. డీఈఓ పిల్లి రమేష్ మూడు పరీక్ష కేంద్రాలను, తనిఖీ అధికారులు మూడు కేంద్రాలు పరిశీలించారు. గౌతమి బోర్డు తిప్పేసిందా?బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడలో జయలక్ష్మి, కార్తికేయ సొసైటీలు బాధితులను ముంచిన ఘటనలు మరవకముందే మరో సొసైటీ వ్యవహారం వెలుగు చూసింది. నగరంలోని జన్మభూమి పార్క్ వద్దన్న గౌతమి సిటిజన్స్ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం బోడ్డు తిప్పేసిందన్న సమాచారంతో డిపాజిట్దారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు సంవత్సరాల నుంచి సహకార సంఘాలు సభ్యుల ఫిక్స్డ్ డిపాజిట్లు గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు సహకార సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ విచారణ చేయాలని జిల్లా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి సొసైటీ చైర్మన్ వాకలపూడి తిరుపతిరాయుడు నగరంలోని రిటైర్డు ఉద్యోగుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించినట్లు తెల్సింది. సంఘంలో పొదుపు చేసిన డిపాజిట్దారులు ఈ నెల 29, 30 తేదీల్లో స్థానిక ఎన్ఎఫ్ఎల్ రోడ్లోని సహకార సంఘ కార్యాలయంలో ఒరిజినల్ రసీదులతో హాజరు కావాలని డిపాజిట్దారులకు వర్తమానాలు అందాయి. గౌతమి సహకార సంఘంపై విచారణ చేయాలని కాకినాడ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జె శివకామేశ్వరరావును ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈనెల 29,30 తేదీల్లో బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా సహకార అధికారి శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా సంఘ చైర్మన్కు నోటీస్ ఇచ్చినట్లు చెప్పారు. -
ఉపాధి కూలీల ఆందోళన
పనులు కల్పించాలని ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయింపుకొత్తపల్లి: తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సోమవారం మండల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నాగులాపల్లికి చెందిన ఉపాధి కూలీలు ఆందోళన నిర్వహించారు. కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మండల రైతు కూలీ సంఘం నాయకుడు గుర్రాల అప్పారెడ్డి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్థానంలో తీసుకొచ్చిన విబిజి రాంజీ పథకం ఉద్దేశం ఉపాధి పనులను తగ్గించడమేనన్నారు. వంద రోజుల పని దినాలను 120 రోజులుగా పెంచుతామని చెప్పినా నిధులు మాత్రం కేటాయించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. నాగులాపల్లి పనులు చూపించకపోవడంతో కూలీలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కొత్త పథకాన్ని రద్దు చేసి పాత పథకాన్ని అమలు చేయాలని, ఫేస్ యాప్ను రద్దు చేయాలని డిమాండు చేశారు. కూలీలకు 200 రోజులు పనిదినాలు కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలన్నారు. ఆందోళన చేసేందుకు ఎంపీడీఓ కార్యాలయానికి వస్తే ఉపాధి పని కల్పిస్తున్నామంటూ ఆందోళనను చేపట్టరాదంటూ అధికారులు ఫోన్ చేసి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఐటీయూ నాయకులు కే.నాగేశ్వరావు, రైతు సంఘాల నాయకులు జి.వెంకట సుబ్బారెడ్డి, అబ్బిరెడ్డి అప్పారావు, నేరెళ్ళ రెడ్డి, పి.సత్యన్నారాయణ పాల్గొన్నారు. రెండు వారాలు కూడా పని కల్పించలేదు ఈ సంవత్సరంలో సుమారు రెం డు నెలలు పూర్తవుతున్నా రెండు వారాలు కూడా ఉపాధి పనులు కల్పించలేదు. – పి.సుబ్బిరెడ్డి, ఉపాధి కూలి నాగులాపల్లి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఉపాధి కూలీల పట్ల ఉపాధి సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్ధితి ఏర్పడింది. పనులు కల్పించే వరకూ ఆందోళన విరమించేది లేదు. – కె.అప్పన్న, ఉపాధి కూలి నాగులాపల్లి. -
భూమి మగతా డబ్బు ఇవ్వడం లేదు
వ్యవసాయ భూమికి సంబంధించిన మగతా డబ్బు ఇవ్వడం లేదు. ఇదే విషయంపై స్థానికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 2025లో తన వద్ద ఎకరం భూమి మగతాకు తీసుకొని డబ్బు ఇవ్వకుండా మా గ్రామానికి చెందిన బుర్తి కృష్ణంరాజు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బెంగతో నా భార్య వీరయ్యమ్మ మృతి చెందింది. నాకు న్యాయం చేయాలి. – దడాల పామురాజు, కోదాడ, తొండంగి మండలం. రెండేళ్లుగా తిరుగుతున్నా నాకు ప్రమాదం సంభవించడంతో రెండు కాళ్లూ సక్రమంగా పనిచేయడం లేదు. పింఛన్ కోసం రెండు సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ ఉంటే గానీ పింఛన్ ఇవ్వడం కుదరదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం తరచూ తిరగడం ఇబ్బందిగా ఉంది. – బల్లిపాటి శివాజీ, పిఠాపురం నా కుమార్తెకు ప్రాణదానం చేయండి నా కుమార్తె ఐశ్వర్యలక్ష్మికి చిన్నతనంలోనే లివర్ సమస్య వచ్చింది. గత ఏడాది నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. చికిత్సకు రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం రూ.10 లక్షలు మాత్రమే ఆర్యోగ్యశ్రీలో మంజూరు చేసింది. మిగిలిన డబ్బు కూడా మంజూరు చేస్తే హైదరాబాద్లో ఆపరేషన్ చేయించుకొని నా కుమార్తెను బతికించుకొంటాను. – ఎ చిన్ని, సామర్లకోట పట్టణం. -
పీహెచ్ఛీ!
ఇంకా ఎన్నో... ● జాస్ ప్రోత్సాహక నిధులు విడుదలయితే తమలో ప్రతి ఒక్కరి నుంచి రూ.800 చొప్పున వసూలు చేశారని ఓ ఎంఓపై ఎంఎల్హెచ్పీలు ఆరోపించారు. ● 2024లో పల్స్పోలియో ప్రోత్సాహక నిధుల్లో అవకతవకలకు పాల్పడ్డారని అదే పీహెచ్సీలోని మరో ఎంఓపై కూడా ఆరోపణలు వచ్చాయి. ● సూపర్వైజర్లయిన ఎంపీహెచ్ఈఓ, పీహెచ్ఎన్, ఎంపీహెచ్ఎస్లు ప్రతి రోజూ ఫీల్డ్కు వెళ్లకుండానే ఫీల్డ్ టూర్ అప్రూవల్ (ఎఫ్టీఏ) డబ్బులు డ్రా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ● పీహెచ్సీ పరిధిలోని 13 మంది ఏఎన్ఎంలను ఫీల్డు విజిట్లు చేయనీయకుండా స్టాఫ్ నర్సులు తమకు అసిస్టెంట్లుగా వాడుకుంటున్నారని చెబుతున్నారు. ● పీహెచ్సీ సేవలు సక్రమంగా లేవంటూ అక్కడి ప్రజలు నేరుగా తిమ్మాపురం ప్రజాదర్బారులో ఫిర్యాదులు చేశారు. ● 24 గంటలూ ఉంచాల్సిన పీహెచ్సీని చీకటి పడితే మూసేస్తున్నారని, రాత్రి వేళ డాక్టర్లు లేక సిబ్బందే వైద్యం చేసేస్తున్నారని స్థానిక నాయకులకు, ఉన్నతాధికారులకు చెప్పారు. ● హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల అద్దెలను వ్యక్తిగత ఖాతాల్లో జమ చేస్తున్నారనే ఆరోపణలు ఎంఓపై ఉన్నాయి. తక్కువ అద్దెను ఎక్కువగా చూపి మిగిలిన మొత్తాన్ని ప్రయోజనంగా పొందుతున్నారని అంటున్నారు. ● ఓ ఉద్యోగి మద్యం దుకాణంలో మద్యం కొనడాన్ని అక్కడి వారు వీడియో తీసి వైరల్ చేశారు. ఇది విధి నిర్వహణ సమయంలోనే అనే ప్రచారం ఉంది. ● పియర్ ఎడ్యుకేటర్, స్వస్థ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ ప్రోత్సాహకాలు అందలేదని ఈ ఏడాది ఏప్రిల్ 2న డీఎంహెచ్ఓకు ఎంఎల్హెచ్పీలు ఫిర్యాదు చేశారు. దీనికి ఎంఓనే కారణమని ఆరోపించారు. ● ఓ పీహెచ్సీలో ఇన్ని వివాదాలు చోటు చేసుకోవడం జిల్లాలోనే ఇది తొలిసారని ఉన్నతాధికారులే అంటున్నారు. ‘లెక్క’ లేదు ఈ నేపథ్యంలో ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా ప్రోగ్రామ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లక్ష్మి తేటగుంట పీహెచ్సీలో శనివారం విచారణ నిర్వహించారు. ఎన్హెచ్ఎం ప్రోత్సాహక నిధులు రూ.3 లక్షల వినియోగంపై లెక్కలు అడిగితే ప్రస్తుత ఎంఓ, ఎల్డీసీ నీళ్లు నమిలారని అంటున్నారు. నయాపైసాకు కూడా లెక్క లేదని, ఫర్నిచర్, స్టేషనరీ కొన్నామని బిల్లులు చూపించినా అవి సరైనవేననడానికి రుజువు చూపలేకపోయారని చెబుతున్నారు. చివరకు కాస్త సమయం కావాలని కోరడంతో డాక్టర్ లక్ష్మి తన విచారణను వాయిదా వేశారు. ఆమె అలా వెళ్లగానే ఎంఎల్హెచ్పీలను పీహెచ్సీకి పిలిపించి, స్టేషనరీ, ఫర్నిచర్ ఎప్పుడో కొన్నామని, ఎవరైనా అడిగితే ఇదే చెప్పాలని చెబుతూ సంతకాలు పెట్టించుకున్నారని సిబ్బంది చెబుతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష (జాస్) నిధులతో ఇప్పటికే కొన్నాం కదా.. ఆడిట్లో తేడా వస్తుందని చెప్పినా వినకుండా చెప్పింది చేయాలంటూ బలవంతంగా సంతకాలు పెట్టించారని ఆరోపిస్తున్నారు. ఈ పత్రాలనే తదుపరి విచారణలో విచారణాధికారికి సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు. ● వివాదాలకు కేంద్ర బిందువుగా తేటగుంట పీహెచ్సీ ● ఎన్హెచ్ఎం నిధుల అవకతవకల ఆరోపణలపై విచారణ ● ఎంఎల్హెచ్పీలతో రిజిస్టర్లో బలవంతపు సంతకాలు! ● వైద్యులు ఉండటం లేదని, సిబ్బందే వైద్యం చేస్తున్నారని ఫిర్యాదు ● పల్స్పోలియో ప్రోత్సాహకాల దుర్వినియోగం పైనా ఆరోపణలు కాకినాడ క్రైం: ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) నేడు అనేక వివాదాలకు నెలవుగా మారుతున్నాయి. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వాకం, అవినీతి వెరసి ఆసుపత్రుల ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. తుని మండలం తేటగుంట పీహెచ్సీపై వచ్చిన ఆరోపణలే దీనికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ పీహెచ్సీ పరిధిలోని 25 గ్రామాల్లో 7 సబ్ సెంటర్లు, 13 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల ద్వారా సుమారు 50 వేల మంది గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. పీహెచ్సీలో సుమారు 20 మంది, సబ్ సెంటర్లు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో 70 మంది కలిపి మొత్తం 90 మంది పని చేస్తున్నారు. వీరిలో కొందరి వల్ల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా బట్టబయలు తమకు రావలసిన ప్రోత్సాహకాల మొత్తం నేటికీ అందలేదని పూర్వపు మెడికల్ ఆఫీసర్ (ఎంఓ) ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తేటగుంట పీహెచ్సీలో 2023లో ఆమె పని చేసినప్పుడు ఢిల్లీ నుంచి నేషనల్ క్వాలిటీ అక్రిడిటేషన్ స్టాండర్డ్ (ఎన్క్యూఏఎస్) బృందం వచ్చి, తనిఖీలు చేసి, రాష్ట్రంలోనే ఉత్తమ పీహెచ్సీగా గుర్తించింది. దీనికి గాను ఎంఓకు, ఇతర సిబ్బందికి నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఆ మొత్తం మార్చి 16న ప్రస్తుత మెడికల్ ఆఫీసర్ ఖాతాలో జమ చేశారని, ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మోసం చేశారని, సుమారు రూ.3 లక్షలు దుర్వినియోగమయ్యాయనే అనుమానాలున్నాయని కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ)కి అప్పటి ఎంఓ సహా ఓ మినిస్టీరియల్ ఉద్యోగి, శానిటరీ వర్కర్ ఈ నెల 14న ఫిర్యాదు చేశారు. నామమాత్రపు మొత్తంతో సరి విషయం రచ్చవుతున్న తరుణంలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఫిర్యాదులు అందాక, డబ్బు వచ్చిన రెండు నెలల తర్వాత ఫిర్యాదీల ఖాతాల్లో నామమాత్రపు మొత్తాన్ని జమ చేశారు. తమకు రావలసిన మొత్తంలో ఇది కేవలం పదో వంతేనని ఎంఓ, సిబ్బంది అటున్నారు. అయితే, వారికిచ్చేవి వీటితో సరి అని అధికారులు చెబుతున్నారు. అదే నిజమైతే తాము ఫిర్యాదు చేసేంత వరకూ డబ్బులు వేయకపోవడం, తోచినంత వేయడమేమిటని ఎంఓ, సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. -
చిత్ర పరిశ్రమ సేవలు విస్తృతం
● ఆ దిశగా చర్యలు ● ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కాకినాడ రూరల్: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ సేవలను విస్తృతపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి (ఏపీ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) అధ్యక్షుడు అంబటి మధుమోహన్కృష్ణ, ఉపాధ్యక్షుడు పీవీఎస్ వర్మ, కార్యదర్శి మోహన్గౌడ్ తెలిపారు. వాకలపూడిలోని క్షత్రియ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన చాంబర్ సమావేశాన్ని మధుమోహన్కృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినిమా బాగా ఆడేందుకు బడ్జెట్తో పని లేదని, చిన్న చిత్రాలు సైతం విజయం సాధిస్తున్నాయని అన్నారు. అయితే, శంకరాభరణం వంటి హృదయానికి హత్తుకునే చిత్రాలు మాత్రం రావడం లేదని చెప్పారు. మంచి కంటెంట్ ఉంటే ఏ చిత్రమైన ప్రేక్షకులను రంజింపజేస్తుందన్నారు. రాష్ట్రంలో చిత్ర పరిశ్రమపై మక్కువ ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. మోహన్గౌడ మాట్లాడుతూ, ఏపీలో చలనచిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు చాంబర్ తరఫున జిల్లాలకు కో ఆర్డినేటర్లను నియమిస్తున్నామని చెప్పారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న కళాకారులు తమకు వివరాలు అందజేస్తే వాటిని వెబ్సైట్లో ఉంచుతామని, వారికి అవకాశాలు వచ్చే చాన్స్ ఉంటుందని అన్నారు. వర్మ మాట్లాడుతూ, ఎస్వీఆర్, సూర్యకాంతం, అంజలి, రావు గోపాలరావు వంటి గొప్ప కళాకారులు ఈ ప్రాంతానికి చెందినవారేనని గుర్తు చేశారు. దర్శకుడు సలాది సత్య మాట్లాడుతూ, తనది కాకినాడ జిల్లా ఉండూరు గ్రామమని, గ్రామీణ నేపథ్యంతో సినిమాలు తీయడంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ఆ విధంగానే ‘బెట్టింగ్ గ్యాంగ్ ఆఫ్ కాకినాడ’ సినిమా తీస్తున్నామని తెలిపారు. అనంతరం కో ఆర్డినేటర్లను ప్రకటించారు. చాంబర్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కో ఆర్డినేటర్లుగా సలాది శ్రీనివాసబాబు, కోటిపల్లి బుజ్జి, హిందూపురం కో ఆర్డినేటర్గా వెంకటేష్రెడ్డిలను నియమించారు. చాంబర్ సంయుక్త కార్యదర్శి పీడీఆర్ ప్రసాద్రెడ్డి ఆధ్వర్యాన దర్శకుడు సత్య సలాది అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు అందరినీ అలరించాయి. అలాగే, కాకినాడకు చెందిన ఆర్టిస్ట్ వెంకన్నబాబు చిరంజీవి డ్యాన్స్తో ఆకట్టుకున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తున్న చాంబర్ అధ్యక్షుడు మధుమోహన్కృష్ణ -
అలరించిన ‘గజల్’ గానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): స్థానిక సూర్య కళా మందిరంలో గజల్ శ్రీనివాస్ ఆలపించిన గజల్స్, భక్తి గీతాలు అందరినీ అలరించాయి. సరస్వతీ గానసభ, గజల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన తెలుగు గజల్స్ లెజెండ్, గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన మాస్ట్రో గజల్ శ్రీనివాస్చే 40 వసంతాల గజల్ గాన ఉత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస్తో పాటు సరస్వతీ గానసభ జీవితకాల అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీరామనరసింగరావు, గౌర వాధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యకుమారి మాట్లాడుతూ, 40 సంవత్సరాలు గా తన గజల్స్తో నిర్విరామంగా తెలుగు ప్రేక్షక శ్రోతలను మైమరపింపజేయడం శ్రీనివాస్కే సాధ్యమన్నారు. శ్రీనివాస్ మాట్లాడుతూ, 125 సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న, తెలుగు వారు గర్వించదగిన సరస్వతీ గానసభలో గజల్స్ ఆలపించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు కోదాడ రూరల్: ముందు వెళ్తున్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురం బైపాస్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి యోలో ట్రావెల్స్ బస్సు 36 మంది ప్రయాణికులతో శనివారం రాత్రి హైదరాబాద్కు బయల్దేరింది. ఆదివారం తెల్లవారుజామున కోదాడ సమీపాన బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు ముందు సీట్లలో కూర్చున్న ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారు హైదరాబాద్, విజయవాడ వెళ్లారు. తప్పిన ప్రమాదందేవీపట్నం: పాపికొండలు పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. దేవీపట్నం మండలం గండిపోశమ్మ ఆలయం వద్ద పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన బోటుకు ముందు భాగంలో పగులు ఏర్పడటంతో నీరు లోపలకు చేరింది. 40 మంది సామర్థ్యం ఉన్న ఈ బోటు పర్యాటకులతో తిరుగుతుంటుంది. ఈ బోటులో వెళ్లేందుకు 38 మంది ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. వారంతా ఆదివారం ఉదయం గండిపోశమ్మ ఆలయం వద్ద బోట్ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అయితే బోటులోకి నీరు చేరడాన్ని సిబ్బంది గుర్తించి ముందుగా ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు స్పందించి వేరే బోటులో పర్యాటకులను పంపించారు. -
టెట్పై టీచర్ల ఫైట్
