Kakinada
-
రెచ్చిపోయిన జనసేన ఎమ్మెల్యే..
రాజానగరం: తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఓ కార్యకర్తపై పచ్చి బూతులతో విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. చెరువుల తవ్వకం విషయమై తన వద్దకు వచ్చిన ఒక కార్యకర్తపై ఎమ్మెల్యే బలరామకృష్ణ తీవ్రస్థాయిలో దుర్భాలాడారు.ఈ ఘటనను అదే పార్టీకి చెందిన మరో కార్యకర్త తన సెల్ఫోన్లో రికార్డు చేసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ‘జన సైనికుడిపై జనసేన ఎమ్మెల్యే బూతు పురాణం’ పేరిట ఆ ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘నువ్వెంత పోటుగాడివిరా.. ఎక్కువ మాట్లాడకు.. నువ్వెందుకు దెం.. దెం.. యి,’ వంటి బూతులతో పాటు ఇంకా ఘాటైన పదాలతో దూషించినట్లు ఆడియో ఉంది.నీతి, న్యాయం, ధర్మం గురించి డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్కళ్యాణ్ తెగనీతులు చెబుతుంటారని.. ఇప్పుడు బూతులతో రెచ్చిపోయిన తన పార్టీ ఎమ్మెల్యేపై ఆయన ఇప్పుడేమంటారని పలువురు ఘాటువ్యాఖ్యలు చేస్తున్నారు. -
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణమంటూ కుటుంబ సభ్యుల ఆందోళన ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్ తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు. ఆరు గంటలపాటు ఆందోళన కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలా ఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబా బు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరు లు ముమ్మిడివరం ఎమ్మె ల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. -
నాన్నా... నీ మనసే వెన్న
ఫాదర్స్ డే రోజునే ఉద్యోగంలోకి.. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్ పేపర్లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్ ఎంసెట్లో 289వ ర్యాంకు, గేట్లో 240వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో సామ్సంగ్ రీసెర్చ్ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్లో గూగుల్ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్ జేఈ మెయిన్స్లో 1924వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్ ప్లేసమెంట్లో గూగుల్కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్ ఫాదర్స్ డే రోజునే గూగుల్లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు. ఫ నడిపించే దైవం ఆయనే ఫ కుటుంబానికి వెలుగునిచ్చే సారథి ఫ నేడు ఫాదర్స్ డే కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది. -
నీట్లో సత్తా చాటిన ఆదిత్య
బాలాజీచెరువు (కాకినాడ): నీట్–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్రెడ్డి తెలిపారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో ‘ఆదిత్య’ను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతి, డైరెక్టర్ సుగుణ, ప్రిన్సిపాల్స్ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు. -
మాకు మంచి స్నేహితుడు
నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్ముడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్న సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు. –తండ్రి సత్యనారాయణతో సప్పా నాగేశ్వరరావు, కొంకుదురు ఎంతో ప్రేమగా చూస్తారు.. సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను. –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు -
నీట్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో డి.కార్తీక్ రామ్కిరీటికి ఏపీ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్ కశ్యప్ 12వ ర్యాంకు, డి.కార్తీక్రామ్ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్రెడ్డి 880వ ర్యాంకు, ఎల్.అభిషేక్ 888 ర్యాంకు, టి.రామచంద్రన్ 1,145వ ర్యాంకు, ఎల్.వర్షిత్ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరిలు అభినందించారు. -
22న ద్విశత కవి సమ్మేళనం
సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్కుమార్ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్గా పని చేసే అశోక్కుమార్ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్కుమార్ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మొదటి గురువులా..
ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి. –తండ్రి సత్యనారాయణతో గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక ఆయనే కొండంత ధైర్యం ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం. –తండ్రి బండారు రాముతో సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్, కొప్పవరం -
ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం
కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్బీఐ చీఫ్ అసోసియేట్ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.98 స్కోర్తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 91వ ర్యాంక్ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కింది. అనంతరం సివిల్స్లో ఐఏఎస్ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది. -
శ్రీషిర్డీసాయి విజయకేతనం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నీట్ ఫలితాల్లో శ్రీషిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ దీక్ష్యా మెడికల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బి.సంజన ఆల్ ఇండియా 227వ ర్యాంకు, కె.పావన్ తనయ్ 308వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. 2 వేల లోపు ర్యాంకులు ఐదుగురు, ఐదు వేల లోపు 8 మంది, పది వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది ఎమ్బీబీఎస్ సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, దీక్ష్యా అకాడమీ డీన్ పి.నరసింహారావు అభినందించారు. -
ఆలయ భూముల రక్షణ బాధ్యత ఈఓలదే..
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఆలయా లు, సత్రాలకు చెందిన భూముల రక్షణ బాధ్యత ఈఓలదేనని జిల్లా దేవదాయ శాఖ అధికారి కనపర్తి నాగేశ్వరరావు అన్నారు. దేవదాయ శాఖ మండల ఎండోమెంట్ అధికారులు, ఈఓలతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆలయాలు, సత్రాలకు ఉన్న భూములన్నీ రెవెన్యూ శాఖ 1బిలో నమోదయ్యాయో లేదో చూసుకోవాలన్నారు. ఆ భూమి వేరే వ్యక్తుల పేరిట ఉంటే తక్షణమే సంబంధింత ఆర్డీఓలకు వినతిపత్రం ఇచ్చి, 1బిలో దేవదాయ శాఖ భూమిగా నమోదు చేయించాలని ఆదేశించారు. ఈనాం భూములు కూడా వేరే వ్యక్తుల పేరిట ఉంటే వాటిని కూడా రెవెన్యూ శాఖ 1బిలో నమోదు చేయించాలన్నారు. 6సి దేవాలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. టెలి కాన్ఫరెన్స్లో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి ఫణికుమార్ కూడా పాల్గొన్నారు. -
వేటకు వేళాయె..
ఉప్పాడ రేవులో వేటకు సిద్ధంగా ఉన్న బోట్లుకాకినాడ రూరల్/పిఠాపురం: వలలు సరి చేసుకుని, బోట్లు సరి చూసుకుని.. కడలి అలలపై బతుకు పాట సయ్యాటకు గంగపుత్రులు సిద్ధమవుతున్నారు. బంగాళాఖాతంలో మత్స్య సంతతి వృద్ధి చెందేందుకు వీలుగా ఏప్రిల్ 15 నుంచి చేపల వేటపై నిషేధం అమలు చేశారు. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ నిషేధం శనివారం అర్ధరాత్రితో ముగియనుంది. దీంతో, శనివారం అర్ధరాత్రి, ఆదివారం నుంచి సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు ఉద్యుక్తులవుతున్నారు. ఇప్పటికే ఫైబర్ బోట్లలో మత్స్యకారులు బయలుదేరగా.. సముద్రంలో సుదూర ప్రాంత జలాల్లో చేపలు వేటాడే సోనా బోట్ల నిర్వాహకులు కాకినాడ ఏటిమొగ వద్ద ఆదివారం గంగమ్మ తల్లికి పూజలు చేసి, సాయంత్రం బయలుదేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వేట పునఃప్రారంభం కావడంతో తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సందడి నెలకొంది. మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని తినే సముద్ర చేపలు, రొయ్యలు, పీతల రుచులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. భృతి.. అందరికీ అందలే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.20 వేల చొప్పున ఇస్తామని నమ్మించారు. గత ఏడాది 24,947 మందికి రూ.20 వేల చొప్పున సుమారు రూ.49 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఏ ఒక్కరికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది జిల్లాలోని 4,451 బోట్లకు సంబంధించి 25,752 మంది మత్స్యకారులను గుర్తించారు. వీరికి రూ.51.50 కోట్లకు పైగా భృతి అందించాల్సి ఉంది. అయితే, వివిధ సాకులతో వీరిలో 24,762 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించారు. మిగిలిన 990 మందిని అనర్హులుగా తేల్చి రూ.19 కోట్లు ఎగ్గొట్టారు. అర్హులుగా గుర్తించిన వారిలో కూడా ఇంకా 1,445 మందికి వివిధ కారణాలతో ఇప్పటి వరకూ వేట నిషేధ భృతి చెల్లించలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అవ్వకపోవడంతో నిధులు జమ కాలేదని, వీటిలో 1,200 మందివి సరి చేసి తిరిగి ప్రభుత్వానికి పంపామని, మిగిలిన 245 మంది గ్రామాల్లో లేరని జిల్లా మత్స్యశాఖ అధికారి కృష్ణారావు చెప్పారు. ఇదిలా ఉండగా, కొంత మందికి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని కూడా సాకుగా చూపిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన మత్స్యకారులందరికీ నాలుగేళ్ల పాటు నిర్విరామంగా మత్స్యకార భరోసా సకాలంలో అందించారు. రూ.10 వేల వేట నిషేధ భృతిని రూ.20 వేలకు పెంచామని కూటమి పెద్దలు గొప్పలు చెప్పుకొంటున్నారు. కానీ, గత ఏడాది ఎగ్గొట్టి, ఈ ఏడాది మాత్రమే ఇవ్వడం వలన కూటమి ప్రభుత్వం కూడా ఏడాదికి రూ.10 వేల చొప్పున మాత్రమే ఇచ్చినట్లయ్యింది. రెండేళ్లకు కలిపి రూ.100 కోట్లు పైగా ఇవ్వాల్సి ఉండగా రూ.49 కోట్లు విడుదల చేశారు. అది కూడా ఇప్పటి వరకూ రూ.25 కోట్లు మాత్రమే జమ అయినట్లు మత్స్యకార నాయకులు చెబుతున్నారు. వేట నిషేధ పరిహారం ఇచ్చారిలా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో.. మత్స్యకార కుటుంబానికి రూ.4 వేల చొప్పున 2019 వరకూ 22,250 మందికి రూ.8.90 కోట్లు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో.. అప్పటి వరకూ రూ.4 వేలు మాత్రమే ఉన్న భృతిని రూ.10 వేలకు పెంచారు. సంవత్సరం లబ్ధిదారులు పరిహారం (రూ.కోట్లు) 2019–20 23,190 23.19 2020–21 24,587 24.58 2021–22 30,213 30.21 2022–23 21,394 21.39 2023–24 24,147 24.14 వేట నిషేధం కారణంగా ప్రభావితులైన బోటు యజమానులు, కళాసీలు 1,23,531 మందికి 2019–20 నుంచి 2023–24 వరకూ రూ.123.51 కోట్ల మేర మత్స్యకార భరోసా సొమ్ము అందించారు. గత ఏడాది వేయలేదు.. ఈ ఏడాది ఇవ్వడం లేదు వేట లేకపోతే మా కుటుంబానికి పూట గడవదు. ఈ రెండు నెలలూ మాకు నరకంలా ఉంది. అయినప్పటికీ ఏదో కష్టపడి కుటుంబాన్ని పోషించుకున్నాం. మాకు అండగా ఉండే మత్స్యకార భృతి గత ఏడాది వేయలేదు. అదిగో ఇదిగో అని సరిపెట్టేశారు. ఈసారి వేస్తారని చూశాను. కానీ, ఇప్పుడు కూడా వేయలేదు. అడిగితే ఏవో కారణాలు చెబుతున్నారు. ఎప్పుడు అడిగినా వేసేస్తామంటున్నారు తప్ప వేయడం లేదు. ఎవరిని అడగాలో, ఎక్కడికెళ్లాలో తెలియడం లేదు. తెలుసున్న వారిని అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మాలాంటోళ్లని ఏడిపించడం ప్రభుత్వానికి మంచిది కాదు. దయచేసి మా డబ్బులు మాకు వేసి ఆదుకోండి. – బెణుగు స్వామి, మత్స్యకారుడు, కోనపాపపేట, కొత్తపల్లి మండలం అదిగో ఇదిగో అంటున్నారు చాలా సంవత్సరాలుగా మా కుటుంబానికి చేపల వేటే ఆధారం. ఏటా చేపల వేట నిషేధం విధించే రెండు నెలలూ మాకు గడ్డు కాలం. ఆ రోజుల్లో ఏ ఆదాయమూ లేక అప్పులు చేసి కుటుంబాన్ని గడుపుకోవాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు ప్రతి ఏటా కచ్చితంగా మత్స్యకార భరోసా వేశారు. అప్పుడు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ గత ఏడాది నుంచి ప్రభుత్వం ఈ డబ్బులు వేయడం లేదు. ఇప్పుడు వేశామంటున్నారు కానీ మాకు రాలేదు. ఎందుకు రాలేదో తెలియడం లేదు. ఎవరినడిగినా చూస్తామంటున్నారు తప్ప డబ్బులు పడటం లేదు. ఇప్పటికై నా ఆ డబ్బులిచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. – నక్కా తాతారావు, మత్స్యకారుడు, కోనపాపపేట, కొత్తపల్లి మండలం పరిశీలించి చర్యలు తీసుకుంటాం మత్స్యకార భృతి ఎవరెవరికి, ఎందుకు రాలేదో పరిశీంచి, తగిన చర్యలు తీసుకుంటాం. అర్హత లేకపోతే ఏవిధంగా లేదనే విషయంపై విచారణ చేస్తాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మత్స్యకార భృతి వచ్చేలా చర్యలు తీసుకుంటాం. – కృష్ణారావు, జిల్లా మత్స్యశాఖాధికారి, కాకినాడ -
పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు
● దేవదాయ శాఖ నోటిఫికేషన్ ● దాఖలుకు 26 వరకూ గడువు ● వచ్చే నెల మొదటి వారంలో ఖరారయ్యే చాన్స్ అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు దేవదాయ శాఖ సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. శానిటరీ మెటీరియల్ సహా పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనుల నిర్వహణకు ఈ టెండర్ పిలిచారు. గత ఏప్రిల్లో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కొటేషన్ల దాఖలుకు జూన్ 26 చివరి తేదీగా నిర్ణయించారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఖరారు చేస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో రెండేళ్ల కాలపరిమితితో ఆగస్టు 1 నుంచి పారిశుధ్య పనులు ప్రారంభిస్తుంది. నెలల తరబడి జాప్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలో శానిటేషన్ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే టెండర్ పిలవాలని గత ఏడాది ఆగస్టు 27న నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, దీని అమలులో దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. గత ఏడాది నవంబర్ వరకూ అన్నవరం దేవస్థానంలో హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్ధ శానిటేషన్ విధులు నిర్వహించేది. ఆ సంస్థ కాంట్రాక్ట్ గత నవంబరుతో ముగిసింది. ఆ గడువుకు నెల రోజులు ముందే గత అక్టోబర్లో టెండర్ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే, టెండర్లు పిలవడం ఆలస్యమవడంతో దేవస్థానం కోరిక మేరకు గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్ధ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి 1 నుంచి ఎటువంటి టెండరూ పిలవకుండా గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్కు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్ మాత్రం దేవస్థానమే అందిస్తోంది. రూ.80 లక్షలకు పెరిగే అవకాశం దేవస్థానంలో గతంలో పారిశుధ్య పనులు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్ధకు నెలకు రూ.49 లక్షలకు టెండర్ ఖరారైంది. అనంతరం తాత్కాలికంగా వచ్చిన కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలు, మరో రూ.12 లక్షలు మెటీరియల్కు కలిపి మొత్తం రూ.71 లక్షలు చెల్లిస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక యంత్రాలు ఉపయోగించాలనే షరతు విధించారు. అలాగే, శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్లుగా మరి కొంత మందిని నియమించాలని షరతు పెట్టారు. అలాగే, ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఇవన్నీ కలిపితే అన్నవరం దేవస్థానంలో నెలకు రూ.80 లక్షల వరకూ ఆయా సంస్ధలు కోట్ చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
సామర్లకోట: మాస్టర్ ట్రైనర్లు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని ఎంపీడీఓలు, ఈఓ పీఆర్డీ, సీనియర్ సర్పంచ్లకు మాస్టర్ ట్రైనర్లుగా ఈ నెల 10 నుంచి ఇచ్చిన శిక్షణ శుక్రవారం ముగిసింది. శిక్షణ పొందిన అధికారులు ఆయా జిల్లాల్లోని మహిళా సర్పంచ్లకు ఉత్తమ శిక్షణ అందించాలని ఈ సందర్భంగా రమణ సూచించారు. ఈ శిక్షణలు ఈ నెల 26న ప్రారంభించాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు కె.సునీల (కోర్స్ డైరెక్టర్) కేఆర్ నిహరిక, ఎం.చక్రపాణిరావు, టి.రామకృష్ణ, వి.జగన్నాథం, ఎ.రవిశంకర్, బి.ఆంజనేయులు పాల్గొన్నారు. ఘనంగా చండీ హోమం అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీ హోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. చండీహోమంలో 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాదులు సమర్పించి, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. -
పల్లెలపై పగబట్టినట్లు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పల్లెలపై కూటమి సర్కారు పగబట్టినట్టుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక పల్లెల్లో పాలనాధికారం వైఎస్సార్ సీపీ చేతుల్లో ఉంది. దీంతో, నిధులు విడుదల చేసి, పనులు జరిగితే ఆ క్రెడిట్ వైఎస్సార్ సీపీ సర్పంచ్లకే దక్కుతుందనే దురాలోచనతో గ్రామ పంచాయతీల ప్రగతికి అడుగడుగునా మోకాలడ్డుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 15వ ఆర్థిక సంఘం రెండో విడత నిధులకు ప్రభుత్వం మోకాలడ్డుతోంది. దీంతో, పల్లెల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన గగనమవుతోందని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. మార్చిలోనే వచ్చినా.. జిల్లాలో మేజర్, మైనర్ గ్రామ పంచాయతీలన్నీ కలిపి 385 ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం గత మార్చి నెలలోనే 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఈ విధంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28.39 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉంది. నెలలు గడుస్తున్నా కూటమి సర్కారు చిల్లిగవ్వ కూడా విదల్చకుండా కావాలనే ఈ నిధులను తొక్కి పెడుతోందని సర్పంచ్లు మండిపడుతున్నారు. ఆర్థిక సంఘం నిధులను టైడ్, అన్ టైడ్ విభాగాలుగా కేటాయిస్తారు. టైడ్ విభాగంలో పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు,. అన్ టైడ్ విభాగంలో రోడ్లు, డ్రెయిన్లు, శ్మశాన వాటికల అభివృద్ధి, విద్యుత్, మోటారు మరమ్మతులు, చెత్త సేకరించే కార్మికుల వేతనాల వంటి వాటికి ఖర్చు చేస్తారు. మేజర్ పంచాయతీలకు ఇంటి పన్నులు, చేపల చెరువుల వేలం, వారపు సంతలు, కాలువ గట్లు, ఏటిగట్లపై కొబ్బరి చెట్ల ఫలసాయం ద్వారా వచ్చే ఆదాయం వంటివి ఉంటాయి. వీటితో కొన్ని పనులు చేసే అవకాశం వాటికి ఉంటుంది. వీటితో పోలిస్తే మైనర్ గ్రామ పంచాయతీలకు సాధారణ నిధులు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పంచాయతీల్లో పారిశుధ్యం మెరుగుపరచి, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆర్థిక సంఘం నిధులే దిక్కు. ప్రభుత్వం ఈ నిధులు ఇవ్వకపోవడంతో మైనర్ పంచాయతీలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాయి. నిలిచిన పనులు గ్రామ స్వరాజ్యమే కూటమి లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరచుగా చెబుతూంటారు. కానీ, ఆర్థిక సంఘం నిధుల విడుదలకు వచ్చేసరికి మాత్రం రాజకీయం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను గత ఎన్నికల్లో జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గెలిపించారు. ఆవిధంగా ఆయన ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా పంచాయతీరాజ్ శాఖ ఆయన చేతుల్లోనే ఉంది. అయినప్పటికీ ఆయన గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయించాల్సిన అవసరాన్ని గుర్తించకపోతే ఎలాగని పలువురు ఆక్షేపిస్తున్నారు. గ్రామాల ప్రగతి కోసం కేంద్రం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లిస్తున్నా పవన్కు పట్టకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. నిధులు రాకపోవడంతో జిల్లాలోని మేజర్, మైనర్ గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేని దుస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశుధ్యం, డ్రైన్లు, సిమెంటు రోడ్ల వంటి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలం రాకుండా పనులు పూర్తి చేద్దామన్నా కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ప్రజలను ఇబ్బందులు పెడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు వస్తాయనే ఉద్దేశంతో స్థానిక సంస్థల ప్రతినిధులు అప్పులు చేసి మరీ కొన్ని అభివృద్ధి పనులు చేయించారు. వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పనులు ముందుకు సాగక పల్లెల్లో పాలన పడకేసి ప్రజలు కూడా నరకం కళ్ల చూస్తున్నారు. ఇస్తారా.. ఇవ్వరా! ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక పల్లె పాలనకు ఎదురవుతున్న ఇబ్బందులను ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో సామర్లకోట మండలంలో పరిశీలించింది. ఈ మండలంలో పెదబ్రహ్మదేవం, మేడపాడు, వేట్లపాలెం, ఉండూరు, మాధవపట్నం మేజర్ పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడతగా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ రావాల్సి ఉంది. అలాగే, ఈ మండలంలో 13 మైనర్ గ్రామ పంచాయతీలున్నాయి. వీటికి ఒక్కో దానికి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులివ్వకపోవడంతో ఎక్కడి అభివృద్ధి పనులు అక్కడే నిలిచిపోయాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నిధులు విడుదల కాకపోవడంతో ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారని సర్పంచ్లు మధనపడుతున్నారు. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వ దయ కోసం నెలల తరబడి ఎదురుతెన్నులు తప్పడం లేదని సర్పంచ్లు, వార్డు సభ్యులు వాపోతున్నారు. ఈ నిధులిస్తే గ్రామాల్లోని దళితవాడల్లో రోడ్లు, డ్రైన్ల అభివృద్ధికి, తాగునీటి సదుపాయాల కల్పనకు, చెల్లింపులకు అవకాశం దక్కేదని చెబుతున్నారు. అసలు ఈ నిధులిస్తారా ఇవ్వరా అని పలువురు సర్పంచ్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎదురు చూస్తున్నాం పెద్దబ్రహ్మదేవం గ్రామంలో తాగునీటి సమస్య దారుణంగా ఉంది. వేసవిలో 15వ ఆర్థిక సంఘం నిధుల బకాయిలు రూ.18 లక్షల వరకూ ఉన్నాయి. ఆ నిధులు విడుదలైతే మంచినీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ నిధులు ఎప్పుడొస్తాయో, అసలు వస్తాయో రావో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నాం. ఎస్సీ పేటలో రోడ్లు, డ్రైన్ సమస్యల శాశ్వత పరిష్కారానికి గంపెడాశతో ఎదురు చూస్తున్నాం. – నీలపాల సత్యనారాయణ (బూరయ్య), సర్పంచ్, పెదబ్రహ్మదేవం, సామర్లకోట మండలం పారిశుధ్య పనులు భారం ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో మా గ్రామంలో పారిశుధ్య పను లు చాలా అధ్వానంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నాం. పంచాయతీల నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర అత్యవసర పనుల నిర్వహణ తలకు మించిన భారంగా మారింది. గ్రామాల్లో పనులు చేయించకపోతే ప్రజల నుంచి ఛీ త్కారాలు ఎదురవుతున్నాయి. వర్షాకాలం మొదలైంది, పారిశుధ్య పనులు చేయకపోతే దోమలు వ్యాప్తి చెంది, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. శివా రు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే పైపులైన్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులు రాక అత్యవసర పనులు చేయించేందుకు అప్పులు చేసి, ఖర్చు పెట్టాల్సి వస్తోంది. – కమిడి మంగాదేవి, సర్పంచ్, వేములవాడ, కరప మండలం ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక సామర్లకోట మండలం జి.మేడపాడు ఎస్సీ పేటలో అభివృద్ధికి నోచని రోడ్డు నిధులు విదల్చని కూటమి సర్కారు ముందుకు కదలని పనులు డిప్యూటీ సీఎంగా జిల్లా నుంచే పవన్.. అయినా పైసల కోసం పెదవి విప్పని దుస్థితి ఆర్థిక సంఘం నిధులకూ బ్రేకులు గ్రామ పంచాయతీల్లో సింహభాగం వైఎస్సార్ సీపీవే అందుకే ప్రభుత్వం కక్ష కట్టినట్టుందని విమర్శలు -
కూటమిలో తుని తగవు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: అక్రమ సంపాదనలో పంపకాలు తెగక కూటమి నేతలు రోడ్డెక్కుతున్నారు. గద్దెనెక్కిన ఏడాది కాలంగా మట్టి, ఇసుక, మైనింగ్ మాఫియాతో చేతులు కలిపి రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ నీకు సగం, నాకు సగం అంటూ వాటాలు వేసుకుంటూ, వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వాటాలు, పంపకాలు తెగక వివాదాలతో రోడ్డెక్కుతున్నారు. పిఠాపురంలో బొండు ఇసుక దందా కోసం జనసేన, టీడీపీ నేతల మధ్య రగిలిన దుమారం చల్లారక ముందే.. తాజాగా తునిలో మట్టి అక్రమ తవ్వకాల చిచ్చు రేగింది. మాజీ మంత్రి, హోం మంత్రి వర్గాల పోరు టీడీపీలో నంబర్–2గా చెప్పుకొనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఆయన కుమార్తె, తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఒకవైపు.. హోం మంత్రి వంగలపూడి అనిత వర్గీయులు మరోవైపు మట్టిలో కాసుల కోసం కొట్టుకుంటున్నారు. మంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం తుని సరిహద్దునే ఉంది. అక్కడి వనిత అనుచరులైన టీడీపీ నేతల మట్టి తరలింపును తుని వైపు యనమల అనుచరులతో పాటు జనసేన నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తమ నియోజకవర్గంలో మట్టి తవ్వుకుంటూంటే అందులో వాటాలెందుకివ్వాలని పాయకరావుపేట టీడీపీ నేతలు.. మట్టి తమ ప్రాంతానికి తరలిస్తున్నందు తమకు పంపకాలు జరగాల్సిందేనని తుని వైపు కూటమి నేతలు సిగపట్లు పడుతున్నారు. ఈ క్రమంలో వివాదం ముదురుపాకాన పడింది. ఈ నేపథ్యంలో పాయకరావుపేట వైపు నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న లారీలు, ట్రాక్టర్లు, జేసీబీని తుని వైపు వైరి వర్గం పట్టుకుని, తుని రూరల్ పోలీసులకు అప్పగించింది. దీనిపై ఇరువర్గాలూ గురువారం పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. కొల్లగొడుతున్నారిలా.. పాయకరావుపేట మండలంతో పాటు తుని మండలం ఎస్.అన్నవరం శివారు కవలపాడులో కాకినాడ జగన్నాథపురం ఎంఎస్ఎన్ చారిటీస్కు చెందిన భూములున్నాయి. ఈ భూముల్లో కొంత మంది ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారు. ఇటుకల తయారీకి ప్రధాన ముడి సరకు చెరువు గర్భాల్లోని మట్టి. కవలపాడులో చాలా ఏళ్లుగా ఇటుకల బట్టీలు నడుస్తున్నా ఎప్పుడూ ఇటువంటి వివాదాలు లేవని అంటున్నారు. ఇటుక బట్టీలకు అవసరమైన చెరువు మట్టిని టిప్పర్కు రూ.10 వేలు, ట్రాక్టర్కు రూ.1,200కు అమ్మి కూటమి నేతలు జేబులు నింపుకొంటున్నారు. ప్రతి రోజూ 150 నుంచి 200 ట్రిప్పుల మట్టి రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమంగా తరలించుకుపోతున్నారు. రాత్రి వేళల్లో ఇష్టారాజ్యంగా మట్టి దోపిడీకి పాల్పడుతున్నారు. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి అనుమతి లేనప్పటికీ అధికారం చేతిలో ఉందనే బరితెగింపుతో మట్టి తవ్వి తరలించేస్తున్నారు. అదేమని అడిగి నాథుడే లేకుండా పోయాడు. మట్టి అక్రమాల్లో కూటమి పెద్దలున్నారనే ఉద్దేశంతో తమకెందుకనే ధోరణిలో ఆయా శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వాటాల కోసం ‘పంచాయితీ’ పాయకరావుపేట మండలం నుంచి మట్టిని తుని మండలం కవలపాడులోని ఇటుక బట్టీలకు తరలిస్తూ పాయకరావుపేట కూటమి నాయకులు రూ.లక్షలు వెనకేసుకుంటున్నారు. ఈ దందాలో తమకు వాటా లేక అన్యాయమైపోతున్నామని తుని మండలం ఎస్.అన్నవరంలోని టీడీపీ జనసేన నేతలు భావించారు. ఈ నేపథ్యంలో పాయకరావుపేట నుంచి జరుగుతున్న మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. అక్రమార్జనలో తమకూ వాటా ఇవ్వాలని కొన్ని రోజులుగా తుని టీడీపీ పెద్దల వద్ద పంచాయితీ నడుస్తోంది. పాయకరావుపేటలో బీజీపీకి చెందిన ఒక కీలక నేత, బంగారయ్యపేటకు చెందిన టీడీపీ ద్వితీయ శ్రేణి నేత, తుని మండలం ఎన్.సూరవరం గ్రామ టీడీపీ నేతలు మట్టిలో అక్రమార్జన కోసం కుస్తీ పడుతున్నారు. అయినప్పటికీ పాయకరావుపేట నేతలు దారికి రావడం లేదు. దీంతో, తుని టీడీపీ, జనసేన నేతలు గురువారం తెల్లవారుజామున రంగంలోకి దిగారు. కవలపాడు మట్టి లోడుతో వచ్చిన మూడు లారీలను, మూడు ట్రాక్టర్లను, ఒక జేసీబీని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో, ఈ వివాదం మరింత రచ్చకెక్కింది. మట్టి తవ్వకాల్లో వాటాల కోసం ఇంత నిస్సిగ్గుగా రోడ్డెక్కుతున్న కూటమి నేతలను చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. కుదిరిన సంధి! వాటాల కోసం రోడ్డెక్కిన నేతల మధ్య కూటమి పెద్దలు సంధి కుదిర్చారని అంటున్నారు. పర్సంటేజీలపై ఒప్పందాలు కుదిర్చి, వివాదాన్ని సర్దుబాటు చేశారని చెబుతున్నారు. పోలీసులకు అప్పగించిన వాహనాలను గంటల వ్యవధిలోనే వదిలేయడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అక్రమాలను బయటపెట్టి, వాహనాలను పట్టించిన కూటమి నేతలే.. వాటాలు కుదిరేసరికి వెనక్కు తగ్గడం చూసి జనం విస్తుపోతున్నారు. పంపకాల చిచ్చు ప్రస్తుతానికి చల్లారినా.. భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే. -
విద్యార్థులకు కిట్కట
● ప్రచారార్భాటానబడిసాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నాయి. పనులు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదు. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా ఇచ్చిన హామీల అమలు మొదలుకుని అన్నింటా పాలనలో తిరోగమనమే కనిపిస్తోంది. చివరకు గత జగన్ పాలనలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యపై కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్ఆర్కేవీఎం) కిట్లు అందజేసినట్టు విద్యా శాఖా మంత్రి లోకేష్ను సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ భజన బృందం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. ప్రభుత్వం విఫలం సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, స్కూల్ బ్యాగ్, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువైన విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విద్యార్థిని కదిపినా బూట్లు రాలేదని, బ్యాగ్లు, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. పుస్తకాలు మినహా కిట్లో మిగిలిన ఏ ఒక్కటీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాబు పాలనలో ఎప్పుడూ ఇంతే.. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఇలానే జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బూట్లు, యూనిఫాం అందజేసేందుకు ముందస్తు ప్రణాళిక ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సగం విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ బడులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు.తూర్పుగోదావరి జిల్లాలో.. ● జిల్లాలోని 19 మండలాల్లో అన్ని రకాల పాఠశాలలూ కలిపి 984 ఉన్నాయి. వీటిల్లో 44,771 మంది బాలు రు, 49,583 మంది బాలికలు చదువుతున్నారు. ● జిల్లాకు పాఠ్య పుస్తకాలు 4,14,529, వర్క్ బుక్స్ 76,662, నోట్ బుక్స్ 6,62,952, డిక్షనరీలు 14,947, బెల్టులు 61,548 వచ్చాయి. ● మొత్తం విద్యార్థులకు 94,354 బ్యాగ్లు రావాల్సి ఉండగా 67,158 మాత్రమే వచ్చాయి. ● 94,548 బూట్లు రావాల్సి ఉండగా 84,726 మాత్రమే వచ్చాయి. ● 94,354 యూనిఫాంలు రావాల్సి ఉండగా 50,549 మాత్రమే వచ్చాయి. రాజమహేంద్రవరంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులుజగన్ హయాంలో.. చంద్రబాబు పాలనకు భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింతగా ప్రోత్సహించేలా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో మాదిరిగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు అదనంగా విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు జత చేసి ఇచ్చారు. పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా అందజేసేవారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలు తెరచిన రోజున విద్యా కానుక అందజేశారు. ఈసారి అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో కిట్ల పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వచ్చిన కిట్లను కూడా విద్యార్థులకు అందజేయకుండా ఆపేశారు. దీనిపై అడిగితే మెగా పేరెంట్స్ మీట్లు పెట్టి అందజేస్తామంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీని ప్రచారార్భాటానికి వాడుకోవాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభమైన పాఠశాలలు పుస్తకాలకే ‘విద్యార్థి మిత్ర’ కిట్ పరిమితం బూట్లు, బ్యాగులు, యూనిఫాం లేవు ఇతర వస్తువుల ఊసే లేదు కూటమి సర్కారు వైఫల్యం -
టెన్త్ సప్లిమెంటరీలో 86.51 శాతం ఉత్తీర్ణత
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో జిల్లా 86.51 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) పిల్లి రమేష్ గురువారం తెలిపారు. పరీక్షలకు 5,248 మంది హాజరు కాగా 4,540 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. వీరిలో బాలురు 2,686, బాలికలు 1,853 మంది ఉన్నారని పేర్కొన్నారు. రీ కౌంటింగ్ లేదా రీ వెరిఫికేషన్కు ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఓపెన్ స్కూల్లో 90.93 శాతం ఉత్తీర్ణత ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పదో తరగతి పరీక్షలకు 441 మంది హాజరవగా 401 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఇంటర్లో 1,131 మందికి గాను 985 మంది ఉత్తీర్ణులయ్యారని డీఈఓ రమేష్ తెలిపారు. జిల్లా దేవదాయ అధికారి బాధ్యతల స్వీకరణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా దేవదాయ శాఖ అధికారిగా కనపర్తి నాగేశ్వరరావు గురువారం బా ధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా దేవదాయ శాఖాధికారిగా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను దేవదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయ సూపరింటెండెంట్ సోమరాజు, నగరంలోని పలు దేవాలయాల ఈఓలు అ భినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవదాయ శాఖ ఈఓలు, అర్చకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పారు. ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. వర్షాల హెచ్చరికలతో ఈపీడీసీఎల్ అప్రమత్తం విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కంట్రోల్ రూము నంబర్లు రాజమహేంద్రవరం: 73822 99960 కాకినాడ: 94931 78718 కోనసీమ: 94409 04477 కార్పొరేట్ ఆఫీస్: 1912 -
సీతారాములకు వెండి మకర తోరణం
అన్నవరం: సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి నిత్య కల్యాణంలో పెళ్లి పెద్దలుగా వ్యవహరించే సీతారాములకు అన్నవరం దేవస్థానం వ్రత పురోహితులు వెండి మకర తోరణం సమర్పించారు. వ్రత పురోహిత సూపర్వైజర్లు అల్లంరాజు సత్య శ్రీనివాస్, గుత్తిన రామకృష్ణ, వ్రత పురోహిత సంఘం మాజీ అధ్యక్షుడు రవిశర్మ, వారి డ్యూటీ సభ్యులు 43 మంది రూ.3 లక్షల విలువైన 345 గ్రాముల వెండితో దీనిని తయారు చేయించారు. మకర తోరణాన్ని గురువారం ఈఓ వీర్ల సుబ్బారావుకు అందజేశారు. దీనిని ప్రతి రోజూ స్వామివారి కల్యాణంలో సీతారాములకు అలంకరించాలని కోరారు. సాక్షి కథనంతో.. గతంలో పెళ్లి పెద్దలు సీతారాములను వేరే ఆసనంపై కాకుండా సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి పాదాల చెంతన ఉంచి సత్యదేవుని కల్యాణం నిర్వహించేవారు. దీనివలన కల్యాణంలో స్వామి, అమ్మవారిపై వేసిన తలంబ్రాలు సీతారాములపై కూడా పడేవి. దీనిపై ‘సత్యదేవుని నిత్య కల్యాణంలో అపచారం’ శీర్షికన గత ఏడాది జూన్ 24న ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ వెంటనే స్పందించారు. సత్యదేవుడు, అమ్మవారి సింహాసనం పక్కనే సీతారాములను మరో ఆసనంపై వేంచేయించి, కల్యాణం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి నుంచీ అదే విధంగా చేస్తున్నారు. అయితే సత్యదేవుడు, అమ్మవారి వెనుకన ఉన్నట్టుగా సీతారాముల మూర్తులకు మకర తోరణం లేకపోవడంతో బోసిపోయినట్లు ఉండేది. ఈ నేపథ్యంలో వ్రత పురోహితులు ఈ వెండి మకర తోరణం సమర్పించారు. -
గోదారి.. కళాఝరి
● ప్రారంభమైన అంతర్జాతీయ కళా సమ్మేళనం ● అలరించిన కళాకారుల నృత్య ప్రదర్శనలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కళలకు కాణాచి అయిన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాఝరి రసరమ్యంగా ప్రవహించింది. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళా కేంద్రంలో 43వ కళా సమ్మేళనం–2025 గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ కళా వైభవాన్ని చాటేలా పలువురు చిన్నారులు తొలి రోజు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాల్లో భాగంగా తొమ్మిది మంది సంగీత కళాకారులు వీణానాదంతో అన్నమయ్య కీర్తనలను వీనుల విందుగా వినిపించారు. అలాగే, తమిళనాడుకు చెందిన జానపద కొమ్మి నృత్యాలు, దుర్గ సూక్తం భరతనాట్యం అందరినీ ఆనంద గోదారిలో ఓలలాడించాయి. కళా సమ్మేళనంలో పాల్గొన్న కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జీబీ నారాయణ ఇటీవలి కుంభమేళాలో సైతం తన ప్రదర్శనలతో పలువురి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నారాయణ కుమార్తె లక్ష్మీ గీతిక చిన్న వయస్సులోనే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారని, ఆమె మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శనివారం హాజరు కానున్నారని తెలిపారు. నృత్యాలతో అలరించిన చిన్నారులను మంత్రి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. -
ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం
రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గోదారి తీరాన సంగీత, నృత్యోత్సవం
● నేటి నుంచి అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్–2025 ● నాలుగు రోజుల పాటు సాగనున్న ఉత్సవాలు ● 13 రాష్ట్రాల నుంచి కళాకారుల రాక ● మలేషియా నుంచి రానున్న ప్రత్యేక బృందం ● 13వ తేదీన 134 మందితో నృత్య నీరాజనం సీటీఆర్ఐ: నృత్య నీరాజనంతో గోదారితీరం పులకించనుంది. వంద మందికి పైగా నృత్య కళాకారులు ఒకే వేదికపై నాలుగు రోజులపాటు నగర ప్రజలను పరవశింపజేయనున్నారు. 42 ఏళ్లుగా కళా సమ్మేళన్ పేరితో సంగీత, నృత్యోత్సవాలు నిర్వహిస్తున్న శ్రీరాధాకృష్ణ కళాక్షేత్ర, భారతీయ యువ సేవా సంఘ్ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర ఆనం కళాకేంద్రం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 43వ కళా సమ్మేళన్ అంతర్జాతీయ సంగీత, నృత్య ఫెస్ట్–2025 గురువారం వైభవంగా ప్రారంభం కానుంది. ఈ సమ్మేళన్లో 13 రాష్ట్రాల నుంచి కళాకారులు పాల్గొననున్నారు. వీరితో పాటుగా మలేషియా నుంచి ఒక ప్రత్యేక బృందం రానుంది. సుమారు 550 మంది కళాకారులు మూడు రోజుల పాటు సంగీతం, నృత్య, జానపద కళారూపాలతో పోటీ పడనున్నారు. శుక్రవారం 134 మంది తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకండ్ల పాటు నిర్విరామంగా ఒకే ఆహార్యంతో నృత్యం చేయనున్నారు. వీరితో పాటు 9 మంది సంగీత విద్యాంసులు కూడా పాల్గొనున్నారు. ఈ నృత్యోత్సవాన్ని పలు రికార్డులకు నమోదు చేయనున్నారు. గత ఏడాది అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవం అనేక రికార్డులను సొంతం చేసుకుంది. 12 గంటల 23 నిమిషాల 01 సెకండ్ పాటు 125 మంది కళాకారులు ఒకే ఆహార్యంతో ప్రదర్శించిన హనుమాన్ చాలీసా నృత్యరూపకానికి 12 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్, వండర్ బుక్, తెలుగు బుక్, గోల్డెన్బుక్ వంటి 12 వరల్డ్ రికార్డులను ఆ కార్యక్రమం సొంతం చేసుకోవడం విశేషం. 14వ తేదీ 13న బృందాలు పోటీ పడనున్నాయి. ఒక్కొక్క బృందంలో 25 నుంచి 30 మంది వరకు కళాకారులు పాల్గొననున్నారు. 15వ తేదీ సోలో పోటీలు, సర్టిఫికెట్ల ప్రదానం చేయనున్నారు. శాసీ్త్రయ నృత్యానికి ఆదరణ కరవు పాశ్చాత్య సంగీతం, నృత్యం వైపు నేటి తరం ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. తల్లితండ్రులు కూడా త్వరగా తమ పిల్లలకు పేరు వస్తుందనే ఆశతో పాశ్చాత్య నృత్యం వైపు తమ పిల్లలను పంపుతున్నారు. టీవీ షోలలో అసభ్యకరమైన విన్యాసాలతో, పొట్టి డ్రెస్లతో చేసేది నాట్యమని భ్రమిస్తున్నారు. మన ప్రాచీన కళైన సంప్రదాయ నృత్యం వైపు ప్రపంచం చూస్తోంది. మనం మాత్రం ఆధునిక పొకడలతో తలతోక లేని డ్యాన్స్ వైపు పరుగెడుతున్నాం. – డాక్టర్ జీబీ నారాయణ, శ్రీరాధాకృష్ణ కళాకేత్ర వ్యవస్థాఫకుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
రాష్ట్రస్థాయి తైక్వాండో ఓవరాల్ చాంప్స్ ‘తూర్పు’
నాగమల్లితోట జంక్షన్(కాకినాడ సిటీ): అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లాల తైక్వాండో పోటీలలో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టు పాల్గొని ప్రతిభ కనపరచిందని తైక్వాండో సంఘ జిల్లా కార్యదర్శి బి.అర్జునరావు బుధవారం తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి 80 మంది ఈ పోటీలలో పాల్గొనగా 38 బంగారు, 12 రజత, 17 కాంస్య పతకాలు సాధించి జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ను కై వసం చేసుకున్నారన్నారు. కడప జిల్లా ద్వితీయ స్థానాన్ని, అనంతపురం జిల్లా తృతీయ స్థానాన్ని కై వసం చేసుకున్నాయని తెలిపారు. ఈ పోటీలో జాతీయస్థాయి రిఫరీలు భార్గవి, సాయి, రోహిత్ జిల్లా నుంచి పాల్గొనగా తైక్వాండో కోచ్లు సత్యనారాయణ, మణికంఠ, త్రిమూర్తులను అర్జునరావు అభినందించారు. 67 పతకాలు కై వసం -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో పట్టపగలు జరిగిన చోరీపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక జాతీయ రహదారిపై నరేంద్రగిరి ఎదురుగా ఉన్న భవనంలో పట్టపగలే చోరీ జరిగిన సంగతి తెలిసిందే. పోలీసులు ప్రాధమికంగా 2.1 కేజీల వెండి, మూడు బంగారు గొలుసులు అపహరణకు గురైనట్టు భావించారు. అయితే ఇంటి యజమాని కంటిపూడి శివానంద భాస్కరరావు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యింది. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దీని ఆదారంగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్.లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గల్లంతైన మృతదేహం లభ్యం
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం బీచ్కు స్నానాలకు వెళ్లి సముద్రంలో మంగళవారం గల్లంతైన ఇద్దరిలో రెండో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన యాళ్ల హరికిశోర్ మృత దేహం మంగళవారమే లభ్యమైనప్పటికీ మరో యువకుడు ఇసుకపట్ల జస్వంత్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం వాపాలతిప్ప సమద్రతీర ప్రాంతంలో లభ్యమైనట్టు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు. ఆ మృత దేహాన్ని తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఎస్ఐ రాజేష్ పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందించారు.యువకుడి ఆత్మహత్యయానాం: పిన్ని ఇంటికి వచ్చి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం యానాం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం, జయంతి కాలనీకి చెందిన గండ్రాపు వెంకటకృష్ణచైతన్య (24) యానాంలో వికాస్కాలనీలో నివాసం ఉంటున్న తన పిన్ని ఇంటికి ఇటీవల వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతున్న కృష్ణచైతన్యను చూసిన బంధువులు హుటాహుటిన కిందకు దింపి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణచైతన్య బీటెక్ చదువుకున్నాడని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పెంకే గణేష్ తెలిపారు. -
సత్యదేవుని సన్నిధికి సులువుగా!
