breaking news
Kakinada
-
పరిహారం ఇస్తేనే పచ్చజెండా
● భారత్ మాల రోడ్డుకు తీసుకున్న భూమికి డబ్బులివ్వాలి ● తర్వాతే నిర్మాణం మొదలుపెట్టాలి ● టెండర్ ప్రకటనతో అన్నవరం రైతుల ఆందోళనఅన్నవరం: తమ భూములకు పరిహారం చెల్లించకుండానే భారత్ మాల రోడ్డు నిర్మాణానికి జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై అన్నవరం రైతులు ఆందోళన చెందుతున్నారు. భారత్ మాల పరియోజన మొదటి దశలో కాకినాడ వాకలపూడి లైట్హౌస్ నుంచి అన్నవరం వరకూ 40.621 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారి (ఎన్హెచ్–516ఎఫ్) నిర్మించాలని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం 2020లో నిర్ణయించింది. సాగర తీరం వెంబడి పారిశ్రామికాభివృద్ధికి ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించింది. ఈ మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) అధికారులు 2021లో ఒకసారి టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి, వివిధ కారణాలతో రద్దు చేశారు. తాజాగా మూడు రోజుల క్రితం రీ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.1,040 కోట్లతో అంచనా రూపొందించారు. ఈ రోడ్డు అన్నవరం వద్ద సత్యదేవుని నమూనా ఆలయం సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారిని కలుస్తుంది. అక్కడ కత్తిపూడి హైవే సర్కిల్ మాదిరిగా అతి పెద్ద సర్క్యులర్ ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ఆ సర్కిల్ నుంచి రత్నగిరిపై సత్యదేవుని ఆలయం కనిపిస్తుంది. అందువలన అక్కడ ప్రయాణికులు ఆగేందుకు వీలుగా రోడ్డు నిర్మించనున్నారు. 2021 నుంచే వివాదం ఈ రహదారి నిర్మాణానికి తమ వద్ద నుంచి రూ.కోట్ల విలువైన భూములను తీసుకున్న ఎన్హెచ్ఏఐ అధికారులు తమకు పరిహారం చెల్లించకుండానే టెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై అన్నవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ రహదారికి సంబంధించిన భూసేకరణ వివాదం 2021 నుంచే కొనసాగుతోంది. వాకలపూడి లైట్హౌస్ నుంచి కాకినాడ రూరల్, యు.కొత్తపల్లి, తొండంగి మండలాల మీదుగా అన్నవరం వరకూ 516ఎఫ్ హైవే నిర్మాణం సాగుతుంది. దీని కోసం 2021లో అన్నవరం, ఆరెంపూడి గ్రామాల పరిధిలో 40 ఎకరాలు సేకరించారు. ఇందులో 20 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, మిగిలిన 20 ఎకరాలు చిన్న, సన్నకారు రైతులకు చెందినది. ఈ భూములు సత్యదేవుని పాత నమూనా ఆలయానికి సమీపాన 16వ నంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్నాయి. తమ భూములను 516ఎఫ్ హైవే కోసం సేకరించడంపై అప్పట్లోనే రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకున్న భూమే తక్కువని, అది కూడా భూసేకరణలో పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అన్నవరంలో హైవేని ఆనుకుని ఎకరం భూమి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.4 కోట్లు పైనే ఉంది. ఆరెంపూడి గ్రామంలో సర్వే నంబర్లు 177, 105, 108లో ఉన్న 20 మంది రైతులకు చెందిన పదెకరాలకు సంబంధించి ఎకరానికి రూ.కోటి చొప్పున ఇప్పటికే పరిహారం చెల్లించారు. అయితే, ఒకేచోట భూమి ఉన్నప్పటికీ రికార్డుల్లో గ్రామం పేరు, సర్వే నంబర్లు మారడంతో అన్నవరం రైతులకు మాత్రం పరిహారం చెల్లించలేదు. ఈవిధంగా సర్వే నంబర్ 91–1లోని సుమారు 20 రైతులకు చెందిన మరో పదెకరాలకు ఇంకా పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ విషయం తేలకుండానే రోడ్డు నిర్మాణానికి టెండర్ ప్రకటన విడుదల చేయడంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిహారం ఇచ్చాకే నిర్మించాలి భారత్ మాల రోడ్డుకు నా 2.5 ఎకరాల భూమి సేకరించారు. మా కుటుంబ సభ్యులది రెండెకరాలు తీసుకున్నారు. వాళ్ల భూమి ఆరెంపూడి గ్రామ పరిధిలో ఉండటంతో ఎకరానికి రూ.కోటి చొప్పున చెల్లించారు. నా భూమి అన్నవరం గ్రామ పరిధిలో ఉండటంతో పరిహారం ఇవ్వలేదు. రికార్డుల్లో సర్వే నంబర్లు, గ్రామాలు మారాయని, అందువలన ఎన్హెచ్ఏఐ అధికారులు కొర్రీ వేశారని చెబుతున్నారు. దీనిపై కలెక్టర్ షణ్మోహన్ను కలిసి వినతిపత్రం కూడా ఇచ్చాం. నాతోపాటు మరో 20 మంది చిన్నకారు రైతులకు కూడా పరిహారం ఇచ్చాకే రోడ్డు నిర్మించాలి. – బండారు ముత్యాలరావు, రైతు అధికారులకు కలెక్టర్ ఆదేశం భారత్ మాల రోడ్డు నిర్మాణ భూసేకరణ సమయంలో నేను శంఖవరం మండల ఆర్ఐగా ఉన్నాను. చిన్న సాంకేతిక సమస్య కారణంగా అన్నవరం రైతులకు పరిహారం ఆలస్యమైంది. ఇటీవల ఆ రైతులతో పాటు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కలసి సమస్య వివరించాను. ఆ రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కలెక్టర్ ఎన్హెచ్ఏఐ అధికారులను ఆదేశించారు. – బైరావజ్జుల ప్రసాద్, విశ్రాంత ఆర్ఐ, శంఖవరం మండలం -
రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎస్పీ
సామర్లకోట: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వందేభారత్ రైలులో విజయవాడ నుంచి సామర్లకోట వచ్చి, కాకినాడ వెళ్తారనే సమాచారం మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గురువారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. ప్లాట్ఫాం, అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గాన్ని పరిశీలించారు. ప్రధాన మార్గంలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉండటంతో పార్సిల్ కార్యాలయం సమీపాన ఉన్న మార్గం నుంచి గవర్నర్ కాన్వాయ్ వచ్చే విధంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఆ మార్గంలోని వాహనాలను పూర్తిగా తొలగించాలని స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్కు సూచించారు. గవర్నర్ వస్తారనే సమాచారం నేపథ్యంలో స్టేషన్ ఆవరణను శుభ్రం చేయించడంపై రమేష్తో కలసి మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య పరిశీలన జరిపారు. కార్యక్రమంలో డీఎస్పీ డి.శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్పై అడపా గరగారావు, టికెట్ ఇన్స్పెక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. నేడు మరిడమ్మ ఆలయం మూసివేత పెద్దాపురం: మరిడమ్మ అమ్మవారి ఆలయాన్ని శుక్రవారం మూసివేస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి గురువారం విలేకర్లక తెలిపారు. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి అమ్మవారికి కుంభం వేస్తారన్నారు. అందువలన ఆలయ తలుపులు మూసివేయడంతో శుక్రవారం అమ్మవారి దర్శనం ఉండదన్నారు. శనివారం వేకువజామున ఆలయం తెరచి, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యానవనశాఖ అధికారిగా మల్లికార్జునరావు రాజమహేంద్రవరం రూరల్: జిల్లా ఉద్యానవనశాఖ అధికారిగా నేతల మల్లికార్జునరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ పనిచేసిన బి.సుజాత కుమారి గత నెల 30 ఉద్యోగ విమరణ చేశారు. దీంతో కాకినాడ జిల్లా నుంచి మల్లికార్జునరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కలెక్టర్ పి.ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలోని హార్టికల్చర్ రంగంలో అంతర పంటల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సూక్ష్మ నీటిపారుదలశాఖ అధికారి ఎ.దుర్గేష్, విశ్రాంత డీహెచ్వో బి.సుజాత కుమారి, కొవ్వూరు మండల హార్టికల్చర్ అధికారి డి.సుధీర్ కుమార్ పాల్గొన్నారు. సమర్థంగా నేరాల కట్టడి ● పోలీసు అధికారులు, సిబ్బంది సహకారం భేష్ ● ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి ● నేర సమీక్షలో ఎస్పీ నరసింహ కిశోర్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పోలీసు అధికారులు, సిబ్బంది సహకారంతో జిల్లాలో నేరాలను సమర్థంగా అరికట్టగలుగుతున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ అన్నారు. స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అర్థ సంవత్సర నేర సమీక్ష నిర్వహించారు. 2025లో ఇప్పటి వరకూ జరిగిన సంఘటనలు, చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పోలీసులు ఛేదించిన కేసులు, సాధించిన విజయాలను చర్చించారు. కేసుల దర్యాప్తులో ఎదురవుతున్న సవాళ్లు, వాటిని అధిగమించే మార్గాలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలతో పోలీసులు స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై తక్షణమే స్పందించాలని, బాధితులకు అండగా నిలవాలన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కట్టడి చేయాలన్నారు. ఈ సమీక్షలో గుర్తించిన లోపాలను సరిదిద్దుకొని, రాబోయే ఆరు నెలలకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఎల్.అర్జున్, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధనదైన్యాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు నిర్లక్ష్య వైఖరి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా ఖ్యాతినొందిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రైతులు పీకల్లోతు దైన్యంలో కూరుకుపోయారు. రబీ ధాన్యం డబ్బుల చెల్లింపులో ప్రభుత్వం చేస్తున్న తీరని జాప్యం అన్నదాతలకు శాపంగా మారింది. ఒకటీ రెండూ రోజులు కాదు.. ఒకరో ఇద్దరో రైతులూ కారు.. వందా రెండు వందల రూపాయలు అంతకంటే కాదు.. ఏకంగా రెండు నెలలుగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం రూ.399 కోట్ల మేర ధాన్యం బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటకాలం ప్రారంభమైపోయింది. ఈ నెల 15లోగా నారుమళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ, ధాన్యం డబ్బులు ఇవ్వడం లేదు. మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కూడా అందించడం లేదు. పైగా ఈ పథకం పేరును అన్నదాతా సుఖీభవగా మార్చి రూ.20 వేలు ఇస్తామని గత ఎన్నికల్లో గొప్పగా చెప్పారు. కానీ, ఇప్పటి వరకూ నయాపైసా కూడా ఇవ్వలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. ప్రభుత్వమే నెలల తరబడి ధాన్యం సొమ్ము తొక్కిపెడితే ఖరీఫ్ సాగు ఏవిధంగా చేయగలమంటూ శాపనార్థాలు పెడుతున్నారు. గొప్ప చెప్పి.. చిప్ప చూపి.. ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు కూటమి నేతలందరూ ధాన్యం అమ్మిన 24 లేదా 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తామమని గొప్పగా చెప్పారు. మంత్రి నాదెండ్ల అయితే ధాన్యం కొనుగోళ్లు జరిగిన సమయంలో ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తూ ధాన్యం సొమ్ముపై రైతులకు ఆశలు కల్పించారు. కొనుగోళ్లు ప్రారంభమైన తొలి పక్షంలో మాత్రం ప్రచారార్భాటం కోసం రైతుల ఖాతాల్లో సొమ్ము వేశారు. మే మొదటి వారం నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి మాత్రం డబ్బులు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు చుక్కలు చూపిస్తోంది. దీంతో, కడుపు మండిన అన్నదాతలు ధాన్యం సొమ్ము కోసం ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అంతే కాకుండా, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు, నిడదవోలు రూరల్, ఉండ్రాజవరం, కొవ్వూరు, రాజమహేంద్రవరం రూరల్; కాకినాడ జిల్లా పెద్దాపురం; కోనసీమ జిల్లా అమలాపురం తదితర ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. రైతులు తక్కువలో తక్కువ ఎకరాకు 50 బస్తాల (75 కేజీలు) దిగుబడి సాధించారు. ఈ మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ప్రతి రైతుకు ఎకరానికి రూ.86 వేలు పైగా రావాలి. ఈవిధంగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రభుత్వం రూ.399 కోట్ల మేర ధాన్యం డబ్బులు చెల్లించాల్సి ఉంది. ఇది ఓవైపు ఖరీఫ్ ఖరీఫ్ సాగు ప్రారంభమైపోయినా ధాన్యం బకాయిల చెల్లింపుపై ప్రభుత్వ పెద్దల నుంచి ఉలుకూపలుకూ లేదు. కాకినాడలో బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సభ్యులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై మూకుమ్మడిగా ధ్వజమెత్తారు. అప్పు పుట్టక.. కూటమి సర్కారు గద్దెనెక్కినప్పటి నుంచి దాదాపు అన్ని వర్గాల వద్ద డబ్బుల్లేని దుస్థితి నెలకొంది. ఏటా పంట పెట్టుబడిలు సమయంలో సొమ్ము సర్దుబాటు చేసే కమీషన్ ఏజెంట్లు కూడా ఈసారి చేతులెత్తేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అప్పు పుట్టడం లేదు. ఖరీఫ్కు సమాయత్తమయ్యే తరుణంలో రైతులు ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని రైతు నేతలు మండిపడుతున్నారు. జిల్లాల వారీగా రబీ ధాన్యం బకాయిలు కాకినాడ రూ.80 కోట్లు కోనసీమ రూ.189 కోట్లు తూర్పు గోదావరి రూ.130 కోట్లు మొత్తం రూ.399 కోట్లు నెలలు గడుస్తున్నా ధాన్యం డబ్బులు ఇవ్వని సర్కారు ఉమ్మడి జిల్లాలో మొత్తం బకాయి రూ.399 కోట్లు ఖరీఫ్ పెట్టుబడికి రైతుల అగచాట్లు ధాన్యం సొమ్ము ఇస్తారా.. ఇవ్వరా అని ప్రశ్న ధాన్యం అమ్మి 6 వారాలైనా.. రబీలో ఆరెకరాలు సాగు చేశాను. ధాన్యం 75 కిలోల బస్తాకు ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.1,725 కంటే వ్యాపారులు తక్కువకు అడుగుతున్నారని రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) ద్వారా ప్రభుత్వానికి విక్రయించాను. మే నెలలో 70 కిలోల ధాన్యం బస్తాలు 260 తూచాను. మద్దతు ధర ప్రకారం రూ.4,18,600 రావాలి. మా బ్యాంక్ అకౌంట్లకు ధాన్యం డబ్బులు 24 గంటల్లో జమవుతాయంటే అమ్మాను. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆర్ఎస్కే, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాను. తొలకరి సీజన్ ప్రారంభమైపోయింది. విత్తనాలకు, నారుమడి దమ్ముకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఒకవైపు చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోతోంది. కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్నదాతా సుఖీభవ పథకం అమలు కాక, ధాన్యం లెక్క (డబ్బులు) అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు కుటుంబ ఖర్చులు, మరోవైపు తొలకరి పెట్టుబడులకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. వెంటనే ధాన్యం డబ్బులు ఇవ్వాలి. – వెలుగుబంట్ల రవినాయుడు, రైతు, కూరాడ, కరప మండలం దారుణం ధాన్యం విక్రయించిన 40 రోజులు గడచినా ఇప్పటి వరకూ నయాపైసా కూడా చేతికి రాలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయంగా రూ.20 వేలు ఇస్తామని చెప్పింది. ఏడాది గడచినా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఇటు ధాన్యం డబ్బులు, అటు పెట్టుబడి సాయం ఇవ్వపోతే రైతులు ఖరీఫ్ పంటలు ఎలా పండించగలరు? పరిస్థితి ఇలాగే కొనసాగితే వ్యవసాయం చేయడం కష్టంగా మారుతుంది. ఒకవైపు అతివృష్టి, అనావృష్టితో రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉంటే ధాన్యం అమ్మిన సొమ్ము కూడా ఇవ్వకపోవడం దారుణంగా ఉంది. – వెలమర్తి బుల్లిరాజు, రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
కాకినాడలో జాతీయ జూనియర్ మహిళా హాకీ పోటీలు
కాకినాడ సిటీ: వచ్చే నెల 1 నుంచి 12వ తేదీ వరకూ కాకినాడలో జరగనున్న జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్షిప్ పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఈ పోటీల నిర్వహణపై కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా క్రీడా మైదానంలో ఆస్ట్రోటర్ఫ్ హాకీ ఫీల్డ్లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. దీనికి 29 రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, 200 మంది సహాయక సిబ్బంది హాజరవుతారని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వసతి, భోజన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా శాఖలు చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస కుమార్, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, హాకీ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ జి.హర్షవర్ధన్, జాయింట్ సెక్రటరీ బి.రవిరాజు, సెట్రాజ్ సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రేషన్ షాపులకు చేరని బియ్యం అయినవిల్లి: ప్రతి నెలా ఒకటో తేదీనే రేషన్ బియ్యం లబ్ధిదారులకు చేరేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల రేషన్ బియ్యం వ్యాన్ల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వడం నిలిపేసి పాత విధానంలో డీలర్ల ద్వారా లబ్ధిదారులకు రేషన్ బియ్యం ఇవ్వడం ప్రారంభించారు. ఈ నెల మూడోవ తేదీ దాటినా అయినవిల్లి మండలంలోని చాలా వరకూ షాపులకు రేషన్ బియ్యం దిగుమతి కాలేదు. దీంతో రేషన్షాపు యజమానులు చేసేది లేక లబ్ధిదారులను వెనుకకు తిరిగి పంపిస్తున్నారు. దీంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే ఒకటో తేదీనే రేషన్ బియ్యం ఇంటికి వచ్చేవని, కూటమి ప్రభుత్వం విధానం మార్చడంతో ఇబ్బంది పడుతున్నామని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపులకు వెళ్లి అక్కడ తలుపులకు తాళాలు దర్శనమిస్తున్నాయి. దీంతో పలువురు రెవెన్యూ అధికారులకు పరిస్థితి వివరించారు. మండలంలోని 41 రేషన్ షాపులు ఉండగా 30 శాతం షాపులకు మాత్రమే రేషన్ బియ్యం సరఫరా చేసినట్లు చెబుతున్నారు. గోడౌన్లో బియ్య సరఫరా లేకపోవడంతో ఆలస్యం అయిన మాటా వాస్తవమేనని, స్టాకు రాగానే మిగిలిన 70శాతం షాపులకు బియ్యం సరఫరా చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గాల పరిశీలకుల నియామకంరావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడుగురు పరిశీలకులను నియమించినట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి గురువారం తెలిపారు. రావులపాలెం మండలం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహంలో గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో నూతనంగా నియమితులైన పరిశీలకుతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఉన్న క్యూఆర్ కోడ్ ప్రతాలను వారికి అందజేశారు. వాటితో చంద్రబాబు ఇచ్చిన మోసపు హామీలను ప్రజలకు వివరించాలన్నారు. అనంతరం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక పరిశీలకులను నియమించి వారి విధివిధానాలను క్లుప్తంగా వివరించారు. మండపేట నియోజకవర్గానికి పరిశీలకులుగా కటకంశెట్టి ఆదిత్య, రామచంద్రపురం – కుడిపూడి శ్రీనివాసరావు, ముమ్మిడివరం – మాత మురళి, అమలాపురం – పేరి శ్రీనివాస కామేశ్వరరావు, పి.గన్నవరం – పెన్మత్స చిన్న భద్రరాజు, రాజోలు– వంటెద్దు వెంకన్ననాయుడు, కొత్తపేట – సిరిపురపు శ్రీనివాసరావును నియమించినట్టు తెలిపారు. ధనిక, పేద తారతమ్యం తగ్గాలి అమలాపురం రూరల్: ప్రైవేట్, పీపుల్స్, ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా ధనిక, పేదల మధ్య తారతమ్యం తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. -
ఆగస్టు 1 నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
కాకినాడ సిటీ: జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఆగస్టు 1 నుంచి 20వ తేదీ వరకూ జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేయాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కల్నల్ ఆర్కే సింగ్ మాట్లాడుతూ, విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్మెంట్ విభాగం ఆధ్వర్యాన అగ్నిపథ్ స్కీమ్ కింద ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం నుంచి కృష్ణా వరకూ ఉన్న 13 జిల్లాలతో పాటు యానాంకు చెందిన దాదాపు 22 వేల మంది అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. వీరితో పాటు 145 మంది రిక్రూటింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొంటారన్నారు. రిక్రూట్మెంట్ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఈ మేరకు ఆయా శాఖల ద్వారా చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ షణ్మోహన్ దిశానిర్దేశం చేశారు. ప్రతి రోజూ సుమారు 800 మంది అభ్యర్థులు పాల్గొంటారన్నారు. వీరికి ఆహారం అందించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, ఆసక్తి ఉన్నవారు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ దేవులా నాయక్ను 77020 03535 నంబర్లో సంప్రదించాలని కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 9వ తేదీకి ఉచిత ప్రవేశాలు పూర్తి కావాలి కాకినాడ సిటీ: ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలను ఈ నెల 9వ తేదీ నాటికి కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి స్పష్టం చేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలలు ఏదో ఒక కారణం చెప్పి తమ పిల్లలకు ఉచిత ప్రవేశాలు నిరాకరిస్తున్నాయంటూ తల్లిదండ్రుల నుంచి మూడు వారాలుగా గ్రీవెన్స్ సెల్కు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. ఉచిత ప్రవేశాలు కల్పించని పాఠశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పేద విద్యార్థులు తల్లికి వందనం పథకం ప్రయోజనాలు కోల్పోకుండా ఈ నెల 9వ తేదీ లోగానే అర్హులైన అందరికీ ఉచిత ప్రవేశాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎవరికై నా ఉచిత ప్రవేశం నిరాకరిస్తే అందుకు స్పష్టమైన కారణాలతో సంబంధిత ఎంఈఓకు వివరణ సమర్పించాలన్నారు. పాఠశాలలు తెలిపిన అభ్యంతరాలు, కారణాలను పునఃపరిశీలించి, తిరస్కరించిన విద్యార్థుల్లో అర్హులను ఎంఈఓలు మళ్లీ ఆయా పాఠశాలలకు కేటాయిస్తారని వివరించారు. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పేరెంట్, టీచర్ సమావేశాలు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సమావేశంలో డీఈఓ పి.రమేష్, సమగ్రశిక్షా అభియాన్ ఏపీసీ వేణుగోపాల్, ఎంఈఓలు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నెల దాటినా ధాన్యం సొమ్ము ఇవ్వరు...అదను దాటిపోతున్నా మెట్టలో ఖరీఫ్కు సాగునీరు ఇవ్వరు...ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వదు...కానీ రైతులపై భారం మోపుతూ సర్చార్జీలతో కలిపి నీటి తీరువా వసూలు చేస్తామంటారు...మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ సాగుకు నీరు విడుదలపై స్పష్టత ఇవ్వరు...కోనసీమలో మేజర్ డ్రైన్లు పట్టించుకోకుండా ఖరీఫ్ ఎలా ముందుకు సాగేది...అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వేదికగా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. కాకినాడ జెడ్పీ సమావేశ మందిరంలో చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన బుధవారం జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా రైతుల సమస్యలపై సభ్యులు మూకుమ్మడిగా నిలదీసి కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది రూపాయల ధాన్యం సొమ్ము జమ చేయకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వ తీరును రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తప్పుపట్టారు. జెడ్పీటీసీ సభ్యులు కూడా ప్రభుత్వ తీరును మూకుమ్మడిగా నిలదీశారు. ధాన్యం సొమ్ము కోట్లలో బకాయిలున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదు, 24 గంటల్లో జమచేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పి రైతులను నట్టేట ముంచేసిందని మండిపడ్డారు.ఽఖరీఫ్ పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో వైఎస్సార్ సీపీ నుంచి కూటమికి ఫిరాయించిన జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు కల్పించుకుని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేద్దామనడంతో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు ఒక్కసారిగా అనుబాబుపై విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయించిన మీకు రైతుల కోసం మాట్లాడే అర్హత లేదంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి రైతులంటే లెక్కలేదంటూ సభ్యులు నినాదాలు చేస్తూ వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. నీటి తీరువా వసూలుపై ఆగ్రహం కొద్దిసేపు సమావేశం బయట నిరసన వ్యక్తం చేసిన అనంతరం తిరిగి సభకు వచ్చారు. ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ప్రభుత్వం ఇస్తామన్న పెట్టుబడి ఇవ్వకపోగా నీటితీరువా వసూలు చేయడం అన్యాయమంటూ గొల్లప్రోలు, ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యులు ఉలవకాయల లోవరాజు, బెహరా రాజరాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్లో పెట్టుబడులు లేక రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే అన్యాయంగా సర్చార్జీలతో కలిపి నీటితీరువా ఎలా వసూలు చేస్తారని సభ్యులు ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి కల్పించుకుని సర్చార్జీలు వసూలు చేసే ఆలోచన లేదన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటితీరువా కచ్చితంగా వసూలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించి ప్రాధాన్యం కలిగిన ఈ అంశంపై కూటమి ప్రజాప్రతినిధులు పెదవి విప్పకుండా మిన్నకుండి పోవడం ఏమిటని పలువురు సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాధనం వృథా : ఎమ్మెల్సీ తోట పీడీఎస్ బియ్యాన్ని చేరువలో ఉన్న ఆలమూరు, రామచంద్రపురంలోని గోడౌన్లలో కాకుండా ద్వారపూడిలోని ప్రైవేట్ గోడౌన్లో నిల్వచేయడం ద్వారా ప్రజాధనం వృథా అవుతోందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సభ దృష్టికి తెచ్చారు. ఇరిగేషన్ అధికారులు ఖరీఫ్ సాగునీటి ప్రణాళికను వివరిస్తూ గోదావరి మూడు డెల్టాల పరిధిలో 10.13 లక్షల ఎకరాలకు జూన్ ఒకటిన నీరు విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాలకు విడుదల చేసినట్లే, మెట్ట ప్రాంతంలోని ఏలేరు, భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులు, పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్ ల కింద ఉన్న 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా జూన్ 1 నుంచి ఎందుకు నీరు విడుదల చేయలేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిలదీశారు. ఇరిగేషన్ అధికారుల మధ్య సమన్వయం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలువలలో మానవ విసర్జితాలను వదులుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారయణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్–1 నాటికి పురుషోత్తపట్నం వద్ద కనీస నీటి మట్టం స్థాయి 14 అడుగులకు దిగువకు ఉన్నందున ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతానికి నీటి విడుదల సాధ్య పడలేదని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ వివరణ ఇచ్చారు. ప్రస్తుతం 14.5 అడుగుల స్థాయికి జలాలు ఉన్నందున పుష్కర ద్వారా గురువారం నుంచి నీటి సరఫరా జరుగుతుందని, మిగిలిన మెట్ట ప్రాంత ప్రాజెక్టుల ద్వారా జూలై 15 నుంచి నీరు విడుదల చేస్తామన్నారు. పారిశ్రామిక కాలుష్యాలతో తుల్యభాగ నీరు విషతుల్యమవుతోందని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుల్యభాగ కాలుష్యంపై కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి చర్యలు తీసుకుంటుందని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పేర్కొన్నారు. కోనసీమలో కూనవరం డ్రైన్ వెంబడి చల్లపల్లి –చింతలపూడి లాకుల వరకూ ఉప్పునీరు వెనుకకు తన్నుకు రావడంతో వందలాది ఎకరాల్లో సేద్యం దెబ్బతింటోందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సభ దృష్టికి తెచ్చారు. దీనిపై కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ కల్పించుకుని పరిశీలించి చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి కాలువలు, డ్రైన్ల ఆధునీకరణ, డ్రైనేజీ బోర్డు ఏర్పాటుకు చైర్పర్సన్ వేణుగోపాలరావు ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే ఆధార్ నంబర్తో మూడు కరెంటు మీటర్లు ఉండటంతో తల్లికి వందనం మంజూరు కాకపోవడం తగదని, గ్రామ పంచాయతీలకు 2023 నుంచి స్టాంపు డ్యూటీ జమ చేయాలని, ధాన్యం సొమ్ము సత్వరం చెల్లించాలని, గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణతో సీజనల్ వ్యాధులను నివారించాలని, మండలాల్లో చేసిన పనులకు చెల్లింపులు చేపట్టాలని జెడ్పీటీసీలు విజ్ఞప్తి చేశారు. రంపచోడవరం మన్యం ప్రాంతంలో రహదారులు అధ్వానంగా మారాయని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్సీ అనంతబాబు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిలో సాగునీరు, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకరణకు, డ్రైనేజీ బోర్డు పునరుద్ధరణకు ప్రభుతాన్ని కోరుతూ సర్వసభ్య సమావేశం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత రాజోలు ఎంపీపీ అధ్యక్షుడు కేతా శ్రీనివాసరావు ఆకస్మిక మృతికి సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. కాకినాడ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ మనీషా, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు పాల్గొన్నారు. ధాన్యం సొమ్ము ఎప్పుడిస్తారు మెట్టకు సాగునీరు మాటేమిటి? జెడ్పీ సమావేశంలో గళమెత్తిన సభ్యులు -
తలుపులమ్మకు భీమేశ్వరస్వామి ఆలయం నుంచి చీర–సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి ఆషాడ మాసోత్సవాలను పురస్కరించుకుని ద్రాక్షారామ శ్రీమాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి దేవస్థానం నుంచి ఆలయ సహాయ కమిషనర్ ఎ.దుర్గాభవానీ చీర–సారె సమర్పించారు. బుధవారం లోవ దేవస్థానానికి చీర–సారెతో వచ్చిన భీమేశ్వరస్వామి దేవస్థానం బృందానికి వేద పండితులు, ప్రధాన అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి చీర సారె సమర్పించిన సహాయ కమిషనర్ దుర్గాభవానీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని, ప్రసాదాలను బహూకరించారు. బిల్లుల చెల్లింపులకు నిధులివ్వండి కాంట్రాక్టర్ల వినతి కాకినాడ సిటీ: జిల్లా పరిషత్ గ్రాంట్లతో చేసిన పనుల బిల్లులు తక్షణమే చెల్లించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డివిజన్ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాకినాడలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరైన జెడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు, కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్కుమార్కు వినతిపత్రాలు అందజేశారు. మూడేళ్లుగా జిల్లా పరిషత్ నుంచి వచ్చిన గ్రాంట్లతో అన్ని పనులు పూర్తి చేసినా బిల్లులు విడుదల చేయలేదన్నారు. పెండింగ్ బిల్లులు సత్వరమే మంజూరు చేయాలని కాంట్రాక్టర్లు కోరారు. -
డ్రెయిన్లో పడి యువకుడి మృతి
కాజులూరు: మోటార్ బైక్ అదుపు తప్పడంతో స్థానిక టేకి డ్రెయిన్లో పడి దాకమూరి నాగరాజు (22) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం కోలంక గ్రామానికి చెందిన దాకమూరి నాగరాజు హైదరాబాద్లో ర్యాపిడో సర్వీసులో పనిచేస్తున్నాడు. ఇటీవల గ్రామంలో అమ్మవారి జాతరకు వచ్చాడు. సోమవారం రాత్రి కోలంక నుంచి ద్రాక్షారామ వెళుతుండగా, ఉప్పుమిల్లి శివారు గొప్పిరేవు వద్ద మోటార్ బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో నాగరాజు శిథిలమైన రెయిలింగ్ నుంచి టేకి డ్రెయిన్లో పడిపోయాడు. మృతదేహం కొట్టుకుపోయి, తాళ్లరేవులో లభ్యమైంది. కాగా, నాగరాజుకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఉన్నారు. కోలంకలో మృతుని ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు గొల్లపాలెం పోలీసులు తెలిపారు. ఎస్సై మోహన్కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. -
పేపర్మిల్లో గ్యాస్ లీకేజీ కలకలం
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి ఆంధ్రపేపర్ మిల్లులో గ్యాస్ లీకేజీ కలకలం సృష్టించింది. పేపర్ మిల్లు నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. గత నెల 29వ తేదీన బరోడా నుంచి రాజమండ్రి పేపర్ మిల్కు 26 టన్నుల హైడ్రోజన్ పెరాకై ్సడ్ లోడులో ఓ ట్యాంకర్ వచ్చింది. ట్యాంకర్లోని గ్యాస్ను వెంటనే దిగుమతి చేసుకోకపోవడంతో, ట్యాంకర్ అలాగే ఉండిపోయింది. నాలుగు రోజులుగా పేపర్ మిల్ నార్త్ గేటు వద్ద ట్యాంకర్ నిలిపేశారు. బుధవారం ఉదయం నుంచి గ్యాస్ లీక్ కావడంతో ఎలాంటి ప్రమా దం జరుగుతుందోనని స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైరింజిన్లతో గ్యాస్ లీకేజీని అరికట్టే చర్యలు చేపట్టారు. ఘటన స్థలానికి పక్కనే పెట్రోల్ బంక్, పేపర్ మిల్ టింబర్ డిపో ఉండడంతో స్థానికులు భీతిల్లారు. సంఘటన స్థలాన్ని ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్, ఫ్యాక్టరీస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ కె.కృష్ణమూర్తి, జిల్లా పరిశ్రమల అధికారి వాణిధర్ రామన్ పర్యవేక్షించారు. వ్యూహాత్మకంగా నియంత్రణ కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉదయం 9.15 నిమిషాలు.. రాజమహేంద్రవరం ఫైర్ ఆఫీసుకు ఫోన్ వచ్చింది. పేపర్ మిల్కు వచ్చిన తన లారీ ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీక్ అవుతుందని చెప్పాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆర్యాపురం ఫైర్ ఆఫీసు నుంచి ఫైరింజిన్ బయలుదేరింది. ట్యాంకర్ నుంచి లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్ అధిక మొత్తంలో వ్యాపిస్తే, దానిని పీల్చిన వారి ఊపిరితిత్తులు పాడైపోతాయి. శరీరంపై పడితే పెద్ద బొబ్బలు ఏర్పడుతాయి. అప్రమత్తమైన అగ్ని మాపక బృందాలు జిల్లా ఫైర్ ఆఫీసర్ మార్టిన్ లూథర్కింగ్ నేతృత్వంలో సంఘటన స్థలంలో నియంత్రణ చర్యలు చేపట్టాయి. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఫైర్ ఆఫీసు నుంచి మరో రెండు, కొవ్వూరు నుంచి ఒక ఫైరింజిన్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. రెస్క్యూ టెండర్ వాహనాన్నీ రప్పించారు. హైడ్రోజన్ పెరాకై ్సడ్ లీకేజీతో ప్రజలకు ఏం కాకుండా పోలీసుల సహకారంతో పేపర్ మిల్ ప్రాంతంలో పూర్తిగా రాకపోకలు నిషేధించారు. ట్యాంకర్లోని హైడ్రోజన్ పెరాకై ్సడ్ను పూర్తిగా నిర్వీర్యం చేసేలా అగ్నిమాపక అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక కెమికల్ సూట్లు, సెపరేట్ డ్రెస్ను ధరించారు. ట్యాంకర్లో ఉష్ణోగ్రతను తగ్గించేందుకు కూలింగ్ వాటర్, వాయువులను చిమ్మారు. ఆపరేషన్ ప్రారంభించిన ఉదయం 9.30కు 47 డిగ్రీలున్న ఉష్ణోగ్రతను, మధ్యాహ్నం 12 గంటలకు 26 డిగ్రీలకు తగ్గించగలిగారు. లీకవుతున్న హైడ్రోజన్ పెరాకై ్సడ్పై నీటిని చల్లి, భూమిలోకి ఇంకిపోయేలా చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ట్యాంకర్ నుంచి హైడ్రోజన్ పెరాకై ్సడ్ పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టిన ఫైరాఫీసర్ శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బందిని అందరూ అభినందించారు. 4 గంటలు శ్రమించి నియంత్రించిన అగ్నిమాపక యంత్రాంగం భీతిల్లిన పరిసర ప్రాంతాల ప్రజలు -
మధ్యాహ్న భోజనం అమలులో అలసత్వం వద్దు
రికార్డుల నిర్వహణపై రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుల అసంతృప్తి కరప: ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలులో అలసత్వం వహించవద్దని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణకిరణ్, ఈ.లక్ష్మీరెడ్డి నిర్వాహకులకు హెచ్చరికలు జారీచేశారు. కోడిగుడ్లు ఎక్కువ నిల్వ ఉండటం, విద్యార్ధులకు దొడ్డుబియ్యంతో భోజనం పెట్టడం, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై కమిషన్ సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. బుధవారం వారు మండల అధికారులతో కలసి కరప మండలంలో అంగన్వాడీ కేంద్రాలను, హైస్కూలు, రేషన్ షాపులను, ఎంఎల్సీ పాయింట్ను తనిఖీ చేశారు. కొరిపల్లిలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. 3వ, 4వ ఫేజ్లో వచ్చిన 140 కోడిగుడ్లు ఎక్కువ ఉండటాన్ని గుర్తించారు. అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసు జారీచేయాలని సీడీపీఓ వై.లక్ష్మిని ఆదేశించారు. కూరాడ జెడ్పీ హైస్కూల్లో దొడ్డు బియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టటం ఏమిటని హెచ్ఎం ప్రశ్నించారు. షోకాజ్ నోటీసు జారీచేయాలని ఎంఈఓ కె.బుల్లికృష్ణవేణిని ఆదేశించారు. -
భారత్మాలకు గ్రీన్ సిగ్నల్
పిఠాపురం: ‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం’ అన్న సినీ గేయంలా నీలి సముద్రం అంచునే ప్రయాణం హాయి గొలపనుంది. నీలి సముద్రంలో పడవ ప్రయాణంతో పాటు పక్కనే భారత్మాల జాతీయ రహదారిపై వాహనాల ప్రయాణం చూడముచ్చట గొలపనుంది. కేంద్ర జాతీయ రహదారుల విభాగం భారత్మాల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంది. పచ్చని చెట్లు, తెల్లని ఇసుక తిన్నెలు పక్కనే సముద్రం దానిని ఆనుకుని సన్నటి రోడ్డుతో ఇప్పటి వరకు ఉన్న తీర ప్రాంతం రానున్న రోజుల్లో పరిశ్రమలు, జాతీయ రహదారులతో పారిశ్రామిక వాడగా మారనుంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల నిధులు వెచ్చించి కాకినాడ నుంచి విశాఖ వరకు భారత్మాల పేరుతో పారిశ్రామిక వాడలను నౌకాశ్రయాలు, జాతీయ రహదారులతో అనుసంధానం చేసే ప్రక్రియకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రంగం సిద్ధం చేశాయి. భారత్మాల ప్రాజెక్టుతో తీర ప్రాంతం పారిశ్రామిక తీరంగా మారబోతోంది. అన్నవరం నుంచి కాకినాడ రూరల్ మండలం లైట్హౌస్ వరకు నాలుగులైన్ల రోడ్డు నిర్మాణానికి రంగం సిద్ధమవుతుండడంతో జిల్లాలో సాగరతీరం పారిశ్రామిక మణిహారంగా మారబోతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కాకినాడ సాగరతీరంలో పారిశ్రామికీకరణకు చర్యలు తీసుకున్నారు. ఆయన సూచనల మేరకు అప్పటి కాకినాడ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ భారతమాల ప్రాజెక్టుకు ఆమోద ముద్ర వేయించారు. అప్పట్లోనే ఈ రోడ్డుకు భూసేకరణ కూడా పూర్తి చేశారు. 40.621 కిలోమీటర్ల మేర రోడ్డు ఇప్పటి వరకు సాధారణ రోడ్డు సౌకర్యం మాత్రమే ఉన్న కాకినాడ తుని తీర ప్రాంతానికి జాతీయ రహదారిని అనుసంధానం చేయనున్నారు. దీనికోసం కాకినాడ రూరల్ మండలంలో వాకలపూడి లైట్హౌస్ నుంచి తిమ్మాపురం, నేమాం, కొత్తపల్లి మండలంలో కొమరగిరి, కొత్తపల్లి, కుతుకుడుమిల్లి, ఉప్పాడ, అమీనాబాద, యండపల్లి, అమరవిల్లి, మూలపేట, రమణక్కపేట, పొన్నాడ, తొండంగి మండలంలో కోన ఫారెస్ట్ ఏరియాలో ఏవీనగరం, తొండంగి, శృంగవృక్షం, పీఈ చిన్నయిపాలెం, ఏ కొత్తపల్లి, బెండపూడి, శంఖవరం మండలం అన్నవరం వరకు రోడ్డు నిర్మాణం కానుంది. ఈ నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి 180 ఎకరాల భూమిని సేకరించారు. 45 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. భూసేకరణ పూర్తి కావడంతో రోడ్డు నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు 40.621 కిలోమీటర్ల మేర నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం కానుంది. నిధులు మంజూరు భారత్మాల ఎన్హెచ్ 16 ఎఫ్ భారత్మాల పరియోజన ఫేజ్ 1లో భాగంగా రోడ్డు నిర్మాణానికి కేంద్రం తొలి విడతగా రూ.1,040 కోట్లు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణ పనులకు టెండర్లను ఆహ్వానించింది. గత నెల 27న టెండర్లకు ఆహ్వానం పలుకుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆగస్టు 14వ తేదీ వరకు టెండర్లకు గడువు విధించారు. ఆగస్టు 18న బిడ్లు తెరవనున్నారు. రోడ్డు నిర్మాణానికి రెండేళ్ల గడువు విఽధించారు. రెండేళ్ల పది రోజుల్లో రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు నిర్మాణం పూర్తి అయితే విశాఖపట్నం పోర్టు కాకినాడ పోర్టుకు అనుసంధానం కానుంది. రవాణా వ్యవస్థ పటిష్టం అవడంతో పాటు మత్స్య సంపద రవాణాకు మార్గం సుగమం అవుతుంది. రెండు పోర్టులు అనుసంధానం తీర ప్రాంతంలో ఉన్న విశాఖపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానం చేయడంలో ఈ రోడ్డు కీలక పాత్ర వహిస్తుంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో పెరుమాళ్లపురంలో నిర్మాణమవుతున్న పోర్టు, ఉప్పాడ తీరంలో నిర్మాణం అవుతున్న మేజర్ హార్బర్లకు ఈ రహదారి కీలకంగా మారనుంది. ఇప్పటి వరకు ఈ తీర ప్రాంతంలో ఏ సరకు రవాణా జరగాలన్నా అటు ఏడీబీ రోడ్డు, ఇటు కాకినాడ– తుని బీచ్ రోడ్డు మాత్రమే ఉపయోగపడేవి. బీచ్ రోడ్డులో భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో భారత్మాల నిర్మాణం ఇక్కడ పారిశ్రాక రంగానికి ఒక మైలు రాయిగా నిలవనుంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే పారిశ్రామికాభివృద్ధి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దానిలో భాగంగా మన తీర ప్రాంతంలో ఉప్పాడ మేజర్ హార్భర్, పెరుమాళ్లపురం పోర్టు, కాకినాడ సీపోర్టు నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. వీటన్నింటికి రవాణా సౌకర్యం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భారత్మాల పరి యోజన కింద అన్నవరం నుంచి కాకినాడకు భారత్మాల నాలు లైన్ల రోడ్డు మంజూరుకు కృషి చేశాం. అప్పట్లో దానిని మంజూరు చేయించి భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, రోడ్డు నిర్మాణానికి బాటలు వేశాం. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడం శుభపరిణామం. ఇదంతా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పారిశ్రామికీకరణకు తీసుకున్న చర్యల ఫలితమనే చెప్పవచ్చు. – వంగా గీతావిశ్వనాఽథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి అన్నవరం నుంచి కాకినాడ వరకు నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం తొలి విడతగా రూ.1,040 కోట్లు మంజూరు, టెండర్లకు ఆహ్వానం రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికి చర్యలు రూపురేఖలు మారనున్న సాగర తీరం ఫలించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వ కృషి -
అన్నదాత ఇంట.. సిరుల పంట
ఆలమూరు: వ్యవసాయంలో అధిక పెట్టుబడిని, కూలీల కొరతను ఎదుర్కొనేందుకు రైతులు అనేక అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో వరి సాగులో ఏటా అనేక మార్పులు సంభవిస్తూ, వ్యవసాయం కొత్త పుంతలు తొక్కుతుంది. అత్యాధునిక, పురాతన సంప్రదాయాలతో వ్యవసాయం చేపట్టడం ద్వారా రైతులు పెట్టుబడిని నియంత్రించుకుని అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఈ ఏడాది రబీ సీజన్లో దిగుబడి ఆశాజనకంగా ఉన్నా, సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కొంత నిరుత్సాహంగా ఉన్నారు. ఈ సీజన్లో ధాన్యం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయకపోయినా, అన్నదాత సుఖీభవ అమలు చేయకపోయినా రైతులు మాత్రం ఖరీఫ్ సీజన్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలు, కూలీల కొరత వల్ల పెట్టుబడిని తగ్గించుకునేందుకు ఈసారి అధికంగా రైతులు వినూత్న రీతిలో వెదజల్లు సాగు చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.64 లక్షల ఎకరాల్లో 1.06 లక్షల మంది రైతులు వ రిసాగు చేపట్టారు. స్వర్ణ (7029)కు ప్రత్యామ్నాయంగా ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఈ కొత్త వంగడాల వల్ల నారుమడులు సరైన రీతిలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే, చీడపీడలు నివారించి నష్ట నివారణను అరికట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. స్వర్ణ (7029)కే రైతుల మొగ్గు రైతులు మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు. ఈ సీజన్లో 70 శాతం మేర స్వర్ణ రకం సాగు చేస్తుండగా, మిగతా ఇతర రకాలను సాగు చేస్తున్నారు. ఈ ఖరీఫ్ సాగుకు 35 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని అంచనా వేయగా, రైతుల నుంచి సుమారు మూడు వేల క్వింటాళ్ల సేకరణ ఇప్పటికే జరిగింది. ప్రస్తుతం వివిధ గ్రామాల్లో దాదాపు వెయ్యి క్వింటాళ్ల విత్తనాలు ఆర్ఎస్కేలకు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ సమాయత్తమవుతోంది. ఈ సీజన్లో సుమారు 80 శాతం మేర వెదజల్లు సాగును ఎంచుకోగా, మిగిలిన రైతులు వరినాట్ల పద్ధతిని అవలంబిస్తున్నారు. సాగునీటి ఎద్దడి దృష్ట్యా వ్యవసాయ శాఖ ఈ నెల 15 నాటికి నాట్లు పూర్తి చేయాలని సూచించడంతో, రైతులు పనులను వేగవంతం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా వెదజల్లు వల్ల లాభాలపై అవగాహన కల్పించడంతో రైతులు ఈ విధానంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు రైతులకు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో, సమయానికి ముందే రైతులు సాగు చేపట్టారు. డ్రమ్ సీడర్ వినియోగంతో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నా, రైతులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఆ దిశగా చర్యలు చేపట్టలేదని అంటున్నారు. కలుపు యాజమాన్య పద్ధతి పంట తొలి దశలో నీరు నిలగట్టక ఆరుతడిగా సాగు చేయడం వల్ల కలుపు సమస్య అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ పద్ధతిలో కలుపు మందును తప్పనిసరిగా వాడాలి. ఎకరాకు 35 గ్రాముల ఆక్సాడయార్జిల్ లేదా ప్రెటిలాక్లోర్ మందును ఎకరాకు 400 మి.లీ లేదా పైరజో సల్ఫ్యురాన్ ఇథైల్ 100 గ్రాముల మందును 20 కిలోల పొడి ఇసుకలో కలపాలి. ఈ మందును వెదజల్లు విధానంలో విత్తిన 3–5 రోజుల్లో పొలంలో పలచగా, నీరు పెట్టి కలుపు మందును పిచికారీ చేయాలి. తర్వాత పొలంలో నీరు తీసి వేయడం ద్వారా కలుపును నివారించవచ్చు. రెండో దశ నుంచి పొలంలో ఏర్పడిన కలుపును మొక్కల మధ్ద తొక్కడం ద్వారా ఎరువుగా మలచుకోవచ్చు. నీటి యాజమాన్యం విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వచ్చే వరకూ పొలంలో నీరు నిల్వ ఉండకుండా కేవలం బురదగా మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఎక్కువైన నీటిని బయటకు పోవడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వరి కంకి వేర్లు ఆరోగ్యంగా పెరిగి, ఎక్కువ పిలకలకు అవకాశం ఉంటుంది. పైరు పొట్ట దశ నుంచి పంట కోసే పది రోజుల ముందు రెండు సెం.మీ. నీరు నిల్వ ఉండేలా చూడాలి. డ్రమ్ సీడర్ పద్ధతిలో.. దమ్ము చేసిన అనంతరం చదును చేసిన భూమిలో పలచటి నీటి పొర ఉండేలా చూసుకుని, మండి కట్టిన విత్తనాన్ని చల్లాలి. డ్రమ్ సీడర్ పరికరానికి నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సె.మీ. దూరంలో రెండు చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. ఈ డ్రమ్ములో మొలకెత్తిన విత్తనాలను నింపి మూతను బిగించాలి. గింజలు నింపి, డ్రమ్ సీడర్ను లాగితే ఎనిమిది వరుసల్లో 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. దీంతో వరుసల్లో కుదురు కుదురుకు మధ్య దూరం 5–8 సెం.మీ. దూరం ఉంటుంది. ప్రతి 16 వరుసలకు అడుగు వెడల్పులో కాలిబాటలు వేసుకోవాలి. తాడు లాగి డ్రమ్ వాడితే వరుసలు బాగా వచ్చి, విత్తు సక్రమంగా ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో వెదజల్లుపై రైతుల ఆసక్తి పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడి డ్రమ్ సీడర్ పద్ధతితో మరింత మేలు కనీస జాగ్రత్తలు కీలకం వెదజల్లు సాగు విధానంలో కనీస జాగ్రత్తలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వ్యవసాయాధికారి బోసుబాబు చెబుతున్నారు. వెదజల్లు విధానంలో విత్తనాలను 24 గంటల పాటు నానబెట్టాలి. మరుసటి రోజు ఆ విత్తనాలను గోనె సంచె కప్పి నిల్వ ఉంచాలి. విత్తనం ముక్కు పగిలి తెల్లగా మోసు వచ్చే క్రమంలో పొలంలో విత్తనాలను వెదజల్లాలి. విత్తనాలకు మొక్కలు వచ్చే వరకూ పొలంలో నీరు లేకుండా కాలువలు ఏర్పాటు చేసి, నీటిని బయటకు పంపాలి. వారం తర్వాత ఒకసారి పంటకు నీరును అందజేసి, మరుసటి రోజు తొలగించాలి. దమ్ము చేసే సమయంలో పొలంలో ఎగుడుదిగుడులు లేకుండా నేలను సమాంతరంగా ఉండేలా చూడాలి. ఎకరానికి 16 నుంచి 20 కిలోల విత్తనాలను నాటాలి. వరినాట్లు నాటే 15 రోజుల ముందు ఒకసారి దమ్ము చేయాలి. నాలుగు రోజుల ముందుగా చదును చేయాలి. ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలువలను ఏర్పాటు చేయాలి. కలుపు నివారణకు బింతియోకార్బ్ లేదా అనిలోఫాస్ 1.25 లీటర్ల మందును 27 కిలోల ఇసుకలో కలిపి చల్లితే కలుపును నివారించవచ్చు. వెదజల్లుతో ప్రయోజనాలు తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసి, కూలీల కొరతను అధిగమించవచ్చు. సాగునీటి ఎద్దడిని అధిగమించవచ్చు. పంట పది రోజుల ముందే కోతకు వస్తుంది. భూమి సారవంతమవుతుంది. మొక్కలో సాంద్రత పెరిగి, పది శాతం మేర అధిక దిగుబడికి అవకాశం ఉంది. సాధారణ పద్ధతిలో వరి సాగుకు ఎకరం పొలంలో నారుమడికి 30 కేజీల విత్తనాలు అవసరం. వెదజల్లులో కేవలం 12 నుంచి 18 కేజీలు చాలు. కలుపు మొక్కలను సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఎరువుగా మలుచుకోవచ్చు. నారుమడులు పోసి ఊడ్చేందుకు పట్టే ఎక్కువ సమయాన్ని, వెదజల్లు సాగుతో అరికట్టవచ్చు. పెట్టుబడి పరంగా రూ.మూడు వేల వరకూ ఆదా అవుతుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట కాలం కోల్పోకుండా, నీరు అందుబాటులో ఉన్నప్పుడే సాగుకు అవకాశం ఉంటుంది. -
అనధికార మద్యం అపాయకరం
జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి లావణ్య రాజమహేంద్రవరం రూరల్: లైసెన్స్ పొందిన రిటైల్ దుకాణాల నుంచి మాత్రమే మద్యం కొనుగోలు చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య ఓ ప్రకటనలో తెలిపారు. అనధికార (లైసెన్స్ లేని) వ్యక్తుల నుంచి మద్యం కొనుగోలు చేయడం చాలా అపాయకరమన్నారు. అటువంటి మద్యం నకిలీది కావచ్చన్నారు. వివాహాలు, పార్టీలు లేదా ఇతర సామూహిక వేడుకల సందర్భాల్లో మద్యాన్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తామంటూ మోసం చేసే అవకాశం ఉందన్నారు. వారు సరఫరా చేసే నకిలీ మద్యం ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించవచ్చని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీయవచ్చన్నారు. అటువంటి అనుమానిత వ్యక్తుల వివరాలను వెంటనే ఎకై ్సజ్ శాఖకు తెలియజేయాలన్నారు. ట్రోల్ ఫ్రీ నంబరు 14405కి కానీ, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి 96767 14547 నంబర్కు కానీ తెలపాలని కోరారు. -
కారు ఢీకొని వ్యాపారి మృతి
ఏలేశ్వరం: అతివేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఓ వ్యాపారి మృతి చెందిన సంఘటన ఇది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, పట్టణానికి చెందిన గూడపాటి నాగసత్య చంద్రశేఖర్(44) పాత ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా చెప్పుల షాపు నిర్వహిస్తున్నాడు. షాపు వద్దే అతడి ఇల్లు కూడా ఉంది. షాపు వెనుక భాగంలో భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో నల్లరాయి చిప్స్ లారీ వస్తుందని సమాచారం రావడంతో, మంగళవారం అర్థరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో వర్షం కురుస్తోంది. గొడుగు వేసుకుని.. షాపు ఎదురుగా రోడ్డు దాటుతుండగా, యర్రవరం రోడ్డులో ఏలేశ్వరం వైపు అతివేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొంది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీపంలోని షాపులో ఉన్న సీసీ కెమెరాలో ప్రమాద సంఘటన రికార్డు అయినట్టు పోలీసులు గుర్తించారు. మృతుడికి భార్య దివ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రత్తిపాడు ఆస్పత్రిలో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నవ్వుతూ ఉండే వ్యక్తి ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఉండే చంద్రశేఖర్.. రోడ్డు ప్రమాదంలో మృతిచెందడాన్ని అతడి బంధువులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి మృతితో భార్యాపిల్లలు, తల్లిదండ్రులు తీవ్రంగా విలపిస్తున్నారు. వీరిని ఓదార్చడం బంధువులకు కష్టంగా మారింది. -
మోటారు సైకిళ్ల దొంగ అరెస్టు
ఏడు బైక్లు స్వాధీనం కాకినాడ రూరల్: వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిళ్లను దొంగిలించిన కేసులో కాకినాడ అర్బన్ కామేశ్వరినగర్ రామకృష్ణారావుపేటకు చెందిన యువకుడు కడియాల ప్రేమ్కుమార్ అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ జిజ్జును సర్పవరం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్సై పి.శ్రీనివాస్కుమార్ వివరాల మేరకు, నిందితుడు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడ్డాడు. అతడిపై నిఘా ఉంచి, అరెస్టు చేశారు. సుమారు రూ.3.5 లక్షల విలువైన ఏడు మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్సై శ్రీనివాస్కుమార్తో పాటు, ఏఎస్సైలు శ్రీనివాస్, నాగేశ్వరరావు, హెచ్సీలు సత్తిబాబు, రాజు, ప్రసాద్, పీసీలు అనిల్, కిశోర్ను సీఐ పెద్దిరాజు అభినందించారు. -
పరిమళించిన మానవత్వం
తూర్పు గోదావరి: ఏం చేస్తుందో ఆమెకు తెలియడం లేదు. ఎండైనా.. వానొచ్చినా మురుగు కాలువలోకి దిగి గంటల తరబడి ఉండిపోతోంది. ఎట్టకేలకు కొందరు చొరవ చూపడంతో.. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని ఓ యువతి దయనీయ స్థితిలో మురికి కాలువలోనే రెండు రోజుల పాటు గడిపిన హృదయ విదారక సంఘటన కోరుకొండ బస్టాండ్ సెంటర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎక్కడి నుంచి వచ్చిందో, కోరుకొండలో ఆమె సంచరిస్తోంది. మతి స్థిమితం లేకపోవడంతో ఎవరైనా పెట్టింది తిని కాలం వెళ్లదీస్తోంది. రెండు రోజుల నుంచి స్థానిక బస్టాండ్ సెంటర్ను ఆనుకుని ఉన్న మురుగు కాలువలోకి దిగి, మళ్లీ బయటకు వస్తోంది. దుర్వాసన వస్తున్నా.. వ్యర్థాల మధ్యే రెండు రోజులుగా ఇలా చేస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు ఈ కాలువ నుంచే గోదావరి నదిలోకి వెళ్తుంది. కొన్ని రోజులుగా కాలువకు వర్షపు నీరు రాకపోవడంతో ఆమెకు ఎటువంటి అపాయం కలగలేదు. కొందరు స్థానికులు ఈ విషయాన్ని పంచాయతీ వారి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పారిశుధ్య కార్మికులు మంగళవారం ఆమెను కాలువ నుంచి బయటకు తీసుకొచ్చారు. సైగలు చేస్తూ, పొడిపొడిగా మాట్లాడుతూ ఆమె భయంగా ఉంటోంది. పారిశుధ్య కార్మికులు జలడుగుల చిన్నపార్వతి, సోమాజుల బంగారమ్మ, రాజమహేంద్రవరానికి చెందిన డివైన్హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆమె చికిత్స పొందుతోంది. -
తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది..