అమలాపురం టౌన్: టెట్పై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలన్నీ ఫైట్ చేస్తున్నాయి. 2010 ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందిన వారిని టెట్ నుంచి మినహాయించాలనేది వారి ప్రధాన డిమాండ్. టెట్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, విద్యా శాఖ మంత్రి లోకేష్లు సానుకూలంగా ఇచ్చిన హామీని ఉపాధ్యాయులు విశ్వసించడం లేదు. సూపర్ సిక్స్, పీ–4 హామీల మాదిరిగానే టెట్ హామీని కూడా గాలికొదిలేస్తారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తున్న తమకు ఈ వయసులో అర్హత పరీక్ష ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 2010లో ఆర్టీఐ చట్టం వచ్చింది. అంతకుముందు నియామకాలు పొందిన ఉపాధ్యాయులను ఈ చట్టం నుంచి మినహాయించాలన్నది వారి మరో డిమాండ్. 2025 సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ టెట్ రాయాల్సిందేనని పేర్కొంది. అయితే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ఉపాధ్యాయ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఈ మేరకు పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. టీచర్లు మళ్లీ విద్యార్థులుగా మారాలి! ఉమ్మడి జిల్లాలో దాదాపు 18 వేల మంది ఉపాధ్యాయులున్నారు. టెట్ నిబంధనల మేరకు వీరిలో దాదాపు 7 వేల మందికి పైగా ఈ పరీక్ష రాసి నైపుణ్యాన్ని పరీక్షించుకోవాల్సిందే. దాదాపు 16 ఏళ్ల కిందట ఉద్యోగం పొందిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్ ఉత్తీర్ణులు కావడం కష్టమే. 150 మార్కులకు నిర్వహించే టెట్లో ఉత్తీర్ణత పొందాలంటే ఓసీ, బీసీ, ఎస్సీలు 50 నుంచి 90 శాతం మార్కులు తెచ్చుకుంటేనే కానీ ఈ గండం నుంచి గట్టెక్కలేరు. టెట్ పేపర్–1లో తెలుగు, ఇంగ్లిషు, గణితం, పర్యావరణం, శిశు సంరక్షణలకు చెందిన సబ్జెక్టుల కోసం ఉపాధ్యాయులు మళ్లీ విద్యార్థులుగా మారాలి. పేపర్–2లో బయో సైన్స్ ఉపాధ్యాయులు లెక్కలు, తెలుగు పండితులు సాంఘిక శాస్త్రం పేపర్లు విధిగా రాయాలి. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. టెట్ పాసైతేనే ఆ ఉపాధ్యాయులకు పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఉంటాయన్న నిబంధనపై కూడా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నోరు మెదపకపోవడంపై గురువులు గుర్రుగా ఉన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్న నిబంధన టెట్ పాసైతేనే పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఉంటాయని మెలిక 2010కి ముందు ఇన్ సర్వీస్ ఉన్నవారిని మినహాయించాలని డిమాండ్ -
రాజమహేంద్రవరం టు అరకు వ్యాలీ
సూపర్ లగ్జరీ బస్సు సర్వీసు ప్రారంభం రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం నుంచి అరకువ్యాలీకి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. ఈ సర్వీసును ఆదివారం ప్రారంభించారు. ఈ బస్సు ప్రతి రోజూ ఉదయం 5 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరి గోకవరం, రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, కేడీ పేట, చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు అరకువ్యాలీ చేరుకుంటుందని వివరించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు అరకువ్యాలీలో బయలుదేరి, అదే మార్గంలో రాత్రి 9 గంటలకు రాజమహేంద్రవరం చేరుకుంటుందని తెలిపారు. ఈ సర్వీసుకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామన్నారు. టికెట్టు ధర రూ.580గా నిర్ణయించామని చెప్పారు. -
అప్రమత్తంగా ఉండండి సర్
● ఓట్లు తొలగించకుండా చూడాలి ● తొలగిస్తే వెంటనే స్పందించాలి ● బూత్ లెవెల్ ఏజంట్లకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సూచన శంఖవరం: ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్)పై వైఎస్సార్ సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అర్హుల ఓట్లు తొలగించకుండా చూడాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఈ అంశంపై నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్లకు అన్నవరం కేకే ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సర్ పక్రియపై ఏజెంట్లకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలని చెబుతూ ఈ ప్రక్రియను సులభంగా అర్థమయ్యే రీతిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతంలో చాలా రాష్ట్రాల్లో సర్ ప్రక్రియతో కొంత మంది ఓట్లను తొలగించారని, దీనివలన చాలా మంది ఓటమి పాలయ్యారని చెప్పారు. అర్హుల ఓట్లు తొలగించకుండా సర్లో నిబంధనలు పాటించేలా బూత్ లెవెల్ ఏజెంట్లు చూడాలని కోరారు. వారికి ఎప్పటికప్పుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు సూచనలు చేయాలని రాజా ఆదేశించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా సర్ ప్రక్రియ జరిగితే, వెంటనే పార్టీ నేతలకు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో బూత్ లెవెల్ ఏజెంట్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకూ పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టి సారించాలని అన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైదని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తోందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జోన్–2 బూత్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీవీఆర్ చౌదరి, తుని నియోజకవర్గ పరిశీలకుడు వాసిరెడ్డి జమీల్, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్నదివాణం, బెహరా రాజరాజేశ్వరి దొరబాబు, మండల కన్వీనర్లు నరాల శ్రీను, రామిశెట్టి నాని, చింతకాయల సత్యనారాయణ, శిఘడం వెంకటేశ్వరరావు, గొల్లపల్లి సురేష్, పార్టీ నాయకులు శెట్టిబత్తుల కుమార్రాజా, వాసిరెడ్డి భాస్కరబాబు, వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అడపా సోమేష్, బదిరెడ్డి గోవింద్, గొల్లపల్లి కాశీ, గౌతు స్వామి, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు. సదస్సులో మాట్లాడుతున్న దాడిశెట్టి రాజా హాజరైన బీఎల్ఏలు, పార్టీ నాయకులు -
తలుపులమ్మ తల్లి భక్తులకు ‘ఆన్లైన్’ కష్టాలు
తుని రూరల్: లోవ దేవస్థానంలో ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటుతో.. తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు నానా అవస్థలూ పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం 23 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరందరూ పూజా టికెట్లు, ప్రసాదాలు, ఇతర సేవలకు ఆన్లైన్లోనే డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలుమార్లు విద్యుత్, ఇంటర్నెట్ మొరాయించడంతో ఆన్లైన్ సేవలకు పదేపదే అంతరాయం ఏర్పడింది. సమస్యను సిబ్బంది కొంత మేర పరిష్కరించినా.. గ్రా మీణ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడ్డారు. కొంత మందికి స్మార్ట్ ఫోన్లు లేకపోవడం, మరి కొంత మంది ఫోన్లలో నెట్ సిగ్నల్స్ సక్రమంగా లేకపోవడంతో అవస్థలు ఎదురయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కియోస్కులు పని చేసేలా యూపీఎస్లు ఏర్పాటు చేశామని దేవస్థానం ఈఓ పి.విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,13,448, పూజా టికెట్లకు రూ.3,67,702, కేశఖండన శాలకు రూ. 19,520, వాహన పూజలకు రూ.4,370, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.86,865, విరాళాలు రూ.13,992 కలిపి మొత్తం రూ.7,03,897 ఆదాయం సమకూరిందని వివరించారు. -
ధర్మం కాదు
20 నుంచి 30 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాలు చేస్తున్న వారిపై టెట్ కత్తి వేలాడదీయడం ధర్మం కాదు. 2010 ముందు ఇన్ సర్వీస్లో ఉన్నవారు పరీక్ష రాయాలన్న నిబంధనపై పార్లమెంట్ పునఃసమీక్షించాలి. – రాయుడు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి? అన్ని అర్హతలూ గుర్తించే కదా ఆనాడు ఉపాధ్యాయ ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా అర్హత పరీక్ష ఏమిటి? దీని నుంచి మినహాయింపు ఇవ్వాల్సిందే. – సరిదే సత్య పల్లంరాజు, ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అమలాపురం పదోన్నతులకు టెట్తో మెలిక సరికాదు ఉపాధ్యాయుల పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్లకు టెట్తో మెలిక పెట్టడం సరికాదు. విద్యా సంస్కరణలు చేయాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయి. – దీపాటి సురేష్బాబు, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ● -
సర్’ పేరుతో ఓట్లు తొలగిస్తారు జాగ్రత్త
● వైఎస్సార్ సీపీ శ్రేణులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కన్నబాబు ● రూరల్ నియోజకవర్గ బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం కాకినాడ రూరల్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లు తొలగించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ ఐదు బిల్డింగ్ సెంటర్ సమీపంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ రూరల్ నియోజకర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అధ్యక్షతన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమవ్వడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటరు, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం రీజినఅల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ‘సర్’ జరుగుతుందని, బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇళ్లకు వచ్చి ఓటర్ల జాబితాలు పరిశీలిస్తారన్నారు. మన పార్టీ తరఫున బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఎల్ఏలకు సహకరిస్తారని, అధికార పార్టీ ఒత్తిడితో ఓట్లు తొలగిస్తే పోరాడాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి జగన్మోహన్రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని కన్నబాబు పిలుపు ఇచ్చారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీవీఆర్ చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలకు ఎస్ఐఆర్ నిర్వహణలో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, రూరల్ నియోజవర్గ పరిశీలకుడు కొప్పన శివనాఽథ్, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యుడు వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, నాగఫణిబాబు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, నాయకులు కొప్పిశెట్టి గణేష్, రామదేవు సూర్య ప్రకాశరావు, చింతా ఈశ్వరరావు, పెంకే సత్తిబాబు, పంతం ఇందిరా, పి.సరోజ, శివకుమారి, సరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏటి గట్టుపై ఇసుక తొలగింపు
తాళ్లపూడి: గోదావరి ఏటిగట్టు రోడ్డుపై జారి పడిన ఇసుకను రెవెన్యూ అధికారులు తొలగించారు. రోడ్లపై పడుతున్న ఇసుక వల్ల వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులపై శనివారం సాక్షిలో ప్రచురితమైన ‘లారీల జోరు.. ప్రయాణికుల బేజారు’ కథనంపై స్పందించి తహసీల్దార్ లక్ష్మీ లావణ్య యుద్ధ ప్రాతిపతికన చర్యలు చేపట్టారు. ఇసుక రవాణా లారీల రాకపోకల్లో వాటి నుంచి పడుతున్న ఇసుక ప్రమాదాలకు కారణమవుతోంది. దీంతో తాడిపూడి, పైడిమెట్ట, ప్రక్కిలంక తదితర గోదావరి ఏటిగట్లపై పడిన ఇసుకను అధికారులు తొలగిస్తున్నారు. దివ్యాంగుల గ్రీవెన్స్కు 62 అర్జీలుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం శనివారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ ప్రజావాణి హాలులో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్ హరేంధిరప్రసాద్, డీఆర్వో డాక్టర్ టి.తిప్పెనాయక్, విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడి శ్రీనివాసులు హాజరై దివ్యాంగుల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. పెన్షన్లు, గృహం, సహాయ పరికరాల మంజూరు, విద్య, ఉపాధి, ఆరోగ్య సేవలు తదితర అంశాలపై 62 అర్జీలు అందాయి. వాటిని సంబంధిత శాఖలకు పంపి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో ‘క్లీన్ స్వీప్’ బోట్క్లబ్ (కాకినాడసిటీ): నగర సుందరీకరణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ హరేంధిరప్రసాద్ అన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. స్థానిక గాంధీనగర్పార్కులో శనివారం ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మరోసారి పెట్రో పిడుగు తాజాగా 97 పైసలు పెంపు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కేంద్ర ప్రభుత్వం శనివారం మరోసారి పెట్రో ధరలు పెంచింది. తాజాగా 97 పైసలు పెంపుతో ప్రజలపై పెనుభారం పడనుంది. గడిచిన 13 రోజుల వ్యవధిలో పెట్రో ధరలు పెరగడం ఇది మూడోసారి. జిల్లాలో లీటరు పెట్రోలు రూ.110.05 ఉండేది. అది కాస్తా రూ.3.29 పెంపుతో లీటరు రూ.113.34 అయ్యింది. తాజా పెంపుతో లీటరు రూ.115.08కు చేరింది. డీజిల్ సైతం తాజా పెంపుతో రూ.102.72కు పెరిగింది. ఆకట్టుకున్న ‘లయ విన్యాసం’ముగిసిన త్యాగరాజ సమితి అమృతోత్సవం ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో పెరవలి జయభాస్కర్ బృందం లయ విన్యాసం ఆకట్టుకుంది. సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో 18 రోజుల పాటు సాగిన కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు శనివారం సాయంత్రం పెరవలి జయభాస్కర్ బృందంచే లయ విన్యాసం పేరిట వాద్య సమ్మేళనం హృద్యంగా సాగింది. కళాకారులు, కార్యవర్గంతో కలిసి మహా మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి జ్యోతి ప్రకాశనం చేశారు. విశ్వనాథం భాస్కర రామ్, వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్ వెంకట్రావు, జోస్యుల సరస్వతి, వక్కలంక శ్రీరామచంద్రం, వి.కృష్ణకుమారి తదితర సమితి కార్యవర్గం పర్యవేక్షించింది. శ్రీనివాసా.. శ్రీవేంకటేశా ఆత్రేయపురం: భానుడు ఉగ్రరూపం దాల్చినా.. భక్తిభావం సడలలేదు.. ఆ శ్రీనివాసుని దర్శనానికి భక్తజనం క్యూ కట్టింది. వాడపల్లిలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం శనివారం కిక్కిరిసింది. సుమారు 80 వేల నుంచి లక్ష వరకూ వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. తెల్లవారుజాము నుంచే రద్దీ నెలకొంది. -
ప్రజలపై ప్రకృతి ముప్పేట దాడి
● ఎండలు, ఈదురు గాలులు, భారీ వర్షంతో ప్రజల బెంబేలు ● తునిలో నేల కొరిగిన చెట్లు ● మామిడి రైతులకు నష్టం తుని/తుని రూరల్: భానుడు ఓ వైపు, వరుణుడు మరో వైపు, వాయుదేవుడు ఇంకోవైపు ప్రజలను అల్లాడిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఉదయం నిప్పు కొలుమిలా భానుడు మాడుస్తుంటే, సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షంతో వరుణుడు భయపెడుతున్నాడు. పట్టణంలోని కొబ్బరితోట, పార్కు సెంటర్, అమ్మాజీపేట తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపోవడంతో ఆ శాఖ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. చెట్లు కూలిపోవడంతో వాహనచోదకులు ఇబ్బందిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ వెంకట్రావు, డీఈఈ సతీష్ సత్వర చర్యలు చేపట్టి వాటిని తొలగిస్తున్నారు. పక్వానికి వచ్చిన మామికాయలు రాలిపోయి రైతులకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు తొండంగి తీరప్రాంతంలో బోటు విరిగిపోయింది. తలుపులమ్మతల్లి దర్శనానికి వెళ్తున్న భక్తుల కారుపై చెట్టు కొమ్మలు విరిగిపడడంతో వారు ఆందళనకు గురయ్యారు. ఈ విషయం తెలియడంతో దేవస్థానం సిబ్బంది, రూరల్ పోలీసులు హుటాహుటిన వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కారుపై పడిన కొమ్మలను తొలగించి భక్తులను రక్షించారు. -
వడగాడ్పులకు వ్యవసాయ కూలీ మృతి
సామర్లకోట: స్థానిక కుమ్మరి వీధికి చెందిన వ్యవసాయ కూలీ లోడ సతులు (55) వడగాడ్పులకు గురై శుక్రవారం రాత్రి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు పనికి వెళ్లిన సతులు ఇంటికి వచ్చిన వెంటనే కుప్పకూలిపోయాడని, వెంటనే అతడిని మంచంపై పడుకొపెట్టి సేద తీరుస్తుండగా కొంత సేపటికే మృతి చెందాడని వారు తెలిపారు. సుమారు ఐదేళ్ల క్రితమే కుమారుడు చనిపోవడంతో కోడలు గంగ, భార్య చంద్ర, మనవడు సాత్విక్లను సతులే పోషిస్తున్నాడు. అతడి మృతితో ఆ కుటుంబానికి ఆధారం లేకుండా పొయింది. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ పట్టణ అధ్యక్షుడు దర్శిపాటి సత్యానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డికి వినతి పత్రం అందజేసినట్టు దర్శిపాటి తెలిపారు. కొత్త సూరవరంలో.. తుని రూరల్: ఎస్.అన్నవరం పంచాయతీ కొత్త సూరవరం గ్రామానికి చెందిన తోట యేసుబాబు (40) వడగాడ్పునకు గురై మృతి చెందినట్టు వీఆర్వో సత్యవతి శనివారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల మేరకు యేసుబాబు శుక్రవారం పనికి వెళ్లి వచ్చి ఇంటి వద్ద రాత్రి ఎనిమిది గంటల సమయంలో నీరసించి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే తుని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే1 మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించాన్నారు. యేసుబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె, తండ్రి ఉన్నారు. -
ప్రచండాడుతున్నాడు!