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సత్యదేవుని దర్శనానికి మరో మార్గానికి పనులు చురుగ్గా సాగుతున్నా యి. మొదటి ఘాట్రోడ్డు వద్ద గల టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.90 లక్షల వ్యయంతో సుమారు 450 మెట్లతో ఆకర్షణీయంగా ఈ మార్గం రూపుదిద్దుకుంటోంది. రాజస్థాన్ కార్మికుల మెళకువలతో రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన మెషీన్తో అందమైన పరిమాణాల్లో కట్ చేసిన రాళ్లను మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. తొలిపావంచా నుంచి స్వామివారి ఆలయానికి ఉన్న ప్రస్తుతం మెట్లను సుమారు 50 ఏళ్ల క్రితం రాతితో నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మిస్త్న్ను రెండో మెట్లమార్గానికి గ్రానైట్, మార్బుల్ రాళ్లను యంత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. 2010లోనే ప్రతిపాదన 2010 సంవత్సరంలో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో సందర్శకుల బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడి నుంచి తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మెట్లపై స్వామివారి దర్శనానికి వెళ్లాల్సివచ్చేది. ఇది దూరాభారం కావడంతో కళాశాల మైదానానికి దగ్గరలో మరో మెట్లదారి నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంతలో ఆయన 2012లో బదిలీకావడంతో ఆ ప్రతిపాదన మూలపడింది. మళ్లీ 2023లో ఆయన ఈఓగా రావడంతో ఈ మెట్ల మార్గం పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. మూడు మలుపులు, 450 మెట్లు ఈ మార్గాన్ని 450 మెట్లతో మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి మెట్లు ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల రోడ్డు వద్ద ముగియనున్నాయి. అక్కడ నుంచి 200 మీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. గత ఏప్రిల్లో ప్రారంభించిన పనుల్లో భాగంగా వంద మెట్లు పూర్తి చేశారు. ఇంకా 350 మెట్లు నిర్మించాల్సి ఉంది. ఈ మెట్లకు అవసరమైన రాయిని ప్రత్తిపాడులోని క్వారీ నుంచి తీసుకువచ్చి మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల విశ్రాంతికి ఏర్పాట్లు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అలసట చెందితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు, తాగునీటి సదుపాయానికి పక్కనే కొంత స్థలాన్ని చదును చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల్లో పూర్తి ఈ మెట్ల నిర్మాణాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నట్టు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్కుమార్ తెలిపారు. పనుల పరిశీలన దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ ఈ మెట్ల మార్గం పనులను ఇటీవల పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా రెండో మెట్లదారి నిర్మాణం రూ.90 లక్షలతో 450 మెట్లు ఏర్పాటు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి -
ఉసురు తీసిన వివాహేతర సంబంధం
బిక్కవోలు: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడదేర్చింది ఆ ఇల్లాలు. సీఐ వీఎల్వీకే సుమంత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బిక్కవోలు గ్రామంలోని కెంగం శ్రీను (43) లారీ క్లీనర్గా పనిచేస్తున్నారు. స్థానిక జగనన్న లే అవుట్ ప్లాట్ నంబర్ 59లో భార్య దేవితో కలసి కాపురం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు కాగా పెద్దవాడు సురేంద్ర సత్యకుమార్ నర్సాపురం మండలం సీతారామపురంలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు యశ్వంత్కుమార్ పోలవరం మండలం గుటాల గ్రామంలో తాపీ పని చేస్తుంటాడు. దేవి బిక్కవోలులో అంబటి పేట ప్రాంతానికి చెందిన జంపా దుర్గారావుతో వివాహేతర సంబంధం నెరపుతుండడంతో ఆ భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తల్లి వివాహేతర సంబంధాన్ని చూస్తూ ఉండలేక చిన్న కుమారుడు గుటాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మళ్లీ శ్రీను, దేవి ఘర్షణపడ్డారు. ఈ ఘర్షణలో శ్రీను మృతి చెందాడు. బుధవారం ఉదయం శ్రీను తల్లి సరస్వతి ఇంటికి రాగా విగతజీవుడై పడి ఉన్న శ్రీనును చూసి కన్నీరుమున్నీరైంది.అనంతరం దేవి తన ప్రియుడు దుర్గారావుతో కలసి శ్రీనును చంపినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ శ్రీవిద్య, సీఐ సుమంత్, ఎస్సై వాసంశెట్టి రవిచంద్రకుమార్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రీను భార్య దేవి, దుర్గారావు పరారీలో ఉన్నారని వారిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని వారు తెలిపారు. శ్రీను మృతదేహాన్ని అనపర్తి సీహెచ్సీకి తరలించినట్టు సీఐ తెలిపారు. -
పీతల సరఫరాలో ఘరానా మోసం
కాట్రేనికోన: పచ్చ పీత పిల్లలకు సొమ్ము చెల్లిస్తే మండ పీత పిల్లలను అంటగట్టి రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన పల్లం గ్రామంలో చోటు చేసుకుంది. మండలం పల్లం గ్రామానికి చెందిన 26 మంది రైతులు 50 ఎకరాలు పీతల చెరువులు లీజుకు చేస్తున్నారు. పచ్చ పీత పిల్లల కోసం స్థానికం హేచరీ అందుబాటులో లేక పోవడంతో మద్రాసుకు చెందిన హేచరీ నుంచి పీత పిల్లలను పల్లం గ్రామానికి చెందిన పాలెపు శ్రీను, సంగాని సత్యంకు సొమ్ము చెల్లించారు. 26 మంది రైతులు ఒక పీత పిల్లకు రూ.23 చొప్పున 60 వేల పిల్లలకు రూ.14 లక్షలను దళారులు పాలెపు శ్రీను, సంగాని సత్యంలకు చెల్లించారు. అయితే పచ్చ పీత పిల్లలకు బదులు నకిలీ పీతలను (మండ పీతల) సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ చెరువులో పీత పిల్లలను వదలడం, సీడ్ దశలో ఉండడం వల్ల అసలో నకిలీయో తెలియదని వారు పేర్కొన్నారు. చెరువులో పీతలు వేసి 20 రోజులు పైబడిందని, పచ్చ పీతలకు బదులు మండ పీతలని తేలడంతో మోసపోయినట్టు గుర్తించామని, మండ పీత పిల్లలను సరఫరా చేసిన హేచరీ యాజమాన్యం పైన, దళారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పచ్చ పీతలకు బదులు మండ పీతలు పంపిన హేచరీ యాజమాన్యం రూ.14 లక్షలు నష్టపోయిన రైతులు -
ఎక్కడా లేని హామీలు ఎందుకు ఇచ్చారు?
అధికారమే పరమావధిగా ఎన్నికల్లో ఎక్కడా లేని హామీలు ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయలేమని చేతులెత్తేయడం తగునా. ఏడాది పాలనపై ప్రజలకు సరైన సమాధానం చెప్పాలి. సంక్షేమాన్ని అమలు చేయకపోవడంతో నగదు లావాదేవీలు పూర్తిగా పడిపోయాయి. కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లోకి పోతున్నాయి. – రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, కాకినాడ ఇది తల్లికి వంచన తల్లికి వందనం పేరుతో ఓట్లు వేయించుకుని విద్యార్థుల తల్లులను నిలువునా చంద్రబాబు మోసంచేసి తల్లికి వంచనగా పథకంగా మార్చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన జగన్ పాలనతో పోల్చుకుంటే కనీసం ఒక వంతు కూడా కూటమి సర్కార్ అమలు చేయలేదు. చంద్రబాబు ఏడాది పాలనతోనే ప్రజలు విసుగెత్తిపోయారు. సుంకర శివప్రసన్న, వైఎస్సార్ సీపీ సిటీ ప్రెసిడెంట్, కాకినాడ -
దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు
కాకినాడ సిటీ: దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలో దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. పింఛన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప, ముమ్మిడివరం మండలాల్లో మానసిక మహిళ దివ్యాంగులపై అత్యాచార ఘటన జరపడం దురదృష్టకరమన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, 35 కేజీల బియ్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంఘ జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు పాల్గొన్నారు. -
పంచ భూతాలను కాపాడుకోవాలి
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచ భూతాలను కాపాడుకోవచ్చునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమిను పురస్కరించుకుని పిఠాపురం, ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం సస్యవృద్ధి బీజారోపణోత్సవం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా తమ ఆశ్రమం వద్ద ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించడమే ఆధ్యాత్మిక వ్యవసాయమని అన్నారు. దానికి ప్రేరణ కలిగించే కార్యక్రమమే సస్యవృద్ధి బీజారోపణోత్సవం అని తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దారపురెడ్డి వెంకన్న, దార్లంక సూరిబాబు, యాండ్ర చంద్రావతి, దాసరి పెద్దనాగేశ్వరరావు, గుళ్ళపల్లి వీరభద్రరావును సత్కరించారు. పరబ్రహ్మ మొహియుద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా చీమలవారిగూడెంకు చెందిన చీమల వెంక టేష్కు అందజేసి రూ.10వేల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామగోపాలవర్మ డ్రోన్లతో వ్యవసాయం గురించి రైతులకు వివరించారు. అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.బి.వి చలపతి వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతులను తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి సత్య నారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్ కఠారి, పొట్రు శశికాంత్ సమీకృత ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు, ఎస్సార్ కార్పొరేషన్ మాజీ సీఈవో జి.వి.కృష్ణంరాజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పాల్గొన్నారు. ఏరువాక సాగిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా -
మహా సంస్థానం రెగ్యులర్ ఈఓగా సౌజన్య
పిఠాపురం: పిఠాపురంలో ప్రముఖ దత్త పుణ్య క్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం రెగ్యులర్ ఈఓగా ఆర్.సౌజన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అదనపు బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు రెగ్యులర్ ఈఓగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వనదుర్గమ్మకు ఘనంగా ప్రత్యంగిర హోమం అన్నవరం: రత్నగిరి దుర్గామాతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా బుధవారం ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రత్యంగిర హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. 40 మంది భక్తులు రూ.750 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. దీంతో భక్తులకు హోమ మంటపం సరిపోక ఇబ్బంది పడ్డారు. నేడు కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా గురువారం చండీహోమం నిర్వహిస్తారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ హోమాలలో రూ.750 టిక్కెట్తో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు. జిల్లా ఇన్చార్జి సహకార అధికారిగా కుమార్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లా ఇన్చార్జి సహకార అధికారిగా పీబీఎంఎం కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారిగా పనిచేసిన వెంకటకృష్ణ సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూల్ జిల్లా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కుమార్ను నియమించారు. -
అక్షరంపై కక్ష కట్టి..
‘సత్యమేవ జయతే’ హితోక్తిని మకుటంలో ధరించి.. ఆ మాటలను త్రికరణ శుద్ధిగా నమ్మి.. ప్రభుత్వ విధానాల్లోని దుర్నీతిని ఎండగడుతూ.. నిరంతరం జనపక్షం వహిస్తూ.. ప్రజలకు నిత్యసత్యాలను అందిస్తున్న ‘సాక్షి’ అక్షరంపై పాలకులు కక్ష కట్టారు. సాకు కోసం వేచి చూసి.. మూకదాడికి ‘కూటమి’ కట్టారు. అణగారిన ప్రజల మనస్సాక్షిగా నిలుస్తున్న పత్రిక కార్యాలయంపై తెగబడ్డారు. పత్రిక నేమ్బోర్డును బలవంతంగా పెకలించి, ధ్వంసం చేశారు. భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారు. ఆ మూకల బరితెగింపు చూసి అటుగా వెళ్తున్న సామాన్య ప్రజలు నివ్వెరపోయారు. చక్కటి పాలన అందించాలని అందలం ఎక్కిస్తే.. ఇలా అరాచకానికి పాల్పడటమేమిటంటూ నిర్ఘాంతపోయారు. రాజానగరం: ‘సాక్షి’ టీవీలో ఇటీవల జరిగిన ఒక చర్చాగోష్టిలో అమరావతి మహిళలను కించపరిచేలా ఓ వ్యక్తి వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆ పార్టీతో కూటమిగా ఉన్న బీజేపీ, జనసేన శ్రేణులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొని, సాక్షి కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు పాల్పడి, ఆస్తులకు నష్టం కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో రాజానగరంలోని సాక్షి ముద్రణా కార్యాలయం వద్ద కూడా కూటమి నేతలు ఆదివారం నుంచి ఆందోళనలు చేస్తున్నారు. మంగళవారం అవి మరింత పరాకాష్టకు చేరాయి. ఆందోళనకారుల దుర్మార్గ చర్యలను నిరోధించేందుకు ప్రయత్నించిన పోలీసులు కూడా గాయపడ్డారంటే వారి చేష్టలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగిందంటే.. రాజానగరం, అనపర్తి ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ (జనసేన), నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(బీజేపీ)తో పాటు అనపర్తి టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, జనసేన పార్టీ సమన్వయకర్త రావాడ నాగుల ఆధ్వర్యాన రెండు నియోజకవర్గాల నుంచి ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు సాక్షి ముద్రణా కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి, ఆందోళనకు దిగారు. ఉదయం 10.30 గంటల సమయంలో రాజానగరం ఎమ్మెల్యే తన అనుయాయులతో కలసి ఆందోళన చేపట్టారు. సాక్షి మీడియాకు, వైఎస్సార్ సీపీకి, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కొద్దిసేపటికి తన వర్గీయులతో అక్కడకు చేరుకున్న అనపర్తి ఎమ్మెల్యే ఆ ఆందోళనను కొనసాగిస్తూ విధ్వంసం దిశగా నడిపించారు. కార్యాలయం ప్రధాన గేటు ముందు సాక్షి దిన పత్రికలను వేసి దహనం చేశారు. పోలీసులు వారించినప్పటికీ ఆందోళనకారులు ఆగలేదు. దౌర్జన్యం ఎమ్మెల్యే రామకృష్ణరెడ్డి ప్రోత్సాహంతో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకట రామారెడ్డి మరింత రెచ్చిపోయారు. పార్టీ శ్రేణులను ఉసిగొల్ప్పారు. దీంతో, అన్నవరం దేవస్థానం మాజీ డైరెక్టర్ సత్తి దేవానందరెడ్డి (బాబు), రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పుట్ట గంగాధర్ చౌదరి, టీడీపీ మహిళా అధ్యక్షురాలు జుత్తుగ సూర్యకుమారి, ప్రధాన కార్యదర్శి సువాసిని, బిక్కవోలు యూత్ కమిటీ అధ్యక్షుడు పాలచర్ల వెంకట శివ ప్రసాద్ చౌదరితో పాటు కొంతమంది మహిళా కార్యకర్తలు కార్యాలయం ప్రహరీకి అమర్చి ఉన్న సాక్షి నేమ్ బోర్డును బలవంతంగా పెకలించారు. అడ్డుకోబోయిన పోలీసులను ఖాతరు చేయలేదు. ఈ క్రమంలో రాజానగరం సీఐ ఎస్.ప్రసన్న వీరయ్యగౌడ్, ఎస్సైలు నాగార్జున, నారాయణమ్మతో పాటు కొంతమంది పోలీసుల చేతులకు కూడా గాయాలయ్యాయి. ఫ నిజాలు చెబుతున్న ‘సాక్షి’పై అక్కసు ఫ దాడికి ‘కూటమి’ కట్టారు ఫ రాజానగరంలోని పత్రికా కార్యాలయం వద్ద ఆందోళన ఫ మూకుమ్మడి దాడి ఫ అనపర్తి ఎమ్మెల్యే ఆధ్వర్యాన చెలరేగిపోయిన మూకలు ఫ సాక్షి నేమ్ బోర్డు పీకేసి.. పత్రికల దహనం ఫ అడ్డుకోబోయిన పోలీసులకు గాయాలు -
జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి
ఫ పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలి ఫ ఎస్పీకి పాత్రికేయుల వినతి ఫ సానుకూలంగా స్పందించిన బిందుమాధవ్ ఫ జిల్లావ్యాప్తంగా మీడియా ప్రతినిధుల వినతులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్న కూటమి నేతల తీరుపై జనాగ్రహం పెల్లుబుకుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియా ప్రతినిధులు, పాత్రికేయులపై కూటమి సర్కారు దాడులు, కక్ష సాధింపు చర్యలపై జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో ప్రజా, జర్నలిస్టు సంఘాలు మంగళవారం నిరసన తెలిపాయి. జిల్లా కేంద్రం కాకినాడలో పలు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు జిల్లా ఎస్పీ గరికపాటి బిందుమాధవ్కు విజ్ఞాపన అందజేశారు. సాక్షి మీడియాతో పాటు జర్నలిస్టులందరికీ రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ ప్రాంతాల్లోని జర్నలిస్టులు ఎస్పీని కలిశారు. తమ హక్కులు, విధులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా, దాడులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అది తమ బాధ్యతని భరోసా ఇచ్చారు. దాడులను ప్రజాస్వామిక వాదులు ఖండించాలి ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు, జర్నలిస్టులపై దాడులకు తెగబడటం, కార్యాలయాలను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలను ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలని కోరారు. జిల్లా జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, ఇటువంటి దాడులకు తెగబడటం సహేతుకం కాదని అన్నారు. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులపై పోలీసులు తక్షణం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టు డాక్టర్ సబ్బెళ్ల శివనారాయణరెడ్డి, సాక్షి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బ్యూరో చీఫ్ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ కరస్పాంటెడ్ బొక్కినాల రాజు, మేకల వెంకట రమణ, పాత్రికేయులు కొమ్మిరెడ్డి శ్రీధర్, తోట చక్రధర్, విశ్వనాథుల రాజబాబు, బొత్స వెంకట్, తలాటం సత్యనారాయణ, మురళి, దొమ్మేటి నాగరాజు తదితరులున్నారు. సాక్షి మీడియాపై జరుగుతున్న దాడులను తక్షణం కట్టడి చేయాలంటూ కాకినాడతో పాటు కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు పోలీసు స్టేషన్లలో ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లకు విజ్ఞాపనలు అందజేశారు. పిఠాపురంలో జర్నలిస్టులు విజ్ఞాపన పత్రం అందజేసేందుకు వెళ్లగా సీఐ స్థానికంగా లేరు. ఆయన ఆదేశాలతో పిఠాపురం టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ మణికుమార్కు సాక్షి ఆర్సీ ఇన్చార్జి వీవీవీ ప్రసాద్తో పాటు మిగిలిన జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన విలేకరులందరి ఆధార్ కార్డులు, ఇంటి అడ్రస్సులు ఇవ్వాలని ఎస్సై మణికుమార్ అడగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాకినాడ కార్యాలయం వద్ద బందోబస్తు సాక్షి కార్యాలయాలపై దాడులపై ఎస్పీ బిందుమాధవ్కు వినతిపత్రం ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కాకినాడ దేవాలయం వీధిలోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం వద్ద రాత్రి కాకినాడ వన్టౌన్ పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
తప్పిపోయిన బాలుడు
పిఠాపురం: తప్పిపోయిన ఓ బాలుడిని పోలీసులు గంట వ్యవధిలో పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి చెందిన పబ్బిరెడ్డి పాపారావు, కావ్య దంపతులకు మూడేళ్ల కుమారుడు రిత్విక్ శ్రీహన్ ఉన్నాడు. ఆ బాలుడిని తీసుకుని ఆ దంపతులు గొల్లప్రోలు మార్కెట్ సెంటర్లోని కావ్య అన్నయ్య ఘట్టెం అప్పలరాజు ఇంటికి మంగళవారం వెళ్లారు. అక్కడ ఆడుకున్న బాలుడు శ్రీహన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గొల్లప్రోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో కలసి గాలింపు చేపట్టారు. బాలుడు శ్రీహన్ గొల్లప్రోలు వద్ద 216 జాతీయ రహదారి పక్కన ఉన్న ఒక హోటల్ వద్ద ఉన్నట్లు గంట వ్యవధిలోనే గుర్తించారు. ఆ బాబును పట్టుకుని, వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఫ గంట వ్యవధిలో పట్టుకున్న పోలీసులు ఫ తల్లిదండ్రులకు అప్పగింత -
మహిళలను మళ్లీమళ్లీ కించపరుస్తున్నది వాళ్లే..
పిఠాపురం: మహిళల విషయంలో జరిగే ప్రచారాల్లో గోప్యత పాటించాలన్న నిబంధనను విస్మరించి పదేపదే ప్రచారం చేస్తున్నది కూటమి నేతలేనని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, అమరావతి విషయంలో టీవీ డిబేట్లో జరిగిన విషయం తక్కువ మందికే తెలుసన్నారు. కానీ, దానిపై రాద్ధాంతం చేసి అన్ని చానళ్లలో పదేపదే ప్రచారం చేస్తూ, బహిరంగంగా మాట్లాడుతూ మహిళలను కించపరుస్తున్నది కూటమి నేతలేనని ఆమె మండిపడ్డారు. ఒకసారి అన్న మాటలను పదేపదే అంటున్న కూటమి నేతల పైనే కేసులు పెట్టాలని అన్నారు. మహిళలపై అభ్యంతరకర మాటలు మాట్లాడిన వారి కంటే, వాటిని బహిరంగంగా ప్రచారం చేస్తున్న వారే నేరస్తులవుతారని చట్టాలు చెబుతున్నాయన్నారు. టీవీ లైవ్ డిబేట్లలో అనుకోకుండా తప్పులు దొర్లుతూంటాయని, వాటిని సరిదిద్దుకోవాల్సిన వారు సరి చేసుకున్నా పట్టించుకోకుండా, అన్నవారిపై కాకుండా ఎటువంటి తప్పూ చేయని కేఎస్ఆర్పై అక్రమ కేసు పెట్టి వేధించడం సరికాదని గీత అన్నారు.ఇదే విషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోందని, వాటిపై కూడా కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి నేతలు దాడులకు దిగుతున్నారన్నారు. సాక్షి టీవీ చానల్కు, పత్రికకు సంబంధం లేని అంశాన్ని వాటిపై రుద్ది కావాలనే సాక్షి కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉండే పత్రికా స్వేచ్ఛపై దాడికి దిగడం అమానుషమని పేర్కొన్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతమైందని, ప్రజల నుంచి ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఏమీ చేయలేని కూటమి నేతలు పత్రికా కార్యాలయాలపై ఇలా దాడులకు ఎగబడుతున్నారని దుయ్యబట్టారు. కేవలం ఏడాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం కూటమిదేనని, అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సాక్షి పత్రిక, చానల్పై లేనిపోని రాద్ధాంతం చేసి, అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఇటువంటి తప్పుడు చర్యలకు స్వస్తి చెప్పి, ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేయాలని, లేకపోతే ప్రజలందరూ కూటమి నేతలను రోడ్డుకీడ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని గీత అన్నారు. -
సచివాలయం అద్దాలు ధ్వంసం
తుని రూరల్: మండలంలోని తాళ్లూరు గ్రామ సచివాలయం కిటికీల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. సోమవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఎంపీడీఓ కె.సాయినవీన్, డిప్యూటీ ఎంపీడీఓ జి.మరిడయ్య సూచనల మేరకు సచివాలయ కార్యదర్శి రేష్మా తుని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సమీపంలో నివాసం ఉంటున్న వారిని విచారించారు. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలో భాగంగా రూ.40 లక్షలతో భవనం నిర్మించి, ఫర్నిచర్ ఏర్పాటు చేశారు. దీనిని 2023 జూలైలో అప్పటి ఆర్అండ్బీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ భవనంలో మూడు కిటికీల అద్దాలను ధ్వంసం చేసింది ఆకతాయిలా, తాగుబోతులా లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. సమీపంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఉన్న బీచ్లో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతుకాగా అందులో ఒకరు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన యాళ్ళ హరికిషోర్(19), అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఇసుకపట్ల జస్వంత్(19), మరో ముగ్గురు నేదునూరుకు చెందిన యువకులు ఎస్.యానం బీచ్కు వచ్చి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. వీరు ఐదుగురు స్నేహితులు. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల్లో హరి కిషోర్, జస్వంత్ సముద్రంలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా హరికిషోర్ మృతదేహం లభ్యమయిందని, జస్వంత్ కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ సీహెచ్.రాజేష్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం... అంబాజీపేట: మృతిచెందిన యాళ్ల హరికిషోర్ ఓ ప్రైవేటు కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దిక్కెవరని బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరి స్వగ్రామం పి.గన్నవరం కాగా మృతుడి తండ్రి కుమార్ ఎస్.యానం ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. తల్లి నాగమణి, అతని సోదరి మాచవరం కుసుమవారిపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అందరితో సరదగా ఉండే హరికిషోర్ ఇక లేడని తెలియడంతో కుసుమవారిపేటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హరికిషోర్ అందరితో కలిసి ఉండేవాడని అతని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గల్లంతైన మరొకరి కోసం గాలింపు -
మహిళల రక్షణలో ఘోర వైఫల్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో సీ్త్రలు, బాలికలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మహిళలు మండిపడ్డారు. మహిళలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యాచారాలు, హత్యలు లెక్కకు మిక్కిలిగా జరుగుతున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో మహిళలు కాకినాడలో మంగళవారం కదం తొక్కారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కాకినాడ ఇంద్రపాలెం వద్ద ఉన్న అంబేడ్కర్ సెంటర్లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నేలపై కూర్చుని నిరసన తెలిపారు. వారినుద్దేశించి మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం కో ఆర్డినేటర్ వంగా గీత మాట్లాడుతూ, కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలపై ప్రతి రోజూ పదుల సంఖ్యలో దాడులు, హత్యాచారాలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మహిళలకు రక్షణ కరువైందని, చిన్నారులపై హత్యాచారాలు మితిమీరిపోయినా ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందని, మహిళలపై దాడులు అరికట్టాలని, రక్షణ కల్పించాలని, ప్రభుత్వం తక్షణం స్పందించాలని, జై జగన్ అని పెద్ద పెట్టున నినదించారు. వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా కమిటీ ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించిన అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీశికుమారి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న విద్యాసాగర్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఫ కాకినాడలో మహిళల ఆందోళన ఫ భారీ ర్యాలీ, ధర్నా ఫ అంబేడ్కర్ విగ్రహానికి విజ్ఞాపన -
ఎండ వేడికి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో ఎండ వేడికి సోమవారం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రానన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ బయటకు రావడంతో అంటుకొని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న గడ్డి మొక్కలు మంటలకు కాలిపోయాయి. పురుషోత్తపల్లి విద్యుత్ ఏఈ బి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఓ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30,000 ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో నిడదవోల పట్టణంలోని బసివిరెడ్డిపేట, నిడదవోలు మండలంలోని సమిస్రగూడెం, అట్లపాడు, తాళ్లపాలెం, శెట్టి పేట గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
కరవాక తీరానికి వింత జీవులు
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రగతిలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో జేఎన్టీయూ కాకినాడ, వాద్వాని ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ట్రైన్ది ట్రైనర్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఎంటర్ప్రెన్యూర్ షిప్ డెవలప్మెంట్ అండ్ వెంచర్ క్రియేషన్ అంశంపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని సోమవారం జేఎన్టీయూకే వీసీ ప్రొఫెసర్ సీఎస్ఆర్కే ప్రసాద్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇటువంటి స్వయం ఉపాధికి సంబంధించిన కార్యక్రమాలు వికసిత్ భారత్ 2047–సర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయడానికి దోహదపడతాయన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ శిక్షణకు తమ కళాశాలను ఎంచుకోవడం సంతోషంగా ఉందని, వాద్వాని ఫౌండేషన్ డైరెక్టర్, పార్టనర్ షిప్ దయాకరమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. జేఎన్టీయూకే అకడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.బాలకృష్ణ, డైరెక్టర్ మేనేజ్మెంట్ హరినాథబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డైరెక్టర్ అకడమిక్స్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్ జి.నరేష్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ కె.ఆనంద్ పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి
● నారుమడుల సంరక్షణతో నాణ్యమైన దిగుబడులు ● రైతులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ● వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మేలు ఆలమూరు: ఖరీఫ్ పంటకు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఖరీఫ్లో అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.63 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంకా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులను సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్లో స్వర్ణ (7029), ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని సూచనలిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. నారుమళ్ల దశలో సరియైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని వ్యవసాయశాఖ చెబుతోంది. సస్యరక్షణ చర్యలు నారుమడుల తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు చెబుతున్నారు. ● తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులను ఏర్పాటు చేసుకునేందుకు 10–12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి. ● పొలాల్లో నీరు పారేందుకు చిన్న చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని ప్రతి మొక్కకు నీరు అందేలా చూడాలి. ● ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పోటాష్నిచ్చే ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి. ● చలి తీవ్రత ఎక్కువగ ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి. ● వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి. ఆకు కొద్దిగా ఎదిగి ఒక దశకు వచ్చిన తరువాత నీటిని నిల్వకట్టాలి. ● జింక్లోపం గమనిస్తే లీటరు నీటిలో రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. ● చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాళ్వా వరి సాగుకు కనిపించే జింక్ లోప లక్షణాలను గుర్తిస్తే సత్వరమే వ్యవసాయశాఖ సూచనలు తీసుకోవాలి. ● నారు తీయడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే ఐదు సెంట్లలో వేసిన నారుమడికి ఒక కేజీ కిర్టోప్యూరాన్ గుళికలను తక్కువ నీటిలో సమానంగా చల్లాలి. నాట్లు వేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ● వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ● నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి. ● 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు. ● పొలాన్ని దమ్ము చెక్కతో కాని యంత్ర పరికరంతో గాని చదును చేయాలి. ● నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది. ● నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. ● నారు ౖపైపెన ఉండే విధంగా నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. ● నారు వేసేటపుడు భూసారాన్ని బట్టి చదరపు మీటరుకు 33 మూనలు ఉండేటా నాటాలి. ● వరి నాట్లు నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటిమీటర్ల చొప్పున బాటలు వేయాలి. ● దీనివల్ల పైరుకు వెలుతురు తగిలి చీడపీడలు నివారణకు దోహదపడుతుంది. ● నారుమడి మునిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు ● నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి. ఠిమొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి. ● నారుమడికి తెగుళ్లు సోకకుండా లీటరు నీటిలో రెండు గ్రాముల కార్బన్డిజమ్, 2.5 మి.గ్రా క్లోరోపైరీపాస్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయంగా వెదజల్లు విధానాన్ని అవలంబించి సమయం, పెట్టుబడిని ఆదా చేసుకోవాలి. వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను తీసుకుంటే నారుమడి దెబ్బతిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ ద్వితీయార్థంలో నారుమళ్లు చేపట్టాలి 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూన్ ద్వితీయార్థంలో నారుమళ్ల ప్రక్రియను చేపట్టి జూలై 15 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ చెబుతోంది. దీనివల్ల అక్టోబర్ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది. దీనివల్ల ఏటా నవంబర్ నెలలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను నుంచి తప్పించుకోవచ్చునని, మళ్లీ డిసెంబర్ చివరి నాటికి రబీ సాగుకు సంబంధించి వరినాట్లు పూర్తి చేస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి రబీ పంట చేతికొస్తుందని, దీనివల్ల మూడవ పంటగా అపరాల సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ సూచనలు కచ్చితంగా పాటిస్తూ భూసారం పెరిగి ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీగా త్రినాథరావు
అన్నవరం: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావును దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (రాజమహేంద్రవరం)గా బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థానానికి ఈఓని నియమించేవరకు ఆ దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా కూడా కొనసాగాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్జేసీగా పనిచేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓ వి. సత్యనారాయణమూర్తికి ఇన్చార్జి బాధ్యతలు తొలగించారు. త్రినాథరావు గతంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా, రెండుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా, 2020–22 మధ్య రెగ్యులర్ ఈఓగా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఓగా 2024లో బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన సెలవు పై విదేశాలకు వెళ్లగా ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీ సుబ్బారావును సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఆరుగుగు భక్తులు మృతి చెందిన ఘటనలో ఇన్చార్జి ఈఓ సుబ్బారావుతో సహా ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త్రినాథరావు సెలవు అనంతరం మే 26న సింహాచలం దేవస్థానం ఈఓగా జాయిన్ అయ్యారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుతూ టీచర్ల నిరశన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు మాన్యవల్ విధానంలో కౌన్సెలింగ్పై స్పష్టత లేకపోవడంతో సోమవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద ఽనిరాహార దీక్ష చేపట్టారు. ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సెలింగ్కు ఉపాధ్యాయ ఐక్యసంఘాలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. మాన్యువల్ కౌన్సెలింగ్కే కట్టుబడి ఉండటంతో వెబ్ ఆప్షన్లకు లింక్ విడుదల చేసినప్పటికీ ఆప్షన్లు ఇవ్వడం లేదు. దశలవారీ పోరాటంలో భాగంగా ఐక్యవేదిక పిలుపు మేరకు నిరహార దీక్ష చేపట్టారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. పీడీఎఫ్ ఎంఎల్సీ బొర్రా గోపిమూర్తి హాజరై సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. జీవో నంబర్ 22లో అనేక లోపాలున్నాయని, దాన్ని మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
స్వామి పుష్కరిణిలో డెవిల్ ఫిష్!