తూర్పు గోదావరి: బాగా చదువుకుంది. జీవితంలో ఏదో సాధించాలనే తపనతో ఉద్యోగంలో చేరింది. చిరుద్యోగులైన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయించుకుంది. తానొకటి తలిస్తే.. విధి ఒకటి తలచిందని.. ఉద్యోగంలో చేరిన రెండు నెలలకే ఆమెను మృత్యువు కబళించింది. ఆమె ఆశలన్నీ కల్లలయ్యాయి.తెలంగాణలో పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చాగల్లుకు చెందిన యువతి మృతి చెందడంతో చాగల్లులో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన పొలిశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రసన్న(22) ఈ దుర్ఘటనలో మృతి చెందింది. రెండు నెలల క్రితమే ఫ్యాక్టరీలో కెమిస్ట్గా ఉద్యోగంలో చేరిన ప్రసన్న మరణాన్ని కుటుంబ సభ్యులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. తండ్రి శ్రీనివాసరావు మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులు, అనాథ పిల్లల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాపీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి రామలక్ష్మి ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రసన్న కాగా, చిన్న కుమార్తె ప్రభుకుమారి ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతుంది. ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. ప్రసన్న అత్త కొడుకు కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామానికి చెందిన యాతం మహేష్ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రసన్న కూడా రెండు నెలల క్రితమే అదే ఫ్యాక్టరీలో ఉద్యోగంలో చేరింది. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీ పనిపై మహేష్ బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. దుర్ఘటన విషయం తెలుసుకుని.. అదే సమయంలో డ్యూటీలో ఉన్న ప్రసన్న కూడా ప్రమాదానికి గురైందని గ్రహించి ఆమె తల్లిదండ్రులకు మహేష్ సమాచారం అందించాడు. సోమవారం సాయంత్రం శ్రీనివాసరావు, రామలక్ష్మి హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు.ఎన్నో ఆశలతో..దుర్ఘటనలో మృతిచెందిన ప్రసన్న బీ–ఫార్మసీ చది వింది. ఉన్నత చదువు అభ్యసించి జీవితంలో మంచి స్థానం సాధించాలని ఆశించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఫ్యాక్టరీలో స్టైఫండ్ తీసు కుంటూ క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఉద్యోగంలోకి చేరింది. ఎం–ఫార్మసీ చేయాలన్న తపనతో ఓ శిక్షణ సంస్థలో కూడా చేరింది. ఇదే విషయాన్ని దుర్ఘటనకు ముందురోజు ఆమె తల్లితో ఫోన్లో చెప్పింది. తాను ఎం–ఫార్మసీ చదివేందుకు ఫీజు చెల్లించానని ఆనందం పంచుకుంది. సోమవారం సాయంత్రం ఏడు గంటల నుంచి జరిగే క్లాసులకు వెళుతున్నానని తల్లికి చెప్పింది. ఎంతో ఆనందాన్ని పంచుకున్న కుమార్తె తమను విషాదంలో విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.కన్నీరుమున్నీరైన చెల్లెలు చిన్ను(ప్రసన్న) కుటుంబ సభ్యులందరితో కలివిడిగా ఉండేదని, తామిద్దరం అక్కాచెల్లెలైనా.. స్నేహితుల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని ప్రసన్న చెల్లెలు ప్రభుకుమారి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. ప్రసన్న ఇంటి వద్ద బంధువుల రోదనలు హృదయవిదారకంగా మారాయి. -
రెండు పొక్లెయిన్లు సీజ్
పి.గన్నవరం: మండలంలోని మానేపల్లిలంకలో అనుమతులు లేకుండా మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలకు వినియోగిస్తున్న రెండు పొక్లెయిన్లను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ మంగళవారం సీజ్ చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో పి.గన్నవరం మండలంలోని యర్రంశెట్టివారిపాలెం, పెదకందాలపాలెం, మానేపల్లిలంకలో ర్యాంపులను తహసీల్దార్ పి.శ్రీపల్లవితో కలిసి ఆర్డీఓ పరిశీలించారు. మానేపల్లిలంకలో ఉన్న పొక్లెయిన్లను సీజ్ చేసి మైన్స్ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ 15 వరకూ జిల్లాలో ఎక్కడా మట్టి, ఇసుక తవ్వకాలు జరపరాదని కలెక్టర్ ఆదేశించారన్నారు. అక్రమ తవ్వకాలు సాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాంపుల్లోకి లారీలు, ట్రాక్టర్లు వెళ్లకుండా బాటలను కట్ చేయించాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో ఎంత మేరకు అక్రమ తవ్వకాలు జరిపారో డ్రోన్ల ద్వారా సర్వే చేయించి, సంబంధిత వ్యక్తులకు డిమాండ్ నోటీసులు పంపిస్తామని ఆర్డీఓ చెప్పారు. -
లారీని ఢీకొన్న గూడ్స్ ఆటో
జొన్నాడకు చెందిన డ్రైవర్ మృతి కిర్లంపూడి: ఆగి ఉన్న లారీని గూడ్స్ ఆటో ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద చోటుచేసుకుంది. కిర్లంపూడి ఎస్సై జి.సతీష్ తెలిపిన వివరాల మేరకు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సూరిశెట్టి శ్రీధర్(43) గూడ్స్ఆటోలో విశాఖపట్నానికి పువ్వుల లోడుతో కిరాయికి వెళ్లాడు. అక్కడి నుంచి న్యూస్ పేపర్ల లోడును వేసుకుని రాజమండ్రికి తిరిగొస్తుండగా, మంగళవారం తెల్లవారుజామున కృష్ణవరం టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో శ్రీధర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. హైవే అంబులెన్స్లో అతడిని ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలోనే మరణించాడు. అతడి సోదరుడు సూరిశెట్టి గంగాజలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. గ్రామంలో తీవ్ర విషాదం ఆలమూరు: రోడ్డు ప్రమాదంలో సూరిశెట్టి శ్రీధర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన శ్రీధర్ 12 ఏళ్లుగా జొన్నాడలో నివసిస్తున్నారు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. యజమాని శాశ్వతంగా దూరం కావడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. ఇక తమకు దిక్కెవరంటూ మృతదేహం వద్ద కుటుంబీకులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది. బంధువులు విషాదంలో మునిగిపోయారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కనకాయలంక కాజ్ వే వద్ద వంతెన నిర్మాణం
రూ.22.83 కోట్లకు పరిపాలనా ఆమోదం పి.గన్నవరం: కొద్దిపాటి వరదకే కాజ్ వే నీటమునిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కనకాయలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు తీరనున్నాయి. మండలంలోని చాకలిపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న కనకాయలంక కాజ్ వే వద్ద హై లెవెల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.22.83 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలనా ఆమోదం ఇచ్చినట్టు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ (ధవళేశ్వరం) ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ తెలిపారు. కనకాయలంక, చాకలిపాలెం (వశిష్ట ఎడమ ఏటిగట్టు) గ్రామాలను కలుపుతూ వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి అనుమతి లభించిందన్నారు. రూ.24 కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, రూ.22.83 కోట్లు మంజూరైనట్టు తెలిపారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కనకాయలంక గ్రామంలో సుమారు మూడు వేల మంది నివసిస్తున్నారు. వారి జీవన విధానం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలంతో ముడిపడి ఉంది. నిత్యం కాజ్ వే దాటి పి.గన్నవరం మండలానికి వస్తుంటారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తే కనకాయలంక కాజ్ వే మునిగిపోతోంది. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో కాజ్ వే దాటి వస్తుంటారు. వరద నీరు మరీ ఎక్కువైతే పడవలపై ప్రయాణిస్తారు. ఇక్కడ వంతెన నిర్మాణం పూర్తయితే కనకాయలంక గ్రామాల ప్రజల వరద కష్టాలు తీరతాయి. పెదలంక వద్ద వంతెన అలాగే వరద సమయాల్లో ప్రజల రాకపోకల కోసం వశిష్ట ఎడమ ఏటిగట్టు నుంచి యలమంచిలి మండలం పెదలంకకు రూ.80.8 లక్షలతో సింగిల్ లైన్ రోడ్డు వంతెనకు కూడా పరిపాలనా ఆమోదం లభించినట్టు ఈఈ జి.శ్రీనివాస్ తెలిపారు. టెండర్లు పూర్తయిన తర్వాత ఈ వంతెన పనులు ప్రారంభమవుతాయని ఈఈ గంగుమళ్ల శ్రీనివాస్ వివరించారు. -
14 నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో శిక్షణ ఉంటుందని శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ ఎ.రవిశంకర్ తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని ఎంపీటీసీ సభ్యులకు సామర్లకోట ఈటీసీలోనే శిక్షణ ఇవ్వాలని తొలుత నిర్ణయించారని, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈటీసీ సిబ్బంది ఆయా జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చాయన్నారు. దాంతో ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులకు మంగళవారం శిక్షణ ప్రారంభించినట్టు వివరించారు. కోర్సు డైరెక్టర్గా కేఆర్ నిహారిక, ఫ్యాకల్టీలు వి.జగన్నాథం, ఖాజా మొహీద్దీన్ శిక్షణ ఇస్తారన్నారు. రెండో తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా మహిళా ప్రాంగణంలో, ఎనిమిదో తేదీ నుంచి విశాఖపట్నంలోని జెడ్పీ మీటింగ్ హాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని జెడ్పీ మీటింగ్ హాల్లో శిక్షణ ఉంటుందన్నారు. నెల రోజులు సెక్షన్–30 అమలు అమలాపురం టౌన్: అమలాపురం పోలీస్ సబ్ డివిజన్లో నెల రోజుల పాటు సెక్షన్–30 అమలులో ఉంటుందని డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ మంగళవారం ఇక్కడ వెల్లడించారు. అమలాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అమలాపురం పట్టణం, అమలాపురం రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈ నెల 31 వరకూ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెప్పారు. ఈ నేప థ్యంలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు వంటివి నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి కార్యకలాపాలు జరపడానికి ముందుగా తన అనుమతి పొందాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకుంటున్న ఈ చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
కలెక్టరేట్ వద్ద రవాణా జేఏసీ ధర్నా అమలాపురం రూరల్: రవాణా శాఖాధికారులను పక్కనపెట్టి, వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ ప్రైవేట్ ఏజెన్సీలు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా రవాణా జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రవాణా జేఏసీ జిల్లా కో–ఆర్డినేటర్, ఆంధ్రా ఆటోవాలా జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి, కలెక్టర్ మహేష్కుమార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సత్తిరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల మోటారు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్ చేయడానికి జిల్లా రవాణా అధికారులను విస్మరించి, ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడం వల్ల వాహన యాజమానులు ఆర్థికంగా ఇబ్బందులు పడతారన్నారు. యాంత్రీకరణ విధానం నిలిపి, పాత విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా జేఏసీ అనుబంధ సంఘాల జిల్లా స్థాయి సదస్సు ఈ నెల 4న అమలాపురంలో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 9న సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని తెలిపారు. రవాణా జేఏసీ జిల్లా కన్వీనర్ రాగుర్తి వెంకటేశ్వరరావు, నాయకులు పోలిశెట్టి సీతారాంబాబు, బొంతు బాలరాజు, యాళ్ల వెంకటేశ్వరరావు, ఎల్లమెల్లి పెద్దా తదితరులు పాల్గొన్నారు. -
టెండర్ ఖరారు రేపే..
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సహా, రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలకు శానిటరీ మెటీరియల్, క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ గురువారం ఖరారు కానుంది. దీని ప్రైస్ బిడ్ను విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో గురువారం తెరవనున్నారు. సోమవారం టెక్నికల్ బిడ్ ఓపెన్ చేయగా, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి శానిటరీ ఏజెన్సీస్, తిరుపతికి చెందిన పద్మావతి హౌస్ కీపింగ్, ఫెసిలిటీ సంస్థ క్వాలిఫై అయ్యాయి. దీంతో ఆ రెండు సంస్థల ప్రైస్ బిడ్ గురువారం ఓపెన్ చేసి, లోయెస్ట్ కొటేషన్ దాఖలు చేసిన వారికి టెండర్ ఖరారు చేస్తారని అధికారులు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో ‘పద్మావతి’కి టెండర్ కాగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య రాష్ట్రంలో అన్నవరం దేవస్థానం సహా, పలు దేవస్థానాల్లో శానిటరీ టెండర్ను పద్మావతి సంస్థ దక్కించుకుంది. మొదట రెండేళ్ల కాల పరిమితికి టెండర్ దక్కించుకున్న ఈ సంస్థకు, తర్వాత అప్పటి టీడీపీ ప్రభుత్వం మరో రెండేళ్లు కాంట్రాక్ట్ పొడిగించింది. ఇప్పుడు మరలా అదే సంస్థ టెక్నికల్ బిడ్లో క్వాలిఫై కావడంతో, మరలా ఆ సంస్థకే టెండర్ దక్కే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పద్మావతి సంస్థ యజమాని భాస్కరనాయుడు టీడీపీ పెద్దలకు సన్నిహితుడు కావడమే కారణంగా చెబుతున్నారు. ప్రముఖ దేవస్థానాల్లో రీ టెండర్ గత ఏప్రిల్ నెలలో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలను వ్యక్తం చేయడంతో, రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో కొత్త నోటిఫికేషన్ను జూన్ 12న విడుదల చేసింది. టెండర్దారులు తమ కొటేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు తేదీ జూన్ 26గా నిర్ణయించారు. మొత్తం 23 మంది టెండర్ కోసం పోటీ పడినా, వివిధ కారణాలతో 21 మంది తప్పుకొన్నారు. చివరకు చైతన్యజ్యోతి, పద్మావతి సంస్థలు ప్రైస్ బిడ్కు ఎంపికయ్యాయి. ఏడు దేవస్థానాల్లో శానిటరీ నిర్వహణ టెండర్ దక్కించుకున్న సంస్థ రెండేళ్ల కాల పరిమితిలో అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదార్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనులు నిర్వహించాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో విడివిడిగా.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో దేవస్థానాల వారీగా శానిటరీ టెండర్లు ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని పది నెలలు జాప్యం చేసింది. ఒకే యూనిట్గా టెండర్లు నిర్వహించాలని గతేడాది ఆగస్టు 27న కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్ట్ ముగిసి ఆరు నెలలైనా.. అన్నవరం దేవస్థానంలో శానిటరీ విధులు నిర్వహిస్తున్న హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ కాంట్రాక్ట్ గతేడాది నవంబర్తో ముగిసింది. ఆ కాంట్రాక్ట్ ముగియడానికి ఒక నెల ముందుగానే గత అక్టోబర్లో టెండర్ విడుదల కావాల్సి ఉంది. టెండర్లు ఆలస్యం కావడంతో, దేవస్థానం కోరిక మేరకు ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు వరకు ఆ సంస్థ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి ఒకటి నుంచి తాము విధులు నిర్వహించలేమని దేవస్థానానికి లేఖ సమర్పించారు. దీంతో టెండర్ పిలవకుండానే గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్ సంస్థకు తాత్కాలికంగా పనులు అప్పగించారు. పెరగనున్న కాంట్రాక్ట్..? గత నవంబర్తో ముగిసిన కేఎల్టీసీ సంస్థ శానిటరీ టెండర్ నెలకు రూ.49 లక్షలు. దేవస్థానం కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలుగా చెల్లిస్తున్నారు. రూ.12 లక్షలు మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. మొత్తం నెలకు రూ.71 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి సెంట్రలైజ్డ్ టెండర్లో అత్యాధునిక మెషినరీలు ఉపయోగించాలనే షరతు విధించారు. శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాల చెల్లింపుతో పాటు, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్స్గా కొంతమందిని నియమించనున్నారు. ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఫలితంగా దేవస్థానంలో నెలకు శానిటరీ కాంట్రాక్ట్ రూ.80 లక్షలకు పైమాటే అంటున్నారు. ప్రముఖ దేవాలయాలకు గత ఏప్రిల్లో నోటిఫికేషన్ దానిని రద్దు చేసి మళ్లీ జూన్ 12న రీటెండర్ కొత్త షరతుల ప్రకారం రూ.80 లక్షలకు పెరిగే అవకాశం -
700 లీటర్ల డీజిల్ పట్టివేత
తాళ్లరేవు: కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నుంచి ఆంధ్రా ప్రాంతానికి ట్రాక్టర్లో అక్రమంగా తరలిస్తున్న 700 లీటర్ల డీజిల్ను పట్టుకున్నట్టు కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి కోరంగి పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో డీజిల్ను అక్రమంగా తరలిస్తున్న పాలకొల్లుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ట్రాక్టర్తో పాటు, 700 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు. ఐదుగురు జూదరుల అరెస్టు జగ్గంపేట: జగ్గంపేట శివారు గుర్రంపాలెం రోడ్డులో పోలవరం కాలువ వద్ద పేకాట శిబిరంపై జగ్గంపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఐదుగురిని అరెస్టు చేసినట్లు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు.ఈ దాడిలో రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఎస్సై రఘునాథరావు, సిబ్బంది దాడులు నిర్వహించినట్టు తెలిపారు. -
శృంగార వల్లభునికి రూ.31.66 లక్షల ఆదాయం
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి వారికి అన్నదానం, హుండీల ద్వారా రూ.31,66,081 ఆదాయం సమకూరింది. జిల్లా దేవదాయ శాఖ అధికారి కె.నాగేశ్వరరావు, డివిజనల్ ఇన్స్పెక్టర్ వి.ఫణీంద్ర కుమార్, సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి సమక్షంలో ఆలయంలోని హుండీలను మంగళవారం తెరచి, ఆదాయం లెక్కించారు. మొత్తం 104 రోజులకు గాను ఆలయ హుండీల ద్వారా రూ.23,89,935, అన్నదానం హుండీ ద్వారా రూ.7,76,146 మేర ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అరుణాచలానికి 8న ప్రత్యేక బస్సులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గురు పౌర్ణమి సందర్భంగా ఈ నెల 8న జిల్లాలోని మూడు డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోల నుంచి ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ బస్సులు బయలుదేరుతాయన్నారు. కాణిపాకం, శ్రీపురం దర్శనానంతరం అరుణాచలం చేరుతాయని తెలిపారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాళహస్తి దర్శనానంతరం ఈ నెల 11న ఆయా డిపోలకు చేరుతాయని వివరించారు. పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లేందుకు కూడా స్పెషల్ బస్సులు సిద్ధం చేశామని శ్రీనివాసరావు తెలిపారు. ఆర్అండ్బీ ప్రాజెక్ట్స్ ఈఈగా సీతయ్య బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా రోడ్లు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ప్రాజెక్టు ఈఈగా ఎన్.సీతయ్య మంగళవారం కాకినాడలో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఈగా పని చేస్తున్న మల్లికార్జున రిటైరయ్యారు. ఆయన స్థానంలో కొయ్యలగూడెం డీఈగా ఉన్న సీతయ్యకు ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయనను పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్యం రాంబాబు తదితరులు అభినందించారు. కుమార సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకాలు బిక్కవోలు: స్థానిక శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలో స్వామివారికి పెద్ద సంఖ్యలో భక్తులు మంగళవారం అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం, షష్ఠి కలసి రావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. అభిషేకాల అనంతరం స్వామివారికి అర్చకులు ప్రత్యేక అలంకరణ చేశారు. దేవదాయ శాఖ ఆధ్వర్యాన అన్నసమారధన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఈఓ రామలింగ భాస్కర్ ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. -
పట్టాభిరామ్ మనవారే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ ఆకస్మిక మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలముకున్నాయి. పట్టాభిరామ్కు ఈ జిల్లాతో విడదీయరాని అనుబంధమే ఉంది. ఉమ్మడి జిల్లాలోని కె.గంగవరం మండలం దంగేరులో ఆయన పూర్వీకులు నివాసం ఉండేవారు. అక్కడ నుంచి ద్రాక్షారామ సమీపంలోని దొడ్డంపేటలో తల్లిదండ్రులతో కలిసి నివాసముండగా పట్టాభిరామ్ రామచంద్రపురంలో ప్రాథమిక, మాధ్యమిక విద్యను అభ్యసించారు. ఉన్నత చదువుల కోసం కాకినాడ వచ్చి అక్కడి పీఆర్ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసించారు. కాలి వైకల్యంతో ఉన్న ఆయన ఆ లోపం కనపడకుండా ఉండేందుకు.. తండ్రి రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ సూచన మేరకు ప్రముఖ ఇంద్రజాలికుడు ఎంబీ రావ్ వద్ద ఇంద్రజాలంలో శిక్షణ పొందారు. అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. కాకినాడ నుంచి హైదరాబాద్లో భారత ఆహార సంస్థ ఉద్యోగిగా ఉంటూ అనేక ఇంద్రజాల ప్రదర్శనలు ఇస్తూ జిల్లా పేరు ప్రతిష్టలను రాష్ట్రవ్యాప్తం చేశారు. ఇంద్రజాలంతో పాటు వ్యక్తిత్వ వికాసంపై అనేక పుస్తకాలు రాశారు. ఇంద్రజాలం అంటే ఒక వినోదం మాత్రమే కాదని, మూఢనమ్మకాలపై పరోక్షంగా ఒక యుద్ధాన్ని చేశారు. 1949లో జన్మించిన పట్టాభిరామ్ 75 ఏళ్ల వయసులో ఖైరతాబాద్లో మృతి చెందడంతో ఈ ప్రాంత వాసులు ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. -
దేవస్థానం పునర్నిర్మాణానికి రూ.లక్ష విరాళం
అమలాపురం టౌన్: పురాతన దేవస్థానమైన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని సీతారామచంద్రమూర్తి స్వామి దేవస్థానం పునర్నిర్మాణానికి పట్టణానికి చెందిన జీవీఎంఎం సేవా ట్రస్ట్ చైర్మన్ గుళ్లపల్లి సత్యనారాయణ రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. దేవస్థానం వద్ద దాత గుళ్లపల్లి సత్యనారాయణ పునర్నిర్మాణ కమిటీ ప్రతినిధులకు ఈ విరాళాన్ని మంగళవారం అందించారు. తన తల్లిదండ్రులు దివంగత గుళ్లపల్లి వెంకట్రామయ్య, మహాలక్ష్మమ్మ, తన భార్య దివంగత కామేశ్వరి సంస్మరణార్థం విరాళం అందజేసినట్టు సత్యనారాయణ తెలిపారు. కమిటీ ప్రతినిధులు జిల్లెళ్ల గోపాల్, విస్సాప్రగడ చాన్న, మండలీక నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లు దాటుతున్నా..
జాతీయ రహదారి 216ఏలో ఆలమూరు మండలం జొన్నాడ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు నత్తను తలపిస్తున్నాయి. 2022 సెప్టెంబర్ 22న పనులు మొదలు కాగా, ఇంకా పూర్తి కాలేదు. దీంతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరాన్ని ఆనుకుని మోరంపూడి వద్ద ఫ్లెఓవర్ కూడా జొన్నాడతో పాటు ప్రారంభించారు. ఇప్పటికే మోరంపూడి ఫ్లై ఓవర్ వినియోగంలోకి రాగా, జొన్నాడ మాత్రం బాలారిష్టాలు దాటడం లేదు. పిల్లర్ల నిర్మాణం పూర్తి కాగా, వాటిపై గెడ్డర్లు, శ్లాబ్ వేయాల్సి ఉంది. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు కాలేదు. అప్రోచ్ నిర్మాణం కోసమని పి.గన్నవరంలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తే, అక్రమార్కులు తవ్వకాలు చేసి కాసులు దండుకున్నారు. నిర్మాణ పనుల వల్ల జొన్నాడ సెంటర్లో నిత్యం ట్రాఫిక్ స్తంభించి, ఇటు రాజమహేంద్రవరం, రావులపాలెం, కాకినాడ వెళ్లే ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. -
ఇదేం తీరువా బాబూ!
ఫ రూ.12 కోట్ల నీటితీరువా వసూలుకు సర్కారు సన్నాహాలు ఫ కొత్తగా రూ.35 సర్వీసు ట్యాక్స్ ఫ చిల్లిగవ్వ సాయం చేయకపోగా ఈ వసూళ్లేమిటని రైతుల అసహనం సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత ఖరీఫ్, తరువాత రబీ సీజన్లు రెండూ వెళ్లిపోయాయి. మళ్లీ ఖరీఫ్ వచ్చేసింది. అయినప్పటికీ పెట్టుబడి సాయంగా రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు మాట ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో, సాగు పెట్టుబడి కోసం రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సరిగ్గా ఇదే తరుణంలో పులి మీద పుట్రలా నీటితీరువా వసూళ్లకు కూటమి సర్కారు సన్నాహాలు చేస్తోంది. పిడుగులాంటి ఈ వార్త రైతులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. సిద్ధమవుతున్న రెవెన్యూ యంత్రాంగం జిల్లాలోని కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలో రెండు ఫసలీల(1433, 1434)కు (ఫసలీ – పంట కాలం) పాత బకాయిలతో కలిపి నీటితీరువా రూ.12 కోట్ల పైమాటే. ఈ మొత్తాన్ని రైతుల నుంచి వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్క పెద్దాపురం రెవెన్యూ డివిజన్లోనే 11 మండలాల్లో 1.79 లక్షల పై చిలుకు ఖాతాల్లో నీటితీరువా వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఈ ఏడాది మే నెల నాటికి 1434 ఫసలీలో రైతుల నుంచి నీటితీరువా బకాయి రూ.7.36 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ డివిజన్లోని 10 మండలాల్లోని 143 గ్రామాల పరిధిలో 1,07,720 ఖాతాలున్నాయి. వీటి ద్వారా రూ.4.80 కోట్ల బకాయిలున్నాయని లెక్కలు తేల్చారు. ఈ రకంగా జిల్లావ్యాప్తంగా 2,86,771 ఖాతాల నుంచి నీటితీరువా బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. సర్వీస్ ట్యాక్స్ బాదుడు ఈ మేరకు ఆర్డీఓలకు, మండలాల తహసీల్దార్లకు, అక్కడి నుంచి వీఆర్ఓలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు పంటలు పండే వ్యవసాయ భూములైతే ఎకరానికి మొదటి పంటకు రూ.200, రెండో పంటకు రూ.150 కలిపి మొత్తం రూ.350 నీటితీరువా వసూలు చేయనున్నారు. అదే ఆక్వా చెరువులైతే ఏడాదికి ఒకే పంట తీస్తారనే లెక్కలతో నీటితీరువా ఎకరానికి రూ.500గా పేర్కొన్నారు. నీటితీరువా వసూలుతోనే ఆగిపోకుండా కూటమి సర్కార్ రైతులపై సర్వీసు ట్యాక్స్ రూపంలో కూడా బాదేస్తోంది. నీటితీరువా కోసం జరిపే ప్రతి లావాదేవీకి అదనంగా రూ.35 సర్వీసు ట్యాక్స్ వసూలు చేయాలని ఆదేశించింది. దీనిని రైతుసంఘాల ప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. మునుపెన్నడూ ఇటువంటి సర్వీసు ట్యాక్స్ తాము చూడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నీటితీరువా, సర్వీ సు ట్యాక్స్ చూడటానికి తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, గడచిన నాలుగేళ్లకు కలిపితే రైతులపై పెనుభారం పడుతుందని అంటున్నారు. పైగా, రైతు సాగు చేసే ప్రతి ఎకరానికి ఇది పెరుగుతూ పోతుంది. వీఆర్ఓలకు భారం ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత చందంగా వీఆర్ఓల పరిస్థితి తయారైంది. నీటితీరువా వసూలు ప్రక్రియ వారికి ఆర్థికంగా భారం కానుంది. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో నీటితీరువా వసూలు రెవెన్యూ యంత్రాంగానికి గుదిబండగా మారనుంది. రీసర్వే కాక ముందు 1433 ఫసలీలో అప్పటి వరకూ ఉన్న నీటితీరువా బకాయిలకు ఒక డిమాండ్ నోటీసు, రీసర్వే తరువాత వచ్చిన 1434 ఫసలీలో ఉన్న బకాయిలకు మరో డిమాండ్ నోటీసు జారీ చేయాలి. అంటే ఒక రైతుకు సంబంధించిన బకాయిల వసూలుకు వీఆర్ఓ రెండు డిమాండ్ నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చుల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలూ లేవు. ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులందరికీ రెండేసి నోటీసులు జారీ చేయాలంటే ఆర్థికంగా కుదేలైపోతామని వీఆర్ఓలు అంటున్నారు. కరప మండలంలోని ఒక మేజర్ గ్రామ పంచాయతీ వీఆర్ఓకు డిమాండ్ నోటీసులు జారీ చేసేసరికి రూ.18 వేల మేర చేతిచమురు వదిలిందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ఈ ఖర్చులు ఎవరు భరిస్తారని వీఆర్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయం చేయకుండా నీటితీరువా వసూలా? వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతోంది. రైతులు పెట్టుబడిలు కోసం నానా ఇబ్బందులూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. కానీ, అధికారంలోకి వచ్చి ఏడాదైపోతున్నా ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చూస్తే నీటితీరువాను బకాయిలతో సహా ఇప్పటికిప్పుడు ఒకేసారి వసూలు చేయడం సహేతుకం కాదు. చాలా ఏళ్లుగా నీటితీరువా వసూలు చేయడం లేదు. రైతులు కూడా ఈ విషయం పూర్తిగా మరచిపోయారు. అలాగే, రూ.35 సర్వీసు ట్యాక్స్ వసూలు నిర్ణయం కూడా వెనక్కు తీసుకోవాలి. – రావుల ప్రసాద్, రైతు సంఘ ప్రతినిధి, కూరాడ, కరప మండలం అన్నదాతపై భారం మోపేలా.. గత ప్రభుత్వ విధానానికి భిన్నంగా చంద్రబాబు ప్రభుత్వం రైతులను నానా ఇక్కట్లకూ గురి చేస్తోంది. గద్దెనెక్కగానే రైతులకు చేస్తానన్న సాయం చేయకపోగా వారిపై భారం మోపేలా నిర్ణయం తీసుకుంది. వ్యవసాయం దండగన్న చంద్రబాబు అందుకు తగ్గట్టుగానే రైతుల నెత్తిన అకస్మాత్తుగా నీటితీరువా గుదిబండ వేశారు. ఆయన గద్దెనెక్కాక రెండో వ్యవసాయ సీజన్ ప్రారంభమైనా రైతుకు ఇస్తామన్న పెట్టుబడి సాయం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. పైగా ఇప్పుడు నీటితీరువా వసూలు చేయాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రైతులు మండిపడుతున్నారు. ఇంత కాలం అసలు నీటితీరువా అంటూ ఒకటి ఉందనే విషయాన్నే వారు మరచిపోయారు. అటువంటిది బకాయిలతో కలిపి నీటితీరువా వసూలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం సమాయత్తం కావడం రైతులను కలవరపాటుకు గురి చేస్తోంది. మండలాల వారీగా 1434 ఫసలీలో నీటితీరువా డిమాండ్, వసూలు వివరాలు (రూ.లు) పెద్దాపురం రెవెన్యూ డివిజన్ మండలం డిమాండ్ వసూలు బ్యాలెన్స్గండేపల్లి 10,47,383 ––– 10,47,383 జగ్గంపేట 27,99,974 ––– 27,99,974 కిర్లంపూడి 2,43,71,714 ––– 2,43,71,714 కోటనందూరు 93,36,189 12,81,971 80,54,218 పెద్దాపురం 1,13,36,038 5,39,959 1,07,96,079 ప్రత్తిపాడు 50,23,200 ––– 50,23,200 రౌతులపూడి 13,99,873 ––– 13,99,873 శంఖవరం 5,15,997 ––– 5,15,997 తొండంగి 1,04,34,976 4,93,142 99,41,834 తుని 26,04,969 ––– 26,04,969 ఏలేశ్వరం 70,82,381 ––– 70,82,381 మొత్తం 7,59,52,694 23,15,072 7,36,37,622 కాకినాడ రెవెన్యూ డివిజన్ పెదపూడి 99,31,430.94 4,08,077.00 95,23,353.87 కాజులూరు 82,41,762.46 2,73,796.00 79,67,966.46 పిఠాపురం 79,94,757.17 5,51,368.00 74,43,352.60 కరప 73,66,201.82 1,29,681.00 72,36,520.79 సామర్లకోట 59,89,496.35 2,17,637.00 57,71,853.53 గొల్లప్రోలు 33,94,159.40 41,203.00 33,52,954.44 కొత్తపల్లి 35,04,440.89 1,58,863.00 33,45,577.86 కాకినాడ రూరల్ 17,13,798.04 1,11,853.00 16,01,943.62 తాళ్లరేవు 16,32,013.18 77,327.00 15,54,686.13 కాకినాడ అర్బన్ 2,81,906.40 8,175.00 2,73,730.99 మొత్తం 5,00,49,966.65 19,77,980.00 4,80,71,940.03 జగన్ సర్కారులో ఆ ఊసే లేదు రైతు పక్షపాతి అయిన గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అసలు నీటితీరువా అనేదే లేకుండా చేశారు. తద్వారా రైతుల నెత్తిన పాలు పోశారు. వాస్తవానికి నీటి తీరువాను గతంలో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు వ్యక్తిగతంగా వసూలు చేసేవారు. ఈ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉండటంతో ఆన్లైన్ చేద్దామని నాటి జగన్ ప్రభుత్వం భావించింది. రాష్ట్రవ్యాప్తంగా నీటితీరువా డిమాండ్ రూ.350 కోట్లు మించి లేదు. అటువంటప్పుడు అదేమీ పెద్ద విషయం కాదనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నీటితీరువా వసూలుపై పెద్దగా దృష్టి పెట్టలేదు. తద్వారా రైతులకు మేలు చేసింది. దీంతో, సుమారు నాలుగేళ్లుగా వారికి రూపాయి కూడా నీటితీరువా చెల్లించాల్సిన అవసరం రాలేదు. -
పోలవరంపై సీఎం పచ్చి అబద్ధాలు
ఫ డయాఫ్రం వాల్ నాశనానికి చంద్రబాబే కారణం ఫ జగన్ హయాంలో గేట్లు సహా అత్యధిక శాతం పనులు పూర్తి ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తాళ్లపూడి (కొవ్వూరు): పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మండిపడ్డారు. తాళ్లపూడి మండలం మలకపల్లిలో మంగళవారం జరిగిన పర్యటన సందర్భంగా సీఎం చేసిన ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు పూర్తి చేశారని గుర్తు చేశారు. అనంతరం 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కేవలం ఒక గేటు పెట్టి, ప్రాజెక్టును చూడటానికి జనాన్ని బస్సుల్లో తరలించి, వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వృథా చేశారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టుకు అన్ని గేట్లూ పెట్టారని, ప్రాజెక్టు నిర్మాణం చాలా వరకూ పూర్తి చేశారని చెప్పారు. దీనిని కావాలనే విస్మరించి, జగన్ హయాంలో కేవలం 4 శాతం పనులే జరిగాయని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ ఏడాదిలో 6 శాతం పనులు పూర్తి చేశామంటున్నారని, అదే సమయంలో ప్రాజెక్టు 82 శాతం పూర్తయ్యిందంటున్నారని, అటువంటప్పుడు ఇదంతా ఎవరి హయాంలో జరిగినట్లని వెంకట్రావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ నాశనమవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. పోలవరం సందర్శనకు రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. చంద్రబాబుకు డబ్బులు, క్రెడిట్ దక్కించుకోవడం తప్ప పోలవరం ప్రాజెక్టుపై చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభంలో శీనయ్య కమిటీ రెండు డయాఫ్రం వాల్స్ కట్టాలని సూచించినప్పటికీ చంద్రబాబు ఒక్కటి మాత్రమే నిర్మించారని విమర్శించారు. అది కూడా ఒకచోట 52 మీటర్లు, మరోచోట 92 మీటర్ల మేర ఇష్టారాజ్యంగా నిర్మించారని చెప్పారు. డయాఫ్రం వాల్ పునాది కచ్చితంగా హార్డ్ రాక్ వరకూ వెళ్లాలని అధికారులు సూచించినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. అందువల్లనే నేడు ఈ దుస్థితి నెలకొందని, చేసిన తప్పు ఒప్పుకొని లెంపలేసుకోవాల్సింది పోయి, ఆ తప్పును జగన్పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పింఛన్ల పంపిణీకి రూ.కోట్లు దుర్వినియోగం గత ప్రభుత్వంలో ప్రతి నెలా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేస్తే.. నేడు ప్రతి నెలా చంద్రబాబు తన ప్రచారం కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండానే అమలు చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో కొత్త పథకాలు ప్రారంభించడానికి మాత్రమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలు పెట్టేవారని, కానీ నేడు ప్రతి దానినీ చంద్రబాబు ప్రచారార్భాటానికి వాడుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో రౌడీలు ఉన్నారంటున్నారని, ఆయన పార్టీలో ఎంత మంది రౌడీలున్నారని ప్రశ్నించారు. పైగా ఇసుక, మద్యం, మట్టి, మైనింగ్ మాఫియాలుగా మారి ప్రజాధనాన్ని దోచుకుంటున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కాదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంపై దాడులు చేసి కేసులు పెడుతున్నది ఈ ప్రభుత్వం కాదా అని వెంకట్రావు నిలదీశారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.13,683 కోట్లు ఖర్చు చేసి 72 శాతం పైగా పూర్తి చేశామని 2024 జూన్లో చెప్పారు. పోలవరం అంచనా రూ.55,549 కోట్లు అయినప్పుడు రూ.13,683 కోట్లు అంటే 24 శాతం ఖర్చు చేసి 72 శాతం పూర్తి చేశానని ఎలా అన్నారు? అబద్ధాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. జనాన్ని నమ్మించడానికే ఈ కట్టు కథలు చెబుతున్నారు. -
పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే చెల్లించాలి
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నాకాకినాడ సిటీ: పెండింగ్ బిల్లులు, వేతనాలు వెంటనే విడుదల చేయాలని, స్కూల్ ఆయాలకు ఆరు నెలల వేతన బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యాన మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషుబాబ్జీ, చంద్రమళ్ల పద్మ మాట్లాడుతూ, కాకినాడ రూరల్ ప్రాంతంలో గుడి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పేరుతో ప్రతి నెలా మామూళ్లు చెల్లించాలంటూ మధ్యాహ్న భోజన కార్మికులను ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో శానిటేషన్ పని చేసే ఆయాలకు ప్రభుత్వం జనవరి నుంచి వేతనాలు చెల్లించడం లేదన్నారు. ఇచ్చే అరకొర వేతనం కూడా నెలల తరబడి బకాయి పెడితే కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. మెనూ చార్జీ ప్రతి విద్యార్థికి రూ.20 చెల్లించనిదే వండి పెట్టడం అసాధ్యంగా మారిందన్నారు. వంట గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తోందని, అక్రమ తొలగింపులు రాజకీయ వేధింపులు అధికమయ్యాయని, తక్షణం వీటిని ఉపసంహరించుకోకపోతే తీవ్ర స్థాయి ఆందోళనలకు సిద్ధపడతామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, స్కూలు ఆయాలకు పీఎఫ్, ఈఎస్ఐ, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, మిడ్డే మీల్ సంఘం జిల్లా కార్యదర్శి కరకు సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన కె.వెంకటేశ్వరరావు (పేరు మార్చాం) కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీలో గుమస్తాగా పని చేస్తున్నాడు. కాకినాడ రూరల్ వాకలపూడిలో చిన్న పెంకుటింట్లో నివాసం. భార్యాభర్తలిద్దరూ పనిలోకి వెళ్తే తప్ప కుటుంబం గడవదు. వారికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. ఇరుగుపొరుగు కుటుంబాల వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారు. అది చూసిన వెంకటేశ్వరరావు దంపతులు కూడా తమ కుమారుడిని ఏదో ఒక ప్రైవేటు ప్లే స్కూల్లో జాయిన్ చేద్దామని ఆశ పడ్డారు. రెండు మూడు స్కూళ్లకు వెళ్లారు. అన్ని రకాల ఫీజులూ కలిపి రూ.25 వేలు పైనే చెప్పారు. అదే ఎల్కేజీ రూ.45 వేలు, యూకేజీ రూ.65 వేలు చెప్పడంతో వారు కంగు తిన్నారు. ఏటా అన్ని వేల రూపాయల ఫీజులతో వేగలేమంటూ మరో మాట మాట్లాడకుండా ఇంటికి తిరిగి వచ్చేశారు. ఒక్క వెంకటేశ్వరరావు కుటుంబమే కాదు.. జిల్లాలో ఏ తల్లిదండ్రులను కదిపినా ఠారెత్తిస్తున్న ఫీజులతో గుండెలు పీచుపీచుమంటున్నాయనే అంటున్నారు. కూటమి సర్కారు ఏలుబడిలో విద్యా వ్యవస్థలో కార్పొరేట్ పెత్తనం పెరిగిపోవడంతో ఫీజులపై నియంత్రణ లేకుండా పోయింది. దీంతో, పిల్లల చదువులు సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారాయి. కానరాని తనిఖీలు ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల వసూళ్లపై ప్రభుత్వ పరంగా ఎటువంటి తనిఖీలూ జరగడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో ఎంఈఓ పర్యవేక్షణలో ఆయా పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేసేవారు. అటువంటిది ఇప్పుడు విద్యాశాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలపై కన్నెత్తి కూడా చూడటం లేదు. పాఠశాలల్లో చదువుతో పాటు ఆటలు ఆడించడం విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి దోహదపడుతుంది. దీనికోసం వ్యాయామోపాధ్యాయులతో పాటు ఆటస్థలం కూడా పాఠశాలల్లో ఉండాలి. కానీ, ప్రైవేటు పాఠశాలల్లో అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. పైగా, నాలుగైదు అంతస్తులతో ఉన్న భవనాల్లో కూడా ప్రైవేటు పాఠశాలల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో.. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులపై నియంత్రణ ఉండేది. అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు కూడా చేసేవారు. దీంతో, ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్లో కొంత నియంత్రణ కనిపించేందని చెబుతున్నారు. అప్పట్లో ప్లే స్కూల్ నుంచి టెన్త్ వరకూ ఫీజు రూ.12 వేలు మాత్రమే ఉండేది. పట్టణ ప్రాంతాల్లో అదనంగా రూ.వెయ్యి వసూలు చేసేవారు. కార్పొరేషన్లలోని పాఠశాలల్లో రూ.18 వేల వరకూ అనుమతించేవారు. అటువంటిది నేడు దీనికి పూర్తి భిన్నంగా ప్లే స్కూల్ నుంచే విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీ‘జులుం’ సాగిస్తున్నారు. ఫీజులు నియంత్రించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. వారి ఆశలే.. వీరికి కాసులు సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమకంటే తమ పిల్లలు మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. సర్కారీ పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వమే చిన్నచూపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో.. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రైవేటు విద్యా సంస్థల వైపు చూస్తున్నారు. వేలకు వేలు అప్పులు చేసి మరీ తమ పిల్లలను ఆయా విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదనుగా పలు ప్రైవేటు విద్యా సంస్థలు రకరకాల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నాయి. ● ప్రభుత్వం రూపొందించిన పాఠ్య పుస్తకాలనే ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉపయోగించాలి. కానీ, పలు యాజమాన్యాలు సొంత కంటెంట్తో తయారు చేసిన పుస్తకాలనే విక్రయిస్తున్నా విద్యా శాఖ చూసీ చూడనట్లు వదిలేస్తోందనే విమర్శలున్నాయి. ● యూనిఫామ్ దగ్గర నుంచి పుస్తకాలు, ట్యూషన్ ఫీజులు, డొనేషన్లు ఇలా ప్రైవేటు యాజమాన్యాలు అడిగినంతా రెండో మాట లేకుండా సమర్పించుకోవాల్సిందే. ● కొన్ని విద్యా సంస్థలు తాము చెప్పిన షాపులోనే యూనిఫాం, బెల్టులు, బూట్లు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ వంటివన్నీ కొనాలని షరతులు పెడుతున్నాయి. దీనిని కాదంటే ఏమవుతోందోననే బెంగ తల్లిదండ్రులను వేధింస్తోంది. భారం మోయలేక.. ఏటా అడ్డగోలుగా ఫీజులు పెంచేస్తూంటంతో ఆ భా రం మోయలేని పలువురు తల్లిదండ్రులు పదో తరగతి వచ్చేసరికి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ల నుంచి మా న్పించేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేసిన లెక్కలు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో రెండో తరగతిలో 13,261 మంది విద్యార్థులుంటే పదో తరగతి వచ్చేసరికి ఆ సంఖ్య 8,590కి పడిపోయింది. దీనినిబట్టి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్లే స్కూల్కే రూ.25 వేలు పైగా వసూలు రకరకాల పేర్లతో భారీగా వసూళ్లు పుస్తకాల నుంచి సాక్స్ వరకూ అంతా వ్యాపారమే.. దోపిడీపై నోరెత్తని ప్రభుత్వం ‘ప్రైవేటు’ దెబ్బకు తల్లిదండ్రుల గుండె గుభేల్ఫీజులు నియంత్రించాలి జిల్లావ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. అటువంటి వాటిపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు నిర్వహించకూడదని విద్యా హక్కు చట్టం చెబుతోంది. కానీ, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు దీనిని పట్టించుకోవడం లేదు. అధిక మొత్తంలో పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ అమ్ముతున్నాయి. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ కఠిన చర్యలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై విద్యార్థుల తల్లితండ్రులు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేటు పాఠశాలలను నిర్వహించాలి. ఫీజులు కూడా ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే వసూలు చేయాలి. దీనిపై విద్యా శాఖ నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. – పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ ఫీజుల మోత మోగుతోందిలా.. ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి మూడో త రగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.49,000, రెండో టర్మ్ రూ.46,900, లైబ్రరీ ఫీజు రూ.3,000 చొప్పున వసూలు చేస్తున్నారు. నాలుగు నుంచి ఆరో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.51 వేలు, రెండో టర్మ్ ఫీజు రూ.49,900, లైబ్రరీ ఫీజు రూ.4,000. ఏడు నుంచి పదో తరగతి వరకూ మొదటి టర్మ్ ఫీజు రూ.53,000, రెండో టర్మ్ రూ.50,900, లైబ్రరీ ఫీజు రూ.4,000. ఇవి కాకుండా బస్సు, ఆటో వంటి వాటికి రవాణా ఫీజుగా రూ.33,000, అడ్మిషన్ ీఫీజు రూ.15,000 వసూలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం బస్సు ఫీజు కిలో మీటరుకు రూ.1.30 వసూలు చేయాలి. కానీ, ప్రైవేటు విద్యా సంస్థలు ఏటా దూరాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేలు పైగా వసూలు చేస్తున్నాయి. అలాగే, మొదటి 30 రోజుల్లో ఆలస్యంగా వస్తే రూ.50, తరువాత నుంచి సమయానికి హాజరు కాకుంటే రోజుకు రూ.100 చొప్పున చెల్లించాలి. ప్రతి విద్యా సంవత్సరానికి 10 నుంచి 15 శాతం మేర ఫీజులు పెంచుతున్నారు. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఫీజుల భారం 20 శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది చాలదన్నట్టు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఖర్చు అదనం. తరగతి విద్యార్థులు 1 11,757 2 13,261 3 13,717 4 13,142 5 12,761 తరగతి విద్యార్థులు 6 10,755 7 9,590 8 8,746 9 8,818 10 8,590 మొత్తం 1,11,137 -
ధాన్యం బకాయిలు చెల్లించాలి
కాకినాడ సిటీ: దాళ్వా పంటలో సీఎంఆర్ ద్వారా అమ్మిన ధాన్యం బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మే నెల నుంచి రూ.110 కోట్లు బకాయి పెట్టడంతో జిల్లాలోని రైతులు అనేక అవస్థలు పడుతున్నారని ఆందోళనకారులు వివరించారు. ఒక్క తాళ్లరేవు మండలంలోనే 300 మంది రైతులకు రూ.5 కోట్లు, కాజులూరు మండలంలో 400 మందికి రూ.6 కోట్లు పైగా చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఖరీఫ్ మొదలైందని, ఇటు పెట్టుబడికి డబ్బులు లేక, అటు పాత బకాయిలు తీర్చలేక నానా ఇక్కట్లూ పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఇస్తానన్న రూ.20 వేలు కూడా వేయలేదన్నారు. వెంటనే ధాన్యం బకాయిలు, పెట్టుబడి సాయం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నూతన కౌలు చట్టం తీసుకురావాలని, కాజులూరు, ఇంజరం వంతెనలు తక్షణం నిర్మించాలని కోరారు. ఈ సంఘం జిల్లా నాయకులు వల్లు రాజబాబు, టేకుమూడి ఈశ్వరరావు, దువ్వా శేషుబాబ్జీ, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.పీజీఆర్ఎస్కు 556 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై 556 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు, ట్రైనీ కలెక్టర్ మనీషా, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ వీవీఎస్ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరమే సమగ్రంగా, సంతృప్తికరంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిట్ చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో ఆడిట్ జరుగుతుందని, ఆ సందర్భంగా గుర్తించిన లోపాలపై సంబంధిత జిల్లా అధికారులకు మెమోలు జారీ చేస్తారని కలెక్టర్ తెలిపారు. సత్యదేవునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు అన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవునితో పాటు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారి ఆలయం తెరచి అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం నిర్వహించి, సుగంధభరిత పుష్పాలతో పూజించారు. ఉదయం ఆరు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సుమారు 20 వేల మంది భక్తులు దర్శించారు. వెయ్యి వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవల ధరలు ప్రదర్శించాలి రాజమహేంద్రవరం రూరల్: ప్రైవేటు ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల ధరలను 15 రోజుల్లోగా ప్రదర్శించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశించారు. రిసెప్షన్ కౌంటర్లో స్థానిక భాష, ఇంగ్లిషులో ఈ ధరల పట్టికను స్పష్టంగా ప్రదర్శించాలని పేర్కొన్నారు. ఏటా జూన్ ఒకటో తేదీ నాటికి ధరల జాబితాను రిజిస్ట్రేషన్ అధికారికి పంపించాలన్నారు. -
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ ● ఇతర దేవతా విగ్రహాలు కూడా.. ● తరలిరానున్న ప్రముఖులు నాయనార్లు ఎవరంటే.. తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు. ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వామి వారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికేయ శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజేశ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వామీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్నారు. విజయవంతం చేయాలి ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి. – స్వామి రామానంద, శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి -
ప్రధాన రహదారిపై నాట్లు
ఏలేశ్వరం: ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ, భారీ గోతులు పడిన ఈ రోడ్డుపై మహిళలు నాట్లు వేసిన ఘటన ఇది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారి శిథిలమై దారుణంగా ఉంది. రమణయ్యపేట గ్రామం నుంచి పది కిలోమీటర్ల మేర ఈ రోడ్డు గోతులమయంగా మారింది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత అధ్వానంగా మారింది. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ (ఎంఎల్) వినోద్మిశ్రా, సీపీఎం అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యాన మహిళలు ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారిని పునర్నిర్మించేంత వరకూ కదిలేదిలేదని భీషి్మంచారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూటమి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు, నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు లోత రామారావు, రెడ్డి ఆనంద్పాల్, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడలో గంజాయి బ్యాచ్ రచ్చ.. రికార్డింగ్ డ్యాన్సర్లతో హల్చల్
సాక్షి, కాకినాడ: కాకినాడలోని పెద్దాపురం మరిడమ్మ జాతరలో యువకుల వీరంగం సృష్టించారు. జాతర సందర్బంగా అక్కడ రికార్డింగ్ డ్యాన్స్లు, అశ్లీల నృత్యాలు జరిగాయి. ఈ క్రమంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. అనంతరం, ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు.వివరాల ప్రకారం.. కాకినాడలో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. జాతర సందర్భంగా దర్గా సెంటర్లో రికార్డింగ్ డ్యాన్స్, అశ్లీల నృత్యాలతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నృత్యాలు చూసి కొందరు యువకులు రెచ్చిపోయారు. గంజాయి, మద్యం మత్తులో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. రక్తం వచ్చేలా ఇరువర్గాలు తన్నుకున్నారు. దీంతో, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో సదరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. -
రికార్డు స్థాయిలో..