సాక్షి, రాజమహేంద్రవరం: భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యా ప్తంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వ రకు తన విశ్వరూపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీనికి వడగాలులు తోడై ప్రాణాలు తోడేస్తున్నాయి. ఐదు రోజులుగా ఈ పరిస్థితి మరింత ఎక్కువై గరిష్టంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 50 మందికి పైగా వడదెబ్బతో మృతి చెందినట్టు సమాచారం. గతంలో ఎన్నడూ లేనంతగా.. కొన్నేళ్ల గణాంకాలు పరిశీలిస్తే నమోదవుతున్న ఉష్ణోగ్రతలు 42 నుంచి 43 డిగ్రీల లోపే. ఈ ఏడాది భానుడు ప్రచండుడైపోయాడు. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయని నిపుణలు వెల్లడిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, మొక్కలు పెంచకపోవడం, ఉన్నవాటిని నరికేయడం తదితర కారణాలు ఇందుకు ప్రధాన కారణమని వారంటున్నారు. పచ్చని చెట్ల స్థానే లే అవుట్లు వేయడం, ఇటుక బట్టీలకు కలపగా వినియోగించడం కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయంటున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు భీతిల్లుతున్న ప్రజలు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. సాయంత్రం 7 గంటల వరకు వేడి కొనసాగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు సైతం 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని పనివారు డీహైడ్రేషన్కు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఉపశమన చర్యలు శూన్యం ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపశమన చర్యలు తీసుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీటి సదుపాయం కల్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల ఒకటో తేదీన ఆదేశాలు జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితి లేదు. జీజీహెచ్కు బాధితులు కాకినాడ, రాజమండ్రి, కోనసీమ జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య శాలలకు వడదెబ్బ బాధితులు క్యూ కడుతున్నారు. ఐదు రోజులుగా డీహైడ్రేషన్, త లనొప్పి, నీరసం సమస్యలతో వ స్తున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉమ్మడి జిల్లాలో రోజుకు 300 మందికి పైగా ఇలా వైద్యులను ఆశ్రయిస్తున్నారు. 30 మందికి పైగా ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. నిర్థారణ ఇలా.. ● వడదెబ్బ మృతిగా నిర్థారించాలంటే సదరు మృతుని సంబంధీకులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ● మృతదేహానికి తప్పనిసరిగా పోస్టుమార్టం నిర్వహించాలి. రెవెన్యూ అధికారుల శవ పంచనామా, మధ్యవర్తుల రిపోర్టు పోలీసు విచారణ వంటివి జరిపి నిర్థారించాలి. ● వడదెబ్బతో మృతి చెందినవారికి అంతిమ సంస్కారం చేస్తున్నారు తప్ప పోలీసు ఫిర్యాదును విస్మరిస్తున్నారు. ● గతంలో ప్రభుత్వం నిబంధనలు సడలించి వైద్యాధికారి, పోలీసు సబ్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్లతో త్రిసభ్య కమిటీ నియమించింది. ఆ కమిటీలు దరఖాస్తులను పరిశీలించి మృతుల ఇళ్లకు వెళ్లి నిర్థారించాల్సి ఉంది. ● వాటిని కలెక్టరేట్కు నివేదిస్తే ఆ మేరకు ప్రభుత్వం పరిహారం నిధులు విడుదల చేస్తుంది. ● కానీ ఈ ఏడాది ప్రభుత్వం నిర్థిష్ట ప్రకటన చేయకపోవడంతో ఫిర్యాదులు లేక సంబంధిత నిధుల విడుదలలో సైతం మొండి చేయి చూపుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత నాలుగు రోజులుగా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇలా.. వారం కనిష్టం గరిష్టం మంగళవారం 37 45బుధవారం 37 45 గురువారం 39 46 శుక్రవారం 39 46 శనివారం 37 45నిడదవోలు రూరల్ మండలానికి చెందిన గారపాటి ధర్మతేజ (24) వడదెబ్బతో శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందారు. ఉష్ణోగ్రతలతో అస్వస్థతకు గురికావడంతో అతని కుటుంబ సభ్యులు నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎన్నో తలెత్తుతున్నాయి.కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గ సర్పవరం గ్రామానికి చెందిన గుర్రం అప్పన్న పారిశుద్ధ్య కార్మికుడు. విధి నిర్వహణలో ఉండగా ఎండ వల్ల అస్వస్థతకు గురయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. అతడి మృతితో కుటుంబలో విషాదం నెలకొంది. అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో పిట్టల్లా రాలుతున్న జనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి వడదెబ్బకు పదుల సంఖ్యలో మరణాలు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉపశమన చర్యలు శూన్యం -
కడలికి కల్యాణ శోభ..
● ప్రీ వెడ్డింగ్ షూట్లకు వేదికగా సాగరతీరం ● బోటులో ఫొటో షూట్, క్యాంప్ఫైర్లు ● యువతను ఆకట్టుకుంటున్న సుందర దృశ్యాలు ప్రాతః.. సాయం సంధ్యలలో సాగరాలు.. తీరాలు.. ఇసుక తిన్నెలు.. ఒడ్డున ఉండే నున్నని రాళ్లు.. వాటిపై ఉవ్వెత్తున ఎగసి విరుచుకుపడే అలలు.. వీచే బలమైన గాలులకు ఆ అలల అంచుల విన్యాసాలు.. ఆ అంచులతో రవి కిరణ సంయోగాలు.. ఒకటా రెండా.. వర్ణనకు అందని సాగర సోయగాలు ఎన్నో. రవి కాంచని చోట కవే కాదు.. కెమెరా కన్నూ కాంచును. ఆ అందాలను పొదివిపట్టి కొత్త కాంతులు అద్ది వారి జీవితాలకు కొత్తందాలు తెచ్చుకుంటున్నారు ఈనాటి యువత. పిఠాపురం: ఆధునిక కాలంలో వివాహానికి ముందు జరిగే తంతుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి వచ్చి చేరింది. మనసుకు కెమేరా కన్ను.. కళాదృష్టి ఉన్న ప్రతి ఒక్కరూ సాగరతీరాల సోయగాలను తన ఆల్బమ్లో బంధించకుండా ఉండడు. ఈ అందాలను ప్రీ వెడ్డింగ్ షూట్లలో బంధించి వధూ వరుల చిత్రాలను మరింత అందంగా చిత్రించి చక్కని టైటిల్స్తో ఫొటో, వీడియో ఆల్బమ్లను తయారు చేసి సంక్షిప్త ఇన్విటేషన్లుగా వాట్సప్లలో పంపుతూ.. పూర్తిగా వివాహ వేడుకల్లో ప్రదర్శిస్తూ వేడుకను మరింత ద్విగుణీకృతం చేస్తున్నారు. ఆ మధ్య అంతగా సినిమా షూటింగ్లు లేకపోయినా ఉప్పెన చిత్రంతో మళ్లీ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సాగర తీరంలో క్లాప్లు, రోల్ కెమేరాలు, యాక్షన్ల అరుపులు వినిపిస్తున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లు సైతం చకచకా సాగిపోతున్నాయి. ఒకప్పుడు మంచు కురిసే వేళల్లో.. వసంత కాలాల్లో.. క్యాంప్ఫైర్ వీడియోలతో ఏజెన్సీ కళకళలాడేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. చాలా మంది నేడు ఈ షూట్ల కోసం సాగరతీరాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాకినాడ నుంచి తుని సమీపంలో అద్దరిపేట వరకు ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలో హోప్ఐలాండ్, మడ అడవులు పచ్చని చెట్లతో లోకేషన్లు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో ఇక్కడ షూటింగ్లు చేసేందుకు ఎక్కువ జంటలు ఆసక్తి చూపుతున్నారు. ప్రీ వెడ్డింగ్ స్పాట్గా ఉప్పాడ ఇప్పటి వరకు సినిమా షూటింగ్లకు నెలవుగా ఉన్న ఉప్పాడ సాగర తీరం ప్రీ వెడ్డింగ్ స్పాట్గా మారింది. ఈ ప్రాంతంలో షూటింగ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఉప్పుటేరుల్లో బోటు షికారు కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. కాబోయే నూతన జంటల బోటు షికారు వీడియోలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. సెట్టింగ్లతో పనిలేదు కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్లు చేస్తే సెట్టింగ్లతో పని ఉండదు. ప్రకృతి అందాలే చాలు. స్థానికుల సహకారం చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. – సాగర్, డిజిటల్ ఫోటో వీడియో గ్రాఫర్, ఉప్పాడ చాలా థ్రిల్ ఫీలయ్యాం సాధారణంగా ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే ఎక్కడో మారేడుమిల్లి, గుడిసె వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాని ఉప్పాడ సాగరతీరం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాం. సాగరతీర అందాలు మమ్మల్ని కట్టి పడేసాయి. బోటు షికారు వీడియో చాలా బాగుంది. ఇసుక తిన్నెల్లో క్యాంప్ఫైర్ బాగుంది. ఇక్కడ షూటింగ్ వల్ల డబ్బు, సమయం ఆదా అయ్యాయి. – గోపీనాథ్, కాకినాడ ఉషోదయాన సిందుర వర్ణపు సాగరంలో ఓ జంట లాహిరి.. ఉప్పాడ సాగరతీరం ఏరియల్ వ్యూ -
సయ్యంటే సై అన్న ఎద్దులు.. జనాల్లో భయం..!
