breaking news
Kakinada
-
మురళీకృష్ణంరాజును ఫోన్లో పరామర్శించిన వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమగోదావరి: నర్సాపురం పార్లమెంట్ వైఎస్సార్సీపీ పరిశీలకులు మురళీకృష్ణంరాజును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. 86 ఏళ్ల వయసున్న మురళీకృష్ణంరాజు తండ్రి రామరాజుపై తప్పుడు కేసు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ అన్నారు. అక్రమ కేసులపై భయపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.పింఛన్లు పంపిణీ సందర్భంగా ఈనెల 1వ తేదీన ధర్మవరంలో మురళీకృష్ణంరాజు నివాసానికి వెళ్ళిన సచివాలయం మహిళ సంరక్షణ కార్యదర్శి రాధిక.. జగన్నాధరాజు అనే పింఛన్ దారుని చిరునామా కోసం రామరాజును ఆమె వివరాలు అడిగారు. ఈ సమయంలో తనను 86 ఏళ్ల రామరాజు లైగింకంగా వేధించారని ఆరోపిస్తూ ప్రత్తిపాడు పీఎస్లో ఆమె ఫిర్యాదు చేశారు. రాధిక ఫిర్యాదు మేరకు ఆగమేఘాలపై పోలీసులు లైగింక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
మర్రెడ్డిపై కన్నెర్ర..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏ ముహూర్తాన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారో కాని అప్పటి నుంచి పిఠాపురంలో జనసేన ముఖ్య నేతల మధ్య సెగ రాజుకుంటూనే ఉంది. డిప్యుటీ సీఎం ఎలాగూ ఉండని పిఠాపురంపై పెత్తనం కోసం జనసేనలోని ఒకే సామాజికవర్గం నుంచి రెండు వర్గాలు నువ్వా, నేనా అనే స్థాయిలో కుమ్ములాడుకుంటున్నాయి. రచ్చకెక్కిన వీరి విబేధాలు ఇటీవల పవన్ వద్ద పంచాయతీకి వెళ్లాయి. ఒకరి పెత్తనాన్ని మరొకరు ఒకపట్టాన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆధిపత్య పోరు చివరకు పిఠాపురంలో పవన్ కనుసన్నల్లో అన్నీ తానై ఒంటిచేత్తో చక్రం తిప్పిన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్కు మంగళంపాడే వరకు వెళ్లింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఎవరూ ఉండరనేందుకు ఈ రెండు వర్గాల ముఖ్యనేతలే పెద్ద ఉదాహరణగా నేతలు విశ్లేషిస్తున్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ తెర వెనుక అన్నీ తానై చక్కబెట్టారు. తాను ఎంపీగా పోటీ చేయాలనుకుని పిఠాపురానికి ఎటువంటి సంబంధం లేని ద్వారపూడికి చెందిన మర్రెడ్డి శ్రీనివాస్కు ఇన్చార్జి అప్పగించడంలో తంగెళ్ల పావులు కదిపారు. తొలినాళ్లలో ఈ రెండు గ్రూపులు భాయ్భాయ్ అంటూ చెట్టాపట్టాలేసుకునే తిరిగాయి. ఎటొచ్చీ తంగెళ్ల ఎంపీ, పవన్ ఉప ముఖ్యమంత్రి కావడంతో పిఠాపురంపై పెత్తనం కోసం మర్రెడ్డి, తంగెళ్ల వర్గాల మధ్య అంతర్గత పోరు పలు సందర్భాల్లో రచ్చకెక్కింది. పిఠాపురం ఇన్చార్జిగా మర్రెడ్డి ఒంటెద్దు పోకడలతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తొలి నుంచి ఎంపీ వర్గం బాహాటంగానే చెబుతోంది. నియోజకవర్గంలో తన కనుసన్నల్లోనే అంతా జరగాలనే స్థాయికి మర్రెడ్డి వచ్చేశారని పవన్ కల్యాణ్ వద్ద చెవిలో జోరీగలా పోరుపెడుతూనే వస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మతో మిలాఖత్ అయ్యి పార్టీ నేతలను తొక్కేస్తున్నారని రక్తికట్టించే కథ అల్లారని ఎంపీ తంగెళ్ల వర్గం పవన్కు చెబుతున్నారు. నియోజకవర్గ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఇటీవల పార్టీ నేతలతో పవన్ మంగళగిరిలో బేటీ అయ్యారు. నమ్మి బాధ్యతలు అప్పగిస్తే ఇలానే వ్యవహరిస్తారా అంటూ మర్రెడ్డిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారని పార్టీ నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఎంపీ వర్గం వ్యూహాత్మకంగా పావులు కదిపి మర్రెడ్డికి చెక్ పెట్టిందంటున్నారు. మర్రెడ్డి స్థానే నియోజకవర్గంలో పార్టీ నిర్వహణకు ఫైవ్ మెన్ కమిటీ వేశారని చెబుతున్నారు. ఇప్పటి వరకు మర్రెడ్డి ఒక్కరే ఇన్చార్జిగా ఉండగా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాస్లతో నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటుచేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కమిటీ నియామకం ద్వారా మర్రెడ్డికి నియోజకవర్గ కార్యకలాపాల్లో ప్రాధాన్యం లేకుండా చెక్ పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఇక ముందు సమన్వయ కమిటీదే తుది నిర్ణయమని, అధికారులు కూడా కమిటీ సభ్యులు చెప్పే పనులకు ఆమోదం తెలియచేయాలని మౌఖిక ఆదేశాలు కూడా వచ్చాయంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు నామినేటెడ్ పోస్టులపై మర్రెడ్డి ఇన్చార్జిగా నిర్ణయం తీసుకుని ప్రతిపాదించిన వాటిని వెనక్కు తీసుకోవడం ద్వారా మర్రెడ్డికి ప్రాధాన్యం లేదనే విషయం ప్రచారం చేయాలనే యోచనలో ఎంపీ వర్గం పావులు కదుపుతోంది. నియోజకవర్గంలో 12 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 8 జనసేన, 4 టీడీపీకి ఇప్పటికే పంపకాలు జరిగిపోయాయి. అయినా వాటన్నింటినీ ఎక్కడివక్కడే ఆపేయాలని నిర్ణయించారని పార్టీలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పవన్ గెలుపు కోసం పనిచేసిన వారిని జనసేనలో కరివేపాకుల్లా వాడుకుని గాలికి వదిలేస్తారని ఇదంతా చూస్తుంటే అర్థమవుతోందని పార్టీ నేతల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ వర్మ ఉదంతాన్ని గుర్తుచేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకు పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మను పవన్, అతని సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు ఆకాశానికి ఎత్తేసేవారు. ఎన్నికలు పూర్తయ్యి కూటమి గద్దె నెక్కి పవన్ ఉప ముఖ్యమంత్రి, నాగబాబు ఎమ్మెల్సీ అయిపోగానే సోదర ద్వయం వర్మను కరివేపాకులా పక్కన పడేశారని పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. వర్మకు పదవి ఇవ్వాలా వద్దా అనేది ఆ పార్టీ అధిష్టానం చూసుకుంటుందనే సరికొత్త ప్రచారాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు 14 నెలల పాటు పార్టీ కోసం పనిచేసిన తమ నేతను కూడా వర్మ మాదిరిగానే కరివేపాకులా తీసిపారేశారని మర్రెడ్డి వెంట తిరిగిన పార్టీ నేతలు మండిపడుతున్నారు. పవన్ ఇలాకా పిఠాపురం జనసేనలో రాజుకున్న ఈ కుంపటి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోననే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఆధిపత్య పోరులో అధికారాలకు కత్తెర కోటరీలో చక్రం తిప్పిన ఎంపీ వర్గం ఫైవ్మెన్ కమిటీతో ఇన్చార్జికి చెక్ పిఠాపురంలో పెరుగుతున్న కరివేపాకులు ఎన్నికలకే పరిమితమైన వర్మ ప్రాధాన్యం గద్దెనెక్కాక గమ్మునున్న పవన్ సోదరులు -
ముగ్గురు ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారం
పెరుమాళ్లపురం స్కూల్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ తొండంగి: మండలంలోని పెరుమాళ్లపురం జెడ్పీ హైస్కూలు ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్ బొబ్బాది ప్రవీణ్కుమార్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్ఎం చాట్రాతి సత్యనారాయణ బుధవారం తెలిపారు. గతంలో పాఠ్య పుస్తక రచయితగా, ఉత్తమ టీఎల్ఎం నిపుణుడిగా, ట్రైనింగ్ రీసోర్స్ పర్సన్గా ఆయన ఎన్నో అవార్డులు పొందారన్నారు.కాకినాడ రూరల్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకని ఏటా నిర్వహించే ఉత్తమ ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు ఉత్తమ పురస్కారాలకు ఎన్నికయ్యారు. కాకినాడకు చెందిన కోటంరాజు గాయత్రి మూడు దశాబ్దాల పాటు చేసిన విద్యా సేవకు ఈ పురస్కారం దక్కింది. ఆమె ఎటువంటి దరఖాస్తు చేసుకోనప్పటికీ లీప్ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆమె ప్రతిభను గుర్తించి పురస్కారానికి ఎంపిక చేసింది. ఇంద్రపాలెంలో నివసిస్తున్న గాయత్రి కాకినాడ రూరల్ రమణయ్యపేటలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్లస్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. పాఠశాలను పీఎం శ్రీ పాఠశాలగా తయారు చేసి ఐదు ల్యాబ్లను, ప్లే ఫీల్డ్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆమె కృషి చేశారు. తుని మండలం తేటగుంట జెడ్పీ హైస్కూల్లో 1995 జూన్ 29న ఉపాధ్యాయినిగా తన వృత్తిని ప్రారంభించి, 2009లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయినిగా పదోన్నతి పొందారు. 2014లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా పురస్కారం అందకున్నారు. తేటగుంట, పెదపూడి మండలం ఎల్ఎన్ పురం, కాకినాడ అర్బన్ పీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. గెజిటెడ్ హెచ్ఎంగా కిర్లంపూడి మండలం సోమవరం, పెద్దాపురం మండలం చంద్రమాంపల్లిలో పని చేసి, 2023 నుంచి రమణయ్యపేటలో పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికై న గాయత్రిని డీఈఓ రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. కొమరగిరి నుంచి రవిశంకర్ కొత్తపల్లి: రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకున్న వారిలో కొత్తపల్లి మండలం ఉప్పాడలోని కొమరగిరి జెడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు పతివాడ రవిశంకర్ ఒకరు. గణిత అవధానిగా, పాఠ్య పుస్తక రచయితగా, మాడ్యూల్ రైటర్గా, స్టెమ్ ల్యాబ్ డిజైనర్గా పలు విద్యా సేవలు అందించడంలో ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఏలేశ్వరం స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, స్నేహస్తం, చేయూత, లయన్స్ క్లబ్ కాకినాడ ఎలైట్ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా సైతం ఆయన సామాజిక సేవ చేస్తున్నారు. గత మూడేళ్లుగా జాతీయస్థాయిలో గణిత అభ్యసన సామగ్రితో పురస్కారాలు అందుకుంటున్నారు. బోధన అభ్యసన సామగ్రి తయారు చేయడం, వాటిని ఎలా తయారు చేయాలి.. ఎలా ఉపయోగించాలనే అంశాలపై వర్క్ షాపులు నిర్వహించడం చేస్తున్నారు. అంతే కాకుండా విద్యార్థులకు ఆటల పాటల ద్వారా వినూత్నంగా విద్యా బోధన చేస్తున్నారు. గణిత క్రికెట్, గణిత హౌసి, టేబుల్ అంత్యాక్షరి, మ్యాజిక్ స్క్వేర్ డాన్స్ వంటి అనేక వినూత్న విధానాలతో పిల్లల ఆకట్టుకోవడమే కాక సైన్స్ ఫెయిర్లకు పిల్లలను రాష్ట్రస్థాయిలో బహుమతులు అందుకునేలా చేశారు. ఎన్ఎంఎంఎస్, ఐఐఐటీలలో సీట్లు పొందడంలో విద్యార్థులకు అండగా నిలిచారు. అంతే కాకుండా విద్యార్థులకు విజ్ఞాన, విహారయాత్రలే కాక సేవను కూడా అలవాటు చేసే లక్ష్యంతో లియో క్లబ్లను ఏర్పాటు చేసి సేవపై అంకితభావాన్ని తెలియజేశారు. ఏపీఎంఎఫ్ బాధ్యుడిగా ఉంటూ గణిత ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటూ తనకు తోచిన విషయాన్ని నలుగురికి తెలియజేస్తూ వాళ్ళ దగ్గర నుంచి తెలియని విషయాన్ని నేర్చుకుంటూ గణిత సేవలో నిమగ్నమయ్యారు. -
వివాదాస్పద ఫ్లెక్సీలపై చర్యలకు డిమాండ్
పోలీస్ స్టేషన్ వద్ద దళితుల ఆందోళన మామిడికుదురు: జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. అప్పనపల్లిలో వివాదాస్పద ఫ్లెక్సీ ఏర్పాటు నేపథ్యంలో బుధవారం నగరం పోలీస్ స్టేషన్ వద్ద వారు ఆందోళన నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, సినీ నటుల అభిమాన సంఘాలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో నాయకులు, హీరోల పేర్లలో బాబు సీమ, కల్యాణ్ సీమ అని అన్వయించుకోవడం వివాదాలకు కారణమవుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు కొన్ని కులాలను కించపర్చేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేస్తున్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్సై ఎ.చైతన్యకుమార్, తహసీల్దార్ పి.సునీల్కుమార్కు వినతిపత్రాలు ఇచ్చారు. అంబేడ్కర్ యువజన సంక్షేమ సంఘం, ఎమార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కుల విద్వేషాలను రెచ్చగొట్టొద్దు: సీపీఎం అమలాపురం టౌన్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మామిడికుదురు మండలం అప్పనపల్లిలో కులవిద్వేషాలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. స్థానిక జిల్లా సీపీఎం కార్యాలయంలో పార్టీ నాయకులు బుధవారం సమావేశమై దీనిపై చర్చించారు. ఈ ఫ్లెక్సీ వేయించిన వారిపై, ముద్రించిన షాపుపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. పార్టీ నాయకులు జి.దుర్గాప్రసాద్, పీతల రామచంద్రరావు, జిల్లా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కన్వీనర్ శెట్టిబత్తుల తులసీరావు తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరిపై 30 శాతం భక్తుల అసంతృప్తి
అన్నవరం: రత్నగిరికి వచ్చే భక్తుల అసంతృప్త స్థాయి అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. భక్తు సేవలందించడంలో ఆగష్టు నెలలో కూడా దేవస్థానం పాలకవర్గం విఫలమైనట్టు రాష్ట్ర ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. ఆగస్టు నెలలో సత్యదేవుని సన్నిధికి వచ్చే భక్తుల్లో దాదాపు 30 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. గత జూలై 26 నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తులకు అందుతున్న సేవలపై రాష్ట్ర ప్రభుత్వం వాట్సప్, ఐవీఆర్ఎస్ ద్వారా సర్వే నిర్వహించింది. సింహాచలం, అన్నవరం, ద్వారకాతిరుమల, విజయవాడ, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం దేవస్థానాలలో నిర్వహించిన సర్వేలో శ్రీకాళహస్తి ప్రధమస్థానంలో నిలవగా అన్నవరం దేవస్థానం ఐదో స్థానంలో నిలిచింది. కాగా కాణిపాకం ఏడో స్థానంలో నిలిచింది. భక్తుల సంతృప్తి శాతం ఇలా.. ● సత్యదేవుని దర్శనం విషయంలో జూన్ నెలలో 73 శాతం మంది, జూలై నెలలో 74 శాతం, ఆగస్టులో 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● మౌలిక వసతుల కల్పనలో జూన్లో 66 శాతం, జూలైలో 65 శాతం, ఆగస్టులో లో 64.9 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ● స్వామివారి గోదుమ నూక ప్రసాదం నాణ్యతపై జూన్లో 77 శాతం, జూలైలో 78 శాతం, ఆగస్టులో 76.9 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ● పారిశుధ్య చర్యలలో జూన్లో 70 శాతం, జూలైలో 68 శాతం, ఆగస్టులో 66.5 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దసరా, కార్తికమాసాల నాటికి చక్కదిద్దాలి ఈ నెల 22 నుంచి ఆశ్వయుజ మాసం ప్రారంభమవుతోంది. ఆ రోజు నుంచి పది రోజుల పాటు దసరా నవరాత్రులలో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. అలాగే అక్టోబర్ 22 నుంచి కార్తికమాసం రద్దీ ఉంటుంది. ఈ లోపుగా దేవస్థానంలో భక్తుల అసంతృప్తి తగ్గేలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. జూలై 26 నుంచి ఆగస్టు 25 వరకు వాట్సాప్ యాప్, ఐవీఆర్ఎస్ సర్వే -
స్ప్రేయర్ మొరాయిస్తే.. ఫియరే..!
రాయవరం: పంటలకు ఆశించిన చీడపీడల నివారణకు మందులు పిచికారీ చేయడానికి రైతులు రకరకాల స్ప్రేయర్లను వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటలకు ఆశిస్తున్న తెగుళ్ల నివారణకు పురుగు మందులను పిచికారీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. పంట కాలంలో వాటితో పని ముగియగానే అలాగే వదిలేస్తారు. తర్వాత పంట కాలంలో అవసరం రాగానే స్ప్రేయర్లను మళ్లీ వినియోగించేందుకు యత్నిస్తే.. చాలావరకు మొరాయిస్తుంటాయి. అప్పుడు స్ప్రేయర్లను తీసుకుని మెకానిక్ షెడ్లకు పరుగులు పెట్టడం సర్వసాధారణం. డబ్బు వెచ్చించి రిపేరు చేయించడం కన్నా, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వృథా ఖర్చులు తగ్గడంతో పాటు, స్ప్రేయర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కాండం తొలుచు పురుగు ఆశించడంతో రైతులంతా పురుగు మందుల పిచికారీలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో స్ప్రేయర్లను భద్రపర్చే విధానాన్ని మండల వ్యవసాయాధికారి కేవీఎన్ రమేష్కుమార్ వివరించారు. పవర్ స్ప్రేయర్ మందుల పిచికారీ సమయం ముగియగానే మంచి నీటితో శుభ్రం చేయాలి. ట్యాంకులో పెట్రోలు లేకుండా చూసుకోవాలి. టర్బోరేటర్ గిన్నెలోనూ పెట్రోలు లేకుండా చూడాలి. ప్లగ్ తీసి శుభ్రంగా పెట్రోల్తో కడగాలి. పిస్టన్పై 5–6 చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ను బిగించాలి. ఇలా చేస్తే పిస్టన్ పాడైపోకుండా ఉంటుంది. మళ్లీ అవసరం వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ అవుతుంది. తైవాన్ ట్యాంకులో ఐదు లీటర్ల మంచినీరు పోయాలి. ఇంజిన్ స్టార్ట్ చేసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. ఇలా చేయడం వల్ల పైపుతో పాటు, నాజిల్లో మలినాలు లేకుండా శుభ్రమవుతుంది. ట్యాంకులో పెట్రోలు లేకుండా తీయాలి. ప్లగ్ను తీసి పిస్టన్పై ఐదారు చుక్కల ఇంజినాయిల్ వేసి ప్లగ్ బిగించాలి. పంపు భాగాలన్నింటినీ శుభ్రంగా తుడిచి భద్రపర్చుకోవాలి. రీచార్జబుల్.. పనులు పూర్తయిన వెంటనే మూడు లీటర్ల నీటిని ట్యాంకులో పోసి బయటకు పంపాలి. ప్రతి 15 రోజులకు ఓసారి గంట పాటు చార్జింగ్ పెట్టాలి. ఇలా చేయడం వల్ల బ్యాటరీ డ్రెయిన్ కాకుండా ఉంటుంది. అన్నదాతలు ఆయా విషయాలు పాటించి తమ పంపు స్ప్రేయర్లను భద్రపర్చుకోవచ్చు. ఏడాది తర్వాత తీసినా.. మందుల పిచికారీ పూర్తి కాగానే శుభ్రమైన నాలుగు లీటర్ల మంచినీటిని ట్యాంకులో పోసి నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తద్వారా స్ప్రేయర్ గొట్టం(ఇత్తడి) తీసి, దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు రాకుండా ఉంటుంది. ఏడాది తర్వాత తీసి వాడినా బాగా పనిచేస్తుంది. హైటెక్.. ట్యాంకులో మూడు లీటర్ల నీటిని పోసి శుభ్రంగా నాజిల్ ద్వారా బయటకు పంపాలి. తర్వాత స్ప్రేయర్ గొట్టం తీసి దానికి ఇంజినాయిల్ పోసి మళ్లీ బిగించాలి. ఇలా చేస్తే గొట్టం తుప్పు పట్టకుండా ఉంటుంది. బుష్లు, రాడ్ల వద్ద ఇంజినాయిల్ పూయడం వల్ల తుప్పు పట్టదు. పరికరాలను భద్రపర్చాలంటున్న వ్యవసాయ నిపుణులు నెలల తరబడి వదిలేస్తే.. మొండికేసే అవకాశం డబ్బు, సమయం వృథా చిన్న జాగ్రత్తలతో రైతులకు మేలు -
7న పంచారామ క్షేత్రం మూసివేత
సామర్లకోట: చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంట నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరి సమేత కుమారా రామభీమేశ్వరస్వామి ఆలయం మూసి వేయనున్నట్టు ఈఓ బళ్ల నీలకంఠం తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ చంద్రగ్రహణం వీడిన తరువాత సోమవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్టు ఆయన తెలిపారు. భక్తులు ఈ అసౌకర్యాన్ని గమనించాలన్నారు. అలాగే అతి పురాతన విష్ణు ఆలయం మాండవ్య నారాయణస్వామి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేసి సోమవారం ఉదయం 9.30 గంటలకు తెరవనున్నట్టు ఆలయ ఈఓ బిక్కిన వెంకట్రాయచౌదరి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పట్టణ, మండల పరిధిలోని అన్ని దేవాలయాలను మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు మూసి వేయనున్నట్టు ఆయా ఆలయాల కమిటీ నాయకులు తెలిపారు. ఆందోళనకరంగా భూగర్భ జలాలు భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నల్లజర్ల: మండలంలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటాయని, తక్షణం నీటి సంరక్షణ చేపట్టకపోతే ఈ ప్రాంతంలోని పంట భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉందని భూగర్భ జలశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం డ్వామా, వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశమై భూగర్భ జలాల సంరక్షణ – పెంపుపై చర్చించారు. డీడీ మాట్లాడుతూ భూగర్భ జలమట్టాలు 20 అడుగుల నుంచి 50 అడుగుల లోతుకు తగ్గిపోయాయని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇక్కడ వ్యవసాయమంతా బోరుబావులపైనే ఆధారపడి జరుగుతోందన్నారు. ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో వ్యవసాయం, తోటల పెంపకంలో డ్రిప్, స్పింక్లర్లు వినియోగం పెరిగి నీటి వినియోగం తగ్గాలన్నారు. రీచార్జి పిట్లు, ఫారంపాండ్స్, రింగ్ ట్రెంచ్లు, చెరువుల పూడిక తీత పనులు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకునే అవకాశం ఉందన్నారు. డ్వామా ఏపీడీ బి.రాంప్రసాద్ మాట్లాడుతూ ఐదేళ్ల కాలపరిమితిలో ప్రణాళిక బద్ధంగా ఈ పనులు చేపట్టి, పురోగతి సాధించవచ్చన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఏ.దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు రానున్న ఐదేళ్లలో తమ పొలాల్లో ఫారంపాండ్లు, రింగ్ ట్రెంచ్లు ఏర్పాటు చేసుకుని, భూమిలో తేమశాతం తగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు. ఈ పనులన్నీ ఉపాధి హామీ పథకం ద్వారానే జరుగుతాయని వివరించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి మల్లికార్జునరావు, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రత్నకుమారి, నీటిపారుదలశాఖ డీఈ మనోజ్ కుమార్, మండల పరిషత్ ఏఓ మహాలక్ష్మి మంగతాయారు, ఉద్యానశాఖ అధికారి బబిత, వ్యవసాయాధికారి సోమశేఖరం, ఏపీఓ త్రిమూర్తులు పాల్గొన్నారు. కాటన్ బ్యారేజీకి తగ్గిన వరద ఉధృతి ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీకి వరద ఉధృతి బుధవారం మరింత తగ్గింది. ఉదయం నుంచి క్రమేపి తగ్గుతూ వచ్చి.. రాత్రి 8 గంటలకు 10.70 అడుగులకు చేరింది. అయితే ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో మరో రెండు రోజుల పాటు కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి కొనసాగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరంలో 11.20 మీటర్లు, పేరూరులో 15.85 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.57 మీటర్లు, భద్రాచలంలో 41.80 అడుగులు, కూనవరంలో 17.48 మీటర్లు, కుంటలో 9.40 మీటర్లు, పోలవరంలో 11.65 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.70 మీటర్ల నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. -
నాస్కామ్తో జేఎన్టీయూకే ఒప్పందం
బాలాజీచెరువు: ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఇనిషియేషన్ అమలు చేసేందుకు జేఎన్టీయూ కాకినాడ, నాస్కామ్ మధ్య బుధవారం ఒప్పందం జరిగింది. స్టూడెంట్ అఫైర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.కృష్ణమోహన్ అధ్యక్షతన వీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, నాస్కామ్ డైరెక్టర్ ఉదయ్శంకర్ ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, ప్రొఫెసర్ నైపుణ్యాలు, వర్చువల్ ఇంటర్న్షిప్లు, హ్యాక్ధాన్, పరిశ్రమ లీడర్ సెషన్ కోర్సులు ఉచితంగా అందజేస్తామని వీసీ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులలో డిజిటల్ నైపుణ్యాలను శక్తివంతమవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెక్టార్ వీవీ సుబ్బారావు, ఓఎస్డీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు సహదేవయ్య, బీటీ కృష్ణ, స్వర్ణకుమారి, పద్మజారాణి పాల్గొన్నారు. -
అంధత్వ నివారణకు కృషి
బాదం బాలకృష్ణ ఐ–బ్యాంక్ను 2006లో ప్రారంభించాం. తూర్పుగోదావరి, పరిసర జిల్లాల్లో అంధుల జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో 19 మందితో దీనిని స్థాపించి అంధత్వ నివారణకు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు 7,584 కార్నియాలు సేకరించాం. మరణించిన వారి నేత్రాలను దానం చేసేలా కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. – డాక్టర్ బాదం బాలకృష్ణ, ఐ–బ్యాంక్, కాకినాడసమాజ సేవలో రెడ్క్రాస్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఐ–బ్యాంక్ను ప్రారంభించాం. గతేడాది జనవరి 31న ప్రారంభించగా, మార్చి నుంచి కార్నియాలు సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 248 కార్నియాలు సేకరించాం. మరణానంతరం నేత్రాలు, అవయవాలు వృథా పోనీయకుండా ప్రజల్లో మరింత అవగాహన పెంచేందుకు రెడ్క్రాస్ ద్వారా కృషి చేస్తున్నాం. – వైడీ రామారావు, చైర్మన్, రెడ్క్రాస్ ఐ–బ్యాంక్, కాకినాడ ప్రజల్లో స్పందన జిల్లాలో అంధత్వ నివారణకు విస్తృత చర్యలు తీసుకుంటున్నాం. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. మరింతగా అవగాహన పెరగాల్సి ఉంది. మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపును ప్రసాదించవచ్చు. ప్రజల్లో కూడా నేత్రదానంపై స్పందన వస్తోంది. – డాక్టర్ శ్రీవిద్య, ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, కాకినాడ -
విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి భూమిపూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం పశ్చిమ రాజగోపురం వద్ద రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విశ్రాంతి షెడ్డుకు బుధవారం భూమిపూజ జరిగింది. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ ఎండీ ఎంవీవీఎస్ కృష్ణంరాజు దంపతులు భూమిపూజ చేశారు. భక్తుల కోసం లారెస్ సంస్థ ఈ షెడ్డు నిర్మిస్తుంది. కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, ఈఈ వి.రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. చీటీల పేరుతో మోసం ● రూ.2.39 కోట్లు స్వాహా ● ఇద్దరు నిందితుల అరెస్టు పిఠాపురం: చిట్ ఫండ్ కంపెనీ పేరుతో రూ.2.39 కోట్లు స్వాహా చేసిన నిందితులను బుధవారం అరెస్టు చేసినట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, పిఠాపురానికి చెందిన కొర్ర సత్యనారాయణ, పక్కుర్తి వరహాలరావు, లోకారెడ్డి భాస్కరరావు కలిసి 2014లో శ్రీసత్య శివాని చిట్ఫండ్ కంపెనీని పట్టణంలో మొదలుపెట్టారు. వీరు సభ్యులను చేర్చుకుని, రూ.5 లక్షలు, రూ.10 లక్షలు, రూ.20 లక్షల చీటీలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం చీటీలు పాడుకున్న 94 మందికి డబ్బు చెల్లించకుండా మోసం చేశారు. దీంతో బాధితులు అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణ అనంతరం, అసిస్టెంట్ జిల్లా రిజిస్ట్రార్ సునంద గతేడాది నవంబర్ 29న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి 94 మందిని బాధితులుగా గుర్తించారు. నిందితులు కొర్ర సత్యనారాయణ, లోకారెడ్డి భాస్కరరావును బుధవారం అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. -
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్య
శంఖవరం: చదువుపై దృష్టి సారించడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక కృష్ణాలయం వీధిలో కనిగిరి వర లక్ష్మీ అపర్ణ(16) మంగళవారం రాత్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. అన్నవరం అడిషనల్ ఎస్సై ఎల్ ప్రసాద్ వివరాల మేరకు, స్థానిక ఆదర్శ పాఠశాలలో అపర్ణ ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే మంగళవారం కళాశాలకు వెళ్లొచ్చిన ఆమె ఇంటి వద్ద చదువుపై దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన అపర్ణ తన తల్లిదండ్రులు పడుకున్నాక, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నిర్జీవంగా ఉన్న కు మార్తెను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అపర్ణ మృతికి పాఠ శాల ఉపాధ్యాయులు, విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పోలీసులు తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అడిషనల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
దేవరపల్లి: వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మండలంలోని కృష్ణంపాలెం వద్ద గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా మేజిక్ డ్రైవర్ నాని(28) మృతి చెందగా, వాహనంలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం గోపాలపురం ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న లారీని కంటైనర్ ఢీకొంది. అదే సమయంలో డ్యాన్సర్లతో వస్తున్న టాటా మేజిక్ వెనుక నుంచి కంటైనర్ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అజ్జరానికి చెందిన డైవర్ నాని(28) మృతి చెందగా, డ్యాన్సర్లు చరణ్ ఢిల్లీరావు, హరిసంతోష్, కరిష్మా తీవ్రంగా గాయపడ్డారు. విశాఖపట్నం నుంచి నెల్లూరుకు ప్రోగ్రాం కోసం 8 మంది వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు నాని కూడా డ్యాన్సరేనని కుటుంబ సభ్యులు తెలిపారు. అతడికి ఇటీవల నిశ్చితార్థమైంది. రెండు నెలల్లో వివాహం కావాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గోపాలపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. కుమార్తెను చూసేందుకు వెళ్తూ.. అయినవిల్లి: సడన్ బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడిన ప్రమాదంలో ప్రయాణికుడు మృతి చెందాడు. ఎస్సై హరికోటిశాస్త్రి వివరాల ప్రకారం, బుధవారం చింతనలంక చిన రామాలయం వీధికి చెందిన గోసంగి తనుకులు(75) ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన కుమార్తెను చూసేందుకు బయలుదేరాడు. ముక్తేశ్వరంలో ఆటో ఎక్కి అమలాపురం వెళ్తుండగా, రావిగుంట చెరువు వద్ద ఆటోడ్రైవర్ అతివేగంగా వెళ్తూ సడన్ బ్రేక్ వేశాడు. ఆటో బోల్తా పడడంతో తనుకులు రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అతడి కుమారుడు అంజికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వర్షంలో ప్రయాణిస్తూ.. అమలాపురం టౌన్: కిమ్స్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వడ్రంగి మేసీ్త్ర మరణించాడు. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు వివరాల మేరకు, అమలాపురం రూరల్ మండలం భట్నవిల్లి గ్రామానికి చెందిన వడ్రంగి మేసీ్త్ర గోడ ఫణికుమార్(32) వర్షం కురుస్తున్న సమయంలో స్కూటీపై వెళుతున్నాడు. అమలాపురం వైపు వస్తున్న ట్రాక్టర్ అతడిని వెనుక నుంచి ఢీకొంది. మరో బైకిస్ట్ను కూడా ట్రాక్టర్ ఢీకొట్టడంతో అతనూ గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఫణికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్బాబు తెలిపారు. -
భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..
● రెండేళ్ల బిడ్డతో తల్లి ఆత్మహత్య ● జూలైలో భర్త బలవన్మరణం కాకినాడ రూరల్: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
భర్త దూరమయ్యాడని.. తానూ తిరిగిరాని లోకానికి..
కాకినాడ రూరల్: సాఫీగా సాగే వారి పచ్చని సంసారాన్ని అప్పుల సుడిగుండం ముంచేసింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న రెండేళ్ల మగ బిడ్డకు పుట్టినరోజును స్తోమతకు మించి ఘనంగా చేశారు. ఆ అప్పు భారంగా మారడంతో, ఈ ఏడాది జూలై నెలలో భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒకటిన్నర నెలలు తిరక్కుండానే బిడ్డతో కలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ కుటుంబానికి విషాదాంతమే మిగిలింది. సర్పవరం పోలీసుల వివరాల మేరకు, కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలోని భావనారాయణపురం గాంధీనగర్కు చెందిన జనపల్లి ఆకాంక్ష(25) తన బిడ్డ సార్విక్(2)కు పురుగు మందు పట్టించి, తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంది.చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. కరప మండలం గురజనాపల్లికి చెందిన ఆకాంక్షకు, సర్పవరం గ్రామానికి చెందిన జనపల్లి గోపితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కాకినాడ నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్గా గోపి పనిచేసేవాడు. జూలైలో బిడ్డ సార్విక్ రెండో పుట్టిన రోజును ఘనంగా జరిపారు. ఇందుకు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పు ఇచ్చినవారి ఒత్తిడిని తట్టుకోలేక గోపి జూలై 22న మద్యంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆకాంక్ష మానసికంగా కుంగిపోయింది. కొన్ని రోజులు పుట్టింటి వద్ద, కొంతకాలం అత్తింటి వద్ద ఉండేది. భర్తపై బెంగతో గత నెల 31న మధ్యాహ్నం సర్పవరంలోని ఇంట్లో సోడాలో పురుగు మందు కలిపి బిడ్డకు పట్టించి, తాను తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున ఇద్దరూ మృతి చెందారు. ఆకాంక్ష తల్లి డోనం శాంతికుమారి ఫిర్యాదు మేరకు సర్పవరం ఏఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం అనంతరం సర్పవరం భావనారాయణపురంలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. -
మద్యం మత్తులో తండ్రి హత్య
కరప: కూటమి ప్రభుత్వంలో ఏరులై పారుతున్న మద్యం బంధాలను చిదిమేస్తోంది. మద్యం మత్తు తండ్రీకొడుకుల మధ్య ఘర్షణకు దారి తీసి, చివరికి తండ్రిని తనయుడు కడతేర్చేలా చేసిన ఘటన కాకినాడ జిల్లా కరప పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మొండి గ్రామానికి చెందిన కాలాడి సూర్యచంద్రరావు(50)కు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు ధనుంజయ్కు వివాహం కాగా వేరు కాపురం పెట్టాడు. భార్య అనారోగ్యంతో మరణించగా, తండ్రి మిగిలిన ముగ్గురి కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో సూర్యచంద్రరావు మద్యానికి బానిసయ్యాడు. రెండో కుమారుడు చంద్రశేఖర్ పనిచేస్తూ, అన్నీ చూసుకుంటూ, వంట చేసి పెడుతుంటాడు. చిన్నకుమారుడు మహేష్ ఫిట్స్ వ్యాధిగ్రస్తుడు. ఈ నేపథ్యంలో మంగళవారం మహేష్ కు మందులు తీసుకురమ్మని తండ్రికి చంద్రశేఖర్ రూ.500 ఇచ్చాడు. సూర్యచంద్రరావు ఆ డబ్బుతో మద్యం తాగి వచ్చాడు. దీంతో అప్పటికే మద్యం తాగి ఉన్న చంద్రశేఖర్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి తలపై గొడ్డలి తిరగేసి దాడి చేయడంతో సూర్యచంద్రరావు మృతి చెందాడు. సమాచారం అందుకున్న కాకినాడ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
నీట మునిగి వదినామరదళ్ల మృతి
● ఏలేరు కాలువలో దుర్ఘటన ● మృతులు మందుల కాలనీకి చెందినవారు ● ఇసుక అక్రమ తవ్వకాలే కారణమంటున్న స్థానికులు ఏలేశ్వరం: నీటి లోతు అవగాహన లేకపోవడంతో ఏలేరు కాలువలో దిగిన ఇద్దరు వదినామరదళ్లు మృత్యువాత పడిన సంఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల మేరకు, మందుల కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మి(38), పెండ్ర కుమారి(13) వరుసకు వదినామరదళ్లు. వీరు గ్రామాల్లోని ఇళ్ల వద్దకు వెళ్లి తల వెంట్రుకలకు అల్యూమినియం పాత్రలు ఇచ్చే వ్యాపారం చేస్తుంటారు. ఇలాఉండగా, వీరిద్దరూ కలిసి వంట కోసం పుల్లలు ఏరుకునేందుకు ఏలేరు కాలువ వద్దకు వెళ్లారు. దాహం వేయడంతో కాలువలోకి దిగి.. గోతులు ఉన్న ప్రాంతంలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న వ్యక్తులు గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి సంఘటన ప్రదేశంలో మునిగిపోయిన ఇద్దరినీ వెలికితీశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతురాలు లక్ష్మీకి భర్త అప్పన్న, కుమారైలు భవాని, జ్యోతి, కుమారులు హరి, అశోక్ ఉన్నారు. మృతురాలు కుమారికి తల్లిదండ్రులు సత్తిబాబు, అంకమ్మ, సోదరుడు రాజు, సోదరి శ్యామల ఉన్నారు. ఈ మేరకు ఎస్సై రామలింగేశ్వరరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మందుల కాలనీలో విషాద ఛాయలు ఎప్పుడు కలిసి తిరిగే లక్ష్మి, కుమారి ఏలేరు కాలువలో మునిగి మరణించడంతో మందుల కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎప్పుడూ చలాకీగా కళ్ల ముందే తిరిగే వారిద్దరూ శాశ్వతంగా దూరం కావడంతో వారి కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిందంటూ లక్ష్మి కుటుంబ సభ్యులు విలపించిన తీరు చూపరులను కలిచివేసింది. అక్రమ తవ్వకాలు పాలకుల అండదండలతో ఇష్టారాజ్యంగా చేసిన ఇసుక అక్రమ తవ్వకాలు రెండు నిండుప్రాణాలను బలిగొన్నాయి. ఏలేరు కాలువలో ఎటువంటి అనుమతులు లేకుండా, పొక్లెయిన్లతో ఇసుక అక్రమ తవ్వకాలు చేపట్టడం వల్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. కొందరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటుండగా.. మరికొందరు వాటికి బలవుతున్నారు. స్థానిక కప్పలచెరువు సమీపంలోని శశ్మానం మీదుగా ఏలేరు కాలువలో రాత్రుళ్లు ట్రాక్టర్లు, లారీలతో ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానికులు అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా, పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఏడాదిన్నర నుంచి ఏలేరు కాలువలో ఇసుకతో పాటు, మట్టినీ అక్రమంగా తవ్వేస్తున్నారని చెబుతున్నారు. గోదావరి నదిలో వృద్ధుడి గల్లంతు మామిడికుదురు: బి.దొడ్డవరం గ్రామానికి చెందిన ఒలుపు కార్మికుడు రవణం సాయిబాబు (78) మంగళవారం వైనతేయ గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఒలుపు ఒలిచేందుకు వెళ్లిన సాయిబాబు.. బహిర్భూమికి వెళ్లి, అదుపుతప్పి గోదావరి నదిలో పడి కొట్టుకుపోయాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. గల్లంతైన సాయిబాబు ఆచూకీ కోసం రెండు బోట్ల సహాయంతో గోదావరి నదిలో రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటనపై సాయిబాబు కుమారుడు పల్లంరాజు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు.యువకుడిని రక్షించిన పోలీసులు అమలాపురం టౌన్: వినాయక విగ్రహాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తున్నప్పుడు అదుపుతప్పి నదిలో పడి కొట్టుకుపోతున్న యువకుడిని పట్టణ పోలీసులు కాపాడారు. బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదిపై ఉన్న వంతెన వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అమలాపురం రూరల్ మండలం పేరూరు గ్రామం పల్లపువీధి నుంచి గణేశ్ విగ్రహాన్ని వైనతేయ నదిలో నిమజ్జనం చేసేందుకు గ్రామస్తులు ఊరేగింపుగా వెళ్లారు. నిమజ్జనం సమయంలో అదే గ్రామానికి చెందిన చిలకలూరి చినసాయికృష్ణ (27) అదుపుతప్పి నదిలో పడిపోయాడు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న అతడిని స్థానికులు తాడు సాయంతో కాపాడేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ బందోబస్తులో ఉన్న అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మట్టపర్తి రాంబాబు, కానిస్టేబుల్ రాయుడు వీవీ శ్రీనివాసరావు స్పందించి.. మత్స్యకారుల సహకారంతో యువకుడిని పడవలో ఎక్కించి ఒడ్డుకు చేర్చారు. -
సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
లాఠీచార్జి దారుణమన్న బీజేపీ నేతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై త్రీటౌన్ సీఐ సత్యనారాయణ లాఠీచార్జి చేయడం దారుణమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నాయకులు మంగళవారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. బీహార్లో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోదీ, ఆమె తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోమవారం స్థానిక డీసీసీ కార్యాలయం వద్ద రాహుల్గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు వెళ్లగా, త్రీటౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు తమను అడ్డుకున్నారన్నారు. తమ కార్యకర్తలపై లాఠీచార్జి చేసిన సీఐ.. కర్రలతో రౌడీల్లా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులను నియంత్రించలేదన్నారు. లాఠీచార్జిలో తమ కార్యకర్తలకు గాయాలు కాగా, స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. తాము కూడా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యులన్న సంగతి మరిచి, పోలీసులు ఇలా దౌర్జన్యం చేయడం తగదన్నారు. కోడికత్తులతో దాడి కేసులో నలుగురి అరెస్టు గోకవరం: కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలో గత ఆదివారం వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహిస్తున్న ఓజుబంద గ్రామానికి చెందిన ఇద్దరిపై కోడికత్తులతో దాడి చేసిన నలుగురిని అరెస్టు చేసినట్టు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. నిమజ్జనం ఊరేగింపు వెళుతుండగా గోకవరం గ్రామానికి చెందిన గేదెల శివనందు, రాయి అచ్చారావు, పోనసానపల్లి నాగవెంకటసాయి పవన్కామేష్, మహిపాల్ వీరవెంకట దుర్గాప్రసాద్ రెండు బైక్లపై వచ్చి, ఊరేగింపులో ఉన్న భరత్, రాజేష్పై కోడికత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. స్నేహభావంతో పండగల నిర్వహణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా నిర్వహించే ర్యాలీలు ప్రశాంతంగా, స్నేహపూ ర్వక వాతావరణంలో నిర్వహించేందుకు కృషి చేయాలని హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలను జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కోరారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన ఏఎస్పీ మనిష్ పాటిల్ దేవరాజ్, డీఆర్వో వెంకటరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయా మతపెద్దలతో జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ, మున్సిపల్ కార్పొరేషన్, మత్స్య, అగ్నిమాపక శాఖల అధికారులు హాజరయ్యారు. వినాయక విగ్రహాల నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. జిల్లాలో గణేశ్ నిమజ్జనాలు సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను జేసీ ఆదేశించారు. జిల్లాలో మొత్తం 25 నిమజ్జన ప్రదేశాలను గుర్తించామని, నిమజ్జనాలు జరిగే ప్రదేశాల వద్ద స్టేజ్, విద్యుద్దీపాలు, క్రేన్లు, బోట్లు, గజ ఈతగాళ్లు, ఇతర సదుపాయాలను సంబంధిత అధి కారులు కల్పించాలన్నారు. వైద్యారోగ్య శాఖ ద్వా రా నిమజ్జన ప్రదేశాల్లో వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు, నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించి, జల కాలుష్యం అరికట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల ఐదున జరిగే మీలాద్ ఉన్ నబీ పండగ సందర్భంగా ముస్లింలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని జేసీ అధికారులను ఆదేశించారు. -
ఉచిత బస్సుతో ఆటోరడైవర్ల ఉపాధికి గండి
● నేటి నుంచి నల్ల బ్యాడ్జీలతో నిరసనలు ● కార్యాచరణ ప్రకటించిన కోనసీమ జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, ఆటో డ్రైవర్ల ఉపాధికి గండి కొట్టిందని ఆంధ్ర ఆటోవాలా కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి సత్తిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం నుంచి ఆటో డ్రైవర్లు నల్ల బ్యాఢ్జీలు ధరించి, ఆటోలకు నల్ల జెండాలు తగిలించి నిరనస తెలిపాలని ఆయన పిలుపునిచ్చారు. అమలాపురం హైస్కూల్ సెంటర్లో మంగళవారం డివిజన్ ఆటో డ్రైవర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్తిరాజు నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ ప్రకటించారు. దీనిపై సమావేశం ఏకగ్రీవ తీర్మానం కూడా చేసింది. త్వరలోనే 48 గంటల పాటు ఆటోలు నిలిపివేసి నిరాహార దీక్షలు చేపడతామని ఆయన వెల్లడించారు. రామచంద్రపురం డివిజన్ ఆటో డ్రైవర్లతో బుధవారం నిర్వహించే సమావేశంలో ఆ తేదీ ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో 25 శాతం ఆటోలు విద్యాసంస్థలకు విద్యార్థులను తరలిస్తున్న క్రమంలో ఆ ఆటోల డ్రైవర్లు 48 గంటల నిరాహార దీక్షకు రెండు రోజుల ముందు ఆయా విద్యా సంస్థలకు నోటీసులు ఇవ్వాలని సమావేశం సూచించింది. తక్షణమే కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆటోవాలా జిల్లా శాఖ కార్యదర్శి ఊటాల వెంకటేష్ నిరసన తీర్మానాలు సమావేశంలో ప్రవేశపెట్టారు. ఆటో యూనియన్ల ప్రతినిధులు మోకా శ్రీను, వాసంశెట్టి శ్రీను, డివిజన్ అధ్యక్షుడు బొలిశెట్టి శంకర్, ప్రధాన కార్యదర్శి బొక్కా నాని, కోశాధికారి బొమ్మి ఫణి, రాయుడు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నన్నయ వర్సిటీ నిర్ణయం సరికాదు
● ఎంపీ పొలిటికల్ సైన్స్ గ్రూపు కొనసాగించాలి ● విద్యార్థి, యువజన, దళిత, ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ గ్రూపును యథావిధిగా కొనసాగించాలని, లేకుంటే ఉద్యమిస్తామని నేతలు స్పష్టం చేశారు. విద్యార్థి, యువజన, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్.రాజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పీడీఎస్యూ, ఏఐఎస్ఎఫ్, ఏఎస్ఎఫ్, కేవీపీఎస్, దళిళ సంఘాలు, ఎస్సీ,ఎస్టీ సంఘాలు, ఎస్ఎస్యూఐ, రెల్లి సంఘం, జనచైతన్య వేదిక వంటి పలు సంఘాలు పాల్గొని చర్చ నిర్వహించాయి. నాయకులు మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజమహేంద్రవరం క్యాంపస్లో పొలిటికల్ సైన్స్ విభాగంలో ఈ విద్యా సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకుని నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాల్సిన యాజమాన్యం ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో దశలవారీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిరణ్, ఏఐఎస్ఎఫ్ కోనసీమ జిల్లా కార్యదర్శి జి.రవికుమార్, ఏఎస్ఎఫ్ నాయకులు తాడేపల్లి విజయ్కుమార్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, దళిత సంఘం నాయకులు కోరుకొండ చిరంజీవి, ఎస్సీ,ఎస్టీ సంఘాల నాయకులు పి.వేణుగోపాల్, జే.సుబ్బారావు, ఎస్.విజయ్కుమార్, ఎన్ఎస్యూఐ నాయకులు తారకేష్ , రెల్లి సంఘం నాయకులు నీలం వెంకటేశ్వరరావు, దళిత ప్రజా సంఘం నాయకులు నక్క వెంకటరత్నం, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు టి. అరుణ్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పూర్ణిమ రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వై.భాస్కర్ ఎస్ఎఫ్ఐ నాయకులు కె.లహరి, కే.జ్యోతి, టి.సౌమ్య పాల్గొన్నారు. -
ఇన్స్పైర్ అయ్యేనా..!