ఫ సత్యదేవుని ప్రసాదాలకు క్యూ కట్టిన లోవ భక్తులు ఫ సుమారు 75 వేల ప్రసాదం ప్యాకెట్ల కొనుగోలు ఫ అన్నవరం దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం అన్నవరం: ఊహించినట్టుగానే ఆషాఢ మాసం తొలి ఆదివారం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాల విక్రయాలు రికార్డు స్ధాయిలో జరిగాయి. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం ఉదయం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి తలుపులమ్మ లోవ దేవస్థానానికి వేలాదిగా భక్తులు వెళ్తూంటారు. వారు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ఆగి సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే పునరావృతమైంది. 80 వేల ప్యాకెట్లు సిద్ధం లోవ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్నవరం దేవస్థానం అధికారులు 80 వేల సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేశారు. రత్నగిరిపై ప్రసాదం కౌంటర్లలో 25 వేలు, తొలి పావంచా వద్ద కౌంటర్లలో 20 వేలు, పాత నమూనా ఆలయం వద్ద 25 వేలు, కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ను రూ.20 చొప్పున సుమారు 75 వేల ప్యాకెట్లు విక్రయించారు. భక్తులు భారీగా బారులు తీరి మరీ ప్రసాదాలు కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకూ రద్దీ కొనసాగింది. లోవ భక్తుల తాకిడిని తట్టుకునేందుకు గాను తొలి పావంచా వద్ద అదనంగా మరో రెండు, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద కూడా మూడు కౌంటర్ల చొప్పున ప్రసాదం విక్రయ కౌంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రచారం లేక.. జాతీయ రహదారిపై రాజమహేంద్రవరం వైపు వెళ్లే మార్గంలో ఉన్న సత్యదేవుని నూతన నమూనా ఆలయం వద్ద కూడా ఏడాది కాలంగా ప్రసాదాలు విక్రయిస్తున్నారు. అయితే, దీనిపై తగినంత ప్రచారం లేకపోవడంతో లోవ భక్తుల వాహనాలు ఇక్కడ పెద్దగా ఆగడం లేదు. విశాఖపట్నం వైపు మార్గంలోని పాత నమూనా ఆలయం వద్దనే భక్తులు తమ వాహనాలను నిలిపి, రోడ్డు దాటుకుని వచ్చి, ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఈవిధంగా రోడ్డు దాటుతున్నప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజమహేంద్రవరం వైపు మార్గంలో కూడా సత్యదేవుని నమూనా ఆలయం, ప్రసాదాల కౌంటర్ నిర్మించింది. వాహనాల పార్కింగ్కు స్థలం కేటాయించి, టాయిలెట్లు కూడా నిర్మించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇక్కడ ఎటువంటి అభివృద్ధీ చేయలేదు. వాటర్ బాటిల్స్, శీతల పానీయాలు, స్నాక్స్ విక్రయించే షాపులు, హోటళ్లు లేకపోవడంతో ఇక్కడ భక్తులు పెద్దగా ఆగడం లేదు. ఎక్కువ మంది పాత నమూనా ఆలయం వద్దనే ఆగుతున్నారు. అక్కడ రోడ్డుకు ఇరువైపులా సుమారు 50 షాపులు, హోటల్స్ ఉండడంతో లోవ భక్తులు తిరుగు ప్రయాణంలో అక్కడి నమూనా ఆలయం వద్దనే ప్రసాదాలు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఆదివారం సుమారు 25 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించగా కొత్త నమూనా ఆలయం వద్ద 5 వేల ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. నూతన నమూనా ఆలయం వద్ద అధికారులు తగిన వసతులు కల్పించాలని పలువురు సూచిస్తున్నారు. -
కార్పొరేట్ల కోసమే ‘ఏపీ విజన్–2047’
కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్–2047 డాక్యుమెంట్ కార్పొరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేశారని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డాక్టర్ వి.గంగారావు అన్నారు. శ్రీవిజన్–2047.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిశ్రీ అనే అంశంపై రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యాన కాకినాడ యూటీఎఫ్ హోమ్లో శనివారం రాత్రి నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యవసాయంలో కార్పొరేట్ పద్ధతి ప్రవేశపెట్టాలని, ఏపీ విజన్ డాక్యుమెంట్లో ఉందన్నారు. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ పెట్టుబడులకు అవకాశం ఉండదని, ప్రైవేటు రంగంలో కూడా చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లేదని చెప్పారు. కార్పొరేట్ తరహా అభివృద్ధి అంటే సంపద ఒకేచోట పోగు పడుతుందని అన్నారు. దీనివలన సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు 1999లో కూడా విజన్–2020 డాక్యుమెంట్ విడుదల చేశారని గుర్తు చేశారు. అది ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లో మెకన్సీ కంపెనీ తయారు చేసిందన్నారు. తాజా డాక్యుమెంట్ను కూడా అధికారులు తయారు చేయలేదని విమర్శించారు. ప్రజా ఉద్యమం ద్వారా పాలకుల విధానాలను మార్చాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సమగ్రంగా జరుగుతుందని గంగారావు చెప్పారు. విశ్రాంత చీఫ్ ప్లానింగ్ అధికారి వి.మహిపాల్ మాట్లాడుతూ, ఏదైనా విజన్ డాక్యుమెంట్ విడుదల చేసే ముందు క్షేత్ర స్థాయిలో అధ్యయనం జరగాలని, అనంతరం వివిధ వేదికలపై చర్చలు జరగాలని, ప్రాధాన్యాలు నిర్ణయించుకుని, అందుకు తగిన విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని వివరించారు. ప్రస్తుత డాక్యుమెంట్ ప్రజారోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ ఉద్యమ సీనియర్ నేత అయితాబత్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు వీవీ రమణ, స్టడీ సర్కిల్ కన్వీనర్ ఎన్.గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు. రత్నగిరిపై భక్తుల సందడి అన్నవరం: రత్నగిరిపై ఆదివారం భక్తులు సందడి చేశారు. సుమారు 20 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. వర్షం కారణంగా సత్యదేవుడు, అమ్మవారికి ఆలయం లోపలి ప్రాకారంలో పల్లకీ సేవ నిర్వహించారు. -
ఫ మనసారె దీవించమ్మా..
‘చల్లని తల్లీ.. మా కల్పవల్లీ.. మమ్మల్ని మనసారా దీవించమ్మా’ అంటు వందలాది మంది భక్తులు పాదయాత్రగా భారీ సారె తీసుకుని వచ్చి.. అమ్మవార్లకు సమర్పించారు. పిఠాపురం పాదగయ క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరీదేవి, అష్టాదశ శక్తి పీఠాల్లో పదో పీఠం దేవత అయిన శ్రీ పురుహూతికా అమ్మవార్లకు మండలంలోని విరవ గ్రామానికి చెందిన శ్రీ పద్మావతీ శ్రీవారి సేవా సంఘం సభ్యులు ఏటా ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తూంటారు. దీనిలో భాగంగా వారు తమ ఇళ్లల్లో స్వయంగా వండిన పిండివంటలు, స్వీట్లతో పాటు పండ్లు, పువ్వులు, ఇతర పదార్థాలతో సారె సిద్ధం చేశారు. పాదగయ దేవస్థానం ఈఓ కాట్న జగన్మోహన్ శ్రీనివాస్ దంపతులు ఈ సారెను ఆదివారం ముత్తయిదువల తలకు ఎత్తగా.. వారు అమ్మవారి నామ స్మరణ చేసుకుంటూ విరవాడ, ఎఫ్కే పాలెం, కందరాడ, కుమారపురం మీదుగా పాదగయ క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆ సారెకు ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. – పిఠాపురం -
టీడీపీ కార్యకర్త దౌర్జన్యం నుంచి రక్షించండి
అమలాపురం రూరల్: ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండల పరిధిలో కొత్తపాలేనికి చెందిన టీడీపీ కార్యకర్త కాలాడి అచ్చిబాబు, అతని కుటుంబ సభ్యులు మొల్లేటిమొగ గ్రామంలో తమపై దాడి చేసి తాటాకు ఇంటిని కూల్చేసి డబ్బు, బంగారం దోచుకున్నారని బాధితులు కాలాడి రామలక్ష్మి, సూరిబాబు దంపతులు వాపోయారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని పేర్కొంటూ ఎస్పీ కృష్ణారావు, కలెక్టర్ మహేష్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నకళ్లను శనివారం స్థానిక విలేకరులకు వారు అందజేశారు. గత నెల 26న తన భర్త చేపల చెరువు పట్టుబడికి వెళ్లిన సమయంలో అచ్చిబాబు అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు 30 మంది వచ్చి తమపై దాడిచేసి ఇంటి కూల్చేసి తమను చంపుతామని బెదిరించారని పేర్కొన్నారు. తమ పాకను కూల్చిన స్థలంలో రేకుల షెడ్ నిర్మించారని, కుమార్తె పెళ్లి కోసం బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి తెచ్చిన రూ.6.5 లక్షలు, ఐదు కాసులు బంగారాన్ని దోచుకున్నారని రామలక్ష్మి తెలిపారు. కాట్రేనికోన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారు పేర్కొన్నారు. మొల్లేటిమోగలో 30 ఏళ్లుగా ఉంటున్నామని, తమ కుటుంబాన్ని రోడ్డున పడేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిలువ నీడ లేక సామాన్లు రోడ్డుపై ఉన్నాయని, కొన్ని సామాన్లు కాలువలో పడేశారని, తానూ, తమ కుమార్తెలు బట్టలు మార్చుకునే స్థలం లేకుండా చేశారని రామలక్ష్మి అవేదన వ్యక్తం చేశారు. గుడిసె కూల్చి నిరాశ్రయులను చేశారు బంగారం, రూ.6.5 లక్షలు దోచేశారు కలెక్టర్, ఎస్పీలకు బాధితుల ఫిర్యాదు -
పరిశోధనలతో దేశ సమస్యలకు చెక్
● నీతి అయోగ్ సభ్యుడు సారస్వత్ ● వికసిత్ భారత్పై జీజీయూలో సదస్సు రాజానగరం: దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలకు మన శాస్త్ర వేత్తలు తమ శాస్త్ర పరిశోధనలతో పరిష్కారం చూపాలని నీతి అయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ సహకారంతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జిజియు)లో రెండు రోజులపాటు జరిగే జాతీయ సదస్సును శనివారం ఆయన ప్రారంభించారు. సదస్సులో శ్రీవికసిత్ భారత్ – 2047 కోసం పరిశోధనలు, నవీకరణలను ఉపయోగించడంశ్రీ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ వికసిత్ భారత్పై పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయని, కానీ వికసిత్ భారత్ అంటే.. శ్రీఅభివృద్ధి చెందిన దేశం కోసం రూపొందించిన రోడ్డు మ్యాప్శ్రీ అని పేర్కొన్నారు. దేశంలో నెలకొన్న పోషకాహార లోపం, మాతా–శిశు మరణాలు వంటి పలు సమస్యలకు సైన్స్ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. వీటి సాధనకు పరిశోధనలు అవసరమని, వాటి ద్వారా ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితమవుతుందని, తద్వారా గ్లోబల్ లీడర్గా మార్పు చెందవచ్చన్నారు. సెమీ కండక్టర్లు, కృత్రిమ మేథ మొదలైన అంశాలలో పరిశోధన ద్వారా స్వయం సమృద్ధి సాధించి ఆత్మ నిర్భర భారత్గా మారవచ్చన్నారు. మన దేశ జీడీపీలో 62 శాతం సేవా రంగాల నుంచి వస్తుంటే కేవలం 14 శాతం మాత్రమే తయారీ రంగం నుంచి వస్తోందని, ఇది ఒక ప్రధాన సమస్యగా ఉందన్నారు. విలువల జోడింపే నూతన ఆవిష్కరణ లక్ష్యమని సారస్వత్ పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి అంతా కంప్యూటర్ సైన్స్ పైనే ఉందని, ఇదే పరిిస్థితి కొనసాగితే దేశంలో రైల్వేలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల వంటి వాటికి మావన వనరుల కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2047 నాటికి 100 గిగా వాట్ల అణుశక్తి అవసరమని, అందుకనే న్యూక్లియర్ సైన్స్ చదివితే మంచి అవకాశాలు ఉంటాయని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్సెలర్ కేవీవీ సత్యనారాయణరాజు, ప్రొ ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: మండలంలోని పుల్లేటికుర్రులో శనివారం తెల్లవారుజామున ఓ సిటీ కేబుల్ కార్యాలయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అందులోని సామగ్రి కాలి బూడిదయ్యాయి. రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. స్థానిక వీఆర్వో కొత్తపల్లి కృష్ణమూర్తి డాబా ఇంటిలో కింద ఫ్లోర్లో నిర్వహిస్తున్న కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో విలువైన యంత్ర పరికరాలు, సెట్టాప్ బాక్స్లు అగ్నికి ఆహుతయ్యాయి. అమలాపురం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఘటనా స్థలాన్ని సర్పంచ్ జల్లి బాలరాజు, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీపతి పరిశీలించారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన యంత్ర పరికరాలు -
బాలుడిని మింగిన మృత్యు కుహరం
● ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడిన వైనం ● మరో బాలుడి పరిస్థితి విషమం శంఖవరం: స్థానిక అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఓ బాలుడు శనివారం మృతి చెందగా మరో బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. గ్రామానికి చెందిన భూర్తి మహి (7), పులి ప్రణయ్ జోష్ (7) పాఠశాలకు వెళ్లి ఇంటికి వస్తుండగా ఎస్సీ పేటలోని అంబేడ్కర్ కాలనీలో ఇంటి నిర్మాణంలో ఉన్న గోతిలో పడిపోయారు. గోతిలో నీరు ఉండడంతో ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిద్దరినీ స్థానికులు గుర్తించి రౌతులపూడి సీహెచ్సీకి తరలించగా మహి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రణయ జోష్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భూర్తి సత్తిబాబు దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం కాగా మహేష్ మూడో కొడుకని అన్నవరం పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. -
నకిలీ ఆదాయపన్ను అధికారుల అరెస్టు
● నాలుగేళ్ల క్రితం బియ్యం వ్యాపారిని బెదిరించి దోచుకోవడంతో కేసు ● పోలీసుల అదుపులో నలుగురు ● పరారీలో ఇద్దరు రాజోలు: సుమారు ఏడేళ్ల క్రితం ఆదాయ పన్ను అధికారులమని బెదిరించి విలువైన పత్రాలతో పాటు నగదుతో పరారైన నలుగురిని రాజోలు పోలీసులు అరెస్ట్ చేసి శనివారం కోర్టులో హాజరుపర్చారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల మేరకు 2018 సంవత్సరంలో కూనవరంలోని శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లుల వద్దకు ఆరుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆదాయ పన్ను అధికారులమని యజమానిని బెదిరించి భూమి దస్తావేజులు, ప్రామిసరీనోట్లు, బ్యాంక్ చెక్ బుక్స్, ఆధార్ కార్డులు, నగదు తీసుకుని వెళ్లిపోయారు. రైస్ మిల్లు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటిలో కేసు నమోదు చేశారు. అయితే నిందితులైన మలికిపురం మండలం కేశనపల్లి గ్రామానికి చెందిన యడ్ల అరవింద్, గూడపల్లిపల్లిపాలేనికి చెందిన సోమాని సందీప్, గూడపల్లికి చెందిన మొల్లేటి మణికంఠ, పి.గన్నవరం మండలం పోతవరానికి చెందిన నేలపూడి మురళీశ్రీధర్ పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఆరుగురికి నలుగురిని అరెస్ట్ చేశామని, ఇద్దరు పరారీలో ఉన్నారని సీఐ తెలిపారు. 2020 సంవత్సరంలో వీరిని తెలంగాణ గచ్చిబౌలి పోలీస్లు ఇలాంటి కేసులోనే అరెస్టు చేయగా బెయిల్పై విడుదలయ్యారని సీఐ వివరించారు. -
చదువు కంటే చూసి గ్రహించడంలోనే..
పాఠ్యాంశాల అధ్యయనం కంటే క్షేత్రస్థాయిలో అధ్యయనంతో విద్యార్థులకు ఆ అంశంపై చక్కటి అవగాహన ఏర్పడుతుంది. చదువు పూర్తయ్యి ఉద్యోగంలో చేరే సరికే వారికి ప్రాక్టికల్స్లో అనుభవం తగినంత ఉండి వృత్తికి న్యాయం చేయగలమనే నమ్మకం ఏర్పడుతుంది. – కె.గంగమణి, విద్యార్థిని సాగు విధానాలు తెలుస్తున్నాయి క్షేత్రస్థాయిలో రైతులు వివరించే పద్ధతులు బాగా అర్ధమవుతున్నాయి. చూసి నేర్చుకోవడంలో చాలా విషయాలు తెలిశాయి. వ్యవసాయ సిబ్బంది సైతం పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. చూసిన ప్రతి అంశాన్ని రాసుకుని అవగాహన పెంచుకుంటున్నాం. ఈవిధానం చాలా బాగుంది. – పి.ఝాన్సీ, విద్యార్థిని క్షేత్ర స్థాయి బోధనతో సత్ఫలితాలు విద్యార్థులకు క్షేత్రస్థాయి బోధన వల్ల మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో ప్రకృతి సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో పొలంబాట పట్టించాం. వరి సాగులో విత్తనం నుంచి ఉత్పత్తి వరక అన్ని ప్రక్రియలపైనా అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ ఎరువుల తయారీ, పాడి పరిశ్రమ విశిష్టత వివరిస్తున్నాము. విద్యార్థులు కూడా ఈ పద్ధతిలో నేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. – బి.నాగేశ్వరరావు, జిల్లా మేనేజర్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రకృతి సాగుపై ప్రత్యేక శిక్షణ రానున్న రోజుల్లో ప్రకృతి వ్యవసాయం విస్తరించనుంది. అందుకే కాబోయే వ్యవసాయ ఉద్యోగులకు ఈ సాగుపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లాలో పలు చోట్ల విద్యార్థులు ఈ సాగుపై శిక్షణ పొందుతున్నారు. ప్రకృతి సాగు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా వివరిస్తూ విద్యతో పాటు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందిస్తున్నాం. – ఎలియాజర్, డీపీఎం, ప్రకృతి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, కాకినాడ జిల్లా -
క్షేత్రస్థాయిలో ప్రకృతి పాఠం
● విద్యార్థులకు బోధిస్తున్న అధ్యాపకులు ● రైతుల ద్వారా సాగుపై అవగాహన ● ఉద్యోగంలో చేరడంతోనే విధులకు అంకితమయ్యేలా శిక్షణ ● ఈ విధానంతో ఎంతో ప్రయోజనం అంటున్న అధికారులు పిఠాపురం: కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్న సామెత ఈ విద్యార్థులకు అతికినట్టు సరిపోతుంది. వ్యవసాయ పాఠాలు నేరుస్తున్న వారంతా నేరుగా పొలంబాట పట్టి సాగు పద్ధతులను అక్కడి రైతుల ద్వారా నేర్చుకుంటున్నారు. విద్య పూర్తయ్యి ఉద్యోగంలో చేరే నాటికి మళ్లీ అప్రెంటిస్, శిక్షణలు అనేవి అవసరం లేకుండా విధి నిర్వహణకు వారు సంసిద్ధంగా ఉంటారు. తరగతిలో కంటే క్షేత్రస్థాయిలో అభ్యసిస్తేనే ఈ శాస్త్రం అలవడుతుందని అధ్యాపకులు ఆ విద్యార్థులను పొలంబాట పట్టించారు. ప్రయోగాత్మకంగా సాగు పద్ధతులు వివరిస్తున్నారు. విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్ని ప్రక్రియలపైనా వారికి బోధిస్తున్నారు. ఇలా సాగు విధానాలు నేర్చుకుంటున్నది కాకినాడ ఐడియల్ కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు. ఒక్కో ఊరికి కొంత మంది చొప్పున పంపించి అక్కడి విధానాలను నేరుగా పొలాల్లోనే నేర్పుతున్నారు. ప్రస్తుతం గొల్లప్రోలు మండలం దుర్గాడలో గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి నేరుగా వారితోనే మాట్లాడి సాగు పద్ధతులు తెలుసుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక పాఠాలు విద్యార్థులకు ఎక్కువగా ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులను బ్యాచ్లుగా వివిధ గ్రామాలకు పంపి ప్రకృతి వ్యవసాయ సిబ్బందితో క్షేత్రస్థాయిలో సాగు పద్ధతులు నేర్పుతున్నారు. నిత్యం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారికి సాగు విధానాలు నేర్పుతున్నారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్టు
● 5 జిల్లాల్లో 19 కేసులు నమోదు ● రూ.65 లక్షల విలువైన బంగారంగా స్వాధీనం కాకినాడ క్రైం: రాత్రి వేళల్లో ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. కడియం మండలం మాధవరాయుడుపాలేనికి చెందిన 42 ఏళ్ల బొగడ శ్రీను, అనపర్తి మండలం కుతుకులూరుకు చెందిన 23 ఏళ్ల పాసి శేఖర్, 24 ఏళ్ల పోతంశెట్టి సూర్యభాస్కరరెడ్డి కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. కాకినాడ పరిసర ప్రాంతాలతో పాటు ఐదు జిల్లాల్లో వారు చోరీలు చేశారు. ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ పర్యవేక్షణలో సర్కిల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు బృందాలు వరుస చోరీలపై నిఘా పెట్టాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో నిందితులు ముగ్గురినీ కాకినాడ రూరల్ పరిధిలో శుక్రవారం పట్టుకున్నాయి. వీరి నుంచి రూ.65 లక్షల విలువైన 582 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 12.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. దురలవాట్లు, తక్కువ సమయంలో శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో వీరు దొంగతనాలు చేస్తున్నారన్నారు. దర్యాప్తు బృందంతో పాటు కరప ఎస్ఐ సునీత, గొల్లపాలెం ఎస్ఐ మోహన్కుమార్, నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. వారిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. సుమారు 11 వేల మంది స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.2,50,681 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ వివరించారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. రత్నగిరి కిటకిట అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సాధారణంగా ఆషాఢ మాసంలో సత్యదేవుని ఆలయానికి భక్తుల రాక తక్కువగా ఉంటుంది. అటువంటిది శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ కిక్కిరిసిపోయాయి. స్వామివారిని సుమారు 40 వేల మంది దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారని అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఆదివారం ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లను టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఊరేగించనున్నారు. భక్తులు రూ.2,500 టికెట్టుతో ఈ సేవలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. గస్తీకి 22 ద్విచక్ర వాహనాలుకాకినాడ క్రైం: గస్తీ అవసరాల కోసం జిల్లా పోలీస్ శాఖకు 22 ద్విచక్ర వాహనాలు మంజూరయ్యాయి. వీటిలో 20 అపాచీ వాహనాలు, 2 బుల్లెట్లు ఉన్నాయి. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఇన్బిల్డ్ కెమెరాలుంటాయని, రాత్రి వేళల్లో గస్తీకి, ఇరుకు వీధుల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు, సమస్య చోటు చేసుకున్న ప్రాంతాలకు ట్రాఫిక్ అవాంతరాలను ఛేదించి చేరుకునేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భాస్కరరావు, ఏఆర్ డీఎస్పీ శ్రీహరిబాబు, రిజర్వుడ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తరం..దక్షిణ ఉంటేనే..
● బదిలీల సిఫార్సుకోరుకున్న చోటు ఇష్టారాజ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీలు ఇంజినీరింగ్ అసిస్టెంట్ల బదిలీల కౌన్సెలింగ్ కూడా ఇష్టారాజ్యంగా జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1,271 ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఉండగా.. ఐదేళ్లు పూర్తయి బదిలీకి అర్హత పొందిన వారు 1,113. వీటిలో 904 రిక్వెస్ట్లు ఉన్నాయి. వీరి బదిలీలు అంతర్ జిల్లాల ప్రాతిపదికన జరుగుతున్నా కౌన్సెలింగ్ మాత్రం ఆయా జిల్లాల పంచాయతీరాజ్ అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. ఇక్కడ కూడా కూటమి నేతల సిఫారసు లేఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీకి చెందిన ఇద్దరు గిరిజన ఇంజినీరింగ్ అసిస్టెంట్లు సొంత ప్రాంతాలైన ఏజెన్సీకి బదిలీ కోరుకున్నారు. అసలు ఏజెన్సీకి వెళ్లడానికే ఎవరూ ఇష్టపడని పరిస్థితులున్నా.. వీరికి అవకాశం ఇవ్వకుండా సిఫారసు లేఖ తప్పనిసరి అని చెప్పారు. దీంతో, వారి పరిస్థితి డోలాయమానంలో పడింది. అడ్డగోలుగా జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్పై జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని సచివాలయ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ: సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో మెరిట్కు పాతరేస్తున్నారు. కూటమి నేతల సిఫారసు లేఖలకే పెద్దపీట వేస్తున్నారు. ఎవరైనా కోరుకున్న చోటు దక్కించుకోవాలనుకుంటే అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవాల్సిందే. వారు ఒక్కో సీటుకు ఒక్కో రేటు నిర్ణయించి ఎడాపెడా లేఖలు ఇచ్చేస్తున్నారు. కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు నేతల సిఫారసులు ఆధారంగా బదిలీలకు తెర తీయడంతో సచివాలయ ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖలో జరిగిన బదిలీని కూటమి నేతల సిఫారసుతో నిలుపు చేయించుకున్న ఓ అధికారి కనుసన్నల్లోనే ఈ బాగోతం సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాను కూడా స్వయంగా కూటమి నేతలనే ఆశ్రయించడంతో వారు చెప్పినట్టు చేయాల్సిన దుస్థితిలోకి ఆయన జారిపోయారు. బదిలీకి అర్హులు 616 మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న విలేజ్ అగ్రికల్చరల్, ఇంజినీరింగ్ తదితర అసిస్టెంట్ల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమై, ఆదివారం వరకూ జరగనుంది. కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలకు సంబంధించిన విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ల బదిలీలకు కాకినాడలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చైర్మన్గా ఉన్న కమిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 684 మంది విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఉన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వీరిలో ఐదేళ్లు పూర్తి చేసిన 616 మంది బదిలీలకు అర్హులుగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం 1 నుంచి 205 వరకూ సీరియల్ నంబర్లు ఉన్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. శనివారం 206 నుంచి 410 నంబర్ వరకూ, ఆదివారం 411 నుంచి 616 నంబర్ వరకూ బదిలీలు చేపట్టాలి. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు మూడు వంతుల నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలున్న వారికే బదిలీల్లో అవకాశం కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల జాబితా ప్రకారమే.. ఏజెన్సీలో సర్వీసు, దివ్యాంగులు, భార్యాభర్తల వంటి అంశాలకు బదిలీల కౌన్సెలింగ్లో ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ, ఈ నిబంధనలను బుట్టదాఖలు చేసి, నేతల సిఫారసు లేఖలున్న వారికి మాత్రమే కోరుకున్న చోటు కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు పంపించిన సిఫారసు లేఖల్లో పేర్కొన్న జాబితాను అనుసరించే బదిలీలు చేస్తున్నారని మండిపడుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు ఏ సచివాలయంలో ఏ పోస్టుకు ఎవరిని బదిలీ చేయాలో ముందుగానే జాబితా రూపొందించి, సిఫారసు లేఖలు జత చేసి మరీ పంపించారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ జాబితా ప్రామాణికంగానే బదిలీలు చేస్తున్నారని కౌన్సెలింగ్లో పాల్గొని బయటకు వస్తున్న అసిస్టెంట్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ జాబితాలో ఉన్నవారు 1, 2, 3 స్థానాలకు ఆప్షన్లు పెట్టుకున్నప్పటికీ వాటిని హోల్డ్లో పెడుతున్నట్లు చెబుతున్నారు. మెరిట్ జాబితా టాప్–10లో ఉన్న వారికి కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా పక్కనబెడుతుండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు విలేజ్ అసిస్టెంట్లు సిద్ధపడుతున్నారు. సొమ్ములిస్తేనే సిఫారసు లేఖలు కోరుకున్న సచివాలయానికి బదిలీ కావలంటే మొదట గ్రామ టీడీపీ కమిటీ సభ్యుల ఆశీస్సులుండాలి. వారు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలంటే చేయి తడపాల్సిందే. ఈవిధంగా ఆయా నియోజకవర్గాల్లో ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు నిర్ణయించి, కూటమి నేతలు వసూళ్ల పర్వానికి తెర తీశారు. ఈవిధంగా వీలునుబట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ ముడుపులు గుంజారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం; కాకినాడ జిల్లా తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ రూరల్; తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, రాజమహేంద్రవరం రూరల్ తదితర నియోజకవర్గాల్లో కూటమి నేతలు వసూళ్ల పర్వాన్ని అడ్డగోలుగా కొనసాగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.35 వేల జీతంతో పని చేసే చిరుద్యోగులని కూడా చూడకుండా ముక్కుపిండి మరీ వసూలు చేశారని అంటున్నారు. కూటమి ఏలుబడిలో బది‘లీలలు’ మెరిట్కు పాతర సిఫారసు లేఖకు రేటు ఫిక్స్ చేసిన ప్రజాప్రతినిధులు ఆ తరువాతే కావాల్సిన చోటుకు బదిలీ కౌన్సెలింగ్లో అధికారులు లేఖలు అడుగుతున్నారని సచివాలయ అసిస్టెంట్ల ఆరోపణ ఇవిగో ఉదాహరణలు కోనసీమ జిల్లా రాజోలు దీవికి చెందిన మెరిట్ ఉన్న ఒక అసిస్టెంట్ శుక్రవారం నాటి కౌన్సెలింగ్లో తాను కోరుకున్న మండలం కోసం అభ్యర్థించగా.. అక్కడి ప్రజాప్రతినిధి లేఖ ఉందా అని కౌన్సెలింగ్లోనే నేరుగా అడగడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి రాజోలు సబ్ డివిజన్లో 9, పి.గన్నవరం సబ్ డివిజన్లో 20 పోస్టులు ఉన్నాయి. మెరిట్లో ముందు వరుసలో ఉన్నా సిఫారసు లేఖ అవసరమేమిటని ప్రశ్నించిన పాపానికి ఆ పోస్టును హోల్డ్లో పెట్టేశారు. పైగా, అతడిని ఏజెన్సీ వెళ్లాల్సి ఉంటుందని, అందుకు సిద్ధమేనా అని అడిగారంటున్నారు. రాజోలు నియోజకవర్గం నుంచి స్పౌజ్ కోటాలో భార్యాభర్తలు స్థానికంగా ఏదైనా మండలంలో అవకాశం ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకున్నారు. వారిలో భర్తకు స్థానికంగా అవకాశం కల్పించి, భార్యను మాత్రం దూరంగా వేరే మండలానికి ఖాయం చేశారని తెలియవచ్చింది. 80 శాతం దివ్యాంగుడైన ఒక అసిస్టెంట్ను కూడా సిఫారసు లేఖ లేకుండా ఏమీ చేయలేమని చెప్పారంటే కౌన్సెలింగ్ ఎంత పారదర్శకంగా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలున్నారు.. స్థానికంగా అవకాశం కల్పించాలని, పిల్లలకు స్కూళ్లలో ఫీజులు చెల్లించేశామని రాజోలు ప్రాంతంలో ఆప్షన్ పెట్టుకున్న వారికి ఎక్కడో దూరంగా ఉన్న ఐ.పోలవరం మండలం వెళ్లాల్సిందిగా సూచించారని తెలియవచ్చింది. రంపచోడవరం ఏజెన్సీలో మూడేళ్లు దాటి పని చేస్తున్న ఒక అగ్రికల్చరల్ అసిస్టెంట్కు కాకినాడ జిల్లా శంఖవరం లేదా రౌతులపూడి మండలాల్లో ఆప్షన్ ఇచ్చారు. అయితే అక్కడకు నేతలు వేరే వారికి సిఫారసు చేయడంతో ఈయనను హోల్డ్లో పెట్టారని అంటున్నారు. ఏజెన్సీలో అంత కాలం పని చేసినా సిఫారసు లేఖ లేదనే కాారణంతో అవకాశం కల్పించకుంటే ఇక కౌన్సెలింగ్కు అర్థమేముంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. తొండంగి మండలంలో ఆప్షన్ పెట్టుకున్న మరో అసిస్టెంట్ను కూడా నేతల సిఫారసు లేఖ లేదనే కారణంతో పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. కాకినాడకు చెందిన ఒక మహిళా అగ్రికల్చరల్ అసిస్టెంట్ దగ్గర్లో ఉన్న కాకినాడ రూరల్ లేదా కరప మండలాలకు ఆప్షన్ పెట్టుకున్నారు. కాకినాడ రూరల్ నుంచి సిఫారసు లేఖ లేదనే కారణంతో తుని నియోజకవర్గానికి పంపించేశారు. -
కొబ్బరి @ రూ.22 వేలు
● చరిత్రలో తొలిసారి రికార్డు ధర ● ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 1.8 లక్షల ఎకరాల్లో సాగు ● ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గిన దిగుబడి ● ఉత్తరాదికి దిక్కయిన ఆంధ్రా కొబ్బరి సాక్షి, అమలాపురం: జాతీయ మార్కెట్లో ఆంధ్రా కొబ్బరి రికార్డుల మీద రికార్డు సృష్టిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి కాయ దిగుబడి తగ్గడం ఆంధ్రా రైతులకు వరంగా మారింది. కొబ్బరి చరిత్రలో తొలిసారి అంబాజీపేట మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22 వేలు పలికింది. లంక గ్రామాల్లో కొబ్బరి కాయ రూ.23 వేల వరకూ ధర పలుకుతోందని రైతులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 1.8 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. గత ఏడాది నుంచి పచ్చికాయ, ముక్కుడు కాయ (నిల్వ కాయ) వెయ్యి కాయల ధర రూ.10 వేలకు ఎప్పుడూ తగ్గలేదు. గత మే నెలలో ఒకానొక సమయంలో రూ.12 వేల వరకూ ఉండగా తరువాత నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. మే చివరి వారంలో రూ.16 వేలకు చేరింది. ఈ నెల మొదటి వారంలో కొబ్బరి కాయ ధర రూ.17,500 నుంచి రూ.18,500 వరకూ పెరిగింది. రెండు రోజుల క్రితం రూ.20 వేల వరకు పెరగగా, శనివారం మార్కెట్లో ఏకంగా రూ.22 వేలు పలికింది. మరో వారం రోజుల్లో ధర మరింత పెరగవచ్చని రైతులు, వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొబ్బరి పండే దక్షిణాది రాష్ట్రాల్లో దిగుబడి గణనీయంగా తగ్గగా కేరళలో దిగుబడి మరింత పతనమైంది. ఇక్కడ చెట్టుకు సగటు దిగుబడి 50 కాయలు కాగా ఇప్పుడు 15 కాయలకు పడిపోవడంతో ఉత్తరాది అవసరాలు మొత్తాన్ని రాష్ట్రంలో కొబ్బరి తీర్చాల్సి వస్తోంది. దీనికితోడు గత ఏడాది కాలంగా దిగుబడిగా వచ్చిన కొబ్బరి ఇటు రైతుల వద్ద కానీ, వ్యాపారుల వద్ద కానీ నిల్వ ఉండటం లేదు. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతుల వద్ద నుంచి, వ్యాపారుల వద్ద నుంచి వారం రోజుల వ్యవధిలోనే ఎగుమతి అవుతోంది. ఇది కూడా ధర పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్రం నుంచి ఉత్తరాదిలోని గుజరాత్, హర్యానా, మహారాష్ట్రతో పాటు బిహార్, ఉత్తర ప్రదేశ్లకు పచ్చికాయ అధికంగా ఎగుమతి అవుతోంది. ఇంత ధర పెరిగినా రైతులు ఆచితూచి విక్రయిస్తున్నారు. పెరిగిన ధర ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి రైతుల్లో జోష్ నింపింది. -
విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు
● వచ్చే నెల 15 నాటికి ఏర్పాటు చేయాలి ● అధికారులకు కలెక్టర్ ఆదేశంకాకినాడ సిటీ: మాదక ద్రవ్యాలను అరికట్టే చర్యల్లో భాగంగా వచ్చే నెల 15వ తేదీ నాటికి జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో ఈగిల్ క్లబ్బులు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. రహదారి భద్రతపై కలెక్టరేట్లో సోమవారం జరిగిన సమావేశంలో జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్తో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ మాట్లాడుతూ, ఈ ఏడాది మే నెల వరకూ జిల్లాలో 368 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, 163 మంది మృతి చెందారని, 408 మంది గాయపడ్డారని వివరించారు. అత్యధికంగా 145 ప్రమాదాలు జాతీయ రహదారులపై, 67 ప్రమాదాలు రాష్ట్ర రహదారులపై జరిగాయన్నారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, మోటారు వాహనాల చట్టం–1988 కింద రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి వారం రోజుల పాటు రూ.1.50 లక్షల వరకూ ఉచిత చికిత్స అందించేందుకు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ స్కీమును జిల్లాలో పటిష్టంగా అమలు చేయా లని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఏడాది నుంచి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన ప్రాంతాల స మాచారం ఆధారంగా రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఎస్పీ బిందుమాధవ్ కోరారు. 1,444 కిలోల గంజాయి స్వాధీనం అనంతరం జరిగిన నార్కో కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 22 గంజాయి నేరాలు నమోదయ్యాయని, 85 మందిని అరెస్టు చేసి 1,444 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలు అందించేందుకు 1972, 14405 టోల్ఫ్రీ, 9494933233 వాట్సాప్ నంబర్లపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు. జిల్లాలోని విద్యా సంస్థల్లో ఇప్పటి వరకూ 217 ఈగల్ క్లబ్బులు ఏర్పాటు చేసి, 420 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. డ్రగ్స్ ప్రమాదంపై సుమారు 30 వేల మంది విద్యార్థులను అవగాహన కల్పించామన్నారు. సారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0 కింద జిల్లాలో 560 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ కె.జయమౌనిక తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్, సారా దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. పారిశ్రామికవేత్తలకు సింగిల్విండోలో అనుమతులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి అందిన దరఖా స్తులకు సింగిల్విండో విధానంలో త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జరిగిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. గత మూడు నెల ల కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 556 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 492 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఉత్పాదన, సేవా రంగాల్లోని 14 యూనిట్లకు సుమారు రూ.40 లక్షలు విలువైన రాయితీల జారీకి కమిటీ ఆమోదించిందన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వంచనపై.. జనం బాట
● హామీలు అమలు చేయని కూటమి సర్కారుపై ప్రజల్లోకి వైఎస్సార్ సీపీ ● ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ పేరిట ప్రచారం ● చంద్రబాబు, పవన్ మోసాలను ఎండగట్టాలని నేతల పిలుపు ● ఐదు వారాల పాటు చైతన్య కార్యక్రమాలు ● త్వరలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల వేళ అలవి కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పచ్చి దగా చేస్తున్న కూటమి సర్కారు తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించింది. చంద్రబాబు అండ్ కో ఎడాపెడా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వలన ఏడాది కాలంలో ఏమేరకు నష్టపోయారో ప్రజలకు వివరించనుంది. ఈ మేరకు ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ అనే సరికొత్త కార్యక్రమం చేపట్టేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. కూటమి సర్కారు చేసిన మోసాలను ప్రజలకు వివరించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ఐదు వారాల పాటు ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడ సూర్య కళా మందిరంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా నలుమూలల నుంచీ పార్టీ జిల్లా, మండల, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి ఉత్సాహంగా తరలివచ్చారు. తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి, నివాళులర్పించి, జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, మండల, గ్రామ స్థాయిల్లో చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని సూచించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆయన మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ప్రజల మద్దతు కూడగట్టాల్సిన ఆవశ్యకతను వివరించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల చిట్టా, జూన్ 24 నుంచి అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కాక మొదటి ఏడాది హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టేయడాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలను తు.చ. తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మనందరి పైనా ఉందనే విషయాన్ని ప్రజల ముందుంచాలని అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ, 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ వంటి అంశాలతో పాటు ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న తీరును వివరించాలని నేతలు పిలుపునిచ్చారు. అధినేత వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా పార్టీ రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ప్రతి కార్యకర్తా తన మొబైల్తో ఈ కోడ్ను స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో కూటమి మేనిఫెస్టో వస్తుందని, అందులో చంద్రబాబు హామీలు, చేసిన మోసాలు ఉంటాయని వివరించారు. ఈ ప్రచార కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు వీలుగా తొలుత పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని బొత్స సూచించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, తామంతా అండగా ఉంటామని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. సంక్షేమ పథకాలను సంతృప్తకర స్థాయిలో అమలు చేసిన వైఎస్ జగన్ పేరు నేతల ప్రసంగాల్లో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ జై జగన్ నినాదాలతో సమావేశ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అనంత బాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జ్యోతుల చంటిబాబు, పార్టీ జగ్గంపేట, పెద్దాపురం కో ఆర్డినేటర్లు తోట నరసింహం, దవులూరు దొరబాబు, నర్సాపురం పార్లమెంటరీ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ ప్రసన్న, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యా సాగర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, బెహరా రాజరాజేశ్వరి, పార్టీ నేతలు వాసిరెడ్డి జమీలు, తోట రాంజీ, ఉలవకాయల లోవరాజు, యనమల కృష్ణుడు, గుల్లా ఏడుకొండలు, గండేపల్లి బాబీ, అల్లి రాజబాబు, అనసూరి ప్రసాద్, రావూరి వెంకటేశ్వరరావు, శెట్టిబత్తుల కుమార్రాజా, ఒమ్మి రఘురామ్, నాగం గంగబాబు, రోకళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చే నెల 4న జేఎన్టీయూకే స్నాతకోత్సవం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జేఎన్టీయూ–కాకినాడ 11వ స్నాతకోత్సవం వచ్చే నెల ఇన నిర్వహిస్తున్నట్లు వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ముఖ్య అతిథిగా వర్సిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతారని, ముఖ్య అతిథి బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రమ్మణ్యానికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామని వివరించారు. స్నాతకోత్సవంలో భాగంగా 2023–24కు సంబంధించి బీటెక్ 41,258, బీ–ఫార్మసీ 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఫార్మా–డి 274, బీఆర్క్ 83, పీహెడ్డీ 100, బంగారు పతకాలు 40 ప్రకటించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్తో పాటు మాజీ వీసీలు, ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు. 30న జాబ్మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 30న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కృష్ణ ప్రభాస్ పేపర్ మార్ట్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్, ఎస్బీఐ గ్రూప్లలో 135 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నారు. పదో తరగతి లేదా ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు హాజరు కావచ్చన్నారు. వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఘనంగా చండీహోమం అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితుడు ఉపాధ్యాయుల రమేష్, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకులు బాలు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో 20 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. కాగా, సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి 4న ఇంటర్వ్యూలు కాకినాడ సిటీ: స్థానిక జగన్నాథపురంలోని అన్నవరం సత్యవతీదేవీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకాలకు వ చ్చే నెల 4వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంట ర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి.అనంతలక్ష్మి తెలిపారు. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అ ప్లికేషన్స్, కామర్స్, బోటనీ, జువాలజీ, ఆక్వా కల్చర్, మైక్రో బయాలజీ, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సంస్కృతం, లైబ్రరీ సైన్స్ సబ్జెక్టులు బోధించడానికి అతిథి అధ్యాపకులను నియమిస్తున్నామని వి వరించారు. కనీసం 55 శాతం మార్కులతో పో స్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులన్నా రు. నెట్, పీహెచ్డీ పూర్తి చేసి, డిగ్రీ కళాశాలలో తత్సంబంధిత సబ్జెక్టులో బోధనానుభవం కలిగిన మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎస్కేవీటీ కళాశాలలో.. సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ బీవీ తిరుపాణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ బయోడేటాను వచ్చే నెల 3వ తేదీలోగా అందజేయ్యాలన్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు జూలై 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయని వివరించారు. -
ఆమోదిస్తే బాక్స్ బద్దలే..