కాకినాడ: ఏ విషయంలో తేడా వచ్చిందో ఏమో.. సయ్యంటే సైయ్యంటూ ఢీకొన్నాయీ వృషభరాజాలు. సహజంగానే బలిష్టంగా ఉండే ఆ ఎద్దులు నడిరోడ్డుపై అలా వీరంగం సృష్టింస్తుంటే చుట్టుపక్కల వారు.. వాహన చోదకులు.. పాదచారులు ఒకింత భీతిల్లారు. ఏ మాత్రంఅదుపుతప్పి అవి తమ మీద పడినా అంతే సంగతులు. ఓ అరగంట తరవాత అవే అలసిపోయి తలోదారీ వెళ్లాక కానీ వారి ఆందోళన తీరలేదు. అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్లో శుక్రవారం ఉదయం ఈ వీరంగం స్థానికులకు గగుర్పొడిచేలా సాగింది. -
వడదెబ్బకు 14 మంది మృతి
పిఠాపురం రూరల్/కాకినాడ రూరల్/సీతానగరం/నిడదవోలు రూరల్/ఆత్రేయపురం: తీవ్రమైన ఎండలు, వడగాడ్పులకు తాళలేక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రెండు రోజుల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. పిఠాపురం నియోజకవర్గంలో ఒకే రోజు ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గొల్లప్రోలు మండలం చెందుర్తికి చెందిన పిల్లి రమణ (55) ఉపాధి పని చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిఠాపురం సినిమా సెంటర్లో కొల్లు అప్పారావు, అన్న క్యాంటీన్ వద్ద ఓ యాచకుడు, పాదగయ క్షేత్రం వద్ద లారీ డ్రైవర్, మండలంలోని గోకివాడలో దూలపల్లి అప్పారావు (43), ఎఫ్కే పాలెం మద్యం దుకాణంలో పని చేస్తున్న కొమ్ము వెంకట రమణ (44) వడదెబ్బతో మృతి చెందినట్టు ఎస్సై ఎస్కే జానీబాషా తెలిపారు. కాకినాడ రూరల్ భావనారాయణపురానికి చెందిన గుర్రం అప్పన్న (38) సర్పవరం గ్రామ పంచాయతీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికుడు. విధి నిర్వహణలో వడద్బెకు గురైన అతడు జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాడిమళ్లలో వైఎస్సార్ సీపీ గ్రామ యువజన నాయకుడు గారపాటి ధర్మతేజ (24) ఎండవేడిమితో డీహైడ్రేషన్కు గురై శుక్రవారం మృతి చెందారు. సీతానగరం మండలం చినకొండేపూడిలో పెడూరి చిట్టిబాబు (33), వెలమపేటలో 58 ఏళ్ల వ్యక్తి గురువారం రాత్రి మరణించారు. పురుషోత్తపట్నం పంచాయతీ రామచంద్రపురంలో కండవల్లి మంగమ్మ (88) శుక్రవారం మృతి చెందారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వెలిచేరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్న నాగిరెడ్డి రాముడు (60), నాగిరెడ్డి పనస రాముడు (75) వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఉచ్చిలి గ్రామానికి చెందిన మాగాపు శ్రీను (45) వడగాలుల ప్రభావంతో గుండెపోటుకు గురై మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. -
నాలుగు నెలలుగా అందని జీతాలు
తుని రూరల్: నాలుగు నెలలుగా జీతాలు అందకపోవడంతో ఎస్.అన్నవరం మేజర్ పంచాయతీలో పని చేస్తున్న 25 మంది పారిశుధ్య కార్మికులు అల్లాడిపోతున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యపై కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్కు వినతి పత్రం అందజేశారు. పని చేస్తేనే కానీ పూట గడవని తమకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని, దీంతో, కుటుంబాన్ని పోషించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు అందకపోయినా మండుటెండలో సైతం పారిశుధ్య పనులు చేస్తున్నామని చెప్పారు. తమ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని కార్మికులు తెలిపారు. జూలై నెలాఖరుకు నాట్లు పూర్తి చేయాలి కరప: ఎల్నినో ప్రభావంతో వచ్చే ఖరీఫ్లో 18 నుంచి 20 శాతం వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశముందన్న వాతావరణ శాఖ అంచనాకు అనుగుణంగా.. వరి సాగులో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు (జేడీ) ఎన్.విజయ కుమార్ రైతులకు సూచించారు. కూరాడ, వేములవాడ గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన రైతులతో సమావేశమై పలు సూచనలిచ్చారు. జూలై నెలాఖరుకల్లా వరి నాట్లు పూర్తి చేసుకోవాలన్నారు. వాతావరణం వేడిగా ఉన్నందు వల్ల వరి సాగులో వెదజల్లే విధానం వెళ్లకపోవడమే మంచిదని చెప్పారు. స్వర్ణ (ఎంటీయూ–7626) రకానికి ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఎంటీయూ–1318 రకం విత్తనాన్ని ఈ ఖరీఫ్లో వేయవద్దని విజయ కుమార్ సూచించారు. కార్యక్రమంలో ఎంఏఓ ఇమ్మిడిశెట్టి సత్య పాల్గొన్నారు. ‘పద్మావతి’ పనితీరుపై పరిశీలన తొండంగి: రత్నగిరిపై శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్పై పారిశుధ్య సిబ్బంది నుంచి పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ‘ఇలాగైతే ఎలా పద్మావతీ!’ శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించారు. పారిశుధ్య పనుల నిర్వహణకు ఆ సంస్థ సక్రమంగా మెటీరియల్ ఇవ్వడం లేదని, ఇబ్బందులపై ప్రశ్నిస్తే తొలగిస్తామంటూ బెదిరిస్తోందని సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సత్రాల్లోని రూముల్లో ఏర్పాటు చేస్తున్న బెడ్షీట్లు, దుప్పట్లు, ఇతర మెటీరియల్ను ఈఓ స్వయంగా పరిశీలించారు. అవి శుభ్రంగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్వైజర్, అధికారుల పర్యవేక్షణ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మావతి సంస్థ ఏర్పాటు చేసిన వాషింగ్ మెషీన్లు పని చేయడం లేదని శానిటరీ అధికారులు బదులిచ్చారు. దీంతో, సంస్థ నిర్వహణ తీరుపై ఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ శాఖాపరంగా నోటీసులు ఇచ్చి, చర్యలు తీసుకోవాలని కింది స్ధాయి అధికారులను ఆదేశించారు. -
జూన్ 5 నుంచి ‘సర్’
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం జూన్ 5న ప్రారంభమవుతుందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు వీలుగా జూన్ 5 నుంచి 14వ తేదీ వరకూ బీఎల్ఓలు, రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఎన్నికల అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్లు అందజేసి, నింపిన వాటిని తిరిగి సేకరిస్తారన్నారు. అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురిస్తారని, వీటిపై జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారని తెలిపారు. ప్రజల నుంచి అందిన వినతులు, అభ్యంతరాలను జూలై 21 నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ ఈఆర్ఓలు పరిశీలించి, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాలు ప్రకటిస్తారని పేర్కొన్నారు. ఈఆర్ఓలు తిరస్కరించిన వాటిపై కలెక్టరుకు అప్పీలు చేసుకోవచ్చన్నారు. జూలై ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అనర్హులను తొలగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. -
రెండు ఆలయాలకు.. ఒకే ఒక్కడు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేవదాయ శాఖలో జోడు గుర్రాల సవారీ పరిపాటిగా మారింది. కారణాలేమిటో తెలీదు కానీ రెండు మూడు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా నియమిస్తున్నారు. చిన్న చిన్న ఆలయాలకు ఇలా నియమిస్తున్నారంటే పోనీలే అనుకోవచ్చు. కానీ, లక్షల మంది భక్తులు.. రూ.కోట్ల ఆదాయం వస్తున్న ప్రముఖ పుణ్యక్షేత్రాలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఇదే ఫార్ములా అమలు చేస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన కాకినాడ జిల్లా అన్నవరం సత్యనారాయణస్వామి, కోనసీమ జిల్లా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయాలకు నిత్యం వేలాదిగా భక్తులు వస్తూంటారు. ఈ ఆలయాలకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను ఈఓలుగా నియమించాలి. కానీ, రెండు ఆలయాలకు కలిపి నల్లం సూర్యచక్రధరరావుకు బాధ్యతలు అప్పగించారు. భక్తుల నుంచి రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా ఈ రెండు ఆలయాల నిర్వహణ బాధ్యతలను ఒకే ఈఓకు ఎలా అప్పగిస్తారనే ప్రశ్న వస్తోంది. జిల్లాల పునర్విభజన అనంతరం ఎక్కడ పని చేస్తున్న ఈఓలకు అదే జిల్లాలో బాధ్యతలు అప్పగించాలనే నిబంధన కూడా ఉందని అంటున్నారు. పైగా ఈ రెండు ఆలయాలు దగ్గర్లో ఉన్నవి కావు. రెండింటి మధ్య దూరం 100 కిలోమీటర్ల పైనే. అంత దూరం ఉన్న రెండు ఆలయాల బాధ్యతలను ఒకే ఒక్క ఈఓ ఎలా పర్యవేక్షిస్తారనే కనీస ఆలోచన లేకపోవడం విమర్శల పాలవుతోంది. దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గతంలో అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేశారు. అన్నవరం, వాడపల్లి ఆలయాల విశిష్టత ఆయనకు తెలియంది కాదు. అయినప్పటికీ ఈ రెండు ఆలయాలకు ఒక్కరినే ఈఓగా ఎలా కొనసాగిస్తురనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. తలకు మించిన భారం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఏడు వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన తరువాత వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. శుక్ర, శనివారాల్లో భక్తుల సంఖ్య 70 వేలకు పైనే ఉంటోంది. హుండీ ఆదాయం రోజువారీ ఐదారు లక్షల రూపాయలు, నెలకు రూ.కోటిన్నర పైనే ఉంటోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.6.25 కోట్లతో వకుళమాత శాశ్వత అన్నదాన భవనం నిర్మాణానికి అప్పట్లోనే శంకుస్థాపన చేశారు. ఈ పనులు కొనసాగుతున్నాయి. ఆలయం ఎదురుగా రూ.2 కోట్లతో కోనేరు నిర్మిస్తున్నారు. వీటితో పాటు రథశాల, శ్రీనివాసం వసతి భవనం సహా పలు అభివృద్ధి పనులు రూ.20 కోట్లతో జరుగుతున్నాయి. రెండుచోట్ల పార్కింగ్ స్థలాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇన్ని పనుల పర్యవేక్షణే ఇక్కడి ఈఓ చక్రధరరావుకు తలకు మించిన భారంగా ఉండగా.. ఆయనకే అన్నవరం దేవస్థానం ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్న వస్తోంది. అన్నవరం క్షేత్రానికి నిత్యం 30 వేల నుంచి 40 వేల మంది వరకూ భక్తులు వస్తూంటారు. అదే కార్తిక పౌర్ణమి, ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షకు పైనే వస్తారు. ఏటా 6 లక్షలకు పైగా సత్యనారాయణస్వామి వ్రతాలు జరుగుతూంటాయి. గత ఏడాది ఆదాయం రూ.160 కోట్లు రాగా.. ఈ ఏడాది రూ.170 కోట్లు వస్తుందనే అంచనా ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ కింద రూ.40 కోట్లతో అన్నదాన భవనంతో పాటు పలు పనులు జరుగుతున్నాయి. శిథిలావస్థకు చేరిన సీతారామస్వామి సత్రం స్థానంలో దేవస్థానం నిధులు రూ.12 కోట్లతో 135 గదుల వసతి బ్లాక్ నిర్మాణం జరుగుతోంది. ఇన్ని కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్న ఈ రెండు ఆలయాల బాధ్యతను ఒకే ఈఓకు అప్పగించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పలువురు ఆక్షేపిస్తున్నారు. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శనివారాల్లో వాడపల్లి, సోమవారం సహా మరో రెండు రోజులు అన్నవరంలో ఆయన విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రెండు ఆలయాల పర్యవేక్షణ ఆయనకు మరింత భారంగా మారుతోంది. పర్యవసానంగా పాలన గాడి తప్పుతోందనే విమర్శలు వస్తున్నాయి. అన్నవరం.. ఇన్చార్జితోనే సరి కృష్ణా జిల్లా నుంచి బదిలీపై వచ్చిన సూర్యచక్రధరరావు వాడపల్లి ఈఓగా నియమితులై రెండేళ్లవుతోంది. గత నెలలో దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణరెడ్డి వాడపల్లి, అన్నవరం దేవస్థానాల్లో పర్యటించారు. ఆయన వాడపల్లిలో ఉండగానే చక్రధరరావును అన్నవరం దేవస్థానం ఇన్చార్జిగా నియమిస్తున్న విషయం బయటకు వచ్చింది. మంత్రి పర్యటన ముగియగానే చక్రధరరావును గత నెల 13న అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. అప్పటికే 4 నెలలుగా అన్నవరం ఇన్చార్జి ఈఓగా పని చేస్తున్న దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ వి.త్రినాథరావును ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానానికి బదిలీ చేశారు. అప్పుడు, ఇప్పుడు కూడా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానానికి ఇన్చార్జి ఈఓతోనే సరిపెట్టడంలో ఆంతర్యమేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అన్నవరం, వాడపల్లి దేవస్థానాలకు ఒక్కరే ఈఓ రెండు క్షేత్రాల్లో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పర్యవేక్షణలో ఇబ్బందులు దూరాభారంతో సతమతం సర్కారు నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు -
హామీలు నెరవేర్చకుండా జగన్పై ఆరోపణలా?
యనమలపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఫైర్ తుని రూరల్: ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్న హామీలు, విద్య, వైద్యం, అమరావతిలో అవినీతిపై సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రెస్మీట్లో అడిగితే.. సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దాడికి దిగడమేమిటని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. తుని మండలం ఎస్.అన్నవరం శివారు సాయి వేదికలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్ జగన్ విలేకర్ల సమావేశంలో చెప్పిన అంశాలపై యనమల విమర్శించడాన్ని ఖండించారు. ‘వివేకం’ సినిమా చూస్తే జగన్ ఎంత చెడ్డవారో అర్థమవుతుందని యనమల అంటున్నారని, ఈ వయస్సులో ఆ సినిమాను ప్రమోట్ చేయడం ఆయనకు అవసరమా అని రాజా ప్రశ్నించారు. సినిమాలే ప్రామాణికం అనుకుంటే గతంలో సూపర్స్టార్ కృష్ణ మీ నాయకుల గురించి ఎన్నో సినిమాలు తీశారని గుర్తు చేశారు. వంగవీటి మోహన రంగా, వంగవీటి రాధ జీవిత చరిత్రపై ‘చైతన్య రథం’ అనే సినిమా తీశారని చెప్పారు. ఆ సినిమాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సూపర్ హిట్ చేశారన్నారు. అది మీ జాత్యహంకారం మీద తీసిన సినిమా అని అన్నారు. అటువంటి సినిమా ప్రింట్లను దహనం చేసిన పరిస్థితులు ప్రజలకు తెలుసని చెప్పారు. రాష్ట్రంలో ఒక పెత్తందారీ వ్యవస్థ ఆ ప్రింట్లన్నీ అందుబాటులో లేకుండా చేసిందని మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఇదేనన్నారు. ‘అసెంబ్లీ రికార్డులు చూడండి. తన ప్రాణానికి హాని ఉందని వంగవీటి మోహన రంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. ఆ అంశం ఈ రోజుకూ అసెంబ్లీ రికార్డుల్లో ఉందన్నారు. ‘యనమలా.. ఆ రోజు మీరు అసెంబ్లీలోనే ఉన్నారు కదా. రంగా సోదరుడు రాధాను పొట్టను పెట్టుకున్నారు. రంగా గారినీ వదల్లేదు’ అని మండిపడ్డారు. ధైర్యం ఉంటే జగన్మోహన్రెడ్డి మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పని మాని వెన్నుపోటు పొడిచారని, జగన్ జీన్స్ గురించి, ఆయన వ్యక్తిగత విషయాలు మాట్లాడతారా అని ప్రశ్నించారు. మరి మన జీన్స్ ఏమిటో కూడా చెప్పాలని ఎద్దేవా చేశారు. ‘మీ వ్యక్తిగత చరిత్ర అంత పరిశుభ్రంగా ఉందా? మీ సోదరుడితో 40 ఏళ్లు అన్ని రకాల సేవలు, ప్రతి పనికిమాలిన పనీ చేయించుకున్నారే.. రెండుసార్లు మీ టీడీపీ తరఫున పోటీ చేయించి ఓడిపోయిన తర్వాత వెన్నుపోటు పొడవలేదా?’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతోందని, టీడీపీ కార్యకర్తలను, నాయకులను చక్కదిద్దుకోవాలని రాజా హితవు పలికారు. -
అతి వేగం.. ఆయువు తీసింది
● ఎదురెదురుగా రెండు మోటారు సైకిళ్ల ఢీ ● సంఘటన స్థలంలో ఒకరు.. చికిత్స పొందుతూ మరొకరి మృతి సామర్లకోట: అతి వేగం.. ఆపై హెల్మెట్ ధరించకపోవడం ఇద్దరు ద్విచక్ర వాహనచోదకుల ప్రాణాలను బలి తీసుకుంది. పెద్దాపురం సీఐ వైఆర్కే శ్రీనివాస్ కథనం ప్రకారం.. కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం కోట గ్రామానికి చెందిన తిరుకోట సుధీర్రాజు (25) జగ్గంపేటలోని బజాజ్ షోరూములో సర్వీస్ మేనేజర్గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మోటార్ సైకిల్పై గండేపల్లికి చెందిన లావణ్య అనే యువతితో కలసి శుక్రవారం జగ్గంపేట నుంచి పెద్దాపురం వస్తున్నాడు. అదే సమయంలో జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన దండ్రు నేరియ్య (28) పెద్దాపురం నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. వీరిద్దరి బైక్లు పెద్దాపురం – జగ్గంపేట రోడ్డులో జె.తిమ్మాపురం సమీపంలోని నెక్కంటి సీఫుడ్స్ ఎదురుగా ఉన్న రహదారిలో ఎదురెదురుగా అతి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుధీర్రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నేరియ్యను పెద్దాపురం సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుధీర్రాజు మోటార్ సైకిలు వెనుక కూర్చున్న లావణ్యకు ఎటువంటి గాయాలూ తగల్లేదని సీఐ తెలిపారు. ఈ ప్రమాదంపై ఎస్సై వి.మౌనిక కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వీరిద్దరి మరణాలకు అతి వేగం, హెల్మెట్లు ధరించకపోవడమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కొనసాగిన సప్లిమెంటరీ పరీక్షలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీలో రెండో రోజైన శుక్రవారం లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. ఫస్టియర్కు 6,170 మంది హాజరు కాగా 315 మంది గైర్హాజరయ్యారు. సెకండియర్ పరీక్ష 2,365 మంది రాయగా 211 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కేశవరావు తెలిపారు. -