● ఇన్స్పైర్ మనాక్ దరఖాస్తులకు ఈ నెల 15 వరకు గడువు ● 2025–26 జిల్లా నామినేషన్ల లక్ష్యం 1,780 ● ఇప్పటి వరకు నమోదైనవి కేవలం 140 మాత్రమే.. రాయవరం: విద్యార్థుల్లో శాసీ్త్రయ సాంకేతికతను పెంపొందించి.. భావి శాస్త్రవేత్తలను తయారు చేసేందుకు లభించే అరుదైన అవకాశం ఇన్స్పైర్ మనాక్. దీనిపై ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల సైన్స్ టీచర్లు ఆసక్తి చూపడం లేదు. ఇన్స్పైర్ మనాక్ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న శాసీ్త్రయ ప్రయోగ పోటీలకు ఆశించిన మేర స్పందన కరవైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని 334 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను కలిపి ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టుల చొప్పున 1,780 ప్రాజెక్టులను యాప్ ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంది. ఇప్పటివరకు కేవలం 48 పాఠశాలలకు సంబంధించి 140 ప్రాజెక్టులు మాత్రమే నమోదయ్యాయి. అన్ని యాజమాన్యాల పాఠశాలల సైన్స్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఇందులో భాగస్వాములు కావాల్సి ఉంది. ఆ దిశగా వారు అంతగా చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లు నమోదు చేసుకునేందుకు సంబంధించిన గడువు ఈ నెల 15వ తేదీతో ముగుస్తుంది. ఇన్స్పైర్ మనాక్ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే మినహా లక్ష్యం పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. సెప్టెంబర్ 2వ తేదీ నాటికి ఇన్స్పైర్ మనాక్ వివరాలు జిల్లా మొత్తం నమోదు నమోదు స్కూళ్లు అయినవి కానివి కాకినాడ 331 40 291 తూర్పుగోదావరి 352 34 318 కోనసీమ 334 48 286 -
ఎలుకలుకలు
కొత్తపేట: వరిలో ఎలుకల బెడద ఎక్కువైంది. ముఖ్యంగా వరి పంటను మూషికాలు నాశనం చేస్తున్నాయి. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఆకుమడి దశ నుంచి కుప్పల వరకు రైతులకు ఈ సమస్య తప్పడం లేదు. దీంతో అధికంగా నష్టపోతున్నారు. పంట చేతికందే వరకు ఎలుకల బెడద ఉంటోంది. వీటిని సమర్థంగా అరికట్టేందుకు రైతులంతా సామూహిక నిర్మూలన చర్యలు చేపట్టడం వల్లే సాధ్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరితో పాటు, ఉద్యాన పంటలైన కొబ్బరి, అరటి, కూరగాయల తోటలకు ఎలుకల బెడద ఎదురవుతోంది. ప్రస్తుతం వరి పంట దుబ్బు చేసి, పిలకలు వేసే దశలో ఉంది. ఈ దశలో ఎలుకల వల్ల కలిగే నష్టం అపారంగా ఉంటుంది. ఎలుకలు నీటి మట్టానికి 6 సెంటీమీటర్ల ఎత్తులో వరి పిలకలను కొరికేస్తున్నాయి. దీంతో దిగుబడి తగ్గి రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువ. ఇలా గుర్తించవచ్చు ఎలుకలు సంచరించే పొలం గట్లపై బొరియలు ఉంటాయి. పొలంలో కొరికి వేసిన వరి పిలకలు, దుబ్బులు పడి ఉంటాయి. పొలంలోని బురదలో ఎలుకల పాదముద్రలు కనిపిస్తాయి. ఎలుకల విసర్జనాల ద్వారా వాటి ఉనికిని సులభంగా గుర్తించవచ్చు. నివారణ చర్యలు ముందుగా రైతులు తమ పొలం గట్లపై కలుపు మొక్కలను పూర్తిగా తొలగించాలి. రైతు భరోసా కేంద్రాల్లో బ్రొమోడయోలిన్ అనే ఎరను రైతులకు ఉచితంగా లభిస్తుంది. 480 గ్రాముల నూకలు, 10 గ్రాముల బ్రొమోడయోలిన్ మందు, 10 గ్రాముల నూనెతో 500 గ్రాముల ఎరను తయారు చేసుకోవచ్చు. ఈ ఎర 50 బొరియలకు సరిపోతుంది. తొలి రోజు బొరియలను మట్టితో కప్పేయాలి. రెండో రోజు ఆ బొరియలు తెరుచుకుని కనిపిస్తాయి. ఈ బొరియల వద్ద 10 గ్రాముల బ్రొమోడయోలిన్ ఎర పొట్లాలను ఉంచాలి. ఆ ఎరను తిన్న ఎలుకలు చనిపోతాయి. రెండో విధానంలో వేటగాళ్లతో ఎలుక బుట్టలు వేయించి, వాటిని అరికట్టవచ్చు. ఈ విధానంలో వేటగాళ్లు ఎలుకకు రూ.60 వరకు తీసుకుంటారు. మరో విధానంలో బొరియలో పొగ పెట్టి ఎలుకలను చంపుతారు. ఇలా చేస్తే ఒక్కో ఎలుకకు రూ.100 తీసుకుంటారు. రెండు విధానాలు అధిక ఖర్చుతో కూడినది కావడంతో, రైతులు బ్రొమోడయోలిన్ ఎర ద్వారానే నివారణ సులభమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. రెండు సబ్ డివిజన్లలో.. ప్రస్తుత సీజన్లో కోనసీమ జిల్లాలో 1.94 లక్షల ఎకరాలు వరి, బంజరు భూములు ఉండగా, 79,475 మంది రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఆయా పంటలను ఎలుకల బారి నుంచి రక్షించేందుకు వ్యవసాయ శాఖ సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని తలపెట్టింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, ముమ్మిడివరం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లకు 776 కిలోల బ్రొమోడయోలిన్ మందు చేరినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 22 మండలాల్లో 415 గ్రామాలకు పంటల విస్తీర్ణాన్ని బట్టి మందును సరఫరా చేశారు. ముందుగా ఆలమూరు సబ్ డివిజన్లోని ఆలమూరు, కపిలేశ్వరపురం, మండపేట, రాయవరం, రామచంద్రపురం సబ్ డివిజన్లోని రామచంద్రపురం, కె.గంగవరం మండలాల్లో బుధవారం సామూహిక నిర్మూలన కార్యక్రమం చేపట్టనున్నారు. మిగిలిన సబ్ డివిజన్లలో ఈ నెల 4న లేదా 9న కార్యక్రమం నిర్వహించనున్నారు. సామూహికంగానే చేపట్టాలి సార్వా పంటకు ఎలుకల బెడద ఎక్కువగానే ఉంటుంది. ఎవరికి వారు ఎలుకలను పూర్తిగా నిర్మూలించడం సాధ్యం కాదు. సామూహికంగా బ్రొమోడయోలిన్ మందును బొరియల్లో పెట్టడం ద్వారా మాత్రమే సమర్థంగా అరికట్టవచ్చు. దీనిపై రైతులకు ఏటా అవగాహన కల్పించి, మందును ఉచితంగా అందిస్తున్నాం. ప్రస్తుత తొలకరి సీజన్లో ఎలుకలను అరికట్టడానికి అవసరమైన బ్రొమోడయోలిన్ మందు త్వరలోనే రైతు భరోసా కేంద్రాలకు వస్తుంది. గ్రామాల వారీగా, వరి ఆయకట్టుల వారీగా రైతులతో మందు ఎరను చేనుల్లో పెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట ఏటా సార్వాలో రైతులకు తప్పని బెడద వరి పిలకలను కొరికేస్తుండడంతో తీవ్ర నష్టం నేడు ఆలమూరు, రామచంద్రపురం సబ్ డివిజన్లలో సామూహిక నివారణ -
అవగాహన కల్పిస్తున్నాం
ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి జిల్లాలోని సైన్స్ ఉపాధ్యాయులకు ఆన్లైన్ మీటింగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటు యాప్కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నా దృష్టికి తీసుకురావాలని తెలియజేశాను. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించి ప్రాజెక్టుల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఇప్పటికై నా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తొందరపడాలి. – జీవీఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా సైన్స్ అధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిర్లక్ష్యం చేయడం తగదు ఇన్స్పైర్ మనాక్ నామినేషన్లకు సంబంధించి అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్పందించాలి. సైన్స్ ఉపాధ్యాయులు బాధ్యత తీసుకుని నామినేషన్లను త్వరితిగతిన పూర్తి చేయాలి. ప్రతి పాఠశాల నుంచి తప్పనిసరిగా ఐదు నామినేషన్లు వచ్చేలా చూడాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి లక్ష్యాన్ని పూర్తి చేయాలి. – డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ
ఆరుగురికి గాయాలు ఏలేశ్వరం: జాతీయ రహదారిపై యర్రవరం వద్ద మంగళవారం ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు, ఏలేశ్వరం ఆర్టీసీ డిపో నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న బస్సు జాతీయ రహదారిపై మలుపు తిరుగుతుండగా, రాజమహేంద్రవరం నుంచి విశాఖపట్నం వెళుతున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న డ్రైవర్తో పాటు, ఐదుగురికి గాయాలయ్యారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో ప్రత్తిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రి వద్ద ఆందోళన కాకినాడ రూరల్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మహిళ బ్రెయిన్ డెడ్ అయిందని ఆరోపిస్తూ ఆమె బంధువులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద మంగళవారం ఆందోళన చేపట్టారు. మృతురాలి బంధువుల వివరాల ప్రకారం, రమణయ్యపేట గైగోలుపాడుకు చెందిన మహిళ మేడిశెట్టి దుర్గాభవాని(38)కి భర్త వెంకటరమణ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత నెల 30న సర్పవరం జంక్షన్ సమీపంలోని ఓ డెంటల్ ఆస్పత్రిలో దంత వైద్యానికి వెళ్లింది. దంతాలు తొలగించే క్రమంలో అధిక రక్తస్రావం కావడంతో, అదే రోజు మెరుగైన చికిత్సకు ఆమెను మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు చెప్పడంతో, ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. బోన్ మేరో క్యాన్సర్తో మెదడులో రక్తస్రావం కారణంగా బ్రెయిన్ డెడ్ అయినట్టు ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. దీనిపై సర్పవరం పోలీసు స్టేషన్కు ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
రత్నగిరిపై తీరనున్న భక్తుల కష్టాలు
● పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి నేడు శ్రీకారం ● రూ.2.5 కోట్లతో నిర్మించనున్న ఫార్మా సంస్థ అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలోని పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి మూడేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఈ మార్గంలో సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగనున్నాయి. విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ సంస్థ రూ.2.5 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి బుధవారం ఉదయం శ్రీకారం చుట్టనుంది. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు లేకపోవడంతో భక్తుల ఇబ్బందులను గమనించిన అప్పటి ఈఓ చంద్రశేఖర అజాద్ 2023లో ఈ ప్రణాళిక రూపొందించారు. పశ్చిమ రాజగోపురం ఎదురుగా సత్యదేవ అతిథిగృహాన్ని కూల్చి, దాని స్థానంలో విశ్రాంతి షెడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా, ఇందుకు లారెస్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ ముందుకొచ్చింది. దీంతో 2023 అక్టోబర్లో ఇక్కడ సత్రాన్ని కూల్చేశారు. అదే ఏడాది విజయదశమి నాడు భూమిపూజ జరిగింది. తర్వాత ఈఓ చంద్రశేఖర అజాద్ ఇక్కడి నుంచి బదిలీ కావడంతో ఈ ప్రతిపాదన మూలనపడింది. ఇక్కడ విశ్రాంతి షెడ్డు లేకపోవడం వల్ల భక్తులు పడుతున్న ఇబ్బందులపై సాక్షిలో పలు కథనాలు వెలువడ్డాయి. స్పందించిన దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు లారెస్ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పశ్చిమ రాజగోపురం ముందు ఖాళీ ప్రదేశంలో 120 అడుగుల పొడవు, 80 అడుగుల వెడల్పున విశ్రాంతి షెడ్డు నిర్మించేందుకు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఆదేశాలు జారీ చేసినట్టు దేవస్థానం ఈఈ రామకృష్ణ మంగళవారం తెలిపారు. ఈ విశ్రాంతి షెడ్డులో 12 కౌంటర్లు, స్టెయిన్లెస్ స్టీల్ లైన్లు, మూడు హెలికాప్టర్ ఫ్యాన్లు, నలుగురు కూర్చునేలా 50 సెట్ల స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు. షెడ్డు దిగువన మార్బుల్ ఫ్లోరింగ్ చేయనున్నారు. ఈ ఖర్చంతా లారెస్ సంస్థ భరించనుందని ఈఈ తెలిపారు. రెండు నెలల్లో పూర్తి ● విశ్రాంతి షెడ్డు నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని లారెస్ సంస్థను కోరినట్టు ఈవో వీర్ల సుబ్బారావు తెలిపారు. ● అక్టోబర్ 22 నుంచి కార్తిక మాసం ప్రారంభమవుతున్నందున అప్పటికి అందుబాటులో ఉండేలా చూడాలని కోరామన్నారు. ఇది పూర్తయితే పశ్చిమ రాజగోపురం వైపు వచ్చే భక్తుల ఇబ్బందులు తొలగుతాయని చెప్పారు. -
భక్తిశ్రద్ధలతో పవిత్రోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం రెండో రోజు పవిత్రోత్సవాలను ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీఎన్వీ ప్రసాద్ సారథ్యంలో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ పర్యవేక్షణలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చకులు పూజలు నిర్వహించారు. ఆలయంలోని పురాతన కల్యాణ మండపంలో ఉన్న ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి, విశేష అభిషేకం జరిపారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహద్దూర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
మహానేతకు నీరాజనం
● మరుపురాని మహా మనిషి రాజన్న ● జన హృదయ నేతకు ఘన నివాళి ● జిల్లావ్యాప్తంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు ● వైఎస్సార్ సీపీ శ్రేణుల శ్రద్ధాంజలి సాక్షి ప్రతినిధి, కాకినాడ: మాట తప్పని, మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని.. దివికేగిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జ్ఞాపకాలను జిల్లా గుర్తుకు తెచ్చుకుంది. రాజన్న అసువులు బాసి 16 ఏళ్లయిన సందర్భంగా వైఎస్ అభిమానులు జిల్లా అంతటా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లాలో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా అనేక కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టారు. వైఎస్సార్ సీపీ నేతలతో పాటు, పార్టీరహితంగా వైఎస్ అభిమానులు సైతం వర్ధంతిని పురస్కరించుకుని అనాథలు, రోగులు, నిరుపేదలకు తమకు తోచిన రీతిలో సాయం అందించారు. వాడవాడలా ఉన్న రాజన్న విగ్రహాలను స్థానికులు, వైఎస్సార్ సీపీ నేతలు రంగులతో అలంకరించి, పూలమాలలతో ముంచెత్తారు. దివంగత మహానేత వైఎస్సార్ జిల్లాకు చేసిన మేలును గుర్తు చేసుకుని ఘనమైన నివాళులర్పించారు. ● జగ్గంపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి తోట నరసింహం ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతిని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆయనతో పాటు, పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు జగ్గంపేట క్యాంప్ కార్యాలయం, బస్టాండ్ వద్ద వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయం నుంచి పార్టీ నేత బండారు రాజా ఆధ్వర్యంలో జరిగిన భారీ మోటార్ సైకిల్ ర్యాలీలో చంటిబాబు పాల్గొన్నారు. ● పార్టీ పిఠాపురం కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్, మాజీ ఎంపీ వంగా గీత పూలమాలలు వేసి నివాళులర్పించారు. పిఠాపురం పట్టణం, రూరల్, కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. గొల్లప్రోలులో అన్న సమారాధనలో పాల్గొన్నారు. ● సామర్లకోట జగనన్న కాలనీలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పెద్దాపురం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. పట్టణంలో రాజీవ్ గృహకల్ప, ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద వైఎస్సార్ విగ్రహాలకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా పెద్దాపురం మున్సిపల్ సెంటర్, సినిమా సెంటర్, కాండ్రకోట, సిరివాడ, ఉలిమేశ్వరంల్లో వైఎస్సార్ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. అలాగే గుడివాడ, కట్టమూరు, ఆర్బీ కొత్తూరు గ్రామాల్లో వైఎస్సార్ చిత్రపటాలకు పార్టీ నేతలు, వైఎస్ అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ● ప్రత్తిపాడు నియోజకవర్గంలో వాడవాడలా పార్టీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు నాయకత్వంలో వైఎస్సార్కు పార్టీ శ్రేణులు ఘనమైన నివాళులర్పించారు. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, సి.రాయవరం గ్రామాల్లో వైఎస్సార్ విగ్రహాలకు గిరిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెట్ట ప్రాంత రైతులకు మహానేత చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకున్నారు. ప్రత్తిపాడు కేంద్రంతో పాటు, ప్రత్తిపాడు రూరల్, రౌతులపూడి, శంఖవరం, ఏలేశ్వరం నగర పంచాయతీ, ఏలేశ్వరం మండలంలోని గ్రామాల్లో వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. కాగా, పార్టీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ● తుని నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నాయకుడు యనమల కృష్ణుడు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తుని శ్రీరామ సెంటర్లో మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటనందూరు మండలం బిల్లనందూరులో ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్ వర్ధంతి నిర్వహించారు. తుని పట్టణంతో పాటు, రూరల్, తొండంగి, కోటనందూరు మండలాల్లో వైఎస్సార్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ● కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో మహానేత వైఎస్సార్ విగ్రహానికి స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాకలపూడిలో వైఎస్సార్ విగ్రహానికి పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరీంబాషా తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రం కాకినాడ బాలాజీచెరువు సెంటర్లో వైఎస్ నిలువెత్తు కాంస్య విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాకు వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరుపేదలు, మధ్య తరగతి వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయాల్లో రోల్ మోడల్గా జనరంజక పాలన అందించారని ప్రస్తుతించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ, ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేసి, అభివృద్ధికి రాజకీయాలు చొప్పించకుండా, విలువలతో కూడిన పాలన అందించారన్నారు. పార్టీ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, బీసీ, యువజన విభాగాల జిల్లా అధ్యక్షులు అల్లి రాజబాబు, రాగిరెడ్డి అరుణ్కుమార్(బన్నీ) తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఎలుకల మందు ఉచిత పంపిణీ
కరప: జిల్లావ్యాప్తంగా సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రాల్లో బుధవారం నుంచి బ్రోమోడయోలిన్ మందు ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు జేడీఏ విజయ్కుమార్ వెల్లడించారు. వాకాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని రైతులందరూ ఒకేసారి పొలాల్లో ఈ మందును వాడాలని రైతులకు సూచించారు. రైతులకు టార్పాలిన్లు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, వారు ఆర్ఎస్కేల్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం యూరియా కొరత ఎక్కడా లేదన్నారు. అవసరం మేరకే రైతులు యూరియాను తీసుకెళ్లాలన్నారు. యూరియా స్థానే నానో యూరియా లిక్విడ్ కూడా అందుబాటులో ఉందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రాయితీపై వాహనాలు, యంత్రాలు ఇస్తున్నట్టు చెప్పారు. డ్రోన్లు 80 శాతం సబ్సిడీపై ఇస్తున్నామన్నారు. సకాలంలో తొలకరి నాట్లు వేసి, రబీ తర్వాత మూడో పంటగా అపరాలు వేసేందుకు రైతులు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జేడీఏ సామూహిక ఎలుకల నివారణ కరపత్రాలను విడుదల చేశారు. సామాజిక భద్రత, న్యాయమే లక్ష్యం సామర్లకోట: సుస్థిర లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి గ్రామంలోను సామాజిక భద్రత, సామాజిక న్యాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని విస్తరణ శిక్షణా కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ అన్నారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు 11 జిల్లాల్లోని ఉత్సాహవంతులైన పంచాయతీ కార్యదర్శులను ఎంపిక చేసి టీఓటీలుగా ఇచ్చే శిక్షణను మంగళవారం స్థానిక ఈటీసీలో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణకు 130 మందిని రెండు బ్యాచ్లుగా విభజించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ, గ్రామంలోని పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడానికి, వారి ఆర్థిక, ఆరోగ్య సంబంధ జీవన విధానాన్ని గుర్తించి, వారి అవసరాలు తీర్చేలా చేయాలన్నారు. వృద్ధాప్య, దివ్యాంగత్వం, నిరుద్యోగం, వ్యాధి, ప్రమాదం, మరణం వంటి సందర్భాల్లో వ్యక్తి, ఆ కుటుంబాలకు సామాజిక న్యాయం చేయడానికి పంచాయతీ పరిధిలోనే కృషి జరగాలన్నారు. కోర్సు డైరెక్టర్లుగా కె.సుశీల, ఎస్ఎస్ శర్మ వ్యవహరించారు. ఫ్యాకల్టీలు రామకృష్ణ, శ్రీనివాసరావు, ఎం చక్రపాణిరావు, కేఆర్ నిహారిక శిక్షణ ఇచ్చారు. ఐసీటీసీలో సేవలు మెరుగుపర్చాలి కేంద్ర బృందం తనిఖీ పెద్దాపురం: పట్టణంలోని ఏరియా ఆస్పత్రి ఐసీటీసీ విభాగంలో మంగళవారం కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. న్యూఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ డీడీ యూబీ దాస్, నాకో కన్సల్టెంట్లు రాహుల్ ఆహూజా, డాక్టర్ జస్వందర్ సింగ్, ఏపీ స్టేట్ సొసైటీకి చెందిన డాక్టర్ వై.కామేశ్వరప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. ఐసీటీసీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఐసీటీసీలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఐసీటీసీ భాగస్వామి పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐసీటీసీ, సంపూర్ణ సురక్ష కేంద్రానికి వచ్చిన వారి వివరాలను సోచ్ యాప్లో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఐసీటీసీలోని రికార్డులను పరిశీలించి, ఇక్కడి సేవలపై కౌన్సెలర్ బి.శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. బృందం వెంట అదనపు పీడీ డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ ఉమామహేశ్వరి తదితరులు ఉన్నారు. -
సహజ వనరులు ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం
వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణికాకినాడ రూరల్: రాష్ట్రంలో విలువైన సహజ వనరులను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతుందని, ఇందులో భాగంగానే కోస్టల్ కారిడార్ను దోచిపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి ఆరోపించారు. కాకినాడ 49వ డివిజన్ కొత్త గైగోలుపాడులో తన నివాసం వద్ద సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సముద్రపు ఇసుకలో పలు ఖనిజాలు వేరు చేసి ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తుందన్నారు. నెల్లూరు నుంచి ఇచ్చాపురం వరకూ సుమారు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఈ ప్రాంతంలో అత్యంత విలువైన ఖనిజ సంపద ఇప్పుడు కనుగొన్నారన్నారు. తీరంలో లభించే ఇసుకలో విలువైన ఇటాలియన్ ఖనిజాలు 8 రకాలుగా లభ్యమవుతాయని శాస్త్రవేత్తలు తేల్చారన్నారు. దేశంలోని బడా కంపెనీల కన్ను వీటిపై పడిందని, భీమిలి ప్రాంతంలో, శ్రీకాకుళం జిల్లా గార మండలంలో దాదాపు 900 ఎకరాలు, విశాఖ జిల్లా భీమునిపట్నంలో 90 ఎకరాల్లో సముద్రపు ఇసుక తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేవలం రూ.2 వేల కోట్ల పెట్టుబడితో రూ.లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవడానికి ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నట్టు ఆమె తెలిపారు. ప్రైవేట్కు తక్కువకే కట్టబెట్టే ప్రయత్నం కూటమి ప్రభుత్వం విరమించుకుని గ్లోబల్ టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుల భారం తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అలా కాకుండా కేవలం 8 శాతానికి పరిమితమవ్వడం వెనుక సీఎం చంద్రబాబు హస్తం ఉందని భావించాల్సి వస్తుందన్నారు. గతంలో కృష్ణా, గోదావరి బేసిన్లో చమురు, గ్యాస్ వనరులను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి స్థానికంగా ప్రజలకు ఏమాత్రం లబ్ధి చేకూర్చలేదన్నారు. గుజరాత్కు గ్యాస్, చమురు తరలిపోగా, బ్లో అవుట్ ఇబ్బందులను స్థానికులు చవిచూశారన్నారు. ఇప్పుడు సముద్రపు ఇసుక ప్రొసెస్ వల్ల వచ్చే అధిక వేడితో స్థానికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. -
ఆదాయం.. గణనీయం
● అన్నవరం దేవస్థానంలో హుండీల లెక్కింపు ● 32 రోజులకు రూ.1.69 కోట్లు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి శ్రావణమాసం సిరులు కురిపించింది. 32 రోజులకు గాను హుండీల ద్వారా రూ.1,69,06,902 ఆదాయం సమకూరింది. దేవస్థానంలోని హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. ఇందులో నగదు రూ.1,59,69,547 కాగా, చిల్లర నాణేలు రూ.9,37,355 వచ్చాయని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. 32 రోజులకు సరాసరిన హుండీల ఆదాయం రూ.5.28 లక్షలుగా నమోదైంది. శ్రావణమాసం కావడం, వివాహాది శుభకార్యాలు గణనీయంగా జరగడంతో హుండీం ఆదాయం పెరుగుదలకు కారణమైందని అధికారులు తెలిపారు. ఈ హుండీల ద్వారా 39 గ్రాముల బంగారం, 765 గ్రాముల వెండి వచ్చింది. విదేశీ కరెన్సీ కూడా... సత్యదేవుని హుండీల ద్వారా పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా లభించింది. అమెరికా డాలర్లు 170, ఇంగ్లాండ్ పౌండ్లు 25, సింగపూర్ డాలర్లు ఐదు, ఆస్ట్రేలియా డాలర్లు పది, సౌదీ రియల్స్ పది, యుఏఈ దీరామ్స్ 455, ఖతార్ రియల్స్ 20, కెనడా డాలర్లు ఐదు లభించాయి. మూడు నెలలుగా పెరుగుదల మూడు నెలలుగా స్వామివారి హుండీల ఆదాయం గణనీయంగా పెరిగింది. సాధారణంగా స్వామివారి హుండీ ఆదాయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నెలకు రూ.1.20 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల వరకూ మాత్రమే వచ్చేది. భక్తుల రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ఈ ఆదాయం రూ. కోటి లోపు ఉండేది. అటువంటిది గత మూడు నెలల నుంచి స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. జూన్లో హుండీ ఆదాయం రూ.2.12 కోట్లు, జూలైలో రూ.1.57 కోట్లు వచ్చింది. గత నెల రూ.1.69 కోట్లు వచ్చింది. గత ఏడాది ఈ మూడు నెలల హుండీ ఆదాయంతో పోల్చితే ఈ హుండీ ఆదాయం సుమారు 20 శాతం పెరిగింది. లెక్కింపులో దేవస్థానం చైర్మన్, ఈఓతో పాటు పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆదాయాన్ని స్థానిక స్టేట్ బ్యాంకుకు తరలించారు. -
కొనసాగుతున్న వరద ఉధృతి
● ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.10 అడుగుల నీటిమట్టం ● 11.79 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ఎప్పటికప్పుడు మిగులు జలాలను దిగువకు విడిచిపెడుతున్నారు. సోమవారం ఉదయం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 13.10 అడుగులకు నీటి మట్టం చేరింది. అక్కడి నుంచి రాత్రి వరకు అదే స్థాయిలో కొనసాగుతోంది. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు స్వల్పంగా తగ్గుతున్నాయి. ఆ ప్రభావం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మంగళవారం కనిపించే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాటన్ బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను ఎత్తి సోమవారం రాత్రి 11,79,236 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడిచిపెట్టారు. డెల్టా కాలువలకు సంబంధించి 13,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 4,900, మధ్య డెల్టాకు 2,300, పశ్చిమ డెల్టాకు 6,500 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 9.64 మీటర్లు, పేరూరులో 14.16 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.49 మీటర్లు, భద్రాచలంలో 43.40 అడుగులు, కూనవరంలో 19.53 మీటర్లు, కుంటలో 10.77 మీటర్లు, పోలవరంలో 12.69 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 16.46 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోందని ఇరిగేషన్ ఎస్ఈ కూరెళ్ల గోపీనాథ్ తెలిపారు. వరద ఉధృతి ఈ నెల ఆరో తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. గత నెల 30న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశామన్నారు. నదీ పరీవాహక, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు వరద సమాచారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గణేశ్ నిమజ్జనోత్సవాల సమయంలో నదిలోకి వెళ్లకుండా, ఒడ్డు నుంచే నిమజ్జనాలు చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న ఏటిగట్ల వద్ద ఇరిగేషన్, ఇతర శాఖల ద్వారా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజలు మర పడవల్లో రేవులు దాటేటప్పుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలన్నారు. అక్టోబర్ చివరి వరకు వరద సీజన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. -
రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో కలపాలి
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్మీనాకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భౌగోళికంగా కాకినాడకు అతి సమీపంలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కోనసీమ జిల్లాలో కలపడం సరికాదన్నారు. కోనసీమ జిల్లాకు రామచంద్రపురం నియోజకవర్గానికి మధ్యలో గోదావరి ఉండడం వల్ల ఏ అవసరమైనా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. యానం మీదుగా తిరిగి వెళ్లాల్సి రావడంతో అవస్థలు పడాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కోనసీమ జిల్లా నుంచి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం ఎంపీపీ పంపన నాగమణి, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాధంశెట్టి శ్రీదేవి, రామచంద్రపురం, కె.గంగవరం మండలాలకు చెందిన ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కరించాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ప్రజా సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించాలని కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాలులో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్, జేసీ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానీష, జిల్లా రెవెన్యూ అధికారి జె.వెంకటరావు, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వీటిపై విచారణ చేపట్టి తగిన పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డుల మంజూరు, కార్డులలో పేర్ల మార్పులు చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూ వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడికల తొలగింపు, పారిశుధ్యంపై అర్జీలు వచ్చాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఆన్లైన్ సమస్యలపై మొత్తం 517 అర్జీలు అందాయి. అనంతరం విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ నిధులతో 9 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.45 వేల ఖరీదైన ల్యాప్టాప్లు అందించారు. జిల్లాలో 2,72,497 మందికి పింఛన్ల పంపిణీ పెదపూడి: ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా కింద అందిస్తున్న పింఛన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేక అధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. రామేశ్వరంలో పేదలకు సేవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో వీరపాండ్యన్తో పాటు జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, డీఆర్డీఏ పీడీ జి.శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 2,72,497 మందికి రూ.117.66 కోట్ల విలువైన సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, డీఎంహెచ్ఓ జె.నరసింహనాయక్, ఎంపీడీఓ కొవ్వూరి నరేంద్రరెడ్డి, తహసీల్దార్ పీవీ సీతాపతిరావు తదితరులు పాల్గొన్నారు. నగర పంచాయతీ కమిషనర్ సస్పెన్షన్ ఏలేశ్వరం: ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ ఎం.సత్యనారాయణను సోమవారం సస్పెండ్ చేశారు. ఇటీవల ఏసీబీ అధికారులు చేసిన దాడిలో కమిషనర్ నగదుతో దొరికిపోవడంతో రాజహేంద్రవరం ఏసీబీ కోర్టుకు తరలించగా రిమాండ్ విఽధించారు. ప్రస్తుతం ఏఈ పి.సూర్యప్రకాశరావు ఇన్చార్జ్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఆత్మీయ నేస్తం.. అమృత హస్తం
● జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్రవేసిన రాజన్న ● ఆనాడే పరుగులు పెట్టిన ‘పుష్కర’ ● మెట్టలో జల‘తాండవ’ం ● నేడు మహానేత వైఎస్సార్ వర్ధంతి రాజన్న.. ఆత్మీయ నేస్తం అయ్యారు.. అమృత హస్తం అందించారు.. జిల్లాలో సంక్షేమం పరవళ్లు తొక్కించారు.. అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు.. ప్రతి మదిలోనూ సుస్థిరమయ్యారు.. ‘వైఎస్’ పేరు చెబితేనే పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా కొనియాడుతున్నారు. ఆయన మన మధ్య లేకున్నా, చేసిన మేలు ఇప్పటికీ పదిలం చేసుకున్నారు.. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకంతో పరుగులు పెట్టించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఇప్పటికీ జిల్లా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను నెమరు వేసుకుంటున్నారు. మంగళవారం రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా జిల్లాలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించేందుకు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడమాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు పక్షపాతిగా, పేదల పెన్నిధిగా నిలిచారు. ఈ ప్రాంతానికి ఆయన చేసిన ప్రగతి జన హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. తన సుదీర్ఘ పాదయాత్రతో జిల్లాలో ప్రజల కష్టాలు, మెట్టప్రాంత రైతుల కన్నీళ్లు చూశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా వారి కష్టాలు గట్టెక్కించారు. ఆయన వేసిన అభివృద్ధి జాడలు ఇప్పటికీ చెక్కుచెదరని ఫలాలను అందిస్తున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, తుని తదితర నియోజకవర్గాల్లో మెట్ట ప్రాంత రైతుల కడగండ్లు తీర్చిన నేతగా జన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం మెట్ట ప్రాంత పంటలకు తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందించారు. సాగు.. భలే బాగు జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు పంటలు సాగై రైతులు ఆనందంగా ఉంటున్నారంటే, ఆనాడు రాజశేఖరరెడ్డి సాకారం చేసిన ప్రాజెక్టులే కారణం. ఇప్పటికీ అవి పదిలంగా ఉన్నాయి. జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని తదితర నియోజకవర్గాల్లో వర్షాధారమైన పంట పొలాల్లోకి సాగునీరు పరుగులు పెట్టించారు. వర్షాలే ఆధారంగా దుక్కిదున్ని పంటలు సాగు చేసే పొలాల్లోకి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు అందించి సిరులు కురిపించారు. అటు తుని నుంచి ఇటు జగ్గంపేట నియోజకవర్గం వరకూ బీడు భూములు కాస్తా సాగు భూములై బంగారం పండుతుందటంటే నాడు రాజన్న చేసిన మేలేనని రైతులు ఆనందంగా చెబుతున్నారు. వైఎస్ తమ కుటుంబాల్లో వెలుగులు నింపారంటూ చాలామంది తమ ఇళ్లలో వైఎస్ ఫొటోలు పెట్టుకుని అభిమానం చాటుతున్నారు. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన పుష్కర ఎత్తిపోతల పథకం వ్యవసాయం దిశ, దశనే మార్చేసిందంటే అది నాడు వైఎస్ చలవేనంటున్నారు. సుమారు లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందించి వేలాది మంది రైతుల కడగండ్లు తీర్చిన తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్ రూ.600 కోట్లు వెచ్చించి రైతుల కలను సాకారం చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా మెట్ట రైతులకు రాజశేఖరరెడ్డి అపర భగీరథుడిగా నిలిచారు. ఆనంద‘తాండవ’ం సుమారు 30 వేల ఎకరాలకు పైగా ప్రయోజనం కల్పించే తాండవ ప్రాజెక్టును పూర్తి చేసి తుని పరిసర ప్రాంతాల రైతుల్లో ఆనందం నింపారు. రూ.52 కోట్లతో తాండవను ఆధునీకరించి కుడి, ఎడమ కాలువలు, పిల్ల కాలువలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఇది తమ జీవితాలకు సిరుల పంట తెచ్చిందని కర్షకులు అంటున్నారు. తుని పరిధిలో తాండవ నదిపై భూమి, ముఠా మినీ ఆనకట్టలను రూ.5 కోట్లతో నిర్మించారు. తుని పట్టణ ప్రజలకు పుష్కలంగా తాగునీటి సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. బీడు నుంచి సాగుకు.. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సుమారు 10 వేల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుందంటే, అది ఆనాడు మహానేత వైఎస్ చలవే. ఆ పది వేల ఎకరాల్లో ఏటా రెండు పంటలు సాగు చేసుకుంటున్నామని ఆ ప్రాంత రైతులు సంతోషంగా చెబుతున్నారు. జలయజ్ఞంతో ఏజెన్సీలోని రంపచోడవరంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా గోకవరం మండలంలో ఆయకట్టును సస్యశ్యామలం చేశారు. బీడు భూములను సాగులోకి తీసుకువచ్చారు. 2004లో ఎన్నికలకు ముందు గోకవరం వ చ్చిన వైఎస్ రైతుల కడగండ్లు చూసి చలించిపోయా రు. సీఎం అయ్యాక 22 వేల ఎకరాలకు నీరందించాలనే సంకల్పంతో రూ.205 కోట్లతో మొదలు పెట్టిన ప్రాజెక్టు పనులు దాదాపు 80 శాతం పూర్తి చేశారు. ఆధునీకరించి.. చెరగని ముద్ర వేసి 2009లో రూ.132 కోట్లతో ఏలేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. అపరిష్కృతంగా ఉన్న పిఠాపురం బ్రాంచ్ కెనాల్ను రూ.120 కోట్లతో ఆధునీకరించి తమ హృదయాల్లో చెరగని ముద్రవేశారని పిఠాపురం రైతులు పేర్కొంటున్నారు. కాకినాడలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడానికి నాడు మహానేత సినిమా రోడ్డులో తీసుకువచ్చిన ఫ్లై ఓవర్ దోహదం చేసిందని గుర్తు తెచ్చుకుంటున్నారు. 2004లో సీఎంగా వైఎస్ తొలిసారిగా నగర బాటకు శ్రీకారం చుట్టింది కూడా కాకినాడ నగరంలోనే కావడం విశేషం. కాకినాడలో వేలాది మంది నిరుపేదల సొంతింటి కలను రాజీవ్ గృహకల్పతో సాకారం చేశారు. అందుకే రాజన్న ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. క‘న్నీళ్లు’ తుడిచి.. పెద్దాపురం నియోజకవర్గంలోని సామర్లకోట, పెద్దాపురం జంట మున్సిపాలిటీల్లో లక్ష మంది దాహార్తిని తీర్చిన ఘనత దివంగత రాజశేఖరరెడ్డిదే. సుమారు రూ.15 కోట్లతో నిర్మించిన మంచినీటి ప్రాజెక్టులు ఆయన దార్శనికతకు నిలువుటద్దం. రూ.12 కోట్లతో పెద్దాపురం రాజీవ్ గృహకల్ప, రూ.25 కోట్లతో పేదల ఇళ్ల నిర్మాణానికి 13 ఎకరాలు కొనుగోలు చేసి మహానీయుడు అయ్యారు. వరద సమయంలో ముంపు, నీటి ఎద్దడి సమయంలో కరవుతో కటకటలాడిన ఏలేరు రైతుల కష్టాలు గట్టెక్కించిన రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగానే నిలిచిపోతారని ప్రజలు కొనియాడుతున్నారు. -
వంటకు కొబ్బరి నూనె శ్రేష్ఠం
కొబ్బరి నూనె ఆహారంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. శక్తి పెరిగి, చర్మానికి తేమ అందుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరి నూనెలో ఉండే మధ్యస్థ గొలుసు కొవ్వు ఆమ్లాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. హార్మోన్ల స్థాయిలను స్థిరంగా ఉంచి, మానసిక ప్రశాంతతను పెంచుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కొబ్బరి నూనెను తలకు పట్టించి.. మర్దన చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. -
ఆనందమీనందమాయె..