● యథేచ్ఛగా చేపల వేట ● అసలు అవి ఎలా వచ్చాయి? ● ఇద్దరి మృతితో ఎట్టకేలకు నీటికి మోక్షం గండేపల్లి: తాళ్లూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి గజేంద్ర మోక్ష పుష్కరిణిలో కొందరు ఆకతాయిలు సోమవారం చేపలను వల సహాయంతో పట్టుకుని తీసుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో పెరిగిన చేపలను పట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆలయాలలో ఉండే కోనేరులలో పెరిగిన చేపలను విష్టుమూర్తి మత్స్యావతారంగా భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో చేపలను పట్టుకోవడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు. అసలు పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? గజేంద్ర మోక్ష పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? ప్రకృతి సహజసిద్ధమా! ఎవరైనా చేప పిల్లలను కోనేరులో వేశారా అన్నది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో కొందరు కోనేరులో చేప పిల్లలను పెంపకానికి వేయడంతో అడ్డుకున్నామని అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో వేసిన చేపల పెట్టిన గుడ్లే ప్రస్తుతం కోనేరులో చేపలు పెరగడానికి కారణం కావచ్చు అంటున్నారు. ఘోరం జరిగే వరకూ మనసు కరగదా ఘోరాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయే వరకూ స్పందించారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణికి మెట్ల మార్గం నాచుకట్టి కనీసం భద్రత లేకపోవడంతో ఇటీవల బొర్రంపాలెంకు చెందిన తండ్రీ కొడుకు స్నానాకికి దిగి మృతిచెందారు. దీంతో రెవెన్యూ, దేవదాయశాఖ, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టేందుకు తగు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు. పుష్కరిణిలో నీటికి మోక్షం ఎట్టకేలకు పుష్కరిణిలో నీటికి మోక్షం కలిగింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇది సాధ్యమైంది. కొన్ని సంవత్సరాలుగా పుష్కరిణిలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి తట్టు తేలి పుష్కరిణి (కోనేరు) ప్రమాదకరంగా మారింది. పదవులు లేకపోయినా కొందరు పెత్తనం చెలాయించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆటకం కలుగుతోందని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు. పుష్కరిణిలో డెవిల్ ఫిష్ పుష్కరిణిలో సాధారణ చేపలతో పాటు డెవిల్ ఫిష్లు పెరిగాయి. పుష్కరిణిలో నీరు తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు దిగిన వారి వలకు ఈ డేవిల్ ఫిష్లు చిక్కాయి. అటుగా వెళ్లే వారందూ వాటిని చూసేందుకు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. ఈ డేవిల్ ఫిష్, ఇతర జాతులకు చెందిన చేపలు పుష్కరిణి అడుగుబాగం బురదలో తేలియాడుతున్నాయి. -
అలల దారిలో..వేటబాటలో..
కాకినాడ రూరల్: సాగర తీరంలో క్రమంగా సందడి మొదలవుతోంది.. వలలు సిద్ధమవుతున్నాయి.. అలల దారిలో పయనించేందుకు బోట్లు రెడీ అవుతున్నాయి.. సుమారు రెండు నెలల సుదీర్ఘ విరామం అనంతరం సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు సిద్ధమవుతున్నారు. చేపల సంతానోత్పత్తికి వీలుగా గత ఏప్రిల్ 15 నుంచి బంగాళాఖాతంలో చేపల వేటపై నిషేధం అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నిషేధం గడువు ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రితో ముగియనుంది. నాలుగు రోజుల్లో మత్స్యకారులు ఎటువంటి ఆంక్షలూ లేకుండా సముద్రంలో చేపల వేట చేసుకోవచ్చు. దీంతో, సముద్రంలో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు అన్నివిధాలా సంసిద్ధులవుతున్నారు. దీంతో, మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని తినేందుకు సముద్రపు చేపలు, రొయ్యలు, పీతలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వాసులకే కాకుండా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఇవి ఎగుమతి కానున్నాయి.జిల్లాలో తొండంగి మండలం మొదలుకొని తాళ్లరేవు వరకూ సుమారు 94 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీర ప్రాంత మండలాల్లో 58 మత్స్యకార ఆవాసాలున్నాయి. సుమారు 1,95,184 మంది మత్స్యకారులు నివసిస్తున్నారు. వీరిలో సముద్రంలో చేపల వేట ద్వారా 36,101 మంది ఉపాధి పొందుతున్నారు. మత్స్యకారులతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి సుమారు 75 వేల మంది చేపల వేట, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో మొత్తం 23 చోట్ల ఫిష్ ల్యాండింగ్ సదుపాయం ఉండగా కాకినాడలో కమ్యూనికేషన్ స్టేషన్ అందుబాటులో ఉంది. 410 మెకనైజ్డ్, 3,732 మోటారైజ్డ్ బోట్లతో పాటు 287 సంప్రదాయ పడవల ద్వారా జిల్లాలోని మత్స్యకారులు సముద్రంలో చేపల వేట సాగిస్తున్నారు. ప్రధానంగా కాకినాడ కుంభాభిషేకం, షిషింగ్ హార్బర్, ఉప్పాడ రేవులు చేపల ఎగుమతులకు ప్రసిద్ధి చెందాయి.వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మత్స్యకార భరోసావైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019 నుంచి 2024 వరకూ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10 వేల చొప్పున వేట నిషేధ భృతి ఇచ్చి ఆదుకుంది. ఆంతకు ముందు టీడీపీ ప్రభుత్వం రూ.4 వేలు మాత్రమే అందించేంది. దీనిని 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.10 వేలకు పెంచారు.నేడు సక్రమంగా అందని పరిహారంకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ.20 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. గత ఏడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టేశారు. తాజాగా 2025 వేట నిషేద భృతి మాత్రం చెల్లించింది. జిల్లాలో 4,451 బోట్లకు సంబంధించి 25,752 మంది మత్స్యకారులను గుర్తించగా.. రకరకాల వడపోతల అనంతరం వీరిలో 24,762 మందిని అర్హులని నిర్ధారించారు. వీరిలో 1,445 మందికి వేట నిషేధ భృతి జమ కాలేదు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ అవకపోవడంతో నిధులు జమ కాలేదని, వీటిలో 1,200 మందివి సరిచేసి తిరిగి ప్రభుత్వానికి పంపామని, మిగిలిని 245 మంది ఊళ్లలో లేకపోవడంతో సమస్య ఏర్పడిందని మత్స్యశాఖ అధికారులు వెల్లడించారు. -
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 168 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పి.నారాయణ తదితరులు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక నుంచి ఏటా డీఎస్సీ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని చెప్పారు. కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, షైనింగ్ స్టార్స్–2025 కింద జిల్లాలో మండలానికి ఆరుగురు చొప్పున 132 మంది పదో తరగతి విద్యార్థులను, వివిధ కేటగిరీల్లో 36 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు ఇదే స్ఫూర్తితో ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ తదితరులు కూడా ప్రసంగించారు. తొలుత ప్రతిభా పురస్కారానికి ఎంపికై న విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టర్ షణ్మోహన్ నేరుగా మాట్లాడారు. ఉత్తమ మార్కులు సాధించడానికి గల కారణాలు, తల్లిదండ్రుల వివరాలు, తమ పాఠశాల, కళాశాలల్లోని వసతులు, తదుపరి చదువులకు ఎంచుకున్న కోర్సులు, భవిష్యత్తు ప్రణాళికలను ఆయా విద్యార్థులు వివరించారు. కాకినాడ రూరల్ మండలం స్వామి జూనియర్ కళాశాలకు చెందిన దివ్యాంగ విద్యార్థిని విసరపు హాసినిశ్రీ, సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని చిడత శివలక్ష్మిని దత్తత తీసుకుంటామని ఎమ్మెల్సీ రాజశేఖరం, ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. భవిష్యత్తు ప్రణాళికలు, అభిరుచులు తెలుపుతూ విద్యార్థులు స్వయంగా రాసి, అందంగా చిత్రించిన షైనింగ్ స్టార్స్ వాల్స్ను అతిథులు వీక్షించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, జిల్లా పాఠశాల విద్యా శాఖ అధికారి పి.రమేష్, ఎస్ఎస్ఏ పీఓ పి.వేణుగోపాలరావు, డీఐవో ఐ.శారద పాల్గొన్నారు. -
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివాహాల సీజన్ కావడంతో ప్రతి రోజూ ఆలయంలో నవదంపతుల సందడి కనిపిస్తోంది. సోమవారం సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు నిర్వహించారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అమ్మవారు ఏ విధమైన ఆభరణాలూ లేకుండా ముత్యాల కవచాలు (ముత్తంగి సేవ) ధరించి భక్తులకు దర్శనమిచ్చారు. సత్యదేవుని సన్నిధిలో జస్టిస్ మాలఅన్నవరం: మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.మాల తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సత్యదేవుని దర్శించారు. రత్నగిరిపై సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించి, పూజలు చేశారు. వారికి పండితులు వేదాశీస్సులు, ఈఓ వీర్ల సుబ్బారావు స్వామివారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ద్రాక్షారామ భీమేశ్వరునికి వెండి శంఖం బహూకరణ రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామికి హైదరాబాద్కు చెందిన తంగిరాల రవికిరణ్, నాగలక్ష్మీ శైలజ దంపతులు 328 గ్రాముల బరువు గల వెండి శంఖాన్ని సోమవారం సమర్పించారు. హైదరాబాద్కే చెందిన అనుమోలు దేవా, కుటుంబ సభ్యులు ఆలయ చండీ హోమ పండితుడు జుత్తిక చిన్నా ప్రోత్సాహంతో ఆలయానికి 8 కూలర్లు అందజేశారు. దాతలకు స్వామివారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికలను ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని అందజేశారు. నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు ధవళేశ్వరం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్లో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో వచ్చే వారంలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. -
‘సాక్షి’పై దాడులు ఆపాలి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యుడు కె.స్వాతిప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరుస్తూ ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై పలుచోట్ల పౌరులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం గర్హనీయమన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ నేతలు వెంటనే తమ కార్యకర్తలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లైవ్ షో నిర్వాహకుడు, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన షోలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పినందున, ఆయన సీనియార్టీ, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని స్వాతిప్రసాద్ కోరారు.‘సాక్షి’పై దాడులు ఆపాలి‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ రాజానగరంలోని పత్రిక యూనిట్ కార్యాలయం వద్ద సిబ్బంది సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, పత్రికా కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రాంచి మేనేజర్, రీజినల్ మేనేజర్ రమేష్రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కాగా,సాక్షిపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో పాత్రికేయులు పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. -
కొమ్మినేని అరెస్టు హేయం
కాకినాడ రూరల్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం చాలా హేయమైన చర్యని, రాష్ట్రంలో కక్షసాధింపులకు ఇదొక నిదర్శనమని మాజీ మంత్రి, ఒకప్పటి జర్నలిస్టు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకంటే సీనియర్ అయిన కొమ్మినేని ప్రస్తుతం సాక్షిలో పని చేస్తున్నారని, ఆయనను అరెస్టు చేయడం సాక్షిపై కక్షో లేక వైఎస్సార్ సీపీపై కక్షో తెలియడం లేదని అన్నారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యక్తం చేసే అభిప్రాయాలకు దానిని నిర్వహిస్తున్న మోడరేటర్ కొమ్మినేనిని బాధ్యులను చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రజలు ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్లను అరెస్టు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని, ఇప్పుడు జర్నలిస్టుల అరెస్టులు కూడా ప్రారంభించారని దుయ్యబట్టారు. కొమ్మినేని అరెస్టును కన్నబాబు తీవ్రంగా ఖండించారు. -
ఇసుకాసురులు
● ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకూ.. ● చెలరేగిపోతున్న అక్రమార్కులు ● ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా ● గోదావరి ఇసుక, తువ్వ, సముద్ర తీరంలో బొండు ఇసుక, చేలల్లో మట్టి తవ్వకాలు ● దేనినీ వదలని కూటమి నాయకులు ● జిల్లాలో 20 అధికార ర్యాంపుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సొంతంగా డ్రెడ్జింగ్ గోదావరి నదీపాయల్లో పడవల మీద డ్రెడ్జర్లు ఏర్పాటు చేసి మరీ ఇసుక తోడేశారు. పి.గన్నవరం మండలం ఊడిమూడిలంకలో అనధికార ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి ఇసుకతో పాటు మట్టి తవ్వకాల కోసం ఏకంగా డ్రెడ్జింగ్ చేశారు. ఇది లంక గ్రామాలకు పెనుముప్పు. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిలిపివేశారు. సాగర తీరాన్నీ వదలకుండా.. జిల్లాలో అల్లవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లోని తీర గ్రామాల్లో సముద్ర ఇసుక తవ్వకాలు జోరుగా సాగిపోయాయి. ఇప్పటికీ సాగుతూనే ఉన్నాయి. తీరంలోని తువ్వ ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. గతంలో చాటుమాటుగా ఈ వ్యవహారాలు సాగుతున్నా ఇటీవల అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. మలికిపురం మండలం తూర్పుపాలెం, కేశనపల్లిల్లో ఇసుక తవ్వకాల జోరు కాస్త తగ్గినా ఆగడం లేదు.సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో గత ఏడాది ప్రభుత్వం మారినప్పటి నుంచి నేటి వరకూ ఇసుకాసురులు చెలరేగిపోతూనే ఉన్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అంటున్నా అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. ఇక అనధికార ర్యాంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘నదీపాయల్లో బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనను టీడీపీ, జనసేన నేతలు వరంగా మార్చుకున్నారు. బాబు చెప్పిన దాని ప్రకారం జిల్లా ఇసుక కమిటీ ఎంపిక చేసిన ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుక తవ్వాల్సి ఉంది. కానీ, ఇదే అదనుగా కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకు గోదావరి నదీపాయలను దొలిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గత ఏడాది జూన్ 4న వెలువడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. ఆ రోజు సాయంత్రం నుంచే ఇసుక అక్రమార్కులు దందాకు తెర తీశారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరదలు భారీ వర్షాల సమయంలో ఇసుకకు కొరత రాకుండా ఆరు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా ఇసుక నిల్వ ఉంచింది. మొత్తం 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆగస్టు మొదటి వారానికల్లా ఇసుకాసురులు ఊడ్చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇసుక లేకుండా చేశారు. ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. స్టాక్ పాయింట్ల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా లారీకి అదనంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గ కీలక నేతలు బి–టాక్స్, వి–ట్యాక్స్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఆర్జెడ్ పరిధిలో.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో సైతం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ ఇసుక తవ్వేశారు. అది కూడా గోపాలపురం – సిద్ధాంతం మధ్య ఉన్న రెండు వంతెనలకు 300 మీటర్ల సమీపంలోనే ఇసుక తవ్వేయడం గమనార్హం. పి.గన్నవరంలో సైతం సీఆర్జెడ్ నిబంధనలను తోసిరాజని తవ్వేశారు. అయినవిల్లి మండలం కొండుకుదురు పరిసర ప్రాంతాలు, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, కొమరగిరి, పాత ఇంజరం, గుత్తెనదీవి, జి.వేమవరం, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంకలలోను సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వేశారు. పి.గన్నవరంలో ‘జట్టు కట్టారు’ పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూటమి నేతలు ఎన్నికల్లోనే కాకుండా ఇసుక అక్రమ తవ్వకాల్లో సైతం జట్టు కట్టారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరం, ఆదుర్రులో ఇసుక తవ్వకాలు సాగించారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెంలో తువ్వ ఇసుక అనుమతులు తెచ్చుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనుమతులివ్వగా దీనిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. పెదకందాలపాలెం, ఉడిమూడి, మానేపల్లిలో సైతం ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. -
ఎన్ని జన్మలెత్తినా.. కూతురు, అల్లుడిపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ: తన కుమార్తె, అల్లుడి కుటుంబంపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై మరో కుటుంబం కొంత కాలంగా దాడి చేస్తోందని ముద్రగడ చెప్పుకొచ్చారు. తనకు కాన్సర్ వచ్చిందని.. తన చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుమారుడి ఎదుగుదలను చూసి కొందరు ఏడుస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను అంటూ క్లారిటీ ఇచ్చారు.తన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మాజీ మంత్రి ముద్రగడ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా ముద్రగడ లేఖను విడుదల చేశారు. లేఖలో ముద్రగడ..‘మా కుటుంబంపై మరో కుటుంబం కొంతకాలంగా దాడి చేస్తుంది. మా కుటుంబాల మధ్య సంబంధాలు పూర్తిగా నిలిచిపోయాయి. మా అబ్బాయి ఎదుగుదల చూసి కొందరు దారుణంగా ఏడుస్తున్నారు. వారితో మాకు ఏమాత్రం సంబంధం లేదు. నాకు క్యాన్సర్ వచ్చిందని, నా చిన్న కొడుకు పట్టించుకోవడం లేదని తప్పుడు ప్రేలాపన చేస్తున్నారు. నాకు, నా కొడుకుకు మధ్య మనస్పర్థలు పెంచి దూరం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని జన్మలెత్తినా వారి గుమ్మం ఎక్కను.నాకు, నా వియ్యంకుడు శివాజీకి మధ్య మనస్పర్థలు తేవాలని చూస్తున్నారు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు మానుకోండి. నా కొడుకునే కాదు.. మనవడిని కూడా రాజకీయాల్లోకి తీసుకెళ్తాను. వారిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. నాపై ఎవరో ఏడుస్తున్నారని రాజకీయాలను వదిలిపెట్టను. తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి.. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు. ఆమె మామగారికి క్యాన్సర్ వస్తే రాజమండ్రి హాస్పిటల్లో నేను 15 రోజులు సేవ చేశాను. వీళ్ళు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నారు. వయసు రీత్యా నాకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప.. మరేవీ లేవు. గతంలో నా భార్యకు క్యాన్సర్ వచ్చినప్పుడు వారింటికి వెళ్తే ఐదు నిమిషాలు కూడా మా వద్దకు రావద్దని కూతురు, అల్లుడు చెప్పారు. వీళ్లా ఈరోజు మాట్లాడేది. వీళ్లతో ఏడాది నుంచి రాకపోకలు ఆగిపోయాయి. ఏం ఆశించి నన్ను టార్గెట్ చేస్తున్నారు. వీరు బెదిరిస్తే బెదిరి పోతానా?. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాను. కార్యకర్తలతో కూడా మాట్లాడుతున్నాను.ప్రభుత్వ జీవోలపై ఆ కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారు. మీకు అంత దమ్ము, ధైర్యం ఉంటే కాపులను బీసీల్లో కలిపి కార్యక్రమం చేయించండి. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రితో అమలు చేయించండి. పథకాలు అమలు చేపించి చూపించండి.. అప్పుడు మీ డబ్బా కొట్టుకోండి. మీ చీప్ పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారి బతకొద్దు. ఎన్ని జన్మలెత్తినా మీకు మాకు సంబంధాలు ఉండవు. అనవసరంగా నా ప్రస్తావన తేవద్దు. సిగ్గు, మర్యాద ఉంటే ఈరోజు నుంచి తప్పుడు ప్రచారం ఆపండి’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. pic.twitter.com/QeI22pfm0Z— Mudragada Padmanabhareddy (@Iam_Mudragada) June 9, 2025 -
జనసేనలో ‘మట్టి’ కుస్తీ
పిఠాపురం: వరుస వివాదాలతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని జనసేన నాయకులు పరువు తీసుకుంటున్నారు. శనివారం ఇసుక వివాదం సద్దుమణగక ముందే ఆదివారం చెరువు మట్టి కోసం జనసేనలోని రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణలో తమపై దాడి చేశారని విరవ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ కురుమళ్ళ రాంబాబు పిఠాపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ.. రైతుల అవసరాల పేరుతో ఎఫ్కే పాలెం – విరవాడ గ్రామాల మధ్య పాపిడిదొడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అధికారుల నుంచి జనసేన నాయకులు అనుమతులు పొందారు. చెరువులోని మట్టిని మండలంలోని పలు ఇటుక బట్టీలకు విక్రయిస్తున్నారు. మట్టి తరలింపులో కొన్ని బట్టీలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలిన వారికి ఇవ్వడం లేదని జనసేన నేత కురుమళ్ళ రాంబాబు ఆరోపించారు. చెరువులో మట్టి తవ్వకాలను పరిశీలించేందుకు ఆదివారం వెళ్లిన ఆయన మట్టి తరలింపు చేపడుతున్న వారిని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మట్టి తవ్వకందారులు రాంబాబుతోపాటు సకుమళ్ళ నాగేశ్వరరావు, కురుమళ్ళ మణికంఠ స్వామి, ఆకుల ఆదినారాయణలపై దాడికి పాల్పడ్డారు. రాంబాబు చొక్కా చించివేశారు. కొందరికి గాయాలయ్యాయి. దీంతో కురుమళ్ళ రాంబాబు తదితరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ప్రభుత్వాస్పత్రికి పంపించారు. పేట్రేగిపోతున్న మట్టి మాఫియాపై అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నిరుద్యోగ భృతి లేదు
నిరుద్యోగ భృతిని ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. 2014లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి కేవలం ఒక్క నెల మాత్రమే.. అది కూడా ఎంపిక చేసిన తమ పార్టీ కార్యకర్తలకు ఒక్క నెల మాత్రమే నిరుద్యోగ భృతి అందజేసి అయిందనిపించారు. ఈసారి ఎన్నికల ముందు టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోలో మరోసారి నిరుద్యోగ భృతిని పెట్టారు. అది కూడా సూపర్ సిక్స్ పథకంలో దీనిని ఒక హామీగా చెప్పారు. గెలిచి ఏడాది అవుతున్నా ఆ హామీ నెరవేర్చకుండా నిరుద్యోగ యువతను చంద్రబాబు రెండోసారి మోసం చేసి జోకొడుతున్నారు. జిల్లాలో సుమారు 20 వేల మంది వరకు నిరుద్యోగ యువత ఉంటుందని అంచనా. వీరికి నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాది కాలంలో రూ.36 వేలు కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టినట్టు అవుతుంది. మొత్తం మీద ఏడాది కాలంలో రూ.72 కోట్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఎగ్గొట్టింది. -
అమాంతం పెరిగిన రూప్చంద్ ధర
మలికిపురం(కాకినాడ): రూప్చంద్ చేపల ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం కేజీ రూ.30కి పడిపోయిన కేజీ రూప్చంద్ చేపలను ఎగుమతిదారులు ప్రస్తుతం రూ.114కు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారని ఎగుమతిదారులు అంటున్నారు. 2020లో అత్యధికంగా కిలో రూ.70 పలికిన ఈ చేప ధర అనంతరం రూ.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ధర అయితే పెరిగిందిగానీ, రైతుల వద్ద సరకు లేదు. చెరువుల్లో కిలో రూప్చంద్ పెంపకానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.80 వరకూ అవుతోంది. నాలుగేళ్లుగా ధర లేక నష్టాల బారిన పడిన రైతులు రూప్చంద్ పెంపకం జోలికే వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర పెరిగినా రైతుల వద్ద సరకు లేదు. ఈ చేపలకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బాగా డిమాండ్ ఉంది.గతంలో భారీగా ఎగుమతులుకోస్తా జిల్లాల్లో పదేళ్లుగా ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు ఐదేళ్ల క్రితం ముమ్మరంగా రూప్చంద్ చేపల సాగు చేశారు. కోస్తా జిల్లాల నుంచి ఏటా 25 వేల టన్నుల రూప్చంద్ చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవని అంచనా. అయితే, ధర పతనమైన తరువాత రైతులు దాని జోలికి వెళ్లలేదు. వేరే అవకాశం లేని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలో ఈ చేపల సాగు నిలిపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏటా 5 వేల టన్నులకు పైగా ఈ చేపల ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ధర బాగున్న సమయంలో ఇక్కడి రైతులు సాగు చేశారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని ఈ చేప పెరుగుతుంది.ఇవీ ప్రత్యేకతలుకొన్ని దేశాల్లో పిరాపింగా లేదా రెడ్–బెల్లీడ్ పాకు అని కూడా ఈ చేపను పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా మూలానికి చెందిన మంచినీటి చేప. రెడ్–బెల్లీడ్ పాకును అసోంలో సాధారణంగా శ్రీరుప్చంద్ఙ అని పిలుస్తారు. పాకు అనేది అనేక దక్షిణ అమెరికా చేప జాతులను సూచించడానికి ఉపయోగించే సాధారణ పేరు. ప్రత్యేకమైన రుచి కలిగిన చేపల్లో రూప్చంద్ ఒకటి. చెరువుల్లో పెంచుతారు కాబట్టి దీనిని కోస్తాలో చెరువు చందువా అని పిలుస్తారు. సముద్ర చందువా చేపలకు పోటీగా దీనిని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రవేశపెట్టారు. కోల్కతా నుంచి సీడ్ వస్తుంది. సముద్ర చందువా చేపలు ఒక సీజన్లో మాత్రమే లభిస్తాయి. రూప్చంద్ చేప మన దేశంతో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. సముద్ర చందువాతో పాటే, చెరువు చందువా చేపను చైనీస్లో ఫ్రాంఫెట్ అని పిలుస్తారు. తెలుగులో దీనిని చందువా లేదా సందువా అని అంటారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగుల్లో ఉంటాయి. చెరువుల్లోనూ, నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప ప్రత్యేకత. అయితే ముళ్లు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్చంద్ మాంసంలో ఎక్కువగా ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రూప్చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్–సి, విటమిన్–ఇ, శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు బాగా పని చేస్తుంది. గుండె జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మానవ శరీరంలోని ఎంజైముల పని తీరును మెరుగుపరుస్తాయి.పెరిగిన ధరలుప్రస్తుతం రూప్చంద్ ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ చేపల సాగు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో ఎక్కువగా ఉంది. చైనా, బంగ్లాదేశ్ల నుంచి దొడ్డి దారిన రూప్చంద్ చేపలను ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్కు తక్కువ ధరలకే తరలించేవారు. ఇటీవల బంగ్లాదేశ్ సరిహద్దులో వాణిజ్యం నిలిచిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం అటు నుంచి రూప్చంద్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో, ఆంధ్రాలో ఈ చేపలకు గిరాకీ పెరిగిందని భావిస్తున్నారు. -
● భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండగను శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. స్థానిక పిఠాపురం రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జామియా మసీద్ ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీ ఉదయం 8 గంటలకు ఈద్ నమాజు నిర్వహించారు. బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. నూరానీ కమిటీ తరఫున జమాల్ శేర్ తనయుడు జుబేర్ పంపిణీ చేశారు. నూరానీ కమిటీ సభ్యులు రెహ్మన్ ఖాన్, లతీఫ్ఖాన్లు ఇమామ్ అబ్దుల్ రజాక్ రిజ్వీకి నూతన వస్త్రాలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. నమాజ్ అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ ముబాకర్ చెప్పుకున్నారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్ మైదానానికి చేరుకొని నమాజ్ ఆచరించడంతో ఆ మైదానంతో పాటు పిఠాపురం రోడ్డులో సందడి నెలకొంది. -
సీలేరులో యువకుడి గల్లంతు
● నలుగురిని రక్షించిన పోలీసులు ● బాధితులు దేవరపల్లి వాసులు ● నదిలో స్నానాలు చేస్తూండగా ప్రమాదం దేవరపల్లి/మోతుగూడెం: స్నేహితులతో విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తూండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ఇక్కడకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఎ.నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూండగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగిలిన నలుగురూ నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఎస్సై సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్ల సాయంతో నలుగురు యువకులనూ ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకూ లభ్యం కాలేదు. దీంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహార యాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేస్త్రులుగా పని చేస్తున్నారు. -
మోసానికే ప్రాధాన్యం!
ఖరీఫ్ పెట్టుబడి ఎలా? గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా రైతులకు కూటమి సర్కారు ఇప్పటి వరకూ ఎటువంటి పథకాలూ అమలు చేయలేదు. దీనికితోడు ధాన్యం కొనుగోళ్లు కూడా సక్రమంగా జరపకపోవడం.. కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో రైతులు దిక్కు తోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఖరీఫ్ పంట సాగుకు పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక దిక్కులు చూస్తున్నారు. పంట పెట్టుబడి కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం తమను నెట్టేసిందని వాపోతున్నారు. అప్పుల కోసం రైతులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం బకాయిలు విడుదల చేసి, తమకు అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని వారు కోరుతున్నారు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందని, త్వరలోనే రైతులకు డబ్బులు జమవుతాయని వ్యవసాయ శాఖ పిఠాపురం సహాయ సంచాలకులు పి.స్వాతి చెప్పారు. పిఠాపురం: ఒకవైపు ముందస్తు సాగు పేరుతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సాగునీరు విడుదల ఆరంభించారు. మరోవైపు ఖరీఫ్ పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వేసవి దుక్కులు, ఆకుమడుల తయారీకి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో సాగు పెట్టుబడి దొరికే దారి కానరాక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరించి విధానాలు తమను కష్టాల్లోకి నెట్టేశాయని వాపోతున్నారు. ఏం జరిగిందంటే.. గడచిన రబీలో జిల్లావ్యాప్తంగా 1.45 లక్షల మంది రైతులు 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. సుమారు 5.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 225 కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేపట్టింది. మొత్తం 15,200 మంది రైతుల నుంచి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. దీని విలువ సుమారు రూ.310 కోట్లు. ప్రభుత్వం ఇప్పటి వరకూ రైతులకు రూ.250 కోట్ల మేర చెల్లించింది. గొప్పలు చెప్పి.. తిప్పలు పెట్టి.. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఎంతో గొప్పగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రోజులు, నెలల తరబడి ధాన్యం సొమ్ములు జమయ్యేవి కావని, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో చెల్లిస్తున్నామని ఊదరగొట్టారు. తీరా చూస్తే క్షేత్ర స్థాయిలో కొంత మందికి మాత్రమే ధాన్యం సొమ్ము జమ చేశారు. మిగిలిన వారికి రోజులు, వారాల తరబడి పెండింగ్లో పెట్టారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా రైతులకు ప్రభుత్వం రూ.60 కోట్లు పైగా ధాన్యం సొమ్ము బకాయి పెట్టింది. దళారులపాలు చేసి.. మరోవైపు ధాన్యంలో తేమ 22 శాతం వరకూ ఉన్నా కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టామని ప్రభు త్వం ఎంతో ఘనంగా చెప్పింది. కానీ, క్షేత్ర స్థాయిలో ఆవిధంగా జరగలేదు. దీంతో, రోజుల తరబడి ధా న్యం కళ్లాల్లోనే ఉండిపోయింది. అదే సమయంలో అ కాల వర్షాలు కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తేమ శాతం నిబంధనలను సడలించకపోవడంతో ఎక్కువ మంది రైతులు గత్యంతరం లేక దళారులకే.. అది కూడా వారు చెప్పిన తక్కువ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవిధంగా సుమారు 4.33 లక్షల మె ట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఎకరానికి రూ.20 వేల వరకూ నష్టపోయారు. మొత్తం మీద ఇటు కొన్న ధా న్యానికి డబ్బులివ్వకుండా.. అటు దళారులకే నష్టానికి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రైతు లు ఈ ఏడాది దారుణంగా నష్టాలు చవి చూశారు. 24 గంటలన్నారు.. నెల రోజులువుతున్నా అందని ధాన్యం సొమ్ము జిల్లాలో రూ.60 కోట్లకు పైగా బకాయి ఖరీఫ్ పెట్టుబడులకు డబ్బుల్లేక రైతుల ఆందోళనప్రభుత్వ విధానాలతో రైతుకు నష్టం రైతులు సాధారణంగా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతూంటారు. కానీ రాష్ట్రంలోని అన్నదాతలు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వల్ల నష్టపోయారు. జిల్లాలోని రైతులు 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం పండిస్తే ప్రభుత్వం కేవలం 1.30 లక్షల మెట్రిక్ టన్నులు. దీనికి కూడా డబ్బులివ్వకుండా రైతులకు నరకం చూపిస్తున్నారు. గత నెల 8వ తేదీ వరకూ కొందరికి ధాన్యం డబ్బులు వేసిన ప్రభుత్వం.. ఆ తరువాత నుంచి ఇవ్వడం లేదు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడులకు డబ్బుల్లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. ధాన్యం బకాయిలపై జిల్లా అధికారులతో మాట్లాడితే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని అంటున్నారు. రైతులకు ఇవ్వడానికే డబ్బుల్లేపోతే ఇక వ్యవసాయం ఎలా సాగుతుంది? ఉన్న అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోతే ఎలా? 24 గంటల్లో డబ్బులు వేయిస్తామన్న నేతలు స్పందించాలి. గత ఐదేళ్లలో రైతు ఏనాడూ ఇలా కంటతడి పెట్టలేదు. వారికివ్వాల్సిన డబ్బులు వెంటనే విడుదల చేయాలి. రైతు భరోసా రూ.20 వేల చొప్పున రెండేళ్లకు కలిసి వెంటనే వెయ్యాలి. – వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, పిఠాపురం -
తొలి తిరుపతి.. భక్తఝరి
పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ మొదలైంది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టికెట్లు, కేశఖండన, అన్నదాన విరాళాల రూపంలో స్వామివారికి రూ.3,39,087 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ – సామర్లకోట మధ్య నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపుఫ్లై ఓవర్పై గడ్డర్ల ఏర్పాటు పనులు ప్రారంభం సామర్లకోట: ఏడీబీ రోడ్డులో అచ్చంపేట – సామర్లకోట రాక్ సిరామిక్స్ వరకూ భారత్ మాల జాతీయ రహదారి పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పనుల్లో భాగంగా సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ ఆలయం సమీపాన నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రెడీమేడ్ గడ్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటిని వంతెన వద్దకు చేర్చారు. వీటిని బ్రిడ్జి స్తంభాలకు కలుపుతూ అమరుస్తారు. ఈ పనుల నేపథ్యంలో కాకినాడ – సామర్లకోట మధ్య ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. కాకినాడ నుంచి సామర్లకోట వచ్చే వాహనాలను ఈ నెల 10వ తేదీ వరకూ వీకే రాయపురం నుంచి అచ్చంపేట ఏడీబీ రోడ్డుకు మళ్లిస్తారు. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే వాహనాలు ఏడీబీ రోడ్డు నుంచి వీకే రాయపురం, అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా మళ్లిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ వంతెనపై గడ్డర్ల ఏర్పాటు పనులు గత నెల 21నే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాల కారణంగా వాయిదా వేశారు. యోగా దైనందిన జీవితంలో భాగం కావాలి నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో విధులు సమర్థవంతంగా నిర్వర్తించవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో కాకినాడ మెయిన్ రోడ్డు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ సెంటర్ వరకూ శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నగర పాలక సంస్థ కమిషనర్ భావన, అదనపు ఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్ తదితర అధికారులతో పాటు వివిధ శాఖల నుంచి సుమారు 5 వేల మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. యోగా శిక్షకుడు రామానంద అందరితో యోగాసనాలు వేయించారు. రేపు పీజీఆర్ఎస్ రద్దు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని సోమవారం అనివార్య కారణాలతో రద్దు చేశారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అర్జీదారులు గమనించాలని కోరారు. -
రత్నగిరి.. భక్తజన సంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2,300 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేశారు. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,300 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఆదివారం కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశముంది. సత్యదేవుడు, అమ్మవారిని ఉదయం పది గంటలకు టేకు రథంపై ఊరేగించనున్నారు. -
పవన్కు ఝలక్.. జనసేన నేతల దందాపై వర్మ సెటైర్లు
సాక్షి, కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారు. తాజాగా ఇసుక దందాను టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. దీంతో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలను వర్మ పరిశీలించారు. అనంతరం, వర్మ మీడియాతో మాట్లాడుతూ.. రాత్రి కాగానే పిఠాపురం పోలీసులకు రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. అనుమతులు లేకుండా ఇసుక తవ్వుతున్నారు. పోలీసులు మాఫియాతో కుమ్మక్కైపోయినట్టున్నారు. రోజుకు 200 నుండి 300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. రాత్రుళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక రవాణా కనిపించడం లేదంటే వాళ్లకు కావాల్సిన మామూళ్లు వస్తున్నాయి. పోలీసులు ముందే సమాచారం ఇచ్చి సర్దుకోమంటున్నారు. ఇక్కడ దొంగతనం జరుగుతుందని చెప్పినా పట్టించుకోవడం లేదు. 20 రోజులుగా పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాకినాడలో సైబర్ స్కామర్లు
కాకినాడ క్రైం: అమాయకులే లక్ష్యంగా కాకినాడలో ఓ ముఠా ఖాతాలు తెరచి, వాటిని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతోంది. ఎస్పీ బిందుమాధవ్ «శుక్రవారం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన నార్ని సతీశ్ చంద్ర (37), దాసరి వీరవెంకట సత్యనారాయణ (31) కొద్ది నెలలుగా కాకినాడలోని వివిధ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపిస్తున్నారు. పాస్బుక్, చెక్బుక్, ఏటీఎం కార్డుతో కూడుకున్న బ్యాంక్ కిట్లు తమకు అప్పగిస్తే ఖాతా తెరిచేందుకు అయ్యే ఖర్చుతో పాటు మరో రూ.5 వేలు ఇస్తామని ప్రలోభ పెట్టేవారు. ఈ ఖాతాపై రెండు నెలల్లో రూ.5 లక్షల చొప్పున లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో పదుల సంఖ్యలో జనం ఖాతాలు తెరచి, కిట్లను వీరికి అప్పగించారు. కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్కు ఈ కిట్లు అప్పగిస్తే అతను వీరికి డబ్బు ఇచ్చేవాడు. కాకినాడ సాంబమూర్తినగర్కు చెందిన కొర్రా లోవరాజు ఖాతా తెరచి కిట్ అప్పగించి రెండు నెలలైంది. లోన్ కోసం కాకినాడలోని బ్యాంక్ ఆఫ్ కర్ణాటకకు వెళ్లాడు. బ్యాంక్ అధికారులు అతని ఖాతా పరిశీలిస్తే కేవలం నెల రోజుల వ్యవధిలో రూ.50 లక్షల విలువైన లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. దీంతో లోవరాజు పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీసులు సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణను అదుపులోకి తీసుకొని విచారించారు. వీరు కాకినాడకు చెందిన ఉదయ్కిరణ్ అనే వ్యక్తికి ఈ ఖాతాల కిట్లు అప్పగిస్తే అతడు వీటిని దుబాయ్ పంపిస్తున్నాడని తేలింది. దుబాయ్లో ఈ బ్యాంకు వివరాలు పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నాడని తెలిసింది. ఇందుకు ఉదయ్ కిరణ్కు ఖాతాకు రూ.30 వేల చొప్పున పుట్టారామ్ చెల్లిస్తున్నాడు. గడచిన 2 నెలల్లో సతీశ్ చంద్ర, వీర వెంకట సత్యనారాయణ కాకినాడ జిల్లాతో పాటు గుజరాత్, పశ్చిమ బెంగాల్, కర్ణాటకకు చెందిన పేర్లతో 48 ఖాతాలు తెరచి రూ.9 కోట్ల విలువైన మొత్తం జమ చేసినట్టు ఎస్పీ తెలిపారు. సతీశ్ చంద్ర, సత్యనారాయణను అరెస్టు చేయగా ఉదయ్కిరణ్ పరారీలో ఉన్నాడు. పుట్టారామ్ను పట్టుకునేందుకు కేంద్ర నిఘా విభాగాలకు సమాచారమిచ్చామని ఎస్పీ చెప్పారు. -
ముందస్తుకు నీళ్లొదిలారు!
