Kakinada
-
పంట కొనే నాథుడే లేడు
ప్రకృతి కన్నెర్రకు, కూటమి ప్రభుత్వ నిర్వాకం తోడవడంతో రబీ రైతులు కుదేలయ్యారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో ఈ సీజన్లో దిగుబడులు బాగున్నాయనుకున్న తరుణంలో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం రైతన్నకు పెను శాపమైంది. ఎక్కడి ధాన్యం అక్కడే రోడ్ల పైన, కళ్లాల్లో ఉండిపోవడంతో అకాల వర్షాలకు తడిసి ముద్దయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఖరీఫ్ సీజన్ ఆసన్నమై సాగుకు సమాయత్తమయ్యే తరుణంలో ఇంకా కళ్లాల్లో కనిపిస్తున్న తడిసిన ధాన్యం చూసి రైతులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తడిసిన ధాన్యంతో రైతులు రోడ్డెక్కి ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం అదనంగా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా జగ్గంపేట, పెద్దాపురం మండలాలు సహా పలు ప్రాంతాల్లో కళ్లాల్లో ఉన్న తడిసిన ధాన్యం వద్ద ఫొటోలకు పోజులిచ్చారే తప్ప అదనంగా ఒక్క గింజ కొంటే ఒట్టని రైతులు మండిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడజగన్ హయాంలో తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోళ్లురబీలో వరి కోతలు ముమ్మరంగా జరిగినప్పుడు ధాన్యాన్ని అక్కడక్కడ కొద్దోగొప్పో కొనుగోలు చేసిన ప్రభుత్వం.. వర్షాలు పడి తడిసి ముద్దయ్యే సరికి చేతులెత్తేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా తేమ శాతంతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేసి ఉంటే రబీ సీజన్ ముగుస్తున్నా రోడ్లపైన, కళ్లాల్లోను ధాన్యం కనిపించేదే కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు.జిల్లాల వారీగా పరిస్థితి ఇదీ... కాకినాడ జిల్లాలో రబీలో 1.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఐదున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో రబీ సీజన్ చివరి దశకు వచ్చేసరికి 3.40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు జిల్లా యంత్రాంగం చెబుతోంది. మిగిలిన ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. తూర్పు గోదావరి జిల్లాలో 2.50 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలనేది లక్ష్యం కాగా 2,63,076 మెట్రిక్ టన్నులతో లక్ష్యాలను అధిగమించామని కొనుగోళ్ళు ఆపేశారు. కోనసీమ జిల్లాలో 5,86,616 మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా, రెండు లక్షల మెట్రిక్టన్నుల కొనుగోలుకు మాత్రమే ప్రభుత్వం అనుమతించింది. ఆరబెట్టుకున్న ధాన్యానికి..మొలకలు గడచిన ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై ఆరబెట్టుకున్న ధాన్యం మొలకలెత్తడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక కొనుగోలు చేసిన కొద్దో గొప్పో ధాన్యం విషయానికి వస్తే, 75 కేజీల బస్తా ధాన్యం రూ.1,725కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప క్షేత్ర స్థాయిలో రూ.1,250 మించి ఎక్కడా కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి ఆరబెట్టుకుంటుండగా కురిసిన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి. కొనడానికి దళారులు కూడా రావడం లేదు. దిక్కుతోచని పరిస్థిథతుల్లో తడిసిన ధాన్యాన్ని అటుకులు ఆడించుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందనే భయమేస్తోంది. – టి.సత్యనారాయణ, రైతు, తిమ్మాపురం, కాకినాడ రూరల్ మండలంతక్కువ రేటుకైనా కొనడం లేదు వర్షం కారణంగా రాశుల్లో ఉన్న దానితో పాటు రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం కూడా తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని కనీసం తక్కువ రేటుకైనా కొనుగోలు చేసేందుకు ఏ కమీషన్ ఏజెంటూ ముందుకు రావడం లేదు. – కె.అప్పారావు, రైతు, అచ్చంపేట, సామర్లకోట మండలం, కాకినాడ జిల్లా -
సినీ పరిశ్రమ వివాదంలోకి నన్ను లాగొద్దు: ద్వారంపూడి
సాక్షి, కాకినాడ జిల్లా: సినీ పరిశ్రమ వివాదంలోకి తనను లాగొద్దంటూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. సినిమా థియేటర్ల బంద్ తో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆరోపణలొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అని తేల్చి చెప్పారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సిని నిర్మాతలు కుట్ర పన్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు.‘‘నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏ మాత్రం ధ్రువీకరించు కోకుండా కొన్ని మీడియా సంస్థలు వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాజకీయాలలో ఉన్నాననే అక్కసుతో ఏదో వివాదంలోకి లాగడం ఎంత వరకు సమాంజసం?’’ అంటూ చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. -
తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సుమారు 12 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన టికెట్ల ద్వారా స్వామివారికి రూ.2,71,118 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. వైభవం.. నారసింహుని కల్యాణం సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహుని ఆలయంలో శనివారం ఆర్జీత సేవగా స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం విష్వక్సేన పూజతో అర్చకులు ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకుడు పెద్దింటి వెంకట శ్రీనివాస్ ఈ కల్యాణం జరిపించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ పర్యవేక్షించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు దేవస్థానం లడ్డూ ప్రసాదం ఇచ్చి, భోజన సౌకర్యం కల్పించింది. మహా జ్యేష్టాభిషేకం ఏర్పాట్లపై సమీక్ష అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనరసింహ స్వామివారి మూలవరులకు వచ్చే నెల 11న జ్యేష్ట నక్షత్రం సందర్భంగా నిర్వహించనున్న మహా జ్యేష్టాభిషేక ఏర్పాట్లపై ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, అర్చకులతో సమీక్షించారు. ఈ మేరకు శనివారం అంతర్వేది దేవస్థానం కార్యాలయంలో అర్చకులతో చర్చించారు. సప్త నదులైన గంగ, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, గోదావరి జలాలతో స్వామి మూలవర్లకు మహా జ్యేష్టాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ అభిషేకంలో పాల్గొనేందుకు టిక్కెట్ రూ.400గా నిర్ణయించామన్నారు. సూపరింటెండెంట్ పి.విజయ సారథి, ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పెద్దింటి వెంకట శ్రీనివాస్, ఎస్బీఎం రమేష్ పాల్గొన్నారు. స్వామిని చూసి.. మది మురిసిమామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. తెల్లవారు జామున అర్చకులు సుప్రభాత సేవ, వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలి హారతిని కనుల పండువలా జరిపించారు. విశేష సంఖ్యలో హాజరైన భక్తులు తొలి హారతిని దర్శించుకున్నారు. పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3.49,554 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. స్వామి వారిని 5,500 మంది స్వామి దర్శించుకోగా, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.93,351 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
ఎక్కడ కలవాలి.. వినతి ఎవరికివ్వాలి..
మున్సిపల్ కార్మికులకు పిఠాపురంలో భంగపాటు పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్కు పిఠాపురంలో శనివారం వింత పరిస్థితి ఎదురైంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు వినతిపత్రం అందజేయడానికి మున్సిపల్ కార్మికులు కాకినాడ నుంచి గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ కల్యాణ్ తాత్కాలిక నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. అయితే, పిఠాపురం వచ్చేసరికి చేబ్రోలులోని ఇంటిని పవన్ కల్యాణ్ ఖాళీ చేసేశారని తెలిసింది. దీంతో, ఎవరిని, ఎక్కడ కలవాలంటూ వారు తర్జనభర్జనలు పడ్డారు. పిఠాపురంలో కూడా పవన్ కల్యాణ్కు అధికారిక కార్యాలయం లేదని తెలియడంతో అవాక్కయ్యారు. అంత కష్టపడి వచ్చి, కనీసం జనసేన ఇన్చార్జికై నా వినతిపత్రం ఇద్దామనుకుంటే ఆయన కూడా అందుబాటులో లేరని తెలిసి తలలు పట్టుకున్నారు. చేసేదేమీ లేక పిఠాపురంలోని జనసేన పార్టీ పట్టణ కార్యాలయంలో స్థానిక నాయకుడికి వినతిపత్రం ఇచ్చి వెనుదిరిగారు. ఏ నియోజకవర్గంలో చూసినా ప్రతి ఎమ్మెల్యేకూ అధికారిక కార్యాలయం ఉంటుంది. అలాంటిది ఉప ముఖ్యమంత్రికి ఆయన ఎన్నికై న నియోజకవర్గం పిఠాపురంలో కార్యాలయం లేకపోవడమేమిటంటూ కార్మికులు అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయం లేకపోతే ప్రజలు తమ సమస్యలపై ఎక్కడ ఎవరిని కలవాలని ప్రశ్నించారు. తమ బాధలు చెప్పుకుని ఆదుకోవాలని అడుగుదామంటే చెప్పుకోవడానికి సరైన నాయకుడు లేక నిరాశతో వెళ్తున్నామని అసహనం వ్యక్తం చేశారు. -
6 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగు
కాకినాడ సిటీ: జిల్లా వ్యాప్తంగా 6 వేల హెక్టార్లలో ఆయిల్పామ్ సాగుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులు తప్పనిసరిగా నీటిగుంతలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. ఐదెకరాల్లోపు సాగు చేసే చిన్న రైతులకు ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటేందుకు తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఆయిల్పామ్ రైతులకు విద్యుత్తు కనెక్షన్లు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. బోర్ల ద్వారా వరి, మల్బరీ సాగు చేసే రైతులు ఆయిల్పామ్ సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. గృహ నిర్మాణంపై దృష్టి పెట్టాలని, లబ్ధిదారులకు ఆప్షన్–3 కింద ఇళ్లు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు నిర్దేశిత నిర్మించకపోతే మెమోలు జారీ చేసి, బ్లాక్లిస్టులో పెడతామని హెచ్చరించారు. అర్హులైన కౌలుదారులందరికీ సీసీఆర్ కార్డులు మంజూరు చేయాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ వర్గాల ప్రజలకు ఉచితంగా సోలార్ రూఫ్టాప్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ నుంచి జేసీ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈఏపీ సెట్కు 95.67 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్ష ఆరో రోజైన శనివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 862 మంది హాజరు కాగా 39 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీ డియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉన్నందున ఇంటర్ బోర్డు లేదా సెంట్రల్ బోర్డు విడుదల చేసిన మార్కుల జాబితాను ఈ నెల 30వ తేదీలోగా ఈఏపీ సెట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని కన్వీనస్ వీవీ సుబ్బారావు సూచించారు. -
పట్టుంచుకోవడం మానేసారు
● వినతి ఇద్దామంటే అపాయింట్మెంటు ఇవ్వని జనసేన నేతలు ● అగమ్యగోచరంగా పట్టు రైతుల పరిస్థితి పిఠాపురం: తమ సమస్యలు పరిష్కరించాలంటూ పట్టు రైతులు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూండగా.. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకోవడం మానేశారు. దీంతో ఎవరి వద్దకు వెళ్లాలో తెలియక పట్టు రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన పట్టు రైతులు ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు గ్రీవెన్సులో వినతిపత్రం ఇస్తే.. లాభసాటిగా లేనప్పుడు వేరే పంట సాగు చేసుకోవచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. దీంతో, ఆందోళనకు గురైన పట్టు రైతులు నాలుగు రోజులుగా సమావేశాలు నిర్వహించుకుని, తమ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. తొలుత జనసేన పిఠాపురం ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్కు సమస్యను వివరించిన తరువాత పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా కలిసేందుకు ప్రయత్నిస్తున్నా మర్రెడ్డి శ్రీనివాస్ అపాయింట్మెంటు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే అందుబాటులో లేరంటూ తప్పించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. చేబ్రోలును సిల్క్ హబ్. సిల్క్ సిటీ చేస్తానని హామీ ఇచ్చిన పవన్ ముందు తమ బాధలు వినిపించడానికి అవకాశం ఇవ్వాలనుకుంటే కనీసం కలవడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తూంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో జనసేన నేతలున్నట్లు అర్థమవుతోందని పట్టు రైతులు విమర్శిస్తున్నారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చాక ప్రతి రోజూ తమకు గండంగానే ఉందని వాపోతున్నారు. రూ.లక్షల పెట్టుబడితో చేపట్టిన పట్టు సాగును ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసి, తమతో ఆటలాడుతున్నారని, ఇక ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని అంటున్నారు. -
కూటమి ప్లాన్.. అట్టర్ఫ్లాప్
● ఉమ్మడి జిల్లాలో నిలిచిపోయిన నిర్మాణాలు ● ప్లాన్లు ఇవ్వడానికి సర్వేయర్ల నిరాకరణ ● పుర ప్రజలకు గుదిబండగా జీఓ–20 సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి సర్కారు అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు గుదిబండగా మారుతున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనే చందంగా సర్కారు నిర్ణయాలు తయారయ్యాయనే విమర్శ వస్తోంది. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా వ్యవస్థల్లో ప్రభుత్వం తెస్తున్న మార్పులతో మొదటికే మోసం వస్తోంది. మూడు నెలల క్రితం సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీమ్ (ఎస్సీఎస్) కోసం విడుదల చేసిన జీఓ–20 నగరాలు, పట్టణాల్లో నిర్మాణాలకు అవరోధంగా మారింది. ఈ జీఓ దెబ్బకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరాల్లో ఎక్కడి ప్లాన్లు అక్కడే చతికిలపడ్డాయి. ఈ జీఓ అమలులోకి వచ్చినప్పటి నుంచి భవన నిర్మాణదారులు లబోదిబోమంటున్నారు. సంపన్నుల నుంచి మధ్య తరగతి వరకూ వారి స్థాయికి తగ్గట్టుగా నిర్మించుకునే ఇళ్లకు ముహూర్తాలు చూసుకుంటారు. అన్నీ చూసుకుని పనులు మొదలు పెట్టాలంటే ముందుగా బిల్డింగ్ ప్లాన్లకు అనుమతి రావాలి. దీనిని ప్రభుత్వం ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో నిర్మాణదారులకు పెద్ద సమస్యగా మార్చేసి, చుక్కలు చూపిస్తోంది. కొత్తగా భవనాలు నిర్మించుకోవాలనే వారికి మున్సిపల్ ప్లాన్లు ఇచ్చేందుకు సర్వేయర్లు ముందుకు రావడం లేదు. గతంలో ఇలా.. పట్టణాలు, నగరాల్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలంటే ముందుగా లైసెన్స్డ్ సర్వేయర్ లేదా ఇంజినీర్ను సంప్రదించి, ప్లాన్ రెడీ చేసుకుంటారు. దరఖాస్తు, ప్లాన్తో పాటు సంబంధిత సొమ్మును కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీకి చెల్లించిన అనంతరం ఆ ఫైల్ ఆన్లైన్లో పట్టణ ప్రణాళికా విభాగానికి చేరుతుంది. న్యాయ, సాంకేతికపరమైన అంశాలతో పాటు నిబంధనలను పరిశీలించిన తర్వాత టౌన్ప్లానింగ్ విభాగం భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే భవనం నిర్మిస్తున్న వారిపై టౌన్ ప్లానింగ్ విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు సర్వేయర్దే బాధ్యత కూటమి సర్కారు కొత్తగా జారీ చేసిన జీఓ–20 ప్రకారం ఈ నిబంధనలన్నీ పక్కన పెట్టారు. ప్లాన్ గీసిన సర్వేయర్ లేదా ఇంజినీర్ పైనే మొత్తం బాధ్యత పెట్టారు. ప్లాన్ వేసిన అనంతరం సర్వేయర్లు బేస్మెంట్, లింటల్, స్లాబ్లు.. ఇలా వివిధ దశల్లో ఫొటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లాన్ ప్రకారం నిర్మాణం జరగకపోతే ఆ విషయాన్ని కూడా ప్లాన్ వేసిన సర్వేయరే అప్లోడ్ చేయాలి. వాస్తవానికి ఈ ప్రక్రియను మున్సిపల్ యంత్రాంగం పర్యవేక్షించాలి. అన్ని అధికారాలూ ఉండే మున్సిపల్ అధికారులకు కాకుండా తమపై ఈ బాధ్యత పెడితే ఎలాగని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాల్లో ఎక్కడైనా ఉల్లంఘనలుంటే ప్లాన్ వేసిన సర్వేయర్ లైసెన్సును ఐదేళ్ల పాటు రద్దు చేస్తారు. భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) ప్రకారం వారిని బాధ్యులను చేస్తారు. ఇదెంతవరకూ సహేతుకమని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ పుణ్యమా అని సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు మూడు నెలలుగా ముందుకు రావడం లేదు. ప్లాన్ వేస్తే ఎక్కడ చిక్కుల్లో పడతామోననే భయంతో వారు ఒకవిధంగా పెన్డౌన్ చేస్తున్నారనే చెప్పవచ్చు. ఒక ప్లాన్ తయారు చేసి, అప్లోడ్ చేసి, అనుమతి లభిస్తే భవన యజమాని నుంచి రూ.ఐదారు వేలు, మరీ ఎక్కువైతే రూ.10 వేలు వస్తాయి. ఈ జీఓ అమలు పుణ్యమా అని చేయని తప్పునకు తామెందుకు బాధ్యత వహించాలని సర్వేయర్లు ప్రశ్నిస్తున్నారు. ఈ జీఓ ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో మూడు నెలలుగా ప్లాన్లు నిలిచిపోయాయి. దీనిపై భవన నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ నగరంజీఓలో నిబంధనలు సడలించాలి జీఓ–20లోని కొన్ని నిబంధనలను మార్పు చేయాల్సి ఉంది. లైసెన్స్ హోల్డర్లకు అనుకూలంగా మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం మా సూచనలను పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కొన్ని సాంకేతిక సమస్యలు సవరించడం ద్వారా ఈ జీఓ మరింత ఫలవంతమవుతుంది. భవన నిర్మాణాల్లో యజమానులు ఉల్లంఘనలకు పాల్పడితే అందుకు లైసెన్స్ సర్వేయర్లను బాధ్యులను చేయడం సరైంది కాదు. ఈ విషయాన్ని మున్సిపల్ మంత్రి నారాయణకు విన్నవించాం. జీఓ అమలులో లైసెన్స్ హోల్డర్ల హక్కులు, బాధ్యతలు సమతుల్యంగా ఉండేలా చూడాలి. – సత్తి రాంబాబు, అధ్యక్షుడు, వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఇది పరిస్థితి కాకినాడ నగరపాలక సంస్థలో సుమారు 100 మంది సర్వేయర్లున్నారు. ప్లాన్ల ద్వారా కార్పొరేషన్కు ప్రతి నెలా తక్కువలో తక్కువ రూ.40 లక్షల ఆదాయం వస్తూంటుంది. గడచిన మూడు నెలలుగా రూ.రెండు మూడు లక్షలు కూడా రావడం లేదు. సుమారు వెయ్యి ప్లాన్లు ఆగిపోయాయని చెబుతున్నారు. సామర్లకోట మున్సిపాలిటీలో నలుగురు లైసెన్స్డ్ సర్వేయర్ల వద్దకు గతంలో నెలకు 10 నుంచి 15 దరఖాస్తులు వచ్చేవి. ఏడాదికి సుమారు 120 ప్లాన్లు అప్లోడ్ అవడంతో రూ.52 లక్షల ఆదాయం వచ్చేది. జీఓ–20 కారణంగా దరఖాస్తుదారులు ముందుకు రావడం లేదు. పెద్దాపురం మున్సిపాలిటీలో నలుగురు సర్వేయర్లున్నారు. ప్లానింగ్ ద్వారా నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. ఇప్పుడు రూ.లక్ష వస్తే గొప్పన్నట్టుగా ఉంది. ప్రస్తుతం ప్లాన్లు ఇవ్వడం లేదు. తుని మున్సిపాలిటీలో 20 మంది లైసెన్స్డ్ సర్వేయర్లు ప్రతి నెలా 60 వరకూ ప్లాన్లు ఇచ్చేవారు. అప్పట్లో నెలకు రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ ఆదాయం వచ్చేది. జీఓ–20 అమలులోకి వచ్చాక ప్లాన్లు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) పరిధిలో సుమారు 250 మంది ప్రైవేట్ సర్వేయర్లు ఉన్నారు. ప్రస్తుతం నెలకు 20 నుంచి 30కి మించి దరఖాస్తులు రావడం లేదు. నిడదవోలు మున్సిపాలిటీలో నలుగురు ప్రైవేటు సర్వేయర్లున్నారు. ఏటా ప్లాన్ల కోసం 10 దరఖాస్తులు వచ్చేవి. జీఓ–20 విడుదలైన తరువాత ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అమలాపురం మున్సిపాలిటీలో 20 మంది ప్రైవేటు సర్వేయర్ల వద్దకు జీఓ–20కి ముందు ప్రతి నెలా 25 నుంచి 35 బిల్డింగ్ ప్లాన్ దరఖాస్తులు వచ్చేవి. ఈ జీఓ వచ్చిన తరువాత సర్వేయర్లు ప్లాన్లు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. మండపేట మున్సిపాలిటీలోని 15 మంది ప్రైవేటు సర్వేయర్లు నెలకు సుమారు 20 ప్లాన్లు ఇస్తూంటారు. మున్సిపాలిటీకి నెలకు రూ.40 వేల ఆదాయం వస్తుంది. జీఓ–20తో నెలకు కేవలం మూడంటే మూడే దరఖాస్తులు వస్తున్నాయి. సర్వేయర్లు ప్లాన్లు తయారు చేయడం ఆపేశారు. -
రత్నగిరి.. భక్తజన సంద్రం●
● సత్యదేవుని దర్శించిన 60 వేల మంది ● 5 వేల వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయంఅన్నవరం: ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు వివాహాల సందడితో రత్నగిరి శనివారం భక్తజనసాగరాన్ని తలపించింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట పట్టింది. భక్తుల రద్దీ తట్టుకోలేక మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అంతరాలయ దర్శనం రద్దు చేశారు. మొత్తం 60 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. ఐదు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్న ప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా అనివేటి మండపం వద్దకు తీసుకువచ్చి పల్లకీలో వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ప్రాకార సేవ ప్రారంభించారు. భక్తులకు ఇక్కట్లు భక్తులు రూ.300 వ్రతాల నుంచి రూ.2 వేల వ్రతాల వరకూ గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. దీంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.1,500 వ్రతాలాచరించే భక్తులను అనివేటి మండపం లోపలకు అనుమతించకపోవడంతో గుమ్మం వద్దనే సుమారు గంటసేపు నిలబడాల్సి వచ్చింది. దేవస్థానంలో వైఫై పని చేయకపోవడంతో ఫోన్పే, పేటీఎం వంటి డిజిటల్ యాప్స్, క్రెడిట్ కార్డుల ద్వారా వివిధ సేవా టికెట్లు కొనుగోలు చేసే భక్తులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సెల్ఫోన్ నెట్వర్క్లు కూడా పని చేయకపోవడంతో నగదుతోనే లావాదేవీలు నిర్వహించారు. వ్రతాల టిక్కెట్ల వద్ద తీవ్ర రద్దీ ఏర్పడటంతో ఇదే అదనుగా కొంతమంది ముందుగా వ్రతాల టికెట్లు కొనుగోలు చేసి, బ్లాక్లో అధిక ధరలకు విక్రయించారు. అలా విక్రయిస్తున్న వ్యక్తిని ఓ హోంగార్డు పట్టుకుని, మందలించి వదిలేశారు. అప్పటికే అతడు సుమారు 20 వరకూ టికెట్లు విక్రయించాడు. కౌంటర్లోని సిబ్బంది ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని ఆరోపించారు. పశ్చిమ రాజగోపురం వద్ద తగినంత సెక్యూరిటీ లేకపోవడంతో పలువురు భక్తులు ఇష్టానుసారం తమ వాహనాలను నిలిపివేశారు. దీంతో ట్రాఫిక్కు కొంతసేపు అంతరాయం కలిగింది. గతంలో తీవ్ర రద్దీ ఉన్నప్పుడు ఈఓ, దిగువ స్థాయి అధికారులు ఆలయం వద్దనే ఉండేవారు. దీంతో సిబ్బంది కూడా చురుకుగా పని చేసేవారు. తప్పు చేయడానికి భయపడేవారు. ఇప్పుడు ఎంత రద్దీ ఉన్నా అధికారులు ఆఫీసులకే పరిమితమవుతేండటంతో సరైన నియంత్రణ లేక భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
థియేటర్లు మూసివేత.. చంద్రబాబు సర్కార్పై చెల్లుబోయిన వేణు ఫైర్
సాక్షి, తూర్పుగోదావరి: థియేటర్లు మూసివేత విషయంపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వినోదం పేరిట పేదవారికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎగ్జిబిటర్ల స్వేచ్ఛ హరించే ప్రయత్నం చేయకూడదు. ప్రభుత్వం సమస్యను సరిదిద్ద లేక నెపాన్ని ఎదుటివారిపై నెడుతుంది. అసలు సినిమా వ్యక్తులు ప్రభుత్వం వద్దకు ఎందుకు వెళ్లాలంటూ గతంలో పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు కదా’’ అంటూ వేణు గుర్తు చేశారు.‘‘ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలకు జవాబు దారీగా ఉండాలి. కూటమి నేతలు అధికారంలోకి రావడానికి అనేక అబద్ధాలు వండి వార్చారు. అబద్దాన్ని ప్రజలకు చేరవేయడానికి చాలా ప్రయాసపడ్డారు. కోవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయినా, ప్రజలను ఆదుకోవడానికి మాజీ సీఎం జగన్ ఎక్కడ రాజీ పడలేదు. ప్రతి పక్షంలో ఉండగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపి నిత్యం ఒక అబద్ధాన్ని వండివార్చేవారు. అప్పట్లో రాష్ట్రం అప్పులపాలు అయిపోతుందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అడ్డు అదుపు లేకుండా అప్పులు చేస్తున్నారు. అప్పులను కప్పి పుచ్చటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు’’ అంటూ వేణు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘తిరుమల లడ్డూపై చంద్రబాబు అడ్డగోలుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి ఇప్పటివరకు అమలు చేయలేదు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై గతంలో తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు మీ కేంద్రమంత్రే దానిని అమలు చేస్తామని చెబుతున్నారు. ఉచిత ఇసుక స్కీమ్ కాదు.. స్కామ్. గోదావరిలో ఇసుక అక్రమ దారి అంటూ ఈనాడు పేపర్ లోనే ఐటం వచ్చింది. గోదావరిలో పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ జరుగుతుంది. 80 డ్రెడ్జర్లతో పనిచేస్తుంటే అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు. దీనికి అధికారులు బాధ్యత వహించాలి. అధికారులు పనిచేస్తున్నట్టా లేనట్టా?బోట్స్మెన్ సొసైటీలకు చెల్లించాల్సిన డబ్బులు యంత్రాలకు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకు మూడు వేల కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఈ మొత్తం అధికార పార్టీ నేతల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో మద్యం వినియోగం తగ్గింది. ఆదాయం పెరిగింది. ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఆదాయం తగ్గింది. తప్పు ఎక్కడ జరుగుతుంది?. కేవలం ఏడాది కాలంలో లక్షా 59 వేల కోట్లు కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది. ఇసుక, మద్యంపై ఆరోపణలు చేస్తున్న ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాలి. రాజమండ్రి పరిధిలో గోదావరిలో 80 డ్రెడ్జర్లతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటే మీ నాయకుల ప్రమేయం లేదా?. గోదావరి లో 80 డ్రెడ్జర్లతో జరుగుతున్న తవ్వకాలు వెనుక ఎవరున్నారు? స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు ఇక్కడున్నా, విదేశాల్లో ఉన్నా.. ఇసుక వ్యవహారంపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతాం’’ అని వేణుగోపాలకృష్ణ హెచ్చరించారు. -
నా బిడ్డలను చూస్తాననుకోలేదు
అంబాజీపేట(తూర్పు గోదావరి): కుటుంబ అవసరాల నిమిత్తం జీవనోపాధికి ఇతర దేశానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి వారు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నరకం అనుభవించింది. అక్కడ పడుతున్న ఇబ్బందులను రిస్క్ చేసి తన భర్తకు వీడియో, వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందించింది. దాంతో తన భర్త ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సహకారంతో స్వగ్రామానికి క్షేమంగా చేరుకుంది ఆ మహిళ. వివరాల్లోకి వెళితే... అంబాజీపేట మండలం తొండవరం సత్యవతికాలనీకి చెందిన ఉందుర్తి నాగదుర్గ ఈ గత ఏడాది ఆగస్టు 29న తన సమీప బంధువుల సహకారంతో ఖతార్ బయలుదేరింది. 31న ఖతార్ చేరుకుని అక్కడ ఉన్న ఓ మేడం వద్ద వంటపనికి చేరింది. ఆ యజమానురాలి వద్ద నాలుగు నెలల పాటు సజావుగా గడిచింది. అనంతరం ఆమె కుమార్తె వచ్చి తన పని నచ్చడంతో ఖతార్లో ఓ సిటీలో ఉంటున్న తన ఇంటికి తీసుకువెళ్లింది. రెండు నెలలు బాగానే చూసుకున్నారు. అనంతరం తిండి పెట్టకుండా, భర్త ప్రశాంత్, పిల్లలతో, బంధువులతో ఫోన్ మాట్లాడకుండా చిత్రహింసలు పెట్టారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ను, పాస్పోర్టును తీసేకుని హింసించారు. అక్కడ పెట్టే చిత్రహింసలు భరించలేక తన భర్త ప్రశాంత్ వాట్సాప్కు వీడియో, వాయిస్ మెసేజ్లను పంపించింది. వారి వద్ద ఉన్న సెల్ఫోన్ను రిస్క్ చేసి తీసుకుని, మెసేజ్ పెట్టింది. స్థానిక సర్పంచ్ పేరాబత్తుల దొరబాబు, ఉప సర్పంచ్ దిగుమర్తి చిట్టిబాబులకు ఆమె భర్త విషయం తెలియపర్చారు. ఖతార్లో ఉన్న ఓ బాబా ద్వారా పోలీస్ స్టేషన్కు వెళ్లగా వారు ఇండియన్ ఎంబాసీని సంప్రదించారు. అక్కడ నుంచి వారు ఇండియాకు పంపారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు విషయాన్ని తెలియపరచి వారి సహకారంతో ఈ నెల 22 అర్ధరాత్రి స్వగ్రామానికి ఆమె చేరుకుంది. అందరికీ కృతజ్ఞతలు ఖతార్ వెళ్లి సుమారు 9 నెలలు కావస్తోంది. వెళ్లిన తరువాత ఐదు నెలలు నా బిడ్డలతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సంతృప్తి కలిగేది. వారి యోగ క్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే దానిని. అనంతరం ఓ ఇంటిలో కుక్గా చేరడంతో ఫోన్, పాస్పోర్టు తీసేసుకుని నన్ను చిత్రహింసలు పెట్టారు. ఇండియాకు వెళ్లాలంటే రూ.1.80 లక్షలు కట్టాలని యజమానురాలు బెదిరించేది. అసలు నా బిడ్డలను చూడగలనా, ఎలా ఇంటికి వెళ్లాలో అర్థంకాని పరిస్థితుల్లో కాలం వెళ్లదీశాను. స్వగ్రామం వచ్చేందుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు. – నాగదుర్గ -
ఐఏఎస్, ఐపీఎస్లుగా రైతు బిడ్డలు
సాక్షి, చెన్నై: 2004లో సునామీ సృష్టించిన విలయతాండవం సమయంలో కడలూరులో ఐఏఎస్ అధికారిగా గగన్దీప్సింగ్ బేడీ పనితీరును చిన్న పిల్లలుగా ఉన్న ఇద్దరు సిస్టర్స్ కనులార చూశారు. సునామీ విలయం నుంచి బయటపడిన జీడి పప్పు రైతు కుటుంబంలోని ఈ ఇద్దరు తాము సైతం ఐఏఎస్ కావాలన్న కలతో ముందుకు సాగారు. ఇందులో ఒకరు ఐఏఎస్గా, మరొకరు ఐపీఎస్గా విధుల్లో చేరి రాణిస్తున్నారు. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపంలోని మరుంగూర్ గ్రామానికి చెందిన రామనాథన్, ఇలవరసి దంపతుల కుమార్తెలు సుస్మిత, ఐశ్వర్య. ఈ ఇద్దరి మధ్య ఏడాదిన్నర వయస్సు తేడా. 2004లో జరిగిన సునామీ తాండవం సమయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న గగన్దీప్సింగ్ బేడి అప్పట్లో కడలూరులో వీరోచితంగా సేవలు అందించడంలో శ్రమించారు. దీనిని చిన్న పిల్లలుగా ఉన్న సుస్మిత, ఐశ్వర్య చూసి, తాము సైతం ఐఏఎస్లు కావాలన్న లక్ష్యంతో చదివారు. అన్నావర్సిటీలో పట్టభద్రులయ్యారు. కల సాకారం యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమయ్యారు. తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం వీరిలో సుస్మిత ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ ఐపీఎస్గా కాకినాడలో ఏఎస్పీగా వ్యవహరిస్తున్నారు. ఐశ్వర్య తమిళనాడులోని తూత్తుకుడి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఏదో ఒక రోజున ఒక జిల్లాకు ఎస్పీగా ఒకరు, ఒక జిల్లాకు కలెక్టర్గా మరొకరు బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా ఒకే ఇంటికి చెందిన ఈ ఇద్దరు సిస్టర్స్ విధుల్లో రాణిస్తున్నారు. తన కుమార్తెల గురించి రామనాథన్ మాట్లాడుతూ తన పిల్లలు ఇద్దరు ఐపీఎస్, ఐఏఎస్లుగా ఉండడంతో ఆనందం వ్యక్తం చేశారు. కలెక్టర్ గగన్ దీప్ సింగ్బేడి పనితీరును తన ఇద్దరు పిల్లలు ఆదర్శంగా తీసుకున్నారని పేర్కొన్నారు. సివిల్ సర్వీసులో రాణించి వారి కలను సాకారం చేసుకున్నారని, ఇద్దరు గెలిచారని ఆనందం వ్యక్తం చేశారు. -
ఫ జై ఆంజనేయం.. జామకాయల హారం
మహాకాయుడిగా రూపుదాల్చి.. సాగర తరణానికి వాయువేగంతో.. ఒక్కుదుటన బయలుదేరిన ఆంజనేయ స్వామి వారిపై.. మహేంద్రగిరిన ఉన్న చెట్ల పూలన్నీ జలజలా రాలాయట. పర్వత సదృశమైన ఆయన దేహం రంగురంగుల పూల సోయగాలతో మెరిసిపోయిందట. ఇదంతా శ్రీరామాయణం సుందర కాండలో మహర్షి వాల్మీకి వర్ణన. ఆ స్థాయిలో కాకపోయినా.. రాజమహేంద్రవరం ఐదు బళ్ల మార్కెట్ సెంటర్లో వేంచేసియున్న ప్రసన్నాంజనేయస్వామి వారు శుక్రవారం నవ్యశోభతో దర్శనమిచ్చారు. ఆలయ 31వ వార్షికోత్సవం.. హనుమజ్జయంతి సందర్భంగా స్వామి వారిని శుక్రవారం జామకాయలతో విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారికి ఆకు పూజలు, సిందూర పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) -
సేవ చేయనీయవా స్వామీ..
అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో.. ఏం చేయాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. సేవ చేయడానికి వచ్చిన తమను ఏఈఓ కె.కొండలరావు దూషించారంటూ మంచిర్యాల భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో కాషాయ రంగు చీరలు ధరించిన మహిళా సేవకులు.. భక్తులకు కనిపిస్తూంటారు. వీరందరూ తెలంగాణలోని వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్న స్వచ్ఛంద సేవకులు. వీరందరూ దేవస్థానంలో తమకు నిర్దేశించిన సేవలు ఉచితంగా అందిస్తూంటారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధిలో సేవ చేద్దామనే ఆశతో వస్తున్నా.. రత్నగిరిపై ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన చెందుతున్నారు. సేవా విభాగం లేక.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి రోజూ వేలాదిగా మహిళా సేవకులు వివిధ చోట్ల సేవలందిస్తూంటారు. అలాగే, పరకామణి అంటే హుండీ లెక్కింపుతో పాటు ఇతర సేవలను పురుషులు అందిస్తూంటారు. భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీలో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. దాని ఫోన్ నంబర్ టీటీడీ వెబ్సైట్లో ఉంటుంది. సేవకు వెళ్లాలనుకునేవారు ఆ నంబర్కు ఫోన్ చేస్తే వారు పూర్తి వివరాలు చెబుతారు. దాని ప్రకారం ఆ సేవా కార్యకర్తలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు సేవకు రావాలి, ఎవరిని కలవాలనే వివరాలు తెలియజేస్తారు. దాని ప్రకారం భక్తులు అక్కడకు వెళ్లి సేవ చేయవచ్చు. ఇటువంటి ఏర్పాటు అన్నవరం దేవస్థానంలో లేదు. గతంలో సేవ చేసిన వారైతే దేవస్థానంలో పరిచయం ఉన్నవారికి ఫోన్ చేసి వస్తున్నారు. కొత్తవారైతే మధ్యవర్తులను ఆశ్రయించి, మోసపోవాల్సిన పరిస్థితి. మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవా కార్యకర్తలు ఇదేవిధంగా మోసపోయారు. అన్నవరం దేవస్థానంలో సేవ చేసేందుకు మధ్యవర్తిని ఆశ్రయించగా, అతడు మరో మహిళకు ఈ పని అప్పగించాడు. ఆమె అన్నవరం దేవస్థానానికి పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసింది. తీరా ఇక్కడకు వస్తే సేవ చేయడానికి ఖాళీ లేదని, వెళ్లిపోవాలని ఏఈఓ చిరాకుపడ్డారని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ.. ఆ తరువాత రూ.300 చొప్పున వెనక్కి ఇచ్చి, మిగిలిన రూ.200 ఉంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటువంటి అవస్థలు భక్తులకు ఎదురవకుండా ఉండాలంటే అన్నవరం దేవస్థానంలో కూడా టీటీడీ తరహాలో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనంతరం, సేవ చేయాలనుకునేవారు ఆ విభాగాన్ని సంప్రదించేలా ఫోన్ నంబర్ను దేవస్థానం వెబ్సైట్లో పొందుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ·˘ Æý‡™èl²WÇOò³ çÜÓ^èle…§ýl õÜÐ]lMýS$ÌSMýS$ Cº¾…§ýl$Ë$ ఫ సేవకు దేవస్థానంలో ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి ·˘ {ç³™ólÅMýS Ñ¿êVýS… HÆ>µr$ చేయాలని భక్తుల డిమాండ్ మాకూ ఇలాగే జరిగింది సత్యదేవుని దీక్ష, ఉత్సవాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూంటాను. మా ప్రాంతం నుంచి సేవా కార్యకర్తలను అన్నవరం దేవస్థానానికి తీసుకువెళ్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దాంతో వెనక్కి వచ్చేశాం. దీనికోసం దేవస్థానంలో ఒక విభాగం ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవ చేసే భక్తులకు సమయం నిర్దేశిస్తే మేలు. – కృష్ణ, సేవా కార్యకర్త -
పవన్ కల్యాణ్ స్పందించాలి
వేలాది మందికి మేలు చేసేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటికీ రేషన్ పంపిణీ విధానం ప్రారంభించారు. దీనిని దెబ్బ తీసేలా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించాలి. మాకు, మా కుటుంబాలకు న్యాయం చేయడానికి ఆయన ముందుకు రాక పోవడం చాలా దారుణం. ఆయన నియోజకవర్గం పిఠాపురం నుంచే పోరాటం ప్రారంభిస్తున్నాం. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకునేలా ఆయన చర్యలు తీసుకోవాలి. – సీహెచ్ సునీల్, ఎండీయూ ఆపరేటర్, పిఠాపురం మా జీవితాలను నాశనం చెయ్యొద్దు ఏ దారీ లేని మాకు గత ప్రభుత్వంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవనోపాధి కల్పించారు. వేలాది కుటుంబాలకు దారి చూపించారు. ప్రజాసేవగా భావించి మేము ఈ వృత్తి నిర్వహిస్తున్నాం. అలాంటి మాకు అన్యాయం చేయడం దారుణం. మా జీవితాలను నాశనం చేయకుండా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే స్పందించాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. న్యాయం చేయకపోతే ప్రాణాలు వదలడం తప్ప వేరే దారి లేదు. – ఎన్.గంగాధరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కరప మా పొట్ట కొట్టొద్దు నిరుద్యోగులుగా ఉన్న మేము మా సొంత గ్రామాల్లో మా కాళ్లపై మేము బతికేలా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దారి చూపించారు. ఆయన పెట్టిన భిక్షతో వేల కుటుంబాలు బతుకుతున్నాయి. వీలు కుదిరితే మరి కొంత మందికి బతుకుతెరువు చూపించాలి తప్ప ఉన్న ఉపాధి తీసేయకూడదు. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. చావోరేవో తేల్చుకుంటాం. – సిద్ధాంతపు రవికుమార్, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, కాకినాడ జిల్లా -
ఆర్టీసీ కాంప్లెక్స్లో తనిఖీలు
కాకినాడ సిటీ: స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్లో జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) ఎం.శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. క్యాంటీన్, కార్గో సెక్షన్, స్టాల్స్, టాయిలెట్లను పరిశీలించారు. క్యాంటీన్లో అల్పాహారం భుజిస్తున్న ప్రయాణికులను నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు. కార్గో సెక్షన్లో వినియోగదారుల ఇబ్బందులపై ఆరా తీశారు. అన్ని స్టాల్స్లో ఎమ్మార్పీకే విక్రయిస్తున్నట్లు బోర్డు ఉంచాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని దుకాణ యాజమానులకు సూచించారు. ప్రయాణికులకు అందించే సేవల మెరుగుదలపై బస్ స్టేషన్ మేనేజర్ ఎంయూవీ మనోహర్కు సూచనలు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ టి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు తప్పని బదిలీలు రాయవరం: బదిలీ దరఖాస్తుల ప్రక్రియలో ఉపాధ్యాయులు తలమునకలయ్యారు. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, స్కూల్ అసిస్టెంట్ల ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నెల 27వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు ఉంది. అయితే బదిలీ దరఖాస్తులు ఆన్లైన్లో సబ్మిషన్ చేసే సమయంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆన్లైన్ బదిలీ దరఖాస్తుల సబ్మిషన్ సమయంలో ఓటీపీ రావడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం సర్వర్ మొరాయించగా, మధ్యాహ్నం నుంచి సర్వర్ పనిచేయడంతో దరఖాస్తులు చేసుకున్నారు. పీడీలు దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్లో ఓపెన్ కాగా, పీఈటీలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఓపెన్ కాలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 64 మండలాల పరిధిలో 3,696 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి స్థానచలనం ఉంది. ఈ జాబితాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీ, తత్సమాన క్యాడర్ ఉపాధ్యాయులున్నారు. వీరిలో రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ అయ్యే ఉపాధ్యాయులు, దివ్యాంగ ఉపాధ్యాయులకు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేపట్టరు. ఖాళీలపై రావాల్సిన స్పష్టత క్యాడర్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ దరఖాస్తులు సమర్పించగా, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24 అర్ధరాత్రితో గడువు ముగియనుంది. దరఖాస్తులను సమర్పించిన తర్వాత బదిలీ కోరుకునే ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ప్రాధాన్యతా క్రమంలో వారు బదిలీ కోరుకునే స్థానాలను ఆన్లైన్లో ఎంపిక చేసుకుంటారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్ఎంల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలను ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలను 25న స్వీకరిస్తారు. 27న ఫైనల్ సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఖాళీలను తెలియజేస్తారు. 28న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ కోరుకునే ప్రాంతానికి ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటారు. ఈ నెల 30 గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి.ఆన్లైన్లో బదిలీ దరఖాస్తు చేసుకుంటున్న ఉపాధ్యాయులు -
జీవితాలు మారడమంటే.. ఇదా!