● పిఠాపురం మున్సిపాలిటీలో టెండర్ల బాగోతం ● రూ.3 కోట్లతో వివిధ పనులకు అనుమతి ● కూటమి నేతలకు కలిసొచ్చేలా వ్యూహం ● నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధికారి ఆదేశాలు ● వ్యతిరేకిస్తున్న పాలకవర్గం పిఠాపురం: ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాన్ని పక్కన పెట్టేసి, కూటమి నేతలకు కలిసొచ్చేలా జిల్లా అధికారి ఒకరు ఇచ్చిన ఆదేశాలు పిఠాపురం మున్సిపాలిటీలో రచ్చ రేపుతున్నాయి. ఏకంగా రూ.3 కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై కూటమి నేతలకు కట్టబెట్టేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలను పాలకవర్గం అడ్డుకుంటోంది. వివరాలివీ.. పట్టణంలో తాగునీటి సరఫరా, డ్రైన్లు, రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఏపీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి రూ.3 కోట్లతో అనుమతులు మంజూరు చేశారు. రోడ్ల అభివృద్ధికి రూ.1.48 కోట్లు, డ్రైన్ల నిర్మాణానికి రూ.1.51 కోట్లు కేటాయించారు. ఈ నిధులు తరువాత సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు కౌన్సిల్ గత నెలలో ఆమోదం కూడా తెలిపింది. నిబంధనల ఉల్లంఘన ఇలా.. ప్రస్తుతం ఉన్న ఇంజినీరింగ్ నిబంధనల ప్రకారం రూ.లక్షకు మించి ఏ పని చేపట్టాలన్నా ఈ–ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ఆన్లైన్లో టెండర్లు పిలవాలి. దీనివలన రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టర్లు పోటీ పడి, తక్కువ రేటుకే పనులు చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా ప్రజాధనం మిగిలే అవకాశం ఉంటుంది. కానీ, ఏం ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ, మున్సిపల్ పాలకవర్గాన్ని అధికారులు పూర్తిగా పక్కన పెట్టి, కూటమి నేతలకు అనుకూలంగా ఉండేలా ఆఫ్లైన్ టెండర్ల విధానాన్ని తెర పైకి తెచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (కాంట్రాక్టర్లు తమ కొటేషన్లను మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో వేయడం వలన దీనిని బాక్స్ టెండర్లు అని పిలుస్తున్నారు.) ఇందులో భాగంగా ఈ పనులను రూ.5 లక్షల్లోపు ఉండేలా విడగొట్టారు. రోడ్ల పనులు 8, డ్రైన్ పనులు 31 పనులకు బాక్సు టెండర్లు పిలవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ పనులను కూటమి నేతలకు కట్టబెట్టేందుకే అధికారులు నిబంధనలు తుంగలో తొక్కారంటూ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారుల హెచ్చరిక జిల్లా అధికారి లిఖితపూర్వకంగా ఆదేశించారని పేర్కొంటూ బాక్సు టెండర్ల స్వీకరణకు అనుమతించాలని పిఠాపురం మున్సిపాలిటీ అధికారులు ఆ శాఖ ఉన్నతాధికారులను అభ్యర్థించారు. అయితే, దీనికి ఉన్నతాధికారులు నిరాకరించారని తెలిసింది. టెండర్లలో నిబంధనలు పాటించకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించిన వారు.. ఈ–ప్రొక్యూర్మెంటు విధానంలోనే టెండర్లు పిలవాలని ఆదేశించినట్లు తెలిసింది. అయినప్పటికీ, జిల్లా అధికారి ఆదేశాల మేరకు బాక్సు టెండర్ల ద్వారానే పనులు కేటాయించేందుకు మున్సిపల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలపై పాలక వర్గ సభ్యులు ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రజలు ఎన్నుకున్న పాలక వర్గాన్ని కాదని, కూటమి నేతలకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలపై పోరాడాలని వారు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అటు మున్సిపల్ ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు బాక్సు టెండర్లను వ్యతిరేకించడం.. ఇటు జిల్లా అధికారి ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక పిఠాపురం మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ వివాదం నేపథ్యంలో తాము ఏ పనీ చేయలేమంటూ ఇంజినీరింగ్ విభాగం అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
కూటమి బాండ్లను ప్రజలకు చూపిస్తాం
కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసింది. హామీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారు. చంద్రబాబు హామీలపై ప్రశ్నించే బాధ్యతను 40 శాతం ఓటుతో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ తీసుకుంది. నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తాం. చంద్రబాబు, పవన్ మేనిఫెస్టో, బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాదైంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం.. తోకలు కట్ చేస్తాం అంటున్నారు. మీ పార్టీలో ఉన్న వాళ్లకు తోకలున్నాయేమో.. మాకు లేవు. అక్రమ కేసులు పెట్టి, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే వైఎస్సార్ సీపీ పనైపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటోంది. ఇది ప్రజాస్వామ్యమని గుర్తుపెట్టుకోండి. – బొత్స సత్యనారాయణ, శాసన మండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ అందమైన అబద్ధాలే.. బాబు హామీలు వైఎస్ జగన్ను ఓడించడం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టారు. అందమైన అబద్ధాలను హామీలుగా ఇ చ్చారు. ఎన్నికల్లో ఆయన అబద్ధమే గెలిచింది. ప్రజలు, ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తోంది. అందుకే ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజల్లోకి వెళ్తోంది. క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మేనిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మేనిఫెస్టో వస్తుంది. తొలిసారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నేత వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముఖ వ్యూహం పేరుతో పవన్ కల్యాణ్, కూటమి నేతలు మరికొన్ని హామీలిచ్చారు. 50 ఏళ్లు నిండిన ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానంటూ నోటికొచ్చిన హామీలు చంద్రబాబు ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. వివక్ష, వేధింపులే ఏకై క అజెండాగా కూటమి పాలన సాగుతోంది. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి -
జిల్లాను సారా రహితం చేయాలి
కాకినాడ సిటీ: జిల్లాను సారా రహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమ నిర్వహణకు అధికారులు కృషి చేయాలని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ ఆదేశించారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సారా నిర్మూలనకు అధికారులు, సిబ్బంది ఇప్పటి వరకూ చేసిన కృషిపై సమీక్షించారు. సారా ముద్దాయిలను బైండోవర్ చేయాలని, సారా తయారీకి బెల్లం సరఫరా చేసే వ్యాపారులపై గట్టి నిఘా ఉంచాలని, వారిని కూడా బైండోవర్ చేయాలని ఆదేశించారు. సారా నిర్మూలనపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. పలు కేసులలో ముద్దాయిల ప్రవర్తన పరిశీలించి, ఇంకా సారా వ్యాపారం చేస్తూంటే పీడీ యాక్ట్ పెట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ ఏనుగుల చైతన్య మురళి, అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక, జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి ఎం.కృష్ణకుమారి, ఏఈఎస్ కె.మౌనిక, జిల్లాలోని ఎకై ్సజ్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అదనపు మందుల కౌంటర్ల ఏర్పాటు
● ల్యాబ్ రిపోర్టులు త్వరితగతిన అందేలా చర్యలు ● జీజీహెచ్లో పర్యటించిన సూపరింటెండెంట్కాకినాడ క్రైం: ‘పెద్దాసుపత్రికి సుస్తీ’ శీర్షికన ఈ నెల 25న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కాకినాడ జీజీహెచ్ అధికారులు స్పందించారు. సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి శుక్రవారం ఆసుపత్రిలో పర్యటించారు. మందుల పంపిణీ పేద రోగులకు ప్రహసనంగా మారిందన్న విషయం తెలుసుకున్న ఆమె.. ప్రస్తుతం ఉన్న 8 కౌంటర్లకు అదనంగా మరో 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో మందులు పంపిణీ చేసే కౌంటర్ల సంఖ్య 16కి పెరిగింది. అలాగే, వైద్య పరీక్షల నివేదికలు సకాలంలో అందించేందుకు పాథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాధిపతులతో చర్చించారు. అనంతరం జీజీహెచ్లో హిమోఫీలియా, తలసేమియా, సికిల్సెల్ బాధితులకు ఐదు పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. వారి సేవలకు పీడియాట్రీషియన్, ఫిజీషియన్తో పాటు ఒక స్టాఫ్ నర్సును నియమించారు. వివిధ వార్డుల్లో పర్యటించిన డాక్టర్ లావణ్య కుమారి వైద్య సేవల నాణ్యతను రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్, డీసీఎస్ ఆర్ఎంవో మెహర్ కుమార్ పాల్గొన్నారు. -
పవన్.. షణ్ముఖ వ్యూహం అమలు చేయాలి
ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముఖ వ్యూహం హామీని పవన్ కల్యాణ్ అమలు చేయాలి. కుమారస్వామి పేరిట విడుదల చేసిన మేనిఫెస్టోలో హామీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు ఇస్తానని చెప్పారు. జగన్ ఫైనాన్స్ ఇంజినీరింగ్ వల్ల ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండేది. ఎన్నికల్లో 143 హామీలిచ్చిన చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి. ప్రతి వ్యాపారి డొక్కలు ఎండిపోయాయి. ప్రతి హామీ అమలు చేసేంత వరకూ కాలర్ పట్టుకుని లోకేష్ను అడుగుతాం. ఆ రోజు కాలర్ పట్టి అడగమని ఆయనే చెప్పారు. మత్స్యకార భరోసాను తొలి ఏడాది ఎగ్గొట్టిన బాబు.. వారికివ్వాల్సిన డీజిల్ రాయితీని ఎత్తేసి మోసం చేశారు. – దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కూటమిని నమ్మి మోసపోయిన మహిళలు మహిళల భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహిళల భద్రత కోసం నాటి సీఎం వైఎస్ జగన్ ఎన్నో ఆలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారనే పరిస్థితి కూటమి పాలనలో స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని చంద్రబాబు, పవన్లను ప్రజలు అడగాలి. ప్రజల తరఫున నిరంతరం పోరాడాల్సిన సమయమిది. ప్రతిపక్షంగా ఆ బాధ్యత మనపై ఎంతో ఉంది. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వకుండా ఏడాది కాలంగా నిరుద్యోగులను నిలువునా మోసం చేసిన బాబు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలి. ఏడాదిలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఒక్కటే ఇచ్చారు. తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టేశారు. ఉచిత బస్సు ఊసే లేదు. వీటన్నింటిపై పోరాడటానికి సిద్ధంగా ఉండాలి. చంద్రబాబుకు నిజాయతీ, నిబద్ధత లేనే లేవు. – వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్ -
హామీలు అమలయ్యే వరకూ ప్రజా పోరాటం
గద్దెనెక్కేందుకు చంద్రబాబు మాయమాటలతో ప్రజలను నమ్మించారు. కౌంటింగ్ అయిన అనంతరం జూన్ 24 నుంచి హామీలన్నింటినీ అమలు చేస్తానన్న బాబు.. గద్దెనెక్కి ఏడాదైనా వాటిని గాలికొదిలేశారు. ఆయన ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరఫున పోరాడటానికి క్యాడర్ సిద్ధంగా ఉంది. జగన్ ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. – దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు హామీలను గంగలో కలిపేశారు ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు గంగలో కలిపేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంత వరకూ ప్రజల తరఫున పోరాడటానికి అందరూ సమన్వయంతో ముందుకు రావాలి. వైఎస్సార్ సీపీ ఓడిపోయిందంటే ఎవరూ నమ్మడం లేదు. జగన్ జనాదరణ కలిగిన నాయకుడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టే ఎక్కడకు వెళ్లినా జనం పోటెత్తుతున్నారు. అక్రమ అరెస్టులతో ప్రజా వ్యతిరేకతను నిలువరించడం అసాధ్యం. – విప్పర్తి వేణుగోపాలరావు, జెడ్పీ చైర్మన్ -
వర్తక రిజిస్ట్రేషన్తో ప్రయోజనాలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వ్యాపార రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సభ్యురాలు దుర్గాంజలి అన్నారు. స్థానిక ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులోని ఐసీఏఐ కాకినాడ శాఖ కార్యాలయంలో శుక్రవారం ఎంఎస్ఎంఈ మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం గణపతి మాట్లాడుతూ, ఎంఎస్ఎంఈ పథకం ద్వారా ఏర్పాటు చేసే యూనిట్లకు ప్రభుత్వం రాయితీలిస్తుందన్నారు. ది గోదావరి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధి నారాయణరావు మాట్లాడుతూ, వ్యాపారులతో ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఐసీఏఐ చైర్మన్ తాళ్ళూరి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఎంఎస్ఎంఈపై భారీ స్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసేందుకు, స్పాట్ రుణాలు అందించేందుకు కార్యక్రమం రూపొందిస్తున్నామని చెప్పారు. అనంతరం డీఐసీ జీఎం గణపతిని సత్కరించారు. కార్యక్రమంలో ఐసీఏఐ కాకినాడ బ్రాంచి కార్యదర్శి పాండురంగమూర్తి, ట్రెజరర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
క్యూఆర్ స్కాన్ ద్వారా బాబు మోసాలు బయటపెడతాం: వైఎస్సార్సీపీ
సాక్షి, కాకినాడ జిల్లా: కూటమి ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసిందని.. హమీల గురించి అడిగితే తాట తీస్తామంటున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం.. ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రిజనల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, తోట నరసింహం, వంగా గీతా, దవులూరి దొరబాబు తదితరులు పాల్గొన్నారు.బొత్స మాట్లాడుతూ.. ‘‘నాలుక మందంతో కార్యక్రమాలు చేస్తే ప్రజల తరపున ఉద్యమిస్తాం. ఇదిగో చంద్రబాబు.. ఇదిగో పవన్ అంటూ మీ మ్యానిఫెస్టో.. బాండ్లను ప్రజలకు చూపిస్తాం. అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారని అడుగుదాం. టక్కుటమార విద్యలతో ప్రజల్ని మోసం చేస్తే కుదరదు. తాట తీస్తాం, తోకలు కట్ చేస్తాం అంటున్నారు...అక్రమ కేసులు పెట్టి.. చట్టాన్ని చేతిలో తీసుకుంటే వైఎస్సార్సీపీ పని అయిపోతుందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది. ఇది ప్రజాస్వామ్యం అని గుర్తుపెట్టుకోండి. వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ప్రభుత్వం ఎంత డ్రామా ఆడింది. సింగయ్య ప్రమాదంపై ఒక ఎస్సీ రెండు సార్లు మాట్లాడటం రాజకీయాల్లో ఎప్పుడైనా చూశామా?’’ అంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.కురసాల కన్నబాబుమాట్లాడుతూ.. వైఎస్ జగన్ను ఓడించండం తన వల్ల కాదని చంద్రబాబు కూటమి కట్టాడు. అందమైన అబద్దాలను హమీలుగా ఇచ్చాడు. ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధమే గెలిచింది. ప్రజలు.. ప్రతిపక్షం నోరెత్తకుండా బెదిరింపు ధోరణితో కూటమి ప్రభుత్వం పాలన చేస్తుంది. అందుకే "బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ" పేరుతో వైఎస్సార్సీపీ ప్రజల్లోకి వెళ్తుంది...క్యూఆర్ కోడ్ను ఫోన్లో స్కాన్ చేస్తే టీడీపీ ప్రజాగళం పేరుతో మ్యానిఫెస్టో వస్తుంది. సూపర్ సిక్స్ ఉమ్మడి మ్యానిఫెస్టో వస్తుంది. మొట్టమెదటి సారిగా రైతులకు పెట్టుబడి సాయం అందించిన నాయకుడు వైఎస్ జగన్. దీనిని చంద్రబాబు కాపీ కొట్టారు. షణ్ముక వ్యూహం పేరుతో కూటమి పార్టీలు మరికొన్ని హమీలు ఇచ్చాయి. 50 ఏళ్లు నిండినా ఎస్సీ, బీసీలకు పెన్షన్ ఇస్తానని.. నోటికొచ్చిన హమీలను చంద్రబాబు ఇచ్చారు. ఇస్తానన్న సూపర్ సిక్స్ పథకాలే అమలు చేయడం లేదు. ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు అనేక ఎత్తుగడలు వేశాడు’’అని కన్నబాబు మండిపడ్డారు.దాడిశెట్టి రాజా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన షణ్ముక వ్యూహం హమీ అమలు చేయాలి. కుమారస్వామీ పేరు మీద విడుదల చేసిన మేనిఫెస్టోలో హమీలను అమలు చేయాలి. కాపులకు ఐదేళ్లలో రూ.15 వేలు కోట్లు ఇస్తానని పవన్ చెప్పారు. వైఎస్ జగన్ ఫైనాన్స్ ఇంజనీరింగ్ వల్ల ఖాజనా ఎప్పుడు నిండుగా ఉండేది. కాలర్ పట్టుకుని హమీలు అమలు చేయమని అడుగుతాం. చంద్రబాబు ఎన్నికల్లో 143 హామీలు ఇచ్చాడు. చంద్రబాబు చేసిన వంచనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ -
విధి నిర్వహణలో విగతజీవులై..
ఆలమూరు/కోదాడ రూరల్: కర్తవ్య నిర్వహణే ప్రథమ ధర్మం అంటారు. ఆ కర్తవ్య నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా ఉండే ఆ ఉద్యోగులు శాశ్వత విశ్రాంతిని పొందారు. మాదక ద్రవ్యాల (గంజాయి) రవాణా చేస్తున్న నిందితుడిని పట్టుకోవడానికి వెళుతూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం రోజునే ఓ ఎస్సై, ఓ కానిస్టేబుల్ అసువులు బాసారు. వివరాల్లోకి వెళితే.. ఆలమూరు మండల పరిధిలోని 216 ఏ జాతీయ రహదారిలో గతంలో గంజాయి అక్రమ రవాణా కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుల్లో ఒకరు హైదరాబాద్లో ఉన్నాడన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక ట్రాక్ను సొంతం చేసుకున్న ఎస్సై అశోక్ బుధవారం రాత్రి పది గంటలకు ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎస్.బ్లెసన్ జీవన్, రావులపాలెం సీఐ కార్యాలయం ఐడీ పార్టీ హెడ్ కానిస్టేబుల్ దొంగ స్వామితో కలిసి నిందితున్ని అరెస్ట్ చేసేందుకు డ్రైవర్ జి.రమేష్ను వెంటబెట్టుకుని ఎర్టిగా కారులో హైదరాబాద్కు బయల్దేరారు. మార్గమధ్యలో డ్రైవర్ తనకు నిద్రవస్తోందని చెప్పడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏపీ వైపు గంటన్నరపాటు కారు పక్కకు ఆపి నిద్రించారు. బయల్దేరిన 10 నిమిషాలకే.. కొద్దిసేపటి తర్వాత వీరు తిరిగి హైదరాబాద్కు బయల్దేరగా.. ఆ తర్వాత పది నిమిషాలకే కోదాడ పట్టణ పరిధిలోని దుర్గాపురం జంక్షన్లో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారుతో ఢీకొట్టారు. కోదాడ పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంలో ఎస్సై అశోక్ (45) కానిస్టేబుల్ బ్లెసన్ (32) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ స్వామి తీవ్ర గాయాలతో బయట పడ్డారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా, అక్రమార్కులకు సింహస్వప్నంగా, రక్షణ కోసం వచ్చిన వారికి ఆపద్బాంధవుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ మృతితో అంతటా విషాదం అలముకుంది. కారులో ఇరుక్కుపోయిన ఎస్ఐ మృతదేహం లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. కారు ముందు భాగంలో కూర్చున్న ఎస్ఐ మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. కోదాడ పోలీసులు కారు భాగాలను తొలగించి అతికష్టం మీద ఆయన మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. అయితే పోలీసులు లారీని పట్టుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కోనసీమ ఏఎస్పీ, కోదాడ డీఎస్పీ నివాళులు కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఎస్ఐ, కానిస్టేబుల్ మృతదేహాలకు కోనసీమ జిల్లా అడిషనల్ ఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను ఏపీ పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రుడు హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపారు. పదోన్నతి వస్తుందనుకునే లోపే.. ఎస్సై అశోక్కు ఈ ఏడాది సర్కిల్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి వస్తుందని కుటుంబ సభ్యులు భావిస్తున్న నేపథ్యంలో ఇంతటి ఘోరం జరగడం వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే ఉన్నతాధికారుల సాయంతో అనేక కేసులను ఛేదించి పలు అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్నారు. అశోక్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని రుస్తుంబాదా కాగా ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని ఏవీ అప్పారావు రోడ్డులో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు సోదరులు, ఒక సోదరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నరసాపురంలోని అశోక్ నివాసంలో మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. విధి నిర్వహణలో ఎస్సై అశోక్కు తోడుగా వెళ్లి మృత్యు ఒడిలోకి వెళ్లిన కానిస్టేబుల్ బ్లెసన్ స్వస్థలం ఆలమూరు. ఆయన తన తల్లి హెప్సీబా, సోదరులు ప్రిన్స్ ఆదిత్య, అలెక్స్ కలసి ఉంటున్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన బ్లెసన్ తమ కుటుంబానికి అండగా ఉంటాడనుకుంటే హఠాత్తుగా మృతి చెందడంపై కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వచ్చే ఏడాది కొత్త ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామనుకుంటున్న తన సోదరుడు బ్లెసన్ ఆ ముచ్చట తీరకుండానే కానరాని లోకాలు వెళ్లిపోయాడని సోదరులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. బ్లెసన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి మరో ఇద్దరికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా నిందితుడి అన్వేషణలో దుర్ఘటన -
ఆరుటి గెల!
అంబాజీపేట: సాధారణంగా అరటి గెల రెండు లేదా మూడడుగులు ఉంటుంది. కానీ అంబాజీపేటలో పచ్చ అరటి గెల ఆరు అడుగులు ఉండి అబ్బురపరిచింది. కొర్లపాటివారిపాలేనికి చెందిన కొర్లపాటి వెంకటేశ్వరరావు తన పెరట్లో పచ్చ అరటి మొక్కను పది నెలల క్రితం నాటారు. టిష్యూ కల్చర్లో భాగంగా గింజ నాటడం ద్వారా వచ్చిన మొలకను స్థానిక పండ్ల వ్యాపారి గండ్రోతు సూరిబాబు ఇచ్చారని వెంకటేశ్వరరావు తెలిపారు. ఆ మొక్కను నాటి సేంద్రియ ఎరువులు వాడడంతో సుమారు పది అడుగులు ఎత్తు ఎదిగి బలమైన గెలలు వేసిందన్నారు. చెట్టుకు భారం కాకుండా రెండు వెదురు గెడలను ఇరువైపులా వేసి బలంగా కట్టి చెట్టుకు నిలబెట్టామన్నారు. ఈ భారీ గెలకు 13 హస్తాల ద్వారా సుమారు 300 కాయలతో బలమైన గెల వేసిందన్నారు. అరటి గెలను పలువురు ఆసక్తిగా తిలకించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎదురెదురుగా వాహనాలు ఢీకొని ఘటన తాళ్లపూడి: మండలంలోని అన్నదేవరపేట వద్ద రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై టి.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు అన్నదేవరపేటకు చెందిన కొయ్య ముత్యాలు (38) ఠాగూర్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం పని ముగించుకుని తన స్కూటీపై ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన ఎస్కే సుధీర్ తాళ్లపూడి నుంచి అన్నదేవరపేట వస్తూ అన్నదేవరపేట సొసైటీ వద్ద పరస్పరం ఢీకొన్నారు. ఈ ఘటనలో ముత్యాలు తీవ్రంగా గాయపడి సంఘటనా ప్రదేశంలో మృతి చెందాడు. గాయాలపాలైన సుధీర్ను 108లో గోపాలపురం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. యువకుడికి నివాళి ముత్యాలు కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి వెంకట్రావు, నాయకులు పిట్టా శ్రీనివాస్ పరామర్శించారు. సంతాపం తెలియజేశారు. -
ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రోబోరోర్ మలేషియా–25 వెఫా రోబోటిక్ నిర్వహించిన ఇంటర్నేషనల్ రోబోటిక్స్ పోటీల్లో కాకినాడ లక్ష్య స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. స్మోర్పీ ఇమాజినరీలో ప్రథమ, తృతీయ స్థానాలు, స్మోర్పీ పైలట్ విభాగంలో రెండు రజత పతకాలు, కాంస్య పతకం సాధించారు. స్మోర్పీ స్క్వేర్ అటానమస్ విభాగంలో రెండు స్వర్ణం, రజక పతకం సాధించి ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారు. టీమ్ వన్లో రిహాన్సనా, లలిత్ కుమార్వర్మ, సాజిత్, ఆదిత్య ఆనంద్, ఎ.వీనిత్లు పాల్గొనగా టీమ్–2లో డి.మనోహర్రెడ్డి, దుర్గాఆదిత్య శశాంక్, ముకుంద, నాగసాయి అభినవ్, ఎన్.అర్జున్ పాల్గొన్నారు. స్కూల్ డైరెక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రోబోటిక్స్ ఒక ప్రత్యేక సబ్జెక్టుగా నేర్పిస్తున్నామన్నారు. ఆదిత్య విద్యాసంస్థల అధినేత శేషారెడ్డి మాట్లాడుతూ పలు దేశాలు పాల్గొన్న పోటీల్లో ఇండియా నుంచి తమ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థుల బృందాన్ని ప్రిన్సిపాల్ వందనబోహ్రా, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఏఐ కాదు.. ఆ సిలిండర్ పేలింది కాకినాడలోనే!
కాకినాడ జిల్లా: గ్యాస్ సిలిండర్ పేలుడుకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అది ఫేక్ అని, ఏఐ ఆధారిత వీడియో అని బాగా ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా ఈ ఘటన కాకినాడ జిల్లా తొండంగి మండలం యల్లయ్యపేట శివారులో జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఓ ఇంట్లో వంట చేస్తున్న క్రమంలో గ్యాస్ లీకైంది. దీంతో ఆ మహిళ పైప్తోపాటు సిలిండర్ను హాలులోకి తీసుకువచ్చింది. కాసేపటికి మహిళతోపాటు మరో వ్యక్తి లోపలికి వచ్చి సిలిండర్ను తీస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. ఈనెల 18న ఘటన జరగగా.. అందుకు సంబంధించిన ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. Be careful how you handle your gas cylinders. You are safer having them outside. If the doors and windows were shut the explosion 💥 would have consumed them pic.twitter.com/RvRGQ92kgt— IPOB Zürich (@IpobZurich) June 22, 2025 -
పవన్ అన్నా.. కాపాడు అన్నా!
సాక్షి, తూర్పుగోదావరి: తమ బిడ్డ కనిపించడం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు కనిపించేలా ఓ కుటుంబం ఫ్లకార్డులతో నిరసనకు దిగింది. పవన్ను కలిసేందుకు వచ్చిన మార్వాడి కుటుంబాన్ని ఆయన సిబ్బంది పట్టించుకోకుండా పంపేశారు.కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం మార్వాడి కుటుంబం చెరువు వ్యాపారం చేసుకుంటూ స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఆ కుటుంబానికి చెందిన 14 ఏళ్ల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎయిర్ఫోర్ట్ నుంచి బయట పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురుచూసింది. ఎయిర్ఫోర్ట్ వద్ద కూడా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇన్స్పైర్కు వేళాయె..
రాయవరం: చిన్నారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, వారిలో విజ్ఞాన జిజ్ఞాసను రేకెత్తించేందుకు ఇన్స్పైర్ మనక్ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞాన మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగిన ప్రతిభను బయటకు తీయడం, సైన్స్పై వారికి ఆసక్తిని పెంచడం దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఈ నేపథ్యంలో 2025 – 26 విద్యా సంవత్సరానికి విద్యార్థుల నుంచి నూతన ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. ప్రతి పాఠశాలకూ అవకాశం ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి ఇన్స్పైర్ మనక్ ప్రోగ్రామ్లో పాల్గొనవచ్చు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ప్రతి తరగతి నుంచి ఒకరు వంతున ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు, ఉన్నత పాఠశాలలు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే వీలుంది. 2008–09 సంవత్సరం నుంచి ఏటా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రాజెక్టులను పంపండిలా.. www.inspireawards-dst.gov.in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబరు 15వ తేదీ లోపు పాఠశాల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టాలి. వారి నుంచి రూపుదిద్దుకున్న ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషకం, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్, జపాన్ సందర్శన తదితర అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కళాశాల విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయస్థాయికి ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశముంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. నిబంధనలు ఇవే.. ముందుగా పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను తీర్చే విధంగా ఆలోచన ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతిని నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబరు ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి, సంబంధిత రైటప్ వెబ్సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు సెప్టెంబరు 15 తుది గడువు. జిల్లాలో పరిస్థితి కాకినాడ జిల్లాలో ప్రభుత్వ, ప్రెవేట్ పాఠశాలల నుంచి 2,140 ప్రాజెక్టులు నమోదు కాగా, 172 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. ఎంపికై న ప్రాజెక్టులు తయారు చేసిన విద్యార్థుల ఖాతాలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్కొక్కరికి రూ.10 వేలు వంతున ప్రాజెక్టు రూపకల్పనకు జమ చేశారు. అయితే అత్యధిక ప్రాజెక్టులు రిజిస్టర్ అయినప్పటికీ వాటి రూపకల్పనలో నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లనే ప్రాజెక్టుల ఎంపిక సంఖ్య తగ్గుతోందనే విమర్శలున్నాయి. ప్రాజెక్టులో సృజనాత్మకత, నాణ్యత లోపించడం దీనికి కారణంగా తెలుస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 530 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి కనీసం మూడు, ఉన్నత పాఠశాలల నుంచి కనీసం ఐదు ప్రాజెక్టులు రూపొందించాలి. సృజనాత్మక ఆవిష్కరణలకు ఆహ్వానం ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు పంపే వీలు బాల శాస్త్రవేత్తలకు భలే అవకాశం హెచ్ఎంలు చొరవ చూపాలి విద్యార్థులు సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేలా సైన్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ఇన్స్పైర్ మనక్ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చూడాలి. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా జాతీయ స్థాయిలో నిలిచేలా.. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడేలా ప్రాజెక్టులను విద్యార్థులు రూపొందించాలి. ఈ ప్రక్రియను సైన్స్ ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సైన్సు ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. – గిరజాల వెంకట సత్య సుబ్రహ్మణ్యం, కోనసీమ జిల్లా సైన్స్ అధికారి -
సత్యదేవునికి సిరుల వృష్టి
అన్నవరం: రత్నగిరి సత్యదేవునికి రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. గత 35 రోజులకు హుండీల ద్వారా రూ.2,12,38,410 ఆదాయం సమకూరింది. బుధవారం హుండీలను లెక్కించగా రూ.2,00,76,264 కరెన్సీ, రూ.11,62,146 చిల్లర నాణేలు వచ్చాయని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. సరాసరిన రోజుకు రూ.6,06,811 నమోదైనట్టు తెలిపారు. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం నెలకు రూ.1.2 కోట్ల నుంచి రూ.1.5 కోట్ల వరకు వస్తుంది. కానీ రూ.2 కోట్లు దాటి రావడం అరుదనే చెప్పాలి. 602 గ్రాముల బంగారం.. హుండీలలో నగదుతో పాటు బంగారం సైతం రికార్డు స్థాయిలో 602 గ్రాములు వచ్చింది. బంగారం సైతం ప్రతి నెలా 50 నుంచి 60 గ్రామలు మాత్రమే వస్తుంది. ఈ సారి ఏకంగా పది రెట్లు రావడం గొప్ప విషయమే. ఈ బంగారం మార్కెట్ విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. అలాగే వెండి 613 గ్రాములు వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ కుటుంబం స్వామి వారికి నిలువుదోపిడీ (తాము ధరించిన ఆభరణాలు) సమర్పించినట్టు అధికారులు తెలిపారు. అలాగే వంద గ్రాముల బంగారు బిస్కెట్ కూడా హుండీలో వచ్చినట్టు తెలిపారు. పోటెత్తిన భక్తులు సత్యదేవుని కల్యాణోత్సవాల అనంతరం మే 21న లెక్కించిన తరువాత మళ్లీ బుధవారం హుండీలను లెక్కించారు. వేసవి సెలవులు, వైశాఖం, జ్యేష్ట మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరగడంతో భక్తులు భారీగా తరలి రావడంతో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్టు అధికారులు చెప్తున్నారు. భారీగా విదేశీ కరెన్సీ సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికన్ డాలర్లు 87, సౌదీ అరేబియా రియల్స్ 55, సింగపూర్ డాలర్లు రెండు, బోత్స్వానా కరెన్సీ రెండు పులాలు, ఖతార్ రియల్స్ ఒకటి, యూఏఈ దీరామ్స్ 40, యూరోలు 20, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ బైసా 600 లభించాయి. హుండీ లెక్కింపులో ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం 35 రోజులకు రూ.2.12 కోట్ల నగదు 602 గ్రాముల బంగారం సమర్పణ -
గుట్టుగా దోపిడీ!
పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వతహాగా సినీ నటుడు కావడంతో ఆయన ఇలాకాలో అభివృద్ధ్ది పేరుతో చేస్తున్న పనులు సినిమా యాక్షన్ను తలపిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి. క్లాప్.. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. అన్నట్టుగా గట్టుపై ఒక జేసీబీ పెడుతున్నారు.. కొందరు నేతలు వస్తారు.. కొబ్బరి కాయలు కొడతారు.. వారు వెళ్లి పోగానే జేసీబీతో అక్కడ మట్టి ఇక్కడ వేసి జేసీబీని తరలించేస్తారు. ఈ యాక్షన్ సన్నివేశం ఖరీదు రూ.లక్షల్లో ఉంటుంది. క్లోజర్ పనుల్లో కూటమి నేతలు దోపిడీకి దారి వేసుకున్నారు. రూ.వేలల్లో పని చేసి రూ.లక్షల్లో దోచుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లోజర్ పనుల్లో నాణ్యతకు గోతులు తవ్వి దోపిడీకి గుట్టుగా దారి చేసుకుంటున్నారు అంటూ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఏలేరుకు వచ్చిన వరదల్లో ఏలేరు కాలువకు గండ్లు పడి పిఠాపురం నియోజకవర్గంలో వేలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు రూ.కోట్లలో నష్టపోయారు. పంట పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో కొందరు రైతులు పంట వేసే పరిస్థితి లేకుండా పోయింది. వీటికి నష్టపరిహారాలు ఇవ్వడంలోనూ కూటమి ప్రభుత్వం రైతులకు మొండి చేయి చూపించిందని రైతులు వాపోతున్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునీకరించి చూపిస్తానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వాగ్దానాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కాలువ గట్లు బలహీనంగా మారి గట్టిగా వరదొస్తే వెంటనే గండ్లు పడే పరిస్థితి ఏర్పడింది. ఉన్న గండ్లను పూడ్చడంలో నాణ్యత లోపాలు ఉండడంతో ఏ మాత్రం వరద వచ్చినా మొత్తం పంటలన్నీ నష్టపోయే అవకాశం ఉంది. వేలాది ఎకరాల ఆయకట్టుకు ఏలేరు కాలువ పటిష్టత ఆయువుపట్టు వంటిది. అటువంటి ఏలేరు కాలువలో గండ్లు పూడ్చివేత పనులు నాణ్యతా ప్రమాణాలతో చేయకపోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గండ్లు పూడ్చివేతకు రూ.కోట్లు వెచ్చిస్తున్నప్పటికీ పక్కనే ఉన్న మట్టిని తీసి గట్లు వేసి ఽతూతూ మంత్రంగా గండ్లు పూడ్చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మట్టి తీసి గట్టుపై వేసి సరిపెట్టేస్తే మళ్లీ వరదొస్తే మా పరిస్థితి ఏంటి అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. పక్కనున్న మట్టి వేయడానికే రూ.లక్షలు వ్యయం అవుతుందా అంటు రైతులు కూటమి నేతల దోపిడీని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రూ.30 లక్షల విలువైన పనిని కేవలం 30 గంటల్లో పూర్తి చేసేశారంటే కూటమి నేతల అవినీతి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందంటున్నారు రైతులు. పొలంలో మట్టి కొల్లగొట్టి పిఠాపురం మండలం రాపర్తి వద్ద గొర్రిఖండి కాలువకు గండ్లు పడి గత ఏడాది పంటలు కొట్టుకుపోయాయి. ఆ గండ్ల పూడ్చివేతకు తాత్కాలిక పనులు చేపట్టారు. ముక్కొల్లు నీటి సంఘం ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ అధికారులు 34 గండ్లు పూడుస్తున్నారు. పిఠాపురం మండలం రాపర్తి పరిధిలో వర్కు నంబరు 28 నుంచి 34 వరకు పనులు చేపట్టారు. వీటి నిర్మాణానికి రూ.30.32 లక్షలు కేటాయించారు. వీటిలో కొన్ని టీడీపీ, కొన్ని జనసేన నేతలకు కేటాయించినట్లు తెలిసింది. ప్రతి గండి పూడ్చివేతకు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని తరలించి తీసుకువచ్చి పూడ్చుతున్నట్లుగా ఎస్టిమేట్లలో చూపించిన అధికారులు కాలువ పక్కనే ఉన్న భూముల్లో మట్టిని అక్కడికక్కడే తవ్వి గట్టుపై వేసేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో గట్టు పటిష్టత దెబ్బతిని మళ్లీ వరద వస్తే గండ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పొంచి ఉన్న ప్రమాదం తూతూమంత్రంగా గండ్లు పూడ్చివేత పనులు చేయడం వల్ల మళ్లీ వరద వస్తే క్షణాల్లో గట్లు తెగి వరద నీరు పంట పొలాలను ముంచెత్తే ప్రమాదం కనిపిస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గట్లు ౖపైపెన కొంత మేర మామూలు మట్టిని సర్దేయడం వల్ల పెను ముప్పు తప్పదని వారు అంటున్నారు. అక్కడి మట్టితోనే గండికి పూత! రాపర్తి వద్ద ఏలేరు కాలువ 10.100 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు 34కి రూ.4.82 లక్షలు కేటాయించారు. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి మెటీరియల్ తీసుకు రావడం వల్ల ఇంత ఖర్చు అవుతున్నట్లు చూపించినట్లు తెలిసింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా గట్టు పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి, కాలువలో ఉన్న ఇసుక బస్తాల్లో వేసి వాటిని పేర్చి మట్టి వేసి గట్టును తయారుచేసినట్టు చూపి చేతులు దులిపేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ గతంలో పడిన గండిని గతంలోనే తాత్కాలికంగా కొంతమేర మూసేశారు. దానిపైనే మట్టి వేసి మొత్తం గట్టు అంతా పూడ్చినట్టుగా బిల్లులు పెట్టుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 10 మీటర్ల మేర ఉన్న ఈ గండికి పక్కనే ఉన్న మట్టిని వేయడం వల్ల కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని చెబుతున్నారు. కానీ దీనికి ఏకంగా రూ 4.82 లక్షలు వ్యయం అయినట్లు చూపించి సుమారు రూ.4 లక్షలు దోపిడీ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి పక్కనే ఏలేరు కాలువ 10.200 కిలో మీటరు వద్ద గొర్రిఖండి కాలువకు పడిన గండి పూడ్చివేతకు వర్కు నంబరు 33కి రూ.5.63 లక్షలు కేటాయించారు. పక్కనే ఉన్న రైతుల భూముల్లోని మట్టిని తవ్వి ఇసుక బస్తాలు పేర్చి మట్టి వేసి గట్టు వేసేసినట్టు చూపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పనికి సైతం కేవలం రూ.70 వేలకు మించి ఖర్చు కాదని, కానీ ఏకంగా రూ 5.63 లక్షలు వ్యయమైనట్టు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈవిషయంపై ఏలేరు నీటిపారుదల శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. గొర్రి‘గండి‘ పనుల్లో అవినీతి జలగలు పక్క పొలంలో మట్టితో గండ్ల పూడ్చివేత రూ.వేలల్లో ఖర్చు.. రూ.లక్షలు మేత క్లోజర్ మొత్తం పనుల్లో కూటమిగా రూ.కోట్లు స్వాహా -
అమ్మ ఓడి.. 'పోయింది'
చివరి రోజుల్లో.. చిట్టచివరి క్షణాల్లో.. కొడుకు కంటి చూపు, స్పర్శ కోసం పరితపించిన ఓ తల్లి వ్యథ ఇది. కాటికేగే వేళ కన్నబిడ్డను కళ్లారా చూసుకుంటే చాలనుకున్న ఓ వ్యథార్థ మాతృమూర్తి యథార్థ గాథ ఇది. అంతిమ ఘడియల్లో అన్నీ తెలిసి కొడుకు కావాలనే రాలేదన్న గుండె పగిలే చేదు నిజాన్ని తాళలేక ఆ కన్నీటి వ్యథతోనే కన్ను మూసిన ఓ అమ్మ కథ ఇది. అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం వదిలిపోయావనీ, నాటి నుంచి కంటికి కానరాలేదనీ, చిట్టచివరిగా ఒక్కసారి కనిపించి వెళ్లపో నాయనా అంటూ తల్లి అచేతన స్థితిలో వీడియో పంపి మరీ వేడుకున్నా ఆ కొడుకు మనసు కరగలేదు. పుత్రరత్నం తాను ఉన్న హైదరాబాద్ నుంచి తల్లి ఉన్న కాకినాడకి తీరిక చూసుకొని చేరేసరికి ఆయువు పోసిన అమ్మ ఊపిరి అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఆ అమాయకపు తల్లి రాజేశ్వరి అయితే, కాఠిన్యం నిండిన ఆ కొడుకు పేరు జోష్యబట్ల రాజశేఖర్. తనువు చాలించే వేళ బిడ్డను చూస్తే చాలనుకుంది. పున్నామ నరకం నుంచి తప్పించడమే ఎక్కువనుకొని చిట్ట చివరి వేళ కట్టె గుట్టకి నిప్పంటించి నిష్క్రమించాడా కొడుకు. ఈ హృదయ విదారక ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. – కాకినాడ క్రైంకొడుకు కోసమే యావత్ జీవితం కాకినాడ దేవాలయం వీధి వినుకొండ వారి వీధికి చెందిన జోష్యబట్ల రాజేశ్వరి(70) తన ఒక్కగానొక్క కుమారుడి కోసం తన యావత్ జీవితాన్ని అర్పించింది. ఈమెకి 45 ఏళ్ల కుమారుడు రాజశేఖర్ ఉన్నాడు. బిడ్డను కని భర్త వదిలి పోయినా టైలరింగ్ చేస్తూ కుమారుడిని చదివించింది. పదవ తరగతి అనంతరం విడిచిపోయిన తండ్రి పిలుపుతో రాజశేఖర్ కేరళ వెళ్లాడు. కొన్నేళ్ల తర్వాత తల్లి వద్దకు వచ్చాడు. ఉద్యోగం కోసం వెతుకుతుంటే తల్లి.. తెలిసిన వారి సాయంతో కాకినాడలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా ఉద్యోగం వేయించింది. అదే సమయంలో తల్లిని పిలవకుండానే ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ఒకసారి భార్యను చూపించి, నాటి నుంచి తల్లిని వదిలిపోయాడు. వదిలిపోయి 20 ఏళ్లు 20 ఏళ్ల క్రితం తల్లిని వదిలిపోయిన రాజశేఖర్ మళ్లీ తల్లిని ఒక్క రోజైనా చూడలేదు. రాజేశ్వరి కొడుకు వస్తాడని ఏళ్లకు ఏళ్లు ఎదురు చూస్తూ ఓ అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యంతో టైలరింగ్ చేసుకుంటూ తనని తాను పోషించుకునేది. ఐదేళ్ల క్రితం తన పనులు తాను చేసుకోలేని నిస్సహాయ స్థితికి చేరింది. ఆమె దయనీయ స్థితిని చూసి పొరుగు వారు అప్పటి కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీప్రసన్న దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ చొరవ తీసుకొని వలసపాకలలో ఉన్న రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో రాజేశ్వరిని చేర్చారు. అక్కడికి వెళ్లాక కూడు,గూడులోటు లేకున్నా కొడుకు కోసం పరితపిస్తున్న మనోవేదన మాత్రం ఆమె ఆరోగ్యాన్ని మరింత క్షీణింపజేసింది. తోటి వృద్ధులతో కొడుకు ఉండీ ఇలా అనాథలా బతుకుతున్నానని చెప్పుకొని కన్నీటిపర్యంతమయ్యేది. కార్పొరేటర్ చొరవతో.. అనాథాశ్రమంలో రాజేశ్వరి పరిస్థితి దయనీయంగా మారింది. ఆశ్రమ నిబంధనల ప్రకారం స్వయంగా తమ పనులు తాము చేసుకునేవారికే అక్కడ స్థానం ఉంటుంది. నానాటికీ క్షీణిస్తున్న ఆరోగ్య పరిస్థితితో రాజేశ్వరి మంచానికి పరిమితం అయింది. ఆశ్రమ యాజమాన్యం రాజేశ్వరిని చేర్చిన కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్నకు విషయం చెప్పడంతో ఆమె రాజేశ్వరిని కాకినాడ జీజీహెచ్లో చేర్చి సేవలు చేశారు. నివాసాన్ని కోరుతూ కలెక్టర్ షణ్మోహన్కు లక్ష్మీప్రసన్న ఈ ఏడాది మే 12వ తేదీన లేఖ రాశారు. తక్షణమే స్పందించిన ఆయన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు, రాజేశ్వరి బాగోగులు పరిశీలించి తగిన నివాస సదుపాయం కల్పించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మిని్రస్టేటర్ రంగనాథం శైలజ రాజేశ్వరి బాగోగుల బాధ్యతలు చూసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు, పెద్దాపురంలో బాధ్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “మన ఇల్లు’ వసతి గృహానికి రాజేశ్వరిని తరలించారు. కొడుకా అని కలవరిస్తూ... నాటి నుంచి రాజేశ్వరి తన కుమారుడి పేరును కలవరిస్తూనే ఉంది. వసతి గృహ వ్యవస్థాపకుడు సత్యనారాయణ, బృందం ఆమెకి సపర్యలు చేసేది. రాజేశ్వరి చివరి కోరికను తెలుసుకున్న సత్యనారాయణ విషయాన్ని శైలజ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె రాజేశ్వరి కుమారుడు రాజశేఖర్ను సంప్రదించి తల్లి దీనావస్థను వివరిస్తే రావడానికి తనకు తీరిక లేదని ఫోన్లో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. సత్యనారాయణ, ఆయన బృందం రాజశేఖర్తో మాట్లాడినా ఫలితం లేకపోయింది. తాను సంగీత దర్శకత్వం చేస్తుంటానని, చాలా బిజీగా ఉంటానని తనకు మాటి మాటికీ ఫోన్లు చేయవద్దని విసుక్కున్నాడు. అప్పటికే రాజేశ్వరి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. తిండి మానేసింది, మందులు తీసుకోవడానికి శరీరం కూడా సహకరించడం లేదు. అటువంటి నిస్సత్తువలో కూడా కొడుకు కోసమే పరితపించేది. కొడుకా కొడుకా అంటూ కలవరించేది. పోలీసుల వార్నింగ్ రాజశేఖర్ తన తల్లి స్థితిని కళ్లకు కట్టేలా వీడియోలు పంపి వివరించినా ఏ మాత్రం చలించలేదు. పైగా చెబుతున్న వారందరినీ తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కాకినాడ టూ టౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు సూచనలతో పోలీసులు రాజశేఖర్కి కాల్స్ చేశారు. వచ్చి తల్లికి కనిపించి వెళ్లకపోతే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్–2019 ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో మరో మార్గం లేక రాజశేఖర్ హైదరాబాద్ నుంచి బయల్దేరి ఈ నెల 10వ తేదీన ఉదయం వచ్చాడు. అయితే కొడుకు రాకకోసం పరితపించి అతడు రావడానికి కొద్ది గంటల ముందే ప్రాణాలు విడిచింది. అంతిమ సంస్కారాలు మీరే చెయ్యండి రాజశేఖర్ వచ్చి తల్లి మృతదేహాన్ని చూసి మండిపడ్డాడు. ఇంత మాత్రానికే తనను ఎందుకు ఇబ్బంది పెట్టారని విసుక్కున్నాడు. అంతిమ సంస్కారాలు కూడా మీరే చేసేయండని ఎంత కావాలన్నా ఇచ్చేస్తానని బేరాలాడాడు. శైలజ ఆమె బృందం నచ్చజెప్పారు. నిన్ను చూడాలన్న ఆమె ఆఖరి కోరిక ఎలాగో తీర్చలేదు, కనీసం తలకొరివి అయినా పెట్టమని అడిగారు. సఖి వన్స్టాప్ సెంటర్, బాధ్యత ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు రాజశేఖర్ మాతృమూర్తి మృతదేహానికి తలకొరివి పెట్టాడు. అంతిమ సంస్కారాలు బలవంతంగా చేయించిన అధికారులు, ఫౌండేషన్ సభ్యులపై విసుక్కొని వెళ్లిపోయాడు. -
ఆషాఢం.. అదుర్స్!
