breaking news
Kakinada
-
వనామీపై సునామీ
ధరపై తీవ్ర ప్రభావం రొయ్యల లభ్యత తక్కువగా ఉన్న సమయంలో వాటి కౌంట్లకు మంచి ధర రావడం సాధారణం. ఈసారి కూడా మంచి ధర వచ్చింది. పది రోజుల క్రితం రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. వంద కౌంట్ (కిలోకు వంద రొయ్యలు) ధర రూ.265 వరకు ఉండగా, 90 కౌంట్ రూ.275గా, 80 కౌంట్ రూ.295గా, 70 కౌంట్ రూ.325గా, 60 కౌంట్ రూ.345గా, 50 కౌంట్ రూ.375గా, 40 కౌంట్ రూ.395గా, 40 కౌంట్ రూ.440 వరకూ ఉండేది. ఈ సమయంలో ట్రంప్ రెండోసారి భారతీయ దిగుమతులపై 25 సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిని తర్వాత 50 శాతానికి పెంచారు. ప్రస్తుతం 25 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. సుంకాల ప్రకటన తర్వాత వనామి రొయ్యల ధరలను కొనుగోలుదారులు మరోసారి తగ్గించేశారు. కౌంట్కు వచ్చి రూ.30 నుంచి రూ.50 వరకూ కోత పెట్టడం గమనార్హం. వంద కౌంట్ ధర రూ.235 వరకు తగ్గగా, 90 కౌంట్ రూ.245, 80 కౌంట్ రూ.265, 70 కౌంట్ రూ.285, 60 కౌంట్ రూ.305, 50 కౌంట్ రూ.325, 40 కౌంట్ రూ.345, 30 కౌంట్ రూ.390కి పడిపోయాయి. సాక్షి, అమలాపురం: ఓవైపు కొలుగోలుదారులు సిండికేటుగా మారి ధర పెరిగినప్పుడల్లా ఏదో కారణంతో తగ్గించేస్తున్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడితో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. ఏడాది కాలంగా వనామీ రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగిన ప్రతిసారీ ఏదోక ఉపద్రవం రావడం.. ధర పతనం కావడం పరిపాటిగా మారింది. ఎటువంటి ఇబ్బందులు లేకున్నా.. స్థానిక కొనుగోలుదారులు ధర తగ్గించి ఆక్వా రైతుల నడ్డివిరుస్తున్నారు. తాజాగా ట్రంప్ టారిఫ్ ప్రకటనతో మరోసారి వనామీ ధరలు తగ్గడం రైతుల్లో కొత్త ఆందోళనకు తెర తీసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తీర ప్రాంత మండలాల్లో వనామీ రొయ్యల సాగు అధికంగా సాగుతోంది. కాకినాడ జిల్లాలో సుమారు 8 వేల ఎకరాల్లో ఈసాగు ఉండగా, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో జరుగుతున్నట్టు అంచనా. ఆయా జిల్లాల్లో మొత్తం 23 వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు ఆక్వా వర్గాలు చెబుతున్నాయి. మొదటి పంట పూర్తయి, రెండో పంటకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కోనసీమ జిల్లావ్యాప్తంగా 20 శాతం మాత్రమే చెరువుల్లో వనామీ రొయ్యలున్నాయి. సందు దొరికితే.. అంతర్జాతీయంగా ఏ చిన్న సంఘటన జరిగినా దానిని బూచిగా చూపించి రొయ్యల ధరలు తగ్గించడం కొనుగోలుదారులకు పరిపాటిగా మారింది. వీరంతా సిండికేట్గా ఉండడంతో ఒకే మాటపై ధరలు తగ్గించేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో వనామీ రొయ్యలకు మంచి ధర పలికింది. మార్కెట్కు రొయ్యలు పెద్ద సంఖ్యలో వస్తూండడంతో కౌంట్కు రూ.20 చొప్పున ధర తగ్గించారు. ● ఏప్రిల్ తొలి వారంలో ట్రంప్ టారిఫ్ ప్రకటించగానే, దానిని అడ్డుపెట్టుకుని ధరలు భారీగా తగ్గించారు. కౌంట్కు రూ.60 వరకు ధర క్షీణించింది. తర్వాత సుంకాల విధింపు మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. కానీ కౌంట్కు రూ.15 మాత్రమే ధర పెంచడం గమనార్హం. ● గత నెల నుంచి చెరువులు ఖాళీ అయి మార్కెట్కు రొయ్యల రాక తగ్గింది. దీంతో ధరలు మరోసారి పెరిగాయి. ఇదే సమయంలో ట్రంప్ సుంకాల ప్రకటన రైతులను కుదేలు చేసింది. వనామి ధరలు మరోసారి పతనమయ్యాయి. ● జిల్లా నుంచి ఎగుమతి అయ్యే వనామీ, సముద్రంలో దొరికే టైగర్, ఇతర రొయ్యలు 70 శాతానికి పైగా అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. గతంలో యన్టీ డంపింగ్ టాక్స్ 4.5 శాతం, డీవీడీ ట్యాక్స్ 5 శాతం చొప్పున మొత్తం 9.5 శాతం మాత్రమే టాక్స్ ఉండేది. దీనిపై అదనంగా 25 శాతం టాక్స్ను ట్రంప్ ప్రభుత్వం అమలు చేస్తోంది. అంటే మొత్తం 34.9 శాతం టాక్స్ భారం పడుతోంది. ● వాస్తవంగా ట్రంప్ టారిఫ్ ప్రభావం మొదట పడేది అమెరికాలోని వినియోగదారులపైనే. ఇదే వంకతో కొనుగోలుదారులు ఇక్కడ రొయ్యల కొనుగోలు నిలిపివేశారు. ఇప్పుడు కేవలం 25 శాతం సుంకం ఉండగా, ఈ నెల 25వ తేదీ నుంచి 50 శాతం వసూలు చేయనున్నారు. దీంతో వనామీ ధరలు మరింత పతనం కానున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ● ఆగస్టు నెలాఖరు నుంచి రెండో పంటకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో వారిపై సుంకాల పిడుగు పడింది. దీంతో రైతులు సాగు విషయంలో పునరాలోచనలో పడ్డారు. 50 శాతం టారీఫ్ వల్ల ధరలు మరింత తగ్గితే.. సాగుకు తాత్కాలిక విరామం ఇచ్చేందుకూ వెనుకాడేది లేదంటున్నారు. గత జనవరి నుంచి ఇప్పటి వరకు కౌంట్ ధరలు ఇలా..కౌంట్ ఫిబ్రవరి మార్చి తొలిసారి సుంకాలు పది రోజుల రెండోసారి సుంకాలు రకం తొలి వారంలో తొలి వారంలో ప్రకటించాక... క్రితం మార్కెట్ ప్రకటించాక 30 470 465 425 440 390 40 415 390 340 400 345 50 375 365 320 375 325 60 345 335 300 345 305 70 320 300 295 325 325 80 285 270 255 295 265 90 265 250 235 275 245 100 255 240 225 265 235 సిండి‘కాటు’ నుంచి సుంకాల ‘వేటు’ వరకు మరోసారి రొయ్యకు కష్టకాలం రెండుసార్లు అమెరికా సుంకాల దాడి విదేశాలకు వెళ్లేది 50 కౌంట్ లోపు మాత్రమే.. టారిఫ్ పేరిట మొత్తం కౌంట్ల ధర కుదింపు ప్రస్తుతం సాగు 20 శాతమే.. ఉమ్మడి తూర్పున 23 వేల ఎకరాల్లో ఆక్వా సాగు -
పోరాటాల కల్పవల్లి కొత్తపల్లి
పిఠాపురం: స్వాతంత్య్రం వచ్చెనెని సభలే చేసి.. సంబరపడగానే సరిపోదోయీ.. సాధించిన దానికి సంతృప్తిని పొంది.. అదే విజయమనుకుంటే పొరపాటోయీ.. అని దేశ శృంఖలాలు విడివడిన తొలినాళ్లలోనే ఎందరో అభ్యుదయ కవులు ఇటువంటి ఎన్నో దేశభక్తి గేయాలకు పదాలు కూర్చారు. ఎందరో మహానుభావుల త్యాగాలతో సాధించుకున్న స్వరాజ్యాన్ని ప్రతి భారతీయుడు నరనరానా జీర్ణించుకోవాలి. చేసే ప్రతి పనిలో జాతీయభావాన్ని నింపుకొని జాతి ఔన్నత్యానికి కృషి చేయాలి. అప్పుడే స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలకు విలువ. రేపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. స్ఫూర్తి రగిలించిన ‘చల్లా’ ఆస్తులున్నా ఆనందంగా జీవించే స్వాతంత్య్రం లేనప్పుడు అవి అనుభవించే అర్హత మనకు లేదంటూ దేశం కోసం తృణప్రాయంగా త్యాగం చేసిన చిరస్మరణీయులలో కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు చల్లా నారాయణమూర్తి ఒకరు. ఈయన 1911–2003 మధ్య కాలంలో జీవించిన ఆయన ఆంగ్లేయుల పాలనను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్రాన్ని స్వీకరించారు. అలహాబాద్లో కాంగ్రెస్ సేవాదళ్ సహాయ కార్యదర్శిగా కూడా ఆయన పని చేశారు. స్వాతంత్య్రోద్యమానికి హిందీ భాష అవసరం కావడంతో జవహర్లాల్ నెహ్రూ సతీమణి కమలా నెహ్రూ వద్ద ఆ భాషను నేర్చుకున్నారు. అంతే కాకుండా గోండా జైలులో లాల్బహుదూర్శాస్త్రితో కలిసి 6 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని శిక్షలు అనుభవించారు. జవహర్లాల్ నెహ్రూ, కేడీ మాలవ్య, ఉమాశంకర్ దీక్షిత్, టంగుటూరి ప్రకాశంపంతులు, పొట్టి శ్రీరాములు, మల్లిపూడి పళ్లంరాజు మొదలైన వారితో సత్సంబంధాలు ఉండేవి. మహాత్మగాంధీ వంటి జాతీయ నాయకులతో కలిసి పది రోజుల పాటు తీహార్ జైలులో గడిపారు. మద్దూరి అన్నపూర్ణయ్యతో కలిసి విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యంలో పాల్గొన్నారు. పీయూసీ వరకు చదివిన ఆయన వివిధ భాషల్లో మంచి ప్రావీణ్యం పొందారు. తాటిపర్తి గ్రామానికి ఆయన తొలి సర్పంచ్గా పని చేసి గ్రాామాన్ని విద్యుత్ వెలుగులతో నింపారు. గొల్లప్రోలు కో ఆపరేటివ్ సొసైటీకి అద్యక్షుడుగా పని చేశారు. అస్పృశ్యత నిర్మూలనకు కృషి కుల మతాలకు అతీతంగా ఆయన వ్యవహరించేవారు. నిమ్న కులాలను ఎంతో ఆదరించి, విద్యాబుద్ధులు నేర్పేవారు. ఆయన వద్ద విద్యనభ్యసించిన ఎందరో నేడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. ఆస్తంతా అర్పించి.. అవస్థలు నారాయణమూర్తి పెద్ద భూస్వామిగా పేరొందారు. స్వాతంత్య్ర పోరాటంలో తనకు ఉన్న 150 ఎకరాల భూమిని నగదు, ఆభరణాలను అర్పించారు. తన కుటుంబ పోషణను కూడా లెక్క చేయకుండా కేవలం స్వాతంత్య్ర సమరం కోసం మొత్తం సమర్పించారు. ఆయనకు ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ పట్టణాల్లో జీవిస్తున్నారు. 2003లో ఆయన కన్నుమూసేనాటికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పిల్లల పెళ్లిళ్లు చేయలేని స్థితి ఏర్పడింది. క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమర యోధులకు క్రాంతి మైదాన్ పేరిట అప్పటి కలెక్టర్ సతీష్ చంద్ర, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోన్రావు తదితరులు ఆయనను సత్కరించారు. తాటిపర్తిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జీవిత చరిత్రను ప్రస్తుత జనాలకు తెలిసేలా శిలాఫలకం ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ తొలి సమావేశంలో ఆయన జైలు జీవితం అనుభవించినట్లుగా తొలి తీర్మానం చేశారు. ఆదరిస్తామన్నా తిరస్కరించి.. ఆయన చివరి రోజుల్లో ప్రభుత్వ ఆదరణ అవకాశాన్ని సైతం ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను ఏదో సంపాదించుకోవాలని పోరాటం చేయలేదని ఉన్నదాని కంటే స్వాతంత్య్రం వచ్చిందన్న సంతృప్తే నాకు కోట్ల ఆస్తితో సమానమని పేర్కొన్నారు. దీంతో ఆయనను సన్మానించి అధికారులు వెనుదిరిగారు. మన తెలుగునేల ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు. చరిత్రకారులకు జన్మస్థలమైన కొత్తపల్లి అలనాటి వైభవాన్ని నేటికీ చాటిచెబుతోంది. ఎక్కడ చూసినా చరిత్ర ఆనవాళ్లు దర్శనమిస్తుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమం తొలినాళ్లలో అప్పటి పిఠాపురం తాలూకాలో కొత్తపల్లి ఫిర్కాకు ప్రత్యేక స్థానం వుంది. ఎందరో చరిత్రకారులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజవంశీయుల పుట్టినిల్లు కొత్తపల్లి. పిఠాపురం తాలూకాలో ఐదు వేల జనాభాతో అతిపెద్ద గ్రామంగా విరాజిల్లింది. దివ్య క్షేత్రంగాను, కళా కేంద్రంగాను, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయంగా, సాహితీ మందిరంగా రాజకీయ చైతన్యానికి ఆలవాలంగా చరిత్ర పుటలకెక్కింది. రావు అచ్చియ్యరావు, పుత్సల సత్యనారాయణ, రావు వెంకట జగ్గారావు, అల్లిక సన్యాసయ్య, జ్యోతుల కాశీస్వామి, జ్యోతుల శేషయ్య, చిట్టాడ చిన్న ముత్యాలు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు కొత్తపల్లిలో జన్మించి దేశ అభ్యుదయానికి తమ వంతు కృషి చేశారు. నాటి కొత్తపల్లి రాజకీయ కారణాలతో వాకతిప్ప, కుతుకుడుమిల్లి, కొత్తపల్లిగా విడిపోయింది. కాకతీయుల ఘనతను చాటి చెప్పిన రావు వారి వంశం ఈ గ్రామంలోనే అధిక శాతం నివసించారు.. నివసిస్తున్నారు. ఆయుర్వేద వైద్యానికి, వస్త్ర పరిశ్రమలకు నిలయమై, స్వాతంత్య్ర సమరం, ఉప్పు సత్యగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖద్దరు ప్రచారం, హరిజనోద్ధరణ కార్యక్రమాలకు కొత్తపల్లి వేదికై ంది. బులుసు సాంబమూర్తి సారధ్యంలో కొత్తపల్లిలో ప్రధమ రాజకీయ మహాసభ ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ మహాసభ కొత్తపల్లి చరిత్రలో కలికితురాయి. ఆ సమయంలోనే స్థానికులు విదేశీ వస్త్రాలను గుట్టలుగా పోసి తగులబెట్టారు. దీంతో వారిపై అక్రమ కేసులు బనాయించినా పిఠాపురం తాలూకా పరిధిలో సాక్ష్యం చెప్పేవారు లేక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కాకినాడలో జరిగిన కాంగ్రెస్ మహా సభకు నాయకులు కొత్తపల్లి నుంచే భారీ సన్నాహాలు చేశారు. మహాత్మ గాంధీ, పండిట్ నెహ్రూ, జయప్రకాష్ నారాయణ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు ఎందరో ఇక్కడ సందేశాలిచ్చి ప్రజలను చైతన్యపరిచారు. సద్గ్రంథాలు, సన్మిత్రులవలే సహృదయ శాసనాలు కావిస్తాయని నమ్మిన అప్పటి స్వాతంత్య్ర సమర యోధులు రావు అచ్చియ్యరావు తన స్వగ్రామం కొత్తపల్లిలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. టౌన్ హాల్గా పిలిచే ఆ గ్రంథాలయంలో రాజకీయ, సామాజిక, స్వాతంత్య్ర సంగ్రామం గ్రంథాలను ఏర్పాటు చేశారు. దీనిని విజ్ఞాన మందిరంగాను, కళా కేంద్రంగా రూపొందించారు. సభలు, సమావేశాలు, విద్యాగోష్టులు, నిర్వహించడంతో ఈ గ్రంథాలయానికి ఎంతో ప్రాచీనత సంతరించుకుంది. స్వాతంత్య్ర సమరయోధుల వైద్య సేవల కోసం సుమారు 118 ఏళ్ల చరిత్ర గలిగిన కొత్తపల్లిలోని శ్రీలక్ష్మి గణపతి ఆయుర్వేద నిలయం ఎంతగానో తోడ్పడేది. విదేశీ వస్త్ర బహిష్కరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తపల్లిలో ఖద్దరు తయారీ కేంద్రాలను నెలకొల్పారు. అదే నేడు కొత్తపల్లికి ఘన కీర్తిని తెచ్చిపెట్టింది. ఉప్పు సత్యాగ్రహం సమయంలో అప్పట్లో ఉప్పువాడగా పేరొందిన ప్రస్తుతం ఉప్పాడను పలువురు స్వాతంత్య్ర సమరయోధులు సందర్శించి నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. స్వాతంత్య్ర ఉద్యమ దివిటీలెన్నెన్నో.. పల్లెపల్లెలో రగిలిన పోరాట స్ఫూర్తి మహనీయుల త్యాగాలు.. చరితలతో నిండిన నేల త్రివర్ణ పతాక రెపరెపల వేళ.. త్యాగధనుల సంస్మరణలివి -
సీతారామ సత్రం పరిశీలన
అన్నవరం: రత్నగిరిపై శిథిలావస్థకు చేరిన శ్రీ సీతారామ సత్రాన్ని జేఎన్టీయూ ప్రొఫెసర్లు బుధవారం పరిశీలించారు. గతంలో ఈ సత్రాన్ని కూల్చివేయాలని వారు సూచించడం, కాదు.. మరమ్మతులు చేస్తే సరిపోతుందని దేవదాయ సలహాదారు సిఫార్సు చేయడం.. దీనిపై వివాదం నెలకొన్న విషయం పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో జూన్ 26న ‘సాక్షి’లో ‘సత్యదేవ చూడవయ్యా’ శీర్షికన ప్రచురితమైన కథనంపై కలెక్టర్ షణ్మోహన్, దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ సత్రాన్ని జేఎన్టీయూకే బృందం మళ్లీ పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వారి నివేదిక ఆధారంగా కొత్త సత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు వర్సిటీ ప్రొఫెసర్లు వి.రవీంద్ర, జి.ఏసురత్నంతో కూడిన బృందం సత్రాన్ని పరిశీలించి అనంతరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణతో చర్చించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. టెండర్ ఖరారై మూడు నెలలైనా.. రూ.11.40 కోట్ల వ్యయంతో తొలి దశలో నాలుగు అంతస్తులలో 105 గదులతో సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవగా దాదాపు 16 శాతం లెస్కు టెండర్లు ఖరారయ్యాయి. ఇది జరిగి మూడు నెలలైనా సత్రం ఎక్కడ నిర్మించాలన్న స్పష్టత లేక పనులు ప్రారంభం కాలేదు. దరఖాస్తుల ఆహ్వానం నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పాఠశాల విద్యాశాఖ జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనపరచిన పాఠశాలల నుంచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్ బుధవారం తెలిపారు. జిల్లా నుంచి 5 పాఠశాలలకు ఈ అవార్డులు అందిస్తామన్నారు. 2025 సంవత్సరంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ క్రీడల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలపై పాఠశాల హెచ్ఎం, పీడీ సంతంకం చేసి ఈ నెల 18వ తేదీ లోపు కాకినాడలోని ఎస్జీఎఫ్ఐ కార్యాలయంలో కార్యదర్శి ఎల్.జార్జికి అందజేయాలని కోరారు. అక్షరాంధ్రపై శిక్షణ బోట్క్లబ్ (కాకినాడసిటీ): జిల్లా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒకరోజు శిక్షణ తరగతి నిర్వహించారు. జిల్లా వయోజన విద్య శాఖ ఉపసంచాలకుడు పసుపులేటి పోశయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి తదితరులు హాజరై నూరు శాతం అక్షరాస్యత సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. -
మహాత్ముడు నడయాడిన గాంధీ చౌక్!
సామర్లకోట: స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా మహాత్మ గాంధీ సామర్లకోటలో పర్యటించడంతో ఆ ప్రాంతానికి గాంధీచౌక్గా నామకరణం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంపై ప్రజలను చైతన్యపరచడానికి ఆయన రైలులో సామర్లకోట వచ్చారు. ఇంజిన్లో బొగ్గు నింపడానికి గంట సమయం అవసరం కావడంతో రైలును నిలిపివేశారు. రైలులో గాంధీజీ ఉన్నారని తెలుసుకున్న స్థానికులు వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఐక్యతతో శాంతియుతం ఉద్యమాలు చేయాలని ఆయన వారికి పిలుపు నిచ్చారని. ఇతరులకు సాయం చేయాలని గాంధీజీ చెప్పిన మాటలను స్థానికులు మేకా వీర్రాజు, చుండ్రు గొల్లబ్బాయి, యార్లగడ్డ గోవిందులు సాక్షికి తెలిపారు. గాంధీజీ మరణం తరువాత పేదలకు అంబలి పోయడం ప్రారంభించామని చెప్పారు. రైలులో గాంధీ దిగిన ప్రాంతానికి గాంధీచౌక్గా నామకరణం చేసినట్టు తెలిపారు. గాంధీజీ మరణాంతరం ఆ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా కాకినాడ మున్సిపాలిటీ అభ్యంతరం తెలిపారని, అయితే అప్పట్లో ప్రముఖ సామాజికవేత్త, దివంగత సమయం వీర్రాజు పోత్సాహంతో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి వందో జయంతి వరకు స్థానికులకు అంబలి పోసినట్టు గాంధీ యువజన సంఘం నాయకులు తెలిపారు. రైల్వే పట్టాల సమీపంలో ఏర్పాటు చేసిన తాటాకు పాక నేటికీ ఉంది. పాక సమీపంలోనే ఉండే గాంధీ విగ్రహాన్ని సెంటర్లో ఏర్పాటు చేశారు. ఇటీవల పాత విగ్రహం స్థానంలో నూతన కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. -
జిల్లాలో భారీ వర్షాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బుధవారం కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడలో మెయిన్రోడ్డు, టూటౌన్ నూకాలమ్మ గుడి వీధి, సినిమారోడ్డు, ఎల్బీనగర్, కొత్తపేట మార్కెట్ వంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. జిల్లాలో పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. సామర్లకోట, కాకినాడ రూరల్, కరప, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో అధికంగా వర్షాలు కురవడంతో నాట్లు పూర్తిగా మునిగిపోయాయి. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా టోల్ ఫ్రీ నెంబర్, కంట్రోల్ రూమ్లో ఉన్న 0884 2356801 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. పలుచోట్ల నీట మునిగిన పంటలు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు -
‘పంపా’ పరవళ్లు
అన్నవరం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నవరంలోని ‘పంపా’ రిజర్వాయర్కు భారీగా వాననీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 94 అడుగులకు చేరింది. పంపా క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రిజర్వాయర్లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్ నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. గురువారం ఉదయానికి పంపా నీటిమట్టం 95 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పంపా ఆయకట్టుకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సబ్సిడరీ డ్యామ్ ద్వారా పది క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.24 టీఎంసీ నిల్వ ఉందని అధికారులు తెలిపారు. గత నెల 26న పంపా నీటిని ఆయకట్టుకు విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుడు నీటిమట్టం 94 అడుగులు ఉంది. అయితే అప్పటి నుంచి వర్షాలు లేకపోవడం, రిజర్వాయర్ నీటిని ఆయకట్టుకు విడుదల చేయడంతో నీటిమట్టం రోజు రోజుకీ తగ్గుతూ వచ్చింది. మంగళవారం పంపా నీటిమట్టం 92 అడుగులకు పడిపోయింది. మంగళవారం నుంచి పంపా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటిమట్టం మళ్లీ 94 అడుగులకు చేరింది. 94 అడుగులకు చేరిన నీటిమట్టం -
ముగిసిన జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న 15వ ఇండియన్ ఆయిల్ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీల విజేతగా జార్ఖండ్ జట్టు నిలిచింది. మంగళవారం నిర్వహించిన ఫైనల్స్లో జార్ఖండ్, హర్యానా జట్లు పోటీ పడగా 2–1 స్కోర్తో జార్ఖండ్ జట్టు విజయం సాధించి చాంపియన్ షిప్ను కై వసం చేసుకుంది. రన్నర్స్గా హర్యానా జట్టు నిలిచింది. మూడో స్థానానికి నిర్వహించిన మ్యాచ్లో ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోటీపడగా ఉత్తరప్రదేశ్ 2–0 స్కోర్తో విజయం సాధించి తృతీయ స్థానంలో నిలిచింది. క్రీడామైదానంలో సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ఎస్పీ బిందుమాధవ్ అతిథులుగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ నెల 1 నుంచి 12 వరకు నిర్వహించిన పోటీల్లో 29 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారుల నుంచి 30 మందిని ప్రపంచ పోటీలకు ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్, కార్యదర్శి హర్షవర్ధన్, కోశాధికారి థామస్ పీటర్, భవానీ శంకర్, టోర్ని కో–ఆర్డినేటర్ వి.రవిరాజు, సీపోర్టు సీఈఓ మురళీధర్ పాల్గొన్నారు. విన్నర్స్ జార్ఖండ్ రన్నర్స్ హర్యానా మూడోస్థానం ఉత్తరప్రదేశ్ -
పిఠాపురంలో.. చోర సైనికులు?
జనసేన కార్యకర్తలు ఎత్తుకుపోయిన లారీలుసాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘తప్పు చేసిన వాడిని తరిమితరిమి కొడతా.. బట్టలూడదీసి రోడ్డు మీద నడిపిస్తా.. తోలు తీస్తా.. తాట తీస్తా..’ అంటూ గత సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గర్జించారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అంతే ఏడాది తిరిగేసరికి పిఠాపురంలో సీన్ రివర్స్ అయిపోయింది. చిన్న తప్పు జరిగినా ఉపేక్షించనని కుండబద్దలు కొట్టిన పవన్ ఇలాకాలోనే జనసేన శ్రేణులు దొంగతనాలకు కూడా వెనుకాడటం లేదు. అధికారం అండతో చెలరేగిపోతున్నారు. అటువంటి దొంగలను.. పవన్ వెంట తిరిగే ఆ పార్టీ ముఖ్య నేతలు వెనకేసుకు తిరుగుతూండటం చూసి పిఠాపురం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. లారీల చోరీలు పిఠాపురం కుంతీ మాధవస్వామి గుడి వద్ద దగ్గు అప్పారావు నిలిపి ఉంచిన వంట నూనెల లారీని ఈ నెల 5న గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. ఈ లారీ కోసం పోలీసులు తీగ లాగితే జనసేన డొంక మొత్తం కదిలింది. పోలీసు విచారణలో వంట నూనెల లారీయే కాకుండా ఆకుల ప్రసాద్కు చెందిన నూకల లోడుతో ఉన్న మరో లారీ కూడా మాయమైందని తేలింది. ఆగంతకులు ఎత్తుకుపోయింది ఒక లారీ అనుకుని పోలీసులు విచారణ మొదలు పెడితే రెండో లారీ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ రెండు లారీల్లో సరకు విలువ రూ.కోటి పైమాటేనని పోలీసులు ప్రాథమికంగా లెక్క తేల్చారు. ఎత్తుకుపోయింది జనసేన కార్యకర్తలే.. ఈ లారీలు ఎత్తుకుపోయింది అంతర్రాష్ట్ర దొంగలనుకునుకున్న పోలీసులు తొలుత ఆ దిశగా విచారణ ప్రారంభించారు. వాహనాలకున్న జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా ఆరు రోజుల పాటు కూపీ లాగి, చివరకు ఆ రెండు లారీలనూ పట్టుకున్నారు. తీరా, ఈ రెండు లారీలూ ఎత్తుకుపోయింది ఎనిమిది మంది జనసేన క్రియాశీలక కార్యకర్తలేనని తెలిసి నివ్వెరపోవడం పోలీసుల వంతు అయ్యింది. లారీలు ఎత్తుకుపోయిన దొంగల ముఠాలో ఉన్న పిఠాపురం పట్టణంలోని బొజ్జావారితోట, కోటగుమ్మం, లయన్స్ క్లబ్ ప్రాంతాలకు చెందిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్, కాకినాడ రూరల్ మండలం పండూరుకు చెందిన నందిపాటి వీర సుబ్రహ్మణ్యాలను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. నేతల ఒత్తిళ్లు పోలీసులకు పట్టుబడ్డ ఎనిమిది మందీ జనసేన ముఖ్య నేతలు వెంటేసుకుని తిరుగుతున్న క్రియాశీలక కార్యకర్తలేనని తేలడంతో ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జనసేనలో లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠా గుట్టు రట్టవడం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఈ కేసులో పిఠాపురం పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా తయారైంది. నిందితులను తప్పించేందుకు ఆ పార్టీలో కాకినాడ, పిఠాపురానికి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు పోలీసులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరిని ముందే తప్పించేశారనే విమర్శలు వస్తున్నాయి. పరారీలో ఉన్న ఇద్దరినీ తప్పించాలని లేదంటే ప్రత్యామ్నాయమైనా ఆలోచించాలంటూ తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తూండటంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారని చెబుతున్నారు. వారికి నేర చరిత్ర లారీల చోరీల్లో పట్టుబడిన బెల్లంకొండ రవితేజ, నాగిరెడ్డి నాగ సతీష్, గంజి సురేష్లకు నేర చరిత్ర ఉందని అరెస్టు సందర్భంగా పిఠాపురం సీఐ శ్రీనివాస్ మీడియాకు చెప్పారు. ఈ ముగ్గురూ జనసేన పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్తో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారని పిఠాపురం కోడై కూస్తోంది. అక్కడి జనసేన నాయకులతో కూడా వీరు సత్సంబంధాలు కలిగి ఉన్నారనే చెబుతున్నారు. అలాగే, పార్లమెంటు నాయకుడు, పవన్ కల్యాణ్ అన్న, ఎమ్మెల్సీ నాగబాబు వెంట కూడా ఉంటారు. నాలుగో నిందితుడైన నందిపాటి వీర సుబ్రహ్మణ్యం కూడా జనసేన పార్టీలో చురుకుగా ఉండటం గమనార్హం. నేర చరిత్ర ఉన్న విషయం తెలిసినా ఇంత కాలం వారిని పార్టీ కార్యక్రమాల్లో ఎలా ప్రోత్సహించారని ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ముఖ్య నేతల అండదండలు చూసుకునే వారు ఈ తరహా ‘ఘనకార్యాలకు’ బరి తెగించారని పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. పవన్ ఏమంటారో.. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ చెప్పే మాటలకు.. ఆ పార్టీ నేతలు, కార్యకర్తల తీరుకు అసలు పొంతనే కుదరడం లేదు. గత ఏడాది గొల్లప్రోలులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ, ‘శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది, అవసరమైతే నేనే హోం మంత్రి అయి చక్కదిద్దాల్సి ఉంటుంది’ అని ఆవేశంగా చెప్పుకొచ్చారు. జనవరి 10న సంక్రాంతి సంబరాల సందర్భంగా జరిగిన సభలో ‘పిఠాపురంలో గంజాయి, రౌడీయిజం, దొంగతనాలు పెరిగిపోతున్నాయని స్థానికుల ద్వారా తెలిసింది. వీటిని నియంత్రించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి’ అంటూ పోలీసులకు పవన్ ఏకంగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు తన వెన్నంటి తిరిగే జిల్లా ముఖ్య నేతల కనుసన్నల్లో ఉండే అనుచరులు లారీలు ఎత్తుకుపోయే దొంగల ముఠాగా పోలీసు దర్యాప్తులో వెల్లడి కావడంపై పవన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ·˘ ´ùÎçÜ$Ë$ ¡VýS ÌêW™ól.. కదిలిన జనసేన డొంక ·˘ ÌêÈÌS ^øÈÌZ ç³r$tºyìl¯]l BÆý‡$VýS$Æý‡$ ·˘ ç³Æ>ÈÌZ E¯]l² Ð]l$Æø C§ýlªÇ° తప్పించాలంటూ ఒత్తిళ్లు ·˘ A…§ýlÆý‡* B ´ëÈt క్రియాశీలక కార్యకర్తలే.. ·˘ MîSÌSMýS ¯ól™èlÌSMýS$ çܰ²íßæ™èl$Ìôæ.. ·˘ °…¨™èl$ÌZÏ ముగ్గురు నేరచరితులేనన్న సీఐ ·˘ MýSÌSMýSÌS… Æó‡ç³#™èl$¯]l² దొంగల ముఠా బాగోతం -
సంపద తయారీ కేంద్రాలపై దృష్టి సారించాలి ˘
సామర్లకోట: గ్రామాల్లోని సంపద తయారీ కేంద్రాలపై ఎంపీడీఓలు దృష్టి సారించాలని జిల్లా పరిషత్తు సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్ అన్నారు. జిల్లాలోని 20 మంది ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు జి.మేడపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఒక రోజు శిక్షణలో వారు మాట్లాడారు. ప్రతి ఇంటి నుంచీ తడి, పొడిచెత్త సేకరించి, వర్మి కంపోస్టు యూనిట్లకు తరలించాలన్నారు. తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు తయారు చేసి, దాని వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పెద్దాపురం డీఎల్డీఓలు వాసుదేవరావు, శ్యామల, డీఎల్పీఓలు అన్నామణి, బాలమణి, సామర్లకోట ఎంపీడీఓ కె.హిమమహేశ్వరి, సర్పంచ్ పటాని దేవి తదితరులు పాల్గొన్నారు. బాస్కెట్బాల్ పోటీల్లో విజేతలుగా హైదరాబాద్ జట్లు సామర్లకోట: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిర్వహించిన పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో నాలుగు రోజులుగా నిర్వహించిన బాస్కెట్బాల్ పోటీలు మంగళవారంతో ముగిశాయి. రెండు రాష్ట్రాల నుంచి 140 జట్లు పోటీల్లో పాల్గొనగా 1,500 మంది క్రీడాకారులు హాజరైనట్టు శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాలల డైరెక్టర్ సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో హైదరాబాద్కు చెందిన జట్లు విన్నర్స్, రన్నర్స్గా నిలిచారు. విజేతలకు డీసీసీబీ చైర్మన్ తుమ్మలబాబు బహుమతులు అందజేశారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి డి.చక్రవర్తి, విజయప్రకాష్ మాట్లాడారు. -
కొన ఊపిరికి కొత్త ఊపిరి
కపిలేశ్వరపురం: ఆలోచన అయినా ఆచరణ అయినా బొందిలో ప్రాణం ఉన్నంత వరకే. మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకొన్న సామాజిక అవగాహనతో కూడిన నిర్ణయాలు మరణించిన వ్యక్తిని మరెన్నో తరాలు జీవించేలా చేస్తాయి. అలాంటి కోవలోకి వచ్చే అవయవదానం సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది తమ అవయవాలను దానం చేసి ఎంతోమందికి ప్రాణం పోశారు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఈ కథనం... పెరిగిన అవసరం భారతదేశంలో అవయవాలు సకాలంలో అందుబాటులో లేక రోజుకు 20 మంది చొప్పున చనిపోతున్నారని అంచనా ఉంది. ప్రతి పది నిమిషాలకు ఒకరు అవయవ మార్పిడి చేయించుకోవాల్సిన పరిస్థితి దేశంలో ఉంది. అవయవాలు అవసరమైన వారిలో పది శాతం మందికి కూడా అవి లభ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అవయవదానం ప్రాధాన్యం పెరిగింది. సాహితీవేత్తలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, సామాజిక కార్యకర్తలు మరణానంతరం తమ దేహాలను దానం చేస్తూ అంగీకార పత్రాలను రాసిన చరిత్ర ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి ఉంది. చేయడం ఇలా.. : దాతలు జీవిస్తూనే వారి అవయవాలలో కొంత భాగాన్ని దానం చేస్తూ ఇతరులకు ఊపిరి పోస్తున్నారు. రక్తాన్ని, 50 శాతం కాలేయాన్ని, రెండింటిలో ఒక కిడ్నీని ఇతరులకు దానం చేయడం ఈ కోవలోనివే. మరొక పద్ధతిలో వారు చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల నిర్ణయంతో అవయవాలు దానం చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తుల్లో మొత్తం రెండు కిడ్నీలను, గుండెను, కాలేయాన్ని, ఊపిరితిత్తులను, ప్యాంక్రియాసిస్ గ్రంధిని వాటి పనితీరు సామర్థ్యాన్ని బట్టి ఇతరులకు దానం చేస్తున్నారు. తన దేహాన్ని మరణానంతరం వైద్య కళాశాల విద్యార్థుల పరిశోధన కోసం కళాశాలకు అప్పగించాలంటూ కొందరు ముందస్తు ఒప్పంద పత్రాన్ని రాస్తున్నారు. సహజ మరణం పొందిన వారి నుంచి కార్నియా, చర్మం, ఎముక, గుండె కవాటాలు, రక్తనాళాలు దానం చేసే వీలు ఉంది. చిరంజీవులయ్యారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకర శ్రీనివాసరావు ఈ ఏడాది జూలై 12న గుండెపోటుతో మృతిచెందగా ఆయన నేత్రాలను అనపర్తి రాధాకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం గ్రామానికి చెందిన ధూలిపూడి సీతారాం అనే మహిళ ఈ ఏడాది జులై 1న గుండెపోటుతో మరణించగా నేత్రదానం చేశారు. తాళ్లరేవు మండలం వూడా హిమావతి ఈ ఏడాది జనవరి 26న గుండెపోటుతో మరణించడంతో రెండు నేత్రాలను కాకినాడ బాదం ఐ బ్యాంక్కు దానం చేశారు. ద్రాక్షారామ పద్మ స్టూడియో అధినేత కె.వీర్రాజు ఈ ఏడాది మే 28న మృతి చెందగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పలపకూర వెంకట్రావు ఏడాది ఏప్రిల్ 26న గుండెపోటుతో మరణించగా కాకినాడ రెడ్ క్రాస్ ఐ బ్యాంకుకు రెండు కార్నియాలను దానం చేశారు. కె.గంగవరం గ్రామానికి చెందిన చింత చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరి 27న మృతి చెందగా రెండు నేత్రాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానం చేశారు. ధన్య చరితులు.. పుణ్యమూర్తులు వారి త్యాగం చైతన్యానికి ప్రతీక కన్ను మూస్తూ.. మరొకరికి జన్మనిస్తున్న దాతలు నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం బ్రెయిన్ డెత్ కావడంతో... మండపేట మండలం ద్వారపూడి గ్రామానికి చెందిన యువకుడు నున్న శివన్నారాయణ (శివ) ఈ ఏడాది మే 25న రాజమహేంద్రవరం – ద్వారపూడి రహదారిలో ప్రమాదానికి గురికావడంతో బ్రెయిన్ డెత్ అయ్యింది. కుటుంబ సభ్యుల నిర్ణయంతో కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రిలో అతని అవయవాలను దానం చేయడం ద్వారా ముగ్గురికి జీవితాన్ని ప్రసాదించాడు. లివరు, ఒక కిడ్నీని ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి, మరో కిడ్నీని విశాఖపట్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి అమర్చారు. రెండు నేత్రాలలోని కార్నియాలను కాకినాడ బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్కు దానం చేశారు. నాన్న స్ఫూర్తితో దేహదానం చేశాం నాన్న మానవ సమాజం పట్ల అవగాహనతో జీవించారు. నా చిన్ననాటి నుంచీ అనేక విషయాలు బోధించారు. ఆయనతో పాటు అమ్మకు అవగాహన కల్పించి ఆమె దేహాన్ని కూడా దానం చేసేందుకు చైతన్య పర్చారు. ఆ స్ఫూర్తితో నేను, నా జీవిత భాగస్వామి కల్యాణి కూడా దేహదానం చేసేందుకు పత్రం రాశాం. – మేకా గౌరవ్, పిఠాపురం, కాకినాడ జిల్లావైద్య విద్యార్థుల పరిశోధన లక్ష్యంగా.. కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు, ఆలయ శిల్పి పెద్దింశెట్టి సూర్యనారాయణమూర్తి (91) 2021 డిసెంబర్ 8న వృద్ధాప్యంతో మృతి చెందారు. ఆయన జీవించి ఉండగానే 2009 నవంబర్ 22న కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహదాన ఒప్పంద పత్రాన్ని రాసి ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఆ మేరకు సూర్య నారాయణమూర్తి దేహాన్ని కళాశాలకు అప్పగించారు. పిఠాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, వజ్రాయుధం పుస్తక రచయిత ఆవంత్స సోమసుందర్ 2016 ఆగస్టు 12న వృద్ధాప్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. పిఠాపురం పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త మేకా సత్యనారాయణ శాస్త్రి (బాంబు) తానూ, తన భార్య అనూరాధ ఇద్దరూ తమ దేహాలను వైద్య కళాశాలకు రాసి ఇచ్చారు. కాగా 2022 ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రోజున సత్యనారాయణశాస్త్రి గుండెపోటుతో మరణించగా కుటుంబ సభ్యులు రాజానగరం జీఎస్ఎల్ కళాశాలకు దేహాన్ని అప్పగించారు. ఆ స్ఫూర్తితో అదేరోజు సత్యనారాయణ శాస్త్రి కుమారు డు గౌరవ్, కోడలు కల్యాణిలు తమ దేహాలను దానం చేసేందుకు ఒప్పంద పత్రాలను రాసి ఇచ్చారు. -
అలవాటుగా మారింది
చిన్నప్పటి నుంచి ఎడమ చేతితో రాయడం అలవాటైంది. ఏ పని చేయాలన్నా ఎడమ చేతితో చేయడం ఈజీగా అనిపిస్తోంది. బలమైన పనులన్నింటికీ ఎడమ చేతినే ఉపయోగిస్తాను. ఓ పని ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు ఎడమ చేతితోనే చేస్తాను. – చింతలపూడి మంగాదేవి, పార్ట్టైమ్ ఇన్స్ట్రక్టర్, జీహెచ్ఎస్, అనాతవరం చిన్నప్పటి నుంచి అలవాటు ఎడమ చేతితో రాయడం, పనులు చేయడం చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంట్లో పనులన్నీ ఎక్కువగా ఎడమ చేతితో చేయడం జరుగుతుంది. నాకు ఇద్దరు అబ్బాయిలు. వారికి ఈ అలవాటు రాలేదు. – సప్పా శాంతి, గృహిణి, కొంకుదురు మా అమ్మ నుంచి వచ్చింది ఎడమ చేతిరాత మా అమ్మకి ఉంది. మా అమ్మ నుంచి నాకు, అలాగే నా కూతురికి ఎడమ చేతి అలావాటు వచ్చింది. సూల్క్లో నేను డ్రాయింగ్ వేసేవాడిని. బహుమతులూ వచ్చాయి. ఇప్పడు పెయింట్ వేయడానికి ఉపయోగపడుతోంది. – కుక్కుల శివకృష్ణ, పెయింటర్, పందలపాక -
రంగస్థలంపై సానా పంతం!
పొరుగువారు హాజరు.. ఇరుగు వారే రాలేదు! జనసేన ఎమ్మెల్యే నానాజీతో పాటు టీడీపీ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కూడా ఈ కార్యక్రమానికి దూరంగానే ఉన్నారు. వాస్తవానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి సతీష్తో ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు. ఎన్నికల ముందు నుంచి ఏ పార్టీలో చేరకుండా స్వచ్ఛంద సంస్థ పేరుతో కాకినాడ సిటీలో కార్యక్రమాలు చేస్తూ, తన వర్గీయులతో టచ్లో ఉంటున్నారనే సమాచారం తెలియడంతో కొండబాబుకు సతీష్ పొడ గిట్టలేదు. సిటీ నియోజకవర్గ పరిధిలో లేకున్నప్పటికీ ఆర్ఎంసీ గ్రౌండ్ సిటీ, రూరల్ రెండు నియోజకవర్గాలకే పరిమితం కాదనేది వాస్తవం. పొరుగున ఉన్న పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్వర్మ హాజరవ్వడం, ఇరుగు,పొరుగున ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు నానాజీ, కొండబాబు పునఃప్రారంభోత్సవానికి హాజరుకాకపోవడంపై కూటమిలో విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఎంత మంది వద్దన్నా లెక్క చేయకుండా రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్లో వాకర్స్కు బలవంతంగా అనుమతివ్వడమే పెద్ద తప్పు. అటువంటి గ్రౌండ్పై ఆధిపత్యం కోసం నిస్సిగ్గుగా ఇప్పుడు కూటమి నేతలు కుమ్ములాడుకోవడంపై మేధావి వర్గం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఆర్ఎంసీ క్రీడాప్రాంగణం ఆర్ఎంసీ క్రీడాప్రాంగణం ముఖద్వారం● రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్పై పెత్తనం వెనుక దూరాలోచన ● ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు ● గ్రౌండ్లో వాకర్స్కు అనుమతిపై పలువురి ఆక్షేపణ ● ఇద్దరు ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రంగరాయ వైద్య కళాశాల గ్రౌండ్లో కూటమి నేతలు రాజకీయ కుస్తీలకు సై అంటున్నారు. ఆరు దశాబ్దాల పైబడి చరిత్ర కలిగిన రంగరాయ వైద్యకళాశాలకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల విద్యార్థులు ఆర్ఎంసీలో సీటు వచ్చిందంటే చాలా సంబర పడతారు. ఎంబీబీఎస్, పీజీ, పారా మెడికల్ కోర్సులు కలిపి సుమారు 2,000 మంది విద్యార్థులకు సరస్వతి నిలయంగా ఆర్ఎంసీ విరాజిల్లుతోంది. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆర్ఎంసీని కూటమి నేతలు రాజకీయ వేదికగా మార్చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఆర్ఎంసీని పావుగా వాడుకుంటున్నారని మెడికోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎంసీలో విద్యార్థుల కోసం ఉన్న 14 ఎకరాల విశాలమైన ఆటస్థలంలో బయటి వ్యక్తులను వాకింగ్ ట్రాక్ కోసం అనుమతించడంపై కూటమి నేతల మధ్య వార్ నడుస్తోంది. వాకర్స్కు మళ్లీ అనుమతిపై వ్యతిరేకత ఆర్ఎంసీలోని అన్ని విభాగాలకు చెందిన వైద్య విద్యార్థుల కోసం ఏర్పాటైన ఈ గ్రౌండ్లో బయట వ్యక్తులు చొరబడి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ గ్రౌండ్లో ఆటలాడుకునే వైద్య విద్యార్థినులకు రౌడీమూకల నుంచి వేధింపులు ఎక్కువవ్వడంతో మెడికోలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయట వారిని అనుమతించవద్దని విద్యార్థుల డిమాండ్పై కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులను వెంటేసుకుని గ్రౌండ్కు వెళ్లి నానా రాద్ధాంతం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే నానాజీ ఆర్ఎంసీ స్సోర్ట్స్ ఇన్చార్జి, ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై చేయిచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. అప్పట్లో కూటమి పెద్దలు జోక్యం చేసుకుని జిల్లా అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చి నానాజీతో డాక్టర్ ఉమామహేశ్వరరావుకు క్షమాపణ చెప్పడంతో సమస్యను సర్దుబాటు చేయడం తెలిసిందే. ఇంత రాద్ధాంతం జరిగినా రెండురోజుల క్రితం ఆర్ఎంసీ గ్రౌండ్స్లో వాకర్స్ను కొన్ని షరతులకు లోబడి తిరిగి అనుమతించడాన్ని దాదాపు అన్ని వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అదీ కూడా అధికారాన్ని ఉపయోగించి ఉన్నత స్థాయి నుంచి జిల్లా యంత్రాంగం, ఆర్ఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మరీ అనుకున్నది సాధించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వైరుధ్యాలు? గ్రౌండ్స్లో వాకర్స్ను అనుమతించే వరకు పట్టువదలని విక్రమార్కులు మాదిరి కలిసి పనిచేసిన జనసేన ఎమ్మెల్యే నానాజీ, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు మధ్య వైరుధ్యాలు పొడచూపాయని కూటమి నేతల మధ్య చర్చ నడుస్తోంది. గ్రౌండ్లో వాకర్స్కు అనుమతి సాధించడం వెనుక కృషి, క్రెడిట్ తమ నేతదంటే తమ నేతదంటూ పంతం, సతీష్ వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి. గ్రౌండ్లో వాకర్స్ను అనుమతించక పోవడంపై ఫ్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడిన ఉదంతంతో రాష్ట్ర స్థాయిలో తమ నాయకుడు అప్రతిష్టపాలయ్యారని నానాజీ వర్గీయులు పేర్కొంటున్నారు. తమ నాయకుడు పట్టుబట్టి సాధిస్తే మధ్యలో వచ్చి ఆ క్రెడిట్ను ఎంపీ సతీష్బాబు ఎగరేసుకుపోయారని నానాజీ వర్గం మండిపడుతోంది. ఆర్ఎంసీ గ్రౌండ్స్పై ఆధిపత్యం కోసం అంతలా సతీష్బాబు తాపత్రయపడటం వెనుక దూరదృష్టి లేకపోలేదంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్లను క్రికెట్ అభిమానులు తిలకించేందుకు ఫ్యాన్పార్క్లు ఇప్పటి వరకు మెట్రోపాలిటిన్ సిటీల్లో మాత్రమే అనుమతించే వారు. అటువంటిది కాకినాడ సిటీలో తొలిసారి సతీష్ తీసుకురావడం ముందస్తు వ్యూహంలో భాగమేనంటున్నారు. అందునా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా (ఈ నెల 16న జరగనున్న ఎన్నికలకు సతీష్బాబు ఒక్కరే నామినేషన్ వేశారు) ఏకగ్రీవం కానున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ (బోర్డు ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా) నుంచి దండిగా నిధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జిల్లా క్రికెట్ అసోసియేషన్కు వార్షిక నిర్వహణ నిధులు రెట్టింపు చేయడం వంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇవన్నీ ఉండబట్టే ఆర్ఎంసీ గ్రౌండ్స్పై ఆధిపత్య పోరులో సతీష్బాబు ముందున్నారని నానాజీ వర్గీయులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్రతం చెడినా ఫలం దక్కకే’ వాకర్స్ను అనుమతించే కార్యక్రమ పునఃప్రారంభోత్సవానికి తమ నేత డుమ్మా కొట్టారని ఆ వర్గం పేర్కొంటోంది. -
రూ.1.50 లక్షలవెండి కిరీటం సమర్పణ
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారంలో ఉన్న పార్వతీ వీరేశ్వర స్వామివారికి దాతలు వెండి కిరీటం, ఆభరణాలను సోమవారం సమర్పించారు. గంగలకుర్రుకు చెందిన తనికెళ్ల సోమసూర్య సుబ్రహ్మణ్య విశ్వేశ్వరరావు కుమారులు వెంకటసత్య సూర్యనాగభూషణం, లక్ష్మీసూర్యపద్మ దంపతులు, తనికెళ్ల రామలక్ష్మి నరసింహమూర్తి, పద్మావతి దంపతులు, మనవలు దుర్గావిశ్వనాథం, మనవరాలు ఉమాభాను రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటం, ఆభరణాలను పార్వతీ వీరేశ్వరస్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వెండి వస్తువులను ఆలయ ప్రధానార్చకులు చంద్రమౌ ళీ సూర్యకామేష్ ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించి, స్వామివార్లకు అలంకరించారు. -
స్వామీ... నీ దయ రాదా!