సమాధానం చెప్పలేకే జగన్పై మాటల దాడి
కాకినాడ రూరల్: రాష్ట్ర పరిస్థితులపై వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేకనే ఆయనపై మాటల దాడికి పాల్పడుతున్నారని ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రులు స్పందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జగన్ వ్యాఖ్యల్లో తప్పులుంటే చెప్పాలని, వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేకనే తమకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆత్మ క్షోభించేలా టీడీపీని చంద్రబాబు తన వశం చేసుకున్నారని, కాపు నేత వంగవీటి రంగాను హత్యా రాజకీయాలకు వాడుకుని ప్రయోజనం పొందారని, తనకు లబ్ధి లేకపోతే చంద్రబాబు ఏ పనీ చేయరని విమర్శించారు. జగన్ విమర్శలు వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. వాటిపై స్పందించకుండా మంత్రులు వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్కు సంబంధం ఉందని నిరూపించేందుకు ఎన్నో విధాల చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో చివరకు ఆయన కుటుంబంలోనూ చిచ్చు పెట్టారని ఆక్షేపించారు. రాష్ట్ర హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గంలో బాలికపై అఘాయిత్యం జరగడం బాధాకరమని, గడచిన రెండు మూడు నెలల్లో ఇటువంటి ఘటన రెండోసారి జరిగిందని పేర్కొన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో ఆమె విఫలమయ్యారని ధ్వజమెత్తారు. మారుమూల గ్రామాల్లో సైతం 24 గంటలూ మద్యం ఏరులై పారుతోందని, ఆ మత్తులో ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం నిద్రమత్తు వీడకపోవడం విచారకరమని అన్నారు. కొవ్వూరు వంతెన వద్ద బైపాస్లో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతిగా మద్యం సేవించడమే కారణమని అక్కడి కూలీలే చెబుతున్నారన్నారు. మట్టి, ఇసుక, గ్రావెల్ దోచుకుని చినబాబుకు వాటాలు పంపిణీ చేసే ప్రక్రియలో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారని ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో మట్టి మాఫియా ధనదాహానికి యువకుడు బలయ్యాడని గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తోందని నాగమణి విమర్శించారు. జెడ్పీలో పలువురికి ఉద్యోగోన్నతులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా, ఐదుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించామని వివరించారు. అలాగే, జెడ్పీ యాజమాన్యంలో పని చేస్తూ అకాల మరణం చెందిన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామక పత్రాలను కూడా ఆయన అందజేశారు. ఉద్యోగోన్నతి పొందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జిల్లా పరిషత్కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. -
ప్రొఫెసర్ నాగేశ్వర్, కొమ్మినేనిపై అక్రమ కేసు
సాక్షి, అమరావతి/కాకినాడ రూరల్: మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుపై కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు గురువారం రాత్రి అక్రమ కేసు నమోదు చేశారు. తప్పుడు, రెచ్చగొట్టే ప్రకటనలను ప్రసారం చేసి.. వ్యాప్తికి కారణమైన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని కాకినాడ అర్బన్ జయేంద్ర నగర్కు చెందిన నల్లం శ్రీరాములు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న ఒక చానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ నిర్వహించిన ప్రత్యక్ష చర్చలో హోం మంత్రి అమిత్ షా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్పై ఆధా రాలు లేకుండా మాట్లాడారని, అవి ఇతర మీడియా వేదికలపై ప్రముఖంగా వచ్చాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 'సాక్షి' మీడియా నిర్వహించిన చర్చల్లో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు పాల్గొని కూటమి రాజకీయ పరిణామాలు, సున్నితమైన అంశాలను ప్రసారం చేసి ప్రజల్లో గందరగోళం ఏర్పడేలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సీహెచ్ ప్రకాష్, ఎస్ఐఐ కె.ఏసుబాబు తెలిపారు. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లపై అవాస్తవాలు, అబద్దాలు ప్రచారం చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఈ వ్యాఖ్యలు ప్రసారం చేసిన 99 టీవీ యాజమాన్యం, చర్చ నడిపిన జర్నలిస్టుపై చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకుడు శిరంగు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.వీరబాబు తెలిపారు. జనసేన పార్టీ పైన, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పైన, పార్టీ నాయకులపైన అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణం పోలీసు కేసులు పెట్టడంతోపాటు న్యాయ పరమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు జనసేన పార్టీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
గొల్లప్రోలు (పిఠాపురం రూరల్): పని చేస్తూండగా వడదెబ్బ తగిలి ఉపాధి కూలీ మృతి చెందిన సంఘటన గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామంలోని కోదండ రామయ్య చెరువులో గురువారం ఉపాధి పనులు నిర్వహిస్తున్నారు. అక్కడ పని చేస్తున్న రాపర్తి సత్యనారాయణ (63) తనకు నీరసంగా ఉందని, ఇంటికి వెళ్లిపోతానని ఫీల్డ్ అసిస్టెంట్కు చెప్పాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మృతి చెందాడు. ఎంపీడీఓ సెలెట్ రాజు, ఏపీఓ గంగా భవాని మృతుని ఇంటి వద్దకు వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
రత్నగిరిపై నెల రోజుల్లో సెల్ టవర్
అన్నవరం: రత్నగిరిపై నెల రోజుల్లోగా ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నట్టు అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. దేవస్థానంలో డిజిటల్ చెల్లింపులను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో ఇంటర్నెట్ సరిగ్గా కనెక్ట్ అవక ఈ విధానంలో వివిధ సేవల టికెట్ల కొనుగోలుకు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘క్యాష్ ట్రబుల్’ శీర్షికన ఈ నెల 14న, ‘కష్టాలు ఆన్.. తరగని లైన్’ శీర్షికన ఈ నెల 20న ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. వీటిపై స్పందించిన అధికారులు ఇప్పటికే పలు చర్యలు చేపట్టారు. తాజాగా సెల్ ఫోన్ సిగ్నల్స్ను మెరుగు పరిచేందుకు వీలుగా ప్రకాష్ సదన్ సత్రం వెనుక స్థలంలో ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నామని ఈఓ తెలిపారు. ఈ స్థలాన్ని గురువారం ఆయన పరిశీలించారు. టవర్ ఏర్పాటుతో భక్తుల ఇబ్బందులు చాలా వరకూ తగ్గే అవకాశం ఉంటుందన్నారు. ఇతర సెల్ కంపెనీల టవర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఈలు నూకరత్నం, రామకృష్ణ కూడా పాల్గొన్నారు. 25 నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ నెల 25 నుంచి జూన్ నాలుగో తేదీ వరకూ పదో తరగతి, ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను డీఆర్ఓ టి.తిప్పేనాయక్ ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు 22 కేంద్రాల్లో 4,405 మంది, ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 8 కేంద్రాల్లో 1,386 మంది, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలకు 11 కేంద్రాల్లో 3,119 చొప్పున విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ఆయా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా మెడికల్ క్యాంపు నిర్వహించాలన్నారు, విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆయా పరీక్ష కేంద్రాల పరిధిలో తగినన్ని ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత శాఖల అధికారులకు డీఆర్ఓ సూచించారు. మట్టి మాఫియా బరితెగింపు ● అక్కినీడి చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు ● అధికారులతోనే ఘర్షణ పిఠాపురం రూరల్: మండలంలోని గోకివాడ గ్రామంలో మట్టి మాఫియా బరితెగిస్తోంది. స్థానిక అక్కినీడి చెరువులో రాత్రి వేళల్లో యథేచ్చగా మట్టి తవ్వకాలు సాగిస్తోంది. చెరువు గట్లను సైతం తవ్వేసి ఉదయం వరకూ మట్టిని యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై గ్రామస్తులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ఏలేరు జేఈ శ్రీనివాసరావు పరిశీలించారు. అయితే, ఇక్కడ తవ్వకాలకు తమకు అనుమతులున్నాయంటూ మట్టి మాఫియా ఏకంగా అధికారులతోనే ఘర్షణకు దిగింది. ఈ నేపథ్యంలో మట్టి మాఫియాపై చర్యలు తీసుకుంటామని జేఈ చెప్పారు. భారీ స్థాయిలో మట్టిని అక్రమంగా తరలించుకుపోతున్నారని ఫిర్యాదు చేసినా తహసీల్దార్ కానీ, వీఆర్ఓ కానీ స్పందించ లేదని గ్రామస్తులు విమర్శించారు. చెరువుల పునరుద్ధరణ అంటూ అధికారులు మాటలు చెబుతున్నారే తప్ప, వాటి పరిరక్షణకు ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. మట్టి మాఫియాతో స్థానిక అధికారులకు సంబంధాలున్నాయని, అందుకే ఫిర్యాదు చేసినా కనీసంగా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష నిర్వహించారు. ఫస్టియర్ జనరల్ విభాగంలో 2,948 మంది హాజరు కాగా, 233 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 317 మంది పరీక్ష రాయగా 15 మంది హాజరు కాలేదని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి కేశవరావు తెలిపారు. అలాగే, సెకండియర్ జనరల్ విభాగంలో 5,430 మంది హాజరు కాగా, 380 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 840 మంది పరీక్ష రాయగా, 135 మంది పరీక్షకు హాజరు కాలేదు. -
వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని, పెద్దాపురం నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో వివిధ పదవుల్లో నియమితులయ్యారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా గొల్లపల్లి నూకరాజు (తుని), ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా బోడపాటి సతీష్ (తుని), బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా యాదల గోపీకృష్ణ (తుని), లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా రాగం కామేశ్వరరావు (పెద్దాపురం) నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అధిష్టానం గురువారం నియామక ఉత్తర్వులు విడుదల చేసింది. ఆయా పదవుల్లో నియమితులైన నాయకులు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): తీవ్ర ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ కోరారు. మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. తాళ్లరేవు, కాజులూరు, కరప, కాకినాడ రూరల్, పెదపూడి మండలాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశముందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పనులను ఉదయం 10 గంటలకు ముందు, సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రమే నిర్వహించాలన్నారు. పని ప్రదేశంలో శ్రామికులకు టెంట్లు, తాగునీరు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, అ నారోగ్యాలతో బాధ పడేవారు తప్పనిసరైతే తప్ప ఎండలో సంచరించరాదని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోను, ఏఎన్ఎంల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా వడదెబ్బకు గురైతే తక్షణ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బస్టాపుల వద్ద ప్రజలకు నీడ కల్పించాలని కలెక్టర్ సూచించారు. ‘బాల పురస్కార్’కు దరఖాస్తుల ఆహ్వానం కాకినాడ క్రైం: వచ్చే సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ చెరుకూరి లక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, నూతన ఆవిష్కరణలు, ధైర్యసాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలతో పాటు ఇతర అంశాల్లో అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 ఏళ్ల లోపు బాలలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆసక్తి ఉన్న వారు https://awards.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించేందుకు జూలై 31 తుది గడువని పీడీ తెలిపారు. టైరు పంక్చర్.. పల్టీలు కొట్టిన కారు సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం యలమంచిలి రూరల్: టైరు పంక్చర్ కావడంతో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టిన ఘటనలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలయ్యాడు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం మర్రిబంద గ్రామ సమీపాన పదహారో నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. యలమంచిలి రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెనుమళ్ల వెంకట నాగబుల్లి ప్రసాద్రెడ్డి (30), అతడి బంధువు మణికుమార్రెడ్డి విశాఖపట్నం నుంచి కాకినాడ వెళ్తున్నారు. యలమంచిలి దాటిన తరువాత మర్రిబంద సమీపాన కారు టైరు పంక్చరైంది. దీంతో, వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి, పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలో ఉన్న మణికుమార్రెడ్డిని హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.కోటితో భక్తులకు మౌలిక వసతులు
● అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నిర్ణయం ● పలు తీర్మానాలకు ఆమోదం అన్నవరం: భక్తులకు సుమారు రూ.కోటితో మౌలిక వసతులు కల్పించాలని అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి (ట్రస్ట్బోర్డు) సమావేశం నిర్ణయించింది. చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ప్రకాష్ సదన్లోని ట్రస్ట్ బోర్డు హాలులో గురువారం జరిగిన సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది. ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, దేవస్థానం అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమైన తీర్మానాలు ● భక్తులకు చల్లని తాగునీరు, వాష్ రూముల్లో మెరుగైన సదుపాయాల కల్పించాలి. ● సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష, అంతకు మించి విరాళం ఇచ్చే భక్తులకు అన్నదానం బాండుతో పాటు సత్యదేవుని ఫొటో కూడా ఇవ్వాలి. ● రూ.22 లక్షలతో కేశఖండన శాల దిగువన పురుషులకు 40, సీ్త్రలకు 20 కలిపి మొత్తం 60 వాష్ రూములను అధునాతన శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయాలి. ● పశ్చిమ రాజగోపురం ఎదురుగా సెల్లార్లోని వాష్ రూములను రూ.11.48 లక్షలతో ఆధునిక శానిటరీ పరికరాలతో అభివృద్ధి చేయడానికి పిలిచిన లోయెస్ట్ టెండర్కు ఆమోదం. ● దేవస్థానం టోల్గేట్ వద్ద కళాశాల మైదానంలోని ఉచిత డార్మెటరీలు, వాటిల్లోని వాష్ రూముల మరమ్మతులకు రూ.7.02 లక్షల అంచనాతో పిలిచిన టెండర్లలో లోయెస్ట్ వచ్చిన దానికి ఆమోదం. ● రూ.17.52 లక్షల అంచనాతో వివిధ రోడ్ల మరమ్మతులకు పిలిచిన టెండర్లలో తక్కువగా కోట్ చేసిన దానికి ఆమోదం. ● విజయ డెయిరీ పాల ఉత్పత్తుల విక్రయానికి గాను రెండు స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి. ● భక్తులకు వ్రతం, ఇతర సేవా టికెట్లు విక్రయించేందుకు గాను ఒక్కొక్కటి రూ.90 వేలతో కియోస్కుల కొనుగోలు. ఫ్లోరింగ్పై తెలుపు రంగు పెయింట్ పశ్చిమ రాజగోపురం ఎదురుగా ఉన్న నేలపై కార్పెట్లు లేకపోవడంతో లారెస్ విశ్రాంతి షెడ్డు వద్ద దేవస్థానం బస్సులు ఎక్కే భక్తులు సీసీ రోడ్డుపై కాళ్లు కాలి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై ‘కార్పెట్లు ఎక్కడ స్వామీ’ శీర్షికన ‘సాక్షి’ ఈ నెల 10న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ మర్నాడు అక్కడ కార్పెట్లు వేశారు. దీనికి కొనసాగింపుగా అక్కడ భక్తుల కాళ్లు కాలకుండా ఫ్లోరింగ్పై రూ.11 లక్షలతో తెలుపు రంగు పెయింట్ వేయించాలని ట్రస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. -
ఇలాగైతే ఎలా పద్మావతీ!