‘నేను అధికారంలోకి వస్తే మీ జీవితాలు మారిపోతాయి’ అని పవన్ కల్యాణ్ చెప్తే నమ్మామని.. జీవితాలు మారడమంటే మాకున్న ఉపాధిని ఊడగొట్టడమా అని ఎండీయూ ఆపరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న కూటమి సర్కారు ఇప్పుడు తమను నట్టేట ముంచుతున్నా.. పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవితాలు మారడమంటే ఇలా తలకిందులు చేయడమా అని ప్రశ్నిస్తున్నారు. పిఠాపురం: ఇంటింటికీ రేషన్ సరకులు పంపిణీ చేస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వ్యవస్థను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,760 వాహనాల సేవలు నిలిచిపోనున్నాయి. దీనిని నమ్ముకుని బతుకుతున్న దాదాపు 18 వేల కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. జిల్లావ్యాప్తంగా కూడా 428 రేషన్ వాహనాలున్నాయి. ఒక్కో వాహనానికి డ్రైవర్, ఆపరేటర్, హెల్పర్ పోస్టులను గత ప్రభుత్వం మంజూరు చేసింది. తద్వారా జిల్లాలో ఎండీయూ వాహనాల ద్వారా 1,284 మంది ఉపాధి పొందుతున్నారు. సర్కారు నిర్ణయంతో వీరి కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. రేషన్ వాహనాల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా ఎండీయూ ఆపరేటర్లు పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రేషన్ వాహనాలు నిలిపివేయాలనే నిర్ణయం బడుగు, బలహీన వర్గాల మీద కూటమి ప్రభుత్వం చేపట్టిన కక్ష సాధింపు చర్యేనని పేర్కొంటున్నారు. లక్షల మందికి నేరుగా రేషన్ అందించే ఈ వ్యవస్థను రద్దు చేయడం పేదలను ఇబ్బంది పెట్టడమేనని అంటున్నారు. వైఎస్సార్ సీపీపై ఉన్న కోపంతో ఈ మంచి కార్యక్రమాన్ని రద్దు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టిస్తామని, పేదలకు ఉపాధి కల్పిస్తామని మాయ మాటలు చెప్పి, ఓట్లేయించుకుని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులపై కక్ష కట్టినట్లు.. ఉన్న ఉపాధి, ఉద్యోగాలు రద్దు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాకపోతే.. రేషన్ వాహనదారులే బాధితులకు అన్నపానీయాలు అందించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇటువంటి సేవలను రద్దు చేయడమేమిటని, ప్రభుత్వం పునరాలోచించి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ బతుకు తల్లకిందులు చేస్తారా! ఫ నట్టేట ముంచుతారా! ఫ పవన్.. మా పొట్ట కొట్టొద్దు ఫ ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన -
రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివాని దర్శించుకున్నారు. రెండు వేల వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన అనంతరం, భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి, జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఏకాదశి పర్వదినం కావడంతో సత్యదేవునికి ఉదయం 7 గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం ఉదయం 10 గంటలకు తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఏకాదశి సందర్భంగా సత్యదేవునికి ప్రత్యేక పూజలు స్వామిని దర్శించిన 40 వేల మంది రూ.40 లక్షల ఆదాయం -
డబ్బు తీసుకొని టీమ్ తయారు
ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఆరోపణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రతిభ ఉన్న క్రీడాకారులను తయారు చేయాల్సిన కోచ్లు, అసోసియేషన్ సభ్యులు డబ్బు తీసుకొని క్రికెట్ టీమ్ను తయారు చేస్తున్నారని ది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. కాకినాడలోని ఒక హోటల్లో శుక్రవారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ జోన్ల నుంచి అధ్యక్షులు, సెక్రటరీలు హాజరయ్యారు. శివకుమార్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా ఏ ఫార్మెట్లోనూ టోర్నమెంట్లు నిర్వహించలేదని, క్రీడాకారులు వారి ప్రాక్టీస్ కోసం ఇతర టోర్నమెంట్లలో పాల్గొంటే వారిని పక్కన పెట్టడం దారుణమన్నారు. ప్రతిభను పక్కన పెట్టి ఎవరైతే డబ్బు ఇస్తున్నారో వారిని జట్టులోకి తీసుకున్నారన్నారు. అసోసియేషన్ కాలపరిమితి ఆగస్టుతో ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల తేదీని ఖరారు చేయనున్నట్లు చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్లో నియంతృత్వ ధోరణి కారణంగా క్రికెట్ క్రీడాకారులు భవిష్యత్ కుంటుపడుతోందని, ఈ విషయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జోక్యం చేసుకొని అసోసియేషన్లో జరిగిన అవినీతిపై విచారణ నిర్వహించి దోషులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు తీర్మానించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 40 సభ్యులు హాజరై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అసోసియేషన్ మాజీ సెక్రటరీ కె.బాపిరాజు, మాజీ ఉపాధ్యక్షుడు ఏఎస్ స్వరూప్, రాజమహేంద్రవరం ఇన్చార్జి విజయ్కుమార్, కోనసీమ ఇన్చార్జి ఏవీటీ వర్మ, పెద్దాపురం ఇన్చార్జి ఎ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో తిరుమల విద్యార్థుల సంచలనం
రాజమహేంద్రవరం రూరల్: జేఈఈ మెయిన్, బి–ఆర్క్, బి–ప్లాన్ ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు ప్రకటనలో తెలిపారు. బి.ఆర్క్ జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగంలో కె.యశ్వంత్సాత్విక్ ఆల్ఇండియా 1వ ర్యాంకు, వి.రామసాయివరుణ్రెడ్డి 4వ ర్యాంకు సాధించారని తెలిపారు. బి.ప్లానింగ్ విభాగంలో వివిధ కేటగిరీలలో జాతీయస్థాయిలో కె.యశ్వంత్సాత్విక్ 3వ ర్యాంకు, వి.రామసాయి వరుణ్రెడ్డి 3వ ర్యాంకు, టి.షణ్ముఖ శ్రీనివాస్ 24వ ర్యాంకు, టి.జశ్వంత్దొర 63వ ర్యాంకు, వై.సాయితేజ, టి.పవన్శ్రీకుమార్చౌదరి 78వ ర్యాంకు, సుంకర జోషిచంద్ 99వ ర్యాంకు సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
కాట్రేనికోన: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల కేంద్రం సుబ్బారాయుడు గుడి వద్ద శుక్రవారం ఉదయం పల్లం నుంచి కాకినాడ వెళ్లే ఆర్టీసీ బస్సు మోటారు సైకిల్ను ఢీ కొట్టడంతో సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు (49) మృతి చెందారు. కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపిన సమాచారం ప్రకారం అమలాపురం డిపో ఆర్టీసీ బస్సు పల్లం నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ను ఢీ కొట్టింది. నరసింహరాజును స్థానికులు 108 అంబులెన్సులో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయినవిల్లి మండలం పోతుకుర్రుకు చెందిన సాగిరాజు శ్రీనివాస నరసింహరాజు కోనపాకపేట ఆనంద హేచరీలో పని చేస్తున్నాడు. అక్కడకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలు యూకేలో ఉన్నారు. యూకేలో కుమార్తె ఉద్యోగం చేస్తుండగా, కుమారుడు ఎంఎస్ చదువుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాట్రేనికోన ఎస్సై అవినాష్ తెలిపారు. చికిత్స పొందుతూ...కె.గంగవరం: మండలంలోని అముజూరుకి చెందిన పాలపర్తి శేషగిరిరావు(60) కాకినాడలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. శేషగిరిరావు రామచంద్రపురం నుంచి స్వగ్రామం అముజూరు వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో స్థానికులు అతడిని పామర్రు పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కె.గంగవరం ఎస్సై జానీ బాషా శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
గోపాయిలంక గడ్డి రేవులో మృతదేహం
అల్లవరం: మండలంలోని గోడితిప్ప పంచాయతీ పరిధిలో గోపాయిలంక గడ్డిరేవు వద్ద శుక్రవారం అంబాజీపేట మండలం వాకలగరువు గ్రామానికి చెందిన సుంకర దుర్గాప్రసాద్ (44) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నాలుగు రోజులుగా గడ్డి రేవులో మోటార్ సైకిల్ను పార్క్ చేసి ఉంచడంతో స్థానికులకు అనుమానం వచ్చి అల్లవరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో పోలీసులు మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం గడ్డి రేవులో దుర్గాప్రసాద్ మృతదేహం తేలియాడటంతో స్థానికులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం వాకలగరువులో వాటర్ ప్లాంట్ నిర్వహించే దుర్గాప్రసాద్ లైన్కి వెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. గోపాయిలంక గడ్డిరేవులో బహిర్భూమికి వెళ్లిన దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. దుళ్ల శివార్లలో అగ్ని ప్రమాదం – రూ.5 లక్షల మేర ఆస్తినష్టం కడియం: Ð]l$…yýl-ÌS…ÌZ° §ýl$âýæÏ {V>Ð]l$ ÕÐé-Æý‡ÏÌZ° çÜ™èlÅ-ÝëÆ‡$$ C…yýl[ïÜt-‹ÜÌZ VýS$Æý‡$-ÐéÆý‡… Æ>{† AW² {ç³Ð]l*§ýl… çÜ…¿ýæ-Ñ…-_…-¨. D {ç³Ð]l*-§ýl…ÌZ Möº¾Ç ™éâýæÏ E™èlµ-†¢MìS çÜ…º…-«¨…-_¯]l OòœºÆŠ‡ Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ, ѧýl$Å™Œæ Eç³-MýS-Æý‡-×êË$ ç³NÇ¢V> §ýlVýS®-OÐðl$-´ùĶæ*Ƈ$$. {ç³Ð]l*§ýl… M>Æý‡-׿…V> çÜ$Ð]l*Æý‡$ Æý‡*.5ÌS-„ýSÌS Ðól$Æý‡ ¯]lçÙt… HÆý‡µ-yìl…§ýl° ¸ëÅMýStÈ A«¨-¯ól™èl MýS–çÙ~-ÝëÆ‡$$ ™ðlÍ´ëÆý‡$. M>Ç-Ã-MýS$Ë$ òÜÌSÐ]l# ò³rtyýl…™ø Mö¨ª-Æøk-Ë$V> E™èlµ†¢ °Í-í³Ðól-Ô>-Ð]l$-¯é²Æý‡$. ¯ðlÌê-QÆý‡$MýS$ E™èlµ†¢° {´ëÆý‡…-À…-^ól…-§ýl$MýS$ HÆ>µr$Ï ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. A…§ýl$ÌZ ¿êVýS…V> Æ> Ððl$sîæÇ-Ķæ$-ÌŒæ¯]l$ ¡çÜ$-MýS$Ð]l_a °ÌSÓ ^ólÔ>Ð]l$° ÑÐ]lÇ…^éÆý‡$. Æ> Ððl$sîæ-Ç-Ķæ$ÌŒæ M>Ð]l-yýl…™ø §é°MìS C¯ŒS{çÜ*-ె¯ŒSÞ MýS*yé Ìôæ§ýl-¯é²Æý‡$. AƇ$$™ól {ç³Ð]l*§ýl… H Ñ«§ýl…V> çÜ…¿ýæÑ…_…§ø AÆý‡¦… M>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. ¸ëÅMýStÈ ¯]l$…_ Ð]l$…rË$ Æ>Ð]lyýl… VýS$Ç¢…-_¯]l Ý린-MýS$Ë$ çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø Ð]l_a ^èl*õÜ¢ OòœºÆŠ‡ Ððl$sîæ-ÇĶæ$-ÌŒæ-™ø-´ër$, GÌS-[MìStMýSÌŒæ ç³Ç-MýSÆ>Ë$, ¸ëÅMýStÈ Æó‡MýS$Ë$ OòÜ™èl… Ð]l$…rÌZÏ _MýS$P-MýS$¯é²Ä¶æ$° ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…yýl-õ³-rMýS$ ^ðl…¨¯]l AW-²Ð]l*-ç³MýS MóS…{§é°MìS çÜÐ]l*-^éÆý‡… CÐ]lÓyýl…™ø ÐéÆö_a ç³MýSP¯ól E¯]l² C™èlÆý‡ Ð]l¬yìl ç³§é-Æ>¦-ÌSMýS$ Ð]l$…rË$ ÐéÅí³…-^èlMýS$…yé Ayýl$z-MýS$-¯é²Æý‡-¯é²Æý‡$. గ్యాస్ సిలిండర్ లీకై ... తాళ్లపూడి: మండలంలోని రావూరుపాడులో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు రావడంతో ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మేకా వెంకన్న భార్య మేక సత్తెమ్మ కొత్త ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటి సమీపంలో చిన్న షెడ్డు వేసుకుని నివాసం ఉంటున్నారు. గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులతో పాటు, ఇంటి నిర్మాణం కోసం పెట్టుకున్న నగదు కూడా కాలిపోయిందని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది వివరాలు సేకరించారు. -
కళ్లముందే కన్నతల్లి మృత్యువాత
● బైక్ను ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం ● మహిళ మృతి, ఇద్దరికి గాయాలు ● తండ్రిని ఆసుపత్రి నుంచి తీసుకువస్తుండగా ఘటన తొండంగి: తండ్రిని ఆసుపత్రిలో చూపించి తిరుగు ప్రయాణంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బైకు అదుపు తప్పడంతో మహిళ మృత్యువాత పడగా భర్త, కుమారుడు తీవ్రగాయాలపాలైన సంఘటన బెండ పూడి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన సాగి ఆనంద్ తన తండ్రి సూరిబాబు అనారోగ్యం కారణంగా కాకినాడ ఆసుపత్రికి తల్లి అమ్మాజీ(45)తో కలిసి ముగ్గురు బైక్ పై వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరుగు ప్రయాణంలో బెండపూడి జాతీయ రహదారిపై వీరి బైకును గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో బైకు అదుపుతప్పి రోడ్డు పక్కన గోతిలో పడిపోయారు. ఈ ఘటనలో అమ్మాజీ తలకు రాయి తగలడంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్, తండ్రి సూరిబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని అంబులెన్స్ రప్పించారు. తీవ్రగాయాలైన ఆనంద్, సూరిబాబుల కు అంబులెన్స్ సిబ్బంది మెరుగైన వైద్యం కోసం తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బి.జగన్మోహన్రావు తె లిపారు. కళ్లముందే కన్నతల్లి మృత్యువాత పడటంతో భర్త, కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గ్రేడ్–2 హెచ్ఎం బదిలీలకు 245 దరఖాస్తులు
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు 245 దరఖాస్తులు వచ్చాయి. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీలకు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తులు చేసుకున్నారు. ఈ బదిలీ దరఖాస్తుల్లో రిక్వెస్ట్ బదిలీలకు 181 దరఖాస్తులు రాగా, తప్పనిసరి బదిలీలకు 64 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను రెండు దశల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు రాకపోకలు సాగించేందుకు 44 సమ్మర్ వీక్లీ స్పెషల్ రైళ్లను ప్రకటిస్తూ రైల్వే అధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం– ఎస్ఎంబీటీ బెంగళూరు, ఎస్ఎంబీటీ బెంగళూరు (08581/ 08582) రైళ్లు జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ప్రతీ సోమ, మంగళ వారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం –తిరుపతి, తిరుపతి విశాఖపట్నం (08547/ 08548) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ప్రతీ బుధ,గురువారాల్లో రాకపోకలు సాగించనున్నాయి. విశాఖపట్నం– చర్లపల్లి, చర్లపల్లి –విశాఖపట్నం (08579/ 08580) రైళ్లు జూన్ 6వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు ప్రతీ శుక్ర, శనివారాలలో రాకపోకలు సాగించనున్నాయని అధికారులు తెలిపారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమహేంద్రవరం, అన్నవరం, తుని స్టేషన్లలో ఆగనున్నాయని తెలిపారు. -
ఈసారి ట్రావెల్ సర్వే!
● అన్నవరం దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల మధ్య 15 ఏళ్లుగా స్థల వివాదం ● ఇప్పటికి మూడుసార్లు సర్వే చేసినా తేలని సమస్య అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఘాట్రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న స్థలంపై నెలకొన్న వివాదం తేల్చేందుకు ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించారు. ఈ స్థలం దేవస్థానానిదా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. ఈ స్థలం హక్కుదారులను తేల్చేందుకు ఇప్పటికి మూడుసార్లు సర్వే చేశారు. తాజాగా మొత్తం దేవస్థానానికి సంబంధించిన స్థలాన్ని కూడా కలిపి ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించినట్లు పెద్దాపురం ఆర్డీఓ రమణి తెలిపారు. దేవస్థానం రికార్డుల ప్రకారం రత్నగిరి నుంచి పంపా వరకు దేవస్థానానిదే... అన్నవరం దేవస్థానానికి ఆరెంపూడి గ్రామ సర్వే నంబర్ 24.బి లో 54.69 ఎకరాల కొండ ఉంది. దేవస్థా నం క్వార్టర్స్ నుంచి ప్రారంభమై రత్నగిరి రామాలయం నుంచి పంపా రిజర్వాయర్ వరకు ఉన్న స్థలం రికార్డులలో దేవస్థానానికి చెందినదిగా నమోదై ఉంది. ఇందులో రెండో ఘాట్రోడ్ను ఆనుకుని పవర్హౌస్ వరకు ఉన్న పంపా రిజర్వాయర్ స్థలం కూడా తమదేనని దేవస్థానం అధికారులు అంటున్నారు. ప్రస్తుతం పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న ఆ స్థలంలో 25 సంవత్సరాలుగా హరిణి బోట్ షికార్, అభయ హోటల్ పేరుతో ప్రయివేట్ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని ఇరిగేషన్ శాఖ నుంచి లీజుకు తీసుకున్నట్లు ఆ నిర్మాణాల నిర్వాహకులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్రమణలు ఖాళీ చేయించాలని ఆర్డినెన్స్ 2023లో అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ –5 ప్రకారం దేవస్థానం స్థలం ఆక్రమించిన వారికి నోటీసు ఇచ్చి, తగు సమాధానం చెప్పకపోతే ఆక్రమణలు కూల్చి వేయాలని పేర్కొన్నారు. దాని ప్రకారం దేవస్థానం అధికారులు హరిణి బోట్ షికార్, అభయ్ హోటల్ అక్రమ నిర్మాణాలని గుర్తించామని ఇరిగేషన్ అధికారులకు గత ఏడాది జూలైలో నోటీసు ఇచ్చారు. ఆ నోటీస్కు ఇరిగేషన్ అధికారులు స్పందిస్తూ అది తమ స్ధలమేనని తెలిపారు. దీనిపై అప్పటి దేవస్థానం ఈఓ కే రామచంద్రమోహన్ కలెక్టర్కు నివేదిక పంపడంతో దీనిపై జాయింట్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. గతేడాది ఆగస్టులో జాయింట్ సర్వే నిర్వహించారు. ఆ సర్వేలో ఆ స్థలం దేవస్థానానిదేనని తేలింది. దానిపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో మళ్లీ జాయింట్ సర్వేకు కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే ఏప్రిల్ ఒకటో తేదీన పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ కు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కే శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం డీసీ చంద్రశేఖర్, ఏసీ రామ్మోహన్రావు, ఇరిగేషన్ ఈఈ శేషగిరిరావు హాజరయ్యా రు. పెద్దాపురం ఆర్డీఓ కే రమణి పంపా ఒడ్డున గల నిర్మాణాలను పరిశీలించారు. దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల వాదనలను విన్నారు. అయితే 50 రోజులు దాటినా ఈ సర్వే నివేదిక వెలుగు చూడలేదు. ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించాం కాగా ఈ వివాదం సంక్లిష్టంగా మారినందున 24 బీ సర్వే నంబర్లో ఉన్న దేవస్థానం లాండ్ అంతా కలిపి ట్రావెల్ సర్వే చేయించాలని నిర్ణయించాం. త్వరలోనే ఈ సర్వే చేయిస్తాం. – కే రమణి, ఆర్డీఓ, పెద్దాపురం 2011లో తొలిసారి సర్వే 2011లో అప్పటి ఈఓ కే రామచంద్రమోహన్ తమ రికార్డుల ప్రకారం ఆ స్థలమంతా దేవస్థానానిదేనని, అందువలన సర్వే చేయించాలని ప్రభుత్వాన్ని కోరడంతో సర్వే ప్రారంభించారు. అయితే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు ఉండడంతో ఆ సర్వే మధ్యలోనే నిలిచిపోయింది. -
మహానాడుకు వస్తే ఎకరం పొలం!
తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలప్పుడు జన సమీకరణకు తలా ఒక బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్, పచ్చనోట్లు ఇవ్వడం ఇంతవరకు చూశాం. కానీ, ఇప్పుడు ఏకంగా భూములే ఇచ్చేస్తామంటున్నారు. అధికారం చేతిలో ఉందనే తెగింపుతో మహానాడుకు వస్తే ఎకరం పొలం లీజుకిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆ పార్టీ నేతలు. ఇప్పుడీ ఆఫర్ టీడీపీ నేతల మధ్య హాట్టాపిక్గా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం పిఠాపురం మహారాజా రావువేంకట కుమారమహీపతి సూర్యారావు బహద్దూర్ 513 ఎకరాలు దానం చేయగా.. దేవదాయశాఖ పరిధిలో ఉన్న ఈ విలువైన భూములను ఇప్పుడు అప్పనంగా దోచిపెట్టేందుకు టీడీపీ మహానాడును సాకుగా వాడుకుంటున్నారు. వచ్చేవారం కడపలో జరిగే మహానాడు ఆహ్వాన కమిటీ సభ్యుల్లో ఒకరైన టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తునిలో తెలుగుదేశం నేతలు ఈ భూ పందేరానికి తెరతీశారు. మహానాడుకు సిద్ధపడి వచ్చేవారి పేరు, ఆధార్ నంబరు వంటి వాటిని సమన్వయం చేసేందుకు ఆరుగురు నేతలతో ఓ ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ మహానాడుకు జనం తరలింపులో సమన్వయం చేసేందుకేనని పైకి చెబుతున్నా.. వాస్తవంగా కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ దేవస్థానానికి చెందిన 508 ఎకరాల సాగు భూములను వేలం వేయకుండా దొడ్డిదారిన తెలుగు తమ్ముళ్లకు దోచిపెట్టే ఎత్తుగడని తునికి చెందిన వారు స్పష్టంగా చెబుతున్నారు. –సాక్షి ప్రతినిధి, కాకినాడజనసమీకరణ కోసం ఎర..అనంతరం.. టీడీపీ నేతలు అసలు కథ మొదలెట్టారు. టీడీపీ మహానాడుకు తుని నియోజకవర్గం నుంచి కనీసం వెయ్యి మందినైనా తీసుకెళ్లాలన్నది ఆ పార్టీ నేతల లక్ష్యం. కానీ, వ్యవసాయ సీజన్ మొదలవుతుండడంతో జన సమీకరణ పెద్ద సమస్యగా మారింది. ఇంతలో ఆ పార్టీ పెద్దలకు ఓ ఐడియా తట్టింది. తమ అనుచరులైన రైతుల పేర్లతో వేలం జరిగినట్లుగా రికార్డులు తయారుచేయాలనేది ప్లాన్. ఇందులో భాగంగా.. ప్రస్తుతం ఈ భూములు సాగుచేస్తున్న రైతులను వేలానికి రాకుండా అడ్డుకుని పోలీసు కేసులతో బెదరగొట్టాలని స్కెచ్వేశారు. ఈ క్రమంలో.. మహానాడుకు వస్తే ఎకరం భూమి లీజుకు ఇస్తామని పార్టీ పెద్దాయన చెప్పారని ద్వితీయశ్రేణి నేతలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పుడు మహానాడుకు వచ్చిన వారికే తిరిగొచ్చాక ఎకరం వంతున లీజుకిచ్చే బాధ్యత తమదంటూ తెలుగు తమ్ముళ్లు తొండంగి పరిసర ప్రాంతాల్లో జనాన్ని సమీకరించడం చర్చనీయాంశంగా మారింది. సత్రం పిఠాపురంలో.. భూములు యనమల ఇలాకాలో..నిజానికి.. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ ఈ భూములు మాత్రం యనమల రామకృష్ణుడు సొంత ఇలాకా తొండంగి మండలంలో ఉన్నాయి. మూడేళ్లకోసారి ఈ భూములకు వేలం వేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలోని ఈ భూముల లీజు గడువు ముగియడంతో ఇటీవల దేవదాయ శాఖ ఈఓ శ్రీరాములు పేరుతో వేలం ప్రకటన విడుదలైంది. దీంతో.. టీడీపీ నేతలు ఈ భూములపై వాలిపోయారు. ఈనెల 23 నుంచి 29 తేదీల మధ్య జరపాల్సిన వేలం ప్రక్రియ జరగకుండా అధికారులపై ఒత్తిడి తెచ్చి నిలిపివేశారు.రంగంలోకి జనసేన.. ఈ భూముల వ్యవహారం జనసేన నేతల చెవిలో పడింది. శ్రీ సంస్థానం సత్రం కార్యాలయం, కార్యకలాపాలన్నీ పిఠాపురం కేంద్రంగానే జరుగుతున్నాయని.. సత్రం భూములను తుని నియోజకవర్గంలో వారి అనుచరులకు ధారాదత్తం చేయడానికి వారికి అధికారం ఎవరిచ్చారని జనసేన నేతలు రగిలిపోతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సత్రం ఆదాయం కోల్పోతుంటే చూస్తూ ఊరుకుంటామా అని వారు మండిపడుతున్నారు.కొందరి విజ్ఞప్తితోనే వేలం వాయిదా..ఈనెల 23 నుంచి 29 వరకు మొత్తం 508 ఎకరాలకు వేలం వేస్తామని ప్రకటించాం. ఇంతలో.. టీడీపీ మహానాడుకు వెళ్తున్నందున రైతులు అందుబాటులో ఉండటంలేదని, వేలం వాయిదా వేయాలని కొందరు కోరడంతో వేలం వాయిదా వేశాం. ఎప్పుడు వేలం నిర్వహించేది వచ్చేనెల 6 తర్వాత ప్రకటిస్తాం. – నున్న శ్రీరాములు, కార్యనిర్వహణ అధికారి, శ్రీ సంస్థానం సత్రం గ్రూపు దేవాలయాలు, పిఠాపురం, కాకినాడ జిల్లా -
పట్టు వదలకుండా పోరాడుదాం
పిఠాపురం: స్వదేశీ సిల్క్ ఉత్పత్తిలో రాష్ట్రంలోనే పేరెన్నికగన్న పట్టు సాగును వదిలి పెట్టేది లేదని పట్టు వదలకుండా అందరం కలిసి పోరాటం చేసి సాధించుకుందామంటూ పట్టు రైతులు నిర్ణయించుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గురువారం స్థానిక పట్టు పరిశ్రమ కేంద్రంలో నిర్వహించిన పట్టు రైతుల సమావేశంలో పట్టు వదిలేసి పామాయిల్ సాగు చేయండి అన్న ఉన్నతాధికారుల సలహాలపై చర్చించుకున్నారు. రైతులు మాట్లాడుతూ వేలాది మంది రైతులకు జీవనోపాధి, రాష్ట్రంలో పట్టు సాగులో కీలక పాత్ర వహించే చేబ్రోలులో పట్టు సాగు నిలిపివేయడం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇది కేవలం ఒక పంట కాదని ఎందరికో ఉపాధినిచ్చే ఒక పరిశ్రమ అని ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. కొంతకాలంగా ఈ పరిశ్రమ ఇలా దిగజారిపోవడానికి జిల్లా పట్టు పరిశ్రమ శాఖాధికారి గీతారాణి అని, ఆమె పట్టు పరిశ్రమ శాఖ ద్వారా నకిలీ విత్తనాలు నాణ్యత లేని విత్తనాలు సరఫరా చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తే ఆమె పోలీసులతో తమపై దౌర్జన్యం చేయించి రైతులను దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించారన్నారు. పంటలు నాశనం అవ్వడానికి ఆమె ప్రధాన కారణమని, ఆమెను తక్షణం బదిలీ చేసి పట్టు పరిశ్రమ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టు సాగు వదిలేసి పామాయిల్ సాగు చేయడం జరగని పని అని అన్నారు. పట్టు సాగులో నష్టాలు రాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు చేయించి, చర్యలు తీసుకుని పట్టు పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకు రావాలని రైతులు కోరారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులను, జిల్లా ఉన్నతాధికారులను కలిసి మళ్లీ విజ్ఞప్తులు చేయాలని రైతులు నిర్ణయించుకున్నారు. పట్టు రైతులు ఉలవకాయల రాంబాబు, ఓరుగంటి సందీప్, ఓరుగంటి శ్రీను, చల్లా రామకృష్ణ, ఎలుగుబంటి బాబు పాల్గొన్నారు. చేబ్రోలులో పట్టు రైతుల సమావేశం -
పెట్టుబడి ఘనం.. గిట్టుబాటు గగనం
సఖినేటిపల్లి: జీడిపప్పు తయారీలో కేరళది అగ్రస్థానం కాగా తర్వాతి స్థానం కోనసీమలోని మోరిదే. అందులోనూ మోరి జీడిపప్పు కేరళ పప్పు కంటే మంచి రుచిగా ఉండడం వల్ల డిమాండ్ ఉంది. కేవలం ఇక్కడ తయారీ విధానం ద్వారా మాత్రమే ప్రసిద్ధి. రెండు శాతం మినహా గింజలు మాత్రం పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నవే. గతంలో మోరికి పరిమితమైన ఈ పరిశ్రమ ఇతర ప్రాంతాలకు విస్తరించింది. అయితే సీజన్ ప్రారంభమయ్యే మార్చి నెలాఖరులో ఉగాదికి అందుబాటులో ఉన్న గింజల ధర కాస్తా అమాంతంగా పెరగడం, పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ మార్కెట్లో అమ్మకాలు మందకొడిగా సాగడం చిరు వ్యాపారస్తులను డీలా పర్చాయి. రాజోలు దీవిలో.. రాజోలు దీవిలో ప్రప్రథమంగా మోరిలో తయారైన జీడిపప్పు తదనంతర కాలంలో దీవిలో సుమారు 25 గ్రామాలకు ఎగబాకింది. ఈ నేపథ్యంలో ఏడాదికి మోరి తదితర ప్రాంతాల్లో తయారయ్యే జీడి పప్పు సుమారుగా 8 నుంచి 9 లక్షల టన్నులు ఉంటుందని అంచనా. ఈ పరిశ్రమపై ఆధార పడిన కుటుంబాలు 25 వేలు వరకూ ఉంటాయి. పరిశ్రమ ద్వారా ఏడాది టర్నోవర్ సుమారు రూ.480 కోట్ల నుంచి రూ.500 కోట్లు వరకూ ఉంటుంది. కొత్త గింజలతో వ్యాపారం ఏటా మార్చి నెలాఖరు నుంచి కొత్తగా మార్కెట్లోకి వచ్చే దేశవాళీ గింజలతో సీజన్ ప్రారంభమవుతుంది. హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రధాన కేంద్రాలుగా జీడిపప్పు ఎగుమతితో పాటు, సమీపంలోని పాలకొల్లు, భీమవరం, నర్సాపురం పట్టణాలకు ఎగుమతి చేస్తున్నారు. కాగా జీడిగింజలు హెచ్చు రేటుకు కొనుగోలు చేసుకుని వ్యాపారం చేసే చిరు వ్యాపారులు మాత్రం అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందని వాపోతున్నారు. స్వదేశీ గింజలతో వ్యాపారం సీజన్ స్వదేశీ గింజలతో వ్యాపారం ప్రారంభమవుతుంది. ఇక్కడి వ్యాపారులు జీడిగింజలను రాజానగరం, మధురపూడి, ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, దేవరపల్లి, గోపాలపురం, దూబచర్ల, కొయ్యలగూడెం నుంచి దిగుమతి చేసుకుంటారు. సీజన్ ప్రారంభంలో మార్కెట్లో 80 కిలోల దేశవాళీ బస్తా గింజలు రవాణా చార్జీలతో కలిపి రూ.10 వేలు పలికింది. ఆ రేటు కాస్తా ప్రస్తుతం రూ.12 వేలుకు చేరింది. కాగా 80 కిలోల గింజలను పప్పుగా తయారు చేయడానికి వ్యాపారస్తులకు రూ.1,500 వెచ్చించాల్సి వస్తుంది. స్వదేశీ గింజల్లో లభించే ముడిపప్పు 20 కిలోలను మూడు రకాలుగా గ్రేడింగ్ చేస్తారు. 10 కిలోల గుండు మొదటి రకం, 8 కిలోల ముక్కబద్ద రెండో రకం, 2 కిలోల నలిముక్క మూడో రకం. ప్రస్తుతం మార్కెట్లో కేజీ గుండు ధర రూ.820, కేజీ బద్దముక్క రూ.770, నలిముక్క రూ.400 పలుకుతోంది. ఈ ప్రకారంగా గుండుకు రూ.8,200, ముక్కబద్దకు రూ.6,160, నలి ముక్కకు రూ.800 లభిస్తోంది. ఇలా చూసుకుంటే ఈ గింజల ద్వారా ఆదాయం రూ.15,160 వస్తోంది. గిట్టుబాటు స్వల్పమే మార్కెట్లో 80 కిలోల గింజలను తయారీలో పప్పుగా మార్చడానికి అయ్యే ఖర్చులతో కలిపి గింజలపై రూ.13,500 పెట్టుబడిగా ఉంది. మార్కెట్లో తెల్లపప్పు అమ్మకాల ద్వారా వస్తున్నది రూ.15,160. ఈ రకంగా చూసుకుంటే వ్యాపారస్తుడికి చేతికి మిగిలేది కేవలం రూ.1,660. ఇందులో ఇతర ఖర్చులు పోను రాబడి లెక్కిస్తే ఆటుపోట్లు మధ్య వ్యాపారం కష్టంగా మారింది. జీడిపప్పు చిరు వ్యాపారుల డీలా కలసిరాని పెళ్లిళ్ల సీజన్ అమాంతంగా పెరిగిన గింజల ధర పెరిగిన గింజల ధర కుటీర పరిశ్రమగా విరాజిల్లిన జీడిపప్పు వ్యాపారం ఇప్పుడు ఆటుపోట్ల మధ్య ఊగిసలాడుతోంది. సీజన్ ప్రారంభంలో రూ.10 వేలు ఉన్న బస్తా గింజల ధర ఇప్పుడు రూ.12 వేలుకు చేరింది. దీంతో పెట్టుబడి భారం ఎక్కువ అయింది. – ముప్పర్తి ఆదినారాయణమూర్తి, చిరువ్యాపారి, మోరి మందకొడిగా వ్యాపారం పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వ్యాపారం మందకొడిగా ఉంది. గింజల ధర కూడా ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. సీజన్ ప్రారంభంలో అందుబాటులో రేటుకు గింజలు లభిస్తే పెట్టుబడి భారం తగ్గేది. – జె.మాణిక్యాలరావు, చిరువ్యాపారి, మోరి -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
బావిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
గోకవరం: మండలంలోని తంటికొండ గ్రామంలో బావి నుంచి గుర్తుతెలియని పురుషుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పవన్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక రామాలయం వద్ద ఉన్న చెరువు మధ్యలో ఉన్న బావిలో గురువారం స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడు వయసు సుమారు 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉంటుందని, లుంగీ ధరించి ఉన్నాడని, మృతదేహం ఉన్న తీరుని బట్టి చనిపోయి సుమారు 15 రోజులు అయ్యి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం తరలించామని, వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కె.గంగవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత కులం పేరుతో దూషించారంటూ నిరసన కె.గంగవరం: స్థానిక పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోట గ్రామంలో దళిత కాలనీకి చెందిన మహిళలు, పురుషులు భారీగా స్టేషన్ వద్దకు తరలివచ్చి కులం పేరుతో దూషించి మహిళలపై దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కె.గంగవరం ఎస్సై జానీ బాషా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని కోట గ్రామానికి చెందిన కోటిపల్లి వెంకట సుబ్రహ్మణ్య ఈశ్వరరావు మోటారు సైకిల్పై ఏటిగట్టు వైపు వెళుతున్న సమయంలో అటుగా రోడ్డపై వస్తున్న ఉపాధి కూలీలకు మోటారు సైకిల్ హ్యాండిల్ తగిలింది. వెంటనే కూలీలు అతనిని ఆపి ప్రశ్నిస్తున్న సమయంలో ఈశ్వరరావు మహిళా కూలీలను కులం పేరుతో దూషించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో వారు ఈశ్వరరావును స్టేషన్కు తరలించి ఫిర్యాదు చేశారు. ఈశ్వరరావు కూడా రోడ్డుపై వెళ్తున్న తనను అడ్డుకుని దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. స్టేషన్ వద్ద నిరసన.. కోట గ్రామానికి చెందిన పలువురు వాహనాలలో భారీగా స్టేషన్ వద్దకు చేరుకున్నారు. కులం పేరుతో దూషించి మహిళలను దాడి చేసిన ఈశ్వరరావును వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలంటూ కొంత సేపు నిరసన చేశారు. ఈశ్వరరావు గతంలో కూడా దళితులను చిన్నచూపు చూశాడని, తమ కాలనీలో గల చెరువును తవ్వనీయకుండా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పారు. చెరువు లేకపోతే మాకు నీరు ఉండదని లంక భూములు సాగు చేసుకునే విషయంలో కూడా అడ్డుకుంటున్నాడని వారు నిరసన చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
రౌతులపూడి: స్థానిక మరిడమ్మ తల్లి గుడి వద్ద ఆర్అండ్బీ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. రౌతులపూడి గ్రామానికి చెందిన మోర్త రమేష్బాబు, గెడ్డ ప్రతాప్ మెరక చామవరం బైక్పై వెళ్లి తిరిగి వస్తుండగా రౌతులపూడి శివారు మరిడమ్మ తల్లి గుడి వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెనుక కూర్చున్న మోర్త రమేష్బాబు (15) రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గాయపడిన రమేష్ను రౌతులపూడి సీహెచ్సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతిచెందాడు. మృతుడికి తల్లి సత్యవతి, తండ్రి నాగేశ్వరరావు, సోదరుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. తండ్రి నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా
కాకినాడ క్రైం: బహిరంగ ధూమపానం చేస్తే జరిమానా విధిస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ధూమపానం వల్ల ఎదురయ్యే అనర్థాలను వాల్పోస్టర్ల ద్వారా ప్రదర్శించాలని అన్నారు. ప్రార్థనా ప్రదేశాలకు సంబంధించిన ఫిర్యాదులను సంబంధిత శాఖతో కలిసి పరిష్కరించాలని సూచించారు. సైబర్ నేరాల్లో బ్యాంకు ఖాతాల్లో చిక్కుకున్న సొత్తును తిరిగి ఖాతాదారుడికి అప్పగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై చేసిన విచారణను ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు. జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో గ్రీవెన్స్ బాక్సులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. ప్రజలకు రోడ్డు భద్రతా నియమాలపై తగిన అవగాహన పెంపొందించాలని సూచించారు. పోక్సో, రేప్ కేసుల్లో బాధితులను విచారించేందుకు శక్తి టీం సేవలను వినియోగించుకోవాలని, ఇటువంటి కేసుల్లో 60 రోజుల్లోపు చార్జిషీటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా పాత కేసులు, ఆస్తి తగాదాలు, పోక్సో, రేప్, ఎన్డీపీఎస్, సైబర్ క్రైం, మిస్సింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భాస్కర్రావు, కాకినాడ ఎస్డీపీవో మనీష్ దేవరాజ్ పాటిల్, పెద్దాపురం ఎస్డీపీవో హరిబాబు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. యువతి అదృశ్యంపై కేసు రామచంద్రపురం రూరల్: మండలంలోని ఆదివారపుపేట గ్రామానికి చెందిన యువతి ఈ నెల 21 నుంచి కనిపించడం లేదని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ గురువారం విలేకరులకు తెలిపారు. ఆదివారపుపేట గ్రామానికి చెందిన పిచ్చిక సత్యవతి కుటుంబం ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామం ఆదివారపుపేట వచ్చారు. ఈ నేపథ్యంలో 21 రాత్రి 2 గంటల సమయంలో తల్లి సత్యవతి ఇంటిలో తన కూతురు అపర్ణ లేకపోవడం గమనించింది. పరిసరాల్లోను, బంధువు ఇళ్లల్లోను విచారణ చేసినా ఉపయోగం లేకపోవడంతో ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ప్రారంభించిన సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ సామర్లకోట: పట్టణంలో గురువారం నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర వైభవంగా సాగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నాలుగేళ్లుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర ర్యాలీకి భారీ ఎత్తున ప్రచారం జరగడంతో వేలాది మంది భక్తులు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్దకు తరలివచ్చారు. గురువారం సాయంత్రం శృంగవృక్షం దత్త పీఠాధిపతి సాయిదత్త నాగానంద సరస్వతి స్వామీజీ హనుమాన్ శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ అంటే ఒక శక్తి అని, వారి జోలికి వస్తే మట్టి కరిపిస్తారని తెలిపారు. తిరుమల తిరుపతిలోని అలిపిరి ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా స్వామీజీ వివరించారు. హిందువులు ప్రశాంత జీవన విధానాన్ని కోరుకుంటారని అన్నారు. రామనామం భూమి ఉన్నంత కాలం ఉంటుందని చెప్పారు. జై శ్రీరామ్ అని చెప్పడం ద్వారా శక్తి ఏర్పడుతుందన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా వేలాది మంది శోభాయాత్రకు తరలి వచ్చారు. సీఐ ఏ కృష్ణ భగవాన్, ట్రాఫిక్ ఎస్సై అడపా గరగారావు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుంచి ఇండస్ట్రియల్ ఎస్టేట్, పిఠాపురం రోడ్డు నుంచి పెద్దాపురం రోడ్డు మీదుగా శోభాయాత్ర ర్యాలీ పెద్దాపురం పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్దకు చేరి తిరిగి సామర్లకోట వచ్చింది. ప్రారంభం నుంచి చివరి వరకు స్వామిజీ మోటారు సైకిల్పై కూర్చుని శోభాయాత్రలో పాల్గొన్నారు. -
అర్ధరాత్రి కారు బీభత్సం
పిఠాపురం: స్థానిక పాదగయ క్షేత్రం సెంటర్లో బుధవారం అర్ధరాత్రి ఒక కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి మోటారు సైకిల్పై వెళుతున్న ముగ్గురిని ఢీకొట్టి పాదగయ ఆలయం వద్ద పార్కింగ్లో ఉన్న వాహనాలపైకి దూసుకుపోయింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలవ్వగా పలు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. కారులో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. కత్తిపూడి నుంచి కాకినాడ వైపు వస్తున్న కారు బుధవారం అర్ధరాత్రి పిఠాపురం పాదగయ సెంటర్లో ఒకే మోటార్ సైకిల్పై చంద్రపాలెం పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న స్థానిక ఇందిరానగర్కు చెందిన పల్లా కృష్ణ, ఏడిద వెంకటేష్, బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్రను ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా వేగంగా దూసుకెళ్లి పాదగయ క్షేత్రం వద్ద పార్కింగ్లో ఉన్న పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయపడగా పాదగయ సెంటర్లో ఉన్న పలు మోటారు సైకిళ్లు ధ్వంసం అయ్యాయి. కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ముగ్గురిని అంబులెన్సులో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బి పత్తిపాడుకు చెందిన కే మహేంద్ర పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ ఎస్సై మణికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంగా వచ్చి మోటార్ సైకిలిస్టులను ఢీ కొట్టిన వైనం ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం కారులోని వారిని కాపాడిన ఎయిర్ బెలూన్లు -
ఆగివున్న లారీని ఢీకొట్టిన టాటా వ్యాన్
ఒకే కుటుంబానికి చెందిన 10 మందికి గాయాలు రాజానగరం: జాతీయ రహదారిపై వైఎస్సార్ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా వున్నాయి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చెక్కపల్లికి చెందిన నాగుల వెంకటేశ్వరరావు, ఎన్.రాజ్యలక్ష్మి, బి.రఘుబాబు, లక్ష్మీదుర్గ, తాళం రాధ, బి.దేవిక, బి.లోకేశ్వర్రావు, బి.దేవేంద్ర, ఎన్.పావని అన్నవరానికి టాటా మేజిక్ వ్యాన్లో బయలుదేరారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో వారు ప్రయాణిస్తున్న వ్యాన్ వైఎస్సార్ జంక్షన్ సమీపంలో రోడ్డు పక్క ఆగివున్న లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, డ్రైవర్ చింతలచెరువు మధుతోపాటు అందులో 9 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని 108 వాహనంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఆశ్రమం ఆస్పత్రికి తరలించారు. కాగా క్షతగాత్రులంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, దైవ దర్శనం కోసం అన్నవరానికి బయలుదేరారని పోలీసులు తెలిపారు. అతివేగంతోపాటు డ్రైవర్ కునుకు వేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నారు. కేసును రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: రత్నగిరికి గురువారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరితో పాటు వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు అధిక సంఖ్యలో సత్యదేవుని దర్శనానికి వచ్చారు. ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత, విశ్రాంత మండపాలు నవదంపతులు, భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుడు నిజరూపంలో దర్శనమిచ్చారు. రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహిస్తారు. ఆసక్తి ఉన్న భక్తులు రూ.750 టికెట్టుతో హోమంలో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు. ఈఏపీ సెట్కు 96.32 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏసీ సెట్ ఆన్లైన్ పరీక్ష జిల్లాలో గురువారం ప్రశాంతంగా జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,736 మంది హాజరు కాగా, 63 మంది గైర్హాజరయ్యారు. ఉదయ పరీక్షకు 871 మంది హాజరవగా 30 మంది గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 865 మంది హాజరు కాగా, 33 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. -
జగన్పై కోపం.. ప్రజలపై కక్ష
● చంద్రబాబు పాలనలో కళ తప్పిన గ్రామాలు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కోపంతో ప్రజలపై కక్ష తీర్చుకున్నట్లుగా చంద్రబాబు పరిపాలన ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. స్థానిక వైద్య నగర్లోని మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో గురువారం జరిగిన నియోజకవర్గ కో ఆర్డినేటర్ల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుని, కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్లు దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వంగా గీత, ముద్రగడ గిరిబాబు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టత, కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రజల ఇబ్బందులు తదితర అంశాలపై నేతలు చర్చించారు. పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతకు తీసుకోవలసిన చర్యలపై సమాలోచనలు చేశారు. అనంతరం దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పాలనలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకే), హెల్త్ సెంటర్లు, కనీసం సచివాలయాలు కూడా పూర్తి స్థాయిలో పని చేయక గ్రామాలు కళ తప్పాయని విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 1.20 కోట్లు, జిల్లాలో సుమారు 6 లక్షల కార్డులు ఉన్నాయన్నారు. ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ ఆపరేటర్ల వ్యవస్థను రద్దు చేయడంతో వారు ఉపాధి కోల్పోయారని, ప్రజలకు మళ్లీ రేషన్ కష్టాలు తప్పవని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలు అందడం లేదన్నారు. ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలు, రైతులకు ఉపయోగపడే ఆర్బీకేలు తొలగించి, ఇది మంచి ప్రభుత్వమంటూ వారి మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నెలాఖరుకు కమిటీలు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, జిల్లాలో 95 శాతం కమిటీలు ఇప్పటికే ఏర్పాటయ్యాయని, మిగిలిన 5 శాతం ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని చెప్పారు. జూన్, జూలై నెలల్లో నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి, మండల కమిటీల ఆధ్వర్యాన గ్రామ, బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయితే పార్టీ తరఫున రాష్ట్రంలో 18 లక్షల మంది వలంటీర్లు ఉంటారని, వారందరికీ డిసెంబర్లోగా గుర్తింపు కార్డులు జారీ అవుతాయని చెప్పారు. -
సేవ చేద్దామని వస్తే దూషణలు
● తెలంగాణ మహిళా సేవకుల బృందానికి అవమానం ● రత్నగిరిపై అధికారి దురుసు ప్రవర్తన ● ఏఈఓ తీరుపై కమిషనర్ ఆగ్రహం ● విచారణ జరిపి, నివేదిక ఇవ్వాలని ఈఓకు ఆదేశం అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సేవ చేయడానికి తెలంగాణ నుంచి వచ్చిన మహిళా సేవకుల పట్ల దేవస్థానం ఏఈఓ కె.కొండలరావు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. వివరాలివీ.. అన్నవరం దేవస్థానంలో సేవలందించేందుకు రెండేళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వందలాదిగా మహిళా సేవకులు వస్తున్నారు. వీరు పది రోజుల నుంచి రెండు వారాల వరకూ స్వామివారి ఆలయం, యంత్రాలయం, ఉపాలయాలు, అన్నదానం, ప్రసాదం, క్యూ లైన్లు తదితర చోట్ల సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవకులు గతంలో అన్నవరం దేవస్థానంలో సేవ చేసిన హైదరాబాద్కు చెందిన మరో సేవా బృందానికి చెందిన మహిళను సంప్రదించారు. ఆమె స్వయంగా రానూపోనూ రైలు టికెట్లు రిజర్వ్ చేయించింది. దీనికోసం ఒక్కొక్కరి నుంచి రూ.500 అధికంగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం అన్నవరం వచ్చిన మంచిర్యాల మహిళా సేవకుల బృందానికి డ్యూటీలు వేసేందుకు ఆలయ ఏఈఓ కె.కొండలరావు నిరాకరించారు. తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం వారే దేవస్థానం వద్దకు సేవకులను పంపిస్తారని, ఆమెతో మాట్లాడాలని చెప్పారు. దీంతో, మంచిర్యాల సేవకుల బృందం తునికి చెందిన శ్రీవారి సేవా మహిళా బృందం ప్రతినిధితో మాట్లాడగా, తన అనుమతి లేకుండా ఎందుకు వచ్చారని ఆమె విరుచుకు పడింది. వెంటనే వెళ్లిపోవాలని, తాను కబురు చేసినప్పుడే రావాలని చెప్పింది. దీంతో, వారు మళ్లీ ఏఈఓ కొండలరావు వద్దకు రాగా.. ఆయన కూడా వెంటనే వెళ్లిపోవాలని గట్టిగా కసిరినట్టు చెప్పారు. దేవుని సేవ చేద్దామని అంత దూరం నుంచి వస్తే తమను ఇలా అవమానించడమేమిటని మంచిర్యాల బృంద సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని వెంటనే దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై మండిపడిన ఆయన.. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, వెంటనే నివేదిక ఇవ్వాలని ఈఓ వీర్ల సుబ్బారావును ఆదేశించారు. -
పసుపు జెండా.. వెలిసిపోతోందా..!