● మనసు దోచుకుంటున్న అక్వేరియం కల్చర్ ● ఇంటి అలంకరణలో ప్రత్యేక స్థానం ● వాస్తు నమ్మకాలూ ఓ కారణం రాయవరం: ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిస్తారు. ఇప్పుడు ఇంటి అలంకరణలో అక్వేరియంలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. ఇంటీరియల్ డెకరేషన్లో భాగంగా అక్వేరియం ఏర్పాటుకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా సంస్కృతీ సంప్రదాయాలను పాటించేవారు, వాస్తుపరమైన నమ్మకంతో తమ సంపాదనను వృద్ధి చేసుకునే వారు, సుఖ సంతోషాలను పొందాలని నమ్మేవారు ఇప్పుడు చేపలను గాజు తొట్టె (అక్వేరియమ్స్)లో ఉంచుతున్నారు. వ్యాపార సంస్థల్లోనూ.. అక్వేరియంలను ఇంటితో పాటు వ్యాపార సంస్థల్లో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. వ్యాపారాభివృద్ధి కోసం వ్యాపారులు అక్వేరియంలను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, ఇళ్లల్లో స్థలానికి అవసరమైన ప్రమాణంలో అక్వేరియంలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అందంతో పాటు, ఆదాయం వృద్ధి చెందుతుందని, వాస్తు దోషాలకు విరుగుడుగా ఉంటుందని నమ్మే వారు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు నీటిలో తిరిగే చేపలను చూడడానికి ఇష్టపడతారు. ఇంట్లో చిన్నపిల్లల కోరికను తీర్చేందుకు కూడా వీటిని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. పెరుగుతున్న ఆసక్తి అక్వేరియం ఏర్పాటు వెనుక కొన్ని వాస్తు నమ్మకాలు దాగున్నాయి. చైనీస్ వాస్తు ప్రకారం చేపలు అదృష్టానికి, నీరు సంపదకు గుర్తుగా భావిస్తారు. ఈ రెంటినీ కలిపి ఒకే చోట (అక్వేరియంలో) ఉంచుకుని సంపద వృద్ధిని ఆకాంక్షిస్తున్నారు. చేపలు ఎప్పుడూ కళ్లు తెరిచే స్వభావాన్ని కలిగి ఉండడంతో మనకు జరగబోయే ఆటంకాలను ముందుగా గ్రహించి కదలికలతో సమాచారం అందిస్తాయనే నమ్మకం ఉంది. అధిక లాభాలను ఆర్జించవచ్చనే నమ్మకంతో వ్యాపార సంస్థలు సైతం అక్వేరియంలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. అక్వేరియంల పట్ల ప్రజల్లో ఆసక్తి పెరుగుతుంది. అందుకు అనుగుణంగా స్వదేశీ, విదేశీ చేపలు నేడు మార్కెట్లో లభిస్తున్నాయి. దేశంలోని చైన్నె, కోల్కతా తదితర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర దేశాల చేపలను కూడా వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. ఉపాధికి మార్గంగా.. అక్వేరియంలో ఉంచేందుకు పలు రకాల చేపలను మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నారు. స్కాట్ఫిష్, గోల్డ్ఫిష్, అరోవనా, రెడ్క్యాప్, గుప్పీస్, వైట్ ఏంజల్, బెలూన్ఫిష్, బ్లాక్గోల్డ్ ఫిష్, బ్లాక్ షార్క్, ఫ్లోరాస్, క్రోకడైల్ ఫిష్ వంటి 40 రకాల చేపలు లభిస్తున్నాయి. రూ.10 నుంచి రూ.20 వేల వరకు వివిధ ధరల్లో పలు రకాల చేపలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటితో పాటు పలు రకాల మోడళ్లలో అక్వేరియంలు కూడా లభ్యమవుతున్నాయి. -
సమయం తెలియదు
అక్వేరియంలో చేపల పెంచడం అంటే చాలా ఇష్టం. వాటిని చూస్తుంటే కాలం తెలియదు. వాటిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. – పేకేటి వీరబాబు, వ్యాపారి, రాయవరం అక్వేరియం కల్చర్ పెరిగింది గత 28 ఏళ్లుగా అక్వేరియంలకు ఫిష్ల ను అమ్ముతున్నాను. సింగపూర్, మలే షియా, థాయ్లాండ్, చైనా దేశాల నుంచి చైన్నెకి దిగుమతి అవుతుంటా యి. ఇటీవల కాలంలో అక్వేరియం కల్చర్ పెరిగింది. – సత్యవోలు శ్రీనివాసరావు, అక్వేరియం షాపు యజమాని, రామచంద్రపురం -
కాయకల్ప తరువు
● ఆరోగ్య ప్రదాయిని.. కొబ్బరి ● నీటి నుంచి ఆయిల్ వరకు ప్రతిదీ ఔషధమే.. ● నీరు, ముక్క, పాలు ఇలా ఎన్నెన్నో! ● అన్నింటా ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో సాగు ● నేడు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సాక్షి, అమలాపురం/అంబాజీపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో సాగవుతున్న కొబ్బరి ఒక్క ఉమ్మడి తూర్పులోనే 1.30 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వరి తర్వాత అత్యధికంగా సాగయ్యే కొబ్బరి ఔషధాల గని. కొబ్బరి ఉత్పత్తుల ద్వారా రైతులు, వ్యాపారులు, కార్మికులు ఉపాధి పొందుతుంటే.. ఆయా ఉత్పత్తుల ద్వారా సామాన్యులు సైతం మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతున్నారు. లక్షలాది మంది ప్రజలకు ఔషధాలను అందిస్తూ కొబ్బరి ఆరోగ్య వర ప్రదాయినిగా పేరొందింది. సెప్టెంబర్ రెండున ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం. కొబ్బరి చెట్టును చూస్తే గోదారమ్మ ఒడిలో ఒదిగిన అందాల బిడ్డలా కనిపిస్తుంది. ప్రకృతి అందాల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు అదనపు అందాలు అద్దే కొబ్బరి చెట్టు చూసి ముచ్చట పడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తోటల్లో పంటగానే కాదు వరిచేను.. చెరువులు.. రోడ్లు.. కాలువలు.. నదీపాయల వెంబడి.. ఇళ్ల చుట్టూ కనిపించే కొబ్బరి చెట్టు గోదావరి వాసుల నుదుటిన ప్రగతి తిలకం దిద్దుతూ ఇక్కడ వారి జీవనంలో పెనవేసుకుపోయింది. కన్న కొడుకుగా పిలుచుకుంటారంటే.. వారి జీవనంలో కొబ్బరికి ఎంత ప్రాముఖ్యమో అవగతమవుతుంది. మధుమేహ రోగులకు కొబ్బరి కల్పరస కొబ్బరి జ్యూస్ (కల్లు–కల్పరసా) ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఫెర్మంటేషన్ ఆవకుండా ఉత్పత్తి చేసే కొబ్బరి జ్యూస్ (నీరా) నేరుగా తాగినా, దీనిని నుంచి ఉత్పత్తి చేసే పంచదార, బెల్లం, తేనెను ఆహారంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఇందులో గైసమిక్ ఇండెక్స్ 25 శాతం మాత్రమే. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని ఆహారంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
పాడైన పంటల పరిశీలన
పెరవలి: గోదావరి వరదల కారణంగా వేలాది ఎకరాల్లో పంటలు నీటమునిగి చనిపోయిన విషయమై సాక్షిలో జల దిగ్బంధం శీర్షికన సోమవారం వెలువడిన కథనానికి ఉద్యానవన అధికారులు స్పందించారు. వివిధ ప్రాంతాల్లో పాడైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉద్యానవన అధికారి సుధీర్కుమార్ మాట్లాడుతూ, దిగువ లంకల్లో పంటలు పూర్తి పాడైపోయాయని, నష్టపోయిన పంటల వివరాలు పూర్తి స్థాయిలో తెలియాలంటే వరద పూర్తిగా తగ్గాలన్నారు. ఆ తర్వాత పంటలు పరిశీలించి అంచనాలు రూపొందిస్తామన్నారు. ఇందుకు మరో వారం ఆగాల్సి ఉంటుందన్నారు. సోమవారం కానూరు నుంచి కానూరు అగ్రహారం, ఉసులుమర్రు, తీపర్రు, కాకరపర్రు, ముక్కామల, ఖండవల్లి, మల్లేశ్వరం వరకు పంటలను పరిశీలించామన్నారు. వరద తగ్గాక అంచనాలు తయారు చేయాలని వీఆర్వోలు, ఉద్యానవన అధికారులకు ఆదేశించినట్టు తెలిపారు. ఆయా గ్రామాల రైతులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతి కొయ్యలగూడెం: అదుపు తప్పిన ద్విచక్ర వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని కన్నాపురం గ్రామ శివారున సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు, తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం గ్రామానికి చెందిన అయినపూడి సత్యనారాయణ (60) ద్విచక్ర వాహనంపై బుట్టాయిగూడెం మండలం కండ్రికగూడెం గ్రామంలో బంధువు రెడ్డి వెంకట్రావు ఇంటికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో కన్నాపురం శివారున వాహనంతో చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని కొయ్యలగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్
ఆలమూరు: లంచం డిమాండ్ చేసినట్టు రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. రైతు నుంచి రూ.28 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సబ్ రిజిస్ట్రార్ పట్టుబడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన రైతు జి.సుబ్రహ్మణ్యానికి చెందిన 1.37 ఎకరాల భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ కె.విమల సరోజినీకుమారి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని రైతు ప్రాధేయపడగా, రూ.28 వేలకు అంగీకరించారు. దీంతో రైతు ఆ మొత్తం తీసుకువస్తానని చెప్పి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం దాడి చేసింది. సబ్ రిజిస్ట్రార్ విమల సరోజినీకుమారి తన కారు డ్రైవర్ దాసరి దుర్గారావుతో కలిసి రైతు నుంచి రూ.28 వేలు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆమెతో పాటు, కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించగా, అదనంగా రూ.35 వేల నగదు గుర్తించారు. ఆ మొత్తాన్నీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాడిలో సీఐలు వాసుకృష్ణ, భాస్కరసతీష్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐవీఎఫ్, సరోగసీ కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చట్టాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలోని ఏఆర్టీ/ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. అనుమతి లేకుండా ఎటువంటి చికిత్సా కేంద్రాలు నడపరాదన్నారు. నియామావళి ప్రకారమే సేవలు అందించాలన్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడంలో ఏఆర్టీ, ఐవీఎఫ్, సరోగసీ ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రజలు తప్పనిసరిగా ప్రభుత్వం గుర్తించిన, రిజిస్ట్రేషన్ కలిగిన ఆస్పత్రులు/కేంద్రాల్లోనే చికిత్స పొందాలన్నారు. అనుమతి లేని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం వల్ల ప్రమాదాలు, మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రజలు ఆయా విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనధికార/నమోదు కాని కేంద్రాల్లో చికిత్స చేయించుకోవద్దని సూచించారు. ఏఆర్టీ లేదా సరోగసీ ద్వారా పుట్టిన పిల్లలు దంపతుల చట్టబద్ధ సంతానం అవుతారని స్పష్టం చేశారు. వాణిజ్య సరోగసీ (డబ్బు కోసం) పూర్తిగా నిషేధించబడిందన్నారు. లింగ నిర్ధారణ, గర్భకణాల అమ్మకాలు కఠినంగా నిషేధించబడ్డాయని తెలిపారు. చట్ట ఉల్లంఘన చేసిన వారికి జైలుశిక్ష, భారీ జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు. చట్టాల అమలుతో పారదర్శకత, న్యాయం, రక్షణ అన్నీ సాధ్యమవుతాయన్నారు. ప్రజలంతా అవగాహనతో ఉండి, నిబంధనలు పాటించే కేంద్రాలను మాత్రమే ఆశ్రయించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తెలిస్తే వెంటనే జిల్లా వైద్యారోగ్య శాఖకు సమాచారం అందించాలని కోరారు. ఇతర వివరాలకు 81255 67830 నంబరులో సంప్రదించాలన్నారు. -
స్వదేశానికి క్షేమంగా చేరిన మహిళ
మస్కట్ నుంచి రప్పించిన కోనసీమ మైగ్రేషన్ అధికారులు అమలాపురం రూరల్: మస్కట్ దేశంలో అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఓ మహిళను కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ అధికారులు క్షేమంగా స్వదేశానికి రప్పించారు. తమ తల్లిని స్వదేశానికి రప్పించాలని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య కలెక్టరేట్లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ను పది రోజుల క్రితం ఆశ్రయించింది. కేంద్రం ప్రతినిధులు స్పందించి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మన్యం నాగమణిని ఇండియాకు రప్పించినట్టు డీఆర్వో, కేంద్రం నోడల్ అధికారి కొత్త మాధవి సోమవారం తెలిపారు. ఆగర్రు గ్రామానికి చెందిన సురెళ్ల దివ్య తల్లి నాగమణి ఉపాధి కోసం 9 నెలల క్రితం మస్కట్ దేశానికి వెళ్లింది. కొంతకాలం నుంచి ఆమె ఆరోగ్యం బాగోలేక, ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆమెను ఇండియాకు రప్పించడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆమెను పంపించిన ఏజెంట్ను అడిగితే రూ.1.60 లక్షలు కడితే కానీ ఆమెను రప్పించలేమని స్పష్టం చేశాడు. వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, డబ్బు సర్దుబాటు కుదరలేదు. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్కుమార్ కలెక్టరేట్లో ప్రత్యేకించి వలసదారుల కోసం సెంటర్ ఫర్ మైగ్రేషన్ ఏర్పాటు చేశారని, విదేశాలకు వెళ్లే వారికి అండగా ఉంటోందని తెలుసుకుని ఈ కేంద్రాన్ని దివ్య ఆశ్రయించింది. కేంద్రం అధికారులు సంబంధిత ఏజెంట్తో మాట్లాడి, సమస్యను పరిష్కరించి.. నాగమణిని క్షేమంగా మస్కట్ నుంచి రప్పించే ఏర్పాట్లు చేశారు. సోమవారం నాగమణి హైదరాబాద్కు చేరుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. స్వగ్రామానికి మృతదేహంఅంబాజీపేట: పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన కాగిత అర్జమ్మ ఉపాధి కోసం బెహరాన్ దేశం వెళ్లి పదేళ్లుగా అక్కడే పని చేస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న అనారోగ్యంతో ఆమె అక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేందుకు రూ.3 లక్షల ఖర్చవుతుండడంతో ఆమె కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ(ఏపీఎన్ఆర్టీఎస్) అండగా నిలిచింది. నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్తో కలిసి ఈ సంస్థ ఖర్చులు భరించి, అర్జమ్మ మృతదేహాన్ని సోమవారం ఇంటి వద్ద బంధువులకు అప్పగించారు. ఇందుకు కృషి చేసిన ఆయా సంస్థల ప్రతినిధులకు మృతురాలి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. -
సుజల ప్రాప్తిరస్తు..
● వర్షపు నీటిని ఒడిసిపట్టి.. రీ సైక్లింగ్ ● తొలిసారిగా అన్నవరం దేవస్థానంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ ● లక్ష లీటర్ల సామర్థ్యంతో ట్యాంక్ నిర్మాణం ● సంతృప్తి వ్యక్తం చేసిన దేవదాయ శాఖ కమిషనర్ ● అన్ని దేవస్థానాల్లో నిర్మించాలని ఆదేశం అన్నవరం: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సాంకేతిక పరంగా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి, ట్యాంకులో నింపి, అదే నీటిని తిరిగి ఉపయోగించుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్.. 2023–24 మధ్య అన్నవరం దేవస్థానం ఈఓగా పని చేసినప్పుడు ఈ మేరకు ప్రణాళిక రూపొందించగా.. ఇప్పుడది కార్యరూపం దాల్చుతోంది. అన్నవరం దేవస్థానంలోని సత్యగిరిపై నిర్మించిన 135 గదుల శివసదన్ సత్రంపై శ్లాబు మీద కురిసిన వర్షపు నీటిని పైపుల ద్వారా సేకరిస్తారు. సత్రం దిగువన నిర్మించిన లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకులోకి ఆ నీరు చేరేలా ఏర్పాట్లు చేశారు. ఆ ట్యాంకులో వర్షపు నీరు ఎంత మేర ఉందో తెలిపే మీటరు కూడా ఏర్పాటు చేశారు. ఈ వర్షపు నీటిని ఎప్పటికప్పుడు ఫిల్టర్(శుద్ధి) చేసే ప్రక్రియ కూడా ఈ ట్యాంకులో అమర్చారు. ఈ ట్యాంకు నిండినపుడు ఆ నీటిని మరలా శివసదన్ సత్రం పైన ఉన్న వాటర్ ట్యాంకుకు పంపించేలా మోటార్లు ఏర్పాటు చేశారు. సత్రం ఆవరణలో మొక్కల పెంపకానికీ ఈ నీటిని ఉపయోగించుకునే వీలుంది. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్గా దీనిని పిలుస్తున్నారు. కమిషనర్ సంతృప్తి గత నెల ఒకటో తేదీన అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ ట్యాంకును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ట్యాంకు నిర్మాణం, ఇతర వివరాలను అన్ని దేవస్థానాలకు పంపాలని ఆదేశించారు. దేవస్థానంలోని హరిహర సదన్, ప్రకాష్ సదన్, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ సత్రాల వద్ద కూడా ఇటువంటి వాటర్ ట్యాంకులు నిర్మించి, వర్షపు నీటిని పైపుల ద్వారా మళ్లించి, ఆ నీటిని ఫిల్టర్ చేసి వినియోగించుకునేలా చేయాలని కమిషనర్ నిర్దేశించినట్టు ఈఓ తెలిపారు. రూ.20 లక్షల ఖర్చు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురవడంతో ఈ ట్యాంకు దాదాపుగా నిండిపోయింది. దీంతో ఈ నీటిని మరలా వాటర్ ట్యాంక్కు పంపడమో.. లేక మొక్కల పెంపకానికి ఉపయోగించడమో చేస్తామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఈ ట్యాంకు, పైపులైన్, ఇతర నిర్మాణాలకు రూ.20 లక్షలకుపైగా ఖర్చు చేశామని వివరించారు. సాధారణంగా లక్ష లీటర్ల నీరు భూమి నుంచి సత్రం పైకి పంపించేందుకు చాలా విద్యుత్ అవసరమవుతుంది. సత్యగిరి కొండ ప్రదేశం కావడంతో బోర్లు వేసే అవకాశమూ తక్కువే. ఈ పరిస్థితుల్లో వర్షాకాలంలో ఎప్పటి కప్పుడు ఈ నీటిని తిరిగి వాటర్ ట్యాంక్కు పంపించడం ద్వారా నీటిని సద్వినియోగం చేయడంతోపాటు, విద్యుత్నూ ఆదా చేయవచ్చని తెలిపారు. రీ సైక్లింగ్కు ఏర్పాట్లు చేశాం దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశాల మేరకు శివసదన్ సత్రం టెర్రస్పై కురిసిన లక్ష లీటర్ల వర్షపు నీటిని సేకరించి, నిల్వ చేసే ట్యాంకు నిర్మించాం. ఇందులో నిల్వ అయ్యే నీటిని తిరిగి సత్రం అవసరాలకు, మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. దేవదాయ శాఖలో ఈ విధమైన నీటి ట్యాంకు నిర్మించడం ఇదే ప్రఽథమం. అలాగే దేవస్థానంలో ఐదు చోట్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా ఇంజెక్షన్ వెల్స్ నిర్మించాం. దీనివల్ల భూమిలోకి నీరు ఇంకి, సత్యగిరి, రత్నగిరిల్లో మొక్కలకు సమృద్ధిగా నీరు అందుతుంది. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
మహిళను కాపాడిన కానిస్టేబుల్
ఐ.పోలవరం: గోదావరిలోకి దూకేందుకు ప్రయత్నించిన ఒక మహిళను స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ కాపాడిన సంఘటన మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. యానాం – ఎదుర్లంక వంతెనపై నుంచి గోదావరిలోకి దూకేందుకు యానాం గోపాల్నగర్కు చెందిన దుర్గ ఆదివారం ప్రయత్నించింది. అటుగా వెళ్తున్న ఎస్బీ కానిస్టేబుల్ నాగరాజు గమనించి ఆమెను నలుగురి సాయంతో రక్షించారు. వివరాలు అడిగి తెలుసుకుని.. భర్త, పిల్లలకు సమాచారం అందజేశారు. కాగా, దుర్గ యానాంలో ఇంటి పనులు చేస్తుండగా, భర్త ఆటోను నడుపుతున్నట్టు తెలిపారు. భార్యాభర్తల మధ్య వివాదమే కారణమని తెలుసుకుని ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి, బంధువులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన నాగరాజును స్థానికులతో పాటు, పోలీసులు అభినందించారు. -
విద్యార్థిని అదృశ్యం
రంగంపేట: కళాశాలకంటూ వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైనట్టు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్సై శివప్రససాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, రాజానగరం మండలం శ్రీరామపురం గ్రామానికి చెందిన 16 ఏళ్ల నూతలపాటి షెలాశియా రంగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతోంది. ఎప్పటిలాగే శనివారం దివాన్చెరువులో ఆర్టీసీ బస్సు ఎక్కి, రంగంపేటలో దిగి కళాశాలకు వెళ్లింది. కళాశాల ముగిశాక సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు తెలిసిన చోట్లా, బంధువుల ఇళ్ల వద్దా ఆచూకీ కోసం యత్నించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో.. శనివారం రాత్రి ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. విద్యార్థిని ఆచూకీ తెలిసిన వారు రంగంపేట పోలీస్ స్టేషన్కు, లేదా 94409 04854, 94407 96538 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. -
దేవాలయ భూముల్లో చెట్ల నరికివేత!
కొత్తపల్లి: మండలంలోని గోర్స గ్రామానికి చెందిన పురాతన సీతారామస్వామి దేవాలయ భూముల గట్లపై ఉన్న చెట్ల నరికివేత చర్యలను ఆదివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ భూముల్లో ఎటువంటి వ్యవసాయ పనులు చేపట్టరాదని న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల ప్రకారం, కొమరగిరి గ్రామంలో సర్వే నంబరు 121, 122లో గోర్స దేవాలయానికి సుమారు 20 ఎకరాల భూమి ఉంది. దీనిపై ఆక్రమణదారులు, దేవదాయ శాఖ మధ్య వివాదం న్యాయస్థానంలో ఉంది. ఇలాఉంటే ఆక్రమణదారులు ఇందులో వ్యవసాయ పనులు చేపట్టేందు కు ఆదివారం సిద్ధమయ్యారు. గట్టుపై చెట్లను నరికించడంతో.. సర్పంచ్ రొంగల వీరబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకుని, తహసీల్దార్ చిన్నారావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు వీఆర్వో కిషోర్ ఆక్రమణదారులు, చెట్లను నరికిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఎస్సై వెంకటేష్ తెలిపారు. -
పెట్టుబడి పెన్షన్.. బతుకు టెన్షన్
● ‘ఉమ్మడి’లో 30 వేల సీపీఎస్ ఉద్యోగులు ● నేడు విజయవాడలో మహా సభ రాయవరం: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తాయి. ఉద్యోగ విరమణ తర్వాత ఆర్థిక భద్రత, విధి నిర్వహణలో చనిపోతే కుటుంబానికి తోడ్పాటు, ఆర్థిక ప్రయోజనాలు, ఉద్యోగికి సామాజిక భద్రతగా పెన్షన్ ఉంటుందనేది ఒకప్పటి మాట. సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం ఈ మేరకు భవిష్యత్తుపై భరోసా లేకపోవడంతో.. పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలనే డిమాండ్ దశాబ్ద కాలంగా వినిపిస్తోంది. సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వివిధ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక(ఫ్యాఫ్టో) ఇప్పటికే మద్దతు పలికింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ ఉద్యోగులు కలిపి 30 వేల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులున్నారు. పదవీ విరమణ అనంతరం అందించే పింఛన్లు భారమవుతుందని భావించి 2003–04 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) విధానం అమలు చేశారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) పేరుతో అమల్లోకి తీసుకొచ్చింది. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి సీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నారు. నేడు విజయవాడలో మహాసభ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్తో సీపీఎస్ ఉద్యోగులు సోమవారం విజయవాడలో ధర్నా చౌక్ వద్ద మహాసభ నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు వెళ్లే వారిపై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఐదు వేల మంది తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాట నిలబెట్టుకోవాలి సీపీఎస్ ఉద్యోగుల పోరాటం ద్వారా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్ష న్ సాధించుకున్నాం. ప్రభుత్వ ఉద్యోగి హక్కుగా ఉన్న సర్వీస్ పెన్షన్ సాధించుకోవడమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకూ మా పోరాటాన్ని దశలవారీగా ఉధృతం చేస్తాం. – చింతా నారాయణమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఏపీసీపీఎస్ఈఏ, కాకినాడ తీవ్రంగా నష్టపోతున్నాం సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగికి ప్రాథమిక హక్కులైన పెన్షన్, సామాజిక, ఆర్థిక భద్రత లేని సీపీఎస్ విధానం వల్ల రోడ్డున పడే దుస్థితి ఏర్పడింది. – గుబ్బల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్, ఏపీసీపీఎస్ఈ అసోసియేషన్, అంతర్వేది, సఖినేటిపల్లి మండలం -
బాలలతో భిక్షాటన చేయించడం నేరం
కాకినాడ రూరల్: బాలలతో భిక్షాటన చేయించడం నేరమని జిల్లా బాలల సంక్షేమాధికారి సీహెచ్ వెంకట్రావు అన్నారు. వీధి బాలల గుర్తింపు కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట గ్రామ శివారు కొత్తూరు వద్ద నలుగురు వీధి బాలలను శనివారం సాయంత్రం గుర్తించారు. బాలల తల్లిదండ్రులు పల్నాడు జిల్లా వినుకొండగా గుర్తించారు. ప్లాస్టిక్ సామగ్రి ఏరుకుంటూ, గ్యాస్ స్టౌవ్ల రిపేరు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తల్లిదండ్రులు పిల్లలను భిక్షాటనకు ప్రోత్సహించడంతో వారికి కౌన్సెలింగ్ ఇచ్చినట్టు వెంకట్రావు తెలిపారు. ఇద్దరు పిల్లలను అంగన్వాడీ సెంటరులో, ఒకరిని ఎంపీపీ స్కూల్, మరోకరిని జెడ్పీ స్కూల్లో చేర్చామన్నారు. ఐసీడీఎస్ సీడీ లక్ష్మి సహకారంతో వీధి బాలల గుర్తింపు కాకినాడ పరిసరాలలో చేపడుతున్నట్టు తెలిపారు. -
సత్యదేవుని హుండీ నేడు లెక్కింపు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హుండీలను తెరిచి, భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం లెక్కించనున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారి నిత్యకల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు పర్యవేక్షిస్తారు. దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గత నెల 30న లెక్కించారు. మరలా 32 రోజుల తర్వాత సోమవారం లెక్కించనున్నారు.బాల్ బ్యాడ్మింటన్లో జాహ్మవి, శ్రీలక్ష్మికి తృతీయ స్థానంసీతానగరం: చినకొండేపూడికి చెందిన విద్యార్థిని జాహ్నవి రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ బాలికల విభాగంలో తృతీయ స్థానం కై వసం చేసుకుంది. ఆదివారం ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన ఈ పోటీల్లో చినకొండేపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న బచ్చు జాహ్నవి, సీనియర్స్ విభాగంలో జిల్లా పరిషత్ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ఎం శ్రీలక్ష్మి తృతీయ స్థానం సాధించారు. వీరిని స్కూల్ హెచ్ఎం ఎస్ ఉషారాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు.హైవేపై లీకై న ఆయిల్ వాహన చోదకులకు ఇక్కట్లురాజమహేంద్రవరం రూరల్: జాతీయ రహదారిపై హుకుంపేట జైహింద్నగర్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం సమయంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి ఆయిల్ లీకైంది. దీంతో పలువురు వాహనచోదకులు అదుపుతప్పి కిందపడ్డారు. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఆయిల్ పడిన ప్రాంతంలో ఇసుక వేసి, దానిపై నుంచి వాహనాలు వెళ్లకుండా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆయిల్పై వేసిన ఇసుకను, స్టాప్ బోర్డులను తీసేశారు. వాహనాలు రాకపోకలకు అనువుగా మారడంతో వాహన చోదకులు ఊపిరి పీల్చుకున్నారు.సూర్యదేవునికి ప్రత్యేక పూజలుపెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన ఉషా, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యదేవుడికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, వ్రత పూజలు నిర్వహించారు. -
టేకు రథంపై సత్యదేవుని ఊరేగింపు
● స్వామివారిని దర్శించిన పది వేల మంది భక్తులు ● రూ.15 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించి పూజలు చేసి రథసేవ ప్రారంభించారు. వేద పండితుల మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా, ఆదివారం సుమారు పది వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి సర్వదర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. తరువాత రావిచెట్టు వద్ద ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షలు ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
ఆగని జలగాటం..
● లంకల్లోకి మళ్లీ నీళ్లు ● నీట మునిగిన కాజ్వేలు, పంటలు ● పడవలపైనే రాకపోకలు సాక్షి, అమలాపురం: గోదావరి వరద వదలనంటోంది.. జిల్లాలో లంక ప్రాంతాలను మళ్లీ ముంచెత్తుతోంది.. కాస్త తగ్గిందనుకునే లోపే తిరిగి ఉధృతంగా మారుతోంది.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగా, లంక గ్రామాల్లో ఇప్పటికే కాజ్వేలు, లోతట్టు ప్రాంతాల రోడ్లపైకి ముంపునీరు చేరింది. దీంతో లంక వాసులు ప్రత్యామ్నాయ విధానాల్లో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. సోమవారానికి ముంపు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ప్రభావం పెరుగుతుండడంతో దిగువకు జలాల విడుదల ఆదివారం మరింత పెరిగింది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక విడుదల చేశారు. ఉదయం ఆరు గంటలకు 10,81,115 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, తొమ్మిది గంటలకు 10,94,575 క్యూసెక్కులు, మధ్యాహ్నం 12 గంటలకు 11,16,464 క్యూసెక్కులు, మూడు గంటలకు 11,24,472 క్యూసెక్కులు, సాయంత్రం ఆరు గంటలకు 11,35,249 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేశారు. అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి వరద నిలకడగా ఉంది. ఎగువన భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పట్టడంతో దిగువన కూడా వరద తగ్గుతోంది. ఎగువన తగ్గుతున్నా దిగువన లంకల్లో మాత్రం వరద ముంపు పెరుగుతోంది. జిల్లాలో పి.గన్నవరం, మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కె.గంగవరం, కాట్రేనికోన, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో సోమవారం నుంచి వరద ప్రభావం పెరగనుంది. ఎక్కడెక్కడ ఎలా అంటే.. ● మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్వే నీట మునిగింది. దీనిపై మూడు అడుగుల ఎత్తులో నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాజ్వే మీదుగా రాత్రి నుంచి రాకపోకలు నిలిపివేశారు. లంక వాసులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ● పి.గన్నవరంలో వరద ఉధృతి మరింత పెరిగింది. తాజాగా మానేపల్లి నుంచి శివాయలంకకు వెళ్లే రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నీట మునిగింది. తాము రాకపోకలు సాగించేందుకు వీలుగా ట్రాక్టర్ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కనకాయలంక కాజ్వే మరింత ముంపు బారిన పడింది. ● అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద ఎదురుబిడెం కాజ్వే నీట మునిగింది. దీంతో అయినవిల్లిలంక, వీరవల్లిపాలెం, కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక వాసులు పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. పాడి రైతులు, విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని లంక పొలాల్లోకి వరద నీరు చేరింది. ● ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్తో పాటు, రాఘవేంద్ర వారధి, ఎదుర్లంక వారధి వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎదుర్లంక, జి.మూలపొలం, గుత్తెనదీవిల వద్ద ఏటిగట్టు దిగువన ఉన్న లంకల్లోకి వరద చొచ్చుకు వస్తోంది. దిగువన లంకల్లో నీరు ప్రవహిస్తోంది. ● ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనాలంకల్లోకి వరద నీరు ప్రవేశిస్తోంది. గురజాపులంకకు వెళ్లే రహదారి నీట మునగనుంది. కాట్రేనికో న మండలం పల్లంకుర్రు రేవు, భైరవపాలెం లంకల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వస్తోంది. నేడు పాఠశాలలకు సెలవు పి.గన్నవరం: వరదల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పి.గన్నవరం మండలం ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించినట్టు ఎంఈఓ కోన హెలీనా తెలిపారు. అలాగే పి.గన్నవరం మండలంలోని లంక గ్రామాలతో పాటు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వస్తున్న 327 మంది విద్యార్థులకు కూడా సెలవు ఇచ్చారన్నారు. లంక గ్రామాల నుంచి విద్యార్థులను నదీ పాయలు దాటి బయటకు పంపవద్దని, ఆయా రేవులను పర్యవేక్షిస్తున్న అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు హెలీనా తెలిపారు.మూడోసారి వచ్చి.. ముంచి గోదావరికి గడిచిన రెండు నెలల్లో మూడో సారి వరద వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట చేలు, తోటలు ముంపు బారిన పడుతున్నాయి. దీర్ఘకాలిక పంటలైన కొబ్బరి, కోకో, పోక వంటి పంటలకు నష్టం లేకున్నా అరటి, బొప్పాయి, కంద, పసుపుతో పాటు కూరగాయ పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. జూలైలో ఒకసారి, ఆగస్టులో రెండుసార్లు వరద వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా సుమారు 700 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, బొప్పాయి, కూరగాయ పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయని అంచనా. ప్రభుత్వం పరిహారం అందించాలని రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇంత వరకూ ప్రభుత్వం నుంచి పరిహారంపై ప్రకటన విడుదల కాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏలేరులో పెరిగిన నీటినిల్వలు
ఏలేశ్వరం: ఏలేరులో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆదివారం ప్రాజెక్టులోకి 1.708 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 1.050 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 80.74 మీటర్లు, 24.11 టీఎంసీలకు 14.26 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1500, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. అన్నదానం, గో సంరక్షణకు రూ.2.5 లక్షల విరాళం అన్నవరం: సత్యదేవుని వ్రత విభాగంలో పనిచేస్తున్న కర్రి సూర్యనారాయణ (నాని) తన కుమారుడు సత్యగౌరీ ఉదయ్ శర్మకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా సత్యదేవుని నిత్యాన్నదాన పధకానికి రూ.లక్ష, గోసంరక్షణ ట్రస్ట్కు రూ.1.50 లక్షలు విరాళాన్ని దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఆదివారం అందచేశారు. ఏటా ఆషాఢ బహుళ ఏకాదశి నాడు, అన్నదానం, గోపూజ చేయాలని కోరారు. ఆకట్టుకున్న పురాతన నాణేలు కాకినాడ రూరల్: సర్పవరం జంక్షన్ వద్ద బోట్క్లబ్ ఉద్యానవరంలో గ్రంథాలయం వద్ద వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో వద్దిపర్తి రాజేశ్వరరావు పురాతన నాణేలు, వివిధ దేశాల కరెన్సీ నోట్లను ఆదివారం ప్రదర్శించారు. దేశంలో 18, 19 శతాబ్దాల నాటి వెండి నాణేలు, దమ్మిడీలు, చిల్లు కాసులు, రాగి నాణేలు, అర్ధణాలు, అణాలు, బేడలు, పావలా నాణేలతో పాటు 72 దేశాలకు చెందిన నాణేలు, కరెన్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాణేలు సేకరణ కర్త రాజేశ్వరరావు మాట్లాడుతూ నాణేల సేకరణను అలవాటుగా మార్చికున్నట్టు తెలిపారు. దేశంలో వినియోగించి ప్రస్తుతం వినియోగంలో లేని నాణేల పట్ల నేటి యువతకు అవగాహన కల్పించడం తన ముఖ్య ఉద్దేశమన్నారు. ఎఫ్సీఐ మాజీ జీఎం ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ బోట్క్లబ్ (కాకినాడసిటీ): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్ ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలన్నారు. -
వేదాలతో లోకం సుభిక్షం
అమలాపురం రూరల్: ఇందుపల్లి అరవగరువు గణపతి మందిరంలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ వార్షిక వేదశాస్త్ర మహాసభ జరిగింది. కోనసీమ వ్యాప్తంగా వేద పండితులు పాల్గొని వేదలను ఘోషించారు. వారు మాట్లాడుతూ వేదాలతో లోకం సుభిక్షంగా ఉంటుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన మహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ మాట్లాడుతూ వేదాలకు పుట్టినిల్లు కోనసీమ అని అన్నారు. ఇందుపల్లిలో రాణి హయగ్రీవ అవధాని వేదశాస్త్ర పరిషత్, ఆత్రేయ మహర్షి వేదశాస్త్ర పరిషత్ ఆధ్యర్యంలో ఏటా వార్షిక వేదశాస్త్ర మహాసభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గుళ్లపల్లి దత్తాత్రేయ ఘనపాఠి, వడ్లమని సుబ్రహ్మణ్య ఘనపాఠి, దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు తదితరులు వేదాల గొప్పదనం గురించి వివరించారు. బాలభక్త గణపతి సేవా సంఘ అధ్యక్షుడు తాతకాశీ విశ్వనాథ్ స్వాగత ఉపన్యాసం చేశారు. వేద పండితులను పరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు కర్ర సోమసుందరం (దత్తు), ముష్టి వెంకట రాజేశ్వరశర్మ సత్కరించారు. -
రిప్పాటు ప్రమాదం!
రిప్ కరెంటు అలలు (ఫైల్)పిఠాపురం: గణపతి నవరాత్రులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇక నిమజ్జనాలే తరవాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ సాగరతీరం నిమజ్జనాలతో హోరెత్తనుంది. గతంలో సంభవించిన ప్రమాదాల్లో ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. చీలిక ప్రవాహాలతో విద్యుదావేశం సాగరతీరంలో కనిపించని, కడలి మాటున వేటు వేసే రాకాసి అలులు రిప్ కరెంట్ (చీలిక ప్రవాహాలు) ఎందరో ప్రాణాలను కాటేస్తున్నాయి. అలల మాటున పొంచి ఉండి ఒక్క సారిగా దాడి చేసి పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా రెప్ప పాటులో సముద్రంలోకి లాగేస్తుంటాయి. ఆగస్టు అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ వెలువడే అలులు ఎక్కువగా తూర్పు తీరంలో సంభవిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఉన్న తీర ప్రాంతంలో ఇవి ఎక్కువగా ఏర్పడుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ఎక్కువ మంది వీటి వల్ల మృత్యువాత పడినట్లు గుర్తించారు. ఉప్పాడ తీరంలో గతంలో సంభవించిన పెను ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన రిప్ కరెంట్తో వచ్చే దుర్ఘటనలను గుర్తుచేస్తోంది. రిప్ కరెంట్ అంటే.. బలమైన అలల మధ్య ఇరుకై న ప్రవాహాన్ని రిప్ కరెంట్ అంటారు. ఇవి మనిషిని ఒక్క సారిగా లోతైన ప్రదేశంలోకి లాగేస్తాయి. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో ఏర్పడిన గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా దూసుకు వస్తాయి. తీరానికి వచ్చే సరికి అవి రాకాసి అలలుగా మారిపోతాయి. అల ఒక్క సారిగా తీరాన్ని తాకినప్పుడు సము ద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహంగా ఏర్పడుతుంది. దీంతో ఆ ప్రవాహంలో ఎవరు ఉన్నా వారు కనురెప్ప కాలంలో కడలిలో కలిసిపోతారు. ఎంత గజ ఈతగాడైనా దీని నుంచి తప్పించుకోలేరు. తీరానికి వచ్చే కొద్దీ వేగం అధికమై తరంగాలు ఏర్పడతాయి. తిరిగి కెరటం వెనక్కి సముద్రంలోకి వెళ్లేటప్పుడు ఏర్పడే తీవ్రత అంతా ఇంతా కాదు. దానినే రిప్ కరెంట్ అంటారు. కరెంట్ షాక్ తగిలితే ఎంత తొందరగా ప్రాణాలు పోతాయో దానికంటే ఎక్కువగా ఇది ప్రమాదాన్ని కలిగిస్తుంది అందుకే దీనిని రిప్ కరెంట్ అంటారు. ఎక్కువగా రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు ఉన్న తీర ప్రాంతంలో ఎక్కు ప్రాంతాల్లో ఉప్పుటేరులు, కాలువలు కలిసే చోట్లు ఎన్నో ఉన్నాయి. వాటి దగ్గర ఇవి అనుకోకుండా ఏర్పడుతుంటాయి. రిప్ కరెంట్ ప్రవాహ వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది అల చీలికలో ఒడ్డుకు సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పుతో ఏర్పడుతుంది. ఇది గజ ఈతగాళ్లను, టన్నుల బరువు ఉండే వాటిని లోపలకు లాగేసేంత బలమైనవి. ఇప్పటి వరకు రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో సుమారు 370 మంది వరకు ఈ ప్రమాదానికి గురై మృతి చెందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రిప్ కరెంట్ను కనుగొనడానికి ఆంధ్రా యూనివర్సిటీ, ఇస్రో సంయుక్తంగా సముద్ర ప్రాజెక్టును నిర్వహిస్తోంది. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ ప్రత్యేక పరికరం ద్వారా అలల తరంగం ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా భవిష్యత్తులో రిప్ కరెంట్ ఎక్కడ ఏర్పడతాయి ఎలా ఏర్పడతాయి గుర్తించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆదమరపు వద్దు గతంలో ఉప్పాడలో ముగ్గురు యువకులు మృతి చెందిన ప్రాంతం రిప్ కరెంట్ ఉత్పత్తి అయ్యే ప్రాంతమే. ఎందుకంటే అక్కడ ఏలేరు కాలువ సముద్రంలో కలుస్తుంది. సముద్రం అక్కడ కొంత ఒంపు తిరిగి కూడా ఉంటుంది. అంటే అక్కడ వచ్చే కెరటాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఇటు నుంచి, అటు నుంచి ఒకే సారి కెరటాలు వచ్చి పరస్పరం ఢీ కొనడం వల్ల రిప్ కరెంట్ (స్క్వేర్ అలలు) ఏర్పడి తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. వినాయక నిమజ్జనానికి దిగిన వారు విగ్రహాన్ని నిమజ్జనం చేసేటప్పుడు అలల ఉధృతి తక్కువగానే ఉన్నా ఉప్పుటేరు ఉధృతి ఒక్కసారిగా పెరగడం, దానికి తోడు సముద్ర అలలు ఒక్క సారిగా పెరగడంతో రెండూ కలిసి రిప్ కరెంట్గా మారి ప్రాణాలను తీసేసే ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదకర ప్రదేశాలను గుర్తించి అక్కడ నిమజ్జనాలను అనుమతి లేదని పోలీసులు ప్రకటిస్తున్నారు. జిల్లాలో నిమజ్జన ప్రాంతాలివే జిల్లాలో కాకినాడ బీచ్, ఉప్పాడ సాగరతీరం, పీబీసీ, ఏలేరు, సామర్లకోట, గోదావరి కాలువల్లో నిమజ్జనాలు నిర్వహిస్తుంటారు. ఎక్కువగా కాకినాడ బీచ్, ఉప్పాడ సాగరతీరంలో వందల విగ్రహాలు నిమజ్జనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాల తొమ్మిది రోజుల అనంతరం ఈ నెల 7వ తేదీన చంద్ర గ్రహణం ఉండడంతో తొమ్మిది రోజులు పూర్తి కాగానే అన్ని విగ్రహాల నిమజ్జనాలు పూర్తి చేయాల్సి ఉంది. దీంతో వందల విగ్రహాలు ఒకే సారి తరలించే అవకాశం ఉండడంతో పోలీసులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంతంలో వినాయక విగ్రహాల నిమజ్జనాలు జరిగే ప్రదేశాన్ని పరిశీలిస్తున్న సీఐ శ్రీనివాస్ కడలి కెరటాల్లో పొంచి ఉన్న కరెంట్ అలలతో ఆటలాడితే ప్రాణాపాయమే వినాయక నిమజ్జనాల వేళ అప్రమత్తం గతంలో ముగ్గురు యువకుల మృతి ఏలేరు, పీబీసీ కాలువల్లోనూ ప్రమాదాలు ఈ ఏడాది ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్న అధికారులు గుర్తించిన ప్రమాదకర ప్రాంతాల్లో నిమజ్జనాలకు అనుమతి నిరాకరణ ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి అనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశం అని గుర్తించాం. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేధించి ఇతర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశాం. అక్కడ ఈ ఏడాది బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఉప్పుటేరులు సముద్రంలో కలిసే చోట అలలు తక్కువగా ఉన్నా క్షణాల్లో ప్రమాదకరంగా మారుతుంటాయి. అందుకే కాకినాడ శివారు లైట్హౌస్ నుంచి కొత్తపల్లి మండలం కోనపాపపేట వరకు ఉన్న ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తున్నాం. మూలపేట, సుబ్బంపేటల్లో నిమజ్జనానికి ప్రాంతాలను సిద్ధం చేసాం అక్కడే నిమజ్జనాలు చేయాలి. – జి శ్రీనివాస్, సీఐ, పిఠాపురం -
ఎరుకల అభివృద్ధికి కృషి చేయాలి
జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల పిఠాపురం: ఎరుకల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని కాకినాడ జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ కోరారు. కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ విమోచన దినోత్సవాన్ని పిఠాపురంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనులు అనుభవిస్తున్న వివిధ సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ముఖ్యంగా ఎరుకల జాతి వారు బాగా వెనకబడిన తెగల్లో ఉన్నారని, వాళ్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఎరుకుల సంక్షేమ సంఘం కార్యదర్శి భారతి మాచరయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు గాడ దుర్గ, జిల్లా ట్రెజరర్ అమలదాసు వెంకట లచ్చన్న, ముఖ్య సలహాదారు సింగం రవి, గౌరవ అధ్యక్షుడు భారతి నాగేశ్వరావు, కాకినాడ జిల్లా మీడియా కన్వీనర్ గాడా సత్తిబాబు, పిఠాపురం మండల అధ్యక్షులు అమలదాసు నాగేశ్వరావు, భారతి గంగరాజు, అమలదాసు సత్యనారాయణ, భారతి మంగతాయారు, అమలదాసు దుర్గ, భారతి దుర్గ తదితరులు పాల్గొన్నారు. -
విలక్షణానికి ప్రతీకలు మువ్వురు తల్లులు
● శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ ● సదనంలో సరస్వతీ సపర్యా మహోత్సవాలు సీటీఆర్ఐ: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు మూడు రకాల స్వభావాలకు ప్రతీకలుగా నిలుస్తారని శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ అన్నారు. ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో జరుగుతున్న సరస్వతీ సపర్యా మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రామాయణ కల్పవృక్షంలో మువ్వురు తల్లులు అయిన కౌసల్య, సుమిత్ర, కై కేయిలపై ప్రసంగించారు. వారి విలక్షణ స్వభావాలను వివరిస్తూ విశ్వనాథ అనేక విశేషణాలను వాడారని అన్నారు. కై కకు రాముడిపై అపరిమిత వాత్సల్యం ఉండేదని, రాముడికి బాల్యంలో విలువిద్య నేర్పింది కై కయేనన్నారు. తదనంతర కాలంలో రాముడి వనవాసాన్ని కోరిన కారణంగా పైకి మంథర దుర్బోధగా కనపడినా, అసలు కారణం దైవ ప్రేరణగా భావించాలని వివరించారు. నన్ను సవతి తల్లిని చేశావు.. అని రామునితో కైక అన్న మాటల్లో ఆమె క్రోధం కన్నా, బాధ ఎక్కువగా ధ్వనిస్తుందని విశదీకరించారు. విశ్వనాథ రామాయణ కల్పవృక్షం సర్వలక్ష్య సంగ్రహం, వ్యాకరణ, ఛంద ప్రయోగాల్లో ఆయన వివిధ రకాల ప్రయోగాలను చేశారన్నారు. నా భక్తి రచనలు నావిగాన.. అని చెప్పుకొన్న ధీశాలి విశ్వనాథ అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.అన్నపూర్ణ మాట్లాడుతూ, ప్రాచీన కవుల మూల గ్రంథాలను అనువదించేటప్పుడు తర్వాత తరం కవులు స్వతంత్ర ధోరణులు అవలంబించడం, మూలంలోని అంశాలను విస్తరించడం, పరిహరించడం పరిపాటి అన్నారు. కళాశాల అధ్యాపకులు సత్యశిరీష, శ్రీదేవి, శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు డాక్టర్ బులుసు అపర్ణను ఘనంగా సత్కరించారు. సోమవారం అవధాన శేఖర రాంభట్ల పార్వతీశ్వర శర్మ ప్రబంధ కవుల సరస్వతీసపర్య అనే అంశంపై ప్రసంగిస్తారు. -
భజే విఘ్నేశ్వరా..