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో పారిశుధ్య పనుల కాంట్రాక్టు నిర్వహిస్తున్న పద్మావతి సంస్థ తీరుపై శానిటరీ సిబ్బంది నుంచి విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య కాంట్రాక్టును తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా అన్నవరం దేవస్థానంలో కాంట్రాక్టును సుమారు రూ.10 కోట్లకు పొందింది. దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణ, సత్రాల్లో దుప్పట్లు ఉతికించడం, విద్యుత్ ఉపకరణాల మరమ్మతుల వంటి పనులను ఈ సంస్థ చేయాలి. ఈ క్రమంలో కనీసం శానిటరీ మెటీరియల్ కూడా సరిగ్గా సరఫరా చేయడం లేదని సిబ్బంది విమర్శిస్తున్నారు. దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు మొదటి రకం ఫినాయిల్, సోపాయిల్ సరఫరా చేయాలి. కానీ, నాసిరకం మెటీరియల్ ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. దీనివలన శుభ్రత మాట ఎలా ఉన్నా, కనీసం మరకలు కూడా పోవడం లేదు వాపోతున్నారు. అలాగే, చీపుర్లు, ఇతర వస్తువులు కూడా తగినన్ని సరఫరా చేయడం లేదని అంటున్నారు. సిబ్బందికి చేతి చమురు ● సత్యదేవుని వ్రత మండపాల్లో నూనె మరకలను కడగానికి నాణ్యమైన సోపాయిల్, యాసిడ్లు ఉపయోగించాలి. పద్మావతి సంస్థ ఇస్తున్న మెటీరియల్తో ఆ మరకలు పోవడం లేదు. దీంతో, సొంత సొమ్ముతో చవుడు కొని శుభ్రం చేయాల్సి వస్తోందని వ్రత మండపాల్లోని శానిటరీ సిబ్బంది వాపోతున్నారు. దీనికి గాను వారికి రోజుకు రూ.50 చొప్పున చేతి చమురు వదిలిపోతోంది. నాణ్యమైన మెటీరియల్ ఇవ్వాలని అడిగితే ఉద్యోగం తీసేస్తామంటూ బెదిరిస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ● సత్యదేవుని ప్రసాదం తయారు చేసిన తరువాత నల్లగా మాడిపోయే ఇత్తడి కళాయిలను శుభ్రంగా కడగాలి. అయితే, పద్మావతి సంస్థ ఇస్తున్న మెటీరియల్తో కనీసం కళాయిల జిడ్డు కూడా వదలడం లేదు. దీనిపై ప్రసాదం సూపరింటెండెంట్ ప్రశ్నిస్తే నాణ్యమైన మెటీరియల్ ఇవ్వడం లేదని అక్కడ పని చేస్తున్న మహిళలు చెబుతున్నారు. ఈ విషయంపై పద్మావతి సంస్థ సూపర్వైజర్లను ప్రసాదం విభాగం సూపరింటెండెంట్ అడిగితే.. వారు తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆ మహిళలు వాపోతున్నారు. పైగా తమకు వేతనాలు సైతం సకాలంలో చెల్లించడం లేదని శానిటరీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● దేవస్థానంలో హుండీల ద్వారా వార్షికాదాయం రూ.15 కోట్లు. అందులో సింహభాగం ఈ సంస్థకే చెల్లిస్తున్నప్పటికీ పారిశుధ్య నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. మంత్రికి ఫిర్యాదు చేసినా.. ‘పద్మావతి’ సంస్థతో వస్తున్న సమస్యలపై గత నెల 12న అన్నవరం వచ్చిన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణరెడ్డికి పలువురు సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు చేసి, నివేదిక ఇవ్వాలని ఆయన దేవదాయ శాఖ సీఈ శేఖర్ను ఆదేశించారు. అయినప్పటికీ సంస్థ పని తీరులో ఎటువంటి మార్పూ లేదని సిబ్బంది చెబుతున్నారు. పద్మావతి సంస్థ అధినేత భాస్కర నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడనే ప్రచారం ఉంది. గతంలో 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టెండర్ ద్వారా రెండేళ్లు, తన పలుకుబడి ఉపయోగించి మరో రెండేళ్ల పాటు దేవస్థానాల్లో శానిటరీ కాంట్రాక్టును ఆయన పొందారని చెబుతారు. తిరిగి 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే దేవస్థానాల్లో శానిటరీ కాంట్రాక్టు ఆయనకే దక్కడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థను ప్రశ్నించడానికి, చర్యలు తీసుకోవడానికి దేవస్థానం అధికారులు వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రెండుసార్లు నోటీసులిచ్చాం దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణపై పలు ఫిర్యాదులు రావడంతో పద్మావతి సంస్థకు రెండుసార్లు నోటీసులిచ్చాం. నాసికరం మెటీరియల్ ఇస్తున్న విషయాన్ని సిబ్బంది నా దృష్టికి తీసుకు వస్తే చర్యలు తీసుకుంటాను. వారి పేర్లు బయటపెట్టను. – నల్లం సూర్యచక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం అన్నవరం దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్ట్ సంస్థపై సిబ్బంది విమర్శలు నాణ్యమైన మెటీరియల్ ఇవ్వడం లేదని ఆరోపణ గట్టిగా అడిగితే ఉద్యోగం ఊడబీకుతామంటున్నారని ఆవేదన -
మందుల దుకాణాల బంద్
కాకినాడ క్రైం: ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్, ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ల పిలుపు మేరకు, ది కాకినాడ జిల్లా డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ బుధవారం మందుల దుకాణాల బంద్ పాటించింది. దీంతో, జిల్లా వ్యాప్తంగా 1,518 మందుల దుకాణాలు మూత పడ్డాయి. అత్యవసర సేవల కోసం నిర్ణీత మందుల దుకాణాలను తెరచి ఉంచారు. అసోసియేషన్ నాయకులు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిబంధనలు అతిక్రమించి వ్యాపారాలు చేస్తున్న ఆన్లైన్ ఫార్మసీలు అటు రోగులతో పాటు వ్యాపారులకు కూడా సమస్యగా మారాయన్నారు. నిబంధనలు పాటించకుండా ఆర్డర్ పెట్టిన మందులు పంపిణీ చేయడం రోగుల ప్రాణాలకు ఏమాత్రం సురక్షితం కాదని చెప్పారు. మార్జిన్లపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ పెత్తనాన్ని తగ్గించి, షెడ్యూల్ డ్రగ్స్పై ఇస్తున్న మార్జిన్ను 16 శాతానికి మాత్రమే పరిమితం చేయడాన్ని నిరసిస్తున్నామని తెలిపారు. చిన్న వ్యాపారుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న ఆన్లైన్, చైన్ ఫార్మసీల కార్యకలాపాలను నియంత్రించాలని, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పెద్ద ఫార్మా కంపెనీలు, ఈ–ఫార్మసీలపై నిబంధనలను అనుసరించి కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. -
రత్నగిరి.. భక్తఝరి
అన్నవరం: ఓవైపు ఎండలు మండిపోతున్నా సత్యదేవుని భక్తులు ఏమాత్రం తగ్గేదేలే.. అన్నట్టుగా రత్నగిరికి పోటెత్తుతున్నారు. ఆలయానికి బుధవారం సుమారు 40 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు, క్యూలు కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 2,200 జరిగాయి. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఈ వారాంతం వరకూ రత్నగిరిపై భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఏర్పాట్లను ట్రస్ట్బోర్డు సభ్యులతో కలసి ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పరిశీలించారు. ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నదానం హాలులో శుభ్రత పెరగాలని కొంతమంది భక్తులు ఈఓ దృష్టికి తీసుకువచ్చారు. తగు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. -
‘దేశం’లో తాళ్లూరు రాజకీయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిరో బుల్బుల్ పిట్ట’ అనే పాట మెట్ట ప్రాంత రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఒక్క శంకుస్థాపనతో పార్టీలో అందరి నోళ్లూ మూయించాలనుకుని టీడీపీ సీనియర్ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వర్గం పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. గండేపల్లి మండలంలో రూ.52 కోట్లతో చేపట్ట తలపెట్టిన తాళ్లూరు ఎత్తిపోతల పథకం క్రెడిట్ అంతా జ్యోతుల ఖాతాలో పడాలని ఆయన వర్గం భావించింది. మంత్రి నారా లోకేష్తో శంకుస్థాపన చేయించి, తద్వారా అటు రైతుల్లోను, ఇటు జిల్లా రాజకీయాల్లోను పట్టు బిగించాలనేది నెహ్రూ వ్యూహం. పార్టీపై పట్టు కోసం.. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా రాజకీయాల్లోకి అడుగు పెట్టి, లోకేష్ కోటరీలో అత్యంత నమ్మకస్తుడుగా పేరుబడ్డ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు ఇటీవల జిల్లా టీడీపీలో తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. గత ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటుపై సానా, జ్యోతుల మధ్య అభిప్రాయ భేదాలు పొడచూపాయి. చివరకు పొత్తులో భాగంగా ఆ సీటును జనసేనకు కేటాయించారు. అప్పటి నుంచీ జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఈ రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాళ్లూరు లిఫ్ట్కు లోకేష్తో భూమి పూజ చేయించి పార్టీపై పట్టు బిగించాలని, పార్టీ లోని ప్రత్యర్థులకు చెక్ పెట్టాలని జ్యోతుల భావించారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేశారు. చినబాబుకు ఘన స్వాగతం, ఎత్తిపోతల పథకం భూమిపూజ, రైతులతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కానీ, చివరి నిమిషంలో లోకేష్ పర్యటన రద్దయ్యిందంటూ పై నుంచి వర్తమానం రావడంతో జ్యోతుల వర్గం తీవ్ర నిరాశకు గురైంది. అసలు కారణాలు అవేనా? లోకేష్ పర్యటన రద్దుకు పార్టీ నేతలు ఏవేవో కారణాలు చెబుతుండగా అసలు విషయం వేరే ఉందనే చర్చ కూడా నడుస్తోంది. తాళ్లూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి, గత సీజన్లోనే సాగునీరు అందిస్తామని రైతులకు గడచిన సార్వత్రిక ఎన్నికల్లో జ్యోతుల హామీ ఇచ్చారు. ఆయన ఆ మాట ఇచ్చి రెండు సీజన్లు గడచినా చుక్క నీరు కూడా విడుదల చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో గడచిన రెండు సీజన్లకు పంట కోల్పోయిన మేరకు నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండుతో లోకేష్ పర్యటనలో ఆందోళనకు సిద్ధమని రైతులు ప్రకటించారు. రెండేళ్లుగా పూర్తి చేయని ఈ ఎత్తిపోతల పథకాన్ని వచ్చే మూడు నెలల్లో పూర్తి చేసి, జూలై నాటికి సాగునీరందిస్తామంటూ జ్యోతుల చెప్పిన మాటలను రైతులు విశ్వసించడం లేదు. మరోవైపు గత ఎన్నికల్లో జ్యోతులపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్రరావు ఎమ్మెల్యే నెహ్రూ హయాంలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందంటూ ఇటీవల కొన్నాళ్లుగా ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. దీనికి కొనసాగింపుగా ఎత్తిపోతల పథకం శంకుస్థాపనకు వచ్చే లోకేష్ దృష్టికి జ్యోతుల అవినీతిని సాక్ష్యాధారాలతో తీసుకువెళ్తానని ఈ కార్యక్రమానికి ఒక రోజు ముందు బూరుగుపూడిలో మీడియా సమావేశంలో వెల్లడించారు. అదే సమయంలో టీడీపీ నాయకులు అక్కడకు వచ్చి గలాటా సృష్టించారు. ఈ సమస్యలతో పాటు రైతుల నుంచి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందనే నిఘా వర్గాల సమాచారంతో తాళ్లూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమాన్ని లోకేష్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. అయితే, ఈ వ్యవహారం వెనుక ప్రత్యర్థి సానా సతీష్బాబు వర్గం పని చేసిందని జ్యోతుల వర్గం బలంగా విశ్వసిస్తోంది. కారణాలేవైనప్పటికీ లోకేష్ రాకపోవడంతో జ్యోతుల వర్గం డీలా పడింది.ఫ లోకేష్ వస్తారని జ్యోతుల వర్గం హడావుడి ఫ రైతుల ఆందోళన భయంతో చినబాబు వెనుకడుగు ఫ ‘సానా’ రాజకీయమే నడిచిందని సందేహాలు రకరకాల ప్రచారాలు లోకేష్ పర్యటన రద్దుపై రెండు రోజుల వ్యవధిలో రెండు కారణాలను టీడీపీ నేతలు ప్రచారంలోకి తెచ్చారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో అపాయింట్మెంట్ ఒక రోజు ఆలస్యం కావడంతో ఆయన తాళ్లూరు పర్యటన రద్దయ్యిందని తొలి రోజు ప్రచారం నడిచింది. 24 గంటలు గడిచేసరికి ప్రధాని మోదీ పొదుపు పిలుపుతో ఖర్చు తగ్గించేందుకే లోకేష్ పర్యటన రద్దయ్యిందని చెప్పుకొచ్చారు. జ్యోతుల కూడా ఇదే కారణమని అన్నారు. వాస్తవానికి ప్రధాని పొదుపు పిలుపు అంతకంటే ముందే రావడం గమనార్హం. లోకేష్ పర్యటన రద్దుతో ఇక చేసేది లేక జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఇరిగేషన్ ఎస్ఈ ఏసుబాబు, మెగా ఇంజినీరింగ్ ప్రతినిధుల సమక్షంలో తాళ్లూరు ఎత్తిపోతల పథకానికి జ్యోతులనే స్వయంగా కొబ్బరి కాయ కొట్టి మమ అనిపించారు. రెండు నెలల్లో అసాధ్యం తాళ్లూరు లిఫ్ట్ ఆధునీకరణ ప్రారంభించినా ఈ పనులు రెండు నెలల్లో పూర్తయ్యి ఖరీఫ్కు నీరందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ కారణంతోనే మంత్రి లోకేష్ పర్యటన రద్దు చేసుకుని ఉండవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా తాళ్లూరు లిఫ్ట్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేదు. రెండేళ్లుగా సాగునీరు లేక ఆయకట్టు రైతులు పూర్తిగా నష్టపోయారు. – తోట నరసింహం, వైఎస్సార్ సీపీ జగ్గంపేట సమన్వయకర్త తండ్రీ కొడుకుల అక్రమాలు బయటపడతాయనే.. జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఆయన తనయుడు జ్యోతుల నవీన్ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. వీటిపై మేము ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాం. మంత్రి లోకేష్ను కలిసి, ఈ అవినీతిని ఆయనకు వివరించాలనుకున్నాము. వారు చేస్తున్న అవకతవకలు బయట పడతాయనే ఉద్దేశంతో కావాలనే మంత్రి లోకేష్ పర్యటన రద్దు చేయించారు. – పాఠంశెట్టి సూర్యచంద్రం, బూరుగుపూడి ్ఠ -
బ్రిక్స్ సదస్సులో నృత్య ప్రదర్శనకు ఎంపిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కేంద్ర ప్రభుత్వం అహ్మదాబాద్లో ఈ నెల 21న నిర్వహించనున్న బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సులో కాకినాడకు చెందిన ఇద్దరు నర్తకీమణులు నృత్య ప్రదర్శన చేయనున్నారు. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా వంటి దేశాల అధ్యక్షులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో మన దేశానికి చెందిన శాసీ్త్రయ కళారూపాలు ప్రదర్శిస్తారు. ఇందులో భాగంగా కాకినాడకు చెందిన నాట్యాచార్య కృష్ణకుమార్ శిష్యులైన చంద్రపు సౌమ్యరేఖ, కేతరాజు మనస్విని కృతి కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించేందుకు ఎంపికయ్యారు. ఈ మేరకు వారు బుధవారం అహ్మదాబాద్ బయలుదేరారు. వీరిద్దరూ దేశంలో ప్రఖ్యాతిగాంచిన నృత్యోత్సవాల్లోను, సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్ దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ నృత్యోత్సవాల్లోను ప్రదర్శన ఇచ్చి కాకినాడ కీర్తిని ఇనుమడింపజేస్తున్నారని కృష్ణకుమార్ చెప్పారు. వచ్చే నెల 21 వరకూ యోగా మాసం బోట్క్లబ్ (కాకినాడ సిటీ): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రజల్లో యోగాపై అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆయన బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఆయుష్ అధికారి మొహమ్మద్ ఆలీ మాట్లాడుతూ, బుధవారం నుంచి జూన్ 21వ తేదీ వరకూ యోగా మాసం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించడం, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశమని చెప్పారు. సివిల్ సర్వీసెస్లో పదేళ్లు పూర్తి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ సివిల్ సర్వీసెస్లో చేరి బుధవారానికి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయనను కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉద్యోగులు సత్కరించారు. అపూర్వ భరత్ 2015లో సివిల్ సర్వీసెస్లో చేరారు. తొలుత న్యూఢిల్లీ డిఫెన్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో దేశానికి సేవలందించారు. 2020లో ఉత్తర ప్రదేశ్లో ఆర్డీఓ క్యాడర్లో పని చేశారు. 2021లో ఐఏఎస్ సాధించిన ఆయన ఏలూరులో ట్రైనీ కలెక్టర్గా, 2023–24లో సత్యసాయి జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్గా, 2024లో పోలవరం జిల్లా చింతూరు ప్రాజెక్టు అధికారిగా పని చేశారు. ఏడు నెలలుగా జాయింట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అపూర్వ భరత్ విలేకర్లతో మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావాలనే సంకల్పంతో చదివానని అన్నారు. 1 నుంచి జిల్లాలో ‘సర్’ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ– స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.తిప్పేనాయక్ తెలిపారు. జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమం కింద యూనిక్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ద్వారా ప్రస్తుతం నమోదై ఉన్న ఓటర్ల వివరాలను సర్–2002 డేటాతో పోల్చి చూస్తారని తెలిపారు. వారి బంధువుల వివరాలతో మ్యాచింగ్, లింకింగ్ చేస్తారమన్నారు. దీని ఆధారంగా అర్హులను, అనర్హులను నిర్ధారించి ఓటర్ల జాబితాను సవరిస్తారని వివరించారు. జిల్లాలో ఈ నెల 19వ తేదీ నాటికి 16,50,534 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ప్రస్తుతం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,640 పోలింగ్ కేంద్రాలుండగా, రేషనలైజేషన్ అనంతరం వీటి సంఖ్యను 1,825కు పెంచేందుకు 81 కేంద్రాలకు లొకేషన్ మార్పు, 275 కేంద్రాలకు పేరు మార్పులను ప్రతిపాదించామని వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు డీఆర్ఓ సూచించారు. -
బ్రిడ్జి నిర్మాణానికి.. గేటు తీసేదెప్పుడో?