అదేం ప్రశ్న! అయితే, ఈ వ్యవహారంపై జనసేన నేతలు వేరేలా కౌంటర్ ఇస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టగానే కౌడా చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు తుమ్మల బాబు ప్రకటించారని, అటువంటప్పుడు ఒకరికే రెండు పదవులని నెహ్రూ ఎలా అంటారని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. డీసీసీబీ చైర్మన్గిరీని నవీన్ ఆశించి భంగపడ్డారని, అందువల్లనే నెహ్రూ నోట జోడు పదవుల ప్రస్తావన వచ్చిందని అంటున్నారు. పదవుల పందేరంలో టీడీపీ నేతలకు అన్యాయమనేది సాకు మాత్రమేననని చెబుతున్నారు. ప్రాధాన్యం దక్కనందుకేనా! పార్టీ పరంగా, రాజకీయంగా ఒకప్పుడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చక్రం తిప్పిన జ్యోతుల నెహ్రూ, యనమల రామకృష్ణుడు వంటి నేతలకు జనసేనకు పెద్దపీట వేయడం నచ్చడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రమంలో దాదాపు జిల్లా ఉన్నతాధికారులు ఏ అంశంలోనైనా ఆయన మాటకే ప్రాధాన్యం ఇస్తున్నారు. సీనియర్లమైనప్పటికీ తమను పరిగణనలోకి తీసుకోకవడమే నెహ్రూ ఆగ్రహానికి కారణమై ఉంటుందనే అభిప్రాయం టీడీపీలో కూడా వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో 21 నియోజకవర్గాలున్నప్పుడు ఎమ్మెల్యేలందరూ సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి బాటలు వేశామని నెహ్రూ చెప్పుకొన్నారు. ఇప్పుడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకే పరిమితమైనా సమన్వయం కొరవడి, ఏమీ చేయలేకపోతున్నామన్న నెహ్రూ మాటల్లో ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశమే కనిపిస్తోందని అంటున్నారు. ఈ మొత్తం ఎసిపోడ్లో టీడీపీ నిర్వీర్యమైపోతుందన్న నెహ్రూ వ్యాఖ్యలపై అధిష్టానం ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.పదవులన్నీ వాళ్లకే ఇచ్చేస్తే.. మనకో మరి!●● ‘గ్లాస్’మేట్స్కే నామినేటెడ్ సీట్లా? ● ఈ పొత్తుతో చిత్తయిపోతామన్న జ్యోతుల ● నెహ్రూ వ్యాఖ్యలపై కూటమిలో దుమారం ● ఆధిపత్య ఆరాటమేనని విమర్శ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్టీఆర్ హయాంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ క్రమంగా నిర్వీర్యమైపోయినట్లే.. ఇప్పుడు జనసేన పొత్తుతో ‘పసుపు’ రంగు వెలిసిపోయే పరిస్థితి ఏర్పడుతోందా అంటే.. అవుననే అంటున్నాయి జిల్లాలోని టీడీపీ శ్రేణులు. కాకినాడలో గురువారం జరిగిన ఆ పార్టీ జిల్లా మహానాడులో సీనియర్ నాయకుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా ఆధిపత్యం కోసమేనని మిత్రపక్షమైన జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మొత్తమ్మీద రెండు రోజులుగా జోతుల అండ్ సన్ చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలో దుమారం రేపుతున్నాయి. పదవుల్లో ప్రాధాన్యం ఏదీ? టీడీపీ, జనసేనల మధ్య చాపకింద నీరులా కొనసాగుతున్న విభేదాలు ఎట్టకేలకు జ్యోతుల వ్యాఖ్యలతో రచ్చకెక్కాయి. పదవుల పందేరం మొదలుకొని జిల్లాలో జనసేనకే పెద్ద పీట వేయడాన్ని టీడీపీ నేతలు ఒక పట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. పదవుల్లో తమకు ప్రాధాన్యం దక్కడం లేదనే ఆక్రోశం మినీ మహానాడు వేదికలుగా ఆ పార్టీ నేతల మాటల్లో ప్రస్ఫుటమైంది. జనసేన కంటే బలం, బలగం అధికంగా ఉన్నప్పటికీ పదవుల్లో అన్యాయం జరుగుతోందని టీడీపీ శ్రేణులు కారాలూ మిరియాలూ నూరుతున్నారు. ‘గతంలో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ పార్టీలకు తాత్కాలికంగా ఒకటో రెండో పదవులు వచ్చి ఉండవచ్చు. అప్పుడు మనం తెలివిగా రాజకీయం చేశాం. కేవలం మనతో పొత్తు కారణంగానే తరువాతి కాలంలో రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యమైపోయాయి. ఆ పరిస్థితి మన పార్టీకి రాకుండా రాష్ట్ర నాయకత్వం చూడాలి’ అని జ్యోతుల అన్నారు. పదవుల్లో టీడీపీ అధిష్టానం జనసేనకే పెద్దపీట వేస్తూండటంతో టీడీపీ క్రమంగా నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడుతోందని నేరుగా కాకపోయినా పరోక్షంగా అన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడైన తుమ్మల బాబుకు కొన్నాళ్ల కిందట కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఆయనకే తాజాగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ పదవి కూడా ఇచ్చారు. అయితే, ఎక్కడా జనసేన, ఆ పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండా.. ఒకే వ్యక్తికి రెండు పదవులు ఇవ్వడం న్యాయమా అని జ్యోతుల నిలదీశారు. ఇలాగైతే మెజార్టీలో ఉన్న టీడీపీ ఏమైపోతుందని నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నించారు. జ్యోతులే కాదు.. ఆయన తనయుడు నవీన్ కుమార్ కూడా రెండు రోజుల క్రితం పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మినీ మహానాడుల్లో సైతం దాదాపు ఇదే అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు. పార్టీ పరంగా పిఠాపురంలో ఒకప్పుడు దూకుడుగా ఉండే మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఇప్పుడు దాదాపు స్తబ్దుగా మారిపోవడం చూస్తూంటే జిల్లాలో టీడీపీ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడినట్లు కనిపిస్తోందని నవీన్ అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిని నియమించకపోవడాన్ని ప్రస్తావిస్తూ ఇలాగైతే జిల్లాలో పార్టీ ఎటువైపు పోతుందని ఆయన ప్రశ్నించడం గమనార్హం. తండ్రీకొడుకులు చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. -
దయార్ద్ర హృదయాలకు ధన్యవాదాలు
● తల్లీబిడ్డల రక్షణలో సత్వర స్పందనకు అభినందనలు ● డీసీపీయూ బృందానికి కలెక్టర్ సత్కారం ● సమాచారం ఇచ్చిన పరమేశ్వర్కు భరోసా కాకినాడ క్రైం: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పరిధిలో బాలల సంరక్షణ కోసం పని చేస్తున్న డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ) బృందాన్ని కలెక్టర్ షణ్మోహన్ కలెక్టరేట్లోని తన కార్యాలయంలో గురువారం ఘనంగా సత్కరించారు. ఈ నెల 20న కాకినాడ బస్టాండ్ ఆవరణలో నిస్సహాయ స్థితిలో హోరు వానలో తడిసి ముద్దవుతూ, రోడ్డుపై ఆకలితో దీనస్థితిలో రోదిస్తున్న తల్లి రామలక్ష్మిని, నాలుగేళ్లు, రెండేళ్లు, రెండు నెలలు వయసున్న ముగ్గురు పిల్లలను ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. అక్కడే ఉన్న కె.గంగవరం మండలం కుందూరు సావరానికి చెందిన కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు వెంటనే స్పందించారు. డీసీపీయూ ప్రొటెక్షన్ ఆఫీసర్ జె.విజయకు సమాచారం అందించారు. తన బృందంతో విజయ సకాలంలో వచ్చి, బాధితులను ఆసుపత్రిలో చేర్చి, అక్కడి నుంచి జీజీహెచ్లోని సఖి వన్స్టాప్ సెంటర్కు తరలించారు. అక్కడే వారికి వసతి కల్పించి, సంరక్షిస్తున్నారు. ఈ సంఘటనపై ‘నా బిడ్డల్ని రక్షించండి’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి కలెక్టర్ షణ్మోహన్ స్పందించారు. తల్లీబిడ్డల దయనీయ స్థితి తెలుసుకుని చలించిపోయారు. వారిని సకాలంలో రక్షించిన విజయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థి పరమేశ్వర్తో పాటు డీసీపీయూ సిబ్బందిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఇదే నిబద్ధత కొనసాగించి, తద్వారా జిల్లాకు మరింత మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. విజయ మాట్లాడుతూ, పీడీ విజయకుమారి, డీసీపీవో వెంకట్ల ప్రోత్సాహంతో విధి నిర్వహణలో గుర్తింపు పొందే రీతిలో రాణించగలుగుతున్నామని కలెక్టర్కు వివరించారు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం కాకపోతే తనను సంప్రదించాలని ఈ సమాచారం ఇచ్చిన విద్యార్థి పరమేశ్వర్కు కలెక్టర్ భరోసా ఇచ్చారు. -
పట్టణవాసికి.. పన్నుపోటు!
ఉమ్మడి జిల్లాలో పన్ను వసూళ్ల డిమాండ్ (రూ.కోట్లలో) నగరం/పట్టణం పన్ను డిమాండ్ కాకినాడ 110.99 పిఠాపురం 10.17 సామర్లకోట 8.78 రాజమహేంద్రవరం 137.32 నిడదవోలు 8.47 ఏలేశ్వరం 2.61 అమలాపురం 14.72 రామచంద్రపురం 7.65 పెద్దాపురం 7.18 కొవ్వూరు 4.56 సాక్షి, రాజమహేంద్రవరం: సంపద సృష్టించి, సంక్షేమం అమలు చేస్తామని ఎన్నికల్లో గొప్పలు చెప్పిన కూటమి పెద్దలు.. అధికారం చేపట్టినప్పటి నుంచీ బాదుడుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజలకు పెను భారం మోపిన సర్కారు.. తాజాగా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తి, ఇంటి, ఖాళీ స్థల, కుళాయి పన్నులు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. ఇది చాలదన్నట్లు ప్రస్తుతం 15 శాతం చెల్లిస్తున్న ఆస్తి పన్నును 20 శాతానికి పెంచేందుకు మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేస్తోంది. పురపాలక సంస్థల్లో చాలా ఆస్తులకు అసెస్మెంట్ చేయలేదని, దీనికోసం సర్వే చేపడుతున్నామని నమ్మబలుకుతోంది. కానీ, ప్రజలకు ‘అదనపు వడ్డింపు’లు చేయడమే దీని వెనుక అసలు లక్ష్యమనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ కంటే కనీసం 20 శాతం అధికంగా పన్నులు వసూలు చేయాలని ఇటీవల విడుదల చేసిన ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అధికారులు సర్వే పనుల్లో తలమునకలవుతున్నారు. ఇదేనా సంపద సృష్టి? కూటమి అధికారంలోకి వస్తే ఏటా పెంచే 15 శాతం పన్నును తగ్గిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. గత ప్రభుత్వం పట్టణ ప్రజలపై పన్నుల భారం పెంచిందని, తాము అధికారంలోకి రాగానే మదింపు చర్యలు చేపడతామని తప్పుడు ప్రచారం చేస్తూ అధికార పగ్గాలు చేజిక్కించుకున్నారు. గద్దెనెక్కిన కొన్ని నెలల వ్యవధిలోనే కూటమి పెద్దలు ప్రజల నడ్డి విరిచే చర్యలు చేపడుతున్నారు. ఏదైనా భవనానికి నిర్మాణ సమయంలోనే కొలతలు, నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారు. నిర్మాణం పూర్తయ్యాక మున్సిపల్ సిబ్బంది సర్వే చేసి, పన్ను విధిస్తారు. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో లోపాలున్నాయంటూ తప్పుడు ప్రచారానికి దిగిన ప్రభుత్వం.. తాజాగా కొలతలు తీసుకోవాలని పేర్కొంటూ, కొత్తగా పన్ను భారాలు మోపేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో వచ్చే నెల 15వ తేదీ నాటికి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ఆస్తుల కొలతలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రస్తుతం చెల్లిస్తున్న ఆస్తి పన్నుకు మరో 20 శాతం అదనంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో వసూలు చేసేందుకు నాంది పలుకుతోంది. ఈ మేరకు పురపాలక సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏ పట్టణ స్థానిక సంస్థలో ఎంత మేర అదనంగా వసూలు చేయాలో ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. కూటమి అధికార పగ్గాలు చేపట్టాక మోపుతున్న భారాలను చూస్తూంటే.. సంపద సృష్టి అంటే ఇదేనా బాబు గారూ.. అంటూ ప్రజలు నిట్టూరుస్తున్నారు. ఇంటింటి సర్వే చేస్తారిలా.. ● సచివాలయాల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. సచివాలయ కార్యదర్శులు, రెవెన్యూ, సర్వేయర్ల సహాయంతో ఈ సర్వే చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తారు. ● ఇళ్లు, భవనాలున్నవారు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారా, లేదా తనిఖీ చేస్తారు. ఆస్తి, కుళాయి, ఖాళీ స్థలాల పన్నులపై ప్రత్యేకంగా పరిశీలిస్తారు. ● నిర్మాణ విస్తీర్ణం మేరకు పన్ను విధించారా, లేదా.. అదనపు అంతస్తులకు పన్ను విధించారా.. నివాస భవనాలను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారా.. అనే అంశాలపై క్షేత్ర స్థాయిలో ఆరా తీస్తారు. బాదుడు ఇలా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలు, 9 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉన్నాయి. ఏటా సుమారు రూ.307.89 కోట్ల పన్ను డిమాండ్ ఇక్కడ ఉంది. తాజా ‘పన్ను పోటు’లో కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల ప్రజలపై అత్యధిక భారం పడనుంంది. రాజమహేంద్రవరంలో అత్యధికంగా రూ.137.32 కోట్ల డిమాండ్ ఉంటోంది. సర్వే పూర్తయితే ఇక్కడి ప్రజలపై మరో రూ.15 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ కార్పొరేషన్లో పన్నుల డిమాండ్ రూ.110.99 కోట్లు కాగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వ బాదుడుతో ఈ నగర ప్రజలపై మరో రూ.12 కోట్లు వడ్డిస్తారు. అదనపు వసూళ్లకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల 15లోగా ఇంటింటికీ వెళ్లి కొలతలు తీయాలని ఆదేశాలు రాజమహేంద్రవరంలో రూ.15 కోట్లు.. కాకినాడలో రూ.12 కోట్ల భారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.40 కోట్ల వడ్డింపు -
కూటమి నుంచి టీడీపీ ఎన్నిసార్లు బయటకు రాలేదు: జ్యోతుల నెహ్రూ
సాక్షి, కాకినాడ: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ..‘కాకినాడ జిల్లాలో పదవులు ఏ పార్టీకి వెళ్లాయో ఆలోచించండి. మెజారిటీ ఉన్న తెలుగుదేశం పరిస్థితి ఏంటి?. ఒక వ్యక్తికి రెండు పదవులు అవసరమా?.(కుడా చైర్మన్, డీసీసీబీ చైర్మన్గా ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు). కూటమిలో పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుంది. కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఎన్నిసార్లు బయటకు రాలేదు.టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టు పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అదే పరిస్థితి టీడీపీకి రాకుండా చూడాలి. నేను వాళ్లకు ఇవ్వకూడదు అని అనడం లేదు. మా నిష్పత్తి ప్రకారం టీడీపీకి కూడా ఇవ్వండి అంటున్నాను. ద్వితీయ శ్రేణి నేతలు తమ ఇంట్లో వారికి కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. మా వాటా పదవులు మాకు సక్రమంగా ఇవ్వండి’ అని డిమాండ్ చేశారు. -
సత్యదేవుని హుండీ ఆదాయం రూ.1.55 కోట్లు
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి హుండీల ద్వారా 26 రోజులకు గాను రూ.1,55,04,639 ఆదాయం వచ్చింది. హుండీల ఆదాయం బుధవారం లెక్కించారు. ఈ కానుకల్లో నగదు రూ.1,46,96,779, చిల్లర నాణేలు రూ.8,07,860 వచ్చాయని చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. బంగారం 48 గ్రాములు, వెండి 730 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. రోజుకి సరాసరి రూ. 5,96,332 హుండీ ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. అమెరికా డాలర్లు 184, కెనడా డాలర్లు 15, సింగపూర్ డాలర్లు రెండు, ఇంగ్లాండ్ పౌండ్లు ఐదు, స్కాట్లాండ్ పౌండ్లు పది, కువైట్ దీనార్లు 20, యూఏఈ దీరామ్స్ 25, ఖతార్ రియాల్స్ పది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహరెన్ దీనార్ ఒకటి లభించాయి. వేసవి సెలవులు, వివాహాలు, ఈ నెల ఏడో తేదీ నుంచి 13 వ తేదీ వరకు సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు కారణంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. వీరంతా కానుకలు వేయడంతో భారీగా హుండీ ఆదాయం సమకూరింది. దేవస్థానం డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహన్రావు లెక్కింపులో పాల్గొన్నారు. -
అత్యధికంగా కరపలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం
కాకినాడ సిటీ: జిల్లాలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం 8 గంటల వరకు సరాసరిన 20.5 ెమిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరప మండలంలో 71.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా ఏలేశ్వరం మండలంలో 5.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీ వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. పెదపూడి మండలంలో 38.2 మిల్లీమీటర్లు, శంఖవరం 30.2, జగ్గంపేట 29.2, తాళ్లరేవు 27, కాజులూరు 24.4, కాకినాడ అర్బన్ 22.4, పెద్దాపురం 18,6 గండేపల్లి 17.2, రౌతులపూడి 16.4, కిర్లంపూడి 15.4, తొండంగి 15.2, గొల్లప్రోలు 14.8, తుని 14.8, ప్రత్తిపాడు 14, కాకినాడ రూరల్ 14, పిఠాపురం 12, యు కొత్తపల్లి 11.8, కోటనందూరు 8.8, సామర్లకోట 8.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈఏపీ సెట్కు 95.83 శాతం హాజరు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీఈఏపీ సెట్–25 ఆన్లైన్ పరీక్షలు బుధవారం మూడవ రోజు కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేసిన ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో ప్రశాంతంగా నిర్వహించారు. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి నిర్వహించిన పరీక్షకు 1,719 మంది హాజరుకాగా 64 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్షకు 851 మంది హాజరుకాగా 37మంది, మధ్యాహ్నం పరీక్షకు 868మంది హాజరుకాగా 27మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీ.వీ.సుబ్బారావు తెలిపారు. పార్టీ తప్పిదం వల్లనే కార్యకర్తల్లో అసహనం – టీడీపీ కాకినాడ రూరల్ మినీ మహానాడులో జ్యోతుల నవీన్ కాకినాడ రూరల్: తెలుగుదేశం పార్టీ తప్పిదం వల్ల కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికల ముందు నుంచి ఇన్చార్జిని ప్రకటించాలని కార్యకర్తలు మొర పెట్టుకుంటున్నారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద స్పందన ఫంక్షన్ హాలులో బుధవారం కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడును నిర్వహించారు. పరిశీలకుడిగా శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్తిబాబు హాజరయ్యారు. పలువురు మాట్లాడుతూ కాకినాడ రూరల్లో జనసేన ఎమ్మెల్యేను నెగ్గించుకున్నామని, ఆయన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రతా వైఫల్యంతోనే ఉగ్రవాదుల చొరబాటు అమలాపురం టౌన్: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, పారా మిలటరీ దళాలు, లోకల్ పోలీసులు, ఎల్ఓసీతో పాటు పలు రకాల కేంద్ర ప్రభుత్వ నిఘా ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పుడు పహల్గామ్లోకి ఉగ్రవాదుల చొరబాటు భద్రతా వైఫల్యంతోనే జరిగిందని ఏఐసీసీ ఆహ్వాన కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిలల్లా అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రుద్రరాజు మాట్లాడారు. ఇంతటి భద్రతా వలయాలను దాటుకుని ఉగ్రవాదులు ఎలా వచ్చారు. ఎలా మట్టుపెట్టారు అనే దానిపై దేశ ప్రజలు ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఇన్ని కోణాల్లో భద్రతా వైఫల్యం వల్లే పహల్గామ్లో ఉగ్రవాదులు చొరబడి పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. అందుకు కారణమైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పహల్గామ్లో పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దేశ ప్రజలకు, ప్రతిపక్షాలకు వివరణ ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మోదీ గత 11 సంవత్సరాల్లో 176 దేశాల్లో పర్యటించి ఆయా దేశాలతో సత్ సంబంధాలు మెరుగుపరిచే ప్రయత్నం చేశారు. అయితే పహల్గామ్ ఘటన అనంతరం అనివార్యమైన యుద్ధ సమయంలో ఏ ఒక్క దేశం కూడా మన దేశానికి మద్దుతు ఇచ్చేందుకు ముందుకు రాలేదంటే దేశ ప్రజలు ఆలోచించాలని రుద్రరాజు అన్నారు. సమావేశంలో ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీను, రాష్ట్ర అధికార ప్రతినిధి వంటెద్దు బాబి, ఏఐసీసీ సభ్యుడు యార్లగడ్డ రవీంద్ర పాల్గొన్నారు. -
బాబొచ్చారు.. కష్టాలు తెచ్చారు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇంటింటికీ రేషన్ పథకానికి కూటమి సర్కార్ మంగళం పాడేస్తోంది. నాడు చంద్రబాబు హయాంలో పడ్డ రేషన్ కష్టాలు మరో 10 రోజులలో తిరిగొచ్చేస్తున్నాయి. రేషన్ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలను పాదయాత్రలో స్వయంగా చూసి చలించిపోయిన జగన్మోహన్రెడ్డి ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ సరఫరాకు శ్రీకారం చుట్టారు. దాదాపు ఐదేళ్ల పాటు ఇంటి ముంగిటకే అందించిన రేషన్ ఇక ఇంటికి రాదని తెలిసిన దగ్గర నుంచి కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చౌకధరల దుకాణాల డీలర్లు తమకు నచ్చిన సమయాల్లో రేషన్ సరకులు సరఫరా చేసే పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతోనే నాడు జగన్ కార్డుదారుల ఇంటి ముంగిటకే ఎండీయూ వాహనాలను తీసుకువచ్చారు. రేషన్కార్డుదారులకు సౌకర్యంతో పాటు ఎండీయూ వ్యవస్థ ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పించారు. అటువంటి ఎండీయూ వ్యవస్థ ఒప్పంద కాలపరిమితి ఏడాదిన్నర ఉండగానే చంద్రబాబు సర్కార్ మంగళవారం కేబినెట్ భేటీలో తీసుకున్న రద్దు నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సర్కారు నిర్వాకాన్ని తప్పు పడుతున్న జనం రేషన్కార్డు అంటేనే నిరుపేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల కోసం ఉద్దేశించింది. అటువంటి వారి ఇళ్ల ముంగిటకు నేరుగా వెళ్లి రేషన్ సరకులను అందిస్తున్న మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ)వాహనాలను రద్దు చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఒకప్పుడు రేషన్ తీసుకోవడానికి చౌకధరల దుకాణాల వద్ద క్యూ లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులను చవి చూసిన జనం ఎండీయూ వాహనాలు వచ్చాక చాలా సంతోషంగా ఉన్నారు. గడచిన ఐదేళ్లుగా దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలు, చిన్నా, చితకా పనులు చేసుకునే వారి దగ్గర నుంచి మధ్యతరగతి కుటుంబాలు ఇంటి ముంగిటకే రేషన్ సరకులు వచ్చేస్తుండటంతో సంబరపడ్డారు. రేషన్ దుకాణాల వద్ద నిరీక్షించడంతో సామాన్యుల జీవనోపాధి దెబ్బతింటుందనే ఉద్దేశంతో తీసుకువచ్చిన వ్యవస్థను లేకుండా చేస్తున్న కూటమి సర్కార్ నిర్వాకాన్ని ప్రజలు తూర్పార పడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా ఒకటి నుంచి 17 తేదీ వరకూ ఎండీయూ ఆపరేటర్లు కచ్చితంగా ఇంటికి వచ్చి రేషన్ ఇస్తారనే భరోసా కల్పించారు. ఇప్పుడు ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడం ద్వారా గత ప్రభుత్వ పథకాలు ఉండకూడదనే కూటమి దుర్బుద్ధి బయట పడిందంటున్నారు. కాకినాడ జిల్లాలో 515 గ్రామ సచివాలయాల పరిధిలో 6.43 లక్షల రేషన్కార్డులు ఉంటే 1,060 రేషన్ దుకాణాలున్నాయి. ఈ కార్డుదారులకు ఇంతవరకు 428 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందిస్తున్నారు. అటువంటి ఎండీయూ వ్యవస్థను ఇప్పుడు హఠాత్తుగా రద్దు చేస్తామనడమంటే ప్రజలకు తిరిగి కష్టాలు చూపించడమేనంటున్నారు. గత ప్రభుత్వంలో ఒక్కొక్క వాహనానికి డ్రైవర్, ఆపరేటర్, హెల్పర్ పోస్టులను మంజూరు చేసి జిల్లాలో 1,284 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. అలాగని రేషన్ డీలర్లను తొలగించకుండా వారి ఉపాధికి భంగం కలగకుండా నెలనెలా కమీషన్తో పాటు, గోనె సంచులను కూడా డీలర్లకే అప్పగించేవారు. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడమంటే వందలాది మంది ఆపరేటర్లను రోడ్డున పడేయడమే. ఎండీయూ వాహన వ్యవస్థను అమలులోకి తెచ్చినప్పుడు జిల్లాలో పౌరసరఫరాలశాఖ, బీసీ, ఎస్సీ కార్పొరేషన్లు, బ్యాంక్ ఆఫ్బరోడా, ఎండీయూ వాహనాల ఆపరేటర్ల మధ్య రాష్ట్ర ప్రభుత్వం కుదిర్చిన ఒప్పందం గడువు ఇంకా ఏడాదిన్నర ఉంది. ఒక ఎండీయూ ఆపరేటర్కు ఇచ్చే రూ.18వేలులో డీజిల్కు రూ.3,000, హెల్పర్కు రూ.5,000 పోతే మిగిలే రూ.10వేలతో ఆపరేటర్ కుటుంబం జీవనోపాధి పొందేది. వాహనాలకు ఒప్పంద గడువు ఉండగానే ఈ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా ఇన్ని వందల కుటుంబాల ఉసురుపోసుకుంటోందని ప్రభుత్వంపై వారు నిప్పులు చెరుగుతున్నారు. నెలకు రూ.10వేల జీతం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కి మొత్తం వలంటీరు వ్యవస్థనే రద్దు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు రద్దుల పద్దులో ఇంటింటికీ రేషన్ సరఫరా ఎండీయూ వాహనాలను చేర్చి వారిని రోడ్డున పడేస్తోంది. ఇంటింటికీ సరకుల పంపిణీకి మంగళం రేషన్ దుకాణాల వద్ద నిరీక్షణ తప్పదు రోడ్డున పడనున్న ఎండీయూ వాహనదారులు జగన్ పుణ్యాన ఐదేళ్లూ ఇంటి ముంగిటకే సరకులు రేషన్ కోసం పని మానుకోవాల్సి వస్తుంది వచ్చే నెల నుంచి ఇంటింటికీ తీసుకొచ్చే రేషన్ బళ్లు రద్దు చేయడం మంచిది కాదు. చౌకధరల దుకాణానికి వె ళ్లి గంటలకొద్దీ లైన్లో నిలబడాల్సి ఉంటుంది. సిగ్నల్స్ లేకపోతే ఒక్కోసారి ఒకపూట పడుతుంది. రేషన్కోసం ఒకరోజు పని మానుకోవాల్సి వస్తుంది. రేషన్ షాపులు ఎప్పుడు తీస్తారో తెలియని పరిస్థితులు గతంలో చూశాం. కూలీ చేసుకునేవారు సాయంత్రం సమయంలో షాపులకు వెళతారు, అయితే ఆ సమయంలో షాపులు మూసివేస్తే రేషన్ తీసుకునే అవకాశం కనిపించదు. – మేర్నీడి సత్యవతి, వాకాడ, కరప మండలం రేషన్ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు చంద్రబాబు ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ డోర్ డెలివరీ విధానం రద్దు చేయడం అన్యాయం. దూరంగా ఉన్న రేషన్ డిపోలకు వెళ్లి క్యూలో నిలబడి రేషన్ తెచ్చుకోవాలి. దినసరి కూలీ చేసుకునే వారికి కష్టకాలమే. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కిలో 2 బియ్యం ఎత్తివేస్తే, 2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చి పునరుద్ధరించారు. భవిష్యత్లో రేషన్ బియ్యాన్ని ఎత్తివేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. – రావూరి వెంకటేశ్వరరావు, రమణయ్యపేట, కాకినాడ రూరల్ పడిగాపులు తప్పవు ఎండీయూ వాహనాలను రద్దు చేయడంతో ప్రజలు రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వుంది. రేషన్ షాపులో తూకాలలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండీయూ వాహనం వద్ద ఎదురుగానే ఎలక్ట్రానిక్ కాటాతో తూకం వేయడంతో తేడా వచ్చేది కాదు. వినియోగదారులు రేషన్ షాపునకు వెళ్లిన సమయంలో డీలర్ ఉంటారో లేదో తెలియని పరిస్థితి – రేలంగి వెంకటలక్ష్మి, వీకే రాయపురం, సామర్లకోట మండలం బలహీనవర్గాలను రోడ్డున పడేస్తున్నారు ఎండీయూ వాహనాల రద్దుతో 95 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆపరేటర్లను రోడ్డున పడేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలలో భాగంగా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే బియ్యం, కందిపప్పు ఇంటింటికీ చేరవేసే ఎండీయు వ్యవస్థను రద్దు చేయడం దుర్మార్గం. ఎండీయూ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఎండియూ ఆపరేటర్లు చేసే ఆందోళనలకు మా పార్టీ మద్దతుగా నిలుస్తుంది. – అల్లి రాజబాబు, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ -
బదిలీలకు గ్రీన్ సిగ్నల్
రాయవరం: ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. రెండేళ్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న బదిలీలను పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు బదిలీల జీవో 22ను ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి విడుదల చేసింది. దీంతో బుధవారం నుంచి బదిలీ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన.. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, గ్రేడ్–2 హెచ్ఎంలకు బదిలీలు జరగనున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాతిపదికన వీటిని నిర్వహిస్తారు. 2017 ఆగస్టు 31కి ముందు ఆ పాఠశాలలో విధుల్లో చేరిన స్కూల్ అసిస్టెంట్/ఎస్జీటీ తత్సమాన క్యాడర్, 2020 ఆగస్టు 31 ముందు విధుల్లో చేరిన గ్రేడ్–2 హెచ్ఎంలు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. అలాగే 2027 మే నెలాఖరు లోపు ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని క్యాడర్లకు చెందిన సుమారు 18 వేల మంది వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన తేదీలు ● బదిలీల ప్రక్రియకు సంబంధించి బుధవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు ఈ నెల 21, 22 తేదీల్లో దరఖాస్తు చేసుకోవాలి. 28న ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. ● స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 21 నుంచి 24 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూన్న్1, 2 తేదీల్లో ఆప్షన్లు పెట్టుకోవాలి. ● ఎస్జీటీలు ఈ నెల 21 నుంచి 27 వరకూ దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి జూన్ ఏడు నుంచి 10వ తేదీ వరకూ ఆప్షన్లు పెట్టుకునే అవకాశం ఉంది. హామీలకు కట్టుబడాలి ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలి. బదిలీ జీవోలో ప్రధానంగా మూడు అంశాల్లో స్పష్టత కొరవడింది. ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్, ఖాళీలు బ్లాక్ చేయకుండా ఉండడం, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల స్టడీ లీవ్ ఖాళీల విషయంలో హామీలను అమలు చేయాలి. – పి.సురేంద్రకుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ స్పష్టత లేదు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం మరికొన్ని విషయాల్లో అధికారులు స్పష్టంగా జీవోలు విడుదల చేయాలి. ఇంగ్లిషు మీడియంతో సమానంగా తెలుగు మీడియం నిర్వహించాలన్న అంశం, మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశాలపై స్పష్టత లేదు. – నరాల కృష్ణకుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ నిబంధనల ప్రకారమే.. బదిలీ షెడ్యూల్ విడుదలైంది. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన బదిలీలు చేపడుతున్నాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బదిలీలు నిర్వహిస్తాం. విద్యాశాఖ నుంచి వచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కిందస్థాయికి చేరవేసి, ఎటువంటి గందరగోళానికి తావులేకుండా నిర్వహిస్తాం. – పి.రమేష్, డీఈవో, కాకినాడ జిల్లా విడుదలైన జీవో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కొన్ని అంశాలపై స్పష్టత లేదంటున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు -
ఆ ఇద్దరి వల్లే రాష్ట్రం దివాళా
తుని: రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడే కారణమని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. బుధవారం తుని మండలం ఎస్.అన్నవరం క్యాంపు కార్యాలయంలో రాజా మీడియా సమావేశంలో మాట్లాడారు. మంగళవారం తునిలో జరిగిన మినీ మహానాడులో యనమల రామకృష్ణుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి చేసిన ఏకవచన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం మద్యం పాలసీలో జగన్మోహన్రెడ్డికి రూ.3,200 కోట్లు వెళ్లాయని చెప్పడం, ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం చేయడం వెనుక టీడీపీ ఉందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. 2019లో జగన్మోహన్రెడ్డి లిక్కర్ను ఎంకరేజ్ చేయనని చెప్పారని, లిక్కర్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారన్నారు. మద్యం అమ్మకాలు తగ్గి రాష్ట్రానికి ఆదాయం పెరిగిందని, ఇటువంటి సమయంలో స్కామ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెండుసార్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రాన్ని దివాళా స్థాయికి తీసుకువచ్చారని, 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి రూ.100 కోట్లతో అప్పగించినట్టు చెప్పారని గుర్తు చేశారు. అప్పుల గురించి గాలి పోగు చేసి మాట్లాడుతున్న టీడీపీ నాయకులు ఏడాది పాలనలో రూ.3లక్షల కోట్లు అప్పు చేసి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబునాయుడు 15 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని విమర్శించారు. చంద్రబాబు చేసిన అప్పు ఎంత? రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎంత అప్పు ఉందని లెక్కలు చూసి మాట్లాడాలని రాజా సూచించారు. రాష్ట్రంలో వేధింపుల రాజకీయం, రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఇందుకు వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపైన వేల సంఖ్యలో పోలీసులతో కేసులు పెట్టించారన్నారు. వైఎస్సార్ సీపీ నుంచి నాయకులను, కార్యకర్తలను దూరం చేసేందుకు టీడీపీ యత్నిస్తోందని, దీనికి భయపడేదిలేదని అన్నారు. మీరు ఏది చేస్తున్నారో భవిష్యత్లో అదే జరుగుతుందన్నారు. చంద్రబాబు నిరపరాధి అని కోర్టు బెయిల్ ఇవ్వలేదని, అనారోగ్యం కారణంగానే బెయిల్ వచ్చిందన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు. కేసుల పేరుతో కాలయాపన చేయకుండా పాలన గాడిలో పెట్టేందుకు పని చేయాలని సూచించారు. యనమల సొంత ఊరు ఏవీ నగరంలో విద్యార్థులకు చదువుకోవడానికి ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేయలేదని, రాష్ట్ర కేబినెట్లో కీలక మంత్రి పదవులు చేసిన యనమల ఎందుకు విద్యను ప్రోత్సహించలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాడు–నేడులో అన్ని వసతులతో కూడిన స్కూల్ను నిర్మించామని, టీడీపీ ప్రభుత్వం వచ్చి 11 నెలలు అవుతున్నా ప్రారంభం చేయలేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తూ టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు తీర ప్రాంత ప్రజలకు పారిశ్రామిక సంస్థల నుంచి రూ.15 వేలు ఇప్పిస్తామని చెప్పి రేషన్కార్డులను తీసుకుని మోసం చేశారన్నారు. విజయవాడలో బుడమేరు వాగు పొంగిన ఘటనలో రూ.300 కోట్లు ఖర్చు చేసి వరద బాధితులకు పులిహోర పంపిణీ చేశామని చంద్రబాబు చెప్పుకున్నారని, తునిలో ఇదే రీతిలో 11 నెలల్లో రూ.170 కోట్లు అభివృద్ధి చేశామంటూ చెప్పడం చూస్తే దొందూ దొందేనన్న చందంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి చంద్రబాబు, యనమలే కారణం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కారు ఢీకొని మహిళ మృతి
రాజానగరం: జాతీయ రహదారిపై జీఎస్ఎల్ జనరల్ ఆస్పత్రి వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. కలవచర్లకు చెందిన యర్రా మాణిక్యం (54) కంటి చూపు సరిగా కనిపించక ఇబ్బంది పడుతోంది. కంటి పరీక్ష చేయించుకుందామని జీఎస్ఎల్ ఆస్పత్రికి వచ్చిన ఆమె తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైంది. టు వే గా ఉన్న రహదారిపై డివైడర్ దాటి అవతలి వైపుకు వెళ్తుండగా రాజమహేంద్రవరం నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై నాగార్జున తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ముగ్గురు పిల్లలకు వివాహాలు చేశారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మోటార్ బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి గండేపల్లి: వర్షం కారణంగా మోటారు బైక్ అదుపు తప్పడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎసై యూవీ శివనాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. గండేపల్లికి చెందిన షేక్ నాగూర్ సాహెబ్ (57) రాజానగరంలోని గైట్ కళాశాలలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం మోటార్ సైకిల్పై డ్యూటీకి బయలుదేరారు. వర్షం పడుతున్న సమయంలో మురారి శివారు మాతారాణి దాబా ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజానగరం జీఎస్ఎల్కు, అక్కడి వైద్యుల సూచనల మేరకు కాకినాడ జీజీహెచ్కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. నాగూర్ సాహెబ్కు భార్య నూర్జహాన్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
కొత్తపేట: అవిడి పెదపేట గ్రామానికి చెందిన నామాడి సుధాకర్ అలియాస్ బుజ్జి (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవిడి రేవు సమీపంలో పంట కాలువ కల్వర్టు గోడపై అతడు మృతి చెంది ఉండటాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించారు. ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. సుధాకర్కు భార్య కల్యాణి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉండగా, పెద్ద కుమార్తె ఎంసెట్ పరీక్ష రాసింది. చిన్న కుమార్తె పదో తరగతి పరీక్షలు రాసింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటున్న సుధాకర్ మంగళవారం ఉదయం నుంచి మద్యం తాగుతూనే ఉన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో పంట కాలువ కల్వర్టు వద్ద అతడు మద్యం మత్తులో ఉండగా స్థానికులు చూశారు. ఉదయానికి రక్తపు వాంతులు చేసుకుని చనిపోయి ఉండగా గుర్తించి, అతడి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సురేంద్ర సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య నామాడి రవి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
సముద్రంలో ముమ్మరంగా గాలింపు
కొత్తపల్లి: సముద్రంలో వేటకు వెళ్లిన బోటు ప్రమాదవశాత్తూ బోల్తా పడడంతో గల్లంతైన మేరుగు శ్యామ్ కోసం బుధవారం కుడా ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగించారు. మత్స్యకారులు, అధికారులు నాలుగు బోట్లపై అతడి కోసం వెతుకుతున్నారు. అయితే తుపాను కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సారా నిందితుడిపై పీడీ యాక్ట్ ప్రత్తిపాడు: పెద్దిపాలెం గ్రామంలో సారా నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేసినట్టు ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ బుధవారం తెలిపారు. పలుమార్లు సారా కేసులో నిందితుడిగా ఉన్న నడిగట్ల నూకరాజును అరెస్టు చేసి, పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరచి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించినట్టు చెప్పారు. నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరి అరెస్టు కపిలేశ్వరపురం: నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను బుధవారం అంగర పోలీస్ స్టేషన్లో మండపేట రూరల్ సీఐ దొరరాజు వెల్లడించారు. ఆ ప్రకారం.. కపిలేశ్వరపురం మండలం అంగర ఆర్అండ్బీ రహదారిలోని రైస్మిల్లు సమీపంలోని కిళ్లీకొట్టు వద్దకు మంగళవారం రాజమహేంద్రవరానికి చెందిన మన్యం వీర వెంకట సత్య సీతారామారావు వచ్చాడు. తన దగ్గర ఉన్న రూ.500 నోటు ఇచ్చి సిగరెట్ పెట్టె కొన్నాడు. ఆ నోటు నకిలీదని కిళ్లీకొట్టు యజమాని సత్యనారాయణ గుర్తించాడు. స్థానికుల సహాయంతో సీతారామారావును పట్టుకుని అంగర పోలీసులకు అప్పగించాడు. ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలపై నిందితుడిని సీఐ దొరరాజు, ఎస్సై డి.రవికుమార్ విచారించారు. అతడి సమాచారం మేరకు పోలీసులు విజయవాడకు చెందిన వారా నవీన్ను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ నుంచి 44 నకిలీ రూ.500 నోట్లు, లాప్టాప్, పెన్ డ్రైవ్, ముద్రణ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు సీఐ దొరరాజు తెలిపారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య యానాం: పట్టణ పరిధిలోని న్యూరాజీవ్ నగర్కు చెందిన దంగుడుబియ్యం సత్యవతి (75) బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారై ఫంక్షన్కు వెళ్లిన సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం యానాం జీజీహెచ్కు తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసినట్టు ఏఎస్సై పంపన మూర్తి తెలిపారు. ఏడాదిగా సత్యవతి మానసికస్థితి బాగోలేదని, మందులు వాడుతోందని స్థానికులు తెలిపారు. -
కంప్యూటర్లు చోరీ చేసిన ఇద్దరి అరెస్టు
శంఖవరం: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్లను చోరీ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం అన్నవరం పోలీస్స్టేషన్లో విలేకర్లతో మాట్లాడారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈనెల 18న రూ.15 వేలు విలువైన కంప్యూటర్లు, సీపీయూలు, ప్రింటర్లు చోరీకి గురైనట్లు ప్రధానోపాధ్యాయులు టి.భాస్కరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నెల్లిపూడి – బెండపూడి రోడ్డు మధ్యలో శంఖవరానికి చెందిన గామాల అశోక్, బోడపాటి చిన్నోడు ఆటోలో కంప్యూటర్లను వేరే చోటుకు తరలిస్తుండగా అరెస్టు చేశారు. -
నేర పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకం
మలికిపురం: నేరాల దర్యాప్తు, పరిశోధనలలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని, అందుకే ప్రతి కూడళ్లలో వాటిని ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. ఆయన బుధవారం మలికిపురం పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఇటీవల జరిగిన అనేక నేరాలు, చోరీ కేసులలో నేరస్తుల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. అన్ని ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, వర్తక సంఘాలు కూడా సహకరించాయన్నారు. జిల్లాలో గంజాయి నేరాలు తగ్గాయని, ఈ కేసులలో పాత నేరస్తులపై నిఘా ఉంచి కట్టడి చేస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకుల విగ్రహాల వద్ద కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజాసంఘాలకు సూచించామన్నారు. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో కోనసీమలో మోసాలు జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. లైసెన్స్ కలిగిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, డీఎస్పీ సుంకర మురళీ మోహన్, సీఐ నగేష్ కుమార్, ఎస్సైలు పీవీఎస్ఎస్ఎన్ సురేష్, రాజేష్ కుమార్, కె.దుర్గా శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
140 గ్రాముల బంగారు ఆభరణాల చోరీ
కాజులూరు: అయితపూడిలోని మాజీ సర్పంచ్, పారిశ్రామిక వేత్త కొల్లు వెంకటేశ్వరరావు ఇంట్లో దొంగలు పడి, సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. గొల్లపాలెం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు గత బుధవారం తిరుపతి, ఇతర తీర్థయాత్రలకు వెళ్లి మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి తిరిగి వచ్చారు. లోపలకు వెళ్లి చూడగా ఇంటిలోని ఇనుప బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దానిలో 140 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు బుధవారం గొల్లపాలెం ఎస్సై ఎం.మోహన్ కుమార్ కేసు నమోదు చేసి, డాగ్ స్క్యాడ్, క్లూస్క్యాడ్ సాయంతో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్, రూరల్ సీఐ చైతన్య కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. -
‘పట్టు’ వదిలేశారా?