అయినవిల్లి: గణపతి నవరాత్రుల్లో భాగంగా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారికి శనివారం లక్ష దూర్వార్చన పూజ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపారు. స్వామివారికి పంచ హారతులు ఇచ్చారు. స్వామివారిని మూషిక వాహనంపై ఉంచి వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం గ్రామోత్సవం జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఏర్పాట్లను ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని పర్యవేక్షించారు. -
తిరుచ్చి వాహనంపై ఊరేగింపు
అన్నవరం: రత్నగిరిపై ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని శనివారం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్టించి పూజల అనంతరం అర్చకులు ఊరేగింపు ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఆలయ అర్చకుడు కంచిభట్ల రామ్కుమార్, వేదపండితులు వేదుల సూర్యనారాయణ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, సంతోష్ పాల్గొన్నారు. స్వామిని దర్శించిన 25 వేల మంది భక్తులు శనివారం సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు 1,200 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం పెట్టారు. నేడు టేకు రథంపై ఊరేగింపు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను టేకు రథంపై ఆదివారం ఉదయం పది గంటలకు ఆలయప్రాకారంలో ఊరేగించనున్నారు. రూ.2,500 టిక్కెట్తో ఈ సేవలో పాల్గొనే నలుగురు భక్తులకు అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, స్వామివారి కండువా, జాకెట్టుముక్క, ప్రసాదం అందజేస్తారు. సత్యదేవుని దర్శనానికి క్యూలో నిల్చున్న భక్తులు -
శృంగార వల్లభుని ఆదాయం రూ.2.36 లక్షలు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. అర్చకుడు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామి వారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి రూ.2,36,023 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకోగా 3500 మంది భక్తులకు ప్రసాద వితరణ అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విశ్రాంతి షెడ్డుకు 3న శంకుస్థాపన అన్నవరం: స్వామివారి దేవస్థానంలో పశ్చిమ రాజగోపురం ముందు గల ఖాళీ ప్రదేశంలో విశ్రాంతి షెడ్ నిర్మాణానికి వచ్చేనెల మూడో తేదీ ఉదయం 10.52 గంటలకు ‘లారెస్’ సంస్థ యాజమాన్యం శంకుస్థాపన చేయనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం తెలిపారు. ఆ స్థలాన్ని దేవస్థానం ఈఈ రామకృష్ణ ఆధ్వర్యంలో చదును చేయించి సిద్ధం చేసినట్లు ఈఓ తెలిపారు. విశాఖపట్టణానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇక్కడ వంద అడుగుల వెడల్పు, 125 అడుగుల పొడవుతో విశ్రాంతి షెడ్డు నిర్మించనుంది. సుమారు రూ.1.5 కోట్లు వ్యయంతో 12,500 చదరపు అడుగుల స్థలంలో టెన్సిల్ షెడ్డు ( తెలుపు ప్లాస్టిక్ క్లాత్ తరహా షెడ్డు) నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. గణపతికి 108 వంటకా నివేదన తాళ్లపూడి: వినాయక చవితి ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా కొలువుదీరిన గణపతికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రక్కిలంక గ్రామంలోని కాపుల వీధిలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకునికి శనివారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలతో నివేదన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకున్నారు. -
క్రమంగా పెరుగుతూ..
● మళ్లీ గోదావరికి వరద నీరు ● నీట మునిగిన కనకాయలంక కాజ్వే ఐ.పోలవరం/ పి.గన్నవరం: వరద మళ్లీ పెరుగుతోంది.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు పెద్ద ఎత్తున దిగువకు వస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శుక్రవారం ఉదయం పెరిగిన వరద తరువాత సాయంత్రం నుంచి తగ్గుముఖం పట్టింది. తిరిగి శనివారం ఉదయం నుంచి పెరుగుతూ వస్తోంది. తెల్లవారు జామున మూడు గంటల నుంచి వరద క్రమేపీ పెరుగుతోంది. మూడు గంటలకు బ్యారేజీ నుంచి దిగువకు 7,52,579 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇది ఉదయం ఆరు గంటల సమయానికి 7,93,608 క్యూసెక్కులకు, మధ్యాహ్నం 12 గంటలకు 8,60,262 క్యూసెక్కులకు, మూడు గంటలకు 8,98,113 క్యూసెక్కులకు, రాత్రి ఎనిమిది గంటలకు 9,75,286 క్యూసెక్కులకు చేరింది. పడవలపైనే ప్రయాణం జిల్లాలోని లంక గ్రామాలపై వరద ప్రభావం పడింది. పి.గన్నవరం మండల పరిధిలో జి.పెదపూడిలంక, ఊడిమూడిలంక, బూరుగులంక, అరిగెలవారిపేటలకు ఇప్పటికీ పడవలపై రాకపోకలు సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వరద పెరగడంతో మండలాన్ని ఆనుకుని పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంక కాజ్వే నీట మునిగింది. దీంతో ఇక్కడ పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. అలాగే పెదమల్లంక, సిర్రావారిలంక, ఆనగారిలంకలకు సైతం పడవలపై వెళ్తున్నారు. మరోసారి వరద పెరగడంతో ఇక్కడ లంక రైతులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులకు ఇక్కట్లు మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతాలను తాకుతూ.. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్ట్ను ఆనుకుని వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ మండలంలో మురమళ్ల, కేశనకుర్రు పంచాయతీ పరిధిలోని పొగాకులంక, పల్లిపాలెం, ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠాణేల్లంక, గురజాపులంక, కూనాలంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు రేవు, బలుసుతిప్ప, అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెం వంటి లోతట్టు ప్రాంతాలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వరద మరింత పెరిగితే ఈ లంక గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశముంది.ప్రయాణం.. ప్రమాదం వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో జిల్లాలోని పలు రేవుల వద్ద లైఫ్ జాకెట్లు లేకుండా పడవలపై ప్రయాణాలు సాగిస్తుండడం గమనార్హం. ఐ.పోలవరం మండలం జి.మూలపొలం రేవులో ఎటువంటి జాగ్రత్తలు పాటించడం లేదు. కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఉపయోగించకుండా ప్రయాణికులను రేవు దాటిస్తున్నారు. వరదల సమయంలో రేవు ప్రయాణాలపై అధికారులు నిఘా పెట్టాల్సి ఉన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రమాదం జరిగితేకాని అధికారులు స్పందించరా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. -
ముగిసిన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు
అమలాపురం టౌన్: స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో విజేతలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. పోటీల్లో స్ట్రాంగ్ మెన్ విన్నర్గా కె.దుర్గా శివకుమార్ (కాకినాడ), రన్నర్గా కె.మోహన్ (కాకినాడ), స్ట్రాంగ్ వుమెన్ విన్నర్గా డి.అఖిలదేవి (రామచంద్రపురం), రన్నర్గా వై.ఇందిర (అమలాపురం), స్ట్రాంగ్ మాస్టర్ విన్నర్గా డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), స్ట్రాంగ్ మాస్టర్ రన్నర్గా బి.అప్పన్న (అమలాపురం) టైటిల్స్ను గెలుచుకున్నారు. అలాగే వుమెన్ విభాగంలో 66 కేజీల కేటగిరీలో ఎస్.స్పందన (రాజోలు), 74 కేజీల కేటగిరీలో పి.దీవెన (కాకినాడ), 83 కేజీలో కేటగిరీలో డి.అఖిలదేవి (రామచంద్రపురం), బాలుర సబ్ జూనియర్ విభాగంలో 53 కేజీల కేటగిరీలో పి.వీరేంద్ర (కాకినాడ), 59 కేజీల కేటగిరీలో జె.జితేంద్రదొర (అమలాపురం), 66 కేజీల కేటగిరీలో కె.సాయి మణికంఠ (కాకినాడ), 74 కేజీల కేటగిరీలో ఎంఎస్ విన్ (జగ్గంపేట), మెన్ విభాగంలో 59 కేజీల కేటగిరీలో వై.రాజు (రాజమహేంద్రవరం), 66 కేజీల కేటగిరీలో ఎం.రాహుల్ బాబు (అమలాపురం), 74 కేజీల కేటగిరీలో కె.దుర్గా సాయికుమార్ (కాకినాడ), 83 కేజీల కేటగిరీలో కె.మోహన్ (కాకినాడ), 93 కేజీల కేటగిరీలో కె.సుధీర్ (మలికిపురం), 105 కేజీల కేటగిరీలో బి.అనూష్బాబు (మురమళ్ల), మాస్టర్స్ విభాగంలో 83 కేజీల కేటగిరీలో డి.నాగేశ్వరరావు (ద్రాక్షారామ), 93 కేజీల కేటగిరీలో బి.అప్పన్న (అమలాపురం) ప్రథమ స్థానాలు సాధించారు. విజేతలకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, బీజేపీ నాయకుడు మోకా వెంకట సుబ్బారావు, మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు తదితరులు ట్రోఫీలు, నగదు బహుమతులు పంపిణీ చేశారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, నగభేరి కృష్ణమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధులు కల్వకొలను బాబు, గొలకోటి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలకు దాదాపు 200 మంది పవర్ లిఫ్టర్లు పాల్గొని బరువులెత్తి సత్తా చాటారు. -
జ్వరాలు వైరల్!
● ప్రతి ఇంటా జ్వర బాధితులే ● దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో సతమతం ● వస్తే తగ్గడానికి వారం రోజుల సమయం ● ప్రతి ఒక్కరికీ రూ.6 వేలకు పైగా ఖర్చు ● ప్లేట్లెట్లు పడిపోతే రూ.50వేల నుంచి రూ.70 వేల వ్యయం ● జ్వరాలకు వర్తించని ఆరోగ్యశ్రీ ● అప్పులు చేసి బిల్లులు కడుతున్న రోగులు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క జ్వరాల సీజన్ కాగా మరో పక్క దోమల దండయాత్రతో ప్రజలు రోగాలతో సతమతమవుతున్నారు. దీంతో ఏ ఆస్పత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతున్నాయి. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు పోరాడుతున్నారు. అయితే అధికారులు మాత్రం అరకొర నివారణ చర్యలు తీసుకుని చేతులు దులుపుకొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనేక ప్రాంతాల్లో దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పారిశుధ్య పనులు సక్రమంగా చేయకపోవడంతో దోమల కార్ఖానాలు జిల్లా వ్యాప్తంగా ఎక్కువైపోయాయి. జిల్లాలో 22 లక్షల జనాభా ఉండగా, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 62 ఆరోగ్య సచివాలయాలు, 40 సామూహిక ఆరోగ్య కేంద్రాలు, 23 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వంద మంది వైద్యులు, 1049 మంది పారా మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. దోమల నియంత్రణకు అధికారులు అరకొరగానే చర్యలు చేపడుతున్నారు. ఒకపక్క వర్షాలు కురిస్తే ఇంటి ఆవరణలోనే పూల కుండీలు, నీటి ట్యాంకులు ఇంటిపై ఉన్న ఖాళీ స్థలాలలో నీరు ఎక్కువగా నిలబడి దోమలు విజృంభిస్తున్నాయి. వీధులు, కాలనీలు, శివారు ప్రాంతాలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువుగా ఉంటోంది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో పారిశుధ్యం చాలా అధ్వానంగా తయారైంది. దీంతో జ్వరాల బాధితులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో సరిపడినన్ని నిధులు లేకపోవడంతో గ్రామ పంచాయతీలో డ్రైనేజీలు కాలువలు కూడా శుభ్రం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. బ్లీచింగ్ ముగ్గు, ఫినాయిల్ వంటి పిచికారీ చేయాలంటే డబ్బులు అవసరం కాగా పంచాయతీల ఖజానాలు దాదాపు ఖాళీ అయిపోయాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రావలసి ఉన్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీలు ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి రోజురోజుకూ దోమలు పెరిగిపోవడం వల్ల ప్రజలు రోగాలను బారిన పడుతున్నారు. కాకినాడ జిల్లాలోని ఆరోగ్య కేంద్రాలకు ప్రతి నిత్యం 30 నుంచి 40 మంది జ్వరం బాధితులు వస్తున్నారు. కరప మండలంలోని కరప, వేళంగి పీహెచ్సీలు, ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిత్యం 60 నుంచి 70 మంది జ్వరం, తదితర వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. పిఠాపురం మండలం చేబ్రోలు పీహెచ్సీలో ప్రతిరోజు 70 నుంచి 100 మందికి పైగా జ్వరం బారిన పడినవారు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. పెద్దాపురం మండలం పులిమేరు, కాండ్రకోట ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో 70 నుంచి 80 మంది ప్రతి రోజు జ్వరం బాధితులు వైద్యానికి వస్తున్నారు. ఇక కాకినాడ జీజీహెచ్కు నిత్యం 500 మందికి తక్కువ కాకుండా జ్వరం బాధితులు వస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలువు దోపిడీ జ్వరం వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే రూ.5 వేల నుంచి రూ.6 వేలు వసూలు చేస్తున్నారు. రక్త పరీక్షలు, సైలెన్ పెట్టి రూ.6 వేలకు తక్కువ కాకుండా బిల్లు చేతిలో పెడుతున్నారు. దీంతో రోగులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రోగికి కానీ డెంగీ, మలేరియా వచ్చి ప్లేట్లెట్లు గానీ పడిపోతే రూ.50 వేల నుంచి రూ.60 వేలు గుంజేస్తున్నారు. ఈ బిల్లులు చెల్లించలేక సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు వారు అప్పుల పాలవుతున్నారు. డబ్బులు కడితేనే వైద్యం జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్లినా తగ్గకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రికి వెళితే అక్కడ ప్లేట్లెట్లు పడిపోయాయని రోగులను భయపెట్టి మరీ డబ్బులు గుంజేస్తున్నారు. పోనీ దీనికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య చేయాలన్నా ఆయా ప్రైవేట్ ఆసుపత్రులలోని సిబ్బంది ఆరోగ్యశ్రీ దీనికి వర్తించదని డబ్బులు కడితేనే వైద్యం చేస్తామని ఇబ్బంది పెడుతున్నారు. రోగులు అప్పులు చేసి మరీ ఆసుపత్రులు బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. అరకొరగానే అవగాహన కార్యక్రమాలు జ్వరాల సీజన్ వచ్చినా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో రోగులు భయపడి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటికీ వెళ్లి దోమల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అటువంటివేవీ సక్రమంగా జరగడం లేదు. పట్టణ గ్రామీణ ప్రజలు ప్రజలకు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఒకపక్క మలేరియా మరో పక్క డెంగీ కేసులు నిత్యం నమోదవుతూనే ఉన్నాయి. డెంగీ రావడంతో రూ.70 వేల బిల్లు కట్టా నాకు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో పిఠాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాను. వారు రూ.80 వేల బిల్లు వేశారు. అంత కట్టలేనని చెప్పడంతో రూ.10 వేలు తగ్గించారు. విధిలేక ఆ మొత్తాన్ని చెల్లించి బయటకు రావాల్సి వచ్చింది. ఐదు రోజులు ఆసుపత్రిలో ఉన్నదానికి ఇంత పెద్ద మొత్తం డబ్బులు చెల్లించాలంటే చాలా ఇబ్బంది పడ్డాను. – మేడిశెట్టి దొరబాబు, కొండెవరం, యుకొత్తపల్లి మండలం. -
గోదావరి ఉరకలు
● ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ● అప్రమత్తమైన ఇరిగేషన్ యంత్రాంగం ధవళేశ్వరం: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉరకలెత్తుతోంది. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్దకు భారీగా నీరు చేరుతోంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 175 గేట్లను పైకి లేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా కురస్తున్న వర్షాలతో గోదావరి ఉప నదులైన మంజీర, ఇంద్రావతి, శబరి పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని కిందకు వదులుతున్నారు. ఆ ప్రభావంతో కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి శనివారం క్రమేపీ పెరిగింది. ఉదయం 10.30 అడుగులు ఉన్న నీటి మట్టం రాత్రి 8.35 గంటలకు 11.75 అడుగులకు చేరింది. దీంతో ధవళేశ్వరంలో మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు. అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో నీటి ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో ఆదివారం కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో గోదావరిలో పడవల రాకపోకలను నిషేదించారు. శనివారం రాత్రి 9 గంటలకు బ్యారేజీ వద్ద నీటిమట్టం 11.80 అడుగులకు చేరింది. 10,01,410 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాలువలకు 11,700 క్యూసెక్కులు విడిచిపెట్టారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.56, పేరూరులో 16.76, దుమ్ముగూడెంలో 12.90, కూనవరంలో 18.97, కుంటలో 10.20, పోలవరంలో 12.22, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 15.85 మీటర్లు, భద్రాచలంలో 47.70 అడుగుల నీటి మట్టాలు కొనసాగుతన్నాయి. -
బరువులెత్తారు...పతకాలు పట్టారు
● అమలాపురంలో ఉభయ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు ● 200 మంది క్రీడాకారుల హాజరు అమలాపురం టౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమలాపురం ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ ప్రాంగణంలో 4వ యునైటెడ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల పవర్ లిఫ్టింగ్ పోటీలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పోటీలకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి 200 మంది పవర్ లిఫ్టర్లు హాజరై బరువులెత్తి సత్తా చాటారు. కోనసీమ షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మెట్ల రమణబాబు పోటీలను ప్రారంభించారు. అంతకు ముందు ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లాడ శరత్బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పీఎస్ సురేష్కుమార్ను సత్కరించి క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి, కోచ్ డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో పోటీలు జరిగాయి. సబ్ జూనియర్, మాస్టర్స్ (పురుషులు, మహిళలు) విభాగాల్లో 30 కేటగిరీల్లో పోటీలను నిర్వహించారు. విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు, ఒలింపిక్ పతకాలు, చాంపియన్ షిప్ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు. బెంచ్ ప్రెస్ విధానంలో పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కు అనుబంధంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు ఉత్కంఠగా జరిగాయి. పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డి.సత్యనారాయణ, ఎంవీ సముద్రం, వి.నరేష్, డీఆర్కే నాగేశ్వరరావు, డి.గణేష్బాబు, బి.జోసఫ్, ఎస్కే వలీ సాహెబ్ వ్యవహరించారు. జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గారపాటి చంద్రశేఖర్, అమలాపురం వైస్ ఎంపీపీ అడపా వెంకట సుబ్రహ్మణ్యం, ఒలింపిక్ అసోసియేషన్ సభ్యుడు కల్వకొలను బాబు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రవణం వేణుగోపాలరావు పాల్గొన్నారు. -
రత్నగిరికి మూడు హెచ్వీఎల్ఎస్ ఫ్యాన్ల సమర్పణ
అన్నవరం: రత్నగిరి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.ఆరు లక్షల విలువైన మూడు హెచ్వీఎల్ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను శుక్రవారం అందచేశారు. వీటిలో రెండింటిని స్వామివారి వార్షిక కల్యాణమండపంలో అమర్చారు. మరో ఫ్యాన్ను షాపింగ్ కాంప్లెక్స్ ముందు గల మండపంలో ఏర్పాటు చేయనున్నారు. ఏడు మీటర్ల వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తుంటారు. ఈ ఫ్యాన్ గాలి సుమారు 20 అడుగుల వరకు వ్యాపిస్తుంది. -
పాఠశాలలో మత ప్రచారంపై ఆందోళన
● పాఠశాల పైఅంతస్తులో చర్చిని తొలగించాలని డిమాండ్ ● పోలీసుల హామీతో ఆందోళన విరమణ కపిలేశ్వరపురం: మండలంలోని కోరుమిల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మత ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో నినాదాలు చేస్తూ గోదావరి గట్టు వంతెన నుంచి గ్రామ వీధుల మీదుగా పంచాయతీ కార్యాలయం వరకూ ర్యాలీ చేశారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ పరిస్థితిని సమీక్షించారు. సమస్య మూలాలపైనా, గ్రామంలోని శాంతి భద్రతలపైనా ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజులతో చర్చించారు. ఆందోళనకు కాకినాడకు చెందిన హైందవ పరిరక్షణ సమితి నాయకులు మద్దతు పలికారు. సమితి నాయకులు సీహెచ్ గవరయ్య, కె.తులసి మాట్లాడుతూ పిల్లలకు విజ్ఞానాన్ని పంచాల్సిన పాఠశాలలో మత ప్రచారం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పాఠశాలపై అంతస్తులో చర్చి నిర్వహించడంపై పంచాయతీ, విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పాఠశాల నుంచి చర్చిని వేరు చేసే చర్యలు ప్రారంభించాలని లేని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు మాట్లాడుతూ చర్చి నిర్వహణకు ఉన్న పత్రాలతో వారం రోజుల్లో హాజరుకావాలంటూ నోటీసు జారీ చేస్తానని, ఆ లోగా సమాధానం రానిపక్షం ఉన్నతాధికారులకు సమస్యను నివేదిస్తానని హామీ ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు సంతృప్తి చెంది ఆందోళనను విరమించారు. అంగర ఎస్సై హరీష్కుమార్ బందోబస్తు నిర్వహించారు. -
అంతర్జాతీయ సమావేశాలకు నిర్కా డైరెక్టర్ మాగంటి
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): స్థానిక ఐసీఏఆర్ – జాతీయ వాణిజ్య పరిశోధన సంస్థ (నిర్కా) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ స్వీడన్ స్టాక్హోమ్లో పొగాకు ఉత్పత్తులపై జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. సెప్టెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు జరిగే ఈ అంతర్జాతీయ సమావేశాలలో ఐఎస్వో/టీసీ–126లో పాల్గొనే భారత బృందంలో ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ పర్యటన ప్రధానం పొగాకు, పొగాకు ఉత్పత్తులకు సంబంధించిన అంతర్జాతీయ ప్రామాణీకరణ ప్రక్రియలలో భారతదేశం క్రియాశీల పాత్రను బలోపేతం చేయడమే లక్ష్యంగా సాగుతోందని ఆయన తెలిపారు. పొగాకులో పరీక్షా పద్ధతులు, భద్రతా ప్రమాణాలు, నాణ్యతకు సంబంధించి కొత్త అంతర్జాతీయ ప్రమాణాల అభవృద్ధి, సవరణపై ఆయన అభిప్రాయాలను వ్యక్తపరచనున్నారు. పొగాకు ఉత్పత్తుల పరీక్షలకు సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి శీల సమీక్షలో పాల్గొని, అభివృద్ధి చెందుతున్న భారత జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కృషి చేయనున్నారు. అదే విధంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రయాణీకరణ సంస్థ సమర్పించే సాంకేతిక నివేదికలు, స్థితిగతుల పత్రాలను సమీక్షించి, భారతదేశం గ్లోబల్ ప్రమాణాల అభివృద్ధిలో మాధవ్ కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు శుక్రవారం స్వీడన్కు బయలుదేరనున్న ఆయనను నిర్కా శాస్త్రవేత్తల బృందం పుష్పగుచ్ఛంతో అభినందించింది. -
బాగానే బొక్కుతున్నారు!
తాళ్లరేవు: సముద్ర సంరక్షణిగా పేరుగాంచిన అతిపెద్ద చేప బొక్కు సొర (రింకోడాన్ టైపస్) క్రమక్రమంగా కనుమరుగవుతోంది. సుమారు 65 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చేప అత్యంత శక్తివంతమైన సాధుజీవి. సముద్ర తీరం వెంబడి అభివృద్ధి చెందుతున్న ఏడు సెక్టార్ల కారణంగా ఈ గంభీరమైన చేప అంతరించిపోతుండడం అందరినీ కలవరపెడుతోంది. దీని పరిరక్షణకు భారత ప్రభుత్వంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలలో విస్తరించి ఉన్న ఈ చేపను కాపాడడంలో ప్రజల భాగస్వామ్యం అవసరమైన నేపథ్యంలో ఏటా ఆగస్టు 30వ తేదీన బొక్కుసొర దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఎక్కువ మందమైన చర్మం కలిగిన ఈ చేప సుమారు 13 మీటర్లు (42 అడుగులు) పొడవు ఉండి, 20 నుంచి 25 మెట్రిక్ టన్నులకుపైగా బరువు పెరుగుతోంది. సముద్రంలో హానికర జలాలను తీసుకుని శుభ్రం చేయడంతో పాటు ఆరోగ్యకర వాతావరణాన్ని కలుగజేస్తుంది. దీనికి ఉన్న ప్రత్యేకమైన మొప్పల ద్వారా నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలను, జీవులను వడకట్టి తింటాయి. సముద్రంలో 1500 మీటర్ల లోతుకు వెళ్లగలిగే ఈ చేప సుమారు వెయ్యి కిలోమీటర్ల నుంచి 13 వేల కిలోమీటర్ల వరకు వలస వెళ్తుందని అధ్యయనాలు చెపుతున్నాయి. కోస్తాతీర ప్రాంతం ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండడంతో మన ప్రాంతానికి ఈ చేపలు వస్తుంటాయి. ఒక చేప 300 పిల్లలకు జన్మనిస్తుందని, వందకంటే ఎక్కువ సంవత్సరాలు జీవిస్తుందని అంచనా. ఈ చేపల వల్ల మానవాళికి ఎటువంటి హాని ఉండకపోవడం విశేషం. బొక్కుసొర వాటి రెక్కలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత విలువైనవి కావడంతో వీటి వ్యాపారం ఎక్కువగా సాగుతుంది. మత్స్యకారులకు సరైన అవగాహన లేక వీటిని పట్టుకోవడం వల్ల వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా తగ్గిపోతోంది. అంతే కాకుండా తీరం వెంబడి విస్తరిస్తున్న ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్, టూరిజం, పోర్ట్ అండ్ షిప్పింగ్, ఉప్పు మడులు, ఫెర్టిలైజర్స్, ఆక్వా కల్చర్, మత్స్య పరిశ్రమల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో 1978లో వైల్డ్ లైఫ్ సాంక్చురీలను ఏర్పాటు చేసి వన్యప్రాణులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.సంరక్షణకు చర్యలు చేపడుతున్నాంసముద్ర జలాలను శుభ్రపరచడంలో కీలక పాత్ర పోషించే బొక్కు సొరల సంరక్షణకు అన్ని చర్యలూ చేపడుతున్నాం. ప్రధానంగా ప్రపంచ బొక్కు సొర దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు బోటు యజమానులకు విద్యార్థిని, విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. ఈ మేరకు శనివారం ఉదయం 10 గంటలకు కాకినాడ ఎస్ఐఎఫ్టి (స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ)లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాం. అలాగే వారోత్సవాలు నిర్వహించి మత్స్యకార గ్రామాలతో పాటు ప్రధాన మార్కెట్ల వద్ద జాలర్లకు ప్రజలకు ఈ చేపపై అవగాహన కల్పించాం. ఈ చేప పట్ల మత్స్యకారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి వాటిని వేటాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ ఈ చేపలు వలలో పడినట్లయితే వలలను ధ్వంసం చేసి సముద్రంలో వదిలి పెట్టేలా అవగాహన కల్పిస్తున్నాం. ధ్వంసమైన వలలకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం కూడా అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపకరించే బొక్కు సొరలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.– ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజర్,కోరింగ అభయారణ్యంవాటిని వేటాడితే ఏడేళ్ల జైలుబొక్కుసొర సంరక్షణలో భాగంగా భారీ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారతదేశంలో బొక్కుసొర చేపలను పెద్ద పులలతో సమానంగా రక్షిస్తున్నారు. అక్రమంగా బొక్కుసొరను చంపినా, వాటి శరీర భాగాలను వ్యాపారం చేసినా 1972 వన్య సంరక్షణ చట్టం కింద ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తున్నారు.చేపను కాపాడుదాం ఇలా...సముద్రంలో ఉన్న ఈ గంభీరమైన చేపను సంరక్షించేందుకు అటవీశాఖ వన్యప్రాణి విభాగం పలు సూచనలు చేస్తోంది. చేపల వేటకు వెళ్లినపుడు మత్స్యకారులు సాధు స్వభావం గల బొక్కుసొరను పట్టడం లేదా వాటికి హానికలిగించడం చేయరాదని అవగాహన కలిగిస్తున్నారు. తూర్పుతీరం వెంబడి బొక్కుసొర తరచుగా వచ్చే ప్రదేశాలను మత్స్యకారులు, రక్షణాధికారులు అటవీశాఖ వారికి తెలియజేసి సంరక్షించాలని కోరుతున్నారు.గ్రామాల్లో అవగాహన సదస్సులుపర్యావరణ పరిరక్షణకు, జీవ వైవిధ్యానికి ఎంతగానో సహకరించే అతిపెద్ద చేప మనుగడ కోసం అటవీశాఖ అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది. ప్రధానంగా మత్స్యకార గ్రామాలతో పాటు, జాలర్లు అధికంగా ఉండే ప్రాంతాలు, మార్కెట్ల వద్ద ప్రజలకు అటవీ సిబ్బంది చేప నమూనాలతో పాటు పోస్టర్లతో అవగాహన కల్పిస్తున్నారు. -
దయనీయ బాల్యంపై వాత్సల్యం
● మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకంతో ఆర్థిక సాయం ● బాలల భవిత, భద్రత, ఆరోగ్యం కోసం ● అనాథలు, దీన బాలలు అర్హులు ● కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ ● దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ● అవగాహన లోపంతో దరఖాస్తు చేసుకోని వైనం కాకినాడ క్రైం: దయనీయ బాల్యంపై వాత్సల్యం కురిసింది. మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం దయనీయ స్థితిలో ఉన్న నిస్సహాయ బాలలకు చేయూతనిస్తోంది. వారిని బాధ్యతగా చూసుకుంటున్నవారికి తన వంతు సాయమందిస్తోంది. జిల్లాలో ప్రతి ఏటా వందలాది మంది బాలలు ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవడానికి అవకాశం ఉన్నా, అవగాహన లేక పథక ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు. ఏంటీ పథకం... మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో అనుబంధ జిల్లా బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అర్హులైన బాలలకు ఈ పథక ప్రయోజనాలను అందిస్తోంది. బాలల భవిత, భద్రత, ఆరోగ్యంతో పాటు కుటుంబ అనుబంధాలన్నీ ఆఽస్వాదించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించి అమలు చేస్తున్నారు. తమ వారికి దూరం చేయకుండా అక్కడే ఉంచి సాయం అందిస్తున్నారు. బాలల పోషణ చూస్తున్న సహాయకులు, సంరక్షకులకు సాయమందిస్తూ బాలల ఉన్నతికి తోడ్పాటునివ్వడమే ఈ పథక ఉద్దేశం. కలెక్టర్ చైర్పర్సన్గా కమిటీ అర్హులైన బాలల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఉంది. ఈ కమిటీని స్పాన్సర్షిప్ అండ్ ఫోస్టర్ కేర్ అప్రూవల్ కమిటీ (ఎస్ఎఫ్సీఏ) అంటారు. కలెక్టర్ చైర్పర్సన్గా వ్యవహరించే ఈ కమిటీలో ఎక్స్ అఫీషియో మెంబర్గా మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ, మెంబర్లుగా సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) మెంబర్ లేదా చైర్పర్సన్, బాలల సంరక్షణ కోసం పనిచేసే ఎన్జీవో ప్రతినిధి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి(డీసీపీవో), జిల్లా బాలల పరిరక్షణాధికారి(పీవో ఎన్ఐసీ), శిశుగృహ మేనేజర్ మెంబర్లుగా ఉంటారు. అర్హులైన బాలల్ని ఎంపిక చేయడంలో వీరిదే తుది నిర్ణయం. అర్హులెవరు తొలి ప్రాధాన్యత తల్లి, తండ్రిని కోల్పోయిన పూర్తి స్థాయి అనాథలకు ఇస్తారు. కోవిడ్ వేళ తల్లిదండ్రులు ఇద్దర్నీ కోల్పోయిన పిల్లలు, హెచ్ఐవీ బారిన పడిన బాలలు, తల్లిదండ్రులకు హెచ్ఐవీ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న పిల్లలు, పోక్సో బాధిత బాలలు, పాక్షిక అనాథలు, రక్షణ, సంరక్షణ అవసరం ఉన్న పిల్లలు స్పాన్సర్ షిప్ పథక ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు. కేవలం మైనర్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి నెలా రూ.4 వేలు స్పాన్సర్ షిప్ పథకం ద్వారా అర్హులైన పిల్లలకు ప్రతి నెల రూ.4 వేల చొప్పున పిల్లల ఖాతాలు లేదా వారి సంరక్షకులతో ఉమ్మడిగా ఉన్న జాయింట్ ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బు జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని వారి సంరక్షకులు... పిల్లల చదువు, ఆరోగ్యం అవసరాలకు, పిల్లల రోజు వారీ అవసరాల నిర్వహణకు తప్ప మరే రకంగానూ వెచ్చించకూడదు. అంగన్వాడీ వర్కర్లు, గ్రామ మహిళా పోలీసుల ద్వారా ఇటువంటి పిల్లల్ని గుర్తిస్తారు. బాలల వాస్తవ స్థితిని స్వయంగా ఇంటికి వెళ్లి నిర్దారిస్తారు. సంరక్షకులు లేదా తల్లి లేదా తండ్రి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ దరఖాస్తులను అంగన్వాడీ సూపర్వైజర్లు సీడీపీవోలకు అందిస్తారు. వీటిని నిర్ధారించి సీడీపీవోలు డీసీపీయూ విభాగానికి పంపిస్తారు. ఈ యావత్ ప్రక్రియ ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడం అంతా ఆఫ్లైన్ విధానంలోనే. కావలసిన ధ్రువీకరణలు బాలుడు లేదా బాలిక జనన ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, గ్రామాల్లో నివసిస్తే ఆదాయం ఏడాదికి రూ.72 వేలకు మించకూడదు. అర్బన్ అయితే రూ.96 వేల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. బాలుడు లేదా బాలిక ఆధార్ కార్డు, తల్లిదండ్రులు ఇద్దరూ లేదా వారిలో ఒక్కరు మరణించినట్లయితే సంబంధిత మరణ ధ్రువీకరణ పత్రాలు, బాలలు లేదా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే ఆ రిపోర్టులు, పోక్సో బాధితులు అయితే కేసు పత్రాలు, బాలుడు లేదా సంరక్షకులతో కూడిన జాయింట్ అకౌంట్ వివరాలు, సంరక్షకులు మాత్రమే ఉంటే వారి ఆధార్ కార్డు, వారి ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి.కాకినాడ జిల్లాలో గడచిన మూడేళ్లలో మొత్తం 1,626 మంది బాలలకు మిషన్ వాత్సల్య స్పాన్సర్ షిప్ పథకం ద్వారా ప్రయోజనం అందింది. 2022–23 ఏడాదిలో 683 మంది, 2023–24లో 440 మంది, 2024–25 లో 503 మంది దీన బాలలకు నెలకు రూ.4 వేలు చొప్పున సహకారం అందింది.18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ పథకం జిల్లాలో డీసీపీ యూనిట్ పరిధిలో డీసీపీవో వెంకట్ పర్యవేక్షణలో పీవో ఎన్ఐసీ కె.విజయ ఆధ్వర్యంలో అమలవుతోంది. బాలలు ఏ వయసులో దరఖాస్తు చేసుకున్నా వారికి 18 ఏళ్లు నిండే వరకు స్పాన్సర్ షిప్ ప్రయోజనం అందుతుంది. బాలలు కచ్చితంగా చదువుతుండాలి. హాస్టళ్లలో ఉంటే వర్తించదు. సింగిల్ పేరెంట్, అనాథ బాలలు, వ్యాధిగ్రస్త బాలలు, వ్యాధి ప్రభావిత పిల్లల్ని ఎవరినైనా చేరదీస్తే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు స్థానిక అంగన్వాడీ కార్యకర్తను సంప్రదించాలి. కుటుంబ జీవితానికి పిల్లల్ని దూరం చేయకుండా వారి భవితకు భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యం. – చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్ -
గోదావరి పరవళ్లు
ధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. శుక్రవారం మధ్యాహ్నం 10.30 అడుగులకు నీటి మట్టం చేరింది. బ్యారేజ్ నుంచి 7,88,938 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. అనంతరం స్వల్పంగా తగ్గి రాత్రి 10 అడుగులకు చేరింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి ముందుగా ప్రకటించిన విధంగా నీటిని దిగువకు విడుదల చేయకపోవడంతో కాటన్ బ్యారేజీ వద్ద ప్రమాద స్థాయికి నీటి మట్టం చేరలేదు. అయితే శుక్రవారం రాత్రి ఎగువ ప్రాంతాల్లో నీటి మట్టాలు క్రమేపి పెరుగుతుండటంతో శనివారం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 6,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,500, మధ్య డెల్టాకు 700, పశ్చిమ డెల్టాకు 2,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 12.33 మీటర్లు, పేరూరులో 16.65 మీటర్లు, దుమ్ముగూడెంలో 11.63 మీటర్లు, భద్రాచలంలో 42.90 అడుగులు, కూనవరంలో 17.01 మీటర్లు, కుంటలో 9.85 మీటర్లు, పోలవరంలో 11.31 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.40 మీటర్లు నీటి మట్టాలు కొనసాగుతున్నాయి.కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో జీఎన్ఎం సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న కాపీయింగ్ ఆరోపణలపై శుక్రవారం విచారణ జరిగింది. డీఎంఈ డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశి సహా ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమాసుందరి ఆధ్వర్యంలో ఆర్ఎంసీ డైనింగ్ ప్రాంగణంలో విచారణ జరిగింది. జీఎన్ఎం సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ చోటు చేసుకుందా, చేసుకుంటే కారణాలేమిటి, అందుకు తగ్గ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారించారు. 29 మంది ఇన్విజిలేటర్లతో పాటు జీఎన్ఎం నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, సంబంధిత సీటు గుమస్తా, సీనియర్ అసిస్టెంట్ ఏసుబాబును విచారించారు. విచారణ అనంతరం నివేదికను డీఎంఈకి పంపారు.పొగాకు నారుమడికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి– బోర్డు అధికారి హేమస్మితదేవరపల్లి: పొగాకు నారుమడులు కట్టే ముందు రైతులు తప్పనిసరిగా బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి సీహెచ్ హేమస్మిత రైతులకు సూచించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు పొగాకు వేలం కేంద్రాల పరిధిలో కట్టిన పొగాకు నారుమడులను పరిశీలించి, రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఈ ఏడాది పొగాకు బోర్డు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బోర్డు క్షేత్రస్థాయి అధికారి కీర్తికుమార్ ఆధ్వర్యంలో బృందం పనిచేస్తుందన్నారు. నారుమడులను పరిశీలించి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తనిఖీ చేస్తారని ఆమె చెప్పారు. బృందం శుక్రవారం దేవరపల్లి వేలం కేంద్రం పరిధిలోని పల్లంట్లలో యలమాటి సుధాకర్ పొగాకు నర్సరీలను తనిఖీ చేసినట్టు ఆమె చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా నారుమడులు కడితే చర్యలు తీసుకొంటామన్నారు. రిజిస్ట్రేషన్ గల నారుమడుల్లోనే రైతులు నారు కొనుగోలు చేయాలని, నారు కొనుగోలు చేసిన నారుమడి రైతు ఇచ్చిన రశీదును నాట్లు వేసే సమయంలో మొక్కఫారంతో పాటు జత చేసి వేలం కేంద్రంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ లేని నారుమడుల నుంచి నారు కొనుగోలు చేస్తే పొగాకు బ్యారన్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని తెలిపారు. 2025–26 పంట కాలానికి రాష్ట్రంలో 142 మిలియన్ల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందన్నారు.వేలం కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు 96 మంది రైతులు నారుమడులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిపారు. వీరంతా నారు వ్యాపారస్తులేనని చెప్పారు. -
ఆటోవాలా లబోదిబో