పిఠాపురం: నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందంటూ జనసేన నేతలు తెగ గొప్పలు చెప్పుకొంటున్నారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తాను రూ.400 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు. ఈ రూ.400 కోట్లలో ఉప్పాడ – పిఠాపురం రోడ్డులోని రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) లెక్కలు సైతం చూపిస్తున్నారు. దీని నిర్మాణాన్ని అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే పూర్తి చేస్తానని ఆయనే స్వయంగా ప్రకటించారు. కానీ, గద్దెనెక్కి దాదాపు రెండేళ్లవుతున్నా ఈ ఆర్ఓబీ నిర్మాణం ఒక్క అంగుళం కూడా జరగలేదు. దీంతో, ప్రయాణికులు ఇక్కడ నిత్యం నరకం చవి చూస్తున్నారు. గొప్పలు మాని, తమ ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు పిఠాపురం నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే ప్రధాన రహదారిలో పిఠాపురం రైల్వే స్టేషన్ సమీపాన ఉప్పాడ రైల్వే గేటు ఉంది. ఇటు పిఠాపురం, అటు తుని, తొండంగి, కొత్తపల్లి మండలాలకు చెందిన వివిధ వాహనాలు నిత్యం ఈ గేటు మీదుగానే రాకపోకలు సాగిస్తూంటాయి. ఇక్కడికి సమీపంలోనే మాధవపురం, గోర్స రైల్వే గేట్లు కూడా ఉన్నప్పటికీ అధిక శాతం వాహనాలు ఉప్పాడ రైల్వే గేటు ద్వారానే వెళ్తూంటాయి. గతంలో కంటే రైళ్ల రాకపోకలు గణనీయంగా పెరగడంతో ఎప్పుడు చూసినా ఈ గేటు మూసే ఉంటోంది. ఒక్కోసారి రెండు మూడు రైళ్లు వెళ్లేంత వరకూ గేటు తీయకపోవడంతో ఇరువైపులా వందలాదిగా వాహనాలు అరగంట నుంచి గంట వరకూ నిలిచిపోతున్నాయి. దీంతో, ప్రయాణికులు, వాహన చోదకులు గంటల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. రైళ్లు వెళ్లాక ఆ ట్రాఫిక్ నుంచి బయట పడటానికి మరో అరగంటకు పైగా అగచాట్లు పడుతున్నారు. తీర ప్రాంత గ్రామాలకు ప్రధాన రహదారి కావడంతో ఈ మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉప్పాడ రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ నిర్మించాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. గతంలోనే లైన్ క్లియర్ వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ గతంలో కాకినాడ ఎంపీగా ఉన్నప్పుడే ఒకేసారి నాలుగు రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. తుని, హంసవరం, మాధవపురం, గోర్స రైల్వే గేట్ల వద్ద వీటి నిర్మాణాలు పూర్తయి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ప్రయాణికులు గంటల తరబడి గేట్ల వద్ద పడుతున్న ఇబ్బందులకు ఆమె చాలా తక్కువ కాలంలోనే చెక్ పెట్టారు. అలాగే, ఉప్పాడ రైల్వే గేటు వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి కూడా ఆమె రైల్వే శాఖ నుంచి అనుమతులు తెచ్చి, అప్పట్లోనే రూ.150 కోట్లు మంజూరు చేయించారు. బ్రిడ్జి నిర్మాణ పనులకు అవసరమైన అన్ని పక్రియలూ పూర్తి చేశారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా అనుమతులు మాత్రమే రావాల్సి ఉన్న తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ఆర్ఓబీ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేవలం పరిపాలనా అనుమతులు మాత్రమే ఇచ్చి, మొత్తం తామే చేసినట్లు చెప్పుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిఠాపురంలో ఉప్పాడ రైల్వే గేటు వేయడంతో నిలిచిపోయిన వాహనాలుగంటల తరబడి గేటు వేసేయడంతో వాహనదారుల పడిగాపులునిత్యం నరకం ఉప్పాడ రైల్వే గేటు ఒకసారి మూసేస్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. రైలు వెళ్లాక గేటు తీసినా మళ్లీ వెంటనే వేసేయడం ఇక్కడ నిత్యకృత్యం. దీంతో పాటు తరచూ గేటు మరమ్మతులకు గురవడం, లాక్ అవడం వంటి సమస్యలతో గంటల తరబడి ఎండలోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నిలిపోయిన ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలోపే తిరిగి గేటు పడుతున్న సందర్భాలు కోకొల్లలు. దీంతో, ఈ రహదారిపై ప్రయాణం నిత్యం నరకంలా ఉంటోంది. ఇక్కడ వెంటనే ఆర్ఓబీ నిర్మించాలి. – వేమగిరి వీరాస్వామి, ప్రయాణికుడు, కొండెవరం ఫ అంగుళం కూడా కదలని రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఫ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్న జనసేన నేతలు ఫ గంటల తరబడి నిలిచిపోతున్న ట్రాఫిక్ ఫ పవన్ ఇలాకాలో ప్రయాణికులకు నిత్యం నరకం -
దండిగా హుండీల రాబడి
అన్నవరం: సత్యదేవునికి హుండీల ద్వారా దండిగా ఆదాయం సమకూరింది. స్వామివారి హుండీల ఆదాయాన్ని రత్నగిరిపై బుధవారం లెక్కించారు. గడచిన 34 రోజులకు రూ.2,05,15,095 ఆదాయం వచ్చింది. ఇందులో నగదు రూ.1,93,89,456, చిల్లర నాణేలు రూ.11,25,639 ఉన్నాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వీటితో పాటు బంగారం 42.800 గ్రాములు, వెండి 954.500 గ్రాములు వచ్చాయన్నారు. అలాగే, అమెరికా డాలర్లు 40, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దీనార్లు 25, ఒమన్ బైసా 800, సింగపూర్ డాలర్లు 2, మలేషియా రింగిట్స్ 12, కువైట్ దీనార్ 1, బ్రెజిల్ రియాస్ 4, ఖతార్ రియల్స్ 7, ఆస్ట్రేలియన్ డాలర్లు 10, హాంకాంగ్ డాలర్లు 20, భూటాన్ కరెన్సీ 16, బహ్రెయిన్ దీనార్లు 1.5, ఇండోనేషియా రూపాయలు 50,000, నేపాల్ రూపాయలు 70, నెగారా డాలర్లు 11 చొప్పున లభించాయని వారు వివరించారు. మొత్తం మీద హుండీల ద్వారా సగటున రోజుకు రూ.6,03,385 ఆదాయం సమకూరిందని చెప్పారు. నెల రోజులుగా స్వామివారి సన్నిధిలో వేలాదిగా వివాహాలు జరిగాయి. దీనికి తోడు ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవదంపతులు, వారి బంధుమిత్రులు సత్యదేవుని దర్శనానికి వేలాదిగా తరలివచ్చారు. మరోవైపు విద్యా సంస్థలకు వేసవి సెలవులు, గత నెల 26 నుంచి ఈ నెల రెండో తేదీ వరకూ స్వామివారి వార్షిక కల్యాణోత్సవాలకు సైతం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఈ నెల రోజులూ ఆలయం కళకళలాడింది. దీంతో, స్వామివారికి ఆదాయం గణనీయంగా సమకూరింది.ఫ సత్యదేవునికి రూ.2.05 కోట్ల ఆదాయం ఫ భారీగా విదేశీ కరెన్సీ -
నిప్పుల కొలిమి
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026కాకినాడ రూరల్/తుని రూరల్: మార్తాండుడు చండప్రచండంగా ప్రజ్వరిల్లుతూండటంతో వాతావారణం నిప్పుల కొలిమిలా మారిపోయింది. ఇప్పటికే సూర్యుడు తీవ్ర స్థాయిలో ప్రతాపం చూపుతూండగా.. బుధవారం మహోగ్ర రూపమే దాల్చాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలైపోయింది. మధ్యాహ్నానికి కాకినాడ నుంచి తుని వరకూ పలు ప్రాంతాల్లో మంగళవారం 39 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ దాని ప్రభావం మాత్రం 46 డిగ్రీల స్థాయిని తలపించింది. బుధవారం కూడా కాకినాడలో 40.1, తునిలో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదైనప్పటికీ 50 డిగ్రీల మేర ఉన్నంత ప్రభావం చూపింది. దీనికి వేడి గాలులు, తీవ్రమైన ఉక్కపోత తోడవడంతో వాతావరణం అగ్నిగుండాన్ని తలపించి, ప్రజలు అల్లాడిపోయారు. దీంతో, ఎండ వేళ రోడ్లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారిపోయాయి. నిత్యం వేల సంఖ్యలో వాహనాలు పరుగులు తీసే 16వ నంబరు జాతీయ రహదారిపై ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ వాటి రాకపోకలు చాలా వరకూ తగ్గిపోయాయి. సోమవారం వరకూ 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని, ప్రజలు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వృద్ధులు చిన్న పిల్లలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని ఎన్.సూరవరం పీహెచ్సీ వైద్యుడు రాజశేఖర్ సూచించారు. -
‘బాబూ.. మత్స్యకారులకే చేపల కూర నేర్పిస్తున్నావా?’
సాక్షి, కాకినాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు డ్రామాలు అందరికీ తెలుసని మండిపడ్డారు వైఎస్సార్సీపీ నేతలు కురుసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం కొనే దిక్కులేదు అని ఘాటు విమర్శలు చేశారు.కాకినాడలో వైఎస్సార్సీపీ కార్యాలయంలో కమిటీల నియామకం, పార్టీ బలోపేతంపై నియోజకవర్గ కోఆర్డినేటర్లతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా, దవులూరి దొరబాబు, గిరిబాబు సహా పలువురు నేతలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దాడిశెట్టి రాజా మాట్లాడుతూ..‘రాష్ట్ర పాలన వదిలేసి చంద్రబాబు అమరావతి కాంట్రాక్టర్లే ధ్యేయంగా ఈవెంట్లు చేస్తున్నారు. ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనండి అని మహిళలను అవమానపరుస్తున్నారు. మహిళలు అంటే పిల్లల్ని కనే యంత్రాల్లాగా మాట్లాడుతున్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. చేపల పులుసు ఎలా వండాలో మత్స్యకారులకే చంద్రబాబు నేర్పించిన ఈవెంట్ చూశాం’ అని ఎద్దేవా చేశారు.కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘మత్స్యకారులకు సేవా? మత్యకారులకు శాపమా?. నెల్లూరు జిల్లాలో ఫిషింగ్ హర్బర్ కథ ఏం చేశారో మొన్ననే చూశాం. చంద్రబాబు మళ్ళీ అక్కడికే వెళ్ళి చేపల పులుసు వండుతారు. తెలుగు వెన్నుపోటు పార్టీ.. మత్య్సకారుల నుండి రైతుల వరకు వెన్నుపోటు పొడిచారు. తండ్రి ఒక్క పక్క.. కొడుకు ఒక పక్కన పొదుపు మీరు చేయండి. దుబారా మేము చేస్తామని డ్రామాలు చేస్తున్నారు. ఒకాయన సైకిల్ తొక్కుతాడు.. ఐదారు కెమెరాలు వాహనాలపై నడుస్తాయి. చంద్రబాబు డ్రామాలు ఏంటో అందరికీ తెలుసు’ అని మండిపడ్డారు -
గ్రావెల్ అక్రమ తవ్వకాలపై ఆకస్మిక తనిఖీలు
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణి భూషణ్రెడ్డి, సిబ్బంది గ్రావెల్ అక్రమ తవ్వకాలపై మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిధిలోని మోరంపూడి(శాటిలైట్సిటి) గ్రామంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. తవ్వకాలలో వినియోగిస్తున్న పొక్లయినర్ను, రవాణాకు వినియోగిస్తున్న రెండు ట్రాక్టర్లను అధికారులు సీజ్ చేసి స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలలో రాయల్టీ ఇన్స్పెక్టర్ డి. జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు పి.శైలజ, కె. మనీషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కే.వి. ప్రసాద్ , విఆర్వో ఎం. గోపి పాల్గొన్నారు. యథేచ్ఛగా నల్లమట్టి తరలింపు తాళ్లపూడి: మండలంలో మట్టి మాఫియా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. వేసవికాలంలో ఏటా నల్ల మట్టిని ఇటుకల బట్టీలకు తరలిస్తుంటారు. నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ పనులకు మట్టి తొలుతున్నాం అంటూ ఎర్ర మట్టి గ్రావెల్ జోరుగా తరలించారు. మండలంలో తాజాగా ఇటుక బట్టీలకు నల్ల మట్టిని తరలించటం ప్రారంభించారు. గోపాలపురం మండలం భీమోలు చెరువులో మట్టి ప్రతి ఏడాది తవ్వి బట్టీలకు తరలిస్తూ వుంటారు. మట్టి తరలించాలంటే కనీస నిబంధనలు పాటించాల్సి ఉండగా, నల్ల మట్టి రవాణా తమ హక్కు అంటూ ఇటుకబట్టీలు యజమానులు రాత్రి పగలు అనే తేడా లేకుండా మట్టి తరలిస్తున్నారు. సాక్షి, అమలాపురం: ఎండలు మండే కొద్దీ కొబ్బరి బొండాల ధర ఎగబాకుతోంది. వేసవి ఆరంభంలో అంతంత మాత్రంగా ఉన్న ధర చూసి రైతులు ఆందోళన చెందారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ బొండాల వినియోగం పెరగడంతో పాటు ధర కూడా అంతకంతకూ పెరుగుతుండడంతో వారు స్థిమితపడుతున్నారు. ఈ నెలలో కొబ్బరి బొండాల వినియోగం రెట్టింపైంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు కొబ్బరి బొండాల ఎగుమతి జోరందుకుంది. ఈ రెండు జిల్లాలో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల నుంచి బొండాల ఎగుమతి ఎక్కువగా ఉంటుంది. జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, మామిడికుదురు, అయినవిల్లి మండలాల నుంచి బొండాలను అధికంగా ఎగుమతి చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీలు నమోదవుతుండడంతో వీటి వినియోగం భారీగా పెరిగింది. గత నెలతో పోల్చుకుంటే ధరలు రైతులు ఊహించని విధంగా పెరిగాయి. రైతు వారీ కొబ్బరి బొండాం ధర రూ.25 (రైతు దింపు తీసి ఎగుమతి చేస్తే) వరకు ఉంది. వ్యాపారులే దింపు తీయించుకుంటే రూ.22 చెల్లిస్తున్నారు. మొక్కతోటలో (కాయ సైజు పెద్దగా) ఉండే చోట రూ.35 వరకు ధర వరకు చెల్లిస్తున్నారు. మహా నగరాల్లో లీటరు బొండం నీటి ధర రూ.140 నుంచి రూ.160 వరకు ఉంది. కొబ్బరి ఉత్పత్తి కేంద్రమైన కోనసీమ, కొబ్బరి మార్కెట్ కేరఫ్గా నిలిచిన అంబాజీపేటలో కొబ్బరి బొండాం లీటరు నీటి ధర రూ.140 పలుకుతుండడం గమనార్హం. దిగుబడి తగ్గడం కూడా ఏప్రిల్–మే నెలలో రావాల్సిన బొండాల దిగుబడి ఇప్పుడు రావడం లేదు. తెల్లదోమ, గత ఏడాది అధిక వర్షాల వల్ల పువ్వులు రాలిపోవడం వంటి కారణాలతో బొండాల సేకరణ తగ్గిపోయింది. ఇది కూడా ధర పెంపునకు కారణమైంది. కొబ్బరి బొండాలకు ధర పెరిగినా సేకరణ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఎగుమతులు అనుకున్న స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు. గత నెలలో ఆయా జిల్లాల నుంచి రోజుకు 70 ఐషర్లు, లారీల వరకు బొండాలు ఎగుమతి కాగా, దిగుబడి తగ్గడంతో 50 లారీల మించి ఎగుమతి కావడం లేదని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం వల్ల ఇటీవల కొబ్బరి కాయ ధర పెరిగిన విషయం తెలిసిందే. దీని వల్ల ఇటు కొబ్బరి బొండం, అటు కొబ్బరి కాయల ధర పెరిగినా రైతులలో పెద్దగా సంతృప్తి లేకుండాపోయింది. అయితే మండు వేసవిలో కొబ్బరి బొండం అందుబాటులో లేకుండా పోవడంపై సామాన్యులు నిట్టూరుస్తున్నారు. కోకోనట్ వాటర్ బాటిల్ ఉష్ణోగ్రతలతో తగ్గిన కొబ్బరి దిగుబడి ఫలితంగా భారీగా పెరిగిన ధరలు రైతు వారీ రూ.22 నుంచి రూ.35 వరకు లీటరు నీరు రూ.140.. బొండాం రూ.40 నుంచి రూ.50 కోనసీమ జిల్లాలోనే ధరలు అధికం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అంచనాలకు మించి.. గత మార్చి నెలలో కొబ్బరి బొండం ధర రైతు వారీ రూ.13 నుంచి రూ.15 వరకు ఉండగా, ఏప్రిల్ రెండో వారంలో రూ.17 నుంచి రూ.25 వరకు పెరిగింది. ఈ పెరుగుదల రైతులకు కొంత ఊరటనిచ్చింది. ఇక్కడ నుంచి ఎగుమతి అవుతున్న బొండాలను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రిటైల్గా రూ.40 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. లీటరు బొండం నీళ్లు రూ.120 వరకు ఉండేది. ఇప్పుడు బొండంతో పాటు, నీళ్ల ధర సైతం అంచనాలకు మించి పెరిగింది. -
మహిళా దొంగల ఆచూకీ తెలపండి
జగ్గంపేట: జగ్గంపేట ఏరియాలో సంచరిస్తున్న మహిళా బ్యాగ్ దొంగలు ముఠా ఆచూకీ తెలిసిన వెంటనే ఆటో డ్రైవర్లు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. జగ్గంపేటలో స్థానికులు, ఆటో డ్రైవర్లకు ఆయన మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా దొంగలు ఆటోలో తిరుగుతూ బ్యాగ్లు చోరీ చేయడం, బస్లు ఎక్కేటప్పుడు, వెనక వుండి విలువైన వస్తువులు, హేండ్ బ్యాగ్లు చోరీ చేస్తున్నారని అన్నారు. ఒక ముఠా సభ్యులు ఈ నేరాలకు పాల్పడుతున్నారని, దీనివల్ల చాలా మంది నష్టపోతున్నారని చెప్పారు. ఆటో డ్రైవర్లు అప్రమత్తంగా వుండాలని, అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ట్రాఫిక్కు అంతరాయం లేకుండా తమ వాహనాలను రోడ్లుపై నిలపాలని, నిబంధనలకు అనుగుణంగా అవసరమైన పత్రాలు దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. ఆటోలో ప్రయాణించే వారి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని సూచించారు. జగ్గంపేట సీఐ బి.తిరుపతిరావు, ఎస్సై రఘునాథరావు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలతో అనేక అనర్థాలు
మోతుగూడెం: మత్తు పదార్థాలను వాడడం వల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అదనపు పోలీస్ సూపరింటెండెంట్ హేమంత్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మంగళవారం మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కవరం గ్రామంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన హత్యలు, మద్యం మత్తులో ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యక్తులు, కుటుంబాలు ఎదుర్కొన్న నష్టాలను వివరించారు. ఇటువంటి సంఘటనలు కుటుంబాలను చిన్నాభిన్నం చేసే పరిస్థితులకు దారితీస్తాయన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, మహిళల రక్షణ, భద్రత అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. సమావేశంలో సుమారు 150 మంది గ్రామస్తులతో పాటు చింతూరు సీఐ గోపాలకృష్ణ, మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నసీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిపై ప్రశ్నిస్తే దాడులా?