పట్టు (సిల్క్) ఉత్పత్తిలో పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు మండలం రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడి మల్బరీ సాగు, పట్టుగూళ్ల ఉత్పత్తిని చూసిన స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కె.పవన్కళ్యాణ్ గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలును సిల్క్ హబ్గా, సిల్క్ సిటీగా మారుస్తానని హామీలిచ్చారు. తీరాచూస్తే ఆ హామీ నెరవేరకపోగా.. రాష్ట్రానికే వన్నే తెచ్చిన పట్టు పరిశ్రమ ఇప్పుడు మూతపడే పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – పిఠాపురంమంగళం పాడేసినట్టేనా! ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ పట్టు రైతులు ఇటీవల గుంటూరులోని రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ కమిషనర్కు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ క్రమంలో పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణికి సోమవారం వినతిపత్రం అందజేయగా.. ఆమె సూచన మేరకు కాకినాడలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ను కలిశారు. పంటలు పోయి నష్టాల పాలయ్యామని, ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని గ్రీవెన్స్లో వినతిపత్రం ఇచ్చారు. ఆ సందర్భంగా ‘ఇబ్బందులు పడుతూ పట్టు సాగు చేయడం ఎందుకు. అది మానేసి పామాయిల్ సాగు చేసుకోండి’ అని కలెక్టర్ సలహా ఇచ్చారని రైతులు చెబుతున్నారు. కలెక్టర్ మాటలనుబట్టి పట్టు పరిశ్రమకు ప్రభుత్వం ఇక మంగళం పాడేసినట్టేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.పంటను దున్నేస్తున్న రైతులుపట్టు పురుగులకు ఆహారం కోసం వినియోగించే మల్బరీ తోటల్ని సాగు చేసేందుకు కొత్త రైతులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇదే సందర్భంలో పట్టు పురుగుల పెంపకం చేపట్టిన రైతులు కూడా గిట్టుబాటుకాక సాగును వదిలేస్తున్నారు. ఒక్క గొల్లప్రోలు మండలం చేబ్రోలులోనే సుమారు 400 ఎకరాల్లో మల్బరీ సాగు చేయగా, ఇప్పటికే వందల ఎకరాల్లో పంటను దున్నేశారు. రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు కాకినాడ జిల్లాలోని చేబ్రోలులో పట్టు పరిశ్రమ కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీలో 5, పెద్దాపురం డివిజన్లో 12, కాకినాడ డివిజన్లో 2 మండలాల్లో 4,500 ఎకరాల్లో 1,150 మంది రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టు పరిశ్రమ సుమారు 50 ఏళ్లుగా ఓ వెలుగు వెలుగుతోంది. ఇలాంటిచోట కూటమి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో సరైన ధర రాక, పంట కొనేవారు లేక, పెట్టుబడి దక్కక, కనీసం కౌలుకు తీసుకునే వారు కూడా ఉత్సాహం చూపకపోవడంతో పట్టు రైతులు పంటకు విరామం ప్రకటిస్తున్నారు. ఎకరం విస్తీర్ణంలో మల్బరీ సాగుకు రూ.లక్ష పెట్టుబడి అవుతోంది. పట్టు పురుగుల పెంపకానికి 50 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పున షెడ్ నిర్మాణానికి రూ.15 లక్షల వరకూ ఖర్చవుతోంది. దీని నిర్వహణకు రూ.50 వేల వరకూ ఖర్చవుతోంది. గతంలో ఇక్కడ పండించిన పట్టుగూళ్లకు కేజీకి రూ.550 వరకూ ధర వచ్చేది. ప్రస్తుతం రూ.250కి కూడా కొనేవారు లేకపోవడంతో తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు.మరోవైపు ప్రభుత్వం మల్బరీ రైతులకు ఇన్సెంటివ్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రతి రైతుకు రూ.లక్షల్లో బకాయి పెట్టింది. పైగా షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం లేదు. దీనికి తోడు ఊజీ ఈగ దాడితో పాటు వివిధ రకాల తెగుళ్లతో పట్టు పురుగులు గూళ్లు కట్టలేదు. ఫలితంగా పట్టు సాగు తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో సగానికి పైగా రైతులు తమ మల్బరీ తోటలను దున్నేశారు.కాకినాడ జిల్లాలో మల్బరీ సాగు వివరాలుసాగు చేస్తున్న మండలాలు 19గ్రామాలు 155పట్టు రైతుల సంఖ్య 1,150సాగు విస్తీర్ణం 4,500ఎకరాలురోజుకు పట్టుగూళ్ల దిగుబడి 5 టన్నులుఆదుకుంటారనుకుంటే ఆపేయమంటున్నారు ఎన్నికల్లో పవన్కళ్యాణ్ మా ఊరొచ్చి మాకు న్యాయం చేస్తానని మాటిచ్చారు. సిల్క్ సిటీ కడతానన్నారు. కానీ ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్కు వినతిపత్రం ఇస్తే.. ‘నష్టాలు వచ్చేటప్పుడు ఆ పంట ఎందుకు? వేరే పంటలు సాగు చేసుకోవచ్చు కదా’ అని అంటున్నారు. ‘ముందు మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రోత్సాహకాలు ఇప్పించండి. తరువాత పంట వేయాలో మానేయాలో నిర్ణయించుకుంటాం’ అని చెప్పాం. అధికారుల తీరు చూస్తుంటే పట్టు సాగు చేయనిచ్చేలా లేరు. – ఓరుగంటి ఏసుబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం పామాయిల్ వేసుకోమంటున్నారు పట్టు సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని అడిగితే ఈ పంట మానేసి పామాయిల్ వేసుకోవాలని చెప్పడం విస్మయం కలిగించింది. నష్టం వస్తోందని ఆపుకుంటూ పోతే ఇక్కడ ఇక ఏ పంటలూ ఉండవు. నష్టాలు రాకుండా ఏం చేయాలన్నది ఎవరూ ఆలోచించడం లేదు. మాకు రావాల్సిన ప్రోత్సాహకాల గురించి మాట్లాడటం లేదు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో ఉన్నాం. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగాం. అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. మమ్మల్ని పట్టించుకున్న వారు కనిపించడం లేదు. – ఓరుగంటి శ్రీను, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం -
కొనసాగిన ఏపీ ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు రెండో రోజైన మంగళవారం కొనసాగాయి. జిల్లాలోని ఐదు ఆన్లైన్ కేంద్రాల్లో అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో నిర్వహించిన పరీక్షకు 1,718 మంది హాజరవగా, 120 మంది గైర్హాజరయ్యారు. ఉదయం పరీక్ష 856 మంది రాయగా, 62 మంది రాయలేదు. మధ్యాహ్నం పరీక్షకు 862 మంది హాజరు కాగా, 58 మంది గైర్హాజరయ్యారని కన్వీనర్ వీవీ సుబ్బారావు తెలిపారు. జేఎన్టీయూకేలోని ఎంసెట్ కార్యాలయం నుంచి కో కన్వీనర్లు, టీసీఎస్ ప్రతినిధులు పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. నేటి నుంచి ఇంజినీరింగ్ విభాగ పరీక్షలు ఈఏపీ సెట్లో భాగంగా బుధవారం నుంచి ఇంజినీరింగ్ విభాగంలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకూ ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు జరుగుతాయి. దీనికి జిల్లావ్యాప్తంగా 8,957 మంది దరఖాస్తు చేశారు. నేడు హుండీల ఆదాయం లెక్కింపు అన్నవరం: సత్యదేవుని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించనున్నారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. మరోవైపు దేవస్థానంలో నెల రోజులుగా పెద్ద సంఖ్యలో వివాహాలు జరగడంతో నవదంపతులతో పాటు భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో, ఈసారి హుండీల ద్వారా రూ.1.50 కోట్లు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఉదయం 7 నుంచి సాయంత్రం వరకూ హుండీల ఆదాయం లెక్కించనున్నారు. ఈ కార్యక్రమానికి దేవస్థానం సిబ్బంది అందరూ హాజరు కావాలని ఈఓ ఆదేశించారు. ఐసెట్లో 96.96 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్లో జిల్లా విద్యార్థులు 96.96 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7న ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 1,747 మంది హాజరవగా 1,700 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 696 మందికి గాను 681 మంది, బాలికలు 1,051 మందికి గాను 1,019 మంది అర్హత సాధించారు. గడ్డర్ల ఏర్పాటు వాయిదా కాకినాడ సిటీ: భారత్ మాల జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా సామర్లకోట – అచ్చంపేట మధ్య నిర్మిస్తున్న వంతెనలపై గడ్డర్లు ఏర్పాటు చేసే పనులను వాయిదా వేశారు. కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఈ విషయం తెలిపారు. సామర్లకోట – కాకినాడ మధ్య ముత్యాలమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఈ పనులు ఈ పనులు బుధవారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకూ చేపట్టాలని తొలుత నిర్ణయించారు. అయితే, వర్షాల కారణంగా దీనిని వాయిదా వేశారు. అందువలన సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లింపు లేదని, ప్రయాణికులు, వాహనదారులు యథాతథంగా ప్రయాణించవచ్చని వివరించారు. విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయం రూ.27,68,281 అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారి హుండీ ఆదాయాన్ని అమలాపురం ఆలయ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం లెక్కించారు. 61 రోజులకు గాను స్వామివారికి హుండీల ద్వారా రూ.27,68,281 లభించిందని ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. 4.4 గ్రాముల బంగారం, 436 గ్రాముల వెండి లభించాయన్నారు. 30 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రంలో ముగ్గురే విద్యార్థులు! అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు ముగ్గురంటే ముగ్గురే ఒకే ఒక్క కేంద్రంలో మంగళవారం జాగ్రఫీ పరీక్ష రాశారని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఈ పరీక్ష రాయాల్సిన ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. దీంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు. -
ఈవీఎంల భద్రతకు చర్యలు చేపట్టాలి
కాకినాడ సిటీ: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీ ప్యాట్ల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం గోదామును ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా ఈవీఎం గోదాము భద్రతను తనిఖీ చేసి, నివేదిక పంపిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, అగ్నిమాపక, పోలీసు అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి యోగా అవగాహన కార్యక్రమాలు కాకినాడ సిటీ: యోగా పట్ల అందరికీ అవగాహన కల్పించే లక్ష్యంతో బుధవారం నుంచి వచ్చే నెల 21 వరకూ నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యోగా ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలు, మారథాన్, రంగోలి, విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించాలని సూచించారు. మండల, వార్డుల్లో జరిగే యోగా కార్యక్రమాలకు శిక్షకులను ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయి కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వాముల్ని చేయాలని పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని అన్ని ఆలయాల్లోనూ ఈ నెల రోజులూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన, డీఆర్ఓ జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
నా బిడ్డల్ని రక్షించండి
కాకినాడ క్రైం: ఏ దిక్కూ లేక.. కాకినాడ బస్టాండ్ సమీపాన తన ముగ్గురు పిల్లలతో కలిసి హోరు వానలో ఆకలి, బిడ్డల అనారోగ్యంతో రోదిస్తున్న ఓ తల్లిని, ఆమె పిల్లల్ని జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు రక్షించారు. చుట్టుపక్కల వారు స్పందించకపోయినా కాకినాడ ప్రభుత్వ ఐటీఐ విద్యార్థి వనుము పరమేశ్వర్, మత్స్యకారుడు రాజు మానవత్వాన్ని చాటుకోవడంతో ప్రొటెక్షన్ ఆఫీసర్ కె.విజయ తన బృందంతో అక్కడకు చేరుకున్నారు. రోదిస్తున్న తల్లికి ధైర్యం చెప్పి, ఆహారం అందించే ఏర్పాట్లు చేశారు. వాన నీటిలో తడిసి, నానిపోయి చిగురుటాకుల్లా వణికిపోతున్న పిల్లల్ని కాపాడి, సపర్యలు చేశారు. తల్లి నుంచి వివరాలు సేకరించారు. భర్త వదిలేయడంతో తాను ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డానని ఆ మహిళ తన కష్టాన్ని విజయ బృందం వద్ద చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. తనకు ఇద్దరు నాలుగు, రెండేళ్ల మగపిల్లలతో పాటు నాలుగు నెలల వయసు బిడ్డ కూడా ఉందని చెబుతూ గుండెలకు హత్తుకున్న శిశువును చూపింది. ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావని వారు ప్రశ్నించగా.. తన నాలుగేళ్ల కుమారుడికి పోలియో వల్ల కాళ్లు చచ్చుబడి నడవలేకపోతున్నాడని, పాకడం వల్ల రెండు కాళ్లు పుండ్లు పడ్డాయని, చూసి తట్టుకోలేక ఏడ్చానని విలపించింది. తన బిడ్డల్ని కాపాడాలని వేడుకుంది. కన్నబిడ్డల దుస్థితి చూసి తాళలేక ఆ తల్లి మానసిక వేదనకు గురైందని గుర్తించిన విజయ, ఆమె బృందం వారిని కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్కు పరమేశ్వర్, రాజుల సాయంతో తరలించింది. కాళ్లు చచ్చుబడిన నాలుగేళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అంతకు ముందు పిల్లల్ని రాజమహేంద్రవరంలోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు వర్చువల్గా హాజరుపరిచారు. కమిటీ ఆదేశాల మేరకు ముగ్గురు పిల్లలతో పాటు తల్లిని వన్స్టాప్ సెంటర్ పర్యవేక్షణలో ఉంచి సంరక్షిస్తున్నారు. తల్లీబిడ్డలను రక్షించిన వారిలో విజయతో పాటు కౌన్సిలర్ దుర్గారాణి, సోషల్ వర్కర్ ఎస్.చినబాబు కూడా ఉన్నారు. ఫ నడిరోడ్డుపై.. హోరువానలో ఓ అమ్మ ఆక్రందన ఫ పిల్లలకు ఆహారం, వైద్యం అందించలేక వేదన ఫ తక్షణమే స్పందించిన డీసీపీయూ బృందం ఫ తల్లి, ముగ్గురు పిల్లలకు రక్షణ ముగ్గురు పసికందులు.. నాలుగేళ్లు, రెండేళ్లు, నాలుగు నెలల వయసు.. తండ్రి వదిలి పోయాడు. కానీ, అమ్మ అలా చేయలేదు. రక్తం పంచి ఇచ్చింది కదా.. వివాహేతర సంబంధాల అడ్డదారిలో వెళ్లిపోయిన భర్తలా.. పేగు బంధాన్ని తెంచేసుకోలేకపోయింది. నాలుగేళ్ల కొడుక్కి కాళ్లు లేవు.. నాలుగు నెలల పాపకు పాలిద్దామన్నా దేహం సహకరించడం లేదు. అవిటితనం అంటిన బిడ్డ చచ్చుబడిన కాళ్లతో పాకుతూంటే పుండ్లు పడ్డాయి. వర్షం నీటిలో తడిసి పచ్చిబడ్డాయి. నొప్పితో అరిచేందుకై నా గొంతు దాటి బాధ బయటకు రానంత నిస్సత్తువ.. ఆ స్థితిని కన్నతల్లి చూడలేకపోయింది. తినడానికి తిండి లేదు. హోరు వానలో నడిరోడ్డులో నరక యాతన అనుభవిస్తున్న పేగుబంధాలను రోడ్డు మీదే పడుకోబెట్టి గుండెలు బాదుకుంటోంది. వర్షంలో కన్నీళ్లు కలిసి పోవడం వల్లనేమో.. పిచ్చిదనుకున్నారు. కానీ, బిడ్డల కోసం ఏడుస్తోందని తెలుసుకునేందుకు అక్కడి వారికి గంట పైగా సమయం పట్టింది.. ఈ హృదయ విదారక సంఘటన కాకినాడ బస్టాండ్ ఆవరణలో మంగళవారం చోటు చేసుకుంది. ఐసీడీఎస్ అధికారుల కథనం ప్రకారం... -
పంపా.. ఆహ్లాదకరంగా..
నెల రోజుల కిందటి వరకూ నీరుంటుందా.. ఆవిరైపోయి.. నీటిమట్టం 79 అడుగులకు పడిపోయి.. డెడ్ స్టోరేజ్కు చేరుకుని.. రిజర్వాయర్ ఎండిపోతుందా అనే పరిస్థితి. అన్నవరం గ్రామానికి, దేవస్థానానికి నీటి ఎద్దడి తప్పదేమోననే ఆందోళన.. అటువంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణ ధారలు కురిపిస్తూండటంతో పావన పంపా రిజర్వాయర్ జలకళతో తొణికిసలాడుతోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నా.. పరీవాహక ప్రాంతాలైన శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని కొండల్లో నెల రోజుల నుంచి తరచుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో, రిజర్వాయర్ నీటిమట్టం సోమవారం నాటికి 84.60 అడుగులకు పెరిగింది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు. ప్రస్తుతం 0.028 టీఎంసీలకు నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 105 క్యూసెక్కుల చొప్పున నీరు వస్తుండడంతో జలాశయం నీటిమట్టం 85 అడుగుల వరకూ పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు జలకళతో తొణికిసలాడుతున్న పంపా రిజర్వాయర్ను చూసి ఆనందిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తురాయి చెట్లు కూడా ఎర్రని పూలు పూస్తూండటంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా మారింది. పలువురు భక్తులు రత్నగిరి నుంచి పంపా రిజర్వాయర్ కవరయ్యేలా సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. పంపా ఘాట్ల వద్ద స్నానాలు చేస్తూ సేద తీరుతున్నారు. – అన్నవరం పంపా ఘాట్ల వద్ద పెరిగిన నీటిమట్టం -
చరిత్ర చాటేలా.. చక్కదిద్దేలా..
అన్నవరం: అన్నవరం.. ఈ పేరు వింటేనే ప్రతి భక్తుని మది మురిసిపోతుంది.. ఆధ్యాత్మిక భావం వెల్లివిరుస్తుంది.. అలాంటి రత్నగిరిపై లోటుపాట్లు విమర్శలకు తావిచ్చాయి.. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో వచ్చిన వరుస కథనాలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ స్పందించారు. చక్కదిద్దే చర్యలకు ముందుకు వచ్చారు.. ఇక నుంచి అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో నిత్యం జరిగే పూజాదికాలు, స్వామివారి కల్యాణోత్సవాలు, వేడుకల్లో అనుసరించాల్సిన విధి విధానాలపై త్వరలో శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారి సూచనలు, సలహాలు తీసుకోనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోనున్నట్లు రోహిత్ వెల్లడించారు. ఈ ఏడాది మే ఏడో తేదీ నుంచి 13వ తేదీ వరకూ జరిగిన సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాల్లో గతంలో జరిగిన ఉత్సవాలకు భిన్నంగా వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేయడంపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వచ్చిన విషయం విదితమే. అదే విధంగా 13న జరిగిన స్వామివారి శ్రీపుష్పయాగంలో అమ్మవారిని స్వామివారికి ఎడుమవైపు కాకుండా కుడివైపునకు వచ్చేలా ఏర్పాటు చేయడంపై కూడా భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. కల్యాణోత్సవాల్లో చోటు చేసుకున్న అపశ్రుతులపై కూడా ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ‘ప్చ్..కళ కట్టలేదు’ శీర్షికన కథనం వచ్చింది. దేవస్థానంలో వైదిక కార్యక్రమాల విధి విధానాలు రూపొందించాల్సిన వైదిక కమిటీ సరైన శ్రద్ధ చూపకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శృంగేరి పీఠాధిపతితో చర్చించి వారి సూచనల మేరకు దేవస్థానంలో వైదిక కార్యక్రమాల రూపకల్పన, ఉత్సవాల్లో చేయాల్సిన క్రతువులు, హోమాలు నిలుపుదల చేయాలా వద్దా తదితర విషయాలపై కూడా స్పష్టత వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించనున్నారు. దాని ప్రకారం భవిష్యత్తులో దేవస్థానంలో వైదిక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. వైదిక సలహాదారుడు లేక ఇబ్బంది దేవస్థానంలో గతంలో వైదిక కార్యక్రమాలపై సలహాలకు ప్రముఖ పండితుడిని వైదిక సలహాదారుగా నియమించి పూజలు నిర్వహించేవారు. తొలుత ప్రముఖ పండితుడు తంగిరాల బాలగంగాధరశాస్త్రి దేవస్థానం వైదిక సలహాదారుగా ఉండేవారు. ఆయన తరువాత రాజమహేంద్రవరానికి చెందిన పండితుడు మధుర కృష్ణమూర్తిశాస్త్రి 2010 వరకూ కొనసాగారు. 2014లో రాజమహేంద్రవరానికి చెందిన జాంపండు మాస్టారుగా పేరు పొందిన ప్రముఖ పండితుడు శ్రీసత్యనారాయణ మూర్తిని నియమించారు. ఆ తరువాత మరో సలహాదారుడిని నియమించలేదు. దీంతో దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకే వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో దేవస్థానం వైదిక కమిటీ నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన నేపథ్యంలో వైదిక సలహాదారు లేని లోటు కనిపిస్తోంది. దేవస్థానంతో 50 ఏళ్ల అనుబంధం కలిగిన ప్రముఖ వేద, జ్యోతిష పండితుడు, మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు, కంచి కామకోటి పీథం, శృంగేరీ పీఠాధిపతులతో సాన్నిహిత్యం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన శ్రీవిశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రిని వైదిక సలహాదారునిగా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సత్యదేవుని సన్నిధిలో వైదిక కార్యక్రమాలు ‘సాక్షి’లో వరుస కథనాలతో చర్యలు శృంగేరి పీఠాధిపతి సూచనలతో ముందుకు.. అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ వెల్లడి విధి విధానాలు రూపొందిస్తాం.. ఈ ఏడాది కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి హోమాల నిలిపివేత, శ్రీపుష్పయాగం రోజున స్వామి, అమ్మవారి అలంకరణపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్లో ఇటువంటి వివాదాలు రాకుండా చర్యలు తీసుకుంటాం. దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాలు, ఉత్సవాల్లో అనుసరించాల్సిన పద్ధతులు, అలంకరణలపై శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ స్వామివారిని మార్గదర్శనం చేయాలని కోరతాం. వారి సూచనలు, సలహాలు ప్రకారం నడుచుకుంటాం. వీటిని అతిక్రమించకుండా చూస్తాం. –ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,500 – 14,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
జంట ఆత్మహత్యపై కేసు
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధి వేట్లపాలెంలో ఒక జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. కాకినాడ సిద్ధార్ధ ఆస్పత్రి, గైడ్ ఆస్పత్రిలో అకౌంటెంట్గా పని చేస్తున్న ఉప్పల పోసిబాబు (40), గైడ్ మెడికల్ షాపులో పని చేస్తున్న గెద్దం దివ్యనాగలక్ష్మి (35) ఈ నెల 17న రైలుకు అడ్డుగా నిలబడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బయట పడుతుందనే అనుమానంతో ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని కాకినాడ నుంచి సామర్లకోట మోటారు సైకిల్పై వచ్చారు. అక్కడి నుంచి వేట్లపాలెం వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను రైల్వే ట్రాలీ మేన్ డి.లక్ష్మణరావు గుర్తించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతులిద్దరికీ వివాహాలు కాగా పోసిబాబుకు ఇద్దరు కుమారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోసిబాబు తన పెద్ద కుమారుడికి ఫోన్చేసి చనిపోతున్నట్లు చెప్పాడని వివరించారు. మృతుడి జేబులో ఉన్న సూసైడ్ నోట్లో వివరాలు లభించడంతో కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్సై వాసు తెలిపారు. శ్యాంబాబు మృతి మాదిగలకు తీరని లోటు కాకినాడ సిటీ: ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన కొండేపూడి శ్యాంబాబు మాదిగ మృతి జాతికి తీరని లోటని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నారు. కాకినాడ మధురానగర్లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పూర్వ అధ్యక్షుడు కొండేపూడి శ్యాంబాబు మాదిగ సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత శ్యాంబాబు కుటుంబ సభ్యులను మందకృష్ణ పరామర్శించి ధైర్యాన్ని నింపారు. ఎమ్మార్పీఎస్ వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకున్నది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే అన్నారు. అనేక సవాలను ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో శ్యాంబాబు కీలకపాత్ర పోషించారన్నారు. అనంతరం శ్యాంబాబు చేసిన ఉద్యమాలకు సంబంధించిన ఫొటోలను, శ్యాంబాబు నిలువెత్తు ఫొటోలను కుటుంబ సభ్యులతో కలసి కృష్ణమాదిగ తిలకించి ఆవిష్కరించారు. జాంబవ నిధికి కొండేపూడి శ్యాంబాబు కుటుంబ సభ్యులు రూ.లక్ష చెక్కును కృష్ణమాదిగకు అందజేశారు. కార్యక్రమానికి కొండేపూడి శ్యాంబాబుమాదిగ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. గుండెపోటుతో హెడ్ నర్స్ మృతి పి.గన్నవరం: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెడ్ నర్సుగా పనిచేస్తున్న జీఎల్ అనంత కుమారి (59) సోమవారం గుండెపోటుతో మరణించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన అనంత కుమారి సోమవారం మధ్యాహ్నం తనకు నీరసంగా ఉందని ఇంట్లో చెప్పి తణుకులోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ గుండెపోటుతో మృతి చెందారు. గత 20 రోజుల నుంచి ఆమె సెలవులో ఉన్నారు. ఈనెల 23న విధులకు హాజరు కావాల్సి ఉంది. పి.గన్నవరం సీహెచ్సీలో 2023 జూన్లో ఆమె హెడ్ నర్సుగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మృతితో ఆస్పత్రి వైద్య సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అమలాపురం రూరల్: తన పేరుపై ఉన్న భూమిని వేరే వ్యక్తి పేరున ఆన్లైన్లో మార్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి చెందిన రైతు అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన తెలిపారు. సదరు భూమిని తిరిగి తన పేరున మార్చాలని స్థానిక తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రలోభాలకు గురై వేరొకరి పేరున ఆన్లైన్ చేసిన అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రైతు ఆకుల నాగేశ్వరరావు తదితరులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. భూమికి ఏవిధమైన దస్తావేజులు లేకుండా కుంపట్ల ఆదినారాయణ పేరున ఆన్లైన్లో అక్రమంగా నమోదు చేశారన్నారు. దీనిపై తనకు తగిన న్యాయం చేయాలని నాగేశ్వరరావు కోరారు. -
ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా ముత్యాల నాయుడు
అంబాజీపేట: స్థానిక డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతిగా డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు జిల్లా, నంధ్యాలలోని మహానంది ఉద్యాన పరిశోధన కేంద్ర నుంచి ఆయన ఇక్కడకు బదిలీపై వచ్చారు. ముత్యాల నాయుడు కొవ్వూరు, దర్శి, మహానంది తదితర పరిశోధన స్థానాల్లో సుగంధ ద్రవ్య పంటలు, అరటి, నిమ్మ, దుంప పంటలు, పండ్లు, కూరగాయల పంటలపై పరిశోధనలు చేసి డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధికి తనవంతు కృషి చేసి మంచి గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తానన్నారు. కొబ్బరిలో తెగుళ్లు, పురుగుల నివారణ, యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి చేరువలో ఉంటానన్నారు. కొబ్బరిని ఆశించిన తెల్లదోమ నివారణకు ఎప్పటికప్పుడు రైతులతో మమేకమై నివారణకు కృషి చేస్తానన్నారు. ముత్యాల నాయుడిని స్థానిక శాస్త్రవేత్తలు, సిబ్బంది అభినందించారు. ఇక్కడ విధులు నిర్వహించిన డాక్టర్ ఎన్బీవీ చలపతిరావు తాడేపల్లిగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యాన సమాచార కేంద్రంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ హోదాతో పాటు ముఖ్య ప్రజా సంబంధ అధికారిగా బదిలీపై వెళ్లారు. -
ఐఎఫ్ఎస్కు ములగపూడి విద్యార్థి ఎంపిక
రౌతులపూడి: మండలంలోని ములగపూడికి చెందిన చింతకాయల లవకుమార్ ఇండియన్ ఫారెస్టు సర్వీసు(ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యారు. సోమవారం విడుదలైన 2024 ఐఎఫ్ఎస్ పరీక్షా ఫలితాల్లో ఆయన 49వ ర్యాంకు సాధించారు. సాధారణ వ్యవసాయ కుటుంబానికి చెందిన వీరసర్వ చక్రవర్తి, వీర వరహాలు దంపతులకు లవకుమార్ జన్మించారు. ఆయనకు సోదరి స్వాతి ఉన్నారు. లవకుమార్ ఒకటి నుంచి మూడో తరగతి వరకూ ములగపూడిలో చదువుకున్నారు. 4 నుంచి 8వ తరగతి వరకూ కత్తిపూడి రిఫరల్ పాఠశాలలోను, 9, 10 తరగతులు తుని శ్రీప్రకాష్ విద్యాసంస్థలోను, ఇంటర్మీడియెట్ విజయవాడ చైతన్య జూనియర్ కళాశాలలో, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో బీవీఎస్సీ డిగ్రీ చదివారు. కొంతకాలం వెటర్నరీ అంబులెన్స్లో సేవలందిస్తూ యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేరయ్యారు. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. ఎటువంటి కోచింగ్ లేకుండా, సెల్ఫోన్లు వాడకుండా పట్టుదలతో చదివారు. నిరంతర కృషితో ఎట్టకేలకు ఐఎఫ్ఎస్ సాధించాడని తల్లిదండ్రులు తెలిపారు. ఐఎఫ్ఎస్ సాధించిన మొదటి వ్యక్తి తమ కుమారుడు కావడం ఆనందంగా ఉందన్నారు. లవకుమార్ విజయంపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. -
గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): గోదావరిలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... చాగల్లు మండలం ధారవరం గ్రామానికి చెందిన గాడి రాకేష్ (17) స్నేహితులతో కలసి కొవ్వూరు మండలం సీతంపేట వద్ద గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ నేపథ్యంలో గోదావరిలో గల్లంతయ్యాడు. స్థానికుల సాయంతో అతన్ని బయటకు తీసి నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాకేష్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి తండ్రి శ్రీను, తల్లి, ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. శ్రీను కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నట్లు చెబుతున్నారు. మృతి ఘటనపై కొవ్వూరు పోలీసులకు సమాచారం అందాల్సి ఉంది. ఇదిలాఉంటే పలు ప్రాంతాల నుంచి సీతంపేట వద్దకు నిత్యం అధిక సంఖ్యలో స్నానాలకు వస్తున్నారు. ఇక్కడ అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణంకొత్తపేట: స్థానిక పాత బస్టాండ్ సెంటర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై జి.సురేంద్ర కథనం ప్రకారం.. మండల పరిధిలోని వాడపాలెం గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు (40) ఆదివారం రాత్రి స్థానిక దేవాలయంలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి కొత్తపేట వచ్చాడు. నాగేశ్వరరావు పాత బస్టాండ్ వద్ద నిలబడి ఉండగా అమలాపురం వైపు నుంచి రావులపాలెం వైపుకు వెళుతున్న ఆర్టీసీ బస్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతని బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై మృతుని భార్య దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర వివరించారు. -
కోకో కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
అంబాజీపేట: ఆరుగాలం శ్రమించి పండించిన కోకో గింజలను విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కోకో సాగురైతు సంఘ సహాయ కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ అన్నారు. అంబాజీపేట కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ కార్యాలయంలో జిల్లా కోకో రైతుల సమావేశం జిల్లా బీకేఎస్ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆనంద వెంకటప్రసాద్ మాట్లాడుతూ కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నచ్చిన ధరలకు కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కోకో గింజలు నాణ్యత ఉన్నప్పటికీ సరైన ధర లేకపోవడం, విక్రయాలు జరగకపోవడంతో కోకో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. కోకో గింజలకు ప్రస్తుతం అంతర్జాతీయ ధర కిలో రూ.940లు ఉండగా ప్రైవేట్ వ్యక్తులు కిలో రూ.500లోపు కొంటున్నారన్నారు. అంతర్జాతీయ ధరకే కోకో గింజలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా విదేశీ గింజల దిగుమతులు నిలుపుదల చెయ్యాలని, ధరలు నిర్ణయించే వరకూ రైతులు, కంపెనీలు కొనుగోలు, అమ్మకాలు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగే కోకో రైతులను ఆదుకునేందుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కోకో గింజల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతులు దంగేటి గిరిధర్, అడబాల రాజమోహన్, రెడ్డి రామకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్, సరెళ్ల అప్పారావు, ప్రకాష్, సమయవంతుల పండు తదితరులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్కు 418 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 418 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, సీపీఓ త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా అర్జీలను నాణ్యతతో సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.తెలుసుకోవచ్చన్నారు. -
రత్నగిరి.. భక్తజనఝరి
అన్నవరం: సత్యదేవుని సన్నిధి సోమవారం భక్తజనఝరిని తలపించింది. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులతో పాటు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో ఆలయం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వ్రతాలు 2,100 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాలతో అలంకరించి (ముత్తంగి సేవ) పూజించారు. -
ఈ కట్టడాలు.. మహా స్ట్రాంగ్
మెయిన్ రోడ్డు నుంచి టోల్గేట్కు.. గతంలో భక్తులు వాహనాల్లో రత్నగిరికి వెళ్లాలంటే అన్నవరం మెయిన్ రోడ్డు నుంచి నేరుగా టోల్గేట్ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఆర్టీసీ బస్సులను మెయిన్ రోడ్డు మీద టోల్గేట్ ఎదురుగా ఆపి భక్తులను దింపేవారు. దీనివలన ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగేది. అడపాదడపా ప్రమాదాలు కూడా జరిగేవి. అయితే 2023లో అప్పటి ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ హయాంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న కళాశాల మైదానం గేటు నుంచి సర్వీస్ రోడ్డు మాదిరిగా మరో రోడ్డును టోల్గేట్ వరకూ నిర్మించారు. రత్నగిరికి వెళ్లే వాహనాలు అక్కడే ఆ రోడ్డులోకి మారి నేరుగా టోల్గేట్ వద్దకు చేరుతూండటంతో మెయిన్ రోడ్డు మీద ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ప్రమాదాలు కూడా జరగడం లేదు. టూరిస్టు బస్సులు, ఇతర వాహనాల్లో వచ్చే భక్తుల కోసం 2023లో కొండ దిగువన కళాశాల మైదానంలో ఆరు విశ్రాంతి షెడ్లు నిర్మించారు. ఇవన్నీ భక్తులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అన్నవరం: కూటమి ప్రభుత్వ హయాంలో సింహాచలం దేవస్థానంలో కట్టిన గోడ వారం రోజుల వ్యవధిలోనే.. ఒక్క వానకే క్పుకూలిపోయింది. శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం నాడు జరిగిన ఈ దుర్ఘటన ఏడుగురు భక్తులను బలిగొంది. ఆ గోడ నిర్మాణంలో ఉపయోగించిన నాశిరకం మెటీరియల్ వాడారని తెలిసి అందరూ నిర్ఘాంతపోయారు. దీనికి భిన్నంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అన్నవరం దేవస్థానంలో చేపట్టిన పలు నిర్మాణాలు మహా స్ట్రాంగ్గా నిలచి, భక్తులకు, ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. సింహాచలం దేవస్థానం దుర్ఘటన నేపథ్యంలో.. అన్నవరం దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.30 కోట్లతో పూర్తి నాణ్యతా ప్రమాణాలతో వివిధ నిర్మాణాలు చేపట్టారంటూ సానుకూల చర్చ నడుస్తోంది. శివసదన్ సత్రం సత్యగిరిపై సుమారు రూ.20 కోట్లతో 135 గదులతో నిర్మించిన శివసదన్ సత్రం 2023 నవంబర్ నుంచి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ నిర్మాణం 2018లోనే మొదలైనా.. కరోనా వైరస్ కారణంగా రెండేళ్లు, దానివల్ల తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో ఏడాది పనులు నెమ్మదిగా సాగాయి. చంద్రశేఖర్ ఆజాద్ 2023లో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన తరువాత దీని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ సత్రం భక్తులకు అందుబాటులోకి రావడంతో వసతి సమస్య చాలా వరకూ పరిష్కారమైంది. దీని ద్వారా దేవస్థానానికి రోజుకు సుమారు రూ.2 లక్షల ఆదాయం వస్తోంది. సత్యదేవుని నమూనా ఆలయం జాతీయ రహదారిపై రూ.4 కోట్లతో సత్యదేవుని నమూనా ఆలయం నిర్మాణ పనులు 2023లో ప్రారంభించారు. గత ఏడాది మే నాటికి నమూనా ఆలయం, ప్రసాదం కౌంటర్, ప్రహరీ నిర్మాణాలు పూర్తి చేశారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, శంకరుల మూర్తులను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్లే భక్తులు ఇక్కడ ఆగి, స్వామివారిని దర్శించుకుని, ప్రసాదాలు కొనుగోలు చేయడానికి వీలుగా ఈ నమూనా ఆలయం నిర్మించారు. చెక్కు చెదరని నమూనా ఆలయం గోడ నమూనా ఆలయం చుట్టూ కాంక్రీట్తో బలమైన ప్రహరీ నిర్మించారు. వర్షాకాలంలో పంపా బ్యారేజీ గేట్లు ఎత్తినపుడు వరద నీరంతా జాతీయ రహదారి మీదుగా.. ప్రధానంగా ఉత్తరం, తూర్పు వైపు నిర్మించిన నమూనా ఆలయం ప్రహరీని ఆనుకుని ప్రవహిస్తుంది. గత ఏడాది సుమారు 5 వేల క్యూసెక్కుల వరద నీరు దీనిని ఆనుకుని ప్రవహించినప్పటికీ గోడలు బీటలివ్వడం కానీ, కృంగడం కానీ జరగలేదంటే.. దీనిని ఎంత పటిష్టంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకర మార్గ్ పాత సీఆర్ఓ కార్యాలయం వెనుక నుంచి రెండో ఘాట్ రోడ్డుకు కలిపే ఆదిశంకర మార్గ్ నిర్మాణం భక్తులకు ఎంతో ఉపయోగపడింది. 2023, 2024 కార్తిక మాసాల్లో ఈ రోడ్డు మీదుగా వందలాది వాహనాలు కొండ దిగువకు వెళ్లడంతో రత్నగిరిపై ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగలేదు. అలాగే, ప్రకాష్ సదన్ పక్క నుంచి నిర్మించిన ర్యాంపు రోడ్డు ద్వారా వాహనాలు నేరుగా పశ్చిమ రాజగోపురం వైపు వెళ్లే అవకాశం కలిగింది. అదే విధంగా సత్యగిరి రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ పార్కింగ్ ద్వారా వందలాది వాహనాలను నిలుపు చేయడానికి అవకాశం ఏర్పడి, భక్తులకు ఇబ్బంది తొలగింది. ఎటువంటి విమర్శలకు తావు లేకుండా.. ఈ నిర్మాణాలన్నీ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినప్పటికీ ఎక్కడా చెక్కు చెదరకపోవడం విశేషం. నాణ్యతపై ఎటువంటి విమర్శలూ రాలేదు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నాటి దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ నిర్మాణాలను రెండుసార్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యదేవుని సన్నిధిలో చెక్కుచెదరని రీతిలో నిర్మాణాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రూ.30 కోట్లతో పనులు పూర్తి నాణ్యతతో నిర్మాణం అధికారులు దృష్టి పెట్టాలి సింహాచలం దేవస్థానంలో ఐదుగురు మంత్రులు, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పనులు జరిగినా గోడ కూలిపోవడం అక్కడి నిర్మాణాల్లో నాణ్యతను ప్రశ్నార్థకం చేసింది. కూటమి ప్రభుత్వంలో నిర్మాణాలన్నీ ఇంతేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ స్కీమ్ కింద రూ.23 కోట్లతో చేపట్టనున్న నిర్మాణాలు, రూ.12 కోట్లతో చేపట్టే సీతారామ సత్రం నిర్మాణ నాణ్యతపై అధికారులు దృష్టి సారించాలి. లేకుంటే సింహాచలం పరిణామాలే ఇక్కడ కూడా పునరావృతమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
గుల్జార్ హౌస్లు!