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రోజంతా కష్టపడి ఆటో నడుపుతూ పొట్టపోసుకుంటోన్న వేలాది కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డున పడేశారు. ఆటో నడిస్తేనే జీవన చక్రం తిరిగే కుటుంబాలు నేడు దిక్కులు చూస్తున్నాయి. ప్రయాణికులు రాక, కిరాయిలు లేక రోజు గడవక ఆటోవాలాలు నానా పాట్లు పడుతున్నారు. పూట గడవడమే గగనమైపోతోందని లబోదిబోమంటున్నారు. ఒకప్పుడు ఆడుతూ, పాడుతూ సాగిపోయిన కుటుంబాలు కాస్తా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రీ బస్సు పథకంతో అష్టకష్టాల పాలవుతున్నాయి. ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా 25వేల మంది ఆటో కార్మికుల కుటుంబాలకు దిక్కుమొక్కూ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి తమ నోటికాడ కూడు లాగేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో రోడ్డున పడ్డ ఆటోడ్రైవర్లు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. నిమ్మకు నీరెత్తినట్టుగా... అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి ఇప్పుడు కిరాయిలు లేక నెలవారీ ఈఎంఐలు చెల్లించలేక ఆటో కార్మికులు సతమతమవుతున్నారు. ఆర్టీసీలో ప్రవేశపెట్టిన మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని గడచిన ఆరేడు నెలలుగా మొత్తుకుంటున్నా ప్రభుత్వానికి కనీసం కనికరం లేదంటున్నారు. రోజుకు 10 నుంచి 15 ట్రిప్పులు వేస్తూ ఈఎంఐ చెల్లించేయగా రూ.1,000 రూ.1,200 ఇంటికి తీసుకువెళ్లే ఆటో కార్మికులకు ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి రూ.అయిదారు వందలు కూడా చేతికి రావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఉచిత బస్సుతో జీవనోపాధి కోల్పోతామని తెలిసినా కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ఆటో యూనియన్లు తప్పుపడుతున్నాయి. ఎన్నికల వేళ కూటమి నేతలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన రోజు నుంచి తమకు జరుగుతోన్న అన్యాయంపై వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోరుబాట ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించకపోతుందా అనే ఆశతో జిల్లాలోని జగ్గంపేట, గోకవరం, పెద్దాపురం, కాకినాడ తదితర ప్రాంతాల్లో ఆటో కార్మికులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా శుక్రవారం పెద్దాపురం పట్టణంలో ఆటో కార్మికులు దర్గా సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా చంద్రబాబు ఇస్తామన్న రూ.15,000 ఆర్థికసాయం అందించి భభరోసా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అక్కున చేర్చుకున్న జగన్ సర్కార్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టి వారి ఉపాధికి భరోసాగా నిలిచింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10 వేలు వాహన మిత్ర పథకం ద్వారా ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ ఈ పథకం ద్వారా క్రమం తప్పకుండా సాయం అందించి ఆటో కార్మికులను ఆదుకుంది. వారి కుటుంబాల్లో చిరునవ్వులు చిందించేలా తోడ్పాటు అందించింది. ఏకపక్షంగా మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఆటో కార్మికుల ఉపాధికి గండి దిక్కుతోచని స్థితిలో 23 వేల కుటుంబాలు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ ఆందోళన రూ.15 వేల ఊసెత్తని సర్కారు కనీస కనికరం చూపని వైనం ఆ కుటుంబాల జీవనం ఎలా? కాకినాడ జిల్లాలో సుమారు 20 వేల మంది ఆటోలు నడుస్తున్నాయి. తగిన విద్యార్హత ఉన్నా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లేక విద్యావంతులు కూడా ఫైనాన్స్పై ఆటోలు తీసుకుని నడుపుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. తగిన స్థోమత లేకపోయినా ఫైనాన్స్లో ఆటో తీసుకొని నెలనెలా ఈంఐలు చెల్లిస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంతో ఈంఐలు చెల్లించడమే కష్టమైపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలు ఆటోలు ఎక్కడం లేదు. జిల్లాలోని కాకినాడ నగరంతో పాటు తుని, పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట పట్టణాలతో పాటు జగ్గంపేట, గోకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, కరప, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, తొండంగి, కోటనందూరు తదితర మండల కేంద్రాలల్లో సైతం ఆటోలే జీవనాధారంగా వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలన్నీ ఫ్రీ బస్సు పథకంతో ఇప్పుడు ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అప్పులు తీర్చలేకపోతున్నాం మహిళలకు ఉచిత బస్సు పథకం మా పొట్టకొడుతోంది. ఈ విషయంలో చాలా ఆందోళనగా ఉన్నాం. ఆటోలు ఎక్కే ప్రయాణికుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. ట్రిప్పులు లేక ఆదాయం లేక కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరి ఏదైనా ఆదాయ మార్గాన్ని చూపించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. – తుమ్మల గంగాధర్, ఆటో ఓనర్ కం డ్రైవర్ ఒక ట్రిప్పు వేయడమే గగనమైపోతోంది నా పేరు ఆళ్ల గంగాధర్. నేను ఆటో డ్రైవర్ని. తుని–కోటనందూరు మధ్య ఆటో నడుపుతాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేసినప్పటి నుంచి ఆటోలకు డిమాండ్ తగ్గిపోయింది. గతంలో రోజూ మూడు ట్రిప్పులు వేసి వెయ్యి రూపాయల వరకూ సంపాదించే వాడిని. ఇప్పుడు రోజూ ఒక ట్రిప్పు వేయడమే కష్టంగా మారింది. రోజూ రూ.500 కూడా సంపాదించలేకపోతున్నాను. ఆటోకు నెలవారీ ఈంఐలు కట్టడం, కుటుంబం గడవడం కష్టంగా మారింది. ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. – ఆళ్ల గంగాధర్, ఆటోడ్రైవర్, కోటనందూరు ఆదాయం పడిపోయింది నా పేరు సుబ్రహ్మణ్యం. మాది పెద్దాపురం మండలం తిరుపతి గ్రామం. నేను ఐదేళ్లుగా ఆటో ఆధారంగా బతుకుతున్నాను. నాకు, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను గతం వరకు ప్రతి రోజు పిఠాపురం– దివిలి, సామర్లకోట–దివిలి మధ్య 10 ట్రిప్ లు తిరిగితే రూ.1,500 వచ్చేవి. రూ.500 ఆయిల్కి పోగా రూ.1,000 వస్తే నెలకు రూ.10వేలు ఆటో వాయిదా చెల్లించి మిగిలిన డబ్బులతో జీవనం సాగించేవాళ్లం. ప్రస్తుత ప్రభుత్వం ఫ్రీ బస్సు పెట్టాక కనీసం ఐదు ట్రిప్లు కూడా వెయ్యలేని పరిస్థితి. మా బతుకులు అప్పుల పాలై వడ్డీలు చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం దృష్టి సారించి ఆదుకోవాలి. – సుబ్రహ్మణ్యం, తిరుపతి, పెద్దాపురం -
యూరియా కోసం పడిగాపులు
గండేపల్లి: కొంతకాలం నుంచి యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు యూరియా వచ్చిందనే తెలిసిన తక్షణమే రైతులు పరుగులు తీస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో యూరియా దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మండలంలోని మల్లేపల్లి సొసైటీలో యూరియా ఉందని సమాచారం తెలుసుకున్న రైతులు శుక్రవారం సొసైటీ వద్ద బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసారు. కొందరు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందకపోవడంతో సిబ్బంది ఇచ్చిన ఒక్క బస్తాను తీసుకుపోయారు. మల్లేపల్లి, కె గోపాలపురం గ్రామాల రైతులు ఈ సొసైటీ నుంచే ఎరువులు తీసుకెళతారు. అయితే సొసైటీలో 225 యూరియా బస్తాలు స్టాక్ ఉన్నప్పటికి 113 మంది రైతులకు మాత్రమే సిబ్బంది అందజేశారు. ఆధార్, పాస్బుక్ జిరాక్స్ తెచ్చుకున్న రైతులకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. ఒక దశలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కె గోపాలపురం రైతు కర్రి రామకృష్ణ పొలం జగ్గంపేట మండలంలో మల్లిశాలలో ఉండటంతో శుక్రవారం మల్లేపల్లి సొసైటీకి యూరియా కోసం వచ్చాడు. అయితే అతనికి యూరియా ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పడంతో రైతు వాపోయాడు. మల్లేపల్లి సొసైటీలోనే గతంలోను ఎరువులు తీసుకువెళ్లానని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా పంపిణీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ సిబ్బంది తమకు కావాల్సినవాళ్లకే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సొసైటీలో 225 బస్తాల యూరియా స్టాక్ను కేవలం 113 మంది రైతులకు పంచయేడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కెనరా బ్యాంకు కార్యకలాపాల అడ్డగింపు
– గోల్డ్లోన్ బాధితుల ధర్నా తుని రూరల్: తాకట్టు పెట్టిన తమ బంగారు ఆభరణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గోల్డ్లోన్ బాధితులు తేటగుంట కెనరా బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. శుక్రవారం బాధిత మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో బ్యాంకు గేటు వద్ద షామియానా వేసి ధర్నా నిర్వహించి, ఆందోళన చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ దశాబ్దంగా బ్యాంకులో ఆభరణాలు తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నామని, తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను జనవరి నెలలో విడిపించుకునేందుకు రాగా నగలు మాయమయ్యాయన్నారు. దీనిపై నిలదీస్తే ఆభరణాలు తారుమారయ్యాయని, కొన్ని నగలు గోల్మాల్ అయినట్టు బ్యాంకు అధికారులు పేర్కొన్నట్టు బాధితులు తెలిపారు. ఆ తర్వాత అప్రైజర్ మోసం చేశాడని, మేనేజరుతో సహ మరో ఇద్దరిని ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారన్నారు. రుణగ్రస్తులందరికీ బంగారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇస్తానన్న ఆభరణాలు ఇవ్వకపోవడంతో ఫిబ్రవరి నెలలో ఆందోళన వ్యక్తం చేయగా నెలరోజుల్లో నగలు లేదా నగదు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. అప్పటి నుంచి తిరుగుతున్నా తమ ఆభరణాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నగలు ఇవ్వకుండానే గోల్డ్లోన్దారులతో డబ్బు కట్టించుకున్నారు. దీంతో నగలతో పాటు నగదు నష్టపోయామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి బాధితులు బ్యాంకు వద్దే ధర్నా చేయడంతో బ్యాంక్ తలుపులు తెరవలేదు. ఉన్నత అధికారులకు గోల్డ్లోన్ బాధితుల ఆందోళన విషయాన్ని తెలియజేసినట్టు సిబ్బంది పేర్కొన్నారు. -
రైలు పట్టాల మీద కొడుకు.. పట్టాల కింద తండ్రి మృతదేహం
సాక్షి,కాకినాడ: తునిలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవ పడి..ట్రైన్ ఎక్కేందుకు వెళ్తున్న తండ్రీ కొడుకును మరో రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. పాయకరావుపేటకు చెందిన అనీల్ తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భార్యపై అలిగి తన స్వస్థలమైన గుంటూరు వెళ్లేందుకు కుమారుడితో కలిసి తుని రైల్వేస్టేషన్కు బయల్దేరాడు.పట్టాలపై నుంచి స్టేషన్కు వచ్చే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రైన్ వారిద్దరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో కుమారుడి మృతదేహాన్ని పాయకరావుపేట-తునికి మధ్యలో ఉన్న తాండవ వంతెనపైన..తండ్రి మృతదేహాన్ని తాండవ నదిలో తుని రైల్వే పోలీసులు గుర్తించారు. కుమారుడిపేరు గుణశేఖర్. మరోవైపు,భర్త,కొడుకు ఆచూకీ లభ్యం కాకపోవడం అనిల్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కంప్లయింట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో తుని రైల్వే పోలీసులు,పాయకరావు పేట పోలీసులు సంయుక్తంగా తాండవ వంతెనపై జరిగిన ప్రమాదంలో తండ్రి అనీల్, కుమారుడు గుణ శేఖర్ల మృతదేహాలను గుర్తించారు. -
నేడు జాబ్మేళా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లా ఉపాధి కార్యాలయంలో శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్, న్యూలెర్న్ ఎడ్యుటెక్, అపోలో ఫార్మశీ సంస్థలు 133 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, ఫార్మశీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, వివరాలకు 86398 46568 నంబరులో సంప్రదించవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో ముగ్గురికి చోటు బోట్క్లబ్ (కాకినాడి సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో కాకినాడ జిల్లాకు చెందిన ముగ్గురికి చోటు కల్పించారు. విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉయ్యూరి వీర ప్రసాద్ (నాని), ముమ్మిడి శ్రీనివాస్ను, రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధిగా గుళ్ల ఏడుకొండలును నియమించారు. పారదర్శకంగా ధ్రువపత్రాల పరిశీలన పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ శాఖ పరిశీలించగా మిగిలిన విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారన్నారు. ఈ పరిశీలనంతా అభ్యర్థులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఈ కేంద్రంలో 1,351 మంది సర్టిఫికెట్లు పరిశీలించాల్సి ఉండగా తొలి రోజు గురువారం 1,029 మంది తమ సర్టిపికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. వారిలో గురువారం రాత్రి 10 గంటలకు 750 పైగా పూర్తయ్యాయి. మిగిలినవి పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారి సర్టిఫికెట్లు శుక్రవారం పరిశీలించనున్నారు. ఆయన వెంట డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు, ఎంఈఓ 2 శివప్రసాద్, మల్లం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు గాజుల మురళి భాస్కర్ గొల్లప్రోలు ఎస్సై నౌడు రామకృష్ణ తదితరులున్నారు. నేడు ఐటీఐ అడ్మిషన్లకు కౌన్సెలింగ్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ అడ్మిషన్ల కన్వీనర్ ఎంవీ వేణుగోపాల్వర్మ గురువారం తెలిపారు. అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం 8 గంటలకు విద్యార్హతల సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు. ప్రైవేట్ ఐటీఐలకు దరఖాస్తు చేసుకున్నవారు శనివారం హాజరుకావాలని, వివరాలకు 0884–2348182 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. -
క్రీడాకాశంలో తూరుపు మెరుపులు
కపిలేశ్వరపురం: ఆటలు మానసిక, శారీరక ఉల్లాసాన్నే కాకుండా దేశ కీర్తి ప్రపంచ వ్యాప్తం చేస్తాయి. సాధించిన ప్రగతి పది కాలాల పాటు దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేలా చేస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రీడా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందుతోంది. క్షేత్ర స్థాయిలో పాఠశాల స్థాయి నుంచే ప్రభుత్వాలు క్రీడలకు సరైన సదుపాయాలు, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. నేడు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జాతీయ క్రీడా దినోత్సవం నేపథ్యమిదీ... ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో 1905లో జన్మించిన భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జన్మదినం ఆగస్టు 29వ తేదీని జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను శ్రీమేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న పురస్కారంశ్రీగా నేటి మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదిలో అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ఆ పురస్కారాన్ని అందుకోవడం ఉమ్మడి ‘తూర్పు’ జిల్లాకు గర్వకారణం. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో క్రీడలకు మహర్దశ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023–28 క్రీడా పాలసీ ద్వారా ఆడుదాం ఆంధ్రా క్రీడల సంబరాన్ని నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల సచివాలయాల పరిధిలో మూడు లక్షల మ్యాచ్లను నిర్వహించింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేనంతగా విజేతలకు నగదు బహుమతులను అందజేసింది. 2023 సెప్టెంబర్ 1 నుంచి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో 9 క్రీడా అంశాలపై పోటీలు నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో ప్రగతి ఇదీ.. ● ఈ ఏడాది మార్చిలో గుజరాత్ సూరత్లో నిర్వహించిన అంతర్జాతీయ వీల్ చైర్ క్రికెట్ టీ–10 మానస్ కప్ టోర్నీలో ఏపీ జట్టు ప్రతిభ కనబరచగా, 15 మంది జట్టు సభ్యుల్లో ఎనిమిది మంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారే. ● ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి 8 వరకూ రాజస్తాన్ అల్వార్లో నిర్వహించిన 44వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2024 పోటీల్లో అమలాపురానికి చెందిన రెడ్డి నరేంద్రకుమార్, జి.గంగరాజు రన్నింగ్లో అంతర్జాతీయ అథ్లెటిక్స్కు ఎంపికయ్యారు. ● అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం రామచంద్రపురానికి చెందిన గిరిజన క్రీడాకారిణి కుంజా రజిత మేలో ఆసియా అథ్లెటిక్ చాంపియన్షిప్ పరుగు పోటీలో స్వర్ణం సాధించింది. ● ఈ ఏడాది జనవరి 6 నుంచి 9 వరకూ సింగపూర్లో నిర్వహించిన ఏషియన్ యోగా పోటీల్లో దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన ఇమ్మణి అర్మిత భవానీ చౌదరి ప్రతిభ కనబర్చింది. ● ఈ ఏడాది జూలైలో అమలాపురం మండలం సవరప్పాలేనికి చెందిన సత్తి అక్షయ కర్ణాటక ఒపెన్ చెస్ చాంపియన్షిప్ గెలుచుకుని జాతీయ స్థాయికి ఎంపికై ంది. ● ఈ నెల 1 నుంచి 12 రోజుల పాటు కాకినాడ డీఎస్ఏ మైదానంలో 15వ జాతీయ జూనియర్ మహిళా హాకీ చాంపియన్షిప్–2025 నిర్వహించారు. 2026–27 వరల్డ్ కప్ జట్టు ఎంపికకు 30 మందిని ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 26 వరకూ తాడేపల్లిగూడెంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. ● ఈ ఏడాది జనవరి 14 నుంచి 17 వరకూ రామచంద్రపురంలో నిర్వహించిన 14వ ఆలిండియా బాస్కెట్బాల్ టోర్నీ నిర్వహించారు. ● 2024 డిసెంబర్ 28న వైజాగ్ ఆర్కే బీచ్లో ప్రారంభమై సముద్రంలో 150 కిలోమీటర్లు ఈదుతూ స్విమ్మర్ గోలి శ్యామల 2025 జనవరి 3 కాకినాడ బీచ్కు చేరుకుని అరుదైన రికార్డును సాధించారు. ● ఈ ఏడాది జూలైలో రాజోలుకు చెందిన బండారు అయ్యప్ప, గుడాల దుర్గా శ్రీనివాస్ సురేష్కుమార్లు ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)కు ఎంపికయ్యారు. ● ఈ ఏడాది మార్చి 23న చైన్నెలో కాకినాడకు చెందిన ఫాస్ట్ బౌలర్ పెన్మత్స వెంకట సత్యనారాయణరాజు ముంబయి ఇండియన్స్ జట్టు తరఫున తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ● అమలాపురం విక్టరీ అకాడమీకి చెందిన కొండా శివేంద్ర, పితాని రాఘవేంద్ర, సాధనాల శ్రీసంతోష్ చెస్లో అంతర్జాతీయ రేటింగ్ సాధించారు. ● ఈ ఏడాది జనవరి 7 నుంచి 9 వరకూ మండల స్థాయిలోనూ 22 నుంచి 24 వరకూ అమలాపురంలో జిల్లా స్థాయిలోనూ కోనసీమ క్రీడోత్సవం పేరిట విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో శివరాత్రి జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించింది. న్యాయ నిర్ణేతలుగా.. ఈ ఏడాది జూలైలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అథ్లెట్ కమిషన్ సభ్యులుగా రాజమహేంద్రవారానికి చెందిన జాతీయ బీచ్ వాలీబాల్ క్రీడాకారిణి యండమూరి లలితాదేవి ఎన్నికయ్యారు. ● ఈ ఏడాది ఫిబ్రవరి 9–13 మధ్య ఉత్తరాఖండ్లోని హల్ద్వానిలో నిర్వహించిన జాతీయ స్థాయి ఫెన్సింగ్ క్రీడలకు న్యాయ నిర్ణేతగా కాకినాడ జిల్లాకు చెందిన నాగం సతీష్ నియమితులయ్యారు. ● ఈ ఏడాది జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14వరకూ నిర్వహించిన నేషనల్ గేమ్స్లో బాల్ బ్యాడ్మింటన్ అంపైర్లుగా అమలాపురం మండలానికి చెందిన అడపా శ్రీనివాస్, గొల్లకోటి శ్రీనివాస్ నియమితులయ్యారు. దిగ్భ్రాంతి కలిగించిన ప్రముఖుల మృతి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మృతి చెందారు. సాత్విక్ ఫిబ్రవరి 21న దిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకునే కార్యక్రమానికి బయలుదేరిన కొద్ది సేపటికే ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మే 1న దిల్లీలో కేంద్ర మంత్రి మాండవీయ చేతులు మీదుగా ఆ పురస్కారాన్ని అందుకోగా ఆ ఘట్టాన్ని తల్లి రంగనాయకి స్వయంగా వీక్షించారు. అమలాపురానికి చెందిన వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు బిళ్ళ వీర్రాజు (74) అనారోగ్యంతో ఈ ఏడాది ఏప్రిల్ 14న మృతి చెందారు. ఆటల్లో మేటిగా గోదావరి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ పోటీలకు వేదికగా ఉమ్మడి జిల్లా అదే స్థాయిలో పతకాల కై వసం నేడు జాతీయ క్రీడా దినోత్సవంకూటమి పాలనలో తూతూ మంత్రంగా .. సుమారు ఏడాదిన్నర కూటమి పాలనలో క్రీడలను విస్మరించారు. క్షేత్ర స్థాయిలో మైదానాలను మెరుగుపరచలేదు. 2024 నవంబర్ 20న నూతన క్రీడా విధానం– 2024ను ప్రభుత్వం ఆమోదించినప్పటికీ ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఉమ్మడి జిల్లాలో అథ్లెట్లు సాధన చేసేందుకు సింథటిక్ ట్రాక్, కోచ్ సదుపాయాలు లేకపోవడం ప్రోత్సాహలేమికి ఉదాహరణ. -
విద్యుత్ చార్జీల భారాలు రద్దు చేయాలి
● ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలి ● వామపక్ష నాయకుల డిమాండ్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న విద్యుత్ చార్జీల ధరలకు వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పోరాడుతామని వామపక్షాల నాయకులు గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు. తొలుత 2000 ఆగస్టు 28న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ బషీర్బాగ్లో జరిగిన విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ, విష్ణువర్ధన్రెడ్డి, బాలస్వామిల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు ప్రయోగశాలగా మార్చి ప్రజలపై భారీగా విద్యుత్ భారం వేసినప్పుడు వామపక్షాలు రాష్ట్రవ్యాప్తంగా చారిత్రాత్మకమైన పోరాటం నిర్వహించాయన్నారు. ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా 2000 ఆగస్టు 28న హైదరాబాద్లో జరిగిన కాల్పుల్లో అమరులైన వారి స్ఫూర్తితో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారీగా వేస్తున్న విద్యుత్ చార్జీల భారాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. ట్రూ అప్ చార్జీలు, సర్దుబాటు చార్జీలు, సెకీ ఒప్పందం, టైం ఆఫ్ ది డే విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడం ఆపాలన్నారు. సీపీఐ (ఎంఎల్) జిల్లా నాయకులు సీహెచ్ నాగేశ్వరరావు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అదానీతో 20 సంవత్సరాల పాటు లక్ష కోట్ల రూపాయల ఒప్పందం చేసుకొందన్నారు. ప్రజలకు అత్యవసరమైన విద్యుత్ అవసరాన్ని అవకాశంగా తీసుకుని భారాలు వేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోదీ, అదానీ వైపు ఉంటుందా, రాష్ట్ర ప్రజల వైపు ఉంటుందా తేల్చుకోవాలన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సీపీఐఎం లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘ నాయకులు వల్లూరి రాజబాబు, సీపీఎం నగర కార్యదర్శి పలివెల వీరబాబు పాల్గొన్నారు. -
రైతులు రోడ్డెక్కుతున్నా... ‘కూటమి’కి చీమకుట్టినట్టయినా లేదు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎరువుల కోసం రైతులు రోడ్డు ఎక్కుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని మాజీ మంత్రి, వైసస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా విమర్శించారు. గురువారం ఆయన కాకినాడలో విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి సాగునీటికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. పక్షం రోజులుగా ఎరువుల కొరతతో రైతులు నరకం చూస్తున్నారని ఆక్షేపించారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇటువంటి దుస్థితి రైతులు ఎదుర్కోలేదన్నారు. ఎప్పుడూ లేనిది ఎక్కడా చూడనిది ఒక రైతుకు ఒక బస్తా కోటాగా ఇవ్వడం అన్యాయమని, స్థానిక నాయకులు సిఫారసు ఉంటేనే యూరియా ఇచ్చే పరిస్థితి చూస్తున్నామని, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితికి కూటమి సర్కారు కారణమని ఆరోపించారు. ఐదు ఎకరాలు సాగు చేసుకుంటున్నా రైతుకు ముష్టిపడేసినట్లు ఒక బస్తా యూరియా ఇస్తే పంట సాగు ఎలా చేస్తాడని రాజా ప్రశ్నించారు. కూటమి నేతలు ఎరువుల వ్యాపారులతో కుమ్మకై ్క బ్లాక్ మార్కెట్లో ఎరువులు పెద్ద ఎత్తున విక్రయాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కళ్లు ఉండి కబోదిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం తదితర నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు గంటల తరబడి ఎండలో ఎదురుచూస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ఎరువుల కొరత లేదని నిస్సిగ్గుగా చంద్రబాబు చెబుతున్నారని, అసలు ఈ ప్రభుత్వానికి రైతులపై జాలి, దయ ఉన్నాయా అని రాజా నిలదీశారు. ప్రభుత్వానికి రైతులంటే అంత కక్ష సాధింపు ఎందుకో అర్థం కావడం లేదన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా అయిదేళ్లు రైతే రాజు అనే నినాదంతో రైతు భరోసా పథకం పక్కాగా అమలు చేశారన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా రైతులకు సాయం అందించడంలో కూడా నిలువునా మోసం చేశారని రాజా మండిపడ్డారు. -
ఎరువు.. కరవు
● ఖరీఫ్ రైతుకు కష్టకాలం ● నిల్వలున్నాయంటున్న అధికారులు ● ఒక రైతుకు ఒకే బస్తా ● ఆయకట్టు అంతా ఇదే దుస్థితి ● కళ్లు తెరవని కూటమి సర్కార్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఖరీఫ్ రైతులు పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే మెట్ట ప్రాంతం అఽధికంగా ఉన్న కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తొలినాళ్లలో సాగునీరు కోసం రైతులు నరకం చూశారు. అదను దాటిపోతుందనే ఆందోళనలో ఉన్న సమయంలో కనాకష్టం మీద రెండు వారాలు ఆలస్యంగా సాగునీరు అందించారు. నారుమళ్లకు స్వస్తి పలికి వెదజల్లే విధానంతో 70 శాతం ఆయకట్టులో రైతులు గట్టెక్కారు. ఆ సమస్య తీరిందనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులు కష్టాల కడలిలో ఎదురీదుతున్నారు. కూటమి సర్కార్కు ముందుచూపు కొరవటమే ఎరువుల కొరతకు ప్రధాన కారణమని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. తప్పని కుస్తీలు మునుపెన్నడూ చూడని ఎరువుల కొరత జిల్లాలో ఖరీ్ఫ్ రైతులను వేధిస్తోంది. ఎరువుల కోసం రైతులు పడుతున్న పాట్లు చెప్పనలవికాదు. జిల్లాలో రైతులకు కావలసిన ఎరువులు అందివ్వలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. ఒక రైతుకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్న ప్రభుత్వ నిర్వాకంపై రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఖరీఫ్ సీజన్లో కాకినాడ జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలనేది జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్దేశించింది. జిల్లాలో 13,055 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి రైతులకు అవసరమైన ఎరువులు దొరకడం గగనంగా ఉంది. ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ప్రభుత్వం ఇస్తోంది. ఇలా కోటా మాదిరిగా ఇస్తుండడంతో రైతుసేవా కేంద్రాల వద్ద కొట్లాటలకు దిగుతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ‘తాంబూలం ఇచ్చాం..తన్నుకు చావండన్న’ చందంగా ఐదారు వందల బస్తాలు అవసరమైన ప్రాంతానికి 100 లేదా 150 బస్తాలు యూరియా తీసుకువచ్చి మమ అనిపిస్తున్నారు. దీంతో రైతులు కుస్తీపోటీలకు వచ్చినట్టు తొక్కిసలాడుకుంటున్నారు. కోటా ప్రకారం ఇచ్చే ఒక్క బస్తా తప్ప అదనంగా రైతు అవసరానికి తగ్గట్టు ఒక్క కేజీ ఎరువు కూడా ఇవ్వలేని ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్ని ఎకరాలు ఉన్నా ఒకే బస్తా జిల్లాలో ఏ రైతు సేవాకేంద్రం లేదా, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా, డీఏపీ బస్తాల కోసం గంటల తరబడి క్యూ లో నిరీక్షించి విసుగెత్తిపోయి రైతులు చివరకు ఇళ్లకు తిరిగివెళ్లిపోతున్నారు. జిల్లాలో సుమారు 300 పీఏసీఎస్లు ఉన్నా 10 శాతం చోట్ల కూడా ఎరువులు విక్రయించడం లేదు. ఇటీవల పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో ఎరువుల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల వద్ద కొట్లాటకు దిగిన ఉదంతాలు ఉన్నాయి. వరి సాగు జిల్లాలో దాదాపు 90 శాతం పూర్తి అయ్యిందని వ్యవసాయాధికారులే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఒక రైతుకు ఒక బస్తా అనే విధానంలో అరకొరగా ఎరువులు పంపిణీ చేస్తోంది. ఒక ఎకరా సాగుచేసిన రైతుకు, ఐదు ఎకరాలు సాగు చేసిన రైతుకు ఒకే బస్తా చొప్పున ఇస్తున్నారు. ఇలా అయితే ఖరీఫ్ సాగు ఎలా ముందుకు వెళుతుందని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా ఎరువులు సరఫరా చేయలేకపోవడంతో గత్యంతరం లేక బయట మార్కెట్లో అధిక ధరలకు కొనుక్కోవాల్సివస్తోందని రైతులు లబోదిబోమంటున్నారు. బస్తాకు రూ.50 నుంచి రూ.100 అదనంగా చెల్లించి కొనుక్కోవాల్సి వస్తోందంటున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం చూపినవారికే అమ్మాలి ఖరీఫ్లో ఎకరాకు బస్తా డీఏపీ (డై అమ్మోనియం ఫాస్పేట్), బస్తా యూరియా (నత్రజని), 15 కిలోలు పొటాష్(మ్యూరేట్ ఆఫ్ పొటాష్) వంతున రసాయనిక ఎరువులు వినియోగించాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఇవేమీ పట్టించుకోని రైతులు రెండు బస్తాల యూరియా, డీఏపీ రెండు బస్తాలు వినియోగిస్తారు. పీఏసీఎస్లలో, రైతు సేవాకేంద్రాలలో ఆధార్కార్డు తీసుకొచ్చిన వారికి ఎరువులు విక్రయించడంతో అసలైన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో కూటమి నేతలు దొడ్డిదారిన రైతులు కానివారిని ఆధార్కార్డుతో పంపించి యూరియా బస్తా కొనుగోలు చేసి బయట బస్తాకు రూ.50 నుంచి రూ.100 ఎక్కువకు అమ్మకాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆధార్కార్డు ప్రామాణికంగా కాకుండా పట్టాదార్ పాస్ పుస్తకం చూసి ఎరువులు విక్రయించాలని రైతు ప్రతినిధులు పేర్కొంటున్నారు. యూరియాకు పొటాష్తో లింకు యూరియా బస్తా కావాలంటే పొటాష్ తప్పనిసరిగా రూ.1,700 పెట్టి కొనుగోలు చేయవలసిన పరిస్థితి. 10 ఎకరాల భూమిని సాగు చేస్తున్నా. ఈ పది ఎకరాలకు సుమారు ఐదు బస్తాలు యూరియా కావలసి వచ్చింది. యూరియా కావాలంటే పొటాష్ కొనుగోలు చేయాలని ప్రాథమిక సహకార సంఘంలోనే నిబంధన పెట్టడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండిన ధాన్యం అమ్ముకోవడంలోనే కాకుండా ఖరీఫ్ సీజన్లో పంట పండించుకోవడానికి ఎరువుల కోసం కూడా రోడ్డెక్కే పరిస్థితి దాపురించింది. – మోరంపూడి రమేష్, రైతు, జి.మేడపాడు, సామర్లకోట మండలం. పది ఎకరాలు సాగు చేస్తున్నా.. నేను పది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నాను. ఇప్పటి వరకూ ఒకసారి కూడా పొలానికి పిండి వేయలేదు. గత పదిరోజులుగా పిండి కోసం తిరుగుతున్నాను. ఈ రోజు రైతు భరోసా కేంద్రానికి యూరియా వచ్చింది. ఒక్క బస్తా ఇస్తానంటున్నారు. నాకు 10 బస్తాలు యూరియా కావాలి. ఈ ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నట్లు ఫీలవుతోంది. రైతులకు ఎరువులు కూడా సరఫరా చేయలేని పరిస్థితుల్లో ఉంది. – వీరచక్రవాసు, రైతు, సామర్లకోట మండలం చాలా ఇబ్బంది పడుతున్నాం గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎరువులు కావాల్సినా ఇచ్చేవారు. ప్రస్తుతం ఎరువుల కోసం రోజుల తరబడి ఇక్కడే క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. పదిరోజులుగా యూరియా కోసం వేసిచూస్తే ఒక్క బస్తా మాత్రమే ఇస్తామంటున్నారు. నేను ఐదు ఎకరాలు వరి సాగు చేస్తున్నాను. ఒక బస్తా పట్టుకొని ఏ పొలంలో చల్లాలో అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వానికి రైతుల బాధలు తెలియడం లేదు. – తుమ్మల చిట్టిబాబు, రైతు, చంద్రపాలెం, సామర్లకోట మండలం ఏమీ పట్టని కూటమి నేతలు ఎరువుల కొరతతో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు జిల్లాలో పాలక పక్ష నేతలకు బొత్తిగా పట్టడంలేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే ఎరువుల కొరత ఏర్పడిందంటున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే ఎంత ఆయకట్టులో వరి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ఎంత ఎరువు అవసరం అవుతుందో గుర్తించే బాధ్యత జిల్లా వ్యవసాయ అధికారులదే. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం జిల్లాకు కేటాయింపులు చేసి గోదాంలలో ఎరువులు నిల్వ చేయాల్సి ఉంది. ఇదివరకు ఎప్పుడూ వ్యవసాయశాఖ యంత్రాంగం ప్రణాళికా వైఫల్యం చూడలేదంటున్నారు. ప్రైవేటు డీలర్లు అధిక ధరలకు విక్రయించకూడదని, ఎరువుల అమ్మకాలకు గుళికలు, ఇతర మందులను లింక్ పెట్టవద్దనే ఆదేశాలు గాలిలో కలిసిపోయి రైతులను కష్టాల్లోకి నెట్టేశారు. హోల్సేల్ డీలర్లు లింక్పెట్టి ఇస్తుంటే రిటైల్ అమ్మకాల్లో రైతులకు లింక్పెట్టి అమ్ముకోకపోతే తాము వాటిని ఎలాభరిస్తామని డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వమే కంపెనీలరె పర్యవేక్షిస్తూ లింక్ పెట్టకుండా ఎరువులు సరఫరా చేయాలన్న నిబంధన అమలుచేస్తే ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయాలు జరుపుతామని డీలర్లు అంటున్నారు. కంపెనీవాళ్లే ఎరువులను ఎమ్మార్పీ ధరలకు డీలర్లకు ఇచ్చి, ధవళేశ్వరం నుంచి తెచ్చుకోమంటున్నారని చెబుతున్నారు. ధవళేశ్వరం నుంచి బస్తాకు రూ.35 రవాణా వ్యయమై ఎమ్మార్పీకి మించి బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు అమ్మకపోతే నష్టపోతామని డీలర్లు పేర్కొంటున్నారు. కంపెనీలపై ప్రభుత్వం పర్యవేక్షణ పక్కాగా ఉంటే బ్లాక్ను అరికట్టవచ్చు. ఇదివరకు కాకినాడలో ఎన్ఎఫ్సీఎల్ ఉన్నప్పుడు ఎరువుల కొరత అనేది ఉత్పన్నమయ్యేదే కాదంటున్నారు. -
కాకినాడలో మాస్ కాపీయింగ్ కలకలం..
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా జీఎన్ఎం, ఏఎన్ఎం పరీక్షల్లో మాస్ కాపీయింగ్ బట్టబయలైంది. స్లిప్పులు పెట్టుకుని విద్యార్థులు దర్జాగా పరీక్షలు రాశారు. ఆర్ఎంసీ కాలేజీలో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఇన్విజిలేటర్లు ముడుపులు తీసుకుని మాస్ కాపీయింగ్కు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.గత రెండు రోజులుగా రంగరాయ మెడికల్ కాలేజీలో జీఎన్ఎం, ఏఎన్ఎం కోర్సులకు సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. ఇన్విజిలేటర్లతో పాటు కళాశాల సిబ్బంది కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
‘చంద్రబాబూ.. మూల్యం చెల్లించుకోక తప్పదు’
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సెంట్రల్ జైలులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ములాఖత్ అయ్యారు. అనంతరం మాజీ మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అభూత కల్పనలతో లిక్కర్ స్కాం కేసు తయారు చేశారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ ప్రతిష్టను దెబ్బతీయడానికే మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. జగన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు చంద్రబాబు చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటామన్నారు.మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం 15 నెలల్లో జైలు, బెయిల్తోనే కాలం గడిచిపోయిందని.. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే అధికంగా ప్రతిపక్షాలను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ జైలు వద్ద పవన్ కళ్యాణ్ వచ్చారు. అప్పుడు జైలు వద్ద పవన్ కళ్యాణ్ మాటలు కోటల దాటాయి. ఇప్పుడు ఆయన గడప కూడా దాటే పరిస్థితి కూడా కనిపించడం లేదు. జైల్లో మిథున్ రెడ్డిని హింస పెడుతున్నారు. పాకిస్తాన్ బోర్డర్ కంటే ఎక్కువగా సెంట్రల్ జైలు వద్ద భారీ గేడ్లు కట్టారు’’ అంటూ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు.. మనీ ట్రైల్ ఎలా జరిగిందో 90 రోజులైనా నిరూపించలేకపోయారు. మద్యం డిస్టిలరీలు ఎవరికి ముడుపులు ఇచ్చారో ప్రజలకు చెప్పలేకపోతున్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వం. కక్ష సాధింపు చర్యలకు పాల్పడేవారు మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన హెచ్చరించారు. -
భత్యం కరవు
● డీఏల ఊసెత్తని కూటమి సర్కార్ ● తీరని కలగా 12వ పీఆర్సీ ఏర్పాటు ● ఆందోళనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు రాయవరం: నేను మారిన మనిషిని.. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది కలిగించను. వారి సంక్షేమం కోసం పాటుపడతాను.. ఈ మాటలను ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటలను పట్టించుకోకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నిరాశ అలముకుంది. ఒకవైపు నిత్యావసరాల ధరలు కళ్లెం లేని గుర్రంలా దౌడు తీస్తుంటే, ఉద్యోగులకు ప్రకటించాల్సిన కరవు భత్యం (డీఏ) విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదు. మరోవైపు ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ నియామకంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు గడిచినప్పటికీ కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని వివిధ శాఖల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 11వ పీఆర్సీ గడువు 2023 జూలైతో ముగిసింది. గత ప్రభుత్వం 12వ పీఆర్సీ చైర్మన్గా మన్మోహన్సింగ్ను నియమించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12వ పీఆర్సీని రద్దు చేసింది. ఆ స్థానంలో పే రివిజన్ కమిటీ చైర్మన్గా కొత్త వ్యక్తిని నియమించి, పీఆర్సీ ప్రతిపాదనలను తయారు చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయక పోవడం, ఐ.ఆర్ ప్రకటించక పోవడం, నాలుగు డీఏల్లో కనీసం ఒక్క డీఏ కూడా ప్రకటించక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పీఆర్సీ ఏర్పాటు చేయాలని, ఐ.ఆర్ ప్రకటించాలని, తక్షణమే రెండు డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన రేకెత్తుతుంది. అలాగే గతంలో ప్రకటించిన డీఏలకు సంబంధించి అరియర్స్ కూడా చెల్లించాలి. సగటున ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.50 వేలు అనుకున్నా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు కలిపి 60 వేల మంది వరకూ సుమారు రూ.300 కోట్ల వరకూ డీఏ అరియర్ చెల్లించాలి. డీఏల మాటెత్తని సర్కార్ కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ప్రకటించగానే అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దామాషా పద్ధతిలో ఉద్యోగులకు కరవు భత్యం ప్రకటించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూడు డీఏలు ప్రకటించి, 2025 జూలై డీఏ ప్రకటించడానికి కేంద్ర క్యాబినెట్ మూడు శాతం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డీఏ కూడా ఉద్యోగులకు ప్రకటించలేదు. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకూ నాలుగు విడతలు డీఏలను ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం 33.67 శాతం డీఏ చెల్లిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన 2025 జూలై డీఏతో కలిపి 58 శాతం డీఏ చేరుతుంది. ప్రస్తుతం అమలవుతున్న పీఆర్సీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక శాతం డీఏ ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం డీఏ ఇవ్వాల్సి ఉంది. ఆ ప్రకారంగా 12 శాతానికి 10.92 శాతం డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. అలాగే గతంలో మంజూరు చేసిన డీఏల అరియర్స్ కూడా ఇవ్వాలి. 2024 మే నెలలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ప్రభుత్వం డీఏల ఊసెత్తడం లేదు. 2024 జనవరి, 2024 జూలై, 2025 జనవరి, 2025 జూలై డీఏలు ఇవ్వాలి. -
పోరాటం ఉధృతం
తక్షణం ప్రభుత్వం పీఆర్సీని ఏర్పాటు చేయాలి. అలాగే ఐ.ఆర్ ప్రకటించి, కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల విషయంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ విషయంలో కలిసొచ్చే సంఘాలతో ఉమ్మడి కార్యాచరణ చేపడతాం. –పి.సురేంద్రకుమార్, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ అభద్రతా భావం ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్ఫథంతో వ్యవహరించాలి. పీఆర్సీ ఏర్పాటు, ఐ.ఆర్ ప్రకటన, డీఏల ప్రకటన విషయంలో ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే ఉద్యోగుల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఎంతటి పోరాటానికై నా ఎస్టీయూఏసీ, ఫ్యాఫ్టో తరఫున సిద్ధంగా ఉన్నాం. –పోతంశెట్టి దొరబాబు, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ, ప్రధాన కార్యదర్శి ఫ్యాఫ్టో మాట నిలుపుకోవాలి కూటమి నాయకులు ఎన్నికల ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీలను నిలుపుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీ నియమిస్తామని, ఐ.ఆర్ ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఏడాది గడిచినా ఆ మాట ఎత్తకపోవడం బాధాకరం. దసరా కానుకగా కనీసం రెండు డీఏలను ఇవ్వాలి. పీఆర్సీ కమిటీని నియమించి, జనవరి లోపు 12వ పీఆర్సీ అమలు చేయాలి. –పి.నరేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి,ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఉద్యోగుల్లో అసంతృప్తి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో అసంతృప్తి బయట పడుతుంది. అది ఉద్యమ రూపం దాల్చక ముందే ప్రభుత్వం స్పందించాలి. కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమ బాట చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తక్షణం 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి, డీఏలు ఇవ్వాలి. –ధీపాటి సురేష్బాబు, కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
మాకు జీవనోపాధి కల్పించాలి
టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకుల వినతి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమకు జీవనోపాధి లేకుండా పోయిందని టాటా మ్యాజిక్ ఓనర్స్, డ్రైవర్స్ యూనియన్ నాయకు లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి రూ.1,250 చెల్లించి మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం సీఐటీయూ ఆధ్వర్యంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు వాలిశెట్టి శ్రీను మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణికులే ఆధారమన్నారు. వాహనం తిరిగినా, తిరగకపోయినా ఏడుగురు ప్యాసింజర్లు గల వాహనానికి మూడు నెలలకు రూ.5,500, తొమ్మిది మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి రూ.7,200 ట్యాక్స్ చెల్లిస్తున్నామన్నారు. ఇవికాకుండా ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్ తప్పదన్నారు. ప్రస్తుతం టాటా మ్యాజిక్ డ్రైవర్స్ పూర్తిగా రోడ్డున పడ్డామన్నారు. ఒడిశా రాష్ట్రంలో మాదిరి టాటా మ్యాజిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ఉండాలన్నారు. టాటా మ్యాజిక్లతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు. తుని, కత్తిపూడి, పిఠాపురం, కాకినాడ యూనియన్ నాయకులు రెడ్డి వీరబాబు, పి.సూర్యచక్రం, జి.రాజేష్, వాసంశెట్టి శ్రీనివాస్, పి.మణి, ఎ.సతీష్, బి.సత్యనారాయణమూర్తి, వి.హేమకుమార్ పాల్గొన్నారు. -
హక్కులపై ఉక్కు పాదమా?