క్లోజర్ పనులు ఇప్పుడు మొదలు పెట్టారు డెల్టా పంట కాలువలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేశారు. అయితే చాలాచోట్ల మే 20 తరువాత క్లోజర్ పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టడం గమనార్హం. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన మూడు కాలువల మీద మొదలు పెట్టిన సైఫన్ నిర్మాణాల పనులు నత్తను తలపిస్తున్నాయి. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణాలు సైతం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇవి కాకుండా పి.గన్నవరం, ముక్తేశ్వరం, అమలాపురం, మండపేట, కాకినాడ కాలువల మీద ఇప్పుడిప్పుడే పూడిక తీత పనులు చేపట్టడం గమనార్హం. ఈ పనులు ఈ నెల పదవ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కోనసీమ జిల్లా సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సైతం ఈ నెల పదవ తేదీకి పనులు పూర్తి చేయాలని కోరారు. అంటే ఈ నెల పది వరకు కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం లేదని తేలిపోయింది. అటువంటప్పుడు జూన్1వ తేదీన సాగు నీరు విడుదల చేయడం ఎందుకని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జూన్ పదో తేదీన నీరు విడుదల చేసినా పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల ఈ నెల 20వ తేదీ వరకు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఖరీఫ్ సాగు లేనట్టే ● ఒకటో తేదీన మొక్కుబడిగా నీటి విడుదల ● తూర్పు, మధ్య డెల్టాకు కలిపి 300 క్యూసెక్కులు మాత్రమే ● పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు ● పలుచోట్ల కాలువలపై పనులు ● మధ్య డెల్టాకు లొల్ల లాకుల వద్దనే నిలిపివేసిన అధికారులు ● ఈ మాత్రం దానికి ఎందుకు వదిలినట్టు అని రైతుల మండిపాటు సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్కు ప్రధాన అవరోధం ‘ముంపు’. సాగు ఆలస్యం అయి భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ఖరీఫ్ దిగుబడికి సిద్ధంగా కావడం వల్ల చేలు ముంపుబారిన పడి రైతులు కోట్ల రూపాయలు నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెల్టాలో ముందస్తు సాగును ప్రోత్సహించింది. దీనిలో భాగంగా జూన్ ఒకటి, రెండు తేదీలలో నీరు విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ముందస్తు సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పి కొంత మొత్తంలో నీరు విడుదల చేసింది. దానికి కూడా పలుచోట్ల హెడ్ స్లూయిజ్ల సమీపంలోనే నిలిపివేయడం గమనార్హం. కోటి ఆశల ఖరీఫ్కు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ముందస్తు సాగుకు వీలుగా జూన్ ఒకటి, రెండు తేదీల్లో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేశారు. కాని ఈ మూడు డెల్టాలకు కలిపి కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు. మధ్య డెల్టాకు 100 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. దీనిలో మధ్య డెల్టాకు వదులుతున్న నీరు సమీపంలోని లొల్ల లాకుల వద్దనే నిలిపివేశారు. ఇక్కడ నిలిపివేయడం ద్వారా పి.గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్, అమలాపురం కాలువలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇక తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కుల వదలడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దీని మీద కాకినాడ, మండపేట, కోరంగి, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరందాల్సి ఉంది. అలాగే పశ్చిమ డెల్టాలో ఏలూరు, నర్సాపురం బ్యాంకు కెనాల్ ద్వారా సాగునీరందాల్సి ఉంది. ముందస్తుతో పలు విధాలుగా మేలు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వా రా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమై ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. కాకినాడ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాకు వచ్చి మొత్తం 3,40,548.78 ఎకరాల నికర ఆయకట్టు ఉండగా, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, పశ్చిమ డెల్టాలు కలిపి మొత్తం 66,692.47 ఎకరాలు ఉంది. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డెల్టా ఆయకట్టు ఇలా (ఎకరాల్లో) జిల్లా రిజిస్టర్ ఆయకట్టు నికర ఆయకట్టు కాకినాడ 2,75,765.62 2,60,192.27 కాకినాడ జిల్లా – 80,356.10 (పిఠాపురం బ్రాంచ్ కెనాల్) -
పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు
● బార్లపూడి క్రాంతిపై మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఫైర్ ● పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఇంత దిగజారి పోవాలా? సాక్షి ప్రతినిధి, కాకినాడ: పదవుల కోసం నీ తండ్రి మీద, నీ తమ్ముడుపై ఆరోపణలు చేయడం సరికాదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సూచించారు. బార్లపూడి క్రాంతి ఇటీవల తండ్రి ముద్రగడపై, సోదరుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుపై చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీ శివకుమారి ఘాటుగా స్పందించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం నీవు దిగజారి పోవాలా? అని ప్రశ్నించారు. నీ రాజకీయం కోసం మా నాయకుడు గిరిబాబుపై నిందలు వేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు గిరిబాబు పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు నీ తండ్రి మీద ఆరోపణలు చేసి పరువు తీసినప్పుడు ఈ ప్రేమ ఏమైందన్నారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నీ తండ్రి ముద్రగడ పద్మనాభం ‘నా కూతురితో ఇంక సంబంధాలు లేవు, నాకు ఏమి జరిగినా చూడటానికి కూడా రావద్ద’ని ఎన్నికల సమయంలో మీడియా ముఖంగా చెప్పింది నీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు గిరిబాబుపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే త్వరలోనే మరిన్ని ఆధారాలతో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ముద్రగడపై కక్షతోనే పవన్ కల్యాణ్ జనసేన నాయకురాలు క్రాంతితో వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానం ఉందన్నారు. క్రాంతిపై పవన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీ మామయ్య, నీ భర్త ఆరోగ్యం కోసం ట్రీట్ మెంట్ చేయించుకో అని ఆమెకు సూచించారు. -
యంత్ర రాయితీకి చంద్రగ్రహణం
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 202510లో● కూలీ రేట్లు పెరగడంతో యంత్రాలపైనే ఆధారపడ్డ రైతులు ● గత ఏడాది ఒక్క పరికరమూ అందించని కూటమి ప్రభుత్వం ● ఎక్కువ రేట్లు చెల్లించి పరికరాలు అద్దెకు తెచ్చుకొంటున్న అన్నదాతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రైతులు సాంకేతికత సహాయంతో పంటలు పండించాలని చెబుతూనే యంత్ర రాయితీ పథకానికి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి సర్కారు మంగళం పాడింది. ఏటా రైతులకు 50 శాతం రాయితీపై యంత్రసేవా పథకంలో వ్యవసాయానికి సంబంధించిన యంత్ర పరికరాలు ఇవ్వాల్సి ఉంది. ఈ యంత్ర సేవా పథకానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేస్తుంది. రైతులకు విత్తు దగ్గర నుంచి వరి కోతల వరకూ వివిధ దశల్లో ఉపయోగపడే యంత్ర పరికరాలు ఈ యంత్ర సేవా పథకం ద్వారా అందజేయాల్సి ఉంది. దుక్కులు, దమ్ములు చేసుకొనేందుకు ట్రాక్టర్లు, డ్రమ్ ఫీడర్స్, రైతులు కోతలుకు వినియోగించే వరికోత యంత్రాలతోపాటు పలు పరికరాలు ఈ పథకంలో ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క రైతుకూ రాయితీ పరికరాలు ఇచ్చిన పాపాన పోలేదు. గత ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు కనీసం టార్పాలిన్లు, స్పేయర్లు కూడా పంపిణీ చేయకపోవడంతో అద్దెలకు తెచ్చుకొని పనులు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. జిల్లాలో 2.18 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతులకు, రైతు సంఘాలకు యంత్రసేవా పథకంలో రాయితీపై పరికరాలు అందించేవారు. రెండు సీజన్లలో తప్పని అవస్థలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడచింది. ఖరీఫ్, రబీ సీజన్లు కూడా ముగిశాయి. కానీ రైతులకు కనీసం ఒక్క టార్పాలిన్, స్ప్రేయర్లు, వరికోత యంత్రాలు, మినీ ట్రాక్టర్లు, ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు వంటివి ఏమీ మంజూరు చేయలేదు. యంత్ర సేవా పథకంలో కేంద్ర ప్రభుత్వం నిధులు సైతం ఉన్నప్పటికీ అమలు కావడం లేదు. ఆ నిధులు ఏమీ చేశారో సీఎం చంద్రబాబునాయుడికే తెలియాలి. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే పథకాల నిధులు కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రతీ గ్రామంలో సుమారు రెండునుంచి మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఆయా గ్రామాల్లో సీజన్లో యంత్ర పరికరాలు లేకపోవడంతో వేరే ప్రాంతాల నుంచి పరికరాలు తీసుకొచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రైతులకు వరికోత యంత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయి. గత ఖరీఫ్, రబీ సీజన్లో తగిన యంత్రాలు లేకపోవడంతో ఒడిశా, బిహార్, పంజాబ్ వంటి రాష్ట్రాల నుంచి వరికోత యంత్రాలు అద్దెకు తెచ్చుకొవాల్సి వచ్చింది. గత రబీ సీజన్లో కోతలు కోసే సమయంలో వర్షసూచనల నేపథ్యంలో రైతులు యంత్రాలు లేక, కూలీలు లభించక చాలా అవస్థలు పడ్డారు. ఇదే అదనుగా పలువురు దళారులు వరికోత యంత్రాలు వేరే ప్రాంతాల నుంచి తీసుకువచ్చి అద్దెలు బాగా పెంచారు. ఎకరా పొలం వరికోత కోయడానికి రూ.3,500 చొప్పున వసూలు చేశారు. వరికోత యంత్రాలు స్థానికంగా అందుబాటులో ఉంటే రూ.2,500 తీసుకొనేవారు. వర్షసూచన నేపథ్యంలో ఎక్కువ రేటు పెట్టి అయినా సరే రైతులు కోతలు కోయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక రైతులు కోతలు పూర్తయిన తర్వాత ధాన్యం ఆరబోసుకొనేందుకు టార్పాలిన్ అవసరం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో రైతులకు కావాల్సిన టార్పాలిన్లు 50 శాతం రాయితీపై అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇవ్వకపోవడంతో అద్దెకు తెచ్చుకోవాల్సి వచ్చింది. వర్ష సూచన నేపథ్యంలో ఒక్కొక్క టార్పాలిన్కు రూ.50 చొప్పున అద్దె చెల్లించి తెచ్చుకోవాల్సి వచ్చింది. ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉంటే మిల్లర్లు కొనుగోలు చేయకపోవడంతో సుమారు 10 రోజుల పాటు రైతులు ధాన్యాన్ని ఎండపెట్టాల్సి వచ్చింది. ఒక ఎకరం పొలంలో ధాన్యం ఎండపోసేందుకు ఐదారు టార్పాలిన్లు అవసరం కాగా వాటిని అద్దెకు తెచ్చుకోక తప్పలేదు. ఇలా కొందరు రైతులు 20 రోజుల వరకూ ధాన్యం తరలించకపోవడంతో వాటికి అద్దెలు చెల్లించాల్సి వచ్చింది. అదే ప్రభుత్వం రాయితీపై ఇస్తే ఆ టార్పాలిన్లు రైతులకు రెండు, మూడు సంవత్సరాల వరకూ వినియోగించుకొనే అవకాశం ఉంటుంది. అద్దె బాధ తప్పుతుంది. పురుగు మందులు పిచికారీ చేసే స్ప్రేయర్లు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేని దుస్థితిలో ఉంది. రైతులు గత ఖరీఫ్, రబీ సీజన్లో అద్దెకు తెచ్చుకొనే మందులు పిచికారీ చేసుకున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ మొదలైనా రాయితీ పరికరాల ఊసే ఈ ప్రభుత్వం ఎత్తడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీల కొరత భారీగా ఉంది. గ్రామ ఆయకట్టుకు తగిన విధంగా కూలీలు గ్రామాల్లో దొరకడం లేదు. గతంలో వేరే ప్రాంతాల నుంచి కూలీలు వలసలు వచ్చి వరినాట్లు, వరి కోతలు, కలుపుతీత వంటి పనులు చేసేవారు. దీంతో కూలీల కొరత కొంతమేర తగ్గేది. ప్రస్తుతం వలస కూలీలు అసలు రావడం లేదు. దీంతో రైతులకు స్థానిక కూలీలతో పనులు చేయించుకోవడం కష్టసాధ్యమైపోయింది. ఈ నేపథం్యలో యంత్ర పరికరాలు ఉంటే రైతులకు ఎంతో మేలు చేస్తాయి. ఎకరం వరి కోత కోయాలంటే ప్రస్తుత కూలి రేటు ప్రకారం రూ.6 వేలు చెల్లించాలి. కుప్ప నూర్పిడికి ట్రాక్టరు, కూలీలకు మరో రూ.6 వేలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ వరికోత యంత్రం ద్వారా అయితే రూ.3,500 సరిపోతుంది. ధాన్యం ఆరబోతకు టార్పాలిన్లు, కూలికి మరో రూ.3 వేలు ఖర్చవుతుంది. ఈ విధంగా రైతుకు రూ.6 వేలు మిగులుతుంది. వైఎస్సార్ సీపీ హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2,431 రైతులకు, 150 రైతు సేవా సంఘాలకు రూ.27.52 కోట్లు విలువ చేసే యంత్ర సేవా పథకాలు క్రమం తప్పకుండా ఏటా అందజేశారు. గ్రామాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన యంత్ర పరికరాలు తక్కువ రేట్లకు అద్దెకు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధానానికి కూడా కూటమి సర్కార్ స్వస్తి పలికింది. దీంతో రైతులు దళారుల వద్ద యంత్ర పరికరాలు తెచ్చుకొని అధికంగా అద్దెలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి ఖరీఫ్, రబీ సీజన్లో ఈ యంత్ర పరికరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో బయట నుంచి వచ్చే వరి కోత మెషీన్లపై ఆధారపడి కోతలు కోయడం వల్ల ఎకరాకు రూ.2 వేల వరకూ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ప్రభుత్వం యంత్రాలు ఇస్తే మాకు భారం తగ్గుతుంది. – అడబాల గోవిందు, రైతు వీకేరాయపురం, సామర్లకోట మండలం టార్పాలిన్లు, స్ప్రేయర్లు ఇవ్వాలి గత సంవత్సరం స్ప్రేయర్లు, టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాం. వీటి అద్దెలు రూ.2 వేలు చెల్లించాను. అదే ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తే రెండు, మూడు సంవత్సరాల వరకూ వీటిని వినియోగించుకోవచ్చు. ప్రభుత్వం యంత్రసేవా పథకం పునరుద్ధరించాలి. – ఎలుగుబంట్ల రవినాయుడు, రైతు కూరాడ, కరప మండలం -
వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా రామస్వామి బాధ్యతలుబోట్క్లబ్ (కాకినాడసిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా తుమ్మల రామస్వామి (బాబు) శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ జాయింట్ కలెక్టర్ రాహుల్మీనా డీసీసీబీ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహించారు. బ్యాంకు సీఈఓ ఆర్వీ నరసింహారావు తుమ్మల బాబుతో సంతకాలు చేయించారు. డీఎస్సీ పరీక్షలు ప్రారంభం – తొలిరోజు 893 మంది హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ నియామక పరీక్షకు సంబంధించి నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఆన్లైన్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6 ఆన్లైన్ కేంద్రాల్లో ఉదయం ఐదు, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్ష నిర్వహించారు. రెండు సెషన్లకు సంబంధించి 1,024 మంది హాజరుకావలసి ఉండగా 893 మంది పరీక్షలు రాయగా 131మంది గైర్హాజరయ్యారని డీఈఓ పిల్లి రమేష్ తెలిపారు. 9న షైనింగ్ స్టార్స్ కార్యక్రమంబాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల కోసం ప్రభుత్వం షైనింగ్స్టార్స్ కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 9న కుళాయిచెరువు ఆవరణలో గల ఫ్యాబ్రిక్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 132 మంది పదోతరగతి, 36 మంది ఇంటర్ విద్యార్థులు కలిపి 168 మందిని ఎంపిక చేశారు. ఒక్కో విద్యార్థికి రూ.20వేల చొప్పున నగదు పురస్కారం అందించనున్నారు. ఇప్పటికే ఆయా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మండల స్థాయిలో 500 మార్కులు పైబడి వచ్చిన వారిని ఆరుగురిని ఎంపిక చేశారు. వీరిలో ఒసీ 2, బీసీ 2, ఎస్సీ1, ఎస్టీ1 ఎంపిక చేశారు. ఇంటర్మీడియెట్లో 830 మార్కులు పైబడి వచ్చిన వారిని ఎంపిక చేశారు. రేపటి నుంచి జిల్లా స్థాయి యోగా పోటీలు నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 11 వరకు జిల్లా క్రీడామైదానంలోని యోగాహాల్లో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ బి.శ్రీనివాస్కుమార్ శుక్రవారం తెలిపారు. యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. 60 సంవ్సరాల పైబడిన వారు సీనియర్స్ విభాగంలో, 9వ తేదీన జూనియర్స్ 10 నుంచి 18 సంవత్సరాల విభాగంలో, 10న యూత్ 19 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల విభాగంలో, 11న సీనియర్స్ విభాగంలో 36 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు వారికి, 11న సీనియర్ సిటిజన్ విభాగంలో 60 సంవత్సరాల పైబడిన వారికి ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తి గల వారు ఆయా తేదీలలో యోగా సూట్ ధరించి పోటీలకు ఉదయం 8 గంటలోపు హాజరుకావాలని శ్రీనివాస్ కుమార్ తెలిపారు. జిల్లా స్థాయి పోటీలకు మండలస్థాయిలో మొదటి రెండు స్థానాలు సాధించిన వారు అర్హులన్నారు. వివరాలకు 89196 42248 నెంబర్లో సంప్రదించాలని కోరారు. -
వైభవంగా వేణుగోపాలుని కల్యాణం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేషార్చనలు జరిపారు. సాయంత్రం కల్యాణాన్ని ప్రారంభించారు. ప్రదానం నుంచి తలంబ్రాలు వరకూ ప్రతి క్రతువునూ వేదపండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే వ్యాఖ్యాన పండితులు ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ఈఓ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి పనుల పరిశీలన కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు, రహదారుల ఆధునీకరణ, వాహనాల పార్కింగ్ స్థలం అభివృద్ధి, ఏడు వారాల ప్రదక్షిణకు అనుకూలంగా మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టారు. ఆయా పనులపై ఆర్డీఓ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావుతో సమీక్షించారు. దానిలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల స్థూపాన్ని పరిశీలించారు. అన్నప్రసాద భవనానికి విరాళాలు వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరానికి చెందిన సీవీ చంటి, శాంతి దంపతులు రూ.1,15,000 విరాళంగా సమర్పించారు. వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందచేశారు. -
బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..
● దివ్య కల్యాణాన్ని చూసి తరించిన భక్తజనం ● కనువిందు చేసిన రాయబారోత్సవం ● దేవేరులతో దర్శనమిచ్చిన స్వామివారు మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లి క్షేత్రంలో బాలునిగా కొలువుదీరిన బాలబాలాజీస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో రాత్రి 9.15 గంటలకు శ్రీదేవి, భూదేవిలను స్వామివారు పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తులకు వివరిస్తూ నిర్వహించిన రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గుణ గణాల్లో స్వామి వారికి అమ్మవార్లు సరిజోడి అంటూ సాగిన ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మంటపంలో దేవేరులతో కొలువు తీరిన స్వామివారు భక్తకోటికి సర్వమంగళ రూపంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తన్మయులయ్యారు. కన్నుల పండువగా గ్రామోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణలు, బాణసంచా కాల్పుల నడుమ స్వామివారిని, దేవేరులను పురవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది గ్రామోత్సవంలో పాల్గొని పరమానందం పొందారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని పలు రకాల బెంగుళూరు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా కోలాటం స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన హరే శ్రీనివాస్ కోలాటం ఆహూతులను ఆనంద పరవశుల్ని చేసింది. అలాగే కేరళ వాయిద్యాలు భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తాయి. అప్పనపల్లికి చెందిన వాణి మహిళా సత్సంగ మిత్ర బృందం సభ్యులు ఆలపించిన శ్రీలలితా విష్ణు సహస్రనామ పారాయణం, మామిడికుదురుకు చెందిన యింటి శ్రీరామ్కుమార్, సుజాత ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంతానం కోసం పూజలు సంతానం లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు శుక్రవారం ఉదయం ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రసాదాన్ని తినడం ద్వారా సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
సిద్ధ సమాధికి కామేశ మహర్షి
రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవాలి శ్రీకామాక్షీ పీఠంలో ముగిసిన అంత్యక్రియలు అమలాపురం టౌన్: శివైక్యం పొందిన స్థానిక శ్రీ కామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి సిద్ధ సమాధి క్రతువు అదే పీఠంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా జరిగింది. సిద్ధ పురుషులు, స్వామీజీలు, పీఠాధిపతులకు ఏ రకమైన సిద్ధి సమాధి నిర్వహిస్తారో అదే సంప్రదాయంలో కామేశ మహర్షికి నిర్వహించారు. పీఠం ఉత్తరాధికారి విఖనస రాఖీ ప్రేమ్ ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహించారు. పీఠం బ్రహ్మ బ్రహ్మశ్రీ గోవిందవజ్జుల నాగబాబు బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత గణపతి పూజ, పుణ్యాహవాచనం, పరిషత్, కృచ్చాత్రయం, పంచ గ వ్య ప్రాసన వంటి పూజాదికాలు చేశారు. కామేశ మ హర్షి పార్థివ శరీరానికి పంచ వాకములతో 11 రకాల అభిషేకాలు, విరజాహోమాలు, పుష్పార్చన తర్వాత సమాధి స్థల శుద్ధి, భూత బలి నిర్వహించారు. వేద పండితులు పంచ కాటక, పంచ ఉప నిషత్తులు తదితర పూజాదికాలతో సిద్ధి సమాధి నిర్మించి చివరిగా మంగళ హారతితో ఈ క్రతువు ముగిసింది. తమను కన్న వారి కంటే మిన్నగా కంటికి రెప్పలా పెంచుతున్న పీఠంలోని ప్రేమ మందిరం అనాధ పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. చివరగా తమ గురువులు కామేశ మహర్షి పార్ధివ శరీరానికి నమస్కరించి కన్నీటి వీడ్కో లు చెప్పారు. ప్రేమ మందిరం అమ్మ వక్కలంక వాణి, పీఠం మేనేజర్ మర్రి దుర్గారావు, కామాక్షీ దేవి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, ప్రేమ మందిరం పూర్వ ఆశ్రమవాసులైన అనాథలు, పట్టణ ప్రముఖలు తమ గురు వు కామేశ మహర్షికి నివాళులర్పించారు. తమ గురువు సిద్ధ సమాధి ప్రక్రియలో పాల్గొనేందుకు అనేక మంది భక్తులు తరలి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. – కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్ కరప: కాలానుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) సైంటిస్ట్ డాక్టర్ కేఎల్ ప్రసాద్ అన్నారు. పెనుగుదురు రైతు సేవాకేంద్రంలో శుక్రవారం వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ, రైతులు పొలంలో మట్టి పరీక్షలు చేయించాలన్నారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నారు. పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం వల్ల నేల సారవంతమవుతుందన్నారు. కాకినాడ జిల్లా వనరుల కేంద్రం ఏడీఏ మాధవి మాట్లాడుతూ, పంట కాలువలకు సాగు నీరు విడుదలైందని, రైతులు ముందస్తు ఖరీఫ్ సాగుకు సిద్ధం కావాలన్నారు. అక్టోబరు నెలాఖరుకు పంటచేతికొస్తే, నవంబర్లో తుపాన్ల నుంచి గట్టెక్కవచ్చన్నారు. పెట్టుబడులు తగ్గించుకునేందుకు బెంగాల్ ఊడ్పు, వెదజల్లు పద్ధతులు అనుసరించాలన్నారు. ఖరీఫ్లో మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలని, విత్తన శుద్ధి చేయాలన్నారు. ఎంఏఓ ఏవీ రాజేష్ మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ విధానంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలన్నారు. 80 శాతం రాయితీతో అందిస్తున్న డ్రోన్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తొలకరి పంటకు స్వర్ణ రకంతో పాటు, ఎంటీయూ–1318 రకాన్ని కూడా సాగు చేసి, అధిక వర్షాలు, ముంపు నుంచి పంటను కాపాడుకోవచ్చన్నారు. పిఠాపురం ఉద్యానవన శాఖాధికారి శైలజ మాట్లాడుతూ, పొలాల గట్లపై, ఇంటి మిద్దెలపై సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ బి.నాగేశ్వర్రెడ్డి, డాక్టర్ ఎస్.రవీంద్ర, ఏఈఓ బి.శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ రూరల్: కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే మార్గంలో గంగనాపల్లి గ్రామ పరిధిలో కోటిపల్లి రైల్వే లైన్ దాటిన తరువాత కాల్వలో గుర్తు పట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 మధ్య ఉండవచ్చని, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కాల్వ నీటిలో మునిగిపోయి ఉంటాడని, మృతదేహం ఉబ్బిపోయి చర్మం ఊడిపోయి ఉన్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తజనం
● ఆలయం వద్ద నవ దంపతుల సందడి ● ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నవరం: జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహాలతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా అవే ముహూర్తాలలో వివాహాలు చేసుకున్న భక్తులు రత్నగిరికి వచ్చి వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయి. శుక్రవారం అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు సుధీర్, పరిచారకులు పవన్ తదితరులు నిర్వహించారు. నేడు తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఉదయం పది గంటలకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● చెట్టుకు ఢీకొని నుజ్జయిన కారు ● పోతవరంలో విషాద ఛాయలు నల్లజర్ల: మండలంలోని పోతవరం–యర్నగూడెం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు సోదరుడు రామకృష్ణ తన భార్య రత్నకుమారి, కుమారుడు మనోజ్ (24), మనుమరాలు ఆద్య (2) నిడదవోలులోని కలవచర్ల గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. పోతవరం నుంచి బయలుదేరి కిలోమీటరు దూరం వెళ్లేసరికే అతివేగంతో చెట్టును ఢీకొని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా రామకృష్ణ, రత్నకుమారి, ఆద్య తీవ్ర గాయాలపాలయ్యారు. పోతవరంలో జరుగుతున్న జాతర హడావిడిలో ఉన్న గ్రామస్తులు ఈ ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ మనవరాలు (కుమార్తె అంకితకు కుమార్తె) ఆద్య చికిత్స పొందుతూ మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పోతవరంలో జరుగుతున్న జాతర చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్ ఇలా మృతి చెందడంతో పోతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రలను మాజీ హోం మంత్రి తానేటి వనిత, మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ బంక అప్పారావు పరామర్శించారు. అనంతరం పోతవరం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులను పరామర్శించారు. కాగా ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా.. పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావుకు పిల్లలు లేకపోవడంతో తన సోదరుడు రామకృష్ణ పిల్లలనే తన పిల్లలుగా అల్లారుముద్దుగా పెంచారు. అవసాన దశలో తమ అన్నదమ్ములిద్దరికి ఆసరాగా ఉంటాడుకున్న మనోజ్ జీవితం ఇలా ముగియడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మనోజ్ కారు కావాలంటే కొన్నామని, ఏ లోటూ రాకుండా చూసుకున్నామని వారు అతనితో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు. -
ఉసురు తీసిన అతివేగం
● స్నేహుతుడి వివాహానికి వెళ్తూ ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు పెరవలి: స్నేహితుడి పెళ్లికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన కత్తుల మహేష్ (19), శీలం అంజిబాబు రైడర్ మోటార్సైకిల్పై వేగంగా వస్తుండగా సడన్ బ్రేక్ వేయటంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడి సుమారు 60 మీటర్ల దూరం రోడ్డుపైనే ఈడ్చుకుపోయి డివైడర్ను ఢీకొన్నారు. ఈ సమయంలో మోటార్సైకిల్ నడుపుతున్న కత్తుల మహేష్ రోడ్డు డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే పరుగున వచ్చి ఇద్దరినీ లేపగా మహేష్ ఎటువంటి చలనం లేకపోవటంతో శీలం అంజిబాబును లేపి రోడ్డు పక్కన కూర్చోపెట్టారు. అతడికి తీవ్రగాయాలయ్యాయని, కుడికాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంతలో జాతీయ రహదారుల అంబులైన్స్ వచ్చి మహేష్కు సపచర్యలు చేయగా శరీరంలో కదలిక రావడంతో వెంటనే ఆక్సిజన్ పెట్టి తణుకు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మహేష్ మృతిచెందినట్టు తెలిపారు. మహేష్ తండ్రి కత్తుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫోర్జరీ పోలీస్!
కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. దాన్ని చూపించి ఎస్ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వరరావు గవర్నమెంట్ రైల్వే పోలీస్ విభాగం(జీఆర్పీ)లో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమహేంద్రవరం రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లలో ఉద్యోగులపై అజమాయిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్ తనను వేధిస్తున్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జవాన్ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదు చేసిన జవాన్ భార్యను రైల్వే గెస్ట్ హౌస్కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్ భార్య కాకినాడ టూ టౌన్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్కి చెందిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. -
అమ్మకు వంచన
స్పష్టత లేదు మా అబ్బాయి ఈ ఏడాది 8వ తరగతికి వెళ్లనున్నాడు. గత ఏడాది తల్లికి వందనం నగదు ఇవ్వలేదు. ఈ ఏడాది ఇస్తామంటున్నారు కానీ ఎటువంటి స్పష్టతా రాలేదు. ఆ డబ్బులు త్వరగా ఇస్తే పిల్లల చదువులకు ఉపయోగపడుతుంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలో నగదు జమయ్యేది. – వై.ధనలక్ష్మి, పిఠాపురం ఎన్నికల హామీ ఏమైంది? నాకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి చదువుకుంటున్నాడు. అమ్మాయి ఓ ప్రైవేట్ స్కూల్లో రెండో తరగతి చదవనుంది. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ హామీ ఏమైంది? ఇప్పటికీ అందలేదు. ప్రభుత్వం సాయం అందిస్తే పిల్లల చదువుకు ఆసరాగా ఉంటుంది. – సీహెచ్ సుధీర్కుమార్, కాకినాడ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి లబ్ధి (రూ.కోట్లలో) సంవత్సరం లబ్ధిదారులు లబ్ధి 2019–20 1,87,654 281.48 2020–21 2,01,247 301.86 2021–22 1,88,157 282.23 2022–23 1,86,708 280.06 మొత్తం 7,63,766 1145.63 ● ఏడాదైనా అందని ‘తల్లికి వందనం’ ● 3.20 లక్షల మంది ఎదురుచూపులు ● కూటమి పాలనలో దగా పడ్డ తల్లులు, విద్యార్థులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు.. ముగ్గురుంటే రూ.45 వేలు’– ఈ మాటలు ఎక్కడో విన్నట్లుంది కదూ. సరిగ్గా ఏడాది కిందట నాటి సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నేతలైన చంద్రబాబు అండ్ కో ‘తల్లికి వందనం’ పేరిట ఊరూవాడా అమ్మలను ఊరిస్తూ చెప్పిన మాటలివి. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆ మాటే మరిచారు. మొదటి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టేశారు. రెండో ఏడాది ఇస్తామంటున్నారు కానీ.. ఇప్పటి వరకూ విధివిధానాలేవీ రాలేదు. పిల్లల చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే సమున్నత లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పట్లో ‘అమ్మ ఒడి’ పథకం అమలు చేశారు. ఏటా రూ.15 వేల చొప్పున జమ చేశారు. ఈవిధంగా జిల్లాలో రూ.1,145.63 కోట్ల మేర ‘అమ్మ ఒడి’ సాయం అందించారు. దీంతో, అప్పట్లో పేద పిల్లల చదువులకు ఢోకా ఉండేది కాదు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూటమి మేనిఫెస్టోలో ‘తల్లికి వందనం’ పేరిట పాఠశాల, ఇంటర్మీడియెట్ చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు అండ్ కో గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదే మాట తప్పారు. రెండో ఏడాది నూతన విద్యా సంవత్సరం కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికీ తల్లికి వందనం డబ్బులు ఎప్పుడిస్తారనే దానిపై స్పష్టత లేదు. ప్రభుత్వ తీరుతో కూలీనాలీ చేసుకునే తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించుకునేందుకు నానా అవస్థలూ పడుతున్నారు. కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని విమర్శిస్తున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో క్యాలెండర్, తేదీ విడుదల చేసి మరీ, నేరుగా ఆర్థిక సాయం జమ చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఎగ్గొట్టింది రూ.485 కోట్లు జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరంలో 3.20 లక్షల మంది విద్యార్థులకు రూ.485.35 కోట్లు అందజేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే ఈ మొత్తం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి కూడా సుమారు ఇదే మొత్తం ఇవ్వాల్సి ఉంది. అంటే, రెండేళ్లకు కలిపి సుమారు రూ.971.7 కోట్లు జమ చేయాల్సి ఉంది. రెండేళ్ల సొమ్ము ఇస్తారేమోనని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద సాయం అందించేవారు. దీంతో, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజులు, విద్యార్థుల పుస్తకాలు, బ్యాగులు, బెల్టుల వంటి వస్తువుల కొనుగోలుకు తల్లిదండ్రులకు వెసులుబాటు ఉండేది. కూటమి ప్రభుత్వ పాలనలో ఒక విద్యా సంవత్సరం పూర్తయి, కొత్తది ప్రారంభమవుతున్నా ఇప్పటి వరకూ తల్లికి వందనం నిధుల ఊసే లేకుండా పోయింది. దీనిపై సర్వేలు, ఎటువంటి కార్యాచరణా ప్రారంభించలేదు. ఇప్పటికే ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేపట్టలేదు. ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లభించలేదు. దీనికితోడు అన్ని రకాల సంక్షేమ పథకాలనూ నిలిపివేశారు. ఇటువంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బుల్లేక బడుగు బలహీనవర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తల్లికి వందనం నిధులు త్వరగా విడుదల చేస్తేనే తమ పిల్లలను నిశ్చింతగా చదివించుకోగలమని తల్లిదండ్రులు చెబుతున్నారు. లేకుంటే వారిని చదువు మాన్పించడం తప్ప గత్యంతరం లేదని ఆవేదన చెందుతున్నారు. -
‘మీ ప్రేమకు కృతజ్ఞతలు’
కిర్లంపూడి: తమ కుటుంబంపై ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు చూపిస్తున్న ప్రేమకు వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన గురువారం లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఇచ్చిన పిలుపు మేరకు వెన్నుపోటు దినం కార్యక్రమానికి ఎండను సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమ కుటుంబంపై వెలకట్టలేని, కల్మషం లేని ప్రేమాభిమానాలు చూసి చలించిపోయానని పేర్కొన్నారు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఎంతో ఉత్సాహంతో వచ్చిన ప్రజల చెంతకు తాను రాలేకపోయానన్నారు. నియోజకవర్గం ప్రజలతో తమ కుటుంబానికి ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, ఇప్పటికీ అదే ప్రేమ చూపించడం తమ అదృష్టమని అన్నారు. ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజల సేవకు తమ కుటుంబం మనస్ఫూర్తిగా అంకితమవుతుందని ముద్రగడ పేర్కొన్నారు. నిరసన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నేటి నుంచి డీఎస్సీ జిల్లాలో 41,017 మంది దరఖాస్తు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): డీఎస్సీ–25 పరీక్షలు శుక్రవారం నుం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా 41,017 మంది ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం కాకినాడ అచ్యుతాపురం రైల్వే గేట్ వద్ద అయాన్ డిజిటల్ కేంద్రం, కాకినాడ రూరల్ రాయుడుపాలెం సెంటర్ సాఫ్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల్లో ఆరు ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం 87 మంది స్క్రైబ్లను నియమించామని జిల్లా విద్యా శాఖాధికారి పి.రమేష్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం 94925 16116 (అసిస్టెంట్ డైరెక్టర్), 77996 98462 (సూపరింటెండెంట్), 79897 50963 (సీనియర్ అసిస్టెంట్) హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్గా శ్రీనివాస్ మహేష్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ కాకినాడ సహాయ కమిషనర్గా పి.శ్రీనివాస్ మహేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన ఎస్.బుల్లిరాణి కొవ్వూరు బదిలీ అయ్యారు. సమష్టి కృషితోనే ఎన్బీఏ గుర్తింపు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమష్టి కృషితోనే జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎన్బీఏ) యూజీ స్థాయి గుర్తింపు వచ్చిందని జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మోహనరావు అధ్యక్షతన అలుమ్నీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీటెక్ కోర్సులైన ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్ విభాగాలను ఎన్బీఏ బృందం గత నెలలో సందర్శించిందని, ఈ గుర్తింపు 2028 వరకూ ఉంటుందని చెప్పారు. పీజీ ప్రోగ్రామ్కు ఎన్బీఏ గుర్తింపు వచ్చేలా ఇదే తరహాలో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వరూపరాణి, ఆర్.దీక్షితులు, వివిధ విభాగాల అధిపతులు కోటేశ్వరరావు, కె.వెంకటరెడ్డి, ఆర్.మధు, ఎస్.సురేఖ, కల్యాణ్ మనోహర్, సత్యవేణి పాల్గొన్నారు. -
సేవకులకు తీరనున్న ఇక్కట్లు
● సత్యదేవుని సన్నిధిన ప్రత్యేక ఏర్పాట్లు ● సేవ చేయాలనుకునే వారి కోసం 08868–238163 నంబర్తో ఫోన్ సౌకర్యం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవ చేద్దామనుకునే వారికి ఇకపై కష్టాలు తొలగనున్నాయి. సేవ చేద్దామనుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానంలోని పీఆర్ఓ కార్యాలయాన్ని 08868–238163 నంబరులో సంప్రదించే అవకాశం కల్పించారు. ఈ మేరకు దేవస్థానం అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. సేవ చేయడానికి వస్తున్న చాలా మంది భక్తులు ఎవరిని సంప్రదించాలో తెలిపే ఏర్పాటు దేవస్థానంలో లేక మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు. వారు ఆ సేవకుల నుంచి నగదు వసూలు చేయడం ఇటీవల వివాదంగా మారింది. తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవకులు గత నెలలో ఇదేవిధంగా రాగా.. వారికి సేవ చేసే అవకాశం లేదంటూ ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించడం, వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. దేవస్థానంలో సేవ చేసే అవకాశం కల్పించేందుకు ఆ మహిళా సేవకులు మధ్యవర్తిని ఆశ్రయించగా ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసినట్టు దేవస్థానం అధికారుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో రత్నగిరిపై సేవకుల ఇబ్బందులపై మే 24న ‘సేవ చేయనివ్వరు స్వామీ..’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. సేవ చేయాలనుకునే వారు సంప్రదించేందుకు టీటీడీలో మాదిరిగా అన్నవరం దేవస్థానంలో ఏర్పాట్లు లేవని ఆ కథనంలో పేర్కొనడంతో అధికారులు స్పందించారు. రత్నగిరిపై సేవ చేయాలనుకునే వారు ఇక నుంచి తమ పేరు, ఆధార్, ఫోన్ నంబర్లతో దేవస్థానం పీఆర్ఓ కార్యాలయంలో నమోదు చేయించుకునే అవకాశం కల్పించారు. అయితే, దీంతో పాటు మొబైల్ నంబర్ కూడా ఏర్పాటు చేసి, వాట్సాప్ ద్వారా వివరాలు పంపించే ఏర్పాట్లు చేయాలని పలువురు సేవా కార్యకర్తలు కోరుతున్నారు. -
ఆమైపె కక్ష గట్టి..
భావన, కమిషనర్, నగరపాలక సంస్థ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక మహిళా ఐఏఎస్పై కూటమి నేతలు కక్ష కట్టారు. ఆమెను సాగనంపేందుకు తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. బిల్లుల కోసం వచ్చి, గద్దించి మాట్లాడిన టీడీపీ నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆమె చేసిన పెద్ద నేరమైంది. ఆమెను కొనసాగించవద్దని అందరూ పట్టుబడుతున్నారు. దీనికోసం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులందరూ అంతర్గతంగా ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన బదిలీ కోసం కూటమి కట్టిన నేతల తీరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత పుత్రరత్రం దుందుడుకు వ్యవహారం ప్రజాసంబంధాలతో ముడిపడి ఉన్న ఐఏఎస్ అధికారులు.. ఏ హోదాలో ఉన్నా ఏ విషయంౖపైనెనా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందే. అందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల వేదికలో మరింత జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నాలుగున్నర లక్షల పైచిలుకు జనాభా కలిగిన కాకినాడ నగర పాలక సంస్థకు మహిళా ఐఏఎస్ భావన కమిషనర్గా పని చేస్తున్నారు. ఆమె కాకినాడ వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ప్రతి వారం మాదిరిగానే గత సోమవారం ఆమె ప్రజా ఫిర్యాదుల వేదికలో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ క్రమంలో కమిషనర్ వద్దకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తనయుడు, కాంట్రాక్టర్ అయిన గంగాధర రమేష్ వచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి తనయుడిని కావడంతో తన మాటకు ఎదురుండదనుకున్నారో ఏమో కానీ.. పెండింగ్ బిల్లుల కోసం దుందుకుడుగా ప్రశ్నించారు. తాము చెప్పినట్టే అధికారులు, సిబ్బంది నడచుకోవాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో నేతల వరకూ అందరూ ఒంట పట్టించుకున్నట్టు ఈ సంఘటనతో అర్థమవుతోంది. బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గంగాధర రమేష్ గద్దించి మాట్లాడంతో మనస్తాపం చెందిన కమిషనర్ భావన.. దీనిపై అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్కు ఎంహెచ్ఓ ద్వారా మొబైల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కాస్త శ్రుతి మించి వ్యవహరించారనే విమర్శలున్నాయి. బిల్లుల విషయం పక్కన పెట్టి.. బదిలీపై పట్టుబట్టి.. తమ పార్టీ నాయకుడి తనయుడి పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల అహం దెబ్బ తిన్నట్టుంది. ఈ నేపథ్యంలో వారు బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసి, కమిషనర్ భావనను తక్షణం బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చేస్తామంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంహెచ్ఓ ద్వారా పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు కాకినాడలో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశమైంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగిన ఈ భేటీలో కమిషనర్ భావనను కాకినాడ నుంచి సాగనంపాల్సిందేనని ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. దీనికి వారం రోజులు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. మెట్ట ప్రాంత నేతలకు కాకినాడ సిటీ, రూరల్ నేతలు కూడా తోడయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్డగోలు పనులకు అడ్డమని... వాస్తవానికి కమిషనర్ భావన, కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఆరు నెలల క్రితమే పలు అంశాల్లో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ నగరంలో ఏ అధికారిక కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కాకినాడ దుమ్ములపేటలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కొండబాబు చివరి నిమిషంలో డుమ్మా కొట్టేశారు. వీరిద్దరి మధ్య విభేదాల విషయం తెలియక రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చినప్పటికీ.. కొండబాబు రాలేదని తెలిసి తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి, ఎమ్మెల్యేని విస్మరించారంటూ అప్పట్లో కొండబాబు వర్గీయులు బయట రచ్చరచ్చ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, కమిషనర్ కలసి అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ కమిషనర్గా వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డగోలు పనులకు భావన అడ్డు తగులుతూండటం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. అయితే, అప్పట్లో ఆమైపె చర్యలకు సిఫారసు చేసేందుకు ధైర్యం చాలక కాకినాడ సిటీ టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కాకినాడ వచ్చిన సందర్భంలో సైతం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కమిషనర్ భావనను మార్చాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. తాజా ఘటనతో జిల్లాలోని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూటమి కట్టి, కమిషనర్ బదిలీకి పావులు కదుపుతున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఆమెను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.నగరపాలక సంస్థ కార్యాలయం మహిళా ఐఏఎస్కు వ్యతిరేకంగా నేతల ‘కూటమి’ కాకినాడ కార్పొరేషన్ కమిషన్ బదిలీకి యత్నం అంతా ఒక్కటై.. బదిలీకి వారం డెడ్లైన్ అధిష్టానానికి అల్టిమేటం ఇదేం పద్ధతి? వాస్తవానికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. ఈ చెల్లింపులు సీఎంఎఫ్ పరిధిలో ఉన్నాయి. అధికారం గుప్పిట్లో ఉందని జబ్బలు చరుచుకునే అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నించుకోకుండా కమిషనర్పై దుందుడుకుగా మాట్లాడితే ప్రయోజనమేమిటని, ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఒక మహిళా ఐఏఎస్పై అంత దురుసుగా మాట్లాడటం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే తెగింపుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఉదంతంలో కమిషనర్ భావన అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంలో తప్పేముందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. బిల్లుల మంజూరులో కమిషనర్ వైఫల్యం ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ దుందుడుకుగా మాట్లాడాల్సిన పనేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
చేప ముల్లు తీసి.. ప్రాణం నిలిపి..
కాకినాడ క్రైం: గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణాలను కాకినాడ వైద్యులు రక్షించారు. సంబంధిత వివరాలను కాకినాడ అపోలో ఆసుపత్రి యాజమాన్య గురువారం వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన మహిళ జంప మంగాయమ్మ (54) ఫోన్ మాట్లాడుతూండగా గుండె నొప్పికి గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గత నెల 25వ తేదీన కాకినాడ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ఉందని తేల్చారు. ఆమెను రక్షించేందుకు ఛాతికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ చేయడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. ఇది దేశంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు తెలిపారు. వైద్య బృందానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ గూడె వంశీ చైతన్య, వాస్క్యులర్ సర్జన్ కృష్ణ, గుండె మత్తు వైద్య నిపుణుడు ప్రగడ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. -
ప్రవీణ్ సంస్మరణ సభకు అనుమతి
రాజమహేంద్రవరం సిటీ: హైదరాబాద్కు చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు హైకోర్టు లైన్ క్లియర్ చేసిందని, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తరఫు న్యాయవాది బాల గురువారం విలేకర్లకు తెలి పారు. గత నెల 24న ప్రవీణ్ పడగాల సంస్మరణ సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో హర్షకుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా న్యాయవాది బాల హైకోర్టులో వాదనలు వినిపిస్తూ.. మే 28న కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడుకు అనుమతి ఇచ్చారని, అటువంటిది సామాన్య ప్రజలు సంస్మరణ సభ నిర్వహించేందుకు అనుమతులు నిరాకరించారని ప్రస్తావించారు. వాదనల అనంతరం, ప్రవీణ్ సంస్మరణ సభకు సంబంధించి కొత్తగా చేసే దరఖాస్తుపై నాలుగు వారాల్లో ఏదో ఒక రోజు అనుమతివ్వాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించిందని బాల తెలిపారు. సభ అనుమతుల కోసం త్వరలోనే జిల్లా పోలీసు కార్యాలయంలో దరఖాస్తు చేస్తానని, ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సభ నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు. సెంట్రల్ జైలును సందర్శించిన అటవీ అధికారులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎన్ఎన్ మూర్తి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఫణీంద్ర ధర్మ గురువారం సందర్శించారు. జైలులోని నర్సరీ గురించి వారికి కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కారాగారానికి బయో డైవర్సిటీ పురస్కారం అందజేసిందని చెప్పారు. వందేళ్ల వయస్సుకు పైబడిన వృక్షాలను అటవీ శాఖ అధికారులకు ఆయన చూపించారు. కారాగారంలో నర్సరీని అభివృద్ధి చేసిన జైలు అధికారులను అటవీ అధికారులు ప్రశంసించారు. అనంతరం కారాగారంలోని పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు. -
‘కోరింగ’లో ‘స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ ఫ పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా! ఫ అత్యంత విషపూరితం ఫ కాటేస్తే ప్రాణానికే ప్రమాదం ఫ భవిష్యత్తులో అంతరించిపోయే జాతిగా నిర్ధారణ ఫ షెడ్యూల్ 4 నుంచి 1కి మార్పు ఫ దేశంలో మూడో అతి పెద్ద కోరింగ అభయారణ్యంలో గుర్తింపు ఫ పరిరక్షణకు నడుం బిగించిన వన్యప్రాణి విభాగం -
వెన్నుపోటుపై పోరుబాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఊరూ వాడా ఒక్కటైంది. గద్దె నెక్కి ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి సర్కార్పై జనాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునందుకున్న జనం పార్టీలు, వర్గాలు, కులాలకు అతీతంగా చంద్రబాబు కూటమి పాలనపై గళమెత్తారు. ఎన్నికల్లో వందకు పైబడే పథకాలు పేరు చెప్పి ఓట్లు వేయించుకుని తమను మోసం చేయడానికి అధికారం ఇచ్చామా అని జనం వెన్నుపోటు దినంలో నిలదీశారు. ప్రభుత్వంపై ఏడాది కాలంగా ఉన్న ప్రజా వ్యతిరేకత బుధవారం జరిగిన వెన్నుపోటు దినంలో ప్రస్ఫుటమైంది. పల్లెలు, పట్టణాల నుంచి ఉదయం 10 గంటలకే పార్టీ జెండాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంతో కూడిన ప్లకార్డులతో జనం తండోపతండాలుగా తరలివచ్చి వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన పిలుపులో భాగస్వాములయ్యారు. మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, పార్టీ నేతలు, పార్టీ శ్రేణులు పార్టీ జెండాలు చేతపట్టి పార్టీ కార్యాలయాల నుంచి భారీ బైక్ర్యాలీలు, పాదయాత్రలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడే ఉదయాన్నే స్వచ్ఛందంగా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావడంతో వెన్నుపోటు దినం కార్యక్రమం జిల్లా అంతటా సూపర్ సక్సెస్ అయ్యింది. పార్టీ శ్రేణులలో ఉత్సాహం ఉరకలు వేసింది. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్లో మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జన సందోహంతో నిరసన ర్యాలీ నిర్వహించారు.అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తుని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తునిలో నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. పల్లెల నుంచి వేలాదిగా తరలివచ్చిన జన సందోహంతో తుని పట్టణం కిక్కిరిసిపోయింది. తుని పట్టణంలో ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయకొట్టి కాలినడకన ప్రారంభించిన నిరసన ర్యాలీ బాలాజీ సెంటర్, మెయిన్రోడ్డు, గొల్లప్పారావు సెంటర్, తహసీల్దార్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. పార్టీ నాయకులు యనమల కృష్ణుడు, లాలం బాబ్జి తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో జగ్గంపేటలో వెన్నుపోటు దినం భారీ ర్యాలీలో నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు ర్యాలీలో పాల్గొన్నాయి. జగ్గంపేట కోనేటి వద్ద నుంచి ప్రారంభమై మొయిన్రోడ్డు, బస్టాండ్, పోలీసుస్టేషన్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్, చంద్రబాబు వెన్నుపోటు దారుడు, మోసగాడు, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ నినాదాలు చేశారు. అనంతరం వినతిపత్రాన్ని తహసీల్దార్కు అందజేశారు. రాష్ట్ర యువజన విభాగం సహాయ కార్యదర్శి తోట రాంజీ, పబ్లిసిటీ విభాగం నుంచి రామకుర్తి జగాలు, లీగల్ సెల్ తరఫున గుల్లా ఏడుకొండలు, పెద్దాడ రాజబాబు, రామకుర్తి శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని పల వార్డుల నుంచి తరలివచ్చిన జనంతో కలిసి పార్టీ నేతలు నిరసన గళం వినిపించారు. సిటీలో ద్వారంపూడి సహా పార్టీ నేతలు నలుపురంగు షర్టులు, మహిళా నేతలు, సిటీ ప్రెసిడెంట్ సుంకర శివప్రసన్న, రాష్ట్ర మహిళా కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్ తదితరులు నలుపురంగు చీరలతో వినూత్నంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వరకు వెళ్లి ఆర్డీవో మల్లిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు అల్లి రాజబాబు, మైనార్టీ సెల్ నేతలు బాషా, బషీర్, లీగల్ సెల్ నేతలు పితాని శ్రీనివాస్, ఆదిత్యకుమార్, ప్రచార, ట్రేడ్, బీసీ విభాగాల నేతలు రావూరి వెంకటేశ్వరరావు, చక్రవర్తి, వాసుపల్లి కృష్ణ, మాజీ డిప్యుటీ మేయర్ మీసాల ఉదయకుమార్, సిటీ యూత్ ప్రసిడెంట్ రోకళ్ల సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రత్తిపాడు పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కిర్లంపూడిలోని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఇంటికి వచ్చి ఆయనను కలిశారు. అనంతరం అక్కడి నుంచి నేతలు, పార్టీ శ్రేణులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు కలసి గిరిబాబు ఆధ్వర్యంలో జగపతినగరం, సింహాద్రిపురం, మీదుగా ప్రత్తిపాడు వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం స్వచ్ఛందంగా వచ్చి ‘జెండాలను జతకట్టె..జనాలను మడతపెట్టె’, ‘వెన్నుపోటుకు కేరాఫ్ చంద్రబాబు’, ‘ఉచిత బస్సు అమలులో తుస్’, ‘రైతుభరోసా భారీ మోసం’, ‘వెన్నుపోటు బాబుకు వెండి తెరపై చూపిస్తాం అసలు సినిమా’, ‘వెన్నుపోటు సూపర్హిట్’, ‘నెలనెలా రూ.1,500 అన్నావ్’, ‘50 ఏళ్లకే పింఛన్ అన్నావ్ ఓట్లు వేయించుకున్నావ్’ అనే ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొనడం ఆకర్షించింది. పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, పార్టీ నేతలు వాసిరెడి జమీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు గోళ్ల క్రాంతిసుధాకర్, గొల్లు దివానం, సిగడం వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. పెద్దాపురం సామర్లకోటలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి పెద్దాపురం ఆర్డీవో కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా మోటారు సైకిల్ ర్యాలీ ప్రారంభించగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో ప్రసన్నాంజనేయస్వామి ఆలయం నుంచి మండుటెండలో ఆర్డీవో కార్యాలయం వరకు పాదయాత్రగా నాయకులు, కార్యకర్తలు, నేతలు ర్యాలీగా తరలివెళ్లారు. పార్టీ సీనియర్ నేత దవులూరి సుబ్బారావు ఆధ్వర్యంలో పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద కూటమి ప్రభుత్వం వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేసింది. అనంతరం ఆర్డీవో కె శ్రీరమణికి వినతి పత్రం అందజేశారు. పార్టీ రాష్ట్ర అయ్యరక విభాగం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, స్థానిక సంస్థల ప్రతినిధులు గవరసాని సూరిబాబు, ఎంపీపీలు పెంకే సత్యవతి, బొబ్బరాడ సత్తిబాబు పాల్గొన్నారు. పిఠాపురం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తోన్న పిఠాపురంలో సైతం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వెన్నుపోటు దినం కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన జనంతో పిఠాపురం ఉప్పాడ సెంటర్ నిండిపోయింది. ప్రధానంగా పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళల ఇచ్చిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో పిఠాపురం మారుమోగింది. ఉప్పాడ సెంటర్లో ప్రారంభమైన నిరసన ర్యాలీ పాత బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా తహసీల్దారు కార్యాలయం వరకు సాగింది. తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు వులవకాయల నాగ లోవరాజు, గుబ్బల తులసీకుమార్, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్థినీడి సుజాత, రాష్ట్ర యూత్ సంయుక్త కార్యదర్శి ఉలవల భూషణం, జిల్లా అధికార ప్రతినిధి పెదపాటి రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కారే శ్రీనివాసరావు, కొప్పన శివనాఽథ్ పాల్గొన్నారు. కూటమి సర్కార్పై పోటెత్తిన ప్రజాగ్రహం వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలిసొచ్చిన జన సందోహం భారీ మోటార్ సైకిల్ ర్యాలీలు ఉత్సాహంతో ఉరకలెత్తిన పార్టీ శ్రేణులు కాకినాడ జిల్లాలో వెన్నుపోటు దినం సూపర్ సక్సెస్ -
పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. దీనిని ఒక విషపూరితమైన పాము జాతిగా తేల్చారు. ఈ పాము విషం చాలా శక్తిమంతమైనదిగా నిర్ధారించారు. ఈ పాము కాటు వేసినప్పుడు సకాలంలో వైద్య అందకపోతే ప్రాణాంతకమే. ఆకుపచ్చ రంగులో ఉండి శరీరంపై చిన్న చిన్న ఎరుపు మచ్చలు కూడా కనిపిస్తుంటాయి. తల భాగం ఒకే రీతిలో చిలకాకుపచ్చ, వెనుక ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. పచ్చని చెట్లపై సంచరిస్తూండటంతో ఈ పామును స్థానికులు పసర పాముగా భావించి ఉదాసీనంగా ఉంటే ప్రాణాలకే ప్రమాదం. జీవ వైవిధ్యంలో విశేషతను సంతరించుకుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ పాముకు ఉప జాతులేమీ ఇంతవరకూ గుర్తించ లేదు. ఇటువంటి లక్షణాలున్న పాము కోరంగి అభయారణ్యంలో రికార్డు కావడంతో దీని పరిరక్షణ కోసం వన్యప్రాణి విభాగం ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాయత్తమవుతోంది. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది.పర్యాటకులకు అవగాహన కల్పింస్తున్నాం మడ అడవులకు వచ్చే పర్యాటకులకు ఈ విషయంలో ముందు జాగ్రత్తలు చెబుతాం. చెట్లు ఎక్కవద్దు, లోపలకు వెళ్ళవద్దంటూ హెచ్చరించి పంపిస్తాం. ఒకవేళ ఈ పాము కాటు వేస్తే వెంటనే వైద్య సహాయం పొందాలి. ఈ పాము కరవగానే విరుగుడుకు ఇంజక్షన్ చేయించాలి. ఈ ఇంజక్షన్ కోరంగి అభయారణ్యం సమీపాన తాళ్లరేవు పీహెచ్సీ లేదా కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రిలో ఉంటుంది. కాలు మీద కాటేస్తే ఎక్కువగా నడవకూడదు. కట్టుకట్టకుండా ఆస్పత్రికి తరలించాలి. ఈ విషయాలపై ముందుగా అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, అటవీ రేంజర్, వన్యప్రాణి విభాగం, కోరంగి అభయారణ్యం, కాకినాడ -
బిడ్డను చంపి.. తనువు చాలించి..
కాకినాడ క్రైం: కన్న పేగుని చిదిమేసి తానూ తనువు చాలించిన తల్లి హృదయ విదారక సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, రాజమహేంద్రవరానికి చెందిన గుడేటి రమ్యదీప్తి(30)కి ఐదేళ్ల క్రితం కాకినాడ రేచర్లపేట దౌర్లవారి వీధికి చెందిన రాజాల శరత్తో వివాహమైంది. ఈ దంపతులు అబుదాబీలో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు కియాన్ ప్రశాంత్ ఉన్నాడు. రెండు నెలల క్రితం రమ్యదీప్తి అబుదాబి నుంచి తన కుమారుడితో కలిసి రాజమహేంద్రవరానికి వచ్చింది. అక్కడ ఒకటిన్నర నెలల పాటు ఉండి, సుమారు పది రోజుల క్రితం కాకినాడలోని అత్తయ్య ఇంటికి వచ్చి ఉంటోంది. ఏమైందో, ఏమో మంగళవారం రాత్రి నిద్రపోయేందుకు కుమారుడితో కలిసి తన గదిలోకి వెళ్లింది. ఉదయం ఎంతకూ తలుపు తీయకపోయేసరికి దీప్తి అత్తయ్య, ఆడపడుచు కిటికీ నుంచి గదిలోకి చూశారు. దీప్తి ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. ఆమె కుమారుడు మంచంపై నిర్జీవంగా పడి ఉన్నాడు. పొరుగు వారి సాయంతో తలుపులు తెరిచిచూడగా.. దీప్తి అప్పటికే చనిపోయి ఉంది. బాలుడు ప్రశాంత్కు ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. టూ టౌన్ ఇన్చార్జి సీఐ సత్యనారాయణ, ఎస్సై తులసీరామ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీప్తి ఆత్మహత్యకు పాల్పడిందని, అంతకు ముందు తన కుమారుడి ముక్కు, నోటికి ప్లాస్టర్లు వేసి, ఊపిరాడకుండా చేసి ఉంటుందని గుర్తించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో దీప్తి ఈ ఘాతుకానికి పాల్పడిందని భావిస్తున్నామని, విచారణలో వాస్తవాలు తెలుస్తాయని సీఐ చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇలాఉంటే, అత్త, ఆడపడుచు, భర్త వేధింపులు తాళలేకున్నానని దీప్తి తమకు వాయిస్ మెజేస్లు పెట్టి ఈ ఘాతుకానికి పాల్పడిందని దీప్తి తల్లి అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాకినాడ టూ టౌన్ పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. -
కన్నూమిన్నూకాన‘కొండ’..!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తెలుగు తమ్ముళ్ల కన్నుపడితే కొండలు కూడా పిండైపోతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్దాపురం సమీపాన ఏడీబీ రోడ్డులోని రామేశంమెట్ట కొండను తెలుగుతమ్ముళ్లు గుల్లచేసేశారు. నాడు దాదాపు మూడున్నరేళ్లు ఏకబిగిన రాత్రి, పగలు తేడా లేకుండా గ్రావెల్ మాఫియా రాజ్యమేలింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలి ఉన్న కొండను ఇప్పుడు టీడీపీ నేతలు, వారి అనుచరులు తవ్వేస్తున్నారు. మీకు సగం, నాకు సగం అంటూ పంపకాలు వేసుకుని మరీ సొమ్ము చేసుకుంటున్నారు.టీడీపీ, జనసేన కుమ్మక్కై..రామేశంమెట్టలో సర్వే నంబర్ 1 నుంచి 90 వరకూ 823 ఎకరాల్లో కొండలు ఉన్నాయి. 800 మంది నిరుపేద దళితుల స్వయం ఉపాధి కోసం 1975లో అప్పటి ప్రభుత్వం రామేశంమెట్టను కేటాయించింది. 2014–19 మధ్య ఈ కొండలపై టీడీపీ నేతల కళ్లు పడ్డాయి. అంతే పది పదిహేను అడుగుల లోతున తవ్వేసి దోచుకున్నారు. అప్పట్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అప్పటి కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన కీలక మంత్రి కనుసన్నల్లో ఆయన బంధుగణం రామేశంమెట్ట కొండను గుల్ల చేసేసింది. రూ.కోట్లు కొల్లగొట్టింది. నిత్యం వందలాది టిప్పర్లు, లారీల్లో వేల టన్నుల గ్రావెల్ను జిల్లా సరిహద్దులు దాటించేయడం అప్పట్లో రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. 2019లో అధికారం కోల్పోవడంతో ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఆ మెట్టపై పెద్దగా కార్యకలాపాలు జరగలేదు. 2024లో మళ్లీ కూటమికి అధికారం దక్కడంతో ఇప్పుడు టీడీపీ, జనసేన నేతలు కుమ్మక్కై వాటాలు వేసుకుని మరీ మిగిలిన కొండను కొల్లగొడుతున్నారు.రోజుకు రూ.15 లక్షల వరకూ దోపిడీ..! కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం నియోజకవర్గాల సరిహద్దులో రామేశంమెట్ట ఉంది. ఈ రెండు నియోజకవర్గాలకు టీడీపీ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామేశంమెట్ట కొండను పెద్దాపురం నియోజకవర్గం వైపు 2014–19 మధ్య అడ్డంగా తవ్వేశారు. మిగిలిన కొండను ఇప్పుడు తవ్వేస్తున్నారు. కొండకు రెండోవైపు ప్రాంతం జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోకి రావడంతో అక్కడ స్థానిక సంస్థలకు చెందిన ఒక ప్రజాప్రతినిధి గ్రావెల్ దందా నడిపిస్తున్నాడు. మెట్ట ప్రాంతంలోని ఒక ప్రజాప్రతినిధితో ఉన్న బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాత్రి, పగలు పదుల సంఖ్యలో టిప్పర్లతో గ్రావెల్ను తరలించేసి రామేశంమెట్ట కొండను గుల్ల చేసేస్తున్నారు. టిప్పర్లలో గ్రావెల్ తరలించేసి రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ తెలుగు తమ్ముళ్లు దోచుకుంటున్నట్టు సమాచారం. -
పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ ఆవేదన
పిఠాపురం: ‘వృద్ధాప్య పింఛనే ఇప్పటివరకు నన్ను బతికించింది. ఇప్పుడు ఆ పింఛన్ కూడా ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికున్నట్టు నిరూపించుకోమంటున్నారు. నేను కాలు కదపలేను. ఎక్కడికీ వెళ్లలేను. పింఛన్ లేకపోతే నాకు దిక్కులేదు. దాన్ని కూడా తీసేసి బతికుండగానే చంపేస్తున్నారు’ అంటూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఇలాకాలో 85 ఏళ్ల అవ్వ కన్నీటిపర్యంతమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన చోడిశెట్టి సుబ్బారావు(85) కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ అందుకుంటూ.. కుమార్తె పార్వతి వద్ద నివసిస్తోంది. వైఎస్ జగన్ సర్కార్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా వలంటీర్ ద్వారా ఇంటి వద్దే పింఛన్ అందుకున్న ఆమెకు కూటమి ప్రభుత్వంలో కష్టాలు ఎదురయ్యాయి. ఈ నెల పింఛన్ను ఆపేసిన కూటమి సర్కార్.. బతికున్నట్లుగా నిరూపించుకోవాలంటూ ఆమెకు అగ్ని పరీక్ష పెట్టింది. దీంతో తనను ఆదుకోవాలంటూ ఆ వృద్ధురాలు విలపిస్తోంది. నేను బతికే ఉన్నా కదా.. ‘గతంలో ఏ ఇబ్బంది లేకుండా వలంటీరే అన్నీ చూసుకునేవాడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారడంతో ఐరిస్ కూడా పడటం లేదంటున్నారు. ఏది పడకపోయినా నేను బతికే ఉన్నా కదా. నాకు పింఛనే ఆధారం అని చెబుతున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ వృద్ధురాలు విలపించింది. ‘మా అమ్మకు నెలనెలా వచ్చే పింఛన్ డబ్బులతోనే మందులు కొంటున్నా. పవన్కళ్యాణ్కు ఓటు వేసినందుకు ఇప్పుడు పింఛన్ గురించి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది’ అంటూ ఆమె కుమార్తె పార్వతి వాపోయింది. తమకు న్యాయం చేయాలని కోరింది. -
సూపర్సిక్స్తో మోసం
సూపర్ సిక్స్ సహా గత ఎన్నికల్లో 130 హామీలు ఇచ్చి, మోసం చేసిన చంద్రబాబు సర్కార్పై జనం తిరగబడే రోజులు వచ్చేశాయి. అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా జనాన్ని నిలువునా దగా చేశారు. అందుకే ప్రజాపక్షంగా ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు వైఎస్సార్ సీపీ వెన్నుపోటు దినం నిర్వహిస్తోంది. బలహీనవర్గాలకు రాయితీ రుణాలని గొప్పగా ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైపోయినా ఒక్కరికై నా రుణం ఇచ్చారేమో చెప్పాలి. తీరని అన్యాయానికి గురైన బీసీలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, బీసీ జేఏసీ కో కన్వీనర్, కాకినాడ అన్ని వర్గాలకూ హ్యాండిచ్చారు కూటమి సర్కార్ అన్ని వర్గాలకు హ్యాండిచ్చింది. ఏడాది పాలనలో అన్ని రంగాలనూ భ్రష్టు పట్టించింది. ఇచ్చిన హామీలన్నింటినీ గాలికొదిలేసింది. ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి, చివరకు ప్రజలను మోసం చేసింది. – సుంకర విద్యాసాగర్, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి, కాకినాడ జిల్లా -
అక్రమాలు.. దందాలు
● కూటమి పాలనలో మట్టి, గ్రావెల్ మాఫియా, భూకబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లతో తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ● తుని, పిఠాపురం ప్రాంతాల్లో దేవదాయ భూములకు వేలం జరగకుండా అడ్డం పడి దొడ్డిదారిన దోచుకునేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ● పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఎర్ర గ్రావెల్ కొండలను పిండి చేసి, వాటాలు వేసుకుంటున్నారు. ● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులిచ్చి జిల్లాను మత్తులో ముంచుతున్నారు. యువత మద్యం, గంజాయికి బానిసైపోయినా సర్కారు చెవికెక్కడం లేదు. మద్యాన్ని ఏరులై పారిస్తోంది. జిల్లాలో అధికారిక మద్యం దుకాణాలు 171 ఉండగా, సందుగొందుల్లో సుమారు 500 బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఏర్పాటు చేశారు. ● జిల్లాలో ఇంటింటికీ రేషన్ తీసుకువచ్చిన 428 ఎండీయూ వాహనాలను తొలగించి, తిరిగి పాత రోజుల్లోకి తీసుకుపోయారు. -
సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా సూర్య అరవింద్
తుని: తమిళనాడులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా తునికి చెందిన డాక్టర్ కాదంబరి సూర్య అరవింద్ నియమితులయ్యారు. ఆయన సోదరుడు కాదంబరి రామకృష్ణ ఈ విషయం తెలిపారు. అరవింద్ చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఉండేవాడని, ఎంబీబీఎస్ చదివి, శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో చేరారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో సేవలందించిన అరవింద్కు పీఠాధిపతి, జగద్గురువు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. దత్తేశ్వరానంద భారతి స్వామిగా సన్యాస నామం ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించారని వివరించారు. ఈ నెల 6న కుర్తాళంలో ఆయన పట్టాభిషేకం జరుగుతుందని తెలిపారు. పీఎం సూర్యఘర్కు సహకరించాలి కాకినాడ సిటీ: పీఎం సూర్యఘర్ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లపై సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు అధికారులు, బ్యాంకర్లు చొరవ చూపాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశించారు. వివిధ అంశాలపై కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ సకాలంలో సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటు చేయాలన్నారు. సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటుకు బ్యాంకర్ల ద్వారా రుణ మంజూరులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. దీనికోసం జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, వారం వారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ప్రక్రియ సజావుగా సాగేలా చూస్తామని చెప్పారు. మండలాలు, పట్టణాల వారీగా సోలార్ రూఫ్టాప్ ప్యానెల్ ఏర్పాటు చేసే వారితో డీఆర్డీఏ, మెప్మా సిబ్బంది సమన్వయం చేసుకొని, లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ జి.ప్రసాద్, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు, ఎల్డీఎం సీహెచ్ఎస్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
వంకర పాదాలు సరి చేయొచ్చు