మనకీ ఉన్నాయి..ఈ జాగ్రత్తలు అవసరం ఇళ్లు, అపార్టుమెంట్లు, గ్రూప్ హౌస్ల వంటి నివాస సముదాయాలు, వ్యాపార కేంద్రాల్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించడం అక్షరాలా ప్రాణ రక్షణతో సమానం. అగ్నిమాపక విభాగం, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్బీసీ) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ప్రమాణాలు ఈ అగ్ని ప్రమాదాల నివారణకు ఎంతగానో దోహదపడతాయి. ఫ ప్రతి భవంతిలో రెండు ఫైర్ ఎగ్జిట్లు తప్పనిసరి. అవి ఎక్కడున్నాయో అక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియాలి. వినియోగించడంపై అవగాహన ఉండాలి. ఫ ఫైర్ అలారం వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలి. పొగ, మంటలు చెలరేగినప్పుడు స్పీకర్లు, హెచ్చరిక లైట్లతో అప్రమత్తం చేసే ఏర్పాట్లు అవసరం. ఫ ప్రతి ఫ్లోర్లో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు తగినన్ని ఉండాలి. వాటి పని తీరును ప్రతి నాలుగు నెలలకోకసారి పరిశీలించుకోవాలి. ఫ భారీ భవంతుల్లో ఫైర్ హైడ్రెంట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనూహ్యంగా ప్రమాదాలేవైనా జరిగితే వీటి ద్వారా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే చర్యలను మరింత సులువుగా చేపట్టగలుగుతారు. ఫ 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న ప్రతి భవనంలోనూ వాటర్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలి. ఫ కనీసం ప్రతి ఆరు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహిస్తే నివాసితుల్లో అవగాహన పెరుగుతుంది. ఫ విద్యుత్ వైరింగ్, ఉపకరణాల్లో లోపాలే చాలా అగ్నిప్రమాదాలకు మూలం. ఈ నేపథ్యంలో ఎలక్ట్రికల్ సేఫ్టీకి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని భవన యజమానులకు అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. విద్యుత్ తీగలు, సాకెట్లు క్రమం తప్పకుండా నాణ్యంగా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటూ ఉండాలి. షార్ట్ సర్క్యూట్ సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ ప్రతి భవనం నిర్మాణ సమయంలో అగ్నిమాపక విభాగం నుంచి ఫైర్ సేఫ్టీ అప్రూవల్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఫ హైదరాబాద్ పాతబస్తీ అగ్ని ప్రమాదంతో ఉలికిపాటు ఫ మన భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు ఫ కాకినాడ, రాజమహేంద్రవరం సహా పలుచోట్ల ప్రమాదకరంగా భవనాలు ఫ ముందే మేల్కొంటే మేలు కాకినాడ క్రైం: హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలోని గుల్జార్ హౌస్లో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న సంఘటన అందరినీ భయాందోళనకు గురి చేసింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్తో జరిగిన ఈ ప్రమాదంలో అందరూ సజీవ దహనమైపోయారు. చనిపోయిన వారిలో ఐదేళ్ల లోపు పిల్లలు ఎనిమిది మంది, 60 ఏళ్ల పైబడ్డ వారు ఐదుగురు ఉన్నారు. ఇటీవలి కాలంలో కనీవినీ ఎరుగని ఘోర అగ్ని ప్రమాదమిది. ఈ ప్రమాదంలో తప్పించుకోవడానికి ఉన్న ఒకే ఒక్క దారిలో అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో బయటపడడం ఏ ఒక్కరికీ సాధ్యం కాలేదు. ఈ ఘోర కలి మన నగరాల్లోని భవనాలల్లో భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇటువంటి ఇరుకై న వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మనమూ ముందస్తుగా మేల్కోవలసిన ఆవశ్యకతను గుల్జార్ హౌస్ ప్రమాదం గుర్తు చేస్తోంది. ఇరుకు ప్రాంతాలు.. భద్రత లేని భవనాలు కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో చాలా ప్రాంతాలు ఎంతో ఇరుకుగా ఉన్నాయి. మెయిన్ రోడ్లు సహా మార్కెట్ వీధులు, ఇతర ప్రాంతాల్లో ఇటువంటి భవనాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. కాకినాడ మెయిన్ రోడ్డులో మసీద్ సెంటర్ మొదలు జగన్నాథపురం వంతెన వరకూ కుడి, ఎడమ వైపున అనేక దుకాణాలను గ్రౌండ్ ఫ్లోర్లలోనే నిర్వహిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్తో స్టాక్ పెట్టి, రెండో అంతస్తులో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్న అనేక వ్యాపార సముదాయాలు, నివాస భవనాలు ఇదే రీతిలో ఉన్నాయి. దాదాపు వీటన్నింటిలోనూ పై అంతస్తుల నుంచి కిందకి దిగడానికి ఒకటే మార్గం ఉంటోంది. ఊహించని విధంగా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే కనీసం తప్పించుకునే అవకాశం కూడా లేని పరిస్థితి. ఫ కొద్ది రోజుల క్రితం కాకినాడ సంతచెరువు జంక్షన్లోని ఓ భవంతి ఒకటో అంతస్తులో ఏసీ షార్ట్సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఫ కాకినాడ భానుగుడి కూడలిలో వ్యాపార సముదాయాలు కలిగిన సుభద్ర ఆర్కేడ్లో కొన్నాళ్ల క్రితం అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ప్యానళ్లు కాలిపోయి మంటలు వ్యాపించాయి. ఉదయం వేళ కావడంతో స్థానికులు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చి, ప్రమాదాన్ని నిలువరించారు. నిలిచిన తనిఖీలు ఫైర్ సేఫ్టీ ఇన్స్పెక్షన్లు నిలిపి వేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసి, అగ్నిమాపక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలున్నాయి. జిల్లా స్థాయిలో ప్రస్తుతం తనిఖీలేవీ జరగడం లేదు. గతంలో భవనాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు చేసి, ఒకే మార్గాలున్న భవనాలన్నింటికీ అదనపు మెట్ల మార్గాలు ఏర్పాటు చేయించారు. అయితే, కొన్ని నెలల క్రితం నుంచి ఆ తనిఖీలకు తిలోదకాలిచ్చారు. పొగే ప్రమాదకారి మంటలు వ్యాప్తి చెందే తొలి దశలో మంటల కంటే పొగే ప్రమాదకారి. హైదరాబాద్ ఘటనలో 17 మరణాలు సంభవించడానికి కారణం కూడా పొగ వ్యాపించి, ఊపిరి ఆడకపోవడమే. మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నాన్ని సైతం ఈ పొగ అడ్డుకుంటుంది. ఊపిరాడకుండా చేసి, ప్రాణాలు తీస్తుంది. ఇరుకై న నివాస, వర్తక సముదాయాలు అగ్నిప్రమాదాలకు నిలయాలు. ఆయా ప్రాంతాల్లో జీవనం సాగిస్తూ, వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు నిత్యం అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత మార్గదర్శకాలు పాటిస్తూ మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్ ఆధ్వర్యంలో తరచుగా చేపడుతున్న మాక్ డ్రిల్, అవగాహన సదస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. – ఉద్దండురావు సుబ్బారావు, జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి, కాకినాడ -
కక్ష సాధింపు మానాలి
కాకినాడ రూరల్: కక్ష సాధింపులు మానుకుని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. గైగోలుపాడులోని తన నివాసంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మద్యం విధానంపై పెట్టిన కేసులో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపడం కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసును సీఐడీ నుంచి సిట్కు అప్పజెప్పడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. మద్యం అమ్మకాలు పెరిగినప్పుడు అవినీతి జరుగుతుందా, తగ్గినప్పుడు జరుగుతుందా గమనించాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధింపులో భాగంగానే ఆయన అనుచరులను వేధిస్తున్నారన్నారని పేర్కొన్నారు. గతంలో ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, బీపీ ఆచారిలను ఇదే మాదిరిగా వేధించారని, వారు ఆ కేసుల నుంచి క్లీన్చిట్తో బయటకు వచ్చారని అన్నారు. అటవీ భూములు ఆక్రమించారంటూ పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులు బనాయిస్తున్నారన్నారు. భోగాపురంలో నిర్మించిన రిసార్ట్లో 51 ఎకరాల అటవీ భూమి ఉందనే ఆరోపణలను నిగ్గు తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులపై, గత ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు బనాయించడం మానుకోవాలని నాగమణి హితవు పలికారు. ప్రశాంతంగా ఏపీ ఈఏపీ సెట్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్లైన్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. కాకినాడ ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల, రాయుడుపాలెం సాఫ్ట్ టెక్నాలజీ, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణం కలిపి 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆయా కేంద్రాలకు గంట ముందుగానే చేరుకున్నారు. జిల్లాలో అక్కడక్కడ ప్రారంభ సమయంలో కొద్ది నిమిషాల పాటు సర్వర్ సమస్య మినహా విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యమూ కలగకుండా పరీక్షలు సజావుగా సాగాయి. జిల్లాలో ఉదయం పరీక్షకు 922 మంది దరఖాస్తు చేసుకోగా 844 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 923 మంది దరఖాస్తు చేసుకోగా 869 మంది హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 92.85 శాతం హాజరు నమోదైంది. -
నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్
ఫ పూర్తయిన ఏర్పాట్లు ఫ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజనీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్–2025 ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది జేఎన్టీయూ–కాకినాడ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు నుంచి ఆన్లైన్ టెస్ట్ పూర్తి చేయడంలో పాటించాల్సిన నిబంధనలు, జాగ్రత్తలను ఇన్విజిలేటర్లు వివరిస్తారు. ఈఏపీ సెట్ ద్వారా విద్యార్థులకు ఇంజినీరింగ్ (బీటెక్), బయో టెక్నాలజీ, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీఎస్సీ (అగ్రికల్చర్), హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్జెండరీ, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, బీ.ఫార్మసీ, ఫార్మ్.డి కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఫ విద్యార్థులు గంటన్నర ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఫ హాల్ టికెట్, ఐడీ కార్డు, పెన్సిల్ మినహా ఇతర ఎటువంటి వస్తువులనూ తమ వెంట తీసుకురాకూడదు. ఫ సెల్ఫోన్లు, స్మార్ట్ వాచీలు సహా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఫ పరీక్ష కేంద్రానికి బయలుదేరే ముందు హాల్ టికెట్లపై పరీక్ష వివరాలు, కేంద్రం పేరు, సమయం, తేదీ, ఇతర వివరాలను అభ్యర్థులు క్షుణ్ణంగా పరిశీలించుకోలి. ఫ హాల్ టికెట్టుతో పాటు ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకుని వెళ్లాలి. ఫ ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రింటవుట్, బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల విద్యార్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన కుల ధ్రువీకరణ పత్రం కాపీ వెంట తీసుకుని వెళ్లాలి. ఫ ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటవుట్ కాపీ దిగువన ఫొటో అతికించి, కళాశాల ప్రిన్సిపాల్, గెజిటెడ్ అధికారి నుంచి సంతకం తీసుకోవాలి. ఫ హాల్ టికెట్పై ఎటువంటి రాతలు రాసినా, పరీక్ష రాసే అవకాశం కోల్పోతారు. ఫ పరీక్ష కేంద్రంలో విద్యార్థి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలి ముద్రను ఇన్విజిలేటర్ పర్యవేక్షణలో వేయాలి. ఏర్పాట్లు పూర్తి పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశాం. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని ఆయా శాఖల సమన్వయంతో వైద్య సేవలు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నాం. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ వీవీ సుబ్బారావు, సెట్ కన్వీనర్ పరీక్షల తేదీలు అగ్రికల్చర్, ఫార్మసీ : నేడు, రేపు ఇంజినీరింగ్ : 21 నుంచి 27వ తేదీ వరకూ సమయం : ఉదయం 9.00 – 12.00, మధ్యాహ్నం 2.00 – 5.00 ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు : 5 కాకినాడ సాఫ్ట్ టెక్నాలజీ (రాయుడుపాలెం), ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల (సూరంపాలెం), ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 3 కేంద్రాలు (సూరంపాలెం) హెల్ప్లైన్ నంబర్లు : 0884–2342499, 2359599 జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ వివరాలు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ దరఖాస్తుదారులు : 8,961 అగ్రికల్చరల్, ఫార్మసీ : 3,671 రెండు విభాగాలు : 10 -
క్లోజర్ పనులకు మంగళం?
ఫ పూడుకుపోయిన తూములు, కాలువలు ఫ పిఠాపురంలో సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తం ఫ సార్వా సీజన్ దగ్గర పడుతున్నా చేపట్టని వైనం పిఠాపురం: రబీ సీజన్ ముగిసింది.. పంట కాలువలకు నీటి విడుదల నిలిపివేసి మూడు వారాలు అయింది. 20 రోజుల్లో మళ్లీ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధమవుతోంది. కాని ఈ మధ్యలో చేపట్టాల్సిన పంట కాలువల అభివృద్ధి (క్లోజర్) పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో ఏలేరు, పీబీసీ కాలువ ద్వారా పంటలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. పుణ్యకాలం పూర్తవుతున్నా ఎక్కడా కాలువల్లో పూడికతీత తీస్తున్న దాఖలాలు లేక ఇంకెప్పుడు చేస్తారో పనులు అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది సార్వాలో ఏలేరు వరదలు నియోజకవర్గంలో పంటలను నట్టేట ముంచేయగా రబీలో అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. ఒకపక్క కాలువలు, తూములు, స్లూయిజ్లన్నీ మరమ్మతులకు గురై శిథిలావస్థలో ఉన్నాయి. ఎక్కడా సాగునీరు సక్రమంగా పారే పరిస్థితి లేదు. పంట విరామ సమయంలో అన్నీ పూర్తి చేస్తారని ఆశగా ఎదురు చూశామని, కానీ ఎక్కడా పనులు చేయకపోవడంతో ఈ ఏడాది నష్టాలు తప్పవని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. -
ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై..
ఫ దైనందిన జీవనంలోకి సత్య చంద్రశేఖరేంద్రుని తల్లిదండ్రులు ఫ ధన్వంతరి దంపతులకు ఘనంగా సన్మానం అన్నవరం: కడుపున పుట్టిన పుత్రుడు ప్రయోజకుడైతే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. అటువంటిది తమ పుత్రుడు దుడ్డు వేంకట సత్య సూర్య గణేష్ శర్మ ద్రావిడ్.. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా సన్యాస దీక్ష స్వీకరించి.. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా ప్రభవించి.. సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుడే పీఠాధిపత్యం వహించిన కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా.. తదుపరి పీఠాధిపతిగా పూజ్యనీయ స్థానం పొందడం చూసి.. ఆయన తల్లితండ్రులు మంగాదేవి, ధన్వంతరి దంపతులు ఎంతో పొంగిపోతున్నారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నవరానికి చెందిన యువ పండితుడు, చతుర్వేది గణేష్ శర్మకు గత నెల 30న అక్షయ తృతీయ పర్వదినం నాడు కంచి కామకోటి పీఠంలో సన్యాస దీక్ష ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఏప్రిల్ 29న గణేష్ శర్మ జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకుని, వారి బంధాలను విడనాడి, సన్యాస దీక్షకు సమాయత్తమయ్యారు. దీనికి సంబంధించిన వైదిక క్రతువులు వరుసగా నాలుగు రోజుల పాటు జరిగాయి. అప్పటి నుంచీ మంగాదేవి, ధన్వంతరి దంపతులు సుమారు 20 రోజుల పాటు కంచి పీఠంలోనే ఉన్నారు. గణేష్ శర్మను తమ కుమారుడిగా కాకుండా కంచి పీఠం ఉత్తరాధికారిగా, సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిగా దర్శిస్తూ వచ్చారు. అనంతరం, ధర్మనిష్టకు బద్ధులై.. పుత్రబంధానికి దూరమై.. ఆ దంపతులు నాలుగు రోజుల కిందట అన్నవరం చేరుకున్నారు. శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆదేశానుసారం దైనందిన జీవితం గడుపుతున్నారు. వారిని వారి బంధువు, అన్నవరం దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ ఆదివారం ఉదయం దేవస్థానానికి తీసుకుని వచ్చారు. సత్యదేవుని దర్శనానంతరం ఆలయంలో పండితులు ఆ దంపతులకు వేదాశీస్సులు అందజేశారు. అనంతరం, వారిని సత్యదేవుని కండువాతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ సత్కరించారు. ఈఓ వీర్ల సుబ్బారావు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులు ఆ దంపతులను అభినందించారు. యథాప్రకారం సత్యదేవుని సేవలో.. నేను యథాప్రకారం సత్యదేవుని సేవలో పాల్గొంటాను. తెలిపారు. వ్రత పురోహితునిగా వ్రతాలు నిర్వహించడంతో పాటు సత్యదేవుని పూజలు, ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటాను. – దుడ్డు ధన్వంతరి భిన్నమైన జీవనం గడుపుతున్నారు ధన్వంతరి భార్య మంగాదేవి నా మేనకోడలు. వారి ఏకై క కుమారుడికి సన్యాస దీక్ష ఇచ్చి, కంచి పీఠం ఉత్తరాధికారిగా నియమించేందుకు అంగీకరించిన ఆ దంపతుల త్యాగం వెల కట్టలేనిది. సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి సేవలో సుమారు 20 రోజులు గడిపి, తిరిగి అన్నవరం వచ్చిన ఆ దంపతులు గతానికి భిన్నమైన జీవనం గడుపుతున్నారు.వారితో పాటు మా జన్మ కూడా ధన్యమైంది. – నాగాభట్ల కామేశ్వరశర్మ -
21 నుంచి ట్రాఫిక్ మళ్లింపు
సామర్లకోట: భారత్ మాల జాతీయ రహదారి బ్రిడ్జి పనుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ట్రాఫిక్ మళ్లించనున్నారు. అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట ఏడీబీ రోడ్డులోని రాక్ సిరామిక్స్ వరకూ ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జికి స్తంభాల నిర్మాణం అధునాతన సాంకేతిక పద్ధతిలో పూర్తి చేశారు. ఈ స్తంభాలను కలుపుతూ రెడీమేడ్ గర్డర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాటిని ఆయా ప్రదేశాలకు చేర్చారు. సామర్లకోట – కాకినాడ రోడ్డులో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జికి ఈ నెల 21 నుంచి ఈ గర్డర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – కాకినాడ కెనాల్ రోడ్డులో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకూ ట్రాఫిక్ మళ్లించాలని కలెక్టర్ షణ్మోహన్ ఇప్పటికే ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సామర్లకోట – కాకినాడ మధ్య ప్రయాణించే వారు అచ్చంపేట, పనసపాడు, సర్పవరం మీదుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అచ్చంపేట – సామర్లకోట మధ్య ఉన్న బ్రిడ్జిలో ఈ నెల 27 నుంచి గర్డర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో సామర్లకోట – అచ్చంపేట ఏడీబీ రోడ్డులో వాహనాలను ఈ నెల 27, 28 తేదీల్లో కెనాల్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. -
ప్రసాద్ నిర్మాణాలకు మూడోసారి టెండర్
ఫ రూ.18.98 కోట్లతో ఒకే ప్యాకేజీగా ఆహ్వానం ఫ 24 తుది గడువు అన్నవరం: కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ స్కీమ్ నిర్మాణాలకు అధికారులు ముచ్చటగా మూడోసారి టెండర్లు పిలిచారు. గత ఏడాది అక్టోబర్లో తొలిసారి టెండర్లు పిలిచి, జనవరిలో రద్దు చేశారు. అనంతరం, రూ.18.98 కోట్ల అంచనాతో గత జనవరిలో రెండోసారి టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన అనంత రాములు అండ్ కో 16 శాతం లెస్కు కొటేషన్ దాఖలు చేసి, ఈ టెండర్ దక్కించుకుంది. కొద్ది రోజుల్లో పనులు ప్రారంభించాల్సి ఉంది. ఈలోగా గత నెల 30న సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం సందర్భంగా నిర్మించిన గోడ కూలిపోయి ఏడుగురు మృతి చెందారు. దీంతో, ఆ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ అనంత రాములు అండ్ కోను ప్రభుత్వం బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ కాంట్రాక్టర్ కూడా ఆ కంపెనీయే కావడంతో ఇక్కడ కూడా ఆ సంస్ధ కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఈ నేపథ్యంలో రూ.18.98 కోట్ల అంచనాతో ప్రసాద్ నిర్మాణాలకు ఈ నెల 15వ తేదీన ముచ్చటగా మూడోసారి షార్టు టెండర్లు పిలిచారు. టెండర్ల దాఖలుకు ఈ నెల 24 ఆఖరు తేదీ. అనంతరం, వాటిని తెరచి, ఖరారు చేస్తారని టూరిజం శాఖ ఈఈ ఈశ్వరయ్య శ్రీసాక్షిశ్రీకి ఆదివారం తెలిపారు. -
చల్లగా చూడు స్వామీ!
పిఠాపురం: పట్టణంలో వేంచేసియున్న రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారు శనివారం విసనకర్రల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉగ్రరూపం చూపిస్తున్న వేసవిలో అందరినీ చల్లగా చూడాలని కోరుతూ స్వామివారికి తాటాకు విసనకర్రలతో అలంకారం చేశామని అర్చకుడు విజయ జనార్దనాచార్యులు తెలిపారు. వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా శ్రీనివాస్ నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): జిల్లా వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుడిగా పెద్దిశెట్టి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. సంఘం అధ్యక్ష ఎన్నికలు రామ్కుమార్ వ్యాయామోపాధ్యాయ సంఘ భవన్లో ఎన్నికల అధికారి వి.రవిరాజు ఆధ్వర్యాన శనివారం జరిగాయి. మొత్తం 191 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న శ్రీనివాస్కు 139 మంది, రవి సుందర్ కౌర్కు 51 మంది ఓట్లు వేశారు. దీంతో నూతన అధ్యక్షుడిగా శ్రీనివాస్ ఎన్నికై నట్లు ప్రకటించారు. -
మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఉపసంహరణ
సామర్లకోట: తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానని మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ శనివారం మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యకు వినతిపత్రం అందజేశారు. సొంత పార్టీకి చెందిన 22 మంది సభ్యులు చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం కోరుతూ గత నెల 2న జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన అందజేశారు. ఆ మేరకు ఈ నెల 15న అవిశ్వాస తీర్మానానికి కలెక్టర్ అనుమతించారు. దీనికి ముందుగానే అరుణ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి, కమిషనర్కు అందజేశారు. ఈ నేపథ్యంలో రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు తిరిగి ఆమె లేఖ ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చైర్పర్సన్ రాజీనామా చేయడంతో అవిశ్వాస తీర్మానానికి మెజార్టీ సభ్యులు రాకపోతే తీర్మానం వీగిపోయిందనే ఎత్తుగడలో భాగంగానే రాజీనామా డ్రామా ఆడారనే వాదనలు వినిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానంపై చర్చకు 21 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా.. ఆ సమావేశానికి 25 మంది హాజరై అవిశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. అయితే, అలా అవిశ్వాస తీర్మానం చేయడానికి వీలులేదని చైర్పర్సన్ అరుణ కోర్టును ఆశ్రయించారు. దీంతో, అవిశ్వాస తీర్మానంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనిని ఆధారంగా చేసుకొని అరుణ రాజీనామాను ఉపసంహరించుకుని ఉండవచ్చనే వాదనలు ఉన్నాయి. ఇప్పటికే చైర్పర్సన్ అరుణ, ఆమె భర్త కృష్ణమూర్తిలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించే అవకాశం ఉన్నప్పటికీ, అజెండాలోని అంశాలను ఆమోదించకుండా మెజార్టీ సభ్యులు బహిష్కరించే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం ఆమో దం పొందిన తరువాత అజెండాపై ఆమె ఏవిధంగా సంతకం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
ప్చ్.. కళ కట్టలే..
అన్నవరం: గతంతో పోలిస్తే ఈ ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాలు పెద్దగా కళ కట్టలేదనే విమర్శ భక్తుల నుంచి వస్తోంది. అలంకరణల నుంచి సంప్రదాయానికి విరుద్ధంగా కొన్ని క్రతువులు నిర్వహించడం వరకూ ఇప్పటికీ చర్చ నడుస్తోంది. పూర్తి స్థాయిలో కానరాని అలంకరణ ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలు ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకూ నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దివ్యకల్యాణం 8వ తేదీ రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా కల్యాణ వేదిక అలంకరణ బాగుంది. కానీ, వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డు పై భాగంలో ఎటువంటి అలంకరణా చేయలేదు. ఏటా కల్యాణోత్సవాల సందర్భంగా ఈ షెడ్డు పై భాగాన్ని అందమైన వస్త్రంతో కవర్ చేసి, దానికి పూలమాలలు, విద్యుద్దీపాలతో అలంకరించేవారు. ఈసారి అటువంటిదేమీ లేకపోవడంతో షెడ్ వెలవెలబోయినట్లు కనిపించింది. ఫ కల్యాణోత్సవానికి వచ్చిన వీఐపీలకు స్వామివారి ప్రసాదాలు, కల్యాణ అక్షతలతో పాటు నూతన వస్త్రాలు బహూకరించడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు ఎమ్మెల్యేలకు వీటిని అందజేశారు. కానీ, ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్కు కనీసం అక్షతలు కూడా ఇవ్వకపోవడం వివాదానికి తావిచ్చింది. దీనిపై ఆయన కల్యాణ వేదిక వద్దనే ఈఓ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. హోమాల నిలిపివేత రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ప్రతి శుక్రవారం చండీహోమం, అమావాస్య, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహిస్తారు. సత్యదేవుని కల్యాణోత్సవాల్లో కూడా ఈ హోమాలు ఎప్పుడూ ఆపలేదు. ఈసారి మాత్రం ఈ హోమాలు నిలిపివేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయంపై అన్నివైపుల నుంచీ విమర్శలు రావడంతో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు వైదిక కమిటీ సభ్యులతో గత మంగళవారం సమావేశమయ్యారు. హోమాలు ఎందుకు నిలిపివేశారో వివరణ ఇవ్వాలని నిలదీశారు. వారి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి వైదిక కార్యక్రమాల నిర్వహణపై శృంగేరి పీఠాధిపతి సూచనలు పాటించాలని నిర్ణయించారు. హోమాల నిలిపివేతపై ‘సాక్షి’ ఈ నెల 8వ తేదీ నుంచి వరుస కథనాలు ప్రచురించింది. దీనిపై మొదట్లోనే స్పందించి, హోమాలు నిర్వహించాలని ఆదేశించి ఉంటే అసలు ఈ వివాదమే తలెత్తేది కాదు. రథోత్సవం వెలవెల ఫ అసలే మే నెల ఎండ.. దానికి తోడు అగ్నికత్తెరలు.. నిప్పులు కక్కుతున్న సూరీడు.. సాయంత్రం ఆరు గంటలకు కూడా బయటకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటలకు సత్యదేవుని రథోత్సవం నిర్వహించారు. వాతావరణం వేడిగా ఉండటంతో ఈ ఉత్సవం ప్రారంభంలో పట్టుమని వంద మంది భక్తులు లేరు. చివరిలో అంటే రాత్రి 7.30 గంటల సమయానికి రెండు మూడు వేల మంది మాత్రం వచ్చారు. ఫ సాధారణంగా రథోత్సవం సందర్భంగా రథానికి కట్టిన పగ్గాలను భక్తులు లాగుతారు. కానీ, భద్రత పేరుతో సత్యదేవుని రథం పగ్గాలను భక్తులను పట్టుకోనివ్వలేదు. ముందు ట్రాక్టర్ ఉంచి, దానికి కట్టి లాగించారు. రథానికి వెనుక సపోర్టుగా జేసీబీకి పగ్గాలు కట్టారు. దీంతో, ఇదేం రథోత్సవమని విస్తుపోవడం భక్తుల వంతైంది. ఫ ఉత్సవాల్లో ఎప్పుడు ఊరేగింపులు నిర్వహించినా భక్తులకు ప్రసాదాలుగా పులిహోర, శనగలు పంిపిణీ చేసేవారు. ఈసారి అటువంటిదేమీ లేదు.సంప్రదాయానికి విరుద్ధంగా..ఉత్సవాల చివరి రోజున నిర్వహించిన శ్రీపుష్పయాగం నిర్వహణపై కూడా విమర్శలు వచ్చాయి. ఏటా స్వామివారు పడుకుని ఉండగా, అమ్మవారు ఎడమవైపు ఉండి కాళ్లు ఒత్తుతున్నట్టు పవళింపు సేవలో అలంకరణ చేసేవారు. ఈసారి స్వామివారు అమ్మవారి తొడ మీద పడుకుంటే అమ్మవారు విసన కర్రతో విసురుతున్నట్టు అలంకరించారు. ఈ క్రమంలో సంప్రదాయానికి విరుద్ధంగా స్వామివారికి అమ్మవారు కుడివైపు వచ్చారు. ఇది ఎబ్బెట్టుగా ఉందని పలువురు విమర్శించారు. అమ్మవారి చేతిలో అందమైన రంగురంగుల విసనకర్ర లేదా నెమలి ఈకల విసనకర్రనో ఉంచితే బాగుండేదని, చిన్న తాటాకుల విసనకర్రతో సరిపెట్టేశారని పలువురు పెదవి విరిచారు. ఈసారి శ్రీపుష్పయాగంలో పుష్పాలు కూడా తక్కువగానే ఉపయోగించారు. ఏటా పెద్ద వయస్సున్న వేదపండితుల దంపతులు, ఆ తరువాత అదే వయస్సు కలిగిన ప్రధానార్చకుల ఐదు జంటలకు దంపత తాంబూలాలు ఇచ్చేవారు. కానీ, ఈసారి పెద్దలను పక్కన పెట్టి, చిన్న వయసులో ఉన్న దంపతులకు ఈ తాంబూలం ఇవ్వడం విమర్శలకు తావిచ్చింది. దంపత తాంబూలంలో ఇచ్చిన కొబ్బరి బొండాలు కూడా చాలా చిన్నవిగా ఉన్నాయనే అసంతృప్తి వ్యక్తమైంది.ఫ కల్యాణం నాడు అంతంత మాత్రంగా అలంకరణ ఫ వనదుర్గ అమ్మవారికి హోమాల నిలిపివేతపై వివాదం ఫ రథోత్సవానికి ఎండదెబ్బ ఫ శ్రీపుష్పయాగంలో సంప్రదాయానికి భిన్నంగా స్వామికి కుడివైపు అమ్మవారు ఫ సత్యదేవుని కల్యాణోత్సవాలపై భక్తుల పెదవి విరుపు -
మన్నించండి మహారాజా..
పిఠాపురం: వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలు కరవు బారిన పడకూడదని.. పంటలు పుష్కలంగా పండాలనే సమున్నత లక్ష్యంతో పిఠాపురం మహారాజా సమకూర్చిన అపార జలనిధిపై జలవనరుల శాఖ అధికారులు అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారు. వేల ఎకరాలకు సాగు నీరు, లక్షలాది మందికి తాగునీరు అందించేందుకు ఆ మహనీయుడు నిర్మించిన భారీ చెరువు నిర్వహణను గాలికొదిలేశారు. కనీసం తూములు కూడా బాగు చేయించకపోవడంతో వందల క్యూసెక్కుల నీరు కడలి పాలవుతోంది. మరోవైపు చెరువు ఆక్రమణల పాలవుతున్నా కబ్జాదారులకు అండగా నిలుస్తూ రైతులు, ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పిఠాపురం మహారాజా రావు వెంకట కుమార మహీపతి సూర్యారావు బహద్దూర్ వంశం దాతృత్వానికి ఈ చెరువు మచ్చుతునక. దీనిని నిర్మించిన పిఠాపురం మహారాజా విగ్రహాన్ని ప్రజలు ఆ చెరువు గట్టుపై ఏర్పాటు చేసుకుంటే.. దాని నిర్వహణనూ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆ విగ్రహం చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్లతుప్పలు పెరిగిపోయాయి. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 వేల ఎకరాల ఆయకట్టు పూర్వం తరచూ వర్షాభావ పరిస్థితులతో సాగునీరు లేక, పంటలు పండక రైతులు.. తాగునీరు లేక ప్రజలు, పశువులు అల్లాడిపోవడం చూసి మహారాజా కలత చెందారు. భవిష్యత్తులో ఎంత కరవు వచ్చినా తన రాజ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదని భావించారు. ఈ నేపథ్యంలో రాజా రావు బహద్దూరు (ఆర్ఆర్బీ) పేరిట 1841లో గొల్లప్రోలు మండలం చేబ్రోలు – మల్లవరం మధ్య 1,416 ఎకరాల విస్తీర్ణంలో పిఠాపురం మహారాజా అతి పెద్దదైన ఈ చెరువును నిర్మించారు. పదేళ్ల పాటు వానలు కురవక పోయినా సుమారు 20 వేల ఎకరాలకు సాగునీరు, 2 లక్షల మందికి తాగునీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా పిఠాపురం మహారాజా చర్యలు తీసుకున్నారు. కొత్తపల్లి, గొల్లప్రోలు, తొండంగి మండలాల్లోని నాగులాపల్లి, రమణక్కపేట, ఏకే మల్లవరం, ఏపీ మల్లవరం, శ్రీరాంపురం, రావివారిపోడు, ముమ్మిడివారిపోడు, ఏవీ నగరం, కోదాడ, రావికంపాడు, ఎ.విజయనగరం, దుర్గాడ, తొండంగి తదితర 30 గ్రామాల్లోని దాదాపు లక్ష కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి ఉన్నాయి. పిఠాపురం బ్రాంచి కెనాల్, సుద్దగెడ్డ కాలువల నుంచి ఈ చెరువులోకి నీరు ప్రవహిస్తూంటుంది. ఈ చెరువు కింద ప్రస్తుతం సుమారు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 50 వేల మంది రైతులు సాగు చేసుకుంటున్నారు. మహారాజా సాక్షిగా మట్టి పాలవుతున్న జలనిధి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ చెరువు నిర్వహణపై జలవనరుల శాఖ అధికారులు నిర్లక్ష్యం చూపుతూండటంతో ఇది కాస్తా మట్టిదిబ్బగా మారుతోంది. ఈ చెరువుకు 14 తూములు, ఒక కళింగలు ఉన్నాయి. చెరువు నిండా నీరు పెడితే పదేళ్ల పాటు 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. అయితే తూములు, కళింగలు పూర్తి అధ్వాన స్థితికి చేరుకోవడంతో వర్షాలు కురిసినప్పుడు అదనపు నీరు వచ్చినా.. నిల్వ చేసే అవకాశం ఉండటం లేదు. ఈ తూముల షట్టర్లు పూర్తిగా శిథిలమై, మట్టితో పూడుకుపోవడంతో ఎప్పటి నీరు అప్పుడే సముద్రంలోకి పోతోందని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా సుమారు 2 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని అంచనా. మరోవైపు తూములు పూడుకుపోయి సాగు నీరు అందక పంటలు నష్టపోతున్నారు. ఏటా కోట్లాది రూపాయలతో పనులు చేస్తున్నట్లు చెప్పుకునే ఇరిగేషన్ అధికారులు ఈ చెరువు వంక కన్నెత్తి కూడా చూడటం లేదని ఆరోపిస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం ప్రాచీన చరిత్ర, అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ చెరువు అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, వరదలు, అధిక వర్షాలు వచ్చినప్పుడు ఆయకట్టులోని వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చెరువులో నీటిని నిల్వ చేసే వీలు ఉండటం లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ చెరువును అభివృద్ధి చేయాలని, కళింగలు, తూములకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. తాత్కాలిక మరమ్మతులు ఆర్ఆర్బీ చెరువు తాత్కాలిక మరమ్మతులకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. తాత్కాలిక మరమ్మతులకు మాత్రమే నిధులు విడుదలవుతున్నాయి. పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఇంకా ఎటువంటి నిధులూ విడుదల కాలేదు. – సంతోష్ కుమార్, డీఈ, జలవనరుల శాఖఫ 1,400 ఎకరాల చెరువును పట్టించుకోని జలవనరుల శాఖ ఫ మహారాజా సాక్షిగా వందల క్యూసెక్కులు కడలి పాలు ఫ వేల ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం -
మట్టి తవ్వకాలపై కన్నెర్ర
·˘ పాపిడిదొడ్డి చెరువులో అడ్డుకున్న ఎఫ్కే పాలెం రైతులు ·˘ ఇరు వర్గాల మధ్య ఘర్షణ, తోపులాటపిఠాపురం: ఎఫ్కే పాలెం పాపిడిదొడ్డి చెరువులో అక్రమంగా మట్టి తవ్వుతున్నారంటూ రైతులు శనివారం కన్నెర్ర చేశారు. మట్టి తవ్వడానికి తీసుకువచ్చిన యంత్రాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు, మట్టి మాఫియాకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాటలు, వాదోపవాదాలు జరగడంతో సుమారు రెండు గంటల పాటు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంతో సంబంధం లేని ఇటుక బట్టీల వ్యాపారులు దాడికి ప్రయత్నించడంతో స్థానిక రైతులు కొందరు కింద పడిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం కావడంతో రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా కనీసంగా కూడా నోరు మెదపడం లేదని, మట్టి అక్రమార్కులకు వత్తాసు పలకడమేమిటని ప్రశ్నించారు. అయితే, మట్టి తవ్వకాలకు అనుమతులున్నాయని, అడ్డుకుంటే కేసులు నమోదు చేస్తామని పోలీసులు పరోక్షంగా హెచ్చరించారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు. మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న చెరువును సీపీఎం జిల్లా సీనియర్ నాయకుడు డి.శేషుబాబ్జీ, స్థానిక నాయకులు కుంచె చిన్న, కోనేటి రాజు శనివారం పరిశీలించారు. రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పాడా) పీడీ చైత్రవర్షిణి, కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, సీఐ శ్రీనివాస్, తహసీల్దార్ గోపాలకృష్ణ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మరొకరికి గాయాలు పిఠాపురం: దైవ దర్శనానికి కాలి నడకన వెళ్తున్న ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలైన సంఘటన పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పిఠాపురం పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. గొల్లప్రోలుకు చెందిన తొగర సూర్యలక్ష్మి, అడపా చంద్రకళ (35)లు శనివారం తెల్లవారుజామున గొల్లప్రో లు నుంచి పెద్దాపురం మండలం చిన తిరుపతి బయలుదేరారు. నడుచుకుంటూ వెళుతుండగా పిఠాపురం శివారు రాపర్తి జంక్షన్ వద్దకు వచ్చేసరికి అతి వేగంగా వచ్చిన ఒక గుర్తుతెలియని వాహనం వారిద్దరినీ బలంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలైన అడపా చంద్రకళ అక్కడికక్కడే మృతి చెందగా, సూర్యలక్ష్మికి గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన సూర్యలక్ష్మిని హైవే అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. పిఠాపురం పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి భర్త త్రిమూర్తులు అనారోగ్యంతో ఇంటి వద్దే ఉంటుండగా, కుమారుడు రాజేష్ ఇటీవలే పదో తరగతి పాసై ఇంటర్లో జాయిన్ అయ్యేందుకు సిద్ధపడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. అంతా తానై కుటుంబాన్ని చూసుకునే చంద్రకళ మృత్యువాత పడడంతో ఆ కుటుంబం వీధిన పడిందని స్థానికులు, బంధువులు ఆవేదన చెందుతున్నారు. నీకు నాలాగ పేదరికం ఉండకూడదని, తనను తల్లి చదివిస్తుందంటూ కుమారుడు రాజేష్ గుండెలవిసేలా విలపించాడు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఆ ఇంట్లో పెద్ద కష్టం
ఫ సైకిల్పై నుంచి పడిపోవడంతో ప్రమాదం ఫ మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద ఫ ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు కొత్తపేట: ఆ కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది.. రెక్కాడితే గాని డొక్కాడని ఆ ఇంటి పెద్ద ప్రమాదానికి గురై మంచాన పడటంతో అతని 15 ఏళ్ల కుమారుడిపైనే భారం పడింది. ఒకపక్క తండ్రికి వైద్యం, మరోపక్క కుటుంబాన్ని నెట్టుకురావడం ఈ బాలుడికి ఇబ్బందిగా మారింది. ఇలా నలుగురు సభ్యుల ఆ కుటుంబం తీవ్ర దయనీయ స్థితిలో ఉంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట కొప్పిశెట్టివారి వీధికి చెందిన షేక్ అహ్మద్ యాకూబ్ ఆలీషా (48)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తాపీమేస్త్రి వద్ద కూలీగా పనిచేస్తూ ఆలీషా కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్నాడు. గతేడాది నవంబరులో ఒకరోజు రాత్రి కూలిపని ముగించుకుని సైకిల్పై ఇంటికి వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ హెడ్లైట్లు కాంతి కంట్లోకి కొట్టి కళ్లు కనిపించక సైకిల్ అదుపుతప్పి రోడ్డు మార్జిన్లో రాళ్లపై పడిపోయాడు. మెడ కింద వెన్నెపూస నరాలు నలిగిపోయి కాళ్లు చచ్చుబడిపోయాయి. మొదట్లో రావులపాలెంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లగా కొన్ని రోజులు వైద్యం చేశారు. రోగం ముదిరిందే తప్ప తగ్గలేదు. తర్వాత అమలాపురంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వివిధ పరీక్షలు, కొన్ని రోజులు వైద్యం చేసి ఆపరేషన్ పడుతుందని, రూ.6 లక్షల వరకూ ఖర్చవుతుందని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఈ ఆపరేషన్కు రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలింది బాధితులే భరించాలన్నారు. అప్పటికే అప్పులు చేసి, బంధువులు, తెలిసిన వారు చేసిన సాయంతో సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశారు. కానీ ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. సరికదా అనారోగ్యం ముదిరి పక్షవాతం వచ్చింది. ఇక ఆర్థిక స్తోమత లేక కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లగా పరీక్షలు చేసి ఆపరేషన్ చేస్తాం కానీ పూర్తిగా కోలుకుంటాడని చెప్పలేమని అక్కడి వైద్యులు చెప్పారని బంధువులు అంటున్నారు. దాంతో వద్దని చెప్పడంతో కొన్ని రోజులు వైద్యం చేసి డిచ్చార్జ్ చేశారు. నడవలేక మంచానికే పరిమితమైన ఆలీషాను నెలా, రెండు నెలలకోసారి ఫిజియోథెరపీకి కాకినాడ తీసుకు వెళుతున్నారు. వెళ్లిన ప్రతిసారి అంబులెన్స్కు రూ.10 వేలు, అక్కడ సిబ్బందికి రెండు, మూడొందలు ఇవ్వాల్సి వస్తుందని అతని భార్య బీబీజా వాపోయారు. భర్త మంచాన పడి, ఆదాయం లేకపోవడంతో పదో తరగతి పాసైన కుమారుడిపైనే వైద్యం ఖర్చులు, కుటుంబ పోషణ పడిందన్నారు. చదువుకు స్వస్తి చెప్పి కూలి పనికి వెళ్తున్నాడని, అయ్యే ఖర్చులకు తన కొడుకు సంపాదన సరిపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని బీబీజా ఆవేదనతో చెప్పారు. మంచాన పడిన వారికి ఇచ్చే పింఛను కోసం సదరం క్యాంపునకు వెళితే, 83 శాతం అంగవైకల్యం అని సర్టిఫికెట్లో పేర్కొన్నారు. కానీ టెంపరరీ అని రాశారని, దీనివల్ల పింఛను రాదన్నారని బీబీజా వాపోయారు. దీనావస్థలో ఉన్న ఈ కుటుంబానికి దాతలు ఆపన్నహస్తం అందించాలని స్థానిక పీఎంపీ షేక్ హైదర్, మెడికల్ రిప్రజంటేటివ్ షేక్ మక్బుల్ కోరారు. -
అనాథరక్షకా.. ఆపద్బాంధవా..