● సత్యదేవుని సన్నిధిన శానిటరీ సిబ్బంది ఆకలి కేకలు ● అందని జూన్, జూలై జీతాలు ● నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి బకాయి అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో పారిశుధ్య కార్మికులకు జీతాల చెల్లింపు సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. జూన్, జూలై నెలల జీతాలు ఇంకా అందకపోవడంతో 350 మంది ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా ఎక్కువ మొత్తాలలో జీతాలు తీసుకునే వేతన జీవులకే ఒక నెల జీతం ఆలస్యం అయితే ఇబ్బంది పడతారు. ఈ ఎంఐలు, అద్దెలు, వివిధ చెల్లింపులు ఆలస్యం అవుతాయి. అటువంటిది చిన్నపాటి జీతం రెండు నెలలు నుంచి రాకపోతే వారి పరిస్థితి ఏమిటో ఊహించొచ్చు. ఐదు నెలలుగా ఇదే తంతు ఐదు నెలలుగా జీతాలు ఆలస్యం అవుతున్నాయి. పాత కాంట్రాక్ట్ సంస్థ కేఎల్టీఎస్ కాలపరిమితి ముగిసిన తరువాత మార్చి నెల నుంచి శానిటరీ కాంట్రాక్ట్ విజయవాడకు చెందిన కనకదుర్గా మేన్పవర్ సంస్థకు అప్పగించారు. మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ వార్త ప్రచురితమవడంతో ఏప్రిల్ 30న అకౌంట్లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా పడకపోవడంతో సాక్షి దినపత్రికలో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచే వారేరీ!’ శీర్షికన కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. జూలై నెలలో ఫేక్ పీఎఫ్ చలానాలు ఇచ్చారంటూ వివాదం రావడంతో ఆ చలానాలు వెరిఫై చేయడం, పీఎఫ్ కార్యాలయ సిబ్బంది తనిఖీలు, కాంట్రాక్టర్పై కేసులు, ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ వంటి పరిణామాలతో జూన్, జూలై జీతాలు ఇంకా చెల్లించలేదు. సెక్యూరిటీ కాంట్రాక్టర్తో జీతాలిప్పించే ప్రయత్నం విఫలం ఫేక్ పీఎఫ్ చలానాల ఆరోపణలతో కనకదుర్గ సంస్ధను పక్కన పెట్టి సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్ధ ‘మాక్స్’ ద్వారా శానిటరీ సిబ్బందికి జీతాలిప్పించేందుకు కమిషనర్ కార్యాలయానికి ఫైలు పంపారు. దీనిపై కమిషనర్ అభ్యంతరం తెలిపారు. దీంతో మళ్లీ కనకదుర్గా సంస్థ ద్వారా జూన్, జూలై నెలలకు జీతాలిచ్చేందుకు వీలుగా ఆ సంస్థతో రెండు నెలల పీఎఫ్ కట్టించారు. రూ.30 లక్షల పీఎఫ్ సొమ్ము చెల్లించి ఆ రశీదులు దేవస్థానానికి ఆ సంస్థ ప్రతినిధులు జమ చేశారు. ఇది జరిగి వారం అయినా ఇంకా శానిటరీ సిబ్బంది అకౌంట్లలో జీతాలు పడలేదు. నెరవేరని కమిషనర్ హామీ ఈ నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి వచ్చిన దేవదాయశాఖ కమిషనర్ కే రామచంద్రమోహన్ను శానిటీరి సిబ్బంది కలిసి తమ జీతాలు చెల్లింపుపై వినతి పత్రం సమర్పించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లించే ఏర్పాటు చేయిస్తానని కమిషనర్ హామీ ఇచ్చారు. నెలకు రూ.59 లక్షల చొప్పున 350 మంది సిబ్బందికి రెండు నెలల జీతాలు చెల్లించాల్సి ఉంది. అయినా 11వ తేదీ వచ్చినా జీతాలు చేతికి అందడం కాదు కదా ఇంకా జీతాల బిల్లు సిద్ధం కాలేదని తెలిసింది. మరో వారం పడుతుందా? జీతాలు బిల్లు తయారైతే అది ఆడిట్కు వెళ్లి అక్కడ ఏ కొర్రీలు పడకుండా మళ్లీ దేవస్థానానికి వచ్చి ఆ తరువాత బిల్లు పాస్ అవ్వాలి. ఆ బిల్లుపై చెక్కు తయారు చేస్తే దానిపై ఈఓ సంతకం చేసి సంబంధిత మొత్తాన్ని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ కాంట్రాక్టర్ 350 మంది సిబ్బంది అకౌంట్లలో జమ చేయాలి. ఇదంతా జరగడానికి కనీసం వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అంటే ఆగస్టు 20 తేదీ తరువాతనే పారిశుధ్య కార్మికులకు జీతాలు అందే అవకాశం ఉందని అర్థమవుతోంది. -
జీజీహెచ్లో మత కార్యకలాపాలపై నిషేధం
అధికారులు, సిబ్బందికి సర్క్యులర్ జారీ కాకినాడ క్రైం: జీజీహెచ్లో ఎప్పటికప్పుడు తీవ్ర వివాదాలకు కారణమవుతున్న మత కార్యకలాపాలపై నిషేధాన్ని విధిస్తూ కలెక్టర్ షణ్మోహన్ సూచనలతో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆర్సీ.నం.18/ఏవో/2025తో సర్క్యులర్ జారీ చేశారు. అంతకుముందు హెడ్ నర్సులు, ఆసుపత్రి అధికారులతో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. రాజ్యాంగ సూత్రాలకు లోబడి లౌకికవాదం అనుసరించాల్సిన ఆసుపత్రి, ఆవరణలో, తటస్థత, సమగ్రత తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వార్డులు, కార్యాలయాలతో పాటు ఆసుపత్రి సంబంధిత ఇతర ప్రాంతాలలో మతపరమైన కార్యకలాపాలు అంటే పూజలు, ప్రార్థనలు, ఉత్సవాలు, సమావేశాలు, ఊరేగింపులు, ప్రచారాలు, బోధనలు నిర్వహించడం, ప్రోత్సహించడం, వాటిలో పాల్గొనడం పూర్తిగా నిషేధం. మత సంబంధిత పుస్తకాలు, కరపత్రాలు, బ్యానర్లు, చిత్రాలు, వాల్ పోస్టర్లు చూపడం, పంచడం చేయకూడదు. ఈ ఆదేశాలు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు, మెడికల్, పారామెడికల్, అడ్మినిస్ట్రేటివ్, సహాయక, అనుబంధ విభాగాలలో పనిచేస్తున్న వారితోపాటు ఆసుపత్రిలోకి ప్రవేశించే ఇతరులకూ వర్తిస్తాయి. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎయిడ్స్ నియంత్రణ పోస్టర్ ఆవిష్కరణ కాకినాడ సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో డిస్ట్రిక్ట్ ఇంటిగ్రేటెడ్ స్టాటజీ ఫర్ హెచ్ఐవీ, ఎయిడ్స్ అనుసంధానంతో ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ ప్రోగ్రామ్స్ పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్ సగిలి సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. హైరిస్క్ మండలాల్లోని గ్రామాల్లో హెచ్ఐవీ, ఎయిడ్స్ వ్యాప్తి నివారణ, ఉన్న అపోహలు తొలగించినందుకు అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు. హెచ్ఐవి జీవిస్తున్న వారికి మందులు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందిస్తున్నామన్నారు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్పై పూర్తి అవగాహన కలిగించేందుకు జిల్లాలో ఉన్న కాలేజీల్లో, హైస్కూళ్లలో రెడ్ రిబ్బన్ క్లబ్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ 1097 టోల్ఫ్రీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. జేసీ రాహుల్ మీనా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.నరసింహనాయక్, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి ఐ ప్రభాకరరావు, జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ పి బాలాజీ పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 441 అర్జీలు కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో అందిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ సోమవారం కాకినా కలెక్టరేట్లోని వివేకానంద హాలులో నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీషా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ శ్రీనివాసు, సీపీవో పి త్రినాథ్లతో కలిసి హాజరై ప్రజల నుంచిఅర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు చెందిన మొత్తం 441 అర్జీలు అందాయి. పారదర్శకంగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడామైదానంలో జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ పారదర్శకంగా జరుగుతుందని విశాఖ ఆర్మీ విభాగం సోమవారం ఒక ప్రకటలో తెలిపింది. విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీలో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఈనెల 5 న ప్రారంభమైన ఈ ర్యాలీ 21 వరకు కొనసాగుతుందన్నారు. అగ్రివీర్ విభాగాల్లో స్టోర్ కీపర్, టెక్నికల్ క్లర్క్, జనరల్ డ్యూటీ, ట్రేడ్స్ మెన్ విభాగాలకు ఈ రిక్రూట్మెంట్ర్యాలీ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్, లోకల్ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. -
వాడపల్లి ఆలయానికి బ్యాటరీ కార్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ రెండు బ్యాటరీ కార్లు అందజేసింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మెర్లపాలెం గ్రామానికి చెందిన జేఎస్ఎన్ రాజు కన్స్ట్రక్షన్ కంపెనీ వారు రూ.12 లక్షలు విలువైన రెండు కార్లను అందజేసినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డీసీ, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ కార్లను ఈ నెల 15న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభిస్తారని చెప్పారు. -
లెఫ్ట్ అయినా రైటే..
● ఎడమ చేతి వాటం జాబితాలో ఎందరో ప్రముఖులు ● కళ, క్రీడ, సంగీత, రాజకీయ రంగాల్లో అద్భుత రాణింపు ● రేపు లెఫ్ట్ హ్యాండర్స్ డే రాయవరం/బిక్కవోలు: కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అన్నాడో సినీ కవి. కుడి ఎడమైతే గ్రహపాటు కాదోయ్ అంటున్నారు లెఫ్ట్ హ్యాండర్స్. మానవ శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది. ఎడమ చేతితో రాసేవారు తమ హదయ స్పందనను కచ్చితంగా అక్షర బద్ధం చేయగలరని ప్రముఖ విద్యా, మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం.. ప్రపంచంలో ఉన్నత పదవులు అలంకరించిన వారిలో సగానికి పైగా ఎడమ చేతి వాటం వారే. బుధవారం ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. భిన్నమైన శైలి సాధారణంగా ఏ పనైనా కుడి చేత్తో చేయడం అలవాటు. ప్రపంచంలో 87 శాతం మంది కుడి చేత్తో పనులు చేస్తుంటే, 12 శాతం మంది ఎడమ చేత్తో చేస్తారని సర్వేల్లో వెల్లడైంది. మిగిలిన ఒక శాతం మంది రెండు చేతులను వినియోగించడంలో సామర్థ్యాన్ని కనబరుస్తారు. దేశంలో 5.20 శాతం మంది మాత్రమే ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారు. కుడిచేతి వాటం వారి కన్నా, ఎడమ చేతి వాటం వారు ప్రత్యేక స్థానాల్లో ఉంటారని, వారి మేధోశక్తి, ఆలోచనలు, తెలివితేటలు భిన్నంగా ఉంటాయని నిపుణుల అంచనా. ప్రస్తుతం ప్రపంచంలో గుర్తింపు పొందిన మేధావుల్లో చాలా మంది ఎడమ చేతి వాటం వారు కావడం విశేషం. ప్రతిభ, సృజనాత్మకత, ఏ రంగంలోనైనా రాణించే శక్తి సామర్థ్యాలు ఎడమ చేతి వాటం వారిలోనే ఎక్కువని నాడీ శాస్త్రం కూడా చెబుతుందంటారు. జిల్లా జనాభాలో సుమారు 3.01 లక్షల మంది ఎడమ చేతి వాటం వారున్నట్టు ఓ అంచనా. ప్రముఖుల్లో కొందరు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్, చంద్రుడిపై మొట్టమొదట కాలుమోపిన నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మోనాలిసా సృష్టికర్త లియోనార్డ్ డావెన్సీ, అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్క్లింటన్, ప్రధాని నరేంద్రమోదీ, పారిశ్రామికవేత్త రతన్టాటా, మాజీ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, యువరాజ్సింగ్, సినీ నటుల్లో అమితాబ్ బచ్చన్, సావిత్రి ఇలా ఎడమచేతి వాటమున్న ప్రముఖులే. అలాగే పలువురు కళా, క్రీడా, సంగీత రంగాల్లో రాణిస్తూ లెఫ్ట్.. బట్ వియ్ ఆల్వేస్ రైట్ అనిపించుకుంటున్నారు. ఇబ్బందులూ తప్పవు! ఎడమ చేతి వాడకంపై లాభనష్టాలు, ఇబ్బందులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎడమచేతి వాటం ఉన్న వారెంతో అదృష్టవంతులని కొందరంటుంటారు. అటువంటి వారు ప్రపంచం గర్వించదగ్గ వ్యక్తులుగా ఎదిగారని చెబుతారు. శుభకార్యాల్లో ఎడమ చేతి వినియోగాన్ని మన సంప్రదాయాలు అంగీకరించవు. ఇటువంటి సందర్భాల్లో ఆ అలవాటు ఉన్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూజలు, శుభకార్యాలు, డబ్బు చేతులు మారేటప్పుడు కుడి చేతినే ఉపయోగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థుల కుర్చీలకు కుడిచేతివైపు రాయడానికి వీలుగా అట్టలు అమరుస్తారు. డ్రైవర్లకు కుడిచేతి వాటానికి అనుకూలంగా హారన్ వంటివి ఉంటాయి. జన్యు ప్రభావం కూడా.. పుట్టినప్పటి నుంచే కుడి, ఎడమ చేతి వాటాలను సహజసిద్ధంగా కలిగి ఉంటారని సైన్స్ చెబుతోంది. మనిషికి మెదడు కుడి, ఎడమ రెండు అర్ధ భాగాలుగా ఉంటుంది. కుడి వైపు శరీర భాగాన్ని మెదడు ఎడమ వైపు భాగం నియంత్రిస్తుందని, మెదడు కుడి అర్ధ భాగం బలంగా ఉన్న వారిలో ఎడమ చేతి వాటం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటం గమనిస్తే.. దానిని మాన్పించేందుకు యత్నిస్తుంటారు. జన్యుపరమైన మార్పులు ఉన్నప్పుడు అలా మాన్పించడం సాధ్యం కాదంటున్నారు. -
హోరాహోరీగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
నేడు ముగింపు, బహుమతుల ప్రదానం తుని రూరల్: అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. శ్రీప్రకాష్ విద్యా సంస్థలలో ఇవి నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండవ రోజూ సీబీఎస్ఈ క్లస్టర్ –7 అంతర్రాష్ట్ర బాలురు, బాలికల అండర్ 14, 17, 19 విభాగాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 180 జట్లకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్–19 బాలికల విభాగంలో ప్రథమ స్థానాన్ని సిస్టర్స్ నివేదిత స్కూల్ (హైదరాబాద్), ద్వితీయ స్థానాన్ని వెరిటాస్ సైనిక్ స్కూల్ (తిరుపతి), తృతీయస్థానాన్ని సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ (ఏలూరు) కై వసం చేసుకున్నట్టు సీబీఎస్ఈ పరిశీలకుడు సీహెచ్ఎంఎల్.శ్రీనివాసు తెలిపారు. అండర్–14, 17 విభాగాల్లో జట్లు తమ సత్తా చాటి క్వార్టర్ ఫైనల్స్ వైపు దూసుకువెళుతున్నాయన్నారు. వీటి ఫలితాలు సోమవారం వస్తాయని, విజేతలకు అదేరోజు బహుమతుల ప్రదానం జరుగుందన్నారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్ మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఆంధ్ర, తెలంగాణాల నుంచి విద్యార్థులు, కోచ్లు, మేనేజర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఉత్కంఠగా అండర్–17 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్ –17 చెస్ పోటీలు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యా సంస్థల్లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు దాదాపు 60 మంది క్రీడాకారులు వచ్చి తమ ప్రతిభకు పదను పెట్టారు. పోటీల్లో బాలురు నుంచి ముగ్గురిని, బాలికల నుంచి ముగ్గురిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి కవురు జగదీష్ చెప్పారు. బాలుర విభాగంంలో గిరిమణి శేఖర్ (ప్రథమ), బండారు నానిబాబు (ద్వితీయ), తాడి సాయి వెంకటేష్ (తృతీయ), బాలికల విభాగంలో పనిశెట్ట ధరణి (ప్రథమ), బొడ్డు సాన్వి (ద్వితీయ), పసుపులేటి రేష్మ (తృతీయ) గెలిచారని తెలిపారు. వీరు ఈ నెల 16,17 తేదీల్లో కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా తరఫున ఆడతారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిది విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్నాయుడు షీల్డ్లు అందజేశారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
అన్నదమ్ముల మధ్య విభేదాలతో మనస్తాపం నిడదవోలు: పెరవలి మండలం ఉసులుమర్రు గ్రామానికి చెందిన తానేటి శ్రీనివాస్ (42) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడు. అన్నదమ్ముల మధ్య ఏర్పడ్డ చిన్నపాటి విభేదాలతో మనస్తాపం చెందిన శ్రీనివాస్ ఈనెల 8న పురుగు మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడిని వెంటనే కుటుంబ సభ్యులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న శ్రీనివాస్కు భార్య భాగ్యలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెరవలి ఎస్సై ఎం. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫైనల్స్ దశలో జాతీయ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు ఆదివారం కాకినాడ డీఎస్ఏలో సెమీఫైనల్స్ పూర్తి చేసుకుని ఫైనల్స్కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్లో రెండు మ్యాచ్లు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన మ్యాచ్లను హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్రెడ్డి ప్రారంభించారు. మొదటి సెమీఫైనల్స్లో హర్యానా, ఛత్తీస్గఢ్ పోటీపడగా హర్యానా 3–0 స్కోర్తో విజయం సాధించి ఫైనల్స్కు చేరుకుంది. రెండో సెమీఫైనల్స్ జార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ మధ్య జరుగగా జార్ఖండ్ 3–0 స్కోర్తో గెలుపొంది ఫైనల్స్కు చేరింది. మూడోస్థానానికి మంగళవారం ఛత్తీస్గఢ్, ఉత్తర్ప్రదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. ఫైనల్స్ హర్యానా, జార్ఖండ్ జట్ల మధ్య నిర్వహించనున్నారు. క్రీడాకారులకు సోమవారం విశ్రాంతిరోజు. డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్, హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్దన్, కోశాధికారి పి.థామస్, భవానీశంకర్, వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు. -
చెట్టుపై నుంచి పడి దింపు కార్మికుడి మృతి
కొత్తపేట: కొబ్బరి కాయల దింపు కోసం చెట్టు ఎక్కిన కార్మికుడు ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కారింకి వీరవెంకట సత్యనారాయణ (పండు) (42) కొబ్బరి దింపు కార్మికుడు. ఆదివారం మధ్యాహ్నం గ్రామంలో కొబ్బరి దింపు కోసం చెట్టు ఎక్కి కింద పడి మృతి చెందాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాము తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు దింపు కార్మికుడు పండు మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పండుకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అందరితో కలసిమెలసి ఉంటూ, సహచర దింపు కార్మికులకు అండగా ఉండే పండు మృతి చెందాడని తెలిసి పలువురు గ్రామస్తులు, దింపు కార్మికులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం కొబ్బరి దింపులు తీసుకుంటూ జీవనం సాగించే అతని మృతితో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. అమ్మమ్మ చెంతకు చేరిన బాలిక సామర్లకోట: వరుసగా మూడురోజుల పాటు సెలవులు రావడంతో ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్సు కాంప్లెక్స్లు ఆదివారం ప్రయాణికులతో నిండి పోయాయి. ఈ తరుణంలో ఆదివారం జోన్నాదుల వెంకటసాయమ్మ తన మనువరాలు జ్యోత్స్నతో కలిసి చీరాలకు వెళ్లడానికి రైల్వే స్టేషన్కు వచ్చింది. టిక్కెట్టు తీసుకొవడానికి కౌంటర్ వద్దకు వెళ్లిన సమయంలో జనంతో కలిసి జ్యోత్స్న ఒకటవ నెంబరు ప్లాటుఫారంపైకి వచ్చింది. అక్కడ అమ్మమ్మ కనిపించక పోవడంతో ఏడుస్తూ ఉండటాన్ని స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్ అనంత లక్ష్మీ గమనించారు. రైల్వే స్టేషన్లోని మైక్ ద్వారా ప్రకటించారు. అప్పటికే టిక్కెటు తీసుకున్న వెంకటసాయమ్మ మనవరాలి కొసం కౌంటర్ వద్ద వెతుకుతూ ఉంది. ఈ తరుణంలో మైక్ ద్వారా సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకుని స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాలయానికి వెళ్లింది. అచ్చట స్టేషన్ మేనేజరు ఎం రమేష్ కౌన్సెలింగ్ చేసి బాలికను ఆర్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో వెంకటసాయమ్మకు అప్పగించారు. -
మూడు హత్యలకు నిరసనగా శాంతి ర్యాలీ
● నిందితుడికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ ● సీబీఎం సెంటర్లో మానవహారం సామర్లకోట: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ఒక వివాహిత, ఇద్దరు బాలికలను దారుణంగా హత్య చేసినందుకు నిరసనగా ఆదివారం సాయంత్రం శాంతి ర్యాలీ నిర్వహించారు. దళిత సంఘాల నాయకులు, మానవహక్కుల సంఘ నాయకుల మద్దతుతో స్థానిక సీబీఎం సెంటర్ నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి సీతారామ కాలనీలో నివాసం ఉంటున్న ములపర్తి మాధురి (30) కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన(6)లను హత్య చేసిన విషయం విదితమే. 3వ తేదీ ఉదయం ఇంటికి వచ్చిన మాధురి భర్త ధనుప్రసాద్ హత్య జరిగిన విషయాన్ని గమనించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎస్పీ ఆదేశాలలో పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడు స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ను ఈ నెల 7వ తేదీన అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించిన విషయం విదితమే. ఇటువంటి మానవమృగాలకు బుద్ధి వచ్చే విధంగా ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ స్థానిక సీబీఎం సెంటర్లో పిల్లలు, పెద్దలు, మహిళలతో కలిసి మానవ హారం నిర్వహించారు. దళిత సంఘ నాయకులు పిట్టా జానికిరామారావు, లింగం శివప్రసాద్, జిల్లా మానవహక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ మాట్లాడుతూ సురేష్ తరఫున ఏ న్యాయవాది వాదించకుండా చూడాలన్నారు. మానసికంగా కృంగి పొయిన ములపర్తి మాధురి భర్త ధనుప్రసాద్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాఽఽధురి తల్లి ఫిర్యాదును కాకుండా భర్త ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని కోర్టు శిక్ష పడే విధంగా చూడాలన్నారు. సుమారు 30 నిమిషాల పాటు సీబీఎం సెంటర్లో మానవ హారం నిర్వహించడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. అక్కడి నుంచి పోలీసు స్టేషన్ మీదుగా సంతమార్కెట్, పాత తహసీల్దార్ కార్యాలయం, బ్రౌన్పేట సెంటర్ నుంచి తిరిగి సీబీఎం సెంటర్ వరకు శాంతి ర్యాలీ చేరింది. సీఐ ఎ కృష్ణభగవాన్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దళిత సంఘ నాయకులు జుత్తుక అప్పారావు, పాలిక చంటి బాబు బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. -
పరిశోధనలకు ప్రోత్సాహం ప్రయాస్
ప్రధాన తేదీలు దరఖాస్తు చేసేందుకు గడువు: ఆగస్టు 17 దరఖాస్తుల స్క్రీనింగ్: సెప్టెంబర్ 15 జ్యూరీ ఎంపిక గడువు: సెప్టెంబర్ 30 ఫలితాల ప్రకటన: అక్టోబర్ 15 ఎంపికై న ప్రాజెక్టుల ప్రారంభం: అక్టోబర్ 16 ప్రాజెక్టు ముగింపు తేదీ: అక్టోబర్ 16, 2026. రిపోర్టు సబ్మిషన్: అక్టోబర్ 20, 2026. ● దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ● శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యం రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇన్స్ఫైర్ మనాక్, జాతీయ సైన్స్ దినోత్సవం వంటి కార్యక్రమాలను అమలు చేస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారాలను కనుగొనేందుకు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదును పెట్టేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)– ప్రమోషన్ ఆఫ్ రీసెర్చ్ యాటిట్యూడ్ అమాంగ్ యంగ్ అండ్ యాస్పైరింగ్ స్టూడెంట్స్ (ప్రయాస్) పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోంది. అందులో పరిశోధన ప్రాజెక్టు ప్రతిపాదనలను ఆహ్వానించేందుకు దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. అర్హతలు – నిబంధనలు ● ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 9, 10 తరగతులు, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఒక పాఠశాల నుంచి ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాలల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా గణితం బోధించే పీజీటీ/టీజీటీ ఉపాధ్యాయుడు, ఏదైనా ఒక ఉన్నత విద్యా సంస్థ, పరిశోధన సంస్థ నిపుణుడితో కలిసి పరిశోధన ప్రాజెక్టును సమర్పించాలి. ● ఒక పాఠశాల నుంచి ఒక దరఖాస్తును మాత్రమే పరిశీలిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలుంది. పూర్తి సమాచారాన్ని ఎన్సీఈఆర్టీ అధికారిక వెబ్సైట్లో పరిశీలించవచ్చు. ● విద్యార్థులకు సైన్స్ ఉపాధ్యాయుడు గైడ్ టీచర్గా వ్యవహరిస్తారు. ఉన్నత విద్యాసంస్థల సైన్స్ సబ్జెక్ట్ నిపుణుల నుంచి సాంకేతిక సహకారం, మార్గదర్శకత్వాన్ని విద్యార్థులు పొందవచ్చు. మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వాములు అయ్యే విధంగా సైన్స్ ఉపాధ్యాయులు మార్గదర్శకత్వం చేయాలి. జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు ఎంపికవ్వాలంటే సమస్యను ప్రతిబింబించడంతో పాటుగా, మంచి పరిష్కారాన్ని చూపించాలి. ప్రతి ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎంపికై న వారికి రూ.50వేల నగదు విద్యార్థులు స్థానికంగా ఉన్న ఒక సమస్యను గుర్తించి, దానిని అధ్యయనం చేయాలి. సమస్య పరిష్కారానికి మార్గాలను అన్వేషించాలి. శాసీ్త్రయ పరిశోధన చేసి, సమస్య పరిష్కారానికి మార్గాలు చూపిస్తూ రిపోర్టును సమర్పించాలి. ప్రాజెక్టును ఏడాది లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎన్సీఈఆర్టీ ఎంపిక చేసిన పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.50వేలు మంజూరు చేస్తోంది. మంజూరైన నిధులను పరిశోధనకు, ప్రాజెక్టు రూపకల్పనకు వినియోగించుకోవచ్చు. పరిశోధన సామగ్రి, ప్రయాణ ఖర్చులకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిధుల నుంచి విద్యార్థులకు రూ.10 వేలు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత విద్యాసంస్థ సబ్జెక్టు ఎక్స్పర్ట్కి రూ.20 వేల వంతున అందజేస్తారు. -
సెమీస్ దశలో సీబీఎస్సీ బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ సురేష్నగర్లో శ్రీప్రకాష్ స్కూల్లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీబీఎస్సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు రెండో రోజు ఆదివారం క్వార్టర్స్ దశ పూర్తి చేసుకుని సెమీస్ దశకు చేరుకున్నాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులు ప్రత్యర్ధులతో తలపడ్డారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు పరిశీలకునిగా గణేష్, జాతీయస్థాయి రిఫరీలుగా శ్రీనివాస్, భద్రంల పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ శ్రీదేవి, డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆదివారం మ్యాచ్లను ప్రారంభించారు. సెమీస్కు చేరిన జట్ల వివరాలు అండర్–14 బాలుర విభాగంలో.. సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), ఇండస్ యూనివర్సల్ స్కూల్ (హైదరాబాద్), సీఆర్రెడ్డి పబ్లిక్ స్కూల్(ఏలూరు), మౌంట్లిటిరా జి.స్కూల్ (మణికొండ) అండర్–17 బాలుర విభాగంలో .. గాడియమ్ స్కూల్ (హైదరాబాద్), పల్లవి మోడల్ స్కూల్ (సికింద్రాబాద్), ఎస్టిజోసెఫ్ ఇంగ్లిష్ స్కూల్(కర్నూల్), డీపీఎస్ (ఆనందపురం, వైజాగ్) అండర్–19 బాలుర విభాగంలో.. నీలకంత విద్య పీట్ (తెలంగాణ), సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(హైదరాబాద్), హ్యాపీ వాలీ స్కూల్ (విజయవాడ) -
స్నానానికి వెళ్లి అనంతలోకాలకు..
రాజమహేంద్రవరం రూరల్: స్నేహితులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగి మృత్యువాత పడడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బొమ్మూరు రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన ఊట వంశీకృష్ణ(18) శనివారం సాయంత్రం స్నేహితులతో కలిసి పుష్కరాలరేవులో గోదావరి స్నానానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ మురళీకృష్ణ మునిగిపోయాడు. రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం 10.00 గంటల సమయంలో కుమారి టాకీస్ సమీపంలో దోభీఘాట్ వద్ద మురళీకృష్ణ మృతదేహం లభించింది. టుటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై అశ్వక్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఉన్నత చదువులు చదువుతాడని... మురళీకృష్ణ తండ్రి శ్రీను ఎస్వీజీ మార్కెట్లో జట్టుకూలీగా పనిచేస్తుంటాడు. తనలాగా తన కొడుకు ఉండకూడదని మురళీకృష్ణను స్థానికంగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీలో జాయిన్చేసి చదివిస్తున్నాడు. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్నాడు. బాగా చదువుకుని ఉన్నతస్థాయికి వెళతావనుకుంటే మా అందరిని వదిలేసి వెళ్లిపోయావేంటి వంశీ అంటూ శ్రీను దంపతులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. -
ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు
● 3 రోజుల పాటు నిర్వహణ ● తలపడుతున్న 180 జట్లు తుని రూరల్: శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆవరణలో మూడు రోజులపాటు జరిగే ఆంధ్ర, తెలంగాణ అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యా యి. శనివారం ప్రారంభమైన ఈ పోటీల్లో అండర్ 14, 17, 19 విభాగాల్లో 180 జట్లకు చెందిన రెండు వేల మంది బాలురు, బాలికలు పాల్గొంటున్నట్టు శ్రీప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయప్రకాష్ తెలిపారు. మొదటి రోజు జరిగిన మ్యాచ్లలో 24 జట్లు పాల్గొనగా 12 జట్లు విజేతలుగా నిలిచాయని ఆయన తెలిపారు. సీనియర్ ప్రిన్సిపాల్ ఎంవీవీఎస్.మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ అపర్ణ, ఖోఖో ఫెడరేషన్ కార్యదర్శి సీహెచ్ఎల్ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. మొదట రోజు విజేత జట్లు: అండర్–19 బాలికల విభాగంలో హైదరాబాద్కు చెందిన సిస్టర్స్ నివేదిత స్కూల్, ఏలూరుకు చెందిన సీఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ ఏలూరు, తిరుపతికి చెందిన వరిటాస్ సైనిక్ స్కూల్ జట్లు విజేతగా నిలిచాయి. అండర్–17 బాలికల విభాగంలో నాచారానికి చెందిన సుప్రభాత హైస్కూల్, బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేత్ విద్యాలయం, హైదరాబాద్కు చెందిన భారతీయ విద్యాభవన్ జట్లు గెలుపొందాయి. అండర్–19 బాలుర విభాగంలో తిరుపతికి చెందిన ఎకార్డ్ స్కూల్, అండర్–17 బాలురు విభాగంలో బొమ్మార్సిపేటకు చెందిన శాంతినికేతన్ విద్యాలయం, సిద్ధార్థ బోడుప్పల్కు చెందిన పబ్లిక్ స్కూల్ జట్లు గెలిపొందాయి. అండర్–14 విభాగంలో నర్సింగపాలేనికి చెందిన హీల్ స్కూల్, విజయవాడకు చెందిన శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఫార్ూట్యన్ బటర్ఫ్లై స్కూల్ జట్లు గెలుపొందినట్టు నిర్వాహకులు తెలిపారు. -
కూలిపనికి వెళ్తుండగా మృత్యు ఒడిలోకి..
లారీ ఢీకొని ఇద్దరి దుర్మరణం తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం సీతంపేట రంగా విగ్రహం సెంటర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే పెరవలి మండలం కానూరు అగ్రహారానికి చెందిన దవులూరి సుబ్రహ్మణ్యం (44), లంకే ప్రసాద్ (26) రోజూ మాదిరిగానే శనివారం తెల్లవారుజామున 6.30 సమయంలో కడియపులంకలో పూల కుండీల లోడింగ్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. విజ్జేశ్వరం–సీతంపేట సమీపంలోని రంగా విగ్రహం సెంటర్ వద్దకు వారు వచ్చే సరికి కొవ్వూరు వైపు వస్తున్న లారీ వెనుక నుంచి వారిని బలంగా ఢీకొట్టింది. దీంతో వారు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై శ్రీహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ కొవ్వూరు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. తక్షణ సాయంగా బాధిత కుటుంబాలకు చెరో రూ.10 వేలు అందించారు. ప్రభుత్వం తరఫున సాయం అందించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
శ్యామ్తో నిరుద్యోగుల కల సాకారం
బోట్క్లబ్ (కాకినాడసిటీ): నిరుద్యోగుల కలలను శ్యామ్ ఇనిస్టిట్యూట్ నిజం చేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల విడుదలైన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్ను, డైరెక్టర్ శైలజను, రాష్ట్ర స్థాయి టాపర్స్ నానాజీ, రమ్యమాధిరి, ఎం.అచ్యుతరావు, ఎస్ భవానీలను విశాఖపట్నంలో ఆమె నివాసంలో శనివారం సత్కరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తోందని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6014 పోస్టుల్లో 4673 పైగా పోస్టులు శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే కై వసం చేసుకోవడం, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు అన్ని జిల్లాలోను జిల్లా స్థాయి మొదటి ర్యాంకులు సాధించడం గొప్ప విషయమన్నారు. -
దోపిడీ కేసు గుట్టు రట్టు
● సెల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు ● ఐదుగురి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం పిఠాపురం: గత నెల 28న గొల్లప్రోలు మండలం చెందుర్తి రహదారిలో జరిగిన దారి దోపిడీ కేసును గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు. సీఐ శ్రీనివాస్ శనివారం గొల్లప్రోలు పోలీసు స్టేషన్లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నల్లమందు వీధికి చెందిన సమీర్ ప్రజాపత్ అక్కడి భవానీ సిల్వర్స్లో గుమస్తాగా పనిచేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు బంగారం, వెండి వస్తువులను రవాణా చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయన గత నెల 28న పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని నగల దుకాణాల నుంచి బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్పై చెందుర్తి వెళ్తుండగా రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెందుర్తి రోడ్డులో కల్వర్ట్ దగ్గర నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై వచ్చి బ్లేడుతో బెదిరించి 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, రూ.60 వేల నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేసిన పోలీసులు ఘటనాస్థలంలో సిగ్నల్స్ ఆధారంగా పెద్దాపురానికి చెందిన బంగారు నగల వర్తకుడు రౌతు గోవిందుపై నిఘా పెట్టారు. శనివారం పిఠాపురం మండలం జల్లూరు గ్రామ శివారులో అతనితో పాటు గనిరెడ్డి సాయి ప్రసాద్, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ మణికంఠ దోపిడీ చేసిన సొత్తును పంచుకుంటున్న సమయంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి దోచుకున్న సొత్తుతో పాటు వారు వినియోగించిన రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కాగా గోవిందు పెద్దాపురంలో బంగారు వెండి వ్యాపారం చేస్తుంటాడు. బాధితుడైన సమీర్ అతడితో కూడా లావాదేవీలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సమీర్ వద్ద అధికమొత్తంలో బంగారం, వెండి ఉంటాయని, వాటిని కొట్టేయాలన్న దుర్బుద్ధితో అతడిపై తన మనుషులతో రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. దోపిడీ చేసిన వెండి, బంగారాన్ని కరిగించి దిమ్మలుగా మార్చి ఆనవాళ్లు లేకుండా చేశారని సీఐ తెలిపారు. -
రక్షా బంధనం వేళ.. వీడిన పాశాలు..
● శుభకార్యానికి వెళ్లివస్తూ ఒకరు.. చెల్లెలికి రాఖీ కట్టి వస్తూ మరొకరు.. ● ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన ● కుమారుడి మృతి వార్త విని గుండెపోటుతో తండ్రి మృతి గోపాలపురం: మండలం వెంకటాయపాలెంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడడం.. వారిలో ఒకరి మరణ వార్త విని అతడి తండ్రి గుండెపోటుకు గురై చనిపోవడంతో ఇటు గోపాలపురం మండలం వాదాలకుంట, తాళ్లపూడి మండల పెద్దేవం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన మరపట్ల సువర్ణరాజు (56) తాళ్లపూడి మండలం చిడిపిలో బంధువుల ఇంటిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే తాళ్లపూడి మండలం పెద్దేవం గ్రామానికి చెందిన గుండేపల్లి మణిశంకర్ (30) దేవరపల్లి మండలం యాదవోలులో ఉన్న చెల్లి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకు తిరిగి వస్తున్నాడు. వారిద్దరు గోపాలపురం మండలం వెంకటాయపాలెం మలుపు వద్ద పరస్పరం ఢీకొనడంతో మణిశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న సువర్ణరాజును గోపాలపురం సీహెచ్సీకి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సువర్ణరాజు వెళ్లిన శుభకార్యానికి భార్య, కుమారుడు, కుమార్తె మిగిలిన బంధువులు వెళ్లారు. తిరిగి సువర్ణరాజు ఒక్కడే మోటార్ సైకిల్ వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెనుక వస్తున్న భార్య కుమారుడు, కుమార్తె, బంధువులు సువర్ణరాజును ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. -
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక శనివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించారు. సంఘ అధ్యక్షుడిగా జీవీఆర్ఎస్హెచ్కే వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్.రాజు, గౌరవ అధ్యక్షుడిగా సలాది సాయి సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడిగా రేపాక వెంకటరాము, ఉపాధ్యక్షుడిగా కె.కిశోర్, సంయుక్త కార్యదర్శిగా ములంపాక శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీవీఎన్ త్రినాథ్, ఉపాధ్యక్షుడిగా తనికెళ్ల శ్రీనివాస్, మహిళా ప్రతినిధిగా కె.సునీత, రాష్ట్ర ప్రతినిధిగా డొక్కా రాజు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు, ప్రధాన కార్యదర్శి నాదెండ్ల బాబి, ఆలీ, రంగారావు, పి.వేంకటేశ్వరరావు, పి.రామకృష్ణ, చార్లెస్, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఒక్క రూమ్ ప్లీజ్
అన్నవరం: వివాహ సందడితో రత్నగిరి రద్దీగా మారింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై ఆదివారం, ఈ నెల 17న పెద్ద సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. రత్నగిరిపై దాదాపు 600 వసతి గదులుండగా వీటిలో 70 శాతం ఈ ముహూర్తాలకు రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించిన చార్టులు కూడా సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగిలిన సత్రం గదుల కోసం కూడా వీఐపీల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తూండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క రూమ్ ప్లీజ్ అంటూ పెళ్లి బృందాలు, భక్తులు వెంట పడుతూండటంతో దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తూండటంతో వారికి వసతి గదులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకూ వసతి గదుల కేటాయింపునకు ముగ్గురు సూపరింటెండెంట్లతో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వారు వీఐపీల సిఫారసులు, రిజర్వేషన్, ఖాళీలు, ఇతర వివరాలు పరిశీలించి గదులు కేటాయిస్తారు. శ్రావణం.. పెళ్లిళ్ల సంరంభం శుభప్రదమైన శ్రావణ మాసం ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతి రోజూ కొంగుముడి వేసుకున్న కొత్త దంపతులు సత్యదేవుని సన్నిధికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ శ్రావణంలో సత్యదేవుని సన్నిధిలో ఇప్పటికే 200కు పైగా వివాహాలు జరిగాయి. గత నెల 25వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం కాగా 26 నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కో ముహూర్తంలో 40 నుంచి 50 వివాహాలు జరిగాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరిపై 100 వివాహాలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ వరకూ రత్నగిరిపై అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ప్రధానంగా 10, 11, 13, 14, 15, 17 తేదీల్లో రత్నగిరిపై సత్రం గదుల్లో దాదాపు 70 శాతం, వివాహ మండపాలన్నింటినీ పెళ్లి బృందాలు గత నెలలోనే రిజర్వ్ చేసుకున్నాయి. ఆ ముహూర్తాల్లో ఆలస్యంగా వివాహాలు నిర్ణయించుకున్న పెళ్లి బృందాల వారు గదులు, వివాహ మండపాలు లభ్యం కాక ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఈ వివాహాలన్నీ ఏ వివాదాలూ లేకుండా సజావుగా జరిగితే అదే పదివేలనుకునే పరిస్థితి దేవస్థానంలో నెలకొంది. వెల్లువలా భక్తులు శ్రావణ పౌర్ణమి పర్వదినం, రెండో శనివారం సెల వు కావడంతో రత్నగిరికి భక్తులు వెల్లువెత్తారు. సుమారు 50 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. భక్తులు, నవదంపతులతో వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. రూ.2 వేల వ్రత మండపాలు చాలకపోవడంతో భక్తులు క్యూలో వేచి ఉండాల్సి వచ్చింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారికి తిరుచ్చి వాహనంపై ఘనంగా ప్రాకార సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రాకారంలో స్వామి, అమ్మవారిని ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై ఊరేగిస్తారు. రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో భక్తులు పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. రత్నగిరిపై జోరుగా పెళ్లిళ్ల సందడి 70 శాతం సత్రాల గదులన్నీ వివాహ బృందాలకు రిజర్వ్ మిగిలిన రూముల కోసం వీఐపీల సిఫారసులు తలలు పట్టుకుంటున్న అధికారులు -
కన్నీటి వరదకు కట్టడేదీ!
ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 20258లోఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోడం లేదు మాధవపురం గండి పూడ్చి, మా పంటలు కాపాడాలని ఎన్నిసార్లు మొర పెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోడం లేదు. దీనిపై పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) గ్రీవెన్స్ సెల్లో కూడా అధికారులకు ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేదు. ఇది పెద్ద గండి పని చేయడం సాధ్యం కాదని వదిలేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఈ గండి వల్లే ఊళ్లకు ఊళ్లు, వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. వరద వస్తే ఏలేరు అదనపు జలాలు, పీబీసీ నీరు ఒకేసారి వచ్చి పడడం వల్ల ఈ కాలువపై ఒత్తిడి పెరుగుతోంది. ఆవిధంగానే దీనికి గండి పడింది. ఈ గండి వల్ల గత ఏడాది సుమారు 2 వేల ఎకరాల్లో వరి పంట, వందలాది ఇళ్లు నీట మునిగాయి. ఇప్పటికై నా ఈ గండిని పూడ్చి, గట్టును పటిష్టపరచకపోతే మరోసారి పలు గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునగడం ఖాయంగా కనిపిస్తోంది. – వై.ప్రసాదరెడ్డి, రైతు, నాగులాపల్లి, యు.కొత్తపల్లి మండలం పిఠాపురం: గత ఏడాది సెప్టెంబర్ రెండో వారం.. ఎడతెరిపి లేకుండా వానలు.. ఏలేశ్వరం వద్ద ఉన్న ఏలేరు రిజర్వాయర్లో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరింది.. షరా మామూలుగానే అదనపు జలాలను అధికారులు దిగువకు విడిచిపెట్టడం ప్రారంభించారు. మామూలుగా ఏలేరు ప్రవాహ సామర్థ్యం 4 వేల క్యూసెక్కులు. కానీ, దానికి దాదాపు ఏడు రెట్లు మించి ఏలేరులోకి ఒకేసారి 27 వేల క్యూసెక్కుల నీటిని వదిలేశారు. దీంతో, ఒక్కసారిగా వెల్లువలా విరుచుకుపడిన జలరాశి పరీవాహక ప్రాంతాలను ముంచెత్తింది. రోజుల తరబడి వరద నీటిని వదిలేయడంతో వేలాది ఎకరాల్లో పంటలు, పదుల సంఖ్యలో ఊళ్లు నీట మునిగాయి. అపార నష్టం వాటిల్లింది. ఏరువాక సాగి.. దుక్కి దున్ని.. నారు పోసి.. దమ్ము చేసి.. నాట్లు వేసి.. ఉన్నదంతా పంటకు పెట్టుబడి పెట్టి.. ఫలసాయం అందుతుందని ఆశించిన అన్నదాతకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరో పది రోజుల్లో పొట్ట దశకు వస్తుందనుకున్న వరి పంట కాస్తా ముంపు బారిన పడింది. దీనికి తోడు వందలాది ఎకరాల్లో ఇసుక, మట్టి మేటలు వేయడంతో వారికి రెండింతల నష్టం జరిగింది. పిఠాపురం మండలం రాపర్తి ప్రాంతంలో ఏలేరు కాలువకు గండి పడటంతో వరి పొలాల్లో సుమారు 2 అడుగుల ఎత్తున ఇసుక మేటలు వేసింది. దీనిని తొలగించుకోడానికే రైతులకు వేలాది రూపాయలు వదిలిపోయాయి. వరద నీటి ధాటికి కాలువ గట్లకు పెద్ద సంఖ్యలో గండ్లు పడ్డాయి. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల్లో ఊహకందని రీతిలో ఏకంగా రూ.150 కోట్ల మేర నష్టం సంభవించింది. వాస్తవానికి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని ఒకేసారి వదిలేశారని, అందువల్లనే ఇంత భారీ స్థాయిలో నష్టం జరిగిందని స్థానికులు చెబుతారు. ముందస్తు చర్యలేవీ! ఇంతటి మహావిపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైనా వెంటనే మేల్కొంటుంది. మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తితే ప్రజలకు, వారి ఆస్తులకు తగిన రక్షణ కల్పించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది. కానీ, దాదాపు ఏడాదవుతున్నా అటువంటి చర్యలే కానరావడం లేదు. నాటి వరదలకు పంటలన్నీ నీట మునిగి నాశనమైపోయినా ప్రభుత్వం నిబంధనల పేరుతో మొక్కుబడిగా ఎకరానికి రూ.10 వేలు మాత్రమే పరిహారం ఇచ్చి, చేతులు దులుపుకొంది. అది కూడా కొంతమందికి ఇవ్వకుండా ఆపేశారని రైతులు ఆరోపిస్తున్నారు. తప్పని కడ‘గండ్లు’ నాటి వరదలతో ఏలేరు గట్లకు 290 చోట్ల గండ్లు పడ్డాయి. వీటిల్లో 243 గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అప్పట్లోనే అధికారులు గుర్తించారు. కానీ, ఇప్పటి వరకూ తొలి విడతలో రూ.2.28 కోట్లతో 28, మలి విడతలో రూ.3.51 కోట్లతో 39 గండ్లు మాత్రమే పూడ్చారు. మలివిడత పనులకు ఇప్పటి వరకూ ప్రభుత్వం బిల్లులే మంజూరు చేయలేదు. ఇవి కాకుండా మరో 211 పనులు చేపట్టడానికి రూ.18.16 కోట్లతో ప్రతిపాదించారు. వీటికి కూటమి ప్రభుత్వం ఇప్పటికీ మోక్షం కల్పించలేదు. దీంతో, ఈ ఏడాది వరదలు వస్తే తమకు మళ్లీ కడగండ్లు తప్పవని ఏలేరు ప్రాంత ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గోదా‘వర్రీ’ తోడు ఏలేరు జలాశయంలో తగినంత నీటి నిల్వలు లేవనే పేరుతో ప్రభుత్వం కొద్ది రోజులుగా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలను ఏలేరు జలాశయంలోకి తరలిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఏలేరు జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరితే.. దానిని దిగువకు వదిలేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అదే కనుక జరిగితే ఏలేరు పరీవాహక ప్రాంతాలకు మరోసారి వరద ముప్పు తప్పదని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈసారి వరదలు వస్తే సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునుగుతాయని అంటున్నారు. వారికి భరోసా కల్పించేలా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాత్రం కానరావడం లేదు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోనే ఈ దుస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.మండలాల వారీగా దెబ్బ తిన్న ఇళ్లు గొల్లప్రోలు 2,071 కొత్తపల్లి 1,109 పిఠాపురం 1,490 పిఠాపురం టౌన్ 58 ఏలేరు కాలువకు పడిన గండ్లు 290 యుద్ధప్రాతిపదికన పూడ్చాలని అధికారులు నిర్ధారించిన గండ్లు 243 పూడ్చిన గండ్లు 67 తొలి విడత పూడ్చినవి 28 దీనికైన వ్యయం రూ.2.28 కోట్లు తరువాత పూడ్చి గండ్లు 39 దీనికైన వ్యయం రూ.3.51 కోట్లు మిగిలిన గండ్ల పూడ్చివేతకు అంచనాలు రూ.18.16 కోట్లు ఏలేరు ఆయకట్టుకు పొంచి ఉన్న ప్రమాదం గత వరదల్లో ముక్కలైన కాలువ గట్లు రూ.కోట్లతో తూతూమంత్రంగా పనులు గండ్లు పూర్తిగా పూడ్చని ప్రభుత్వం మళ్లీ వరద వస్తే ముంపు ముప్పు తప్పదని ఆందోళన గత ఏడాది ఏలేరు వరద నష్టాలు ఇలా.. నియోజకవర్గంలో వరి సాగు 42 వేల ఎకరాలు వరదలో చిక్కుకున్న పంట సుమారు 36 వేల ఎకరాలు సాగు పెట్టుబడి ఎకరానికి రూ.25 వేలు వరద నష్టం సుమారు రూ.150 కోట్లు మండలాల వారీగా రైతులు నష్టపోయిన పంట విస్తీర్ణం (ఎకరాల్లో) మండలం రైతులు పంట విస్తీర్ణం పిఠాపురం 4,730 6,604కొత్తపల్లి 3,099 5,192గొల్లప్రోలు 2,922 4,334 -
మానవ విధ్వంసం వల్లే ..
వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరులు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయవ్యంగా రావాల్సిన మేఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనివల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడటం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవాలంటే సముద్ర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు. – డాక్టర్ పి.కృష్ణకిశోర్, కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు, అమలాపురం -
శృంగార వల్లభుని సన్నిధిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 18 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామివారికి రూ.3,10,502 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు.. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం చేశామన్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారిని సీఆర్డీఏ కమిషనర్ కూనపురెడ్డి కన్నబాబు దంపతులు దర్శించుకున్నారు. ఆయనకు ఈఓ శ్రీనివాస్, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.బ్యాటరీ కారు బహూకరణ అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం కత్తెర శ్రీనివాసరావు, వైజయంతి దంపతులు, కుమారుడు కేశవానంద్ (హైదరాబాద్) రూ.10 లక్షల విలువైన బ్యాటరీ కారును శనివారం అందజేశారు. తన తండ్రి రామారావు జ్ఞాపకార్థం దీనిని బహూకరిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. కారు తాళాలను ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్ తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి దేవదాయ, ధర్మదాయ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు శనివారం తెలిపారు. 13 మంది సభ్యుల నియామకానికి హిందూ మతానికి చెంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను దేవస్థానం కార్యాలయంలో 20 రోజుల్లోగా అందజేయాలని కోరారు. కార్యాలయం పని వేళల్లో దరఖాస్తులు పొందవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
శ్రుతి తప్పిన రుతురాగం
మందకొడిగా ఖరీఫ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ నత్తనడకన సాగుతోంది. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో మొత్తం 5,97,847 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉండగా ఇప్పటి వరకూ 4,56,067 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడటంగమనార్హం. అంటే మొత్తం సాగులో 76 శాతం మాత్రమే నాట్లు పడ్డాయి. కోనసీమ జిల్లాలో 1,63,999 ఎకరాలకు గాను 1,23,117 ఎకరాల్లో (70 శాతం), తూర్పు గోదావరి జిల్లాలో 1,99,867 ఎకరాలకు గాను 1,74,638 ఎకరాల్లో (87 శాతం), కాకినాడ జిల్లాలో 2,33,981 ఎకరాలకు గాను 1,58,312 ఎకరాల్లో (67 శాతం) మాత్రమే నాట్లు వేశారు. కాకినాడ జిల్లాలో ఏలేరు, పంపా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్(పీబీసీ)తో పాటు పలు ప్రాంతాల్లో ఖరీఫ్ మందకొడిగా సాగుతోంది.●● ఉమ్మడి ‘తూర్పు’పై నైరుతి శీతకన్ను ● 48 మండలాల్లో లోటు వర్షపాతం ● ఖరీఫ్కు అడుగడుగునా అవాంతరం ● 5.97 లక్షల ఎకరాల ఆయకట్టులో 4.56 లక్షల ఎకరాల్లోనే సాగు ● గోదారి నీటి రాక సైతం అరకొర ● గత ఏడాది ఈ సమయానికి 1,895 టీఎంసీల ఇన్ఫ్లో ● ఈ ఏడాది వచ్చింది 937.420 టీఎంసీలేసాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాలు రాకుండానే.. మే నెలలో.. మండు వేసవిలో జోరుగా వర్షాలు కురిశాయి. ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలతో భారీ వర్షాలు కురుస్తాయని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్నదాతలు, ప్రజలు ఆశించారు. కానీ అడపాదడపా తప్ప వాన జాడ లేదు. గోదావరికి జూలై నెలలో అరుదుగా వరద వస్తుంది. ఇలా వచ్చిన ఏడాది.. ఆ తరువాత ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వరదలు రావడం పరిపాటి. గత ఏడాది లాగే ఈసారి కూడా జూలైలో గోదావరికి రెండుసార్లు వరద పోటు తగిలినా పెద్దగా ఇన్ఫ్లో లేకుండా పోయింది. పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో గోదావరిలో నీటి ఉరవడి తగ్గిపోయింది. ఇక రైతుల ఆశల పంట ఖరీఫ్ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. గోదావరి డెల్టాలోనే నీరందడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోచ్చు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. అప్పుడప్పుడు తప్ప ఉమ్మడి జిల్లాలో వర్షం జాడే దాదాపు లేకుండా పోయింది. జూన్, జూలై నెలలతో పాటు ఆగస్టు నెలలో ఇప్పటి వరకూ లోటు వర్షపాతం నమోదైంది. వారంలో ఒక రోజు ఒక మోస్తరు వర్షం కురిస్తే మిగిలిన ఆరు రోజులూ వేసవిని తలపించేలా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉష్ణోగ్రతల ధాటికి సామాన్యులు విలవిలలాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికీ 32 నుంచి 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకొరగానే గోదావరి నీరు.. ఈ ఏడాది గోదావరి ఇన్ఫ్లో కూడా అంతంత మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఇన్ఫ్లో సగం కూడా లేదు. గత ఏడాది ఆగస్టు 9వ తేదీ నాటికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో 1,895.571 టీఎంసీలుగా నమోదైంది. ఆ సమయానికి డెల్టాలోని మూడు ప్రధాన కాలువలకు 47.465 టీఎంసీలు నీరు విడుదల చేయగా సముద్రంలోకి 1,848.106 టీఎంసీల మిగులు జలాలను విడిచిపెట్టారు. అదే రోజు మూడు డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, సముద్రంలోకి 7,33,886 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. కానీ, ఈ సంవత్సరం ఇప్పటి వరకూ ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 937.420 టీఎంసీల ఇన్ఫ్లో మాత్రమే నమోదైంది. దీనిలో 61.33 టీఎంసీలు పంట కాలువలకు విడుదల చేయగా 876.087 టీఎంసీలు సముద్రంలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం పంట కాలువలకు 14,700 క్యూసెక్కుల నీటిని వదులుతూండగా 1,18,480 క్యూసెక్కులు మాత్రమే సముద్రంలోకి వదులుతున్నారు. గత ఏడాది జులై నెలలో భారీ వరద చోటు చేసుకోగా తిరిగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనూ గోదావరికి పెద్ద వరదలు వచ్చాయి. ఇన్ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో గత ఏడాది రబీకి ఢోకా లేకుండా పోయింది. కానీ, ఈ ఏడాది జూలై నెలలో గోదావరికి రెండుసార్లు మాత్రమే స్వల్పంగా వరద వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే రబీకి నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన రైతుల్లో నెలకొంది. -
సంక్షేమం పట్టని కూటమి ప్రభుత్వం
వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ప్రజలు సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు దడాల జాషువాగిరి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ కూడా లేకుండా పోయిందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసం పనిచేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ముందు అభిమానులను రెచ్చగొట్టి, తర్వాత కులాన్ని రెచ్చగొట్టారన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మతాన్ని రెచ్చ కొడుతూ రాజకీయాన్నీ భ్రష్టు పట్టించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి క్రైస్తవులకు ఎలాంటి గౌరవం ఇచ్చారో ఆయన హయాంలో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందాయో వివరించారు. అధికారంలో లేనప్పుడే నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుండా జాన్ వెస్లీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్టీఫెన్ ఆనంద్, పార్టీ నాయకులు కృపావరం, లాజరస్, శ్యామలరావు, జయరాజ్, శాంతి ప్రసాద్, నరేంద్ర, ఏసుబాబు పాల్గొన్నారు. -
కాసూ కాసూ కలిపి కంఠాభరణం
కరెన్సీ కన్యకాంబ శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్బంగా స్థానిక మెయిన్రోడ్లో కొలువైన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారిని రూ.3 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ.వంద, రూ.200, రూ.500 నోట్లతో అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు చేశారు. – అన్నవరంపుత్తడి బాలమ్మ.. శ్రావణ శుక్రవారం సందర్భంగా కాకినాడ సూర్యారావుపేటలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారు బంగారు చీరలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు చెరుకూరి సుబ్రహ్మణ్యం అమ్మవారికి అత్యంత సుందరంగా చీర అలంకరించారు. ఆ చీరలో అమ్మవారు అద్వితీయంగా ప్రకాశిస్తూ కాంతులీనారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. – బోట్క్లబ్ జె.కొత్తూరులో గ్రామ దేవత కనక దుర్గ అమ్మవారికి రూ.5.5 లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చిన్న చిన్న బంగారు వస్తువులన్నింటినీ కరిగించి అమ్మవారికి బంగారు హారం తయారు చేయించినట్టు కమిటీ సభ్యులు వివరించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈ హారాన్ని అమ్మవారికి అలంకరించినట్టు వారు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రముఖులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. – జగ్గంపేట -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
మారేడుబాకలో గంజాయి కలకలం
కపిలేశ్వరపురం (మండపేట): మారేడుబాకలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. మండపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న మారేడుబాకలోని ఖాళీ స్థలంలో యువకులు గంజాయి తాగుతున్నారన్నారంటూ గురువారం పట్టణ పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఎన్.రాము తన సిబ్బందితో కలసి దాడి చేశారు. మారేడుబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను, అనపర్తి మండలానికి చెందిన ఒక యువకుడిని, మండపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 300 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచగా రిమాండ్ విధించినట్టు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. బాలికను రాజమహేంద్రవరం డీపీఓ జువైనల్ హోమ్లో హాజరు పరిచామన్నారు. -
భీమేశ్వరాలయ ప్రధాన అర్చకుడి మృతి
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ కళ్లేపల్లి ఫణికుమార్ (83) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు ఒక కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుందరి ఉన్నారు. ఆయన మృతికి సంతాపంగా భీమేశ్వరాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేశారు. ఆయన మృతికి ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ అర్చకులు కళ్లేపల్లి విశ్వప్రకాశ్, జుత్తుక శ్రీకాంత్, పురోహితులు దొంతుర్తి శ్రీరామచంద్రమూర్తి, మేడవరపు శ్రీనివాస చింతామణి, ఆర్యవైశ్య సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి చెరుకు బాబూరావు, దేవాలయ వైదిక బృందం, ఆలయ సిబ్బంది తమ సంతాపాన్ని తెలియజేశారు. మెట్లపై నుంచి జారిపడి తాపీమేస్త్రి దుర్మరణం అల్లవరం: మండలంలోని బెండమూర్లంక గ్రామంలో యాళ్ల వెంకట రామ్మోహనరావుకు చెందిన నూతన గృహ నిర్మాణ పనులు చేస్తుండగా తాపీమేస్త్రి ముత్యాల వీరన్నబాబు (47) ప్రమాదవశాత్తు శుక్రవారం జారిపడి మృతి చెందాడు. దీనిపై అల్లవరం ఎస్సై బి.సంపత్కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం ఇంటి పనులు చేస్తుండగా మెట్లపై నుంచి జారిపడి తాపీమేస్త్రి వీరన్నబాబు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతనితో పనిచేస్తున్న సహచర కూలీలు వీరన్నబాబును హుటాహుటిన అమలాపురంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని ఎస్సై వివరించారు. మృతుడి కుమారుడు ముత్యాల సాయి పవన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
రత్నగిరిపై సీఎన్జీ కారు దగ్ధం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హరిహరసదన్ సత్రం వద్ద నిలిపి ఉంచిన సీఎన్జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) కారు దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుంచి గురువారం అర్ధరాత్రి ఆ కారులో వచ్చిన భక్తులు కారును హరిహరసదన్ సత్రం ఎదురుగా నిలిపి ఉంచి ఆ సత్రంలో బస చేశారు. అయితే వారు నిలిపిన అర గంటలోనే కారు నుంచి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. అగ్నినిరోధక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ నిమిషాల వ్యవధిలో కారు కాలిపోయింది. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ కారు పక్కన నిలిపి ఉంచిన ఇతర కార్ల యజమానులను అప్రమత్తం చేసి ఆ కారుకు దూరంగా పెట్టించారు. ఓ కారు యజమాని అందుబాటులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది కారు అద్దాలు బద్దలు కొట్టి ఆ కారు హేండ్ బ్రేక్ తీసి దానిని దూరంగా నెట్టారు. అయితే దగ్ధమవుతున్న కారు వేడికి ఆ కారు కూడా కొంతమేర పాడైంది. కాగా, ఖమ్మం నుంచి సుమారు ఏడు గంటల పాటు కారును ఎక్కడా ఆపకుండా నడుపుతూ రావడంతో కారు వేడెక్కి నిలిపిన వెంటనే మంటలు చెలరేగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విద్యుత్ తీగలపై పడి యువకుడి మృతి
యానాం: స్థానిక గౌతమీ గోదావరి రాజీవ్ రివర్ బీచ్ వద్ద ఉన్న కూనపురెడ్డి కాంప్లెక్స్లో లాడ్జిపై భాగం నుంచి గురువారం అర్ధరాత్రి విద్యుత్ తీగలపై పడిన యువకుడు మృతి చెందినట్లు ఎస్సై పునీత్రాజ్ తెలిపారు. మృతి చెందిన యువకుడు ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామ నివాసి చింతా గురుమూర్తి (22)గా గుర్తించామన్నారు. మృతుడు ఏసీ మెకానిక్గా పని చేస్తున్నాడని వివరించారు. అర్ధరాత్రి వేళ విద్యుత్ తీగలపై యువకుడు పడి ఉన్నాడని సమాచారం అందడంతో ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అక్కడకు వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. యానాం పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బందికి ఆయన సమాచారం అందించారు. వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని కిందకు దించారు. ముగ్గురు యువకులు గురువారం రాత్రి లాడ్జిలో దిగి మద్యం తాగారన్నారు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. యానాం జీజీహెచ్కు మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పునీత్రాజ్ తెలిపారు. -
శిథిలాకులు!
లాకులన్నీ లీకులే.. సాగునీటి సరఫరాలో అత్యంత ప్రధానమైన రెగ్యులేటర్లు, స్లూయిజ్లు మరమ్మతులకు గురై శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతున్నాయి. సాధారణంగా సాగునీటి కాలువల్లో నీటి ప్రవాహం సక్రమంగా జరగడానికి రెగ్యులేటర్లు కీలక పాత్ర వహిస్తుంటాయి. అన్ని ప్రాంతాలకు సాగు నీరు సక్రమంగా సరఫరా చేయడానికి వీటిని ఉపయోగిస్తుంటారు. అలాంటి రెగ్యులేటర్లు కొన్నేళ్లుగా మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నా అధికారులు వాటి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరం ఆర్ఆర్బీ ట్యాంకు రెగ్యులేటర్ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. రెగ్యులేటర్ గోడలు శిథిలమై కూలిపోతున్నాయి. షట్టర్లు తుప్పుపట్టి ముక్కలవుతున్నాయి. దీంతో అది పూర్తిగా నిరుపయోగంగా మారింది. 1400 ఎకరాల చెరువుకు నిర్మించిన ఈ రెగ్యులేటర్ గట్టిగా వరద నీరు వస్తే ఏక్షణంలోనైనా కొట్టుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వేల ఎకరాల పంటలు నీటిలో కొట్టుకుపోయి, గ్రామాలకు గ్రామాలు నీట మునిగే ప్రమాదం పొంచి ఉంది. పిఠాపురం: నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఏలేరు, పీబీసీ ఆయకట్టు ప్రాంతం అత్యంత ప్రమాదకర స్థితిలో సాగవుతోంది. వరితో పాటు వాణిజ్య పంటలకు పెట్టిందిపేరైన నియోజకవర్గంలో సాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఏటా అతివృష్టి అనావృష్టి సమయాల్లో ఇక్కడి రైతులు తమ పంటలను కోల్పోవాల్సి వస్తోంది. అయినప్పటికీ పాలకులు చర్యలు తీసుకోవడం లేదు. అధికారుల నిర్లక్ష్యంతో లీకులు కొట్టుకుపోతున్న రెగ్యులేటర్లు, స్లూయిజ్లు, సైఫన్లు పీబీసీ, ఏలేరు ఆయకట్టుకు సాగునీటి ఇక్కట్లు -
ముడుపు కట్టు.. ముక్క పట్టు!
● మూడు సీక్వెన్స్లు.. ఆరు ఢంకాల్లా సాగుతున్న పేకాట శిబిరాలు ● కాసులు పోగేసుకోవడంలో కూటమి నేతలు బిజీబిజీ ● ముఖ్య నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా తమ్ముళ్ల దందా సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎవరికీ డబ్బులు ఊరకనే రావు అంటుంటారు ఒక నగల వ్యాపారి. కూటమి నేతలకు మాత్రం వద్దంటే డబ్బు వచ్చి పడిపోతోంది ఊరకనే. అందుకు ఎన్నో మార్గాలు. అందులో ఒకటి పేకాట శిబిరాలు. కూటమి నేతల కనుసన్నల్లో ఎన్నో శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. పలు నియోజకవర్గాల్లో పేకాట డెన్లు నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నియోజకవర్గాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులకు మామూళ్లు ముట్టజెబుతూ పేకాట శిబిరాలను అడ్డూ అదుపూ లేకుండా నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరో నెల నుంచే పేకాట శిబిరాలతో పేట్రేగిపోతున్నారు. వీటిని కట్టడి చేసేందుకు పోలీసులు కదనరంగంలోకి దిగినప్పటికీ అధికార పార్టీ పెద్దల అండదండలు, నిర్వాహకుల ముడుపుల ముందు అవి దిగదిడుపు అవుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. పేకాట శిబిరాల్లో లక్షలు చేతులు మారుతున్నాయి. పేకాట మోజులో పడి మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. పేకాట డెన్ నిర్వహించాలంటే ముందుగా నియోజకవర్గ ముఖ్యనేతతో బేరం కుదుర్చుకోవాలి. పోలీసులతో నెలవారీ మామూళ్ల లెక్కల్లో మాట్లాడుకోవాలి. ఈ ప్రక్రియ అంతటినీ నియోజకవర్గాల నేతల ముఖ్య అనుచరులు చక్కబెడుతున్నారు. నిర్వాహకులు గుట్టు చప్పుడు కాకుండా పేకాటను మూడు ఆసులు, ఆరు ఢంకాలుగా నిర్వహిస్తున్నారు. జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ రూరల్, రాజానగరం, కమలనాథులు ప్రాతినిథ్యం వహిస్తున్న అనపర్తి, టీడీపీ ఏలుబడిలో ఉన్న రామచంద్రపురం, మండపేట, ముమ్మిడివరం, అమలాపురం తదితర నియోజకవర్గాలతో పాటు పాండిచ్చేరి కేంద్రపాలిత యానాంలో కూడా విచ్చలవిడిగా పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. లోవ దేవస్థానం సమీపంలోనూ.. తుని మొదలు కాకినాడ రూరల్ వరకు డజన్ల కొద్దీ పేకాట శిబిరాలు నడుస్తున్నాయి. తునిలో రెండు స్థావరాల్లో పేకాట నడుస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం సమీపాన ప్రైవేటు రిసార్ట్స్, తుని సాయినగర్లలో వారంలో మూడురోజులు పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. టీడీపీ పెద్దల అండదండలతో తమ్ముళ్ల కనుసన్నల్లో నడుస్తున్న పేకాట స్థావరాలకు విశాఖజిల్లా పాయకరావుపేట, నర్సీపట్టణం నుంచి జూదప్రియులు క్యూకడుతున్నారు. సాయినగర్లోని ఒక తేదేపా నాయకుడి ఇంటినే డెన్గా మార్చేసిన విషయం తెలిసినా పోలీసులు అటువైపు తొంగి చూడలేని పరిస్థితి. తమ్ముళ్లకు, పోలీసులకు నెలవారీ మామూళ్లు ఇవ్వడంతో పేకాట స్థావరాలకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది. కాకినాడ రూరల్లో రమణయ్యపేట, ఇంద్రపాలెం, రాయుడుపాలెం తదితర ఐదారు ప్రాంతాల్లో పేకాటక్లబ్లు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ నేతకు నమ్మినబంట్లైన ఇద్దరు ముఖ్య అనుచరులు ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్నారని సమాచారం. ఈ పేకాటడెన్లలో వారం వారం రూ.50 లక్షలు నుంచి రూ.70 లక్షలు లావాదేవీలు జరుగుతున్నాయి. అన్ని కలిపి నెలకు జనసేన ముఖ్యనేతకు రూ.లక్ష ఇచ్చేలా కుదిరిన ఒప్పందం ప్రకారం మొదటి వారంలోనే సరిపెట్టేస్తున్నారు. స్టేషన్కు రూ.50 వేలు ముట్టచెబుతుండబట్టే పోలీసులు అటువైపు కన్నెత్తిచూడటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కాషాయం కోటలోనూ.. కాకినాడ రూరల్ నియోజకవర్గ సరిహద్దు అనపర్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. కమలనాథులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలోని రామవరం కేంద్రంగా పెద్ద పేకాట శిబిరం నడుస్తోంది. రామవరంతో పాటు కుతుకులూరు, పొలమూరు, దుప్పలపూడి, పీరా రామచంద్రపురం, పెడపర్తిలో పేకాట స్థావరాలు నడుస్తున్నాయి. వీటిలో రామవరం ప్రధాన స్థావరంగా నడుస్తోంది. నియోజకవర్గ ముఖ్యనేత మధ్యవర్తిత్వంతో రామవరం పేకాట డెన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ నిధులతో నిర్మించిన గోకులం షెడ్డునే పేకాట శిబిరంగా మార్చేశారు. షెడ్డు నిర్మాణానికి రామవరం గ్రామ పంచాయతీ అనుమతి ఇవ్వగా అధికారులు భయపడి ఎంబుక్ రికార్డు చేయకుండా వదిలేశారు. రామవరం పేకాట శిబిరం అనపర్తి, ద్వారపూడి, రాజమహేంద్రవరం, కాకినాడ, కడియం, మండపేట, రావులపాలెం, ద్రాక్షారామం తదితర ప్రాంతాల నుంచి వచ్చే జూదగాళ్లతో కిటకిటలాడుతోంది. బ్యాచ్, బ్యాచ్లుగా వచ్చి గుట్టచప్పుడు కాకుండా పేకాటడుతున్నా పోలీసులు కిమ్మనడం లేదు. రామవరం డెన్లో నిత్యం రూ.70 లక్షల నుంచి రూ.90 లక్షల జూదం జరుగుతోందని అంచనా. ముఖ్యనేత ఇంటికి 500 మీటర్ల దూరంలోనే పేకాట శిబిరం నడుస్తుండటంతో పోలీసులు కూడా చూసీచూడనట్టు పోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడిలో శిబిరం నిర్వాహకుడి ముఖ్యనేత ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టే ప్రధాన అనుచరుడేనని తేలింది. రామవరం శిబిరంలో ముక్కతిప్పిన రోజు లక్షన్నర ముఖ్యనేతకు ముట్టచెబుతున్నారని సమాచారం. టీడీపీ యువనేత వాటా యువనేతకు వెళ్లిపోతోందంటున్నారు. మంత్రి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో పేకాట స్థావరాలకు కొదవులేకుండా ఉంది. ముచ్చిమిల్లి రోడ్డు, శ్రీ సిటీ, శీలంవారి సావరం, రూరల్లోని చోడవరం, అన్నయ్యపేట, కూళ్ల, మసకపల్లి, పామర్రు తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వీటిలో కూళ్ల, మసకపల్లి, పామర్రు శిబిరాలు అధికార పార్టీ పెద్దల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యనేత అండదండలతోనే పేకాట స్థావరాలు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నాయి. రూ.లక్ష నుంచి లక్షన్నర ముడుపులు.. జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, శ్రీరామపురం, మల్లంపూడి, శ్రీరంగపట్నం, మధురపూడి, గాడాల, రఘుదేవపురం, వంగలపూడి, మిర్తిపాడులలో పేకాట శిబిరాలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు. ఇక్కడి ముఖ్యనేతకు నెలనెలా లక్ష నుంచి లక్షన్నర ముడుపులు మూటగడుతున్నారని ఆనోటా ఈ నోటా వినిపిస్తోంది. ఇలా పలు నియోజకవర్గాల్లో పేకాట స్థావరాలు అడ్డూ అదుపులేకుండా నడుస్తున్నా పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నారు తప్ప జూదాలను అరికట్టడంలో విఫలమవుతున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. -
వేలం... కూటమి గాలం
ఫ నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా ఫ కూటమి నేతల ఒత్తిళ్లతో ఖరారు కాని వైనం ఫ నచ్చిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం తొండంగి: వేలం నిర్వహించకుండా ‘కూటమి’ గాలం వేసింది.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమకు నచ్చిన వారికి మేలు చేసేందుకు ప్రయ త్నిస్తుంది.. సత్రం భూముల కౌలు వేలాన్ని మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతోంది.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న నాళంవారి సత్రం దాతల ఆశయాలకు కూటమి పార్టీ నేతల ఒత్తిడితో దేవదాయ, ధర్మదాయశాఖ యంత్రాంగం తూట్లు పొడుస్తుంది. రాజమహేంద్రవరం నాళంవారి సత్రంలో శుక్రవారం నిర్వహించిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలాన్ని అధికారులు మళ్లీ వాయిదా వేయడంతో కౌలు వేలం కోసం వెళ్లిన రైతులంతా నిరాశగా వెనుదిరిగారు. ఒకపక్క ఖరీఫ్ సాగు కాలం ప్రారంభమైనా భూములకు కౌలు వేలం పూర్తి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాళంవారి సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమి శృంగవృక్షంలో ఉంది. ఈ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహించగా వచ్చిన ఆదాయంతో సత్రం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాగా ఈ ఏడాది కౌలు కాలం ముగియడంతో ఏప్రిల్లో దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు, సత్రం అధికారులు కలసి శృంగవృక్షం పంచాయతీ కార్యాలయంలో కౌలు వేలం ప్రక్రియ నిర్వహించారు. పాత బకాయిల వసూళ్ల సాకుతో కౌలు వేలాన్ని వాయిదా వేశారు. మళ్లీ జూలై 23న రాజమహేంద్రవరం నాళం వారి సత్రం కార్యాలయంలో కౌలు వేలం నిర్వహించారు. 268.64 ఎకరాలకు సంబంధించి 13 బిట్లుగా కౌలు వేలం నిర్వహించగా, మొదటి బిట్టు 27.19 ఎకరాలకు శృంగవృక్షంకు చెందిన రైతు యనమల నాగేశ్వరరావు రూ.3.68 లక్షలకు హెచ్చుపాటగా కౌలు ఖరారు చేసుకున్నారు. అదేవిధంగా రెండో బిట్టుగా 25.85 ఎకరాలకు మరో రైతు అమృత లోవబాబు రూ.5.01 లక్షలకు హెచ్చుపాటగా వేలం ఖరారు చేసుకున్నారు. కాగా మిగిలిన బిట్లు వేలం నిర్వహించగా, వేలానికి వచ్చిన రైతులు వేలం స్థలం నుంచి వెళ్లిపోయారంటూ అధికారులు మిగిలిన 11 బిట్లుకు కౌలు వేలాన్ని వాయిదా వేశారు. తిరిగి శుక్రవారం వేలం నిర్వహిస్తున్నట్టు శృంగవృక్షంలో రైతులకు తెలియడంతో వేలంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం నాళంవారి సత్రానికి కొద్దిమంది రైతులు వెళ్లారు. అక్కడకు వెళ్లిన రైతులకు కౌలు వేలం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో నిరాశగా వెనుతిరిగారు. తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతలు అధికారులకు ఫోన్లు చేయడంతోనే కౌలు వేలాన్ని వాయిదా వేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల తొండంగిలో పిఠాపురం శ్రీసంస్థాన సత్రం భూముల కౌలు వేలం ప్రక్రియను కూడా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో పోలీసుల బెదిరింపులతో తమకు నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టేందుకే కూటమి నేతల ఒత్తిళ్లతో సత్రం ఆదాయానికి గండికొడుతూ అధికారులు పలుమార్లు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్ పంట కాలం ప్రారంభం కావడంతో కౌలు వేలం ఖరారు కాకపోవడంపై మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా శృంగవృక్షంలోనే సత్రం అధికారులు కౌలు వేలాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
సత్యసాయి కార్మికులకు ‘చాగల్నాడు’ సిబ్బంది మద్దతు
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం వద్ద 32 రోజులుగా సమ్మె చేస్తున్న సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు కార్మికులకు శుక్రవారం చాగల్నాడు మంచినీటి ప్రాజెక్టు కార్మికులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు కార్మికులకు పెండింగ్లో ఉన్న 20 నెలల జీతాలతో పాటు, 26 నెలలు కట్టాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ సొమ్ములను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంచినీటి ప్రాజెక్టు కార్మికులతో భారీ ఎత్తున నిరసన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లయి ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు శ్రీను, ఇస్సాక్, కార్మికులు పాల్గొన్నారు. సిరుల తల్లి.. కల్పవల్లి రాయవరం: సిరుల తల్లి.. కల్పవల్లి ప్రణామం అంటూ ఆ వరలక్ష్మీదేవిని భక్తులు కొలిచారు. జిల్లాలో శ్రావణ శుక్రవారం పూజలను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. వెదురుపాక విజయదుర్గా పీఠంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. అలాగే వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. గేట్ కోచింగ్కు కలెక్టర్ సాయంసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): చిన్న వయసులో తల్లి దండ్రులను కోల్పోయిన ఆ అన్నాచెల్లెళ్లకు కలెక్టర్ కొండంత అండగా నిలిచారు. రాజానగరం మండలం, నందరాడ గ్రామానికి చెందిన మేడిశెట్టి నీరజ, ఎమ్మెస్సీ, జూవాలజీ పూర్తి చేసి డెహ్రాడూన్లో గేట్లో కోచింగ్ తీసుకోవాలనే కలతో ఉన్నారు. ఆమె అన్న హరికృష్ణ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఈ కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా కష్టకాలంలో ఉంది. ఉద్యోగం కోల్పోయిన అన్న, అద్దె ఇంట్లో కష్టాలు పడుతున్న పరిస్థితుల్లో, నీరజ తన ఆశయాన్ని వదులుకోక, కలెక్టర్ ప్రశాంతిని తగిన సహాయాన్ని ఇవ్వవలసిందిగా పీజీఆర్ఎస్ ద్వారా కోరారు. కలెక్టర్ పి.ప్రశాంతి వెంటనే స్పందించారు. వారిని గురువారం తన కార్యాలయానికి పిలిపించి భరోసా ఇచ్చారు. ఆమెకు డెహ్రాడూన్లో కోచింగ్ కోసం రూ.40,000 చెక్కును అందజేశారు. హరికృష్ణ అర్హతకు తగిన ఉద్యోగం కల్పించే అవకాశాల కోసం చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కోనసీమలో మద్యం నుంచి పిండేస్తున్నారు
సాక్షి, అమలాపురం: అటు మేమే.. ఇటు మేమే.. అన్నట్లు వ్యవహరిస్తున్నారు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కూటమి నేతలు. ఒకవైపు వాళ్లు చెప్పినట్లుగా మద్యం మామూళ్లు వసూలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులను.. మరోవైపు అదే అధికార కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్ వ్యాపారులు మేమెందుకివ్వాలని ప్రశ్నిస్తున్నారు. అధికారుల ఒత్తిళ్లకు నిరసనగా కొందరు వ్యాపారులు మద్యం దుకాణాలకు తాళాలు వేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మద్యం షాపుల కేటాయింపు నుంచి బెల్టుషాపులు, పర్మిట్ రూములు, అనధికార బార్లు.. ఎన్నిరకాలుగా వీలైతే అన్ని రకాలుగా మద్యం చుట్టూ కూటమి నేతల దోపిడీ సాగుతోంది.దరఖాస్తుల నుంచే..కూటమి ప్రభుత్వం తొలి నుంచి మద్యం ప్రియులను దోచుకోవడంపైనే దృష్టి పెట్టింది. షాపుల కేటాయింపులో లాటరీని నమ్ముకుంది. ఆశావహుల వద్ద రూ.2 లక్షల చొప్పున డీడీ తీసుకుంది. కోనసీమ జిల్లాలో తొలివిడతగా 133 మద్యం దుకాణాలకు 3,894 దరఖాస్తులందాయి. వీటిద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.77.88 కోట్లు చేరాయి. కొందరు సిండికేట్గా పదుల సంఖ్యలో డీడీలు తీసి దరఖాస్తు చేశారు. ఇటువంటి సిండికేట్లు నాలుగైదు దుకాణాలే పొందాయి. దీంతో వచ్చిన దుకాణాల నుంచే వీలైనంత సొమ్ము పిండాలని మద్యం విచ్చలవిడి అమ్మకాలకు తెరతీశారు. షాపుల్లో కన్నా బెల్టు షాపులు, అనుమతి లేని పర్మిట్ రూముల్లో మద్యం అమ్మకాలు అధికంగా జరుగుతున్నాయి. జిల్లాలో మొత్తం 146 మద్యం దుకాణాలున్నాయి. ప్రతి మద్యం దుకాణానికి 15 నుంచి 25 వరకు బెల్ట్ షాపులున్నాయి. ప్రతి ఐదు దుకాణాలకు గాను మూడింటిలో అనధికార పర్మిట్ రూములు ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తున్నారు. కొన్ని పర్మిట్ రూములు చిన్నసైజు బార్లను తలపిస్తున్నాయి. కొన్ని దుకాణాల వద్ద బిర్యానీ, ఇతర నాన్ వెజ్ ఆహారం అమ్ముతున్నారు. వీటితోపాటు డ్రింకులు, సోడాలు, సిగరెట్ల వంటి అమ్మకాలకు కూడా అనుమతులిస్తూ మద్యం దుకాణదారులు నాలుగైదు రకాలుగా ఆదాయం పొందుతున్నారు. వీరి సంపాదన అటు ఎక్సైజ్ అధికారులకు, ఇటు కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. కూటమి పార్టీలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులకు, వారి ముఖ్య అనుచరులకు మద్యం దుకాణాలుండటంతో ఈ దోపిడీ నిరాటంకంగా సాగుతోంది. కీలక నేతల్లో కొందరికి మద్యం దుకాణాల్లో నేరుగా వాటాలున్నాయి. వాటాలు లేనిచోట్ల దుకాణాల నుంచి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎక్సైజ్ అధికారులు సైతం ఇదే బాటను ఎంచుకున్నారు. ఎక్సైజ్, పోలీస్, విజిలెన్స్.. ఇలా అందరూ ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం. కూటమి నేతల కనుసన్నల్లోనే..అమలాపురం పరిధిలో ఓ మద్యం సిండికేటు చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధికి తోడు.. చినబాబుతో సన్నిహిత సంబంధాలున్న టీడీపీ యువనేత భాగస్వామిగా ఉన్న ఈ సిండికేట్ మామూళ్లు ఇవ్వడం లేదు. తమకు ఈ స్థాయిలో పరిచయాలుంటే నెలవారీ మామూళ్లు ఎందుకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇదే సమయంలో ఎక్సైజ్ శాఖలో కింద నుంచి పై వరకు అదే చినబాబు మామూళ్ల లక్ష్యం పెట్టడంతో వాటిని సాధించలేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పట్టణ పరిధిలోని దుకాణాలపై ఏదో ఒక రూపంలో ఒత్తిడి తెస్తున్నారు. అధికార పార్టీ అండదండలున్నా అధికారులు ఒత్తిడి తెస్తుండటంతో సిండికేట్ ఆధ్వర్యాన దుకాణదారులు ఎదురు తిరిగారు. దుకాణాలకు సోమవారం తాళాలు వేసి, తాళం చెవుల్ని ఏకంగా ఎక్సైజ్ సీఐకి ఇచ్చి వచ్చేశారు. ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇవ్వలేకపోతున్నామంటూ మీడియా ముందు ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ మొత్తం ఎపిసోడ్లో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు, కీలక నేత ముఖ్య అనుచరుడు కీలకంగా వ్యవహరించారు. పైన టార్గెట్లు పెట్టేది కూటమి నేతలే.. దిగువన ఎదురు తిరిగేది కూటమి నేతలే అంటూ ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
గోదావరి స్నానానికి వెళ్లి వస్తూ...