అన్నవరం: సాధారణంగా ఆషాఢ మాసంలో ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాలు, శని, ఆదివారాలు మినహా సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ, ఇదే సమయంలో అన్నవరం సత్యదేవుని గోధుమ నూక ప్రసాదానికి డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. తుని సమీపంలోని లోవ దేవస్థానంలో కొలువు తీరిన తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వెళ్తూంటారు. ఉమ్మడి జిల్లాలోని కోనసీమ, రాజమహేంద్రవరం, కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి లోవకు వెళ్లే భక్తులు మధ్యాహ్నం రెండు గంటల నుంచి తిరుగు ప్రయాణమవుతూంటారు. వీరు మార్గం మధ్యలో అన్నవరంలో ఆగి, సత్యదేవుని గోధుమ నూక ప్రసాదాలు పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తూంటారు. దీంతో, ఈ ప్రసాదం విక్రయాలు ఈ మాసంలో లెక్కకు మిక్కిలిగా జరుగుతూంటాయి. ఈ ఏడాది ఆషాఢ మాసం గురువారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తుల డిమాండ్కు అనుగుణంగా సత్యదేవుని ప్రసాదాలను అందుబాటులో ఉంచేందుకు అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు ఇలా.. ఫ ఆషాఢ మాసంలో ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలుపులమ్మ తల్లి దర్శనానికి వెళ్లే భక్తులు అధికంగా ఉంటారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు లోవ దేవస్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. వారిలో అధిక శాతం మంది తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తారు. జాతీయ రహదారిపై నిర్మించిన సత్యదేవుని కొత్త, పాత నమూనా ఆలయాల వద్ద, తొలి పావంచా వద్ద ప్రసాద విక్రయ స్టాల్స్లో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫ సాధారణ రోజుల్లో 60 వేలు, ఆదివారం నాడు పాత, కొత్త నమూనా ఆలయాల కౌంటర్లలో చెరో 20 వేలు, తొలి పావంచా కౌంటర్ వద్ద 30 వేలు, రత్నగిరిపై ఉన్న కౌంటర్ల వద్ద 30 వేలు, కలిపి మొత్తం లక్ష ప్రసాదం ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఈ కౌంటర్ల వద్ద అదనపు భద్రత కూడా ఏర్పాటు చేశారు. రూ.1.50 కోట్ల ఆదాయం! మొత్తం మీద ఆషాఢ మాసంలో కొండ దిగువన ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా అన్నవరం దేవస్థానానికి సుమారు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్క ఆదివారం నాడే సుమారు 50 వేల నుంచి లక్ష ప్రసాదాల ప్యాకెట్ల విక్రయాలు జరుగుతాయి. ఒక్కో ప్రసాదం ప్యాకెట్ ఖరీదు రూ.20. దీని ప్రకారం ఆషాఢ మాసం నాలుగు ఆదివారాల్లోనే సుమారు రూ.80 లక్షల ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రసాద విక్రయాల ద్వారా మరో రూ.70 లక్షలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రెండు పూటలా తయారీ రత్నగిరిపై ఉదయం, మధ్యాహ్నం కూడా ప్రసాదం తయారు చేసి భక్తులకు వేడిగా విక్రయిస్తున్నారు. గతంలో ఒక్క కార్తికం మినహాయిస్తే మిగిలిన మాసాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ మాత్రమే స్వామివారి గోధుమ నూక ప్రసాదం తయారు చేసేవారు. దానిని మర్నాడు ఉదయం వరకూ విక్రయించేవారు. అయితే ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఇప్పుడు ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక షిఫ్ట్, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ రెండో షిఫ్ట్లో ప్రసాదాలు తయారు చేసి, కౌంటర్ల ద్వారా విక్రయిస్తున్నట్లు ప్రసాదం విభాగం అధికారులు తెలిపారు. ఫ తలుపులమ్మ లోవకు భక్తుల తాకిడి ఫ జోరందుకోనున్న సత్యదేవుని ప్రసాద విక్రయాలు ఫ అన్నవరంలో అదనపు కౌంటర్ల ఏర్పాటు -
మారీటైమ్ బోర్డుకు సాల్ట్ భూములు బదలాయించాలి
కాకినాడ సిటీ: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాల్ట్ డిపార్టుమెంట్కు చెందిన 1,245.28 ఎకరాల భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదలాయించాల్సి ఉందని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తెలిపారు. ఈ మేరకు ఈ భూముల ధరను నిర్ణయించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన జేసీ మాట్లాడుతూ, కాకినాడ, కరప, తాళ్లరేవు మండలాల్లో ఉన్న సాల్ట్ డిపార్టుమెంట్ భూములను రాష్ట్ర మారీటైమ్ బోర్డుకు బదిలీ చేసేందుకు ధర నిర్ణయించాల్సిందిగా చైన్నెలోని డిప్యూటీ సాల్ట్ కమిషనర్ను కోరారన్నారు. ఈ భూముల విలువను కలెక్టర్ షణ్మోహన్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ నిర్ణయిస్తుందన్నారు. గురజనాపల్లి, చొల్లంగి గ్రామాల్లో 626.37 ఎకరాలు, పెనుగుదురులో 501.26 ఎకరాలు, కాకినాడ జగన్నాథపురం, సాల్ట్ సూపరింటెండెంట్ ఆఫీసు ప్రాంగణంలో 117.65 ఎకరాల చొప్పున ఈ భూములున్నాయని వివరించారు. ఈ భూములను సంబంధిత తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు పరిశీలించి, వాటి స్థితి, ధర వివరాలతో కమిటీకి నివేదిక అందజేయాలని జేసీ ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ జె.వెంకటరావు, ఆర్డీఓ ఎస్.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. లీఫియస్ ప్లాంట్ ప్రారంభించండి సాక్షి ప్రతినిధి, కాకినాడ: పరిశ్రమలు తీసుకువచ్చి సంపద సృష్టిస్తానంటున్న ప్రభుత్వం కాకినాడ ఎస్ఈజెడ్లో రూ.2,400 కోట్లతో సిద్ధమైన లీఫియస్ పెన్సిలిన్ ప్లాంట్కు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని రాక్స్ మాల మహానాడు, సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ ప్రశ్నించారు. కాకినాడలో మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక సమస్యలతో నాలుగు నెలలుగా ప్లాంట్ నిర్వహణలోకి తీసుకురాకపోవడం అన్యాయమన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన 2,500 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించి, ఉద్యోగుల జీతభత్యాలకు ఇబ్బందులు తలెత్తకుండా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెన్సిలిన్–జీ యాంటీ బయోటిక్ను పెన్సిలియం క్రైసోజినం ఫంగస్ ఉపయోగించి ఫెర్మెంటేషన్ ద్వారా ఈ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తున్నారన్నారు. ఈ ప్లాంట్కు ఏటా 15 వేల టన్నుల పెన్సిలిన్–జి, 1.8 లక్షల టన్నుల గ్లూకోజ్, 6 అమైనో పెన్సిల్లానిక్ యాసిడ్ 3,600 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని రత్నాకర్ తెలిపారు. పీజీ ఈసెట్లో 93.85 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన పీజీ ఈసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 93.85 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. పీజీ విభాగంలో 13 సబ్జెక్టులకు సంబంధించి ఈ పరీక్షకు 931 మంది దరఖాస్తు చేసుకోగా 764 మంది రాశారు. వీరిలో 717 మంది ఉత్తీర్ణులయ్యారు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో కుంచె సుదర్శన్ (కాకినాడ రూరల్ పెనుమర్తి) 7, సివిల్ ఇంజినీరింగ్లో అల్లు సాయి నవీన్ (పెద్దాపురం) 8, కె.వెంకట రామప్రసాద్వర్మ 10, ఈఈఈ విభాగంలో ఎస్.లాస్య (సామర్లకోట) 3, సి.సత్య వెంకట లోవ శివ సమీర్ (తొండంగి) 10, ఎం.కృష్ణ కౌశిక్ (దుర్గాడ) 10, ఫుడ్ టెక్నాలజీలో బిళ్లకుర్తి జ్యోతి (కాకినాడ) 4, ఇన్స్ట్రుమెంట్ విభాగంలో రాయుడు సాయిరామ్ (జగన్నాథగిరి) 1, పి.సాయి (ఎ.కొత్తపల్లి) 4, మెకానికల్ విభాగంలో కె.లోకేష్ (సీతారామపురం) 1, మెటలర్జీ విభాగంలో ఎం.నాగేశ్వరి (పేపకాయయలపాలెం) 4, నానో టెక్నాలజీలో కె.విశాల్ (సర్పవరం) 9 ర్యాంకులు సాధించారు. ఎస్ఎస్ఏ ఉద్యోగుల బదిలీల సీనియారిటీ జాబితా విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమగ్ర శిక్షా అభియాన్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్, కేజీబీవీ, పీటీ, సీఆర్ఎంటీఎస్, ఎంఐఎస్లకు సంబంధించిన ఉద్యోగుల బదిలీల సీనియారిటీ జాబితాను సమగ్ర శిక్ష తూర్పు గోదావరి వెబ్సైట్లో ఉంచినట్లు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ పి.వేణుగోపాలరావు మంగళవారం తెలిపారు. అభ్యంతరాలుంటే ఈ నెల 27వ తేదీలోగా తెలియజేయాలని సూచించారు. -
రూ.26,409 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాకు రూ.26,409 కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ షణ్మోహన్ సగిలి మంగళవారం ఆవిష్కరించారు. బ్యాంకులు, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా కన్సల్టేటివ్ కమిటీ, జిల్లా స్థాయి రుణాల లక్ష్య సాధన ప్రగతి సమీక్ష కమిటీ సమావేశాలు కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వ్యవసాయ, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇతర ప్రాధాన్య రంగాలకు వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం రుణాలివ్వాలని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాలకు మించి రుణాలిచ్చినందుకు బ్యాంకర్లకు అభినందించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు మరింత చొరవ చూపాలని కోరారు. ఈ రుణాల ప్రగతిపై ప్రతి వారం సమీక్షిస్తామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ 10,500 మంది మంది కౌలు రైతులకు క్రాప్ కల్టివేటర్ రైట్స్ (సీసీఆర్) కార్డులు జారీ చేయగా, 8 వేల మంది రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కమిటీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ వి.కృష్ణమాచారి, ఎల్డీఎం, సీహెచ్ఎస్వీ ప్రసాద్, రిజర్వ్ బ్యాంకు ఎల్డీఓ ఎ.రామకృష్ణ, నాబార్డ్ ఏజీఎం వై.సోమునాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వంచనపై సమరభేరి
సర్కార్కు కనువిప్పు కలగాలి యువత పోరుతో కూటమి సర్కార్కు కనువిప్పు కలగాలి. విద్యా సంవత్సరం ముగిసిపోయినా ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోంది. దీంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మంత్రి లోకేష్ తాము ఇచ్చిన 31 హామీలు 31 కెమెరాల్లో ఫీడ్ చేసుకోమని నాడు ఎన్నికల సందర్భంగా చెప్పారు. ఇప్పుడేమో రెడ్బుక్ పట్టుకుని తిరుగుతున్నారే తప్ప హామీలు, సంక్షేమ పథకాలను పట్టించుకోవడం లేదు. ఫీజుల ఇబ్బందుల నుంచి విద్యార్థులను బయటపడేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ హామీలు అమలు చేయాలి హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కూటమి సర్కారుపై యువత తిరగబడింది. ఇది తొలి అడుగుగా గుర్తెరిగి విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా యువత పోరుకు విద్యార్థులు, యువత తరలివచ్చారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా నెలకొన్న వ్యతిరేకతకు ఇది అద్దం పడుతోంది. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా, వసతి దీవెనలను అటకెక్కించిన సర్కారు.. విద్యార్థులను రోడ్డు పాలు చేసింది. – పూసల అనిల్ కుమార్, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ ● కదం తొక్కిన విద్యార్థులు, యువత ● కాకినాడలో భారీ ర్యాలీ ● కూటమి సర్కారు మోసంపై ఆగ్రహం ● ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి తక్షణం ఇవ్వాలని డిమాండ్ ● దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు ● కలెక్టర్కు వినతి సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఉద్యోగాలిస్తాం.. ఇవ్వలేకుంటే నెలనెలా రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తాం. విద్యా సంవత్సరం ముగియకుండానే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తాం’ అంటూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు చంద్రబాబు అండ్ కో నమ్మించారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తమను నిలువునా వంచించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు, యువత సోమవారం పెద్ద ఎత్తున కదం తొక్కారు. కూటమి నేతల మాయమాటలతో దగా పడిన విద్యార్థులు, యువత జిల్లా నలుమూలల నుంచీ తరలివచ్చి, కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఈ హామీలు ఏడాది కాలంగా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ‘యువత పోరు’ పిలుపే ప్రభంజనమైనట్లు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచీ వేలాదిగా తరలివచ్చారు. యువ‘జన ప్రవాహం’ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, యువత కాకినాడ బాలా త్రిపుర సుందరి ఆలయం సమీపాన ఉన్న వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడి నుంచి పార్టీ నేతలు వెంట రాగా దిక్కులు పిక్కటిల్లేలా పెద్ద పెట్టున నినాదాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పిండాల చెరువు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం, మెక్లారిన్ కాలేజీ, పీఆర్ కాలేజీ, జిల్లా పరిషత్ జంక్షన్, సివిల్ సప్లైస్ పెట్రోల్ బంకు, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకూ ఈ ప్రదర్శన సాగింది. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ ముందు భాగంలో నిలిచారు. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ పార్టీ నేతలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి, కూటమి సర్కారు మోసాలను ఎండగడుతూ ప్రదర్శనలో పాల్గొన్నారు. పార్టీ సిటీ కార్యాలయం వద్ద బయలుదేరిన దగ్గర నుంచి జెడ్పీ సెంటర్ వరకూ ఆ మార్గమంతా కిక్కిరిసిపోయింది. ర్యాలీ జరిగిన రోడ్డు యువ జాతరను తలపించింది. ‘చంద్రబాబూ.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ఏమైంది సిగ్గు సిగ్గు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా మోసం చేస్తారా సిగ్గు సిగ్గు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సిగ్గు సిగ్గు, నాడు మామకు వెన్నుపోటు – నేడు యువతకు వెన్నుపోటు’ అంటూ ప్లకార్డులు, నినాదాలతో హోరెత్తించారు. ర్యాలీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత, పార్టీ నేతలు కలెక్టరేట్కు చేరుకున్నారు. ప్రధాన గేటు ద్వారా కలెక్టరేట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పది మంది ముఖ్య నేతలను మాత్రమే అనుమతించడంతో, వారు వెళ్లి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. యువతపోరు విజయవంతం కావడం వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ, పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాగులాపల్లి ధనలక్ష్మి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, పార్టీ యువజన, విద్యార్థి, మహిళా విభాగాల జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ), పూసల అనిల్కుమార్, వర్ధినీడి సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, కాకినాడ సిటీ యూత్, విద్యార్థి విభాగాల అధ్యక్షులు రోకళ్ల సత్యనారాయణ, జలగడుగుల పృథ్వి, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జమ్మలమడక నాగమణి, పార్టీ ముఖ్య నేతలు సుంకర విద్యాసాగర్, వాసిరెడ్డి జమీలు, అల్లి రాజబాబు, నాగం గంగబాబు, లాలం బాబ్జీ, రావూరి వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల లోవరాజు, బెజవాడ సత్యనారాయణ, బెండా విష్ణు, కొప్పన శివ, గండ్రేడు రాము, గండేపల్లి బాబీ, మాదిరెడ్డి దొరబాబు, దాసం వెంకటేష్, కారే శ్రీనివాస్, ఆనాల సుదర్శన్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర, జిల్లా నాయకులు తోట శ్రీరాంజీ, బదిరెడ్డి గోవిందు, సకురు గుర్రాజు, ఎంజీకే కిశోర్, కరణం భాను, వీరంరెడ్డి నాని, మాదేపల్లి రాజబాబు, మాదారపు నాని, సీడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు దగా విద్యార్థులకు కూటమి సర్కార్ వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. విద్యా సంవత్సరం ముగియకుండానే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోంది. వారానికో ఈవెంట్ చేస్తూ ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ప్రభుత్వంలా మారింది. ప్రజల్లోకి జగన్మోహన్రెడ్డి గళం వెళ్లకుండా ఉండేందుకు కుట్రలు చేస్తోంది. ప్రజలకు జగన్ నుంచి సహకారం అందకుండా చేయాలనుకుంటోంది. ఒక వ్యూహం ప్రకారం ప్రతిపక్షమనేది లేకుండా చేయాలని చంద్రబాబు అండ్ కో కుయుక్తులు పన్నుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80 ఏళ్ల వయసులో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్రెడ్డి తలకాయ నరికేస్తానంటూ ఒక ఎమ్మెల్యేగా ఆయన ఎలా మాట్లాడతారు? హామీలు అమలు చేయాలని, రాష్ట్ర సమస్యల పైన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని జగన్ నిలదీశారు. మీడియా నుంచి వచ్చిన రప్పా రప్పా అనే ప్రశ్నకు ఆయన సమాధానం మాత్రమే చెప్పారు. ఒక టీడీపీ కార్యకర్త మోసపోయామనే బాధతో రప్పా రప్పా అని ఫ్లెక్సీ పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అది సినిమా డైలాగ్ తప్ప మరొకటి కాదని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం ఈ డైలాగ్ను టాపిక్ డైవర్షన్ కోసం వాడుకుంటోంది. నిరుద్యోగ భృతి రప్పా, ఫీజు రీయింబర్స్మెంట్ రప్పా రప్పా, హామీలన్నీ రప్పా రప్పా కాదా? – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
శాన్ఫ్రాన్సిస్కోలో సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రదర్శన
భువనేశ్వర్: సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ–మేనేజ్మెంట్ (సీయూటీఎం) అరుదైన ఘనత సాధించింది. శాన్ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన 62వ డిజైన్ ఆటోమేషన్ కాన్ఫరెన్స్ (డీఏసీ)లో పాల్గొనే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకోవడమే కాకుండా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. ఈ కాన్ఫరెన్స్ ఈ నెల 22న ప్రారంభమైంది, 25 వరకు కొనసాగనుంది. సెమీకండక్టర్, డిజైన్ ఆటోమేషన్ పరిశ్రమ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కాన్ఫరెన్స్లో సెంచూరియన్ ప్రాతినిధ్యం వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీచిప్స్ టు సిస్టమ్స్శ్రీ అనే శీర్షికతో నిర్వహిస్తున్న డీఏసీ కార్యక్రమానికి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (ఈడీఏ), సెమీకండక్టర్ టెక్నాలజీలు, సిస్టమ్ ఇన్నోవేషన్ రంగంలో దిగ్గజాలు హాజరయ్యాయి. వర్సిటీ ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ డీఎన్ రావు ఆధ్వర్యంలో ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్దాస్, లక్ష్మీకాంత్ సుతార్లతో కూడిన బృందం సెంచూరియన్కు ప్రాతినిధ్యం వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి వేదికపై సామర్థ్యాన్ని ప్రదర్శించిన తొలి వర్సిటీగా సెంచూరియన్ నిలుస్తుందన్నారు. వర్సిటీలో సెమీకండక్టర్ టెక్నాలజీ పాఠ్యాంశాలు మెరుగుపరచడానికి మార్క్యూ సెమీ కండక్టర్స్తో ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్రపంచ స్థాయిలో సెంచూరియన్ తన ఉనికి చాటుకుంటుందని ఆశాభవం వ్యక్తం చేశారు. -
బాధితురాలి చేతికి చేరిన బంగారు గొలుసు
సామర్లకోట: విశాఖపట్నానికి చెందిన దంపతులు సామర్లకోటలో పొగొట్టుకున్న బంగారు గొలుసును పోలీసులు సోమవారం బాధితురాలికి అందజేశారు. కలిపిరెడ్డి నారాయణమ్మ, జగన్మోహన్రావు ఆదివారం విశాఖపట్నం నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక స్టేషన్ సెంటర్లో ఒక హోటల్లో అల్పాహారం చేశారు. అనంతరం ఆ దంపతులు రోడ్డుపై పర్సు జాడ విరుచుకున్నారు. రైల్వే స్టేషన్కు వెళ్లిన తరువాత చూసుకొంటే పర్సు కనిపించక పోవడంతో స్థానిక అవుట్ పోస్టులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు మూడు తూలాల బరువైన రూ. మూడు లక్షల విలువ కలిగిన బంగారు గొలుసు పోవడంతో ఎస్సీ ఈ కేసును ఛేదించాలని పోలీసులను ఆదేశించారు. దాంతో ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు అవుట్ పోస్టు పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు. ఒక బిచ్చగాడు రోడ్డుపై పడిపోయిన పర్సు తీసుకొని జేబులో పెట్టుకోవడాన్ని గుర్తించారు. వెంటనే ట్రాఫిక్ పోలీసులు బిచ్చగాని కోసం గాలింపు చేసి గుర్తించి అతని వద్ద నుంచి పర్సును సోమవారం స్వాధీనం చేసుకున్నారు. పర్సులో బంగారు గొలుసు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితులకు సమాచారం ఇచ్చారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీహరిరాజు, సీఐ ఎ.కృష్ణభగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బంగారు గొలుసు అందజేశారు. -
ఆసనాలకు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం ఈ నెల మూడో తేదీన అంతర్వేది సముద్ర తీరంలో నిర్వహించిన వృక్షాసనం, భారీ మానవహారం ఆసనాలు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించాయి. వికసిత్ భారత్లో భాగంగా నిర్వహించిన యోగ ఆంధ్ర మాసోత్సవాల ద్వారా అంతర్వేదిలో నిర్వహించిన వృక్షాసన భారీ మానవహారం ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడంపై డీఆర్వో రాజకుమారి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్ డీఎల్డీవో రాజేశ్వరరావు, ఎస్డీసీ పి.కృష్ణమూర్తి, జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారుల బృందం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను అభినందించారు. ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన అంతర్వేది వృక్షాసన భారీ మానవహారం ఆసనాలు -
వేటగాళ్ల అరెస్టు
తుపాకీ స్వాధీనం గండేపల్లి: వన్య ప్రాణులను వేటాడే వ్యక్తులను అరెస్టు చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని కె గోపాలపురం శివారులో వన్య ప్రాణులను వేటాడేందుకు వచ్చిన వ్యక్తులను ఎస్ఐ శివ నాగబాబు, సిబ్బందితో కలిసి గండేపల్లికి చెందిన జి నాగార్జున, ఎం రాంబాబు, జి సత్తిబాబును అరెస్ట్ చేయగా రాజమహేంద్రవరానికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు తెలిపారు. వీరి వద్ద నుంచి సింగిల్ బ్యారల్ నాటు తుపాకీ, 12 మీడియం ఐరన్ బాల్స్, 65 స్మాల్ ఐరన్ బాల్స్, 3 సెల్ ఫోన్స్, 2 మోటార్ సైకిళ్లు, 2 ఎడ్ టార్చ్ లైట్లు, తుపాకీ ఫైర్ చేయడానికి ఉపయోగించే రెండు రకాల పౌడర్లు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించగా రిమాండ్ విధించినట్టు తెలియజేశారు. -
కౌలుకోలేని దెబ్బ
● 24 గంటలన్నారు.. 45 రోజులైనా రాని ధాన్యం సొమ్ము ● ఖరీఫ్ పెట్టుబడికి డబ్బుల్లేక కౌలు రైతుల ఆందోళన ● పీజీఆర్ఎస్లో ఫిర్యాదు తీసుకోవడానికి అధికారుల నిరాకరణ ● కన్నీటి పర్యంతమైన అన్నదాతలుపిఠాపురం: ఖరీఫ్ సాగు మొదలైపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రైతులు పొలం బాట పడుతున్నారు. కానీ, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. అప్పు పుట్టడం లేదు. కౌలు చెల్లిస్తేనే భూమిలో అడుగు పెట్టాలని యజమానులైన రైతులు కరాఖండిగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. ముందస్తు సాగు చేయాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటలు కాపాడుకోవాలని ఊదరగొడుతున్న ప్రభుత్వం.. తమకివ్వాల్సిన ధాన్యం సొమ్ము గురించి మాత్రం నోరు మెదపడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రబీ ధాన్యం విక్రయించిన రైతులకు జిల్లా వ్యాప్తంగా రూ.60 కోట్లు, పిఠాపురం నియోజకవర్గంలో సుమారు 250 మంది రైతులకు రూ.10 కోట్లకు పైగా ప్రభుత్వం బకాయి పెట్టింది. ఈ డబ్బులు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నిస్తున్నారు. గత రబీలో పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించింది. ఇది జరిగి 45 రోజులైంది. అప్పుడే ఖరీఫ్ కూడా వచ్చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇవ్వడం లేదు. ఈ డబ్బులు వెంటనే ఇవ్వాలని కోరుతూ నియోజకవర్గానికి చెందిన పలువురు రైతులు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై అర్జీ ఇచ్చేందుకు వారు ప్రయత్నించగా కాగితం రూపంలో వద్దని, మామూలుగా చెప్పాలని అంటూ రైతుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో, రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పండించిన ప్రతి ధాన్యం గింజా కొంటామని, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని గొప్పలు చెప్పిన అధికారులు.. ఇప్పుడు అర్జీ తీసుకోవడానికి సైతం నిరాకరిస్తున్నారని, ఇక తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇవ్వాల్సిన ధాన్యం సొమ్ము ఇవ్వకపోగా తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితిలోకి ప్రభుత్వం నెట్టేసిందని వాపోయారు. మరోవైపు అప్పులు కూడా పుట్టడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి కోలుకోలేని విధంగా దెబ్బ తిన్నామని కన్నీరు పెట్టుకుంటున్నారు. మరో మూడు వారాలంటున్నారు ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ధాన్యం సొమ్ము రావడానికి ఇంకా మూడు వారాలు పడుతుందంటున్నారు. ముందు కౌలు ఇస్తే తప్ప భూమిలోకి రావద్దని యజమాని అంటున్నాడు. అప్పు చేసి ఇద్దామంటే అప్పులు ఇచ్చే వారు కూడా లేరు. రబీలోనే ఆస్తులు తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి సాగు చేశాం. ధాన్యం సొమ్ము వస్తుందని, పెట్టుబడికి ఇబ్బంది ఉండదని అనుకున్నాం. కానీ అటు సొమ్ము రాక.. ఇటు పంట వేసే దారి లేక ఆస్తులు తాకట్టులో ఉండిపోయి వడ్డీలు పెరిగిపోతున్నాయి. వచ్చే సొమ్ము వడ్డీలకే సరిపోని పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటే ధర తక్కువైనా వెంటనే సొమ్ము ఇచ్చేసేవారు. అలా అమ్మనీయకుండా అధికారులు వచ్చి మమ్మల్ని నమ్మించి, ఇప్పుడు నట్టేట ముంచారు. – విజయకుమార్, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు రైతును ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చూడలేదు. ‘గంటల్లో మీ డబ్బు మీ ఇంటికి వస్తుంది’ అని గొప్పగా చెప్పారు. ప్రైవేటు వ్యాపారికి అమ్మితే చర్యలు తీసుకుంటామని భయపెట్టారు. ప్రభుత్వానికి అమ్మితే మాకు రక్షణగా ఉంటుందని నమ్మాం. తీరా ధాన్యం అమ్మి 45 రోజులైనా ఇదిగో అదుగో అంటున్నారు తప్ప డబ్బులు వేయడం లేదు. అప్పుడు మా దగ్గరకు వచ్చి ధాన్యం అమ్మాలని చెప్పిన ఏ అధికారీ ఇప్పుడు సమాధానం చెప్పడం లేదు. ఎవరిని అడగాలో తెలియడం లేదు. కనిపించిన ప్రతి ఆఫీసుకు, అధికారి వద్దకు తిరుగుతున్నాం. ఇప్పుడు సాగు పెట్టుబడికి డబ్బుల్లేవు. ఇక తాకట్టు పెట్టడానికి మా దగ్గర ఆస్తులూ లేవు. అప్పులు ఇచ్చేవారూ లేరు. అన్నం పెట్టే రైతును ఏడిపించడం ప్రభుత్వానికి తగదు. – నాగేశ్వరరావు, కౌలు రైతు, గొల్లప్రోలు మండలం నట్టేట ముంచారు రైతులను నమ్మించి ప్రభుత్వం నట్టేట ముంచింది. రైతు సంక్షేమమే ధ్యేయమని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలి. 24 గంటల్లో డబ్బులు వేస్తామంటూ తెగ గొప్పలు చెప్పిన నేతలు, అధికారులు ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆరుగాలం కష్టపడి ఎండనక వాననక ఒళ్లు గుల్ల చేసుకుని అప్పు చేసి మరీ పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు డబ్బులు ఇవ్వకపోతే రైతు ఎలా మళ్లీ పంట పండిస్తాడు? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతూంటే ఇంకా వాయిదాలు వేయడమేమిటి? ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్లే ఇలా జరుగుతోంది. రైతులకు వెంటనే ధాన్యం సొమ్ము చెల్లించాలి. లేకపోతే రైతుల తరఫున వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుంది. రైతులకు ఏమాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. – వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
సుదర్శన హోమానికి సంప్రదాయ దుస్తులు తప్పనిసరి
● పురుషులు పంచె, కండువా.. ● మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్ చున్నీతో.. సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో నిత్యం నిర్వహిస్తున్న నారసింహ సుదర్శన హోమంలో పాల్గొనే భక్తులు ఇకపై సంప్రదాయ దుస్తులను తప్పనిసరిగా ధరించాలని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సోమవారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేవస్థానం కార్యాలయంలో ఒక ప్రకటన విడుదల చేశారు. పురుషులు పంచె, కండువా, మహిళలు చీర, జాకెట్టు లేదా పంజాబీ డ్రెస్, చున్నీతో పాల్గొనాలన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం దైవ దర్శనం సమయంలో సంప్రదాయ దుస్తులు ధరించడంలో పరమార్థం గురించి ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు వివరించారు. దేవాలయానికి వెళ్లిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటకు వచ్చే వరకూ మన దృష్టి దేవుని మీదనే ఉండాలి. అందుకే మన పెద్దలు భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా ఉండాలనే ఆచారాన్ని పెట్టారని వివరించారు. -
మహిళా ప్రజా ప్రతినిధులకు శిక్షణ ప్రారంభం
కాకినాడ సిటీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల మహిళా ప్రజా ప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణాభివృది పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఏపీఎస్ఐఆర్డిపీఆర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రజాపరిషత్ కాకినాడలో ఏర్పాటు చేసి శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ లింగ సమానత్వమే లక్ష్యంగా అనేక విధానాలు అమలులో ఉన్నప్పటికీ, మహిళలు రాజకీయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో తక్కువ ప్రాతినిధ్యం పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం పేరిట ఈ శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. నిధులు, విధులు, భావ వ్యక్తీకీకరణ నైపుణ్యం, ప్రజాస్వామ్య విధుల సులభతరం వంటి అంశాలపై ఈ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. -
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ ప్రసాద్ ● తూర్పు గోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు శిక్షణ ప్రారంభం సామర్లకోట: మహిళా ప్రజా ప్రతినిధులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎస్వీ ప్రసాదరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మహిళా సర్పంచ్లకు మూడు రోజుల శిక్షణను సోమవారం ఆయన ఈటీసీలో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళా సర్పంచ్లు స్వతంత్రంగా పని చేయాలని సూచించారు. రాజకీయంగా ఎదగడానికి సర్పంచ్ పదవి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలను దగ్గర ఉండి తెలుసుకొనే అవకాశం సర్పంచ్లకే ఉంటుందన్నారు. మహిళలు అన్ని రంగాలలోను పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారని, అయితే సర్పంచ్లు వెనుబడుతున్నారన్నారు. మహిళా సర్పంచ్లు స్వయం నిర్ణయాధికారంతో పాలన సాగించాలన్నారు. ఉత్తమ సేవలు అందిస్తే గ్రామంలోని ప్రతీ మహిళ ఆమెను ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి చెందడానికి వీలు కలుగుతుందన్నారు. కోర్సు డైరెక్టరు కె. సుశీల శిక్షణ కేంద్రం ఆవరణలో మహిళా సర్పంచ్లను గ్రూపులుగా ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చలు జరిపే ఏర్పాట్లు చేశారు. వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు ఎస్ఎస్ శర్మ, ఎం చక్రపాణిరావు, ఎ.రవిశంకర్ శిక్షణ నిర్వహించారు. -
సమాజానికి స్వచ్ఛమైన రాజకీయాలు అవసరం
పెద్దాపురం: సమాజానికి సూర్యారావు లాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకులు ఎంతో అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్, సీపీఎం నేత యాసలపు సూర్యారావు వర్ధంతి సభ ఆ పార్టీ మండల కార్యదర్శి డి.క్రాంతికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిపరులను పార్టీలోకి తీసుకుంటుందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య ఐక్యతను దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మూడుసార్లు రాష్ట్ర పర్యటన చేసినా ఆంధ్రాకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్నులను భారీగా పెంచిందన్నారు. తొలుత సూర్యారావు చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా కమిటీ సభ్యులు జి.బేబీరాణి, రాజశేఖర్, పలివెల వీరబాబు, నీలపాల సూరిబాబు, సిరపురపు శ్రీనివాస్, కేదారి నాగు, వీర్రాజు, కృష్ణ, గడిగట్ల సత్తిబాబు, స్నేహ, అప్పన్న, సిరిపురపు బంగార్రాజు, మంతెన సత్తిబాబు, మాగాపు నాగు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం, అమృత, నమ్రత తదితరులు పాల్గొన్నారు.నేటి నుంచి పెద్దాపురం మరిడమ్మ జాతర పెద్దాపురం: కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మంగళవారం నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కె.విజయలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, ఏటా 37 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి జూలై 31 వరకూ ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. మంగళవారం రాత్రి 8.08 గంటలకు జాతర ప్రారంభమవుతుందన్నారు. పీజీఆర్ఎస్కు 335 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు 335 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డి.పెద్దిరాజు, ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాలరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో భూమి వివరాల నమోదు, రీసర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్లు, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ సమస్యల వంటి అంశాలపై ప్రజలు అర్జీలు అందజేశారు. అర్జీదారులు పీజీఆర్ఎస్లోనే కాకుండా మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో కూడా అర్జీలు సమర్పించవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితి తెలుసుకోవడానికి టోల్ఫ్రీ నంబర్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చన్నారు. భీమేశ్వరాలయ అన్నదాన ట్రస్ట్కి రూ.5 లక్షల విరాళం రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కి విజయవాడకు చెందిన నాగులపల్లి శ్రీనివాస్, పల్లవి దంపతులు సోమవారం రూ.5 లక్షలు విరాళంగా అందజేశారు. వారి తరఫున విరాళం అందజేసిన ధారా జయరామకృష్ణ శాస్త్రికి ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
కోకో సాగు విస్తీర్ణం గుర్తింపునకు ఈ–క్రాప్
దేవరపల్లి: ఈ–క్రాప్ బుకింగ్ ద్వారా జిల్లాలో కోకో సాగు విస్తీర్ణాన్ని గుర్తిస్తామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. నల్లజర్ల మండలం చోడవరంలో సోమవారం కోకో తోటలను ఆమె పరిశీలించి, రైతులతో మాట్లాడారు. కోకో రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల వివరాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఈ–క్రాప్ బుకింగ్ సమయంలో ఏ రైతు ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలను తప్పకుండా నమోదు చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులుండవని ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. నల్లజర్ల మండలంలో 457 ఎకరాల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నట్లు కలెక్టర్కు అధికారులు వివరించారు. కోకో రైతుల నుంచి ప్రతి గింజా కొనుగోలు చేసేందుకు మద్దతు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. కోకో రైతుల నుంచి కంపెనీలు కిలో రూ.500 చొప్పున కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రైతు కొత్తపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ, కిలో కోకో గింజలకు రూ.500 ధర ప్రకటించడం రైతులకు, కంపెనీలకు ఆమోదయోగ్యంగా ఉందని అన్నారు. -
రత్నగిరి జనసంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2500 వ్రతాల నిర్వహణ ● ఘనంగా సత్యదేవుని రథసేవ అన్నవరం: రత్నగిరి ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేలాదిగా వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం కేటాయించవలసి వచ్చింది. స్వామివారి దర్శనానంతరం అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. వ్రతమండపాలు, ఆలయప్రాకారం మధ్యాహ్నం వరకు భక్తులతో నిండిపోయాయి. స్వామివారిని 50 వేల మంది దర్శించగా, 2,500 వ్రతాలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదా యం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తు లు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉల్లాసంగా గడిపారు. ఘనంగా సత్యదేవుని రథసేవ ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజల అనంతరం ప్రాకారసేవ ప్రారంభించి రథసేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు సూర్యనమస్కారాలు నిర్వహించారు. -
బాకాయి బాబుపై పోరు
● ఉద్యోగాలు లేదా భృతి కోసం నిరుద్యోగులు.. ● ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ● కూటమి ప్రభుత్వంపై దండెత్తుతున్న యువత ● వారి పక్షాన కలెక్టరేట్ వద్ద నేడు వైఎస్సార్ సీపీ ఆందోళన సాక్షి ప్రతినిఽధి, కాకినాడ: ఓడ ఎక్కే దాకా ఓడ మల్లన్న.. ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న అన్న సామెత చందంగా ఉంటుంది చంద్రబాబు తీరు. సార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించేసి గద్దె నెక్కాక వాటిని గాలికి వదిలేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పలువురు అంటుంటారు. ఇందుకు నిదర్శనమే గత ఏడాది ఎన్నికల్లో యువత, విద్యార్థులకు ఆయన ఇచ్చిన హామీలు. వారికి ఎన్నో ఆశలు కల్పించి ఓట్లు కొల్లగొట్టారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా వారి హామీల గురించిన ఆలోచనే ఆయనకు లేకపోవడం బాధాకరం. రారష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఒక వేళ ఉద్యోగాలు ఇవ్వకుంటే నెలకు రూ.3000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంతకు ముందు 2014 ఎన్నికలలో కూడా ఇలానే నిరుద్యోగభృతి రూ.2000 ఇస్తామని చంద్రబాబు నమ్మించి మోసంచేశారు. అయినా ఈ సారైనా ఇవ్వకపోతారా అనే నమ్మకంతో ఓటేసిన పాపానికి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కానీ, ఒక్క నెల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా దగా చేశారని నిరుద్యోగ యువత ఆగ్రహంతో రోడ్డెక్కుతోంది. ఇచ్చిన హామీ అమలుచేస్తారేమో అని ఏడాది పాటు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూసినా మొండి చేయే చూపడంతో వారంతా సంఘటితమవుతున్నారు. నిరుద్యోగ యువతతో పాటు ఫీజు రీయింబర్స్మెంట్ అందని విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపును అందుకుని జిల్లాలోని పార్టీ విభాగాల ప్రతినిధుల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీల నుంచి తిప్పి పంపేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగులకు మద్దతుగా కాకినాడ కలెక్టరేట్ వద్ద తలపెట్టిన ఆందోళనకు పెద్ద ఎత్తున యువత తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కాకినాడ జిల్లాలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కలిసి అక్షరాలా రూ.1800 కోట్లు బకాయిపడ్డారని లెక్కలు కడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఫలితంగా జిల్లాలో సుమారు ఐదు లక్షల పైచిలుకు నిరుద్యోగులకు ఒక్కటంటే ఒక్క నెల నిరుద్యోగ భృతి కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోవడంపై వైఎస్సార్ సీపీ నిలదీయనుంది. వీరికి నెలకు రూ.150 కోట్లు వంతున నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగాలు ఇచ్చే వరకు ఇస్తామన్న భృతిని లెక్కేస్తే జిల్లాలో ఒక్కో నిరుద్యోగికి రూ.3000 చొప్పున ఇవ్వాలి. కానీ ఎవరికీ పైసా కూడా విదల్చలేదు సరికదా.. ఆ ప్రస్తావన, ప్రతిపాదనలు సైతం చేయడం లేదు. మాటల గారడీతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు హామీలు అమలుచేయాలనే డిమాండ్తో కలెక్టరేట్ల వద్ద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయనున్నారు. నిరుద్యోగులకు చేదోడుగా వైఎస్సార్ సీపీ నాడు జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర సందర్భంగా నిరుద్యోగులు ఆయనకు ఎదురువెళ్లి ఆదుకోవాలని వేడుకున్నారు. డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు చేసినా కనీసం చిరుద్యోగం కూడా లేదంటూ వారు కంటతడిపెట్టుకోవడంతో చలించిన జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. వర్గాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల నియామకాలు చేపట్టారు. అలా ప్రతి పల్లె, పట్టణంలో వందలాది మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 620 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5324 మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగులుగా నియమించిన విషయాన్ని ఈ సందర్భంగా యువత చర్చించుకుంటోంది. జాబ్ క్యాలెండర్ లేక, నిరుద్యోగ భృతి అందక ఉన్నత చదువులు అభ్యసించిన యువత ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు వలసబాట పడుతున్నారు. బీటెక్, ఎంటెక్, పీజీలు చదివినా యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు లేక హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, తదితర రాష్ట్రాలకు పొట్టచేత పట్టుకుని వెళ్లిపోతున్నారు. వందలాది మంది స్థానికంగానే ఉన్నా సరైన ఉద్యోగం లేక చిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగ అర్హత వయసు దాటిపోతోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కూటమి సర్కార్కు ఉలుకుపలుకు లేదు. పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందనే ఆశతో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో చేరితే ఏడాదిగా ఆ నిధులు విడుదలచేయకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. దాని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. జిల్లాలో 19వేల పై చిలుకు విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి సర్కార్ ఫీజు రీ ఎంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు తిప్పి పంపేస్తున్న పరిస్థితుల్లో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితులన్నింటిపైనా ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు వైఎస్సార్ సీసీ యువజన, విద్యార్థి విభాగాలు తమ వంతు బాధ్యతగా యువత, విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా సోమమవారం ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చే యువత, విద్యార్థులు తొలుత వైఎస్సార్ సీపీ కాకినాడ సిటీ పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని నిర్ణయించారు. అక్కడి నుంచి డీఎంహెచ్ఓ కార్యాలయం, జిల్లా పరిషత్ సెంటర్, ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందచేయనున్నారు. బీసీ యువత తరలిరావాలి దగాపై పోరుకు బీసీ యువత తరలిరావాలి. కూటమి పార్టీలు సూపర్ సిక్స్తో పాటు 143 హామీలు ఇచ్చి మోసంచేశాయి. డైవర్షన్ రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ నిద్ర నటిస్తున్న ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తరలిరావాలి. బీసీ సెల్ అధ్యక్షులు, అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో నియమితులైన నాయకులు తరలిరావాలి. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం తగదు. దీని వల్ల కాలేజీల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం సమంజసం కాదు. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు, కాకినాడ జిల్లా అవిచ్చేస్తాం.. ఇవిచ్చేస్తాం.. అన్నీ ఇచ్చేస్తాం అంటూ బాకా ఊదేసి నమ్మించి ఆనక నట్టేట ముంచడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. ఇచ్చిన హామీల్లాగే యువతకు ఉద్యోగాలు, విద్యార్థులకు రీయింబర్స్మెంట్లు బకాయి పెట్టి మళ్లీ అదే బాకాతో ఊరేగుతూ ఓట్లు దండుకోవడం ఆయనకే చెల్లింది. పదే పదే అదే సాగుతుందనుకోవడం కుదరనే కుదరదు. పోరాడి మరీ ఇచ్చిన హామీలను ఆయన నుంచే గుంజుకుంటామని నిరుద్యోగ యువత, విద్యార్థులు కూటమి పాలనపై దండెత్తుతున్నారు. పోరుబాట పడుతున్నారు. కాకినాడ కళాశాలల వివరాలు ఇవీ.. డిగ్రీ ప్రభుత్వ 08, ప్రైవేట్ 31 ఇంజినీరింగ్లో ప్రభుత్వ 01,ప్రైవేట్ 08 ఐటీఐ ప్రభుత్వ 02, ప్రైవేట్ 09 నర్సింగ్ కళాశాలలు 06 పాలిటెక్నిక్ 03, ప్రైవేట్ 04 మెడికల్ ప్రభుత్వ 01 బీఈడీ 06 ఏంబీఏ, ఎంసీఏ 07 మొత్తం కళాశాలలు 86 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. విద్యార్థుల సంఖ్య 19,650 బకాయిపడ్డ నగదు రూ.38.59కోట్లు జిల్లా జనాభా 22,47,680 జిల్లాలో కుటుంబాలు 5,33,908 గ్రామీణప్రాంతాల్లో 16,36,389 పట్టణ ప్రాంతాల్లో 6,11,471 ఇంటికొక నిరుద్యోగి లెక్కన: నిరుద్యోగులు: 5,00,000 (సుమారు) ఒక్కొక్కరికి రూ.3000 వంతున నెలకు: రూ.150 కోట్లు 12 నెలలకు బకాయి: రూ.1800 కోట్లు -
విజయవంతానికి పిలుపు
చంద్రబాబు మాయ మాటలతో మోసానికి గురైన విద్యార్థులకు, యువతకు బాసటగా నిలిచేందుకు అంతా కలిసికట్టుగా రావాలి. ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు విడుదలచేసే వరకు ప్రభుత్వంపై పోరాటాలు చేయాలి. ఇందుకు యువత, విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి. సోమవారం కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న యువత పోరును విజయవంతం చేయాలి. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థి, యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోరుకు పార్టీలో యువత, విద్యార్థి విభాగాల నేతలు తరలిరావాలి. పిఠాపురం నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. – వంగా గీత. మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్, పిఠాపురం బకాయిలు విడుదల చేసే వరకు పోరు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించే వరకు యువత, విద్యార్థులు కలిసికట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పిలుపుతో వారి పక్షాన యువజన విభాగం ఎంతవరకై నా పోరాడుతుంది. జిల్లాలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితులపై ప్రభుత్వం స్పందించాలి. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగమైనా ఇవ్వాలి, లేదా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 12 నెలల కాలానికి నిరుద్యోగభృతి రూ.3000లు వంతున రూ.36 వేల బకాయిలతో సహా విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి. – రాగిరెడ్డి అరుణ్కుమార్(బన్నీ) అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ యువజన విభాగం, కాకినాడ జిల్లా -
నేటి నుంచి మహిళా సర్పంచ్లకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా సర్పంచ్లకు సోమవారం నుంచి 25వ తేదీ వరకు శిక్షణ నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల మహిళా ప్రజాప్రతినిధులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణ సంస్థ ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలో సామర్లకోట, బాపట్ల, శ్రీకాళహస్తి విస్తరణ శిక్షణ కేంద్రాలతో పాటు ఆయా కేంద్రాల పరిధిలోని జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల ద్వారా సర్పంచ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. స్థానిక సంస్థల పాలకులుగా నిర్వహణ, నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, విధులు, బాధ్యతలు వంటి అంశాలపై మూడు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని 71 మంది మహిళా సర్పంచ్లకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. అలాగే ఈనెల 26వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 42 మంది మహిళా ఎంపీపీలకు ఈటీసీలో శిక్షణ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. శ్రేష్ట పరీక్షలో చైతన్యకృష్ణకు 9వ ర్యాంకు పిఠాపురం: కేంద్ర సామాజిక న్యాయ సాధికారిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నిర్వహించే శ్రేష్ఠ (స్కీం ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్) పరీక్షలో మండలంలోని నర్సింగపురానికి చెందిన బందిలి చైతన్యకృష్ణ కుమార్ 9వ ర్యాంకు సాధించాడు. శనివారం ఈ ఫలితాలు వెలువడినట్టు బాలుడి తండ్రి ఆదివారం తెలిపారు. దేశ వ్యాప్తంగా అత్యుత్తమ ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ తరగతి ప్రవేశాలకు ఎస్సీ బాల, బాలికలకు నిర్వహించిన పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని పలువురు అభినందించారు. తలుపులమ్మ తల్లి ఆదాయం రూ.7.75 లక్షలు తుని రూరల్: తలుపులమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి 35వేల మంది భక్తులు వివిధ వాహనాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,63,550, పూజా టికెట్లకు రూ.2,77,160, తలనీలాలకు రూ.27,360, వాహన పూజలకు రూ.5,040, వసతి గదులు, కాటేజీలు, పొంగలి షెడ్ల అద్దెలు రూ.85,696, విరాళాలు రూ.1,17,012, మొత్తం రూ.7,75,818 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. కాగా దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో సోమవారం ఉదయం 8 గంటలకు హుండీలను లెక్కించనున్నట్టు ఈఓ తెలిపారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: కాకినాడ కలెక్టరేట్లో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే ప్రజా ఫిర్యా దుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు ఉదయం 9.30 గంటలకు విధిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఉపాధ్యాయుల సర్దుపాట్లు
ఫ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ధర్నా ఫ దూర ప్రాంతాలకు వెళ్లేది లేదని నిరసన రాయవరం: ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల అనంతరం పలు పాఠశాలల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలను మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్ల (ఎంటీఎస్)తో సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆదివారం కాకినాడలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించింది. అయితే తమకు బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ ఎంటీఎస్ ఉపాధ్యాయులు ధర్నా చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 410 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో 2008 డీఎస్సీ బ్యాచ్ 199 మంది, 1998 డీఎస్సీ బ్యాచ్ 211 మంది ఉన్నారు. వీరంతా మినిమమ్ టైమ్ స్కేల్ విధానంలో జిల్లాలోని వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. కాకినాడలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆదివారం జరిగిన బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియను 1998, 2008 ఎంటీఎస్ ఉపాధ్యాయులు వ్యతిరేకించారు. అక్కడ ధర్నాకు దిగారు. ఇటీవల జరిగిన రెగ్యులర్ ఉపాధ్యాయుల బదిలీల అనంతరం సుదూర ప్రాంతాల్లోనే ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో ఎంటీఎస్ ఉపాధ్యాయులంతా ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాంతాలకు దూరంగా 100 నుంచి 200 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని వారు వ్యతిరేకిస్తున్నారు. అసలే అరకొర జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న తాము దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు ఎలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో 70 శాతం మంది ఉపాధ్యాయులు రెండు మూడేళ్లలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. వారి డిమాండ్లు ఇవీ.. కేవలం రూ.32 వేలతో పనిచేస్తున్న ఎంటీఎస్ ఉపాధ్యాయులను ప్రస్తుతం పనిచేస్తున్న మండలాల్లోనే సర్దుబాటు చేయాలి. ప్రతి మండలంలో ఉన్న మోడల్ స్కూల్స్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలి. ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న ఖాళీలు నివాసాలకు 200 కి.మీ దూరంలో ఉన్నందున ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రయాణ ఖర్చులకే సరిపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రస్తుత ఖాళీల్లో సర్దుబాటు చేయాల్సి వస్తే హెచ్ఆర్ఏ, డీఏ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలి. జిల్లా వ్యాప్తంగా ప్రతి క్లస్టర్లో క్లస్టర్ వేకెన్సీలు క్రియేట్ చేసి, ఎంటీఎస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలి. దివ్యాంగులుగా ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులకు వారు కోరుకున్న మండలంలో పని చేసేందుకు అవకాశం కల్పించాలి. మున్సిపల్ పాఠశాలల్లో వేకెన్సీలను కూడా చూపించాలి. 15 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలలో ఒక ఎంటీఎస్ ఉపాధ్యాయుడిని నియమించాలి. గతంలో విశాఖపట్నంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం నియర్ బై రెసిడెన్స్ అవకాశం కల్పించాలి. ● ఎంటీఎస్ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ఉదయం 9 నుంచి జరగాల్సి ఉండగా, వీరి ఆందోళన, చర్చల నేపథ్యంలో రాత్రి 8.30 గంటలకు మొదలైంది. ఉన్నతాధికారులు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్కు హాజరయ్యారు. -
రోడ్డెక్కిన టీచర్లు.. చంద్రబాబు సర్కార్ తీరుపై నిరసన
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ తీరుకి నిరసనగా టీచర్లు వరుస ఆందోళనలు చేస్తున్నారు. మొన్న ఎస్జీటీలు.. నేడు ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. విశాఖలో మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులు రోడ్కెక్కారు. నేడు జరగాల్సిన కౌన్సిలింగ్ను టీచర్లు బహిష్కరించారు. డీఈవో కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఏజెన్సీ వేకెన్సీలు మాత్రమే చూపడంపై టీచర్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారుకాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ఎంటీఎస్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేయొద్దని డిమాండ్ చేస్తూ చేశారు. సింగిల్ టీచర్ పోస్టులను నిరాకరిస్తున్న ఉపాధ్యాయులు.. మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో ఒక ఎంటీఎస్ టీచర్ను నియమించాలని డిమాండ్ చేసూ.. డీఈవో కార్యాలయం వద్ద బైఠాయించారు. -
ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ లీజులు రద్దు చేయాలి
తుని: ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్కు ఇచ్చిన లీజులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ అధ్యక్షుడు జక్కంపూడి రాజు డిమాండ్ చేశారు. శనివారం తునిలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. శ్రీకాకుళం, మన్యం పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఆదివాసీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మైదాన ప్రాంతాల్లోని ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీలో కలపాలని, శంఖవరం మండలం పెదమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 యాక్ట్కు ఎటువంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మైనింగ్ మాఫియాను అరికట్టి, ఆదివాసీలపై జరుగుతున్న కగారు ఆపరేషన్ తక్షణం నిలుపుదల చేసి, అక్రమ కేసుల్లో ఇరికించిన ఆదివాసీలను విడుదల చేయాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులు, ఆదివాసీలను అడవుల నుంచి ఖాళీ చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను వలస భూస్వాములు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని, వీరి నుంచి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. వచ్చే నెల 13, 14 తేదీల్లో అన్నవరంలో రాష్ట్ర స్థాయి వర్క్షాపు నిర్వహించేందుకు నిర్ణయించారు. అనకాపల్లి జిల్లా కన్వీనర్ మోసూరి రాజు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సన్యాసిరావు, మన్యం జిల్లా నుంచి కర్ర ఏసు, కాకినాడ జిల్లా నుంచి రేచుకట్ల సింహాచలం, ముసలయ్య, బాలరాజు, పందిరి ప్రసాద్ పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగార్రాజు, రాష్ట్ర కమిటీ సభ్యుడు కె.జనార్దన్లు ఆదివాసీ సంఘం చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. -
కస్సుబస్సులు
బోసిపోయిన బస్టాండ్లు ఉమ్మడి జిల్లాలోని 11 ఆర్టీసీ డిపోల నుంచి 502 బస్సులను విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి తరలించుకుపోయారు. ఇంతకు రెట్టింపు సంఖ్యలో ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను రవాణాశాఖాధికారుల ద్వారా నయానా భయానా దారికి తెచ్చుకుని వినియోగించారు. విద్యా సంస్థల బస్సుల మాటెలా ఉన్నా ఆర్టీసీ బస్సులు తగినన్ని లేకపోవడంతో ఆయా బస్టాండ్లలో ప్రయాణికులు శుక్ర, శనివారాల్లో తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక ఆర్టీసీ బస్టాండ్లు బోసిపోయాయి. దూర ప్రాంతాలతో పాటు పల్లెవెలుగు బస్సులు కూడా తగినన్ని లేకపోవడంతో ప్రయాణికులు నరకం కళ్లజూశారు. బస్సుల కోసం గంటల తరబడి బస్టాండ్లలో పడిగాపులు పడ్డారు. పల్లెలకు వెళ్లే సర్వీసులను దాదాపు రద్దు చేశారు. నడినెత్తిన సూరీడు చుర్రుమంటున్నా.. రోడ్డు పైనే బస్టాప్ల వద్ద గంటల తరబడి చెమటలు కక్కుతూ పడిగాపులు పడ్డారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో పలువురు ప్రయాణికులు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. ఇదే అదనుగా కొన్ని ప్రాంతాల్లో ఆటోలకు డబుల్ చార్జీలు కూడా డిమాండ్ చేశారు. పలుచోట్ల ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణించారు. ● ప్రయాణికులకు ‘యోగాంధ్ర’ కష్టాలు ● ఉమ్మడి ‘తూర్పు’ నుంచి 502 బస్సులు ‘చలో వైజాగ్’ ● ప్రయాణాలకు నరకం చూసిన జనం ● ఆర్టీసీ బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆర్టీసీ బస్సు రూటు మారింది.. యోగాంధ్ర రికార్డు కోసం విశాఖపట్నం దారి పట్టింది.. ఫలితంగా ఇబ్బందులు పడటం ప్రయాణికుల వంతయ్యింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న విషయం తెలిసిందే. దీనిని గొప్పగా నిర్వహించామని చెప్పుకొనేందుకు, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు ప్రహసనం నడిపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వారం రోజులుగా అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులనూ యోగాంధ్ర కార్యక్రమం పైనే మోహరించారు. దీనికి ముగింపుగా విశాఖలో ప్రధాని పాల్గొనే యోగా దినోత్సవానికి భారీగా జనాల్ని తరలించేందుకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి వందలాదిగా ఆర్టీసీ బస్సులతో పాటు వివిధ ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలల బస్సులను వినియోగించారు. దీనికోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించింది. జిల్లాల వారీగా.. ● కాకినాడ జిల్లా నుంచి ఆర్టీసీ 155 బస్సులను విశాఖకు తరలించారు. ఈ నేపథ్యంలో కాకినాడ – రాజమహేంద్రవరం, కాకినాడ – అమలాపురం నాన్స్టాప్ సర్వీసులను కుదించేశారు. నాన్స్టాప్ బస్సుల కోసం గంట, రెండు గంటల పాటు వేచి చూడాల్సిన దుస్థితి ఎదురవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ – రాజమహేంద్రవరం, కాకినాడ – విజయవాడ సర్వీసులలో కోత పెట్టారు. కాకినాడ నుంచి మెట్ట ప్రాంతమైన జగ్గంపేట, గోకవరం, ఏలేశ్వరం, తుని తదితర ప్రాంతాలకు వెళ్లే ఆర్డినరీ సర్వీసులలో రెండింతలు కోత పెట్టడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలోని 4 డిపోల నుంచి 185 బస్సులను విశాఖకు తరలించుకుపోయారు. రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు మండిపడ్డారు. రాజమహేంద్రవరం మెయిన్ బస్టాండుతో పాటు రైల్వేస్టేషన్, గోకవరం బస్టాండ్, కోటిపల్లి బస్టాండ్ల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. ● కోనసీమ జిల్లాలోని 4 డిపోల నుంచి మొత్తం 162 బస్సులను విశాఖ యోగాంధ్ర కార్యక్రమానికి తరలించారు. జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడకు ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచేది. అటువంటిది విశాఖకు బస్సులు తరలించేయడంతో రెండు గంటలకొకటి చొప్పున మాత్రమే బస్సులు నడపడంతో ప్రయాణికులు నానా కష్టాలూ పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు, నైట్ సర్వీసులు సైతం దాదాపు మూడు వంతులు రద్దు చేశారు. అమలాపురం – కాకినాడ నాన్స్టాప్ సర్వీసులను కూడా తగ్గించేశారు. ఈ రూటులో ప్రతి అరగంటకు ఒక నాన్స్టాప్ తిరిగేది. చలో విశాఖ ప్రభావంతో రెండు గంటలైనా నాన్స్టాప్ సర్వీసు లేక ప్రయాణికులు నరకం చవి చూశారు. విజయవాడ, విశాఖపట్నంతో పాటు పల్లె వెలుగు సర్వీసులను కొన్ని రూట్లలో రద్దు చేశారు. అమలాపురం, రావులపాలెం, రామచంద్రపురం, రాజోలు డిపోల నుంచి స్వల్ప సంఖ్యలోనే బస్సులు నడపడం ప్రయాణికులకు శాపంగా మారింది. కోనసీమ జిల్లాలో సమారు 300 ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల బస్సులను యోగాంధ్రకు వినియోగించడంతో ఆయా విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు సెలవు ప్రకటించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి డిపోల వారీగా విశాఖకు తరలించిన ఆర్టీసీ బస్సులు డిపో మొత్తం విశాఖకు మిగిలినవి బస్సులు తరలించినవి కాకినాడ 166 66 100 తుని 72 44 28 ఏలేశ్వరం 49 45 4 అమలాపురం 143 60 83 రావులపాలెం 71 41 30 రామచంద్రపురం 52 40 12 రాజోలు 53 21 32 రాజమహేంద్రవరం 148 77 71 గోకవరం 63 44 19 కొవ్వూరు 52 39 13 నిడదవోలు 37 25 12 -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. ఏకాదశి పర్వదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 15 వేల మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. స్వామివారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. శృంగార వల్లభుడిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశఖండన, వివిధ సేవల టికెట్లు, అన్నదాన విరాళాలుగా స్వామి వారికి రూ.3,09,209 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. -
లారీ ఢీకొని సచివాలయ ఉద్యోగి మృతి
బిక్కవోలు: రోడ్డు ప్రమాదంలో సచివాలయ ఉద్యోగి మృతి చెందిన ఘటన పందలపాక శివారులో శనివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కాకినాడ భానుగుడి శ్రీరామ్నగర్ ప్రాంతానికి చెందిన గొల్ల మహంతి బాల వెంకటేష్ (29) పందలపాక సచివాలయం–2లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఇంటి నుంచి సచివాలయానికి వచ్చారు. అక్కడ గ్రామస్తులతో కలసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిక్కవోలులో ఇంజినీర్ కార్యాలయానికి బయలు దేరారు. తాను పనిచేస్తున్న సచివాలయం నుంచి కనీసం 400 మీటర్ల దూరంలో పందలపాక – ఊలపల్లి రోడ్డు వద్ద బిక్కవోలు వెళ్తున్న సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా కుడివైపు తిప్పి అతని బైక్ను కొట్టడంతో వెంకటేష్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. ఆ లారీ వెంటనే అతని తలపై నుంచి వెళ్లిపోయింది. వెంకటేష్ తలకు హెల్మెట్ ఉన్నా అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన స్థలానికి భారీఎత్తున గ్రామస్తులు, సచివాలయ ఉద్యోగులు చేరుకున్నారు. ప్రమాద తీరును ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ పరిశీలించారు. మృతిదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించారు. మృతుడి భార్య కావ్యసత్యశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పందలపాకలో విషాదం ఐదేళ్లుగా సచివాలయ ఉద్యోగిగా బాధ్యతలు చేపడుతూ, అందరితో సరదా ఉండే ఉద్యోగి ఇలా మృతి చెందడంతో స్థానికులు మదనపడుతున్నారు. తమ్ముడు అనే పిలిచే వ్యక్తి ఇలా అకాలంగా మరణించడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పుడూ బైక్ నడిపినా హెల్మెట్ వాడేవాడని, అందరినీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేవాడని, అలాంటి వ్యక్తి బైక్ ప్రమాదంలో మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు, గ్రామస్తులు, మిత్రులు తమ్ముడు ఇక రాడంటూ ఆవేదన చెందుతున్నారు. తల్లిదండ్రులకు ఇతనే ఒక్కగానొక్క కుమారుడు. రెండేళ్ల కిందట దగ్గర బంధువని కావ్యసత్యశ్రీతో వివాహం జరిపించారు. కుటుంబానికి ఆసరా ఉంటాడని అనుకున్న కొడుకు ఇక లేకపోవడంతో తల్లిదండ్రులు, జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పిన భర్త ఇకలేడని తెలిసి భార్య కావ్యసత్యశ్రీ బోరున విలపిస్తున్నారు. -
రేపు యువత పోరు
● విజయవంతానికి నేతల పిలుపు ● పోస్టర్ ఆవిష్కరణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): యువత, విద్యార్థులకు ఇచ్చిన మాట తప్పిన కూటమి సర్కార్కు బుద్ధి వచ్చేలా తలపెట్టిన యువత పోరు ఆందోళనను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి అరుణ్ కుమార్ (బన్నీ) పిలుపునిచ్చారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాలు సమన్వయం చేసుకుంటూ సోమవారం తలపెట్టిన యువత పోరును విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం కళ్లు తెరిపించాలన్నారు. వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ యువత పోరు పోస్టర్ను అరుణ్కుమార్ ఆధ్వర్యాన పార్టీ యువ నేతలు శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతిని విస్మరించిందన్నారు. నిరుద్యోగులకు తక్షణమే భృతి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీరాంజీ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి హామీ కొండెక్కించారని సంయుక్త కార్యదర్శి ఎంజీకే కిషోర్ ఆక్షేపించారు. యువగళం పేరుతో మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఏటా జనవరి 1న నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న హామీ ఏమైందని సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్యనారాయణ, ఉలవల భూషణం ప్రశ్నించారు. కార్యక్రమంలో దాసం వెంకటేష్, కరణం భాను, వీరంరెడ్డి నాని, సకురు గుర్రాజు, తిరుమల శెట్టి లక్ష్మీకాంత్, సీడీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీతారాములకు వెండి మకర తోరణం అలంకరణ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు నిర్వహించే నిత్య కల్యాణంలో పెళ్లిపెద్దలుగా వ్యవహరించే క్షేత్ర పాలకులు సీతారాములకు శనివారం వెండి మకర తోరణం అలంకరించారు. దీంతో, స్వామి, అమ్మవార్లు ప్రత్యేక శోభతో ప్రకాశించారు. గతంలో నిత్య కల్యాణం సందర్భంగా సత్యదేవుడు, అమ్మవార్లను వెండి సింహాసనంపై వేంచేయించి, వారి పాదాల దగ్గరలో సీతారాములను ఉంచేవారు. దీంతో, సత్యదేవుడు, అమ్మవారిపై వేసిన అక్షింతలు, తలంబ్రాలు సీతారాములపై కూడా పడేవి. భక్తులు దీనిని అపచారంగా భావించేవారు. దీనిపై ‘సత్యదేవుని నిత్య కల్యాణంలో అపచారం’ శీర్షికన గత ఏడాది జూన్ 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అప్పటి ఈఓ, ప్రస్తుత కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్యదేవుడు, అమ్మవారి సింహాసనం పక్కనే సీతారాములను మరో ఆసనంపై ఉంచి, నిత్య కల్యాణం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అలాగే చేస్తున్నారు. అయితే, సత్యదేవుడు, అమ్మవార్ల మాదిరిగా సీతారాముల ఉత్సవ మూర్తుల వెనుక మకర తోరణం లేకపోవడంతో బోసిపోయినట్టుండేది. ఈ నేపథ్యంలో వ్రత పురోహిత సూపర్వైజర్లు అల్లంరాజు సత్య శ్రీనివాస్, గుత్తిన రామకృష్ణ, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు రవిశర్మ, వారి డ్యూటీ సభ్యులు 43 మంది కలసి రూ.3 లక్షలతో 345 గ్రాముల వెండితో మకర తోరణం తయారు చేయించి సీతారాములకు ఈ నెల 12న సమర్పించారు. దీనిని ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం సీతారాములకు అలంకరించారు. ఇక నుంచి ప్రతి రోజూ సీతారాములకు ఇదేవిధంగా మకర తోరణం అలంకరించి సత్యదేవుని నిత్య కల్యాణం నిర్వహిస్తామని అధికారులు చెప్పారు. 145 మంది వైద్యుల నమోదుకాకినాడ క్రైం: రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) డిజిటల్ లైబ్రరీలో జిల్లా స్థాయి వైద్యుల నమోదు ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యాన కళాశాల నిర్వహణలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరిగింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 145 మంది వైద్యులు హాజరై లైసెన్స్ రెన్యువల్స్, రీ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఐఎంఏ కాకినాడ కార్యదర్శి డాక్టర్ చిట్ల కిరణ్ తెలిపారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోనే జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు డాక్టర్ మోకా పవన్కుమార్, రామ్కోసా అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఎంవీ ఆనంద్, డాక్టర్ ఆదిత్య సత్యప్రసన్న మాట్లాడుతూ, విజయవాడలోని ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి 15 మంది నిష్ణాతులైన సిబ్బంది వచ్చి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, ఉమ్మడి విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఇదే తరహా రిజిస్ట్రేషన్లు నిర్వహించారన్నారు. తగిన నమోదు లేకుండా ప్రాక్టీస్ చేయడం నేరమని, లైసెన్సు పునరుద్ధరణ తప్పనిసరని పేర్కొన్నారు. ఆదివారం నిర్వహించే నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రక్రియను ఐఎంఏ పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జీఎస్ మూర్తి, డాక్టర్ సంపత్కుమార్, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పరిశీలించారు. అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులుపెరవలి: ఏకాదశి పర్వదినం కావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వందలాదిగా భక్తుల రాక ప్రారంభమైంది. ఆలయ ప్రాంగణం చుట్టూ భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి మరీ స్వామిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నా రు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమ ర్పించారు. అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను అర్చకులు విశేషంగా అలంకరించి, భక్తులను దర్శనానికి అనుమతించారు. -
ఉప్మా... ఇదేంటి చెప్మా!