ఫ గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి ఫ ఒక్కరోజే రూ.51.96 లక్షల ఆదాయం కొత్తపేట: అనాథరక్షకా.. ఆపద్బాంధవా.. గోవిందా.. అంటూ వేలాది భక్తులు ఆ స్వామిని కొలిచారు. గోవింద నామస్మరణతో ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మార్మోగింది. శనివారం వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేసి తలనీలాలు సమర్పించారు. భారీ క్యూలో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించే భక్తులు మాడ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో ప్రారంభించి వివిధ సేవలు నిర్వహించారు. రంగురంగుల సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని విశేషంగా అలంకరించారు. స్వామి దర్శనం, తీర్థప్రసాదాలు స్వీకరణ అనంతరం అన్నసమారాధనలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఈ ఒక్కరోజు దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.51,96,999 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయం వద్ద రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము బందోబస్తు పర్యవేక్షించారు. అలాగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా వాడపల్లికి ప్రత్యేక బస్సులు నడిచాయి. -
అనుమానాస్పద స్థితిలో జంట ఆత్మహత్య?
సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలో ఒక జంట అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన శనివారం కలకలం రేపింది. సామర్లకోట రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ కథనం ప్రకారం.. సామర్లకోట నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఓ రైలుకు అడ్డుగా ఆ జంట నిలబడి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాల వద్ద ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రైల్వే పోలీసులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వాటిని తరలించారు. అయితే కాకినాడలోని ఓ ఆఫీస్లో అకౌంటెంట్గా సదరు వ్యక్తి పని చేస్తున్నట్లు, ఆ మహిళ నర్సుగా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారని రైల్వే మేనేజర్ రమేష్ వివరించారు. ఆ జంటకు వేర్వేరుగా వివాహాలు కాగా, ఇద్దరూ కలసి ఆత్మహత్య చేసుకోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు రాత్రి వరకూ ఎటువంటి వివరాలు చెప్పకపోవడం గమనార్హం. -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: తుని– అన్నవరం మధ్యలో రైలు నుంచి జారిపడి అర్లి ఈశ్వరరావు (23) మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంగి గ్రామానికి చెందిన ఈశ్వరరావు తొండంగి మండలం దివీస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామానికి సెలవుపై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గజపతినగరంలో రైలు ఎక్కి అన్నవరం రైల్వే స్టేషన్కు వస్తుండగా జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. -
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
అంబాజీపేట: దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అంబాజీపేట మండలం ముక్కామల, వక్కలంక వంతెనకు మధ్య ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. స్థానికులు, సమీప బంధువుల కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా నిజామ్పేటకు చెందిన దొమ్మేటి శ్రావణ్కుమార్, అతని భార్య రేఖాలక్ష్మి (38), వీరి కుమార్తెలు లాస్య, మోహనగన ప్రియతో పాటు రేఖాలక్ష్మి అమ్మమ్మ కె.ధనలక్ష్మితో కలసి కారులో శనివారం ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. అనంతరం అమలాపురం వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ముక్కామల వచ్చేసరికి అమలాపురం నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్ను వీరి కారు బలంగా ఢీకొంది. దాంతో కారులో ఉన్న రేఖాలక్ష్మికి తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకు వెళుతుండగా మార్గ మధ్యంలో మృతి చెందారు. శ్రావణ్కుమార్, లాస్య, మోహనగన ప్రియ, ధనలక్ష్మిలకు తీవ్ర గాయాలు కాగా అమలాపురంలో ఓ ఆస్పత్రికి తరలించారు. రేఖాలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై కె.చిరంజీవి పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రావణ్కుమార్ నిజామ్పేటలో స్థిరపడి అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతనిది యానం కాగా, మృతురాలి తల్లిదండ్రులది అమలాపురం. పళ్లాలమ్మ జాతరకు వచ్చి... వారం రోజుల కిందట నిజామ్పేట నుంచి వానపల్లి పళ్లాలమ్మ అమ్మవారి జాతర చూసేందుకు వచ్చి అమలాపురంలో మృతురాలి తల్లి ఇంటి వద్ద బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులంతా కలసి వెళ్లారు. అనంతరం యానం వెళ్దామనుకుని అమలాపురం వస్తుండగా ప్రమాదం జరిగిందని బంధువులు చెప్పారు. వారం రోజుల పాటు బంధువులతో సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి ఇంతలో ప్రమాదం జరగడంతో అంతా కన్నీరుమున్నీరు అవుతున్నారు. వేసవి సెలవులకు వచ్చిన ఆ కుటుంబంలో విషాదం నెలకొంటుందని అనుకోలేదని బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. వివాహిత మృతి, నలుగురికి తీవ్ర గాయాలు -
పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత
కాకినాడ జిల్లా: పిఠాపురం రూరల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫక్రుద్దీన్ పాలెం( ఎఫ్.కే.పాలెం) పాపిడి దొడ్డి చెరువులో మట్టి తవ్వేందుకు యత్నించగా.. జేసీబీని రైతులు అడ్డుకున్నారు. చెరువును పరిశీలించిన సీపీఎం నేతలు.. చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎమ్మార్వో అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను బీడుగా మారుస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తారని ఆరోపించారు. పంచాయితీ తీర్మానం, రైతులు అభిప్రాయం తీసుకోకుండా ఎమ్మార్వో మట్టి తవ్వకాలకు ఏలా అనుమతి ఇస్తారంటూ సీపీఎం నేతలు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సీపీఎం నేతలు హెచ్చరించారు. -
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
కాకినాడ జిల్లా: తుని రూరల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రి అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. మరో ఘటనలో కడియం-రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్ఫీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు.మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడి చేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
సమస్యలపై ప్రజాపోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సమస్యలపై ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వాన్ని మేలుకొల్పేలా పోరుబాటకు వైఎస్సార్ సీపీ సిద్ధమవుతోంది. ఇందుకు పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రానున్న రెండు నెలల్లో మండల, గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు. వచ్చే జూన్ లోగా ఇంకా మిగిలిన మండలాలు, జూలైకల్లా గ్రామ స్థాయి కమిటీల నియామకాలు పూర్తి చేయాలని సూచించారు. కాకినాడ డి–కన్వెన్షన్లో శుక్రవారం జరిగిన పార్టీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవ్వాలనేది ప్రధాన అజెండాగా నిర్ణయించారు. ఇందుకోసం ప్రజల సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వాలు శాంతియుత పంథాలో నిరసన కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి నాయకత్వాన నిర్వహించిన ఆందోళనలపై ఈ సమీక్షలో చర్చించారు. ఇదే తరహాలో సమస్యలపై పోరుబాటకు సన్నద్ధం కావాలని నేతలకు బొత్స సూచించారు. జిల్లా స్థాయిలో సైతం పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని తీర్మానించారు. దీని కోసం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 50 రోజుల కార్యక్రమాన్ని ఖరారు చేశారు. వచ్చే జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలను ఐదు జిల్లాల్లో 50 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. రైతులకు అండగా.. ఫ ప్రధానంగా వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న రైతులకు అండగా నిలవాలని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని బొత్స తెలిపారు. కళ్లాల్లో ధాన్యం ఉన్నా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయంపై ఈ సందర్భంగా చర్చించారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితికి అసలు పొంతనే లేదని నేతలు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ విషయంలో రైతుల ఇబ్బందులు తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించి, వారితో మాట్లాడి, అండగా నిలవాలని నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఫ ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని నిర్ధారించారు. రొయ్యల ధరలు పడిపోవడం, మేత ధరలు అడ్డగోలుగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నా సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదని, ఆక్వా రైతులకు వెన్నంటి నిలవాలని తీర్మానించారు. ఫ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మాదిరిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొగాకు రైతులకు అండగా నిలిచి, పోరాడటానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయించారు. ఫ ప్రధానమైన ప్రజా సమస్యలపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి క్షేత్ర స్థాయిలో పర్యటించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారని బొత్స వివరించారు. ఫ సూపర్ సిక్స్ సహా కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలయ్యే వరకూ ప్రభుత్వంపై ప్రజాపోరులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేలా బాధ్యత తీసుకోవడానికి నాయకులు ముందుకు వచ్చారు. ఫ క్షేత్ర స్థాయిలో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు, ప్రజలకు అండగా నిలిచి, మనోధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, పండుల రవీంద్రబాబు, అనంత బాబు, బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రులు పినిపే విశ్వరూప్, తానేటి వనిత, తోట నరసింహం, గొల్లపల్లి సూర్యారావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్రామ్, గిరజాల స్వామినాయుడు, పార్లమెంటరీ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పొన్నాడ సతీష్ కుమార్, జ్యోతుల చంటిబాబు, రౌతు సూర్యప్రకాశరావు, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, పాముల రాజేశ్వరిదేవి, అంగూరి లక్ష్మీశివకుమారి, అసెంబ్లీ కో ఆర్డినేటర్లు ముద్రగడ గిరిబాబు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, మహిళా నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మేడపాటి షర్మిలారెడ్డి, సుంకర శివప్రసన్న, జమ్మలమడక నాగమణి, పతివాడ నూక దుర్గారాణి, గాధంశెట్టి శ్రీదేవి, నేతలు సుంకర విద్యాసాగర్, అల్లి రాజబాబు, రాగిరెడ్డి బన్నీ, గండేపల్లి బాబీ, వాసిరెడ్డి జమీలు, చెల్లుబోయిన శ్రీనివాస్, గొల్లపల్లి డేవిడ్, మార్గాని గంగాధరరావు, పేరి శ్రీనివాసరావు, గుత్తుల మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఫ ప్రజలతో నేతలు మమేకమవ్వాలి ఫ ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అండ ఫ ఆక్వా రైతులకు వెన్నుదన్ను ఫ క్షేత్ర స్థాయి పర్యటనలకు అధినేత జగన్ ఫ ప్రతి 10 రోజులకు వైఎస్సార్ సీపీ జిల్లా సమావేశం ఫ జూన్ లోగా మండల కమిటీలు ఫ జూలైనాటికి గ్రామ కమిటీలు ఫ కాకినాడ సమీక్షలో పార్టీ నేత బొత్స దిశానిర్దేశం -
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ పై అంతస్తులో అగ్నిప్రమాదం.. వెంటనే విపత్తు స్పందన సిబ్బంది నిచ్చెన సహాయంతో భవనం లోపలకు చేరుకుని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకువచ్చారు.. బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించేందుకు అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.. ఇదంతా నిజమనుకునేరు.. అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కొనేలా ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖల సిబ్బంది కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మాక్ డ్రిల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందులో అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే విధానాన్ని ఆ శాఖ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపారు. అలాగే, ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను కాపాడటం, సహాయక చర్యలు తదితర అంశాలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో కొంత భాగం కూలిపోయినట్లు ఊహించి.. అందులోని వారిని కాపాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. కూలిన భవనంలో చిక్కుకున్నవారిని గుర్తించేందుకు అధునాతన పరికరాల వినియోగాన్ని వివరించారు. గోడను కట్టర్లతో కట్ చేసి, భవనంలోకి ప్రవేశించి, లోపలున్న వారిని బయటకు తరలించడం తదితర అంశాలను చూపించారు. సీపీఆర్, అత్యవసర వైద్యంపై ఆ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్ను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా స్వయంగా పర్యవేక్షించారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని ఆయనన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ జె.వెంకటరావు, మూడో బెటాలియన్ ఎస్డీర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం.మోహన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, డీఈఓసీ నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్డీసీ డి.భారతి తదితరులు పాల్గొన్నారు. -
అప్పులతో ఏపీ మరో పాకిస్తానే
ఫ మెడలు వంచైనా హామీలు అమలు చేయిస్తాం ఫ ధాన్యం కొనుగోలులో సర్కార్ ఘోర వైఫల్యం ఫ పౌర సరఫరాల మంత్రి చెప్పేదంతా బూటకమే ఫ సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి జగన్ ఫ కాకినాడ సమీక్షలో రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తోందని, ఈ లెక్కలు చూస్తూంటే ఏపీకి ఆర్థికంగా పాకిస్తాన్కు పట్టిన గతే పడుతుందని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. చెత్తతో కూడా సంపద సృష్టిస్తామని చెప్పి, ఆ చెత్తను తరలించే ట్రాక్టర్లను తీసేశారని, రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోవడం చంద్రబాబు ఘనతని ఆక్షేపించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్లు, పార్లమెంటరీ పరిశీలకులు, ముఖ్య నేతలతో కాకినాడలో శుక్రవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చెప్పుకోదగ్గ ఉత్పత్తి ఆధారంగా ఒక్క పని అయినా చేయగలిగారా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో మిగిల్చిన అప్పులతో కలిపి గడచిన ఐదేళ్లలో అప్పులు రూ.4.30 లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో ఏటా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్లు మాత్రమే అప్పులు పెరిగాయన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఏడాదిలోనే రూ.1.59 లక్షల కోట్ల అప్పులు చేసిన నిర్వాకం చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఇంతా చేసి పేదల సంక్షేమానికి ఏమీ ఖర్చు చేయలేదని చేసిన కోట్ల రూపాయల అప్పు ఎవరి ఖాతాల్లోకి పోయాయో, ఎవరు దోపిడీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో దళారీ వ్యవస్థ లేకుండా పేదలు, మధ్యతరగతి సంక్షేమం కోసం డీబీటీ ద్వారా నేరుగా వ్యక్తిగత ఖాతాలకు రూ.2.50 లక్షల కోట్లు జమ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అప్పు చేసిన సొమ్ము పౌడర్లు, మేకప్లకు ఖర్చు చేశారని బొత్స ఎద్దేవా చేశారు. బాబు చెబుతున్నది చూస్తూంటే ఆయన చేతిలో అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. మద్యం విధానంపై వేధిస్తున్నారు మద్యం కుంభకోణం పేరుతో కొందరిని టార్గెట్ చేసి వేధిస్తూ, అప్రతిష్టపాల్జేస్తున్నారనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదన్నారు. మద్యం వ్యవహారంలో నిష్పక్షపాత విచారణను స్వాగతిస్తామని, కావాలని అన్యాయంగా కేసులు పెడుతూ పోతారా అని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని తీర ప్రాంతంలో హార్బర్లు, వైద్య కళాశాలలు, ఉద్దానంలో కిడ్నీ ఆస్పత్రి, భోగాపురంలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం వంటి ఉత్పత్తి, ఉపాధి ఆధారంగా పెట్టుబడులు పెట్టామని వివరించారు. సమస్యలపై ఆందోళనలు సమస్యలపై పార్టీ స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ఆందోళనలకు సిద్ధమవుతోందని బొత్స చెప్పారు. ప్రధానమైన పొగాకు, ధాన్యం, ఆక్వా రైతుల సమస్యలపై వారికి అండగా నిలిచేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుని జగన్మోహన్రెడ్డి త్వరలో క్షేత్ర స్థాయికి వస్తారని తెలిపారు. పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా జూన్లో మండల, జూలై నెలాఖరుకు గ్రామ కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కాకినాడ సమీక్షలో తీర్మానించినట్లు చెప్పారు. జూన్ 1 నుంచి ప్రతి 10 రోజులకు ఒక జిల్లాలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని బొత్స వెల్లడించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, వంకా రవీంద్ర, బొమ్మి ఇజ్రాయిల్, పండుల రవీంద్రబాబు, అనంత ఉదయ్ భాస్కర్, కుడుపూడి సూర్యనారాయణరావు, పార్టీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేర్ కురసాల కన్నబాబు, ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ జిల్లాల అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (తూర్పు గోదావరి), దాడిశెట్టి రాజా (కాకినాడ), చిర్ల జగ్గిరెడ్డి (కోనసీమ), పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ మంత్రులు తానేటి వనిత, పినిపే విశ్వరూప్, తోట నరసింహం, కారుమూరి నాగేశ్వరరావు, గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్రామ్, కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరి ప్రసాదరాజు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, దూలం నాగేశ్వరరావు, పొన్నాడ సతీష్కుమార్, తలారి వెంకట్రావు, గెడ్డం శ్రీనివాసనాయుడు, రౌతు సూర్యప్రకాశరావు, పాముల రాజేశ్వరిదేవి, పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు పాల్గొన్నారు. రైతుల ఇబ్బందులు పవన్కు పట్టవా? ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ ఘోర వైఫల్యం ప్రధానంగా గోదావరి జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తోందని బొత్స దుయ్యబట్టారు. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొంటున్నామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పేదంతా బూటకమన్నారు. గోదావరి ప్రాంతం నుంచి గెలుపొందిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రైతుల వద్దకు రాకపోవడం వారి దురదృష్టమని అన్నారు. ధాన్యం కొనే నాథుడు లేక గోదావరి జిల్లాల రైతులు నానా యాతనా పడుతూంటే పవన్ కల్యాణ్ ఒక్కసారైనా ఈ ప్రాంతంలో పరిస్థితిని పరిశీలించారా అని ప్రశ్నించారు. కోకో ధర కోసం అధికార పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే తదితరులు ఆందోళనకు దిగడం రాష్ట్రంలోని పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొగాకు, ఆక్వా రైతుల ఇబ్బందులపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. గత ఎన్నికల సందర్భంగా మరో రెండు హామీలివ్వాలని తామంతా ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్రెడ్డి చేయగలిగిందే చెబుదామన్నారని, చంద్రబాబు మాదిరిగా అధికారం కోసం ఎడాపెడా హామీలు గుప్పించ లేదని బొత్స చెప్పారు. చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ సహా అన్ని హామీలనూ ప్రభుత్వ మెడలు వంచైనా సరే అమలు చేసేలా వైఎస్సార్ సీపీ ఒత్తిడి తెస్తుందని అన్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలపై ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. తమ పార్టీకి ప్రజలిచ్చిన 40 శాతం ఓటింగ్ చిన్న విషయం కాదన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు ప్రజలే వైఎస్సార్ సీపీకి రెండంకెల ఓటింగ్ ఇచ్చారన్నారు. -
కేదార్నాథ్ యాత్రలో రోటరీ క్లబ్ సభ్యుడి మృతి
రాజమహేంద్రవరం సిటీ: ఉత్తరాంచల్లోని కేదార్నాథ్ యాత్రకు వెళ్లిన రాజమహేంద్రవరానికి చెందిన రోటరీ క్లబ్ ఐకాన్ సభ్యుడు బిలిసెట్టి శ్రీరంగ కృష్ణ బదరి(33) బుధవారం కేదార్నాథ్లో మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం ఢిల్లీ నుంచి హైదరాబాద్ మీదుగా శుక్రవారం మృతదేహాన్ని నగరంలోని కంబాలసత్రం సమీపంలోని కృష్ణ బదరి నివాసానికి తీసుకువచ్చారు. కృష్ణ బదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, క్లబ్ అధ్యక్షుడు యిమ్మన్ని వెంకట్, క్లబ్ సభ్యులు మృతదేహానికి నివాళులు అర్పించారు. తీగల రాజా మాట్లాడుతూ చిన్న వయసులోనే సమాజ శ్రేయస్సుకు శ్రద్ధగా పనిచేసే క్లబ్ సభ్యుడు అకాల మరణం సమాజానికి తీరని లోటు అన్నారు. కృష్ణ బదరి అంత్యక్రియలను ఇన్నీసుపేట రోటరీ కై లాస భూమిలో నిర్వహించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడతా..
28వ ర్యాంకర్ యజ్ఞేశ్వరి అమలాపురం టౌన్: ఏపీ ఈ సెట్ ఫలితాల్లో అమలాపురానికి చెందిన పితాని యజ్ఞేశ్వరి రాష్ట్ర స్థాయిలో 28వ ర్యాంక్ సాధించింది. ఆమె సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఈ ర్యాంక్ను కై వసం చేసుకుంది. ఆమె అమలాపురం ఆరు నెలలుగా పీఆర్ ప్రాజెక్ట్స్ విభాగంలో ఇండస్ట్రీయల్ ట్రైనింగ్ తీసుకుంటోంది. ఈమె తండ్రి వెంకటరమణ వడ్రంగి మేస్త్రిగా పనిచేస్తున్నారు. భవిష్యత్లో మంచి ఆర్కిటెక్ట్గా స్థిరపడాలన్నది తన లక్ష్యమని ఆమె పేర్కొంది. అమలాపురం పంచాయతీరాజ్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అభినందన సభలో యజ్ఞేశ్వరిని ఈఈ పులి రామకృష్ణారెడ్డి, డీఈఈ అన్యం రాంబాబు ప్రశంసించారు. -
ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్
60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అన్నవరం: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులను మాటలతో మభ్యపెట్టి వారి బ్యాగుల్లో గల విలువైన ఆభరణాలు, నగదు అపహరిస్తున్న ఇద్దరు మహిళా దొంగలను శుక్రవారం స్థానిక బస్ కాంప్లెక్స్ వద్ద అరెస్ట్ చేసినట్టు ప్రత్తిపాడు సీఐ బీ సూర్య అప్పారావు తెలిపారు. అన్నవరం, ప్రత్తిపాడు బస్స్టేషన్ల వద్ద తమ బంగారు వస్తువులు దొంగలు అపహరించారని మహిళలు ఆయా పోలీస్స్టేషన్లలో కొద్దిరోజుల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. బస్టాండ్ల వద్ద నిఘా పెట్టారు. శుక్రవారం అన్నవరం బస్ కాంప్లెక్స్ వద్ద దొంగతనం చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వీరిని ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకటలక్ష్మి, రామవరప్పాడుకు చెందిన నక్కా మంగగా గుర్తించారు. వీరి వద్ద నుంచి 60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి ప్రత్తిపాడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సమావేశంలో అన్నవరం ఎస్ఐ శ్రీహరి బాబు, అడిషనల్ ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు. -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కడియం – రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ల మధ్య రైలునుంచి జారి పడి సుమారు 50 ఏళ్ల వయసుగల వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని జీఆర్పీ ఎస్సై మావుళ్లు తెలిపారు. గాయపడి ఉండగా శుక్రవారం తెల్లవారు జామున గుర్తించి 108 అంబులెన్సు ద్వారా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడు నలుపు రంగుపై పసుపు రంగు గడులు గల హాఫ్ హాండ్స్ షర్ట్, నీలం రంగు లుంగీ ధరించాడు. మృతుడి కుడిచేయి మీద సన్ ఫ్లవర్ గుర్తుతో పచ్చబొట్టు ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుని వివరాలు తెలిసిన వారు 94406 27551, 94910 03239 నంబర్లలో సంప్రదించాలన్నారు. నిడదవోలులో.. నిడదవోలు : చాగల్లు –నిడదవోలు రైల్వేస్టేషన్ మధ్యలో శుక్రవారం విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న రైలు నుంచి జారిపడి 40 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడు నలుపు, సిమెంటు రంగు నెక్ బనియన్, నీలం రంగు ప్యాంట్ ధరించాడు. మృతదేహాన్ని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసినవారు 94906 17090, 99480 10061 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై అప్పారావు తెలిపారు. -
సివిల్స్ చదవడమే లక్ష్యం
జిల్లా 8వ ర్యాంకర్ స్పందన మామిడికుదురు: బీటెక్ పూర్తి చేసి సివిల్స్ చదవాలన్నదే తన లక్ష్యమని ఏపీ ఈసెట్లో కోనసీమ జిల్లా స్థాయిలో 8వ ర్యాంకు సాధించిన మొగలికుదురు గ్రామానికి చెందిన గోగి మోహిని స్పందన శుక్రవారం తెలిపింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన స్పందన బీఎస్సీ మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రతిభ చూపింది. తండ్రి సత్యనారాయణ రైతు, తల్లి వెంకటలక్ష్మి గృహిణి. పేరెంట్స్ ప్రోత్సాహంతో తాను చదువుకున్నానని తెలిపింది. ఏపీ ఈసెట్లో ప్రతిభ చూపిన మోహిని స్పందనను స్థానికులు అభినందించారు. వ్యవసాయ శాస్త్రవేత్తనవుతా.. మామిడికుదురు: ఏపీ ఈసెట్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్లో ఆదుర్రు గ్రామానికి చెందిన గుబ్బల సాయిమణిరత్నం రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించాడు. తాను వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నానని అన్నాడు. శాస్త్రవేత్తగా రైతులకు మేలైన యంత్ర పరికరాలను తయారు చేసి, మంచి దిగుబడులు సాధించేలా కృషి చేయడమే తన లక్ష్యమని తెలిపారు. సాయిమణిరత్నం తండ్రి లక్ష్మణరావు, తల్లి శ్యామలాదేవి దంపతులు రైతు కుటుంబానికి చెందినవారు. సాయిమణిరత్నంను స్థానికులు శుక్రవారం అభినందించారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
రూ.6,50,000 విలువైన వస్తువుల రికవరీ కోరుకొండ: మండలంలోని దోసకాయలపల్లిలో ఈ నెల 11వ తేదీన చోరీకి గురయిన రోవర్ మెషీన్, ల్యాబ్, లైటర్లను శుక్రవారం రికవరీ చేసినట్టు కోరుకొండ సీఐ సత్యకిషోర్ తెలిపారు. సర్వేయరు నాగేంద్ర రూ.6,50,000 విలువైన రోవర్ మెషీన్, ట్యాబ్, లైటర్లను దోసకాయలపల్లి సెంటర్లోని కిరాణాషాపులో చార్జింగ్ కోసం ఉంచాడు. తెల్లవారు దుకాణం తెరిచేటప్పటికే చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా, సీఐ సత్యకిషోర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. రాజమహేంద్రవరం బాలాజీపేటకు చెందిన రవివర్మ, అతని తమ్ముడు, క్వారి మార్కె ట్ సెంటర్కు చెందిన యేసును పట్టుకున్నారు. వారి నుంచి వస్తువులను స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు. -
‘కుట్రతోనే లిక్కర్ స్కామ్ అంటూ అక్రమ కేసు’
కాకినాడ: తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు చేస్తూ,వైఎస్సార్సీపీని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో పని చేస్తోందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.తమ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో నిజంగా తప్పు జరిగి ఉంటే, నిష్పాక్షికంగా జరిపే ఎలాంటి విచారణనైనా స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు. కానీ రాజకీయ దురుద్దేశాలతో తప్పుడు విచారణల పేరుతో వేధింపులకు పాల్పడితే సహించేది లేదని, ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండ గడతామని కాకినాడలో మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..కూటమి ప్రభుత్వం దారుణ వ్యవహారంకూటమి ఏడాది పాలనలో పార్టీల హనీమూన్ ముగిసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కింది. కూటమి పాలనలో అవినీతి, దోపిడీ తప్ప ప్రజా సంక్షేమం, అభివృద్ది ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయ కక్ష సాధింపులకే మొత్తం సమయాన్ని వెచ్చిస్తున్నారు.ఎన్నికల మందు ఆర్భాటంగా ప్రచారం చేసిన సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చకుండా తప్పించుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు పెట్టుబడి సాయం, ప్రతి కుటుంబానికి ఏటా మూడు ఉచిత సిలిండర్లు, ఏటా 4 లక్షల ఉద్యోగాలు లేదా ప్రతి నెలా ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేల భృతి, ఆడబిడ్డ నిధి కింది ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామన్నారు. కానీ, ఏడాది గడుస్తున్నా వాటిలో ఏదీ అమలు చేయడం లేదు.మరోవైపు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అంతులేని అవినీతి. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా కేవలం 99 పైసలకే దాదాపు 3 వేల కోట్ల విలువైన భూముల అప్పగింత. ఇంకా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ.. ‘సీజ్ ది షిప్’ అని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ నానా హంగామా చేశారు. ఒక్క బియ్యం గింజ కూడా అక్రమంగా రవాణా చేయడానికి వీలులేదని అన్నారు. కానీ ఒక్క దానిపైనా చర్యలు లేవు. పోలీసుల జులుంతో ప్రభుత్వాన్ని నడిపించాలని చూస్తున్నారు. అందుకే ప్రశ్నించే గొంతులను నొక్కేయాలని ప్రయత్నిస్తున్నారు.తెచ్చిన అప్పులు దేనికి ఖర్చు చేశారు?ఏడాది పాలనలోనే ఏకంగా రూ.1.59 లక్షల కోట్లు అప్పులు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంతలా ఏడాదిలో అప్పులు చేయలేదు. ఇంత అప్పులు తెచ్చి ఏ ప్రజా సంక్షేమ కార్యక్రమానికి ఖర్చు చేశారు? మా హయాంలో అప్పులు చేసినా, వివిధ పథకాల కింద రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం. మరి కూటమి ప్రభుత్వం చేసిన అప్పులు దేనికి వినియోగించారో చెప్పాలి. సంపద సృష్టిస్తాను. అది తనకు బాగా తెలుసు అని ప్రచారం చేసిన చంద్రబాబు, మరి ఇన్ని అప్పులు, ఇంత తక్కువ సమయంలో ఎందుకు చేశారు? అప్పు చేయడం. ప్రచార ఆర్భాటాలకు ఖర్చు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటు.అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొంత అప్పు చేసినా, ఆ ఖర్చులకు ఒక అర్థం ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, తీర ప్రాంతాల్లో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, బోగాపురం ఎయిర్పోర్ట్.. ఇలా ఉత్పాదకతకు దోహదం చేసే వాటికి ఖర్చు చేశాం. మాట ఇస్తే, దాన్ని తప్పకుండా నెరవేర్చాలనేది జగన్గారి విధానం. అందుకే ఎన్నికల ముందు, టీడీపీ కూటమి మాదిరిగా, అడ్డగోలు హామీలు ఇవ్వలేదు.పార్టీ కార్యాచరణ. నిర్ణయాలువైఎస్సార్సీపీ అయిదు జిల్లాల ముఖ్య నేతలతో ఈరోజు (శుక్రవారం) సమావేశం నిర్వహించాం. భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో సంస్థాగతంగా క్షేత్రస్థాయి నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు, ప్రతి జిల్లాలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకున్నాం. అలాగే గోదావరి జిల్లాల్లో ధాన్యం సేకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడంతో పాటు, తీర ప్రాంతాల్లోని ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో పొగాకు రైతులు మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ పొగాకు రైతులు ఇదే సమస్యలపై ఇబ్బంది పడుతున్నారు.దీనిపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్, పొగాకు రైతులను కలిసి నేరుగా వారితో మాట్లాడనున్నారు. తదుపరి పొగాకు కొనుగోళ్ళపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పార్టీ పరంగా కార్యాచరణను ఖరారు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పొగాకు మద్దతు ధర లభించని సందర్భంగా మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నాం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆ మొద్దునిద్ర నుంచి ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు రైతుల పక్షాన పోరాడతామని బొత్య సత్యనారాయణ హెచ్చరించారు. -
గడువులోగా హైవేల నిర్మాణం
కాకినాడ సిటీ: జిల్లాలో చేపట్టిన వివిధ జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), రెవెన్యూ, సర్వే, ఏపీఈపీడీసీఎల్, పోలవం ఇరిగేషన్ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. జాతీయ రహదారి 216 కాకినాడ–కత్తిపూడి, కాకినాడ పోర్టు–అచ్చంపేట, అచ్చంపేట–సామర్లకోట, వాకలపూడి–అన్నవరం వరకు నిర్మించనున్న జాతీయ రహదారులు, నిర్మాణ దిశలో ఉన్న రహదారుల పనులు పురోగతి, ఇతర భూసేకరణ, టెండర్లు ప్రక్రియలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులతో చర్చించారు. ఎన్హెచ్ఎఐ పీడీ డి.సురేంద్ర, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ జి ప్రసాద్, తహసీల్దార్లు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛదివస్ కార్యక్రమాన్ని బీట్ ది హీట్ థీమ్తో నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ఉష్ణోగ్రతలు, హ్యుమిడ్ వాతావరణంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం సూచించిన వివిధ అంశాలతో ఈ నెల స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. -
టెన్త్ సప్లిమెంటరీకి ఏర్పాట్లు
కాకినాడ సిటీ: ఈ నెల 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పదో తరగతి విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం పదోతరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై డీఆర్వో జె.వెంకటరావు, రెవెన్యూ, పాఠశాల విద్య, ఓపెన్ స్కూల్ సొసైటీ, పోస్టల్, జిల్లా పరిషత్, పోలీస్, ట్రెజరీ, రవాణా, విద్యుత్, వైద్య ఆరోగ్యం, ఆర్టీసీ, పంచాయతీ, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 29 పరీక్షా కేంద్రాల్లో 5,956 మంది విద్యార్థులు హాజరుకానున్నారన్నారు. ప్రశ్నాపత్రాలు స్టోరేజీ నిమిత్తం 18 పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో పదోతరగతి (ఓపెన్ ఎస్ఎస్సీ), ఓపెన్ ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయని డీఆర్వో తెలిపారు. రెగ్యులర్ పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలతో పాటు ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడిట్ సప్లమెంటరీ పరీక్షలు ఉదయం పూట నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 1,151 మంది విద్యార్థులకు నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి పి రమేష్, డీటీసీ లక్ష్మికిరణ్, పోస్టల్ పీఆర్ఐపీ కె.ప్రసాదరావు, డీసీఈబీ సెక్రటరీ ఎం.వెంకటరావు, ఓపెన్ స్కూల్ సొసైటీ అధికారి పి సాయివెంకటరమణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత కన్ను
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీలో జరుగుతోన్న భూ భాగోతమిది. ఈ భాగోతం ప్రస్తుతం కాకినాడ రెవెన్యూలో హాట్టాపిక్గా మారింది. నగర పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 579లో గ్రామ పంచాయతీకి 1.52 ఎకరాల భూమి గ్రామ కంఠంగా ఉంది. ఈ విషయం గొల్లప్రోలు ఫెయిర్ అడంగల్లో స్పష్టంగా ఉందని అక్కడి ప్రజలు, నేతలు చెబుతున్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో ఇళ్ల నిర్మాణాలు పెరగడంతో ఇక్కడ భూముల ధరలు బాగా పెరిగాయి. ఈ ఎకరా 52 సెంట్లు భూమి 7,296 గజాలు వస్తోంది. తహసీల్దార్ కార్యాలయానికి సమీపాన తాటిపర్తి రోడ్డు పక్కన గజం రూ.30వేలు పైనే పలుకుతోంది. అదే ఈ భూమికి పరిసరాల్లో గజం రూ.20వేలు ఉంది. ఈ లెక్కన చూసుకుంటే గ్రామకంఠంగా చెబుతోన్న ఈ భూమి విలువ సుమారు రూ.15 కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో భూముల విలువ పెరిగిపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత కన్ను దీనిపై పడింది. అలాగని ఆయన ఎక్కడా బయట పడకుండా తెరవెనుక చక్రం తిప్పుతూ భూ బదలాయింపు ప్రక్రియ నడిపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రజల ఆస్తిని కాపాడాలి
వివిధ దశల్లో రెవెన్యూ అధికారులు, మున్సిపల్ ఆర్డీ సర్వే నంబర్ 579లో 1.52 ఎకరాల భూమిని పక్కాగా ప్రభుత్వ భూమి అని నిర్థారించారు. గొల్లప్రోలు నగర పంచాయతీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా ఇదే విషయాన్ని న్యాయస్థానానికి నివేదించింది. మూడేళ్లుగా నడుస్తోన్న ఈ వ్యవహారంలో అధికారులు పక్కాగా రికార్డులు ప్రకారం గ్రామ కంఠం, ప్రభుత్వ భూమి అని చెబుతూనే ఉన్నారు. ఈ భూమిలో ప్రజాప్రయోజనార్థం గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయం, కమ్యునిటీ హాళ్లు నిర్మించాలని ప్రజలు నుంచి డిమాండ్లు ఉన్నాయి. రూ.15 కోట్లకు పైగా విలువైన ప్రజల ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను జిల్లా యంత్రాంగం గుర్తించి కట్టడి చేయాల్సి ఉంది. – గండ్రేటి మంగతాయారు, చైర్పర్సన్, నగర పంచాయతీ, గొల్లప్రోలు -
నేడు వైఎస్సార్ సీపీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం కాకినాడలో జరగనుంది. పార్టీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. కాకినాడ డి కన్వెన్షన్లో జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ అధ్యక్షులు, సిటీ అధ్యక్షులను ఆహ్వానించారు. ఈ విషయాన్ని పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి దాడిశెట్టి రాజా గురువారం మీడియాకు తెలియజేశారు. ఉదయం 10.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభంకానుంది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు బొత్స మీడియాకు వివరించనున్నారు. రీజనల్ కోఆర్డినేటర్ బొత్స రాక -
‘కోట’ మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా
సామర్లకోట: మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆపై వైఎస్సార్ సీపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కౌన్సిల్ సమావేశం అవుతున్న రెండు గంటల ముందు అరుణ రాజీనామా చేశారు. అందుకు దారితీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులు ఉన్న పట్టణంలో వైఎస్సార్ సీపీ 29 వార్డులను కై వసం చేసుకుంది. చైర్పర్సన్ పదవి పార్టీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు తల్లి పార్వతికి ఇవ్వాలని ముందుగా నిర్ణయించారు. అయితే పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి కుటుంబంలో ఒకే పదవి ఉండాలని నిర్ణయించడంతో 27వ వార్డు నుంచి ఎన్నిక అయిన గంగిరెడ్డి అరుణకు ఉహించని పరిస్థితిలో చైర్పర్సన్ పదవి లభించింది. 26వ వార్డు కౌన్సిలర్ నక్కా లలిత అనారోగ్యంతో మృతి చెందారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఇద్దరు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. దాంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ గత కొంతకాలంగా పార్టీ సభ్యుల వార్డులలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని, అజెండాలో అంశాలు సభ్యులకు తెలియపర్చడం లేదని మెజార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నారు. దాంతో ఆమైపె ఆవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గత నెల 2వ తేదీన బలనిరూపణ కోసం 22 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరు షణ్మోహన్, మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్యలకు వినతి పత్రాలు అందజేశారు. మూడవ తేదీన చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫిర్యాదులు రావడంతో ఆమెను గత నెల మూడవ తేదీన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి బలనిరూపణకు కలెక్టరు అవకాశం ఇచ్చారు. ఈ ప్రత్యేక సమావేశానికి కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును ప్రత్యేకాధికారిగా నియమించారు. దాంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఎదురుచూస్తూ ఉండగా ప్రత్యేక సమావేశానికి రెండు గంటల ముందుగా ఉదయం 9 గంటలకు చైర్పర్సన్ అరుణ కమిషనర్ ఎ.శ్రీవిద్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. దాంతో గత నెల రోజులుగా పట్టణంలో నెల కొన్న ఉత్కంఠకు తెరపడింది. అనంతరం 11 గంటలకు ఆర్డీఓ మల్లిబాబు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి 25 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు హాజరై చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా డీఎస్పీ డి.శ్రీహరిరాజు ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గురువారం భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల రోజుల ఉత్కంఠకు తెర మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు -
యువకుడి దారుణ హత్య
కాకినాడ క్రైం: నగరానికి చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే.. కాకినాడ జగన్నాథపురం ఏటిమొగకు చెందిన వాడ్రేవు కిరణ్ (20) అవివాహితుడు. చేపల వేటతో జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా నివాసం పెమ్మాడి హరీష్ అలియాస్ చిన్న భార్యతో కిరణ్కు వివాహేతర సంబంధం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కిరణ్పై హరీష్ కోపం పెంచుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం కిరణ్ తన స్నేహితుడు శ్యామ్తో కలిసి పెంపుడు కుక్కను టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలోని పశువైద్యశాలకు తీసుకెళ్లాడు. అక్కడకు హరీష్ తన స్నేహితుడు మహేష్తో కలిసి ఆటోలో వెళ్లాడు. మాట్లాడే పని ఉందంటూ కిరణ్ను ఆటోలో ఎక్కించాడు. అనంతరం వివాహేతర సంబంధంపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో హరీష్ తనతో తెచ్చుకున్న బీరు సీసాతో కిరణ్ గుండెల్లో పొడిచాడు. పలుమార్లు గొంతుకోసి ఆటోలోనే చంపేశాడు. మృతదేహాన్ని స్నేహితుడి సాయంతో తిమ్మాపురం సమీపంలోని నేమం వద్ద రోడ్ కం బిడ్జి వద్ద సముద్రంలోకి విసిరేశాడు. తల్లి ఫిర్యాదుతో.. తన కుమారుడు కనిపించడం లేదంటూ కిరణ్ తల్లి దుర్గ బుధవారం రాత్రి పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పొరుగు వారు సముద్ర తీరంలో ఉన్న కిరణ్ మృతదేహాన్ని చూసి దుర్గకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లి ఆ మృతదేహాన్ని గుర్తించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోర్టు పీఎస్ సీఐ సునీల్ ఆధ్వర్యంలోని పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం కోసం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారని సీఐ సునీల్ తెలిపారు. ఈ ఘటనపై గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. -
సరస్వతీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
బోట్క్లబ్ (కాకినాడసిటీ): సరస్వతీ పుష్కరాల సందర్భంగా కాకినాడ డిపో నుంచి ప్రత్యేక బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సరస్వతీ దాయం – పుష్కరయాత్ర పేరిట స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ బస్సు కాళేశ్వరంలో పుణ్యస్నానాలు, మహాకాళ్వేరుని దర్శనం అనంతరం రామప్ప దేవాలయం, వరంగల్లు వేయి స్తంభాల మంటపం, భద్రకాళీ దర్శనం, ధర్మపురిలో స్నానాలు, లక్ష్మీనరసింహస్వామి దర్శనం, కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం, వేములవాడ క్షేత్ర దర్శనం అనంతరం ఈనెల 18న ఉదయానికి కాకినాడ చేరుకుంటుందన్నారు. ఈ నెల 22న సూపర్ లగ్జరీ బస్సు బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కాలం చెల్లిన బీరు బాటిళ్ల ధ్వంసం తాళ్లపూడి: తుపాకులగూడెం పరిధిలోని ఎలియస్ బేవరెజన్ ప్రైవేటు లిమిటెడ్లో కాలం చెల్లిన 9,193 కేసుల బీరు బాటిళ్లను ధ్వంసం చేసినట్టు ఎకై ్సజ్ సీఐ కేవైఎంబీ కుమార్ తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కాలం చెల్లిపోయి నిల్వ ఉన్న బీరులను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని గురువారం అసిస్టెంట్ ఎకై ్సజ్ కమిషనర్ బి.స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గామన్ బ్రిడ్జి అండర్ పాస్ సర్వీస్ రోడ్డు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వూరుకు చెందిన దాసరపూడి సుధ (45) తన కుమారుడు చరణ్తో కలిసి దొమ్మేరు నుంచి కొవ్వూరుకు మోటార్ బైక్పై వస్తున్నారు. కొవ్వూరు అండర్ పాస్ సర్వీస్ రోడ్డుకు వచ్చేసరికీ వారిని వెనక నుంచి ఇసుక లారీ ఢీకొంది. రోడ్డుపై పడిన సుధ మీద నుంచి లారీ చక్రాలు వెళ్లిపోవడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కొవ్వూరు పట్టణ సీఐ విశ్వం చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. సుధ భర్త సాయికృష్ణ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. చెక్కు బౌన్స్ కేసులో జరిమానా, జైలు కాకినాడ లీగల్: చెల్లని చెక్కులు ఇచ్చి ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయస్థానం జరిమానా, జైలు శిక్ష విధించింది. కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్.ఉషాలక్ష్మి కుమారి ఈ మేరకు తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కేబీ ప్రతాప్ కుమార్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన దూడల శ్రీనివాసరావు వ్యాపార అవసరాల కోసమని కాకినాడలోని వెంకటరత్నంపురానికి చెందిన వెంట్రాప్రగడ మురళీ వద్ద అప్పు తీసుకున్నాడు. ఇందుకోసం శ్రీనివాసరావు రూ.1,40,66,666 విలువైన ఒక చెక్కు ఇచ్చారు. సమయానికి అప్పు తీర్చక పోవడంతో చెక్కును మురళీ బ్యాంక్లో వేయగా బౌన్స్ అయ్యింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు విచారణలో శ్రీనివాసరావుపై నేరం రుజువు కావడంతో 18 నెలల జైలు, రూ.1,40,66,666లు పరిహారంగా చెల్లించాలని మేజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. కాగా, ఇదే శ్రీనివాసరావు మురళీకి ఇచ్చిన మరో చెక్కు కూడా బౌన్స్ అయ్యింది. దీనిలో శ్రీనివాసరావుకు 18 నెలల జైలు, రూ.3.60 కోట్లు పరిహారం విధిస్తూ తీర్పు వెలువడింది. -
రాజుల తూరంగిలో భారీ చోరీ
కాకినాడ రూరల్: రాజుల తూరంగి గ్రామంలోని పురోహితుడు చంద్రమౌళి శ్రీనివాసశర్మ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, నగదును దొంగలు దోచుకున్నారు. ఇంద్రపాలెం పోలీసులు వివరాలు ప్రకారం.. శ్రీనివాసశర్మ గృహ ప్రవేశం పూజ కోసం రాత్రి 10.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఆయన భార్య పుట్టింటికి వెళ్లడంలో ఇంట్లో ఎవరూ లేదు. ఇది గమనించిన దొంగలు లోపలకు ప్రవేశించి బంగారం, నగదు చోరీ చేశారు. పూజా కార్యక్రమం అనంతరం గురువారం ఉదయం 6 గంటలకు వచ్చిన శ్రీనివాస శర్మ.. ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించారు. లోపలకు వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది. వెంటనే ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్సీ మనీష్ దేవరాజు పాటిల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దింపి వేలి ముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. ఇంద్రపాలెం అదనపు ఎస్సై సూర్య కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అన్నవరం.. భక్తజన సంద్రం
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి గురువారం వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి, గురువారం తెల్లవారుజామున రత్నగిరిపై పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. నవ దంపతులు, వారి బంధువులతో కలిసి, రత్నగిరిపై స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. దీంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 35 వేల మంది భక్తులు దర్శించగా, వ్రతాలు 1,800 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది భక్తులు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో భోజనం చేశారు. సత్యదేవుని కల్యాణోత్సవాలు ముగియడంతో మరలా సత్యదేవుడు, అమ్మవార్లకు స్వామివారి నిత్య కల్యాణం,ఆయుష్య హోమం, వనదుర్గ అమ్మవారికి హోమాలు, సహస్ర దీపాలంకారణ, పంచహారతుల సేవలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. దాత మట్టే సత్యప్రసాద్ దంపతులు స్వామి, అమ్మవార్లకు చేయించిన వజ్ర కిరీటాలను సోమ, గురువారాలు మినహ మిగిలిన ఐదు రోజులు అలంకరిస్తున్నారు. గురువారం పర్వదినం సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, లింగాకారంలోని శివుడు నిజరూప దర్శనం ఇచ్చారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం -
జల్జీవన్ మిషన్ పనుల్లో చిన్నారులు
రామచంద్రపురం రూరల్: తోటపేట గ్రామంలో రూ. 79 లక్షల నిధులతో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనుల్లో భాగంగా జరుగుతున్న పైపులైన్ పనుల్లో సుమారు 10, 12 సంవత్సరాల చిన్నారులు పనులు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే చిన్నారులను ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనుల్లో ఉపయోగించడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎస్.రాహుల్ వివరణ కోరగా వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
ఉపాధి శ్రామికులపై తేనెటీగల దాడి
కపిలేశ్వరపురం: మాచర గ్రామ శివారు శ్రీరామపురం ఏటిగట్టుపై జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా తుప్పలను తొలగిస్తున్న గ్రామీణ వికాస్ శ్రామికులపై గురువారం తేనెటీగలు దాడి చేశాయి. కోరుమిల్లి గ్రామ శివారు చిన్నకోరుమిల్లికి చెందిన కొండమూరి ఏసును తీవ్రంగా కుట్టడంతో అతడు అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. వెంటనే సహచర శ్రామికులు మోటారు సైకిల్పై కపిలేశ్వరపురం సీహెచ్సీకి తరలించారు. ఆస్పత్రి వైద్యాధికారి పి.రాజ్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు చికిత్స అందించారు. ఏసు కోలుకొంటున్నాడని, మరో రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పినట్టు ఎన్ఆర్ఈజీఎస్ ఇన్చార్జి ఏపీఓ రజిత్సింగ్ తెలిపారు. అలాగే తేనెటీగల దాడిలో గంగుమళ్ల కృష్ణ, కోలపల్లి త్రిమూర్తులు స్వల్పంగా గాయపడ్డారు. వాడపల్లి ఆలయంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో గురువారం రాత్రి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు తనిఖీలు నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో భక్తుల భద్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా ఈ తనిఖీలు జరిపారు. ప్రధాన ఆలయంతో పాటు ప్రాంగణం, క్యూలైన్లు, ఏడు ప్రదక్షిణలు చేస్తున్న మాడ వీధులు, అన్నప్రసాద ప్రాంగణాలు, తలనీలాలు సమర్పించే ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు వాడపల్లి ఆలయంతో పాటు రావులపాలెం బస్ కాంప్లెక్స్లో తనిఖీలు జరిపినట్టు రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు. -
కుట్టిందో మరణమే..