బాలాజీచెరువు (కాకినాడ): కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకూ సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1,285 ప్రభుత్వ పాఠశాలలు, 47 జూనియర్ కాలేజీలున్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలు, పాఠశాలల్లో వసతుల లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశానికి అనుమతులు ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు నిరంకుశత్వానికి నిదర్శనం కళాశాల్లోకి రాకూడదంటూ ఇచ్చిన జీఓపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లకు అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు ప్రశ్నించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. విద్యా ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం జూనియర్ కళాశాల్లోకి సైతం విద్యార్థి సంఘాల నేతలకు అనుమతి లేదంటూ మరో జీఓ జారీచేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలో సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థుల హక్కుల కోసం పోరాడటమే కాకుండా, విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయి. నాయకత్వ లక్షణాలను, సామాజిక అవగాహనను, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించి పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నేతల ప్రవేశంపై నిషేధం కళాశాలల్లోకి సైతం అనుమతి లేదని జీఓ కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు -
అనాలోచిత నిర్ణయం
ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫీజులు, పుస్తకాల పేరుతో ఇప్పటికే రూ.లక్షల్లో దోపిడీ చేస్తున్నాయి. వీటిని అడ్డుకునేవారు లేకుండా చేయడం కోసం అడ్డగోలు జీఓలు విడుదల చేస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలపై స్పందించేవారు లేకపోతే అధికారులు, ప్రభుత్వం ఎలా చేసినా అడిగేవారు లేకుండా పోతారు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఆంక్షలు ఎత్తేయాలి విద్యారంగంలోని సమస్యలపై ప్రశ్నించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాంటి హక్కులను కాలరాసేందుకు కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేయడం దుర్మార్గం. విద్యను వ్యాపారం చేస్తున్న కళాశాలలపై గళం విప్పితే ఆంక్షలు విధించడం ఈ ప్రభుత్వానికే చెల్లింది. తక్షణం విద్యార్థి సంఘాలపై ఆంక్షలు ఎత్తివేయాలి. – బి.సిద్దూ, పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి విద్యార్థి సంఘాలపై ఆంక్షలు దుర్మార్గం కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. ఇచ్చిన హామీల అమలుకు విద్యార్థి సంఘాలు నిలదీశాయి. ప్రభుత్వ బడుల్లో, కళాశాలల్లో వసతులపై గళం విప్పాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. ఆంక్షల పేరుతో విద్యాసంస్థల్లోకి అనుమతులు లేకుండా జీఓలు జారీ చేయడం దుర్మార్గం. – పి.రవితేజ, నిరుద్యోగ జేఎసీ కన్వీనర్ ● -
మరోసారి ఆగిన సర్వే
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న నిర్మాణాల స్థల వివాదంపై మంగళవారం జిల్లా లాండ్ రికార్డులు, సర్వే శాఖ అధికారులు నిర్వహించిన జాయింట్ సర్వే మధ్యలో నిలిచిపోయింది. వివాద స్థలంలోకి దేవస్థానం ఈఓ, సిబ్బంది వెళ్లడానికి వీలు లేదని జూలై 31న పెద్దాపురం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్స్ ఇచ్చిందని ఆ స్థలంలో హోటల్, బోట్షికారు నిర్వహిస్తున్న దాసరి హరగోపాల్ పెద్దాపురం ఆర్డీఓ కే రమణికి తెలపడంతో ఆమె కోర్టు ఆర్డర్స్ ఒరిజినల్ కాపీ తమకు అందజేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేను నిలిపివేశారు. ఈ స్థల వివాదంపై జాయింట్ సర్వే చేయడం ఇది ఐదోసారి. అయినా ఫలితం తేలకపోవడం విశేషం. దేవస్థానం, ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం పంపా రిజర్వాయర్ స్లూయిజ్ గేట్లు ఎదురుగా గల కొండ వద్ద నుంచి పవర్ హౌస్ వద్దకు వెళ్లే మార్గంలోని హరిణి బోట్ షికార్ నిర్మాణాల వరకు జాయింట్ సర్వే నిర్వహించారు. లాండ్ ప్రొటెక్షన్ సెల్ స్పెషల్గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ డి.భారతి, డిస్ట్రిక్ట్ లాండ్ రికార్డ్స్ అండ్ సర్వే డీఈ కె.శ్రీనివాస్, అన్నవరం దేవస్థానం ఈఓ సుబ్బారావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈఈ శేషగిరిరావు హాజరయ్యారు. సర్వే సగం పూర్తయ్యాక పెద్దాపురం ఆర్డీఓ కే రమణి వచ్చి సర్వేను పరిశీలించారు. అదే సమయంలో లీజుదారుడు దీనిపై ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెప్పడంతో సర్వే అర్ధాంతరంగా నిలిపివేశారు. -
విద్యారంగ సమస్యలపై ర్యాలీ
1500 మందితో భారీ ర్యాలీ బోట్క్లబ్: విద్యారంగంలోని సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 1500 మందితో భారీ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం. గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం కోసం చూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యావిధానం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యా అందని ద్రాక్షగా తయారయిందని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్య మొత్తం కేంద్రీకరణ, కాషాయీకరణ, ప్రైవేటీకరణ అవుతుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోను పూర్తిగా అమలు చేయనటువంటి నూతన జాతీయ విద్యావిధానాన్ని మన రాష్ట్రం అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యారంగాన్ని సమూలంగా మార్పులు చేస్తామని, చెప్పి నేడు ఎటువంటి మార్పులు లేకుండా గత ప్రభుత్వం చేసిన విధానాల్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న రూ.6400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం లేదన్నారు. దీని వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో చదువుకున్న వారికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ప్రభుత్వం వేయక, విద్యార్థులను పరీక్షలు రాయనివ్వకుండా, విద్యార్థులు సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ హాస్టల్లో మెరుగైన వసతులు కల్పిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ అరకొర సౌకర్యాలతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారని 2018లో ఇచ్చిన మెనూనే, నేటికీ అమలు చేయాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచకపోవడం దుర్మార్గమన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను రూ.3 వేలకు పెంచాలని, విద్యార్థులకు ఇచ్చే కాస్మోటిక్ చార్జీలు ప్రతి నెల ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి, ప్రత్తిపాడు, కోటనందూరు మండలాల్లో జూనియర్ కళాశాలలకు భవనాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లాలో సంక్షేమ హాస్టల్కు శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ బిక్కుబిక్కుమంటూ విద్యార్థులు చదువులు కొనసాగుతున్నాయని విమర్శించారు. కాకినాడ నడిబొడ్డున ఉన్న అంబేడ్కర్ హాస్టల్కు గత మూడేళ్ల నుంచి నూతన భవనం నిర్మిస్తున్నామని చెప్పి, నేటికీ భవనం పూర్తయినా ప్రారంభించకుండా జిల్లా అధికారులు ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటున్నారన్నారు. అనంతరం దాదాపు 54 సమస్యలను గుర్తించి వినతి పత్రాన్ని జేసీ రాహుల్ మీనాకు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు సిద్ధూ, సాహిత్, వాసుదేవ్, నాగరాజు, మణికంఠ, ఉదయ్కుమార్, జయరాం, సత్యం, చిన్ని, గోపాలకృష్ణ, రవి, నాని, తదితరులు పాల్గొన్నారు. -
ఇదేం భూగోతం
● ఎకరా కన్వర్షన్కు రూ.3 లక్షలు ఇవ్వాల్సిందే.. ● లేకుంటే నో పర్మిషన్ ● ముఖ్యనేతకు ముడుపుల మూట ● సొంత పార్టీ అయినా ససేమిరా.. ● పేట్రేగిపోతున్న కూటమి నేతలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. తన, తమ భేదం లేకుండా ఎవరైనా పైసలు ఇవ్వందే పని కాదంటున్నారు. పై నుంచి కింది వరకు నేతలందరిదీ ఒకటే దారి అన్నట్టుగా ఉంది. మట్టి, గ్రావెల్, ఇసుక, లిక్కర్తోనే సరిపెట్టకుండా రియల్టర్లను కూడా విడిచిపెట్టడం లేదు. జిల్లా కేంద్రం కాకినాడ నగరానికి నాలుగుపక్కలా ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన నేతలు రియల్ దందా మూడు ప్లాట్లు, నాలుగు లే అవుట్లుగా నడుస్తోంది. లే అవుట్ వేయడమే పాపం అన్నట్టు లక్షలు మెక్కేస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పెట్టి సొమ్ములు ఇస్తేనే సై అంటున్నారు. అన్నంత ఇవ్వకుంటే లే అవుట్లను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఈ విషయంలో సొంత పార్టీ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. కాకినాడ రూరల్, కరప మండలాల్లో జరుగుతోన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం నియోజకరవర్గ ముఖ్యనేతకు కాసులు కురిపిస్తోంది. చివరకు సొంత వ్యవసాయ భూమిని ప్లాట్లుగా అమ్ముకుందామన్నా కూడా కప్పం కట్టాల్సిందేనని పంతం పట్టిమరీ వసూళ్లకు తెగబడుతున్నారు. ఈ రియల్ దందా అంతా కాకినాడ పరిసర ప్రాంతాల్లో సినిమాటిక్గా జరుగుతోంది. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కౌడా) పరిధిలోకి వచ్చే రూరల్ నియోజకవర్గం లే అవుట్లకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ నియోజకవర్గానికి జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విద్య, వైద్యం, వ్యాపార అవసరాల కోసం అటు కోనసీమ, ఇటు తూర్పుగోదావరి జిల్లాల్లోని నగరాలు, పల్లెల నుంచి కాకినాడ నగరానికి వలసలు పెరుగుతూ వస్తున్నాయి. ఏటా పెరుగుతూ వస్తున్న నగర జనాభా ప్రస్తుతం నాలుగున్నర లక్షల పైమాటే. వలసలు వచ్చే కుటుంబాలతో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు కాకినాడ నగరంలో నివాసం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ నగరానికి ఆనుకుని ఆరేడు కిలోమీటర్ల వరకు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములుగా మారుతున్నాయి. ఈ భూములను రియల్టర్లు కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి విక్రయిస్తున్నారు. ఎకరాల్లో భూములు కొనుగోలు చేసి లేఅవుట్లు చేసి గజాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేసే సమయంలో నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు ఆ భూముల్లో గద్దల్లా వాలిపోతున్నారు. రియల్టర్లతో బేరసారాలకు తెరతీస్తున్నారు. అనుకున్నట్టు గానే పంతం పట్టి కప్పం కట్టించుకుంటున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు నిర్ణయించి జనసేన నేతలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. అది సొంత పార్టీ అయినా.. కూటమి నేతలైనా నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు మాత్రం విడిచిపెట్టడం లేదు. లే అవుట్ వేస్తే కప్పం కట్టాల్సిందేనంటున్నారు. లేదంటే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి భూ బదలాయింపు (కన్వర్షన్)కు అనుమతులు ఆపేస్తున్నారు. మండల కేంద్రమైన కరప, పెనుగుదురు, నడకుదురు, కాకినాడ రూరల్ తూరంగి, చీడిగ, కొవ్వాడ, సర్పవరం, తిమ్మాపురం తదితర ప్రాంతాల్లో వేస్తున్న వెంచర్లలో ఎకరాకు రూ.3 లక్షల వంతున బలవంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లోనే ఈ రియల్ దందా అంతా సాగుతోంది. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో అతని అనుచరులు బరితెగించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల మండల కేంద్రం కరపలో జనసేన నాయకుడు వేసిన లే అవుట్ను కూడా విడిచి పెట్టలేదు. ఒకప్పుడు అన్నవరం దేవస్థానం సభ్యుడిగా పనిచేసిన ఆ నాయకుడు తాను జనసేనకే పనిచేశానని, ఆ భూమి తన సొంతమని ఎంత మొత్తుకున్నా జనసేన నేతలు పెడచెవిన పెట్టారు. 26 ఎకరాల లే అవుట్లో ఎకరాకు రూ.3 లక్షలు వంతున కప్పం కట్టాలని పంతం పట్టారు. ఇందుకు ఆ నాయకుడు ససేమిరా అనడంతో అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చి లేఅవుట్లో మెరకచేసే పనులను ఆపేయించారు. రెండు వారాల పాటు పనులు ఆపేసిన సంబంధిత రియల్టర్ కం జనసేన ఫాలోవర్ చివరకు చేసేదేమీ లేక వారు పంతం పట్టినంతా కప్పం కట్టేసి నిలిచిపోయిన లే అవుట్ పనులు మొదలుపెట్టారు. ఆ ఒక్క లే అవుట్లోనే సుమారు అరకోటి ముడుపు మూటకట్టి నియోజకవర్గ ముఖ్యనేతకు చెల్లించుకున్నారు. ఇదే విషయం ఇటీవల కరప మండలంలో జరిగిన తేదేపా మండల స్థాయి నేతల సమావేశంలో చర్చకు రావడం గమనార్హం. సొంత పార్టీ వారు లే అవుట్లు వేసుకున్నా వదలకుండా జలగల్లా పట్టి పీడించుకు తింటే ఎలా అని తేదేపా సీనియర్ నేతలు నిలదీశారని తెలియవచ్చింది. ఎక్కడైనా లే అవుట్ వేస్తున్నారంటే ముందుగానే ఎకరాకు రూ.3 లక్షలు ఇస్తామనే ఒప్పందం చేసుకుని అడ్వాన్స్ ముడుపు ముట్టజెప్పాల్సిందే. ముఖ్యనేత చేతిలో సొమ్ము పడితేనే లే అవుట్కు అధికారులు అనుమతుల ప్రక్రియ మొదలుపెడతా రు. నియోజకవర్గమంతటా ఇదే దందా నడుస్తోంది. కాకినాడ రూరల్ తూరంగి, చీడిగ, కొవ్వాడ, గంగనాపల్లి, పండూరు, పి.వెంకటాపురం, పెనుమర్తి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో సైతం ఇదే తరహా రియల్ దందా నడుస్తోంది. ఎకరాకు వసూలు చేస్తున్న కప్పం రూ.3 లక్షల్లో రెండు వంతులు అంటే రెండు లక్షలు నియోజకవర్గ ముఖ్యనేతకు మిగిలింది స్థానిక నేతలు పంచుకుంటున్నారు. ఈ ముడుపులు చెల్లించలేక రియల్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం వస్తే ఏదో నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చనే ఆశ అడియాశ చేశారని రియల్టర్లుగా మారిన కూటమి నేతలు మండిపడుతున్నారు. తమ ప్రభుత్వం వచ్చిందనే సంతోషం కూడా లేకుండా చేశారంటున్నారు. కనీసం తమకై నా మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ కూటమి సమావేశం ముందుంచాలని రియల్టర్లు అయిన కూటమి నేతలు సిద్ధపడుతున్నారు. -
హామీలు అమలు చేయాలంటూ ధర్నా
బోట్క్లబ్ (కాకినాడ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు రజకులకు ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ వద్ద రజక వృత్తిదారుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తరతరాలుగా వెనుకబడి ఉన్న రజక వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, డిమాండ్లను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు కోనేటి రాజు మాట్లాడుతూ ఎంతో కష్టపడి తమ పిల్లలను చదివించినా సరైన ఉద్యోగ అవకాశాలు లేవన్నారు. అందువల్ల ఆసుపత్రి, రైల్వే, ఆర్టీసీ, పోలీస్ శాఖల్లో రజకులకు కేటాయించిన పోస్టులను వారికే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే వృత్తి ద్వారా 50 ఏళ్లకే అనారోగ్యానికి గురై బాధపడుతున్నామని, ఆ వృత్తిదారులకు పింఛన్ సదుపాయం కల్పించాలన్నారు. పిఠాపురం అగ్రహారంలో ఉన్న దోబీఘాట్లో తరతరాలుగా వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నామని అది శిథిలస్థితికి చేరిందని తక్షణమే మరమ్మతులకు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. రజకులకు ఇచ్చిన హామీల్లో 250 యూనిట్లు ఉచిత కరెంటు, రజకులకు శాశ్వత నివాస ధ్రువపత్రాలు, వృత్తిదారులకు రూ.5 లక్షల రుణాల ఇచ్చి దానిపై 90 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోనేటి రాజు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలసి వినతి పత్రాన్ని అందించారు. కార్యక్రమంలో వృత్తిదారులు సీహెచ్ శ్రీనివాస్, కొడమంచిలి అప్పన్న, దుమరసింగు దుర్గ, సామంతకుర్తి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
అక్టోబర్ 7న తెలుగు సాహిత్య సదస్సు
రాజానగరం: పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలోని వైఎన్ కళాశాలలో అక్టోబర్ 7న శ్రీతెలుగు సాహిత్యం – భాషా బోధన మనోవికాసంశ్రీ అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగనుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ని సోమవారం విడుదల చేశారు. ప్రాచీన సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, దక్షిణాంధ్రయుగ సాహిత్యం, శతక సాహిత్యం, ఆధునిక సాహిత్య ప్రక్రియలు, జానపద, గిరిజన విజ్ఞానం, ప్రాథమిక, ఉన్నత విద్య, మాతృ భాష బోధన అంశాల పై పరిశోధన పత్రాలను సెప్టెంబర్ 25లోపు పంపించాలన్నారు. కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ పిట్టా శాంతి పాల్గొన్నారు. -
649 మంది ధ్రువపత్రాల పరిశీలన
కాకినాడ క్రైం: తాజా నియామక ప్రక్రియలో పోలీస్ కానిస్టేబుళ్లుగా ఎంపికై న 649 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన సోమవారం జరిగింది. కాకినాడలోని డీఏఆర్ పోలీస్ మైదానంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రక్రియలో ఏపీఎస్పీ (మెన్), సివిల్ (మెన్, విమెన్) అభ్యర్థులు పాల్గొన్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు కరప: పీహెచ్సీల పరిధిలో గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో వైద్యసేవలందించాలని జిల్లా టాస్క్ఫోర్స్ బృందం సూచించింది. మండలంలోని గురజనాపల్లిలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం జిల్లా టాస్క్ఫోర్స్ బృందం కె.శ్రీనివాసరావు (స్టాటిస్టికల్ ఆఫీసర్), జి.గిరిగణేష్ (డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్) సందర్శించి, రికార్డులను, ఆర్సీహెచ్, హెచ్ఎమ్ఐఎస్ తదితర పోర్టల్స్ తనిఖీ చేశారు. అనంతరం వారు సిబ్బందితో సమావేశమై గర్భిణులకు, పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకుని, చేయాల్సిన విధులపై సూచనలిచ్చారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి, వారికి సరైన వైద్యం అందించి, సుఖప్రసవాలు జరిగేటట్టు చూడాలన్నారు. పీహెచ్సీ డాక్టర్ సయ్యద్ ఖతీజా సత్తారి అఫ్రోజ్, సీహెచ్ఓ యేసురత్నం, పీహెచ్ఎన్ సత్యనారాయణమ్మ, హెచ్వీ సీత తదితర సిబ్బంది పాల్గొన్నారు. భక్తులతో రత్నగిరి కిటకిట అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భోజనం చేశారు. కాగా ముత్యాల కవచాల అలంకరణలో స్వామి, అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు. సత్యదేవుని భక్తుల కోసం రెండు హెలికాఫ్టర్ ఫ్యాన్లు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.నాలుగు లక్షలు విలువ చేసే రెండు హెచ్వీఎల్ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను అందజేయనున్నారు. ఏడు మీటర్లు వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తారు. సోమవారం ఆలయానికి వచ్చిన దాత సత్యప్రసాద్ వారం రోజుల్లో వార్షిక కల్యాణ మండపంలో భక్తుల కోసం ఈ ఫ్యాన్లును అమర్చనున్నట్లు అధికారులకు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి పిఠాపురం: డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అబ్జర్వర్, ఏపీ విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ మువ్వ రామలింగం తెలిపారు. ఆయన సోమవారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో డీఎస్సీ సాధించిన వారి ధ్రువపత్రాల పరిశీలన కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కులధ్రువీకరణ పత్రాలను రెవెన్యూ అధికారులు, విద్యార్హత సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఆన్లైన్లో పొందుపరిచిన జాబితా ప్రకారం ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి ఉద్యోగ అర్హత నిర్ణయిస్తామని చెప్పారు. ఆయన వెంట ఆర్జేడి నాగమణి, డీఈవో రమేష్ డీసీఈబీ వెంకట్రావు ఉన్నారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
తుని: చోరీ కేసును తుని పోలీసులు చేధించారు. ఈ మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు సోమవారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యాదవోలు గ్రామానికి చెందిన సతీష్ (అవంతికరెడ్డి) మూడేళ్ల కిందట తుని వచ్చి హిజ్రాలతో కలసి జీవిస్తున్నాడు. ఆడ లక్షణాలు కలిగిన సతీష్ మహిళ వేషధారణలో స్థానిక జాతీయ రహదారిపై ఉంటూ పలువురిని ఆకర్షిస్తూ డబ్బులు సంపాదించేవాడు. పండగలు, జాతర్లలో నృత్యాలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సతీష్కు ఇన్స్టాగామ్లో ప్రశాంత్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. వీరిద్దరూ తుని పట్టణం 10వ వార్డు నిమ్మకాయలవారి వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు. సతీష్ తనను పెళ్లి చేసుకోవాలని ప్రశాంత్ను కోరాడు. ఆపరేషన్ చేయించుకుని పూర్తి హిజ్రాగా మారితేనే పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. దీంతో ఆపరేషన్కు రూ. 5 లక్షలు అవసరమని తెలుసుకున్న సతీష్, ప్రశాంత్లు చోరీకి వ్యూహరచన చేశారు. వారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే నివాసం ఉంటున్న బాలేపల్లి సత్యవతి అనే వృద్ధురాలిని టార్గెట్ చేశారు. ఈ నెల 20న ఆమె తన ఇంటి వెనుక భాగంలో ఉండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన సతీష్, ప్రశాంత్లు ఆమె కళ్లలో కారం కొట్టారు. వృద్ధురాలి మెడలో ఉన్న ఐదు గ్రాముల పగడాల బంగారు గొలుసుతో పాటు చేతికున్న నాలుగున్నర తులాల బంగారు గాజులను తీసుకుని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పట్టణ సీఐ గీతారామకృష్ణ సమగ్ర దర్యాప్తు జరిపి ఆదివారం స్థానిక రైల్వే గెస్ట్హౌస్ వద్ద నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 7 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రెండు సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ గీతారామకృష్ణ, ఎస్సైలు విజయ్బాబు, పాపారావు, సిబ్బంది యాదవ్, శివయ్య, నాయుడులను డీఎస్పీ అభినందించారు. -
ఆదినాయకా... అందుకో మా పూజ
అయినవిల్లి: ఆదినాయకా.. అందుకో మా పూజ అంటూ వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి జరిగే వేడుకలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ ఆలయాలు ముస్తాబవుతున్నాయి.. ఇప్పటికే ఉత్సవ మంటపాల ఏర్పాటుకు అన్నీ ఏర్పాట్లూ చకచకా జరిగిపోతున్నాయి. ప్రసిద్ధి చెందిన అయినవిల్లి సిద్ధి వినాయకుని ఆలయం చవితి ఉత్సవాలకు అంగరంగ వైభవంగా సిద్ధమైంది. బుధవారం వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుని సన్నిధిలో వేడుకలు నిర్వహించనున్నారు. దీని కోసం ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి. గతేడాది కంటే అధికంగా భక్తులు వస్తారనే అంచనాతో ఆలయ వర్గాలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. వివిధ రంగులతో ఆలయ గోపురాన్ని తీర్చిదిద్దారు. ప్రత్యేక పుష్పాలు, కొబ్బరి, అరటి ఆకులు, కూరగాయలు వంటి వాటితో ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయినవిల్లి ఎప్సై హరికోటి శాస్త్రి చెప్పారు. తొమ్మిది రోజులు.. ప్రత్యేక అభిషేకాలు వినాయక చవితి సందర్భంగా బత్తాయి, దానిమ్మ, యాపిల్, ద్రాక్ష, మామిడి వంటి వివిధ సీజనల్ పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకాలు చేయనున్నారు. అనంతరం లక్ష గరిక పూజ, వివిధ పుష్పాలతో ప్రత్యేక అలంకరణ, హారతులు తదితర కార్యక్రమాలు తొమ్మిది రోజుల పాటు ఉంటాయని ఏసీ వెంకట దుర్గాభవాని తెలిపారు. ఈ రోజుల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణలు చేస్తామన్నారు. చవితి రోజున సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ ప్రాంగణం వెలుపల మండపంలో మట్టి గణపతిని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రోజూ తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆలయం తెరుస్తారు. మేలుకొలుపు సేవ తదితర పూజల ఆనంతరం ఐదు గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు నిత్య గణపతి హోమం, ఒంటి గంటకు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, ప్రసాద నివేదన కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం నాలుగు గంటలకు స్వామివారిని మూషిక వాహనంపై మాఢ వీధుల్లో ఊరేగిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు పంచ హారతులు ఇస్తారు. రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుందని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. అన్ని ఏర్పాట్లూ చేశాం.. అయినవిల్లి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం. చవితి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. నవరాత్రుల్లో ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. –అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ ఈఓ, అయినవిల్లి రేపటి నుంచి వినాయక చవితి ఉత్సవాలు ఉమ్మడి జిల్లాలో ముస్తాబైన ఆలయాలు, ఉత్సవ మంటపాలు ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 4 వరకూ వేడుకలు -
మోటారు సైక్లిస్ట్పైకి దూసుకెళ్లిన ఆబోతులు
చికిత్స పొందుతూ మృతి అల్లవరం: రెండు ఆబోతులు పొట్లాడుకుంటూ దారిని పోతున్న వ్యక్తిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలైన అతను మృతి చెందిన సంఘటన అల్లవరం మండలం గుండెపూడిలో సోమవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల వివరాల ప్రకారం... గుండెపూడి పోతులవారిపేట గ్రామానికి చెందిన జంగా రామకృష్ణ (41) గురువారం రాత్రి దేవగుప్తం సెంటర్ నుంచి మోటారు సైకిల్పై పోతులవారిపేట వెళ్తుండగా గుండెపూడిలోని ఆంజనేయస్వామి వారి ఆలయాలకు సమీపంలో రోడ్డుపై రెండు ఆబోతులు హోరాహోరీగా పోట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో మోటారు సైకిల్పై వెళ్తున్న రామకృష్ణపైకి రెండు ఆబోతులు దూసుకువచ్చాయి. దీంతో రామకృష్ణ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. సయమానికి ఎవరూ లేకపోవడంతో రామకృష్ణపై ఆబోతులు వీరంగం సృష్టించి మరింత గాయాలు పాల్జేశాయి. కొద్ది సేపటికి రోడ్డుపై పడి ఉన్న రామకృష్ణను స్థానికులు గుర్తించి కాకినాడ జీజీహెచ్కు తరలించారు. తీవ్ర గాయాలైన రామకృష్ణ తలకు శస్త్రచికిత్స చేశారు. అయితే ఆదివారం సాయంత్రం అతను మృతి చెందారు. ఈ ఘటనపై అల్లవరం ఎస్సై సంపత్కుమార్ కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, బాబు, పాప ఉన్నారు. -
చెవిలో చెబితే.. కోర్కెలు తీర్చే స్వామి
బిక్కవోలు: చెవిలో చెబితే కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా పేరొందిన బిక్కవోలు శ్రీలక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం చవితి వేడుకలకు ముస్తాబైంది. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆనుకుని ఉన్న ఈ ఆలయం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. 1,100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయం కావడంతో చవితి ఉత్సవాలకు ఇక్కడ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ శ్రీలక్ష్మీగణపతి స్వామి ఏకశిలా మూర్తిగా దర్శనమిస్తారు. స్వామి విగ్రహం 10 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున ఉంటుంది. స్వామివారికి తొండం కుడి వైపునకు తిరిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఈ విగ్రహం తూర్పు చాళుక్యుల కాలం నాటిదని పురావస్తు శాఖ అంచనా వేసింది. స్వామివారి చెవిలో తమ కోర్కెలు చెబితే తీరతాయనేది భక్తుల నమ్మకం. వినాయక చవితి సందర్భంగా గణపతి ఆలయంలో బుధవారం ఉదయం నుంచి గణపతి నవరాత్ర మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి దాటాక బుధవారం తెల్లవారు జామున 1.58 గంటలకు తీర్థపు బిందె సేవతో స్వామివారి చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బుధవారం ఉదయం 11.04 కలశ స్థాపన చేశారు. ఈ వచ్చే నెల 6న మహాన్నదానంతో ఉత్సవాలు పూర్తవుతాయి. గతేడాది కంటే ఘనంగా.. ఆలయం చుట్టుపక్కల అంతా రేకుల షెడ్డు ఏర్పాటు చేశాం. గత ఏడాది కంటే ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ క్యూలైన్లు నిర్మించాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి చవితి రోజు మినహా మిగిలిన రోజుల్లో అన్నదానం ఉంటుంది. –ఎ.భాస్కర్, దేవదాయ శాఖ ఈఓ, బిక్కవోలు గ్రూప్ ఆలయాలు -
పీజీఆర్ఎస్కు 631 అర్జీలు
బోట్క్లబ్(కాకినాడ): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, ట్రైనీ కలెక్టర్ మనీషా, డీఆర్వో జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాసు, సీపీవో పి.త్రినాఽథ్, జీజీహెచ్ ఎస్డీసీ ఎన్ శ్రీధర్ ఇతర అధికారులతో కలిసి హాజరై జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు, విన్నపాలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని అధికారులను ఆదేశించారు. బియ్యం కార్డు మంజూరు, కార్డులోని పేర్లు మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు, రీ సర్వే, ఆక్రమణల తొలగింపు, డ్రైన్ కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, తల్లికి వందనం, ఆన్లైన్ సమస్యలు వంటి అంశాలకు సంబంధించి మొత్తం 631 అర్జీలు అందాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. పరిష్కరించిన దరఖాస్తులను జిల్లా అధికారి ఆడిటింగ్ చేసి నివేదిక పంపించిన తర్వాత వాటిని రాష్ట్ర స్థాయిలో ఆడిట్కి పంపించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీల ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి టోల్ఫ్రీ నంబర్ 1100కి నేరుగా కాల్ చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
గొడవను అడ్డుకోబోతే గొంతు కోసేశాడు
రాజానగరం: ఇద్దరు వ్యక్తులు గొడవపడి, కొట్లాటకు దిగడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేస్తూ, ప్రాణాల మీదకు తెచ్చుకున్న వ్యక్తి ఉదంతమిది. రాజానగరం నడిబొడ్డున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ముత్యాలమ్మ గుడి వద్ద ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన గోళ్ల సాయి, అగత్తి సాయి అనే ఇద్దరు గొడవపడి, కొట్టుకున్నారు. గుడి వద్ద వినాయక చవితికి సంబంధించిన డెకరేషన్ పనులు చేస్తున్న నీలం లక్ష్మీప్రసాద్ దీనిని గమనించి, వారిద్దరినీ విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గోళ్ల సాయి తన వద్ద ఉన్న చాకుతో అతని గొంతును కోశాడు. దీంతో రక్తపు మడుగులో పడిఉన్న లక్ష్మీప్రసాద్ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స జరుగుతుందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పై ఎస్.ప్రియకుమార్ తెలిపారు. మేల్ నర్సుపై సస్పెన్షన్ వేటు కాకినాడ క్రైం: ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో కాకినాడ జీజీహెచ్లో పనిచేస్తున్న మేల్ నర్స్ మోకా సందీప్పై అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో సందీప్పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం సందీప్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు. విధులకు మద్యం తాగి రావడం, బాధ్యతాయుతమైన నర్సు విధుల్లో పనిచేస్తూ ఓ మహిళ నగ్న ఫొటోలు ఆమెకు తెలియకుండా తీయడం, వాటిని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేయడం, బాధితురాలిని కొట్టి అఘాయిత్యానికి పాల్పడడం, ఆ ఫొటోలను ఆమె కుమారుడికి పంపడం తద్వారా ఆ బాలుడిని ఆత్మహత్యకు పురిగొల్పడం అంశాలు ఎఫ్ఐఆర్లో పొందుపరచడంతో అవే అంశాల ప్రాతిపదికన సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడన్న సహ మేల్ నర్సుల ఫిర్యాదుతో అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఎక్కువ రోజులు సెలవులో ఉంటున్న సందీప్కు అసలు అన్నాళ్లు సెలవు ఎవరు ఇస్తున్నారు, అలాగే సందీప్కు సహాయకారిగా ఉంటూ అతడి సెలవు దరఖాస్తులను అధికారులకు ఎవరు అందిస్తున్నారనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. -
శ్రీపాద శ్రీవల్లభ స్వామికి లక్ష బిల్వార్చన
పిఠాపురం: ప్రముఖ దత్త పుణ్యక్షేత్రమైన శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో శ్రీపాద శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో భాగంగా పిఠాపురంలో ఆరవ రోజు సోమవారం లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. ఈ సంధర్భంగా స్వామికి ఏకాంత సేవ, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ సౌజన్య తెలిపారు. స్వామివారికి విశేష అలంకారం చేయగా పలువురు భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవల్లభ సప్తాహ మహోత్సవాల సందర్భంగా మరాఠీ భక్తులు పోటెత్తారు. 10 వేల మంది మహారాష్ట్ర భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ఆనంద తాండ్రవం
● ఏడాది పొడవునా తాండ్ర తయారీ ● జిల్లాలో 17 పరిశ్రమల్లో కూలీలకు ఉపాధి ● వివిధ జిల్లాలకు సరకు ఎగుమతి కాకినాడ రూరల్: తాండ్ర తినవయ్యా... ఆనందించవయ్యా అన్నట్లు మామిడి తాండ్రకు కాకినాడ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏడాది పొడవునా తాండ్రను తయారు చేయడం విశేషం. అందుకే చిన్నారుల నుంచి పెద్దల వరకూ లొట్టలేసుకుని తింటుంటారు. మామిడి కాయలుగా ఉన్నప్పుడు ఆవకాయ, ఊరగాయగా.. పండ్ల రసంతో తాండ్ర రుచిని ఏడాది పొడవునా ఆస్వాదిస్తున్నారు. తియ్యదనాన్ని పంచే తాండ్ర తయారీలో జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి తాండ్రను ఇతర రాష్ట్రాల ప్రజలు లొట్టలేసుకుని తినేలా ప్రాచుర్యం పొందింది. స్థానికంగా పండే మామిడితో పాటు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుని తాండ్ర తయారీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవి ఎండల వేళ పనులు లేని సమయంలో కుటీర పరిశ్రమగా నిలుస్తున్న ఈ తయారీ ఎన్నో వేల కుటుంబాలకు ఉపాధి అందిస్తోంది. జిల్లాలో ముఖ్యంగా కాకినాడ రూరల్ మండలంలో పండూరు, సర్పవరం, తమ్మవరం గ్రామాలు ప్రసిద్ధి చెందాయి. సర్పవరంలో సుమారు ఎనిమిది దశాబ్దాల కిందట ప్రారంభమైన దినదిన ప్రవర్థమానంగా మారింది. కాకినాడ రూరల్తో పాటు చేబ్రోలు, చిన్నయ్యపాలెం, ధర్మవరం, జగ్గంపేట మండలం రాజపూడి, మల్లిసాల తదితర గ్రామాలకూ ఈ వ్యాపారం విస్తరించింది. జిల్లా సుమారు 17 చోట్ల ఏడాది పొడవునా తాండ్ర తయారు చేస్తున్నారు. అత్యధికంగా కాకినాడ రూరల్లో తయారీ ఉంది. వేసవిలో మొదలై ఏడాది పొడవునా కూలీలకు పనులు కల్పిస్తున్నారు. మన ప్రాంతంలో పండే మామిడి కాయలతో పాటు కృష్ణా జిల్లా నూజివీడు, ఖమ్మం, చిత్తూరు, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి లారీల్లో భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. ఏటా సీజనల్గా జిల్లాకు 80 వేల టన్నులకు పైబడి మామిడి దిగుమతి అవుతుందని అంచనా. వేసవిలోనే తాండ్ర తయారీతో సరిపెట్టుకోకుండా, ఏడాదికి సరిపడే మామిడి జ్యూస్ను తయారు చేసుకుని నిల్వ ఉంచుకుంటున్నారు. తద్వారా ఏడాది పొడవునా డిమాండ్కు అనుగుణంగా తాండ్ర తయారు చేస్తున్నారు. వేసవిలో ఏటా సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. అన్ సీజనల్లో వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ తయారయ్యే తాండ్రను ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఏటా సుమారు 50 వేల నుంచి 70 వేల టన్నుల వరకూ ఎగుమతి అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గిన ధరలతో జోష్ ఈ ఏడాది వేసవిలో మామిడి ధరలు తగ్గాయి. తాండ్ర తయారీలో కలెక్టర్ రకం మామిడిని వినియోగిస్తారు. గత ఏడాది టన్ను ధర రూ.20 వేల వరకూ పలకగా ఈ ఏడాది అఽత్యధికంగా రూ.13 వేలు పలికింది. సీజన్ ముగింపు దశలో ఽమామిడి ధరలు పతనమవ్వడంతో టన్ను కాయలు రూ.6 వేలకు రావడంతో తాండ్ర తయారీదారులు జ్యూస్ నిల్వలు పెంచుకోగలిగారు. అందుకే ఈ ఏడాది వ్యాపారం బాగుందని అంటున్నారు. ఆరోగ్యానికి ఎంతో మేలు సీజనల్గా లభ్యమయ్యే మామిడి పండ్ల రసంతో తయారు చేసే తాండ్ర ఏడాది పొడవునా లభ్యమవుతోంది. దాదాపు 20 గ్రాముల తాండ్రలో 67 కేలరీలు పోషకాలు, 0.3 గ్రాముల ప్రోటీన్లు, 0.1 గ్రాముల కొవ్వు, 17.5 గ్రాముల కార్బో హైడ్రైట్లు ఉంటాయి. ఇందులో ఉన్న విజమిన్– ఏ శరీర ఆరోగ్యంతో పాటు కంటిచూపునకు మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. విటమిన్ – సీ రోగ నిరోధక శక్తిని పెంచేందుకు, వ్యాధుల నుంచి రక్షణకు దోహదపడుతుంది. తాండ్రలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో శరీర కణాలకు మేలు చేయడమే కాకుండా పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పీజు పదార్థాలు పేగుల కదలికల క్రమబ ద్ధీకరణకు, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులు తక్కువ తీసుకోవడమే మేలు. అధికంగా తింటే దంత క్షయం, ఊబకాయం సమస్యలు రావొచ్చు. -
రక్తం చిందిన రహదారులు
● వేర్వేరు ఘటనల్లో నలుగురి మృతి ● ఆయా గ్రామాల్లో విషాదం గోపాలపురం / రాజానగరం/ ఉప్పలగుప్తం/ శంఖవరం: రహదారులు రక్తమోడాయి.. అనుకోని ప్రమాదాలు ఆ కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోపాలపురం మండలం సాగిపాడు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామానికి చెందిన ముప్పిడి నరేష్ (26) బైక్పై అతని స్నేహితుడు నున్న బాలుతో గోపాలపురం మండలం గుడ్డిగూడెం తన చెల్లి ఇంటికి వచ్చి వేరే పనిపై సాగిపాడు వెళ్లారు. తిరిగి వస్తుండగా సాగిపాడు మలుపు వద్ద గోపాలపురం నుంచి సాగిపాడు వెళుతున్న వ్యాన్ బలంగా ఢీకొంది. దీంతో ముప్పిడి నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన నున్న బాలును 108 అంబులెన్స్లో రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పి.మనోహర్ తెలిపారు. రాజానగరంలో మహిళ.. జాతీయ రహదారిపై రాజానగరం వైఎస్సార్ జంక్షన్ వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన అనిశెట్టి లత (39) మృతి చెందింది. రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్ సమీపంలో నివాసం ఉంటున్న లత రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చింది. పై జంక్షన్ వద్ద రోడ్డు దాటుతున్న ఆమెను బైకు ఢీకొనడంతో తలకు బలమైన గాయమైంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి భర్త అనిశెట్టి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రొయ్యల వ్యాన్ ఢీకొని.. రొయ్యల వ్యాన్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఉప్పలగుప్తం ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. వానపల్లిపాలేనికి చెందిన కోలా వీర రాఘవులు (75) ఉప్పలగుప్తం నుంచి వానపల్లిపాలెం సైకిల్పై వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రొయ్యల వ్యాన్ వానపల్లిపాలెం వైపు వెళ్తూ వీర రాఘవులకు తగిలింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించామని ఎస్సై వివరించారు. కత్తిపూడిలో మరొకరు.. కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ప్రకాశం జిల్లా మార్కాపురం గ్రామానికి చెందిన మోతే సూరిబాబు (40) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. తాటిపర్తి నుంచి పాట్నా బొగ్గు లోడు లారీలో క్లీనర్గా వెళ్తుండగా కత్తిపూడి ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద పని నిమిత్తం సూరిబాబు లారీ దిగాడు. పని ముగించుకుని రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం అడిషినల్ ఎస్సై ప్రసాద్ తెలిపారు. -
నీట్లో మెరిసిన ముత్యం
పెద్దాపురం: నీట్ ఫలితాల్లో కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామానికి చెందిన మాసా యామిని సౌమ్యశ్రీ ప్రతిభ చాటింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో తొలి ప్రయత్నంలోనే ఆమెకు సీటు దక్కింది. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విశ్వ విద్యాలయం ఆదివారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఈ మేరకు ఆమె ఉచిత సీటును దక్కించుకుంది. యామిని డాక్టర్ కావాలనే లక్ష్యంతో విద్య కొనసాగించింది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఈడుపుగల్లు ఐఐటీ నీట్ అకాడమీలో ఆమె ఇంటర్తో పాటు ప్రత్యేక శిక్షణ పొందింది. తండ్రి మాసా చంద్రరావు పారా లీగల్ అడ్వయిజర్ కాగా, తల్లి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తుంది. యామిని తన లక్ష్యాన్ని చేరుకోవడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. -
ఎందరికో ఉపాధి
ఏటా సీజనల్గా లభ్యమయ్యే మామిడి కాయలను కొనుగోలు చేసి తాండ్ర తయారీకి వినియోగిస్తున్నాం. ఏడాదికి సరిపడేలా జ్యూస్ నిల్వ ఉంచుకుంటున్నాం. ఒక్కో పరిశ్రమలో వంద మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మగవారికి రూ.800 నుంచి రూ.900 వరకు, ఆడవారికి రూ.600 వరకూ కూలి ఇస్తున్నాం. తాండ్ర ధర ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.100 వరకూ ఉంది. తాండ్ర తయారీ ద్వారా కూలీలకు ఉపాధి కల్పిస్తున్నామనే సంతృప్తి ఉంది. – వలవల వెంకటేశ్వరరావు, తాండ్ర తయారీదారుడు, పండూరు -
బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం రూరల్: కాకినాడలో జరిగిన ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అండర్– 19 అమరావతి చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి బ్యాడ్మింటన్ బాలుర సింగిల్స్ విభాగంలో విన్నర్గా మలికిపురానికి చెందిన నందకిశోర్, రన్నర్గా కృష్ణకార్తీక్, డబుల్స్ బాలుర విభాగంలో విన్నర్గా అమలాపురానికి చెందిన బి.ఆదిత్యరామ్, రన్నర్గా మలికిపురానికి చెందిన వై.గౌతమ్కుమార్, బాలికల డబుల్స్ విభాగంలో రన్నర్గా ఎం.రమ్య, రిత్విక నిలిచారు. డబుల్స్ విభాగంలో విజేతలు ఆదిత్యరామ్, గౌతమ్కుమార్లు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కాకినాడ డీఎస్ఓ శ్రీనివాస్, జాతీయ అంపైర్ పాయసం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బీవీవీఎస్ఎన్ మూర్తి ఆదివారం అభినందించారు. -
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
అల్లవరం: బోడసకుర్రు బ్రిడ్జి వద్ద్ద దారి తెలియకుండా ఇబ్బంది పడుతున్న పదేళ్ల బాలుడు మల్లిపూడి చిరును వారి తల్లిదండ్రులకు ఆదివారం సాయంత్రం అప్పగించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న మల్లిపూడి ఏసులక్ష్మి పాలకొల్లు వెళ్లింది. తల్లి పాలకొల్లు వెళ్లిన తర్వాత చిరు, తల్లి వద్దకు పాలుకొల్లు వెళ్లాలని బయలుదేరి కొమానపల్లి నుంచి బోడసకుర్రు వరకూ తన సైకిల్పై వచ్చాడు. బోడసకుర్రు బ్రిడ్జి వరకూ వచ్చే సరికి దారి తెలియక ఇబ్బంది పడుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో అల్లవరం పోలీసులు స్పందించి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. బాలుడి నుంచి మరింత సమాచారం సేకరించిన పోలీసులు ముమ్మిడివరంలోని చిరు తల్లిదండ్రులు ఏసులక్ష్మి, సతీష్లకు సమాచారం అందించామని ఎస్సై సంపత్కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత చిరుని అప్పగించామని అన్నారు. -
కార్పొరేటుకు సలామ్
● పుట్టుగొడుగుల్లా కిండర్ గార్డెన్ స్కూళ్లు ● అనుమతులు పదుల్లో.. నిర్వహణ వందల్లో ● ఇదే బాటలో ప్రైమరీ, హైస్కూళ్ల నిర్వహణ ● నోటీసులు జారీకే విద్యాశాఖ పరిమితం ● ఆమ్యామ్యాలతో చర్యలు తీసుకోని అధికారులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారంగా మార్చేశాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుందామనే రీతిలో వ్యవహరిస్తూ తల్లిదండ్రుల ఆశలను చక్కగా క్యాష్ చేసుకుంటున్నాయి. జిల్లాలో కిండర్ గార్డెన్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. రకరకాల పేర్లు పెట్టి ఫీజులను అమాంతంగా పెంచేసి దోచుకుంటున్నారు. అనుమతుల్లేకపోయినా ఇష్టారాజ్యంగా ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నారు. యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా వాటి నిర్వహణ సాగుతోంది. జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ధనదాహంతో అడ్డదారులు తొక్కుతున్నాయి. అందినకాడికి దండుకోవడమే లక్ష్యంగా వీరు చెలరేగిపోతున్నారు. పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో ప్రభుత్వ 1285, ప్రైవేట్ పాఠశాలలు 573 ఉన్నాయి. ఇందులో 3 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీటిని నర్సరీ నుంచి పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు. మరోవైపు కిండర్ గార్డెన్ పేరుతో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ నిర్వహిస్తున్న స్కూళ్లు ప్రభుత్వ అనుమతిని విధిగా పొందాల్సి ఉంది. అయితే ఎలాంటి పర్మిషన్లను పొందకుండానే జిల్లాలో 200 వరకూ ఉండగా ఒక్క కాకినాడ నగరంలోనే 50 స్కూళ్లను నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో ఫీజులు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. ఈ ఉదంతంపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు పేరెంట్స్ అసోసియేషన్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రయోజనం లేదు కార్పొరేట్ యాజమాన్యాల నుంచి మామూళ్లను భారీగా పుచ్చుకొని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అధిక ఫీజులు, పుస్తకాల పేరిట దోపిడీ జరుగుతున్నా మిన్నకుండిపోతున్నారు. దీనిపై కలెక్టర్ జోక్యం చేసుకోవాలి. అనుమతుల్లేని స్కూళ్లపై చర్యలు చేపట్టాలంటూ విద్యాశాఖాధికారులకు పలుమార్లు వినతిపత్రాలను అందజేసినా ప్రయోజనం లేదు. – ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనుమతులు పొందాల్సిందే.. నగరంలో అనుమతుల్లేకుండా పాఠశాలలను నడుపుతున్న యాజమాన్యాలకు నోటీసులను జారీ చేస్తున్నాం. నూతన విద్యా పాలసీ ప్రకారం కిండర్ గార్డెన్కు అనుమతులు పొందాల్సిందే. – పిల్లి రమేష్, డీఈఓ, కాకినాడ జిల్లా సమాచారం నిల్.. జిల్లా విద్యాశాఖాఽధికారి కార్యాలయంలో కిండర్ గార్డెన్ స్కూల్ వివరాలు నమాదైన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదు. కార్యాలయ అధికారులు తగిన సమాచారం లేదంటున్నారు. ఏవో మొక్కుబడిగా అనుమతుల కోసం కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయంటూ జిల్లా విద్యాశాఖ అధికారులు తాజాగా సెలవిస్తున్నారు. అనుమతుల్లేకుండా నిర్వహిస్తున్నా, నేటికీ ఒక్క స్కూల్పై సైతం చర్యలు చేపట్టలేదంటేనే కార్పొరేట్ యాజమాన్యాలతో వారికి ఉన్న బంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు పదుల సంఖ్యలో కార్పొరేట్ యాజమాన్యాలు అనుమతుల్లేకుండా ప్రాథమిక, హైస్కూళ్లను నిర్వహిస్తున్నాయి. పట్టని విద్యాశాఖాధికారులు అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు చేపట్టకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు మౌనం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి, అర్బన్ అధికారులు కనీసం ఏక్కడా తనిఖీ చేపట్టిన సందర్భాలు లేవని బాహాటంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా అనుమతి లేని పాఠశాలలపై కలెక్టర్ ఉక్కు పాదం మోపాలని పలువురు కోరుతున్నారు. -
ఘనంగా సత్యదేవుని రథసేవ
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి సన్నిఽధిలో ఆదివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తూర్పురాజగోపురం వద్దకు తీసుకువచ్చి రథంపై ప్రతిష్ఠించారు. అనంతరం అర్చకస్వాములు పూజలు చేసి రథ సేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను మూడుసార్లు ఆలయ ప్రాంగణంలో రథంపై ఊరేగించారు. ఊరేగింపు అనంతరం స్వామి, అమ్మవార్లకు మళ్లీ పూజలు చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. -
సేవలు నిలిఛీ...