పిఠాపురం: ఈ వంటకం చూస్తే.. ఇదేదో కొత్త పాయసం అనుకుంటే పొరబడినట్టే. ఇది సర్కారు బడిలో వడ్డించిన ఉప్మా. అయ్య బాబోయ్.. ఇదేంటి అనుకుంటున్నారా! నిజమేనండోయ్... పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు అల్పాహారంగా ఈ నీళ్ల ఉప్మా శనివారం వడ్డించారు. యోగా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఉప్మా నీళ్ల మాదిరిగా ఉండడంతో పాటు ఉండలు కట్టి ఎక్కడి నూక కనిపించడంతో విద్యార్థులు పాడేశారు. మధ్యాహ్న భోజనం సైతం నాసిరకంగా ఉండడంతో విద్యార్థులు ఆకలితో ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. -
చల్లని తల్లి... మా కల్పవల్లి
పెద్దాపురం: చల్లని తల్లి... మా కల్పవల్లి... మమ్మేలు మాతా అంటూ ఆ మరిడమ్మ వారిని భక్తజనం కొలుస్తుంది. ఆధ్యాత్మికతతో అలరారుతున్న, కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పుగా పేరొందిన, ఉమ్మడి రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ నెల 24 నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఏటా 37 రోజుల పాటు నిర్వహించే జాతర మహోత్సవాల్లో భాగంగా 24న జాతర ప్రారంభమై, జూలై 31వ తేదీ వరకు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏటా లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శింకుంటున్నారు. నిత్యం విశేష పూజలందుకుంటూ విరాజిల్లుతున్న పెద్దాపురం మరిడమ్మ ఉత్సవాలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. చింతపల్లివారి ఆడపడుచుగా... ఆంధ్ర, ఽతెలంగాణ రాష్ట్రాల్లో దేవతాలయాల్లో పెద్దాపురం శ్రీమరిడమ్మ అమ్మవారి దేవస్థానం ప్రసిద్ధమైంది. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని సందర్శిస్తే కోరిన కోర్కెలు తీరతాయని భక్తుల నమ్మకం. మరిడమ్మ వారు సామర్లకోట చింతపల్లివారి ఆడపడుచుగా ప్రాచుర్యం పొందారు. ఇప్పటికీ ఆ వారుసులే ఇక్కడ ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. వారి కుల దేవతగా పెద్దాపురం పట్టణంలో వెలసి యావత్ ఆంధ్రావని సంరక్షిస్తున్న వరదేవతగా ప్రఖ్యాతి గాంచారు. ఏటా ఆషాఢ మాసంలో 37 రోజుల పాటు జాతరను జరపడం ఆనవాయితీగా వస్తోంది. గరగ ఊరేగింపు ఆనవాయితీ ఆషాఢ మాసంలో అమ్మవారి జాతరకు ఉన్న ప్రత్యేకతతో పాటు గరగకు విశిష్ట పూజలు నిర్వహిస్తుంటారు. జాతర ఆరంభానికి ముందు నుంచీ తొలి గరగను ఊరేగించడం ఆనవాయితీ. పురవీధుల్లో గరగ తిరుగుతూ డప్పు వాయిద్యాలతో ఊరేగిస్తుంటే భక్తులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అమ్మవారికి పాన్పు, చీరలు వేయడం, కోరిన కోర్కెలు తీర్చడంతో ముడుపులు, మొక్కులు తీర్చుకునేందుకు వేల సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. వారానికో వీధి సంబరం గ్రామ దేవతగా ఆరాధించే పెద్దాపురంలో ఆయా వీధుల వారు అమ్మవారి సంబరాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. రూ.లక్షలు వెచ్చించి అమ్మవారి సంబరం నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది వీధి సంబరాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఆయా ఉత్సవ కమిటీలు సిద్ధమవుతున్నాయి. ఇది పట్టణంలో ప్రత్యేకతను చాటనుంది. 24న రాత్రి నుంచి జాతర ఏటా ఆషాఢ మాసం ఆరంభంలో నిర్వహించే మరిడమ్మ వారి జాగరణ మహోత్సవంలో భాగంగా ఈ నెల 24న రాత్రి అంగరంగ వైభవంగా జాతర ప్రారంభం కానుంది. దేవదాయ శాఖ ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే హాజరవుతారు. జాతరకు సంబంధించి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆసాదుల, వేదపండితులతో అమ్మవారి జాతర ఉత్సవం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో సెట్టింగ్లు వేశారు. పెద్దాపురం మరిడమ్మ జాతరకు వేళాయె తెలుగు రాష్ట్రాల్లోనే వేడుకలకు ప్రసిద్ధి 24 నుంచి జాతర మహోత్సవాలుఅమ్మవారి కృపకు పాత్రులుకండి కోరిన కోర్కెలు తీర్చే మరిడమ్మ వారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రులు కావాలి. ఆషాఢ మాస ఉత్సవాల్లో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై జాతరను విజయవంతం చేయండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ ఏడాది ఉత్సవాలను మరింత వేడుకగా నిర్వహించనున్నాం. – విజయలక్ష్మి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, పెద్దాపురం -
పాపం పసివాళ్లు.. యోగా డేలో విద్యార్థుల ఆకలి కేకలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో యోగా డే సందర్భంగా విద్యార్థులు అవస్థలు పడ్డారు. సమయానికి తిండిలేక ఆకలితో అలమటించారు. అర్ధరాత్రి పస్తులతోనే గిరిజన విద్యార్థులు పడుకున్నారు భోజనాలు సరిపోక.. ఆకలి కేకలతో హాహాకారాలు చేశారు. గిరిజన విద్యార్థులను పట్టించుకోలేదని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మండిపడ్డారు. యోగా కోసం తీసుకెళ్లి కనీస సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.కాకినాడ జిల్లాలో కూడా యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు ఆకలి బాధలు పడ్డారు. పిఠాపురం, సామర్లకోట ప్రభుత్వ పాఠశాలల్లో యోగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు నాసిరకం ఆహరం, అల్పాహారం సరఫరా చేశారు. జావ మాదిరిగా ఉన్న ఉప్మాను తినలేక విద్యార్థులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం అన్నం, సాంబారు భోజనం సరఫరా చేశారు. కొందరు విద్యార్థులు భోజనం తినలేక ఆకలితో అలమటించారు.విద్యార్థులకు సరఫరా చేసిన ఆహారాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘం నేతలు, విద్యా కమిటీ సభ్యులు.. పాఠశాల ఉపాధ్యాయులపై మండిపడ్డారు. నాసికరం ఆహారం సరఫరా చేసిన బెండపూడికి చెందిన అల్లూరి సీతారామరాజు ట్రస్ట్పై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తోడల్లుడు కావడమే అర్హతా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మిత్రభేదంతో సతమతమవుతున్న జనసేనకు పిఠాపురంలో కొత్త కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రూపంలో జనసేన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పెద్ద సవాల్నే ఎదుర్కొంటోంది. ఆయన రాజకీయాన్ని తట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలూ పడుతున్నారు. ఈ తలనొప్పి ఇలా కొనసాగుతూండగానే పులి మీద పుట్రలా నియోజకవర్గంలో పార్టీపై ఆధిపత్యం కోసం ‘గ్లాస్’మేట్స్ కుమ్ములాడుకుంటున్నారు. వారిని దారికి తెచ్చుకోలేక ఆ పార్టీ సతమతమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎన్నికై , ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ ఈ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి పోతూంటారు. తమ్ముడి తోడ్పాటుతో శాసన మండలి సభ్యుడైన ఆయన అన్న, సినీ నటుడు నాగబాబు కూడా అదే మార్గం అనుసరిస్తున్నారు.ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో ఒక కొత్త సమస్య రాజేసి పోతూంటారనేది బహిరంగ రహస్యమే. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పరోక్షంగా లేనిపోని విమర్శలు చేస్తూ నాగబాబు కొత్త తలపోట్లు తెచ్చి పెడుతూంటారు. పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచీ ఈ నియోజకవర్గంలో జనసేన బాధ్యతలను నాగబాబుకు వరుసకు తోడల్లుడైన మర్రెడ్డి శ్రీనివాస్కు అప్పగించారు. కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ద్వారపూడికి చెందిన మర్రెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవమూ లేదు. అయినప్పటికీ ఆయనను నియోజకవర్గ ఇన్చార్జిని చేసినా, పవన్పై అభిమానంతో ఆ పార్టీ నేతలు, అభిమానులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.తోడల్లుడు కావడమే అర్హతా?గత ఎన్నికల్లో కూటమి గద్దెనెక్కి, పవన్ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ పిఠాపురం ఇన్చార్జి పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పవన్, నాగబాబు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించాలనే ఆశావహుల జాబితా రోజులు గడిచేకొద్దీ చాంతాడులా పెరుగుతోంది. ఎవరి మట్టుకు వారే ఈ పదవి కోసం ఆరాటపడుతూ ప్రస్తుత ఇన్చార్జి మర్రెడ్డి మైనస్లపై ఫోకస్ చేస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకున్నా కేవలం నాగబాబుకు వరుసకు తోడల్లుడు కావడమే అర్హతగా ఇన్చార్జిని చేశారన్నది ఆ పార్టీ నేతలు మొదటి నుంచీ లోపాయికారీగా విమర్శిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ మర్రెడ్డికి పైనుంచి కింది వరకూ అంతటి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్చార్జిగా మర్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో అవలంబిస్తున్న వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎంపిక చేసుకున్న కొందరికి మాత్రమే ఆయన పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో, ఆ పార్టీలో సొంత సామాజికవర్గ నేతలే మర్రెడ్డికి తాజాగా కుంపటి రాజేస్తూండటం జనసేనలో హాట్టాపిక్గా మారింది.విభేదాలకు ‘తొలి గంట’గతంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా తొలి గంట కొట్టే విషయంపై రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ సందర్భంగా మర్రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాయడం అప్పట్లో రచ్చరచ్చ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్కు చేబ్రోలులోని తన ఇంటిని ఓదూరు నాగేశ్వరరావు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గం మర్రెడ్డిని బహిరంగంగానే నిలదీసింది. దీనిని సాకుగా తీసుకుని చేబ్రోలులో పవన్కు ఇచ్చిన ఇంటిని కావాలనే ఖాళీ చేయించి, పార్టీకి, పవన్కు స్థానికంగా అడ్రస్ లేకుండా చేశారని ఓదూరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మర్రెడ్డి సమయస్ఫూర్తితో సర్దుబాటు చేయలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గం పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లిందని చెబుతున్నారు. అంతటి రాజకీయ అనుభవం ఆయనకు లేని విషయమై ముఖ్య నేతలకు గట్టిగా చెప్పారని సమాచారం. అదే సందర్భంలో స్థానికేతరుడైన మర్రెడ్డి స్థానే స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ను తెర మీదకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) చైర్మన్ పదవి కట్టబెట్టి, పార్టీలోని అర డజను మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.రూ.కోట్ల కోసం కొట్లాటలుఇటీవల పవన్ నియోజకవర్గానికి కేటాయించిన రూ.4 కోట్ల పనుల పంపకాల అంశం కూడా ఆ పార్టీ నేతల మధ్య మరింత అగ్గి రాజేసిందనే చర్చ జరుగుతోంది. పనుల కేటాయింపులో మర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారంటూ కొందరు నేతలు పార్టీ ముఖ్యుల వద్ద ‘పంచాయితీ’ పెట్టారని సమాచారం. తనకు నచ్చిన ఒకరిద్దరికి మాత్రమే ఆయన పనులు అప్పగించడం మిగిలిన నేతలకు రుచించడం లేదు. అకస్మాత్తుగా విదేశాల నుంచి వచ్చిపడిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. అందునా ఇటీవల మంజూరైన నీటిపారుదల, రహదారుల వంటి పనులను నేతల రూపంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంపై వారు గుర్రుగా ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చిపడిన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం తమకెందుకివ్వడం లేదని పలువురు నిలదీస్తున్నారు. ఇటీవల పిఠాపురం రూరల్ ఎఫ్కే పాలెం, విరవాడ గ్రామాలకు చెందిన పాపిడిదొడ్డి చెరువులో జరిగిన మట్టి తవ్వకాల్లో పంపకాల విషయంపై జనసేనలో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. రెండు వర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కానీ, మర్రెడ్డి అనుయాయుడి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి, వైరివర్గం ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో, అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది. -
లేటరైట్రైట్..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు సరిహద్దులు దాటి తరలిపోతున్నాయి. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఉప ప్రణాళికా ప్రాంతమైన వంతాడ సమీపంలోని గిరిజనాపురం నాగులకొండ అటవీ ప్రాంతంలో అక్రమార్కులు కొండలు పిండి చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలకొద్దీ టిప్పర్లతో గ్రావెల్, లేటరైట్ తరలించుకుపోతున్నారు. ఏం జరిగిందంటే.. గిరిజనాపురం అటవీ ప్రాంతంలో సుమారు 250 ఎకరాల్లో 2014లో లేటరైట్ ఖనిజం తవ్వకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచీ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ.. అధికార టీడీపీ పెద్దల అండదండలతో అక్కడ పెద్ద ఎత్తున లేటరైట్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. ప్రారంభంలో ఆరేడు వాహనాలతో నడిచిన దందా చివరాఖరుకు 25 వాహనాలతో వందలాది ట్రిప్పులు వేసే స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ గిరిజనాపురం పరిసర ప్రాంతాల్లోని కొండలను పిండి చేసేస్తున్నారు.లేట్రైట్ను తవ్వి తీసి ప్రత్తిపాడు మండలం ఆరళ్లధార డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తొండంగి మండలం రావికంపాడు వద్ద మరో డంపింగ్ యార్డు కూడా ఉంది. రావికంపాడు యార్డు నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా టన్నుల కొద్దీ లేటరైట్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతున్నా వంతా డ, గిరిజనాపురం ప్రాంతాల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కొండలనే నమ్ముకున్న తమ నోటి దగ్గర కూడు కూడా కబళించేస్తున్నారని అడవి బిడ్డ లు ఆందోళన చెందుతున్నారు.రోజుకు 440 ట్రిప్పులు ఈ రెండు డంపింగ్ యార్డులకు రోజుకు ఒక్కో టిప్పర్తో సుమారు 20 ట్రిప్పుల చొప్పున లేటరై ట్ తరలిస్తున్నారు. ఈవిధంగా రోజుకు 25 వాహ నాలతో తక్కువలో తక్కువ 440 ట్రిప్పుల వరకూ లేటరైట్ తరలిస్తున్నారని అంచనా. నిబంధనలు తుంగలో తొక్కి ఒకో టిప్పర్లో 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. గిరిజనాపురం అటవీ ప్రాంతంలో నాలుగు ఆధునిక యంత్రాలతో లేటరైట్ తవ్వుతున్నారు. గతంలో రెండు క్రషర్లు పని చేస్తే ఇప్పుడు మరో రెండింటిని జోడించారు. రా త్రి, పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో టిప్పర్లు భారీ లోడుతో దుమ్ము రేపుతూ వెళుతుంటే ప్రమాదాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చినబాబు కనుసన్నల్లోనే విశాఖకు చెందిన అధికార పారీ్టల కీలక ప్రజాప్రతినిధి అనుచరులు అనుమతికి మించి కొండలను పిండి చేసేస్తున్నారని మండిపడుతున్నారు.పోడు భూములకు పట్టాలివ్వాలి వంతాడ పరిసర అటవీ ప్రాంతంలోని గిరిజనులకు 30 ఏళ్లుగా పోడు భూముల పట్టాలు ఇవ్వడం లేదు. ఆ భూములను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇస్తూ రూ.కోట్ల విలువైన ఖనిజ సంపదను రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. ఫలితంగా వ్యవసాయ భూములతో కళకళలాడాల్సిన భూములు భారీ గోతులతో అగాధాల్లా మిగులుతున్నాయి. అధికారులు స్పందించి తక్షణమే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. – కొసిరెడ్డి గణేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి సీపీఐ (ఎంఎల్ – వినోద్ మిశ్రా) -
ఆధ్యాత్మికతకు ధర్మ పరిక్రమణ యాత్ర
దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులుఆలమూరు: హిందూ ధర్మ పరిరక్షణ, హిందూ మత వ్యాప్తి కోసం ధర్మ పరిక్రమణ యాత్ర చేపట్టి గ్రామీణ, తీర ప్రాంతాల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు దాస సాహిత్య ప్రాజెక్టు తీవ్రంగా కృషి చేస్తోందని ప్రత్యేక అధికారి విద్వాన్ పగడాల ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. ఆలమూరు మండలం జొన్నాడలో మూడు రోజుల నుంచి జరుగుతున్న శ్రీపురందరదాసు సంకీర్తనల శిక్షణ తరగతుల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వేద, ఉపనిషత్, పురాణాల సారాంశాన్ని రంగరించి పురందరదాసు సుమారు 4.70 లక్షల సంకీర్తనలు రచించారన్నారు. ఈ కీర్తనలన్నీ కన్నడ భాషలో ఉండడం వల్ల అందులో ఉన్న సారాన్ని తెలుగు వారికి అర్థమయ్యే విధంగా తర్జుమా చేయించామన్నారు. ఆ కీర్తనలు ఆలపించే విధానాన్ని భజన మండలి సభ్యులకు నేర్పడానికి ఏటా మహిళా భక్త బృంద సభ్యులకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లో భాగంగా కోస్తా జిల్లాల్లో ప్రస్తుతం 4,862 భజన మండళ్లు ఉండగా వీటిల్లో 8,694 మంది మహిళా సభ్యులు ఉన్నారని తెలిపారు. దాస సాహిత్య ప్రాజెక్ట్లో ఉన్న హరే శ్రీనివాస భక్తభజన మండళ్ల సభ్యులందరూ సంకీర్తన యజ్ఞంతో పాటు కోలాటానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కొనియాడారు. దాస సాహిత్య ప్రాజెక్టు విస్తరణకు, నిర్వహణకు టీటీడీ రూ.2.50 కోట్లు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. హిందుత్వం వైపు ఆకర్షితులను చేస్తాం గిరిజనులు, దళితులు దాస సాహిత్య ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబర్చి హిందూత్వం వైపు అకర్షించేలా ఈ ధర్మ పరిక్రమణ యాత్ర దోహదపడుతుందని ఆనంద తీర్థాచార్యులు తెలిపారు. మత మార్పిడుల నివారణకు టీటీడీ ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. హిందుత్వానికి ఉన్న వైభవాన్ని వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా జూలై 15న ధర్మ పరిక్రమణ యాత్రను ప్రారంభిస్తున్నామన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో హరే శ్రీనివాస భజన మండళ్ల ఏర్పాటులో, నిర్వహణలో ఆలమూరు అయ్యప్ప స్వామి ఆలయ నిర్వాహకులు ముకుంద స్వామి కృషి ప్రశంసనీయమని అన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
ఉండ్రాజవరం: భార్యాభర్తల మధ్య వివాదం నేపథ్యంలో భార్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మండలంలోని మోర్త గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఉండ్రాజవరం ఏఎస్సై కె.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలో మోర్త గ్రామానికి చెందిన పుల్లూరి నాగేశ్వరరావుతో నిడదవోలు మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పుల్లూరి సంధ్య(22)కు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు సహస్ర, బాల శ్రీవల్లి ఉన్నారు. ఈ నెల 19వ తేదీన భార్యాభర్తలు తగదా పడ్డారు. శుక్రవారం ఉదయం భర్త పొలానికి వెళ్లేముందు తనతో మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన సంధ్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం వెళ్లిన భర్త నాగేశ్వరరావు బయట హోటల్ నుంచి టిఫిన్ తీసుకుని ఇంటికి రాగా.. బెడ్రూమ్లో భార్య ఉరి వేసుకొని ఉండడాన్ని గమనించి, వెంటనే స్థానిక వైద్యులను సంప్రదించగా ఆమెను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి కరింకి వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రామకృష్ణ తెలిపారు. -
సూక్ష్మ భరితం!
పత్రచరితం! రామచంద్రపురం రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని హసన్బాద జెడ్పీ హైస్కూల్లో 8 వ తరగతి విద్యార్థి ఎం.ఉత్తర వెంకట్ సున్నితమైన జిల్లేడు ఆకును కత్తిరించి రూపొందించిన యోగ ముద్ర విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా బలంగా ఉండే రావి ఆకు, పనస ఆకులపై ఇటువంటి చిత్రాలు రూపొందిస్తుంటారు. అయితే వెంకట్ జిల్లేడు ఆకుపై మనోహరంగా చిత్రించిన యోగముద్రను పాఠశాల డ్రాయింగ్ టీచర్ జి. శ్రీను, ప్రధానోపాధ్యాయురాలు పీఎస్బీఎస్కే సుందరి, ఉపాధ్యాయులు,విద్యార్ధులు అభినందించారు. జిల్లేడు ఆకుపై రూపొందించిన యోగ ముద్ర బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండాల నిపుణులు అరిపాక రమేష్బాబు, సున్నితమైన చాక్పీస్ని ఉపయోగించి అతి చిన్న అంతర్జాతీయ యోగా సింబల్ను తయారు చేశారు. యోగాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ సూక్ష్మ యోగా సింబల్ రూపొందించినట్లు చెప్పారు. -
ఉపయోగాలెన్నో...
● మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి చక్కటి మార్గం ● జిల్లాలో పెరుగుతున్న ఆదరణ ● పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ● నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాయవరం: దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఒడిదొడుకుల కారణంగా అధిక శాతం ప్రజలు బీపీ, సుగర్, థైరాయిడ్, ఊబకాయం, ఆస్తమా, నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ వేలు, లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయినా రోగాలు పూర్తిగా నయం కాని పరిస్థితి. ఇటువంటి రోగాలు, రుగ్మతలను జయించడానికి నిత్యం యోగా సాధన చేయాలని గురువులు సూచిస్తున్నారు. రోజూ అరగంట నుంచి గంట వరకు యోగాసనాలు వేస్తే మానసిక ప్రశాంతతతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుందంటున్నారు. 2015 నుంచి ప్రపంచ యోగా దినోత్సవం భారతదేశంలో పుట్టిన యోగా నేడు ప్రపంచ దేశాలకు విస్తరించింది. భారతదేశ ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి గుర్తించి 2015 జూన్ 21 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. జూన్ 21న సూర్య గ్రహం భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది. ఆ రోజు దినంలో సమయం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందరిలోనూ ఆసక్తి జిల్లాలో యోగా నేర్చుకోవాలనే ఆసక్తి అన్ని వయసుల వారిలోనూ పెరుగుతోంది. అందుకు అనుగుణంగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. అమలాపురం, మండపేట, రావులపాలెం, కొత్తపేట, రామచంద్రపురం, రాయవరం, రామచంద్రపురం, ద్రాక్షారామ, రాజోలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పలు యోగా సెంటర్లలో శిక్షణ పొందేందుకు రోజూ వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా యోగా శిక్షణ అందిస్తున్నాయి. యోగాడే నిర్వహణకు ఏర్పాట్లు విద్యార్థి దశ నుంచే యోగాపై ఆసక్తి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఏటా పాఠశాలలు, కళాశాలల్లో యోగాడేను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా యోగాడేను పాఠశాలల్లో ఘనంగా నిర్వహించాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాలల్లో యోగాడే ప్రాధాన్యాన్ని వివరిస్తూ, పాఠశాలల్లో నిర్వహించిన యోగాడే కార్యక్రమాల ఫొటోలు, వీడియోలను గూగుల్ ట్రాకర్లో అప్లోడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పలు పాఠశాలల్లో యోగా తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నారు. దీనికి విద్యార్థుల నుంచి స్పందన లభిస్తోంది. కొన్ని విద్యాసంస్థలలో ఉదయం, సాయంత్రం వెసులుబాటును బట్టి రోజూ అరగంట విద్యార్థులకు యోగా శిక్షణ అందిస్తున్నారు. తద్వారా చిన్నారులలో క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక పరమైన ఆరోగ్య సమస్యలు దూరమవుతున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. లాభాలు ఇవీ... ● యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. ● ఏ రంగానికి చెందినవారైనా తమ విధులపై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తారు. ● ఒత్తిడి, మానసిక ఆందోళనలతో సతమతమయ్యేవారు యోగాపై దృష్టి సారిస్తే ప్రయోజనం ఉంటుంది. ● యోగాసనాలు వేయడం వల్ల శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఉపశమనం లభిస్తుంది. ● నిత్యం యోగా వల్ల విద్యార్థులలో జ్ఞాపక శక్తి పెంపొందుతుంది. ● యోగాసనాల వల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ ఉత్తేజమై ఆరోగ్య సమస్యలు దరి చేరవు. పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నా వ్యాధుల నియంత్రణకు, మానసికంగా ధృఢత్వాన్ని సాధించడానికి యోగా ఉపయోగపడుతుంది. ఉద యం, సాయంత్రం వేళల్లో సాధనతో ప్రతి ఒక్కరూ ఉత్తేజితులవుతారు. శరీరం, మనసుపై అదుపు ఏర్పడుతుంది. 17 ఏళ్లుగా యోగాను ఉచితంగా నేర్పించడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. – వెలగల ఫణికృష్ణారెడ్డి, యోగా గురువు, రాయవరం దినచర్యలో భాగం కావాలి యోగా మన దినచర్యలో భాగం కావాలి. యోగా చేయడం వలన దీర్ఘకాలిక వ్యాధులు దరి చేరవు. ధ్యానం, ప్రాణాయామం వంటివి ఒత్తిడిని దూరం చేస్తాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ సునాయాసంగా యోగా చేయవచ్చు. – అల్లూరి శ్రీనివాసచౌదరి, యోగా శిక్షకుడు, లొల్ల, రాయవరం మండలం విస్తృత ప్రయోజనాలు యోగా సాధన మనిషి జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకుని వస్తుంది. యోగాతో విస్తృత ప్రయోజనాలు ఉంటా యి. అంతరంగాన్ని చదివే దిశగా మనిషిని యోగా ప్రేరేపిస్తుంది. విద్యార్థి దశ నుంచి యోగాను నేర్పిస్తే ఉత్తమ పౌరులు తయారవుతారు. – జి.మమ్మీ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, అమలాపురం నేడు పాఠశాలల్లో.. ప్రపంచ యోగా దినోత్సవాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించడానికి జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి జిల్లాలో ఉన్న 2,031 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు పాఠశాల షెడ్యూల్లో మార్పులు చేశారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మధ్యాహ్నం 12.30 గంటల వరకు పనిచేస్తాయి. జిల్లాలో 2.10 లక్షల మంది పాఠశాల విద్యార్థులతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర విద్యాసంస్థల్లో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. -
పచ్చ పార్టీలో కొత్త రచ్చ
● పెందుర్తి, వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య ఉప్పునిప్పు ● ఆజ్యం పోస్తున్న సీనియర్ గోరంట్ల సాక్షి టాస్క్ఫోర్స్: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. చంద్రబాబునాయుడు అనుసరించే రెండు కళ్ల సిద్ధాంతం సొంత పార్టీ నేతల మధ్య అగాధాన్ని పెంచుతోంది. పార్టీలో సీనియర్ నాయకులుగా భుజకీర్తి తగిలించుకుని తిరిగేవారు సైతం ఈ అగాధాన్ని మరింత పెంచుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో పెందుర్తి వెంకటేష్, బొడ్డు వెంకటరమణచౌదరిల మధ్య పదవులు కేటాయింపు విషయంలో విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో సైతం ఈ రెండు వర్గాలు తమ ప్రాధాన్యాన్ని చాటుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్యకర్తల మధ్య ఏర్పడే వివాదాలను సైతం ఇరువర్గాలు ప్రెస్టేజీయస్గా పరిగణిస్తున్నాయి. తమ వ్యతిరేకవర్గం వారిని పోలీసుల సాయంతో అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూరల్ నియోజకవర్గం పరిధిలోని తొర్రేడు గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరిల ఫొటోలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో సీఎం ప్రోగ్రాం కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ ఫొటో లేదని, ఆయన కుమారుడు అభిరామ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో వారికి వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న వివాదాన్ని పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి సర్దుబాటు చేసే ప్రయత్నం చేయకపోగా స్వంత పార్టీ కార్యకర్తలపైనే రాజానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయించడం ప్రస్తుత వివాదాన్ని మరింత పెద్దది చేసింది. బుచ్చయ్య ఇలా ఒక వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తూ మరో వర్గం వారిపై కేసులు పెట్టించడం ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న తమ నాయకుడి ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంలో బుచ్చయ్య ప్రమేయం కూడా ఉందని పెందుర్తి వర్గీయులు అనుమానిస్తున్నారు. గోరంట్ల రవిరామ్కిరణ్ ఫొటో పెట్టగా లేనిది సీఎం ప్రోగ్రాం కన్వీనర్గా ఉన్న తమ నాయకుడి ఫొటో ఎందుకు ఫ్లెక్సీలో పెట్టకూడదని పెందుర్తి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. అభిప్రాయ భేదాలు ఉండడం సహజమని, పార్టీ కార్యాలయం వద్ద ఉన్న ఫ్లెక్సీలను పెందుర్తి వర్గీయులు ధ్వంసం చేయడం ముమ్మూటికీ తప్పేనని పార్టీలో పలువురు అభిప్రాయపడుతున్నారు. బొడ్డు వెంకట రమణ చౌదరి, పెందుర్తి వెంకటేష్ వర్గీయుల మధ్య ఉన్న వివాదాలను మరింత పెంచే విధంగా గోరంట్ల వ్యవహరించడాన్ని కూడా పార్టీ నేతలు తప్పుబడుతున్నారు. పార్టీలో ప్రాధాన్యమైన పదవులు కేటాయించే సమయంలో తనకు పెందుర్తి అడ్డురావచ్చన్న భావనతోనే అక్కడ బొడ్డు వెంకటరమణచౌదరిని బుచ్చయ్య ప్రోత్సహిస్తున్నారన్న అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. మొత్తమ్మీద ప్రస్తుత వివాదంలో గోరంట్ల వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఫ్లెక్సీల చించివేతపై కేసు తొర్రేడు గ్రామంలో టీడీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీఎం చంద్రబాబు, ప్రోగ్రాం కన్వీనర్ పెందుర్తి వెంకటేష్ ఫొటో వేయలేదని ఆయన కుమారుడి అనుచరులు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరిల ఫొటోలు గురువారం చించివేశారు. దీనిపై తొర్రేడు గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఫిర్యాదు మేరకు ముగ్గళ్లకు చెందిన గెడ్డం అనిల్కుమార్, కాటవరానికి చెందిన కాట్రగడ్డ శివ, తొర్రేడు గ్రామానికి చెందిన చిట్టూరి సురేంద్రలపై కేసు నమోదు చేశారు. -
ఉద్యోగాలు కోల్పోయి ఏడో నెలొచ్చినా..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఉన్నా ఉద్యోగాలు కోల్పోయి ఏడో నెలొచ్చినా వైద్య ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సహాయకులు విశాఖపట్నంలో జరుగుతున్న యోగా వేడుకల్లో పాల్గొనేందుకు కదిలారని ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జీ.వీ.వీ.ప్రసాద్ అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నం వెళుతూ రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖలో ఆరోగ్య సహాయకులుగా ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న దాదాపు వెయ్యి మందిని కోర్టు ఆదేశం పేరుతో విధుల నుంచి తొలగించడంతో రోడ్డున పడ్డారన్నారు. నెలలు గడుస్తున్నా నేటికీ విధుల్లోకి తీసుకోలేదని ఆవేదన చెందారు. ఉన్నతాధికారుల మాటల ఊరటతో తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందని ఏడు నెలలుగా ఎదురుచూపులు చూస్తున్నామన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా విశాఖలో జరుగుతున్న శ్రీయోగాంధ్ర విజయం కోసం.. ఆరోగ్యాంధ్రా సాధన కోసం్ఙ ఉద్యోగాలు కోల్పోయిన ఆరోగ్య సహాయకులు వందలాదిగా తరలి వెళుతున్నారని ప్రసాద్ చెప్పారు. వరదలు, తుపానులు వచ్చినప్పుడు మేము చేసే సేవలు అనంతమని, అదే సేవా స్ఫూర్తితో స్వచ్ఛంధ సేవకు ముందుకురావడం ఆరోగ్య సహాయకులు పెద్ద మనస్సుకు నిదర్శనమని ప్రసాద్ కొనియాడారు. ప్రభుత్వం ఇప్పటికై నా కనికరించి త్వరితగతిన తిరిగి ఉద్యోగాలిచ్చి ఆదుకోవాలని వారు కన్నీళ్లతో అభ్యర్థిస్తున్నారన్నారు. -
23 నుంచి మహిళా సర్పంచ్లకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా సర్పంచ్ల శిక్షణ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలేరు జిల్లాలలోని ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలకు మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ ఇచ్చామన్నారు. వారు ఆయా జిల్లాల్లో ఈ నెల 26 నుంచి సర్పంచ్లకు శిక్షణ ఇస్తారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని సర్పంచ్లకు ఈటీసీలో శిక్షణ ఉంటుందన్నారు. మహిళల హక్కులు, బాధ్యత, సమాజంలో వారి పాత్రపై శిక్షణ నిర్వహిస్తామన్నారు. రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినా వాటిని ఉపయోగించకపోవడంతో వారిలో అవగాహన పెంచడానికి ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. సర్పంచ్గానే కాకుండా మహిళగా ఆమె చేయవలసిన పనులను తెలియజేస్తామన్నారు. 26 నుంచి ఎంపీపీలకు... ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ఎంపీపీలకు ఈటీసీలో శిక్షణ ఉంటుందని ప్రిన్సిపాల్ తెలిపారు. మండల పరిధిలో గ్రామసభల నిర్వహణ, మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం, జిల్లా పరిషత్తు సమావేశాల్లో వారి పాత్రలపై శిక్షణలో వివరిస్తామన్నారు. -
తప్పని కటకట
అల్లవరం మండల పరిధిలోని 14 గ్రామాల్లో తాగునీటికి జనం కటకటలాడుతున్నారు. బోడసకుర్రు ఆర్డబ్ల్యూఎస్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీరు అడుగంటింది. దీని ద్వారా 53 ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీరు లేకపోవడం ఎద్దడికి కారణం. పది రోజులుగా తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చేతులేత్తేశారు. బోడసకుర్రులో బోరు బావి నుంచి నీటిని ట్యాంకర్ల ద్వారా సంప్లో నింపి ఆపై ఓహెచ్ఆర్లకు పంపింగ్ చేస్తున్నారు. అది కూడా అరకొరగా మూడు లేదా నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే. బోడసకుర్రు ప్రాజెక్టులో నీటి ఎద్దడి తలెత్తడంతో బోడసకుర్రుతో పాటు, కోడూరుపాడు, గూడాల, తాడికోన, గోడి, గోడితిప్ప, గోడిలంక, ఓడలరేవు, మొగళ్ళమూరు, రెల్లుగడ్డ, అల్లవరం, ఎంట్రుకోన, బెండమూర్లంక గ్రామాల్లోని ప్రజలు ట్యాంకర్లపై ఆధార పడవలసి వస్తోంది. -
25 నుంచి నైపుణ్యాభివృద్ధి శిక్షణ
కాకినాడ సిటీ: దీన్దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) సెంటర్ ఆధ్వర్యాన ఈ నెల 25 నుంచి కాకినాడ వాకలపూడిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పాసైన 18 నుంచి 30 సంవత్సరాలలోపు పురుష అభ్యర్థులు దీనికి అర్హులన్నారు. టూ వీలర్ టెక్నీషియన్, వేర్హౌస్ ఎగ్జిక్యూటివ్ కోర్సులలో వీరికి మూడు నెలలు శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం, స్టడీ మెటీరియల్ అందిస్తారన్నారు. ఈ కోర్సులతో పాటు అదనంగా బేసిక్ కంప్యూటర్ కోర్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్పై శిక్షణ ఇస్తారని తెలిపారు. అనంతరం, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం కల్పించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ ఇస్తారని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదీలోపు 83284 83297, 89784 75164 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని, నేరుగా తమ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని లచ్చారావు స్పష్టం చేశారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి కాకినాడ సిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టరేట్ నుంచి గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కాకినాడ నూకాలమ్మ గుడి నుంచి మూడు లైట్ల జంక్షన్, దేవదాయ శాఖ కార్యాలయం వరకూ 3 వేల మందితో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. దీనికి పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో గుర్తించిన వేదికల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలను భాగస్వాముల్ని చేస్తూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమానికి సుమారు 10.38 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన, అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, డీఆర్ఓ జె.వెంకటరావు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఆయుష్ వైద్యాధికారులు పాల్గొన్నారు. -
పని గంటలు.. 10 గంటలా?
● కూటమి సర్కారుపై కార్మిక సంఘాల ఆగ్రహం ● కలెక్టరేట్ వద్ద ధర్నా ● కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ కాకినాడ సిటీ: రాష్ట్రంలో కార్మిక హక్కులను కాలరాసే విధంగా పని గంటలను పెంచుతూ కూటమి ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వివిధ కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఏ రంగంలో పని చేసే కార్మికులకై నా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చివుకుల వెంకటరావు, తోకల ప్రసాద్, జె.వెంకటేశ్వర్లు, తాళ్లూరి రాజు, గొడుగు సత్యనారాయణ, వల్లూరి రాజబాబు మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని అవహేళన చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు కార్మికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పని గంటలను పెంచుతూ అసెంబ్లీలో చేసిన నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పది గంటల పని విధానం అమల్లోకి వచ్చిన మొదటి సంవత్సరమే 12.50 లక్షల మంది కార్మికుల ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. పది గంటల పని గంటల విధానానికి వ్యతిరేకంగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులందరూ కార్మికులతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మహిళలకు పగటి పూటనే రక్షణ కల్పించలేని కూటమి సర్కారు శ్రామిక మహిళలతో రాత్రి వేళల్లో పని చేయించడం మానుకోవాలని అన్నారు. అధిక పని గంటలు కార్మికుల పాలిట యమపాశాలని అనేక శాసీ్త్రయ పరిశోధనలు ఘోషిస్తున్నా చంద్రబాబు చెవికెక్కడం లేదని దుయ్యబట్టారు. పారిశ్రామిక మిత్రుల ప్రయోజనాలే కూటమి పెద్దలకు ముఖ్యమని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గత 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు సవరించలేదని, తక్షణం సలహా మండలిని నియమించి, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాన్ని రూ.26 వేలు చేయాలని కోరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చే నాలుగు లేబర్ కోడ్ల అమలును రాష్ట్రంలో నిలుపు చేయకపోతే కార్మిక వర్గం ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని కూటమి నేతలను హెచ్చరించారు. ధర్నాలో కేంద్ర కార్మిక సంఘాల నాయకులు చెక్కల రాజ్కుమార్, మలకా వెంకటరమణ, పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్కుమార్, నక్కా గంగాధర్, దుంపల ప్రసాద్, గుబ్బల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మంచినీటికి చెడ్డ కష్టం
సాక్షి, అమలాపురం: సాగు నీరే కాదు.. గుక్కెడు తాగునీరు అందించడంలో కూడా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. డెల్టా పంట కాలువలకు సకాలంలో నీరు విడుదల చేయకపోవడం వల్ల శివార్లలో ఖరీఫ్ సాగు ఆలస్యం కావడమే కాదు.. తాగునీటి ఎద్దడికి కూడా కారణమైంది. జూన్ ఒకటిన డెల్టా కాలువలకు నీరు విడుదల చేసినా లొల్ల లాకుల వద్దనే అడ్డుకట్టలు వేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావంతో జిల్లాలోని ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు నియోజకవర్గాలలోని శివారు ప్రాంతాలకు తాగునీరందించే ప్రాజెక్టులలో నీటి నిల్వలు తగ్గి జనం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. మున్సిపాలిటీలో తాగునీటి ఇబ్బందులు అమలాపురం మున్సిపల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు అడుగంటడంతో పట్టణంలో పలు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందడం లేదు. ఏటా ఇచ్చినట్టుగానే ఈ ఏడాది జూన్ 1న పంట కాలువలకు నీరు విడుదల చేస్తారని భావించిన మున్సిపాలిటీ అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేసుకుంది. నడిపూడి వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు అమలాపురం – చల్లపల్లి పంట కాలువల ద్వారా నీరు అందాల్సి ఉంది. ఈ కాలువ మీదనే నడిపూడి వద్ద వంతెన నిర్మాణం పేరుతో ఈ నెల 15 వరకు తాగునీరు ఇవ్వలేదు. తరువాత విడుదల చేసినా తొలి వారం రోజులు మురుగునీరు కావడం వల్ల తోడలేదు. ఇక పట్టణంలో ఉన్న రెండు రిజర్వాయర్లకు అమలాపురం – అల్లవరం బెండా కెనాల్ ద్వారా తాగునీరు నింపుతారు. ఈ కాలువకు ఇప్పటికీ నీరు విడుదల చేయలేదు. సాధారణంగా 60 రోజుల పాటు నీటి నిల్వలతో ఈ రిజర్వాయర్లు తాగునీరు అందించే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాలువలకు నీరు రాక ఈ మూడు చెరువులకూ పంపింగ్ చేసి నింపే పరిస్థితి లేదు. పలు వార్డుల్లో ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నారు. ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ ట్యాంకర్లతో సరఫరా చేస్తోంది. మున్సిపాలిటీలో పని చేస్తున్న 50 మంది ఇంజినీరింగ్ వర్కర్లు 42 రోజులుగా సమ్మెలో ఉండడం కూడా తాగునీటి సరఫరాకు అవాంతరంగా మారింది.శివార్లలో ఇక్కట్లు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి ప్రాజెక్టులో 45 రోజు లు నీరు నిల్వ ఉంటుంది. ప్రాజెక్టు నుంచి ప్రతి రోజూ 1,875 కిలోలీటర్ల తాగునీరు గ్రామాలకు సరఫరా అవుతుంది. ఎస్.యానాం ప్రాజెక్టులో మైక్రోఫిల్టర్లు పోవడంతో గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. నీరు కేవలం వాడడానికి తప్ప తాగడానికి పని చేయడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. భీమనపల్లి పంచాయతీ ప్రాజెక్టు ఎండిపోవడంతో వారం రోజులు దాని నుంచి నీరు అందడం లేదు. కూనవరం ప్రాజెక్టు చెరువు ఈ నెల 7వ తేదీ నుంచి ఎండిపోవడంతో మండలంలోని కూనవరం, ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం, మునుపల్లి కోటిగట్టు, పెదగాడవిల్లి, చిన్నగాడవిల్లి, ఎన్.కొత్తపల్లి, కాట్రేనికోన మండలం ఉప్పూడి గ్రామ పంచాయతీ పరిధి నాగి చెరువు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఈ ప్రాంతాల్లో పది రోజులుగా తాగునీరు పూర్తి స్థాయిలో అందడం లేదు. అడుగంటుతున్న నీటి నిల్వలు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఐ.పోలవరం (ఐలెండ్)కు గురువారం నుంచి పంట కాలువల ద్వారా సాగునీరందుతోంది. ఇప్పటికే మురమళ్ల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. మరో వారం అయితే కానీ నీరు నింపే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇప్పటికే మురమళ్ల, కేశనకుర్రు శివారు ప్రాంతాల్లో తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు. ముమ్మిడివరం మండలం పోలమ్మ చెరువులో నీరు తక్కువగా ఉంది. అయితే బోర్లు ఎక్కువగా ఉండడంతో నీరు సరఫరా చేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాట్రేనికోన మండలం కందికుప్ప, నడవపల్లి, బలుసుతిప్ప మంచినీటి ప్రాజెక్టులలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శివారలో నీటి ఇబ్బందులున్నాయి. రాజోలు దీవిలోని మలికిపురం, సఖినేటిపల్లిలో తాగునీటి ఇక్కట్లు ఇప్పుడిప్పుడే తొలుగుతున్నాయి. పంట కాలువల ద్వారా నీరందడంతో ప్రాజెక్టులను నీటితో నింపుతున్నారు. గుడిమెళ్లంక, రామేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో వారం రోజుల పాటు తాగునీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. నీరందించలేక ఎదురుదాడి తమ నిర్వాకం వల్ల ప్రజలకు తాగునీరు.. రైతులకు సాగునీరు అందకుండా పోతే నీటి కష్టాలకు మున్సిపాలిటీలు.. స్థానిక సంస్థలు కారణమని ఆరోపిస్తూ ఎదురుదాడికి దిగారు కూటమి నేతలు. డెల్టా కాలువలకు జూన్ 1న అందించాల్సిన నీటిని 15వ తేదీ వరకూ అందించలేదు. అల్లవరం బెండా కెనాల్కు ఇప్పటికీ ఇవ్వలేదు. మురమళ్ల కాలువకు ఇప్పడిప్పుడే నీరు వదులుతున్నారు. ఈ ఏడాది కాలువలకు నీరు ఇవ్వడం ఆలస్యమవుతుందని ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదు. ఇప్పుడు మున్సిపాలిటీలకు ముందుచూపు లేదని ఆరోపిస్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో పాటు టీడీపీ నేతలు ఇదే పల్లవి అందుకున్నారు. ఆనందరావు సొంత మండలం చల్లపల్లిలో తాగునీరు అందడం లేదని మహిళలు గురువారం ఖాళీ బిందెలతో నిరసన ప్రదర్శన చేయడం గమనార్హం. అయితే దీనిపై కూటమి నేతలు నోరు మెదపకపోవడం విశేషం. కాలువలకు నీరు విడుదల ఆలస్యమవుతున్నందున కనీసం ఆర్డబ్ల్యూఎస్ ద్వారా ప్రత్యామ్నాయంగా తాగునీరు అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేపట్టలేదు. కోనసీమ జిల్లాలో దాహం దాహం ప్రాజెక్టులలో అడుగంటిన జలాలు పంట కాలువలకు ఆలస్యంగా నీరు విడుదల చేయడం వల్లే.. జూన్ 1కి రావాల్సిన నీరు ఇప్పటికీ పలుచోట్ల అందని వైనం అమలాపురం, ముమ్మిడివరంలో తాగునీటి ఇబ్బందులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోని ఆర్డబ్ల్యూఎస్ -
లేటరైట్రైట్..