జాగ్రత్తలు అవసరం ● డెంగీ వ్యాధి బాధితులు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవాలి ● ఆరోగ్యకరమైన వ్యక్తి శరీరంలో ఎర్ర రక్తకణాలు (ప్లేట్లెట్స్) సాధారణంగా 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకూ ఉండాలి. ● తెల్ల రక్త కణాలు నాలుగు వేల నుంచి 11 వేల వరకూ ఉండాలి. ● డెంగీ జ్వరం ద్వారా రక్త కణాలు లక్ష దిగువకు పడిపోతే సత్వరమే వైద్యుడిని సంప్రదించాలి. ● ధీర్ఘకాలం తక్కువ రక్తకణాలు ఉంటే ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చు. ● డెంగీ జ్వరం బారిన పడిన వ్యక్తి సరైన విశ్రాంతి, పౌష్టికాహారం తీసుకుంటే రక్తకణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ● తరచూ పండ్లు, ఆకుకూరలతో పాటు ఐరన్, విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆలమూరు: రాత్రయితే చాలు పిలవని అతిథుల్లా మన ఇంటికి వచ్చి, తెల్లవార్లూ రక్తాన్ని పీల్చేసే దోమలతో పడే బాధలు అందరికీ అనుభవమే. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వీటి బాధితులే. అందుకనే దోమల భారిన పడకుండా నిత్యం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అయితే దోమలు కట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందే డెంగీ జ్వరం అత్యంత ప్రాణాంతకమైంది. నేడు జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా ఆ వ్యాధి లక్షణాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. దోమ కాటుతో.. దోమ కాటు ద్వారా డెంగీ జ్వరం వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తిని కుట్టిన దోమ మరొకరిని కుడితే అతడి రక్తంలో వైరస్ వెంటనే ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు సరైన సమయంలో చికిత్స చేయించుకోకుంటే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముంది. డెంగీ జ్వరం సోకిన వెంటనే శరీరంలోని ఎముకల్లో ఉన్న గుజ్జు తగ్గిపోయి క్రమేపీ రక్త కణాల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపి అంతిమంగా మరణానికి దారి తీస్తుంది. ఏడిస్ దోమల నుంచి సోకే డెంగీ వైరస్ నాలుగు రకాలుగా శరీరంలోకి ప్రవేశిస్తుంది. తొలి రెండు దశల్లో జ్వర తీవ్రత రోగిపై ఒక మోస్తారు ప్రభావం చూపగా, మూడో దశలో హెమరేజిక్ జ్వరం తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తుంది. తుది దశ అయిన డెంగీ షాక్ సిండ్రోమ్ సోకితే మృతి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ దోమలు పగటి సమయంలో మనుషులను కుడతాయి. మంచినీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గుడ్లు పెట్టి దోమల వృద్ధికి కారణమవుతాయి. వ్యాధి నిర్ధారణ డెంగీ వ్యాధిని ఏలీసా (ఎన్ఐవీ) పరీక్ష ద్వారా నిర్దారణ చేస్తారు. వ్యాధి సోకిన వ్యక్తికి వివిధ రక్త పరీక్షలు నిర్వహించి, వ్యాధి తీవ్రతను గుర్తిస్తారు. డెంగీ జ్వరం తరచూ వస్తుంటే వైరస్ సంబంధిత వైద్య నిపుణుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స తీసుకోవాలి. సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే దోమలు కాటు వేయడం వల్ల్ల ఈ వైరస్ ఎక్కువగా సోకే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడిస్ దోమల తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2010 మే 16వ తేదీ నుంచి జాతీయ డెంగీ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. దానిలో భాగంగా ఏటా ఆ రోజున దోమల నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను ప్రజలకు వివరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దోమలతో అనేక వ్యాధులు డెంగీ అత్యంత ప్రమాదకరం జాగ్రత్తలు తీసుకోకుంటే తీవ్ర నష్టం నేడు జాతీయ డెంగీ దినోత్సవం డెంగీ లక్షణాలు ఆకస్మికంగా అధిక జ్వరం సంభవించడం (104 డిగ్రీలు) తీవ్రమైన తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి తీవ్రమైన కండరాల నొప్పి అలసట, వికారం, వాంతులు చర్మంపై దద్దుర్లు, తేలికపాటి రక్తస్రావం చిగుళ్ల లేదా ముక్కు నుంచి రక్తస్రావం మూత్రం, మలం, వాంతిలో రక్తం శ్వాస ఆడకపోవడం అలసిపోవడం, చిరాకు అప్రమత్తంగా ఉండాలి దోమకాటు వల్ల సంభవించే డెంగీ జ్వరంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవిలో సైతం వర్షాలు కురుస్తుండటం వల్ల వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టాలి. జ్వర లక్షణాలు ఉంటే సత్వరమే సమీప వైద్యులను సంప్రదించి, సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. – కె.స్వర్ణలత, వైద్యాధికారి, సామాజిక ప్రభుత్వ ఆస్పత్రి, ఆలమూరు. -
క్వారీ లారీ బోల్తా
ప్రత్తిపాడు: ప్రత్తిపాడు – లంపకలోవ రహదారిలో గురువారం ఓ క్వారీ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. లాటరైట్ ఖనిజాన్ని తరలించేందుకు వెళుతున్న ఆ లారీ రైతు గౌతు గంగ పొలంలో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. దీనిపై ఫిర్యాదు అందలేదని ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. కాగా.. ఈ రహదారిలో లాటరైట్ ఖనిజాన్ని రవాణా చేసే లారీలే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే మితిమీరిన వేగంతో వెళుతుండడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇటీవలే క్వారీ లారీ ఢీకొని గేదే మృతి చెందింది. గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు దేవరపల్లి: గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి గాయపడ్డారు. రాజమహేంద్రవరం వైపు వెళుతున్న ఆటోను వెనుక వైపు నుంచి వస్తున్న వ్యాన్ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదేళ్ల చిన్నారిని, ఇద్దరు మహిళలకు రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఏలూరులో శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. -
ఇటీవలే శుభకార్యం.. అంతలోనే విషాదం..
రాయవరం: ఆ కుటుంబంలోని పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితమే ఎంతో ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితులతో కలిసి కుటుంబ సభ్యులు ఆనందంగా గడిపారు. అక్క ఫంక్షన్లో చిన్న కుమార్తె ఎంతో సందడి చేసింది. రెండు రోజులు అవకుండానే ఆ బాలికను ట్రాక్టర్ రూపంలో మృత్యువు కబళించింది. శుభకార్యం జరిగిన ఇంటిలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే.. అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామానికి చెందిన పాలపర్తి వీర వెంకట సత్యనారాయణ, ఉమా మహేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఓణీల ఫంక్షన్ను రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో నిర్వహించారు. వీఆర్ఏగా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ఇంట శుభకార్యం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఇంకా ఇంట్లోనే ఉన్నారు. కాగా.. సత్యనారాయణ వరసకు మేనల్లుడైన నెల్లూరుకు చెందిన పవన్ సత్యస్వరూప్ గురువారం సత్యనారాయణ రెండో కుమార్తె నాగవర్షిణి (11)ని మోటార్ సైకిల్పై ఎక్కించుకుని రాయవరం వచ్చాడు. లొల్ల వైపునకు వెళ్లిన వీరు తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ధాన్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. నాగవర్షిణిపై నుంచి ట్రాక్టర్ తొట్టె వెనుక చక్రాల వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడింది. పవన్ సత్య స్వరూప్ స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. విలవిల్లాడిన బాలిక ట్రాక్టర్ చక్రాలు ఎక్కేయడంతో తీవ్రంగా గాయపడిన నాగవర్షిణి విలవిలలాడింది. ఆమె వద్దకు వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేదు. సుమారు పావుగంట తర్వాత సమీపంలోని ఫొటో స్టూడియో నిర్వాహకుడు కారంపూడి సత్తిబాబు అక్కడకు వచ్చి బాలిక శరీరంపై క్లాత్ను కప్పాడు. ఆ తర్వాత స్థానికులు వచ్చి సాయమందించారు. ఘటనా స్థలానికి పోలీసులు ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలికను 108లో రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మండపేటకు తీసుకువెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. సంఘటనా స్థలాన్ని మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని బాలిక మృతి రాయవరంలో ఘటన -
మహిళా బాక్సర్లు సత్తా చాటుతున్నారు
నేను 8 సంవత్సరాల నుంచి పిఠాపురంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నాను. నా దగ్గర 150 మంది 10 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న పురుషులు, మహిళలు ఉన్నారు. వారిలో మహిళా బాక్సర్లు 70 మంది వరకు ఉన్నారు. ఇప్పటివరకు 30 మంది మహిళా బాక్సర్లు రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నారు. 40 మంది జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. నలుగురు రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పతకాలు సాధించారు. బాక్సింగ్ యుద్ధ కళ. బాక్సింగ్లో సబ్ జూనియర్, జూనియర్, యూత్, సీనియర్స్ మెన్ అండ్ వుమెన్ విభాగాలు ఉంటాయి. వయసును బట్టి బరువును బట్టి పోటీ ఉంటుంది. బాక్సింగ్ నేర్చుకుని పతకాలు సాధిస్తే విద్య, ఉద్యోగాల్లో 3 శాతం స్పోర్ట్స్ కోటా ఎంతగానో ఉపయోగపడుతుంది. బాలికలు ఎక్కువగా ఈ క్రీడ పట్ల మక్కువ చూపుతున్నారు. – పి.లక్ష్మణరావు, బాక్సింగ్ కోచ్, పిఠాపురం ● -
ఫలిస్తున్న పంచ్తంత్రం!
పిఠాపురం: నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచన వారిని క్రీడల వైపు అడుగులు వేసేలా చేసింది. ఈ ఆటకు ఆడవారెందుకు అనే క్రీడలోనే పట్టుదల వారిని బాక్సింగ్ వైపు నడిపించింది. రింగ్లోకి దిగితే పతకం ఖాయం అనే రీతిలో తమ ప్రతిభా పాటవాలను చూపిస్తున్నారు పిఠాపురానికి చెందిన మహిళా బాక్సర్లు. ఒలింపిక్ పతకాన్ని అందించడమే తమ లక్ష్యం అంటున్నారు వీరు. ఇటీవల భారత్ బాక్సింగ్లో దూసుకెళ్తోంది. ప్రపంచ చాంపియన్న్షిప్లతో పాటు ఆసియా, కామన్వెల్త్, అంతర్జాతీయ ఈవెంట్లలో భారత ఆటగాళ్లు రాణిస్తున్నారు. బాక్సింగ్లో టాప్ 5 దేశాలలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా భారత మహిళలు ఆడిన 12 చాంపియన్ షిప్లలో 10 గోల్డ్ మెడళ్లతో సహా 39 పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ మెడల్స్ సాధించిన వారి జాబితాలో తదుపరి తమ పేరు నమోదు చేసుకుంటామంటున్నారు ఇక్కడి మహిళా బాక్సింగ్ క్రీడాకారులు. రింగ్లోకి దిగితే పతకం రావాల్సిందే సత్తా చాటుతున్న పిఠాపురం మహిళా బాక్సర్లు -
సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే కేటాయించాలి
మలికిపురం: రాష్ట్ర బడ్జెట్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేసే అభివృద్ధి పనులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లకు అవసరమయ్యే సరకుల సరఫరా టెండర్లు దళితులకే కేటాయించాలని విస్తృత దళిత సంఘాల (విదసం), ఐక్య వేదిక రాష్ట్ర సమితి సమావేశం డిమాండ్ చేసింది. బుధవారం విదసం ఐక్యవేదిక రాష్ట్ర సమితి, రాజోలు పరిరక్షణ సమితి సంయుక్త సమావేశం మలికిపురం మండలం శంకరగుప్తంలో సభ్యులు చింతా సత్య ఇంటి వద్ద జరిగింది. విదసం కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎస్సీ సబ్ ప్లాన్ సక్రమ అమలు కోసం ప్రభుత్వం ఎస్టీఎస్ (సబ్ ప్లాన్ టెండర్లు ఎస్సీలకే) అనే కొత్త స్కీమ్ ప్రవేశ పెట్టాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 750 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న లక్షా నాలుగు వేల మంది విద్యార్థులకు సరకుల సరఫరా కోసం కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లు చెల్లిస్తోందని, ఈ సరఫరా దారుల్లో ఒక్క టెండర్లో కూడా దళితుడు లేడన్నారు. రాష్ట్రంలో దళిత వాడల్లో 12 వేల అంగన్వాడీ కేంద్రాల్లో సరకులు సరఫరా టెండర్లు దళితులకు ఇస్తే 1,000 నుంచి 1,500 కుటుంబాలకు జీవనోపాధి కల్పించవచ్చన్నారు. రాజోలు పరిరక్షణ చైతన్య సమితి చింతా సత్య మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కులగణన పూర్తయ్యే వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. కొంకి రాజమణి , ముత్యాల శ్రీనివాస్, జాజి ఓంకార్, గుడివాడ ప్రసాద్, ఉప్పాడ రాము పాల్గొన్నారు. విదసం, రాజోలు ప్రదర్శన చైతన్య సమితి డిమాండ్ -
సరిగా ఆడిట్ చేయకుంటే మెమో
కాకినాడ సిటీ: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం ద్వారా వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి అందిన అర్జీలను గ్రీవెన్స్ అధికారి మాత్రమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కార్యాలయంలోని వివేకానంద హాలులో జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో డీఎల్డీవో వాసుదేవరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణలతో కలిసి డీఆర్వో గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కారం చేసే విధానంపై పలు సూచనలు చేశారు. సమస్యను గ్రీవెన్స్ దారు సంతృప్తి పొందే విధంగా పరిష్కరించాలని ఆదేశించారు. పరిష్కరించిన గ్రీవెన్స్లను జిల్లా స్థాయి అధికారి మొదటి సారి ఆడిట్ చేస్తారని, దానిని జిల్లా స్థాయి కమిటీ రెండవసారి ఆడిట్ చేస్తుందని ఆ సమస్యను సక్రమంగా పరిష్కరించకపోతే సంబంధిత అధికారికి మెమో జరీ చేస్తామని తెలిపారు. దానిపై జిల్లా అధికారి సక్రమంగా ఆడిట్ చేయకపోతే ఆ జిల్లా అధికారికి కూడా మెమో జారీ చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్ల తొలగింపు స్థానికుల ఆందోళన జగ్గంపేట: స్థానిక జగనన్న కాలనీలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఐదు అధికారులు తొలగించడంపై స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనితో జగనన్నకాలనీ వాసులు ఈ విషయాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి తోట నరసింహానికి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు తెలియజేశారు. దీంతోవారు జగ్గంపేట విద్యుత్ డీఈ వీరభధ్రరావుతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్లు జగనన్నకాలనీలో వున్నవి తీయడం సరికాదని తెలిపారు. అయితే వేసవి కారణంగా గ్రామంలో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు పనిచేయకపోవడంతో జగనన్న కాలనీలో ప్రస్తుతం ఉపయోగించని ట్రాన్స్ఫార్మర్లు మారుస్తున్నామని విద్యుత్ డీఈ వారికి వివరించారు. జగ్గంపేట గ్రామంలో రెండు రోజులుగా ఎండవేడిమికి పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, పాడైపోవడంతో పలు కాలనీలలో విద్యుత్ సరఫరా లేక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడానికి జగనన్న కాలనీలో ట్రాన్స్ఫార్మర్లు వాడుతున్నట్లు, కొత్తవి వచ్చిన వెంటనే జగనన్న కాలనీలో యథావిధిగా ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. పాలిసెట్–25లో 94.06 శాతం ఉత్తీర్ణత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పాలిసెట్–15 ఫలితాల్లో కాకినాడ జిల్లా 94.06 శాతం ఉత్తీర్ణత సాఽధించింది. గత నెల 30వ తేదీన కాకినాడ, పిఠాపురం కలిపి 28 కేంద్రాల్లో 8,849 మంది పరీక్షలు రాయగా వీరిలో 8.371 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 5,212 మందికిగాను 4,865 మంది ఉత్తీర్ణులు కాగా బాలికలు 3,637కుగాను 3,506 మంది ఉత్తీర్ణత సాఽధించారు. కాకినాడకు చెందిన కొప్పిశెట్టి అభిజత్ 15వ ర్యాంక్, ఏ.సత్యసూర్యతేజ 25వ ర్యాంక్, సి.కృష్ణరామవర్షిత్ 34వ ర్యాంక్ సాధించారు. కిక్కిరిసిన విఘ్నేశ్వరుని సన్నిధి అయినవిల్లి: విఘ్నేశ్వరస్వామివారిని బుధవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. ఆర్చకులు స్వామిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామికి మహానివేదన చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు విశేష సేవలు చేసి ఆలయ తలుపులు వేశారు. ఆదివారం స్వామివారికి పూజ టిక్కెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.1,96,054 ఆదాయం లభించినట్లు ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. -
స్పోర్ట్స్ కోటాలో ఉన్నత స్థానం సాధిస్తా
ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పూర్తి చేశాను. విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో పాల్గొన్నాను. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం మా తల్లిదండ్రులు నా ఇష్టాన్ని గమనించి కోచ్ లక్ష్మణరావు దగ్గర జాయిన్ చేశారు. ఆయన నాకు ముందుగా ధైర్యం చెప్పి బాక్సింగ్లో మెళుకువలు నేర్పించారు. ఇప్పుడు నేను రాష్ట్ర బాక్సర్గా పేరు పొందాను. స్పోర్ట్స్ కోటాలో డాక్టర్ అయి పేదలకు ఉచిత వైద్యం చేయడమే నా లక్ష్యం. – కాకాడ హరిణి, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం -
ఒలింపిక్ మెడల్ సాధించడమే ధ్యేయం
నేను ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నా తండ్రి బ్యాంక్ ఉద్యోగి. నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. నా సరదాను చూసి నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను మా కోచ్ లక్ష్మణరావు దగ్గర చేరి బాక్సింగ్ నేర్చుకున్నాను. ఏడాదిన్నర కాలంలోనే అన్ని మెళుకువలు నేర్చుకుని కాకినాడ డిస్ట్రిక్ స్పోర్ట్స్ అథారిటీలో జరిగిన అండర్ 19 స్కూల్ గేమ్స్ బాక్సింగ్కు జిల్లా స్థాయిలో ఎంపికయ్యాను. పిఠాపురంలో జరిగిన జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలలో స్వర్ణ పతకం సాధించాను. విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 బాక్సింగ్ పోటీలలో కాంస్య పతకం సాధించాను. విశాఖపట్నంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో రజత పతకం సాధించాను. ఒలింపిక్ మెడల్ సాధించడమే నా ధ్యేయం. – జే ఐశ్వర్య సూరి దీపిక, బాక్సింగ్ క్రీడాకారిణి, పిఠాపురం ● -
ధూప, దీప నైవేద్యాలకు దరఖాస్తుల ఆహ్వానం
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామాల్లో ఆదాయం లేని ఆలయాలకు ధూప, దీప నైవేద్యాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖాధికారి సుబ్బారావు తెలిపారు. కాకినాడ దేవదాయశాఖ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న చిన్న ఆలయాల్లో ఆదాయం లేకపోవడంతో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయా ఆలయాలకు ప్రతీ నెలా రూ.10 వేలు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే ద్వారా అందివ్వాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చిన్న ఆలయాలకు చెందిన కమిటీ సభ్యులు, అర్చకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్నవరం దేవస్థానం వైదిక కమిటీ పునర్ వ్యవస్థీకరణ అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వైదిక కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. కమిటీలో ఆరుగురు సభ్యులకు అదనంగా మరో ఇద్దరు పండితులను నియమించారు. గొల్లపల్లి గణపతి ఘనపాఠీ, వేదుల సూర్యనారాయణ ఘనపాఠీ, గంగాధరబట్ల గంగబాబు ఘనపాఠీ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్శింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత స్పెషల్గ్రేడ్ సూపర్వైజర్ ఛామర్తి కన్నబాబు వైదిక కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీరితో బాటు చిట్టి శివ ఘనపాఠీని, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభిరామ్మూర్తిని సభ్యులుగా చేర్చారు. ఈ ఎనిమిది మంది దేవస్థానంలో జరిగే వైదిక కార్యక్రమాల గురించి చైర్మన్, ఈఓలకు సలహాలిస్తారు. -
ప్రాథమిక విద్యకు సర్దుపోటు!
గురువారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2025ఉపాధ్యాయుల నియామకం ఇలా.. ● ఫౌండేషన్ స్కూల్ (పీపీ1, పీపీ2 1–2వ తరగతి) 1–30 మంది విద్యార్థులకు 1 ఎస్జీటీ, 31–60 విద్యార్థులకు 2 ఎస్జీటీలను నియమించారు. ● బేసీక్ ప్రైమరీ స్కూల్ (పీపీ–1, పీపీ2, 1–5వ తరగతి)లో 20 మందికి ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను నియమించారు. ● మోడల్ ప్రైమరీ స్కూల్స్ (పీపీ1, 2, 1–5వ తరగతి వరకు) 59 మంది విద్యార్థులకు ముగ్గురు (హెచ్ఎం లేదా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ) ఉపాధ్యాయులను కేటాయించారు. అంతేగాక 150 మంది విద్యార్థులకు నలుగురిని నియమిస్తారు. ● అప్పర్ ప్రైమరీ పాఠశాలల్లో 1–10 వరకు ఒక స్కూల్ అసిస్టెంట్, 11 నుంచి 30 వరకు ఇద్దరు, 31 నుంచి 140 విద్యార్థులుంటే నలుగురు, 141 నుంచి 175 మందికి ఐదుగురు స్కూల్ అసిస్టెంట్లను నియమిస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందా..? ఇందులో భాగంగానే పాఠశాలల పునర్మిర్మాణ ప్రక్రియ పేరుతో గందరగోళానికి తెర తీసిందా..? ఈ పరిణామం ప్రాథమిక విద్యపై తీవ్ర ప్రభావం చూపనుందా..? మిగులు ఉపాధ్యాయులు పెరిగి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి భంగం కలగనుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నుంచి. ఇదీ సంగతి ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే క్రమంలో కూటమి ప్రభుత్వం అసంబద్ధ విధానాల అమలుకు శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన క్లస్టర్ విధానాన్ని తొలగించి మోడల్ స్కూల్స్ విధానానికి శ్రీకారం చుట్టింది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం జీవో 117 పేరిట పాఠశాలల విలీన ప్రక్రియ చేపట్టింది. కూటమి అధికారంలోకి వచ్చాక జీఓను రద్దు చేసింది. ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలోనూ ఉపాధ్యాయుల నుంచి విమర్శలు ఎదుర్కొంది. తాజాగా పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కొత్త విధానానికి తెర తీసింది. ఇందులో భాగంగా తొమ్మిది రకాల పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొన్ని రోజులుగా చేసిన కసరత్తు మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం చేపట్టిన తాజా చర్యలతో మిగులు పోస్టులు పెరిగి, ప్రాథమిక విద్యకు నష్టం తప్పదని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. యూపీ స్కూళ్ల కొనసాగింపు పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం ప్రాథమికోన్నత (యూపీ) పాఠశాలలను ఎత్తివేయాలని భావించింది. తల్లిదండ్రులు, ఆయా ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న యూపీ స్కూళ్లను యథావిధిగా కొనసాగించేందుకు అంగీకరించింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 72 అప్పర్ ప్రైమరీ పాఠశాలలున్నాయి. ఇవి యథావిధిగా కొనసాగనున్నాయి. 767 పోస్టుల సర్దుబాటు ఉపాధ్యాయుల సర్దుబాటుపై గురువులు గుర్రుగా ఉన్నారు. అసంబద్ధ విధానాలతో ప్రక్రియ చేపట్టిందని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా సర్దుబాటు ప్రక్రియ కాస్తా గందరగోళంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్, మున్సిపల్ పాఠశాలల వారీగా మంగళవారం జాబితా విడుదల చేసింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా 767 మిగులు ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్తులో ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్) పోస్టుల భర్తీ కలగానే మారనుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 371 మంది ఉపాధ్యాయులను వివిధ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పోస్టులకు, మోడల్ ప్రైమరీ పాఠశాల్లో సర్దుబాటు చేశారు. 31 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లుగా సర్దుబాటు చేశారు. హెచ్ఓడీ పూల్లో ఉన్న 355 మంది ఉపాధ్యాయులను సైతం వివిధ పాఠశాలలకు సర్దుబాటు చేస్తున్నారు. డీఎస్సీని మరిపించేందుకు ఎత్తులు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్నం కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. ఇదిలా ఉంటే టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపిస్తోంది. విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం కుట్ర అంతా అస్తవ్యస్తం..! పాఠశాలల పునర్మిర్మాణం పేరుతో ఉపాధ్యాయ పోస్టుల కుదింపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 767 పోస్టుల సర్దుబాటు క్లస్టర్ వ్యవస్థకు మంగళం.. మోడల్ స్కూల్ విధానానికి నాంది కూటమి ప్రభుత్వ చర్యలతో మిగులు పోస్టులు పెరిగే అవకాశం -
పట్టుదలతో నేర్చుకున్నా
క్రీడల్లో మంచి ప్రతిభ చూపి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఆలోచన ఉండేది. ఏ ఆటలో నాకు మంచి జరుగుతుందనేది అర్థమయ్యేది కాదు. కాని పిఠాపురంలో బాక్సింగ్ క్రీడలో శిక్షణ ఇస్తున్న కోచ్ లక్ష్మణరావు వద్దకు వెళ్లి మాట్లాడగా నీవు బాక్సింగ్ బాగా ఆడగలుగుతావు అంటు ప్రోత్సాహించారు. ముందు కొంత భయమేసింది ఇంట్లో వాళ్లు బాక్సింగ్ అంటే చాలా ధైర్యం ఉండాలి.. జాగ్రత్త అన్నారు. కాని మా కోచ్ చాలా ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో బాక్సింగ్ నేర్చుకున్నా. పిఠాపురంలో జరిగిన యూత్ వుమెన్ బాక్సింగ్ జిల్లా స్థాయి పోటీల్లో స్వర్ణ పతకం సాధించాను. విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి యూత్ వుమెన్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించాను. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాను. జాతీయ స్థాయిలో మంచి పతకాలు సాధించడమే ధ్యేయం. – అడబాల వైష్ణవి, బాక్సింగ్ క్రీడాకారిణి, మల్లాం, పిఠాపురం మండలం ● -
నేడు ‘కోట’ మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం
సామర్లకోట: మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రవేశ పెట్టడానికి రంగం సిద్ధం అయింది. మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణపై బలనిరూపణకు 22 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి కలెక్టరుకు గత నెల 2వ తేదీన వినతిపత్రం అందజేశారు. చైర్పర్సన్ అరుణ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కౌన్సిల్ సభ్యుల వినతి మేరకు గురువారం బలనిరూపణ చేసుకోవాలని కలెక్టరు ఆదేశించారు. ప్రత్యేకాధికారిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబును నియమించారు. ఈ మేరకు బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయానికి వచ్చి బలనిరూపణకు చేయవలసిన ఏర్పాట్లపై మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య, సీఐ ఎ.కృష్ణభగవాన్లతో సమీక్ష నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేసే అధికారాన్ని జిల్లా ఽఅధ్యక్షుడు దాడిశెట్టి రాజాకు ఇవ్వగా, ఆయన పట్టణ పార్టీ అధ్యక్షుడు పాగా సురేష్కుమార్కు విప్ జారీ చేసే అధికారం ఇచ్చారు. ఈ మేరకు విప్ పత్రాన్ని పాగా సురేష్కుమార్ ఆర్డీఓ మల్లిబాబుకు అందజేశారు. కౌన్సిలర్ కరణం రాజ్కుమార్ పాల్గొన్నారు. గురువారం మున్సిపల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి కోరమ్ ఉన్న సమయంలో బలనిరూపణకు అవకాశం ఇస్తామని, కోరమ్ లేకుంటే అదే రోజు మధ్యాహ్నం మరో పర్యాయం అవకాశం ఇస్తామని అప్పటికీ కోరమ్ లేక పోతే సమావేశం నిరవధికంగా వాయిదా వేస్తామని ఆర్డీవో అన్నారు. దాంతో ఏడాది వరకు చైర్పర్సన్పై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండదని ఆర్డీఓ మల్లిబాబు చెప్పారు. కౌన్సిల్ సభ్యులు గుర్తింపు కార్డులో హాజరయ్యే విధంగా చూడాలని సీఐకు ఆర్డీఓ సూచించారు. కౌన్సిల్ హాల్లో చేయవలసిన ఏర్పాట్లపై ఆయన అధికారులతో చర్చించారు. మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో ఒక కిలోమీటరు వరకు 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. చేతులు ఎత్తే పద్ధతిలో బల నిరూపణ ఉంటుంది. వైఎస్సార్సీపీకి చెందిన సభ్యులు పార్టీ సూచించిన విధంగా కాకుండా వ్యతిరేకంగా ఓటు వేస్తే పార్టీ నుంచి బహిష్కరించడంతో పాటు కౌన్సిల్ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వినతితో కౌన్సిల్ సమావేశం విప్ జారీచేసిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజా కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ అమలు -
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
తుని: రైలు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్పీ ఎస్సై జీ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..తుని–హంసవరం రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు నుంచి జారిపడి 20 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు మృతి చెందాడు. మృతుడు నలుపురంగు ట్రాక్ ధరించి ఉన్నాడు. చేతిపై శ్రావణి అనే పచ్చబొట్టు ఉంది. మృతుడి దగ్గర ఇతర ఏ ఆధారాలూ లభించలేదు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94906 19020 నంబరులో సంప్రదించవచ్చన్నారు. ఏలూరులో కలవచర్ల మహిళ... రాజానగరం: భర్తతో కోపంతో పుట్టింటికి వెళ్లిన మహిళ ఊహించని ప్రమాదానికి గురై అందరికీ దూరమైంది. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్తున్న మండలంలోని కలవచర్లకు చెందిన బొమ్మోతు కుమారి (40) ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోవడంతో మృతిచెందింది. ఏలూరు రైల్వే స్టేషను సమీపంలో మంగళవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలావున్నాయి. మండలంలోని ముక్కినాడకు చెందిన కుమారికి కలవచర్లకు చెందిన ఏసుతో వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా, కుమార్తెకు వివాహం చేశారు. ఈ క్రమంలో కుటుంబ పరంగా భార్యాభర్తల నడుమ ఏర్పడిన గొడవలతో కుమారి కోపంతో తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఆమె తల్లిదండ్రులు మండెల సత్యనారాయణ, పాపలు పనుల కోసం హైదరాబాద్కి పయనమవడంతో వారితోపాటు తాను కూడా గౌతమీ ఎక్స్ప్రెస్ రైలులో బయలుదేరింది. డోరులో నిలబడివున్న ఆమె ఏలూరు సమీపంలోకి వచ్చే సరికి ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను రైల్వే పోలీసులు ఏలూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త ఏసు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి, మృతురాలిని తన భార్యగా నిర్ధారించాడు. కేసును ఏలూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
సీబీఎస్ఈ ఫలితాల్లో శ్రీప్రకాష్ ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీబీఎస్ఈ పదవ తరగతి, ప్లస్టూ ఫలితాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రతిభ చూపారని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి విజయప్రకాష్ మంగళవారం తెలిపారు. పదవ తరగతి ఫలితాల్లో ఎన్.సత్యసాయి 483, ఎం.యశస్వి 482, పి.తరుణ్కుమార్ 481, మహర్షి4 79, ఎస్.రఘవందన 478మార్కులు సాధించారన్నారు. ప్లస్టూ ఫలితాల్లో జి.సాయి అనీష్ 469, ధాత్రి నిహారిక 466 సాధించి ప్రతిభ చాటారన్నారు. మ్యాథ్స్, సైన్స్, సబ్జెక్టుల నుంచి నూటికి నూరుశాతం మార్కులు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను కార్యదర్శి నరసింహారావు, అధ్యాపకులు అభినందించారు. -
పెనకనమెట్ట సావరంలో చోరీ
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలంలోని పెనకనమెట్ట సావరంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. కొవ్వూరు రూరల్ సీఐ బి.విజయబాబు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి సత్తిబాబు, వారి కుటుంబ సభ్యుల తో పాటు ఈ నెల 11వ తేదీన పందలపర్రులో బంధువుల ఇంటికి పెళ్లికి వెళ్లారు. 12వ తేదీ ఉదయం తిరిగి వచ్చి చూసుకుని సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి సుమారు 8 కాసుల బంగారు వస్తువులను, రూ.8 లక్షల నగదు, 250 గ్రాముల బరువు గల వెండి వస్తువులను దొంగిలించినట్టుగా తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి డీఎస్పీ కేవీ సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ స్వరూప్, సీఐ శ్రీధర్ తదితరులు పరిశీలించి, వివరాలు సేకరించారు. -
ఇసుక లారీ ఢీకొని కౌలు రైతు మృతి
తుని రూరల్: తుని మండలం వి.కొత్తూరు గ్రామానికి చెందిన సూరెడ్డి రమణ (48)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. మంగళవారం కౌలు రైతు అయిన సూరెడ్డి రమణ తుని రైతుబజారులో కూరగాయలు విక్రయించుకుని మోపెడ్పై స్వగ్రామానికి వస్తుండగా వెలంపేట వై.జంక్షన్లో రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ఇసుక లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రమణను తుని ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: బెంగళూరులో చోరీలకు పాల్పడుతున్న ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన ఘరానా దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల నగరంలో కొడిగేహళ్లిలో ఇంటి తాళం బద్దలు కొట్టి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పోలీసులు గాలించి జేబీ నగరలో నివసించే గోదావరి వాసి కామేపల్లి శ్రీనివాస్ అలియాస్ కార్తీక్ (39)ను అరెస్ట్చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.9.20 లక్షల విలువచేసే 148 గ్రాముల బంగారు ఆభరణాలు, 200 గ్రాముల వెండి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 16వ తేదీన చోరీ చేసిన తరువాత ఓ ప్రైవేటు హాస్టల్లో మకాం వేశాడు. పోలీసులు సీసీ కెమెరాల చిత్రాలు, ఇతర ఆధారాల ప్రకారం పట్టుకున్నారు. కార్తీక్కు దొంగతనాలే వృత్తి అని, బీదర్, హైదరాబాద్, సైబరాబాద్తో పాటు 10 పోలీస్ స్టేషన్లలో పాత నేరస్తుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. కార్తీక్, మోహన్రుద్ర అనే పేర్లతో తిరుగుతూ చోరీలకు పాల్పడేవాడు. ఇతడిపై ల్యాప్టాప్, ఇళ్లలో చోరీలతో పాటు 88 కి పైగా కేసులు ఉన్నట్లు చెప్పారు. -
కుక్కలు, పందుల నివారణకు చర్యలు
అమలాపురం టౌన్: మున్సిపల్ రీజనల్ పరిఽధిలోని నగరాలు, పట్టణాల్లో కుక్కలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు రాజమహేంద్రవరం మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) సీహెచ్ నాగ నరసింహరావు స్పష్టం చేశారు. అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసే ఏర్పాట్లు చేశామని ఆర్డీ చెప్పారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలో కుక్కుల కుటుంబ నియంత్రణ కోసం ఆపరేషన్ కేంద్రాలు నిర్మిస్తున్నామని తెలిపారు. అమలాపురం మున్సిపాలిటీలో రూ.15 లక్షలతో కుక్కల ఆపరేషన్ కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ మున్సిపాలిటీలో పందులను నివారించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. పట్టణాల్లో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఉపేక్షించవద్దని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పన్నుల వసూళ్లు నూరు శాతం జరిగేలా రెవెన్యూ విభాగాలు నిమగ్నం కావాలని ఆదేశించారు. పారిశుధ్యం, తాగునీటి సరాఫరా విభాగాలపై ఆయన చర్చించారు. తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అమలాపురం కమిషనర్ కేవీఆర్ఆర్ రాజు, మండపేట కమిషనర్ టీవీ రంగారావు, కొవ్వూరు కమిషనర్ నాగేంద్రకుమార్, నిడదవోలు కమిషనర్ కృష్ణవేణి, రామచంద్రపురం డీఈఈ శ్రీకాంత్, ముమ్మిడివరం కమిషనర్ వర్మతో పాటు అధికారులు పాల్గొన్నారు. కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవన నిర్మాణం పరిశీలన: స్థానిక 27వ వార్డులో రూ.15 లక్షలతో నిర్మితమవుతున్న కుక్కుల ఆపరేషన్ కేంద్ర భవనాన్ని ఆర్డీ నాగ నరసింహరావు పరిశీలించారు. సమీక్షా సమావేశం అనంతరం పట్టణంలో ఆయన పర్యటించి పలు విభాగాలను సందర్శించారు. డ్రెయిన్లతో పూడిక తీయాల్సిన డీఈఈ నాగ సతీష్తో ఆర్డీ చర్చించారు.మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహరావు -
జిల్లా బ్యాడ్మింటన్ సంఘ కార్యవర్గం ఎన్నిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా బ్యాడ్మింటన్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక సోమవారం కాకినాడలో ఓ హోటల్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా ప్రసాద్వర్మ, కార్యదర్శిగా ఫణిగోపాల్, కోశాధికారిగా భాస్కరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా చుండ్రుగోవిందరాజు, కర్రి భామిరెడ్డి, ద్వారంపూడి వీరభద్రారెడ్డిని సంఘం ఎన్నుకుంది. ఉపాధ్యక్షులుగా ఎమ్.మురళీధర్, పీఎస్ గణేష్కుమార్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమూర్తి, అడ్డాల సత్యనారాయణ, జగన్నాఽథ్, సభ్యులుగా కేవీబీ కృష్ణంరాజు, యు.రామకృష్ణ, కె.నరసింహరావు, వి.శారదాదేవి, కె.శ్రీనివాస్, లక్ష్మణ్కుమార్, రామ్మోహన్రావు ఎన్నికయ్యారు. -
ప్రత్యంగిర హోమానికి బ్రేక్
● సత్యదేవుని కల్యాణోత్సవాల పేరిట నిలుపుదల ● గతంలో ఎప్పుడూ ఇలా లేదని భక్తుల అసంతృప్తి అన్నవరం: రత్నగిరి వన దేవత వనదుర్గ అమ్మవారికి వైశాఖ పౌర్ణమి సందర్భంగా నిర్వహించాల్సిన ప్రత్యంగిర హోమం సోమవారం నిర్వహించలేదు. సత్యదేవుని కల్యాణోత్సవాల సందర్భంగా పలు వైదిక కార్యక్రమాలు నిలుపు చేసిన దేవస్థానం అధికారులు ఈసారి కొత్తగా వనదుర్గ అమ్మవారి హోమాలు కూడా నిలిపివేశారు. గత శుక్రవారం చండీ హోమం, తాజాగా ప్రత్యంగిర హోమం నిర్వహించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2019 నుంచి 2024 వరకూ దేవదాయ శాఖ అధికారులే అన్నవరం దేవస్థానం ఈఓలుగా వ్యవహరించారు. అప్పట్లో ఏ సంవత్సరంలోనూ సత్యదేవుని కల్యాణోత్సవాల పేరిట ఈ హోమాలు నిలిపివేయలేదు. 2019 కల్యాణోత్సవాలకు దేవదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ పి.సురేష్బాబు, 2021, 2022 సంవత్సరాల్లో వి.త్రినాథరావు, 2023లో చంద్రశేఖర్ ఆజాద్, గత ఏడాది కల్యాణోత్సవాల సమయంలో ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓలుగా పని చేశారు. వీరి హయాంలో వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు యథావిదిగా జరిగాయి. ఏటా వైశాఖ పౌర్ణమి సందర్భంగా జరిగే సత్యదేవుని చక్రస్నానం నాడే ప్రత్యంగిర హోమం నిర్వహించేవారు. చక్రస్నానం అనంతరం ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పట్లో ఈఓలు పాల్గొనేవారు. 2021లో సత్యదేవుని చక్రస్నానం, వనదుర్గ అమ్మవారి ప్రత్యంగిర హోమం పూర్ణాహుతిలో అప్పటి ఈఓ త్రినాథరావు దంపతులు పాల్గొన్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు చెందిన వీర్ల సుబ్బారావు ఈఓగా ఉన్నారు. ఈ ఏడాది హోమాలు నిలిపివేయడం ద్వారా కొత్త సంప్రదాయం నెలకొల్పారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ పట్టించుకోవాలి రత్నగిరిపై సత్యదేవుని ఆవిర్భావం నుంచి కొద్ది కాలం ఇతరులు చైర్మన్లుగా ఉన్నా గత 135 సంవత్సరాలుగా వ్యవస్థాపక ధర్మకర్తలు, చైర్మన్లుగా దాదాపు ఇనుగంటి వంశీకులే వ్యవహరిస్తున్నారు. రాజా ఇనుగంటి వేంకట రామారాయణం, రాజా ఇనుగంటి ప్రకాశరావు, ఇనుగంటి గోపాలరావు, తరువాత రాజా ఐవీ రామ్కుమార్ ధర్మకర్తలుగా వ్యవహరించారు. వారందరూ దేవుని కార్యక్రమాలకు ఏ లోటూ రానిచ్చేవారు కాదు. పూజలు, హోమాలు ఏవి నిలుపు చేసినా ఊరుకునేవారు కాదు. ప్రస్తుతం ఇనుగంటి వంశంలో ఐదో తరానికి చెందిన ఐవీ రోహిత్ వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్గా కొనసాగుతున్నారు. ఏటా స్వామివారి కల్యాణోత్సవాల్లో యథావిధిగా జరిగే వనదుర్గ అమ్మవారి చండీ, ప్రత్యంగిర హోమాలు నిలిపివేస్తే ఆయన పట్టించుకోకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అమ్మవార్లకు అపచారం జరుగుతూంటే ఎందుకు అడ్డుకోవడం లేదని, ఇప్పుడైనా ఆయన పట్టించుకుని, పరిస్థితిని చక్కదిద్దాలని భక్తులు సూచిస్తున్నారు. -
అడ్డుగా ఉందని పసిగుడ్డును చంపేశారు
● కేసును ఛేదించిన పోలీసులు ● కన్నబిడ్డను కడతేర్చింది తల్లి, అమ్మమ్మే! ● కేసును తప్పుదారి పట్టించడానికే క్షుద్రపూజల నాటకం ● వివరాలు వెల్లడించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్ పిఠాపురం: పాపం పుణ్యం తెలియని పసికందును తమకు అడ్డు వస్తుందనే కారణంగో కడతేర్చినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీలో ఇటీవల పసికందును హత్య చేసిన కేసులో ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. కేసు వివరాలను పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో చనిపోయిన యశ్విత తల్లి అయిన పసుపులేటి శైలజ నరసింగపురానికి చెందిన పెదపాటి సతీష్ను ప్రేమించి ఇరు కుటుంబాలకు ఇష్టం లేకపోయినా వివాహం చేసుకున్నారు. 2024లో వారికి పాప యశ్విత జన్మించింది. వివాహం అయినప్పటి నుంచి భర్త తనను అత్తగారింటికి తీసుకెళ్లలేదని, పాప పుట్టిన తర్వాత భర్త కుటుంబ సభ్యులు చూడ్డానికి రాలేదని, తన భర్త కూడా తనతో మునుపటిలా సఖ్యతగా ఉండడం లేదని శైలజ ద్వేషం పెంచుకుంది. తన తల్లిదండ్రులు చూసిన సంబంధం కాదని, వేరే కులానికి చెందిన సతీష్ను వివాహం చేసుకోవడం ఆమె తల్లి పసుపులేటి అన్నవరానికి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో సతీష్కు పుట్టిన యశ్వితను అడ్డు తొలగిస్తే శైలజకు రెండో పెళ్లి చేయవచ్చనే ఉద్దేశంతో ఆ తల్లి ఉంది. దీంతో ఇద్దరూ కలిసి పసికందును అడ్డు తొలగించుకోడానికి పథకం వేశారు. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 5 నెలల వయసు గల యశ్వితను వారి ఇంటిలోనే వారిద్దరూ పీక నొక్కి చంపేశారు. అనంతరం పాప మృతదేహాన్ని ఇంటి వెనక గల నీటి బావిలో పడవేశారు. అనంతరం హత్యను కప్పిపుచ్చడానికి పాపకు ఎవరో మాంత్రికుడు చేతబడి చేసి చంపి ఉంటాడని నమ్మించి కేసును తప్పుదోవ పట్టించడానికి వారి గుమ్మం ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయ పెట్టి గుట్టుచప్పుడు కాకుండా కొంతసేపు నిద్ర పోయినట్లు నటించారు. అనంతరం లేచి తమ పాపను ఎవరో ఎత్తుకు పోయారంటు పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేసి జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఏమీ తెలియనట్లు నటిస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాప ఆచూకీ కోసం గాలించగా వారి ఇంటి పక్కనే ఉన్న బావిలో పాప మృతదేహం లభించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించారు. పాప తల్లి శైలజ, అమ్మమ్మ పసికందును చంపి నూతిలో పడవేసి క్షుద్ర పూజల నాటకం ఆడినట్లు సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించామన్నారు. పాప తండ్రి సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ కేసులో నిందితులు ఇద్దరిని సోమవారం అరెస్టు చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించినట్టు ఆయన తెలిపారు. -
బడి బస్సుల భద్రత ఎంత?!