గోకవరం: వరలక్ష్మీ పర్వదినాన్ని పిల్లలతో కలిసి సంతోషంగా గడపాలని ఆ కుటుంబం అనుకుంది. ఇందుకోసం పిల్లలతో కలిసి రాజమహేంద్రవరంలో గోదా వరి స్నానానికి వెళ్లారు. తిరి గి తమ గ్రామానికి వస్తుండగా గ్యాస్ సిలిండర్ల లారీ రూపంలో అనుకోని ఉపద్రవం ఎదురై కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. గోకవరం మండలం బావాజీపేట గ్రామ శివారున గురువారం మధ్యాహ్నం బైక్ని గ్యాస్ సిలిండర్ల లోడు లారీ ఢీకొన్న ప్రమాదంలో ఏడేళ్ల బాలిక మృతి చెందగా, మూడేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గోకవరం మండలం కామరాజుపేట దుళ్ల వీధికి చెందిన పండూరి రాంబాబు ఇటుకబట్టీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య వరలక్ష్మి, కుమార్తె షణ్ముఖి (7), మూడేళ్ల బాలుడు పూర్ణకిరణ్తేజ ఉన్నారు. శుక్రవారం వరలక్ష్మీవ్రతాన్ని పురస్కరించుకుని గోదావరి స్నానం చేయాలని భార్యాభర్తలు కుమార్తె, కుమారుడితో కలిసి బైక్పై ఉదయం రాజమహేంద్రవరం వెళ్లారు. స్నానం ముగించుకుని వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి కొనుగోలు చేసి సంతోషంగా తిరిగి వస్తుండగా మధ్యాహ్నం సమయంలో బావాజీపేట శివారున పోలవరం వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ వీరి బైక్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమార్తె షణ్ముఖి, కుమారుడు పూర్ణకిరణ్తేజల తలకు తీవ్ర గాయాలయ్యాయి. తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఓ ప్రైవేటు వాహనంలో వారిని గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కాతమ్ముళ్లను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక షణ్ముఖి మృతి చెందింది. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై గోకవరం పోలీస్స్టేషన్లో ఎస్సై పవన్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మృతితో కామరాజుపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలిక స్థానికంగా ఒక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటోంది. చదువులో ఎంతో చలాకీగా ఉండే బాలిక అర్ధంతరంగా తనువు చాలించడంతో విషాదం నెలకొంది. కళ్లముందే తమ చిన్నారులకు ఈ పరిస్థితి తలెత్తడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. రోడ్డు ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి మూడేళ్ల బాలుడి పరిస్థితి విషమం బైక్ను సిలిండర్ల లోడు లారీ ఢీకొట్టడంతో ఘటన -
క్వార్టర్స్ దశలో జాతీయ జూనియర్ హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా క్రీడామైదానంలోని హాకీ టర్ఫ్ మైదానంలో జరుగుతున్న 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు గురువారం క్వార్టర్స్ దశకు చేరుకున్నాయి. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుగుతున్న ఈ పోటీలలో ప్రీ క్వార్టర్స్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ఓటమి పాలై అభిమానులను నిరాశ పరచింది. మొదటి మ్యాచ్లో పంజాబ్, చంఢీఘర్ జట్లు పోటీపడగా మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. బెంగాల్, ఉత్తర్ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు 1–1 స్కోర్ చేయడంతో డ్రాగా కాగా, కర్ణాటక, ఛత్తీస్గఢ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ 6–1 స్కోర్తోను, ఆంఽధ్రప్రదేశ్, మహారాష్ట్ర మధ్య జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర 5–1 స్కోర్తో గెలుపొందాయి. శనివారం నిర్వహించనున్న క్వార్టర్ ఫైనల్స్లో హర్యాణా జట్టు ఒడిశాతోను, మధ్యప్రదేశ్ జట్టు ఛత్తీస్గఢ్తోను, జార్ఘండ్ జట్టు పంజాబ్తోను, మహారాష్ట్ర జట్టు ఉత్తర్ ప్రదేశ్తోను పోటీ పడనున్నాయి. శుక్రవారం విశ్రాంతి రోజుగా నిర్వాహకులు ప్రకటించారు. గురువారం నిర్వహించిన మ్యాచ్లను మెడికోవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ ఎం.సుబ్బారావు అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. హాకీ సంఘ కార్యదర్శి హర్షవర్ధన్, కోశాఽధికారి థామస్ పీటర్, కో–ఆర్టినేటర్ వి.రవిరాజు, భవానీ శంకర్, డీఎస్డీఓ బి.శ్రీనివాస్ కుమార్లు పోటీలను పర్యవేక్షించారు. -
మూడు హత్యల కేసులో నిందితుడి అరెస్టు
కాకినాడ క్రైం: ఈ నెల 3వ తేదీన సామర్లకోట సీతారామకాలనీలో చోటు చేసుకున్న మూడు హత్యలవవ మిస్టరీ వీడింది. వివరాలను ఎస్పీ బింధుమాధవ్ బుధవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సామర్లకోట కొత్తపేట వీధికి చెందిన 35 సంవత్సరాల తలే సురేష్ అనే లారీ ఓనర్ కం డ్రైవర్కు సీతారామకాలనీకి చెందిన ములపర్తి మాధురి(29)తో కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇద్దరికీ రెండు కుటుంబాలు ఉండగా ఎవరి కుటుంబంతో వారు కొనసాగుతూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. అయితే కొద్దికాలంగా మాధురి సురేష్తో భార్య జ్యోతిని వదిలేయాలంటూ గొడవ పడుతోంది. ఇదిలా ఉంటే, ఈ నెల 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో మాధురి సురేష్కు ఫోన్ చేసి ‘నా భర్త లేడు, ఇంటికి రా...’ అంటూ పిలిచింది. మాధురి వద్దకు వెళ్లిన సురేష్ పలు అంశాలపై మాట్లాడాడు. ఈ నేపథ్యంలో సురేష్ ఆమెకి వెచ్చించిన రూ.7 లక్షల నగదు విషయం చర్చకు వచ్చింది. ఘర్షణ జరగగా, అదే సందర్భంలో మాధురి సురేష్తో వాదులాడుతూ జ్యోతిని వదిలేయాలని మరోమారు రాద్ధాంతం చేసింది. దీంతో సహనం కోల్పోయిన సురేష్ అక్కడే ఉన్న దుడ్డు కర్రతో మాధురి తలపై బలంగా కొట్టాడు. ఆమె కేకలు వేయగా నిద్ర పోతున్న కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీ(6)లు నిద్ర లేచి భయపడి గట్టిగా ఏడుస్తుండగా వారినీ అదే దుడ్డు కర్రతో తలలపై కొట్టి చంపేశాడు. తల్లి, ఇద్దరు పసిపిల్లల్ని చంపిన సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. లాయర్ను పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండగా నిందితుడు సురేష్ను సామర్లకోట సుగర్ ఫ్యాక్టరీ డంప్ యార్డు సమీపంలో అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి లారీ, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, 123 గ్రాముల వెండి వస్తువులు, సెల్ఫోన్, హత్యకు వినియోగించిన దుడ్డు కర్రను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ భగవాన్ సహా బృందాన్ని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. భార్యను వదిలేయమన్నందుకే ఘాతుకం ప్రియురాలు, ఆమె పిల్లల్ని చంపేసిన ప్రియుడు వివరాలు వెల్లడించిన ఎస్పీ బింధుమాధవ్ -
శ్రావణ శోభ
ఫ నేడు వరలక్ష్మీ వ్రతం ఫ కొండెక్కిన పండ్లు, పువ్వుల ధరలు ఫ కిటకిటలాడిన మార్కెట్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం.. వరలక్ష్మీ వ్రతం కావడంతో జిల్లావ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా మారాయి. వరలక్ష్మీ వ్రతాన్ని ముత్తయిదువలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతానికి కావాల్సిన పూజా సామగ్రి, పువ్వులు, పత్రి, బంగారు లక్ష్మీ రూపుల వంటి వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో గురువారం మార్కెట్కు వచ్చారు. దీంతో, పలు దుకాణాలు రద్దీగా మారాయి. పత్రి, పండ్లు కొనుగోలు చేసేందుకు మహిళలు బయటకు రావడంతో భానుగుడి, నాగమల్లితోట జంక్షన్, అశోక్ నగర్, గాంధీనగర్, రామారావుపేట, బాలాజీ చెరువు సెంటర్, పెద్ద మార్కెట్లో సందడి నెలకొంది. రోడ్డు పక్కన పత్రి, పండ్ల దుకాణాలు వెలియడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. భానుగుడి, బాలాజీ చెరువు, పెద్ద మార్కెట్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు మరింతగా ఆకాశన్నంటాయి. పత్రి, పువ్వులు, పండ్ల ధరలు రెట్టింపయ్యాయి. దీంతో, పలువురు ఉన్నంతలోనే పూజా సామగ్రి కొనుగోలు చేసుకొని ఇంటి ముఖం పట్టారు. గత ఏడాదితో పోల్చితే ధరలు పెరిగాయిలా.. (రూ.) పూలు/పండ్లు గత ఏడాది ప్రస్తుతం చామంతి పూలు (కిలో) 400.00 800.00 (విడిగా ఒక్కో పువ్వు రూ.2) మొక్కజొన్న పొత్తు (1) 5.00 15.00 అరటి పండ్లు (డజను) 40.00 60.00 బత్తాయి పండ్లు (డజను) 100.00 250.00 దానిమ్మ పండు (1) ––– 40.00 జామకాయ (1) ––– 15.00 -
సాంకేతికతతో గిరిజన సంస్కృతి పరిరక్షణ
రాజానగరం: మౌఖిక రూపంలో ఉండే అపారమైన గిరిజన సాహిత్య, సంస్కృతీ సంపదను సాంకేతిక పరిజ్ఞానంతో పరిరక్షించుకుంటూ భావితరాలకు అందించాలని ఆదికవి నన్నయ యూని వర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. వర్సిటీలో ఎన్ఎస్ఎస్ విభాగం సహకారంతో ఎస్సీ, ఎస్టీ సెల్, కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యాన ప్రపంచ గిరిజన దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ, ‘స్థానిక ప్రజల కృత్రిమ మేధస్సు – హక్కులను కాపాడుకోవడం, భవిష్యత్తును రూపొందించడం’ అనే థీమ్తో ప్రపంచ గిరిజన దినోత్సవం జరుగుతుందని అన్నారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 19 గిరిజన భాషలకు లిపిని రూపొందించడంలో తను 35 ఏళ్ల అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలపై అవగాహన కలిగి ఉండటం ఆనందంగా ఉందని చెప్పారు. గిరిజనులు వాడుక భాషలో మౌఖికంగా సాహిత్య సేద్యం చేస్తున్నారన్నారు. ప్రకృతితో బంధం ఏర్పరచుకుని, రాయిలో కూడా దేవుడిని చూడగలిగే నిర్మలమైన మనస్సున్న వారు గిరిపుత్రులని ప్రసన్నశ్రీ అన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, సదస్సు కన్వీనర్ పి.విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణం.. ప్రయాసం
మలికిపురం: రెండు జిల్లాల మధ్య గోదావరి నదిపై గల దిండి– చించినాడ వంతెనపై రాకపోకలు నిషేఽధించిన ప్రభుత్వం ప్రయాణికులకు తగిన ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలం అయింది. సుమారు 3 నెలల పాటు రాకపోకలు నిషేధం అంటూ పదిరోజుల క్రితం ప్రకటించిన అధికారులు విద్యార్థుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదు. వంతెన మరమ్మతులకు నిధులు కేటాయింపుపై కూడా దృష్టి పెట్టలేదు. సుమారు 20 ఏళ్లుగా ఇక్కడ వంతెనపై రాకపోకలకు అలవాటు పడిన ప్రయాణికులు, వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ప్రధానంగా ఇక్కడ విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలలోని రాజోలు దీవి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో గల విద్యాసంస్థలకు అనేక బస్సులు తిరుగుతున్నాయి. ఈ దీవి నుంచి సుమారు 3 వేలకు పైగా విద్యార్థులు బస్లలో విద్యాసంస్థలకు వెళ్తారు. సుమారు 100కు పైగా బస్లు ఉన్నాయి. అయితే వంతెనపై రాకపోకలు నిలిపివేయడంతో ఆయా విద్యా సంస్థలు బస్లను దిండి వైపే నిలిపి వేస్తున్నాయి. సుమారు 2 కిలోమీటర్ల పొడవు గల వంతెనపై విద్యార్థులు నడుచుకుంటూ చించినాడ వైపు వెళ్తున్నారు. సాయంత్రం కూడా చించినాడ వరకే బస్లు నడుపుతున్నారు. అటువైపు నుంచి విద్యార్థులు నడుస్తునూ ఇవతలి వైపునకు వస్తున్నారు. ఇలా ఉదయం, సాయంత్రం నడక విద్యార్థులకు భారంగా మారింది. ఎండ కూడా తీవ్రంగా ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. పట్టించుకోని విద్యాసంస్థలు తేలిక పాటి వాహనాలకు అనుమతి ఉండడంతో ఆయా విద్యాసంస్థలు ఆటోలను ఏర్పాటు చేయవచ్చు. కానీ అలా చేయడంలేదు. ఫీజులు దండీగా వసూలు చేసే ఆయా విద్యాసంస్థలు ఇలా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ బస్లు అటువైపు, ఇటువైపు కూడా నిలిపి వేసి ప్రయాణికులకు వంతెనపై నడకే దిక్కు అంటున్నారు. ప్రయివేటు బస్లు కూడా చించినాడ వరకే పరిమితం కావడంతో మలికిపురం, రాజోలు, అమలాపురం నుంచి వచ్చే బస్లు నిలిచిపోయాయి. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులను రాజోలు దీవి నుంచి మోటార్ సైకిళ్లపై చించినాడ తీసుకెళ్లవలసి వస్తోంది. ఇక ఉపాధి కోసం అటు నుంచి వచ్చి వెళ్లే కార్మికులు ట్రక్కులను ఆశ్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే వంతెనకు ఇరువైపులా భారీ వాహనాలు, బస్లు నిలిపి ఉంచడం వల్ల ట్రాఫిక్ సమస్య కూడా ఽఅధికంగా ఉంది. ఈ కష్టాలు ఎన్నాళ్లు ఉంటాయో అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిండి– చించినాడ వంతెనపై రాకపోకలు నిషేధం ప్రత్యామ్నాయం చూపని అధికారులు విద్యార్థులకు నడక యాతన ట్రక్కుల పైనే కార్మికుల ప్రయాణం ఇంకా మొదలు కాని మరమ్మతులు అంచనాలు కూడా రూపొందించని వైనం విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం దిండి వంతెనపై బస్ల రాకపోకల నిషేధించడం వల్ల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యా సంస్థల బస్లు వంతెన అటు వైపు, ఇటు వైపు నిలిపివేసి వంతెనపై విద్యార్థులను నడిపిస్తున్నారు. ఆటోలు పెట్టి ఇబ్బందులను తొలగించాలి, అధికారులు జోక్యం చేసుకోవాలి. – బూశి జాన్ మోషే, విశ్వేశ్వరాయపురం. -
బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న కూటమి
● కాకినాడలో కదం తొక్కిన బీసీలు ● ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడికి నిరసనసాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తోందని బీసీలు గళమెత్తారు. అధికార పార్టీ గూండాలు బరితెగించి బీసీలపై వరుసగా దాడులకు దిగుతూ, భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాచగొల్ల రమేష్ యాదవ్పై టీడీపీ గుండాల దాడిని ఖండిస్తూ కాకినాడలో గురువారం నిరసన తెలిపారు. జిల్లా నలుమూలల నుంచీ వచ్చిన పార్టీ నేతలు, బీసీ సెల్, స్థానిక సంస్థల ప్రతినిధులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పీఆర్ కాలేజీ సమీపాన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం జంక్షన్కు చేరుకున్నారు. బీసీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో చంద్రబాబు సర్కారు విఫలమైందని ఆందోళన తెలిపారు. అనంతరం ఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా నల్లగుండువారిపాలెంలో ప్రచారంలో పాల్గొన్న రమేష్ యాదవ్పై జరిగిన దాడి అనాగరికమని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కాకినాడ స్మార్ట్ సిటీ మాజీ చైర్మన్, బీసీ జేఏసీ కో కన్వీనర్ అల్లి రాజబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందని దుయ్యబట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, రమేష్ యాదవ్పై దాడే దానికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసి ఏదో ఒక విధంగా గెలవాలని, జగన్ నియోజవర్గంలో పైచేయి సాధించాలనే కుట్రలో భాగమే ఈ రాద్ధాంతమని మండిపడ్డారు. పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేసి గెలవాలన్న చంద్రబాబు కుట్రలో భాగమే ఈ దాడి అని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీలంటే చంద్రబాబుకు మొదటి నుంచీ చులకన భావమేనన్నారు. 2014లో అలవిగాని హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదని గుర్తు చేశారు. ఆ హామీలు అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాట తీస్తా, తొక్క తీస్తా.. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారంటూ ఏవిధంగా అవమానించారో అందరికీ తెలుసన్నారు. రాష్ట్ర సెక్రటేరియట్లో చంద్రబాబును కలిసి హామీలు అమలు చేయాలని నాయీ బ్రాహ్మణులు అడిగితే.. పవిత్రమైన సెక్రటేరియట్లోకి మీరు ఎలా వస్తారంటూ అవమానించారన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆ సామాజిక వర్గాన్ని అవమానించారని గుర్తు చేశారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించి గౌరవించారని రాజబాబు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బూత్ కమిటీ కన్వీనర్, జెడ్పీటీసీ సభ్యుడు గుబ్బల తులసీ కుమార్, పార్టీ బీసీ నేతలు యనమల కృష్ణుడు, ఒమ్మి రఘురాం, అనుసూరి ప్రభాకర్, రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు జమ్మలమడక నాగమణి, వాసుపల్లి కృష్ణ, ఆయా నియోజకవర్గాల బీసీ సెల్ నేతలు రేపాటి శ్రీనివాస్, చెక్క చక్రవర్తి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), యువజన విభాగం కాకినాడ అధ్యక్షుడు రోకళ్ల సత్య, నందం, మాజీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం దగా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ పంట కాలం జూన్ నుంచి ప్రారంభమవుతుంది. దీనికోసం మే నెలలోనే పొలం దుక్కులు చేయాలి. విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. నారుమడి వేయాలి. పొలాల్లో దమ్ములు చేయాలి.. ఆ తర్వాత నాట్లు వేయాలి.. అదునుకు ఎరువులు వేయాలి.. ఇవి కాకుండా కూలీ ఖర్చులు.. ఇవన్నీ జరగాలంటే కర్షకుడి చేతిలో కాసులుండాల్సిందే. గతంలో అయితే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం విత్తు నుంచి విక్రయం వరకూ అన్ని విధాలా అండగా ఉండేది. జిల్లాలోని రూ.1.86 లక్షల మందికి రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందించేది. కానీ, నేడు కూటమి పాలనలో ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు నమ్మించి.. నేడు ముంచేసి.. తాము అధికారంలోకి వస్తే అంతకు మించి సాయం చేస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి నేతలు నేడు తమను నిలువునా ముంచేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ ముందస్తు సాగు పేరిట హడావుడి చేసిన ప్రభుత్వం అందుకు తగిన రీతిలో రైతుకు తోడ్పాటు అందించలేదు. రబీ ధాన్యం డబ్బులు బకాయి పెట్టింది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పేరిట ఇస్తామన్న రూ.20 వేలు తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది అనేక సాకులతో అర్హులైన సుమారు 40 వేల మంది రైతులకు కోత పెట్టారు. ఈ పథకాన్ని 1.48 లక్షల మందికి మాత్రమే పరిమితం చేశారు. అది కూడా కేంద్రం ఇచ్చిన రూ.2 వేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు మాత్రమే కలిపి రూ.7 వేలు విదిల్చారు. ఇది ఏ మూలకూ చాలక రైతులు సాగు పెట్టుబడులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుఖీభవ సొమ్ము కూడా పలువురికి కేంద్రం ఇచ్చిన రూ.2 వేలు మాత్రమే జమ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా అందలేదని వారు ఆవేదన చెందుతున్నారు. తప్పని అప్పులు ఎకరం పొలంలో వరి సాగు చేయాలంటే విత్తనాల దగ్గర నుంచి నాట్ల వరకూ సుమారు రూ.15 వేలు ఖర్చవుతుంది. ఎరువులకు మొదటి దఫా రూ.2,500 అవసరం కాగా, మొత్తం రూ.17,500 ఖర్చవుతుంది. ఈ పరిస్థితుల్లో కూటమి సర్కారు ఇచ్చిన రూ.7 వేల పెట్టుబడి సాయం దేనికి అక్కరకొస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో సాగు పెట్టుబడుల కోసం పలువురు రైతులు అధిక వడ్డీలకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు బంగారు ఆభరణాలను వర్తకుల వద్ద కుదువ పెట్టి అప్పులు తెచ్చుకొంటున్న పరిస్థితి నెలకొంది. చంద్రబాబు చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు అసలు పొంతనే ఉండదనే విషయం అన్నదాత సుఖీభవ విషయంలో మరోసారి రుజువైందని రైతులు మండిపడుతున్నారు. ‘సుఖీభవ’ అరకొర సాయంపై అన్నదాతల ఆగ్రహం జిల్లాలో సుమారు 40 వేల మందికి పంగనామం రైతుకు తప్పని అప్పుల తిప్పలుఅరకొర సాయంతో అవస్థలు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్తో లింక్ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు ఒకేసారి విడుదల చేయాలి. అరకొరగా ఇస్తున్న సాయం చూస్తూంటే పెట్టుబడి బారెడు.. సాయం జానెడు అన్నట్టుగా పరిస్థితి ఉంది. రైతులను ఆదుకోవాలంటే ఈ పథకం సొమ్ము వాయిదాల్లో కాకుండా ఒకేసారి ఇవ్వాలి. – బండే వీరబాబు, రైతు, వేములవాడ, కరప మండలం భంగ పడ్డాం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రైతు భరోసా సాయం అందుకున్నాను. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ సాయం అందలేదు. ఈ పథకం కింద కూటమి ప్రభుత్వం ఒకేసారి రూ.20 వేలు ఇస్తుందని గంపెడాశలు పెట్టుకున్నాం. ఏడాది గడచిపోయిన తరువాత రూ.7 వేలు మాత్రమే వేయడం.. అది కూడా కేంద్రం ఇచ్చే రూ.2 వేలు కలిపి ఇవ్వడం అన్యాయం. అది కూడా అందరికీ అందలేదు. ప్రస్తుతం ఇచ్చిన రూ.7 వేలు ఏ మూలకూ చాలవు. పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎరువులకు కూడా చాలని పరిస్థితి. మూడు వాయిదాలు కాకుండా కనీసం రెండు వాయిదాల్లోనైనా అన్నదాత సుఖీభవ సాయాన్ని రైతులందరికీ ఇవ్వాలి. – మేకా శ్రీనివాసరావు, రైతు, సామర్లకోట -
మట్టి, చెట్లు మాయం
గోపాలపురం: గ్రామంలో సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బొల్లేరు చెరువులో ఉన్న మట్టిని టీడీపీ నాయకులు తరలించడంతో పాటు గట్టుపై ఉన్న అత్యంత విలువైన చెట్లను నరికివేశారు. నీటి సంఘం ముసుగులో తాత్కాలిక తీర్మానం చేసి ఇరిగేషన్ అధికారులకు కనీసం సమాచారం లేకుండా రూ.లక్షా 50వేలకు అమ్ముకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో చెరువులో ఉన్న లక్షలాది రూపాయల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇదంతా టీడీపీ నాయకులు కనుసన్నలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం. గోపాలపురం మండలంలోని గంగోలు, భీమోలు, నందిగూడెం, జగన్నాథపురం, కరిచర్లగూడెం గ్రామాల్లోని చెరువుల్లోని మట్టిని ఆయా గ్రామ టీడీపీ నాయకులు నియోజకవర్గ ముఖ్యనాయకుడికి 70 శాతం వాటాగానూ, మిగిలిన 30శాతం వాటా స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు పంచుకొనే విదంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే చెరువు మట్టిని తరలించి అమ్ముకున్న సొమ్ము మొత్తం 100 శాతం నియోజకవర్గ ముఖ్య నాయకుడికి అందజేయాలని ఆ తర్వాత మాత్రమే నాయకులకు 30శాతం అందజేస్తామని చెప్పినట్లు సమాచారం. అయితే మొత్తం 100శాతం అప్పగించడానికి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు సుముఖంగా లేకపోవడంతో ఇప్పటికే 30 శాతం వాటా సొమ్మును ఆయా గ్రామాల నాయకులు వాడుకున్నారు. ఎన్నికల సమయంలో మా గ్రామంలో ప్రతి కార్యక్రమానికి తమ సొంత సొమ్ము ఖర్చు చేశామని, కనీసం 30శాతం వాటా కూడా ఇవ్వకపోతే పార్టీ కార్యక్రమాలు ఎలా నిర్వహించాలంటూ కొంతమంది టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మా భాగస్వామ్యం ఉన్నా కనీసం చెరువు అక్రమ మట్టి తవ్వకాలు కానీ, ఇతర కార్యక్రమాలు కానీ తెలియజేయడం లేదని ఒక పక్క జనసేన, బీజేపీ నాయకులు మధన పడుతున్నారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ, డీఈ కె.రవీంద్ర, రాహుల్ భాస్కర్లను వివరణ కోరగా చెరువుల్లోని మట్టిని రైతులు తమ పంట పొలాలకు తీసుకెళ్లడానికి అనుమతులు ఇచ్చామని కానీ ఆ మట్టిని ఇటుక బట్టీలకు తరలించినట్లు మాకు సమాచారం రావడంతో నిలుపుదల చేశామన్నారు. బొల్లేరు చెరువు గట్టుపై విలువైన వేప, ఇతర జాతుల చెట్లు నకరడం మా దృష్టికి వచ్చిందని దానిపై జిల్లా ఉన్నతాధికారులకు, స్థానిక పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గోపాలపురం బొల్లేరు చెరువులో నీటి సంఘం నిర్వాకం అంతా టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్న అధికారులు -
ఖరీఫ్..అసేద్యం!
ఫ చేయని పనులకు రూ.కోట్లు ‘క్లోజ్’ ఫ సాగునీటి కాలువల్లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన గుర్రపుడెక్క, తూటికాడ ఫ సక్రమంగా అందని సాగునీరు ఫ ఆదిలోనే అన్నదాతలకు కష్టాలు పిఠాపురం: పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఖరీఫ్ సాగుకు నీరు సకాలంలో అందక, నారు లేక రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాలువలకు నీరు విడుదల చేశామని అధికారులు చెబుతుండగా ఎక్కడికక్కడే పెరిగిపోయిన పూడికలతో శివార్ల సంగతి తరువాత.. సమీప పొలాలకు సైతం నీరు అందక, నాట్లు పడక.. రైతులు పాట్లు పడుతున్నారు. ఏ చెరువు చూసినా జలకళ తప్పిపోయే కనిపిస్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి క్లోజర్ పనులు చేసేశామని అధికారులు చెబుతూండగా.. చాలాచోట్ల కాలువల్లో గుర్రపుడెక్క, తూటికాడ దర్శనమిస్తున్నాయి. ఫలితంగా సక్రమంగా నీరందక రైతులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ), ఏలేరు పరిధిలో 42 వేల ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ ఏలేరు నుంచి కానీ, పీబీసీ నుంచి కానీ సరిగ్గా నీరందకపోవడంతో 15 శాతం విస్తీర్ణంలో మాత్రమే నారుమడులు పడ్డాయి. సుమారు 20 శాతం విస్తీర్ణంలో వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నీరు లేక గగ్గోలు ఏలేరు ప్రాజెక్టులో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడంతో ఆ ఆయకట్టులో కనీసం నారుమడులు కూడా వే యలేని దుస్థితి నెలకొంది. సాధారణంగా ఈ సమ యానికి నాట్లు పూర్తయ్యి, కలుపు తీసే పనుల్లో రైతు లు నిమగ్నం కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకూ ఎక్క డా ఒక్క నారుమడి కూడా సిద్ధం కాకపోవడంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఏలేరు నుంచి నీరు వి డుదల చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ పిఠాపురం ఆయకట్టుకు చుక్క నీరు కూడా చేరలేదు. మరోవైపు పీబీసీ నుంచి అరకొరగా నీరు వస్తున్నా ప లు చోట్ల కాలువల్లో పూడికలు ఉండటంతో నీరు ముందుకు ప్రవహించడం లేదు. మరో వైపు వర్షాలను న మ్ముకుని వాణిజ్య పంటలు వేసిన రైతులకు బోర్ల ద్వా రా నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరికొన్ని చోట్ల వాటి ద్వారా కూడా నీరందక బావుల్లో నీరు తో డుకుని, మోసుకుని మొక్కలకు తడులు అందించాల్సి న పరిస్థితి దాపురించిందని అన్నదాతలు వాపోతున్నా రు. వెదజల్లే పద్ధతిలో సాగు ప్రారంభించాలని వ్యవ సాయ అధికారులు సూచిస్తున్నారు. అయితే, నీరు లేకుండా, దమ్ము చేయకుండా, ఎలా వెదజల్లుతామని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమని ప్రశ్నిస్తున్నారు.ఎక్కడి పూడిక అక్కడే.. రూ.కోట్ల వ్యయంతో క్లోజర్ పనులు చేస్తున్నామ ని అధికారులు, అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ, ఏ కాలువ చూసినా ఎక్కడి పూడిక అక్కడే కనిపిస్తోందని రైతులు విమర్శిస్తున్నారు. పని చేసినట్టుగా రాసుకుంటున్నారు తప్ప ఎక్కడా ఏ కాలువనూ పూర్తిగా బాగు చేయలేదని చెబుతున్నారు. కాలువల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోవడంతో నీరు వదిలినా పొలాలకు వచ్చే పరిస్థితి లేదంటున్నారు. కొన్నిచోట్ల మొక్కుబడిగా పూడికలు తొలగించి, ఫొటోలు తీసుకుని అంతా చేసినట్లుగా రాసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. -
వివాహేతర సంబంధం కొనసాగించలేదని కాల్పులు
కాకినాడ: శంఖవరం మండలం, పెదమల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో ఈ నెల 3న మణికుమార్ (గబ్బర్సింగ్) అనే వ్యక్తి భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు జరపడానికి ప్రధాన కారణం వివాహేతర సంబంధం కొనసాగించలేదనే కక్షే కారణమని పోలీసు విచారణలో తేలింది. బుధవారం అన్నవరం పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శృంగధార గ్రామానికి చెందిన కాకూరి చంద్రయ్య (చంద్రబాబు) భార్య సూర్యావతితో అదే గ్రామానికి చెందిన మణికుమార్కు వివాహేతర సంబంధం ఉంది. కొంత కాలం ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే ఇటీవల సూర్యావతి తన భర్త చంద్రయ్య వద్దకు వచ్చేసింది. తనను వదిలేసి వచ్చిందని సూర్యావతిపై మణికుమార్ కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 3న అర్ధరాత్రి చంద్రయ్య, సూర్యావతి వారి ఇంటి అరుగుపై నిద్రపోతుండగా మణికుమార్ వారిపై నాటు తుపాకీతో కాల్పులు జరపగా, ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయని డీఎస్పీ వివరించారు. మణికుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పెదమల్లాపురం వద్ద ప్రత్తిపాడు సీఐ సూర్యఅప్పారావు ఆధ్వర్యంలో అరెస్ట్ చేసి నాటు తుపాకీని స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడిని ప్రత్తిపాడు కోర్టుకు తరలించినట్టు డీఎస్పీ వివరించారు. -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..
తరగతులు ప్రభుత్వం ప్రైవేట్ మొత్తం 1–5 41,559 85,066 1,26625 6వ 13,741 16,225 29,389 7వ 16,441 15,198 31,384 8వ 17,250 12,521 29,585 9వ 18,459 12,777 30,729 10వ 18,463 11,478 29,913బాలాజీ చెరువు: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గతేడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025– 26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకూ సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈ నెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈ నెల 11కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రామ్పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యసన లోపాలను గుర్తించడంతో పాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికితీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1, 3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్కు బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్ఏలు, రెండు సమ్మేటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. బైలింగ్విల్ ప్రశ్నపత్రాలు సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిష్లో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి ప్రశ్నను అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్నపత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాత పూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్.. అండర్ స్టాండింగ్.. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది. ఏర్పాట్లు పూర్తి పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థులు ప్రతి ఒక్కరూ పరీక్షలు రాసేలా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలు జారీచేశాం. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ ఈ నెల 11 నుంచి 14 వరకూ పరీక్షలు విద్యార్థి అభ్యసనం మదింపునకు నిర్వహణ జిల్లాలో 2.78 లక్షల మంది విద్యార్థులు -
వైఎస్సార్ సీపీ యువజన విభాగం జోన్–2 అధ్యక్షుడిగా కారుమూరి
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి. పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పెద్దిరాజు గోకవరం: వైఎస్సార్ సీపీ ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డికి చెందిన కండెల్ల పెద్దిరాజును నియమిస్తూ వైఎస్సార్ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్న పెద్దిరాజు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పార్టీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. తనకు ఈ పదవి అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్చార్జి తోట నరసింహంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఫేక్ పీఎఫ్ చలానాలపై విచారణ అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్ కనకదుర్గా మేన్పవర్ సర్వీసెస్ తప్పుడు పీఎఫ్ చలానాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావు బుధవారం విచారణ చేపట్టారు. ఈఓ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో ఈఓ వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ కాంట్రాక్టర్ మూడు నెలలకు ఫేక్ పీఎఫ్ చలానాలు ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. దాంతో కాంట్రాక్టర్ను హెచ్చరించడంతో మళ్లీ మూడు నెలలకు రూ.30 లక్షలు పీఎఫ్ చెల్లించి ఒరిజినల్ చలానాలు జత చేశారని తెలిపారు. కాగా, కాంట్రాక్టర్ తరఫున హాజరైన ప్రతినిధి మాట్లాడుతూ తాము వెనుక ఇచ్చిన చలానాలే అసలైనవని, ముందు చలానాలు తాము ఇచ్చినవి కాదని చెప్పినట్టు ఆర్జేసీ తెలిపారు. తప్పుడు చలానాలు ఎలా వచ్చాయో చెప్పడానికి తమకు కొంత సమయం కావాలని కోరారని దాంతో విచారణ వాయిదా వేశామని ఆర్జేసీ తెలిపారు. అయితే ముందు ఇచ్చిన ఫేక్ చలానాల ఆధారంగా దేవస్థానం బిల్లు చెల్లించిందని, అది కాంట్రాక్టర్ అకౌంట్లోనే జమ అయిందని ఆయన తెలిపారు. ఫేక్ చలానాలు సమర్పించిన కాంట్రాక్టర్ తరఫు వ్యక్తి విష్ణు స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామని ఆర్జేసీ వివరించారు. వారం రోజుల్లో మళ్లీ విచారణ నిర్వహిస్తామని తెలిపారు. దేవస్థానం ఏఈఓ ఎల్.శ్రీనివాస్, శానిటరీ సూపరింటెండెంట్ తాడి గుర్రాజు విచారణలో పాల్గొన్నారు. ప్రయాణికులకు Ððl$Æý‡$-OVðS¯]l ÝûMýSÆ>ÅË$ ˘ రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ తుని: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ అన్నారు. అమృత్భారత్ రైల్వేస్టేషన్గా ఎంపికై న స్థానిక రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ డివిజన్ అధికారి మోహిత్ సొనాకియాతో కలిసి ఆయన గురువారం తనిఖీ చేశారు. ప్రయాణికులు, సిబ్బందితో మాట్లాడి కల్పించాల్సిన సౌకర్యాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్ఆర్యూసీసీ మెంబర్ బొడపాటి శ్రీను పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. -
ఉద్యోగాల్లో రెండు నెలలుగా!
పిఠాపురం: పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలలో బదిలీల జీఓ అమలు కావడం లేదు. దీంతో రెండు నెలలకు పైగా ఇతర ప్రాంతాల నుంచి బదిలీలపై వచ్చిన ఆరుగురు మున్సిపల్ ఉద్యోగులు జీతాలు రాక గాల్లో చక్కర్లు కొడుతున్నారు. వారి బదిలీల జీఓను వెంటనే అమలు చేయాలని సీడీఎంఏ పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ కమిషనర్కు మెమో ఇచ్చినా వారిలో చలనం లేకపోవడంతో రెండు నెలలుగా జీతాలు లేక ఉద్యోగులు అలమటిస్తున్నారు. గత జూన్ 9వ తేదీన సాధారణ బదిలీల్లో భాగంగా పిఠాపురం మున్సిపాలిటీకి ముగ్గురు, గొల్లప్రోలు నగర పంచాయతీకి ముగ్గురు తుని, సామర్లకోట మున్సిపాలిటీల నుంచి బదిలీపై వచ్చారు. కానీ పిఠాపురం మున్సిపల్ కమిషనర్ వీరిని చేర్చుకోలేదు. అప్పటి నుంచి నియామక ఉత్తర్వుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలలో ఎవరినీ చేర్చుకోవద్దని కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని కమిషనర్ కనకారావు వీరిని చేర్చుకోవడానికి నిరాక రించారు. దీంతో వీరు మున్సిపల్ ఆర్డీ, సీడీఎంఏ కార్యాలయాల్లో ఫిర్యాదు చేయగా ఉన్నతాధికారులు పలు మార్లు ఈ ఉద్యోగులను చేర్చుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. అయినా కమిషనర్ తీసుకోవడంలేదని ఆ ఉద్యోగులు చెప్తున్నారు. మళ్లీ సీడీఎంఏకు ఫిర్యాదు చేయగా వీడియో కాన్ఫరెన్సులో తమను చేర్చుకోవాలని ఆదేశించినా పట్టించుకోవడం లేదని, తమపై లేనిపోని ఆరోపణలు చూపిస్తూ చేర్చుకోవడానికి విముఖత చూపుతున్నారని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా పిఠాపురం మున్సిపాలిటీకి, గొల్లప్రోలు నగర పంచాయతీలలో పని చేస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకుని బదిలీలకు దరఖాస్తులు చేసుకున్న ఐదుగురిని ఇక్కడి నుంచి రిలీవ్ చేయక పోవడంతో ఆ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురంలో ఒక ప్రత్యేక రాజ్యాంగం నడుస్తున్నట్టు ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా ఇలా ఉద్యోగులను కావాలని ఏడిపిస్తున్న మున్సిపల్ కమిషనర్ తీరును పలువురు రాజకీయ నాయకులు, పట్టణ వాసులు దుయ్యబడుతున్నారు. చేర్చుకోరు.. పనివ్వరు.. జీతం లేదు.. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపల్ ఉద్యోగుల అగచాట్లు మెమో ఇచ్చినా మార్పు రాని మున్సిపల్ కమిషనర్ -
నెలకి రూ.4 వేల ఆర్థిక సాయం
ఫోస్టర్ కేర్లో చిన్నపిల్లల్ని దత్తత తీసుకుంటే ఆ బాలల సంరక్షణ కోసం ఒకొక్కరికి నెలకి రూ.4 వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తాం. ఈ మొత్తం బాలల విద్య, ఆరోగ్యపరమైన అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటోంది. సోదర, సోదరి బంధాలతో ముడిపడి ఉన్న అనాథ లేదా అర్ధ అనాథ బాలలను విడదీయం. వారిని ఒకే గ్రహీతకి దత్తత ఇస్తాం. దత్తత ఇచ్చిన పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటాం. వారి సంరక్షణను నిరంతరం పర్యవేక్షిస్తాం. అందుకు మా డీసీపీయూ బృందం నిరంతరాయంగా పనిచేస్తుంది. దత్తత కావాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం జిల్లా బాలల పరిరక్షణాధికారి, సీహెచ్ వెంకట్రావును 85550 60818 లేదా జిల్లా బాలల సంరక్షణాధికారి కె.విజయను 63035 99264 నంబర్లలో సంప్రదించాలి. – చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, కాకినాడ జిల్లా ఏ బిడ్డా అనాఽథగా పెరగకూడదనే.. సమాజంలో ఏ బిడ్డ అనాథగా పెరగకూడదనే సత్సంకల్పంతో ఫోస్టర్ కేర్ను ప్రోత్సహిస్తున్నాం. గతం కంటే మరింత విస్తృత ప్రచారం చేసి ఈ తాత్కాలిక సంరక్షణను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. ఆ దిశగా పీడీ బృందం పయనిస్తోంది. అనాథల భవితకు అండగా నిలిచే సహృదయాలను తట్టిలేపడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బిడ్డలు లేని దంపతులు, తల్లిదండ్రుల ప్రేమ నోచుకోకపోతున్న అమాయక చిన్నారులకు ఈ కార్యక్రమం ఓ వరం. శిశు సంరక్షణ కేంద్రాలు అనాథ బిడ్డలకు ఆఖరి మజిలీ కావాలి తప్ప, అవే శాశ్వతం కాకూడదనే సంకల్పంతో ఫోస్టర్ కేర్ను విజయవంతం చేయాలని నిర్ణయించాం. – షణ్మోహన్ సగిలి, కలెక్టర్, కాకినాడ జిల్లా -
కూటమి పాలనలో వారు అంటరానివారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు కూటమి పాలనలో దళితులను అంటరానివారిగా మార్చేశారని మాజీ ఎంపీ చింతా మోహన్ విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో అంటరానితనం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అత్యంత పవిత్రమైన టీటీడీలో చూద్దామంటే ఒక్క దళిత అధికారి కూడా కనిపించడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణతో చంద్రబాబు చేస్తున్నది తప్పు అని, వర్గీకరణపై పొరుగున ఉన్న ముఖ్యమంత్రి స్టాలిన్ను చూసి చంద్రబాబు నేర్చుకోవాలని హితవు పలికారు. ఎస్టీలు కూడా బాబు పాలనలో అన్యాయమైపోతున్నారన్నారు. మన్యంలో విలువైన ఖనిజాలపై పెద్దల కన్ను పడిందన్నారు. 2024లో ముమ్మాటికీ ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం అవినీతికి దగ్గరగా ఉందని ఆరోపించారు. వెయ్యి ఎకరాలు సరిపోతుంది అని బీవీ రాఘవులు చెప్పారు. చంద్రబాబు మాత్రం 70 వేల ఎకరాలు కావాలని తీసుకున్నారన్నారు. భూములు ఎలా ఇచ్చారని రైతులను అడుగుతుంటే ఇష్టం లేకున్నా మా కర్మకొద్దీ ఇచ్చామని చెబుతున్నారన్నారు. బంగారం పండే వేలాది ఎకరాలు లాగేసుకుని రాజధాని ప్రాంతంలో చంద్రబాబు అనుచరులు పెద్ద వ్యాపారం చేస్తున్నారని మోహన్ ఆరోపించారు. రాజధానిలో నిర్మాణాలు, పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకు వచ్చే వారితో చంద్రబాబు మనుషులు లాబీయింగ్ చేస్తున్నారన్నారు. 100 ఎకరాలు కావాలని అడుగుతున్న పొరుగు రాష్ట్రాల వారిని మీకు భూములు ఇస్తే మాకు ఏమిస్తారని బాబు అనుచరులు అడుగుతున్నారని మోహన్ చెప్పారు. రాజధాని కోసం రూ.50 వేల కోట్లు అప్పులు తెస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో అందరి తలలపైనా అప్పుల భారం మోపుతున్నారన్నారు. తల్లికి వందనం అమలు చేసి భార్యాభర్తల మధ్య చంద్రబాబు గొడవలు పెట్టాడన్నారు. భార్యల దగ్గర నుంచి భర్తలు సొమ్ము లాగేసుకుని మందు తాగేస్తున్న ఘటనలు కుప్పంలో తాను స్వయంగా చూశానన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణం కష్టం 70 వేల ఎకరాలతో బాబు అనుచరుల వ్యాపారం ముఖ్యమంత్రిపై మాజీ ఎంపీ చింతా ఫైర్ -
ఉత్సాహంగా హాకీ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 15వ జాతీయ జూనియర్ మహిళల హాకీ పోటీలు మంగళవారం డీఎస్ఏ మైదానంలో ఉత్సాహంగా జరిగాయి. పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో 11–0 స్కోర్తో ఉత్తరాఖండ్, ఢిల్లీ, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ 3–3 స్కోర్తో డ్రా కాగా, ఛండీఘర్, మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో 5–0 స్కోర్తో మధ్యప్రదేశ్ విజయం సాఽధించాయి. హర్యానా, బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా 7–1 స్కోర్తోను, కర్ణాటక, జార్ఘండ్ మధ్య జరిగిన మ్యాచ్లో జార్ఘండ్ 2–0 స్కోర్తోను, ఆంఽధ్రప్రదేశ్, ఒడిశా మధ్య జరిగిన మ్యాచ్లో ఒడిశా 3–1 స్కోర్తో గెలుపొందాయి. మంగళవారం నిర్వహించిన మ్యాచ్లను రాష్ట్ర హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవిరాజు పర్యవేక్షించారు. -
కన్నుల పండువగా వెంకన్న పవిత్రోత్సవాలు
రెండోరోజూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు కన్నుల పండువగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ప్రోక్షణ, పవిత్ర ప్రతిష్ఠ ప్రధాన హోమాలు, అష్టకలశారాధన, మహాస్నపనము, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం స్వస్తివచనం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ అండ్ ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలను అందజేశారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు ప్రసాద వితరణ జరిపారు. -
ఉద్యోగులూ ఐక్యంగా ముందుకు సాగుదాం
రామచంద్రపురం: రాష్ట్రంలో ప్రభుత్వం, కాంట్రాక్టు, ఔట్ర్సింగ్ ఉద్యోగులు, పెన్షనర్లు 13 లక్షల మంది ఉన్నారని వీరందరికీ 25 వేల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం చెల్లించాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ ఆరోపించారు. ఉద్యోగుల హక్కులు బాధ్యతలు తెలియజేసేందుకు, వారిని పోరాటంలో కార్యోన్ముకులను చేసేందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ పిలుపు మేరకు ఉద్యోగులను ఐక్యం చేసేందుకు ఉద్యోగులారా రండి.!.. టీ... తాగుతూ... మాట్లాడకుందాం.. పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బాపూజీ అన్నారు. అందులో భాగంగా రామచంద్రపురం తాలూకా కమిటీ అధ్యక్షుడు జి. శ్రీ మన్నారాయణ అధ్యక్షతన పట్టణంలో ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న బాపూజీ మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నాలుగు డీఏలు, బకాయిలు ఉన్నాయని, ఐఆర్ ప్రకటించలేదని, సరండర్ లీవుల బకాయిలు చెల్లించడం లేదని, ఐదు సంవత్సరాలు దాటిన నేటికీ పీఆర్సీ ఏర్పాటు చేయలేదని బాపూజీ వాపోయారు. ఉద్యోగుల సమస్యలపై ఇతర సంఘాలు పోరాడటం లేదని, అందుకే ఏపీజీఏ కోనసీమ జిల్లా ఆధ్వర్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఉద్యోగులలో చొచ్చుకుపోయేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఉద్యోగికి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత చెల్లించాలో నిర్ధారించాలని, బకాయి డబ్బులు ఎంత ఇవ్వాలో ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్ (ఎస్ఆర్)లో నమోదు చేయాలని, ఉద్యోగి కోరుకున్న ప్రాంతంలో ప్రభుత్వ స్థలం ఉంటే ఇండ్ల స్థలంగా ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసోసియేట్ ప్రెసిడెంట్ కె.సుబ్బలక్ష్మి, కార్యదర్శి పైడిమల్ల సత్తిబాబు, పంపన విష్ణుమూర్తి, కరుణమ్మ, చీకట్ల వీరాంజనేయులు, సత్యవతి, దుర్గమ్మ, దుర్గ, శ్రీనివాస్, సత్తిబాబు పాల్గొన్నారు. -
కుతుకులూరులో గుడిసెల కూల్చివేత
బడుగులపై గెరిల్లా తరహా దాడులా : మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి అనపర్తి : నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి ఆస్తులను గృహాలను నేలమట్టం చేసి పైశాచికానందం పొందుతున్నారని మండలంలోని కుతుకులూరు ఎస్సీపేట నిర్వాసితులు వాపోతున్నారు. అనపర్తి మండలం కుతుకులూరు ఎస్సీ పేటలో నివసిస్తున్న పదిమందికి చెందిన గుడిసెలను సోమవారం మధ్యాహ్నం భారీగా పోలీసులను మోహరించి జేసీబీలతో కూల్చివేశారని వారు చెప్పారు. ఈ ఘటనపై బాధితులు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్లుగా ఈ కాలనీలో నివసిస్తున్నామని, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో గుడిసెలను, పశువుల పాకలను వేసుకున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నం పోలీసులు వచ్చి చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు జేసీబీలతో గుడిసెలను, పశువుల పాకలను కూల్చి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవత్వం చూపకుండా తొలగించి తమను కావాలనే ఇబ్బందుల పాలు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ సానుభూతిపరుల పక్కా భవనాల వైపు కనీసం కన్నెత్తి చూడలేదన్నారు. మారుమూల ఉండే ఆ ప్రదేశంలో విగ్రహాలు పెడతామని అంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద బతుకులపై గెరిల్లా దాడులా? విషయం తెలుసుకున్న అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి మంగళవారం బాధితులను పరామర్శించారు. జరిగిన వివరాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏదో ఒక మూల పేదలపై విరుచుకుపడి వారి ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడం పరిపాటిగా మారిందన్నారు. అనపర్తి నియోజకవర్గంలో అయితే మరో అడుగు ముందుకేసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో నిస్సహాయులైన బడుగుల జీవితాలపై గెరిల్లా తరహా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాత్రి సమయాల్లోను, తెల్లవారుజామున, సెలవు రోజుల్లోను వందలాది మంది పోలీసులను మోహరించి వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. వాటిలో దోమాడ తరహా అర్థిక పరమైన లాభాపేక్షతో చేసేవి కొన్నైతే బిక్కవోలు, కొమరిపాలెం, పందలపాక తదితర చోట్ల చేసినట్టు కక్షపూరితంగా కొన్ని చేస్తున్నారని ఆరోపించారు. దోమాడలో నిరుపేదల, కుతుకులూరులోని మారుమూల ఎస్సీపేటలో ప్రాణమున్న మనుషులను జీవచ్చవాలుగా మార్చి జీవం లేని విగ్రహాలు పెడతామని వింత వాదనను తీసుకువస్తున్నారని అన్నారు. ఈ కూల్చివేతల్లో పోలీసులతో పాటు మహిళా విభాగం నాయకురాలు కూడా ఉండి వారిని ప్రోత్సహిస్తున్నారంటే వారి రాక్షస మనస్తత్వం బయటపడుతుందన్నారు. అధికార పార్టీ నాయకులు పద్దతి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడం తథ్యం అని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ నాగిరెడ్డి ఉన్నారు. -
మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా గీత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జోన్–2 వర్కింగ్ ప్రెసిడెంట్గా మాజీ ఎంపీ, పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ వంగా గీత నియమితులయ్యారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఈ నియామకం చేపట్టారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆమె ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి కాకినాడ సిటీ: స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 15వ తేదీన నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో దేశభక్తిని పెంచేలా వేడుకలు నిర్వహించాలని, సాంస్కృతిక ప్రదర్శనలకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయా శాఖల ఆధ్వర్యాన స్టాల్స్, శకటాలను సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖల ప్రగతి నివేదికలను బుధవారంలోగా పంపించాలని సూచించారు. అత్యుత్తమ సేవలందించిన ఉద్యోగులను మాత్రమే గురువారంలోగా అవార్డులకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతుల మీదుగా పతాకావిష్కరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్, జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి కాకినాడ సిటీ: జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్షేత్ర స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పనుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ, గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంటు, ఇతర మెటీరియల్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందన్నారు. గృహ నిర్మాణాలపై వారం వారం లక్ష్యం నిర్దేశించుకుని తప్పనిసరిగా స్టేజ్ కన్వర్షన్ జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన పోస్టర్ అడాప్షన్ (తాత్కాలిక దత్తత) కింద రెండు నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలను దత్తత ఇచ్చే కార్యక్రమం చేపడతారని చెప్పారు. జిల్లాలో సారా, అక్రమ మద్యం తయారీని అరికట్టేందుకు నవోదయం కింద వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పీ4 కార్యక్రమం కింద క్షేత్ర స్థాయి అధికారులు తమ పరిధిలోని సంపన్నులకు అవగాహన కల్పించి, స్వచ్ఛందంగా దత్తత స్వీకరించేలా చొరవ చూపాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల పాలిట భయంతులు!