ఫ సచివాలయాల్లో ఆగిన ఆధార్ కేంద్రాలు ఫ డీఏల బదిలీల్లో లోపించిన పారదర్శకత ఫ ఉదాసీనంగా వ్యవహరిస్తున్న పోస్టల్ శాఖ ఫ మీ సేవా కేంద్రాల్లో పడిగాపులు ఆలమూరు: సేవలకు స్వస్తి పలికారు.. మనకెందుకులే అని మంగళం పాడారు.. అన్నింటికీ ఆధార్ తప్పనిసరి అని చెబుతూనే వీటి మంజూరు, మార్పులు, చేర్పులకు ఎక్కడా అవకాశం లేకుండా చేశారు.. గత ప్రభుత్వంలో సచివాలయాల్లో అందించిన ఆధార్ సేవలకు గుడ్ బై చెప్పడం, పోస్టాఫీసుల్లో సరైన సాఫ్ట్వేర్ లేదని ఆపేయడంతో దిక్కుతోచక సేవల కోసం లబ్ధిదారులు అటూ ఇటూ పరుగులు తీసే రోజులు తెచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ పురుడు పోసుకుంది. సమస్త సేవలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇలా జిల్లాలోని 385 గ్రామాల పరిధిలో 515 సచివాలయాలు ఏర్పడ్డాయి. ఇందులో 467 గ్రామ, 48 వార్డు సచివాలయాలు ఉన్నాయి. గ్రామ సచివాలయాల ద్వారా 5.24 లక్షల కుటుంబాలకు చెందిన 18.33 లక్షల జనాభాకు నిత్యం సేవలు అందించాల్సి ఉంది. గతంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటైన 2,578 ఆధార్ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు పది వేల మంది వరకూ నామమాత్రం రుసుంతో సేవలు పొందేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అస్తవ్యస్త విధానాలతో సేవలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ వస్తోంది. ఉదాహరణకు, ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామ సచివాలయంలో గత వైఎస్సార్ సీపీ హయాంలో ఆధార్ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడి డిజిటల్ అసిస్టెంట్కు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ అందించింది. దీంతో రోజూ సుమారు 50 మంది ఆధార్ సేవలు అందించేవారు. ఇటీవల ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా జరిపిన బదిలీల్లో ఆ డిజిటల్ అసిస్టెంట్ కపిలేశ్వరపురం మండలానికి వెళ్లిపోయారు. ఇలా ఇక్కడ ఆధార్ సేవలు నిలిచిపోయాయి. పెదపళ్ల సచివాలయానికి బదిలీపై వచ్చిన కొత్త డిజిటల్ అసిస్టెంట్కు ఆధార్ సేవల పట్ల అవగాహన లేదు. బదిలీ సమయం, అంతకు ముందుకాని, ఆ తరువాత కాని ఆధార్ సేవలకు సంబంధించి ప్రభుత్వం శిక్షణ ఇవ్వలేదు. దీంతో ఆధార్ కేంద్రానికి వెళితే ప్రభుత్వం ఇంకా ఆధార్ సేవలకు సంబంధించి ఏ విధమైన ఆదేశాలు ఇవ్వలేవని, ఇంకా ఆధార్ బాధ్యతలు అప్పగించ లేదని ఠక్కున సమాధానం వస్తుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఆధార్ సేవల కోసం శిక్షణ తీసుకున్న డిజిటల్ అసిస్టెంట్లను ఆధార్ కేంద్రం లేని చోటుకు, శిక్షణ తీసుకోని డిజిటల్ అసిస్టెంట్ను ఆధార్ కేంద్రం వద్దకు బదిలీ చేయడం వల్లే ఈ దుస్థితి దాపురించిందనే ఆరోపణ ఉన్నాయి. బదిలీలు జరిగి రెండు నెలలు కావొస్తున్నా ఆధార్ కేంద్రం ఉన్న సచివాలయానికి బదిలీపై వెళ్లిన డిజిటల్ అసిస్టెంట్లకు ఇప్పటి వరకూ శిక్షణ మాత్రం ఇవ్వలేదు. చేసేదిలేక.. ఎదురుచూడలేక గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థ రోజురోజుకు నిర్వీర్యం అవుతుంది. ఇటీవల హేతుబద్ధీకరణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా మారింది. బదిలీల్లో పారదర్శకత లేక గ్రామ సచివాలయాల్లో ఆధార్ సేవలు అందకుండా పోయాయి. అత్యవసర సేవల కింద పోస్టాఫీస్ల వద్దకు వెళ్లి చేయించుకుందామన్నా సాఫ్ట్వేర్ మారిందంటూ పోస్టల్ సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. చేసేదేమీ లేక మీ సేవా కేంద్రాలను ఆశ్రయిస్తూ గంటల తరబడి ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడక్కడా కొన్నిచోట్ల స్లాట్ విధానం పేరిట నిర్వాహకులు అడ్డగోలుగా దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పోస్టల్... సేవలు డల్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సబ్ పోస్టాఫీసుల్లో ఆధార్ సేవలను అందించాలి. దానికనుగుణంగా సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు సాంకేతిక పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రెండు నెలల కిందట పోస్టల్కు సంబంధించి సాఫ్ట్వేర్ మారిందంటూ ఇక్కడా ఆధార్ సేవలు నిలిపివేశారు. మండలానికి రెండు లేదా మూడు పోస్టాఫీస్లు ఉన్నా పని భారమో లేక పని ఒత్తిడి వల్లనో తెలియదు కాని జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల పోస్టల్ ఉద్యోగులు ఆధార్ సేవలను అందించేందుకు సుముఖంగా ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాల వద్ద రద్దీ పోస్టల్, సచివాలయాల నుంచి ఆధార్ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో మీ సేవా కేంద్రాలే ఆధార్ సేవలను అందిస్తున్నాయి. అయితే మీసేవా కేంద్రాలు మండలాల్లో పరిమితంగా ఉండటంతో ని త్యం రద్దీ ఉంటుంది. కొన్ని కేంద్రాల్లో స్లాట్ విధా నం పేరిట ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని ఆసరాగా చేసుకుని అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు అందించే రుసుం కంటే మూడు లేదా నాలుగు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారని అంటున్నా రు. దీనిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక ఆధార్ సేవలు అత్యంత ఖరీదుగా మారిపోయాయి. -
ఏలేరులో పెరిగిన నీటి నిల్వలు
ఏలేశ్వరం: ఏలేరు పరివాహక ప్రాంతంలో పడిన వర్షాలకు ప్రాజెక్టులో నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2.198 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఆదివారం నాటికి ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్లకు 80.02 మీటర్లు, 24.11 టీఎంసీలకు 13.48 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ఆయకట్టుకు 1,000, విశాఖకు 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. తిమ్మరాజుచెరువుకు నీటి విడుదల నిలిపివేశారు. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్ కాకినాడ సిటీ: ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జిల్లా స్థాయిలో సోమవారం కాకినాడ కలెక్టరేట్లో గ్రీవెన్స్ హాలులో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అందరూ విధిగా హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి రాలేని అర్జీదారులు వారి అర్జీలను మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. తలుపులమ్మకు రూ.4.98 లక్షల ఆదాయం తుని: లోవ తలుపులమ్మతల్లికి రూ.4.98 లక్షల ఆదాయం సమకూరిందని కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 15 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించారన్నారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,67,550, పూజా టికెట్ల ద్వారా రూ.1,71,690, కేశఖండన టికెట్ల ద్వారా రూ.12,820, వాహన పూజల టికెట్లకు రూ.12,140, కాటేజీల ద్వారా రూ.71,186, విరాళాలుగా రూ.62,863 మొత్తం రూ.4,98,249 ఆదాయం సమకూరిందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేశామని ఈఓ వివరించారు. కన్నబాబుకు మాజీ మంత్రుల పరామర్శ కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటరు, కాకినాడ రూరల్ నియోజకవర్గ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు, ఆయన సోదరుడు, సినీ దర్శకుడు కళ్యాణ్కృష్ణలను వైద్యనగర్ నివాసంలో ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, మాజీ ఎమ్మెల్యేలు గొర్ల కిరణ్కుమార్, పొన్నాడ సతీష్, వైఎస్సార్ సీపీ రాజాం, ఆమదాలవలస కో ఆర్డినేటర్లు టి.రాజేష్, చింతాడ రవికుమార్ తదితరులు కన్నబాబును కలిసి ఓదార్చారు. ఆయన తండ్రి సత్యనారాయణ చిత్ర పటానికి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. త్వరగా కోలుకొని దైనందిన కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా కన్నబాబుకు పలువురు నేతలు సూచించారు. -
సమగ్ర మార్పులతో కొత్త బార్ విధానం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాష్ట్ర ప్రభుత్వం మద్యం నియంత్రణ, వ్యాపార పరిపాలనలో సమగ్ర మార్పులు తీసుకు రావడమే లక్ష్యంగా కొత్త బార్ విధానం తీసుకు వచ్చిందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్శర్మ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో కొత్త బార్ పాలసీ, నవోదయం 2.0 పనితీరుపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ దేవ్శర్మ మాట్లాడుతూ ఈ పాలసీ బార్ లైసెన్సుల మంజూరులో ఆన్లైన్ విధానం, ఎంపిక ప్రక్రియలో సమానత్వం పాటిస్తామన్నారు. ఏపీ వ్యాప్తంగా 840 బార్లు ఉండగా, దీనిలో ఇకపై వాటిలో పది శాతం కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్లు తెలిపారు. లైసెన్స్ ఫీజులు 70 నుంచి 50 శాతానికి తగ్గాయని వివరించారు. ఇందులో భాగంగా 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభాకు రూ.55 లక్షలు, 5 లక్షలపైన జనాభా ఉంటే రూ.75 లక్షల లైసెన్స్ ఫీజు ఉంటుందని అన్నారు. ప్రతి ఏడాది పది శాతం చొప్పున ఫీజులు పెంచుతామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవని, ఇక ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అనుమతి ఉంటుందని అన్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. 28న కలెక్టర్ లాటరీ తీసి బార్లు కేటాయిస్తారని, సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజా ఆరోగ్యం, సమాజ శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగా సారా వ్యాపారం చేసేవారిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మూడు కన్నా ఎక్కువ సారా కేసుల్లో ఉన్నవారిపై పీడీ యాక్ట్ విధించేలా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎకై ్సజ్ అధికారులు తమ తమ కార్యాలయాల్లో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, సీనియర్ అధికారులతో రాత్రిపూట గస్తీ చేయాలని ఆదేశించారు. సారా వినియోగంతో అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాల్లో విస్తృత దాడులు చేపట్టి సారా రహిత జిల్లాలుగా ప్రకటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళీ, అసిస్టెంట్ కమిషనర్ రేణుక, ఎకై ్సజ్ జిల్లా అధికారులు చింతాడ లావణ్య, ఎస్కేవీడీ ప్రసాద్, ఏఈఎస్లు నాగరాహుల్, రామకృష్ణ, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సర్పంచ్ దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు ప్రధాన రహదారిలో దేవరపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రామన్నపాలెం పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు కూచిపూడి బుల్లారావు(71) దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక పెట్రోల్ బంకులో పెట్రోలు కొట్టించుకోవడానికి బైక్పై వెళ్తున్న సర్పంచ్ కూచిపూడి బుల్లారావును ఎదురుగా వస్తున్న క్వారీ టిప్పర్ లారీ అతి వేగంగా వచ్చి ఢీకొంది. బుల్లారావు తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. సర్పంచ్ బుల్లారావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సత్యదేవుని సన్నిధి.. వరాల పెన్నిధి
● ఘనంగా స్వామివారి జన్మ నక్షత్ర పూజలు ● యాగశాలలో ఆయుష్య హోమం ● ఆలయాన్ని దర్శించిన 20 వేల మంది ● దేవస్థాన ఆదాయం రూ.25 లక్షలు అన్నవరం: స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరిచి, స్వామి, అమ్మవార్లకు అర్చకస్వాములు సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల మూలవిరాట్లకు, శివ లింగానికి పండితులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలు తదితర పంచామృతాలతో మహాన్యాశ పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ భరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఘనంగా ఆయుష్య హోమం యాగశాలలో ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు అయుష్యహోమం ఘనంగా జరిగింది. 11 గంటలకు పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఆలయ ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, గంగాధరభట్ల శ్రీనివాస్, వేద పండితులు గొల్లపల్లి ఘనపాటి, చిట్టి శివ, ఉపాధ్యాయుల రమేష్, వ్రత పురోహితుడు పాలంకి పట్టాభి తదితరులు కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఊరేగింపు శనివారం పర్వదినం సందర్భంగా ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను తిరుచ్చి వాహనంపై ప్రతిష్ఠించి పండితులు పూజలు చేశారు. అనంతరం అర్చకులు కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళవాయిద్యాల నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరాగా, మూడు సార్లు ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. అనంతరం స్వామి, అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరిగి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయానికి చేర్చారు. ఇలాఉండగా శనివారం సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. స్వామివారి వ్రతాలు వేయి నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నాలుగు వేల మంది భక్తులకు అన్నదాన పథకంలో భోజనం సౌకర్యం కల్పించారు. -
వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా..
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం శనివారం భక్తులతో పోటెత్తింది. వేకువజాము నుంచే వేలాదిగా భక్తులు వాడపల్లి బాట పట్టారు. పావన గౌతమీ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తర్వాత స్వామివారిని దర్శించుకుని ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఏడు శనివారాల వెంకన్న దర్శనం నోము ఆచరించే భక్తులు మాఢ వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. వైకుంఠవాసా.. శ్రీవేంకటేశా.. గోవిందా.. గోవిందా.. అంటూ ముందుకు సాగారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించి స్వామివారికి వివిధ సేవలు నిర్వహించారు. వివిధ సుగంధ భరిత పుష్పాలతో స్వామివారిని కన్నుల పండువగా అలంకరించారు. దేవస్థానం నిర్వహించిన అన్నసమారాధనలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఇతర అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. వివిధ సేవల ద్వారా ఈ ఒక్కరోజు సాయంత్రం 4 గంటల వరకూ దేవస్థానానికి రూ.55,60,552 ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. రావులపాలెం సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆత్రేయపురం ఎస్ఐ ఎస్.రాము ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఏపీఎస్ ఆర్టీసీ వివిధ ప్రాంతాల నుంచి వాడపల్లి ఆలయానికి బస్సు సర్వీసులను నడిపింది. -
విద్యాభంగం
● విద్యార్థుల ఫీజుల మాటేమిటి బాకా బాబు..! ● కాలేజీకి వెళ్లేదెలా.. చదువులు సాగేదెలా? ● గుదిబండగా ఫీజు రీయింబర్స్మెంట్ ● అప్పులు చేసి కడుతున్న తల్లిదండ్రులు ● బకాయిలు రూ.వంద కోట్లు పైమాటే.. ● విద్యార్థులు 41,413 మంది ఎదురుచూపులు సాక్షి ప్రతినిధి, కాకినాడ: చంద్రబాబు సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా మొండిచేయి చూపిస్తోంది. బకాయిలు రూ.కోట్లలో ఉన్నా చిల్లిగవ్వ కూడా విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డున పడేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము విడుదల చేయకుండా చంద్రబాబు సర్కార్ విద్యార్థులకు నరకం చూపిస్తోంది. ఫీజుల కోసం కాలేజీ యాజమాన్యాలు పెడుతున్న షరతులతో కాలేజీలకు వెళ్లేదెలా అంటూ విద్యార్థులు కంటతడి పెడుతున్నారు. ఫీజులు చెల్లించాకే కాలేజీలకు రండి అని యాజమాన్యాల ఒత్తిళ్లతో విద్యార్థులు దిక్కులు చూసే పరిస్థితి ఎదురవుతోంది. కాలేజీ యాజమాన్యాలు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ సొమ్ము విడుదల కాకపోవడంతో కాలేజీలు నడపలేకపోతున్నామని మథనపడుతున్నారు. చంద్రబాబు ఒంటెద్దు పోకడలతో పరిస్థితి ఇలానే కొనసాగితే, కాలేజీలు మూతపడే దుస్థితి ఏర్పడుతుందని కాలేజీ యాజమాన్య ప్రతినిధులు మండిపడుతున్నారు. మొత్తం విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఒక్క త్రైమాసికానికి చెల్లించి, మిగిలిన మూడు త్రైమాసికాలు ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. కాగా గత విద్యా సంవత్సరానికి మూడు త్రైమాసికాలు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు నేరుగా చెల్లించిన ఫీజులపై సర్వే పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. ఇదంతా లెక్కిస్తే.. దాదాపు రూ.వంద కోట్లు పైమాటే ఉంటుందని అంచనా. విద్యార్థులపై ఒత్తిళ్లు ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత కరవవ్వడంతో పేద, మధ్య తరగతి వర్గాలవారు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్, మిడ్ పరీక్షలు వచ్చిన ప్రతి సందర్భంలోను ఫీజుల కోసం కాలేజీలు ఒత్తిడి చేస్తున్నాయి. మొత్తం ఫీజులు చెల్లించకున్నా, కనీసం సగం ఫీజైనా చెల్లిస్తేనే పరీక్ష రాయిస్తామని కాలేజీలు షరతులు పెడుతున్నాయి. ఇలా ఒకేసారి రూ.50 వేల నుంచి రూ.65 వేలు చెల్లించాలంటే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు తలకు మించిన భారంగా మారింది. ఓ వైపు కాలేజీల ఒత్తిళ్లతో కొందరైతే అప్పులు చేసి ఫీజులు చెల్లిస్తున్నారు. ఉత్తుత్తి ఉత్తర్వులు ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులకు రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాల్సి ఉంది. గడచిన ఏడాది కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తున్నట్టు రెండు పర్యాయాలు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు చూసి ఇంకేముంది సొమ్ములు ఖాతాలకు వచ్చిపడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు గంపెడాశతో ఎదురుచూశాయి. తీరా అవన్నీ చంద్రబాబు హామీల మాదిరిగానే ఉత్తుత్తి ఉత్వర్వులుగానే మిగిలిపోయాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు మాత్రం విడుదల చేయలేదు. విద్యార్థుల అవస్థలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు పూర్తి బకాయి చెల్లించి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాయి. ఫీజు చెల్లించకపోతే సర్టిఫికెట్ ఇచ్చేది లేదని ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు షరతులు పెడుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి విద్య లేదా డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు పొందిన వారు సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకెళ్లండి అని యాజమాన్యాలు చెబుతుండటంతో విద్యార్థులు నరకం చూస్తున్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీసీఏ కోర్సు అభ్యసించిన విద్యార్థి కలగల సత్తిబాబు(పేరు మార్చాం)కి ఏడాదికి రూ.18 వేల చొప్పున రెండేళ్ల పాటు చెల్లించగా, ఈ విద్యా సంవత్సరంలో చెల్లించలేదు. ఐసెట్లో అర్హత సాధించి, ఎంసీఏ కోర్స్ చేయడానికి సర్టిఫికెట్లు అవసరం కావడంతో, సొంతంగా ఫీజు చెల్లించి సర్టిఫికెట్ తీసుకున్నాడు. అదేవిధంగా జేఎన్టీయూకే ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థికి సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం రావడంతో సంబంధిత కంపెనీ సర్టిఫికెట్లు అడగడంతో, ఫీజు మొత్తం చెల్లించి ఉద్యోగంలో చేరాడు. ఇలా విద్య, ఉద్యోగాలకు విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. ఓవైపు కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేశాక చెల్లిస్తామని విద్యార్థుల నుంచి అంగీకార పత్రం తీసుకుని సర్టిఫికెట్లు జారీ చేయమని ఆదేశాలిస్తున్నా.. వాటిని యాజమాన్యాలు ఏమాత్రం పాటించడం లేదు. పథకాలు ఇవ్వలేక.. కళ్లబొల్లి మాటలతో ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసింది తప్పితే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా అందించిన పథకాలను ఇవ్వలేక చేతులెత్తేసింది. అప్పుడే అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటిపోయినా, ఇప్పటికే మూడు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చింది. ఇలా రూ.కోట్లలోనే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులు పూర్తిగా నిలిపివేయడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అధికారంలోకి వస్తే అంతకుమించి ఇస్తామని గొప్పలకు పోయిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక ఆ విషయాన్ని గాల్లో కలిపేశారని వారు మండిపడుతున్నారు.కాకినాడ జిల్లా 2024–25 ఎ.వై. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విడుదల చేసిన వివరాలు కులాల వారీగా.. స్టూడెంట్స్ ఆర్టీఎఫ్ మొత్తం స్టూడెంట్స్ ఎంటీఎఫ్ మొత్తం ఆర్టీఎఫ్ పెండింగ్ ఎస్సీ 6,106 6,09,49,165 5,478 1,08,58,800 0 ఎస్టీ 295 59,74,115 174 7,87,900 0 క్రీస్టియన్ మైనార్టీ 100 15,88,127 0 0 14,00,000 ముస్లిం మైనార్టీ 559 76,37,565 0 0 68,00,000 బీసీ 19,557 25,47,49,771 0 0 21,00,00,000 ఈబీసీ 2,372 4,01,40,833 0 0 3,00,00,000 కాపు 12,424 17,33,52,429 0 0 12,00,00,000 మొత్తం 41,413 54,43,92,005 5,652 1,16,46,700 33,82,00,000 (36,82,00,000) నోట్: రీయింబర్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజు (ఆర్టీఎఫ్), ఎంటీఎఫ్ (మెయింటెనెన్స్ ఫీజు) ఇది వరకు క్రమం తప్పకుండా వచ్చేది నేను ప్రత్తిపాడు నైపుణ్య డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. బీఎస్సీ ఫస్టియర్ పూర్తి చేసి రెండో సంవత్సరంలోకి వచ్చాను. నాకు ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జమ కావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పటికీ పడలేదు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడే నేను కళాశాలలో జాయిన్ అయ్యాను. రీయింబర్స్మెంట్ సొమ్ము పడకపోవడంతో ఫీజు అడుగుతున్నారు. ఫీజు చెల్లించకపోయినా యాజమాన్యం దయతో నన్ను కొనసాగిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్ము జమ చేయాలి. – ద్విభాస్యం ఝాన్సీ ఉమామహేశ్వరి, ప్రత్తిపాడు ఆఖరి ఏడాది రీయింబర్స్మెంట్ రాలేదు సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందినవారం. కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2022–25 మధ్య డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ ఆఖరి ఏడాదికి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో సర్టిఫికెట్లు కళాశాలలో ఉండిపోయాయి. ఫీజు పూర్తిగా చెల్లించిన తరువాతే సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఏపీ పీజీ సెట్లో అర్హత సాధించాను. ఉన్నత విద్య అభ్యసించాలన్నా, ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేయాలన్నా డిగ్రీ ప్రొవిజనల్ అడుగుతున్నారు. డబ్బు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి నాది. – మణి శివసంజయ్, కాకినాడ ఇదే నా చదువుకు ఆధారం మాది పెద్దాపురం మండలం మర్లావ గ్రామం. వ్యవసాయంపైనే ఆధారపడిన కుటుంబం మాది. తండ్రి సూర్యప్రకాష్ కష్టపడి నన్ను ఇంజినీరింగ్ చదివిస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడే చదువుకున్నాను. అప్పుడు ఏ ఇబ్బందీ ఎదురుకాలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో విడతల వారీగా విడుదల కావడంతో కాలేజీల నుంచి ఎటువంటి ఒత్తిళ్లు ఎదురవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంతవరకు ఫీజుల సొమ్ము విడుదల చేయకపోవడంతో కాలేజీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి మా లాంటి రైతు కుటుంబాలను ఆదుకోవాలి. – జగటపు శివరామకృష్ణ, మర్లావ, పెద్దాపురం -
ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి
జిల్లా గ్రంథాలయ ఉద్యోగుల వినతి సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా పని చేస్తున్న గ్రంథాలయ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా చెల్లించాలని ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడు సలాది సాయిసత్యనారాయణ అన్నారు. శనివారం ముఖ్యమంత్రి పెద్దాపురం నియోజకవర్గ పర్యటనను పురస్కరించుకుని ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫిర్యాదుల స్వీకరణ కేంద్రంలో వినతిపత్రం అందజేసినట్టు ఆయన విలేకర్లకు తెలిపారు. గ్రంథాలయాల ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా చెల్లించడం వల్ల సకాలంలో జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగేలా 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా జీతాలు, పెన్షన్లు అందజేయాలని కోరామన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఈ.వెంకట్రావు పాల్గొన్నారు. ప్రజలకు చేరువగా పంచాయతీరాజ్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ సామర్లకోట: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను ప్రజలకు మరింత చేరువగా, పారదర్శంగా మార్చడానికి ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తి విస్తరణ శిక్షణ కేంద్రాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రంలో గత నెల 28 నుంచి ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ, శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి, గ్రామాలు, మండలాల పాలనలో మార్పు తేవాలన్నారు. అప్పుడే ప్రజల అభివృద్ధి, ఉద్యోగులకు సంతృఫ్తి కలుగుతుందన్నారు. స్వర్ణ పంచాయతీ, మేరీ పంచాయతీ యాప్ల ద్వారా పంచాయతీ రాబడి, ఖర్చులను ప్రజలు నేరుగా తెలుసుకోవచ్చని తెలిపారు. పంచాయతీ సంస్థలను ప్రజలకు అందుబాటులో ఉంచి, వారి అభివృద్ధి, సంక్షేమానికి సంస్కరణలు తీసుకువస్తున్నట్టు వివరించారు. భవిషత్తులో శిక్షణలు తప్పనిసరి చేస్తూ ఉద్యోగ నియమావళిలో మార్పు తెస్తామని తెలిపారు. స్థానిక ఈటీసీ ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఫ్యాకల్టీలు శేషుబాబు, శర్మ, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. వికాసలో రేపు జాబ్మేళా కాకినాడ సిటీ: వికాస ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు శనివారం తెలిపారు. బజాజ్ క్యాపిటల్లో ఫైనాన్షియల్ అడ్వయిజర్, టెలికాలర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వెంకీ రెసిడెన్సీలో స్టీవర్డ్, కెప్టెన్, టెక్నీషియన్, ఐసాన్ ఎక్స్పీరియన్సెస్ కంపెనీలో టెలి సేల్స్ రిప్రజెంటేటివ్, డెక్కన్ కెమికల్స్లో ట్రైనీ(మెకానికల్ మెయిన్టెనెన్స్), జూనియర్ ఇంజినీర్, సీనియర్ ఇంజినీర్, కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్, ఇసుజు, వియాష్ లైఫ్ సైన్సెస్, ఇంజి, డిక్సాన్, హ్యుండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నీషియన్, ఫాక్స్కాన్ కంపెనీలో ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమో, బీటెక్లో ఉత్తీర్ణులై, 35 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. అభ్యర్థులు సోమవారం వికాస కార్యాలయానికి ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల కాపీలతో హాజరుకావాలన్నారు. -
కన్నబాబుకు ముఖ్య నేతల పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబును శనివారం పలువురు ముఖ్య నేతలు పరామర్శించారు. కాకినాడ వైద్యనగర్ నివాసంలో కన్నబాబును పరామర్శించి, ఆయన తండ్రి సత్యనారాయణ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. పరామర్శించిన వారిలో మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి వీడిక రాజన్నదొర, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పినిపే విశ్వరూప్, మాజీ ఎంపీ బెల్లాని చంద్రశేఖర్, పాడేరు ఎమ్మెల్యే మత్సరాజు విశ్వేశ్వరరాజు, ఎమ్మెల్సీ కంబ రవిబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనరసయ్య, బి.అప్పలనాయుడు, కండుబండి శ్రీనివాసరావు, జోగారావు, విశ్వసరాయి కళావతి, పర్వత ప్రసాద్, వైఎస్సార్ సీపీ స్పోక్ పర్సన్ యనమల నాగార్జున యాదవ్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. అలాగే కన్నబాబు, ఆయన సోదరుడు కళ్యాణ్ కృష్ణను ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన పలువురు నేతలు పరామర్శించారు. -
ఒరిగిన పిల్లర్ సరిచేసేందుకు కాంట్రాక్ట్ ఖరారు
మలికిపురం: కోటిపల్లి– నరసాపురం రైల్వే లైన్లో భాగంగా దిండి– చించినాడ వద్ద వశిష్ట నది మధ్య నిర్మించిన రైల్వే వంతెనలో ఒక పిల్లర్ సుమారు రెండు నెలల కిందట ఒరిగిన సంగతి పాఠకులకు విధితమే. ఈ పిల్లర్ను సరి చేసేందుకు ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఖరారు అయ్యింది. ఈ వారంలోనే పనులు ప్రారంభం కావాల్సి ఉండగా, వరదల వల్ల వాయిదా పడింది. వరద తగ్గిన తరువాత పనులు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నదిలో ఓ వైపునకు 45 డిగ్రీల మేర ఒరిగిన ఈ వంతెన పిల్లర్ను తిరిగి యథాస్థానంలో ఉంచేందుకు ముంబయి కంపెనీ ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులు, ఇంజినీర్లు ఒరిగిన పిల్లర్ పరిస్థితిని అధ్యయనం చేశారు. దీనిని సరి చేయడానికి దాదాపు రూ. కోటి వరకూ ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనాతో కాంట్రాక్టు ఖరారైనట్లు ఆ వర్గాలు తెలిపారు. ఈ ఖర్చు అంతా కూడా ప్రస్తుత కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వంతెన నిర్మాణంలో ఆఖరు పిల్లరు ఇది భూ గర్భంలోకి వెళ్లే సమయంలో బురద బ్లో అవుట్ సంభవించి ఒరిగిపోయింది. స్థానిక కాంట్రాక్టు ఇంజినీర్లు అప్రమత్తమై రైల్వే ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. దీంతో వారి సూచనల మేరకు డిజైన్ చేసి పిల్లర్ సరిచేసి యథాస్థానంలో ఉంచే విధంగా ప్రణాళిక రూపకల్పన చేశారు. ఈ మేరకు అనుభవం ఉన్న ముంబయి కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. సుమారు 23 మీటర్ల ఎత్తు గల ఈ పిల్లర్ నదిలో ఒరిగిపోయింది. నదిలో మరో 50 మీటర్ల లోతు వరకూ వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 23 మీటర్ల పిల్లర్ నిర్మాణానికి ఇప్పటి వరకూ దాదాపు రూ. 5 కోట్ల ఖర్చు అయ్యింది. రూ.కోటితో పనులకు ముంబయి సంస్థకు అప్పగింత -
కర్యాట్ టైమ్
మూషికాల బెడదను నివారిస్తాం ఖరీఫ్ సీజన్కు సంబంఽధించి పంట పొలాల్లో ఎలుకల బెడద అధికంగా ఉందని గుర్తించాం. అందులో భాగంగా మూషికాల బెడదను నివారించి రైతులకు స్వాంతన చేకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎలుకల ఉధృతిని నివారించేందుకు బ్రోమోడయోలిన్ మందును రైతులకు సరఫరా చేయబోతున్నాం. అలాగే ఎలుకల నిర్మూలనకు పూర్వ సంప్రదాయ రీతికి అనుగుణంగా ఎలుకల కన్నాల్లో పొగను నింపి నిర్మూలనపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – సీహెచ్కేవీ చౌదరి, వ్యవసాయ సహాయ సంచాలకుడు, ఆలమూరు ఆలమూరు: ఎలక చిన్నదే.. సాగులో తెచ్చే నష్టం మాత్రం పెద్దది. అసలే ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఆందోళనలో ఉన్న రైతులకు ఈ సమస్య ప్రాణసంకటంగా మారింది. ప్రస్తుతం పిలక దశలో ఉన్న వరి పంటపై మూషికాల దాడి అధికమైంది. ఒకపక్క ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క ప్రతికూల పరిస్థితులు, ఇంకోపక్క ముషికాల బెడద కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రారంభ దశలోనే ఇలా ఉంటే పంట చేతి కొచ్చే సమయానికి మరింత నష్టాన్ని చేకూర్చుతాయని రైతన్నల్లో ఆందోళన నెలకొంది. సమస్య పరిష్కారానికి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఇంకా బ్రోమోడయోలిన్ మందును పంపిణీ చేయకపోవడంతో రైతులను మనోవేదనకు గురిచేస్తుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాలు, నాలుగు మున్సిపాలిటీల పరిధిలో 1.64 లక్షల ఎకరాల్లో సుమారు 1.40 లక్షల మంది రైతులు ఖరీఫ్ సాగు చేస్తున్నారు. అందులో సుమారు 70 శాతం మేర వెదజల్లు సాగు చేపట్టగా, మిగిలిన పొలాల్లో సాధారణ పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఈ సీజన్లో రైతులు అధిక విస్తీర్ణంలో స్వర్ణ (ఎంటీయూ 1318), తక్కువ విస్తీర్ణంలో ఎంటీయూ 7,029, విత్తనాల కోసం బొండాలు (ఎంటీయూ 3,626), పీఆర్ 126, ఎంటీయూ 1121 రకాన్ని సాగు చేస్తున్నారు. ఇంకా స్పందించక.. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎలుకల నివారణకు వ్యవసాయ శాఖ ఏటా బ్రోమోడయోలిన్్ మందును నూకలు, నూనె మిశ్రమంతో కలిపి రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో పంట పొలాల్లో మూషికాల బెడద ఎక్కువై పంటను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. పంట పొలాల్లో ఎలుకలు తినేదాని కన్నా దాదాపు పది రెట్లు పంటను పాడుచేసే అవకాశం ఉంది. దీంతో పిలుక దశలోనే ఎలుకలను నిర్మూలిస్తే చిరు పొట్ట దశకు చేరుకునే సరికి వరి పంటకు సంబంధించి నష్ట నివారణకు దోహదపడుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ స్పందించి ఎలుకల నివారణకు బ్రోమోడయోలిన్ మందును త్వరితగతిన పంపిణీ చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇదో అదనపు ఖర్చు పంట పొలాలను నాశనం చేస్తున్న ఎలుకలను సంప్రదాయ పద్ధతిలో పట్టించేందుకు అఽధిక ఖర్చు అవుతుంది. చిలుకలు పండ్లను కొరికి పడేసినట్టు ఎలుకలు వరి దుబ్బులను కొరకడంతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వరి పంటను పూర్తి స్థాయిలో రక్షించాలనుకునేందుకు ఖర్చుకు వెనకాడని పరిస్థితి ఉంది. అందులో భాగంగానే బుట్టల సహాయంతో, పొగపెట్టే విధానంతో ఎలుకలను మట్టుబెట్టే చర్యలకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఒక ఎకరం భూమిలో సరాసరి సుమారు 50 ఎలుకలకు పైగా పట్టివేత జరుగుతుండగా, ఒక్కొక్క ఎలుకకు కార్మికులు రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో ఎకరాకు ఎలుకల నివారణకే రూ.మూడు వేల వరకూ ఖర్చు అవుతుందని రైతులు అంటున్నారు. ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో వాటిని పట్టేవారికి అదే స్థాయిలో డిమాండ్ కూడా ఉంది. సామూహిక నివారణ సాధ్యమేనా! వ్యవసాయ శాఖ ఏటా పంపిణీ చేసే బ్రోమోడయోలిన్ మందు సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవడం సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సామూహిక ఎలుకల నిర్మూలన చేపట్టడం ద్వారా పంట పొలాల్లో అధిక భాగం ఎలుకలను నిర్మూలించేందుకు అవకాశం ఉన్నందున ఆ మేరకు వ్యవసాయ శాఽఖ చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అయితే బ్రోమోడయోలిన్ మందును ఇంకా పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో సామూహిక ఎలుకల నివారణ సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఫ పంటలపై ఎలక్కొట్టుడు ఫ పిలక దశలో పంట ధ్వంసం ఫ నివారణకు అధికారుల చర్యలు శూన్యం ఫ ఆందోళనలో అన్నదాతలు -
పరదాల మాటున చంద్రబాబు పర్యటన
పెద్దాపురం: సీఎం చంద్రబాబు నాయుడు పెద్దాపురం పర్యటన శనివారం కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ, పరదాలమాటున సాగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ర్యాలీకి చంద్రబాబు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం అక్కడి డ్రెయిన్లను సీఎం పరిశీలించారు. వాటి నిర్మాణం, ఉపయోగం గురించి పారిశుధ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం సెంటర్ సమీపంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అధ్యక్షతన నిర్వహించిన ప్రజా వేదికలో ప్రసంగించారు. పరదాల మాటున.. చంద్రబాబు ఆద్యంతం పరదాల మాటున పర్యటన నిర్వహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామర్లకోట, పెద్దాపురం వెళ్లే రోడ్లను మూసి వేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వేల మంది పోలీసులతో రోడ్లను దిగ్బంధించడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రెండు గ్రామాలకూ రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కువగా మఫ్టీలో పోలీసులు పహారా కాయడం విశేషం. చంద్రబాబు పాదయాత్ర చేసిన 100 మీటర్ల దూరం అంతా రెండు వైపులా ఫ్లెక్సీలతో మూసి వేశారు. సభ ముగిసిన తర్వాత టీడీపీ కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు వెళ్లే వరకు సుమారు 45 నిమిషాల పాటు సభా ప్రాంగణం నుంచి జనాన్ని బయటకు రాకుండా ఆంక్షలు విధించారు. దీంతో సభకు వచ్చిన జనం అక్కడే ఉండిపోయారు. -
ఆర్డీఓకు అస్వస్థత
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గంలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను పురస్కరించుకొని శుక్రవారం బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు అస్వస్థతకు గురయి ఒకసారిగా కుప్పకూలి పోయారు. వెంటనే ఆర్డీఓ సిబ్బంది స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ ట్రస్టు ఆస్పత్రికి తరలించామని తహసీల్దార్ కొవ్వూరి చంద్రశేఖరరెడ్డి తెలిపారు. బీపీ కారణంగా అస్వస్థతకు గురి అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని డాక్టర్లు తెలిపారు. నేడు పెద్దాపురంలో ముఖ్యమంత్రి పర్యటన సామర్లకోట: స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దాపురంలో పర్యటిస్తున్నట్లు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆర్ కృష్ణకపర్ధి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్లోని ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్లో దిగుతారు. అక్కడి నుంచి పెద్దాపురంలోని 10వ వార్డు నిర్మాణం చేసిన మేజిక్ డ్రైన్ను, స్వచ్ఛ రథంను సందర్శిస్తారు. శానిటరీ వర్కర్లకు ఇన్సూరెన్సు కిట్లు అందజేస్తారు. స్వచ్ఛ ర్యాలీలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.40 వరకు సామర్లకోట–పెద్దాపురం రోడ్డులోని లేఆవుట్లో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక వద్ద స్టాల్స్ విజిట్ చేసి అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సమీపంలో ఉన్న పూర్ణా కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్లో తాడేపల్లి చేరుకొంటారు. నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి ప్రత్తిపాడు: పెద్దాపురం, ఎటపాకలలోని పీఎం శ్రీ జవహర్ నవోదయ పాఠశాలలో ఆరవ తరగతిలోకి ఉచిత ప్రవేశాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్టు ప్రత్తిపాడు మండల విద్యాశాఖాధికారి వి.రాజబాబు తెలిపారు. పెద్దాపురం నవోదయ విద్యాలయ పరిధిలోని పెద్దాపురం, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, సామర్లకోట, పెదపూడి, జగ్గంపేట, కాజులూరు, కిర్లంపూడి, కరప, తాళ్ళరేవు, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ కొత్తపల్లి, గండేపల్లి మండల పరిధిలోని వారు, ఎటపాక నవోదయ విద్యాలయకు తుని, తొండంగి, కోటనందూరు, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం మండలాలకు చెందిన విద్యార్థులు 2026–27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఆఖరు తేదీ ఈ నెల 27లోగా దరఖాస్తు చేసుకోవాలని, డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పారు. మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రదానోపాధ్యాయులు అర్హత కలిగిన విద్యార్థులను ఈనెల 27 లోగా దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరారు. 25న జాబ్ మేళా బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఈ నెల 25వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి జి.వసంతలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఆశోక్ లేలాండ్ సంస్థ 40, టీమ్లీజ్ సర్వీస్ (బ్యాంక్ సర్వీస్) 220, పేటీఏం 200, సోలార్ సిస్టమ్ 100, క్రెడిట్ యాక్సెస్ 300 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయన్నారు. పదవ తరగతి ఆపైన ఐటీఐ, డిప్లమో, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు హాజరుకావవచ్చని, ఇతర వివరాలకు 86398 46568 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీల షెడ్యూల్ విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): టీచర్ల అంతర్ జిల్లా బదిలీలకు (భార్యాభర్తలు, పరస్పర అంగీకారం చేసుకునేవారికి మాత్రమే) ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ నెల24 వరకు ఆన్లైన్లో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు ఫారం ప్రింటవుట్లను సంబందిత మండల విద్యాశాఖాధికారికి సమర్పించాలన్నారు. 22 నుంచి 25 వరకు మండల విద్యాశాఖాధికారి ధ్రువీకరిస్తారన్నారు. 28, 29 తేదీలలో పాఠశాల విద్యా డైరెక్టర్ కార్యాలయంలో తుది నిర్ధారణ జరుగుతుందన్నారు. -
విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్
కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్ కార్యక్రమ పోస్టర్ను శుక్రవారం స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 77ను రద్దు చేసి, ప్రైవేట్ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్, నగర నాయకులు సత్యం, ఆదర్శ్ కార్త్తిక్, తేజ తదితరులు పాల్గొన్నారు. -
వాడపల్లిలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
● తరలివచ్చిన మహిళలు ● పూజా సామగ్రిని సమకూర్చిన దేవస్థానం కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకన్న క్షేత్రంలోని ఉత్తర ప్రాంగణంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహించారు. సుమారు రెండు వేల మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్, అర్చకులు వాడపల్లి రవికిరణ్, ఖండవిల్లి సాయిరామకృష్ణ తదితరులు ఉదయం కల్యాణ మంటపం వేదికపై వరలక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు పండితుల మంత్రోచ్ఛారణ మధ్య డీసీ అండ్ ఈఓ చక్రధరరావుతో పండితులు పూజ చేయించి వ్రతాన్ని ప్రారంభించారు. పూజలో పాల్గొన్న వారందరికీ వరలక్ష్మీదేవి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్తాపన, కుంకుమ పూజల అనంతరం పురాణ వ్యాఖ్యానం నడుమ వరలక్ష్మీదేవి వ్రతం చేయించారు. -