గిరిజనాపురం అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: అధికారం అండతో వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులు సరిహద్దులు దాటి తరలిపోతున్నాయి. ప్రత్తిపాడు మండలంలో ఉప ప్రణాళికా ప్రాంతమైన వంతాడ సమీపంలోని గిరిజనాపురం నాగులకొండ అటవీ ప్రాంతంలో అక్రమార్కులు కొండలు పిండి చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వందలకొద్దీ టిప్పర్లతో గ్రావెల్, లేటరైట్ యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు. ఏం జరిగిందంటే.. గిరిజనాపురం అటవీ ప్రాంతంలో సుమారు 250 ఎకరాల్లో 2014లో లేటరైట్ ఖనిజం తవ్వకాలకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఒక ప్రైవేటు కంపెనీకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచీ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ.. అధికార టీడీపీ పెద్దల అండదండలతో అక్కడ పెద్ద ఎత్తున లేటరైట్ తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి. అప్పట్లో అక్రమార్కులు టన్నులకు టన్నుల లేటరైట్ తరలించుకుపోయి రూ.కోట్లు కొల్లగొట్టారు. అధికారం అండ చూసుకుని నిబంధనలతో పని లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తున్నా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయలేకపోయారు. నాడు ప్రారంభంలో ఆరేడు వాహనాలతో నడిచిన దందా చివరాఖరుకు 25 వాహనాలతో వందలాది ట్రిప్పులు వేసే స్థాయికి చేరుకుంది. గత ఎన్నికల్లో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడు మళ్లీ గిరిజనాపురం పరిసర ప్రాంతాల్లోని కొండలను పిండి చేసేస్తున్నారు. లేట్రైట్ను తవ్వి తీసి ప్రత్తిపాడు మండలం ఆరళ్లధార డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీంతోపాటు తొండంగి మండలం రావికంపాడు వద్ద మరో డంపింగ్ యార్డు కూడా ఉంది. రావికంపాడు యార్డు నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా టన్నుల కొద్దీ లేటరైట్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ఇందులో కొంత ఐరన్ ఓర్ కూడా ఉందనే ఆరోపణలున్నాయి. అడవి బిడ్డల ఆందోళన ఇంత భారీ స్థాయిలో మైనింగ్ జరుగుతున్నా వంతా డ, గిరిజనాపురం ప్రాంతాల గిరిజనులకు ఒరిగిందేమీ లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కొండలనే నమ్ముకున్న తమ నోటి దగ్గర కూడు కూడా కబళించేస్తున్నారని అడవి బిడ్డ లు ఆందోళన చెందుతున్నారు. పోడు వ్యవసాయా నికి గిరిపుత్రులను అడ్డుకునే అటవీ శాఖ.. రూ.కోట్ల విలువైన లేటరైట్ను పరిమితికి మించి అడ్డగోలుగా తరలించుకుపోయేందుకు మాత్రం అనుమతిస్తోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. మై నింగ్లో రెండు మూడు వందల మంది పని చేస్తు న్నా తమకు ఉపాధి కల్పించడం లేదని స్థానిక గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కోసం స్థానిక గిరిజన యువత మైదాన ప్రాంతంలో చేప లు, రొయ్యల చెరువులు, రెస్టారెంట్లలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ దుర్భరంగా బతుకుతున్న పరిస్థితులున్నాయి. మైనింగ్ జరిపే క్రమంలో నాగులకొండ మీద నివసించే అడవి బిడ్డలకు అనేక హామీలు ఇచ్చారు. గోకవరం పంచాయతీలో నిర్వహించిన గ్రామసభలో ప్రతి కుటుంబానికీ ఇంటి ని ర్మాణానికి తోడ్పాటు, గ్రామాభివృద్ధికి ఏటా రూ. 20 లక్షలు ఇస్తామని, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతులు, స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని వాగ్దానం చేశారు. ఆ హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని గిరిజనులు మండిపడుతున్నారు. పోడు భూములకు పట్టాలివ్వాలి వంతాడ పరిసర అటవీ ప్రాంతంలోని గిరిజనులకు 30 ఏళ్లుగా పోడు భూముల పట్టాలు ఇవ్వడం లేదు. ఆ భూములను ప్రైవేటు సంస్థలకు లీజులకు ఇస్తూ రూ.కోట్ల విలువైన ఖనిజ సంపదను రాత్రి, పగలు అనే తేడా లేకుండా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. ఫలితంగా వ్యవసాయ భూములతో కళకళలాడాల్సిన భూములు భారీ గోతులతో అగాధాల్లా మిగులుతున్నాయి. ఈ గోతుల్లో పడి మనుషులు, జంతువులు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తక్షణమే పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలి. – కొసిరెడ్డి గణేశ్వరరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి సీపీఐ (ఎంఎల్ – వినోద్ మిశ్రా) హామీలు అమలు చేయడం లేదు గ్రామ సమీపంలో లేటరైట్ మైనింగ్ జరుగుతున్నా మా గ్రామానికి ఒరిగిందేమీ లేదు. అప్పట్లో గ్రామ సభలో గిరిజనులకిచ్చిన హామీలు అమలు చేయడంలో లీజుదారు విఫలమయ్యారు. విద్య, వైద్య సదుపాయాలతో పాటు మౌలిక వసతులు కల్పించకపోవడంతో గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాభివృద్దికి చర్యలు తీసుకోవాలి. మైనింగ్ సంస్థలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. – ఉల్లి తాతారావు, ఆదివాసీ గిరిజన సంఘం, వంతాడ, ప్రత్తిపాడు మండలం నాగులకొండ అటవీ ప్రాంతంలో కొండలు పిండి చినబాబు కనుసన్నల్లో మైనింగ్ మెట్టలో సహజ వనరుల దోపిడీ గిరిపుత్రులకు గుండు సున్నా ఉపాధీ లేదు.. ఉద్యోగాలూ లేవురోజుకు 440 ట్రిప్పులు ఈ రెండు డంపింగ్ యార్డులకు రోజుకు ఒక్కో టిప్పర్తో సుమారు 20 ట్రిప్పుల చొప్పున లేటరై ట్ తరలిస్తున్నారు. ఈవిధంగా రోజుకు 25 వాహ నాలతో తక్కువలో తక్కువ 440 ట్రిప్పుల వరకూ లేటరైట్ తరలిస్తున్నారని అంచనా. నిబంధనలు తుంగలో తొక్కి ఒకో టిప్పర్లో 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. గిరిజనాపురం అటవీ ప్రాంతంలో నాలుగు ఆధునిక యంత్రాలతో లేటరైట్ తవ్వుతున్నారు. గతంలో రెండు క్రషర్లు పని చేస్తే ఇప్పుడు మరో రెండింటిని జోడించారు. రా త్రి, పగలు అనే తేడా లేకుండా పదుల సంఖ్యలో టిప్పర్లు భారీ లోడుతో దుమ్ము రేపుతూ వెళుతుంటే ప్రమాదాలు జరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చినబాబు కనుసన్నల్లోనే విశాఖకు చెందిన అధికార పార్టీల కీలక ప్రజాప్రతినిధి అనుచరులు అనుమతికి మించి కొండలను పిండి చేసేస్తున్నారని మండిపడుతున్నారు. -
గడువు దాటితే ముప్పు
అంబాజీపేట: గ్యాస్ సిలిండర్తో పంట చేసుకోవడం ఎంత సులభమైన పద్ధతో... సరైన జాగ్రత్తలు పాటించకపోతే అంతే ప్రమాదం కూడా ఉంటుంది. సిలిండర్కు కాల పరిమితి ఉంటుందని, దానిని గమనిస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. గడవు తేదీ ముగిసిన సిలిండర్ను వినియోగిస్తే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్ కంపెనీలు సరఫరా చేసే ప్రతీ సిలిండర్పై గడువు తేదీ, కోడ్ విధానంలో మెటల్ ప్లేటుపై ముద్రిస్తాయి. సిలిండర్ను మార్చుకున్నప్పుడల్లా ఆ గడువు తేదీని చూసుకొని వినియోగించాలి. ఇలా గుర్తించాలి.. సిలిండర్ మెటల్ ప్లేటుపై ఏ–25, బీ–25 అని ఉంటే ఆ సిలిండర్ 2025 మార్చి–జూన్కి గడువు ముగుస్తుందని అర్థం. 25 అంటే 2025 సంవత్సరానికి, ఆంగ్ల అక్షరం త్రైమాసికానికి సూచిక. ‘ఏ’ అక్షరం జనవరి నుంచి మార్చి వరకు ‘బి’ అక్షరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు, ‘సీ’ అక్షరం జూలై నుంచి సెప్టెంబర్ వరకు, ‘డీ’ అక్షరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అని గుర్తించాల్సి ఉంటుంది. సిలిండర్ ఇంటి వద్దకు వచ్చిన వెంటనే మెటల్ ప్లేటుపై కోడ్ విధానంలో ఉన్న గడువు తేదీని. గడువు తేదీ నెల వ్యవధిలో ముగుస్తున్నట్లు సిలిండర్పై ఉంటే దానిని తీసుకోకూడదు. ఎందుకంటే చిన్న కుటుంబాల వారికి నెల రోజులకు పైగా గ్యాస్ వస్తుంది. ఆ సిలిండర్ స్థానంలో వేరే సిలిండర్ను అడిగి తీసుకునే హక్కు వినియోగదారుడికి ఉంది. సిలిండర్కు 10 ఏళ్ల గడువు.. సిలిండర్ తయారైనప్పటి నుంచి 10 ఏళ్ల వరకు గడువు ఉంటుంది. సిలిండర్ను ప్రత్యేకమైన ఉక్కుతో సిలిండర్ లోపల సురక్షితమైన కోటింగ్తో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు తయారు చేస్తారు. బీఐఎస్ అనుమతులు తీసుకున్న తర్వాతే సిలిండర్ మార్కెట్ల్లోకి వస్తుంది. వినియోగదారుల హక్కులు.. గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు హక్కులు ఉన్నాయి. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారుడు మృతి చెందితే వారి కుటుంబ సభ్యుల పేరిట ఆ కనెక్షన్ మార్పు చేసుకోవచ్చు. కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నిబంధనల మేరకు ఽధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే అదే రోజు కనెక్షన్ పొందవచ్చు. కొత్త కనెక్షన్ తీసుకునే సమయంలో తమ వద్దనే స్టౌ కొనుగోలు చేయాలని డీలర్ కోరవచ్చు. అయితే డీలర్ వద్ద కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. వంట గ్యాస్ సిలిండర్కు కాలపరిమితి గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి -
యాంత్రీకరణ దిశగా రైతు అడుగులు
కాకినాడ సిటీ: వ్యవసాయంలో యాంత్రీకరణ దిశగా రైతులను ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, వివిధ యంత్ర పరికరాలను రాయితీపై అందిస్తుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు. 688 మంది రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలకు సంబంధించి మంజూరైన రాయితీ రూ.3.83 కోట్ల నమూనా చెక్కును అందజేశారు. అనంతరం రైతులకు వివిధ రకాల విత్తనాలకు సంబంధించిన మినీ కిట్లను, పవర్ స్ప్రేలను పంపిణీ చేశారు. జిల్లాకు 42 డ్రోన్లు లక్ష్యం కాగా ఇప్పటికి 35 మంది బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయగా, 25 మంది బ్యాంకుల్లో సొమ్ము డిపాజిట్ చేశారన్నారు. జిల్లాలో ఇప్పటికే నలుగురికి కిసాన్ డ్రోన్లు అందజేసినట్లు వివరించారు. ఈ నెల చివరి నాటికి మిగిలిన వారందరికీ రాయితీపై డ్రోన్లు అందజేస్తామని వెల్లడించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎన్ విజయకుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో యాంత్రీకరణ లేకపోతే వ్యవసాయమే లేదన్నారు. యు కొత్తపల్లి మండలం రమణక్కపేటకు చెందిన ఏ సాయిచంద్రారెడ్డి, పెద్దాపురం మండలం గోరింకకు చెందిన సాయికృష్ణ, గొల్లప్రోలు మండలం వెన్నపూడికి చందిన జి కొండయ్య, తాళ్లరేవు మండలం పి మల్లవరానికి చెందిన పి పాండురంగారావు, వ్యవసాయ రంగంలో డ్రోన్లు, పవర్ టిల్లర్ల వినియోగంతో కలిగే లాభాలను వివరించారు. మాదక ద్రవ్యాల నిరోధానికి ప్రజా సహకారం అవసరం రాజానగరం: మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే తమ సంకల్పానికి ప్రజా సహకారం కూడా ఉండాలని రాష్ట్ర ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఈగల్) ఆర్కే రవికృష్ణ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి కళాశాలలోను విద్యార్థులతో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి విద్యార్థి ఇందులో సభ్యునిగా ఉంటూ తన దృష్టికి వచ్చిన మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారాన్ని 1972 నంబర్కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. ఇందుకు సంబంధించిన కేసుల్లో నేరస్తులుగా ఎవరు పట్టుబడినా వారి భవిష్యత్తు నాశనం కాక తప్పదన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈగల్ క్లబ్లకు సంబంధించిన పోస్టర్ను గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) చాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)తో కలిసి విడుదల చేశారు. అడిషనల్ ఎస్పీ ఎన్బీ మురళీకృష్ణ, నార్త్ జోన్ డీఎస్పీ వై. శ్రీకాంత్, సీఐలు వీరయ్యగౌడ్, సూర్యమోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.నాగేంద్ర, జీజీయూ వీసీ డాక్టర్ యు.చంద్రశేఖర్, ప్రొఫెసర్ వీసీ డాక్టర్ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంవీవీఎస్ శర్మ, పాల్గొన్నారు. లేపాక్షి, ఆప్కో సావనీర్ డిజైన్ పోటీలకు ఆహ్వానంసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): లేపాక్షి హస్తకళలు, ఆప్కో హ్యాండ్లూమ్స్ సావనీర్ డిజైన్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థల ఎండీ విశ్వమనోహరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సైతం పోటీల్లో భాగస్వామ్యంగా ఉంటుందన్నారు. కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక, వుడ్ కార్వింగ్, పప్పెట్, బొబ్బిలి బొమ్మలు, కలంకారి ప్రింట్లు, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, బందరు వస్త్రాలతో నూతనత్వం ఉట్టిపడేలా కొత్త డిజైన్లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రూ.5 లక్షల వరకు నగదు బహుమతులు ఉంటాయన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చేతివృత్తులవారు, కళాఖండాలు గీసేవారు, చేతితో బొమ్మలు తయారు చేసేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. నమూనాలను జూలై 16వ తేదీలోగా రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద గల లేపాక్షి ఎంపోరియంలో అందించాలని లేపాక్షి నగర శాఖ మేనేజర్ మోనిక తెలిపారు. 23న ఒలింపిక్ డే రన్ అమలాపురం టౌన్: జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ ఉదయం జిల్లాలోని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఒలింపిక్ డే రన్లు నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ రన్ బ్రోచర్లు, సర్టిఫికెట్లను ఒలింపిక్ సంఘం ప్రతినిధులు స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించే ఈ రన్లలో వ్యాయామ ఉపాధ్యాయులు, స్పోర్ట్స్ క్లబ్ల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. -
నారుకు నీరు కరవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘ఈ ఏడాది మూడు పంటలు పండించాలి. రైతులంతా ముందస్తు సాగుకు సమాయత్తం కావాలి. జూన్ 15లోపు నారుమళ్లు వేసుకోవాలి. జూలై నెలాఖరుకు నూటికి నూరుశాతం నాట్లు పూర్తి కావాలి’ అంటూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరూవాడా ముందస్తు సాగు, ముందస్తు సాగు అంటూ చేస్తోన్న ప్రచారం అంతా ఇంతా కాదు. బాబు మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఖరీఫ్ ముందస్తు కార్యాచరణ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. జిల్లాలో ఏ ఒక్క ఆయకట్టులోను ముందస్తుకు సాగునీరు దరి చేరలేదు. నారు పోద్దామంటే నీరు లేక బీడువారిన భూములను చూసి రైతుల గుండె తరుక్కుపోతోంది. కాలువ శివారు ఆయకట్టు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ముందస్తు సాగు కోసం జూన్ ఒకటో తేదీ నాటికే పంట కాలువల్లో నీటిని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికే పక్షం రోజులు దాటిపోయింది. అయినా పొలాల్లోకి చుక్క నీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ముందస్తు, ఏటా మూడు పంటలు అంటూ ప్రభుత్వం ఆర్భాటం ఎందుకు చేస్తోందో అర్థం కావడం లేదని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఖరీఫ్ సీజన్లో రైతులు 60 నుంచి 70శాతం సొంతంగా నారు వేసి నాట్లు వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సీజన్లో సైతం రైతులు ఇందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు తగ్గట్టు సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతూ వర్షాలు, బోర్లు ఆధారంగా నారు పోసుకుంటున్నారు. కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 91,300 హెక్టార్లలో వరి సాగు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన కార్యాచరణలో పేర్కొంది. ఇందులో 57,760 హెక్టార్లలో ఎంటీయూ 7029, ఎంటీయూ 1318, 33,540 హెక్టార్లలో ఆర్జేఎల్ 2537, బీపీటీ 5204, హైబ్రీడ్ రకాలు సాగు చేయాలని సంకల్పించారు. ఇందుకోసం అన్ని రకాలు కలిపి 45,939 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామని వ్యవసాయశాఖ చెబుతోంది. జిల్లాలో అత్యధికంగా గోదావరి కాలువపై ఆధారపడి 47,928 హెక్టార్లలో వరి సాగుకు సమాయత్తం అవుతున్నట్టు వ్యవసాయశాఖ ప్రకటించింది. దమ్ము చేయడానికి అవస్థలు ప్రభుత్వం నిర్దేశించిన కార్యాచరణ కాగితాల్లో భద్రంగా ఉంది. ఆచరణలో మాత్రం మూడడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా కనిపిస్తోంది. అసలు నీరే లేకుండా చంద్రబాబు చెబుతున్నట్టు ముందస్తు సాగు ఎలా గట్టెక్కుతుందని రైతు సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో గోదావరి కాలువపై ఆధారపడి సాగుకు సమాయత్తమయ్యే పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలంలోని పలు గ్రామాల్లోని ఆయకట్టుకే నీరు పారడం లేదు. వీకే రాయపురం, మాధవపట్నం, ఉంగటూరు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లోని ఆయకట్టులో నారుమళ్లకు దమ్ములు చేద్దామంటే నీరు అందడం లేదని రైతులు మదనపడుతున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్(పీబీసీ)లో నవర, చంద్రంపాలెం, పవర తదితర శివారు ఆయకట్టులో ముందస్తు ఖరీఫ్ అసలు సాధ్యమే కాదంటున్నారు. పెదబ్రహ్మదేవం, జి మేడపాడు, వేట్లపాలెం తదితర ఆయకట్టు రైతులు ఇప్పుడిప్పుడే దమ్ములు చేసేందుకు సిద్ధమవుతున్నారు. శివారులకు అందని నీరు కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో అంతా దాదాపు శివారు ఆయకట్టే. ఇక్కడ 15వేల ఎకరాల ఆయకట్టు కాలువలకు శివారున, సముద్ర తీరాన ఉంది. కాలువలకు సాగునీరు విడిచిపెట్టి పక్షం రోజులు దాటిపోయినా ఇంతవరకు పంట పొలాలకు నీరు రాలేదు. ఖరీఫ్లో ముందస్తు సాగుకు సమాయత్తం కావాలని వ్యవసాయశాఖ చెబుతున్నా పొలాల్లోకి నీరు పారకుండా సాగు ఎలా ముందుకు వెళుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. పంట పొలాల్లోకి నీరు రాకపోవడం ఒక సమస్యకాగా, పంట కాలువలు, మురుగు కాలువలు గురప్రు డెక్క, పూడికతో పేరుకుపోయాయి. ఇప్పటికీ కాలువల్లో సాగునీరు రాకపోగా మూసుకుపోయిన పంట, మురుగుకాలువలతో చంద్రబాబు చెబుతున్నట్టు ముందస్తు సాగు ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేఎం జే కెనాల్, న్యూ భీమన్నకర్రకాలువ, గరువు కాలువ, రావువారి కాలువ, మెరక, వెల్ల నార్త్ కెనాల్, తుల్యభాగ, శహపురం, కూరాడ, జెడ్.భావారం, జి.భావారం, యండమూరు, వెంకటప్పయ్య, రాజు డ్రెయిన్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. కాలువలు కట్టేసిన నెలరోజులు ఏమీ చేయకుండా నీరు విడుదలైన తరుణంలో డ్రైన్లలో పూడిక, గుర్రపు డెక్క తొలగింపు పనులు హడావుడిగా చేసి కూటమి నేతలు జేబులు నింపుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఏలేరు ఆయకట్టుకు ఎప్పుడిస్తారో? ఏలేరు కింద సాగయ్యే సుమారు 50వేల ఎకరాల్లో ఆయకట్టుకు ఇంకా సాగునీరు విడుదల చేయలేదు. సరికదా ఎప్పుడు నీరిస్తారో కూడా చెప్పడం లేదు. ఏలేరు పరిధిలో గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కాలువలు కట్టేసి నెలరోజులైంది. ఈ సమయంలో క్లోజర్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఏలేరు గండ్లు పూడ్చివేత పనులు ఇప్పుడు హడావుడిగా మొదలు పెడుతుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ పరిధి ఆయకట్టుకు గోదావరి నీటిని విడుదల చేశారు. కానీ ఉప్పాడకొత్తపల్లి మండలం రమణక్కపేట, నాగులాపల్లి, శ్రీరామపురం సహా తొండంగి మండలంలో పలు ప్రాంతాల ఆయకట్టుకు ఇప్పటికీ సాగునీరు పారలేదు. పుష్కర, పంపా, తాండవ ఆయకట్టు పరిస్థితి ఇందుకు భిన్నమేంకాదు. పొలాలకు సాగునీరు పారకుండా ముందస్తు సాగు ఎలా చేస్తామని రైతులు నిలదీస్తున్నారు. ‘బాబు’ ముందస్తు డాబు మాటలు కాలువలకు నీరిచ్చి పక్షం రోజులు అయినా పొలాలకు చేరని వైనం ఖరీఫ్ ముందుకు సాగేదెలా? అధ్వానంగా డ్రైన్లు -
స్మార్ట్సిటీకి మేలు చేసే ఒప్పందం
బోట్క్లబ్ (కాకినాడ): ఐఐఐటీ హైదరాబాద్, కాకినాడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ పరస్పర సహకారంతో పనిచేసేందుకు ఒక ఒప్పందం చేసుకున్నాయి. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా, స్మార్ట్సిటీ అభివృద్ధికి సంబంధించిన ప్రత్యక్ష పరిశోధన, ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించనున్నారు. స్మార్ట్సిటీ వింగ్ ల్యాబ్ చీఫ్ టెక్నాలజీ ఆర్కిటెక్ వి అనురాధ నేతృత్వంలోని ప్రతినిధి బృందం , కై ట్ ప్రొఫెసర్లతో కలిసి వ్యూహాత్మక సహకార ప్రతిపాదనను సమర్పించడానికి బుధవారం కలెక్టర్ షణ్మోహన్ను కలిశారు. నగర అభివృద్ధిలో ఎదురవుతున్న ముఖ్యమైన సవాళ్లను అధిగమించడానికి ఐఐఐటీ అభివృద్ధి చేసిన వివిధ స్మార్ట్ సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలు వినియోగించేందుకు ప్రతిపాదించారు. తాగునీటి పంపిణీపై రియల్ టైమ్ మానిటరింగ్, పైపులైన్ లీకేజీల గుర్తింపు, తాగునీటి నాణ్యతపై విశ్లేషణ సాగుతాయి. ఈ భాగస్వామ్యం వల్ల స్మార్ట్ సిటీలో మౌలిక సదుపాయాలను గణనీయంగా ప్రోత్సహించే వీలుంటుంది. కలెక్టర్ను కలిసిన వారిలో కై ట్ కళాశాల అధినేత పోతుల విశ్వం ఉన్నారు. -
సీతపల్లి వాగులో ఇద్దరు యువకుల మృతి
కోటికేశవరంలో విషాదం కోరుకొండ: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం, సీతపల్లివాగులో స్నానానికి దిగి కోరుకొండ మండలం కోటికేశవరానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఇటీవల వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్టు సభ్యులు 15 మంది బుధవారం వాగులోకి స్నానాలకు దిగారు. వారిలో పీతల రాకేష్ (25), గుమ్మడి హర్ష (25) వాగు ప్రవాహ వేగానికి కాలు జారి కొట్టుకుపోయారు. ఈ క్రమంలో వాగులోని రాళ్లకు వారు బలంగా ఢీకొని మృతి చెందారు. వీరిలో రాకేష్ చిన్న కిళ్లీ దుకాణం నిర్వహిస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన అతడు మైదానంలో కట్ కొడితే ప్రత్యర్థి జట్టు సభ్యులు అడ్డుకోలేరని మంచి పేరుంది. కాగా గుమ్మడి హర్ష తల్లి కవిత సహకారంతో చిరు వ్యాపారం చేస్తున్నాడు. గ్రామ సర్పంచ్ ముడే సింధూ దివ్య, ఆమె భర్త ముడే కామేష్ ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాలకు పంచనామా తదితర కార్యకలాపాలు నిర్వహించారు. ఇసుక తవ్వుతున్న ఏడు పడవల సీజ్ తనిఖీల్లో జిల్లా మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ రెడ్డి తాళ్లపూడి: స్థానిక డీసిల్టేషన్ పాయింట్ వద్ద ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్న ఏడు పడవలను అధికారులు బుధవారం సీజ్ చేశారు. జిల్లా మైనింగ్ ఏడీ డి.ఫణిభూషణ్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీ లావణ్య, టాస్క్ఫోర్స్ ఎస్సై ఆంజనేయులు తదితరులు సాధారణ తనిఖీల్లో భాగంగా బోట్స్మన్ సొసైటీ సభ్యులు గోదావరిలో ఇసుక తవ్వకాలకు వినియోగిస్తున్న ఏడు పడవలను సీజ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుక తవ్వకాలపై నిషేధం ఉందని వారు తెలిపారు. తమకు వచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేసినట్టు ఆయన తెలిపారు. తహసీల్దార్ లక్ష్మీ లావణ్య మాట్లాడుతూ మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ పడవలను సీజ్ చేశామని తెలిపారు. కాగా ఇసుక తవ్వకాలు చేపట్టిన పడవలు ఎవరివన్న విషయమై సాయంత్రం వరకు అధికారులు తర్జనభర్జన పడ్డారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
యోగాంధ్రలో నన్నయకు రికార్డు
రాజానగరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆదికవి నన్నయ యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నిర్వహించిన ‘మెగా యోగ’ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. తెలుగు రాష్ట్రాలలో అతి పెద్ద యూనివర్సిటీ ఉన్న ‘నన్నయ’లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదే స్థాయిలో 16,123 మంది హాజరు కావడంతో, దీనిని ఒక రికార్డుగా గుర్తించిన ఆ సంస్థ నిర్వాహకులు డాక్టర్ సి.కె. రాయుడు, తాతా వెంకట వరప్రసాద్లు అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీకి అందజేసి అభినందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలలు, క్యాంపస్ల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అంచనాలకు మించి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్సలోకి ఎక్కడంతో పాటు యూనివర్సిటీ చరిత్రలో ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందన్నారు. ఇందుకు కారకులైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం యోగ సాధన చేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నారు. మానసిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు మేథో సంపత్తిని వృద్ధి చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇది ఎంతో అవసరమన్నారు. యోగాసనాలతో అబ్బురపరిచారు యూనివర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్పెట్లపై విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వేసిన యోగాసనాలు ఆబ్బురపరిచాయి. కానవరంలోని రాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా ప్రతినిధుల పర్యవేక్షణలో యోగాసనాలు వేశారు. రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తదితరులు పాల్గొన్నారు. గోదావరి జిల్లాల నుంచి 16,123 మంది హాజరు -
వేతనాల ఆలస్యం రివాజే!
అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. 18వ తేదీ వచ్చినా ఈ నెల జీతాల బిల్లు సిద్ధం చేసిన దాఖలాలు లేకపోవడంతో దేవస్థానంలోని 349 మంది కార్మికులు మూడో నెలలో కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. బిల్లు తయారై ఆడిట్కు వెళ్లి పాసై వస్తే అప్పుడు చెక్కుపై ఈఓ సంతకం చేయడం, దానిని ఆన్లైన్లో కాంట్రాక్టర్కు బదలాయించడం, ఆయన సదరు కార్మికుల అకౌంట్లలో జమచేయడం ఈ ప్రక్రియంతా కనీసం వారం రోజుల ప్రహసనం. అంటే 25వ తేదీ దాటితే తప్ప కార్మికులకు మే నెల జీతాలు పడని పరిస్థితి. గత రెండు నెలలూ ఆలస్యమే.. ఆలయంలో కార్మికులకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం రివాజైపోయింది. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 30న, ఏప్రిల్ నెల జీతాలు మే 28న చెల్లించారు. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ...? అంటూ సాక్షిలో ప్రచురితమైన కథనానికి, మే 26న ప్రచురితమైన ‘వీరి కష్టం తుడిచేవారేరీ’ కథనాలకు స్పందించి అధికారులు ఆ తేదీలకై నా వారి అకౌంట్లలో జమ చేయగలిగారు. ఇందులో కూడా ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.లక్ష కోత పెట్టి రూ.58 లక్షలు విడుదల చేశారు. అయితే మొత్తం నిధులు వస్తేకానీ చెల్లించనని కాంట్రాక్టర్ చెప్పడంతో జూన్ ఒకటో తేదీకి కానీ జమ చేయలేదు. కాంట్రాక్టర్ వల్లే ఆలస్యం దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సరఫరా చేస్తున్న గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీ సకాలంలో పీఎఫ్ జమ చేయకపోవడం, బిల్లు అందచేయకపోవడం వల్లే జీతాల చెల్లింపు ఆలస్యమవుతోందని అధికారులు పదే పదే చెప్తున్నారు. ఏజెన్సీకి స్థోమత లేకపోయినా.. హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్థ రెండేళ్లకు పైగా దేవస్థానంలో పారిశుధ్య విధులు నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెల పదో తేదీనే సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసినా టెండర్ ద్వారా కొత్త సంస్థను కాంట్రాక్టుకు ఎంపిక చేసే వరకు విధులు కొనసాగించాలని అధికారులు కోరడంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు కాంట్రాక్టు కొనసాగింది. మార్చి ఒకటో తేదీ నుంచి ఆ కాంట్రాక్టు గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ఆ సంస్ధకు 349 మందికి జీతాలు ఇచ్చే స్థోమత లేకపోయినా అధికారులు నామినేషన్ పద్ధతిపై ఇచ్చినట్టుగా హడావిడిగా విధులు కట్టబెట్టారు. దీంతో ఆ సంస్థపై ఏ విధమైన చర్యలూ తీసుకోలేని పరిస్థితిని అధికారులే కల్పించుకున్నారు. కానీ సకాలంలో జీతాలు అందక పారిశుధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తాం రాజమహేంద్రవరం రూరల్: పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయిన బాధితురాలికి అన్ని విధాలా న్యాయం చేస్తామని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి బి.శశాంక ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక మహిళ తన కుమార్తెను పులవర్తి సత్యదేవ్ తన కుమార్తెను ప్రేమించి మోసం చేశాడని ఓ మహిళ కలెక్టర్ కార్యాలయంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళాభివృద్ధి, సంక్షేమశాఖ, వన్స్టాప్ సెంటర్ విచారణ జరిపింది. బొమ్మూరు పోలీస్స్టేషన్లో పలుమార్లు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని, తమకు పదిరోజులు గడువు కావాలని కోరగా, బొమ్మూరు ఇన్స్పెక్టర్ వారం రోజులు గడువు ఇచ్చారని పేర్కొన్నారు. బాధితురాలిని సత్యదేవ్ వివాహం చేసుకోవడానికి నిరాకరించడంతో ఈనెల 13న అతనిపై పోక్సో కేసు నమోదు చేశారని, ప్రస్తుతం అతడు రిమాండ్పై సెంట్రల్ జైల్లో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారన్నారు. ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఉంచారన్నారు. రత్నగిరిపై కొనసాగుతున్న పారిశుధ్య కార్మికుల కష్టాలు వరుసగా మూడో నెలా ఆలస్యం సగం నెల దాటినా సిద్ధం కాని బిల్లు -
మరిడమ్మ జాతరకు పటిష్ట భద్రత
కాకినాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీహరిరాజు కరప: ఈనెల 25వ తేదీ నుంచి 40 రోజుల పాటు జరిగే మరిడమ్మ జాతర మహోత్సవంలో భక్తులకు అసౌక్యం కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు పెద్దాపురం డీఎస్పీ, కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తునకు కరప ఎస్ఐ టి.సునీతతో చర్చించేందుకు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దాపురంలో అమ్మవారి దర్శనానికి ఆది, మంగళ, గురువారాల్లో వేలాదిగా భక్తులు తరలివచ్చే నేపథ్యంలో క్యూలైన్లు, వివిధ శాఖల సమన్వయంపై ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. బాలిక అదృశ్యంపై దర్యాప్తు బాలిక అదృశ్యం కేసుపై ఎస్ఐతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు, బంధువులు డీఎస్పీని కలసి తమగోడు వినిపించారు. బాలికను కిడ్నాప్ చేసినట్టు భావిస్తున్న యువకుడి తండ్రిని పిలిపించి మాట్లాడారు. కిడ్నాప్ కేసుతో పాటు, పోక్సో కేసు పెట్టాల్సి ఉంటుందని, ఎక్కడున్నా వెంటనే సమాచారం చెప్పాలని యువకుడి తండ్రికి డీఎస్పీ సూచించారు. ఆర్డీఓ, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేస్తామని ఆయన హెచ్చరించారు. బాలిక అదృశ్యానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని, బాలిక వివరాల ముఖ్యమైన నగరాల్లోని పోలీసులకు పంపినట్టు ఆయన తెలిపారు. అనంతరం కరపలోని పురాతన శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లి స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. అర్చకులు విలపర్తి శ్రీనివాస్, విలపర్తి సత్యకృష్ణ, పెద్దింటి గోపాలకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం ఇచ్చారు. -
పైసలిస్తేనే పోస్టింగ్!
రీ వెరిఫికేషన్ పూర్తి కాకినాడ క్రైం: సచివాలయం ఏఎన్ఎంల నుంచి ఎంపీహెచ్ఏఎఫ్లుగా పదోన్నతులు పొందిన అభ్యర్థుల కౌన్సిలింగ్ రీవెరిఫికేషన్ బుధవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఉమ్మడి తూర్పుగోదావరికి చెందిన 390 మందికి కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయంలో డిఎంహెచ్ఓ డాక్టర్ నరసింహంనాయక్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరిగింది. తాజా ప్రక్రియలో ఇద్దరు అనర్హులను, గత ఆదివారం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో బృందాన్ని మోసగించి పదోన్నతులు పొందిన ఇద్దరు సచివాలయ ఏఎన్ఎంలను గుర్తించారు. ఓ ఏఎన్ఎం వివాహితురాలు అయినప్పటికీ అవివాహిత హోదాలో బదిలీ ప్రయోజనం పొందింది. మరో ఏఎన్ఎం ప్రొహిబిషన్ డిక్లేర్ కాకపోయినా బదిలీలకు హాజరై తనకు అనుకూలమైన స్థానాన్ని పొందింది. వీరద్దరిని డీఎంహెచ్ఓ బుధవారం నాటి రీవెరిఫికేషన్లో గుర్తించారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా 388 మందికి నియామక పత్రాలు అందజేశారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతుల కౌన్సెలింగ్లో అవినీతి జాతర సాగుతోంది. కొందరి అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కాసులిస్తేనే పదోన్నతులు, కోరుకున్న కుర్చీలు దక్కుతున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కొక్క రేటు నిర్ణయించి ముక్కుపిండి మరీ వసూళ్లకు పాల్పడ్డారు. పదోన్నతుల బాగోతంలో లక్షలు చేతులు మారాయి. సాధారణంగా పదోన్నతులు వచ్చినప్పుడు ఏ స్థాయిలో ఉన్నా ఉద్యోగులు తలా ఇంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. ఇటువంటివన్నీ ఉద్యోగులు సంతృప్తి కోసం సంతోషంగా ఇస్తుంటారు. ఏ శాఖలో అయినా ఇదేమీ కొత్త కూడా కాదు. ఎటొచ్చీ పదోన్నతులకు ఒక రేటు, కోరుకున్న సీటు కోసం మరొక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడటమే ఈ సారి సంబంఽధిత శాఖలో హాట్టాపిక్గా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ పదోన్నతులు కాకినాడ డీఎంహెచ్ఓ నోడల్ అధికారి వ్యవహరిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలకు ఏఎన్ఎంలుగా పదోన్నతుల కౌన్సెలింగ్ జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 830 సబ్ సెంటర్లలో సుమారు 400 సబ్ సెంటర్లలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందుకోసం గత ఆదివారం ఉదయం నుంచి తెల్లవారుజాము వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ కౌన్సెలింగ్లో భార్య, భర్తలు, వితంతువులు, పెళ్లికాని వారు, అనారోగ్య సమస్యలున్న వారికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 60 మందికి పోస్టింగులు ఇచ్చారు. 340 సబ్ సెంటర్లలో ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించేందుకు సాధారణ కౌన్సెలింగ్ నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే హెల్త్ సెక్రటరీలు ఏఎన్ఎంలుగా పదోన్నతి కోసం క్యూ కట్టారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారికి ఏఎన్ఎంలుగా పదోన్నతి కల్పించాలని గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జరిపిన కౌన్సెలింగ్కు ముందుగానే ఆ శాఖలోని కొందరు చేతివాటం చూపించారు. ఇందుకోసం ఒక రేటు కూడా నిర్ణయించి వసూళ్ల పర్వానికి తెరతీశారు. పదోన్నతి పొందిన వారికి సీటు కేటాయించే సందర్భంలో సొమ్ములు గుంజారు. రూ.4000 నుంచి రూ.5000 వంతున వసూలు చేశారు. ఇలా రూ.20 లక్షలు వరకు ముడుపులు వసూలుచేశారు. ఇందులో వైద్య ఆరోగ్యాన్ని పర్యవేక్షించే ఒకరికి 50 శాతం, పరిపాలనా వ్యవహారాలు చక్కబెట్టే దిగువ స్థాయి వారు 20 శాతం, క్షేత్ర స్థాయిలో వ్యవహారాలు చక్కబెట్టే వారికి 30 శాతం వంతున వాటాలు వేసుకున్నారు. కృష్ణా జిల్లా నుంచి వచ్చి కాకినాడలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న ఒక ఉద్యోగి, ఎపిడిమిక్ విభాగంలో మరొకరు, ఏఎన్ఎం సంఘంలో ముగ్గురు కలిసి ఈ మొత్తం అవినీతి బాగోతాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెట్టి సొమ్ము చేసుకున్నారు. పదోన్నతులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను బ్లాక్లో పెట్టి సొమ్ములు ఇచ్చిన వారికి కోరుకున్న పోస్టింగ్లు కట్టబేట్టేశారు. ఇలా పోస్టింగ్లు అందుకున్న వారి నుంచి రూ.30 వేలు వంతున వసూలు చేసి మూటగట్టేసుకున్నారు. ఇలా మరో తొమ్మిది లక్షలు ముడుపులు మెక్కి పోస్టింగ్లు ఇచ్చేశారనే విమర్శలు వెళ్లువెత్తాయి. ఇలా సొమ్ములు తీసుకున్న వ్యవహారంలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో వైద్యుల వ్యహారాలు పర్యవేక్షించే ఒకరు, పరిపాలనా విభాగంలో మరొకరు సూత్రధారులుగా వ్యవహరించారు. ఈ లంచావతారాలతో విసుగెత్తిపోయిన ఐదుగురు ఏఎన్ఎంలు వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలికి చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చి కథ అడ్డం తిరిగింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ రీ కౌన్సెలింగ్ జరపాలని ఆదేశాలు చేశారు. దీంతో బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. వేలకు వేలు సొమ్ములు ముట్టచెప్పి పోస్టింగులు పొందిన వారి పరిస్థితి రీ కౌన్సెలింగ్తో కుడితిలో పడ్డ ఎలుక చందంగా తయారైంది. సొమ్ములు ఇచ్చి కోరుకున్న పోస్టింగులు పొందిన వారి స్థానాలు తాజా కౌన్సెలింగ్లో మారిపోతున్నాయి. దీంతో గత ఆదివారం ఇచ్చిన సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని సదరు సూత్రధారులపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలియవచ్చింది. సొమ్ములు తిరిగి ఎలా ఇవ్వగలుగుతామని, ఏదో రకంగా సర్దుబాటు చేస్తామని బుజ్జగిస్తున్నారు. రీ కౌన్సెలింగ్ పూర్తయ్యి చివరకు ఈ వ్యవహారం ఏ మలుపు తీసుకోనుందో వేచి చూడాల్సిందే. వైద్య, ఆరోగ్య శాఖలో పదోన్నతుల కౌన్సెలింగ్ పోస్టుకో రేటు నిర్ణయం కలెక్టర్కు ఫిర్యాదు చేసిన పలువురు ఏఎన్ఎంలు ఆయన ఆదేశాలతో రీ కౌన్సెలింగ్ సొమ్ము తిరిగి ఇవ్వాలని మెక్కిన వారిపై ఒత్తిడి -
అధినేతతో భేటీ
తొండంగి: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన మడదా హేమంత్ తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం కలిశారు. రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా మడదా హేమంత్ను ఇటీవల నియమించారు. ఈ నేపథ్యంలో మర్యాద పూర్వకంగా వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో కలిసి జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
చేనుకు చేప మందు
ప్రయోజనాలు ఇవే.. ● ఫిష్ అమినో యాసిడ్లో నత్రజని శాతం ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు తొందరగా పెరుగుతాయి. ● స్వల్ప కాలిక పంటలైన కూరగాయలు, వరి, పప్పు దినుసులకు మొదటి 40 రోజులు చాలా కీలకమైనవి. వాటి పెరుగుదల పైన మాత్రమే దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేస్తే యూరియా, డీఏపీ ఎరువుల కంటే ఎక్కువ బలాన్ని పంటకు ఇస్తుంది. ● 40 రోజుల తర్వాత పది రోజులకు ఒకసారి ఇతర ద్రవాలతో కలిపి దీనిని వాడుకోవచ్చు. దీనిని వాడడం వల్ల మొక్క ఆకులు బాగా పచ్చబడటం, కొమ్మలు బాగా రావటం, కాయ సైజు బాగా పెరగడం జరుగుతుంది. ● నత్రజనితో పాటు ఇతర పోషకాలు ఉండటం వల్ల పూత, పిందె ఎక్కువ మొత్తంలో వస్తుంది. పిఠాపురం: సాధారణంగా ఉబ్బసానికి చేప మందు వేయడం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో చేపలతో చేలకు మందు తయారు చేస్తున్నారు. దాన్నే ఫిష్ అమినో యాసిడ్ మీనామృతం అని పిలుస్తున్నారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలోని గో గాయత్రి ప్రకృతి వ్యవసాయ వనరుల తయారీ శిక్షణ కేంద్రంలో ఈ ఏడాది అధిక మొత్తంలో మీనామృతం తయారీ చేపట్టారు. రోజుకు 300 లీటర్ల మీనామృతం తయారు చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి నుంచి వివిధ జిల్లాలకు ఈ మందును పంపిణీ చేయనున్నారు. మీనామృతం తయారీఽ విధానాన్ని ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకుడు గుండ్ర శివచక్రం వివరించారు. మీనామృతం మీనామృతం తయారీకి చేపలు, బెల్లం, బొగ్గు, దేశీయ ఆవు మూత్రం అవసరమవుతుంది. ముందుగా చేపలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చేప లోపలి భాగాలను కూడా వినియోగించుకోవచ్చు. వాటిని పారవేయాల్సిన అవసరం లేదు. ముందుగా కత్తిరించిన చేపలు ఎన్ని కేజీలున్నాయో తూకం వేసి సిద్ధం చేసుకోవాలి. అంతే మొత్తంలో బెల్లాన్ని దగ్గర పెట్టుకోవాలి. బెల్లాన్ని పొడిగా దంచుకోవాలి. 200 లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ములు తీసుకోవాలి. వాటిని ముందుగానే శుభ్రం చేసుకోవాలి. మీనామృతం కలపడానికి ఒక పెద్ద గిన్నె లేదా టబ్ అవసరం. అది పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. తయారీ విధానం పెద్ద గిన్నె లేదా టబ్లో 10 కేజీల చేపలు, 10 కేజీల బెల్లం, 100 గ్రాముల బొగ్గు పొడి, ఒక లీటర్ ఆవు మూత్రం పోసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఎన్ని కేజీల చేపలు ఉంటే అన్నిసార్లు కలుపుకొని డ్రమ్ములో వేసుకోవాలి. వీటిని కలిపే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. పాత్రలు శుభ్రంగా ఉండేలా చూడాలి. తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే చేపలు ఎన్ని ఉన్నాయో అంచనా వేసుకొని అందుకు తగిన విధంగా డ్రమ్ములు సిద్ధం చేసుకోవాలి. జాగ్రత్తలు తప్పనిసరి డ్రమ్ములో కలిపిన చేపలు వేసినప్పుడు 60 శాతం మాత్రమే నింపాలి. లేకపోతే రెండో రోజు పొంగిపోయే అవకాశం ఉంటుంది. డ్రమ్ము 60 శాతం నింపిన తరువాత దానిని కప్పేందుకు సరిపడా ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ సంచితో మూతిని గట్టిగా కట్టాలి. దీన్ని ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సవ్య దిశలో ఐదు నిమిషాల పాటు కర్రతో కలుపుతూ ఉండాలి. అనంతరం కర్రను శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. లేకపోతే వాటిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి, దానితో ద్రవాన్ని కలిపినప్పుడు పురుగులు తయారయ్యే ప్రమాదం ఉంటుంది. ద్రవాన్ని కలిపిన అనంతరం డ్రమ్ముకు కవర్ కట్టి వేయాలి. ఇలా 20 నుంచి 25 రోజులలో ద్రావణం తయారవుతుంది. సుమారు 20 రోజుల తర్వాత ద్రావణం నుంచి తాటి పండు వాసన వస్తుంది. అలా వాసన వస్తే ద్రావణం ఉపయోగించడానికి వీలుగా తయారైనట్లు గుర్తించాలి. ఉపయోగించే విధానం మొక్కలు నారుదశలో ఉన్నప్పుడు వంద లీటర్ల నీటికి 250 గ్రాముల ద్రావణం సరిపోతుంది. చిన్న మొక్కలైతే 500 గ్రాములు, పెద్దవైతే ఒక కేజీ వరకూ వాడుకోవచ్చు. స్ప్రే చేసినప్పుడు ఫలితం తొందరగా కనిపిస్తుంది. ఎకరానికి ఐదు నుంచి పది కేజీల వరకూ ఉపయోగించుకోవాలి. ఈ ఫిష్ అమినో యాసిడ్ నీటిలో కలిపే ముందు ఒక కేజీ ద్రావణాన్ని ఐదు లీటర్ల నీటిలో బాగా కలుపుకొని, ఫిల్టర్ చేసుకోవాలి. దాన్ని వంద లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రకృతి వ్యవసాయంలో చేపలతో మీనామృతం తయారీ దుర్గాడలో ఖరీఫ్కు సిద్ధమవుతున్న ద్రావణం -
నిలకడగా డయేరియా రోగుల ఆరోగ్యం
రౌతులపూడి: డయేరియాతో బాధపడుతూ రౌతులపూడి సీహెచ్సీలో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వైద్యాధికారిణి మంగళవారం జానకీదేవి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 44 మందికిగాను ఆరోగ్యం మెరుగుపడిన ఏడుగురిని మంగళవారం డిశ్చార్జి చేయగా సత్యవరం గ్రామానికి చెందిన మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వారందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో జిల్లా రాపిడ్ రెస్సాన్స్ బృంద సభ్యులు డాక్టర్ వి.అరవింద్ కుమార్, డాక్టర్ వి.సత్యచంద్రిక, డాక్టర్ ఎస్.రుక్మిణీదేవి మాట్లాడారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్స, తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. మెరుగైన చికిత్స నందించేందుకు అవసరమైన సూచనలను సీహెచ్సీ వైద్యులకు సూచించారు. డయేరియా ప్రబలిన సబ్ప్లాన్ ఏజెన్సీకి చెందిన దబ్బాది, సత్యవరం గ్రామాల్లో తాగునీరు, ఆహార దినుసులు, తదితర శాంపిల్స్ను సేకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. సీహెచ్సీ వైద్యులు డాక్టర్ పావని పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
పెరవలి: గంజాయి తరలిస్తున్న ఐదుగురిని పెరవలిలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకుకు చెందిన పాలుమూరి సాగర్, కానూరు అగ్రహారానికి చెందిన కర్సినపు ప్రవీణ్ కుమార్, నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ సలీం, కొవ్వూరు మండలం మద్దూరు గ్రామానికి చెందిన తగరపు వెంకట్, వర్దణపు మణి తదితరులు మూడు కిలోల గంజాయిని రవాణా చేయటానికి ప్రణాళిక వేసుకున్నారు. వీరందరూ పెరవలిలోని హిందూ శ్మశానవాటిక సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గమనించారు. అనుమానంతో వారిని పట్టుకుని తనిఖీ చేయగా మూడు కిలోల గంజాయి దొరికింది. దానితో పాటు రెండు మోటారు సైకిళ్లను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు ఐదుగురినీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి తణుకు కోర్టులో మంగళవారం హాజరు పరిచారు. గంజాయి కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు కోరుకొండ: గంజాయి కేసులో ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ను కోరుకొండ పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్టు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. కోరుకొండ పోలీసుస్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చింతపల్లి నుంచి తీసుకొచ్చిన రెండు కేజీల గంజాయిని కోరుకొండ మండలం అయ్యన్నగళ్లు వద్ద పంచుకుంటుండగా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆ సమయంలో ఐదుగురు దొరికారని, ప్రధాన నిందితుడు కాళ్ల నరేష్ పరారయ్యాడన్నారు. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన నరేష్ కర్ణాటక, తెలంగాణా రాష్ట్రాల్లో పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్టు తెలిపారు. కాగా.. నరేష్ను అరెస్టు చేయడానికి కృషి చేసిన ఎస్సై కూన నాగరాజు, కానిస్టేబుల్ ఉదయ భాస్కర్, ప్రసాద్ అభినందించారు. సమావేశంలో కోరుకొండ సీఐ వై.సత్యకిషోర్, ఎస్సై కూన నాగరాజు పాల్గొన్నారు. -
‘నన్నయ’ రిజిస్ట్రార్గా సుధాకర్ పదవీ విరమణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిజిస్టార్గా ఆచార్య జి.సుధాకర్ పదవీ విరమణ చేశారు. ఈ మేరకు యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయనను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఘనంగా సన్మానించి, జ్ఞాపిక అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2023 ఆగస్టు 23 నుంచి రిజిస్ట్రార్గా సుధాకర్ విశిష్ట సేవలందించారన్నారు. ‘నన్నయ’ యూనివర్సిటీ అభివృద్ధిలో ఒక రిజిస్ట్రార్గా భాగస్వామినైనందుకు ఆనందంగా ఉందని ఆచార్య సుధాకర్ పేర్కొన్నారు. కాగా.. సుధాకర్ ఇక నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో హ్యుమన్ జెనిటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించనున్నారు. ఇదిలావుండగా ‘నన్నయ’ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్గా అకడమిక్ డీన్ ఆచార్య కేవీ స్వామిని నియమిస్తూ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ ఉత్తర్వులు జారీ చేశారు. దేవదాయశాఖ ఆస్తులను పరిరక్షించాలి బోట్క్లబ్ (కాకినాడ): ఆలయాలు, సత్రాలకు సంబంధించిన భూములు, ఖాళీ స్థలాలు ఆక్రమణకు గురైతే కోర్టులో కేసులు దాఖలు చేయాలని జిల్లా దేవదాయశాఖాధికారి కె.నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ నగరంలోని ఆలయ, సత్రాలకు సంబంధించిన ఈవోలతో మంగళవారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దేవదాయశాఖకు చెందిన ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఆయా ఆలయ ఈఓ, సత్రాల ఈవోలపైనే ఉందన్నారు. నగరం పరిధిలో ఉన్న ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములు, ఖాళీ స్థలాలు అన్నీ ఆన్లైన్లో ఆయా సత్రాలు, ఆలయాల పేరున ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు. భూములు ఏమైనా ఆక్రమణలో ఉంటే వాటిని ఖాళీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆ శాఖ కాకినాడ డివిజన్ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణీంద్ర కుమార్ పాల్గొన్నారు. -
సచివాలయాల వారీగా తల్లికి వందనానికి కరెంటు షాక్కు ఇవిగో ఉదాహరణలు