భక్తి ముసుగులో భారీగా దోపిడీ శ్రీపాద శ్రీ వల్లభ మహా సంస్థానంకు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి సుదూ ర ప్రాంతాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీపాద వల్లభ ఆలయానికి వస్తుంటారు. ఆలయా నికి వచ్చే భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకున్న కొంతమంది అక్రమార్కులు నివాస గృహాలను అద్దె గృహాలు (లాడ్జిలు)గా మార్చివేసి భారీగా అద్దెలు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో నిర్మాణంలో ఉన్న భారీ భవనం పక్కకు వాలిపోయి కూలిపోయే స్థితికి చేరడంతో ఆ భవనం పక్కనే ఉన్న మరో భవన యజమాని అధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో అధికారులు పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవనం నిర్మించారని, ప్రస్తుత భవనం పక్కకు వాలిపోయినట్లు గుర్తించామని, ఆ భవనం పడిపోతే ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడవ అంతస్తును తొలగించి, భవన నిర్మాణ పటిష్టత విషయమై కాకినాడ జేఎన్టీయూ నుంచి నిర్మాణ పటిష్టత ధ్రువీకరణ పత్రాన్ని 15 రోజుల్లోగా అందజేయాలని నోటీసులో పేర్కొన్నారు. కానీ అధికారుల నోటీసులు పట్టించుకోకుండా ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సలహా మేరకు కేవలం పై అంతస్తులు మాత్రమే తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ● ప్రమాదం పునాదులపై కట్టడాలు ● ఇరుకు సందుల్లో బహుళ అంతస్తుల భవనాలు ● ఆటో కూడా వెళ్లలేని చోట అతి పెద్ద భవంతుల నిర్మాణం ● ఫైర్ ఇంజిన్, అంబులెన్సు కూడా వెళ్లలేని పరిస్థితి ● నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అనుమతులు పిఠాపురం: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు అంతస్తుల భవనాలు. 50కి పైగా గదులు. ఒకేసారి 250 నుంచి 300 మంది వరకు ఒకే భవనంలో నివసించే విధంగా నిర్మాణాలు. కాన్నీ భవనం చుట్టూ నిలబడడానికి కూడా స్థలాలు కరవు. నిబంధనలను తుంగలో తొక్కి అవినీతి అధికారులు ఇష్టారాజ్యంగా ఇచ్చిన అనుమతులతో పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కనీసం ఆటో కూడా వెళ్లడానికి వీలు లేని ఇరుకు సందుల్లో అతి పెద్ద భవనాలు నిర్మించేశారు. దీంతో ఏదైనా పెద్ద ప్రమాదం సంభవిస్తే అంబులెన్సు గాని ఫైర్ ఇంజిన్ గాని వెళ్లలేని పరిస్థితి ఉన్నా ఏ ఒక్క అధికారి ఇటు వైపు చూడకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయాందోళనల నడుమ ఉంటున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతితో అనుమతులు అత్యంత ప్రసిద్ధిగాంచిన పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ప్రతిష్టను దిగజార్చేలా కొంతమంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడం, అక్రమార్కులకు మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్లో గతంలో పని చేసిన ఒక అధికారి సహకరించడం భక్తులకు శాపంగా మారింది. కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ వ్యవహారం గతంలో నిర్మాణంలో ఉండగానే పక్కకు వాలిపోయి కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాల వ్యవహారంతో బయటపడింది. పిఠాపురం మున్సిపల్ పరిధిలో కేవలం జి ప్లస్ టు భవనాలను మాత్రమే నిర్మించాల్సి ఉంది. అంతకుమించి మరొక అంతస్తు నిర్మించాలంటే అనేక రకాల అనుమతి పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కానీ అవి ఏమీ లేకుండా అనుమతి పత్రాలకు బదులు శ్రీనోట్ల పత్రాల్ఙు సమర్పిస్తే నిబంధనలతో పని లేకుండా ఎన్ని అంతస్తులైనా ఎంచక్కా నిర్మించుకోవచ్చన్నది బహిరంగ రహస్యంగా మారింది. పిఠాపురం శ్రీపాద వల్లభ ఆలయం చుట్టుపక్కల కనీసం ఆటో కూడా వెళ్లలేని ఇరుకు వీధులలో ఐదంతస్తుల భవనాలను సైతం అవలీలగా నిర్మించడం వెనక భారీ ఎత్తున సొమ్ము చేతులు మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎటువంటి నిబంధనలు పాటించకుండా, జాగ్రత్తలు తీసుకోకుండా భారీ బహుళ అంతస్తుల భవనాలు నిర్మించడంతో అవి ఎప్పుడు ఏ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయోనన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగితే అంతే సంగతి ఇరుకు సందులు చిన్న వీధుల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన పెద్ద భవనాల్లో ఏ ప్రమాదం జరిగినా ఒక్కరు కూడా తప్పించుకునే పరిస్థితి కనిపించదు. క్షతగాత్రులను తరలించడానికి కనీసం అంబులెన్సు కూడా వెళ్లలేని అత్యంత ప్రమాదకర పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఏ భవనానికి అనుమతి ఇవ్వాలన్నా సేప్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. అక్కడ నివాసాలకు తగ్గట్టుగా పార్కింగ్ స్థలం ఉండాలి. కాని ఇక్కడ ఏ భవనం చూసినా గదులు పదుల సంఖ్యలో ఉంటే ఒక్క కారు కూడా పెట్టుకునే వీలు ఉండదు. శాశ్వత నివాసాలు కాకపోవడంతో యాత్రీకులు కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఉండి వెళ్లి పోతుండడంతో పార్కింగ్ వేరే చోట పెట్టి భవనాలను లాడ్జిలుగా ఉపయోగిస్తు రూ.లక్షల్లో దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లానింగ్ విభాగపు అధికారుల చేతివాటం పట్టణ పరిధిలోని మరిన్ని భవనాల బహుళ అంతస్తులను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఎవరు ఎలా పోతే మాకేంటి మా చేయి తడుస్తుంది అన్న రీతిలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి అనుకోని సంఘటన జరిగినా ఫైర్ ఇంజిన్, పోలీస్, ఇతర శాఖల అధికారులు ప్రవేశించలేని ఇరుకు వీధులలో అక్రమ భవనాలకు లభించిన అనుమతులపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే మేల్కొంటే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు పాటించని వారిపై చర్యలు పిఠాపురం పట్టణంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేవారు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. అన్ని రకాల రక్షణ చర్యలు తీసుకోవాలి. లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. పట్టణంలో నిబంధనలు పాటించకుండా చేపట్టిన నిర్మాణలపై దృష్టి సారిస్తున్నాం. అటువంటి భవనాలపై కోర్టు ద్వారా చర్యలు తీసుకుంటాం. – ఎస్.వల్లీప్రియ, పట్టణ ప్రణాళికా విభాగం అధికారి, పిఠాపురం మున్సిపాలిటీ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
సారా విక్రేతపై పీడీ యాక్టు
సామర్లకోట: సారా విక్రయం చేస్తూ ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు కేసు నమోదు అయిన పండ్రవాడ గ్రామానికి చెందిన గెద్దాడ రాఘవకు పీడీ యాక్టు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశామని కాకినాడ, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.రామమోహనరావు మంగళవారం తెలిపారు. ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ 2023 డిసెంబర్ నుంచి ఆమైపె నాటు సారా విక్రయం కేసులు నమోదు చేశామన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆమె సారా వ్యాపారం చేస్తున్న కారణంగా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కాకినాడ జిల్లా కలెక్టర్ రాఘవపై పీడీ యాక్టు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ఈ మేరకు ఆమెను మంగళవారం రాజమహేంద్రవరం ప్రత్యేక మహిళా కారాగారానికి అప్పగించామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నవోదయంలో భాగంగా ఈ పీడీ యాక్టు నమోదు చేశామని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకొని సారా తయారీ, అమ్మకాలకు దూరంగా ఉండాలని సీఐ హెచ్చరించారు. పదిమందికి పదోన్నతులు కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో పనిచేస్తున్న ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లకు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ఖాళీలు ఏర్పడగానే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతిపై నియామకపు ఉత్తర్వులు వెంటనే జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సాహంతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజాసేవలో ముందుంటూ పంచాయతీరాజ్ సంస్థలను ప్రగతి పథంలో నడిపించడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, ఉపముఖ్య కార్యనిర్వహణాధికారి జీఎస్ రామ్గోపాల్, ఏపీపీఆర్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్ పాల్గొన్నారు. నేడు జిల్లాస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ జట్ల ఎంపిక చాగల్లు: చాగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 8,9 తేదీలలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ టార్గెట్ బాల్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా జట్టును బుధవారం పాఠశాల ప్రాంగణంలో ఎంపిక చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి మంగళవారం తెలిపారు. ఎంపిక పోటీల్లో పాల్గొనే విద్యార్థులు ఆధార్కార్డుతో హాజరుకావాలని ఆమె పేర్కొన్నారు. -
వెదుళ్లపల్లి సొసైటీకి తాళం
● రుణాలు చెల్లించిన రైతుల ఆగ్రహం ● తమకు పాస్బుక్లు ఇవ్వాలని డిమాండ్ ● సస్పెండైన సీఈవో లెటర్తో చైర్పర్సన్ ఎంపికపై అభ్యంతరం సీతానగరం: సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్తో చైర్ పర్సన్ పదవి ఇవ్వడమేంటని, రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్బుక్ను బ్యాంక్ నుంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు వెదుళ్లపల్లి పీఏసీఎస్కు మంగళవారం తాళం వేశారు. వివరాల్లోకి వెళ్లితే పీఏసీఎస్లో రూ.64 లక్షలు గల్లంతయ్యాయని సాక్షి దినపత్రిక గత ఏడాది వెల్లడించింది. దాంతో సీఈవో సురేంద్ర, ఎరువుల సేల్స్ వుమెన్ భారతి, గుమస్తా పోశియ్యలను సస్పెండ్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినా తప్పుడు రసీదులు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రుణాలు చెల్లించిన రైతులకు పట్టాదారు పాస్బుక్లు విచారణ పేరుతో అందించకుండా నిలిపివేశారు. తాజాగా పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ఏర్పాటుపై రైతులు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. లక్షలాది రూపాయల రుణాలు తీసుకుని ఓవర్ డ్యూలో ఉన్న కవల శ్రీనివాస్రావుకు సస్పెండైన సీఈవో సురేంద్ర లెటర్ ఇచ్చారని, అందులో శ్రీనివాస్ చెల్లించిన రుణ నగదు తానే వాడుకున్నానని, దానిని చెల్లిస్తానని లెటర్ ఇవ్వడంతో చైర్ పర్సన్ పదవి ఇవ్వడానికి విచారణాధికారి శివరామకృష్ణ సిద్ధపడ్డారని రైతులు మరిపిండి సోమరాజు, ఎ రుఘురామ్, మద్దుకూరి సత్యనారాయణ, బొల్లి సత్యనారాయణ, సానపల్లి సత్యనారాయణ, కొత్తపల్లి దోసాలరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సస్పెండైన సీఈవో తాము చెల్లించిన రుణాలకు ఇదే విదంగా లెటర్ ఇస్తానని విచారణాధికారుల ఎదుట చెప్పాడని, లెటర్ తీసుకుని మా పట్టాదారు పాస్బుక్లు బ్యాంక్ నుంచి తమకు అందించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం తేలే వరకు సొసైటీ తాళం తీయబోమని హెచ్చరించారు. రుణాలు చెల్లించిన రైతులకు న్యాయం చేయకుండా రుణాలు ఓవర్ డ్యూ అయిన వారికి లెటర్ ఆధారంగా సొసైటి చైర్ పర్సన్ పదవి ఇవ్వడం తగదని రైతులు అన్నారు. -
వనదుర్గమ్మకు సరస్వతీదేవిగా పూజలు
అన్నవరం: రత్నగిరి దుర్గామాత వనదుర్గమ్మ శ్రావణ మాస జాతరలో భాగంగా రెండో రోజైన మంగళవారం అమ్మవారిని వీణాపాణి సరస్వతీదేవిగా అలంకరించి, పూజలు చేశారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణ, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణ నిర్వహించారు. మధ్య వయస్కురాలైన ముత్తయిదువను సువాసినిగా, చిన్నారిని బాలగా భావిస్తూ పాద పూజ చేశారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. అనంతరం, అమ్మవారికి నీరాజన, మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. దేవస్థానంలో పని చేస్తున్న వేద పండితులు కుటుంబ సమేతంగా అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, వ్రత పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకుడు దేవులపల్లి ప్రసాద్, పరిచారకుడు వేణు, మరో 44 మంది రుత్విక్కులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఆర్టీసీ స్థలాల ధారాదత్తం దారుణం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కోట్లాది రూపాయల విలువ చేసే ఆర్టీసీ స్థలాలను లులు షాపింగ్ మాల్కు అప్పనంగా కేటాయించడం దారుణమని ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పులి జార్జిబాబు అన్నారు. కాకినాడలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ స్థలాలను లులు గ్రూపునకు కేటాయిస్తూ ఇచ్చిన జీవో 137 రద్దు కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణకు చేపడుతున్న ఉద్యమంలో అన్ని సంఘాలూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ నడిబొడ్డున గవర్నర్పేట–1, 2 డిపోల వద్ద బస్టాండుకు చెందిన 4.15 ఎకరాల స్థలం సుమారు రూ.400 కోట్ల విలువ చేస్తుందన్నారు. ఈ రెండు డిపోల పరిధిలో 200 బస్సులున్నాయన్నారు. ఇటువంటి కీలకమైన స్థలాన్ని 1,100 మంది ఉద్యోగులకు అన్యాయం చేస్తూ, బడా వ్యాపారులకు ఇవ్వడం దారుణమని విమర్శించారు. 1959లో అప్పటి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ స్థలానికి గజం రూ.16 చొప్పున ఆర్టీసీ యాజమాన్యం రూ.4.06 లక్షలు చెల్లించిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీ ఉద్యోగులు సహకరించామని, అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీ కూడా అమలు చేయలేదని అన్నారు. డీఏలు ఇవ్వలేదని, 12వ పీఆర్సీ వేస్తామని, ఐఆర్ ఇస్తామని హామీలు ఇచ్చారు తప్ప ఇప్పటి వరకూ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని దుయ్యబట్టారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీలో విద్యుత్ బస్సులను తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే, ఈ బస్సులను ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా ప్రవేశపెడుతూ, వారికి ఆర్టీసీ డిపోలను అప్పజెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. విద్యుత్ బస్సులను కూడా ఆర్టీసీకే ప్రభుత్వం అప్పగించాలని జార్జిబాబు డిమాండ్ చేశారు. యూనియన్ నాయకుడు పి.సత్యానందం మాట్లాడుతూ, దశాబ్దాల చరిత్ర కలిగిన ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని చూడటం చాలా బాధాకరమన్నారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఇందేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు ఐ.రవి, డీవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధం.. నాటు తుపాకీతో కాల్పులు
కాకినాడ జిల్లా: కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెద మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని శృంగధార గ్రామంలో భార్యాభర్తలపై ఓ వ్యక్తి నాటు తుపాకితో కాల్పులు జరిపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన కాకర చంద్రబాబు, కుమారి భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఓకుర్తి గ్రామానికి చెందిన ముళ్ల మణికంఠకు, కుమారికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వారిద్దరూ ఓకుర్తిలో సహజీవనం చేశారు. పెద్దల సమక్షంలో చర్చల అనంతరం కుమారి పది రోజుల కిందట భర్త, పిల్లల వద్దకు చేరుకుంది. మణికంఠ ఆదివారం అర్ధరాత్రి నాటు తుపాకితో శృంగధార గ్రామంలోని చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించాడు. భార్యాభర్తలపై కాల్పులు జరిపి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో చంద్రబాబు, కుమారి దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. -
ఆటోను ఢీకొన్న కారు
విద్యార్థులు, డ్రైవర్ సహా 11 మందికి గాయాలు తుని రూరల్: తుని మండలం హంసవరం సమీపంలో పాదాలమ్మతల్లి గుడి మలుపులో విద్యార్థులతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు సహా ఆటో డ్రైవర్, మరో ప్రయాణికురాలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కె.కోటేశ్వరరావు, వి.గోపాలకృష్ణ, వరప్రసాద్, రమేష్బాబు, ఆశ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం మరువాడకు చెందిన విద్యార్థులు హంసవరంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్కు ఆటోలో వస్తున్నారు. మార్గం మధ్యలో మరో ప్రయాణికురాలిని డ్రైవర్ ఆటో ఎక్కించుకున్నాడు. హంసవరం పాదాలమ్మతల్లి గుడి వద్ద మలుపు తిరుగుతున్న ఆటోను వెనుక కారు ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. కారు సహా డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి మినహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం విద్యార్థులను వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి
పెరవలి: కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ పల్లా దానయ్య(42) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, కేబుల్ వైర్ లాగటానికి విద్యుత్ స్తంభం ఎక్కిన అతడు విద్యుదాఘాతానికి గురై, స్తంభం పైనే చనిపోయాడు. స్తంభం ఎక్కినప్పుడు వైర్లు తగలడంతో అలాగే ఉండిపోయాడు. విద్యుత్ సరఫరా నిలిపివేశాక మృతదేహం కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దానయ్యకు భార్య ధనలక్ష్మి, కుమారులు రామసతీష్, గోపి సంతోష్ ఉన్నారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎసై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. -
మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బంగారపు పూత ఉన్న కవచాన్ని సమర్పించారు. ముందుగా ఆలయంలో నంది మండపం వద్ద వేణు సతీమణి వరలక్ష్మి, కుమారుడు నరేన్, కోడలు స్రవంతి, మనుమలు సునిధి, విరాజ్తో కలసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బంగారపు చీరను సమర్పించగా, అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని, శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివరావు గురూజీ, రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అంబటి భవాని, వైస్ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్లు యల్లమిల్లి సతీష్కుమారి, అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు, కట్టా గోవిందు, అంబటి తుకారం, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు. -
విషాదంలో సీతారామ కాలనీ
● పోలీసుల అదుపులో నిందితుడు? ● సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తింపు సామర్లకోట: తల్లి, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పట్టణంలోని సీతారామ కాలనీలో సామవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కూలీ పనులు చేసుకునే వారితో, పిల్లలు, పెద్దల అరుపులు, కేకలతో సీతారామ కాలనీ నిత్యం సందడిగా ఉంటుంది. ఇదే కాలనీలో నివసిస్తున్న ములపర్తి ధనుప్రసాద్ భార్య మాధురి(30), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీలోన(6)ను హత్యకు గురైన విషయం విదితమే. తొలుత ధనుప్రసాద్పై అనుమానంతో పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. తన భార్య వద్ద ఉండాల్సిన బంగారు ఉంగరాలు, సెల్ఫోన్లు కనిపించలేదని అతడు పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ధనుప్రసాద్ ఏడీబీ రోడ్డు పనుల కాంట్రాక్టర్ వద్ద ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. కాగా ధనుప్రసాద్ సమాచారం మేరకు మాధురి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్ అనే వ్యక్తి మాధురిని, పిల్లలను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మరో వ్యక్తితో కూడా మాధురి వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు తెలుసుకున్న ప్రియుడు సురేష్.. ఆమెతో శనివారం రాత్రి ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్ర లేచి వచ్చారు. ఘర్షణ సమయంలో మాధురి అందుబాటులో ఉన్న కర్రతో సురేష్ను కొట్టినట్టు తెలిసింది. అదే కర్రను అందిపుచ్చుకుని అతడు మాధురితో పాటు, పిల్లల తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. సురేష్ సొంత లారీపై డ్రైవర్గా పని చేస్తూ, తన సంపాదనతో ప్రియురాలికి కోరినవన్నీ కొనిపెడుతుండగా, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది వద్దని చెప్పినా వినకపోవడంతోనే సురేష్ ఈ హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యాబిడ్డలు హత్యకు గురి కావడంతో ధనుప్రసాద్ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. అతడిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సీతారామ కాలనీ విషాదంలో మునిగిపోయింది. -
ముగిసిన ఆలిండియా చదరంగం పోటీలు
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ఆలిండియా ఇండిపెండెన్స్ డే కప్ చదరంగం పోటీలు రాజమహేంద్రవరంలో విజయవంతంగా ముగిశాయి. ఈ జాతీయ స్థాయి పోటీలను స్థానిక లారెల్ హై గ్లోబల్ స్కూల్లో క్యాల్ఫ్యూషన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ చెస్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించారు. 309 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి సోమవారం తెలిపారు. విజేతగా రాఘవ శ్రీవాత్సవ్ (హైదరాబాద్), రన్నరప్గా జ్ఞానసాయి సంతోష్(కాకినాడ), మూడో స్థానంలో దివ్యతేజ (కాకినాడ) నిలిచారు. ఏడు రౌండ్ల పోటీలను స్విస్ పద్ధతిలో జరిగాయి. రాఘవ శ్రీవాత్సవ్ చాంపియన్షిప్ ట్రోఫీతో రూ.25 వేల నగదు, జ్ఞానసాయి సంతోష్ రూ.10 వేలు, దివ్యతేజ రూ.5 వేల నగదు బహుమతులను అందుకున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ చెస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వై.సుమన్,, స్కూల్ ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ కన్వీనర్ పూర్ణచంద్ర శర్మ, విత్తనాలు కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయన నిలువెత్తు బంగారం
● విద్యార్థుల ఆకలి తీరుస్తున్న బంగారు చినశోభనాద్రి సత్రం ● రెండు పూటలా విద్యార్థులకు భోజన సదుపాయం ● నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం ● ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం ● వందేళ్లు దాటిన దాతృత్వపు చరిత్ర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అలనాడు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సత్రం నేడు నిరుపేద విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. కాకినాడ పెద్ద మార్కెట్ వద్దనున్న బంగారు చినశోభనాద్రి సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చి ఉంటున్న నిరుపేదల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రుచికరమైన భోజనం ఈ సత్రంలో అందిస్తున్నారు. గతంలో ఈ సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన వారికి ఉచితంగా వసతి కల్పించేవారు. వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. గతంలో వివిధ హోటళ్ల పాస్లను విద్యార్థులకు అందించేవారు. హోటళ్ల భోజనం సక్రమంగా ఉండకపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు 2017 సత్రం ఆవరణలో అన్నదాన భవనం నిర్మించారు. ఇక్కడ సిబ్బందిని నియమించి భోజన వసతి కల్పిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ, వారి మెరిట్, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. సమాజ సేవలు ప్రస్తుతం విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు, సత్రం ఆవరణలో ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి శనివారం 120 నుంచి 150 మంది రోగులు ఇక్కడ వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి భోజనం సత్రంలో మంగళవారం నుంచి విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సత్రం ఈవో విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 90కి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ఏ కళాశాలలో చదువుతున్నారో ధ్రువీకరణ సత్రం, నిరుపేద కుటుంబాలు వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేసి, సత్రం కార్యాలయంలో దరఖాస్తు అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి భోజన వసతి కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కళాశాలలు మూసివేసే వరకూ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు. అర్హులైన విద్యార్థులందరికీ భోజన వసతి దాత ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నాం. మంగళవారం నుంచి భోజన సదుపాయం ప్రారంభం కానుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. – చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, ఈవో, బంగారు చిన శోభనాద్రి సత్రం 101 ఏళ్ల చరిత్ర ఈ సత్రానికి 101 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సత్రాన్ని 1924లో బంగారు చినశోభనాద్రి నెలకొల్పారు. ఈ సత్రం కోసం ఆయన 65 ఎకరాల వ్యవసాయ భూమి, 2,800 చదరపు గజాల స్థలాన్ని ఈ సత్రానికి దానం చేశారు. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన రోగులకు, వ్యాపారులకు ఇక్కడ ఎటు వంటి సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శోభనాద్రి ఇక్కడ సత్రం ఏర్పాటు చేసి, వారికి ఆసరాగా నిలిచారు. వ్యవసాయ భూములు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వహణకు వినియోగిస్తున్నారు.ఇతర జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యం కాకినాడలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువగా ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారికి సత్రంలో భోజనం అందిస్తున్నారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మహబూబాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్టు మహబూబాబాద్ డీఎస్పీ ఎన్.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్ టౌన్ పోలీసు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్లో ఓ బైక్, మహబూబాబాద్లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు విద్యార్థుల ఎంపిక
పి.గన్నవరం: రామచంద్రపురంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ పదో తరగతి విద్యార్థి కలిగితి సందీప్ బాలుర అండర్–16 లాంగ్ జంప్లో ప్రథమ, 60 మీటర్ల రన్నింగ్లో ద్వితీయ స్థానాలు సాధించాడు. దీంతో అతడిని ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు హెచ్ఎం కె.ఉమాదేవి తెలిపారు. ఆమెతో పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్, కె.భీమేంద్ర తదితరులు సందీప్ను అభినందించారు. కేశనపల్లి, బట్టేలంక విద్యార్థులు మలికిపురం: రామచంద్రపురంలో ఎస్కేపీజీఎన్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ స్కూళ్లకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. కేశనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మీటర్ల రన్నింగ్లో ఎస్.సత్యసాయికృష్ణ, ప్రథమ, పి.అభిలాష్ తృతీయ, లాంగ్ జంప్లో ఎస్.సత్యసాయి కృష్ణ ద్వితీయ, పి.అభిలాష్ తృతీయ స్థానంలో నిలిచారు. సత్యసాయికృష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అలాగే బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.మోహన్, ఎ.గీతిక, జి.భార్గవి, పి.జ్యోతి, కె.ప్రసన్న, కె.శ్రీరామ్ వివిధ క్రీడాంశాల్లో ఎంపికయ్యారు. అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ పోటీలకు స్థాని జెడ్పీ హైస్కూల్కు చెందిన కె.లక్ష్మీ ప్రసన్న, డి.దోనేశ్వర్ వంద మీటర్ల పరుగు, లాంగ్ జంప్లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. -
కువైట్లో మగ్గిపోతున్నా.. స్వదేశానికి తీసుకెళ్లండి
కోనసీమ మహిళ వేడుకోలు కొత్తపేట: కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్తే, అక్కడ నిర్బంధించారని, పాలకులు దయతలచి స్వదేశానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన గుమ్మడి ధనలక్ష్మి ఈ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియో, ఆమె అక్క కుమారుడు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు చిక్కాలవారిపేటకు చెందిన చిక్కాల రాజేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనలక్ష్మి పుట్టిల్లు బిళ్లకుర్రు శివారు చిక్కాలవారిపేట కాగా, అత్తవారిల్లు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. సుమారు 16 ఏళ్ల క్రితం గుమ్మడి రాంబాబుతో వివాహమైంది. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఇద్దరు కుమారులు బీటెక్, ఇంటర్మీడియెట్ చదువుతున్నారు. ఇలాఉండగా విదేశంలో కొన్నేళ్లు ఉపాధికి వెళితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధనలక్ష్మి ఆశించింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం కువైట్లోని ఓ షేక్ ఇంట్లో పనికి కుదిరింది. రెండేళ్ల అనంతరం స్వదేశంలో భర్త, పిల్లలను చూసివస్తానని అడిగితే, అక్కడి వారు జాప్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం తాను వెళ్లిపోతానని పట్టుబడితే ధనలక్ష్మిని ఇంట్లో నిర్బంధించారు. తిండి కూడా పెట్టలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్ ఎంబసీకి చేరింది. కాగా ఆమె వాచ్ దొంగిలించి పారిపోయిందని షేక్ కేసు పెట్టడంతో, ప్రస్తుతం అక్కడే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఉద్దేశించి తన దుస్థితిని వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. ఆమె భర్త రాంబాబు, కుమారులు, బంధువులు అమలాపురం ఎంపీ గంటి హరీష్మాథుర్, కలెక్టర్ ఆర్ మహేష్కుమార్ను కలిశారు. కువైట్లో మగ్గిపోతున్న ధనలక్ష్మిని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు రాజేష్ తెలిపారు. -
మాకొద్దీ ‘హెల్’ ఫోన్లు
● అంగన్వాడీ కార్యకర్తల నిరసన ● సెల్ ఫోన్లు కార్యాలయంలో అప్పగింత కాకినాడ క్రైం: పని చేయని ఫోన్లు ఇచ్చి.. పని భారం పెంచేస్తున్న ప్రభుత్వ తీరుపై జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు కన్నెర్ర చేశారు. కాలం చెల్లిన ఫోన్లతో విధి నిర్వహణ నరకంలా మారిందని నిరసన తెలుపుతూ.. ఆ మొబైల్ ఫోన్లను ఆయా ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించేశారు. తక్కువ డేటాతో ఎక్కువ పని చేయాలని సతాయించడం.. పోషణ ట్రాకర్, బాల సంజీవని అనే రెండు యాప్లను మిళితం చేసి ఒకే యాప్గా ఇవ్వాలని కోరినా పట్టించుకోకపోవడం.. పని భారం నానాటికీ పెంచేయడం.. దీనికి తగినట్టుగా జీతం పెంచకపోవడం.. ఉద్యోగ భద్రత కరవవడం.. ఉన్నతాధికారుల నియతృత్వ ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ నేపథ్యంలో కాలం చెల్లిన, పాడైన ఫోన్లను కార్యాలయాల్లో అప్పగించారు. విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామం నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులకు నివేదించినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మి తెలిపారు. -
రైతులకు తక్షణం ఎరువులు ఇవ్వాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ● కలెక్టర్కు పార్టీ నేతల వినతిసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమై నెల రోజులు పైగా గడచినా రైతులకు అవసరమైన స్థాయిలో ఎరువులు సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. ఇప్పటికీ రైతులు ఎరువుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురు కావడం దారుణమన్నారు. ఎరువులు, యూరియా కొరత నివారణకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎరువులు, యూరియా కొరతపై రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన విజ్ఞాపన పత్రాలు అందించాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన వైఎస్సార్ సీపీ నేతలు కలెక్టర్ షణ్మోహన్ సగిలికి సోమవారం విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం రాజా మీడియాతో మాట్లాడుతూ, రైతు సమస్యల పరిష్కారానికి కూటమి సర్కార్ చొరవ చూపాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇక్కడి రైతుల సమస్యలపై స్పందించాలన్నారు. రైతులను ఆదుకోవడానికి సమీక్ష నిర్వహించాలన్నారు. ఇరిగేషన్పై పిఠాపురానికి ప్రత్యేకంగా ఇచ్చిన మ్యానిఫెస్టోను పవన్ ఒకసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం యూరియా బస్తాను రూ.270కే రైతుభరోసా కేంద్రాల వద్ద అందించిందన్నారు. అటువంటిది నేడు మార్కెట్లో యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మార్చి నెలలోనే యూరియా, ఇతర ఎరువులు నిల్వ చేసేదని గుర్తు చేశారు. రైతు కష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి, మామిడి, అరటి, చెరకు ఇలా ఏ రైతులైనా ఈ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు ఎందుకు అందుబాటులో ఉంచడం లేదని రాజా ప్రశ్నించారు. ‘సుఖీభవ’ ఏమూలకు? అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు కూటమి నేతలు చెప్పారని, దీని ప్రకారం రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాలని దాడిశెట్టి రాజా అన్నారు. తీరా చూస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిసి రైతులకు రూ.5 వేలు, రూ.2 వేలు అంటూ వేసిన రూ.7 వేలు రైతులకు ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. మరణించిన కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఐదు కోట్లు పంచిపెడతామంటూ వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి గతంలో కంటే రెట్టింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు కొంటేనే యూరియా అమ్ముతామంటున్న పరిస్థితిపై పవన్ సమీక్షించాలని రాజా అన్నారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు వంగా గీత, తోట నరసింహం, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దవులూరి దొరబాబు, పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లంక ప్రసాద్, పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, రావూరి వెంకటేశ్వరరావు, రోకళ్ల సత్య, జేడీ పవన్, గొల్లపల్లి నానాజీ, ఒమ్మి రఘురామ్, యనమల కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. -
బడి పంతుళ్లకు పస్తుల పాఠం
● పొజిషన్ ఐడీ రాక.. రెండు నెలలుగా మంజూరు కాని వేతనం ● బదిలీ అయిన ఉపాధ్యాయులకు నేటికీ ఐడీల కేటాయింపు లేదు ● జీతాలకు ఎదురు చూస్తున్న టీచర్లు ● ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఒత్తిడిలో 1,500 మంది ఒకప్పుడు బతకలేక బడిపంతులు అనేవారు. ఇప్పుడు కూటమి పాలనలో ఆ మాట నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితి. పిల్లలకు పాఠాలు చెప్పాల్సిన బడి పంతుళ్లు కాలే కడుపుతో అలమటిస్తున్నారుు. పదోన్నతులు వచ్చాయని ఆనందపడాలో.. నెల జీతం చేతికందడం లేదని బాధ పడాలో తెలియని అయోమయాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకటో తేదీ వస్తే కుటుంబ పోషణ, ఖర్చులు, అప్పులంటూ నెత్తిన గంపెడు కష్టాలు మోస్తూ కాలం వెళ్లదీస్తున్న వీరు.. సంపాదన ఆకస్మికంగా నిలిచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. చిన్న సాంకేతిక లోపాన్ని కూడా భూతద్దంతో చూపుతూ.. సర్కారు వీరిని కష్టాల కడలిలోకి నెట్టేసింది. రాయవరం: జీతాలు రాగానే వేతన జీవులు ప్రతి నెలా ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, పాలు, కిరాణా తదితర ఖర్చులు చెల్లించాల్సి ఉండడం సర్వసాధారణం. ఏదైనా కారణంతో ఓ నెల ఆదాయం రాకుంటే ఎంత కష్టంగా ఉంటుందో వేతన జీవులకే ఎరుక. అటువంటిది రెండు నెలలుగా వేతనాలు రాకుంటే వారి పరిస్థితి ఏమిటో అవగతమవుతుంది. గత వేసవిలో బదిలీలు పొందిన పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించడంలో ఏర్పడ్డ ప్రతిష్టంభనతో అనేక మంది ఉపాధ్యాయుల నెల జీతానికి బ్రేక్ పడింది. గత నెల వేతనాలు రాకపోగా, ఈ నెల కూడా అడియాశే ఎదురైంది. సాంకేతిక సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందన్న విమర్శలు ఉపాధ్యాయ సంఘాల్లో వ్యక్తమవుతోంది. పొజిషన్ ఐడీలు కేటాయించి, తక్షణమే వేతనాలు చెల్లించాలంటూ ఇప్పటికే ఫ్యాప్టో ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ధర్నాలు చేసి, అధికారులకు వినతిపత్రాలు అందజేసిన విషయం పాఠకులకు విదితమే. 1,500 మందికి పైగా.. ఈ ఏడాది మే 21న ప్రారంభించిన బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ జూన్ 15తో ముగిసింది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పొందిన వారిలో పలువురికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. వాటిని సకాలంలో కేటాయించకపోవడంతో జూన్, జూలై వేతనాలను వారు నేటికీ పొందలేకపోయారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి పైగా ఉపాధ్యాయులు ఇలా జీతభత్యాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. పొజిషన్ ఐడీ అంటే.. సాధారణంగా ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సంబంధిత ఉపాధ్యాయుడి పొజిషన్ ఐడీని ప్రభుత్వం కేటాయిస్తుంది. బదిలీ కాక పూర్వం వరకు వారు రెగ్యులర్గా జీతభత్యాలు పొందుతున్నప్పటికీ, ప్రస్తుతం బదిలీ అయిన స్థానానికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అప్పుడే సంబంధిత ఉద్యోగి/ఉపాధ్యాయుడి వివరాలు సీఎఫ్ఎంఎస్లో డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే డీడీఓలో బిల్లు సమర్పించడానికి వీలవుతుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడల్ ప్రైమరీ స్కూళ్లకు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ ఉపాధ్యాయులు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు నూతనంగా ఏర్పడడంతో, ఇక్కడ కొత్తగా కేటాయించిన పోస్టులకు పొజిషన్ ఐడీలు కేటాయించాలి. అప్పుడు ఆ స్థానాల్లో బదిలీపై వచ్చిన వారి జీతభత్యాలకు అవకాశం ఉంటుంది. బదిలీలు, పదోన్నతులు పూర్తయి రెండు నెలలు కావస్తున్నా.. నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలై, ఆగస్టులో తీసుకోవాల్సిన జూన్, జూలై నెలల వేతనాలు వారికి మంజూరు కాలేదు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీలోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. గత నెల 25వ తేదీలోపు పొజిషన్ ఐడీలు రానందున రెండు నెలల వేతనాలను వీరు పొందలేకపోయారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో.. వేతనాలతో పాటు, ఇతర అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలు ఉపాధ్యా య సంఘాలు శనివారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాయి. పలుమార్లు వినతిపత్రాలిచ్చినా పరిస్థితి లో మార్పు లేదని ఆయా సంఘాల నేతలు మండిప డ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పొజిషన్ ఐడీలకు చ ర్యలు తీసుకుని, రెండు నెలల వేతనాలను జూలై ఆరు న సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ చేసేలా జీవో జారీ చేసింది. ఈ జీవో ఎంతవరకు అమలవుతుంది, పొజిషన్ ఐడీలు సప్లిమెంటరీ బిల్లు సబ్మిట్ గడువు ముగిసే లోపు కేటాయిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్/ఒకేషనల్ ఉపా ధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. ప్రభుత్వ కక్షపూరిత ధోరణి ఆన్లైన్ సమాచారం కావాల్సినప్పుడు ప్రభుత్వం ఆగమేఘాలపై సెకండ్ల వ్యవధిలో సమాచారం సేకరిస్తుంది. ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించి సాంకేతిక సమస్యను పరిష్కరించడానికి రెండు నెలలు సాగదీశారు. ఉపాధ్యాయులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణి వీడి వెంటనే ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించి, వేతనాలను తక్షణమే చెల్లించాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రెండు నెలలుగా ఇబ్బందులు నెల వేతనం రాకుంటేనే వేతన జీవులు ఇబ్బందులు పడే పరిస్థితి. నిత్యావసర వస్తువులు, ఈ ఎంఐలు చెల్లించాల్సిన పరిస్థితు ల్లో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. టెక్నాలజీని అధికంగా వినియోగిస్తూ, క్షణాల్లో డేటా సేకరిస్తున్న ప్రభుత్వం.. పొజిషన్ ఐడీలు కేటాయించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. సప్లిమెంటరీ బిల్లు లు ఈ నెల 15లోపు చేసుకునేలా చర్యలు చేపట్టాలి. – పోతంశెట్టి దొరబాబు, జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ప్రణాళిక లోపం కన్పిస్తోంది బదిలీలు, పదోన్నతుల సమయంలోనే పొజిషన్ ఐడీలు కేటాయించే చర్యలు తీసుకోవాలి. ఇందులో ప్రభుత్వ ప్రణాళిక లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రెండు నెలలుగా వేతనాలు రాక, బ్యాంకుల్లో ఈఎంఐలు చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. వైద్య ఖర్చులకూ ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – ధీపాటి సురేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
దేశంలో గూఢచర్యం!
● నేతలపై నిఘా ● మొబైల్స్ ట్యాప్ చేస్తున్నారని అనుమానాలు ● ‘అల్లుడు గారి’పై అసంతృప్తి ● సీనియర్ నేతకు హ్యాండిస్తున్న వైనం ● అయ్యన్న పంచకు ద్వితీయ శ్రేణి సాక్షి ప్రతినిధి, కాకినాడ: గూఢచర్యం వ్యవహారం తుని ‘దేశం’లో కలకలం రేపుతోంది. ఆవిర్భావం నుంచీ టీడీపీలో ఉంటున్న తమ కదలికలపై మొన్న కాక నిన్న వచ్చిన ఓ నేత నిఘా పెడుతున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడకు వెళుతున్నాం.. ఎవరితో ఎక్కువగా మాట్లాడుతున్నాం.. ఎవరి వద్ద ఎక్కువ సమయం గడుపుతున్నామనే వివరాలు తెలుసుకునేందుకు ఏకంగా వేగులను సైతం నియమించారని మండిపడుతున్నారు. చివరకు తమ ఆనుపానులు తెలుసుకునేందుకు మొబైల్ ట్యాపింగ్కు కూడా పాల్పడుతున్నారని కొంత మంది నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం తుని టీడీపీలో కలకలం రేపుతోంది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని ఓ ‘అల్లుడు గారు’ తమ ఆనుపానులపై నిత్యం నిఘా పెడుతున్నారంటూ పార్టీలోని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీలో ఎన్నో ఒడుదొడుకులు చూసినా ఏనాడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ తరహా నిఘా వ్యవహారాలతో విసుగెత్తిపోయిన కొందరు సీనియర్లు పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఏం జరిగిందంటే.. పార్టీయేతరులతో టచ్లో ఉన్నారంటూ తన వేగులు అందించిన సమాచారంతో తమను ఆ అల్లుడు గారు అవమానకరంగా మాట్లాడారని తుని మున్సిపల్ మాజీ చైర్మన్ కినుక వహించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం పార్టీతో అంటీముట్టనట్టుగా ఉంటోంది. పార్టీలోని ఓ కీలక నేతతో నాలుగు దశాబ్దాల పాటు వెన్నంటి ఉన్న మరో సీనియర్ నేత ఫోన్ ట్యాప్ చేయించారనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది. తాండవ షుగర్స్ మాజీ చైర్మన్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, తుని రూరల్లో క్రియాశీలకంగా ఉన్న సీనియర్పై నిఘా పెట్టిన విషయం కూడా ఇటీవల లీకై ంది. ఇన్నేళ్ల టీడీపీ అనుబంధంలో తన ప్రవర్తన ముఖ్య నేతలు అనుమానించేలా ఎన్నడూ లేదని ఆ నాయకుడు ఒక ముఖ్య నాయకుడి వద్ద ఆవేదన చెందారని చెబుతున్నారు. నిఘా ఎదుర్కొన్న సంబంధిత సీనియర్ నాయకుడు ఒకింత ఆగ్రహంతో అల్లుడు గారి అనుచరగణాన్ని ఇటీవల కడిగి పారేశారని పార్టీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ పరిణామాలతో విసుగెత్తిన ఆ నేత ఇటీవల తుని నియోజకవర్గంలోని కీలక నేత చేయి వదిలేశారని.. పొరుగునే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఉన్న శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి అనుచరులతో టచ్లోకి వెళ్లారని అంటున్నారు. అలా చేయక తప్పలేదని ఆ నాయకుడు బహిరంగంగానే చెబుతున్నా తునిలోని కీలక నేత కోటరీ నోరు మెదపడం లేదు. తుని పట్టణంతో పాటు తొండంగి, తుని రూరల్ మండలాల్లోని మరికొందరు సీనియర్లు కూడా అల్లుడు గారి వ్యవహార శైలిపై రుసరుసలాడుతున్నారు. కొందరైతే పార్టీలో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు అధికారం చేతిలో ఉంది కదా అని పార్టీలో ఎవరి పరిస్థితేమిటి.. ఎవరెంత పని చేశారనేది తెలుసుకోకుండా సీనియర్లను పక్కన పెట్టడాన్ని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే కొందరు సీనియర్లకు పొమ్మనకుండానే పొగ పెట్టేశారు. ఇలా ఇంకెంత మందిని దూరం పెడతారో తామూ చూస్తామని ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన నాయకులు సవాల్ చేస్తున్నారు. అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని అల్లుడి పెత్తనం తుని టీడీపీలో దుమారం రేపుతోంది. తమను ఆయన ఏ కోశానా నమ్మడం లేదని, పైగా ఆయన అనుచరులు సైతం పేట్రేగిపోతున్నారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లు ఒకరొకరుగా పార్టీకి దూరమయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పార్టీలో నంబర్–2గా ఉన్న నేతతో కలిసి తిరిగిన తమకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతోందని కలలో కూడా ఊహించలేదని ద్వితీయ శ్రేణి నేతలు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ఇప్పుడంటే పార్టీలో పెద్దన్న పాత్ర లేకుండా పోయిందే తప్ప.. ఆ స్థాయిలో ఉన్నప్పుడు కూడా తమను ఎప్పుడూ కరివేపాకుల్లా చూడలేదని అంటున్నారు. ఇదంత తెలిసి కూడా కీలక నేత పట్టించుకోకపోవడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు రచ్చబండల వద్ద గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో ఇన్నేళ్ల సీనియారిటీ ఉండి సబ్ జూనియర్ అయిన వారి ముందు చేతులు కట్టుకుని పని చేయడం తమ వల్ల కాదని అంటున్నారు. కేవలం పెద్దాయన ముఖం చూసే ఇంకా కొనసాగుతున్నాం తప్ప లేదంటే ఎప్పుడో తుది నిర్ణయం తీసుకునే వారమని చెబుతున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
వనదుర్గమ్మ శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
అన్నవరం: రత్నగిరి దుర్గామాత వనదుర్గ అమ్మవారి శ్రావణ మాస జాతర సోమవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని తొలి రోజు బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి, పండితులు పూజలు చేశారు. ఉదయం 8 గంటలకు ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకూ రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు, చండీ పారాయణలు నిర్వహించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. ఆలయ వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు, 44 మంది రుత్విక్కులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సత్యదేవుని తరఫున ఈఓ దంపతులు చీర, సారె సమర్పించారు. ఈ నెల తొమ్మిదో తేదీ పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. -
తల్లి, ఇద్దరు కుమార్తెల దారుణ హత్య
సామర్లకోట: వివాహిత, ఇద్దరు బాలికలు దారుణంగా హత్యకు గురైన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆదివారం జరిగింది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ కథనం మేరకు.. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక ఉన్న సీతారామ కాలనీలో ములపర్తి ధనుప్రసాద్ కుటుంబం నివసిస్తోంది. ధనుప్రసాద్ స్థానిక ఏడీబీ రోడ్డు కాంట్రాక్టు పనులకు సంబంధించిన లారీకి డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు సోమవారం ఉదయం ఇంటికి వచ్చాడు.ఎంత కొట్టినా కుటుంబ సభ్యులు తలుపులు తెరవలేదు. ఏసీ పని చేస్తూనే ఉంది. దీంతో, అతడు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లాడు. అప్పటికే అతడి భార్య మాధురి (30), కుమార్తెలు పుష్పకుమారి (8), జెస్సీలోన (6) చనిపోయి ఉన్నారు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎస్పీ బిందుమాధవ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సత్యనారాయణ, డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐలు కృష్ణభగవాన్, శ్రీనివాస్, తదితరులు ఘటనా స్థలం వద్ద వివరాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులను రప్పించి, ఆధారాలు సేకరించారు. హతురాలు మాధురి తల నుజ్జునుజ్జయ్యింది. తలపై కొట్టడంతో పలు కోణాల్లో దర్యాప్తుఈ హత్యలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ధనుప్రసాద్ ఇంటి వెనుక తలుపు నుంచి గోడ దూకి సమీపంలో ఉన్న కాలనీ వైపు వెళ్లింది. ఈ నేపథ్యంలో హంతకుడు ఇంటి వెనుక తలుపు తీసి పారిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. హతురాలి వద్ద ఉండాల్సిన 2 ఉంగరాలు, 2 సెల్ ఫోన్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ధనుప్రసాద్ రాత్రంతా రోడ్డు పనిలోనే ఉన్నట్లు సూపర్వైజర్ చెప్పారని సమాచారం. ఈ హత్యలు వివాహేతర సంబంధం కారణంగా జరిగిందా లేక భర్త చేసి ఉంటాడా లేదా దొంగలు చేసిన పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు. -
‘రంగరాయ’ గ్రౌండ్లో.. రాజకీయ క్రీడ
● వైద్య విద్యార్థులకే కేటాయించిన మైదానం ● కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ● ఈ నెల 10 నుంచి వాకర్స్కు అనుమతి ● ఆ ముసుగులో వివాదాస్పద వ్యక్తులు చొరబడతారని ఆందోళన ● విద్యార్థుల భద్రతకు భరోసా కరవు కాకినాడ క్రైం: చాలా నెలల తరువాత రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) క్రీడా మైదానం గేట్లు ఎట్టకేలకు తెరచుకోనున్నాయి. కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఈ మైదానంలో వాకింగ్కు, వ్యాయామం చేసుకునేందుకు వాకర్స్కు అనుమతులు ఇచ్చారు. దీనిపై పలు విమర్శలు వస్తున్నాయి. ఏం జరిగిందంటే.. గత ఏడాది సెప్టెంబర్ 21వ తేదీ సాయంత్రం అప్పటి ఆర్ఎంసీ స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రస్తుత కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ దాడి చేశారు. తాను గౌరవనీయమైన హోదాలో ఉన్న ఓ ప్రజాప్రతినిధినని.. అవతలి వ్యక్తి సమాజానికి సేవలందించే వైద్యుడనే కనీస గౌరవం కూడా లేకుండా పిడిగుద్దులు గుద్దుతూ, బూతులు తిట్టారు. విద్యార్థులతో గొడవలకు దిగుతూ, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆయన అనుచరులను డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆర్ఎంసీ గ్రౌండ్ నుంచి బయటకు పంపించేయడమే దీనికి కారణం. దాడి చేస్తున్న క్రమంలో అప్పటి వైస్ ప్రిన్సిపాల్, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ అడ్డుపడి, ఎమ్మెల్యేను నిలువరించారు. దీంతో, దాడి నుంచి డాక్టర్ ఉమామహేశ్వరరావు బయటపడ్డారు. ఈ విజువల్స్ అప్పట్లో వైరల్ కాగా.. ఈ వివాదం ముఖ్యమంత్రి వరకూ వెళింది. ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కలెక్టర్ షణ్మోహన్, అప్పటి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు. దఫదఫాల చర్చల అనంతరం ఎమ్మెల్యే నానాజీకి, డాక్టర్ ఉమామహేశ్వరరావుకు మధ్య సయోధ్య కుదిర్చారు. అయితే, తోటి వైద్యుడికి ఎమ్మెల్యే చేసిన అవమానాన్ని వైద్య సంఘాలు మాత్రం అంత తేలికగా విడిచిపెట్టలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. అప్పటి నుంచీ ఆర్ఎంసీ క్రీడా ప్రాంగణంలోకి వైద్య విద్యార్థులను తప్ప మరెవరినీ అనుమతించరాదనే డిమాండ్ తెర మీదికి వచ్చింది. ఒక దశలో ఒత్తిళ్లకు లొంగిన అధికారులు మైదానంలోకి బయటి వారిని కూడా అనుమతించాలని భావించినా అందుకు విద్యార్థులు ఎంత మాత్రమూ అంగీకరించలేదు. ముక్తకంఠంతో వద్దని.. ఆర్ఎంసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యాన మొత్తం 2,400 మంది వైద్య విద్యార్థులు దశల వారీగా అంతర్గత సమావేశాలు నిర్వహించారు. తమ కళాశాల గ్రౌండ్లోనికి ఇతరులను అనుమతించవద్దని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించారు. వాకర్స్ ముసుగులో గంజాయి బ్యాచ్లు, అసాంఘిక శక్తులు క్రీడా ప్రాంగణంలోకి ప్రవేశించడం తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. అలాగే, వైద్య బృందాలు కూడా ఏకమయ్యాయి. వివిధ సమావేశాల్లో విద్యార్థులకు తప్ప మరెవ్వరికీ ఆర్ఎంసీ క్రీడా మైదానాన్ని కేటాయించరాదని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 11 నెలల పాటు విద్యార్థులు తప్ప మరెవ్వరికీ కళాశాల క్రీడా ప్రాంగణంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా పోయింది. తాము వాకర్స్కు వ్యతిరేకం కాదనీ, కానీ ఆ ముసుగులో అసాంఘిక మూకలు దురుద్దేశాలతో గ్రౌండ్లోకి వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులివ్వడం అనివార్యమైతే విద్యార్థినీ విద్యార్థులకు ఎటువంటి సమస్యా ఉత్పన్నమవ్వకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆర్ఎంసీ క్రీడా మైదానంలోకి వాకర్స్ను అనుమతించాలంటూ అధికారులపై కూటమి నాయకులు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకుని వచ్చారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ షణ్మోహన్ జోక్యం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ ఈ నెల 10వ తేదీ నుంచి వాకర్స్కు అనుమతివ్వాలని ఎట్టకేలకు నిర్ణయించారు. అయితే, ఒత్తిడి తెచ్చిన రాజకీయ నాయకులు మాత్రం విద్యార్థుల భద్రతకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. యాజమాన్యం రిస్క్తోనే అనుమతులివ్వాలన్నట్లు మంత్రాంగం నడిపారు. కలెక్టర్ సహా ఆర్ఎంసీ ప్రిన్సిపాల్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ రాజకీయ క్రీడలో చివరకు తమ పంతం నెగ్గించుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు చొరవతోనే ఆర్ఎంసీ క్రీడా ప్రాంగణం గేట్లు తెరచుకున్నాయని ఆయన అనుచరులంటున్నారు. -
భద్రత, రవాణా సామర్థ్యంపై దృష్టి సారించాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): భద్రత, సరకు రవాణా సామర్థ్యం, సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం) మోహిత్ సోనాకియా అధికారులను ఆదే శించారు. కాకినాడ టౌన్, పోర్టు రైల్వే స్టేషన్లను, సీపోర్ట్, సరకు రవాణా నిర్వహణ, భద్రతా సంసిద్ధత, సిబ్బంది సౌకర్యాలు, కోచ్ సర్వీసింగ్ కార్యకలాపాలను ఆదివారం ఆయన పరిశీలించారు. రైల్వే కార్యకలాపాలు, ప్రయాణికుల భద్రతను నిర్ధారించడంలో బ్యాక్ ఎండ్ జట్లు కీలక పాత్ర పోషించాలన్నారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. కాకినాడలోని రన్నింగ్ రూమ్ను తనిఖీ చేసి, ఆపరేటింగ్ సిబ్బందికి విశ్రాంతి, రిఫ్రెష్మెంట్ సౌకర్యాలను సమీక్షించారు. పరిశుభ్రత, పోషకాహారం, డిజిటల్ లాగ్బుక్ వ్యవస్థల్లో సిబ్బంది సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. కష్టపడి పని చేసే సిబ్బందిని డీఆర్ఎం అభినందించారు. -
అన్ని దారులూ వాడపల్లికే..