కాకినాడ క్రైం: పుట్టుకతో వచ్చే వంకర పాదాలను సరి చేయవచ్చని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ్ (ఆర్బీఎస్కే) జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ వి.అరుణ తెలిపారు. వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా కాకినాడ జీజీహెచ్ ఆర్థోపెడిక్ లెక్చర్ గ్యాలరీలో డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ), క్యూర్ ఇండియా సంయుక్త ఆధ్వర్యాన మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ, పుట్టుకతో వంకర పాదాలను గుర్తిస్తే వైద్యులు, సామాన్యులు జీజీహెచ్లో ఉన్న డీఈఐసీకి సిఫారసు చేయాలని సూచించారు. ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ, పుట్టిన 21 రోజుల్లోగా చికిత్స అందించగలిగితే వంకర పాదాలు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ నిపుణుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే చికిత్సా విధానాల ద్వారా శిశువు జీవన ప్రమాణాలు మెరుగు పడతాయన్నారు. అవసరానికి అనుగుణంగా టినోటమీ అనే మైనర్ శస్త్రచికిత్స నిర్వహిస్తామని డాక్టర్ విఠల్ అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు, తల్లిదండ్రులతో పాటు, క్యూర్ ఇండియా ప్రతినిధులు, డీఈఐసీ సిబ్బంది, ఆర్దోపెడిక్, పీడియాట్రిక్స్, ఫిజియోథెరపీ నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం, వరల్డ్ క్లబ్ ఫుట్ డే సందర్భంగా డాక్టర్ విఠల్ కేక్ కట్ చేసి, పిల్లలకు అందించారు. స్కూటీపై వెళ్తూంటే.. చైన్ లాక్కుపోయారు కరప: గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వెంబడించి, విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి తిరిగి వెళ్తున్న మహిళా ఉద్యోగి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాజులూరు మండలం గొల్లపాలెం గ్రామానికి చెందిన కొండేపూడి శాంతి శివకుమారి కరప మండలం వేళంగిలోని ఎస్బీఐ బ్రాంచిలో టెంపరరీ వర్కర్గా పని చేస్తున్నారు. ఆమె సోమవారం సాయంత్రం తన స్కూటీపై గొల్లపాలెం వెళ్తూండగా సిరిగలపల్లిలంక గ్రామం దాటిన తర్వాత దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టి, వేగంగా పరారయ్యారు. బాధితురాలు మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరప పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో కరప ఎస్సై టి.సునీత కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు
రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామ సచివాలయంలో జయబున్నీసా బేగం గ్రేడ్–5 హోదాలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ సచివాలయంలో వారంతా ఒకే నోటిఫికేషన్లో నియమితులయ్యారు. దీంతో వారి మధ్య సీనియారిటీ సమస్య కూడా లేదు. అయితే, బేగంకు కొన్నాళ్ల క్రితం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. డీడీవోగా సిబ్బంది జీతాల ఫైల్ సిద్ధం చేయడం ఆమె చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆ సచివాలయ సిబ్బంది రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని డీఎల్డీవో, వార్డు, గ్రామ సచివాలయాల ఇన్చార్జి వీణాదేవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెల జీతాలు నేటికీ రాలేదని బేగం ఫైల్ సిద్ధం చేయకపోవడమే అందుకు కారణమని డీఎల్డీవో దృష్టికి తీసుకెళ్లారు. బేగం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డీఎల్డీవో సిబ్బంది ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో 4 నుంచి 7 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో పాల్గొనే పురుషుల జిల్లా జట్టు ఎంపి కను మంగళవారం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్రీడామైదానంలో నిర్వహించిన సెలెక్షన్స్లో 15 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ మ హిళల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం తరఫున క్రీడాదుస్తులు అందజేశామని తెలిపారు. -
ఇద్దరు లారీ డ్రైవర్ల దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం కాపవరం వద్ద హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. కొవ్వూరు ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ బత్తుల శీనయ్య(40) హైదరాబాద్ నుంచి మండపేటకు ధాన్యం లోడుతో వస్తున్నాడు. కాపవరం వద్దకు వచ్చే సరికి కునుకుపాటుకు గురై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం రోడ్డు డివైడర్ను ఢీ కొట్టడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీని ఇతర వాహనాలకు ఢీకొనకుండా, శీనయ్య కిందకు దిగి డైరెక్షన్ ఇస్తూ దారి చూపుతున్నాడు. ఇంతలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ.. శీనయ్య లారీని బలంగా ఢీకొట్టడంతో అందులోని డ్రైవర్ కొయ్యే బాబూరావు(40) లారీ క్యాబిన్లో ఇరుకుపోయి మృతి చెందాడు. డైరెక్షన్ ఇస్తున్న బత్తుల శీనయ్య కూడా ఐచర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు. -
రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిపై గల ప్రతిష్టాత్మకమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్ బిడ్జిల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పీఈ ఎడ్విన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో గల రెండు బ్రిడ్జిలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే వంతెనలపై జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నాణ్యత, భద్రతా తనిఖీని నిర్వహించామన్నారు. 2027 నాటికి సురక్షితమైన, బలమైన వంతెనలుగా తీర్చిదిద్దడానికి, రూ.115 కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై సురక్షితమైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశామన్నారు. ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జ్పై రూ.70 కోట్లతో కేబుల్ రీ ప్లేస్మెంట్ వర్క్ పూర్తి చేస్తున్నామన్నారు. భారతీయ రైల్వేలతో అవగాహన ఒప్పందం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతును ఆశిస్తున్నామన్నారు. పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఆదేశాలు భేఖాతర్
మునికూడలి ర్యాంపులో ఆగని ఇసుక రవాణా సీతానగరం: జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిపివేస్తున్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను భేఖాతరు చేస్తూ మునికూడలి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మండలంలోని ములకల్లంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి కాటవరం ర్యాంప్ నుంచి, పక్కిలంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి మునికూడలి ర్యాంపు నుంచి, రఘుదేవపురం, వంగలపూడి ర్యాంపుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ర్యాంపులను అక్టోబర్ వరకు నిలిపివేస్తున్నట్లు, ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి లారీలపై మునికూడలి ర్యాంపు నుంచి రవాణా చేస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో మూడు భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా జరుగుతోందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా తక్షణమే ర్యాంపును నిలిపివేస్తామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి. -
ఉత్కంఠగా సీనియర్ ఓపెన్ చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన సీనియర్ ఓపెన్ చెస్ జిల్లా స్థాయి పోటీలు ఉత్కంఠగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. ద్రాక్షారామ సాత్విక్ (ప్రథమ), తాడి వెంకటేష్ (ద్వితీయ), బండారు నానిబాబు (తృతీయ), పి.ధరణి (4వ స్థానం) సాధించారని చెప్పారు. ఈ నలుగురు విజేతలు ఈనెల 6వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిధి స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి బహుమతులు అందజేశారు. -
నాణ్యమైన విద్యకు నవోదయం
రాయవరం: జవహర్ నవోదయ విద్యాసమితిలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉండగా..కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఇక్కడ దరఖాస్తుకు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత. పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఒక్కసారే అవకాశం ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయలో ప్రవేశం లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందగోరే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3,4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం తగ్గకుండా సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు ఏడు శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. వసతులు బాలబాలికలకు వసతి గృహాలు, భోజనం, విద్య, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్, షూస్, టాయిలెట్ సామగ్రి ఉచితం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నవోదయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బాలికలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జూలై 29వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. దరఖాస్తుకు రుసుం చెల్లించనవసరం లేదు. 2026–27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష గతేడాది జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన దరఖాస్తులు కోనసీమ 3,869 తూర్పుగోదావరి 1,741 కాకినాడ 3,361పరీక్షా విధానమిదీ.. నవోదయ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబరు 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు భాషను(తెలుగు/ఇంగ్లీషు) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహియిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 40 ప్రశ్నలు 50 మార్కులకు, గణితం(అర్ధమెటిక్), ఎంచుకున్న భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ఎంపికై న వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిషు భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిషులోనే బోధన చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్టీటీపీఎస్://నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు అవగాహన కల్పించాలి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం -
‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పుస్తకావిష్కరణ
కపిలేశ్వరపురం (మండపేట): ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ అనే పుస్తకాన్ని జమాత్–ఎ–ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ రఫీఖ్ ఆవిష్కరించారు. మండపేట పట్టణం గాంధీనగర్ అల్–ఆమీన్ మస్జిద్లో మంగళవారం జమాత్–ఎ–ఇస్లామీ హింద్ మండపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక సమావేశంలో రక్షీఖ్ పలు అంశాలను ప్రస్తావించారు. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు జరుపుకునే బక్రీద్ పండగ పాడిరైతులకు ఆర్థిక చేయూతనిస్తుందన్నారు. వక్ఫ్ చట్టంపై కేంద్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తోందని, మేధావులు, ధార్మిక సంస్థలు, ప్రజాసంఘాలు శాసీ్త్రయ దృక్పథంతో వక్ఫ్ చట్టాన్ని సమీక్షించాలని కోరారు. చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘వక్ఫ్ చట్టం ఎవరికి చుట్టం’ పేరుతో ప్రచురితమైన పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. కార్యక్రమంలో జమాత్–ఎ–ఇస్లామీ హింద్ స్థానిక కమిటీ అధ్యక్షుడు ఫారుఖ్ అలీ, జిల్లా అధ్యక్షుడు అబుల్ ఆలా, అల్– ఆమీన్ మస్జిద్ అధ్యక్షుడు రహీం, జమియా మస్జిద్ అధ్యక్షుడు అల్తాఫ్, ముస్లిం జేఏసీ నాయకులు ఎండీ కరీం, సయ్యద్ ఇబ్రాహీం షరీఫ్, షేక్ ఇబ్రాహీం, కరీం పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు
మామిడికుదురు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాశర్లపూడిలంకకు చెందిన కోలా ప్రవీణ్కుమార్ సత్తా చాటాడు. ఇతను జాతీయ స్థాయిలో 328వ ర్యాంకు సాధించాడు. విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్కుమార్కు ముంబయి సీఎస్ఈలో సీటు వచ్చింది. తండ్రి గోపాలకృష్ణ రైతు, తల్లి జ్యోతి గృహిణి. పేరెంట్స్ ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. ప్రతి రోజు 14 గంటలు చదవడం వల్ల మంచి ర్యాంకు వచ్చిందని ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపాడు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. అతడిని స్థానికులు అభినందించారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ఒకరికి ఐదురోజులు, తొమ్మిది మందికి రెండు రోజుల చొప్పున జైలు, 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 27 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల అదుపులో కారు యజమాని అమలాపురం టౌన్: స్థానిక ఏఎస్ఏ ఆస్పత్రి వద్ద 216 జాతీయ రహదారిపై ఓ మోటారు సైకిలిస్ట్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అక్కడ నుంచి కారుతో సహా పరారైన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు యజమాని దీపక్ను అదుపులోకి తీసుకుని రోడ్డు ప్రమాదంలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. స్థానిక పితానివానిపాలేనికి చెందిన దీపక్ స్థానికంగా రోల్స్ ఆన్ రోడ్డు పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడని ఎస్సై పేర్కొన్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసును విచారిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
బతికుండగానే చంపేస్తున్నారు కదయ్యా.. పిఠాపురంలో ఇదేం దారుణం పవనూ..
సాక్షి, కాకినాడ జిల్లా: ‘కాలు కదపలేను నోరు విడిచి అడగలేను శరీరం సహకరించడం లేదు. అయినా నాకు వచ్చే వృద్ధాప్య పింఛనే ఇప్పటి వరకూ నన్ను బతికించింది. గతంలో వలంటీర్ వచ్చి నాకు ప్రతి నెలా పింఛన్ ఇచ్చేవాడు. ఇప్పుడు తెచ్చి ఇచ్చే వారే లేరు. ఎవరినైనా అడుగుదామంటే ఎక్కడికీ వెళ్లలేను. ఇప్పుడు నా పింఛన్ ఆపేసి ఏవో కారణాలు చెబుతున్నారు. నేను బతికి ఉన్నట్టు నిరూపించుకోమంటున్నారు. పింఛన్ లేకపోతే నాకు దిక్కు లేదు. నా మొర వినే వారు కనిపించడం లేదు’ అంటూ కన్నీటి పర్యంతమవుతోంది కాకినాడ జిల్లా పిఠాపురం డ్రైవర్స్ కాలనీకి చెందిన వృద్ధురాలు చోడిశెట్టి సుబ్బారావు (85).‘గతంలో ఎప్పుడూ ఏ ఇబ్బందీ లేకుండా వలంటీరే అన్నీ చూసుకునే వాడు. ఇప్పుడు ఎవరూ రావడం లేదు. వృద్ధాప్యం వల్ల నా చర్మం పటుత్వం తప్పింది. వేలిముద్రలు పడడం లేదంటున్నారు. నా కళ్లు మసకబారాయి. ఐరిస్ పడటం లేదంటున్నారు. ఏది పడినా పడక పోయినా నేను బతికే ఉన్నాను బాబోయ్ అంటున్నా నమ్మకం లేదంటున్నారు. ఇలా కారణాలు చెప్పి నా పింఛన్ ఆపేశారు. దానికి ప్రత్యామ్నాయం మాత్రం చెప్పడం లేదు. మరి నేను బతికేదెలా? ఇక నువ్వు బతకడం అనవసరం అన్నట్టుగా చెబుతున్నారు.ఇన్నేళ్లూ లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకొచ్చింది? నేను బతికే ఉన్నాను కదా! నాకు పింఛనే ఆధారం, బతుకుతెరువు అంటూ కాళ్లు పట్టుకుంటున్నా ఎవరూ కనికరించడం లేదు. నాకు పింఛనైనా ఇప్పించండి లేదా నన్ను చంపేయండి’ అంటూ ఆమె కనికరించమని కన్నీటితో అధికారులను వేడుకుంటోంది. తన తల్లి పింఛను కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సుబ్బారావు కుమార్తె పార్వతి చెప్పారు. తన తల్లికి నెలనెలా పెన్షన్ డబ్బులతో మందులు కొంటున్నానని, ఆమె పింఛను గురించి అడిగితే అక్కడికెళ్లు.. ఇక్కడికెళ్లు అంటూ తెగ తిప్పారని, ఆడదానిని తానేం చేయగలనని, అందరికీ పింఛను ఇచ్చి తమను ఇబ్బంది పెడతారా అని రోదించారు. అందరూ ఏదో కక్ష కట్టినట్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.👉వీడియో: -
ఉచిత బస్సు అంటే నిజమనుకున్నాం
అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని అంటే ఎంతో సంబరపడ్డాం. మాలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందనుకున్నాం. నిజమనుకుని, నమ్మి ఓట్లు వేశాం. కానీ, అధికారంలోకి వచ్చాక తెలిసింది అదంతా నాటకమని.. కేవలం మహిళలను మోసం చేయడానికే ఆ హామీ ఇచ్చారని. ఏడాది పూర్తవుతున్నా ఉచిత బస్సు గురించి మాట్లాడడం లేదు. ఇంకా ఇస్తున్నాం అంటున్నారు తప్ప ఇవ్వడం లేదు. మహిళలను మభ్యపెట్టడానికే ఈ హామీ ఇచ్చారని అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన బుద్ధి చెబుతారు. – యేడిద సునీత, జీవన్నగర్, పిఠాపురం కలగానే.. ఏడాది కావస్తున్నా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీ ఇప్ప టి వరకూ నెరవేరలేదు. మూ డు నెలలకోసారి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని నాయకులు చెబుతున్నారు తప్ప ఆచరణలోకి మాత్రం రావడం లేదు. – వేల్పూరి రత్నకుమారి, గండేపల్లి విధివిధానాలు రావాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే ఆచరణలో పెడతాం. – పి.శ్రీనివాసరావు, జిల్లా ప్రజా రవాణా అధికారి, కాకినాడ -
రహదారిపై మృత్యుఘోష
ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే.. మృతుడు శివన్నారాయణ కుమార్తెలు హర్షిత, వర్షితలు కవల పిల్లలు. 13వ సంవత్సరంలోకి వచ్చారు. ఇద్దరూ ఒకే రూపంలో ఉండటంతో ఆధార్ అయ్యేది కాదు. ఈ క్రమంలో కాకినాడలో ఇందుకు సంబంధించిన పని చేసే వారున్నారని వారికి తెలిసింది. బీచ్లో సరదాగా గడిపిన అనంతరం వారు హర్షిత ఆధార్ పని పూర్తి చేసుకోవాలని వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో ఈ కవలల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఆధార్ ఇబ్బందులు తొలగిపోతాయనుకుంటే ఇలా జరిగిందంటూ వారి బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు.అతివేగం అనర్థదాయకమని అందరికీ తెలిసిందే. కానీ, ఆచరణలో చూపుతున్న నిర్లక్ష్యం పలుచోట్ల ప్రమాదాలకు కారణమవుతోంది. వారం రోజుల క్రితం గామన్ బ్రిడ్జి హైవేపై మలుపు తిరుగుతున్న లారీని కారు ఢీకొని కొవ్వూరు ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కన్నీటి తడి ఇంకా ఆరక ముందే.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ రెండు ప్రమాదాలకూ ప్రధాన కారణం అతివేగమే కావడం బాధాకరం.రంగంపేట/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: అప్పటి వరకూ ఆనంద సాగరంలో ఓలలాడిన వారిని విధి చిన్నచూపు చూసింది.. కొద్దిసేపటిలో ఇంటికి చేరుకునేవారే.. అయినవారితో సంతోషంగా గడిపేవారే.. కానీ, అంతలోనే వారిపై మృత్యువు పంజా విసింది.. రహదారిపై మృత్యుఘోష ప్రతిధ్వనించింది.. రంగంపేట మండలం వడిశలేరు వద్ద ఏడీబీ రోడ్డుపై జరిగిన ఘోర ప్రమాదం రెండు కుటుంబాల్లో ఎప్పటికీ తీరని విషాదాన్ని నింపింది. అయినవారందరినీ శోక సంద్రంలో ముంచింది. ఏం జరిగిందంటే.. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు, గాయపడిన వారు దగ్గర బంధువులు. రాజానగరం మండలం రఘుదేవపురానికి చెందిన రేలంగి శివన్నారాయణ (40), ఆయన భార్య దేవీ లలిత (34), కుమార్తెలు వర్షిత (13), హర్షితతో పాటు.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కవలగొయ్యి గ్రామానికి చెందిన శివన్నారాయణ బావమరిది తీగిరెడ్డి శివ (30), ఆయన భార్య భవాని, వారి కుమార్తె సాన్వి (4) కలసి కారులో సోమవారం కాకినాడ బీచ్కు వెళ్లారు. అక్కడ ఆనందంగా గడిపారు. తిరిగి వస్తున్న క్రమంలో వడిశలేరు గ్రామ సమీపాన హెచ్పీ పెట్రోలు బంకు వద్ద వారు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వేగంగా ఢీకొంది. ఆ వేగానికి కారు సగ భాగం ట్యాంకర్లోనికి చొచ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్నారాయణ, దేవీ లలిత దంపతులు, వారి కుమార్తె వర్షిత, తీగిరెడ్డి శివ, ఆయన కుమార్తె సాన్వి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెనుక సీటులో కూర్చున్న శివ భార్య భవాని, శివన్నారాయణ కుమార్తె హర్షిత తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కల్లు గీతపై ఆధారపడి ఈ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. శివ తండ్రి సూరిబాబు గత ఏడాది తాటిచెట్టు పైనుంచి పడి, మంచాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈ ఘోరం జరగడం ఆయా కుటుంబాలను తీవ్రంగా కలచివేస్తోంది. సరదాగా బీచ్కు వెళ్లి వస్తామని చెప్పి వెళ్లిన వారు ఇలా కనుమరుగైపోతారనుకోలేదంటూ మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదంతో రెండు గ్రామాల్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. డైవర్షన్ గమనించలేదా? ఏడీబీ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరిస్తున్నారు. ఈ పనుల నేపథ్యంలో వడిశలేరు హెచ్పీ పెట్రోల్ బంకు వద్ద అటుగా వెళ్లాల్సిన ట్రాఫిక్ను పక్క మార్గంలోకి డైవర్షన్ ఇచ్చారు. దీనికి కొద్ది దూరంలోనే పాల ట్యాంకర్ ఆగి ఉంది. ప్రమాద సమయానికి శివన్నారాయణ కారు నడుపుతున్నారు. ఆయన ఆగి ఉన్న ట్యాంకర్ను, డైవర్షన్ను గమనించకుండా వేగంగా దూసుకుని రావడం వల్లనే ఈ ఘోరం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయిపోయింది. రహదారిపై డైవర్షన్ను గమనించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చని స్థానికులు భావిస్తున్నారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వడిశలేరు వద్ద ట్యాంకర్ను ఢీకొన్న కారు ఐదుగురి దుర్మరణం ఇద్దరికి తీవ్ర గాయాలు కాకినాడ వెళ్లి వస్తూండగా ఘోరం రెండు కుటుంబాల్లో పెను విషాదం అతి వేగమే బలిగొందా? -
ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా పెద్దిరాజు
కాకినాడ సిటీ: జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా డి.పెద్దిరాజు కాకినాడ ప్రగతి భవన్లోని కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీశైలం ఈఓగా పని చేస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా బదిలీ చేసింది. 2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక కాకినాడ సిటీ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర అటవీ శాఖ, నేషనల్ గ్రీన్కోర్ ఆధ్వర్యాన ఈ నెల 5న జిల్లాలో 2.33 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రూపొందించిన వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, జిల్లా అటవీ శాఖ అధికారి డి.రవీంద్రనాథ్రెడ్డి, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన, డీఆర్ఓ జె.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972పై విస్తృత ప్రచారం కాకినాడ సిటీ: మత్తు పదార్థాల నివారణ, సహాయానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఫోర్స్మెంట్)కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్పై నిఘా, నియంత్రణకు ఈగల్ డిపార్టుమెంట్ పని చేస్తుందన్నారు. దీనిపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972పై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీజీఆర్ఎస్కు 408 అర్జీలు కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 408 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యకు తగిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. సొంత వారికి కట్టబెట్టేందుకే రేషన్ షాపులు ప్రారంభం కాకినాడ రూరల్: సొంత వారికి కట్టబెట్టేందుకే రేషన్ షాపులను కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించిందని, ఇది పేదలకు మంచి చేసే కార్యక్రమం కాదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎండీయూ ఆపరేటర్ల పొట్టకొట్టి సొంత పార్టీ వారికి రేషన్ షాపులు కట్టబెట్టేందుకు పేదలను ఇబ్బందిపాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడకుండా ఉండేందుకే గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు. రేషన్ సరకులు ఇంటి వద్దకే రావడంతో ప్రజలు సంతోషించారని, మంచి లక్ష్యంతో ప్రారంభించిన ఈ విధానాన్ని రాజకీయ కక్షతో కూటమి ప్రభుత్వం తొలగించడం సబబు కాదని అన్నారు. -
ఫ్రీ బస్సు.. హోల్డాన్
● ఏపీకి వచ్చేది ఎప్పుడో! ● అంతా ఉత్తుత్తి హామీనే.. ● మహిళలను వంచించిన బాబు ● ఉచిత ప్రయాణం హామీ గాలికి.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఏరుదాటే వరకు ఓడ మల్లన్న ఏరుదాటక బోడి మల్లన్న’ అన్న సామెత ముఖ్యమంత్రి చంద్రబాబుకు సరిపోలుతుంది. ఆయన చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతనే ఉండదనే విషయం ప్రతి సందర్భంలోనూ స్పష్టమవుతూనే ఉంటుంది. అధికారం కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా హామీలు గుప్పించిన చంద్రబాబు.. వాటిని అమలు చేయాల్సి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావస్తున్నా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేసిన దాఖలాల్లేవు. నాటి ఎన్నికల్లో ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఊరూవాడా ఊదరగొట్టారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటే ఆశ ఉన్నా.. గత అనుభవాల రీత్యా చంద్రబాబు దీనిని అమలు చేస్తారా అనే సంశయం వెంటాడుతూనే ఉంది. ఊహించినట్టుగానే గద్దెనెక్కి ఏడాది కావస్తున్న ఉచిత బస్సు ప్రయాణంపై ఇంతవరకూ చంద్రబాబు ఎటువంటి స్పష్టతా లేకుండా చేశారని మహిళలు మండిపడుతున్నారు. అక్కడ రైట్రైట్.. పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించారు. కానీ, మన రాష్ట్రంలో దీనిని అమలు చేస్తారా లేదా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాన్ని మొత్తానికే తూచ్ అనేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని మహిళా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సంపద సృష్టిస్తామన్న బాబు ఇప్పుడు ఉచిత బస్సు హామీపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే భయమేస్తోందంటూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఈ హామీలన్నింటినీ అసలు అమలు చేస్తారా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా ఉన్నప్పటి నుంచీ కాకినాడ.. ఇంటర్, డిగ్రీ కాలేజీలతో పాటు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ, రంగరాయ వైద్య కళాశాల, ప్రైవేటు నర్సింగ్ కాలేజీలతో పాటు అన్ని రకాల బ్రాండెడ్ వస్తువుల మార్కెట్కు కేంద్రం. విద్య, వైద్యంతో పాటు ఇతర అవసరాల కోసం మహిళలు, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాల నుంచి కాకినాడకు రాకపోకలు సాగిస్తూంటారు. జిల్లాల పునర్విభజన తరువాత కూడా కాకినాడకు మహిళల రాకపోకల విషయంలో పెద్దగా వ్యత్యాసం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది మహిళలున్నారు. ఏలేశ్వరం, తుని, కాకినాడల్లో ఆర్టీసీ డిపోలున్నాయి. ఈ మూడు డిపోల పరిధిలో 321 బస్సులను జిల్లా ప్రజా రవాణా శాఖ నిర్వహిస్తోంది. ఇందులో 250 సొంత, 71 అద్దె బస్సులున్నాయి. ఆయా డిపోల నుంచి ఈ బస్సులు ప్రతి రోజూ లక్షా 14 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) 78 ఉంటోంది. మొత్తం బస్సుల్లో 156 పల్లె వెలుగు బస్సులున్నాయి. మొత్తం ప్రయాణికుల్లో సగం మంది ఈ పల్లె వెలుగు బస్సుల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారని అంచనా. మొత్తం బస్సులలో రోజుకు సగటున 66,379 మంది ప్రయాణిస్తూండగా.. వీరిలో సగం మంది మహిళలే ఉంటారని లెక్కలు వేస్తున్నారు. గత మే నెలలో ఆర్టీసికి రూ.20.58 లక్షల ఆదాయం వచ్చింది. ఇందులో సగం మంది మహిళా ప్రయాణికుల ద్వారా రూ.10.25 లక్షలు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన 12 నెలలకు రూ.1.23 కోట్ల ఆదాయం మహిళా ప్రయాణికుల ద్వారానే వస్తోంది. చంద్రబాబు గద్దెనెక్కి ఏడాది కావస్తోంది. ఉచిత బస్సు ప్రయాణ హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అమలు చేయకపోవడంతో ఏడాది కాలంగా జిల్లాలోని మహిళలు రూ.1.23 కోట్ల మేర నష్టపోయారు. ఈ హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మంత్రులు ఉచిత ప్రయాణంపై ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. తాజాగా ఆగస్ట్ 15 నుంచి అమలు చేస్తామని ఓ ఫీలర్ వదిలారు. అయితే, దీని విధివిధానాలేమిటనే దానిపై ఇప్పటి వరకూ ఎటువంటి ప్రకటనా లేదు. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం హామీని అసలు అమలు చేస్తారా లేక మిగిలిన హామీల మాదిరిగానే చాప చుట్టేస్తారా అని మహిళలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం మహిళలు తుని 1,11,800 ప్రత్తిపాడు 1,08,207పిఠాపురం 1,14,819 కాకినాడ రూరల్ 1,31,591 పెద్దాపురం 1,07,478 కాకినాడ సిటీ 1,23,166 జగ్గంపేట 1,13,720 ఇంత మోసమా బాబూ! కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని పథకాలను కాపీ కొట్టి, ఇక్కడి మహిళలను నమ్మించి ఓట్లేయించుకున్నారు. ఆ రాష్ట్రాల్లో అమలైనట్టే ఇక్కడ కూడా అమలు చేస్తారనే నమ్మకంతోనే మహిళలు ఓట్లేసి కూటమిని గెలిపించారు. అక్కడి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం అమలు చేశాయి. ఇక్కడ గారడీ బాబు ఏడాదైనా అమలు చేయలేదు. ఆగస్టు 15న అమలు చేస్తానంటున్న ఆయన మాటలను మహిళలు నమ్మలేకపోతున్నారు. చంద్రబాబుకు ఏదీ ఉచితంగా ఇచ్చే మనస్తత్వం లేదు. పేదలంటే ఆయనకు అస్సలు పడదు. మహిళలను నమ్మించి ఓట్లేయించుకుని ఇంత మోసం చేస్తారా? మీకు న్యాయమనిపిస్తోందా? ఎన్నికల్లో ఊరూవాడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైపోయింది. ఇన్ని నెలల పాటు మీరిచ్చిన హామీ అమలు చేసి ఉంటే మహిళలకు ఆ మేరకు బస్సు చార్జీలు తగ్గి న్యాయం జరిగేది కదా! – వంగా గీత, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పిఠాపురం -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివలింగానికి పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. -
కడతేరి.. కన్నీరు మిగిల్చి..
● కోనేటిలో మునిగి కొడుకు, మనవడు మృతి ● తల్లడిల్లిన వృద్ధ దంపతుల కన్నపేగు ● తండ్రీకొడుకుల మృతితో బొర్రంపాలెంలో విషాదం గండేపల్లి: వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు, మనవడు మృత్యువాత పడడం ఆ ముసలి దంపతులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. కన్న కొడుకు, మనవడు ఒకేసారి దూరమవడంతో ఆ కన్నపేగు తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన సాగి శ్రీరామమూర్తి (బూరయ్య), నాగరత్నం దంపతులకు కొడుకు నల్లబాబు(46), కుమార్తెలు సీతఆదిలక్ష్మి, సుగుణ ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, నల్లబాబు వ్యాపారం కోసం భార్య నాగతులసి, కుమారుడు సంజయ్ శ్రీరామ్(19), కుమార్తె సరస్వతితో హైదరాబాద్లో ఉంటున్నాడు. సరస్వతి ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసింది. ఇటీవల కాలంలో నల్లబాబు ఒంటరిగా సొంతూరు వచ్చి తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నాడు. సంజయ్ శ్రీరామ్ చదువు కోసం విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఇటీవల అతడు ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం వలసపాకల గ్రామానికి పరామర్శకు వెళ్లిన నల్లబాబు, సంజయ్ శ్రీరామ్ మైలు శుద్ధి స్నానానికి సాయంత్రం తాళ్లూరు వచ్చారు. కోనేరులో దిగిన సంజయ్ శ్రీరామ్ మునిగిపోతుండగా నల్లబాబు రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. ఆ సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో కాపాడేందుకు వీల్లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. తల్లి వద్దకు వెళ్లాల్సి ఉండగా.. హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేసిన సంజయ్ శ్రీరామ్ విశాఖపట్నంలో హాస్టల్లో ఉంటూ, రఘు ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఉన్న తల్లి, చెల్లి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని బంధువులు, స్నేహితులు వాపోయారు. మృదుస్వభావి, సౌమ్యుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నల్లబాబు ఇలా దూరం కావడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఇల్లు తప్ప వేరే ధ్యాస లేని సంజయ్ చిన్న వయస్సులోనే దూరమయ్యాడని స్నేహితులు వాపోయారు. బొర్రంపాలెం గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోనేరు నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కడసారి చూపు కోసం.. కొడుకు, మనవడు ఒకేసారి శాశ్వతంగా దూరమవ్వడంతో కదల్లేని స్థితిలో ఉన్న శ్రీరామమూర్తి, నాగరత్నం వద్దకు అంబులెన్స్లో మృతదేహాలను బొర్రంపాలెం తీసుకువెళ్లారు. కొడుకు, మనవడిని చూసి ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తమ్ముడూ.. అప్పుడే నీకు నూరేళ్లూ నిండాయా.. నన్ను అక్క అని ఎవరు పిలుస్తారురా.. నన్ను అత్తా అని ఎవరు పిలుస్తారురా...అంటూ మృతదేహాలను పట్టుకుని సుగుణ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
బండారులంకలో రేషన్ బియ్యం పట్టివేత
డ్రైవర్, ఇద్దరు డీలర్లపై కేసు నమోదు అమలాపురం రూరల్: బండారులంక గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 55 బస్తాల బియ్యం లోడుతో వెళుతున్న వ్యాన్ను పోలీసులు పట్టుకున్నారు. సరకును స్వాధీనం చేసుకుని, వ్యాన్ సీజ్ చేసి, డ్రైవర్తో పాటు, ఇద్దరు రేషన్ డీలర్లపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు, రూరల్ మండలం బండారులంక గ్రామంలో రేషన్ షాపుల వద్ద బియ్యాన్ని వ్యాన్లో లోడ్ చేసి తరలిస్తుండగా, సోమవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. వాహనాన్ని అడ్డగించి, పోలీసులకు, సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని, విచారణ చేపట్టారు. ఈ వ్యాన్లో 50 కేజీల వంతున 55 బస్తాల్లో రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. వాహనాన్ని తాలూకా పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. డ్రైవర్ ఎ.సత్యనారాయణ, రేషన్ డీలర్లు సుగ్గు మాణిక్యాలరావు, కాశిన సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శేఖర్బాబు తెలిపారు. -
బైక్లు ఢీకొని యువకుడి మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు, కోరుమామిడి గ్రామానికి చెందిన ఆరుగొల్లు చంద్రరావు కుమారుడు పండు(21) గేదెల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పిట్టా సందీప్ కోరుమామిడి కంచాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో పండును వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పండును నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు అతడి తండ్రి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు కె.ప్రణీత్ రెండో ర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ ఎనిమిది, ఇ.వర్షిత్ 12, ఎం.సుమంత్దొర 38, కె.అభినవ్ 42, జి.సుజోష్రాజ 43, జి.అఖిల్సాయి 45, తుమాటిపూజిత అఖిల్రాజ్కుమార్ 85, కప్పల వెంకటరామవినీష్ 127, పాతపాటి వెంకటవివేక్వర్మ 132, మువ్వల లిఖిత 137 ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంకా 165, 174, 193, 195, 231, 238, 246, 270, 275, 276 ర్యాంకులు సాధించారన్నారు. వెయ్యిలోపు 69, మూడు వేలలోపు 201, ఐదు వేలలోపు 333, పది వేలలోపు 456 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. 260 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకర్లను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
రైతు బిడ్డకు 1911 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని చెముడులంకకు చెందిన రైతు బిడ్డ నాగిరెడ్డి తేజ చంద్రనారాయణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 1911 ర్యాంకు సాధించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన అతడు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అత్యున్నత ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అతను తెలిపాడు. ఇదే కుటుంబంలో తేజ చంద్రనారాయణ సోదరి శ్రావణి 2022లో జేఈఈ అడ్వాన్స్డ్లో 1800వ ర్యాంకును సాధించి, ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. సరస్వతీ కటాక్షం కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసు, నాగ అరుణ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. -
కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్
బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్ కేటగిరీ లో నాలుగో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్లో రెగ్యులర్ సిలబస్తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి. -
పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ
● దేవస్థానం అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ చెల్లింపు ● ఊపిరి పీల్చుకున్న 349 మంది సిబ్బంది అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఎట్టకేలకు చెల్లించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది ఖాతాలకు సొమ్ము జమ అయింది. మే నెల గడిచినా ఏప్రిల్ వేతనాలను పారిశుధ్య సిబ్బందికి చెల్లించకపోవడంపై శ్రీవీరి కష్టం తుడిచే వారేరిశ్రీ శీర్షికన మే 26న వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన దేవస్థానం అధికారులు మే 28న సంబంధిత కనకదుర్గా ఏజెన్సీస్ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లించేందుకు రూ.58 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష తనకు రావాల్సి ఉందని, అది వస్తే కానీ తాను జీతాలు చెల్లించనంటూ కాంట్రాక్టర్ భీష్మించడంతో.. కార్మికుల వేతనాలు మరింత ఆలస్యమయ్యాయి. దీనిపై ఇలాగైతే మేమెలా బతకాలి శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. అధికారుల ఒత్తిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంపై దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారమే కార్మికుల అకౌంట్లకు వేతనాలు జమ కావాలని కాంట్రాక్టర్కు స్పష్టం చేయడంతో.. గత్యంతరం లేక ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది అకౌంట్లలో నగదు జమ అయింది. వరుసగా రెండు నెలల జీతాలు ఆలస్యం కావడంపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. మే నెల జీతాలైనా జూన్ పది కల్లా చెల్లించేలా చూడాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. నలుగురికి అందని వేతనాలు కాగా, దేవస్థానంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు మార్చి వేతనాలు ఇంకా చెల్లించలేదు. గత నెలలో అందరికీ మార్చి వేతనాలు చెల్లించగా, వీరికి అందలేదు. సాంకేతిక కారణాలతో జమ కాలేదని, వచ్చే నెల చెల్లిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. వీరికి మార్చి బకాయి చెల్లంచకుండా, ఏప్రిల్ వేతనాలు మాత్రమే చెల్లించారు. -
చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం
వైద్య కళాశాలకు భౌతికదేహం అందజేత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి.చిరంజీవిని కుమారి భౌతికదేహాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. అభిమానులు, పూర్వ విద్యార్థులు. ప్రజాప్రతినిధుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రతాప్నగర్లోని ఆమె స్వగృహం నుంచి ఇంద్రపాలెం లాకుల వద్దనున్న ఐడియల్ కళాశాలకు ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆమె భౌతికకాయాన్ని రంగరాయ వైద్య కళాశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందజేవారు. ఆమెకు సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, మురళీకృష్ణ, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పి.కృష్ణారావు, మాజీ రిజిస్ట్రార్ వి.రవీంద్ర, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సీపోర్టు సీఈఓ మురళీధర్, జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పూర్వ విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఉన్నారు. -
సత్తా చాటిన అన్నదమ్ములు
కె.గంగవరం: ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో కె.గంగవరానికి చెందిన కొడవటి ప్రసాద్చౌదరి (విశ్రాంత ఉపాధ్యాయుడు) మనవడు సువర్ణ రామ్ప్రత్యూష్కు అత్యుత్తమమైన ఆలిండియా 510 ర్యాంక్ సాధించినట్టు కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో అతని అన్నయ్య కొడవటి సాయిప్రణీత్ ఆలిండియా 565 ర్యాంక్ సాధించడం గమనార్హం. తమ ఇద్దరు కుమారులు ప్రఖ్యాత ఐఐటీ కాలేజీల్లో సీట్లు సాధించడంపై తండ్రి కొడవటి సురేష్ (డీఈ, ఏపీ ట్రాన్స్కో), తల్లి వసుధ (సాఫ్ట్వేర్ ఇంజినీర్)తో పాటు, తాతయ్య కొడవటి ప్రసాద్చౌదరి, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వారం పరీక్ష రాసి, పొరపాట్లు సరిదిద్దుకోవటం, సందేహాల నివృత్తి, సమయ పాలన, రోజుకు 14 గంటలు శ్రమించడం వంటివి తన విజయానికి ప్రధాన కారణాలుగా తెలిపారు. -
‘అధికారాన్ని అనుభవించడం కోసమే బాబు పనిచేస్తున్నారు’
కాకినాడ జిల్లా గత ఏడాది కాలంలో ఇచ్చిన హామాలను అమలు చేయకుండా కుడి, ఎడమలగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్ని దగా చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు విమర్శించారు. ఈ రోజు(సోమవారం, జూన్2) కాకినాడ రూరల్లో వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు కురసాల కన్నబాబు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎన్ని మంచి పనులు చేసినా వాటిని చంద్రబాబు దుర్మార్గంగా చిత్రీకరించారు. చెప్పిన హమీని ఒక్కటైనా నెరవేర్చారా అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాను. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలను నిలిపివేశారు. వైఎస్ జగన్ పై ఉన్న కోపాన్ని ప్రజలపై చూపిస్తున్నారు. అధికారాన్ని అనుభవించడం కోసమే గత ఏడాదిగా చంద్రబాబు పని చేశారు. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి..రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు* అని విమర్శించారు. -
అయిపోయిన పెళ్లికి బాజాలెందుకని!