ఆన్లైన్లో తేదీల ఖరారు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణాశాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లో నమోదు చేశాక ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్నెస్ తనిఖీ చేస్తారు. వాహన కండిషన్పై సమగ్ర పరిశీలన అనంతరం ఽఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సులు ఏ విధంగా ఉండాలన్న దానిపై విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత రవాణాశాఖ అధికారులపై ఉంది. ● ఈ నెల 15తో ముగుస్తున్న పాత ఎఫ్సీ గడువు ● కొత్తగా ఎఫ్సీలు జారీచేస్తున్న అధికారులు ● స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు తప్పనిసరి ● జిల్లాలో 835 పాఠశాల, కళాశాల బస్సులు రాయవరం: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో బస్సుల వినియోగం పెరిగింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు 580 వరకు ఉన్నాయి. వచ్చే నెల 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక శాతం మంది బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. బస్సు సామర్థ్యం సరిగా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. ఫలితంగా విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. అందుకే ఏటా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు బస్సు కండిషన్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈ నెల 14తో ముగియడంతో, ఈ నెల 15 నుంచి కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్నెస్) ఎలా ఉంది? అన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపట్టనున్నారు. 835 పాఠశాల బస్సులు కోనసీమ జిల్లాలో 580 వరకు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల పరిధిలో 835 ప్రైవేట్ బస్సులు, వ్యాన్లు ఉన్నాయి. జూన్ 15వ తేదీలోగా ఫిట్నెస్ సర్టిఫికెట్లను ఆయా పాఠశాలల యాజమాన్యాలు పొందాల్సి ఉంది. 2017 నుంచి స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. స్కూల్ బస్సుల వేగం గంటకు 60 కిటోమీటర్లు మించి ఉండకూడదు. ఫిట్నెస్ సర్టిఫికెట్ నిబంధనలివీ.. బస్సు డ్రైవర్కు బీపీ, సుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి ఉంచాలి. బస్సు అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లెక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులు అన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. బస్సు నుంచి పొగ రాకుండా చూడాలి. బ్రేక్ కండిషన్లో ఉండాలి. స్పీడో మీటర్ పనిచేయాలి. స్టీరింగ్, టైర్లు కండిషన్లో ఉండాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం ఉండాలి. 60 ఏళ్ల లోపు వయసు ఉండాలి. బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఉండాలి. బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి దీన్ని తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ను తనిఖీ చేయాలి. దీనికోసం ప్రత్యేక రిజిస్టర్ను నిర్వహించాలి. బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరల ఏర్పాటు ఉండాలి. సైడ్ విండోలకు మధ్యలో 31 అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చి ఉండాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం విద్యాశాఖ, ట్రాన్స్పోర్ట్, పోలీస్, సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒక రోజు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. బస్సు ఫుట్ బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తుకు మించరాదు. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చబడి ఉండాలి. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్లు ఏర్పాటు చేయాలి. బస్సు అటెండెంట్ బస్సు బయట దగ్గరగా నిలబడి విద్యార్థులు బస్సు నుంచి సురక్షితంగా దిగేలా, ఎక్కేలా చూడాలి. పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలం ఉండాలి. బస్సులో అటెండర్ ఉండాలి. సీటింగ్ కెపాసిటికి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. శ్రీబస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు పొందుపర్చాలి. రూట్ ప్లాన్ బస్సులో ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకాన్ని ప్రతి నెలా యాజమాన్యం తనిఖీ చేయాలి. బస్సులో అటెండర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. నిబంధనలు పాటించకుంటే సీజ్ చేస్తాం మోటార్ వాహనాల నిబంధనలు పాటించని పాఠశాల, కళాశాలల బస్సులను సీజ్ చేస్తాం. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్సీ, పర్మిట్, కండిషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – డి.శ్రీనివాసరావు, జిల్లా రవాణాశాఖ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఘనంగా సత్యదేవుని చక్రస్నానం
● వేడుకగా నాగవల్లీ పట్టు, దండియాడింపు కార్యక్రమాలు ● రత్నగిరిపై నేడు శ్రీపుష్పయాగం అన్నవరం: వార్షిక దివ్యకల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం పంపా జలాల్లో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు చక్రస్నానం, సాయంత్రం రత్నగిరిపై నాగవల్లి, దండియాడింపు కార్యక్రమాలను పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెళ్లి పెద్దలు సీతారాములు వెంట రాగా నవ దంపతులు సత్యదేవుడు, అమ్మవార్లను ఉదయం 8.30 గంటలకు ఊరేగింపుగా పంపా నదీ తీరానికి తీసుకువచ్చారు. అక్కడి మండపం లోపల సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరో ఆసనం మీద సీతారాములను వేంచేయించి, పూజలు చేశారు. పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి, శూలానికి పంచామృతాలతో అవభృథ స్నానం చేయించారు. అనంతరం బలిమూర్తికి, సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా పంపా నది లోపలకు తీసుకువెళ్లి నదిలో మూడుసార్లు చక్రస్నానం చేయించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, చిట్టి శివ, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు దత్తు శర్మ, సుధీర్, పవన్, దేవస్థానం వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు నాగాభట్ల కామేశ్వరశర్మ, వైదిక కమిటీ సభ్యుడు, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, అంగర సతీష్ తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రత్నగిరిపై అనివేటి మండపంలో స్వామి, అమ్మవార్లకు సాయంత్రం నాగవల్లి పట్టు, నీలలోహిత ధారణ, దండియాడింపు కార్యక్రమాలను పండితులు ఘనంగా నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్లను ప్రత్యేక వేదిక మీద, పెళ్లిపెద్దలు సీతారాములను మరో ఆసనం మీద ఆశీనులను చేసి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగులతో నాగవల్లి తీర్చిదిద్ది పూజలు చేశారు. అమ్మవారికి నీలలోహిత ధారణ చేశారు. ధ్వజావరోహణ చేసిన తరువాత అర్చకులు కంకణ విమోచనం చేశారు. అనంతరం వధూవరులైన అమ్మవారు, సత్యదేవుని తరఫున అర్చకులు బంతులాట, బిందెలో ఉంగరం వెతకడం వంటి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు కొండవీటి రాజా, పవన్, యడవిల్లి ప్రసాద్ తదితరులు స్వామి, అమ్మవార్ల విగ్రహాలు పట్టుకుని నృత్యం చేస్తూ, ఒకరిపై ఒకరు రంగులు జల్లుకున్నారు. ప్రధానాలయంలో సత్యదేవుడు, అమ్మవార్లకు, రామాలయంలో సీతారాముల విగ్రహాలపై కూడా రంగులు జల్లారు. సిబ్బంది కూడా ఒకరిపై ఒకరు రంగులు జల్లుకుని వేడుక చేశారు. నేడు కల్యాణోత్సవాల ముగింపు సత్యదేవుడు, అమ్మవార్ల శ్రీపుష్పయాగం మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామివారి నిత్య కల్యాణ మండపంలో రాత్రి 8.30 నుంచి 10 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు, మహిళలకు జాకెట్టు ముక్కలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నిత్య కల్యాణ మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ వేడుకతో సత్యదేవుని దివ్యకల్యాణోత్సవాలు ముగియనున్నాయి. అన్నవరంలో నేడు తెల్లవారుజామున 3.00 : సుప్రభాత సేవ ఉదయం 8.00 : చతుర్వేద పారాయణ రాత్రి 7.30 : రత్నగిరిపై స్వామివారి నిత్యకల్యాణ మండపంలో సత్యదేవుని శ్రీపుష్పయాగ మహోత్సవం ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00 : సాంస్కృతిక కార్యక్రమాలు -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
● ఆర్టీసీ బస్ నుంచి ఊడిన డీజిల్ ట్యాంక్ ● డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్ నిలిపివేత సీతానగరం: మండలంలోని వంగలపూడి ఏటిగట్టుపై పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ ఊడి పోవడంతో గమనించిన డ్రైవర్ బస్ను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే ఫైర్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రమాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే సోమవారం ఉదయం 9 గంటలకు పురుషోత్తపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళ్లుతున్న ఆర్టీసీ బస్ డీజిల్ ట్యాంక్ వంగలపూడి – సింగవరం మధ్యలో ఊడి అందులోని డీజిల్ బయటకు లీకై ంది. డ్రైవర్కు బస్ నుంచి శబ్ధం రావడంతో ఏటిగట్టుపై బస్ని నిలిపివేశాడు. బస్ను గమనించగా డీజిల్ ట్యాంక్ ఒక వైపు ఊడి రోడ్డుపై రాసుకుంటూ వచ్చింది. బస్ను అలాగే నడిపి ఉంటే రోడ్డుపై ట్యాంక్ రాచుకుని నిప్పు రవ్వలు వచ్చి డీజిల్కు అంటుకుంటే ప్రయాణికుల పరిస్తితి ఏంటని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులు, స్థానికులు డ్రైవర్ను అభినందించారు. ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్లో పంపించారు. పది కిలోమీటర్ల సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు శిథిలం అవ్వడంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. గత నెలలో కూటమి నాయకులు రోడ్డుకు శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు రోడ్డు పనులు చేపట్టలేదు. రోడ్డు శిథిలమవ్వడంతో ఆర్టీసీ బస్లు తరచు పాడవుతున్నాయి. వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. -
పీజీఆర్ఎస్కు 373 అర్జీలు
కాకినాడ సిటీ: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 373 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, డీఆర్ఓ వెంకటరావు, జెడ్పీ సీఈఓ వీవీ లక్ష్మణరావు, హౌసింగ్ బోర్డు పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండార్స్మెంట్ చేయాలని సూచించారు. సక్రమంగా పరిష్కరించని వాటిని రెండు స్థాయిల్లో ఆడిట్ జరిపి, రీ ఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ రీ ఓపెన్ చేసిన శాఖ అధికారులకు మెమోలు జారీ చేస్తారని హెచ్చరించారు. అర్జీదారులు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీకి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే 1100 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. సీహెచ్ఓల భిక్షాటన కాకినాడ సిటీ: తమ డిమాండ్ల పరిష్కారానికి గత పది రోజులు నుంచి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్ఓ) సోమవారం భిక్షాటన చేశారు. మానవ హారంగా ఏర్పడి ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని నినదించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ల ద్వారా ప్రజలకు వైద్యం చేస్తున్న సీహెచ్ఓలు ఇలా భిక్షాటన చేయడంతో ప్రజలు వారి పట్ల సానుభూతి ప్రకటించారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. పోలీస్ గ్రీవెన్స్కు 47 ఫిర్యాదులు కాకినాడ క్రైం: తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్కు 47 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులను ఆయన నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వర్గీకరణలో మాదిగలకు అన్యాయంసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ వర్గీకరణ అమలులో మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక ప్రెస్క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లలో మాలలకు 8 శాతం, మాదిగలకు 6 శాతం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాదిగలకు చంద్రబాబు అన్యాయం చేస్తూంటే మంద కృష్ణ మాదిగ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా మాదిగలు పోరాటం చేస్తే, ఫలాలు మాలలకు అందించడం దురదృష్టకరమన్నారు. వర్గీకరణ అమలులో మాల, మాదిగలకు చెరో 7 శాతం, ఉప కులాలకు ఒక శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్లిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఉమ్మడిగా కాకుండా ఎ, బి, సి, డి గ్రూపులుగా కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి, జూన్ 5న అమరావతిలో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వెంకటేశ్వరరావు చెప్పారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బలంకుల రాజు తదితరులు పాల్గొన్నారు. సరస్వతీ నదీ పుష్కరాలకు ప్రత్యేక బస్సులు రావులపాలెం: సరస్వతీ నదీ పుష్కరాలకు రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు డిపో మేనేజర్ జీజీవీ రమణ సోమవారం తెలిపారు. రావులపాలెం డిపో నుంచి వరంగల్, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, రామప్ప దేవాలయాల దర్శనాలతో పాటు సరస్వతీ నదిలో పుష్కర స్నానం చేసే విధంగా రెండు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు ఈ నెల 15 తేదీన రావులపాలెం నుంచి బయలుదేరుతున్నట్టు తెలిపారు. ప్రయాణికుల నుంచి విశేష స్పందన ఉన్న కారణంగా ఈ నెల 20వ తేదీన మరో రెండు బస్సులు పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. -
పదోన్నతుల కోసం ఏఎన్ఎంల ధర్నా
కాకినాడ క్రైం: అర్హులైన తమకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏఎన్ఎంలు నిరసన బాట పట్టారు. సోమవారం సాయంత్రం కాకినాడలోని కార్యాలయ ఆవరణలో ఏపీ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సంయుక్తాధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అస్కరరావు, శ్రీకాంత్రాజు మాట్లాడుతూ, ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించడంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదోన్నతులపై తాత్సారం చేయడం తగదన్నారు. డీఎంహెచ్వో సహా డిప్యూటీ డెమో వైఖరే ఇందుకు కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో డీఎంహెచ్వోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పందించిన డీఎంహెచ్వో మంగళవారం మెరిట్ లిస్ట్ ప్రదర్శించి, 22వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఏఎన్ఎంలు నిరసన విరమించారు. -
పవన్ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలి: దళిత సంఘాలు
సాక్షి, కాకినాడ జిల్లా: పవన్ కల్యాణ్పై దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఆయన్ను తొలగించాలంటూ డిమాండ్ చేశారు. మల్లాం భాధితులకు న్యాయం చేయాలని పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.‘‘కంప్యూటర్ యుగంలో దళితుల సాంఘిక బహిష్కరణ సిగ్గుచేటు. పిఠాపురంలో మనువాదం అమలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లాంలో సాంఘిక బహిష్కరణకు గురైన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించకపోవడం దారుణం. ఇదేనా పవన్ కళ్యాణ్ చెప్పిన సామాజిక న్యాయం’’ అంటూ దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు.దళితుడన్న కారణంగా కరెంటు షాక్తో చనిపోయిన జనసేన కార్యకర్త పల్లపు సురేష్ కుటుంబాన్ని కూడా పరామర్శిచలేదు. పవన్కు మనసు నిండా కుల వివక్ష ఉంది. కులం, మతం రంగు పూసుకుని బతుకుతున్నాడు. మల్లాం దళితుల సాంఘిక బహిష్కరణపై సుప్రీం కోర్టును ఆశ్రయించాం. చట్టాన్ని ఉల్లంఘించినందుకు పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, కాకినాడ కలెక్టర్, ఆర్డీవో, పోలీసు అధికారులపై కేసు పెట్టాం...మల్లాం ఘటనపై నేటికి పవన్ కళ్యాణ్ స్పందిక పోవడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం పదవి నుండి తొలగించాలని పిటిషన్ వేశాం’’ అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆశోక్ బాబు తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి)గండేరా (వెయ్యి) 22,000 గటగట (వెయ్యి) 19,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,000 గటగట (వెయ్యి) 18,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 13,000 – 13,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ఫిట్స్తో వ్యక్తి మృతి
కడియం: స్థానిక కాలువగట్టున ఆలమూరు మండలం నర్శిపూడి గ్రామానికి చెందిన గుబ్బల వెంకటరమణ (40) అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. వారి కథనం మేరకు నర్శిపూడి గ్రామానికి చెందిన వెంకటరమణ కాలువలో గేలంతో చేపలు పట్టి అమ్ముతుంటాడు. శనివారం మధ్యాహ్నం కడియం కాలువగట్టుకు చేపలు పట్టడానికి వెళ్లాడు. ఆదివారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన స్థానికులు వెంకటరమణ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆరా తీశారు. వెంకటరమణకు తరుచూ ఫిట్స్ వస్తుంటాయని, అలా శనివారం ఫిట్స్ వచ్చి కాలువగట్టున పడిపోయి ఉండి ఉంటాడని, ఎవరూ గమనించకపోవడంతో మృతిచెంది ఉంటాడని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.డీసీసీబీ చైర్మన్గా తుమ్మల బాబుబోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి డీసీసీబీ చైర్మన్గా తుమ్మల రామస్వామి (బాబు)ను, డీసీఎంఎస్ చైర్మన్గా పెచ్చెట్టి చంద్రమౌళిని నియమించారు. గత కొన్ని రోజులుగా డీసీసీబీ చైర్మన్ పదవులకు పలువురి పేర్లు వినిపించినా చివరికి రామస్వామిని నియమించారు. -
భారతదేశానికి వ్యతిరేకంగా పోస్టు
అమలాపురం రూరల్: మండలం కామనగరువు పంచాయతీ పరిధిలోని మిక్చర్ కాలనీకి చెందిన పూజారి రాజు అనే యువకుడు ఇటీవల జై పాకిస్థాన్ అంటూ ఫేస్బుక్ పోస్టు పెట్టాడు. ఆ పోస్ట్ అదివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమలాపురం తాలూకా ఎస్సై శేఖర్బాబు అధ్వర్యంలో పోలీసులు రాజు ఇంటికి చేరుకుని తనిఖీ చేశారు. అతడు ప్రస్తుతం విజయనగరం జిల్లా సాలూరులో ఉన్నట్లు అతని తండ్రి ఏసుబాబు పోలీసులకు తెలిపారు. తెలియక ఈ పోస్టు పెట్టినట్లు రాజు చెప్పినట్లు ఎస్సై శేఖర్బాబు తెలిపారు. ఈ కుటుంబం గతంలో మిక్చర్ కాలనీలో ఉండే వారని, సోఫా పనుల కోసం వెళ్లి కుటుంబ మొత్తం విజయనగరం జిల్లా సాలూరులో నివసిస్తున్నారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు విజయనగరం పోలీసులకు సమాచారం అందించారు. ● యువకుడి కోసం పోలీసుల గాలింపు -
కోరుకొండలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కోరుకొండ: స్థానిక దేవునికోనేరు వద్ద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై కూన నాగరాజు తెలిపారు. 45 ఏళ్ల వయసున్న మృతదేహాన్ని గుర్తించినట్టు వీఆర్వో కొవ్వాడ రామకృష్ణ ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని గుర్తించేందుకు వీలుగా 72 గంటల పర్యవేక్షణ నిమిత్తం రాజమమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.బాల్య వివాహం అడ్డగింతయానాం: చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ఓ బాల్య వివాహాన్ని యానాం చైల్డ్ హెల్ప్లైన్కు వచ్చిన సమాచారం ఆధారంగా సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. ఆదివారం చైల్డ్ హెల్ప్లైన్ కో ఆర్డినేటర్ సంసాని రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం నియోజకవర్గ పరిధిలో బాలయోగి నగర్లో 15 ఏళ్ల బాలికకు 22 ఏళ్ల యువకుడితో వివాహం చేస్తున్నారని తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు యానాం ఏఎస్సై పంపన మూర్తి, ప్రకాష్లను వెంటపెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లి బాల్యవివాహాల నిరోధక చట్టం–2006 గూర్చి ఇరువురు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించామని, చట్టరీత్యా ఈ వివాహం నేరమని చెప్పి చెప్పినట్టు తెలిపారు. యానాంలో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతుంటే 1098కు సమాచారం అందించాలని, వివరాలను గోప్యంగా ఉంచుతారని తెలిపారు. -
తొలిదశలో గుర్తిస్తే బోన్ క్యాన్సర్ నివారణ
● అమోర్ ఆసుపత్రి ఎండీ, బోన్ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కిశోర్రెడ్డి ● ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్లపై పీఎంపీలకు అవగాహన కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బోన్ క్యాన్సర్ వచ్చిందంటే ఇక చివరిదశే అని చాలామంది అనుకుంటారు. అది పూర్తి అపోహేనని హైదరాబాద్కు చెందిన అమోర్ ఆస్పత్రి ఎండీ, బోన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కిశోర్రెడ్డి తెలిపారు. స్థానిక మోడల్కాలనీలో ఉన్న ఎఫ్ కెఫే హోటల్లోని ఫంక్షన్ హాలులో ఆదివారం ఉభయగోదావరి జిల్లాల్లోని పీఎంపీ వైద్యులకు ఎముకలు, కీళ్లు, కండరాల క్యాన్సర్ స్పెషలిస్టు డాక్టర్ కిశోర్రెడ్డి ఆదివారం అవగాహన కల్పించారు. కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎముకలకు కండరాలకు సంబంధించిన క్యాన్సర్కు కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ, చికిత్సలను వివరించారు. క్యాన్సర్లు వ్యక్తి జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, ముఖ్యంగా బోన్ క్యాన్సర్లపై అవగాహన అవసరమన్నారు. బోన్ క్యాన్సర్కు గురైన ఎందరికో నేటి ఆధునిక వైద్యంతో నయం చేశామన్నారు. మూడేళ్ల చిన్నారికి సైతం బోన్ క్యాన్సర్ చికిత్స చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగుమళ్ల రాంబాబు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎస్ ప్రసాద్, ఎండీ తానీషా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు కోన సత్యనారాయణ, సూరంపూడి వీరభద్రరావు, రాజమహేంద్రవరం అధ్యక్షుడు రహమాన్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి ఎ.ధనుంజయ్, కార్యదర్శి మట్టా రమేష్లతో పాటు అన్ని మండలాల నాయకులు హాజరయ్యారు. -
నర్సింగ్ నైటింగేల్!
కపిలేశ్వరపురం: సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి సంపూర్ణ శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించాలి. రోగభయం లేని సమాజానికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. జనాభా, ఆరోగ్య ప్రమాణాల ప్రాతిపదికన తగినన్ని ఆస్పత్రులను, వైద్యులను, సిబ్బందిని నియమించాలి. వారి పూర్తి సేవలు రోగులకు అందేలా సహకరించాలి. వైద్యం ఎంత ఉన్నతంగా చేసినా సిబ్బంది, నర్సుల సహకారం లేకపోతే అంతా వృథా అయినట్టే. సమాజ ఆరోగ్య పరిరక్షణలో నర్సుల పాత్ర ఎంతో కీలకం. ఉమ్మడి జిల్లాలో నర్సులు ఇలా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్సీలు, 22 సీహెచ్సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలున్నారు. 200 మంది ఏఎన్ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్హెచ్పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశా కార్యకర్తలు పని చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నర్సులుగా పనిచేస్తున్నారు. నర్సుల డిమాండ్లు వినేవారేరీ! ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. అనుమతులు లేకుండా ఆస్పత్రులు నడుస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనానాకు ముగ్గురు నర్సులు చొప్పున ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన నిర్దేశకాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నర్సులపై పనిభారం అధికమవుతోంది. కార్మిక చట్టానికి భిన్నంగా వారు 8 గంటలకు బదులు 11 గంటలు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగులకు పని ప్రదేశంలో ప్రత్యేక సదుపాయాలు లేవు. హెల్త్ సెక్రటరీలకు వైద్య సేవలకు తోడు ఇతర ప్రభుత్వ అనుబంధ పనులు సైతం చెప్పడంతో వైద్య సేవల్లో నాణ్యత కొరవడుతోంది. ఉద్యోగ ఉన్నతి ప్రక్రియ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిలిచిపోవడంతో నర్సులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాకినాడ జీజీహెచ్లో ఐసీయూ విభాగంలో ఒక్కో బెడ్కు ముగ్గురు చొప్పున నర్సులు ఉండాలన్నది ఆచరణకు నోచుకోవడంలేదు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సేవలందిస్తు ఆశా కార్యకర్తలు క్షేత్ర స్ధాయిలో వేధింపులకు గురవుతున్నారు. మార్చి 1న నిర్వహించిన ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశంలో గ్రాట్యుటీ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, 30 ఏళ్ల సర్వీసు ఉంటేనే రూ.1.5 లక్షల గ్రాట్యుటీ ఇస్తామంటూ మెలిక పెట్టింది. 2024 డిసెంబర్లో సమస్యల పరిష్కారాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేశారు. వారి పోరాటాన్ని వేధింపులు, పోలీస్ చర్యలతో అణచివేసింది. పలు దఫాలుగా నిర్వహించిన నర్సుల ఉద్యమాలు ఫలితంగా ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచింది. 180 రోజుల ప్రసూతి సెలవులకు అంగీకరించింది. నర్సుల దినోత్సవ నేపథ్యం ఇదీ... 1820, మే 12న ఇటలీలో ధనిక కుటుంబంలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టిన రోజును ప్రపంచ నర్సుల దినోత్సవంగా నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ నర్సెస్ 1965లో నర్సింగ్ డేను గుర్తించింది. యుద్ధ సమయంలో గాయాలపాలైన వారికీ, ప్రకృతి వైపరీత్యాలకు గురైనవారికీ ధైర్య సాహసాలతో వైద్య సేవలందించడంలో నర్సింగ్లో నైటింగేల్ తీసుకువచ్చిన సంస్కరణలు ఎంతో దోహదం చేశాయి. ఆమె రాసిన రచనలు వైద్యరంగాన్ని మరో మెట్టు ఎక్కించాయి. నైటింగేల్ ట్రైనింగ్ స్కూల్ ఫర్ నర్సెస్ పేరుతో సంస్థను స్థాపించి ఎందరో నర్సులను తయారు చేశారు. 1910 ఆగస్టు 13న లండన్లో ఆమె మృతి చెందారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఆస్పత్రుల ప్రగతి స్వాతంత్య్రం వచ్చాకా రాష్ట్రంలో 11 వైద్య కళాశాలలు ఏర్పాటైతే, వైఎస్సార్ సీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకొచ్చింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంతో ప్రైవేటుపరం చేయాలని చూస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నర్సింగ్ కౌన్సిల్తో ఎంవోయూ కుదుర్చుకుని నర్సింగ్ కోర్సులు చేసిన యువతలో నైపుణ్యాల పెంపునకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. సేవే లక్ష్యం, ప్రేమే మార్గంగా రోగుల సేవ ప్రపంచానికి ఆదర్శంగా నిలచిన ఫ్లోరెన్స్ ఆమె మార్గంలో నేడు ఎందరో పయనం వారి శ్రేయస్సు ప్రభుత్వాల కనీస బాధ్యత మాటే మంత్రం.. మంత్రం లక్షణం.. మనసుపై బలమైన ముద్రవేసి సమస్య పరిష్కరించడం. ఈ లక్షణాన్ని నూరు శాతం కలిగి ఉన్న మన ఊరి మంత్రసాని ఆమె. కాలక్రమంలో నామాంతరం.. రూపాంతరం చెంది నర్సులుగా సమాజ సేవ చేస్తోంది. రోగం ఎంత క్షిష్టమైనదైనా.. రోగి శరీరం.. మనసు ఎంత అవసానంలో ఉన్నా తన అనునయ వాక్యాలతో మనసును ఊరడించి రోగభయాన్ని తగ్గించి మానసికంగా రోగం తగ్గడానికి ఉద్యుక్తుడిని చేసి వైద్యుడు ఇచ్చిన ఔషధం ఒంటబట్టేలా చేస్తుంది. ఎంత పెద్ద ఆస్పత్రి అయినా.. వైద్యుడు ఎంతటి ప్రవీణుడైనా ఆమె మాటల అనుపానం లేకపోతే ఎందరో రోగులు అంత తీవ్రతరమైన రోగం లేకపోయినా మానసిక భయంతో విలువైన ప్రాణాలు కోల్పోయేవారు. ఎంతో దూరం పోనవసరం లేకుండా ఇటీవల కొన్ని వేల మందిని కబళించిన కరోనాయే ఇందుకు సాక్ష్యం. ఆ కష్టకాలంలో ఎందరో రోగులు మానసికమైన ఒత్తిడిని తట్టుకోలేకే మృతి చెందారన్నది నిర్వివాదాంశం. సరైన వైద్యాన్ని సకాలంలో అందిస్తూ సేవ చేసే మంత్రముగ్ధలైన నర్సులు నిజమైన సమాజ సేవకులు. వారికి ప్రేరణ.. ఆదర్శం ఫ్లోరెన్స్ నైటింగేల్. నిజంగా ఆమె సార్థకనామధేయురాలు. నైటింగేల్ అంటే మధురమైన గానం చేసే పక్షి అని అర్థం. ఆమె మాటల ప్రభావం ఎంతటిదో ప్రపంచం నేడు గుర్తిస్తోంది. ఇటలీలో జన్మించి ఐర్లాండులో నర్సింగ్లో సంస్కరణలకు నాంది పలికిన మహోన్నత సేవా శిఖరం. నేడు ఆమె జయంతిని పురస్కరించుకుని నర్సుల దినోత్సవం సందర్భంగా కథనం. చాకిరీ మూరెడు... వేతనం బెత్తెడు... నర్సులు ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు 12 గంటలు పాటు సేవలందిస్తున్నారు. నెలకు వారికి ఇచ్చే వేతనం రూ.15 వేల లోపే. ప్రభుత్వ రంగంలోని నర్సులు సైతం వేతనాలు పెంచాలన్న డిమాండ్ అపరిష్కృతంగానే ఉంది. పీఎంఎంవీవై పథకం ద్వారా గర్భిణులను ప్రతి నెలా 9న ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయిస్తున్నారు. గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్య పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కిల్కారీ, మొబైల్ అకాడమీ సేవల్లో నర్సులు భాగస్వాములవుతున్నారు. జిల్లాకు సుమారుగా ఐదు వేల మంది చిన్నారుల చొప్పున ప్రతి నెల బుధ, శనివారాల్లో క్రమం తప్పకుండా టీకాలు వేస్తున్నారు. వైద్య, ఆరోగ్య సేవలకు అవకాశం కల్పించాలి పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య, ఆరోగ్య సేవలు చేసేందుకు పూర్తి స్ధాయిలో అవకాశం ఇవ్వాలి. అలా కాకుండా సచివాలయ పరిధిలోని పనుల భారాన్ని మోపడం సరికాదు. హెల్త్ సెక్రటరీలను యాప్ల నిర్వహణకు మినహాయించాలి. ఫీల్డ్ వర్క్లో ఉన్నందున ఎఫ్ఆర్ఎస్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – జి.నాగ వరలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ యునైటెడ్ విలేజ్ అండ్ వార్డ్ హెల్త్ సెక్రటరీ వెల్ఫేర్ అసోసియేషన్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ -
వాహనం అదుపుతప్పి యువకుడి మృతి
ఆలమూరు: స్థానిక జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి ఆనంద్ (29) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం మడికి గ్రామానికి చెందిన ఆనంద్ రాజమహేంద్రవరంలోని ఐసీఐసీఐ క్రెడిట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పని మీద తన బైక్పై రావులపాలెం వైపు వెళ్తుండగా స్థానిక లాకుల వద్ద అదుపు తప్పి కల్వర్టు గోడను ఢీకొట్టాడు. దీంతో ఆనంద్కు తలపై బలమైన గాయమై రక్తం పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టంకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆనంద్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏడాది క్రితం అతడికి వివాహం కాగా భార్య, ఒక పాప ఉన్నారు. ట్రాక్టర్ ఢీకొని.. పిఠాపురం: గొల్లప్రోలు మండలం ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కథనం మేరకు అల్లూరిసీతారామరాజు జిల్లా ముంచంగిపుట్ట మండలం మచ్చేపురానికి చెందిన కోడ మోహన్ గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురంలో చేపల చెరువుల వద్ద పని చేస్తున్నాడు. ఆదివారం చేపల పట్టుబడి ఉండడంతో ఇతర కూలీలకు భోజనాలు తేవడానికి మోటారు సైకిల్పై చేబ్రోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఏకే మల్లవరం రైల్వే గేటు వద్ద అత్యంత వేగంగా వచ్చిన ట్రాక్టర్ మోహన్ను బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎస్సై ఎన్.రామకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. లారీ ఢీకొని.. తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం జంక్షన్ సమీపంలో లారీ ఢీ కొనడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి చెందినట్టు రూరల్ ఎస్సై బి.కృష్ణమాచారి తెలిపారు. ఆదివారం విజయవాడ రాణీపేటకు చెందిన బూరాడ పట్టాభినాయుడు శుభలేఖలు ఇచ్చేందుకు శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. లారీ ఢీ కొనడంతో పట్టాభినాయుడు అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. -
పాడైన గుడ్లే పోషకాహారం!
● గొర్రిపూడి అంగన్వాడీ కేంద్రంలో పంపిణీ ● ఆందోళన వ్యక్తం చేసిన లబ్ధిదారులు కరప: అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ లేక అక్కడి చిన్నారులు, గర్భిణులు ఇబ్బంది పడుతున్నారు. చిన్నారులకు, గర్భిణులకు పోషకాహారం నిమిత్తం అందించే కోడిగుడ్లపై అంగన్వాడీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండలం గొర్రిపూడి మార్కెట్సెంటర్లోని అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 7వ తేదీన సరఫరా చేసిన కోడిగుడ్లను ఆదివారం లబ్ధిదారులు ఇంటి వద్ద ఉడకబెట్టగా దుర్వాసనతో కుళ్లిపోయాయి. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికీ, ఎండకూ పాడయ్యాయి ఈ విషయమై సెక్టార్ సూపర్వైజర్ విజయలక్ష్మి వివరణ ఇస్తూ కోడిగుడ్లు చెడిపోవడం వాస్తవమేనని, అయితే వాటిని ఎవరికీ పంపిణీ చేయలేదన్నారు. నాలుగు రోజుల క్రితం కోడిగుడ్లు తీసుకు వచ్చే వ్యాన్ డ్రైవర్కు అకస్మాత్తుగా ప్లేట్లెట్లు పడిపోవడంతో కాకినాడ ఆసుపత్రిలో చేరారని, కోడిగుడ్లతో ఉన్న వ్యాన్ను బయట ఉంచేయడంతో వర్షానికి తడిసి, ఎండకు పాడైపోయాయని తెలిపారు. డ్రైవర్ కోలుకున్నాక ఈ విషయం ఏజన్సీ యజమానికి చెప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చి వెళ్లిపోయాడు. ఆదివారం కోడిగుడ్లు పాడైనట్టు గుర్తించిన వెంటనే ఏజన్సీస్కి తెలియజేస్తే, పాడైన గుడ్లను వెనక్కి తీసుకుని, మంచివి ఇచ్చేందుకు అంగీకరించారని, ఇదే విషయాన్ని సీడీపీఓకు కూడా తెలియజేసినట్టు విజయలక్ష్మి తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
తాళ్లపూడి (కొవ్వూరు): మండంలోని దోమ్మేరు శివారులో ఎదురుగా వస్తున్న ట్రాలీ ట్రాక్టర్ మోటార్ సైకిల్ను ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడి క్కడే మృతి చెందాడు. ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు దోమ్మేరు గ్రామానికి చెందిన చిగురుపల్లి విద్యాసాగర్ (18) కాపవరం వెళ్లి అక్కడ నుంచి మోటార్ సైకిల్పై వస్తుండగా కొవ్వూరు వైపు నుంచి పంగిడికి గడ్డితో వెళుతున్న ట్రాలీ ట్రాక్టర్ ఎదురుగా ఢీకొనడంతో విద్యాసాగర్ దాని చక్రాల కింద పడిపోయాడు. దీంతో అతని తల, ఇతర శరీరభాగాలు నుజ్జయ్యి మృతి చెందాడు. విద్యాసాగర్ కొవ్వూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి అరవింద్ కుమార్ కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి, చెల్లి జోత్స్న ఉన్నారు. కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో వారి రోదన వర్ణనాతీతమైంది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఆరోపించి తమకు న్యాయం చేయాలని పట్టుబట్టారు. సీఐ విజయబాబు ఘటనా ప్రదేశానికి చేరుకుని వారికి నచ్చ చెప్పి యువకుడి మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రాలీ ట్రాక్టర్ న్యాయం చేయాలని కుటుంబ సభ్యుల బైఠాయింపు సీఐ జోక్యంతో పరిస్థితి ప్రశాంతం -
మండు వేసవిలోనూ లోవకు భక్తుల తాకిడి
తుని రూరల్: మండు వేసవిలోనూ తలుపులమ్మ అమ్మవారి సన్నిధి వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 30 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని డిప్యూటీ కమిషనర్ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,24,140, పూజా టికెట్లకు రూ.73 వేలు, కేశఖండన శాలకు రూ.16,130, వాహన పూజలకు రూ.9,860, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలుగా రూ.63,772, విరాళాలు రూ.77,577 కలిపి మొత్తం రూ.3,64,479 ఆదాయం సమకూరిందని వివరించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా వేద పండితులు, ప్రధానార్చకులు అమ్మవారికి పంచామృతాభి షేకాలు నిర్వహించారు. రత్నగిరిపై భక్తజన ప్రవాహం అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి ఆదివారం భక్తజన ప్రవాహాన్ని తలపించింది. కొండపై ఎక్కడ చూసినా భక్తులు గుంపులు గుంపులుగా కనిపించారు. రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో రావడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. స్వామివారిని 50 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఎండ వేడికి అల్లాడుతున్న భక్తులు సత్యదేవుని దర్శనానికి, వ్రతాలు ఆచరించేందుకు వస్తున్న భక్తులు రత్నగిరిపై ఎండవేడికి అల్లాడిపోతున్నారు. ఆదివారం 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రత నమోదవడంతో భక్తులు ఆలయ ప్రాంగణంలోని చలువ పందిళ్ల కింద సేద తీరారు. విపరీతమైన ఉక్కపోతతో ఆపసోపాలు పడ్డారు. గతంలో పశ్చిమ రాజగోపురం వద్ద కూడా మజ్జిగ పంపిణీ చేసేవారు. ఈ ఏడాది ఎందుకనో పంపిణీ చేయడం లేదు. దీంతో భక్తులు శీతలపానీయీలను కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. దేవస్థానం తరఫున భక్తులకు మజ్జిగ పంపిణీ చేయాలని పలువురు సూచిస్తున్నారు.