సచివాలయం అర్హులు అనర్హులు విద్యుత్ బిల్లులతో అనర్హులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: తల్లికి వందనంలో తల్లులకు విద్యుత్ బిల్లులు షాక్ కొడుతున్నాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం ఇస్తామంటూ ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దల మాటలు నీటి మూటలే అయ్యాయి. పథకం అమలుకు వచ్చేసరికి సవాలక్ష కొర్రీలతో సగానికి సగం మందిపై అనర్హత వేటు వేశారు. గ్రామ సచివాలయాల్లో ప్రకటించిన తల్లికి వందనం జాబితాలు చూసి తల్లులు లబోదిబోమంటూ రోడ్డెక్కుతున్నారు. ప్రధానంగా ఎక్కువ మందికి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించి ఉందనే కారణం చూపించి తల్లికి వందనం లేకుండా చేశారు. విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన ఏడాది విద్యుత్ బిల్లులను నెలవారీగా లెక్క తీసినా 300 యూనిట్లలోపు వచ్చిన వారిని కూడా అనర్హుల జాబితాలో చేర్చడంపై తల్లులు మండిపడుతున్నారు. ఇదేం అన్యాయమంటూ కూటమి సర్కార్ తీరును నిరసిస్తూ విద్యుత్ కార్యాలయాలకు పోటెత్తారు. కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంతో పాటు పెద్దాపురం నియోజకవర్గంలో సైతం తల్లులు ఆగ్రహంతో విద్యుత్ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భూమి ఎక్కువ ఉందని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులని, కారు ఉందని, 300 యూనిట్లు మించి విద్యుత్ బిల్లు వచ్చిందనే కారణాలతో అనర్హులుగా తేల్చి, పలువురిని తల్లికి వందనానికి దూరం చేశారు. కరెంటు మీటర్ లేకపోయినా.. కూటమి సర్కార్ అనర్హత వేటు వేసిన వారిలో కొందరి పేరున అసలు విద్యుత్ మీటర్లే లేవు. అయినప్పటికీ 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించారంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. ఏడాది కాలంలో ఏ ఒక్క నెలలోనూ 300 యూనిట్ల విద్యుత్ వినియోగం రాలేదని పలువురు తల్లులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆ బెంచ్మార్క్ దాటిందనే కారణంతో తల్లికి వందనం లేకుండా చేశారని మండిపడుతున్నారు. కొందరి పేరున 4 నుంచి 10, 15 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు రికార్డయ్యాయి. వాటిని చూసి తల్లికి వందనం లేకుండా చేశారని కొందరు తల్లులు విద్యుత్ అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఒకే మీటర్ ఉన్నప్పటికీ, తమ పేరిట ఇన్ని మీటర్లు ఉన్నట్టు ఎలా చూపుతున్నారని నిలదీశారు. తల్లికి వందనం లబ్ధిదారుల సంఖ్యను కుదించేందుకే ప్రభుత్వం ఇలా చేసి ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతరుల మొబైల్ నంబర్లతో ఆధార్ లింక్ అయినందువల్లనే ఈ సమస్య వచ్చి ఉంటుందని ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు పిఠాపురం, సామర్లకోట, తుని, కాకినాడ సహా అన్ని మండలాల్లోని సబ్ స్టేషన్ల వద్ద ఆరు నెలల స్టేట్మెంట్ల కోసం బారులు తీరి కనిపించారు. ఈపీడీసీఎల్ నుంచి ఈ స్టేట్మెంట్లు తెచ్చుకుని, అందజేస్తే తల్లికి వందనం దరఖాస్తులు పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కొర్రీలతో అన్యాయమైపోయిన తల్లులు జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నారని తెలుస్తోంది. మీటరే లేదు.. 300 యూనిట్లు ఎక్కడొచ్చాయి నా భర్త చక్కపల్లి వీర వెంకట అప్పారావు వ్యవసాయమే ఆధారంగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. మా కుమార్తె సాయి లక్ష్మి 2వ తరగతి, కుమారుడు ఒకటో తరగతి చదువుతున్నారు. నా పేరున కానీ, నా భర్త పేరున కానీ విద్యుత్ మీటరు లేదు. మాకు 300 యూనిట్ల కంటే ఎక్కువ బిల్లు వచ్చిందని తల్లికి వందనం పథకం లేకుండా చేశారు. విద్యుత్ మీటరు మా పేరున లేకపోయినా బిల్లు ఎలా చూపిస్తోందో అర్థం కావడం లేదు. – చక్కపల్లి రమ్య, పోతులూరు, ప్రత్తిపాడు రూరల్ జగ్గంపేట మండలం జగ్గంపేట–1 591 174 90 జగ్గంపేట–2 593 196 96 పెద్దాపురం మండలం కట్టమూరు–1 443 64 39 కట్టమూరు–2 567 53 37 సామర్లకోట మండలం సామర్లకోట–7 392 103 56 సామర్లకోట–11 277 83 34 కిర్లంపూడి మండలం జగపతినగరం–1 440 66 32 జగపతినగరం–2 456 81 43 చిల్లంగి–3 456 81 43 తాళ్లరేవు మండలం తాళ్లరేవు–1 428 187 90 తాళ్లరేవు–2 517 97 52 కరప మండలం కరప–1 490 96 27 కరప–2 175 45 19 కోటనందూరు మండలం కాకరాపల్లి 265 57 37 కోటనందూరు–2 379 91 46 కాకినాడ రూరల్ మండలం వలసపాకల–1 351 168 100 వాకలపూడి–3 291 209 90 కాకినాడ అర్బన్ మండలం 41వ డివిజన్ సచివాలయం 523 232 120 ప్రత్తిపాడు మండలం ఇ.గోకవరం 347 36 20 పిఠాపురం మండలం పిఠాపురం–3 425 151 85 పిఠాపురం డ్రైవర్స్ కాలనీ 239 68 30 ·˘ ™èlÍÏMìS Ð]l…§ýl¯é°MìS Mö{ÈÌS™ø Mø™èlË$ ·˘ ÆøyðlzMìSP¯]l Ð]l$íßæâýæË$ ·˘ 300 ĶæÊ°rÏ MýSsꋜOò³ Ð]l$…yìl´ër$ ·˘ A¯]lÆý‡$áÌZÏ çÜVýS… Ð]l$…¨MìS C§ól çÜÐ]l$çÜÅ ·˘ ѧýl$Å™Œæ M>Æ>ÅÌSĶæ$… Ð]l§ýlª మహిళల బారులు ˘ వేరే వాళ్ల కరెంట్ మీటర్లు కలిపేస్తే ఎలా? అద్దె షాపులో సెలూన్ నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. నాలుగు రోజులు పనుంటే రెండు రోజులు ఉండదు. దీంతో, చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. కరప నక్కా సూర్యనారాయణమూర్తి జెడ్పీ హైస్కూలులో పెద్ద కుమార్తె హర్షిత 10, కుష్మిత 7వ తరగతి చదువుతున్నారు. తల్లికి వందనం పథకంలో ఇద్దరు పిల్లలకూ డబ్బులొస్తాయని ఎదురు చూస్తూంటే కరెంట్ బిల్లు ఎక్కువని ఆపేశారు. మాకు కరెంట్ బిల్లు ఎప్పుడూ 180 యూనిట్లకు మించి రాలేదు. కరెంట్ ఆఫీసుకు వెళితే ఆరు నెలల బిల్లులు చూసి, నెలకు సరాసరిన 194 యూనిట్ల వంతున కరెంట్ వాడుకున్నట్టు సర్టిఫికెట్ ఇచ్చారు. కరెంట్ ఎక్కువ వాడకుండానే వాడినట్లు ఇవ్వడమేమిటో అయోమయంగా ఉంది. – మల్లువలస నాగమణి, పాపారావు దంపతులు, రామకంచిరాజు నగర్ కాలనీ, కరప కరెంట్ బిల్లు సాకుతో కోత పెట్టారు మా కుమార్తె గీతిక 7వ తరగతి చదువుతోంది. కరెంట్ బిల్లు అధికంగా వచ్చిందనే కారణం చూపించి తల్లికి వందనం డబ్బు ఇవ్వలేదు. చదువుకునే పిల్లలకు వచ్చే డబ్బులకు, కరెంట్ బిల్లులకు ముడిపెట్టడం సరికాదు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎటువంటి అడ్డంకులూ లేకుండానే మాకు అమ్మ ఒడి డబ్బు వచ్చింది. ఈ ప్రభుత్వంలో అధిక విద్యుత్ బిల్లు వచ్చిందంటూ అనర్హుల జాబితాలో చేర్చారు. – పెంటకోట సుధావాణి, కిర్లంపూడి ఫ తల్లికి వందనానికి కొర్రీలతో కోతలు ఫ రోడ్డెక్కిన మహిళలు ఫ 300 యూనిట్ల కటాఫ్పై మండిపాటు ఫ అనర్హుల్లో సగం మందికి ఇదే సమస్య ఫ విద్యుత్ కార్యాలయం వద్ద మహిళల బారులు -
తొమ్మిది మందికి రిమాండ్
ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో జరిగిన పరస్పర దాడులకు సంబంధించి తొమ్మిది మంది నిందితులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు రిమాండు విధించింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక యర్ర కాలనీ సమీపంలో ఈ నెల 15వ తేదీ రాత్రి పెనికేరుకు చెందిన కె.రోహిత్, చింతలూరుకు చెందిన పి.తేజ వర్గాల మధ్య కొట్లాట జరిగింది. ఈ సందర్భంగా ఒక వర్గంపై మరొక వర్గం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై 15 మంది నిందితులను గుర్తించి సోమవారం కేసు నమోదు చేశారు. వారిలో ఇప్పటికే అరెస్ట్ చేసిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఐ.ప్రవీణ్ కుమార్ 15 రోజుల రిమాండు విధించారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వెళ్లింది 31 మంది... వచ్చింది 50 మంది నర్సింగ్ ఆఫీసర్ల కౌన్సెలింగ్ పూర్తి కాకినాడ క్రైం: సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న నర్సింగ్ ఆఫీసర్లకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. జీజీహెచ్లోని కమ్యూనిటీ హాల్లో వెబ్ ద్వారా నిర్వహించిన ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పర్యవేక్షించారు. జీజీహెచ్లో తొలి నుంచి 24 ఖాళీ స్టాఫ్ నర్సుల పోస్టులు ఉండగా, ఉన్న వారి నుంచి 31 మంది బదిలీ అయ్యారు. దీంతో మొత్తం 55 ఖాళీలు ఏర్పడ్డాయి. మంగళవారం నాటి కౌన్సెలింగ్ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి 50 మంది స్టాఫ్ నర్సులు కొత్తగా కాకినాడ జీజీహెచ్కు బదిలీ అయ్యారు. దీంతో సింహభాగం భర్తీ అయి, మరో ఐదు ఖాళీలు మిగిలాయి. అలాగే, జీజీహెచ్లో పనిచేస్తున్న హెడ్ నర్సులు 9 మంది బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఒక్కరు కూడా చేరలేదు. స్టాఫ్ నర్సులకు పదోన్నతులు వచ్చే వరకు ఈ స్థానాలు భర్తీ అయ్యే ప్రసక్తే లేదు. ఈ పరిస్థితి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. స్టేషన్ సీనియారిటీని అనుసరించి బదిలీ అయిన వీరంతా రాజమహేంద్రవరం, విజయవాడ, ఏలూరు, మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రులకు వెళ్లారు. అలాగే నర్సింగ్ ట్యూటర్లలో ఓ పోస్టు రిటెన్షన్ అయి దరఖాస్తుదారు అదే స్థానంలో కొనసాగనున్నారు. మరో పోస్టు ఖాళీగా ఉండగా తాజా బదిలీలో భర్తీ అయ్యింది. -
ట్రాక్టర్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చాగల్లు: ఆగి ఉన్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో బస్సులోని ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నిడదవోలు – పంగిడి రహదారిలోని ఎస్.ముప్పవరం శివారులో ఇసుక ట్రాక్టర్ ఆగి ఉంది. దాన్ని పోలవరం నుంచి నిడదవోలు వెళుతున్న నిడదవోలు డిపోకు చెందిన బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం ధ్వంసమైంది. అలాగే బస్సు ఢీకొనడంతో ట్రాక్టర్ ఇంజిన్ ఆన్ అయ్యి సమీపంలో ఇంటి గేటును ఢీకొని ట్రక్కు బొల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న కొవ్వూరుకు చెందిన జి.వీర వెంకట సత్యనారాయణతో పాటు మరో ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగా ఉండటంతో వారిని మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానాలకు చేరవేశారు. -
వేస్ట్ ఆయిల్ ప్యూరిఫై యూనిట్లో తనిఖీలు
కాకినాడ రూరల్: సర్పవరం ఆటోనగర్లో వేస్ట్ ఆయిల్ను ప్యూరిఫై చేసి సెకండ్ గ్రేడ్ ఆయిల్, గ్రేజ్ తయారు చేసే ఎస్ఏఎఫ్ పెట్రోలియం యూనిట్పై విజిలెన్స్, సివిల్ సప్లయీస్ అధికారులు దాడులు నిర్వహించారు. రాజమహేంద్రవరం విజిలెన్స్ డీఎస్పీ తాతారావు, విజిలెన్స్ సీఐలు, కాకినాడ సివిల్ సప్లయిస్ అసిస్టెంట్ సప్లయి అధికారి ప్రసన్న లక్ష్మీదేవి, అర్బన్ టీపీ అనిల్ కుమార్ తదితరులు సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చైన్నె నుంచి ట్యాంకర్లో తీసుకువచ్చిన టర్పెన్టైన్ను గుర్తించారు. జీఎస్టీ బిల్లులు ఉన్నప్పటికి టర్పెన్టైన్లో పెట్రోలియం కంటెంట్ ఉండడంతో వాహనంతో సహా 25 వేల లీటర్ల సరుకు ఉన్నట్టు గుర్తించారు. టర్పెన్టైన్ ఉన్న వాహనంతో పాటు మరో ఖాళీ వాహనాన్ని సీజ్ చేశారు. వాహనాలు, సరకు విలువ సుమారు రూ.75 లక్షలు అధికారులు తెలిపారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలువురికి స్థానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ బలోపేతంలో భాగంగా కాకినాడ జిల్లాకు చెందిన పలువురికి రాష్ట అనుబంధ విభాగాల్లో చోటు కల్పించారు. రాష్ట్ర మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షుడిగా కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన అబ్ధుల్ బషీరుద్దీన్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా కాకినాడ సిటీ నియోజవర్గానికి చెందిన హసన్ షరీఫ్, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కాకి లక్ష్మణరావు (నాని), రాష్ట్ర ఎస్సీసెల్ సెక్రటరీగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన చిన్నాడ భీమరాజు, రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా తుని నియోజకవర్గానికి చెందిన పి.బాబూరావు, రాష్ట్ర అంగన్వాడీ విభాగం జనరల్ సెక్రటరీగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన అంబటి బొజ్జనమ్మ, రాష్ట్ర కల్చరల్ విభాగం అధికార ప్రతినిధిగా ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన దొడ్డిపట్ల సోమన్నదొర, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ జాయింట్ సెక్రటరీగా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన ఒబ్బిని వీరబాబు ఎంపికయ్యారు. ఐఎఫ్టీ నిర్మాణానికి రూ.25 కోట్లు విడుదల బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐఐఎఫ్టీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫారిన్ ట్రేడ్) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 కోట్లు విడుదల చేసిందని ఎంపీ తంగేళ్ల ఉదయ్శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తపల్లి మండలం పొన్నాడ వద్ద 229.81 కోట్ల వ్యయంతో నిర్మించే క్యాంపస్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం నిధులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంజూరు చేశాయి. కొన్ని పాఠశాలలకు మూడురోజుల సెలవు కాకినాడ సిటీ: ఈ నెల 21న విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ప్రజల సమీకరణ, బస్సుల సేకరణకు జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారన్నారు. రవాణా సౌకర్యాల ఏర్పాటు కోసం జిల్లాలోని విద్యా సంస్థలకు 19 నుంచి 21వ తేదీ వరకు మూడు రోజులు సెలవులు ఇచ్చామని కలెక్టర్ తెలిపారు. సెలవులు ప్రకటించిన పాఠశాలల జాబితాలను ఆయన ప్రకటించారు. రక్త సేకరణలో జేఎన్టీయూకేకు అవార్డు బాలాజీచెరువు: ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన రక్త సేకరణలో జేఎన్టీయూకే రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి అవార్డును సాధించింది. గుంటూరులో వైద్యశాఖమంత్రి సత్యకుమార్యాదవ్ ఈ అవార్డును అందజేశారు. మంగళవారం జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తన చాంబర్లో అవార్డు అందుకున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ శ్యామ్కుమార్ను అభినందించారు. 2023–24 ఏడాదికి వర్సిటీ అనుబంధ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించి అధిక యూనిట్లు సేకరించడం సంతోషమని, ఈ స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. శ్యామ్కుమార్ను రెక్టార్ కేవీ రమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, ప్రిన్సిపాల్ మోహనరావు అభినందించారు. మళ్లీ రండి... కాకినాడ క్రైం: సచివాలయ ఏఎన్ఎంల నుంచి ఎంపీహెచ్ఏ–ఎఫ్(మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్)గా పదోన్నతి పొందిన అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఆదివారం కాకినాడ డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రమోషన్ కం ట్రాన్స్ఫర్ కోసం 390 మంది అభ్యర్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరగగా వారందరినీ రీ వెరిఫికేషన్ కోసం మళ్లీ పిలిచారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం వీరంతా కాకినాడ డీఎంహెచ్వో కార్యాలయానికి హాజరుకానున్నారు. కౌన్సిలింగ్ ప్రక్రియ ర్యాంకులను అనుసరించి జరగలేదనీ, కొన్ని సబ్ సెంటర్లకు చెందిన ఏఎన్ఎంలను కౌన్సెలింగ్కు పిలవకపోవడంతోపాటు వారికి పదోన్నతులు వర్తించలేదన్న అసంతృప్తి ఫిర్యాదుల రూపంలో కలెక్టర్కి చేరింది. దీంతో కలెక్టర్ షణ్మోహన్ కౌన్సిలింగ్ను పునః పరిశీలించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వో డాక్టర్ నరసింహ నాయక్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియపై రీ వెరిఫికేషన్ నిర్వహించనుంది. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తుని: అన్నవరం – రావికంపాడు రైల్వేస్టేషన్ల మధ్యలో రైలు నుంచి జారిపడి కొడకల వెంకట రమణ (30) అనే వ్యక్తి మృతి చెందాడని తుని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం జల్లూరుకు చెందిన కొడకల వెంకటరమణ అనపర్తి మండలం పి.రామచంద్రాపురం కోళ్లఫారంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. తల్లికి ఆరోగ్యం బాగోలేదని తెలియడంతో సోమ వారం రాత్రి రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నానికి రైలులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో రైలు నుంచి జారిపడి తీవ్ర గాయాలు కావడంతో 108లో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వెంకటరమణకు భార్య, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అమలాపురంలో అదృశ్యం.. విశాఖలో ప్రత్యక్షం
అమలాపురం టౌన్: అమలాపురం నుంచి రెండు రోజుల కిందట అదృశ్యమైన తల్లీ పిల్లలను (కుమార్తె, కుమారుడు) విశాఖపట్నం మద్దెలపాలెంలో పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. తన భర్త పెట్టే వేధింపులు భరించలేకే కన్నబిడ్డలతో కలిసి ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఈ నెల 15న తల్లీపిల్లల అదృశ్యంపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు తక్షణమే వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు రోజుల్లో అదృశ్యమైన ఆ కుటుంబాన్ని వెతికి పట్టుకున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామ శివారు దూడలవారి వీధికి చెందిన చవ్వాకుల నరేష్ భార్య హారతి (24), కుమార్తె నందన (6), కుమారుడు భార్గవ్ (4) ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. హారతి తన బిడ్డలతో తొలుత మామిడికుదురు మండలం లూటుకుర్రులోని తన పుట్టింటికి స్కూటీపై వెళ్లడం, అక్కడ నుంచి అమలాపురం ఆర్టీసీ బస్స్టేషన్కు వచ్చి సైకిల్ స్టాండ్లో స్కూటీని పెట్టి అదృశ్యమైనట్లు పోలీసులు ఆ రోజు రాత్రే గుర్తించారు. విశాఖపట్నం బస్సు ఎక్కి వెళ్లిన ఆమె తన బిడ్దలతో మద్దెలపాలెంలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుని ఉన్నట్లు అమలాపురం పోలీసుల విచారణలో తేలింది. వారిని విశాఖ నుంచి అమలాపురం తీసుకుని వచ్చి బంధువులకు అప్పగించారు. అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో ఎస్సై కేఎం జోషి, కానిస్టేబుల్ రాయు డు శ్రీను, ఐటీ కోర్ విభాగం కానిస్టేబుల్ జాఫర్ సాంకేతికత ఆధారంగా తల్లీపిల్లలను గుర్తించారు. తల్లి వద్దకు క్షేమంగా చేరిన బాలిక కాకినాడ రూరల్: చీడిగ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక చల్లా సత్య పావని అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఆ బాలికను మంగళవారం ఇంద్రపాలెం పోలీసులు క్షేమంగా తల్లిదండ్రులు వద్దకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. ఐదో తరగతి చదువుతున్న సత్యపావని సోమవారం ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు ఇంద్రపాలెం పోలీసులు రాత్రి అదృశ్యం కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఎస్సై వీరబాబు ప్రత్యేక బృందాలతో బాలిక కోసం గాలించారు. ఆ బాలిక ముందుగా విజయవాడ వెళ్లి, అక్కడి నుంచి సామర్లకోట వచ్చి, చివరకు రామచంద్రపురంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఇంద్రపాలెం తీసుకువచ్చి విచారించగా తల్లి మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు పావని చెప్పింది. దీంతో బాలిక, ఆమె తల్లికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి, అనంతరం అప్పగించారు. కాగా.. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్ర మత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. తల్లీపిల్లల ఆచూకీ లభ్యం భర్త వేధింపులు భరించలేకే పారిపోయినట్టు వెల్లడి -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కోనసీమ కళ .. పూరీలో భళా..
కొత్తపేట: కోనసీమకు చెందిన గరగనాట్యం, వీరనాట్యం కళాబృందాల ప్రదర్శనలకు ఒడిశా రాష్ట్రంలోని పూరీలో జరిగిన ఫోక్ ఫైర్ ఫెస్టివల్ (జానపద జాతర)లో విశేష గుర్తింపు లభించింది. ఆ ఫెస్టివల్లో భాగంగా వెస్ట్ జోన్ కల్చరల్ ఉదయ్పూర్, సౌత్ జోన్ కల్చరల్ తంజావూరు, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జానపద జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన కొమారిపాటి ఏసు వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో గరగ నాట్యం, వీరనాట్యం ప్రదర్శనలకు అవకాశం అభించింది. సోమవారం నిర్వహించిన ఆయా ప్రదర్శనల్లో ప్రసాద్తో పాటు 20 మంది ఆయా కళాబృందాలు తమ ప్రతిభను ప్రదర్శించి, నిర్వహకులను, ప్రముఖులను, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ కళాకారులను ముఖ్యంగా టీమ్ లీడర్ ఏసు వెంకట ప్రసాద్.. ఒడిశా హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖల మంత్రి డాక్టర్ కృష్ణచంద్ర మహాపత్ర, తదితర ప్రముఖుల అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ తమ బృందాలను గుర్తించి దేశ, విదేశాల్లో అవకాశాలు కల్పి స్తున్న రాష్ట్ర ప్రభుత్వ కల్చరల్ సీఈఓ మల్లికార్జునరావుకు కళాబృందాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
పాఠశాలల్లో సౌకర్యాలపై సమీక్ష
కాకినాడ సిటీ: జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్ నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ, జిల్లా పరిషత్, డ్వామా, పంచాయతీరాజ్, పాడా శాఖల అధికారులతో కలిసి పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, తాగునీరు, కాంపౌండ్ వాల్ నిర్వహణ, ఫెన్సింగ్ ఏర్పాటు, క్రీడామైదానాల నిర్వహణ, యోగాంధ్ర తదితర అంశాలపై చర్యలు చేపట్టాలన్నారు. అన్ని తరగతి గదులలో విద్యుత్తు సదుపాయం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో తాగునీరుకు ఉపయోగించే ట్యాంకులను శుభ్రం చేయించాలని ఆదేశించారు. మరుగుదొడ్లలో నీరు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో నూట్రిన్ గార్డెన్కు రక్షణ కల్పించే విధంగా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలన్నారు. అన్నిచోట్ల కాంపౌండ్ వాల్ ఉండేలా చూడాలన్నారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, మరమ్మతుల నిమిత్తం పాఠశాల గదుల్లో వేసి మెటరియల్స్ను వెంటనే తొలగించి శుభ్రం చేయించాలని, పాఠశాల క్రీడా మైదానాలను విద్యార్థులు వినియోగించుకునేందుకు అనువుగా శుభ్రం చేయించాలని ఆదేశించారు. డీఆర్వో జె.వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, పాడా పీడీ చైత్రవర్షిణి, డీపీవో రవికుమార్, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి పాల్గొన్నారు. అర్జీదారు సంతృప్తి ముఖ్యం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన ప్రతి అర్జీకి అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారంపై శాఖల వారీగా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 31,641 దరఖాస్తులు రాగా అందులో 28,993 పరిష్కరించామన్నారు. వచ్చే రెండు రోజుల్లో సమావేశాలు నిర్వహించి సిబ్బందికి పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీసుకోవలసిన పద్ధతులపై వివరించాలని కలెక్టర్ సూచించారు. రీ ఓపెన్ అయ్యే దరఖాస్తుల పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. డీఆర్వో జె.వెంకటరావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వాసుదేవరావు పాల్గొన్నారు. -
గట్టు తెగితే గల్లంతే..
ఐ.పోలవరం: ఒకవైపు గౌతమి గోదావరి పాయ... మరోవైపు వృద్ధ గౌతమి నదీ పాయ...ఈ రెండింటి మధ్య ఉండే దీవి ఐ.పోలవరం (ఐలాండ్). సుమారు 16 గ్రామాలతో ఉండే ఐలాండ్లో దాదాపు లక్ష మంది వరకూ ప్రజలు జీవిస్తున్నారు. గోదావరి మధ్యన ఉండే ఈ దీవికి వరద సమయంలో చుట్టూ ఉన్న ఏటిగట్లే శ్రీరామరక్ష. 2006, 2022లో గోదావరికి వచ్చిన అతి పెద్ద వరదల నుంచి ఇవే ఐలాండ్ను రక్షించాయి. అటువంటి ఏటిగట్లకు గత కొన్నేళ్లుగా కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో అవి కుంగిపోయి ప్రమాదకరంగా మారాయి. వరద పోటు గోదావరికి వరద పోటు తాకగానే ఏటిగట్లను ఆనుకుని ఉండే నది లంక గర్భాలు నీట మునుగుతుంటాయి. ఏటిగట్టు పట్టున ఉండే పంట పొలాలు, ఇళ్లల్లోకి వరద నీరు చేరడం ఇక్కడ సర్వసాధారణం. అయితే ఏటిగట్ల వల్ల వరద నీరు గ్రామాల్లోకి రాకుండా ఉంటుంది. ఐలాండ్ చూట్టూ 36 కిలోమీటర్ల మేర ఏటిగట్లు విస్తరించి ఉన్నాయి. వీటిని 2000లో ఎత్తు చేసి పటిష్ట పరిచారు. నాటి నుంచి నేటి వరకు కనీస మరమ్మతులు చేపట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడవి బలహీనపడడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయి.. ఐ.పోలవరం మండలంలోని పలు గ్రామాలలో ఏటిగట్లు కుంగి స్థానికులను భయపెడుతున్నాయి. గట్లకు రక్షణగా ఉన్న మట్టి అండలుగా జారిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో కోతలకు గురై ప్రమాదకరంగా మారాయి. గట్ల మీద వేసిన గ్రావెల్, బీటీ రోడ్లు అధ్వానంగా తయారై, రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. మండలంలోని కేశనకుర్రు, కేశనకుర్రుపాలెం, తిల్లకుప్ప, దుప్పిలంక, జి.మూలపాలెం, జి.వేమవరంలో ఐలాండ్ ఏటిగట్లు బలహీనంగా ఉన్నాయి. ఇటువంటిచోట మరమ్మతులు చేపట్టి, గట్లకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. కొంపముంచుతున్న ఆక్వా సాగు ఏటిగట్లను ఆనుకుని నదీ గర్భంలో ఆక్వా సాగు చేపట్టారు. దీని కోసం ఏటిగట్టు వెంబడి ఇస్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భంలోనే ఆక్వా చెరువులు ఉన్నాయి. గట్లకు ఆనుకుని నదిలో ఉండే పెద్ద పెద్ద మట్టి దిబ్బలను తొలగించడం వల్ల వరద నీటి ప్రవాహం నేరుగా గట్టుకు తగులుతోంది. దీని వల్ల గండ్లు పడే ప్రమాదం మరింత పెరుగుతోంది. ఆక్వా చెరువుల తవ్వకాలు 1856 మద్రాస్ కన్జర్వెన్సీ యాక్టుకు పూర్తి విరుద్ధం. నది వైపునే కాకుండా నదికి ఇవతలి వైపు ఐలాండ్లో సాగు చేసే ఆక్వా చెరువుల కోసం గట్లను ధ్వంసం చేసి, మోటార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి చర్యల వల్ల వీటి వల్ల కూడా గట్లు బలహీనపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొమరగిరి, పాత ఇంజరం, ఎదుర్లంక, జి.వేమవరం, మురమళ్ల, పశువుల్లంక, కేశనకుర్రు. జి.మూలపొలంలో ఆక్వా సాగు పెద్ద ఎత్తున సాగుతోంది. ఇంత జరుగుతున్నా హెడ్ వర్ుక్స అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దెబ్బతిన్న ఐలాండ్ రోడ్లు గతంలో ఐలాండ్ చుట్టూ రోడ్ల నిర్మాణం చేపట్టారు. పలుచోట్ల బీటీ రోడ్లు వేశారు. మొత్తం బీటీ రోడ్డు వేసి ఉంటే వాహనాల రాకపోకలు పెరిగి గట్లు బలపడడంతో పాటు స్థానికులకు రవాణా సౌకర్యం కూడా ఏర్పడుతుందని భావించారు. దీనితో పాటు నదిని ఆనుకుని రిసార్టుల నిర్మాణాలు జరిగితే పర్యాటకాభివృద్ధి జరుగుతుందని ప్రణాళికలు రచించారు. ఆ తర్వాత వాటి సంగతి వదిలేశారు. ప్రస్తుతం ఏటిగట్ల మీద రహదారులు దెబ్బతినడంతో రైతులు, స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. గోదావరికి వరదలు సమీపిస్తున్న తరుణంలో గట్లు బలహీనంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు గట్లను పటిష్టం చేసే పనులు చేపట్టాలని ఐలాండ్ వాసులు కోరుతున్నారు. బలహీనంగా ఏటిగట్లు వరదలు వచ్చే సమయం స్థానికుల ఆందోళన రక్షణ చర్యలు చేపట్టాలి IÌê…yŠæ HsìæVýSrϯ]l$ 2000ÌZ ç³sìæçÙt ç³Ç^éÆý‡$. B 糯]l$Ë$ fÇW Cç³µ-sìæMìS §é§éç³# 24 Hâ¶æ$Ï AÐ]l#-™ø…-¨. M>ºsìæt Hsìæ-VýS-rϯ]l$ çÜÐ]l${VýS…V> ç³Ç-Ö-Í…-_, MýS$…W¯]l {´ë…™é-ÌS¯]l$ VýS$Ç¢…_ Ððl…r¯ól ç³sìæçÙt 糯]l$Ë$ ^ólç³-sêtÍ. Ð]l$Æø ¯ðlÌS ÆøkÌZÏ Vø§éÐ]lÇ Ð]lÆý‡-§ýlÌSMýS$ Ð]l^óla AÐ]lM>Ôèæ… E¯]l²…§ýl$¯]l Ððl…r¯ól 糯]l$Ë$ {´ëÆý‡…-À…-^é-Í. ˘ – ఎన్.రామకృష్ణ, మాజీ ఎంపీటీసీ, టి.కొత్తపల్లి, ఐ.పోలవరం మండలం -
‘తల్లికి వందనం’కు షాక్!
సామర్లకోట: తల్లికి వందనం పథకానికి విద్యుత్తు బిల్లుల నిబంధనల సెగ తగిలింది. గడచిన ఆరు నెలలుగా 300 యూనిట్ల వాడకం లేనప్పటికీ తమకు తల్లికి వందనం పథకం నిలిపివేశారని ఆరోపిస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు సోమవారం స్థానిక పిఠాపురం రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్కు తరలివచ్చారు. వేసవి కాలంలో ఎండలు మండిపోవడం, అదే సమయంలో శుభకార్యాలు జరగడంతో ఒక్క మే నెలలో మాత్రమే 300 యూనిట్ల బిల్లు వచ్చిందని, దానిని సాకుగా తీసుకోవడం ఎంత వరకూ సమంజసమని నిలదీశారు. ఆరు నెలల సరాసరి తీసుకొని 300 యూనిట్లు దాటితే తల్లికి వందనం నిలిపివేసినా అభ్యంతరం లేదని అన్నారు.అనేక మందికి 4 నుంచి 14 వరకూ మీటర్లు ఉన్నట్లు స్టేట్మెంట్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో వాడుకుంటున్న విద్యుత్ మీటర్లు తమ పేరిట ఉండటమేమిటని ప్రశ్నించారు. ఇలా ఉన్న మీటర్లను గుర్తించి, బాధితుల పేర్లు తొలగిస్తామని ఏపీ ఈపీడీసీఎల్ ఏఈ రమేష్ కుమార్ చెప్పారు. ఆధార్ కార్డుల ప్రాతిపదికన విద్యుత్తు బిల్లులకు సంబంధించి అదనపు మీటర్లు ఉన్నట్లు గుర్తిస్తే రూ.30 చెల్లించి స్టేట్మెంట్ తీసుకోవడం ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి తొలగిస్తామని తెలిపారు. దీంతో, ఈ స్టేట్మెంట్ల కోసం విద్యుత్ వినియోగదారులు ఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద బారులు తీరారు. విద్యుత్తు వాడుతున్న వారు వారి ఆధార్ కార్డులతో మీటరుకు లింక్ చేయించుకోవాలని ఏఈ సూచించారు. ఈ మేరకు విద్యుత్తు మీటర్లకు ఆధార్ లింక్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. విద్యుత్తు వాడకం 300 లోపు యూనిట్లు ఉన్నవారికి స్టేట్మెంట్లు అందజేస్తామని చెప్పారు. అయితే, తల్లికి వందనం అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 20వ తేదీ వరకు మాత్రమే గడువు ఉందని, ఆలోగా విద్యుత్ వాడకానికి సంబంధించిన స్టేట్మెంట్లు రాకపోతే తమకు అన్యాయం జరుగుతుందని తల్లులు ఆవేదన చెందుతున్నారు. -
చేపా చేపా.. ఎందుకు పడలేదు?
● వేట నిషేధం తరువాత చిక్కని చేపలు ● నిరాశతో వెనుదిరుగుతున్న మత్స్యకారులు ● ఒడ్డుకు చేరిన సుమారు 200 బోట్లు ● నిలిచిపోయిన వ్యాపారం ● బోసిపోయిన ఉప్పాడ సాగరతీరంపిఠాపురం: రెండు నెలల విరామం అనంతరం ఎంతో ఆశతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు నిరాశే మిగిలింది. ఎంత వెతికినా, ఎన్నిసార్లు వల వేసినా ఒక్క చేపా చిక్కకపోవడంతో మత్స్యకారులు వట్టి చేతులతో వెనుదిరుగుతున్నారు. చేపల వేట నిషేధం ఎత్తివేత అనంతరం కాకినాడ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సముద్రంపై చేపల వేటకు వెళ్లిన బోట్లు ఖాళీగా ఒడ్డుకు చేరుకుంటున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లిన మత్స్యకారులు సైతం చేపలు పడక ఖాళీ బోట్లతో తిరిగి వచ్చేస్తున్నారు. దీంతో, వేటకు వెళ్లాల్సిన బోట్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. చేపల క్రయవిక్రయాలతో కళకళలాడాల్సిన ఉప్పాడ తీర ప్రాంతం ఖాళీగా దర్శనమిస్తోంది. రూ.2 కోట్ల మేర నష్టం మత్స్యసంతతి వృద్ధి చెందేందుకు వీలుగా బంగాళాఖాతంలో చేపల వేటపై కేంద్ర ప్రభుత్వం రెండు నెలల పాటు విధించిన నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగిసింది. అయితే, ఈ నెల 10వ తేదీ నుంచే చాలా మంది మత్స్యకారులు చేపల వేటకు బయలుదేరారు. ఇది ఏటా సాధారణంగా జరిగేదే. దీనికి అధికారులు కూడా అడ్డు చెప్పరు. సముద్రంలో సుదూర ప్రాంతాలకు బోట్లలో 8 నుంచి 12 మంది వరకూ మత్స్యకారులు వేటకు వెళ్తూంటారు. సుమారు రూ.50 వేల విలువైన డీజిల్, రూ.30 వేల ఐస్, ఇతర వంట సామగ్రితో వారు బయలుదేరుతారు. సుమారు 8 నుంచి 10 రోజుల పాటు వేట సాగించి మత్స్య సంపదతో తిరిగి వస్తూంటారు. ఇలా వేటకు వెళ్లిన వారు కూలితో కలిపి ఒక్కో బోటుకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.40 లక్షల వరకూ పెట్టుబడి పెడుతూంటారు. సముద్రంలో 100 నుంచి 200 నాటికల్ మైళ్ల దూరానికి వెళ్లి, సొర వంటి పెద్ద చేపలను వేటాడుతూంటారు. కానీ, ఈసారి అలా వెళ్లిన మత్స్యకారులు చేపలు లేకుండానే ఒడ్డుకు చేరుకుంటున్నారు. సుమారు 200 బోట్లు చేపలు లేకుండానే ఖాళీగా వెనుదిరగడంతో రూ.2 కోట్లు పైగా నష్టం వచ్చిందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్చ్.. వ్యాపారం లే.. వేటకు బోట్లలో వెళ్లిన మత్స్యకారులు వట్టి చేతులతో తిరిగి వస్తూండడంతో తీరాన ఉన్న మత్స్యకారులు తమ బోట్లను ఎక్కడికక్కడే నిలిపివేశారు. దీంతో, చేపల క్రయవిక్రయాలతో కళకళలాడాల్సిన ఉప్పాడ తీరం బోసిపోయింది. జిల్లాలో కాకినాడ హార్బర్ తరువాత యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సాగర తీరంలోనే చేపల ఎగుమతులు ఎక్కువగా జరుగుతూంటాయి. వేట నిషేధం అనంతరం తొలి రోజు నుంచే చేపల క్రయవిక్రయాలతో ఉప్పాడ కళకళలాడుతూంటుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజూ 100 నుంచి 150 లారీల్లో వివిధ రకాల చేపలు 2 వేల టన్నుల వరకూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతూంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఉప్పాడ చేరుకున్న పలు లారీలు చేపలు లేకపోవడంతో ఇక్కడే నిలిచిపోయాయి. రూ.కోట్లలో జరిగే వ్యాపార లావాదేవీలు సైతం స్తంభించిపోయాయి. చేపలను నిల్వ ఉంచేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉంచిన టన్నులకొద్దీ ఐస్ కరిగిపోతోంది. ఇలా జరగడం ఇదే తొలిసారి సాధారణంగా రెండు నెలల నిషేధం తరువాత వేటకు వెళ్తే భారీగా మత్స్య సంపద దొరుకుతూంటుంది. అందుకోసమే నిషేధం పూర్తయిన వెంటనే వేటకు వెళ్లేందుకు ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుని ముందు నుంచీ సిద్ధమవుతూంటాం. ఈ ఏడాది ఏం జరిగిందో ఏమో కానీ ఏ ఒక్క బోటుకూ చేపలు పడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలా ఎప్పుడూ జరగలేదు. సుమారు రూ.1.20 లక్షల పెట్టుబడితో వేటకు వెళ్తే కనీసం రూ.20 వేల ఖరీదైన చేపలు కూడా పడలేదు. అవి కూడా చిన్న సైజు చేపలు మాత్రమే దొరికాయి. చాలా నష్టం వచ్చింది. నిషేధం తరువాత గతంలో ఎప్పుడూ ఇలా వట్టి చేతులతో తిరిగి వచ్చిన సందర్భాలు లేవు. మాతోపాటు వేటకు వచ్చిన అన్ని బోట్ల వారూ చేపలు పడకపోవడం ఇదే మొదటిసారని అంటున్నారు. – పట్టా సూరిబాబు, మత్స్యకారుడు, కొత్తపట్నం, ఉప్పాడ శివారు చేపలు పడటం లేదు తుపాను వచ్చినప్పుడు సముద్రం అల్లకల్లోలంగా ఉండి కొన్ని రోజులు చేపలు దొరకని పరిస్థితి ఉంటుంది. కానీ, సముద్రం బాగానే ఉంది. కానీ, ఎక్కడకు వెళ్లినా చేపలు పడటం లేదు. కోనాలు, సూరలు, సొరల వంటి చేపల వేటకు వెళ్లిన వారితో పాటు తీరం వెంబడి వేటకు వచ్చిన వారికి కూడా చేపలు అంతగా పడలేదు. ఐదు రోజులైనా ఏ ఒక్కరికీ కనీసం రూ.10 వేల విలువైన చేపలు కూడా పడినట్లు లేదు. అందరం నిరాశతో వెనక్కి వచ్చేశాం. అందరికీ రూ.లక్షల్లో నష్టం వచ్చింది. మామూలు సమయాల్లో ఒక్కోసారి కొందరికి వేట పడదు. కానీ నిషేధం తరువాత ఎక్కువ చేపలు దొరుకుతాయి. కానీ, ఈసారి ఏ ఒక్కరికీ చేపలు పడలేదు. – వనమాడి ఎల్లారావు, మత్స్యకారుడు, కొత్తపట్నం, ఉప్పాడ శివారు వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు చేపలు పడటం లేదని మత్స్యకారులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటం, సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వాతావరణ మార్పుల వల్ల కూడా చేపలు పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సముద్రంలో కలుషిత జలాలు ఎక్కువగా కలవడం వల్ల కూడా ఆయా ప్రాంతాల్లో చేపలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉప్పాడ, కాకినాడ తీరాల నుంచి వెళ్లిన బోట్లు చేపలు పడకపోవడంతో ఒడ్డుకు వచ్చేశాయి. వేటకు వెళ్లాల్సిన బోట్లు వెళ్లలేదు. – శివరామకృష్ణ, మత్స్యశాఖాధికారి, ఉప్పాడ -
ప్రభుత్వ ఉద్యోగి జీతమైనా ఇవ్వండి
●● సంక్షేమ పథకాలైనా అమలు చేయండి ● కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అంగన్వాడీల కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేతనాలైనా ఇవ్వాలని, లేదంటే సంక్షేమ పథకాలయినా అమలు చేయాలని అంగన్వాడీ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యాన కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు జి.బేబీరాణి, దడాల పద్మ మాట్లాడుతూ, చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు మ్యానిఫెస్టోలో పేర్కొన్నారని, నేడు అధికారంలోకి రాగానే అంగన్వాడీలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సాధికార సర్వేలో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదు చేసి, తప్పు చేశారని, ఇప్పటికే పని గంటలు పెంచి విపరీతమైన పని ఒత్తిడి పెంచారని చెప్పారు. ఆయాకు రూ.7 వేలు, టీచరుకు రూ.11,500 చెల్లిస్తూ ప్రభుత్వోద్యోగులుగా చెప్పడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గనిపించడలేదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కుటుంబాల్లోని పిల్లలకు తల్లికి వందనం డబ్బులు వేయకపోవడమే కాకుండా వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్లు ఆపేశారని, వితంతు పింఛన్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తున్న వేతనంతో అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు వండి పెట్టేందుకు, సెంటర్ అద్దెలకు పెట్టుబడి పెడుతూ, కార్యకర్తల కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి మలకా రమణ, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకట రమణ, పలివెల వీరబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ బదిలీలు పూర్తి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కార్పొరేషన్లలో పని చేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలకు సంబంధించి 6,572 మంది బదిలీ అయ్యారన్నారు. జెడ్పీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ల నుంచి ప్రధానోపాధ్యాయులుగా 96 మంది, మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 10 మంది పదోన్నతి పొందారని తెలిపారు. ప్రభుత్వ యాజమాన్యంలో సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా 204 మందికి పదోన్నతి కల్పించామని రమేష్ తెలిపారు. పీజీఆర్ఎస్కు 681 అర్జీలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 681 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం ఆన్లైన్ తదితర సమస్యలపై అర్జీలు అందాయని కలెక్టర్ వివరించారు. కేతన్ గార్గ్ బదిలీ రాజమహేంద్రవరం సిటీ: నగర పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ గ్రేటర్ విశాఖపట్నం నగర పాలక సంస్థ కమిషనర్గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేతన్ గార్గ్ దాదాపు ఏడాది కాలం నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా పని చేస్తున్నారు. ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఇంకా ఎవ్వరినీ నియమించలేదు. కొత్త కమిషనర్ వచ్చేంత వరకూ జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. అమలాపురంలో విపత్తుల స్పందన దళం స్థావరం అమలాపురం టౌన్: జిల్లాలో తరచుగా సంభవించే తుపాన్లు, గోదావరి వరదలు, చమురు సంస్థల గ్యాస్ లీకేజీ వంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను తక్షణమే ఆదుకుని ప్రాణ నష్టాన్ని నివారించేందుకు విపత్తుల స్పందన దళం స్థావరాన్ని అమలాపురంలో నెలకొల్పుతున్నట్లు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. అమలాపురం తహసీల్దార్ కార్యాలయం వెనుక గల పాత సబ్ జైలు భవనంలో ఈ స్థావరం నెలకొల్పాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ జైలు భవనాన్ని కలెక్టర్తో పాటు రెవెన్యూ అధికారులు సోమవారం పరిశీలించారు. ఈ స్థావరంలో దళం నివాసం ఉండి రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణకు సంసిద్ధమై ఉంటుందన్నారు. తహసీల్దార్ పలివెల అశోక్ ప్రసాద్తోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
మెట్టలో మట్టి మాఫియా
● కె.గోపాలపురంలో భారీగా తవ్వకాలు ● రోజూ 50 టిప్పర్లతో రవాణా ● ఛిద్రమవుతున్న రహదారులు గండేపల్లి: మెట్టలో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా పెద్దపెద్ద లారీలతో మట్టి తరలించుకుపోతూ అక్రమార్కులు రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మెట్ట, చెరువు.. ఇలా ఎక్కడ అవకాశముంటే అక్కడ గెద్దల్లా వాలిపోతూ.. నేలతల్లికి తూట్లు పొడుస్తున్నారు. గండేపల్లి మండలం కె.గోపాలపురంలో కొద్ది రోజులుగా మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. నర్సరీల్లో ఎర్రమట్టికి అధిక గిరాకీ ఉండటంతో అక్రమార్కుల కన్ను ఈ ప్రాంతంలోని ఎర్రమట్టిపై పడింది. గ్రామ శివారున సర్వే నంబర్ 1/1లో కొద్ది రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా భారీ టిప్పర్లలో మట్టి తరలించుకుపోగా.. ఇప్పుడు సర్వే నంబర్ 209లో ఎర్రమట్టి విచ్చలవిడిగా తవ్వేసి, తరలించుకుపోతున్నారు. మట్టి తవ్వకాలు పొక్లెయిన్ సైతం వినియోగిస్తున్నారు. తవ్విన మట్టిని తరలించేందుకు కొండలను సైతం పిండి చేసి, దర్జాగా బాటలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో టిప్పర్ మట్టికి సుమారు రూ.10 వేల నుంచి దూరాన్ని బట్టి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతి రోజూ సుమారు 50 టిప్పర్లతో మట్టి తరలించుకుపోతున్నారు. కళ్ల ముందే ఈ దందా జరుగుతునప్పటికీ ఇటు రెవెన్యూ, అటు అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. భారీ మొత్తాలు చేతులు మారుతున్నందువల్లనే చూసీచూడనట్లు వదిస్తేన్నారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎర్రమట్టి కోసం కొంత మంది రైతులకు డబ్బు ఆశ చూపి, పంట భూములను సైతం గుల్ల చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో, తమ పొలాలు కూడా పాడవుతున్నాయని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. గతంలో డి–పట్టా భూముల రైతుల అవసరాలను సైతం అనుకూలంగా మార్చుకుని, అక్కడి కొండను తవ్వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హడలెత్తుతున్న గ్రామస్తులు కె.గోపాలపురం నుంచి మట్టి టిప్పర్లు ఎన్టీ రాజాపురం మీదుగా జాతీయ రహదారికి చేరుకుంటున్నాయి. ఆ టిప్పర్లను డ్రైవర్లు మితిమీరిన వేగంతో రేయింబవళ్లు నడుపుతూండటంతో ఆ గ్రామస్తులు హడలెత్తుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ అధిక లోడుతో మట్టి టిప్పర్లను నడుపుతూండటంతో ఆ మార్గంలో నేల అదిరిపోతోందని స్థానికులు చెబుతున్నారు. దీంతో, తమ ఇళ్లు, గోడలు బీటలు తీసి, కుంగిపోతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధిక లోడు వల్ల రోడ్లు ఛిద్రమవుతున్నాయి. మట్టి తవ్వకాలకు మైనింగ్ అధికారులే అనుమతులు ఇవ్వాల్సి ఉంటుందని, తాము ఎటువంటి అనుమతీ ఇవ్వలేదని, అక్రమ తవ్వకాలపై చర్యలు చేపడతామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. మట్టి మాఫియాకు వెంటనే కళ్లెం వేయాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
● రత్నగిరిపై సత్రాలకు ఎట్టకేలకు మరమ్మతులు ● రూ.1.20 కోట్లతో పనులు ● రెండు నెలల్లో పూర్తి అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో ఈ సత్రాల మరమ్మతులు ఎట్టకేలకు సోమవారం ప్రారంభమయ్యాయి. రూ.1.20 కోట్లతో న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాల్లో ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఈఓ వీర్ల సుబ్బారావు పరిశీలించారు. ఆయా సత్రాల్లో చేపడుతున్న పనుల గురించి ఆయనకు ఈఈ వి.రామకృష్ణ వివరించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, టెండర్ షరతుల ప్రకారం ఈ మూడు సత్రాల్లో మరమ్మతులు పూర్తి చేయడానికి మూడు నెలల గడువుందని చెప్పారు. అయితే రెండు నెలల్లోనే పూర్తి చేసి, భక్తులకు అందుబాటులోకి తేవాల్సిందిగా ఈఓ ఆదేశించారన్నారు. ఆ మేరకు పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం మూఢమి, దానికి తోడు ఈ నెల 26 నుంచి ఆషాఢ మాసం కావడంతో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవు. అందువలన ఈ సమయంలో భక్తులు పెద్దగా రారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి భక్తుల రాక ప్రారంభమవుతుంది. ఆలోగా సత్రాల మరమ్మతులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సగం గదుల్లో సమస్యలు దేవస్థానంలో హరిహర సదన్, శివసదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ, ప్రకాష్ సదన్, శ్రీ సీతారామ సత్రం, కొండ దిగువన సత్యనికేతన్ సత్రాలున్నాయి. వీటిల్లో ఏసీ, నాన్ ఏసీ గదులు 620 ఉన్నాయి. వీటిలో సుమారు 120 గదులు పాడై, అద్దెకిచ్చేందుకు ఏమాత్రం వీలుగా లేవు. మరో 150 గదుల్లో ఫర్నిచర్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ సరిగా లేవు. ప్రకాష్ సదన్ వంటి సత్రాల్లో బస చేసిన భక్తులు ఆ గదుల్లో ఉండలేక రాత్రికి రాత్రే ఖాళీ చేసిన సందర్భాలు కోకొల్లలు. వీటికి మరమ్మతులు చేయించాలని చాలా కాలం నుంచి భక్తులు కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదు. గత ఏడాది అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సత్రాల గదులకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించి, అంచనాలు రూపొందించారు. తొలుత రూ.40 లక్షలతో హరిహర సదన్ సత్రంలో గదులకు మరమ్మతులు పూర్తి చేసి, రంగులు వేయించారు. తరువాత న్యూ సెంటినరీ, ఓల్డ్ సెంటినరీ, ప్రకాష్ సదన్ సత్రాలకు మరమ్మతులు చేయించాలని నిర్ణయించి, రూ.40 లక్షల చొప్పున అంచనాలు రూపొందించి, టెండర్లు ఖరారు చేశారు. ● ఓల్డ్ సెంటినరీ సత్రం: దీనిని నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఇందులో 48 గదులున్నాయి. పెళ్లి బృందాల వారు ఇక్కడ గదులు రిజర్వ్ చేసుకుని, సత్రం ఆవరణలో వివాహాలు చేసుకుంటారు. ఈ సత్రం గదులకు పెయింట్లు వేసి చాలా కాలమైంది. డోర్లు, కిటికీలు, వాటర్ పైప్లైన్లు, బాత్రూముల్లో ఫిట్టింగ్స్ పగిలిపోయాయి. నీరు లీకవుతూండటంతో డ్రైనేజీ పైప్లైన్లకు నాచు పట్టింది. కొన్నిచోట్ల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ● న్యూ సెంటినరీ సత్రం: సుమారు 28 ఏళ్ల కిందట నిర్మించిన ఈ సత్రంలో కూడా 48 గదులున్నాయి. వివాహాది శుభకార్యాలకు భక్తులు గదులు రిజర్వ్ చేసుకుంటారు. ఇందులో కూడా ఓల్డ్ సెంటినరీ సత్రం మాదిరిగానే సమస్యలున్నాయి. ● ప్రకాష్ సదన్ సత్రం: వీఐపీ సత్రంగా పేరొందిన ఈ భవనాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు. 86 గదులున్నాయి. గదికి రూ.వెయ్యి చొప్పున రోజుకు రూ.86 వేల మేర అద్దె రూపంలో ఆదాయం వస్తుంది. స్వామివారి ఆలయానికి దగ్గరగా ఉండటం, దగ్గర్లోనే క్యాంటీన్, పార్కింగ్ సదుపాయాలుండటంతో ఈ సత్రంలో బస చేయడానికి భక్తులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇందులోని పలు గదుల్లో కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. -
ధాన్యం బకాయి సొమ్ము
చెల్లించాలని వినతి అమలాపురం రూరల్: గత మే నెలలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మంగెన నరసింహారావు, ఎరుబండి లక్ష్మయ్య, అప్పారి చినవెంకటరమణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ 45 రోజులుగా ధాన్యం సొమ్ము రాలేదని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సూమారు రూ.250 కోట్లకుఽపైగా ధాన్యం బకాయిలు ఇవ్వాలని వారు తెలిపారు. -
పెద్దాపురంలో వ్యక్తి దారుణ హత్య
పెద్దాపురం: పట్టణ శివారు కట్టమూరు పుంత ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. కిర్లంపూడి మండలం గోనేడ గ్రామానికి చెందిన జానకి సత్య శ్రీనివాస్ (వెంకన్నబాబు) (32)ను ఎవరో దారుణంగా హత్య చేశారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి... మృతుడు ఓ రైస్మిల్లులో పని చేస్తున్నాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో ఉన్న శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు భావిస్తున్నారు. పదునైన ఆయుధంతో మెడపై బలంగా కొట్టి చంపినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద పగిలిన బీర్ బాటిళ్లు ఉండడంతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమా.? మద్యం మత్తులో ఎవరైనా హత్య చేశారా? మరే ఇతర కారణం ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడు శ్రీనివాస్పై గతంలో హత్య, హత్యాయత్నంతో సహా పలు కేసులు ఉన్నట్లు సమాచాఉరం. పెద్దాపురం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తును ప్రారంభించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ మౌనిక తెలిపారు.