పిఠాపురం: అయిపోయిన పెళ్లికి బాజాలెందుకనుకున్నారో ఏమో! పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆర్ఓ ప్లాంట్ల ప్రారంభోత్సవాన్ని అర్ధాంతరంగా రద్దు చేశారు అధికారులు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాదగయ క్షేత్రంలో ఆర్ఓ ప్లాంట్లను ఆదివారం ప్రారంభిస్తారని అధికారికంగా ప్రకటించారు. మూడు రోజులుగా అక్కడ ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేపట్టారు. వాటిని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికార కూటమిలోని జనసేన నేతలు శనివారం రాత్రి వరకూ ఏర్పాట్లు చేశారు. వీటిని గతంలోనే ప్రారంభించేసిన విషయాన్ని ‘అమాత్యులొస్తున్నారు మళ్లీ మొదలెట్టండి’ శీర్షికన ప్రచురించిన కథనంతో ‘సాక్షి’ శనివారం వెలుగులోకి తెచ్చింది. ఇది చర్చనీయాంశంగా మారడంతో కంగు తిన్న జనసేన నేతలు, అధికారులు చివరి నిమిషంలో దీని పునఃప్రారంభోత్సవాన్ని ఎట్టకేలకు రద్దు చేశారు. -
ఇలాగైతే మేమెలా బతకాలి?
అన్నవరం: ‘యాడ దొరికిన సంతరా ఇది’ పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన పాపులర్ డైలాగ్ ఇది. అన్నవరం దేవస్థానంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తూంటే ఈ డైలాగ్ గుర్తుకు రాక మానదు. అధికారులే కాదు.. దేవస్థానం పారిశుధ్య కాంట్రాక్టర్ వైఖరి కూడా ఒకే రీతిలో ఉండటమే దీనికి కారణం. దేవస్థానంలో పని చేస్తున్న 349 మంది పారిశుధ్య కార్మికులకు ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో.. వారు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెస్తూ గత నెల 26న ‘వీరి కష్టం తుడిచేవారేరీ!’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై దేవస్థానం అధికారులు స్పందించి, జీతాల చెల్లింపునకు గాను పారిశుధ్య కాంట్రాక్టర్కు గత నెల 28న రూ.58 లక్షలు చెల్లించారు. ఈ మొత్తంతో పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించవచ్చు. కానీ, తనకు ఇంకో రూ.లక్ష రావాల్సి ఉందని, ఆ మొత్తం వస్తే తప్ప జీతాలు చెల్లించనని కాంట్రాక్టర్ భీష్మించారు. ఇది జరిగి రోజులు గడుస్తున్నా దేవస్థానం అధికారులు ఆ కాంట్రాక్టర్తో ఇప్పటి వరకూ చర్చించలేదు. గట్టిగా హెచ్చరించలేదు. జూన్ 1వ తేదీ వచ్చినా ఏప్రిల్ జీతాలు కూడా ఇవ్వకపోతే తామెలా బతకాలని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, కాంట్రాక్టర్ తీరును తప్పు పడుతున్నారు.జీతాల్లో జాప్యం.. ఇది రెండోసారిదేవస్థానం పారిశుధ్య సిబ్బందికి జీతాలు ఆలస్యం కావడం వరుసగా ఇది రెండోసారి. గతంలో మార్చి నెల జీతాలు చాలా రోజులు చెల్లించలేదు. అప్పట్లో కూడా ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ?’ శీర్షికన ‘సాక్షి’ ఏప్రిల్ 25న కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు కాంట్రాక్టర్కు ఏప్రిల్ 29న బిల్లు చెల్లించారు. దీంతో, ఏప్రిల్ 30న పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చారు. తాజాగా మళ్లీ ఇదే పునరావృతమైంది. ఈ రెండు సందర్భాల్లోనూ దేవస్థానానికి పారిశుధ్య సిబ్బందిని సమకూరుస్తున్న కనకదుర్గా ఏజెన్సీ (గుంటూరు) పీఎఫ్ మొత్తాన్ని ఆలస్యంగా బ్యాంకులో జమ చేసిందని, అందువల్లనే జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందని చెప్పారు. అంతే తప్ప జీతాలు సకాలంలో చెల్లించేందుకు తీసుకుంటున్న చర్యలు శూన్యం.కారణం అదేనా?దేవస్థానంలో పారిశుధ్య నిర్వహణను గతంలో కేఎల్టీఎస్ సంస్థ (హైదరాబాద్) రెండేళ్లకు పైగా నిర్వహించింది. ఆ సంస్థ ప్రతి నెలా 10వ తేదీన సిబ్బందికి జీతాలు చెల్లించేది. గత నవంబర్తో ఆ సంస్థ గడువు ముగిసింది. టెండర్ ద్వారా కొత్త సంస్థను ఎంపిక చేసేంత వరకూ విధులు నిర్వహించాలన్న దేవస్థానం విజ్ఞప్తి మేరకు ఫిబ్రవరి నెలాఖరు వరకూ కేఎల్టీఎస్ సంస్థే పారిశుధ్య పనులు నిర్వహించింది. మార్చి 1 నుంచి పారిశుధ్య సిబ్బందిని సమకూర్చే కాంట్రాక్టును గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీకి అప్పగించారు. ప్రతి నెలా 349 మంది సిబ్బందికి వేతనాలుగా సుమారు రూ.58 లక్షలు చెల్లించాలి. దీనికి గాను సిబ్బంది పీఎఫ్ కింద 10 శాతం అంటే సుమారు రూ.6 లక్షలు ముందుగానే ఆ సంస్థ చెల్లించాలి. ఆ తరువాతే దేవస్థానం రూ.58 లక్షల బిల్లు చెల్లిస్తుంది. దాని నుంచి రూ.6 లక్షలు మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని ఆ సంస్థ సిబ్బంది ఖాతాల్లో జీతం కింద జమ చేయాలి. అయితే, ముందుగా పీఎఫ్ చెల్లించే స్తోమత ఆ సంస్థకు లేనందువల్లనే జీతాల చెల్లింపులో జాప్యం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా దేవస్థానం అధికారులు ఆ కాంట్రాక్టర్ను పిలిపించి మాట్లాడి, వెంటనే తమకు జీతాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. అలాగే, మే నెల జీతాలు ఈ నెల 10వ తేదీలోగా అందించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
ప్రజల్లోకి కూటమి వైఫల్యాలు
● హామీలపై సర్కార్ మోసం ● 4న వెన్నుపోటు దినంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 4న చేపడుతున్న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నేతలు నిర్ణయించారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అధ్యక్షతన కాకినాడలో ఆదివారం ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినాన్ని పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు పిలుపునిచ్చారు. కూటమి నేతలు ప్రజలను వంచించి ఓట్లు వేయించుకుని, ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కాకినాడ పార్లమెంటరీ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు సూచించారు. జిల్లా అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ, అధికార పార్టీ ఆగడాలను ఉపేక్షించకుండా పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర సాగర్, రాష్ట్ర కార్యదర్శి వెలమల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించారు. -
తూకాల్లో తేడాలుంటే డీలర్లపై చర్యలు
అమ్మ ఒడి.. ఆశలు ఆవిరి ఆర్థిక ఇబ్బందుల కారణంగా పేద కుటుంబాలు తమ పిల్లలను చదువు మాన్పించకూడదనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15 వేల చొప్పున జమ చేసేది. ఇది పేద పిల్లల చదువులకు ఎంతో ఆసరాగా ఉండేది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న చదువుతున్న అర్హులైన విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తిపజేసేవారు. జిల్లావ్యాప్తంగా 1,86,708 విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.280.06 కోట్లు జమ చేసేవారు. అమ్మ ఒడి పథకాన్ని కూటమి ప్రభుత్వం తల్లికి వందనంగా మార్చింది. కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా చూస్తే గత ఏడాది ఎగ్గొట్టింది. ఇప్పుడు స్కూళ్లు తెరిచే నాటికి ఇస్తామని చెబుతున్నారు. అయితే, దీనిని చదువుకునే పిల్లలందరికీ వర్తింపజేస్తారా లేదా అనే దానిపై ఇప్పటి వరకూ స్పష్టంగా చెప్పడం లేదు. అమ్మ చేతి ‘గోరుముద్ద’లా.. ఆరోగ్యంగా ఉంటేనే బాగా చదువుతారని భావించిన గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పేరిట విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించింది. రోజుకో మెనూతో వైరెటీ వంటకాలు, వారానికి మూడు రోజులు చిక్కీ, మూడు రోజులు రాగి జావ, వారానికి ఐదు రోజులు కోడిగుడ్డు ఇచ్చేవారు. విద్యార్థులు జావ తాగేందుకు వీలుగా స్టీలు గ్లాసులు సైతం నాటి ప్రభుత్వం సమకూర్చింది. ఈ పథకం పేరును కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చింది. కానీ, నాణ్యతను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఇష్టంగా తినని పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు స్మార్ట్ బోధన చేస్తున్న ఉపాధ్యాయిని పిఠాపురం: తూకాల్లో వ్యత్యాసం ఉన్నా, సరకులు లేవని తిప్పి పంపినా రేషన్ డీలర్లపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పిఠాపురం పట్టణంలోని 18వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ గుడి వీధి వద్ద ఉన్న రేషన్ షాపు ద్వారా ప్రజలకు ఆయన ఆదివారం రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డీలర్లు ఈ–పోస్, వేయింగ్ మెషీన్ల పని తీరును ముందుగానే పరిశీలించుకోవాలని, సాంకేతిక సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాల్లో సరకులు పంపిణీ చేయాలని అన్నారు. సరకుల పంపిణీ సమాచారం కోసం కొత్తగా యాప్ రూపొందిస్తున్నామని, ఏ రోజు ఎంత రేషన్ పంపిణీ చేశాం, ఎంత మందికి అందించామనే విషయాలు ఎప్పటికప్పుడు నమోదయ్యేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రేషన్ దుకాణాల ద్వారా సరకుల పంపిణీతో దాదాపు రూ.385 కోట్లు ఆదా చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29,761 రేషన్ షాపులకు గాను ఆదివారం 24,795 షాపుల్లో సరకుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఆదివారాలు కూడా సరకులు పంపిణీ చేయాలని, ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకూ రేషన్ దుకాణాలు తెరచి ఉంచాలని ఆదేశించారు. దివ్యాంగులకు, 65 ఏళ్లు నిండిన వృద్ధులకు ప్రతి నెలా 5వ తేదీలోపు ఇళ్ల వద్దే సరుకులు అందిస్తామన్నారు. ఈ బాధ్యత రేషన్ డీలర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని, సరకు అందిన వెంటనే అందులో ఫొటో అప్లోడ్ చేసేలా డీలర్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అన్ని పోర్టుల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యుడు పిడుగు హరిప్రసాద్, కలెక్టర్ షణ్మోహన్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్ జిల్లాల హాకీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఈ నెల 6 నుంచి 8 వరకు జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్స్ బాలికల హాకీ పోటీలలో పాల్గొనే జిల్లా జట్టును ఆదివారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఎంపిక చేశారు. హాకీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎంపికల్లో 25 మంది పాల్గొనగా 18 మందిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశామని హాకీ సంఘ కార్యదర్శి నంబు శ్రీనివాస్ తెలిపారు. ఎంపికల నిర్వహణలో డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, హాకీ సంఘ ప్రతినిధి రవిరాజు పాల్గొన్నారు. తలుపులమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైయున్న తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ ద్వారా అమ్మవారిని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,11,455, పూజా టికెట్లకు రూ.2,13,300, కేశఖండన శాలకు రూ.24,040, వాహన పూజలకు రూ.5,010, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.85,956, విరాళాలు రూ.1,44,033 కలిపి మొత్తం రూ.6,83,794 ఆదాయం లభించిందని వివరించారు. నేడు పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరుగుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ కార్యక్రమానికి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయ 9.30 గంటలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు కాకినాడ క్రైం: కానిస్టేబుల్ అభ్యర్థుల మెయిన్స్ పరీక్షలు జిల్లావ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఏపీఎస్ఎల్పీఆర్బీ ఆధ్వర్యాన జిల్లా పోలీస్ శాఖ పర్యవేక్షణలో జరిగిన ఈ పరీక్షలకు 6,302 మందికి గాను 6,021 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణను ఎస్పీ బిందుమాధవ్ పరిశీలించారు. అయినవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారి సన్నిధిలో భక్తులు లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్న ప్రాసన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామి వారి నిత్యాన్న దాన పథకానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు. అన్న ప్రసాద భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎన్.చైతన్య జనార్దన్, సిందూరి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.50,307, వి.వినోద్, సులోచనారాణి దంపతులు రూ.50,307 చొప్పున ఆదివారం విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. -
పవన్ నియోజవర్గంలో టీడీపీ, జనసేన బాహాబాహీ
పిఠాపురం: టీడీపీ, జనసేనలు పొత్తు పరంగా కలిసి ఉన్నా, కార్యకర్తల దగ్గరకు వచ్చే సరికి ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత లేదనేది మరోసారి బయటపడింది. ఈరోజు(ఆదివారం, జూన్1) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య రగడ చోటు చేసుకుంది. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో టీడీపీ, జనసేన శ్రేణులు రెచ్చిపోయి మరీ ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు.పిఠాపురం జనసేన ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ సమక్షంలోనే ఇరు పార్టీల విభేదాలు బహిర్గతమయ్యాయి. ఆ కార్యాక్రమానికి హాజరైన రెండు పార్టీల శ్రేణులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. జై జనసేన, జై టీడీపీ అంటూ ఇరు వర్గాల నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరు పార్టీల కార్యకర్తల్లో సఖ్యత అనేది లేకపోవడంతో ఏ కార్యక్రమం జరిగినా అక్కడ పరిస్థితులు గందరగోళానికి దారి తీసిన సందర్బాల్లో తరచు జరుగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి: పొత్తుపై పవన్ పునరాలోచన!.. వైరాగ్యమా.. వికారమా!! -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
భార్యకు తీవ్ర గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు గ్రామానికి చెందిన బిక్కన సత్యభాస్కరరావు (69), అతని భార్య పాపాయమ్మతో కలసి స్కూటీపై పెద్దాపురం మండలం కట్టమూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఏడీబీ రోడ్డు జంక్షన్ వద్ద మలుపు తిరుగుతుండగా, వీరి వెనుక నుంచి వ్యాన్ వచ్చి ఢీకొంది. దీంతో సత్యభాస్కరరావు తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్యకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదేం?
సామర్లకోట: ప్రతి నెలా జరగాల్సిన కౌన్సిల్ సాధారణ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడంపై సామర్లకోట మున్సిపల్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు 24 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం నశించాలంటూ నినాదాలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఉబా జాన్ మోజెస్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు కూడా నిర్వహించిన కౌన్సిల్ సమావేశం మే నెలలో నిర్వహించకపోవడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మే 15న మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ తన పదవికి రాజీనామా చేశారని, అదే రోజు ఆమైపె 25 మంది సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించారని గుర్తు చేశారు. అదే సమయంలో సభ్యులందరూ కలిసి అత్యవసర సమావేశం నిర్వహించాలని కోరినా కమిషనర్ ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదన్నారు. సాధారణ సమావేశం నిర్వహణకు నాలుగు రోజుల ముందు, అత్యవసర సమావేశానికి 24 గంటల ముందుగా అజెండా రావాల్సి ఉండగా శనివారం వరకూ అందలేదని, దీంతో సమావేశం జరిగే అవకాశం లేదని తెలిసి, నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. మున్సిపాలిటీకి వచ్చిన నిధులతో అభివృద్ధి పనుల ఆమోదానికి కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని, అలా జరగకపోవడంతో అభివృద్ధి కుంటుబడే అవకాశం ఉందని అన్నారు. సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించడానికి కౌన్సిల్ సమావేశం దోహదపడుతుందన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కాకపోవడానికి కారకులపై చర్యలు తీసుకోవాలని జాన్ మోజెస్ డిమాండ్ చేశారు. కమిషనర్కు వినతి మే నెలలో సాధారణ లేదా అత్యవసర సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి కారణమేమిటని 24 మంది కౌన్సిలర్లు కమిషనర్ ఎ.శ్రీవిద్యను నిలదీశారు. ఈ మేరకు వారందరి సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు. కమిషనర్ బదులిస్తూ చైర్పర్సన్ అంశం కోర్టులో ఉన్నందున సమావేశం నిర్వహించలేకపోయామని చెప్పారు. సీడీఎంఎ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని అన్నారు. రాజీనామా అనంతరం మరుసటి రోజునే చైర్పర్సన్ రాజీనామాను ఉపసంహరించుకున్నారని, మెజార్టీ సభ్యులు వైస్ చైర్మన్ జాన్ మోజెస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించాలని అదే రోజు కోరారని చెప్పారు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని, తాను స్వయంగా నిర్ణయం తీసుకునే అంశం కాదని అన్నారు. సమావేశం జరగకపోవడంతో మే నెల గౌరవ వేతనం ఉండదని సభ్యులు అడిగి ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. 15 రోజుల గడువు ఉన్నా అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్–2 గోకిన సునేత్రాదేవి, 22 మంది సభ్యులు పాల్గొన్నారు.ఫ సామర్లకోటలో మున్సిపల్ కౌన్సిలర్ల నిరసన ఫ కమిషనర్ నిలదీత -
మాల మహానాడు జేఏసీ నాయకుల అరెస్ట్
పామర్రు పోలీస్ స్టేషన్కు తరలింపు ముమ్మిడివరం: నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం వచ్చిన సీఎం చంద్రబాబుకు ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు అన్యాయం జరిగిందని తెలపాలని మాల మహానాడు పిలుపునిచ్చిన నేపథ్యంలో మాల మహానాడు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం రూరల్, క్రైమ్ సీఐల ఆధ్వర్యంలో శనివారం ఉదయం బందరుపాలెం సమీపంలో కర్రివానిరేవుకు చెందిన జేఏసీ నాయకుడు కాశి జగపతిరావు, ఎదుర్లంక గ్రామానికి చెందిన దుక్కిపాటి సత్యనారాయణ, ముమ్మిడివరానికి చెందిన దేవరపల్లి ఏడుకొండలు, మెండి కృష్ణబాబు, ఉచ్చుల సాల్మన్రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పామర్రు పోలీస్ స్టేషన్కు తరలించారు. జేఏసీ నాయకులతో పాటు వైఎస్సార్ సీపీ జిల్లా నాయకురాలు కాశి బాలమునికుమారిని ముమ్మిడివరం బాలయోగి ఆశ్రమం వద్ద గృహ నిర్బంధం చేశారు.అలాగే కాట్రేనికోనకు చెందిన వడ్డి శ్యాంప్రసాద్, గల్లా రాజేందర్లను గృహ నిర్బంధం చేశారు. శనివారం రాత్రి ముమ్మిడివరం పోలీస్ స్టేషన్కు జేఏసీ నాయకులను తీసుకు వచ్చి అప్పగించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు) 14,500 – 15,000 కాయ (వెయ్యి) కొత్త (పచ్చి) కాయ 14,500– 15,000 (వెయ్యి) కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
అక్రమ కేసులకు బెదరొద్దు
తుని రూరల్: చంద్రబాబు నాయుడి ఏడాది పాలన అక్రమ కేసుల నమోదుకే సరిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేల మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. దీనికి బెదరాల్సిన పని లేదని, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, కేసులు ఎత్తివేయకపోతే న్యాయ పోరాటం చేద్దామని అన్నారు. పార్టీ నాయకత్వం న్యాయ సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారని అన్నారు. జనం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని, అప్పుడు అక్రమ కేసులు పెట్టిన నాయకులు, హామీలిచ్చిన నాయకులు పారిపోయే రోజులు వస్తాయని చెప్పారు. మూడు రోజుల మహా డ్రామా నడిచిందని, జగన్మోహన్రెడ్డిని తిట్టడమే అజెండాగా కడపలో టీడీపీ మహానాడు నిర్వహించారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం తలసరి ఆదాయంలో మొదటి ఐదు స్థానాల్లో నిలవగా ఇప్పుడు అధ్వానంగా ఉందని రాజా చెప్పారు. వైద్య విద్యను ఖరీదైనదిగా మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. జగన్ నాయకత్వంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒక్కో వైద్య కళాశాలను రూ.500 కోట్లతో నిర్మిస్తే వాటిని తన అనుయాయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు రూ.5 వేలకే అద్దెకు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని అన్నారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఉంటే ప్రజలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందన్నారు. మద్యం అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే, డిస్టిలరీలన్నీ టీడీపీ నాయకులకు చెందినవే ఉన్నాయని అన్నారు. రోజులో ఎక్కువ సమయాన్ని వైఎస్సార్ సీపీ పటిష్టత కోసమే అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేటాయిస్తున్నారన్నారు. నమ్మకంగా పని చేస్తున్న కార్యకర్తలకు పార్టీ పదవులు అప్పగిస్తున్నామని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడిన కార్యకర్తలకు, పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇస్తామని రాజా స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీల నాయకులు చోడ్రాజు రాంబాబురాజు, రాయి మేరీ అవినాష్, నాగం దొరబాబు, లంక కృపానందం, డొంక వెంకట బెనర్జీ, కీర్తి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఫ కార్యకర్తలకు అండగా ఉంటాం ఫ న్యాయ పోరాటం చేద్దాం ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా -
ఇసుక తవ్వకాలపై ఎన్జీటీకి సమాచారం
సీతానగరం: మండలంలోని సింగవరం ర్యాంపు వద్ద ఇసుక అక్రమ తవ్వకాలపై చైన్నె, ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ)కు మెయిల్ ద్వారా సమాచా రం ఇచ్చానని వంగలపూడికి చెందిన మాజీ సైనికుడు, న్యాయ వాది సూరెడ్డి శివకుమార్ తెలిపారు. శనివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలను అడ్డుకుని, వాటిని వీడియోలు, ఫొటోలు తీసి జిల్లా కలెక్టర్, ఏడీ మైన్స్, తహసీల్దార్, ఎస్సైలకు సామాజిక మాధ్య మాల ద్వారా తెలియపర్చానని తెలిపారు. దీంతో ఎస్సై స్పందించి లారీలను నిలిపివేశారని అన్నా రు. శనివారం ఉదయం మైన్స్ ఏడీ నుంచి లిఖిత పూర్వక మెసేజ్ ఇచ్చారని, అందులో జిల్లా కలెక్టర్కు గాని, తనకు గాని సంబంధం లేదని తెలిపారన్నారు. అనకాపల్లి కలెక్టర్, మైన్స్ డిపార్ట్మెంట్కు మాత్రమే సంబంధం ఉందని తెలియపర్చారని వివరించారు. జిల్లాలో తవ్వకాలపై వారికి సంబంధం లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్జీటీకి తెలిపర్చిన తరువాత తనకు సమాచారం అందించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. సింగవరం లంక భూముల్లో తవ్వకాలు జరపాల్సి ఉండగా, వంగలపూడి లంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి, సింగవరం ర్యాంపు నుంచి కాకుండా వంగలపూడి ర్యాంపు నుంచి ఇసుక లారీలపై తరలిస్తున్నారని అన్నారు. సోమవారం గ్రామస్తులంతా లారీలను అడ్డుకుంటారని, అనకాపల్లి కలెక్టర్, ఏడీ మైన్స్ వారు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసే వరకూ ఆ లారీలను అడ్డుకుంటామని శివకుమార్ హెచ్చరించారు. -
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారథులు
ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారథులుగా మేం ఎన్నో రకాల సేవలందించాం. గౌరవ వేతనంతో సంబంధం లేకుండా ప్రజలకు నిష్పక్షపాతంగా సాయం అందించడం చాలా సంతృప్తినిచ్చింది. స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో కోవిడ్ సమయంలో ఎంతో చేశాం. ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఇళ్లళ్లో ఉండిపోతే మేమే వెళ్లి వారికి నిత్యావసర వస్తువులు, మందులు, కిరాణా సరకులు అందించాం. అనారోగ్యాలతో ఆస్పత్రి పాలైన రోగులకు ఆస్పత్రికి వెళ్లి మరీ పింఛన్లు అందించే వాళ్లం. వరదల సమయంలో ప్రతి ఇంటికీ పీకల్లోతు నీటిలో వెళ్లి ప్రజలకు నిత్యావసర సరకులు, మంచినీరు అందించాం. దురుద్దేశంతోనే వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అప్పుడు మేం చేసిన సేవలను ప్రజలు ఇప్పుడు గుర్తిస్తున్నారు. చాలా సంతోషం. – వలీ బాబా, వలంటీర్, పిఠాపురం -
అలా స్పాగిపోతున్నారు..!
హెయిర్ కటింగ్తో ప్రారంభమై.. ముందుగా హెయిర్ కటింగ్తో కస్టమర్లను ఆకర్షించే నిర్వాహకులు కస్టమర్లు అడగకపోయినా హెడ్ మసాజ్ వంటివి చేస్తారు. వారు చూపిస్తున్న ఆసక్తిని బట్టి తమ వద్ద బాడీ మసాజ్ కూడా ఉందని చెబుతారు. అలా ముగ్గులోకి వచ్చిన కస్టమర్లతో మసాజ్ ప్రక్రియలో భాగంగా పరిచయం పెంచుకుంటారు. చీకటి మాటున జరిగే ఈ మసాజ్ ప్రక్రియలో ఫుల్ మసాజ్, బాడీ టూ బాడీ మసాజ్ వంటి పేర్లతో యువతులతో మగ కస్టమర్లను ఆకర్షిస్తారు. ఇలా ప్రత్యేక గదిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కూడా జరిగిపోతుంది. అలవాటు పడిన కస్టమర్లు వారానికి ఒకసారైనా ఇక్కడకు వస్తున్నారని అంటున్నారు. ఇటీవల ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకురాలి ఫోన్లో బ్యూటీపార్లర్కు వచ్చే ఆడవారికి మగ వ్యభిచారులను కూడా సమకూరుస్తున్నట్టు రికార్డింగ్ బయటపడటం విష సంస్కృతికి అద్దంపడుతోంది. ఫ మసాజ్ పేరుతో మగువలతో వల ఫ రాజమహేంద్రవరంలో స్పా సెంటర్లు ఫ గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచారం ఫ దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం కంబాలచెరువు: (రాజమహేంద్రవరం): సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నయా సంస్కృతి మొదలైంది. ఎక్కడో హైదరాబాద్, బెంగళూరు వంటి కాస్మోపాలిటిన్ నగరాల్లో ఉండే స్పా సెంటర్ల కల్చర్ ఇక్కడకు విస్తరించింది. మసాజ్ పేరుతో హైటెక్ వ్యభిచారం అధికమైంది. ఉపాధి పేరుతో ఆయా స్పా సెంటర్లలో చేరిన యువతులను నిర్వాహకులు పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. ఏడాది కాలంలో నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న సుమారు 14 స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం చూస్తే.. జిల్లాలో చాపకింద నీరులా విష సంస్కృతి పెరిగిందని చెప్పకనే అర్థమవుతోంది. ఎక్కడే ఎందుకంటే.. రాజమహేంద్రవరంలో ధనిక వర్గాలు ఎక్కువగా ఉండే ఏవీ అప్పారావు రోడ్డు, జేఎన్ రోడ్డు, దానవాయిపేట వంటి ప్రాంతాల్లో ఇటీవల స్పా సెంటర్లు పెరుగుతున్నాయి. నిరుద్యోగ యువత ఉపాధి వేటలో భాగంగా బ్యూటీ కోర్సులు, మసాజ్ కోర్సులు వంటివి చేసి స్పా సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారం బాగుంటుండటంతో అసాంఘిక శక్తులు ఈ రంగంలోకి ప్రవేశించి పెట్టుబడి పెడుతూ తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాందించేందుకు పథక రచన చేస్తున్నారు. బ్యూటీపార్లర్లతో కూడిన మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే కస్టమర్లను వ్యభిచారం వైపు లాగుతున్నారు. ఆయా సెంటర్లకు వెళ్లే విటులలో ఎక్కువ వ్యాపార వర్గాలు, యువత ఉంటున్నారు. కొద్దినెలల కిందట ఏవీ అప్పారావు రోడ్డులో పట్టుబడిన స్పా సెంటర్ నిర్వాహకురాలు బ్యూటీ పార్లర్లకు వచ్చే మహిళలకు వారి అభిరుచి మేరకు మగ వ్యభిచారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ఓ వాయిస్ రికార్డింగు బయటపడటం చూస్తే పరిస్థితి చేయిదాటిందని అర్థమవుతోంది. ఎక్కడో మెట్రోపాలిటిన్ సిటీల్లో బయటపడే ఇటువంటి ఘటనలు జిల్లాలో విస్తరించడం చూస్తే అసాంఘిక శక్తులు ఏ మేరకు చొచ్చుకు వస్తున్నాయో స్పష్టమవుతోంది. ఉద్యోగం పేరుతో.. బ్యూటీపార్లర్, సెలూన్, స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచారాలు ప్రారంభించే నిర్వాహకులు ముందుగా బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి మసాజ్ సెంటర్లలో అనుభవం ఉన్న ఒకరిద్దరు యువతులను ఆకర్షణీయమైన ప్యాకేజీతో నియమించుకుంటారు. జన సంచారం తక్కువగా ఉండే ధనిక వర్గాలు నివసించే ప్రాంతాల్లో అట్టహాసంగా స్పా, సెలూన్ సెంటర్లు ప్రారంభించి రిసెప్షన్, హెల్పర్ల పేరుతో అందమైన యువతులను పనిలో పెట్టుకుంటారు. ముందే అనుభవం ఉన్న యువతులు కొత్తగా చేరిన వారితో సన్నిహితంగా ఉంటారు. వారికి ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తూ తమవైపు తిప్పుకుంటారు. వారి అవసరాలకు డబ్బులు ఇస్తూ పూర్తిగా వీరి ఉచ్చులో పడే విధంగా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటారు. కొత్తగా చేరిన యువతులకు పాత యువతులతో కౌన్సెలింగ్ ఇప్పిస్తూ వారిని కూడా మసాజ్ ప్రక్రియకు ఉపయోగించుకుని కమీషన్ ఇస్తారు. నిర్వాహకులు ఆ యువతులతో చనువుగా ఉంటూ ఫోటోలు దిగడం చేస్తుంటారు. అవి నిర్వాహకుల వద్ద ఉండటంతో ఆ యువతులు పూర్తిగా విధేయతతో ఉంటారు. వారితో గొడవ పెట్టుకునేందుకు సాహసించరు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం సాగిపోతోంది. ఏడాదిలో 14 సెంటర్లపై దాడి ఏడాది కాలంలో జిల్లాలోని రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మసాజ్ సెంటర్లు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లలో అసాంఘిక కార్యకలాలు నిర్వహిస్తున్న 14 సెంటర్లపై పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేశారు. అక్కడ దొరికే యువతులను సాక్షులుగా పరిగణిస్తూ విటులపై, నిర్వాహకులపై కేసులు నమోదు చేశాం. స్పాలు, బ్యూటీపార్లర్లపై నిరంతరం నిఘా పెడుతున్నాం. ప్రజలు కూడా తమ ప్రాంతాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సమాచారం ఇవ్వాలి. –డి.నరసింహకిశోర్, ఎస్పీ, తూర్పుగోదావరి జిల్లా -
పర్యాటకుల కోసం ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తర భారత దేశంలో ప్రముఖ దేవాలయాలను సందర్శించుకునేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ హలో సంయుక్త ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ ఎం.రాజా తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో బ్రోచర్ను విడుదల చేసి మాట్లాడారు. ఈ నెల 14న భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు మీదుగా వారణాసి, ప్రయోగరాజ్, రామ జన్మభూమి, త్రివేణి సంగమం నైమిశా శరణ్యం సందర్శించుకోవచ్చన్నారు. 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ పర్యటన ఎకానమీ, స్టాండర్డ్, కంఫర్ట్ ప్యాకేజీల్లో ఉందన్నారు. ఈ రైలుకు విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని బోర్డింగ్ సౌకర్యం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూలై 5న పంచ జ్యోతిర్లింగ దర్శన్ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభమై అదే నెల 13న యాత్ర ముగుస్తుందన్నారు. నాగపూర్, ఉజ్జయిని, నాసిక్, పూణే ఔరంగాబాద్, డాక్టర్ అంబేడ్కర్ జన్మస్థలం మహా పుణ్యస్థలాల సందర్శన ఉంటుందన్నారు. ఈ రైలుకు కామారెడ్డి, నిజామాబాద్, నాందేడు, పూర్ణ స్టేషన్లో బోర్డింగ్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి లేహ్, లడఖ్, చారుదాం, గోవాలకు విమాన ప్యాకేజీలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. సమావేశంలో ఐసీటీసీ అసిస్టెంట్ మేనేజర్ బాలాజీ పాల్గొన్నారు. -
రత్నగిరి.. కిక్కిరిసి..
అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరిపై సత్యదేవుని ఆలయం శనివారం కిక్కిరిసిపోయింది. రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం వద్ద తీవ్ర రద్దీ ఏర్పడింది. ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. తీవ్రమైన రద్దీ కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సత్యదేవుని 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 5,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఉదయం వాతావరణం మేఘావృతమై వర్ష సూచనలు ఉండటంతో సత్యదేవుని ప్రాకార సేవ పల్లకీ మీద ఆలయం లోపలి ప్రాకారంలో నిర్వహించారు. సత్యదేవుని సన్నిధిలో ఆదివారం కూడా రద్దీ కొనసాగనుంది. ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాకారంలో టేకు రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఊరేగించనున్నారు. రూ.2,500 చెల్లించిన భక్తులు ఈ రథ సేవలో పాల్గొనవచ్చు. ఆ రుసుం చెల్లించిన వారి కుటుంబ సభ్యులు నలుగురికి స్వామివారి అంతరాలయ దర్శనం, ప్రసాదం, వేదాశీర్వచనం, దంపతులకు కండువా, జాకెట్టు ముక్క అందజేస్తారు. ఫ సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ఫ 5,200 వ్రతాలు ఫ దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం -
వలంటీరుతోనే విద్యా దీవెన
వలంటీరు ఇంటి ముంగిటకే వచ్చి దరఖాస్తు పూర్తి చేసి తీసుకుని అవగాహన కల్పించడంతోనే మాకు విద్యాదీవెన వచ్చింది. అందువల్లనే మా పిల్లలు ఈ రోజు బాగా చదువుకోగలుగుతున్నారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యా దీవెన పథకం తీసుకురావడమే కాకుండా ఆ పథకాన్ని వలంటీరు ద్వారా ఇంటికి పంపించి మరీ మంజూరు చేయించారు. మొదట్లో వలంటీర్లను చూసి వీళ్లేం చేస్తారనుకునే వాళ్లం. కానీ, వారు చేసిన సేవలు మాటలు కాదు. వారి మేలును జీవితంలో ఎప్పటికీ మరచిపోలేం. ఇల్లు లేని వారికి జగనన్న కాలనీలో ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేయించడంలో వలంటీర్లు చాలానే చేశారు. – ఆలమూరు దుర్గ, నవరత్నాల లబ్ధిదారు, పవర, సామర్లకోట మండలం ప్రాణాలు లెక్క చేయకుండా.. కరోనా మహమ్మారితో బాధ పడుతున్న వారికి మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సేవలందించాం. అప్పట్లో మా కుటుంబాల్లోని వారి కంటే మాకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఉన్న వారి ప్రాణాలే ముఖ్యమనుకుని పని చేశాం. కోవిడ్ బాధితుల వద్దకు వెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులే ప్రాణాలు అరచేత పట్టుకుని భయపడిపోయే వారు. అటువంటిది కోవిడ్తో బాధ పడుతున్న వారు హోం ఐసోలేషన్, క్వారంటైన్లో ఉన్నా లెక్క చేయకుండా వలంటీర్లుగా మేము ఎంతో చేశాం. అటువంటి మమ్మల్ని అర్ధాంతరంగా రోడ్డున పడేశారు. వేతనం రూ.10 వేలు చేస్తామని చెబితే నిజమే అనుకున్నాం. తీరా మొత్తం వ్యవస్థనే రద్దు చేయడం అన్యాయం. – కడియాల కిరణ్, వలంటీర్, వాకలపూడి -
రైతు ప్రాణం తీసిన కలుపు మందు
నల్లజర్ల: పంట పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే గడ్డి మందు ఓ యువ రైతు ప్రాణం తీసింది. ఆ వివరాల ప్రకారం.. మండలంలోని చీపురుగూడెం గ్రామానికి చెందిన యువ రైతు చెల్లు లీలాకృష్ణ ప్రసాద్ (30) పదిహేను రోజుల కిందట పొలాల్లో కలుపు నివారణకు ఇంటి వద్ద ఉన్న గడ్డి మందు డబ్బాను పొలానికి తీసుకెళ్లాడు. ఆ డబ్బాను బైక్ ముందు కవర్లో పెట్టాడు. మార్గ మధ్యంలో డబ్బా మూత లీకై అతని ప్యాంట్పై పడింది. ఏమీకాదులే అని కడిగేసుకుని ఆ మందు స్ప్రే చేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఒక్కరోజు వ్యవధిలోనే ఒంటిపై పడిన మందు ద్రావణం వృషణాల నుంచి శరీరంలోని కిడ్నీ, లివర్ తదితర అవయవాలకు సోకింది. అతను తొలుత ఏలూరు, తర్వాత విజయవాడ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందినట్లు మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడాది క్రితమే ప్రసాద్కు ఆవపాడుకు చెందిన మౌనికతో వివాహం కాగా, ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భిణి. ప్రసాద్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అటవీ భూమిలో చెట్ల నరికివేత గోపాలపురం: మండలంలోని కోమటికుంట అటవీ భూమిలో ఉన్న చెట్లు నరికివేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు రెండు ట్రాక్టర్ల పుల్లలను స్వాధీనం చేసుకున్నామని డీఆర్ఓ కె.వేణుగోపాల్ శనివారం విలేకరులకు తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. అటవీ శాఖకు చెందిన భూమిలో ఉన్న వేప, జీడిమామిడి చెట్లు అక్రమార్కులు నరుకుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అక్కడ రెండు ట్రాక్టర్లతో ఉన్న సుమారు 12 టన్నుల పుల్లలను స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు చేసినట్లు డీఆర్ఓ తెలిపారు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా ఆలయానికి రూ.3,34,407 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. సుమారు 3,500 మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. 36 యూనిట్లకు రూ.1.28 కోట్ల రాయితీలు కాకినాడ సిటీ: సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహ రాయితీల కింద ఉత్పాదన, సేవా రంగాల్లోని 36 యూనిట్లకు సుమారు రూ.1.28 కోట్ల మేర రాయితీలు కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశాన్ని జూమ్ ద్వారా శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గడచిన మూడు నెలల్లో వివిధ పరిశ్రమల స్థాపనకు 386 దరఖాస్తులు అందగా, సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 333 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామని తెలిపారు. మిగిలిన 53 దరఖాస్తులు వివిధ శాఖల వద్ద పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈ క్లస్టర్ అభివృద్ధి కార్యక్రమం ద్వారా జిల్లాలో అర్హత కలిగిన క్లస్టర్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి పథకం (ఎంఎస్ఈసీడీపీ) కింద జిల్లాలో ప్రతిపాదించిన మ్యాంగో జెల్లీ క్లస్టర్ ప్రతిపాదనలను జూన్ నెలాఖరుకు సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, ఏడీ ఎస్.విజయ్ కుమార్, రవాణా శాఖ అధికారి జీవీ శివరెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ ఎ.రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డి.రాధాకృష్ణ, ఎల్డీఎం సీహెచ్వీ ప్రసాద్, గ్రౌండ్ వాటర్ డీడీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఐటీఐలలో ప్రవేశాలకు 3 నుంచి ఇంటర్వ్యూలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం జూన్ 3 నుంచి 10వ తేదీ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, కన్వీనర్ ఎం.వేణుగోపాలవర్మ తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో కేటాయించిన షెడ్యూలు ప్రకారం హాజరు కావాలని సూచించారు. 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మెరిట్ నంబర్లు 1 నుంచి 80 వరకూ, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 81 నుంచి 159 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 160 – 242 వరకూ, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 243 – 325 మెరిట్ లిస్ట్ వరకూ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. పైన పేర్కొన్న షెడ్యూల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి జనరల్ కేటగిరీలో జూన్ 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. తొమ్మిదో తేదీ ఉదయం 8 గంటలకు మెరిట్ లిస్ట్ 1 – 159, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 160 – 325 వరకూ, 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 326 – 484 వరకూ, మధ్యాహ్నం 485 నుంచి 634 వరకూ ఇంటర్వ్యూలు జరుగుతాయని వేణుగోపాలవర్మ వివరించారు. కూటమి పాలనలో విలేకర్లపై పెరిగిన దాడులు అమలాపురం రూరల్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో విలేకర్లపై దాడులు పెరిగిపోయాయని జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. అయినవిల్లి మండల సాక్షి విలేకరి బావిశెట్టి నాగేశ్వరరావుపై అయినవిల్లిలో శుక్రవారం రాత్రి ఇద్దరు యువకులు ముసుగులు ధరించి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. అమలాపురంలో ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగేశ్వరావును ఆయన శనివారం పరామర్శించారు. దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాక్షి విలేకరిపై హత్యాయత్నానికి పాల్పడిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావును వైఎస్సార్ సీపీ పి.గన్నవరం నియోజవర్గ ఇన్చార్జి గన్నవరం శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, వైఎస్సార్ సీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్బాబు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మెండగుదిటి శిరీష్, విఘ్నేశ్వరస్వామి ఆలయం మాజీ చైర్మన్ గుత్తుల నాగబాబు, నాయకులు సలాది బుచ్చిరాజు, మద్దాల చంటిబాబు, గుర్రాల రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి తదితరులు పరామర్శించారు. -
సీఎం స్థాయిలో ఉండి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా?: మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డగోలు హామీలిచ్చి, ఏడాది గడుస్తున్నా ఏ ఒక్కటీ అమలు చేయకుండా, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్తో నెట్టుకొస్తున్న సీఎం చంద్రబాబు, పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆక్షేపించారు. శనివారం ఆయన రాజమహేంద్రవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ ఒక్క మాటకు కట్టుబడక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. వేదిక ఏదైనా జగన్ను నిందించడమే పనిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మార్గాని భరత్ ఇంకా ఏమన్నారంటే..మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనిందలే:మహానాడు పేరుతో ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ఆత్మని క్షోభకు గురిచేస్తున్నారు. చంద్రబాబుని ఎన్టీఆర్ ఔరంగజేబు, రావణాసురుడుతో పోల్చితే ఏఐ టెక్నాలజీ వాడుకుని పొగిడించుకోవడం సిగ్గుచేటు. వారి దిగజారుడుతనానికి నిదర్శనం. నందమూరి కుటుంబ సభ్యులెవర్నీ మహానాడుకి పిలవకుండా ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారు. ప్రజలు ఇదంతా తెలియని అమాయకులని తండ్రీకొడుకులు భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు.మూడు రోజుల మహానాడు మొత్తం ఆత్మస్తుతి, పరనింద తప్ప, ప్రజలకు ఏడాదిలో ఏం చేశామో చెప్పుకోలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఏడాది గడిచినా సూపర్ సిక్స్లో ఒక్క హామీని కూడా నెరవేర్చింది లేకపోయినా 30 ఏళ్లు మనమే ఉంటామని చెప్పడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. టీడీపీ నాయకులకు ప్రజల గడప వద్దకు వెళ్లే ధైర్యం కూడా లేదు. మహానాడుకి జనం కరువైపోతే డ్వాక్రా మహిళలు రాకపోతే పథకాలు కట్ చేస్తామని బెదిరించారు.ఆ నిర్ణయాన్ని సమర్థించుకోలేక..:ప్రతినెలా రూ.4 వేల పింఛన్ పంపిణీ కార్యక్రమం పేరుతో చంద్రబాబు లక్షలకు లక్షలు ఖర్చు చేస్తున్నాడు. వేదిక మీదకు నలుగురు పేదవారిని పిలిచి వారికి మైకులు పెట్టి డ్రామా నడుపుతున్నాడు. ఏడాదిగా కనీసం ఒక్క కొత్త పింఛన్ కూడా పంపిణీ చేయకుండా ఇలాగే కాలక్షేపం చేశాడు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు, ఎండీయూ వాహనాలు నడుపుకునే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల మీద దారుణమైన ఆరోపణలు చేశాడు. నెలకు రూ.10 వేల వేతనం తీసుకునే రేషన్ వాహనాల డ్రైవర్లు లంచాలు ఇవ్వడానికి తన వద్దకే వచ్చినట్టు చంద్రబాబు దారుణమైన అభాండాలు వేయడం సిగ్గుచేటు. సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి దిగజారి ఆరోపణలు చేయడం బాధాకరం.పేదలపై చంద్రబాబు వ్యాఖ్యలు దారుణం:వేల కోట్ల విలువైన బియ్యం కాకినాడ పోర్టుకి వెళ్తున్నాయని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి చేయాల్సిన ఆరోపణలు ఇవేనా? బియ్యం అక్రమంగా తరలిపోతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నట్టు? అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అలాంటి అక్రమార్కులను ఎందుకు పట్టుకోలేకపోయారు? రేషన్ వాహనాలు ఎత్తేయాలని తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయాన్ని సమర్థించుకోలేక అమాయకుల మీద దారుణమైన ఆరోపణలు చేస్తున్నాడు. వెనుకబడిన వర్గాల వారిని, నిరుపేదలను కొవ్వెక్కిపోయారని మాట్లాడటం దారుణమైన విషయం.అది అహంకార నిర్ణయం:వెనుకబడిన వర్గాల మీద ఇంత చులకనభావం పనికిరాదు. 18 నెలల కాలపరిమితి ఉన్నా ఎండీయూ ఆపరేటర్లను తొలగించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అహంకారపూరిత నిర్ణయంతో వారు తీసుకున్న వాహనాలకు నెలనెలా కిస్తీలు కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎండీయూ ఆపరేటర్లను ఆర్థిక నేరస్తులని, టెర్రరిస్టులుగా చెప్పడం ఎంత దారుణం? చంద్రబాబు తన వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎండీయూ ఆపరేటర్లు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఎండీయూ ఆపరేటర్లకి వైయస్సార్సీపీ కూడా అండగా ఉంటుంది.పింఛన్ డోర్ డెలివరీ ఇవ్వలేనివారు, రేషన్ ఇస్తారా?:కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్లే డోర్ డెలవరీ చేయలేకపోతున్నారు. అలాంటిది వికలాంగులు, వృద్ధులకు ఇంటికే రేషన్ సరుకులు తీసుకొచ్చి ఇస్తామంటే నమ్మడానికి ప్రజలెవరూ సిద్ధంగా లేరు. ఒకపక్క కొత్తగా 6 వేల రేషన్ షాపులు మంజూరు చేస్తామని చెప్పుకుంటూ, చంద్రబాబు తన ప్రసంగంలో మాత్రం రేషన్కి బదులు డీబీటీ ద్వారా డబ్బులిస్తామని చెబుతున్నాడు. ఈ రేషన్ షాపులను ఒక్కోటి రూ.5 లక్షలకు వేలంపాట ద్వారా అమ్మడానికి ఇప్పటికే ఎమ్మెల్యేలు సిద్ధమైపోయారు. అదే జరిగితే ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు. మరోవైపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ గుర్తు చేశారు. -
అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
సాక్షి, అన్నవరం: అన్నవరం దేవస్థానం ఏఈఓ కొండలరావు.. మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దేవాదాయశాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ముందస్తు చర్యల్లో భాగంగా కొండలరావును ఆలయ విభాగం నుండి గోశాల, గార్డెన్స్ విభాగాలకు బదిలీ చేశారు. ఇక, కొండలరావుపై ఇప్పటి వరకు ఇద్దరు మహిళా భక్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం.వివరాల ప్రకారం.. తెలంగాణలోని మంచిర్యాల నుంచి సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి వచ్చిన తమ పట్ల కొండలరావు దురుసుగా ప్రవర్తించారని మహిళా సేవకులు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడిన దేవదాయ శాఖ కమిషనర్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావును ఆదేశించారు. ఈ మేరకు కొండలరావుకు షోకాజ్ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ వివాదం ఇంకా ముగియక ముందే ఆయనపై మరో భక్తుడు తీవ్ర స్థాయి ఆరోపణలతో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది.ఏం జరిగిందంటే..హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి ఈ నెల 13వ తేదీ రాత్రి జరిగిన సత్యదేవుని శ్రీపుష్పయాగం కార్యక్రమానికి అన్నవరం వచ్చారు. రూ.రెండు వేల టికెట్తో సత్యదేవుని వ్రతం ఆచరించి, స్వామివారిని దర్శించుకోవాలని అనుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి పురోహితుడు రాత్రి స్వామివారి శ్రీపుష్పయాగ మహోత్సవం జరుగుతుందని చెప్పడంతో కామేశ్వరశాస్త్రి దంపతులు హైదరాబాద్ ప్రయాణం రద్దు చేసుకున్నారు. అనంతరం, సత్యదేవుని శ్రీపుష్పయాగానికి హాజరయ్యారు. ఈ ఉత్సవం ముగిసిన తరువాత ప్రసాదం తీసుకునేందుకు అర్చకుని వద్దకు వెళ్లగా, తెల్లని వస్త్రాలు ధరించిన వ్యక్తి తన భార్య భుజంపై చేయి వేసి అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు.దీంతో, తాను ఒక్కసారిగా షాక్కు గురైనట్టు తెలిపారు. అయితే, ఆ వ్యక్తి దేవస్థానం ఏఈఓ కొండలరావుగా అక్కడి సిబ్బంది ద్వారా తెలుసుకున్నానని పేర్కొన్నారు. వెంటనే ఈ విషయమై ఈవోకు ఫిర్యాదు చేద్దామనుకున్నాను. కానీ, అప్పటికే ఈవో కొండ దిగువకు వెళ్లిపోయారని తెలిసి హైదరాబాద్ వచ్చేశామని పేర్కొన్నారు. తన భార్యతో పాటు ఇతర భక్తుల పట్ల అతడి ప్రవర్తన అదేవిధంగా ఉందని ఆ ఫిర్యాదులో కామేశ్వరశాస్త్రి చెప్పుకొచ్చారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఫిర్యాదు కాపీని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి గురువారం దేవస్థానానికి పంపించి, దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవోను ఆదేశించారు. దీనిపై విచారణాధికారి ద్వారా విచారణ చేయించనున్నట్లు ఈవో తెలిపారు. -
అమలాపురంలో తొలిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు
ఎన్హెచ్ఆర్సీ కౌన్సెలింగ్తో ఒక్కటైన దంపతులు ఆలమూరు: మండలంలోని బడుగువానిలంకలో మూడేళ్ల క్రితం విడిపోయిన దంపతులు జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) చొరవతో ఒక్కటయ్యారు. స్థానికుల కథనం ప్రకారం బడుగువానిలంకకు చెందిన పాలూరి వెంకటేష్తో పెదపళ్లకు చెందిన దేవి గౌతమికి 2014 లో వివాహమైంది. మూడవ కాన్పులో ఆడపిల్ల పుట్టిందనే కారణంతో 2022 మార్చిలో దేవి గౌతమిని పిల్లలతో సహా భర్త వెంకటేష్ పుట్టింటికి పంపించి వేశాడు. అప్పట్లో పెద్దల వద్దకు, ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్లి కాపురాన్ని నిలబెట్టాలని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఆలమూరు మండలంలోని పెదపళ్లకు చెందిన గారపాటి శ్రీనివాసరావు నియమితులు కావడంతో దేవి గౌతమి ఆయనకు తన పరిస్థితి వివరించింది. దీనిపై స్పందించిన వైస్ చైర్మన్ గారపాటి భర్త వెంకటేష్ నివాసానికి వెళ్లి, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధుల సాయంతో కౌన్సెలింగ్ ఇచ్చి భార్యాభర్తలిద్దరితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి కాపురానికి ఒప్పించడంతో కథ సుఖాంతమైంది. ఎన్హెచ్ఆర్సీ కృషిని ఇరు గ్రామాల ప్రజలు అభినందించారు. అమలాపురం టౌన్: గుర్రాల విజయ కృష్ణ మెమోరియల్ పేరిట అమలాపురంలో మొట్టమొదటిసారిగా బాక్స్ క్రికెట్ పోటీలు స్థానిక గండువీధిలో ఈ నెల 28వ తేదీన మొదలయ్యాయి. జూన్ 3వ తేదీతో ఈ పోటీలు ముగిస్తాయని నిర్వాహకుడు కన్నా చెప్పారు. వారం రోజుల పాటు పోటీలను తమ సోదరుడి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నామన్నారు. మొదటి బహుమతిగా రూ.30 వేలు, రెండో బహుమతిగా రూ.15 వేలు ఇవ్వనున్నారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మొత్తం 40 జట్లు తలపడనున్నాయన్నారు. ప్రతీ మ్యాచ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీని విజేత జట్టుకు అందజేస్తున్నారు. -
చెరువు గుట్కాయస్వాహా!
● బియ్యపుగుంట చెరువును పూడ్చేసిన ఆక్రమణదారులు ● అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ● పట్టించుకోని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు నిడదవోలు: ఆక్రమణకు కాదేది అనర్హం అన్నట్లు కొందరు రెచ్చిపోతున్నారు. ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తుందా.. పాగా వేసేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడంతో ఆక్రమణదారులకు అడ్డు అదుపూ లేకుండాపోతోంది. ఆక్రమణలపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు చీమకుట్టినట్లు కూడా ఉండడం లేదు. దీనికి తాజా ఉదాహరణగా నిడదవోలులోని బాలాజీనగర్లో మున్సిపాలిటికి చెందిన బియ్యపుగుంట చెరువును ఆక్రమణదారులు పూడ్చివేశారు. బుధవారం రాత్రికి రాత్రే లారీలతో మంటి తరలించి 80 సెంట్ల ఉన్న చెరువును పూడ్చివేశారు. దీని విలువ రూ.4 కోట్ల వరకు ఉంటుంది. రెండేళ్ల క్రితం మున్సిపల్ అధికారులు చెరువు విస్తీర్ణాన్ని కొలిచి సరిహద్దు స్తంభాలను కూడా ఏర్పాటు చేశారు. విలువైన భూమి పట్టణ శివారున బాలాజీనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారంజోరుగా సాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల నుంచి పొలాలు కొని వెంచర్లు వేసి అధిక ధరలకు విక్రయించి లాభపడుతున్నారు. ఈ ప్రాంతంలో మున్సిపాలిటీకి చెందిన 80 సెంట్ల బియ్యపుగుంట చెరువుపై అక్రమార్కుల కన్ను పడింది. ఇక్కడ గజం భూమి రూ.10 వేలు పలుకుతోంది. సెంటు భూమి సుమారు 4.80 లక్షలు అయితే 80 సెంట్ల భూమి విలువ సుమారు రూ.4 కోట్లు పలుకుతోంది. రైతులకు ఈ చెరువు ఎంతో ఉపయోగంగా ఉండేది. ఎక్కువగా చాగల్లు మండలం ధారవరం, బ్రాహ్మణగూడెం గ్రామాలకు చెందిన రైతులకు చెందిన 300కి పైగా పశువులు చెరువులో దాహం తీర్చుకునేవి. సుమారు 50 ఎకరాలకు సంబంధించిన మురుగునీరు చెరువుకు చేరడంతో పొలాలకు నష్టం లేకుండా ఉండేది. అయితే చెరువును పూడ్చివేయడంతో వర్షపునీరు, పంట మురుగునీరు వెళ్లే దారిలేక భవిష్యత్తో పొలాలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తాగునీరు కరువవుతుందని వాపోతున్నారు. -
ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలంటూ ధర్నా
రామచంద్రపురం రూరల్: ప్రమాదాలకు కారణమవుతున్న ఇసుక లారీల వేగాన్ని నియంత్రించాలని కోరుతూ వెంకటాయపాలెం, వేగాయమ్మపేట గ్రామాల సర్పంచ్లు, ప్రజలు, అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఇసుక లారీలను అడ్డగించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాయపాలెం గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు యల్లమిల్లి సతీష్కుమారి, వేగాయమ్మపేట సర్పంచ్ అంబటి తుకారం, రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాసంశెట్టి శ్యామ్, అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి గోదావరి జిల్లాల నాయకుడు వెంటపల్లి భీమశంకరం, ఐఎఫ్టీయూ నాయకుడు చింతా రాజారెడ్డి తదితరులు మాట్లాడుతూ లారీలు, ముఖ్యంగా ఇసుక లారీలు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని మండి పడ్డారు. ఈ నెల 28న మహిళపై నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఉదంతాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె మృతితో అప్పటికే తండ్రిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు తల్లిని కూడా కోల్పోయి అనాథలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాయపాలెం ప్రధాన రహదారి నుంచి వేగాయమ్మపేట, యర్రపోతవరం, యానాంలకు దగ్గరి దారిగా ఉండటంతో చీమలదిబ్బ గ్రామం నుంచి కాలువ గట్టు రహదారిపై నుంచి లారీలు రాకపోకలు సాగించడం ప్రమాదాలకు కారణమవుతోందన్నారు. ఈ రహదారి ఇరుకుగా ఉండటం రెండు పక్కలా కాలువలు ఉండటంతో అధిక బరువు కలిగిన లారీల వల్ల రోడ్డు కూడా కుంగిపోయి మరింత ప్రమాదకరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక లోడులు వేస్తున్న ఇసుక లారీలకు కనీసం బరకాలు కూడా కప్పకపోవడంతో లారీల వేగానికి ఇసుక ఎగిరి ప్రయాణికుల కళ్లల్లో పడి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఆర్అండ్బీ అధికారులు లారీల వేగాన్ని నియంత్రించేలా స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, చీమలదిబ్బ దారిలో లారీలు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుసూరి వెంకటరమణ, ఇళ్ల సత్యనారాయణ, రాయుడు కృష్ణ, కోడి అర్జునుడు, ఇళ్ల గణపతి, అనుసూరి దుర్గ, దంగేటి జ్యోతి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దడాల రవికుమార్ పాల్గొన్నారు. -
బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సీఐ
సామర్లకోట: పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బుధవారం సంతమార్కెట్ సెంటర్లో ఒక బాలుడు సెల్ఫోన్ చూస్తూ నడుచుకొంటూ వెళ్లిపోతున్నాడు. దానిని గమనించిన సీఐ ఎ.కృష్ణభగవాన్ బాలుడి నుంచి వివరాలు సేకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలుడు మూగవానిగా తెలుసుకున్నారు. దాంతో సెల్ఫోన్లో నంబర్కు ఫోన్ చేయడంతో ఆ బాలుడిని వేదాంశ్ కార్తికేయగా గుర్తించారు. సీఐ సమాచారం మేరకు తల్లి పోతుల తులసీ, తండ్రి శరత్కుమార్ ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తాము విశాఖపట్నం నుంచి వేసవి సెలవుల కారణంగా కోట్లమ్మ చెరువు వద్ద బంధువుల ఇంటికి వచ్చామని తెలిపారు. రెండో తరగతి చదువుతున్న ఆరేళ్ల తమ కుమారుడు వేదాంశ్ కార్తికేయ సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకొంటూ బయటకు వచ్చేయడాన్ని తాము గమనించలేదని చెప్పారు. క్షేమంగా తమ కుమారుడిని అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు సీఐకి, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
పెట్టుబడి సాయం ఎప్పుడు?
గత సంవత్సరం రైతు భరోసా నిధులు పడలేదు. ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సన్నాహాలు చేస్తున్నాం. వరి విత్తనాలు, ఎరువులకు డబ్బులు లేకపోవడంతో బయట అప్పులు తెచ్చుకొంటున్నాం. రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సాయాన్ని ఈ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి. – తుమ్మలపల్లి తాతాజీ, రైతు, కరప ఈ ఏడాదైనా ఇస్తారా? అధికారంలోకి వస్తే రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున సాయం అందిస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. గత సంవత్సరం ఇవ్వలేదు. ఈ ఏడాదైనా ఇస్తే రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. బయటి వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఎరువులు, పురుగు మందులు కొంటున్నాం. – ఎర్నీడి సత్తిరాజు, రైతు జి.మేడపాడు, సామర్లకోట మండలం -
వైఎస్సార్ సీపీ యువజన విభాగంలో 11 మందికి స్థానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగంలో జిల్లా నుంచి 11 మంది నేతలకు పదవులు దక్కాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ యువజన విభాగం జోనల్ ప్రెసిడెంట్గా దాడిశెట్టి శ్రీనివాస్ (తుని నియోజకవర్గం), ప్రధాన కార్యదర్శిగా తోట రాంజీ (జగ్గంపేట), కార్యదర్శులుగా బదిరెడ్డి సతీష్ గోవిందుబాబు (ప్రత్తిపాడు), మధిరెడ్డి దొరబాబు (పిఠాపురం), సంయుక్త కార్యదర్శులుగా కరణం భాను (పెద్దాపురం), ఎంజీకే కిషోర్ (కాకినాడ సిటీ), ఎం.హేమంత్ కుమార్ (తుని), వలవల భూషణం (పిఠాపురం); ప్రధాన కార్యదర్శిగా సూర్రెడ్డి తిరుమల రాయుడు (ప్రత్తిపాడు), సంయుక్త కార్యదర్శులుగా తోట అయ్యన్న (జగ్గంపేట), అక్షింతల లక్ష్మణమూర్తి రాజా (జగ్గంపేట నియోజకవర్గం) నియమితులయ్యారు.ఆలయ బాధ్యతల నుంచి ఏఈఓ తొలగింపుఅన్నవరం: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం ఏఈఓ కె.కొండలరావును సత్యదేవుని ఆలయ బాధ్యతల నుంచి తప్పించి గోశాల, గార్డెన్స్ విభాగానికి మార్చారు. ఆయన స్థానంలో గోశాల, గార్డెన్స్ విభాగం ఏఈఓ పి.జగ్గారావును నియమించారు. ఈ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న సత్యదేవుని శ్రీపుష్పయాగానికి వచ్చిన తమపై కొండలరావు అనుచితంగా ప్రవర్తించారని, తన భార్యను తోసివేయడంతో ఆమె కింద పడిపోయిందని హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓను సీఎంఓ అధికారులు ఆదేశించారు. దీనిపై విచారణాధికారిగా ఆలయ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ను ఈఓ నియమించారు.12 కేంద్రాల్లో కానిస్టేబుల్స్ మెయిన్స్కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్షల కోసం 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ, టెక్నాలజీ కాలేజీ, మోహన్ కాలేజీ, ఐడియల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, వీఎస్ లక్ష్మీ కాలేజీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్టుతో పాటు ఒరిజినల్ గుర్తింపు పత్రాలు తప్పకుండా తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు 94949 33233 (వాట్సాప్), డయల్ 112, 94407 96501, 94407 96513 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.రేపటి నుంచి 500 క్యూసెక్కుల విడుదలకాకినాడ సిటీ: తూర్పు డెల్టాలోని రైతులు ఖరీఫ్ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా గోదావరి కాకినాడ, సామర్లకోట, బ్యాంక్ కాలువలకు ఆదివారం నుంచి రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అలాగే, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ఏలేరు రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోను, పంపా రిజర్వాయర్ నుంచి ఆగస్టు మొదటి వారంలోను నీటిని విడుదల చేస్తామని వివరించారు.సత్యదేవుని సన్నిధిలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తిఅన్నవరం: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ఫొటో, ప్రసాదాలను ఈఓ వీర్ల సుబ్బారావు అందజేశారు. -
చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు
డిగ్రీ పూర్తి చేశాను. అయినా ఉద్యోగం రాలేదు. అయినా అక్కడితో ఆగిపోకుండా ఎంబీఏ, పీజీ కూడా చేశాను. ప్రయత్నించినా ఉద్యోగం రాలేదు. ఇంతలో సరిగ్గా ఏడాది క్రితం ఎన్నికలు వచ్చాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి నేతలు చెప్పారు. ఆ మాటలు నమ్మా. అయినా ఉద్యోగం రాలేదు. పోనీ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అయినా ఇస్తారని ఎదురు చూశాను. కూటమి అధికారంలోకి వచ్చి అప్పుడే ఏడాదైంది. ఒక్క రూపాయి కూడా భృతి ఇవ్వలేదు. 2014లో కూడా చంద్రబాబు ఇలాగే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి గాలికొదిలేశారు. – బొండాడ సుధాకర్, సర్పవరం, కాకినాడ రూరల్ అబద్ధాలతో బాబు మరో మోసం ఎప్పుడూ చెప్పే అబద్ధాలతో చంద్రబాబు నిరుద్యోగులను మరోసారి మోసం చేశారు. 2014లో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి తూతూ మంత్రంగా ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగం వస్తే కుటుంబాన్ని పోషించుకోవచ్చునని ఎదురు చూస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. ఉద్యోగాలు కల్పించడం లేదు. అలాగని భృతి కూడా ఇవ్వడం లేదు. ఇలా దగా చేయడం అన్యాయం. బాబు అబద్ధాలు నమ్మి యువత మోసపోయింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోని చంద్రబాబును ఇకపై ఎవ్వరూ నమ్మరు. – పెంకే రవితేజ, కన్వీనర్, నిరుద్యోగ యువత జేఏసీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా బాబు వచ్చే.. జాబు పోయే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఉన్న ఉద్యోగాలు ఊడబెరికేస్తూంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అధికారంలోకి రాగానే 20 లక్షల కొత్త ఉద్యోగాలిస్తామని నమ్మించారు. తీరా గద్దెనెక్కాక మద్యం దుకాణాల్లో పని చేసే 12 వేల మంది ఉద్యోగులను తొలగించి, 25 వేల కుటుంబాల పొట్ట కొట్టారు. ప్రజలకు వారి ఇళ్ల వద్దనే నిత్యావసర సరకులు అందజేయడానికి ఏర్పాటు చేసిన రేషన్ వాహనాలను ఎత్తేశారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వేల మంది ఉద్యోగులను ఒక్క కలంపోటుతో తొలగించి, వారి ఉసురు పోసుకున్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలిచింది. నేటి కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగులను తొలగించి నిరుద్యోగ యువతను దగా చేస్తోంది. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, కాకినాడ -
చంద్రబాబు సర్కార్పై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని నేపథ్యంలో జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకులు, శ్రేణులు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తనను కలిసిన మీడియాతో రాజా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను వంచించి, వందకు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చంద్రబాబు, కూటమి నేతలు ఏ ఒక్క హామీ అయినా అమలు చేసి ఉంటే ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మే నెల ముగిసిపోతోందని, ఖరీఫ్ సీజన్ మొదలవుతూండటంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారని అన్నారు. అయినప్పటికీ వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 రైతుకు అందించారన్నారు. చంద్రబాబు గద్దెనెక్కాక రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి సాయంగా జమ చేశారా అని నిలదీశారు. అన్ని వర్గాలకూ చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకూ పార్టీ యావత్తూ ప్రజలు, బాధితులను సమన్వయం చేసుకుంటూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పోస్టర్లను ఒకటి రెండు రోజుల్లో కాకినాడలో ఆవిష్కరిస్తామని రాజా చెప్పారు. ఫ ఒక్క హామీనైనా అమలు చేశారా? ఫ వెన్నుపోటు దినం విజయవంతం చేయాలి ఫ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపు -
అమాత్యులొస్తున్నారు.. మళ్లీ మొదలు పెట్టండి!
‘అయ్యగారొస్తున్నారు మళ్లీ మొదలెట్టండి’ అన్నట్లుగా ఉంది పిఠాపురంలో కూటమి నేతల తీరు. స్థానిక పాదగయ క్షేత్రంలో భక్తులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు దివీస్ సంస్థ గతంలో రెండు ఆర్ఓ ప్లాంట్లు నిర్మించింది. నెల రోజుల క్రితమే ప్రత్యేక పూజలు నిర్వహించి మరీ జిల్లా దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారి ఈవీ సుబ్బారావు, స్థానిక ఈఓ కాట్నం జగన్మోహన శ్రీనివాస్, దివీస్ సిబ్బంది వీటిని ప్రారంభించారు. ప్రస్తుతం, వీటి వద్ద భక్తులు మంచినీరు తాగుతున్నారు. ఇప్పుడు ఇదే ఆర్ఓ ప్లాంటును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆదివారం మళ్లీ ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన నేతల ఆదేశాలకు తలొగ్గే అధికారులు ఇలా చేస్తున్నారని, లేకపోతే ఎప్పుడో ప్రారంభించిన వాటర్ ప్లాంటును మళ్లీ ఇప్పుడు మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడమేమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. – పిఠాపురం -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. చాలా డిమాండ్ ఉందిపన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా...ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లాఅరుదైన రకాలివే.. » రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. » కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. » నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. » ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. » ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. » రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్టి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. » కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. » కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. » మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. » ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. » కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి గురువారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగడంతో నవదంపతులు, వారి బంధుమిత్రులకు ఇతర భక్తులు తోడవడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాయంత్రం 4 గంటల వరకూ రద్దీ కొనసాగింది. సత్యదేవుని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటలకు చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. వెన్నుపోటు దినంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిద్దాం తుని రూరల్: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి వెన్నుపోటు దినంతో కనువిప్పు కలిగిద్దామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. ఎస్.అన్నవరంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వచ్చే నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంపై నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, ప్రజలకు న్యాయం చేసేలా పోరాటం చేద్దామని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా కూటమి పాలన సాగుతోందని విమర్శించారు. ఇటువంటి అరాచకాలను ఎండగట్టేందుకు నాయకులు, కార్యకర్తలు ప్రజలను భాగస్వాముల్ని చేయాలన్నారు. సమావేశంలో నాయకులు లాలం బాబ్జీ, రేలంగి రమణగౌడ్, రాయి మేరీ అవినాష్, చోడ్రాజు రామచంద్రరాజు, సకురు నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, నాగం గంగబాబు, గొర్లి రామచంద్రరావు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. పదోన్నతులకు ఉపాధ్యాయుల నిరీక్షణ రాత్రి 7 దాటినా నిర్వహించని వైనం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కూల్ అసిస్టెంట్లకు గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించడానికి చేపట్టిన కౌన్సెలింగ్ గురువారం రాత్రి ఏడు గంటలు దాటినా ప్రారంభం కాలేదు. దీంతో, ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ కేంద్రం వద్దనే గంటల తరబడి పడిగాపులు పడ్డారు. పదోన్నతుల కౌన్సెలింగ్కు ఉదయం 9 గంటలకే స్థానిక సాలిపేట బాలికల ఉన్నత పాఠశాలకు రావాలని సమాచారం ఇవ్వడంతో అందరూ ఉదయమే అక్కడకు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం ఈ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉండగా ఆప్షన్ల నమోదులో జాప్యం చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 96 మంది జిల్లా పరిషత్, 16 మంది ప్రభుత్వ, ఏడుగురు మున్సిపల్ పాఠశాలలల్లో ఉద్యోగోన్నతి పొందనున్నారు. తీవ్ర ఆలస్యంగా ప్రారంభమైన ఈ కౌన్సెలింగ్ రాత్రి సుమారు 10 గంటల సమయానికి పూర్తయ్యింది. బదిలీలకు 8,836 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు రాయవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా బదిలీల కోసం 8,836 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. కంపల్సరీ దరఖాస్తులతో పాటు, ఇష్టపూర్వకంగా ఉన్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 245, పీఎస్ హెచ్ఎంలు 215, ఎల్పీ హిందీ 41, ఎల్పీ సంస్కృతం 3, ఎల్పీ తెలుగు 93, ఎల్పీ ఉర్దూ 3, పీఈటీలు 42, ఎస్ఏ తెలుగు 524 మంది, ఎస్ఏ ఇంగ్లిష్ 729, ఎస్ఏ హిందీ 396, ఎస్ఏ సంస్కృతం 9, ఎస్ఏ ఉర్దూ 2, ఎస్ఏ బయలాజికల్ సైన్స్ 479, ఎస్ఏ గణితం 873, ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 615, ఎస్ఏ సోషల్ స్టడీస్ 471, ఎస్ఏ ఫిజికల్ డైరెక్టర్ 260, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 10, సెకండరీ గ్రేడ్ టీచర్లు 3,826 మంది ఉన్నారు.