– పాటంశెట్టి సూర్యచంద్ర ఆవేదన కిర్లంపూడి: జగ్గంపేట నియోజకవర్గంలో జరుగుతున్న మట్టి, ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై ప్రశ్నిస్తే ఇంటికొచ్చి భౌతిక దాడులు చేయడం సమంజసమేనా అంటూ గత ఎన్నికల్లో జగ్గంపేట నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పాటంశెట్టి సూర్యచంద్ర స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను ప్రశ్నించారు. సోమవారం బూరుగుపూడిలోని ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ, ప్రజా సమస్యలపై తన నివాసంలో ప్రెస్మీట్ పెడితే జరగకుండా ఆపేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మా ఇంటి పైకి పంపించి నా మీద, నా శ్రేయోభిలాషుల మీద భౌతిక దాడులు చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుని అణచివేయడం న్యాయమా? అని సూర్యచంద్ర ప్రశ్నించారు. తన ఇంటి మీదకి వచ్చి తన మీద, తన అనుచరులపై దౌర్జన్యం చేయడమే కాకుండా, తమపై తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోయడమేనని అన్నారు. ఎమ్మెల్యే అవినీతి చేయకపోతే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల మట్టి, ఇసుక అక్రమ తోలకాలు ఎవరు చేస్తున్నారో నిరూపించాలన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు మీకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరువర్గాలు పరస్పరం కేసులు బూరుగుపూడిలో జరిగిన వివాదంపై ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నట్టు స్థానిక ఎస్సై జి.సతీష్ తెలిపారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పాటంశెట్టి సూర్యచంద్ర ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో సూర్యచంద్ర దూషించారంటూ టీడీపీ దళిత నేత మూరా సత్తిబాబు ఫిర్యాదు చేశారు. -
మున్సిపల్ స్టేడియంపై డ్రోన్ నిఘా
ఇదేం ‘బరి తాగింపు’పై కమిషనర్ సీరియస్ రాజమహేంద్రవరం సిటీ: నగరం నడిబొడ్డున ఉన్న నగరపాలక సంస్థ మున్సిపల్ స్టేడియంలో పట్టపగలు బహిరంగంగానే మద్యం తాగుతూ సందర్శకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో ‘ఇదేం బరి తాగింపు’ శీర్షికన సోమవారం సాక్షిలో కథనం వెలువడటంతో నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్మీనా సీరియస్ అయ్యారు. తక్షణమే చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులకు లేఖ రాశారు. దీంతో మందుబాబుల ఆగడాలు కట్టించేందుకు మఫ్టీలో పోలీసులు చర్యలు చేపట్టారు. చీకటి సమయంలో మందుబాబుల ఆటకట్టించేందుకు మున్సిపల్ స్టేడియంలో డోన్ ఎగురవేసి నిఘా నిర్వహించారు. సాక్షి కథనంతో అప్రమత్తమైన నగరపాలక సంస్థ అధికారులు మున్సిపల్ స్టేడియంలో పూర్తిస్థాయి నిఘా పెంచాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాత్రి సమయాల్లో గోడలు దూకి లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026–27 విద్యాసంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు అడ్మిషన్ల కన్వీనర్ ఎంవీజే వర్మ సోమవారం తెలిపారు. కాకినాడ, జగ్గంపేట ప్రభుత్వ ఐటీఐలతో పాటు కోనసీమలో ఉన్న ప్రైవేట్ ఐటీఐలకు జూన్ 30వ తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూలై 2వ తేదీలోగా సంబంధిత ఐటీఐలో తమ విద్యార్హతల సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 0884–2348182 నంబరులో సంప్రదించాలన్నారు. భక్తజన సంద్రంగా రత్నగిరి అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సంద్రంగా మారింది. విద్యాసంస్థలకు వేసవి సెలవుల కారణంగా స్వామివారి సన్నిఽధికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. దీనికితోడు గత వారంలో వివాహాలు చేసుకుని స్వామివారి సన్నిధికి రాలేని దూర ప్రాంత భక్తులు కూడా పెద్ద సంఖ్యలో సత్యదేవుని సన్నిధికి వస్తున్నారు. వీరంతా సత్యదేవుని దర్శించి స్వామివారి వ్రతాలాచరిస్తున్నారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూ లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. సత్యదేవుని వ్రతాలు 2,500 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మందికి అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ నల్లం సూర్యచక్రధర్రావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. అలరించిన నృత్య ప్రదర్శనలుఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): శ్రీ త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి 75 వసంతాల సందర్బంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఏసీ ఆడిటోరియంలో అమృతోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం రెడ్డి ఉమారాణి బృందం నృత్య ప్రదర్శనలు ఆద్యంతం అలరించాయి. త్యాగరాజస్వామి రచించిన ’ఎందరో మహానుభావులు..’, అహల్య శాప విముక్తికి సంబంధించిన ’శ్రీరామ పాదమా..’, ‘నన్ను కన్న తల్లి నా భాగ్యమా..’ తదితర కీర్తనలకు నర్తించారు.బాలాంత్రపు రజనీకాంతరావు రచించిన ’మహిషాసురమర్థిని...’ఘట్టానికి నృత్యాభినయం చేసి కరతాళ ధ్వనులు అందుకున్నారు. అనంతరం యూఎస్ఏకి చెందిన చింతలపాటి రూపారాజు కూచిపూడి నృత్యంతో అలరించారు. కోదండరామా, పట్టాభి రామా అనే త్యాగరాజ కీర్తనకు ఆమె అద్భుతంగా నర్తించారు. అనంతరం ఉమారాణి బృందం గోదా కల్యాణం రూపకం ప్రదర్శించారు. సమితి కార్యవర్గ సభ్యులు వాడ్రేవు వెంకట రమణారావు, సీఎస్ వెంకట్రావు, వక్కలంక శ్రీరామచంద్రం, విశ్వనాథం భాస్కర రామ్, వి.కృష్ణకుమారి, పర్యవేక్షించారు. -
ఆంధ్రప్రదేశ్లోనే ధరలు ఎక్కువ
మాజీ మంత్రి కన్నబాబు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. ఎన్నికల ముందు పెట్రో ధరలు పెంచేశారని మాట్లాడిన చంద్రబాబు ఇప్పడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెబుతారు. మన రాష్ట్రంలో పెట్రోలు లీటరు రూ.113 దాటిపోయింది. డీజిల్ రూ.100 దాటింది. తమిళనాడు కన్నా పెట్రోల్ మనకు రూ.7 ఎక్కువ. గుజరాత్కు మనకు రూ.15 తేడా ఉంది. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత ఎన్నికల ముందు పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచే ప్రసక్తే లేదన్నారు. ఎలాంటి అదనపు పన్నుల భారం వేయబోమని చెప్పారు. పై పెచ్చు వ్యాట్ తగ్గిస్తామని గొప్పలకు పోయారు. ఇప్పుడు ఆ హామీలను గాలికొదిలేసి ధరల భారం మోపడం అన్యాయం కాదా. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. వెంటనే తగ్గించాలి కాకినాడ సిటీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగ్గించాలి. పెట్రో ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటితో సామాన్యులు నలిగిపోతారు. పెంచిన ధరలు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. దేశంలోనే అత్యధిక ధరలు ఇక్కడ ఉండటం ఎవరి అసమర్థతతో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తండ్రీ కొడుకులు ప్రజలను వంచించారు మాజీ మంత్రి తోట నరసింహం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు మంత్రి లోకేశ్ ప్రజలను నిలువునా వంచించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో స్వల్పంగా పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితేనే ఎక్కడలేని హంగామా సృష్టించిన తండ్రి, కొడుకులు రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్పై ఎందుకు అధికఽ ధరలు వసూలు చేస్తున్నారు. నిజమైన బాదుడు ఎలా వుంటుందో చంద్రబాబు ప్రజలకు రుచి చూపించారు. -
గ్యాస్ను ఇతర రాష్ట్రాలకు తరలించడం సరికాదు
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: కేజీ బేసిన్లో అపారంగా లభ్యమవుతున్న సహజ వాయువు (గ్యాస్)ను చమురు సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలించడంపై ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన గ్రీవెన్స్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కోనసీమ ప్రాంతం నుంచి అధిక మొత్తంలో చమురు, సహజ వాయువులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ రూ. వందల కోట్లలో లాభాలు ఆర్జిస్తున్నా ఈ ప్రాంతానికి మొండిచేయి చూపుతున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. కోనసీమలో గ్యాస్ ఉత్పత్తి జరుగుతున్న పట్టణాలు, గ్రామాల ప్రజలు నేటికీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అధిక ధరతో కొనుగోలు చేసే దుస్థితి ఉందని చెప్పారు. కేజీ బేసిన్ పరిఽధిలో ఇంటింటికీ గ్యాస్ను పైపులైన్ల ద్వారా సరఫరా చేసే పీఎన్జీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనిపై 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన లేదని ధ్వజమెత్తారు. స్థానికంగా లభ్యమయ్యే గ్యాస్ను ప్రజలకు తక్కువ ధరకు అందించే ఆలోచన ఉందా.. అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఇంటింటికీ పైపులైన్ల ద్వారా ఉచిత గ్యాస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్ యూనివర్సిటీని కేంద్ర ప్రభుత్వం అనకాపల్లి నుంచి ఇతర రాష్ట్రానికి తరలించుకుపోయిందన్నారు. గ్యాస్ కార్పొరేషన్ను ప్రభుత్వమే నిర్వహించాలని ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. -
మంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026
పెట్రోమంటపై ప్రజాగ్రహం● వినూత్నం..విభిన్నంగా ర్యాలీలు ● మోటార్ సైకిళ్లు, ట్రాక్టర్లతో నిరసన ● పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అడ్డగోలుగా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలపై ప్రజాగ్రహం పెల్లుబుకింది. పెరిగిన ధరలతో సామాన్యుల నడ్డి విరుస్తోన్న చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అసలే సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుచేయకుండానే అమలు చేశామంటున్న సీఎం చంద్రబాబు తీరుపై దాదాపు అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇందుకు పెట్రోలు, డీజిల్ ధరల మంట కూడా తోడవ్వడంతో ప్రజా భాగస్వామ్యంతో వైఎస్సార్ సీపీ సోమవారం తలపెట్టిన ఆందోళన జిల్లా అంతటా సూపర్సక్సెస్ అయ్యింది. తుని నుంచి మొదలు పెట్టి కాకినాడ నగరం వరకు కాకినాడ జిల్లా అంతటా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలతో హోరెత్తించారు. పెరిగిన పెట్రో ధరల భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వం భరించాల్సింది పోయి దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పెంచడంపై నిరసనాగ్రహం వ్యక్తమైంది. జిల్లాలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆందోళనా కార్యక్రమాలకు పల్లె, పట్టణం అనే వ్యత్యాసం లేకుండా వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపునకు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, తుని, ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సందోహంతో ఆందోళనలు సాగాయి. పెంచిన ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. వినూత్నమైన, విభిన్నమైన రీతిలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేయడం ప్రజలను ఆకర్షించింది. కాకినాడ రూరల్ మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ సమన్వయకర్త కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో సర్పవరం జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. వైద్యనగర్లో క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి సర్పవరం జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ నిరసన అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. తహసీల్దార్ కుమారికి పెట్రోలు ధరలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సుమారు రెండు గంటలపాటు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, ఎస్ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జీ, కరీంబాషా పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, కాకినాడలో పార్టీ సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి పార్టీ నేతలు పార్టీ సిటీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా పరిషత్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించారు. అనతరం ఆర్డీఓ మల్లిబాబుకు వినతిపత్రాన్ని అందించారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ మహిళ రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తికుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్కుమార్, పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, జిల్లా ట్రేడ్ అధ్యక్షుడు చెక్కా చక్రవర్తి ర్యాలీలో పాల్గొన్నారు. పెద్దాపురం రాష్ట్రంలో జంట మున్సిపాలిటీలు కలిగిన పెద్దాపురం నియోజకవర్గంలో కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో సామర్లకోట వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు ఎడ్ల బండిపై వచ్చి పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలతో జనం అల్లాడిపోతున్నారనే విషయాన్ని స్పష్టం చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ఎడ్లబండి నిలిపి నిరసన తెలియజేసి ఆర్డీఓ భానుకు నేతలు వెంటరాగా దొరబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద పాసింజర్ ఆటోను తాళ్లతో లాగుతూ నిరసన తెలియజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కంటి సాయిప్రసాద్, సీనియర్ నేత కంటే వీర రాఘవరావు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, జెడ్పీటీసీ సభ్యుడు కవరసాన సూరిబాబు, యువజన విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి కరణం భాను పాల్గొన్నారు. జగ్గంపేట స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమై జగ్గంపేట తహసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. ర్యాలీతో పాటు పెద్ద ఎత్తున రైతులు తీసుకువచ్చిన ట్రాక్టర్లతో మాజీ మంత్రి, నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట నరసింహం ఆధ్వర్యంలో నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రాగా ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడ వినూత్నంగా రైతులు ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. అనంతరం పార్టీ కోఆర్డినేటర్ తోట, నాయకులు తహసిల్దార్ జేవీఆర్ రమేష్కు వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ ముఖ్యనేతలు రామకుర్తి జగాల్, పాటి రాంబాబు, కరుటూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు పిఠాపురంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, మత్స్యకారులు, స్థానికులు పెద్ద ఎత్తున ఉప్పాడ సెంటర్కు తరలివచ్చి నిరసన ప్రదర్శన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసిల్దార్ గోపాలకృష్ణకు వినతిపత్రాన్ని అందించారు. సీఈసీ సభ్యుడు గండేపల్లి బాబి, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్థినీడి సుజాత పాల్గొన్నారు. తుని మండలంలోని ఎస్ అన్నవరం పార్టీ కార్యాలయం నుంచి మూడు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక తహసిల్దార్ కార్యాలయం వరకు సాగింది. డిప్యూటీ తహసిల్దార్కు వినతి పత్రం అందజేశారు. లోవ దేవస్థానం మాజీ చైర్మన్ లాలం బాబ్జి, తాండవ సుగర్స్ మాజీ చైర్మన్ నాగం దొరబాబు, పార్టీ మున్సిపల్ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణ గౌడ్, తుని తొండంగి మండలాల పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, తుని పట్టణ శాఖ అధ్యక్షులు అన్న వరం శ్రీను ఆదోళనలో ఉన్నారు.ప్రత్తిపాడులో పెట్రో పెంపునకు నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్తిపా డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశా యి. అక్కడి నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ఎం.సూర్యప్రభకు వినతి పత్రం అందజేశారు. రౌతులపూడి, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు గొల్లు చిన్నదివానం, రాజేశ్వరి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు బెహరా దొరబాబు పాల్గొన్నారు. నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత ఆధ్వర్యంలో పిఠాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు జగ్గంపేటలో ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి తోటనరసింహం. పెంపు పాపం చంద్రబాబుదే పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు పాపం చంద్రబాబుదే. నాడు మా పాలనలో పెరిగితే జగన్ మోహన్రెడ్డి అసమర్ధ పాలన అన్న నాయకులు ఇప్పుడు ఏమి చేస్తున్నారు. కూటమిలో ఉన్న చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రాలేకపోతున్నారు. చంద్రబాబుకు మోసాలు చేయడం కొత్త కాదు.అందులో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు.