● భక్తులతో కిక్కిరిసిన వెంకన్న క్షేత్రం ● ఒక్క రోజే రూ.6.70 లక్షల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కిక్కిరిసింది. శనివారం ఇసుక వేస్తే రాలనంత రీతిలో భక్తులు తరలిరాగా ఆ జనంలో ప్రదక్షిణలు చేయలేని భక్తులు ఇతర వారాల్లో ఏదో ఒక రోజు నిర్ణయించుకుని ఏడు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలం’ నానుడితో అశేష భక్తజనం తరలి రావడంతో కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్రం నలుమూలల నుంచీ అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, మిగిలిన ఆరు రోజులూ అత్యధికంగా వస్తున్నారు. దానితో ఈ క్షేత్రం శనివారాలే కాకుండా వారంలో మిగిలిన రోజుల్లో కూడా నిత్య కల్యాణం పచ్చతోరణంలా మారుతోంది. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు ఆదివారం అష్టోత్తర పూజ, స్వామివారి నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. పండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్క రోజే దేవస్థానానికి రూ.6,70,313 ఆదాయం వచ్చిందని చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో విశాఖపట్నం కళారాధన నృత్య కళాశాల కళాకారిణుల కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. నేటి నుంచి పవిత్రోత్సవాలు వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈఓ సూర్యచక్రధరరావు తెలిపారు. సోమవారం ఉదయం రుత్విక్కులు దీక్షాధారణ, అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, పవిత్ర ప్రతిష్ఠ పూజలు చేయనున్నారు. ఐదో తేదీ ఉదయం అష్ట కలశ స్థాపన, మహా శాంతి హోమం, ఆరో తేదీ ఉదయం పవిత్ర విసర్జన, పూర్ణాహుతి నిర్వహిస్తారని ఈఓ వివరించారు. -
రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం ఆదర్శనీయం
మహా సహస్రావధాని గరికిపాటి నరసింహరావు కాకినాడ సిటీ: అష్టావధానులకు మార్గదర్శిగా, సాహితీ స్రష్టగా నిలచి, సంస్కృత భాషాసాహిత్యాలకు విశేష సేవలందించిన రాణి సుబ్బయ్య దీక్షితులు జీవితం నేటి తరానికి ఆదర్శనీయమని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహరావు అన్నారు. బాణుడు సంస్కృతంలో రచించిన కాదంబరి కావ్యంపై ఆయన సాహితీ ప్రసంగం చేశారు. రాణి సుబ్బయ్య దీక్షిత, సాహితీ కౌముది ఆధ్వర్యాన సూర్య కళా మందిరం ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. కాదంబరి కావ్యంలోని అనేక పాత్రల వ్యక్తిత్వాన్ని గరికిపాటి ఆవిష్కరించారు. కావ్యంలో పరిపాలన చేసే రాజు, నాయికా నాయకులను వర్ణిస్తూ నేటి యువతకు ఆదర్శనీయంగా ఉండేలా ఆయన ప్రసంగం సాగింది. రాణి సుబ్బయ్య దీక్షితులుతో తనకున్న అనుబంధాన్ని గరికిపాటి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాదంబరి కావ్యంలోని ఉదాత్త పాత్రలతో సుబ్బయ్య దీక్షితులును సరిపోల్చారు. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులకు గరికిపాటి సూచించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకుడు రాణి చంద్రశేఖరశర్మ ఆధ్వర్యాన గరికిపాటి నరసింహరావును సత్కరించారు. ముందుగా సంస్థ నిర్వాహకురాలు గంటి బాలాత్రిపురసుందరి, ప్రముఖ వ్యాపారవేత్త గ్రంధి బాబ్జీ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో రాణి సుబ్బయ్య దీక్షితులు కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన సరిపెల్ల శ్రీరామచంద్రమూర్తి, మార్ని జానికిరామ్ చౌదరి, గరికిపాటి మాస్టారు, గౌరినాయుడు, శిరీష, సీఎస్ తదితర సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు పాల్గొన్నారు. -
16 నుంచి విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలు
రాయవరం: వెదురుపాక విజయదుర్గా పీఠం 53వ వార్షికోత్సవాలను ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, పీఆర్ఓ వి.వేణుగోపాల్ (బాబీ) తెలిపారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) సమక్షంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు వార్షికోత్సవ వివరాలు వెల్లడించారు. పీఠాధిపతి గాడ్ 1972 ఆగస్టు 18న మంత్రోపదేశం పొందారన్నారు. 1989 ఆగస్టు 16న శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్థస్వామి విజయదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ చేసి, భవానీ శంకర స్ఫటిక బాణాన్ని విజయదుర్గాదేవి సన్నిధిలో ప్రతిష్ఠించారన్నారు. పీఠంలో నిరంతరాయంగా విజయదుర్గా అమ్మవారికి పూజాదికాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. వచ్చే నెల 16న పీఠంలో సర్వతోభద్రతా మండప ఆవాహన జ్యోతి ప్రజ్వలనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. సీతారామ కల్యాణం ఈ నెల 16న ఉదయం 8.45 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభమవుతాయని బాపిరాజు, బాబీ తెలిపారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం భద్రాచలం వేద పండితులతో సీతారామచంద్రుల కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం 6.15 గంటలకు శ్రీ సాయి సత్సంగ నిలయం, పీఠం మహిళా భక్తులతో శక్తిమాల సహిత మణిద్వీప వర్ణన శ్లోకాల పారాయణ, నవదుర్గల సువాసినీ పూజ నిర్వహిస్తారు. 17న జొన్నవాడ వద్ద ఉన్న శ్రీ కామాక్షితాయి అమ్మవారి ప్రధానార్చకులతో మహానవావరణ హోమం, సాయంత్రం 6 గంటలకు అన్నవరం దేవస్థానం పండితులతో అనంత లక్ష్మీ సత్యవతీదేవి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి వారి దివ్య కల్యాణం నిర్వహిస్తారన్నారు. 18వ తేదీ ఉదయం టీటీడీ వారితో విజయదుర్గా పీఠం వద్ద నెలకొల్పిన విజయ వేంకటేశ్వరస్వామి దివ్య కల్యాణం శ్రీ వైఖానస ఆగమ పండితులతో నిర్వహించనున్నట్లు తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక అర్చన, హారతులు, చతుర్వేదస్వస్తి కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు. వార్షికోత్సవాలకు వచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. సమావేశంలో పీఠం భక్తజన కమిటీ సభ్యులు గాదె భాస్కర నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువు.. కరవు
పట్టించుకోని వ్యవసాయ శాఖ ఎరువులు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నా వ్యవసాయ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేచి ఉన్నా ఒక్క బస్తా కూడా దొరకని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యవసాయ శాఖ వేధింపుల కారణంగా ఎరువుల స్టాకు తెచ్చుకోవడం మానేశామని ప్రైవేటు డీలర్లు బహిరంగంగానే చెబుతున్నారు. అటు ప్రభుత్వం ఎరువులు ఇవ్వక.. ఇటు ప్రైవేటు డీలర్ల వద్ద కూడా దొరక్కపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే.. పైరు పొట్ట పోసుకొనే దశలో ఎరువులు దొరకని పరిస్థితి నెలకొంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. రైతులకు ఎరువులు ఏ మేరకు అవసరమో ప్రభుత్వానికి, వ్యవసాయ అధికారులకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఎరువుల కోసం నేడు వైఎస్సార్ సీపీ వినతులు ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని వ్యవసాయ అధికారులకు వైఎస్సార్ సీపీ నాయకులు సోమవారం వినతి పత్రాలు ఇవ్వాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. ఎరువులు కూడా సక్రమంగా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులు ఇబ్బందులను అధికారులకు తెలియజేయాలని నియోజకవర్గ కో ఆర్డినేటర్లకు, పార్టీ నాయకులకు ఆయన సూచించారు. కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ సగిలికి దాడిశెట్టి రాజా వినతిపత్రం ఇవ్వనున్నారు.● జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు ● ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు ● ప్రతి రైతుకూ రెండు మూడు బస్తాల ఎరువులు అవసరం ● వాటి కోసం గంటల తరబడి నిరీక్షణ ● ఇదే అదనుగా కూటమి నాయకుల దందా ● బస్తాకు రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా వసూళ్లు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ‘చంద్రన్న ఉన్నంత వరకూ రైతుకు భరోసా లేదు.. ఉండదు.. ఉండబోదు.. ఇది నా ప్రామిస్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తూర్పు వీరాయపాలెంలో అన్నారు. ఆ మాటలు నిజమే అన్నట్టుగా ఉంది జిల్లాలోని రైతుల పరిస్థితి. ఖరీఫ్లో అన్నదాతకు అదనుకు పెట్టుబడి సాయం అందించని కూటమి సర్కారు.. వారికి కావాల్సిన ఎరువులు సైతం సరఫరా చేయలేక చేతులెత్తేసింది. దీంతో, ఎరువుల కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో వ్యవసాయం పండగలా సాగేది. అన్నదాతలకు సకాలంలో పెట్టుబడి సాయం అందించేవారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి ముంగిట్లోనే ఎరువులు అందేవి. కూటమి సర్కారు వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. మరో 30 వేలకు పైగా ఎకరాల్లో పొగాకు, మొక్కజొన్న, పత్తి, అపరాలు సాగవుతున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో ఎరువులు లభించడం లేదు. ప్రస్తుతం సహకార సంఘాల్లో ఎరువులు విక్రయిస్తున్నారు. ఒక లోడు వచ్చినా రైతుల అవసరాలకు ఏమాత్రం చాలడం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వ్యవసాయ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో (ఆర్ఎస్కే) అవసరాల మేరకు ఎరువులు అందుబాటులో ఉంచలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదనుకు ఎరువులు లభించకపోవడంతో గత్యంతరం లేక అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి వారికి కావలసినంతగా.. ప్రస్తుతం వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ జిల్లావ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో రైతులు వరి నాట్లు వేశారు. ఈ దశలో యూరియా, డీఏపీ, నత్రజని ఎరువులు అవసరం. మూడెకరాలు సాగు చేసే రైతుకు యూరియా 3 బస్తాలు, కాంప్లెక్సు ఎరువులు మూడు బస్తాలు అవసరం. కానీ, ప్రస్తుతం యూరియా, కాంప్లెక్సు ఎరువులు ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు ఆర్ఎస్కేలు, సహకార సంఘాలకు ఒక లోడు (సుమారు 200 బస్తాలు) ఎరువులు వస్తే.. కూటమి నాయకులు వాలిపోతున్నారు. వచ్చిన ఎరువుల్లో సగానికి పైగా తమకు కావాల్సిన రైతులకే ఇస్తున్నారని, మిగిలిన వారికి ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామర్లకోట మండలం ఉండూరులో శనివారం ఒక లోడు ఎరువులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన కూటమి నాయకులు వారికి కావాల్సిన వారికి దగ్గరుండి మరీ ఎక్కువ బస్తాలు ఇచ్చి, మిగిలిన వారికి ఒక్కో బస్తా మాత్రమే ఇచ్చారని ఆరోపిస్తూ అక్కడి రైతులు ఆర్ఎస్కే వద్ద ధర్నా చేశారు. చాలా మందికి ఒక్క బస్తా కూడా ఇవ్వకుండా రేపు మాపు అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని, ఎరువులను పక్కదారి పట్టించి, ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారని దుయ్యబట్టారు. ఇదే అదనుగా కూటమి నాయకులు ఒక్కో బస్తాను రూ.200 నుంచి రూ.300 వరకూ అధికంగా అమ్ముకుంటూ దోచుకుంటున్నారని రైతులు బహిరంగంగానే విమర్శించారు. సీజన్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఎరువుల కొరత ఎప్పుడూ లేదని, తమను ఇబ్బంది పెట్టేందుకే ప్రభుత్వం ఎరువులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. గంటలో అయిపోతున్నాయి ప్రస్తుతం ఎరువుల అవసరం ఎక్కువగా ఉంది. ఎప్పుడో ఒకసారి లోడు ఎరువులు వస్తున్నాయి. అవి గంటలో అయిపోతున్నాయి. ఇక మళ్లీ ఎరువులు రైతు సేవా కేంద్రాలకు రావడం లేదు. సకాలంలో ఎరువులు సరఫరా చేయాల్సిన వ్యవసాయ అధికారులు పట్టించుకోవడం లేదు. – సుర్ల నాగ రమణ, టీజే నగరం, కోటనందూరు మండలం చాలా ఇబ్బందులు పడుతున్నాం గతంలో ఎన్ని బస్తాలు కావాలన్నా రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. నేను ఐదెకరాలు సాగు చేస్తున్నాను. రెండు బస్తాలు ఎన్ని ఎకరాలకు సరిపోతుంది? ప్రభుత్వం కనీసం ఎరువులు కూడా సక్రమంగా ఇవ్వకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. – నేతల హరిబాబు, రైతు, సామర్లకోట -
నేటి నుంచి వనదుర్గ అమ్మవారి జాతర
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర సోమవారం ప్రారంభం కానుంది. ఈ నెల 9న శ్రావణ పౌర్ణమి వరకూ ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజున అమ్మవారిని బాలాత్రిపురసుందరిగా అలంకరించి, పండితులు పూజలు చేస్తారు. పౌర్ణమి వరకూ రోజుకో అలంకారం చేస్తారని అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు వనదుర్గ అమ్మవారి ఆలయంలో పండితులు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనంతో ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. నవధాన్యాలతో మండపారాధన, కలశ స్థాపన చేస్తారు. 50 మంది రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీసూక్త పారాయణలు, మూలమంత్ర జపాలు, సూర్య నమస్కారాలు, సప్తశతీ పారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. చండీ హోమానికి పండితులు అంకురార్పణ చేస్తారు. ఆ రోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ అమ్మవారికి లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. తొమ్మిదో తేదీన శ్రావణ పౌర్ణమి నాడు వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. దీంతో శ్రావణ మాస పూజలు ముగుస్తాయి. రత్నగిరి కిటకిట● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది భక్తులు ● 2,500 వ్రతాల నిర్వహణ ● రూ.40 లక్షల ఆదాయం అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం కిటకిటలాడింది. రత్నగిరి పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోను శనివారం రాత్రి, ఆదివారం వేకువజాము ముహూర్తాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. దీంతో, అధిక సంఖ్యలో నవదంపతులు సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించారు. వారికి వారి బంధుమిత్రులు, ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారిపోయింది. సత్యదేవుని వ్రతాలు 2,500 నిర్వహించారు. స్వామివారిని దర్శించిన భక్తులు శ్రీగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించారు. అనంతరం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చిన 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు దేవదాయ శాఖ ఉప కమిషనర్, ఆలయ ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,05,890, పూజా టికెట్లకు రూ.1,71,160, కేశఖండన శాలకు రూ.18,760, వాహన పూజలకు రూ.9,240, పొంగలి షెడ్లు, కాటేజీలు, వసతి గదుల అద్దెలు రూ.77,426, విరాళాలు రూ.58,967, కలిపి మొత్తం రూ.5,41,443 ఆదాయం సమకూరిందని వివరించారు. -
ప్రవర్తన నియమావళిపై పట్టు సాధించాలి
సామర్లకోట: ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి (సీపీఏ)పై ఎంపీడీఓలు పట్టు సాధించాలని కొత్తపేట ఎంపీడీఓ పీఎస్ నరేష్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆరో రోజు శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఇతర ఽఅధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కు అయినట్లు రుజువైతే శిక్ష ఉంటుందన్నారు. కింది స్థాయి సిబ్బంది తప్పులు చేసిన సమయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారిని సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు. -
బదిలీ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వండి
ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో ఇటీవల బదిలీ అయిన 60 వేల మంది ఉపాధ్యాయులకు రెండు నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురంలో శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గత జూన్ నెలలో సాధారణ బదిలీల్లో భాగంగా దాదాపు 67 వేల మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం జరిగిందన్నారు. కొందరు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెచ్ఎంలుగా, మరికొందరు ఎస్జీటీలకు పదోన్నతులు ఇచ్చి హెచ్ఎంలుగా పంపించిందని గుర్తు చేశారు. స్కూల్ అసిస్టెంట్ సమాన క్యాడర్ బదిలీలు జూన్ 9తో, ఎస్జీటీల బదిలీలు జూన్ 14తో ముగిశాయన్నారు. మరుసటి రోజు అందరూ బదిలీల ప్రకారం కొత్త పాఠశాలలకు వెళ్లి బాధ్యతలు చేపట్టారని వివరించారు. కొందరు ఉన్న క్యాడర్లలోనే స్థానికంగా మారడంతో వారికి వేతనాలు అందాయన్నారు. కానీ పోస్టుతో సహా స్థానచలనం కలిగిన దాదాపు 60 వేల మంది ఉపాధ్యాయులకు జూన్, జూలై నెలలకు జీతాలు జమ కాలేదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం రెండు నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైఎస్సార్ సీపీ తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. -
అయస్కాంతాన్ని మింగేసిన బాలిక
తొలగించిన వైద్యులు ప్రత్తిపాడు రూరల్: మండలంలోని బురదకోట గ్రామ పంచాయతీ బాపన్నధార గిరిజన గ్రామానికి చెందిన మాడెం రమ్య ఓ తినుబండారం ప్యాకెట్లో ఉన్న అయస్కాంతం ముక్కను మింగేసింది. ఆ బాలికను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి దానిని వైద్యులు తొలగించారు. మాడెం రమ్య బురదకోటలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. రింగ్ ప్యాకెట్లు తినే అలవాటు ఉన్న బాలిక ఆ ప్యాకెట్లోని తిను బండారాలతో పాటు అయస్కాంతం ముక్కను కూడా మింగేసింది. ఆమెను ప్రత్తిపాడు, ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించగా ఫలితం లేకపోవడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అయస్కాంతం ముక్కను తొలగించారు. ఈ అంశంపై సంబంధిత రింగ్ కంపెనీపై న్యాయ పోరాటం చేస్తామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు. -
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నీలకు రూ.లక్ష విరాళం
బోట్క్లబ్ (కాకినాడ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 5 నుంచి 20 వరకూ జరుగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, జాతీయ జూనియర్ హాకీ టోర్నీలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. శనివారం జిల్లా కలెక్టరేట్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత జి.శ్యామ్, డైరెక్టర్ శైలజా రూ.లక్ష చెక్కును కలెక్టర్ షణ్మోహన్కు అందజేశారు. శుక్రవారం విడుదలైన కానిస్టేబుట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు 6,014 పోస్టులకు గాను 4,005 పోస్టులు శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే సాధించడంతో అధినేత శ్యామ్ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. -
భయో వ్యర్థాలు!
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025అంతా లాలూచీయేనా! అనుమతులు లేని ల్యాబ్లు ఇష్టానుసారంగా జనాల్ని దోచేస్తుంటే, అధికారులకు చీమకుట్టినట్లు అయినా లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ తీరుపై ల్యాబ్ యాజమాన్య వర్గాల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అనధికార ల్యాబ్ నుంచి మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖలో పలువురు సిబ్బంది అధికారుల నిర్వాకాన్ని బయటపెడుతున్నారు. ప్రజలు జాగ్రత్త అనుమతులు లేని ల్యాబ్లలో పరీక్షలు చేయించుకుంటే పరీక్షల నివేదికల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంది. ధరలు, డిస్కౌంట్ల ఎరతో ప్రజల్ని ఆకర్షిస్తున్నారు. కాగా అనుమతులు ఉన్న ల్యాబ్లలో రోగి వివరాలు నమోదవుతాయి. అలాగే నివేదికల్లో అనుమానాలు ఉన్నా నేరుగా యంత్రం వద్దకు వెళ్లి సరిచూసుకోవచ్చు. ఈ సౌలభ్యం అనధికార ల్యాబ్ల వద్ద ఉండదు. శీతల వాతవారణం తగినంత లేకపోయినా ఉష్ణోగ్రత ఎక్కువైతే ఆ యంత్రం ఇచ్చే నివేదికల్లోనూ కచ్చితత్వం లోపించవచ్చు. కాబట్టి ప్రజలు ల్యాబ్లలో పరీక్షలు చేయించుకునేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. తాము వెళ్లిన ల్యాబ్ అనుమతులు చూపించమని అడిగేందుకు ఎటువంటి మొహమాటం అవసరం లేదు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ల విద్యార్హతల పైనా ఆరా తీయాలి.కాకినాడ క్రైం: జిల్లాలో వైద్య, ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ల్యాబొరేటరీలలో కొన్ని ప్రజారోగ్యానికి ప్రాణ సంకటంగా పరిణమిస్తున్నాయి. అనుమతులు తీసుకునేందుకు వెనకాడి జనం జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. రిజిస్ట్రేషన్ లేకపోతే చవక ధరల్లో ప్రమాదకర వ్యర్థాలైన బయో మెడికల్ వేస్టేజీ తొలగింపు సాధ్యం కాదు. నిర్ణీత ధరల కంటే రెండు రెట్ల ఎక్కువ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఆయా ల్యాబ్ల యాజమాన్యాలు ప్రమాదకర కుయుక్తులకు తెరతీశాయి. ప్రాణాంతకాలుగా పరిణమించే బయో మెడికల్ వ్యర్థాలను డంప్ యార్డులు, రోడ్డు పక్కన, డ్రైనేజీలు, చెత్తకుప్పల్లోకి విసిరేసి తమకేమీ తెలియనట్లు చేతులు దులిపేసుకుంటున్నారు. అనఽధికారికంగా కొనసాగుతున్న ల్యాబ్ల తీరు ఇంత దారుణంగా ఉంటున్నా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలోని సంబంధిత అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షాత్తూ, డీఎంహెచ్వో కార్యాలయం ఎదుట ఉన్న చెత్త కుండీలలోనే బయో మెడికల్ వ్యర్థాలు దర్శనమిస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆరోగ్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్ల ఏర్పాటుకు ఓ నిర్దిష్ట ప్రక్రియ ఉంటుంది. వాటికి ప్రభుత్వ అనుమతులు పొందాలి. అందుకు నిర్ణీత ప్రమాణాలు ఉంటేనే అనుమతులు వస్తాయి. సందుగొందుల్లో ఇరుకు గదుల్లో ల్యాబ్లు పెట్టేస్తామంటే కుదరదు. అలాగే రోగిని పరీక్షించి మీకు ఈ వ్యాధి ఉంది, స్థితిగతులివి అని నిర్థారించే వ్యక్తి కచ్చితంగా తగిన విద్యార్హుడై ఉండాలి. అటువంటి వారికి అర్హతకు తగిన జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించే బయోకెమిస్ట్రీ, హార్మోన్స్, హెమటాలజీ అనలైజర్ల వంటి పరికరాలు 25 డిగ్రీల ఉష్ణోగ్రత మించని వాతావరణం కల్పించాలి. నమోదైన ప్రతి ల్యాబ్ బయో మెడికల్ వ్యర్థాల తొలగింపునకు ప్రభుత్వ అనుమతులు పొంది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరిధిలో సేవలందించే సంస్థకు ప్రతి నెల నిర్ణీత రూ.1680 మొత్తాన్ని చెల్లించి రోజువారీగా వాటిని అప్పగించాల్సి ఉంటుంది. ధర అందుబాటులోదే అయినా ఎంతో ఒకంత వ్యయంతో కూడిన ప్రక్రియ. ఆ మాత్రం ఖర్చుకై నా మనస్కరించని పలువురు ల్యాబ్ యజమానులు ప్రమాదకర వ్యర్థాలను చాటుగా విసిరేస్తూ, డ్రైనేజీలలో కలిపేస్తూ, డంప్ యార్డులకు తీసుకువెళ్లి సాధారణ వ్యర్థాల్లా తగిన జాగ్రత్తలు తీసుకోకుండా పడేస్తున్నారు. ఎంతమందికి ఏ వ్యాధి ఉందో! అనధికారికంగా నడిపే ల్యాబ్ల యజమానుల నిర్వాకంతో అసలు సదరు ప్రాంతంలో ఏ వ్యాధి విస్తరిస్తోందో.. ఎందరు ఏ వ్యాధితో సతమతమవుతున్నారో తెలుసుకోవడం దాదాపుగా అసాధ్యం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ల్యాబ్లు, అనుమతి పొందిన ప్రైవేటు ల్యాబ్ల నుంచి వస్తున్న రిపోర్టుల ఆధారంగా మాత్రమే వ్యాధి విస్తరణపై నిర్థారణ, బాధితుల సంఖ్యపై స్పష్టతకు రావలసి ఉంటుంది. వీటి ఆధారంగానే తుది గణాంకాలను సిద్ధం చేస్తున్నారు. ఈ గణాంకాలనే ప్రభుత్వ అధికారులు ప్రజలకు వెల్లడిస్తున్నారు. ఈ గణాంకాల్లో అనుమతులు పొందని ల్యాబ్లు నిర్వహించే పరీక్షల వివరాలు ఉండవు. దీంతో అధికారులు చెప్పే గణాంకాలు అవాస్తవాలయ్యే అవకాశం ఉంది. కాకి లెక్కల్ని కూడా కచ్చితమైనవని నమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అనధికార ల్యాబ్లలో గుర్తిస్తున్న బాధితుల సంఖ్యపై అధికారుల వద్ద ఏ లెక్కా లేదు. అనుమతులు లేనివే ఎక్కువ జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ల రిజిస్ట్రేషన్ల అంశం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అసలు కంటే నకిలీ రెండొందల శాతం ఎక్కువగా కొనసాగుతుండడం అధికారుల నిబద్ధతను ప్రశ్నిస్తోంది. ఏ విభాగం అయినా అసలు కంటే నకిలీ అధికమనే స్థితి ఉండదు. అసలులో ఇన్నో అన్నో నకిలీలు చేరడం చూస్తుంటాం. కానీ ఆశ్చర్యకరంగా అనుమతి పొందిన ల్యాబ్లు జిల్లాలో 116 మాత్రమే ఉంటే అనధికారికంగా కొనసాగుతున్న ల్యాబ్లు 224 ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే జిల్లా వ్యాప్తంగా ఉన్న ల్యాబ్ల సంఖ్య 340. ఇవి కాక మరో 12 దరఖాస్తులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద అనుమతులు పొందేందుకు సిద్ధంగా ఉన్నాయి. కార్పొరేట్ ల్యాబ్ల ఘనకార్యమిదీ.. స్థానిక ల్యాబ్ల నిర్వాకం ఇలా ఉంటే, వైద్య ఆరోగ్య పరీక్షలను కార్పొరేట్ ల్యాబొరేటరీలు శాసిస్తున్నాయి. మెట్రో నగరాల్లో బ్రాంచ్లు పెట్టి స్థానికంగా కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. శాంపిల్ కలెక్టర్ను నియమించి ఆ వ్యక్తి ద్వారా స్థానిక కలెక్షన్ పాయింట్లను నమూనాలను తీసుకు వస్తారు. కొన్ని పరీక్షలు అక్కడే నిర్వహిస్తారు. మరొకొన్నింటిని ఇతర ప్రాంతాలకు పంపిస్తారు. స్థానికంగా నిర్వహించే ఏ కలెక్షన్ పాయింట్కూ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అనుమతులు లేవు. రక్తం, మల మూత్రాలు, కళ్లె, సూదులు, దూదులు ఇలా బయోమెడికల్ వ్యర్థాలను ఏం చేస్తారో అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏమవుతున్నాయో తెలియడం లేదు. పుట్టగొడుగుల్లా మెడికల్ ల్యాబ్లు జిల్లాలో వందల సంఖ్యలో అనధికారికంగా నిర్వహణ వ్యర్థాల నిర్వహణలో అలసత్వం ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదం కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రాణాంతకంగా వేస్టేజీ బయో మెడికల్ వేస్టేజీని సమర్థవంతంగా నిర్వహించకపోతే ప్రజలకు ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. హెపటైటిస్ బి, సి, హెచ్ఐవి, ట్యూబర్క్యులోసిస్, చర్మవ్యాధులు, గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఇన్ఫెక్షన్లు, సెప్సిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఇవి ప్రాణాంతకం. నిర్థిష్ట అనుమతులు పొంది మాత్రమే ల్యాబ్లు నిర్వహించాలి. వాడిన సూదులు, రక్తంతో నిండిన గాజు వస్తువులు, శస్త్రచికిత్స పరికరాలు, పాడైపోయిన మందులు హాని కలిగిస్తాయి. ప్రజలు ఇటువంటి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి. పరీక్షలు చేయించుకునేటప్పుడు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న ల్యాబ్లను మాత్రమే ఎంచుకోవాలి. – డాక్టర్ ఎంపీఆర్ విఠల్, విశ్రాంత సూపరింటెండెంట్, జీజీహెచ్, కాకినాడ రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించాలి ల్యాబ్ రిజిస్ట్రేషన్ల కోసం అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. బయో మెడికల్ వ్యర్థాలను సేకరిస్తున్న సంస్థ ధరలు నియంత్రించాలి. ఈ విషయాన్ని విన్నవిస్తూ ఉన్నతాధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకపోయింది. అనధికారికంగా ల్యాబ్లు నడపడాన్ని సంఘం తరఫున ప్రోత్సహించం. ఈ చర్యలు ప్రజలకు ప్రాణసంకటం. కార్పొరేట్ ల్యాబ్ల కార్యకలాపాలపై పర్యవేక్షణ కొనసాగాలి. పరీక్షల ధరల నియంత్రణకు నిర్థిష్ట విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించి అమలు చేయాలి. – వెంకట్, అధ్యక్షుడు, కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ లేబొరేటరీస్ అసోసియేషన్ -
దళిత సర్పంచ్ను అవమానించారంటూ ఫిర్యాదు
అమలాపురం రూరల్: పేరూరులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదని ఆ గ్రామ సర్పంచ్ దాసరి అరుణాడేవిడ్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళా సర్పంచ్ కావడంతోనే స్థానిక నాయకులు తనకు సమాచారం ఇవ్వలేదని, ప్రోటోకాల్కు విరుద్ధంగా సర్పంచ్ లేకుండా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పింఛన్లు పంపిణీ చేయడం దారుణమని ఆమె శనివారం డీఎల్పీఓ బొజ్జిరాజుకు ఫిర్యాదు చేశారు. ఉప సర్పంచ్ కుడుపూడి సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు చొల్లంగి సుబ్బిరామ్, వాసంశెట్టి శ్రీనివాసరావు, దొంగ ఆంజనేయులు, వార్డు సభ్యుడు అప్పారి లక్ష్మీనారాయణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దాసరి నాగేశ్వరరావు తదితరులు డీఎల్పీఓకు వినతి పత్రం అందించారు. ప్రభుత్వ కార్యక్రమంలో సర్పంచ్ లేకుండా ప్రోటోకాల్కు విరుద్ధంగా ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేయడం సరికాదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు అన్నారు. గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ జగ్గంపేట: కాట్రావులపల్లిలో పోలీసుల తనిఖీల్లో గంజాయితో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తన సిబ్బందితో శనివారం కాట్రావులపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాట్రావులపల్లికి చెందిన కె.లోవరాజు అనే రాజేష్ ఎలియాస్ పటేల్ (37)ను అనుమానంతో అరెస్టు చేశారు. అతని వద్ద 4.38 కిలోల గంజాయి లభ్యమైంది. లోవరాజును పెద్దాపురం కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. -
పోలవరం గట్టుపై కాసుల వేట
● యథేచ్ఛగా చెలరేగిపోతున్న మట్టి మాఫియా ● కలవచర్లలో కాసులు కొట్టేస్తున్న కూటమి నేతలు ● రోజువారీ దందా రూ.25 లక్షల పైమాటే ● పేదల లే అవుట్ పేరుతో ముఖ్య నేత మేత! సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రావెల్ మాఫియా పేట్రేగిపోతోంది. అడ్డూ అదుపూ లేకుండా గ్రావెల్ అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో టీడీపీ, జనసేన నేతలు మూడు టిప్పర్లు.. ఆరు లారీలు అంటూ అక్రమంగా రూ.లక్షలు మింగేస్తున్నారు. కొండలను పిండి చేస్తున్న కూటమి నేతలు చివరకు పోలవరం కాలువను కూడా విడిచిపెట్టడం లేదు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి కాకినాడ జిల్లా తుని మీదుగా విశాఖకు వెళ్తున్న పోలవరం ఎడమ కాలువ గట్లు కూటమి నేతలు కాసులు కురిపిస్తున్నాయి. ఇటు రాజానగరం, అటు జగ్గంపేట, తుని నియోజకవర్గాల పరిధిలో అధికార పార్టీ కీలక నేతలు తెర వెనుక ఉండి ద్వితీయ శ్రేణి నేతలతో ఆ కాలువ గట్టును గుల్ల చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కలవచర్ల, గాదరాడ తదితర ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు స్థానిక జనసేన ముఖ్యనేతకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆ ముఖ్య నేత అండదండలతో అనుచరగణం అడ్డూ అదుపూ లేకుండా గడచిన నాలుగైదు నెలలుగా ఎర్రమట్టి, సుద్దమట్టి దందా నడుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు గోదావరిలో ఇసుకను తోడేళ్ల మాదిరిగా తోడేస్తున్నా వారి దాహం తీరడం లేదు. కలవచర్లలో పోలవరం, పుష్కర కాలువ గట్లను రాత్రీ, పగలు తేడా లేకుండా తవ్వేసి లక్షలు మింగేస్తున్నారు. ఈ రెండు ప్రధాన కాలువలకు ఇరువైపులా 30, 40 అడుగుల ఎత్తున ఉన్న గట్లను ఇష్టారాజ్యంగా తవ్వి, తరలించేసి ఆనక వాటాలు పంచుకుంటున్నారు. భారీ యంత్రాలను వినియోగించి ఎర్ర మట్టి, సుద్దమట్టిని తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లు, నర్సరీలకు విక్రయిస్తున్నారు. గ్రావెల్ రూపంలో ఉన్న ఎర్రమట్టిని నర్సరీలకు తరలిస్తున్నారు. వెలుగుబందలో పేదల కోసం సేకరించిన భూముల మెరక కోసమనే వంకతో పోలవరం కాలువ గట్టును తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. కలవచర్ల నుంచి నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా తవ్వకాలు జరుపుతూ వస్తున్నారు. ఎటువంటి అనుమతీ లేకుండా పోలవరం గట్టు పొడవునా ఏడెనిమిది పొక్లెయిన్లు ఉపయోగించి 50 నుంచి 60 టిప్పర్లతో ఎర్ర గ్రావెల్ను అమ్మేసుకుంటున్నారు. ఒక టిప్పర్ రోజుకు ఆరేడు ట్రిప్పులు వేస్తోంది. ఇలా నిత్యం సుమారు 300 ట్రిప్పులు గ్రావెల్ను తవ్వేస్తున్నారు. టిప్పర్ గ్రావెల్ దూరాన్ని బట్టి రూ.7 వేల నుంచి రూ.8 వేల వంతున విక్రయిస్తున్నారు. ఇలా రోజుకు సుమారు రూ.25 లక్షలు చేతులు మారుతున్నాయి. ఇలా వచ్చిన సొమ్ములో 40 శాతం నియోజకవర్గ జనసేన ముఖ్యనేతకు ముడుపుకట్టి ముట్టచెబుతున్నారని జిల్లా అంతటా కోడై కూస్తోంది. మిగిలిన 50 శాతంలో ఈ వ్యవహారాన్ని చక్కబెడుతున్న శ్రీరాంపురానికి చెందిన ముఖ్యనేత అనుచరుడు, స్థానిక అఽధికారులు సమానంగా వాటాలు వేసుకుంటున్నారని సమాచారం. ఇలా నాలుగైదు నెలలుగా సాగుతున్న దందా జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ దృష్టికి వెళ్లకుండా ఉంటుందా లేక, తెలిసినా పట్టించుకోలేదా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. కలవచర్ల నుంచి ఎర్రమట్టిని నర్సరీలకు ఎక్కువగా తరలిస్తున్నారు. వేమగిరి, కడియం, కడియపులంక, చొప్పెల్ల తదితర ప్రాంతాలలో నర్సరీలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నర్సరీలతో పాటు రాజమహేంద్రవరం రూరల్ కాతేరు, జగ్గంపేట తదితర నియోజకవర్గాల్లోని లే అవుట్లకు ఇక్కడి నుంచి సుద్దమట్టిని తరలించి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఇన్ని నెలలుగా అనుమతి లేకుండా అక్రమంగా తవ్వేస్తున్న విషయం స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పెడచెవిన పెడుతూ వచ్చారు. చివరకు శుక్రవారం రాత్రి కలవచర్ల గ్రామస్తులు ఎదురు తిరగడం, కలెక్టర్ ప్రశాంతి చొరవతో గ్రావెల్ తవ్వకాలు వద్ద టిప్పర్లను సీజ్ చేయడంతో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. కానీ వెలుగుబందలో పేదల ఇళ్ల స్థలాలు మెరక చేసే పని ఆగిపోతుందనే సాకుతో తిరిగి తవ్వకాల కోసం ఉన్నత స్థాయి నుంచి నియోజకవర్గ ముఖ్యనేత ఒత్తిళ్లు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా తామేమైనా తక్కువ తిన్నామా అంటూ జగ్గంపేట, తుని నియోజకవర్గాల్లో తమ్ముళ్లు కూడా ఇదే పోలవరం కాలువ గట్టును తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారిలో కూడా కలవచర్లలో మాదిరిగానే పోలవరం కాలువ గట్టును యథేచ్ఛగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. మురారికి చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు గట్టు తవ్వే బాగోతాన్ని చక్కబెడుతున్నారు. మురారిలో కూడా ఆ పార్టీ ముఖ్యనేతల కనుసన్నల్లోనే ఈ దందా జరుగుతోంది. తుని నియోజకవర్గం వెలమ కొత్తూరు, లోవకొత్తూరుల్లో సైతం పోలవరం ఎడమ కాలువ గట్టుపై ఇదే దందా చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా ఆ పచ్చనేతలు చక్కబెడుతున్నారు. ఆ పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. తమ స్వార్థం కోసం పోలవరం ఎడమ కాలువ గట్లు బలహీన పరుస్తుండటాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగే తవ్వకాలు జరుపుతూ పోతే భవిషత్తులో కాలువలకు గండ్లు పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. -
4న వికాసలో జాబ్మేళా
కాకినాడ సిటీ: కలెక్టరేట్ ఆవరణలోని వికాస కార్యాలయంలో సోమవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పీడీ కె.లచ్చారావు శనివారం తెలిపారు. ఈ జాబ్మేళాలో జేజీఆర్ హాస్పిటల్లో పీఆర్వో, నర్సింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, వెంకీ రెసిడెన్సీ త్రీ స్టార్ హోటల్లో మెయిన్టెనెన్స్ టెక్నీషియన్, కెప్టెన్, ఫ్రంట్ ఆఫీస్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, అసోసియేట్, స్టీవార్ట్స్, రాయల్ ఇన్సూరెన్స్లో టెలికాలర్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, సిస్టమ్ ఆపరేటర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ కంపెనీలో టెలిసేల్స్ రిప్రజెంటేటివ్, వియాష్ లైఫ్ సైన్సెస్, జేకే ఫిన్నర్లో టెక్నీషియన్, ఫాక్స్కాన్ కంపెనీలో ఆపరేటర్, హోండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామో, బీటెక్, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ.35 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అలాగే డీడీయూజీకేవై స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా టూ వీలర్ టెక్నీషియన్, లాజిస్టిక్స్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సోమవారం వికాస కార్యాలయం వద్ద ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరుకావాలని కోరారు. ఉత్సాహంగా జాతీయ జూనియర్ హాకీ పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యాన కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 15వ జాతీయ జూనియర్ బాలికల హాకీ పోటీలు శనివారం ఉత్సాహంగా జరిగాయి. లీగ్ కమ్ నాకౌట్ దశలో జరుగుతున్న ఈ పోటీలలో దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ ఉమ్మడి జట్టుతో జరిగిన మ్యాచ్లో 4–0 స్కోర్తో గోయన్స్ జట్టు, గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మిజోరాం 9–0 స్కోర్తోను, తెలంగాణతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 6–1 స్కోర్తోను విజయం సాధించాయి. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్లో కేరళ 4–2 స్కోర్తో గెలుపొందింది. హిమాచల్ప్రదేశ్, తమిళనాడు మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. అరుణాచల్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 4–2 స్కోర్తో గెలుపొందింది. శనివారం నిర్వహించిన మ్యాచ్లను సీనియర్ పీఈటీ బంగార్రాజు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. టోర్ని కో–ఆర్డినేటర్ వి.రవిరాజు పోటీలను పర్యవేక్షించారు. నకిలీ బంగారంతో రుణం సామర్లకోట: స్థానిక జాతీయ బ్యాంకులో నకిలీ బంగారం తాకట్టు పెట్టి ఒక వ్యక్తి రూ.94 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల బ్యాంకులో బంగారు ఆభరణాల తనిఖీ చేస్తుండగా నకిలీ బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బ్యాంకు అధికారులు శనివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎ.కృష్ణభగవాన్ శనివారం తెలిపారు. ఈ విషయం బయటకు రావడంతో బ్యాంకులలో బంగారం పెట్టిన వారు వారి వస్తువులను విడిపించుకున్నట్లు తెలిసింది. -
మిత్రోత్సాహం..
ఫ సోషల్ మీడియా వేదికగా బలపడుతున్న స్నేహం ఫ మనసుకు ఓదార్పునిస్తున్న బంధం ఫ నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం రాయవరం: స్నేహం.. సృష్టిలో మధురమైంది.. జీవితంలో మరువలేనిది.. ఆత్మీయతను పంచేది.. ఆహ్లాదాన్ని అందించేది.. అక్షరాలకతీతమైన పుస్తకం లాంటిది.. భారమైన హృదయానికి ఓదార్పునిస్తుంది.. కష్టాల్లో ఆసరా అవుతోంది. ఇలా స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే స్నేహమేరా జీవితం..స్నేహమేరా శాశ్వతమని అంటుంటారు. ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకొనేందుకు మిత్రులంతా సిద్ధమవుతున్నారు. సెల్ఫోన్ వినియోగం మనుషుల మధ్య సంబంధాలను మరింత దగ్గర చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత సరికొత్త స్నేహాలు చిగురిస్తున్నాయి. సోషల్ మీడియా సమాచార వ్యాప్తిలో ప్రధాన భాగస్వామిగా నిలుస్తుంది. ఒకప్పుడు ఉత్తరాలు, తదుపరి ఫోన్లో మాట్లాడుకునే స్థాయి నుంచి సోషల్ మీడియా సాయంతో దేశ, విదేశాల్లో ఉంటున్న వారు సైతం వీడియో కాల్స్ ద్వారా సంభాషణలు సాగిస్తున్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, మార్పులు చేర్పులను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపులతో సామాజిక సంబంధాల్లో ఊహించని మార్పు వచ్చింది. 90 శాతం మంది మొబైల్ ఫోన్లలో మై ఫ్యామిలీ, టెనన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పేర్లతో తప్పనిసరిగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఈ గ్రూపుల ద్వారా చిన్ననాటి స్నేహితుల నుంచి ఆఫీసులో కొలీగ్స్ వరకూ అందరూ నిత్యం టచ్లో ఉంటున్నారు. స్నేహితుల దైనందిన జీవితంలో జరిగే మంచి చెడులను ఎప్పటికప్పుడు పంచుకోవడమే కాదు, శుభాకాంక్షలూ చెప్పుకొంటున్నారు. రెండు దశాబ్దాల నుంచి.. రాయవరంలో 2002లో తొలిసారి 1981–82 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు కలిశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా రాయవరంలో కలిసినట్లు చె బుతుంటారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా ప్రచా రం కావడంతో ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులు కూడా పూర్వ విద్యార్థుల సమ్మేళనాలకు నాంది పలికినట్లైంది. అప్పుడు ప్రారంభమైన పూర్వ విద్యార్థుల కలయిక దినదినప్రవర్ధమానమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఏటా సంక్రాంతి సమయాల్లో లేదా, వేసవి సెలవుల్లో, వివిధ సందర్భాల్లో కలుసుకుంటున్నారు. ప్రతి సమాచారం వాట్సాప్లోనే.. పూర్వ విద్యార్థులు పలు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేస్తున్నారు. ఈ గ్రూపుల్లో నిత్యం స్నేహితుల యోగక్షేమాలతో పాటు, గ్రామంలో జరుగుతున్న కార్యకలాపాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. స్నేహితుల కష్టసుఖాలను తెలుసుకుంటూ అవసరమైన మేరకు మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది కదా స్నేహమంటే.. రాయవరం శ్రీరామయ్య జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1989–94 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు 2016 జనవరిలో కలిశారు. తమ బ్యాచ్కు చెందిన నలుగురు స్నేహితుల ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో అంతా కలసి ఆర్థిక సాయం అందించారు. నలుగురు విద్యార్థులకు రూ.5.25 లక్షలు అందజేశారు. అలాగే 2016 నుంచి ఏటా రాయవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15న పూర్వ విద్యార్థులంతా కలుసుకుని, పాఠశాలలో మెరిట్ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకూ రూ.6.50 లక్షలు విద్యార్థులకు అందజేశారు. స్నేహమంటే కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం కాదని, మిత్రులకు, సమాజానికి మంచి చేయాలని నిరూపిస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా చాలామంది స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు. జాగ్రత్తలూ అవసరమే.. సోషల్ మీడియా ఆసరాగా చేసుకుని కొందరు ఫేక్ ఫ్రెండ్షిప్లు చేస్తున్నారు. అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వాట్సాప్, ఇన్స్ర్ట్రాగామ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడుతున్నారు. అపరిచితులు పరిచయాలను పెంచుకుంటున్నారు. పరిచయాన్ని స్నేహంగా మలచుకుంటున్నారు. ఆపై స్నేహాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్కు పాల్పడడం వంటి ఘటనలు చూస్తున్నాం. సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ పట్ల యువత, ముఖ్యంగా బాలికలు, మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ మొదటికే మోసం తెస్తుండడంతో అపరిచితులతో ఆచితూచి స్నేహం చేయాల్సిన అవసరం కూడా ప్రస్తుత కాలంలో ఉంది. ఇదిలాఉంటే మార్కెట్లో ఫ్రెండ్షిప్ బ్యాండ్ల అమ్మకాలు విరివిగా జరుగుతున్నాయి. -
అగ్గి... సర్వం బుగ్గి
ఫ చినశంకర్లపూడిలో అగ్ని ప్రమాదం ఫ ఆరు తాటాకిళ్లు భష్మీపటలం ప్రత్తిపాడు: ఊరంతా నిశ్శబ్దం.. అందరూ నిద్రలోకి జారుకున్నారు.. ఇంతలో ఒళ్లంతా వేడి సెగలు.. తుల్లిపడిన ఆ కుటుంబాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశాయి.. తేరుకునేలోపే ఆరు తాటాకిళ్లు కాలిపోయాయి. సర్వం బుగ్లి అయ్యింది. ఆ పేద కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడిలో శనివారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం ఆరు కుటుంబాలను నిరాశ్రయులను చేసింది. విద్యుత్ షార్ట్షర్క్యూట్ కారణంగా ముంచుకొచ్చిన ముప్పు ఇళ్లను బూడిద చేసింది. చినశంకర్లపూడి హరిజన కాలనీలో బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ కుటుంబాలు తాటాకిళ్లలో జీవిస్తున్నారు. వీరంతా వ్యవసాయ కూలీలే. ఒక్కసారిగా అగ్నికీలలు ఊరంతా గాఢ నిద్రలో ఉండగా శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల సమయంలో బుర్రి మరిడమ్మ తాటాకింటికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. తేరుకునే లోగా మంటలు ఒక్కొక్క ఇంటికి వ్యాపించాయి. ఇళ్లలోని వారంతా బయటకు పరుగులు తీశారు. ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి చొప్పున మానూరి రాజబాబు, ముతకల నాగేశ్వరరావు, పిరాటి అచ్చారావు, పిరాటి అప్పారావు, పులగపూరి సత్యనారాయణ ఇళ్లకు మంటలు వ్యాపించాయి. బుర్రి మరిడమ్మ, మానూరి రాజబాబు, పిరాటి అచ్చారావు ఇళ్లలో వేడిమికి గ్యాస్ సిలెండర్లు పేలిపోవడంతో మంటలు క్షణాల్లోనే ఆరు తాటాకిళ్లను భష్మీపటలం చేశాయి. ప్రమాదవార్త తెలిసిన వెంటనే ప్రత్తిపాడు అగ్నిమాపక కేంద్రం ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ కె.రాముడు, లీడింగ్ ఫైర్మెన్ కేఎస్ఎన్ మూర్తి తమ సిబ్బందితో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా సుమారు రూ.ఎనిమిది లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ రాముడు తెలిపారు. బాధితులంతా నిరుపేదలే.. ఒంటరి మహిళ బుర్రి మరిడమ్మ ఒక ఇంట్లో ఉంటుండగా, చదువుకుంటున్న ముగ్గురు పిల్లలు, భార్యతో కలసి మానూరి రాజబాబు ఒక ఇంట్లో, భార్య నాగమణితో కలసి ముతకల నాగేశ్వరరావు, భార్యతో కలసి పిరాటి అచ్చారావు, భార్య కుమారుడితో కలసి పిరాటి అప్పారావు, ఒంటరిగా పులగపూరి సత్యనారాయణలు మరో ఇంట్లో జీవిస్తున్నారు. అగ్ని ప్రమాదంలో ఇంట్లో సమస్తం కాలి బూడిద కావడంతో బాధితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సందర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, వంట సామగ్రి పంపిణీ చేశారు. -
చెప్పుల దుకాణంలో అగ్ని ప్రమాదం
రూ.16 లక్షల ఆస్తి నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక శ్యామలా సెంటర్ వద్ద చెప్పుల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేడియం రోడ్డు నుంచి కోటిపల్లి బస్టాండ్కు మలుపు తిరిగే ప్రాంతంలో ఆనుకుని ఫ్యాక్టరీ ఫుట్వేర్ సేల్ అనే పేరుతో హైదరాబాద్కు చెందిన షేక్ మొహియుద్దీన్, ఆర్ఎస్ దత్తు ఈ చెప్పుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఉదయం 6.40 గంటలకు ఆ దుకాణంలోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి ఫోన్ చేశారు. ప్రమాదానికి దగ్గరలోనే అగ్నిమాపక కార్యాలయం ఉండడంతో వెంటనే ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్, సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. నగరంలోని ఆర్యాపురం, ఇన్నీసుపేట అగ్నిమాపక యంత్రాలతో పాటు కొవ్వూరు నుంచి మరో వాహనాన్ని రప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో చెప్పుల దుకాణానికి ఆనుకుని ఉన్న బాలాజీ అక్వేరియం, పెట్స్ దుకాణం అగ్ని ప్రమాదానికి గురైంది. సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ అంచనా వేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తెలిపారు. జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి సీహెచ్ మార్టిన్రూథర్ కింగ్ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. మంటలను చాకచక్యంగా అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని ఆయన అభినందించారు. -
నీటి వనరుల సంరక్షణకు పటిష్ట చర్యలు
● జేసీ రాహుల్ మీనా ● వివిధ శాఖల అధికారులతో సమీక్ష కాకినాడ సిటీ: జిల్లాలో కబ్జాకు గురైన వివిధ శాఖలకు చెందిన నీటి వనరుల ఆక్రమణలను తొలగించి జల వ్యవస్థల పటిష్టతకు సమష్టి చర్యలు చేపట్టాలని జేసీ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కోర్టు హాలులో చెరువులు, కాలువలు, డ్రైన్లు, వాగులు తదితర నీటి వనరుల సంరక్షణపై జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాగునీటి వనరుల ఆక్రమణలు, వాటివల్ల ఎదురయ్యే సమస్యల నివారణకు సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. మే నెలలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సూచనల మేరకు రికార్డుల ప్రకారం జిల్లాలో మొత్తం 21,185.95 ఎకరాల విస్తీర్ణంలో 2670 నీటి వనరులు ఉండగా 327 వనరులకు సంబంధించి 1,548 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైనట్లు గుర్తించగా, ఇప్పటి వరకూ 2.49 ఎకరాలలోని ఆక్రమణలను తొలగించామని, మిగిలిన వాటి తొలగింపులకు చర్యలను ముమ్మరం చేయాలని జేసీ ఆదేశించారు. సోమవారం నాటికి డివిజన్ స్థాయిలోను, 15వ తేదీలోపు డివిజన్ స్థాయిలో రక్షణ కమిటీల సమావేశాలు జరిపి సర్వే నిర్వహణకు షెడ్యూల్ను సమర్పించాలని ఆదేశించారు. రానున్న నెల రోజుల్లో సర్వేలు పూర్తి చేసి వాటి విస్తీర్ణం, హద్దులను, ఏ శాఖకు చెందినవో వివరాలు ప్రకటిస్తూ అన్ని వనరుల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో జె.వెంకటరావు, డీపీవో వి.రవికుమార్, పెద్దాపురం ఆర్డీవో కె.శ్రీరమణి, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు, కాలుష్య నియంత్రణ మండలి తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
రత్నగిరి కిటకిట
సత్యదేవుని దర్శనానికి 30 వేల మంది అన్నవరం: రత్నగిరి శనివారం వేల సంఖ్యలో వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. ఆలయప్రాంగణం, వ్రతమండపాలు, విశ్రాంత మండపాలు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షలు ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తూర్పు రాజగోపురం వద్దకు తీసుకువచ్చి తిరుచ్చి వాహనంపై ప్రాకార సేవ నిర్వహించారు. కాగా, రత్నగిరి ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగించనున్నారు. ఫోన్లు భద్రపరిచేందుకు రికార్డుస్థాయిలో వేలం రత్నగిరికి వచ్చే భక్తుల సెల్ఫోన్లు, కెమేరాలు భద్రపరచేందుకు శనివారం నిర్వహించిన టెండర్ కం బహిరంగ వేలంపాట నెలకు రూ.8.11 లక్షలు చొప్పున ఏడాదికి రూ.97.32 లక్షలకు రికార్డు స్థాయిలో ఖరారైంది. సెల్ఫోన్ భద్రపర్చడానికి ఇప్పటి వరకు రూ.ఐదు మాత్రమే వసూలు చేయాలనే నిబంధన ఉండగా దానిని రూ.పదికి పెంచడంతో వేలంపాట భారీగా పెరిగింది. రూ.ఐదు వసూలుకు రెండేళ్ల క్రితం వేలం పాట నిర్వహించగా నెలకు రూ.3.31 లక్షలకు ఖరారైంది. కాగా ఆ వసూలు రూ.పది పెంచగా వేలం రెట్టింపు అంటే రూ.6.62 లక్షలు కావాలి. కానీ అంతకంటే ఎక్కువ మరో రూ.1.49 లక్షలు పెరిగింది. ఇలా ఏడాదికి ఖరారైన వేలం రూ.97.32 లక్షలపై 18 శాతం జీఎస్టీ కూడా వసూలు చేస్తారు. అంటే దాదాపు రూ.17.46 లక్షలు జీఎస్టీ చెల్లించాలి. అంటే ఏడాదికి సుమారు రూ.1.15 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రెండో ఏడాది పదిశాతం పాట సొమ్ము పెంచాలి. దానిపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సెల్ఫోన్లు భద్రపరచడానికి రూ.ఐదు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా రూ.పది వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పాటదారులు అధికార పార్టీ వ్యక్తులు కావడంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీంతో మిగిలిన పాటదారులు సెల్ఫోన్ భద్రపరిచేందుకు అన్ని దేవస్థానాలలో రూ.పది వసూలు చేస్తున్నారని, ఇక్కడ కూడా రూ.పది వసూలు చేసేలా వేలం నిర్వహించాలని వినతిపత్రం ఇచ్చారు. దాంతో ఆ మేరకు వేలం నిర్వహించారు. మరో నాలుగు అంశాలపై వేలంపాట వాయిదా వేశారు. వేలంపాటలో ఏఈఓ ఎల్.శ్రీనివాస్, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. -
స్కూల్లో క్షుద్రపూజలు?.. వారి పనేనా?
కాకినాడ జిల్లా(సామర్లకోట): స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ హైస్కూల్లో క్షుద్రపూజలు జరిగినట్లు జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చే సమయానికి పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి నిమ్మకాయలు, పసుపు, కుంకుమతో పూజలు చేసిన విషయాన్ని గుర్తించారు. దాంతో అప్పటికే పాఠశాలకు వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈ రోజు పాఠశాల లేదు అంటూ ఇళ్లకు వెళ్లి పోవడం ప్రారంభించారు. దాంతో విషయాన్ని గమనించిన సైన్సు ఉపాధ్యాయురాలు ఏఎల్వీ కుమారి ఆవరణలో ఉన్న నిమ్మకాయలను తీసి వేసి ముగ్గులను చెరిపించారు.విద్యార్థులను క్లాసు రూములకు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. హెచ్ఎం కె.శ్రీదేవి వచ్చిన తరువాత విషయం తెలుసుకొని ఎదురుగా షాపులో ఉన్న సీసీ కెమెరాలో గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దృశ్యాలను పరిశీలించారు. ఆ దృశ్యాలలో పాఠశాల ఆవరణలోకి ఎవరూ వచ్చినట్లు కనిపించలేదు. దాంతో ఉపాధ్యాయులు ఉపిరి పీల్చుకున్నారు.ఈ మేరకు పాఠశాల హెచ్ఎం శ్రీదేవి మాట్లాడుతూ పాఠశాలలోని ఆకతాయి విద్యార్థులు చేసిన పనిగా అనుమానం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం సమయంలో విద్యార్థులు ఈ పని చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యార్థులకు సీఐ ఎ కృష్ణ భగవాన్తో కౌన్సెలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఉండటానికి ఇటువంటి పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పాఠశాలలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హెచ్ఎం తెలిపారు. -
ట్యూబెక్టమీ చేస్తే ప్రాణాలు పోయాయి
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో ట్యూబెక్టమీ (కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్స) చేయించుకున్న ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళితే, కాకినాడ జగన్నాథపురానికి చెందిన పలపాల సుధారాణి(21)ని సోమవారం కుటుంబ సభ్యులు కాకినాడ జీజీహెచ్లో చేర్చారు. మంగళవారం ఆమెకు ట్యూబెక్టమీ నిర్వహించారు. అనంతరం ఆమెను జీఐసీయూకి తరలించారు. ఆ సమయంలో పల్మనరీ ఎడీమా సంభవించి ఉదరం నుంచి పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి చేరాయి. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై అనుసంధానం చేశారు. రెండు రోజుల పాటు వైద్యులు ఆమెను రక్షించేందుకు శ్రమించగా శుక్రవారం ఉదయం 6.53 సమయానికి కార్డియాక్ అరెస్ట్ సంభవించి ప్రాణాలు కోల్పోయింది. కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం వల్లే సుధారాణి ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబీకులు ఆరోపించారు.కూతురికి పేరు పెట్టకుండానే...సుధారాణికి దుర్గాప్రసాద్తో 2017లో వివాహం అయింది. దుర్గాప్రసాద్ కార్పెంటర్ కాగా అతడికి చేదోడు వాదోడుగా సుధారాణి పలుచోట్ల పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకురావడంతో తోడుగా నిలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. ఐదేళ్ల బాబు వీర లోకేష్ కాగా, నెలన్నర క్రితం పుట్టిన కుమార్తెకు కనీసం పేరు కూడా పెట్టలేదు. తన కుమార్తెకు మంచి పేరు పెట్టాలని సుధారాణి అందరినీ అడిగిందని, మంచి పేరు సూచించాలని కోరిందని, పండంటి బిడ్డకి పేరు పెట్టకుండానే ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరణం వివాదాస్పదమైన తరుణంలో వాస్తవాలను వెలికి తీసేందుకు త్రి సభ్య కమిటీని నియమించారు. సర్జరీ హెచ్వోడీ డాక్టర్ పి.నరేష్కుమార్, పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సుజీవ స్వప్న, ఫోరెన్సిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పి.రాజేష్కుమార్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. సుధారాణి మృతదేహానికి శుక్రవారం పోస్ట్మార్టం నిర్వహించారు. అంతకుముందు జీఐసీయూలో సుధారాణి మృతదేహాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, డీసీఎస్ఆర్ఎంవో డాక్టర్ మెహర్ పరిశీలించారు. -
ఆ రూ.7 వేలు ఏ మూలకు?
ఖరీఫ్లో పంటలు పండించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వనున్న రూ.7 వేలు ఏ మూలకు సరిపోతాయో అర్థం కావడం లేదు. ఈ సొమ్ముతో 3 డీఏపీ బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరుతుందనే నమ్మకం చిక్కడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్లో పెట్టుబడి కోసం రైతులు నానా పాట్లూ పడుతున్నారు. – ఇంటి రమేష్, వీకే రాయపురం, సామర్లకోట మండలం రెండు విడతల్లో ఇస్తే ప్రయోజనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు కష్టంగా మారుతోంది. పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దమ్ములు, నాట్లు, కూలి రేట్లు, ఎరువుల ధరలు ఇలా అన్నీ ఇదివరకటి కంటే పెరిగిపోయాయి. అన్నదాత సుఖీభవలో ప్రభుత్వ వాటాను రెండు విడతలుగా ఇవ్వాలి. తొలి విడతగా రూ.10,000 ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. – తుమ్మలపల్లి సత్తిరాజు (చంటిబాబు), రైతు, పండూరు, కాకినాడ రూరల్ -
హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలి
కాకినాడ సిటీ/జగ్గంపేట: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలు సంక్షోభంలో కూరుకుపోయాయని, సంక్షేమం పూర్తిగా కొరవడి సమస్యల వలయంలో చిక్కి విలవిలలాడుతున్నాయని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరి నాని అన్నారు. విద్యార్థి సంఘం నాయకులతో కలసి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) జె.వెంకటరావుకు శుక్రవారం కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో నాలుగు రోజుల పాటు విస్తృతంగా నిర్వహించిన సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో నిరుపేద ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్నారు. నిధుల కొరత కారణంగా ఎక్కడా మెనూ సక్రమంగా అమలు జరగడం లేదన్నారు. పారిశుధ్యం క్షీణించిందని, నేలపై నిద్ర, దోమల స్వైరవిహారం సర్వసాధారణంగా మారాయన్నారు. నేటికీ దుప్పట్లు, దోమ తెరలు పంపిణీ చేయలేదన్నారు. పురుగుల బియ్యంతో వండిన ఉడికీ ఉడకని అన్నం, కుళ్లిపోయిన కూరగాయలతో పెడుతున్న ఆహారం తింటున్న విద్యార్థులు విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కాస్మెటిక్ చార్జీలు అందక విద్యార్థుల ఇక్కట్లు రెట్టింపయ్యాన్నారు. ప్రతి రోజూ ఇవ్వాల్సిన గుడ్లు, వేరుశనగ చిక్కీతో పాటు వారానికి రెండుసార్లు చికెన్ సైతం సరిగా అందడం లేదని చెప్పారు. అవసరమైనన్ని స్నానపు గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. మౌలిక వసతులు లేక చదువుపై శ్రద్ధ చూపలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం మౌలిక వసతులు కల్పించాలని, మెస్ బిల్లులు, కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయాలని, కేజీబీవీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ చేయాలని, విద్యాశాఖ అధికారులు వారంలో ఒక రోజు ప్రభుత్వ హాస్టళ్లలో నిద్ర చేయాలని నాని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరి నాని, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్వెస్లీ, విద్యార్థి విభాగం నియోజకవర్గ, మండల అధ్యక్షులు నకిరెడ్డి సుధాకర్, మండపాక రవికుమార్, పార్టీ మండల, జగ్గంపేట టౌన్ అధ్యక్షులు రావుల గణేష్ రాజా, కాపవరపు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్పై అవగాహన కల్పించాలి
కాకినాడ లీగల్: ఆస్తి రిజిస్ట్రేషన్తో పాటు వెంటనే ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ చేసే ప్రక్రియపై ప్రజల కు విస్తతంగా అవగాహన కల్పించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్ర ఐజీ, జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. ఆటోమ్యుటేషన్ విధానం అమలును తొలి రోజైన శుక్రవారం కాకినాడ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆయన పరిశీలించారు. ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ జరుగుతున్న తీరు, సమస్యలపై ఉద్యోగులను అడిగి తెలు సుకున్నారు. రెవెన్యూ వసూలు రికార్డులను పరిశీలించారు. రోజువారీ జరుగుతున్న రిజిస్ట్రేషన్ల సంఖ్య, రిజిస్ట్రేషన్ల పురోగతిపై ఆరా తీశారు. జిల్లా రిజిస్ట్రార్ జేఎస్యూ జయలక్ష్మిని వివరాలడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం సేవలపై కక్షిదారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ, ఆటోమ్యుటేషన్ ప్రక్రియపై ప్రజలకు అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, బ్రోచర్లు ముద్రించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలని సూచించారు. రోజువారీ రిజిస్ట్రేషన్ల సంఖ్య పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, ట్రైనీ కలెక్టర్ మనీషా, జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు–1, 2 ఆర్వీ రామారావు, ఎస్వీఎస్ఎస్ వీరభద్రరావు పాల్గొన్నారు. తొలి రోజే ఇబ్బందులు ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ ద్వారా కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలి రోజే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత కార్పొరేషన్, మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను ఆటోమ్యుటేషన్ విధానంలో సమస్యలు రావడంతో క్రయవిక్రయదారులు ఇబ్బందులు పడ్డారు. కాకినాడ, సర్పవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆటోమ్యుటేషన్ ద్వారా తొలి రోజు చెరొక డాక్యుమెంట్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి. -
ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
సామర్లకోట: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. ఆలయంలో ఏటా శ్రావణ శుక్రవారాల్లో సామూహిక వరలక్ష్మీ వత్రాలు నిర్వహిస్తూంటారు. దీనిలో భాగంగా ఈసారి రెండు, నాలుగు శ్రావణ శుక్రవారాల్లో మహిళలు సామూహిక వ్రతాలు చేసుకునేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. వ్రతాల్లో పాల్గొనే మహిళలు బియ్యం, కలశం, జాకెట్టు ముక్క తీసుకుని రాగా.. వ్రతాలకు కావలసిన వరలక్ష్మీ రూపు, ఫొటో, తోరాలు, గాజులు, పువ్వులు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, ప్లేటు, ప్రమిదలు, ఒత్తులు, నూనెను దాతలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సహకారంతో భక్తులకు ప్రసాదం అందజేశారు. సామూహిక వ్రతాలకు వచ్చిన మహిళలతో ఆలయం మొదటి అంతస్తు, దిగువన ఉన్న ఉపాలయాల ప్రాకారాలు నిండిపోయాయి. అధికారులు ఊహించని విధంగా సుమారు వెయ్యి మంది మహిళలు సామూహిక వ్రతాలు ఆచరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు లక్ష్మీదేవి చిత్రపటం వద్ద పూజలు చేసి వ్రతాలను ప్రారంభించారు. మంత్రాలు, పూజా విధానం, వ్రత కథ అందరికీ స్పష్టంగా వినిపించేలా మైకులు ఏర్పాటు చేశారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. భక్తులకు భక్త సంఘం నాయకులు, ఆలయ సూపరింటెండెంట్ ఈశ్వరరావు సేవలందించారు. ఈ నెల 15న నాలుగో శుక్రవారంతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ముగుస్తాయని ఈఓ నీలకంఠం తెలిపారు. పాల్గొనదలచిన భక్తులు ఉదయం 9 గంటలకే ఆలయంలో ఉండాలని సూచించారు. -
బాలల సంక్షేమం, సంరక్షణే ధ్యేయం
జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీనివాసరావు తుని రూరల్: బాలల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, వారి సంరక్షణే ధ్యేయం కావాలని జిల్లా బాలల రక్షణ అధికారి కె.శ్రీనివాసరావు అన్నారు. గురువారం తుని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ కె.శ్రీలత అధ్యక్షతన తుని, కోటనందూరు మండలాలకు చెందిన గ్రామస్థాయి బాలల సంక్షేమ, మండలస్థాయి పరిరక్షణ కమిటీల శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల రక్షణ, హక్కుల రక్షణకు కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలను అడ్డుకోవాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికే వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని, బాల్య వివాహాలు చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తే సచివాలయ అడ్మిన్, కార్యదర్హులు కఠిన చర్యలకు గురవుతారన్నారు. అత్యవసరమైతే చైల్డ్ హెల్ప్లైన్ 1098కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. దత్తత ప్రక్రియపై పిల్లలు లేని తల్లిదండ్రులకు వివరించి, శిశుగృహాల గురించి చెప్పాలన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, అనారోగ్యాలను తెలియజేయాలన్నారు. బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, పోక్సో చట్టాలపై శిక్షణలో వివరించారు. చైల్డ్ హెల్ప్లైన్ కో ఆర్డినేటర్ బి.శ్రీనివాసరావు, ఏసీడీపీఓ కె.శ్రీకళ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, వార్డు మహిళా సంరక్షణ కాక్యదర్శులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది శిక్షణలో పాల్గొన్నారు. శ్రీవారి ఆలయానికి ముడి వెండి విరాళం రాయవరం: మండల కేంద్రమైన రాయవరంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి గురువారం దాతలు ముడి వెండిని విరాళంగా అందజేశారు. గ్రామానికి చెందిన దుర్గపు వెంకన్నబాబు, సత్యరత్నభవాని దంపతులు, కుటుంబ సభ్యులు కలసి రూ.1.01 లక్షల విలువైన ముడి వెండిని మకర తోరణం తయారీ కోసం సమర్పించారు. వారిని గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ వుండవిల్లి రాంబాబు, స్థానిక నేతలు వల్లూరి శ్రీనివాస చౌదరి, పులగం శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు అభినందించారు. ముక్కోటి ఏకాదశి సమయానికి మకర తోరణం సిద్ధం చేసేందుకు ఆలయ కమిటీ ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. -
రత్నగిరి విశ్రాంత ఈఓ పెన్షన్లో 25 శాతం కోత
● 1998–99లో అక్రమ కొనుగోళ్లపై అభియోగాలు ● విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించిన ఏసీబీ ● ట్రిబ్యునల్ తీర్పుతో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయంలో గతంలో ఈఓగా పని చేసిన ఎన్.సోమశేఖర్ అవినీతికి పాల్పడినట్టు వచ్చిన అభియోగాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయన పెన్షన్లో 25 శాతం కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వి.వినయ్చంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 1998–99 కాలంలో ఆయన ఈఓగా ఉన్న కాలంలో టెండర్ పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా సత్యదేవుని వెండి స్టాండ్లు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసినట్టు, మరో 17 అంశాలలో అవినీతికి పాల్పడినట్టు ఆయనపై, మరో 53 మంది సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఆయన చర్యల వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని, ఆయనపై చర్య తీసుకోవాలని 2018లో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ట్రిబ్యునల్ షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఆయన పెన్షన్లో 25 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలపై సోమశేఖర్ బదులిస్తూ దేవస్థానంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న విధానం మేరకే తాను వాటిని కొనుగోలు చేశానని, వాటిని దేవదాయశాఖ కమిషనర్ సైతం ఆమోదించారని పేర్కొన్నారు. ఆ చర్యల వల్ల ఆలయానికి ఆర్థిక నష్టం జరగలేదని పేర్కొన్నారు. తాను 2013లో పదవీ విరమణ చేశానని, ఈ అభియోగాల వల్ల తన పెన్షన్ ప్రయోజనాలు పూర్తిగా అందడం లేదని, తనపై అభియోగాలు తొలగించి పూర్తి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పెన్షన్లో 25 శాతం కోత విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఈ అభియోగాలపై జరిగిన విచారణలో 31 మంది సిబ్బందికి క్లీన్చిట్ ఇవ్వగా, మిగిలిన 22 మందిపై విచారణ కొనసాగుతున్నట్లు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. -
స్మార్త ఆగమ విద్యార్థులకు అస్వస్థత
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతతగ్గుతున్న వరద గోదారి ఐ.పోలవరం: గోదావరి క్రమేపీ శాంతిస్తోంది. వరద నెమ్మది నెమ్మదిగా తగ్గుతోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద జలాల రాక తగ్గుతోంది. దీనితో బుధవారం ఉదయం ఆరు గంటల సమయానికి దిగువునకు 5,86,477 క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం ఆరు గంటల సమయానికి 5,14,177 క్యూసెక్కులకు తగ్గింది. గురువారం ఉదయం ఆరు గంటల ప్రాంతానికి 4,71,927 క్యూసెక్కులకు వరద తగ్గింది. అయితే బ్యారేజీ వద్ద ఉధృతి తగ్గినా దిగువున లంక గ్రామాలను వరద వీడలేదు. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి, పి.గన్నవరం అక్విడెక్టులను తాకుతూ ఇంకా వరద నీరు ప్రవహిస్తోంది. గోదావరికి జూలై నెలలో రెండవ సారి వచ్చిన వరద కూడా స్వల్పంగానే ప్రభావం చూపించడంతో లంక వాసులు ఊపిరిపీల్చుకున్నారు. సగటున పది మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 10 మిల్లీమీటర్లు వర్షం పడగా, అత్యధికంగా పి.గన్నవరం మండలంలో 36.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా మలికిపురం మండలంలో ఒక మిల్లీమీటర్ కురిసింది. అంబాజీపేటలో 30.8, అమలాపురంలో 25.2, ముమ్మిడివరంలో 20.4, ఐ.పోలవరంలో 16.4, మామిడికుదురులో 16.2, అల్లవరంలో 12.8, ఉప్పలగుప్తంలో 11.8, రాజోలులో 10, అయినవిల్లిలో 9.6, కాట్రేనికోనలో 9.2, మండపేటలో 6.2, కొత్తపేటలో 5, కె.గంగవరంలో 4.2, ఆత్రేయపురంలో 3.6 మిల్లీ మీటర్లు నమోదైంది.● తుని ప్రభుత్వ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స ● నిలకడగా విద్యార్థుల ఆరోగ్యం : డీఎంహెచ్ఓ అన్నవరం: సత్యగిరిపై నిర్వహిస్తున్న సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాల విద్యార్థులు ఎనిమిది మంది గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని రాత్రి తుని ప్రభుత్వాస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కొండదిగువన ఆరెంపూడి సత్రంలో దత్తపీఠం ఆధ్వర్యంలో జరిగిన యాగంలో వారు నాలుగు రోజులుగా పాల్గొని అక్కడే భోజనాలు చేశారు. వారిలో స్వరూప్, సత్యయశ్వంత్, సాయి స్వరూప్, సుధాకర్, ఫణీంద్ర కుమార్, కార్తిక్, సాయి గణేష్, సాత్విక్లకు బుధవారం నుంచి వాంతులు, విరేచనాలు అవుతుండడంతో స్థానిక దేవస్థానం ఆసుపత్రిలో వైద్యం అందించారు. గురువారం పరిస్థితి విషమించడంతో వారిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న డీఎంహెచ్ఓ నర్శింహనాయక్ విద్యార్థులను పరామర్శించి అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన అవసరం లేదన్నారు. దేవస్థానం ఏఈఓ పెండ్యాల భాస్కర్ ఆసుపత్రిలోనే ఉండి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.రాజమహేంద్రవరం రూరల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర్దేశిత భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంకు అధికారులు, సెక్యూరిటీఅధికారులతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి పి.పి.టి. ద్వారా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వివరించి సూచనలు చేశారు. బ్యాంకు విధుల్లో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ భద్రతా సిబ్బందికి ముందుగా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద 24 గంటలూ పనిచేసే నైట్ విజన్ ఏఈ సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు కాల్ చేసే సౌకర్యంతో కూడిన భద్రతా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ, ఫైర్ సెక్యూరిటీ పరికరాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. విడిగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది పోలీసు సిబ్బందితో సంబంధాలు ఏర్పరుచుకోవాలని, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి వీలుగా పోలీసు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సర్వెలెనన్స్ రిపోర్టును సంబంధిత స్టేషన్కు విధిగా పంపాలన్నారు. -
పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర
బోట్క్లబ్ (కాకినాడసిటీ): పవిత్ర క్షేత్ర సందర్శనలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్టు ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. యాత్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు. ఈ యాత్ర పదిహేను రోజులు సాగుతుందన్నారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ‘టూర్ టైమ్స్’ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిద్ధపూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శించుకునే వీలుంటుందన్నారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకి విశేష స్పందన లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు. ఈ రైలు లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. లగేజీ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. టికెట్ ధరలు థర్డ్ ఏసీ రూ.45,750, సెకెండ ఏసీ రూ.54,100, ఫస్ట్ ఏసీ రూ.69500 ఉంటాయన్నారు. అనంతరం యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్ర టికెట్లను 93550 21516 నంబర్కు ఫోన్చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేశ్ పాల్గొన్నారు. -
నేడు పింఛన్ల పంపిణీ
కాకినాడ సిటీ: జిల్లాలో ఈ నెల ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల, మున్సిపల్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ నేపథ్యంలో 2,73,065 మందికి రూ.118.27 కోట్లు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో అదనంగా మరో 4,763 మందికి స్పౌజ్ పింఛన్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులకు అన్నదాత సుఖీభవ జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం అమలుపై గురువారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుంచి అన్ని మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 2వ తేదీన అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ కింద జిల్లాలో 1.48 లక్షల మంది రైతులకు రూ.98.8 కోట్లు అందించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.7 వేలు అర్హులైన రైతులకు అందిస్తోందన్నారు. అర్హుడైన చివరి రైతు వరకు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం వర్తింప చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్ విజయకుమార్, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. కడియం నర్సరీ అందాలు అద్భుతంకడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ప్రభుత్వ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పాటిస్తూ నర్సరీలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ హెచ్ ఓ డైరెక్టర్ బి.గోవిందరాజు, కొవ్వూరు పరిశోధన క్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లలిత కుమారేశ్వరి, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ వి శివకుమార్, ఏపీఎంఐపి పిడి ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, కడియం ఉద్యాన శాఖ అధికారి పి.లావణ్య పాల్గొన్నారు. జర్మనీ భాషలో ఉచిత శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఎస్సీ,ఎస్టీ కులాలకు చెందిన నర్సింగ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయి కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించటానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత శాఖ అధికారి ఎమ్.డి. గవాజుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు 35 సంవత్సరములు లోపు ఉండాలన్నారు. బీఎన్ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ కోర్సు గాని చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన విద్యార్ధులకు 8 నుంచి 10 నెలల వరకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో మాత్రమే ఇస్తారన్నారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్లు 99488 68862, 83400 94688 లలో సంప్రదించాలన్నారు. పింఛన్ల పేరిట వంచన రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వం మాటలకు చేతలకు పొంతన ఉండదని మరోసారి తేలింది. కూటమి హామీలతో మోసపోయిన జాబితాలో తాజాగా వితంతువులు కూడా చేరారు. భర్త మరణిస్తే భార్యకు ఇవ్వాల్సిన పెన్షన్ను కూడా ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా 3,801 మందికి స్పౌజ్పెన్షన్ రెండు నెలలు కింద మంజూరైందంటూ తెలిపి ఈ ఏడాది జూన్ 12వ తేదీన పెన్షన్ ఇస్తామని నమ్మబలికారు. తాజాగా మరోసారి పెన్షన్ ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నామంటూ ప్రచారార్భాటానికి దిగారు. అర్హులని తేలినప్పటికీ 3,801 మందికి నెలకు రూ.1.52 కోట్ల చొప్పున రెండు నెలలకి రూ.3.04 కోట్లు ఎగ్గొట్టింది. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళలను ప్రభుత్వం తరఫున వీలైనంత త్వరగా ఆదుకోవాల్సి పోయి ఇలా ఆలస్యం చేసి వారిని వంచించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఉచితం.. బుసు్స!
ఉమ్మడి జిల్లాలో మాత్రమే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ కేటాయించిన బస్సుల్లో మాత్రమే మహిళలు ప్రయాణించాల్సి ఉంటుందంటున్నారు. జిల్లా దాటితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అదీ కూడా రోజుకు ఒకసారి మాత్రమే ఓ మహిళ ప్రయాణం చేయడానికి వీలుంటుందని ఆ శాఖ అధికాకారులు పేర్కొంటున్నారు. ఆదాయం రాని మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు ఇప్పటికే రద్దు కాగా మరికొన్ని ఎత్తివేసే పరిస్థితి కనిపిస్తోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే సుమారు 200 మార్గాల్లో పల్లెవెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న సర్వీసులను ఉచిత బస్సు పథకానికి వినియోగిస్తే జిల్లాలోని ఏ గ్రామీణ ప్రాంతానికీ పల్లె వెలుగు సర్వీసులు నడిచే పరిస్థితులు ఉండవని అంటున్నారు. ఏదైనా పథకం ప్రారంభిస్తున్నాం అంటే ఇంకెవరైనా నమ్ముతారేమో కానీ.. చంద్రబాబు అంటే మాత్రం నమ్మరు. తీసివేతలు, భాగహారాలు లేకుండా ఆయన పథకాలు ఏవీ వర్తింపజేయరని, అవన్నీ పోగా నామమాత్రపు లబ్ధిదారులు మిగులుతారని.. ఆ మిగిలించుకోవడంలో ఆయన సిద్ధహస్తులని పలువురు విశ్లేషకుల అభిప్రాయం. ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో ఉచిత బస్సు పథకం కూడా అలాంటిదే. పల్లె ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని.. వారి జీవన విధానాల్లో మార్పులు రావాలని ప్రయాణ సమస్యలు తీర్చాలని ఏర్పాటు చేసిన పల్లె వెలుగు బస్సుల లక్ష్యాన్ని నీరుగార్చేసింది చాలక.. అరిగిపోయిన.. మరమ్మతులకు నోచుకోని ఈసురోమంటూ నడిచే ఆ వాహనాలను మహిళలకు ఉచిత బస్సు పథకానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. ప్రతి శివారు పల్లెకు బస్సు సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆ బస్సులను ఇప్పటికే చాలా వరకు ఆక్యుపెన్సీ రేటు లేదని తగ్గించేశారు. మిగిలిన బస్సులను ఉచిత బస్సు పథకానికి వినియోగించనున్నట్టు తెలుస్తోంది. మరి ఉన్న అరకొర బస్సులతో లక్షలాది మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎలా అమలు చేస్తారో.. ఈ పథకానికి ఎన్ని గొళ్లేలు పెట్టనున్నారో.. ఎంత మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుందో చూడాలి. సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు మాటల గారడీతో మరోసారి మహిళలు మోసపోయారు. సార్వత్రిక ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నమ్మి దగా పడ్డ మహి ళాలోకం తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబా బుతో పాటు కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రబాబు గద్దె నెక్కి ఏడాదైనప్పటికీ సూప ర్ సిక్స్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేసింది లే దు. తల్లికి వందనం పేరు చెప్పి అర్హులైన వేలాది మంది తల్లులు ఇప్పటికీ సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15న ఆర్టీసీలో అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించగానే మహిళలు ఎగిరి గంతేశారని చెప్పొచ్చు. మరో పక్షం రోజులు ఆగితే ఏ ఊరు వెళ్లాలన్నా ఆర్టీసీలో ప్రయాణం ఉచితమే అనుకుని సంబరపడ్డారు. తీరా ఉచిత ప్రయాణం అన్ని బస్సుల్లో అమలుచేయడం లేదని తెలిసి చంద్రబాబు మోసంపై మహిళలు నిప్పులు చెరుగుతు న్నారు. ఉచిత ప్రయాణం పల్లె వెలుగులకే పరిమితమంటుంటే మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఉచిత బస్సు పథకం ఉత్తుత్తి బస్సుగా మారుతుందని మహిళలు చంద్రబాబుకు శాపనార్థాలు పెడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా 200 గ్రామాలకు పైనే ఆర్టీసీ బస్సులు తిరగడం లేదు. పల్లెలకే కాకుండా పుణ్యక్షేత్రాలకు సరిపడా బస్సులు ఉండటం లేదు. కొత్త బస్సుల ఊసేదీ? కాకినాడ జిల్లాలో పల్లె వెలుగు 125, అల్ట్రా పల్లె వెలుగు సర్వీ సులు 39 మాత్రమే ఉన్నాయి. ఎక్స్ప్రెస్ సర్వీసులు 19 వరకు నడుస్తున్నాయి. జిల్లాలో 12 లక్షల మంది మహిళలు ఉన్నారని అంచనా. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకారం చూసుకుంటే 12 లక్షల మందికి అవసరమైన సర్వీసులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో అన్ని సర్వీసులు ఆర్టీసీకి లేవు. ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసినా ఉచిత బస్సు ప్రయాణం అమలుచేయాలంటే జిల్లాలో తక్కువలో తక్కువ అదనంగా వంద బస్సులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇన్ని బస్సులు ఒకేసారి నిర్వహించాలంటే ఇప్పుడున్న సిబ్బంది సంఖ్యను మరింత పెంచాల్సి ఉంటుంది. 100 మంది డ్రైవర్లు, 100 మంది కండక్టర్లు అవసరమవుతారని చెబుతున్నారు. ఇప్పుడు నడుస్తున్న బస్సులతోనే సర్దుబాటు చేయడం ఎంత మాత్రం వీలుకాదని ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్న పల్లెవెలుగు సర్వీసులను ఉచిత బస్సుల కోసం ప్రధాన ప్రాంతాల్లో నిర్వహిస్తే పల్లెల్లో బస్సు సర్వీసుల పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో కొత్త సర్వీసుల ఊసేలేదు. పాడైన కొన్ని సర్వీసులను మాత్రమే కొత్త బస్సులుగా మార్చారని తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి డిపోకు కొత్త బస్సులను కొనుగోలు చేస్తామని తేదేపా నేతలు చెప్పి మాటలు నీటిమీద రాతలుగానే మిగిలాయి. కాకినాడ సిటీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రవేశపెడతామని చెప్పిన మాటలు ఏమయ్యాయని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఏలేశ్వరం, తుని, కాకినాడ ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. కొత్త బస్సులను ఏర్పాటు చేయకుండా ఉన్న పల్లెవెలుగు బస్సులను ఉచిత బస్సు పథకం కోసం వినియోగిస్తే మిగిలిన సర్వీసుల పరిస్థితి డోలాయమానంలో పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. కొన్నింటిలోనే ఉచితం ఉచితం అన్ని బస్సుల్లో కాదని.. కొన్నింటిలో మాత్రమే ఉంటుందని ఆర్టీసీ అధికారులకు ఉన్నతాధికారుల నుంచి సమాచారం వచ్చింది. ఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు చూస్తే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు మాత్రమే ఉచితంగా మహిళలు ప్రణించడానికి అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు. ఉచిత బస్సు పథకం అమలుచేయడం పల్లెవెలుగు సర్వీసులపైనే ఆధారపడుతుందంటున్నారు. పల్లె వెలుగుతోనే ఉచిత ప్రయాణం అయినా మరో 100 సర్వీసుల అవసరం 12 లక్షల మంది మహిళల ఎదురుచూపు బాబు మార్క్ మరో మోసం జిల్లా ఆర్టీసీ సమాచారం ఏలేశ్వరం 39కాకినాడ 79 తుని 57మొత్తం డిపోలు 3మొత్తం బస్సులు 175మార్గదర్శకాల కోసం నిరీక్షిస్తున్నాం ఇంత వరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై జిల్లా స్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా కాకినాడ, తుని, ఏలేశ్వరం డిపోల పరిధిలో ఉన్న బస్సులనే ఎలా సర్దుబాటు చేయాలనేది అంచనా వేస్తున్నాం. – ఏ శ్రీనివాసరావు, జిల్లా ప్రజారవాణా అధికారి, కాకినాడ అన్ని బస్సుల్లోనూ అనుమతించాలి ఆర్టీసీలో మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణం ఎంతవరకు అమ లు చేస్తారో వేచి చూడాల్సిందే. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం చూసుకుంటే ఆర్టీ సీ నిర్వహించే అన్ని రకాల బస్సుల్లోను ఉచిత ప్ర యాణం కోసం మహిళలను అనుమతించాలి. కానీ అలా అమలు చేస్తారని నమ్మకం కలగడం లేదు. ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుచేయక పోవడంతో ఈ అభిప్రాయానికి రావాల్సి వ స్తోంది. ఏదో మొక్కుబడిగా అమలు చేసి చేతులు దులిపేసుకుంటారనే అనుమానం కలుగుతోంది. – వర్ధినీడి సుజాత, అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం, కాకినాడ జిల్లా -
కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయిన విద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రులతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించాలని ఆమె మండల విద్యాశాఖాధికారికి సూచించారు. ఎంఈఓ స్వామి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ప్రణీత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థినులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆరవ తరగతి ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు పెద్దాపురం: 2026–27వ ఏడాది పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆరవ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు పొడిగించినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆరవ తరగతి ప్రవేశానికి గడువు ఆగస్టు 13వ తేదీ వరకు పొడిగించారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2026–26 ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. యాంటీబయాటిక్స్, డ్రగ్స్పై అవగాహన ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటి బయోటిక్స్ వాడడం వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని, ముందుగా యాంటీబయాటిక్స్, నార్కోటిక్ డ్రగ్స్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ సూచించారు. బుధవారం జిల్లా పోలీసు, ది రాజమండ్రి కెమిస్ట్సు, డ్రగ్గిస్ట్సు అసోసియేషన్, ఈగల్ టీం ఆధ్వర్యంలో యాంటీబయాటిక్స్, నార్కోటిక్స్, డ్రగ్స్పై అవగాహన ర్యాలీ, సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా ర్యాలీని జాంపేట చినగాంధీబొమ్మ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పోలీసు కల్యాణ మంటపంలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్సీ నరసింహకిషోర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు డ్రగ్ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయని, ఇప్పటికే వాటికి అలవాటు పడినవారికి ఈ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తున్నామని తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్న లేదా వినియోగిస్తున్న వారి వివరాలు పోలీసులకు తెలపాలని ఎస్పీ తెలిపారు. -
స్వేచ్ఛగా మాట్లాడనివ్వరా..?
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్లో సైతం స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదు. ములాఖత్లో మా పక్కనే పోలీసులు ఉంటున్నారు. కనీసం ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో అక్రమ అరెస్టుకు గురై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ద్వారకనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానం ఆదేశాలిచ్చినా.. ఆర్డర్ ఇచ్చినా అన్ని విషయాల్లో పోలీసులు వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులను టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవు పలికారు. ‘పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్లం. మాపై కక్ష సాధించే వాళ్లను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు. ఇలాంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. చార్జ్ షీట్లో కూడా మిథున్రెడ్డి పేరు లేదు. అయినా అరెస్టు చేశారు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం జైల్లో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్లినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు. వసతులపై కోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు అందలేదంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అరెస్టు చేసేందుకు ఒక్క ఆధారం దొరకలేదు. ఏదో ఒక కేసు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.’ అని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్రాజు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల కష్టాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. నియంత పోకడ అమలవుతోందని మండిపడ్డారు. అధికారంతో అణచి వేస్తామనే ధోరణి ప్రభుత్వంలో కనిపించడం దారుణమన్నారు. నియంతృత్వ పోకడలతోనే మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. ములాఖత్లో సైతం పోలీసులు పక్కనే ఉంటున్నారు టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్లు చూస్తున్నారు మా కుటుంబంపై ఎందుకింత కక్ష? ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి ఎంపీ మిథున్రెడ్డితో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ములాఖత్ -
క్రెడిట్ టీడీపీదే అని వర్మ వ్యాఖ్యలు
ఉప్పాడ తీరంలో కోతకు గురైన మాయాపట్నం, సూరాడపేట, జగ్గరాజుపేట, పాత మార్కెట్, కొత్తపట్నం తదితర ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.2,000 వంతున సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్కడకు వెళ్లే సరికి బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇద్దరు, ముగ్గురికి సాయంతోనే సరిపెట్టేశారు. ఆ సందర్భంగా వర్మ సముద్ర కోత నివారణ, రక్షణకు 2018లోనే చంద్రబాబు ప్రతిపాదనలు రూపొందించి ఆమోదించారని చెప్పుకొచ్చారు. ఉప్పాడ వచ్చిన సందర్భంలో చంద్రబాబు, యువగళం పాదయాత్ర సందర్భంగా పెరుమాళ్లపురంలో లోకేష్ మత్స్యకారులకు ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబు ఉప్పాడ కోతపై ఎప్పుడో దృష్టి పెట్టారని, ఆ క్రెడిట్ అంతా తమదేనన్నట్టు చెప్పుకున్నారు. -
పవన్ వల్లే ప్రాజెక్టు వస్తుందంటూ కౌంటర్
ఇదంతా జనసేన నేతలకు ఎంతమ్రాతం రుచించ లేదు. వర్మ ఉప్పాడ కోత పరిశీలనకు వెళ్లిన 48 గంటల్లోనే మర్రెడ్డి శ్రీనివాస్ సీఎం సహాయ నిధి చెక్ల పంపిణీ పేరుతో ఉప్పాడ తీరంలో పర్యటించారు. ఆ సందర్భంలోనే వర్మకు పరోక్షంగా మర్రెడ్డి ఇచ్చిన కౌంటర్ కూటమిలో ఇరుపార్టీల నేతల మధ్య రాద్ధాంతాన్ని తిరిగి రాజేసింది. సముద్ర కోత నివారణ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు రిపోర్టు కూడా పవన్ సిద్ధం చేయించారని మర్రెడ్డి చెప్పుకొచ్చారు. వర్మకు ఆ రకంగా మర్రెడ్డి కౌంటర్ ఇవ్వడమే కాకుండా తమ నేత పవన్ వల్లే ఈ ప్రాజెక్టు వస్తుందని గొప్పలకు పోయారు. గత నెలలో ఉప్పాడ కొత్తపల్లి మండలం మల్లివారితోట–రావివారిపోడు గ్రామాల మధ్య బొండు ఇసుక తవ్వి తరలించుకుపోయేందుకు జనసేన నేతల ప్రయత్నాన్ని వర్మ తన అనుచరులతో కలిసి వెళ్లి అడ్డుకున్నారు. మర్రెడ్డి అనుచరుల ఇసుక అక్రమాలపై రోడ్డెక్కడం ద్వారా వైరి వర్గంపై వర్మ పై చేయి సాధించారు. అప్పట్లో ఇరు వర్గాలు కొట్లాటకు దిగగా పెద్దలు జోక్యంతో సర్దుబాటు అయ్యింది. ఇప్పుడు కొత్తగా ఉప్పాడ కోత రక్షణ ప్రతిపాదనలపై ఆధిపత్యం కోసం మాటల యుద్ధానికి తెర తీశారు. ఆ ప్రతిపాదనలు తమవంటే తమవని గొప్పలు చెప్పుకునే ప్రయత్నాలపై జనం విస్తు పోతున్నారు. కేవలం ప్రతిపాదనలకే ఈ స్థాయిలో నిస్సిగ్గుగా తలపడటంపై జనం పెదవి విరుస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు రప్పించి పనులు ప్రారంభించి అప్పుడు గొప్పగా ప్రకటించుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. ఇలా పిఠాపురంలో ప్రతి చిన్న విషయంలోనూ ఆధిపత్యమే ఏకై క అజెండాగా జనసేన, టీడీపీ నేతలు చేస్తోన్న రాజకీయాలను పిఠాపురం ప్రజలు ఏవగించుకుంటున్నారు. -
నేతల కోతల యుద్ధం
జగన్ సర్కార్లోనే.. వాస్తవానికి ఉప్పాడ కొత నివారణ, రక్షణ ప్రతిపాదనలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రూపొందగా టీడీపీ, జనసేల నేతలు ఎవరి గొప్పలు వారు చెప్పుకుంటుంటే జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఉప్పాడ సముద్ర కోత నివారణకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయాల్సినంతా చేసింది. సమస్య తీవ్రతను నాటి కాకినాడ ఎంపీ వంగా గీత ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు కేంద్రానికి నివేదించారు. రూ.300 కోట్ల పై చిలుకు బడ్జెట్ అవసరాన్ని తెలియజేస్తూ డీపీఆర్ రూపొందించి గీత స్వయంగా కేంద్రానికి నివేదించారు. ప్రాజెక్టు రిపోర్టుపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. ఇక నిధులు విడుదల మాత్రమే మిగిలి ఉందనే తరుణంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ఈ విషయాలన్నీ పిఠాపురం ప్రజలకు తెలియనివి కావు. వర్మ, మర్రెడ్డి వర్గాలు వాస్తవాలు మరుగునపెట్టి జనసేన, టీడీపీ నేతలు రాజకీయంగా ఆధిపత్యం కోసం గొప్పలకు పోతున్న తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కాకినాడ: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు నియోజకవర్గంలో ప్రతి అంశంలో తమది గొప్ప అంటే తమది గొప్ప అని జబ్బలు చరుచుకుంటున్నారు. ఎప్పుడైతే పిఠాపురం సీటును జనసేనకు కేటాయించారో అప్పటి నుంచే ఈ రచ్చ మొదలైంది. దీనికి కొనసాగింపుగా ఎమ్మెల్సీ నాగబాబు రాజేసిన అగ్గి రావణ కాష్టంలా కాలుతూనే ఉంది. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మను ఎన్నికలయ్యే వరకు పవన్ కల్యాణ్ ఆకాశానికెత్తేశారు. పవన్ ఉప ముఖ్యమంత్రి కాగానే ‘కూరలో కరివేపాకులా... పక్కన పెట్టేశారని టీడీపీలోని వర్మ వర్గీయులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. దీనికితోడు వర్మపై సైటెర్లతో పవన్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు టీడీపీ, జనసేన నేతల మధ్య వర్గపోరుకు మరింత అగ్గి రాజేశారని చెప్పొచ్చు. సోదర ద్వయం చంద్రబాబుతో కుమ్మకై ్క వర్మ ఎమ్మెల్సీ ఆశలపై కూడా నీళ్లు చల్లేశారు. ఈ నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్ను పవన్ కల్యాణ్ పిఠాపురం ఇన్చార్జిగా నియమించారు. మాటల తూటాలు అనంతర పరిణామాల్లో పిఠాపురంలో టీడీపీలో వర్గం ఒకవైపు, జనసేన నేతలు మరో వైపు హోరాహోరీగా తలపడుతున్నారు. పిఠాపురంలో ఏ చిన్న అంశాన్ని కూడా టీడీపీ, జనసేన వర్గాలు విడిచిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆధిపత్యం కోసం పాకులాడుతూనే ఉన్నారు. పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యాక నియోజకవర్గ అభివృద్ధికి రూ.వందల కోట్లు మంజూరు చేశారని నియోజకవర్గ జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ఇటీవల గొప్పగా ప్రకటించుకున్నారు. ఇందులో ఉప్పాడ సముద్ర కోత నివారణకు ఉద్దేశించిన ప్రాజెక్టు కూడా ఉంది. ఇటీవల సముద్ర ఉధృతి పెరిగి రాకాసి కెరటాలతో ఉప్పాడ తీరంలో మత్స్యకారుల ఇళ్లకు నష్టం సంభవించింది. బాధిత కుటుంబాల పరామర్శ, సముద్ర కోత పరిశీలన పేరుతో అటు వర్మ, ఇటు మర్రెడ్డి మాటల యుద్ధానికి తెర తీశారు. కూటమిలో గొప్పల తిప్పలు ఉప్పాడ సముద్ర కోత నివారణ ప్రతిపాదనల్లోనూ ఆధిపత్య పోరు వర్మ వెర్సెస్ మర్రెడ్డి ఇదేం తీరు అని జనం విస్మయం -
కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు అరకొర సౌకర్యాలు
జగ్గంపేట ఎస్సీ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతున్న చైతన్య జగ్గంపేట: కూటమి ప్రభుత్వంలో హాస్టళ్ల విద్యార్థులు అరకొర సౌకర్యాలతో అవస్థలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. జగ్గంపేట ఎస్సీ హాస్టల్ను బుధవారం సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ పాలనలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కుళ్లిన కూరగాయలతో చేసిన కూరలు, బియ్యంలో పురుగులు, నాణ్యత లేని భోజనం పెడుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో హాస్టళ్ల విద్యార్థులు పౌష్టికాహారం తింటూ ఆహ్లాదకర వాతావరణంలో చదువుకునేవారన్నారు. ఈయన వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయ్యూరు నాని, జగ్గంపేట నియోజకవర్గ అధ్యక్షుడు సుధాకర్, రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, ముమ్మిడివరం నియోజకవర్గం అధ్యక్షుడు ఆకాష్ ఉన్నారు. వైఎస్సార్ సీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు -
ఫుల్ వసూల్
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను అందించనప్పటికీ, మద్యాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్ల మద్యం షాపులను ఏర్పాటు చేసింది. దీనికి తోడు విచ్చలవిడిగా పెరిగిన బెల్టుషాపులతో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఈ షాపుల్లో అమ్మకాల ద్వారా అక్రమార్జన ఎడాపెడా జరుగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లైసెన్స్ మద్యం షాపులు 150 లోపు ఉంటే, బెల్ట్ షాపులు దానికి దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. లైసెన్స్ దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల పేరుతో మద్యం అమ్మకాలు ఫుల్గా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా సరకును అమ్మేస్తున్నారు. లైసెన్స్ మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఉండవని, ఒక వేళ బెల్ట్ షాపుల్లో మద్యం పట్టుబడితే, సంబంధిత లైసెన్స్ షాపునకు రూ.5 లక్షలు జరిమానా విధించడంతోపాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎకై ్సజ్ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదు. వెయ్యికి పైగా బెల్ట్ షాపులు జిల్లాలో అధికారికంగా 146 లైసెన్స్డ్ మద్యం షాపులు, 10 బార్లు ఉన్నాయి. ఈ 146 అధికారిక షాపులకు అనుసంధానంగా దాదాపు వెయ్యికి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. కలెక్టర్ ఇటీవల జిల్లా ఎకై ్సజ్ అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా మద్యం షాపుల ద్వారానే విక్రయాలు జరగాలని ఆదేశించారు. అయితే ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణా వైఫల్యం, లైసెన్స్ మద్యం షాపుల వారితో లాలూచీ వంటి కారణాలతో జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవ లేకుండా పోయింది. మామూళ్ల మత్తుతోనే పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాపులను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో! ఎకై ్సజ్ అధికారులను బెల్ట్ షాపుల గురించి అడిగితే ఎక్కడ ఉన్నాయని ఎదురు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. బెల్ట్ షాపుల నిర్వహణలో ఆరి తేరిన వారుంటే, అలాంటి వారిపై లైసెన్స్ షాపుల యాజమానులతో మాట్లాడి పరస్పర అంగీకారం, అవగాహనతో కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఎకై ్సజ్ అధికారులకు పరిపాటైపోయింది. అయితే పొరుగున్న ఉన్న పాండిచ్చేరి, యానాం నుంచి అక్రమ మద్యాన్ని (నాన్ డ్యూటీ పెయిడ్) తరలిస్తుంటే అధికారులు మాత్రం అలాంటి మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కాట్రేనికోన తదితర మండలాల్లో రిమోట్ గ్రామాల్లో కొన్ని మద్యం షాపులు ప్రైవేటు వేలం పాట పరమవుతున్నా పట్టించుకోరు సరికదా, అసలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ షాపుల నుంచి సంబంధిత అధికారులకు ప్రతి నెలా అందుతున్న మామూళ్లతో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా అమ్మకాలకు ప్రోత్సాహం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవుట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం షాపులను నిర్వహిస్తే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల చేత మద్యాన్ని ఫుల్గా తాగించి అమ్మకాలను అయినకాడికి పెంచేసి, తద్వారా వచ్చే ఆదాయానికి ఆశపడి ఈ అడ్డదారులు తొక్కుతోంది. మద్యం విక్రయాలను అటు లైసెన్స్ షాపుల ద్వారా ఇటు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల ద్వారా అదనంగా అమ్మేసి అక్రమార్జనకు పాల్పడుతోంది. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో పనిలేదన్నట్లుగా, మద్యం అమ్మకాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు పుట్ట గొడుగుల్లా బెల్ట్ షాపులు నిబంధనలు బేఖాతరు ఏరులై పారుతున్న మద్యం రూ.కోట్లలో అక్రమార్జన నకిలీ మద్యం కేసు గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులతో మద్యం అక్రమ అమ్మకాలు సాగితే, అల్లవరం మండలం కొమరిగిరపట్నంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు అవడంతో కోనసీమ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం తయారీ యూనిట్ను, ఈ అక్రమ వ్యాపారంలో పాత్రధారులను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సూత్రధారులైన పెద్దలను వదిలేసి పాత్రధారులైన చిన్న వారిని మాత్రమే అరెస్ట్ చేశారన్న విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నకిలీ దందా ఇక్కడ నుంచి సాగుతూ కోనసీమలోని పలు బెల్ట్ షాపులకు నకిలీ మద్యాన్ని సరాఫరా చేశారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కేవలం కేరామిల్ లిక్విడ్, స్పిరిట్తో నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ లేబుళ్లతో ఓ బాటిలింగ్ యూనిట్నే మెయింటెన్స్ చేస్తున్న ఈ నకిటీ ముఠా స్థావరాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. రూ.10 కోట్ల మేర ఈ నకిలీ మద్యం కేంద్రం నుంచి పక్కదారి పట్టిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ బాహటంగా స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపుల కల్చర్ గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు అయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబులకు పండగే జల్లా కేంద్రమైన అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయం సమీపంలోనే కొన్ని లైసెన్స్ షాపులకు పర్మిట్ రూమ్లు ఉన్నాయి. బారులతో సమాంతరంగా మద్యం షాపుల వద్ద కూడా మందుబాబులు ఫుల్గా తాగేస్తున్నారు. ఇక గుడి, బడి నిబంధనలను బెల్ట్ షాపుల నిర్వాహకులు అసలు పాటించడం లేదు. బెల్ట్ షాపు పట్టడమే ఓ నేరమైతే గుడి, బడికి 200 మీటర్ల దూరంలో పెట్టడం మరో నేరం. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో ఇలా బడి, గుడి నిబంధనలకు నీళ్లొదిలి బెల్ట్ షాపులు వెలిశాయి. అమలాపురం రూరల్, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్పం, కాట్రేనికోన మండలాలతో పాటు జిల్లాలో అసలు బెల్ట్ షాపుల లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. -
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి అవసరం
పెద్దాపురం: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కబడ్డీ మీట్నుద్దేశించి శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు క్రీడారంగానికి ప్రాధాన్యనివ్వడంలో నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమన్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కృష్ణా క్లస్టర్, తుంకుర్ క్లస్టర్ అండర్–19 బాలుర లీగ్ మ్యాచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతానికి చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పారిశ్రామిక వేత్త మట్టే శ్రీనివాస్ ‘నవోదయ’లో కబడ్డీ మీట్ ప్రారంభం -
బంగారం వ్యాపారిపై దొంగల దాడి
పిఠాపురం: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే వ్యాపారిపై దొంగలు దాడి చేసి, అతడి వద్ద ఉన్న వస్తువులను దోపిడీ చేశారు. చెందుర్తిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని అనే వ్యక్తి సిల్వర్ ప్యాలెస్ అనే వెండి, బంగారు నగల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాల్లోని వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేయడం, వాటిని తీసుకెళ్లి వారికి ఇవ్వడం, మళ్లీ వారి నుంచి ఆర్డర్లు తీసుకోవడం, వారిచ్చే నగదుతో పాటు వెండి, బంగారం రావడం ఆయన పని. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని షాపుల్లో ఇచ్చాడు. అక్కడి నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలుదేరాడు. మార్గం మధ్యలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వచ్చే సరికి, రెండు మోటారు సైకిళ్ల మీద నలుగురు వ్యక్తులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. భయభ్రాంతులకు గురిచేసి అతడి వద్ద ఉన్న 12.50 కేజీల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీసు స్టేషన్కు చేరుకుని విషయం తెలిపాడు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ, తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు, నగదు లాక్కుని పరారీ చెందుర్తిలో కలకలం రేపిన ఘటన -
‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం
రాయవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు, అవసరమైన పక్షంలో మూసివేసేందుకు వెనుకాడబోమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. మాచవరంలోని మార్గదర్శి పాఠశాలలో బాలికను ఆ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతిని చేసిన ఘటనపై మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. రాయవరం ఎంఈవో–1 పి.రామలక్ష్మణమూర్తి ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకున్న ఆయన హుటాహుటిన మాచవరం గ్రామానికి చేరుకున్నారు. ఆ స్కూల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఒకటి నుంచి 7వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. విచారణ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఇటువంటి పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సమగ్ర శిక్షా జీసీడీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ డి.రమేష్బాబు తదితరులు ఉన్నారు. ట్రైనీ డీఎస్పీ విచారణ మాచవరంలో బాలిక ఘటనపై ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, మండపేట సీఐ పి.దొరరాజుతో కలిసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలలో నేర స్థలాన్ని పరిశీలించారు. మాచవరంలో ప్రైవేట్ పాఠశాలను కరస్పాండెంట్ ఆకుమర్తి షాజీ జయరాజ్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన బాలికను లోబర్చుకుని, ఆమెను భయపెట్టి గర్భవతిని చేసినట్లుగా ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరగ్గా, పరువు పోతుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే తమ కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనేఉద్దేశంతోబాలిక తండ్రి ఆ పాఠశాల కర స్పాండెంట్ షాజీ జయరాజుపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డీఈవో సలీం బాషా విచారణ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన వైనం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ, సీఐ -
గురువులపై బరువులు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): చదువులు చెప్పే గురువులపై కూటమి ప్రభుత్వం బోధనేతర పనుల బరువులు మోపుతోంది. నానాటికీ ఈ భారం పెరుగుతోందే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. దీనిపై ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ప్రతి రోజూ వాట్సాప్లో అర్జెంట్.. మోస్ట్ అర్జెంట్.. అంటూ మెసేజ్లు, ఆన్లైన్ పనులపై ఆదేశాలు ఇస్తూండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,285 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో దాదాపు 5,100 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఆ తర్వాత స్కూల్ ఆర్గనైజేషనల్ టీములు (ఎస్ఓటీ), ఎంటీఎస్, బదిలీల కౌన్సెలింగ్ నిర్వహణతో 15 రోజులు గడచిపోయాయి. అనంతరం, గిన్నిస్ రికార్డు పేరిట జూన్ 21న చేపట్టిన యోగాంధ్ర కోసం పాఠశాలల్లో ముందస్తు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఉపాధ్యాయులను, విద్యార్థులను భాగస్వాముల్ని చేశారు. ఈ నెల 10న నిర్వహించిన మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్(పీటీఎం)కు పది రోజులు ముందుగానే సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. ఇవి ముగించుకుని హమ్మయ్యా.. అనుకునేసరికి ఈ నెల 14 నుంచి స్కూల్ లీడర్షిప్, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం (ఎఫ్ఎల్ఎన్) వంటి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇటువంటి వాటితో తమ సమయం వృథా అవుతోందని, అనివార్యంగా బోధనకు దూరమవ్వాల్సి వస్తోందని టీచర్లు అంటున్నారు. యాప్లతో ఉక్కిరిబిక్కిరి ఫ పాఠశాల విద్యా శాఖలో ఉన్న అన్ని యాప్లను ఒకే వేదికపై తీసుకువచ్చి లెర్నింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) యాప్ రూపొందించారు. దానిలోనే ఐఎంఎంఎస్, స్టూడెంట్ కిట్స్, మెగా పీటీఎం వంటివన్నీ ఉంచారు. ఫ సర్వర్ సక్రమంగా లేకపోవడంతో ఆన్లైన్లో టీచర్ ఫొటో హాజరు నమోదు ఉదయం, సాయంత్రం వేళల్లో ఆలస్యమవుతోంది. ఫ మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం అందిస్తున్నారు. ప్రతి నెలా పాఠశాలకు అందిన అన్ని బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్లను ఉపాధ్యాయులు స్కాన్ చేసి ఆన్లైన్లో నమోదు చేయాలి. వంటకు ముందు ఆ బస్తా తెరచిన ప్రతిసారీ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, బియ్యం నాణ్యతను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలి. ఫ బియ్యం, సరకులు, యూనిఫాం, పాఠ్య పుస్తకాల వంటివి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి తెచ్చుకోవడం తదితర పనులను ఉపాధ్యాయులే చేయాల్సి వస్తోంది. ఫ వివిధ పనులకు సంబంధించి ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయులు 500 నుంచి వెయ్యి వరకూ ఫొటోలు అప్లోడ్ చేయాల్సి వస్తోంది. ఇంటర్నెట్, సర్వర్ సమస్యతో ఇవి ఏ సమయానికి అప్లోడ్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనివలన టీచర్ల సమయం వృథా అవుతోంది. ఫ ఇవి చాలవన్నట్టు ఈ నెల 28 నుంచి లీడర్షిప్ ట్రైనింగ్ రెండో విడత నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో హెచ్ఏంలు, ఎంఈఓలు గంటల తరబడి ఈ సమావేశాల్లో పాల్గొనాల్సి వస్తోంది. ఫ ఆగస్టు 4 నుంచి ఎఫ్ఎ–1 పరీక్షలున్నందున సిలబస్ పూర్తి చేయాల్సి ఉందని, ఈ సమయంలో తమపై ఇన్ని బోధనేతర పనులు మోపడమేమిటని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొజిషన్ ఐడీలు రాక.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ముగియడంతో జిల్లావ్యాప్తంగా దాదాపు 1,400 మంది ఉపాధ్యాయులు ఆయా ప్రాంతాలకు వెళ్లారు. గతంలో రెగ్యులర్గా జీతాలు తీసుకుంటున్నప్పటికీ బదిలీ అనంతరం మరో స్థానానికి వెళ్లడంతో వారికి ప్రభుత్వం పొజిషన్ ఐడీ కేటాయించాలి. ఇది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు కనిపిస్తాయి. కానీ, ప్రభుత్వం ఇప్పటి వరకూ పొజిషన్ ఐడీలు కేటాయించకపోవడంతో వారికి జీతభత్యాలు నిలిచిపోయాయి. బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అలానే మున్సిపల్ ఉపాధ్యాయులు మార్కాపురం తదితర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. ట్రెజరీ మారడంతో వారికి కూడా పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అలాగే, మోడల్ ప్రైమరీ స్కూల్, అప్గ్రేడ్ చేసిన ఉన్నత పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులున్న చోట అదనంగా మరో మూడు పోస్టులు ఇచ్చారే గానీ.. పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. అలా జరగకపోవడంతో జీతాలు రాక వారందరూ సతమతమవుతున్నారు. బదిలీ అయిన వారికి జూన్ నెల జీతాలు ఇప్పటి వరకూ రాలేదు. ఈ నెలలో కూడా ఐడీలు రాకపోతే ఆగస్టులో కూడా జీతాలు అందుకోలేని పరిస్థితి. బదిలీపై వెళ్లిన ప్రాంతంలో ఇంటి అద్దెలు, రవాణా, అడ్వాన్సుల రూపంలో ఉపాధ్యాయులకు ఖర్చు మరింత పెరిగింది. ఈ పరిస్థితుల్లో జీతాలు నిలిచిపోవడంతో వారు సతమతమవుతున్నారు. పీ–4పై ఒత్తిళ్లు మరోవైపు ప్రభుత్వం పీ–4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్టనర్షిప్) పేరిట ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తోంది. ప్రధానోపాధ్యాయులు 5, ఉపాధ్యాయులు 2 చొప్పున పేద కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలంటూ ఆంక్షలు పెడుతోంది. రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తోంది. దీనిని ఉపాధ్యాయులు తప్పు పడుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతూంటే కొత్తగా పీ–4 పేరిట పేదరిక నిర్మూలనతో తమనెందుకు కలుపుతున్నారని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టిన ఈ కార్యక్రమానికి సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వోద్యోగులపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబడుతున్నారు. ఉపాధ్యాయుల ఆగ్రహం నేపథ్యంలో పీ–4 రుద్దడంపై ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. ఫ బోధనేతర పనులతో సతమతం ఫ యాప్లు, ఆన్లైన్ నమోదులతో ఇక్కట్లు ఫ తాజాగా పీ–4పై ఆదేశాలు ఫ బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఒత్తిళ్లు ఫ మండిపడుతున్న ఉపాధ్యాయులు జీతాలు వెంటనే చెల్లించాలి బదిలీ అయిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలి. ప్రస్తుతం మోడల్ ప్రైమరీ పాఠశాలలో అదనపు ఉపాధ్యాయ పోస్టులు కేటాయించారు. పదోన్నతిపై వచ్చిన వారికీ ఇవే ఇబ్బందులు. ఈఎంఐలు కట్టలేక కష్టాలు పడుతున్నారు. యాప్లు తగ్గిస్తామని చెప్పినా అన్ని అప్లికేషన్లూ ఒకే యాప్లోకి తీసుకొచ్చి నానా యాతనా పెడుతున్నారు. – చింతాడ ప్రదీప్కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఒత్తిడి తగ్గించాలి ఉపాధ్యాయులకు బోధనేతర పనులు తప్పించాలి. నిత్యం ఏదో ఒక పని చెప్పడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. యాప్ల భారం ఎక్కువైంది. వెరీ అర్జెంట్... మోస్ట్ అర్జెంట్ అంటూ మెసేజ్ల వల్ల సమయం వృథా అవుతోంది. పీ–4 కార్యక్రమంలో ఉపాధ్యాయులకు ఆప్షన్ ఇవ్వాలే తప్ప తప్పనిసరి చేయకూడదు. – మెర్త శ్రీనివాస్ ఎస్టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షులు -
ఆర్డినెన్స్తో ‘జయలక్ష్మి’ బాధితులకు న్యాయం చేయాలి
కాకినాడ రూరల్: జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ బాధితులకు సత్వర న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ను తీసుకు రావాలని చైర్మన్ గంగిరెడ్డి త్రినాఽథరావు అన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద మెయిన్ బ్రాంచ్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పాలకవర్గం అధికారం చేపట్టి దాదాపు మూడేళ్లు అయ్యిందని, బాధితుల కోసం పోరాటం సాగిస్తూనే, రుణాలు తీసుకుని ఎగ్గొటిన వారికి చెందిన సుమారు రూ.500 కోట్ల ఆస్తులను సీజ్ చేయించామన్నారు. రూ.300 కోట్ల వరకూ ట్రిబ్యునల్లో కేసులు వేశామని, అవి జడ్జిమెంట్కు సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిలో 13 కేసుల్లో రూ.70 కోట్ల వరకూ డిక్రీ అయ్యిందని, ఆ ఆస్తులను వేలం వేసి అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈలోగా బాధితుల సంఘమని చెప్పుకుంటూ ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయని కమిషనర్కు ఫిర్యాదు చేశారని, దానిపై కమిషనర్ విచారణకు ఆదేశించారన్నారు. కలెక్టర్ ద్వారా డీసీఓ విచారణ నిమిత్తం అసిస్టెంట్ కో ఆపరేటివ్ రిజిస్ట్రార్ జీవీ లక్ష్మిని నియమించడంతో ఆమె విచారణ చేసి, రికార్డులను తనిఖీ చేసి, అవకతవకలు లేవని మే నెలలో తేల్చారన్నారు. తమ పాలకవర్గం రాకముందు అడ్హాక్ కమిటీ చైర్మన్గా పనిచేసిన వీఎస్వీ సుబ్బారావు రికార్డులను అప్పగించలేదన్నారు. ఆయనపై ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. జయలక్ష్మి సొసైటీ బాధితులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం రూ.300 కోట్లు అప్పుగా ఇవ్వాలని తాము కోరామన్నారు. సొసైటీకి దాదాపు రూ.700 కోట్ల ఆస్తులు ఉన్నాయని, బాధితులకు రూ.580 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. సమావేశంలో డైరెక్టర్లు చింతా సుబ్బారావు, షేక్ జానీ బాషా, గౌరీ శేఖర్, బాధితులు పాల్గొన్నారు. -
పెళ్లి భయంతో పారిపోయిన బాలికలు
కాకినాడ రూరల్: ఇంటిలోని పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఆ బాలికలు భయపడిపోయారు. తమకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తారనే ఆందోళనతో ఇంటి నుంచి పారిపోయారు. వారి తల్లుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి ఆ బాలికల ఆచూకీ గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. కరప మండలం అచ్యుతాపురానికి చెందిన ఇద్దరు బాలికలు వరసకు అక్కాచెల్లెళ్లు (అన్నదమ్ముల పిల్లలు) అవుతారు. వీరిలో ఒకరు ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, మరొకరు పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరికీ పెద్దలు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. తమకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తారనే భయం వారికి పట్టుకుంది. పెద్దలను ఎదిరించలేక, ఇంటి నుంచి పారిపోయేందుకు పథకం వేసుకున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి కాలేజ్, స్కూల్కు అని చెప్పి బయలుదేరారు, మధ్యాహ్నం మూడు గంటలకు కాకినాడ నుంచి తప్పించుకుని పారిపోయారు. రాత్రయినా ఇద్దరు పిల్లలూ ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల అన్నిచోట్లా వెతికారు. ఫలితం లేకపోవడంతో రాత్రి పది గంటలకు ఇంద్రపాలెం పోలీసులను ఆశ్రయించారు. బాలికల తల్లుల ఫిర్యాదు మేరకు ఎస్సై వీరబాబు కేసు నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారంతో పాటు తన బృందంతో ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. బాలికలు అమలాపురం వైపు వెళ్లినట్టు టెక్నాలజీ ఆధారంగా గుర్తించి, అక్కడి పోలీసుల సహకారంతో కేవలం మూడు గంటల వ్యవధిలోనే పట్టుకోగలిగారు. బాలికలను మంగళవారం ఉదయం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సీ బిందు మాధవ్, ఏఎస్సీ పాటిల్ దేవరాజ్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ, సిబ్బంది, అమలాపురం పోలీసుల సహకారంతో తక్కువ సమయంలో బాలికల ఆచూకీ కనుగొన్నామని ఎస్సై వీరబాబు తెలిపారు. తల్లుల ఫిర్యాదుపై స్పందించిన ఇంద్రపాలెం పోలీసులు గంటల వ్యవధిలోనే ఆచూకీ లభ్యం -
దళిత విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష
ఫ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫైర్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): దళిత విద్యార్థులంటే కూటమి ప్రభుత్వానికి అలుసని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్ను యూనియన్ జి ల్లా అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీటి ఆనంద్ ఆధ్వర్యాన చైతన్య మంగళవారం సందర్శించారు. సమస్యలు స్వయంగా పరిశీలించి, విద్యార్థుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వసతి గృహాలను పాడుబెడుతున్నారని, విద్యార్థులకు సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని ఫైరయ్యారు. జగన్ హయాంలో ఇచ్చిన మంచి భోజనం, మంచి దుస్తులు, పరిసరాల పరిశుభ్రత మాయమైపోయాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు బా గా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొందాల ని, తద్వారా రాష్ట్రంలో పేదరికం కనుమరుగైపోవాలని గత ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే.. ప్రస్తు త సీఎం చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైతన్య డిమాండ్ చేశా రు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రీజినల్ కో ఆర్డినేటర్ రమేష్, విద్యార్థి నేతలు రేష్మ, కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఏలేరుకు గోదావరి జలాలు
ఏలేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి పైపులైన్ల ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. మంగళవారం నాటికి 175 క్యూసెక్కుల గోదావరి జలాలు వదిలారు. అలాగే, ఏలేరు పరీవాహక ప్రాంతం నుంచి 1,910 క్యూసెక్కుల జలాలు రిజర్వాయర్లోకి వచ్చి చేరాయి. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా మంగళవారం 77.25 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.46 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,300, విశాఖ నగరానికి 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీలను బుధవారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ ఆదేశించారు. గత ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగనప్పటికీ సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో హుండీల్లో కానుకలు దండిగానే పడ్డాయి. స్వామివారి ఆలయం వద్ద ప్రధాన హుండీ నిండిపోవడంతో సీల్ వేశారు. ఈ నెల కూడా సుమారు రూ.కోటి ఆదాయం రాగలదని అంచనా వేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం రాజమహేంద్రవరం సిటీ: దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేయనున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాన్ని అమలు చేసి చూపారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయకుండా క్యాబినెట్లో ప్రకటించడం దారుణమన్నారు. తల్లికి వందనం అమలు జరగడం లేదన్నారు. జగన్ రూ.13 వేలు ఇస్తే విమర్శించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పి, కార్పొరేట్ కంపెనీలకు భూములను కారుచౌకగా 99 పైసలకే కట్టబెడుతున్నారని, ఇందు లో క్విడ్ ప్రో కో జరుగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. ఎవరికో ఒకరికి భూములు కట్టబెట్టడానికే మంత్రి మండలి సమావేశం జరుగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతి వారినీ జైలులో పెడుతున్నారన్నారు. బిహార్లో జరిగిన ఎన్నికల అక్రమాలపై లోక్సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో 8 లక్షల బోగస్ ఓట్లు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లు సృష్టించి గెలుస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ‘నన్నయ’కు వుడ్ చిప్పర్రాజానగరం: యూనివర్సిటీ ప్రాంగణాన్ని సుందరీకరించడంలో భాగంగా చెట్ల కొమ్మలు, పొదలు, వ్యర్థాలను చిప్స్గా మార్చే మైజో వీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. దీనిని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ యంత్ర సాయంతో తయారయ్యే వుడ్ చిప్స్ను మొక్కలకు కంపోస్టు ఎరువుగా వాడవచ్చని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. వ్యర్థాలను కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఆవిధంగా కాకుండా ఈ యంత్రం చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీన్ డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, కె.దేవలాల్, కె.లక్ష్మీపతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఈసారైనా ఖరారయ్యేనా!
అన్నవరం: సాధారణంగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని చెప్పి.. తుదిగా వచ్చిన మొత్తానికి వేలం పాట ఖరారు చేస్తారు. ఒకవేళ ఒకటి రెండుసార్లు ఆశించిన మొత్తానికి వేలంపాట వెళ్లకపోతే పాటదారులతో అధికారులు సమావేశమవుతారు. వారి ఇబ్బంది తెలుసుకుని, దాని ప్రకారం కొంత మొత్తం తగ్గించైనా మూడోసారి పాట ఖరారు చేస్తారు. లేకపోతే ఆ మేరకు నష్టం కలుగుతుంది. కానీ, అన్నవరం దేవస్థానంలో మాత్రం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. భక్తులు ఇబ్బంది పడినా, దేవస్థానానికి రూ.లక్షల్లో ఆదాయం నష్టం వచ్చినా పట్టించుకోవడం లేదు. ఏం జరుగుతోందంటే.. రత్నగిరిపై ఈఓ కార్యాలయం దిగువన దాదాపు 70 సంవత్సరాల నుంచి మెయిన్ క్యాంటీన్ ఉంది. స్వామివారి ఆలయానికి మెట్ల మార్గంలో రాకపోకలు సాగించే భక్తులకు ఇక్కడ టీ, కాఫీ, ఫలహారాలు, భోజనం లభించేవి. దీనికి నెలకు రూ.8 లక్షల వరకూ వేలం పాట జరిగేది. ఏడాదికి రూ.కోటి పైగానే ఆదాయం వచ్చేది. పశ్చిమ రాజగోపురం వెనుక, సత్యగిరిపై సత్రాలు, రెండో ఘాట్ రోడ్డు నిర్మాణాలు జరిగాక భక్తులు అటు నుంచే సత్యదేవుని ఆలయానికి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే, సత్రాల్లో బస చేసేవారి కోసం సీతారామ సత్రం వద్ద సబ్ క్యాంటీన్ ఏర్పాటు చేశారు. దీంతో, మెయిన్ క్యాంటీన్లో వ్యాపారం తగ్గింది. ఆ తరువాత సత్యగిరిపై శివసదన్ వద్ద మరో క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. రెండు క్యాంటీన్లు అదనంగా రావడంతో మెయిన్ క్యాంటీన్కు వ్యాపారం మరింత తగ్గింది. దీనికితోడు ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ భక్తులకు దేవస్థానం పులిహోర, దద్ధోజనం పంపిణీ చేస్తూండటంతో ఆ క్యాంటీన్లో ఫలహారం తినేవారు కూడా తగ్గారు. దీంతో వ్యాపారం తగ్గింది. అయితే, అధికారులు వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. గతంలో మాదిరిగానే నెలకు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఆదాయం వస్తేనే పాట ఖరారు చేస్తామని చెబుతున్నారు. గత సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకూ ఏడుసార్లు వేలం నిర్వహించారు. అయితే, వ్యాపారం తగ్గిందంటూ పాటదారులు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ మాత్రమే పాడుతున్నారు. గత నెలలో నిర్వహించిన ఆరో విడత వేలంలో రూ.4.20 లక్షలకు మాత్రమే పాట వెళ్లింది. కానీ, ఎక్కువ మొత్తం రాలేదని దీనిని ఖరారు చేయలేదు. ఏడోసారి వేలం నిర్వహిస్తే రూ.2.75 లక్షలకు మాత్రమే పాట వెళ్లింది. దీంతో అదీ ఖరారు చేయలేదు. ఇలా అధికారులు వాయిదా వేస్తూండటంతో గడచిన 9 నెలలుగా దేవస్థానం సుమారు రూ.30 లక్షల వరకూ ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న ఈ క్యాంటీన్కు ఎనిమిదోసారి వేలం నిర్వహించనున్నారు. హెచ్చు మొత్తానికి వేలం జరగాలని ఆశిస్తున్నారు. అయితే, నెలకు రూ.4 లక్షలకు మించి వెళ్లే అవకాశం లేదని పాటదారులు చెబుతున్నారు. ఈసారైనా ఖరారు చేస్తారో లేదో వేచి చూడాలి. ఒకవేళ ఈసారి కూడా పాట ఖరారు కాకపోతే దేవస్థానం సొంతంగానే సాయంత్రం వేళ టీ, కాఫీ, ఫలహారాలు విక్రయించాలని భక్తులు కోరుతున్నారు. భక్తులకు ఇబ్బందులు మెయిన్ క్యాంటీన్ పక్కనే దాత నిర్మించిన నాలుగంతస్తుల ఉచిత డార్మెట్రీలో ప్రతి రోజూ సుమారు 300 మంది భక్తులు బస చేస్తూంటారు. సేవ చేయడానికి వస్తున్న వారికి కూడా ఇక్కడే వసతి కల్పిస్తున్నారు. పగలు పెద్ద ఇబ్బంది లేకపోయినా రాత్రి వేళల్లో టీ, కాఫీ, ఫలహారాలు లభించక వీరందరూ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సబ్ క్యాంటీన్ వద్దకు ఆటోలో వెళ్లి ఫలహారం తిని రావాల్సి వస్తోంది. రానూపోనూ ఆటోకు మనిషికి రూ.50 వసూలు చేస్తున్నారు. దీంతో, టిఫిన్ కోసం భక్తులు రూ.100 నుంచి రూ.150 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఫ 9 నెలలుగా మూతపడి ఉన్న మెయిన్ క్యాంటీన్ ఫ దేవస్థానానికి రూ.30 లక్షల నష్టం ఫ ఆగస్టు 6న 8వసారి వేలం -
ఉత్సాహం..ఉత్తేజం
సమావేశానికి తరలివచ్చిన దళితులుసమావేశంలో మాట్లాడుతున్న సుధాకర్బాబుఅక్టోబర్ నుంచి దళిత ఫోర్స్ పర్యటనలు పార్టీ అధిష్టానం ఆదేశాలతో అక్టోబర్ నుంచి గ్రామాలు, మండలాల్లో దళిత ఫోర్స్ పర్యటించాలంటూ కుమార్రాజా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ఎస్సీ సెల్ పరిశీలకులు బి.శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నియోజకవర్గాల అధ్యక్షులు బల్ల సూరిబాబు, పెదపాటి రమేష్ కుమార్, బంగారు కృష్ణ, గుడాల వెంకటరత్నం, లంక కృపానందం, భుల అబ్బులు కూడా ప్రసంగించారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, అనుబంధ విభాగాల కోనసీమ, కాకినాడ పరిశీలకుడు వై.సాయిప్రశాంత్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, ప్రచార విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావూరి వెంకటేశ్వరరావు, బీసీ సెల్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్ని, సిటీ యూత్ అధ్యక్షుడు రోకళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేడ్కర్, బాబూ జగ్జీవన్రామ్ చిత్రపటాలకు నివాళులర్పించారు. సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు వందన సమర్పణ చేశారు. ● వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ సమావేశానికి పోటెత్తిన దళితులు ● కూటమి సర్కారుపై నిప్పులు ● సాగనంపే వరకూ నిద్రపోబోమని ప్రతిన ● కేసులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదని స్పష్టీకరణ ● జగన్ను సీఎంను చేయడానికి సిద్ధమంటూ నినాదం సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారుపై దళితుల్లో నెలకొన్న అసంతృప్తి కాకినాడలో సోమవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి తొలి సమావేశంలో ప్రస్ఫుటమైంది. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశానికి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షత వహించారు. జిల్లా నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన దళితులతో సమావేశ ప్రాంగణమైన సూర్య కళా మందిరం కిక్కిరిసిపోయింది. సగం మంది బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకూ జగన్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. ఆకట్టుకున్న టీజేఆర్ ప్రసంగం ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. కూటమి 13 నెలల పాలనలో దళితులు, దళిత మహిళలపై వివక్ష, కక్షపూరితంగా జరుగుతున్న దాడులను తనదైన శైలిలో ఆయన ఎండగట్టిన తీరు సభికుల్లో రెట్టించిన ఉత్సాహాన్ని నింపింది. దళితుల సంక్షేమ పథకాల్లో పెడుతున్న కోతలను గణాంకాలతో అర్థమయ్యే రీతిలో వివరించారు. వారిని అణగదొక్కేందుకు చూస్తున్న కూటమి సర్కారును కడిగి పారేశారు. ఆ సందర్భంగా జై జగన్ నినాదాలు మిన్నంటాయి. ‘మీ సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకువచ్చిన జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి నేను సిద్ధం. మీరు సిద్ధమేనా?’ అంటూ ప్రశ్నించి అందరిలో ఉత్తేజాన్ని నింపారు. ‘కూటమి సర్కారు పెట్టే కేసులకు బెదిరిపోయి బయటకు రారా.. తలలు పగలగొడతారని భయపడతారా.. ప్రాణాలైనా అర్పించడానికి వెనుకాడేది లేదు.. మన సంక్షేమ పథకాలను పునరుద్ధరించుకోవాలంటే జగన్ను సీఎంను చేసుకోవాలి’ అని సుధాకర్బాబు నొక్కి చెప్పినప్పుడు.. ‘ప్రాణాలైనా అర్పిస్తాం.. జగన్ను సీఎంను చేస్తాం’ అనే నినాదాలతో సమావేశ మందిరం ప్రతిధ్వనించింది. దళితుల భవిష్యత్తు బాగుండేందుకు కూటమి సర్కారును సాగనంపేలా ప్రతి గ్రామం, ప్రతి మండలంలో దళితులు సత్తా చాటాలని పిలుపునిచ్చినప్పుడు దళితులు జగన్కు జై కొట్టారు. వెలుగుల కోసం సత్తా చాటాలి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. వెలుగుల నుంచి చీకట్లోకి నెట్టేసిన కూటమిని సాగనంపి.. తిరిగి వెలుగుల కోసం దళిత సత్తా చాటాలని పిలుపునిచ్చారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అన్న చంద్రబాబుకు, దళితులంటే నాకు మేనమామలు అన్న జగన్ మనస్తత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కనకారావు అర్థమయ్యేలా వివరించినప్పుడు జనం చప్పట్లతో స్వాగతించారు. చంద్రబాబు కేబినెట్లో దళితులకు రెండే రెండు పదవులిస్తే.. జగన్ తన కేబినెట్లో హోం, విద్య, ఎకై ్సజ్ వంటి కీలక శాఖలతో సమున్నత స్థానం కల్పించారని, ఆయనను తిరిగి సీఎంను చేసుకోవాలని అన్నప్పుడు ‘సీఎం జగన్’ అంటూ దళితులు ముక్తకంఠంతో నినదించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువతులు అదృశ్యమయ్యారని దుష్ప్రచారం చేసిన పవన్.. అనంతపురంలో సామూహిక అత్యాచారంతో తల్లి అయిన బాలికను కనీసం పరామర్శించలేదంటూ కనకారావు తూర్పారబట్టిన తీరు ఆకట్టుకుంది. జగన్ వెంటే దళితులు ● చంద్రబాబు మాటలు నమ్మి అన్ని వర్గాలూ మోసపోయినా దళితులు మాత్రం జగన్ వెంటే ఉన్నారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. దేశమంతా అంబేడ్కర్ రాజ్యాంగం అమలవుతూంటే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ పెదబాబు, చినబాబుల తీరును ఆయన ఎండగట్టారు. ● ఆవిర్భావం నుంచీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న దళితులు జగన్ను మరోసారి సీఎంను చేసేంత వరకూ పోరాటాలకు సిద్ధపడాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు పిలుపునిచ్చారు. ● అధికారం ఉన్నా లేకున్నా జగన్ వెంటే జనం.. అదే ప్రభంజనం అని మాజీ ఎంపీ వంగా గీత అన్నారు. ● ‘ప్రాణాలైనా అర్పిద్దాం.. జగన్ను సీఎంను చేసుకుందాం. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో దళిత ఫోర్స్తో సమన్వయంగా ముందడుగు వేద్దామని ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా పిలుపునకు అనూహ్య స్పందన లభించింది. జగన్ను సీఎంను చేసుకుంటేనే మన సంక్షేమం మనకు తిరిగి దక్కుతుందనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పారు. ● కూటమి పాలనలో దళితులు, దళిత మహిళలపై జరుగుతున్న దాడులు, అణచివేతలకు ఎదురొడ్డి పోరాడాల్సిన అవసరాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగుళూరి శివకుమారి, మాల కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, గుల్లా ఏడుకొండలు వివరించారు. ● 75 ఏళ్ల స్వాతంత్య్ర రాజకీయ చరిత్రలో తొలిసారి రెల్లి సామాజికవర్గానికి కాకినాడ డిప్యూటీ మేయర్ పదవి కట్టబెట్టిన జగన్ దళితుల పక్షపాతి అని మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్కుమార్ అన్నారు. దళితుల సత్తా చూపాలి కూటమి ప్రభుత్వం దళితుల హక్కులు కాలరాస్తూ వారి పథకాలను ఎత్తేస్తోంది. 2027 లేదా 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి సీఎంను చేసుకోవడం ద్వారా దళితుల సత్తా ఏమిటో తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్ తన ఐదేళ్ల పాలనలో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.2.75 లక్షల కోట్లు జమ చేశారు. ఇందులో 40 శాతం అంటే రూ.37 వేల కోట్లు దళితులకే వెళ్లాయి. కూటమి ప్రభుత్వం పథకాలన్నింటినీ ఆపేసి దళితుల అభ్యున్నతిని దెబ్బ తీస్తోంది. కూటమి పాలనలో ఏటా రూ.10 వేల కోట్ల మేర దళితులు నష్టపోతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో చేస్తున్న పాత్రలు చూసి సామాజిక న్యాయం పాటిస్తారనుకున్నాం. అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్.. తాను సనాతన వాదినని చెప్పుకోవడమేమిటో అర్థం కావడం లేదు. పవన్ను చూసి రాజకీయం సిగ్గుతో తల వంచుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ను సీఎంను చేసుకోవడానికి దళితులు, మైనార్టీలు ప్రాణాలర్పించడానికి కూడా వెనుకాడరు. 13 నెలల చంద్రబాబు పాలనలో చినబాబు రెడ్బుక్ రాజ్యాంగంతో వారి స్థాయి ఏమిటో ప్రజలకు తెలిసొచ్చింది. మీ పాలన ఇక వెయ్యి రోజులు మాత్రమే, 1001 రోజు కచ్చితంగా మీకు దళితుల సత్తా ఏమిటో తెలిసొస్తుంది. అంబేడ్కర్ స్మృతివనాన్ని పీపీపీ విధానంలో వ్యాపార కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 13 నెలల కాలంలో తల్లికి వందనం తప్ప మరో పథకమేదైనా అమలు చేసిందా? ఈ పథకాన్ని దళిత, బలహీనవర్గాలకు కాకుండా టీడీపీ నేతలకు దోచి పెడుతున్నారు. క్యాబినెట్ మంత్రి అయి ఉండి అచ్చెన్నాయుడు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అన్నారు? – టీజేఆర్ సుధాకర్బాబు, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు -
తల్లికి వంచన ఎందుకు?
● తల్లికి వందనం డబ్బులు రాకపోవడంపై ఆగ్రహం ● కలెక్టరేట్కు పెద్ద సంఖ్యలో క్యూ కట్టిన తల్లిదండ్రులు ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదుల వెల్లువకాకినాడ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్యలు చెప్పుకొనేందుకు జిల్లా నలుమూలల నుంచీ ప్రజలు కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 921 మంది తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ముఖ్యంగా తల్లికి వందనం నగదు తమకు జమ కాలేదంటూ అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అర్హతలున్నప్పటికీ తమకు తల్లికి వందనం డబ్బులివ్వలేదని, ఈ వంచన ఏమిటని ప్రశ్నించారు. దీంతో కలెక్టరేట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక దశలో అర్జీలదారులను నియంత్రించలేక కలెక్టరేట్ సిబ్బంది, పోలీసులు చేతులెత్తేశారు. చివరకు తల్లికి వందనం అర్జీలు స్వీకరించేందుకు కలెక్టర్ షణ్మోహన్ ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేసి మరీ అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం నగదు జమపై విద్యా శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పేద విద్యార్థుల తల్లులకు డబ్బులు ఎందుకు పడలేదో సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాలని, అర్హుల జాబితా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్లిప్తంగా విధులు నిర్వహిస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లులు అధికంగా వచ్చాయనే పేరుతో తల్లికి వందనం పథకానికి అర్హులు కాదంటూ తమ పిల్లలను పక్కన పెట్టడం సరికాదని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సచివాలయాల్లో తల్లికి వందనం ఆన్లైన్ నమోదును ఇష్టానుసారం చేశారని, దీంతో తమ పిల్లలు ఈ పథకానికి దూరమయ్యారని ఆరోపించారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచడం వంటి కారణాలతో అంశాలతో బిల్లులు పెరిగిపోయాయని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ బిల్లులను లెక్కల్లోకి తీసుకోవడం సరికాదని, తమ పిల్లలు పేదలా, కాదా అనేది ప్రత్యక్షంగా చూడాలని డిమాండ్ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లల చదువును ప్రోత్సహించే ఉద్దేశంతో అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టారని, పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికీ గతంలో ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అమ్మ ఒడి అందేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ఏడాది కాలం తల్లికి వందనం రాలేదని, రెండో ఏడాది వస్తుందని ఎదురు చూస్తూంటే వివిధ రకాల కారణాలతో ఈ పథకాన్ని దూరం చేశారని వాపోయారు. గతంలో మాదిరిగానే పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లిదండ్రులందరికీ తల్లికి వందనం పథకాన్ని అందించాలని కోరారు. సంతృప్తికరమైన పరిష్కారం చూపండి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు ఆయా శాఖల అధికారులు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఇతర అధికారులతో కలసి ఆయన అర్జీలు స్వీకరించారు. తల్లికి వందనం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. -
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం ● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే ● ఫంక్షన్ హాల్స్, టెంట్హౌస్లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నా యి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేక పోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మా సం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీరికి డిమాండ్ వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు. -
అనుబంధ విభాగాలతో పార్టీ బలోపేతం కావాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పార్టీ అనుబంధ విభా గాలు సమన్వయంతో పని చేయడం ద్వారా జిల్లా లో పార్టీ బలోపేతం కావాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా నియమితులైన వై.సాయిప్రశాంత్ కాకినాడ లో సోమవారం రాజాను కలిశారు. ఈ సందర్బంగా రాజా మాట్లాడుతూ, జిల్లాలోని అనుబంధ విభాగాల ప్రతినిధులు పార్టీ అభ్యన్నతికి పాటు పడేలా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న అనుబంధ విభాగాలను త్వరితగతిన నియమించాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, నాయకుడు బత్తుల సాయిరామ్ కూడా పాల్గొన్నారు. ఆషాఢం ఆదాయం అదుర్స్ తలుపులమ్మ తల్లికి రూ.1.56 కోట్ల రాబడి తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం ఆదాయం రూ.1.56 కోట్లు లభించింది. అన్నవరం దేవస్థానం డిప్యూటీ కమిషనర్, సహాయ కార్యనిర్వహణాధికారి పి.బాబూరావు పర్యవేక్షణలో లోవ దేవస్థానం ఆవరణలో హుండీలను సోమవారం తెరిచారు. అమ్మవారి పంచలోహ విగ్రహాల ప్రాంగణంలో ఆదాయం లెక్కించారు. నోట్లు రూ.63,15,141, నాణేలు రూ.4,42,318 కలిపి మొత్తం రూ.67,57,459 సమకూరిందని లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఆషాఢ మాసం నెల రోజులూ పూజా టికెట్లు, వసతి గదుల అద్దెలు, లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం, విరాళాల రూపంలో మరో రూ.88,59,239 ఆదాయం లభించిందని వివరించారు. మొత్తం రూ. 1,56,16,698 ఆదాయం సమకూరిందన్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి రూ.26.62 లక్షలు అధికంగా లభించిందన్నారు. నగదు లెక్కింపులో దేవస్థానం సిబ్బంది, శ్రీవారి సేవకులు, నాయీ బ్రాహ్మణులు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. పీ–4 నిర్బంధం చేస్తే బహిష్కరిస్తాం అమలాపురం టౌన్: పీ–4 కార్యక్రమాన్ని నిర్బంధం చేస్తే బహిష్కరిస్తామని యూటీఎఫ్ కోనసీమ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సురేంద్రకుమార్, ఎంటీవీఏఎస్ సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పీ–4 కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు 5, ఉపాధ్యాయులు 2 పేద కుటుంబాలను తప్పనిసరిగా దత్తత తీసుకోవాలన్న ఆంక్షలు సమంజసం కాదన్నారు. -
ప్రారంభమైన వివాహాలు
శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. – సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితులు, కాకినాడ టెంట్ హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్హౌస్లకు గిరాకీ పెరిగింది. – కొండబాబు, టెంట్హౌస్ నిర్వాహకుడు, కాకినాడ -
ఇదో ఫ్రీతలాటకం
తల్లికి వందనానికి ఆంక్షల కత్తెర ● స్కూళ్లలో ఉచిత సీట్ల పేరిట తల్లికి వందనం నిలిపివేత ● కుటుంబంలో ఫ్రీ సీటు ఇచ్చింది ఒకరికి ● ఆ పేరుతో మిగిలిన వారందరికీ కోత ● తల్లిదండ్రుల ఆగ్రహంపిఠాపురం: తమ పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయిస్తున్నారంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడ్డారు. సర్కారు వారి సాయంతో కనీసం తమ పిల్లలైనా మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదుగుతారని అనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం ఫ్రీ సీటు అయితే ఇచ్చింది కానీ, ఆ పేరుతో ఆయా కుటుంబాలకు తల్లికి వందనం నిధులు నిలిపివేసింది. అది కూడా ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ఒకరికి ఉచితంగా సీటు ఇచ్చి.. ఆ పేరుతో మిగిలిన పిల్లలంరికీ తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టేసింది. ఇటు తమ బిడ్డలకు ప్రైవేటు స్కూలులో ఉచిత సీటు వచ్చిందన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు అంతలోనే ఆవిరైపోయింది. తమ పిల్లలకు తల్లికి వందనం డబ్బులివ్వాలంటూ అనేక మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ సీట్లు ఇచ్చినప్పటికీ అమ్మ ఒడి డబ్బులు మాత్రం యథాతథంగానే జమ చేసేవారు. అటువంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ‘ఉచితం’ పేరుతో అనుచిత విధానం అవలంబిస్తోందంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2,960 ఉచిత సీట్లు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలి. దీని ప్రకారం, జిల్లావ్యాప్తంగా 2,960 మంది విద్యార్థులకు వివిధ ప్రైవేటు పాఠశాలల్లో ఉచితంగా సీట్లు కేటాయించారు. ఇప్పటి వరకూ 1,207 మంది ఆన్లైన్లో, 216 మంది ఆఫ్లైన్లో కలిపి మొత్తం 1,423 మంది వారికి కేటాయించిన పాఠశాలల్లో చేరారు. మరో 1,537 మంది ఆయా పాఠశాలల్లో ఇంకా చేరాల్సి ఉంది. ఉచిత సీట్లకు సంబంధించి జిల్లాలో ఇప్పటి వరకూ 48.08 శాతం మంది విద్యార్థులు మాత్రమే చేరారు. 20 శాతం మంది ఫ్రీ సీటు తీసుకోవడానికి నిరాకరించినట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత సీట్లు పొందిన వారిలో తల్లికి వందనం నిలిచిపోయిన విద్యార్థులు సుమారు 500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. తమకు తల్లికి వందనం సాయం ఎందుకు నిలిచిపోయిందో అర్థం కాక వీరందరూ అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కోతలే కోతలు ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో గొప్పగా డప్పేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రకరకాల సాకులతో అనేక మంది అర్హులకు ఈ పథకంలో కోతలు పెడుతున్నారు. కరెంటు బిల్లులు అధికంగా చూపించి కొందరికి, వ్యవసాయ భూములు లేని వారికి కూడా ఉన్నట్లు చూపించి పలువురికి ఈ పథకం ఆపేశారు. మరి కొందరికి పథకం వర్తింపజేసినా రూ.15 వేలకు బదులు రూ.13 వేలు, రూ.9 వేలు మాత్రమే వేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఫ్రీ సీటు వంకతో ఆయా కుటుంబాల్లోని ఇతర విద్యార్థులకు ‘తల్లికి వందనం’లో కోత పెట్టారు. ఇద్దరు పిల్లలకు వెయ్యలేదు మాకు కార్తీక్, తేజ ఇద్దరు కుమారులు. ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. ఇద్దరికీ తల్లికి వందనం పథకం డబ్బులు వెయ్యలేదు. అధికారులను అడిగితే ఆన్లైన్లో చూసుకోమన్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. మేము అర్హులమే కదా! లిస్టులో ఎలిజిబుల్ అని వచ్చింది కదా! అలా ఎందుకు చూపిస్తోందని అధికారులను అడిగితే తామేమి చేయలేమని చెబుతున్నారు. ఏం చేయాలో తెలియక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో డబ్బులు కచ్చితంగా పడిపోయేవి. ఇప్పుడే ఇలా వంకలు పెట్టి ఆపేస్తున్నారు. అర్హత ఉన్నా పథకం ఆపేయడం చాలా దారుణం. – రసబోయిన అర్జమ్మ, చేబ్రోలు,గొల్లప్రోలు మండలం ముగ్గురికీ వెయ్యలేదు మా ముగ్గురు పిల్లలు రిషికుమార్, పూజిత, జాహ్నవి తల్లికి వందనం పథకానికి అర్హులని ఆన్లైన్లో వచ్చింది. అందరికీ పడినట్లే ముగ్గురు పిల్లలకూ కలిపి మాకూ రూ.45 వేలు పడతాయని ఎదురు చూశాం. కానీ పడలేదు. మా పిల్లల్లో ఒకరికి ఫ్రీ సీటు ఇచ్చారు. మిగిలిన ఇద్దరికై నా వేస్తారనుకుంటే వెయ్యలేదు. అధికారులను అడిగితే తమ చేతుల్లో లేదని, ప్రభుత్వం వెయ్యాలని అంటున్నారు. ఆన్లైన్లో చూస్తే ‘పేమెంట్ హోల్డ్ బై డిపార్టుమెంట్ ఆర్టీఈ’ అని చూపిస్తోంది. ఇలా ఎందుకు వచ్చిందని, అసలు డబ్బులు పడతాయా, లేదా అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదు. రెండు వారాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. గతంలో ఎప్పుడూ సమయానికి అమ్మ ఒడి డబ్బులు పడేవి. గత సంవత్సరం ఎలాగూ ఇవ్వలేదు. ఈ ఏడాది ఇలా మెలిక పెట్టి ఆపేశారు. అర్హత ఉన్నా మాలాంటి చాలా మంది డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు. – నూజివీడు దేవి, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం ఫిర్యాదులు చేస్తున్నారు ఫ్రీ సీటు పొందిన వారి కుటుంబంలో మిగిలిన పిల్లలకు తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. దీనిపై చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నా రు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. – పి.రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం చేసి, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఊరేగించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, చిట్టి శివ, ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తాత్రేయశర్మ, పరిచారకుడు గణేష్ తదితరులు నిర్వహించారు. సత్యదేవుడిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
నేడు పీజీఆర్ఎస్
కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. దీనికి జిల్లా అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. దీనికి రాలేని వారు తమ అర్జీలను ‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల నమోదు స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. మరిడమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
కాకినాడ సిటీ: ప్రజలపై విద్యుత్ చార్జీల భారాలను మోపే ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని వామపక్షాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. కాకినాడ సుందరయ్య భవన్లో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు అధ్యక్షతన ఆదివారం వామపక్షాల జిల్లా సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, నగర సహాయ కార్యదర్శి ఎ.భవాని, జె.వెంకటేశ్వరరావు (సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ), ఏగుపాటి అర్జునరావు, గొడుగు సత్యనారాయణ (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్), ఏఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి అంజిబాబు, వి.రాజబాబు (ఏపీఆర్సీఎస్), సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్, పలివెల వీరబాబు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు విద్యుత్ అత్యవసరం కాబట్టి ప్రైవేటు కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం తీసుకువచ్చిందన్నారు. అదానీ ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. విద్యుల్ చార్జీలకు వ్యతిరేకంగా 2000 సంవత్సరంలో జరిగిన పోరాటం ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుసన్నారు. అదే స్ఫూర్తితో వామపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయని ప్రకటించారు. ఆగస్టు 5న ప్రజా వేదిక ఆధ్వర్యాన విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. వరద గోదారి ● సముద్రంలోకి 6 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న ఉధృతి ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,01,884 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతూండటంతో మిగులు జలాల విడుదలను పెంచారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 34.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది. -
నేడు వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళా మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవడంపై ఈ సమావేశంలో దిశానిర్దేశం చేస్తారన్నారు. ఎస్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని రాజా కోరారు.ఎంపీడీఓలకు నేటి నుంచి శిక్షణ సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా ఎంపీడీఓలుగా పదోన్నతులు పొందిన వారికి స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం(ఈటీసీ)లో సోమవారం నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కేంద్రం పరిధిలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకూ ఉన్న 11 జిల్లాల్లోని 89 మంది ఎంపీడీఓలకు ఆగస్టు 26 వరకూ శిక్షణ ఇస్తారు. మొదటి బ్యాచ్లో 46 మందికి సోమవారం శిక్షణ ప్రారంభమవుతుంది. ఈ శిక్షణను ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు ప్రారంభిస్తారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు, గెస్ట్ ఫ్యాకల్టీలు శిక్షణ ఇస్తారు. ఆదివారాలు, రెండో శనివారం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి సెలవులుంటాయని ప్రిన్సిపాల్ తెలిపారు. ఆగస్టు 15న స్వాత్రంత్య దినోత్సవం అందరితో కలసి నిర్వహిస్తామన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకూ పరిపాలనా విధానాలు, సంక్షేమ పథకాలు, సభలు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై శిక్షణతో పాటు ఫీల్డు విజిట్ కూడా ఉంటుందని ప్రసాదరావు వివరించారు. లోవకు కొనసాగుతున్న భక్తుల రద్దీ తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించారు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగదు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు. అంతరిక్ష యానంపై నేడు సదస్సు పిఠాపురం: అంతరిక్ష యానంపై పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ స్కూల్లో విద్యార్థులకు సోమవారం ఉదయం 9 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇస్రో ప్రయోగాలు, ఉపగ్రహాలు, మిషన్లపై ప్రదర్శనలు, స్పేస్ మోడల్స్, వీడియో ప్రదర్శనలు, ఇంటరాక్టివ్ సెషన్లు, క్లియర్ టాక్స్, సైన్స్ సిటీ రిసోర్స్ పర్సన్ల ప్రత్యేక ఉపన్యాసాలు, స్పేస్ క్విజ్, గేమ్స్, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, సర్టిఫికెట్ల ప్రదానం వంటి కార్యక్రమాలు ఈ సందర్భంగా ఉంటాయని వివరించారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి పర్యవేక్షణలో విద్యా శాఖ, సమగ్ర శిక్ష, ముస్కాన్ సంస్థ, సైన్స్ సిటీ సంయుక్త ఆధ్వర్యాన ఈ సదస్సు నిర్వహిస్తున్నారన్నారు. పిఠాపురం పరిసర ప్రాంతాల విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని డీఈఓ కోరారు.