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే ● అమల్లోకి పాస్ విధానం ● రూ.3 వేలతో పొందే అవకాశం ● ఏడాది లేదా 200 ట్రిప్పులకు చెల్లుబాటు ఐ.పోలవరం: జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ (చార్జీ) చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు, ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోల్ కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్నిచోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కో ట్రిప్పుకు (టోల్గేటు) ఇరువైపులా కలిపి రూ.90 నుంచి 200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాస్ విధానం తీసువచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు, లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి, తిరిగి వెనక్కి వస్తే ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క. దేశవ్యాప్తంగా 1,150 టోల్ గేట్లు గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా, ఆ తరువాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకూ తగ్గిపోయింది. దేశ వ్యాప్తంగా సుమారు 1,150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. కోనసీమ జిల్లాలో 216 జాతీయ రహదారిపై ముమ్మిడివరం మండలం అయినాపురం వద్ద, 216 ఏ జాతీయ రహదారిపై రావులపాలెం మండలం ఈతకోట వద్ద టోల్గేట్లు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో ఎన్హెచ్ 216పై గొల్లప్రోలు వద్ద, ఎన్హెచ్ 16పై కృష్ణవరం వద్ద ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు, నల్లజర్ల వద్ద టోల్గేట్లు కనిపిస్తాయి. పాస్ పొందే విధానం ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తోంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా, వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్కు వినియోగించే కార్లకు, జీప్లకు, వ్యాన్లకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ ప్రెస్ రహదారులలోని అన్ని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. అయితే ఉత్తరాదిన కొన్ని ఎక్స్ప్రెస్ హైవేలపై కూడా ఇది వర్తించదని తాజాగా ఎన్హెచ్ ప్రకటించింది. డిజిటల్ రూపంలోనూ.. ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజమార్గ్ యాత్ర యాప్ను సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీని కోసం రూ.మూడు వేలు చెల్లించాలి. సంబంధిత వాహనానికి చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్ట్లో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ వివరాలు నమోదు చేయాలి. రూ.3 వేలు చెల్లించిన తర్వాత, ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్యాగ్కు లింక్ అవుతుంది. ఈ పాస్ ఒక ఏడాది కాలం, లేదా 200 ట్రిప్పులకు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దేని గడువు ముందు అయినా ఇక పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి.ఉపయోగాలు ఇవే కేంద్ర రవాణా, ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్ గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం నుంచి విజయవాడ, రావులపాలెం మీదుగా సొంత కారులో వెళ్లి వస్తే, ఇప్పుడున్న టోల్ చార్జీలను బట్టి నాలుగు టోల్ గేట్ల వద్ద దాదాపు రూ.565 వరకు చెల్లించాలి. కానీ వార్షిక ఫాస్టాగ్ కొన్నవారికి కేవలం రూ.120 మాత్రమే అవుతుంది. అదే అమలాపురం నుంచి విశాఖపట్నం వరకు కాకినాడ, కత్తిపూడి మీదుగా వెళ్లేవారు రూ.500 వరకూ చార్జి కట్టాలి. ఇక నుంచి అది రూ.120కి తగ్గిపోతుంది. ఏడాది ఫాస్టాగ్ వల్ల సొంత కార్లు, వ్యాన్లు, జీపులు ఉన్న వారికి టోల్ చార్జీల భారం గణనీయంగా తగ్గుతుంది. -
ముగిసిన గిరిజన ప్రాచీన విజ్ఞాన సదస్సు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ‘గిరిజన ప్రాచీన విజ్ఞాన పరిరక్షణ – భవిషత్ తరాలకు చేర్చడం’ అనే అంశం పై రెండు రోజులుగా జరుగుతున్న సదస్సు శుక్రవారంతో ముగిసిందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. ఇథోఫియా, ఇరాక్ వంటి దేశాల నుంచి వచ్చిన పరిశోధకులతోపాటు వివిధ అంశాలపై 65 మంది పరిశోధన పత్రాలు సమర్పించారన్నారు. వీటి నుంచి ఉత్తమ పరిశోధనలుగా ఎంపిక చేసిన 40 పరిశోధన పత్రాలతో ఒక పుస్తకాన్ని ముద్రించదలచామన్నారు. పరిశోధన పత్రాలు సమర్పించిన వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆర్ఎస్ వరహాలదొర, కో కన్వీనర్లు డాక్టర్ ఎం. గోపాలకృష్ణ, డాక్టర్ ఎలీషాబాబు, డాక్టర్ కె.రాజామణి, డాక్టర్ వి.రామకష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, రాజేశ్వరీదేవి, సమన్వయకర్త డాక్టర్ సాంబశిరావు పాల్గొన్నారు. -
పాదగయ వరలక్ష్మీ వ్రతాల్లో మహిళలకు ఇక్కట్లు
● నిర్వహణలో జనసేన నేతల వైఫల్యం ● సౌకర్యాలు కల్పించని అధికారులు పిఠాపురం: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది పిఠాపురం పాదగయ క్షేత్రంలో శుక్రవారం జనసేన నాయకుల ఆధ్వర్యంలో సాగిన సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణ. పిఠాపురం పాదగయ క్షేత్రంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు రసాభాసగా ముగిశాయి. వేల మందికి చీరలు సిద్ధం చేసామని జనసేన నేతలు విస్తృత ప్రచారం చేయడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి భక్తులు పాదగయ క్షేత్రంకు చేరుకుని క్యూ లో వేచి చూశారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమైనట్లు పలువురు భక్తులు ఆరోపించారు. విడతల వారీగా పూజలు నిర్వహించడంతో క్యూ లో గంటల తరబడి నిలబడాల్సి రాగా మంచినీరు కూడా అందక మహిళా భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు సైతం పూర్తిగా అందక పోవడంతో భక్తులు ఆందోళనకు దిగారు. కేవలం కొంత మందితో పూజలు పూర్తి చేసి మిగిలిన వారికి చీరలు మాత్రమే ఇస్తామని, పూజలు ముగిసిపోయాయని ఆలయ అధికారులు ప్రకటించడంతో క్యూలో వేచి ఉన్న భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరోపక్క పూజలకు వచ్చిన మహిళలలో కొంతమందికి చీరలు ఇచ్చి ఇక అయిపోయాయని చెప్పిన జనసేన నేతలు చాటుగా చీరలను బయటకు తరలించే ప్రయత్నం చేయడంతో మహిళలు వాటిని అడ్డుకున్నారు. తమకు పూజ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పడంతో ఆశతో వచ్చామని, పూజలు లేకుండా చేయడంతో పాటు చీరలు కూడా ఇవ్వకుండా పట్టుకెళ్లి పోతారా అంటు జనసేన నేతలపై మండిపడ్డారు. దీంతో జనసేన నేతలకు మహిళలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పూజల్లో పాల్గొన్న మహిళలకు జనసేన నేతలు అన్య మతస్తులతో చీరలు పంపిణీ చేయడంపై భక్తులు మండిపడ్డారు. కనీసం బొట్టు కూడా పెట్టుకోని మహిళా నేతతో హిందువులకు చీరలు ఎలా పంపిణీ చేయించారంటూ జనసేన నేతల తీరును మహిళలు దుయ్యబట్టారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల (హెచ్డబ్ల్యూఓ)తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ శాఖ హెచ్డబ్ల్యూవోల పనితీరును మెరుగుపరుచుకునేందుకు నూతన విధానం తీసుకువచ్చిందన్నారు. విధి నిర్వహణలను విభజించి ప్రతి దానికి కొన్ని మార్కులు కేటాయించిందన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి రాష్ట్రంలోని వసతి గృహాల్లో 244 మంది నాలుగో తరగతి సిబ్బందిని నియమిస్తామన్నారు. బీసీ సంక్షేమ శాఖ సంచా లకులు ఎ.మల్లికార్జున మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ బీసీ వెల్ఫేర్ డీసీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు. -
క్షమాపణ చెప్పలేదని స్నేహితుడి హత్య
● ఐదుగురు యువకుల ఘాతుకం ● వీడిన కేసు మిస్టరీ ● నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని కై లాసభూమి సమీపంలో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందిన ధవళేశ్వరానికి చెందిన సతీష్ కుమార్ది హత్యగా తేలింది. ఈ ఘోరానికి పాల్పడిన అతడి ఐదుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఒకరి భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సతీష్ కుమార్ క్షమాపణలు చెప్పలేదనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. వేపాడి సతీష్ కుమార్ (22) రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్లో మూడేళ్లుగా సమోసాలు అమ్ముతు జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 8వ రాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో టీవీ ఎక్కువగా సౌండ్ పెట్టుకుని చూస్తుండగా తండ్రి మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఈ నెల 15న కై లాస భూమి వెనుక శవమై కనిపించాడు. ఈ మేరకు టూటౌన్ సీఐ శివ గణేష్ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిందిలా.. వేపాడి సతీష్ కుమార్ ఈ నెల 9వ తేదీ తెల్లవారుజామున తోటి స్నేహితులైన ఆల్కాట్ గార్డెన్స్కు చెందిన భాగ్ రాధాకాంత్, భాగ్ గౌతం, దొంగ సౌధిరాజు, బాలాజీ పేటకు చెందిన మోటూరి రవి, భీమవరానికి చెందిన నమ్మి సూర్య తేజతో కలిసి మద్యం తాగడానికి గోదావరి గట్టు దిగువనున్న కై లాస భూమి శ్మశానం లోపలకు వెళ్లాడు. వారిలో భాగ్ రాధాకాంత్ భార్యపై ముందు రోజు రాత్రి వారు కలిసిన సమయంలో సతీష్ కుమార్ చులకనగా మాట్లాడాడు. దీనిపై క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్ను వారందరూ అడిగారు. దానికి అతడు నిరాకరించడంతో పాటు మళ్లీ ఆమైపె అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అప్పటికే పూర్తిగా మద్యం తాగి ఉన్న ఐదుగురూ కోపంతో సతీష్ కుమార్పై దాడి చేశారు. నమ్మి సూర్యతేజ పక్కనే ఉన్న కర్ర తీసుకుని తలపై కొట్టడంతో సతీష్ కుమార్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. భాగ్ రాధాకాంత్ ఆ తర్వాత అతడి పీక మీద కాలు వేసి.. మృతి చెందే వరకు గట్టిగా తొక్కాడు. అనంతరం మృతదేహాన్ని ఈడ్చుకుని వెళ్లి గోడ అవతల పారవేసి, ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. హత్యకు ఉపయోగించిన కర్ర, మృతుడి టీషర్టును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. -
కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి
బోట్క్లబ్ (కాకినాడ): బాలికలు కౌమార దశలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ఐసీడీఎస్ పీడీ లక్ష్మి అన్నారు. గాడిమొగ రిలయన్స్ ఇండస్ట్రీ తమ సామాజిక బాధ్యతలో భాగంగా గాడిమొగ, భైరవపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 200 మంది విద్యార్థినులకు కౌమార దశలో బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దంటు కళా క్షేత్రంలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య రక్షణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. డీవైఈవో ఎస్.వెంకటేశ్వరరావు, సీడీపీవో మాధవి మాట్లాడుతూ, కౌమార దశలో బాలికల ప్రవర్తన, వారిని ఎలా రక్షించుకోవచ్చో తెలిపారు. పడాల చారిటబుల్ ట్రస్టు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం బాలికలకు రిలయన్స్ వారు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫైనాన్స్ హెడ్ మదన్ పాల్, సీఎస్సార్ హెడ్ పోతాప్రగడ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
నిరాశతో వెను తిరిగిన భక్తులు
● చివరి వారం వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించరని తెలియక అవస్థలు ● పంచారామ క్షేత్రం వద్ద పరిస్థితి సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత కుమారరామభీమేశ్వరస్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా చివరి శుక్రవారం రోజున సామూహిక వరలక్ష్మీ వ్రతాలు రద్దు చేసిన విషయం తెలియక ఆలయానికి వచ్చిన అనేకమంది మహిళా భక్తులు వెనుతిరిగి వెళ్లిపోయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మినహా మిగిలిన అన్ని శుక్రవారాలలోను 15 ఏళ్లుగా పంచారామ క్షేత్రంలో సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం రెండు, నాల్గవ శుక్రవారాల్లో మాత్రమే పంచారామ క్షేత్రం సామూహిక వ్రతాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయం తెలియని అనేకమంది మహిళలు చివరి వారంలోను సామూహిక వ్రతాలు జరుగుతాయని భావించి ఆలయానికి తరలి వచ్చారు. వ్రతాలు నిర్వహించడం లేదని తెలిసి మహిళలు నిరాశతో వెనుతిరిగి వెళ్లి పొయారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో ప్రైవేటుగా వ్రతాలను నిర్వహించుకున్నారు. -
మొట్టమొదటి మధ్యవర్తి శ్రీకృష్ణుడే
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఈ లోకంలో మొట్టమొదట మధ్యవర్తి శ్రీకృష్ణడేనని సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. స్థానిక సూర్యకళామందిరంలో సరస్వతి గాన సభ ఆధ్వర్యంలో శ్రీసనాతన ధర్మం–శాశ్వత న్యాయంశ్రీ అంశంపై ఐదు రోజులుగా జరుగుతున్న ప్రవచనాలు శుక్రవారంతో ముగిశాయి. మన యోగ్యతను బట్టి మనకు సమాజంలో గౌరవం లభిస్తుందన్నారు. ధర్మరాజు నారదుడితో యథాశక్తి, యథావిధిగా చెప్పిన సనాతన ధర్మాన్ని మనం పాటించాలన్నారు. మన పూర్వీకులు ఈ విధానాన్నే ఆచరించారన్నారు. సత్యానికి కట్టుబడి ఉండడం, ఒడంబడికలకు విలువ ఇవ్వడం, మాటకోసం, సత్యం కోసం కట్టుబడడమే మన సంస్కృతి అన్నారు. గర్భవతి అయిన సీ్త్ర తన సంతానం కాపాడుకోవడానికి తనకిష్టమైన కొన్నింటిని ఎలా వదులుకుంటుందో పరిపాలకులు కూడా అలా ఉండాలన్నారు. అనంతరం సరస్వతీ గానసభ ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మను సత్కరించారు. సరస్వతీ గాన సభ గౌరవ అధ్యక్షురాలు పెద్దాడ సూర్యకుమారి, అధ్యక్షుడు పేపకాయల రామకృష్ణ పాల్గొన్నారు. -
ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● గుడ్డిగూడెంలో ఘటన గోపాలపురం: ట్రాక్టర్ తిరగబడి మహిళా కూలీ మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకి వెళితే. గుడ్డిగూడెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది మహిళలు శుక్రవారం వరినాట్లకు వెళ్లారు. పని ముగించుకుని ట్రాక్టర్పై వస్తుండగా గుడ్డిగూడెం వద్ద గల కొవ్వాడ కాలువలోకి ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ తిరగబడింది. ఈ ప్రమాదంలో సుగ్గనబోయిన పద్మ (42) అక్కడికక్కడే మృతి చెందగా, సుగ్గనబోయిన తాయారు, కత్తవ నాగలక్ష్మికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించారు. స్వల్ప గాయాలైన అడ్డ పోశమ్మ, అడబాల వెంకటలక్ష్మి, సిరిగినీడి రామలక్ష్మి, కత్తవ అచ్చమ్మలకు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందజేశారు. సంఘటనా స్థలాన్ని దేవరపల్లి సీఐ కె.నాగేశ్వర్ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి ప్రమాద వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరలక్ష్మీ నమోస్తుతే..
● రత్నగిరిపై ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ● పాల్గొన్న 9,680 మంది మహి ళ లుఅన్నవరం : నిత్యం సత్యదేవుని నామజపంతో మార్మోగే రత్నగిరి శ్రావణమాసం ఐదో శుక్రవారం మాత్రం వేలాదిగా వచ్చిన మహిళల వరలక్ష్మీ నామ జపంతో మార్మోగింది. దేవస్థానంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఘనంగా నిర్వహించారు. నిత్యకల్యాణ మండపంతో బాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలు, వాయవ్య, నైరుతి వ్రత మండపాలలో ఈ వ్రతాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బ్యాచ్లలో 9,680 మంది మహిళలు ఈ వ్రతాలు ఆచరించారు. ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ రత్నగిరి ఆలయ ప్రాంగణం మహిళలతో కిటకిట లాడింది. ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం పండితులు విఘ్నేశ్వరపూజ, కలశస్థాపన, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య కల్యాణ మండపం వేదిక మీద ప్రతిష్ఠించిన వరలక్ష్మీ అమ్మవారికి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం పూజలు చేసి హారతి ఇచ్చారు. కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు మహిళలతో వరలక్ష్మీ వ్రతం చేయించారు. వరలక్ష్మీ వ్రతకథను పాలంకి పట్టాభిరామ్మూర్తి చదివి వినిపించారు. హాజరైన మహిళలకు ఉచితంగా జాకెట్టుముక్క, సత్యదేవుని ప్రసాదం, అమ్మవారి రాగిరూపు, చేతికి కట్టుకునే తోరం అందజేశారు. నిత్యాన్నదాన పథకంలో వీరికి భోజన సౌకర్యం కలుగజేశారు. మహిళలు గంటల తరబడి క్యూ లో నిలబడాల్సి వచ్చింది. దాంతో ముగ్గురు మహిళలు సొమ్మసిల్లి పడిపోగా వారిని వ్రతాల ఆఫీసులోకి తరలించి తోటి మహిళలు సపర్యలు చేశారు. అధికారులు రామాలయం వద్ద గల వార్షిక కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించి ఉంటే గంటల తరబడి మహిళలు వేచియుండే అవసరం ఉండేది. -
గాజుల గౌరీదేవిగా సుబ్బాలమ్మ
అమలాపురం టౌన్: అమలాపురంలో కొలువైన సుబ్బాలమ్మ అమ్మవారు శుక్రవారం గాజుల గౌరీదేవిగా దర్శనమిచ్చారు. సుమారు 45 వేల గాజులతో అమ్మవారిని అందంగా అలంకరించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారాన్ని పురస్కరించుకుని దేవదాయశాఖ ఆధ్వర్యంలో అమ్మవారి సన్నిధిలో దాదాపు 600 మంది మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించారు. కార్యక్రమాన్ని ఈవో ఆర్.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. వ్రతాలు ఆచరించే మహిళలకు వరలక్ష్మి రూపు, పూజా సామగ్రిని దేవస్థానం సమకూర్చింది. దేవస్థానం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి గాజుల అలంకరణకు భక్తులు గాజులు సమర్పించారు. దేవస్థానం అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పెద్దిరెడ్డి సాయి పుల్లయ్య నాయడు, యర్రంశెట్టి మూర్తి, అరిగెల బాబ్జీ, నిమ్మకాయల నాయుడు తదితరుల ఆధ్వర్యంలో అలంకరణ జరిగింది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అప్పన వీరన్న, ధర్మకర్తలు పాల్గొన్నారు. -
శాస్త్రోక్తంగా లక్ష రుద్రాక్ష పూజ
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి గురువారం లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం మాస శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది రుత్విక్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసి నుంచి తెచ్చిన రుద్రాక్షలను మేళతాళాలతో గ్రామోత్సవం జరిపి, గోదావరి వద్ద ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేశారు. 728 మంది భక్తులు గోత్ర నామాలు నమోదు చేసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమం తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందజేశారు. -
పలుకుపడి ఉంటేనే పూజ
రెండు రోజులుగా వస్తున్నా.. రెండు రోజులుగా ఒక్క పాస్ కోసం ఇక్కడే ఆలయం వద్ద పడిగాపులు కాశాను. అయినా దొరకలేదు. కేవలం పది నిమిషాలు మాత్రమే 50 పాస్లు ఇచ్చి అయిపోయాయని చెబుతున్నారు. నేను కరప నుంచి వచ్చాను. అయినా పాస్ దొరకలేదు. – వీరలక్ష్మి, భక్తురాలు కావాల్సిన వారికే ఇస్తున్నారు ఆలయంలో వారికి కావాల్సిన వారికి మాత్రం దొంగచాటుగా అన్ని పాస్లు ఇస్తున్నారు. కానీ రోజుల తరబడి క్యూలో ఉన్నవారికి మాత్రం ఒక్క పాస్ కూడా ఇవ్వలేదు. పాస్లు అడిగితే సెక్యూరిటీ సిబ్బందితో బయటకు గెంటించి వేస్తున్నారు. – ప్రమీల, భక్తురాలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పలుకుబడి ఉంటేనే పూజ అన్నట్లు చేశారు.. ఎంతో భక్తితో నిర్వహించే సామూహిక వరలక్ష్మీ వ్రతాలకూ రాజకీయ రంగు పులిమేశారు.. దీంతో శ్రావణ శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ పూజల్లో పాల్గొనేందుకు పాస్ల కోసం వచ్చిన మహిళలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గంటల తరబడి వేచి ఉన్నా పాస్లు అయిపోయాయని చెప్పడంతో ఆందోళనకు దిగారు. కాకినాడ బాలాత్రిపుర సుందరీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నారు. దీనికోసం గురువారం పాస్లు పంపిణీ చేశారు. కేవలం 100 పాస్లు ఇచ్చి మొత్తం అయిపోయాయని చెప్పడంతో ఉదయం నుంచి అక్కడ వేచిఉన్న మహిళలు ఆందోళనకు దిగారు. కేవలం సిఫార్సులు ఉన్నవారికి మాత్రమే ఇక్కడ పాస్లు ఇచ్చి, మిగిలిన వారికి ఇవ్వడం లేదని మహిళలు బహిరంగానే చెప్పారు. టీడీపీ నాయకులు, వారి బంధువులు ఒక్కొక్కరికి 5 నుంచి 10 పాస్లు ఇచ్చారని, తాము మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు కాసినా ఒక్క పాస్ కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఆలయంలో శుక్రవారం మహిళలు పూజలు చేసుకునేందుకు సుమారు 2,500 పూజా సామాన్లు కిట్లు సిద్ధం చేశామని, తమకు కూడా పాస్లు ఇవ్వలేదని అక్కడ సేవ చేసే మహిళలు సైతం ఆలయ సిబ్బందితో గొడవకు దిగారు. వేచి ఉంచి.. వెనక్కి పంపించి బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది నమ్మకం. అందుకే ఇక్కడ పూజల కోసం మహిళలు ఎదురు చూస్తుంటారు. రెండు రోజులుగా పాస్ల కోసం భక్తులు ఇక్కడ తిష్టవేసినా ఒక్క పాస్ కూడా భక్తులకు ఇవ్వకుండా పచ్చ నాయకులకు మాత్రం దొడ్డిదారిన పాస్లు ఇచ్చి పంపారు. దేవదాయ శాఖ అధికారులు సైతం ఇక్కడ పాస్లు లేవని, కావాల్సిన వారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కార్యాలయానికి వెళ్లాలని చెప్పడం గమనార్హం. పాస్లన్నీ ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లిపోయాయని, ఈ మాత్రం దానికి ఎందుకు ఇలా పడిగాపులు కాసేలా చేశారని మహిళలు మండిపడ్డారు. బయటకు పంపించేసి.. పాస్ల కోసం మహిళలు ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంధి బాబ్జీ కార్యాలయం, ఈఓ ఉండవల్లి వీర్రాజు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచిఉన్నారు. ఎంతసేపటికి పాస్లు ఇవ్వకపోవడంతో వారు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకుని కూర్చోవడమే కాకుండా ఈఓ రావాలి, పాస్లు ఇవ్వాలని నినాదాలు చేశారు. అదే సమయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ బయటకు రావడంతో మహిళలు ఆయనను చుట్టుముట్టారు. పాస్లు ఇవ్వకుండానే ఆయన ఆలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది పాస్లు అయిపోయాయని, బయటకు వెళ్లిపోవాలంటూ మహిళలను దౌర్జన్యంగా ఆలయ ప్రాంగణం నుంచి బయటకు పంపించేశారు. ఫ సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు రాజకీయ రంగు ఫ పచ్చ నేతలకే పాస్లు ఫ ఆలయం వద్ద మహిళల నిరసన -
సారా రహితంగా మార్చుదాం
ప్రత్తిపాడు: ఆంధ్రప్రదేశ్ను సారా రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయంగా ప్రభుత్వం నవోదయం 2.0 కార్యక్రమాన్ని రూపొందించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ఎం.కృష్ణకుమారి అన్నారు. ప్రత్తిపాడు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో నవోదయం కార్యక్రమానికి 136 గ్రామాలను ఎంపిక చేశారన్నారు. ఇప్పటికే 129 గ్రామాల్లో సారా వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక, దుష్ప్రభావాలను వివరించామన్నారు. సారా అమ్మడం, తయారు చేయడం, రవాణా చేయడం, కలిగి ఉండటం చట్టరీత్యా నేరమన్నారు. జిల్లాలో ప్రత్తిపాడు, తుని ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో ఎక్కువగా సారా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. సిబ్బంది విషయానికొస్తే 55 శాతం పోస్టులు భర్తీ కావాల్సి ఉందని వివరించారు. సమావేశంలో ఎస్టీఎఫ్ సూపరింటెండెంట్ దేవదత్త, ఎకై ్సజ్ సీఐ పి.శివప్రసాద్ పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీల ధర్నా
కాకినాడ సిటీ: అంగన్వాడీలకు ఇబ్బంది కలిగించే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని, 5జీ టెక్నాలజీతో ఉన్న కొత్త సెల్ఫోన్లు ఇవ్వాలంటూ గురువారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నగరంలోని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ యాప్ వల్ల అంగన్వాడీ వర్కర్లతో పాటు లబ్ధిదారులు, బాలింతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. 2024లో 42 రోజుల సమ్మె అనంతరం మినిట్స్లో నమోదు చేసినటువంటి అంశాల అమలుకు ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదన్నారు. తక్షణమే పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.విజయ, జి.రమణమ్మ, సరోజని, వసంత, సత్య, వరలక్ష్మి, అపర్ణ, రమాదేవి, రమ, శేషు, శ్రీదేవి, రామలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
బాబూయ్ రచ్చ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: నమ్మించి దగా చేయడంలో చంద్రబాబు మాస్టర్ డిగ్రీ చేశారు. అది ప్రజలైనా, పార్టీ కోసం పనిచేసే నాయకులైనా, అందరినీ ఒకే గాటన కడతారు. ఎన్నికల్లో సేవలను వినియోగించుకుని గద్దెనెక్కాక కాలదన్నేయడంలో బాబును మించిన నాయకుడు లేడంటారు. అది అక్షరాలా నిజమని కాకినాడ రూరల్ నియోజకవర్గ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన పిల్లి సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) తాజా ఎపిసోడ్తో స్పష్టమైంది. పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్ష పదవి కోసం మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, సత్తిబాబు వర్గం కాలా శ్రీనివాస్ను, వైరి వర్గం నుంచి కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్(బాబి) వర్గం కాకరపల్లి చలపతిరావును తెరమీదకు తీసుకు రావడంతో బుధవారం పార్టీ పరిశీలకులు నల్లమిల్లి వీర్రెడ్డి, పి.సుధాకర్రెడ్డి సమక్షంలోనే కుమ్ములాడుకున్నాయి. రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నిక చివరకు రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. గతంలో ఎప్పుడూ లేనిది పార్టీ మండల కమిటీ అధ్యక్షుడి ఎంపిక కోసం కటకంశెట్టి బాబి వర్గం సీల్డ్ కవర్ రాజకీయాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని సత్తిబాబు వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. సీనియర్ అయిన తనను, తన భార్యను ఇంతలా అవమానించడాన్ని తట్టుకోలేక మనస్తాపంతో సత్తిబాబు పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులపై పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేరుతో నాలుగు పేజీల లేఖను విడుదల చేశారు. తమకు, అనుచరులకు జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక, ఆత్మాభిమానం దెబ్బతిని, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా గౌరవం దక్కకపోవడంతో పదవిని విడిచిపెట్టాల్సి వచ్చిందని సత్తిబాబు వెల్లడించారు. సత్తిబాబును బుజ్జగించేందుకు పార్టీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, తోట నవీన్ వంటి నాయకులు ప్రయత్నించారు. కానీ అప్పటికే కోఆర్డినేటర్ పదవికి సత్తిబాబు రాజీనామా చేసేశారు. ఇక చేసేదేమీ లేక వారు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తామని ముక్తాయించారు.వాస్తవానికి సార్వత్రిక ఎన్నికల నుంచి సత్తిబాబు అధిష్టానంపై అసహనంతోనే ఉన్నారు. అయినా సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ రూరల్ సీటును పొత్తు ధర్మానికి కట్టుబడి త్యాగం చేసిన పాపానికి సత్తిబాబుకు అతన్నే నమ్ముకుని టీడీపీ వెన్నంటే నిలిచిన అనుచర వర్గానికి అడుగడుగునా అవమానాలే ఎదురవుతున్నాయి. తమకు జరుగుతున్న అవమానాలు, అన్యాయాలపై గడచిన 14 నెలల కాలంలో అధినేత చంద్రబాబు దగ్గర నుంచి ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పర్యవేక్షించే నేతల వరకూ అందరి వద్ద నాలుగైదు పర్యాయాలు సాగిలపడినా అవమానాలే తప్ప ఆశాజనకమైన ప్రతి స్పందన కనిపించక పోవడాన్ని సత్తిబాబు వర్గం సీరియస్గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో అనుచర వర్గాన్ని పార్టీ కోసం సైనికుల్లా ఎన్నికల ముందు నిలబెట్టినందుకు సరైన గుణపాఠమే చెప్పారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు.ఒక్క పదవీ దక్కలేదని..ఎన్నికలై అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా తమ నాయకుడికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా దక్కలేదని సత్తిబాబు అనుచరులు బాహాటంగానే ఆక్షేపిస్తున్నారు. పేరుకే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ అయినా ఆ స్థాయిలో అటు పార్టీలోనూ, ఇటు అధికారిక కార్యక్రమాల్లోనూ ప్రాతినిధ్యం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో పైనుంచి కింది వరకూ పొమ్మనకుండానే పొగబెడుతున్నారని ఆ వర్గంలో బలంగా నాటుకుపోయింది. లేదంటే పార్టీ కోఆర్డినేటర్గా నియోజకవర్గంలో 25 గ్రామాల్లో బూత్ కమిటీలు అన్నింటినీ పూర్తి చేసి రూరల్ మండల అధ్యక్షుడి నియామకానికి అడ్డుతగలడం ఏంటని సత్తిబాబు సహా ఆ వర్గం మండిపడుతోంది. రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీపై కూడా సత్తిబాబు పనిలో పనిగా పలు విమర్శలు సంధించారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక కనీసం పనుల్లో ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని సత్తిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తు ధర్మంలో భాగంగా 50 శాతం పదవులు, పనులు తమ పార్టీ నేతలకు దక్కాల్సిందేనని అన్నారు. ఎన్నికల్లో తమ సేవలను వినియోగించుకుని, ఇప్పుడు కూరలో కరివేపాకులా తీసిపడేస్తారా అని సత్తిబాబు వర్గం నిలదీస్తోంది. జరుగుతున్న అవమానాలను చంద్రబాబు సహా జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణ, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుల వరకూ తీసుకువెళ్లినా బీసీ సామాజిక వర్గానికి చెందడంతో తొక్కేస్తున్నారనే ఆవేదనతో ఆ వర్గం కుతకుతలాడుతోంది.ఉదయం అక్కడ.. సాయంత్రం ఇక్కడఅవమానాలపై సత్తిబాబు వర్గం ఉదయం ఆరోపణలకు దిగితే సాయంత్రానికి కటకంశెట్టి బాబి అనుచరులు సత్తిబాబుపై ఎదురుదాడికి దిగారు. రూరల్ మండల అధ్యక్ష పదవికి బాబి వర్గం ప్రతిపాదించిన కాకరపల్లి చలపతి సహా కముజు నెహ్రూ, గీశాల శ్రీనివాస్, గుడాల లోవరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, తుమ్మల వెంకన్న తదితరులు మీడియా సమావేశంలో సత్తిబాబుపై అనేక ఆరోపణలు సంధించారు. 2024 ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వలేదని చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలు తగలబెట్టలేదా అని వారు నిలదీశారు. కార్పొరేషన్ డైరెక్టర్గా పనికి ఆహార పథకంలో బియ్యం స్వాహా చేయడంపై కేసు నమోదు, తరచూ పార్టీపై అలక వహించడం, ఆనక ఇంట్లో కూర్చోవడం సత్తిబాబుకు ఆనవాయితీగా వస్తున్నదేనంటూ వారు తాజా ఎపిసోడ్ను కొట్టిపారేస్తున్నారు. సత్తిబాబుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేయడంతో టీడీపీలో ఇరువర్గాల మధ్య రాద్ధాంతం రావణకాష్టాన్ని తలపిస్తోంది. ఈ కుమ్ములాటల కుంపటి ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాల్సిందే. -
కన్నబాబుకు పేర్ని నాని పరామర్శ
కాకినాడ రూరల్: పితృ వియోగంతో బాధపడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్ పీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబును మాజీ మంత్రి పేర్ని నాని గురువారం పరామర్శించారు. కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన సంగతి విధితమే. కాకినాడ వైద్యనగర్ నివాసంలో సత్యనారాయణ చిత్ర పటానికి పేర్ని నాని నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కన్నబాబు, ఆయన సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణలను ఓదార్చారు. కన్నబాబును పరామర్శించిన వారిలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ ఎంపీ మాధవి, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి భాగ్యలక్ష్మి, విజయనగరం మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, చుండ్రు శ్రీహరి, మాజీ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, బండారు సత్యానందరావు, మారిశెట్టి రాఘవయ్య, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఒమ్మి రఘురామ్ తదితరులు ఉన్నారు. -
వర్రీఫికేషన్
సాక్షి, అమలాపురం: కూటమి ప్రభుత్వ తీరుతో డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా కొత్త విధానానికి తెరతీయడంతో వారిలో ఆందోళన అధికమవుతోంది. డీఎస్సీ స్కోర్ కార్డులను ఈ నెల 14న విడుదల చేశారు. అనంతరం వారం రోజులు గడుస్తున్నప్పటికీ నేటి వరకు మెరిట్ జాబితాను ఇవ్వలేదు. దాని కోసం అభ్యర్థులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మెరిట్ జాబితా ఇవ్వకుండా సెలెక్షన్ జాబితా ఇస్తారని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభిస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగులతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ గందరగోళానికి తెరదించాలని, మెరిట్ జాబితా ప్రకటించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. డీఎస్సీ 2025 అభ్యర్థుల స్కోర్ కార్డులను విద్యాశాఖ వెబ్సైట్లో విడుదల చేసింది. స్కోర్ కార్డుల ఆధారంగా ఎవరికెన్ని మార్కులు వచ్చాయి? తమ మార్కులకు ఉద్యోగం వస్తుందా? రాదా? అంటూ అభ్యర్థులు ఆరా తీసుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కేటగిరీల కింద 1,241 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. స్కోర్ కార్డులు ఇచ్చినప్పటికీ మెరిట్ జాబితా ప్రకటిస్తేనే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. అయితే ఇంత వరకు ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. ఇదిలా ఉంటే డీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో ఎంపికై న అభ్యర్థులకు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిర్ణయించేందుకు ఖాళీల వివరాలను విద్యాశాఖ సేకరించింది. డీఈవో కార్యాలయాల ఐటీ విభాగం మండల విద్యాశాఖ అధికారుల ద్వారా వాస్తవంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, అత్యవసరంగా ఎక్కడ భర్తీ చేయాలనే విషయాలపై సమాచారాన్ని రాబట్టినట్లు సమాచారం. 25 టీమ్ల ఏర్పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డీఎస్సీలో మెరిట్ కనబర్చిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. దీనికోసం తూర్పుగోదావరి జిల్లాలో 25 టీములను నియమించింది. దీనిలో మండల విద్యాశాఖాధికారులు, ఐటీ సిబ్బంది ఉంటారు. సర్టిఫికెట్ల పరిశీలన చేసే విధానంపై టీమ్ సభ్యులకు బుధవారం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ వర్క్షాపును నిర్వహించింది. తెరపడేదెన్నడు? డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఈ ఏడాది ఏప్రిల్ 20న విడుదలైంది. దరఖాస్తుకు మే 15 తుది గడువు, అనంతరం 63,004 దరఖాస్తులు వచ్చాయి. జూన్ 6 నుంచి జూలై 2 వరకూ పరీక్షలు జరిగాయి. ప్రైమరీ కీని జూలై 4న, అభ్యంతరాల అనంతరం ఫైనల్ కీని ఆగస్టు ఒకటిన విడుదల చేశారు. ఆగస్టు 14న స్కోర్ కార్డులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో నార్మలైజేషన్ మార్కులతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు అభ్యర్థుల దృష్టి అంతా మెరిట్ జాబితాపైనే ఉంది. అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో మెరిట్ జాబితా ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ సర్వం గందరగోళం నేటికీ ప్రకటించని మెరిట్ జాబితా గతానికి భిన్నంగా డీఎస్సీ 2025 అయోమయంలో అభ్యర్థులు స్కోర్ కార్డులు ప్రకటించిన అనంతరం మెరిట్ జాబితాను ప్రకటించాల్సి ఉంది ఇంతవరకు మెరిట్ జాబితా ప్రకటన లేదు అయోమయానికి గురవుతున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం మెరిట్ జాబితా రాకపోవడంతో అభ్యర్థుల ఆందోళన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,241 ఉపాధ్యాయ పోస్టులు కూటమి తీరుతో డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన మెరిట్ జాబితా కోసం ఎదురు చూపులు ఇప్పటికీ విడుదల చేయని సర్కార్ పైగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు సిద్ధమంటూ వార్తలు -
స్వామికి దయ కలిగింది!
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో శానిటరీ సిబ్బందిపై సత్యనారాయణ స్వామి దయ చూపారు. సిబ్బంది జూన్, జూలై నెలల జీతాలు బుధవారం అందుకున్నారు. 350 మంది శానిటరీ సిబ్బంది బ్యాంకు ఖాతాలకు బుధవారం కనకదుర్గా మేన్పవర్ సంస్థ ద్వారా జీతాలు జమ అవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. విభాగాల వారీగా ఒక్కొక్కరు నెలకు రూ.10,500 నుంచి రూ.12,500 వరకు రెండు నెలల జీతాలు అందుకున్నారు. ఇందుకోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని దేవస్థానం బుధవారం ఆ కాంట్రాక్టర్ అకౌంట్కు జమ చేసిన ఐదు నిమిషాల్లోనే సిబ్బంది అకౌంట్లకు జీతాలు జమ అయ్యాయి. ఈసారి కూడా సాక్షి చొరవతోనే... గతంలో మాదిరిగానే ఈసారి కూడా సాక్షి చొరవతోనే సిబ్బందికి జీతాలు జమ అవడం విశేషం. సాక్షి దినపత్రికలో ఈ నెల 12వ తేదీన ‘స్వామీ...నీ దయ రాదా...!’ శీర్షికన వార్త ప్రచురితమైన తరువాత మాత్రమే జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది. గతంలో మార్చి జీతాలు ఆలస్యమవడంతో అప్పట్లో సాక్షి దినపత్రికలో ఏప్రిల్ 25 వ తేదీన ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు స్వామీ’ అంటూ వార్త ప్రచురించడంతో ఏప్రిల్ 30న కార్మికుల అకౌంట్లో జీతాలు వేశారు. ఏప్రిల్ జీతాలు కూడా ఆలస్యం కావడంతో మే నెల 26న ‘వీరి కష్టం తుడిచేవారేరీ!’ శీర్షికన వార్త ప్రచురించడంతో దేవస్థానం అధికారులు స్పందించి జీతాలు చెల్లించారు. మే నెల జీతాలు కూడా జూన్ రెండో వారంలో చెల్లించారు. రత్నగిరి శానిటరీ సిబ్బందికి జీతాల చెల్లింపు -
ఉగ్ర గోదావరి ఉరకలు
రాజమహేంద్రవరంలో వరద గోదావరి ఉధృతిధవళేశ్వరం: ఉగ్ర గోదావరి ఉరకలేస్తోంది. ఎగువ నుంచి కాటన్ బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది. ధవళేశ్వరం ఫ్లడ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నీటి ఉధృతి వేగంగా పెరుగుతుంది. మరోపక్క గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి పొంగి పొర్లుతున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద బుధవారం రాత్రి 10.60 అడుగులకు నీటి మట్టం చేరింది. మొత్తం 175 క్రస్ట్గేట్లను పూర్తిగా పైకిలేపి మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు. 8,28,331 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి వదిలారు. డెల్టా కాలువలకు సంబంధించి 4,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తూర్పు డెల్టాకు 3,000 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 1,300 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల నీటిని వదిలారు. నేడు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి.. కాటన్ బ్యారేజీ వద్ద నీటి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి నీటి మట్టం చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ యంత్రాంగం అంచనా వేస్తోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 10 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల చేస్తూ 11.75 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటిస్తారు. 13.75 అడుగులకు నీటి మట్టం చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను, 17.75 అడుగులకు నీటి మట్టం చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయితే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు పడవల రాకపోకలను నిషేధిస్తారు. ఎగువ ప్రాంతాల్లో ఇలా... ఎగువ ప్రాంతాలకు సంబంధించి భద్రాచలంలో 47.40 అడుగులకు నీటి మట్టం చేరింది. భద్రాచలంలో ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది. రాత్రి 10 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాళేశ్వరంలో 12.83 మీట ర్లు, పేరూరులో 17.48 మీటర్లు, దుమ్ముగూడెంలో 13.07 మీటర్లు, పోలవరంలో 13.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.55 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. లంకలను ముంచెత్తిన వరద సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): లంక ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. వర్షాకాలం మూడు నెలలు వీరికి కష్టకాలం అని చెప్పవచ్చు. చేపలు పట్టుకోవడం, లంకల్లో పశువుల పెంపకం వంటి పనులతో వీరంతా జీవనోపాధి పొందుతారు. వర్షాకాలంలో గోదావరికి వరద నీరు చేరడంతో వీరిని పునరావాస కేంద్రాలకు తరలించడం పరిపాటుగా మారింది. ఏటా వర్షాకాలంలో వీరిని రాజమహేంద్రవరంలోని పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. అక్కడే వీరికి మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. వరద ఉధృతి తగ్గిన తరువాత వారంతా తిరిగి లంకల్లోకి వెళ్లతారు. నేడు ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తం కాటన్ బ్యారేజీ నుంచి 8.28లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల -
రేపు సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్లో కూడా ఈ వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల ఉపాధ్యాయులకు సంబంఽధించి 2025 జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్ బుధవారం తెలిపారు. కనీసం 10 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా అనుభవం ఉండాలని, అర్హత ఉన్నవారు ఈ నెల 30వ తేదీలోగా జిల్లా విద్యాశాఖాఽధికారి వెబ్సైట్లో దరఖాస్తు చేసి, తమకు అందజేయాలని సూచించారు. పంపా కాలువ గండికి తాత్కాలిక మరమ్మతులు తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం సమీపంలో పంపా వరద కాలువకు పడిన గండిని ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. సోమవారం రాత్రి పంపా కాలువకు గండిపడిన విషయం తెలిసిందే. మంగళవారం నియోజకవర్గ ప్రత్యేక అధికారి కె.శ్రీధర్ గండిని పరిశీలించి విషయాన్ని కలెక్టర్ షణ్మోహన్కు తెలియజేశారు. కలెక్టర్ ఆదేశాలతో బుధవారం జేసీబీ సహాయంతో మట్టితో గండిని పూడ్చివేసినట్టు ఎంపీడీఓ కె.సాయి నవీన్ తెలిపారు. ఇసుక బస్తాలు తరలించేందుకు పరిసర ప్రాంతాలు అనుకూలంగా లేకపోవడంతో తాత్కాలిక మరమ్మతులను మట్టితో పూర్తి చేసినట్టు తెలిపారు. వాతావరణం అనుకూలించిన తర్వాత ఇసుక బస్తాలతో గట్టిను మరింత పటిష్ట పర్చనున్నట్టు తెలిపారు. వాడపల్లి వెంకన్నకు రూ.1.42 కోట్ల ఆదాయం కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా రూ. 1,42,16,807 ఆదాయం వచ్చింది. దేవదాయ, ధర్మాదాయశాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు బుధవారం ఈ విషయం తెలిపారు. ఆలయంలోని హుండీలను 28 రోజుల అనంతరం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో బుధవారం తెరిచి, ఆదాయాన్ని వసంత మండపంలో లెక్కించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.1,19,58,204, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ. 22,58,603 వచ్చిందని ఈఓ వివరించారు. అలాగే బంగారం 23 గ్రాములు, వెండి 670 గ్రాములు, విదేశీ కరెన్సీ నోట్లు 46 వచ్చాయన్నారు. ఈ కార్యక్రమ పర్యవేక్షణ అధికారిగా ఏసీ అండ్ జిల్లా దేవదాయశాఖ అధికారి వి.సత్యనారాయణ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ టీవీఎస్ సార్ ప్రసాద్, జిల్లా దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు డి.సతీష్ కుమా ర్, గోపాలపురం గ్రూపు దేవాలయాల ఈవో బి కిరణ్, దేవస్థానం సిబ్బంది అర్చకులు, శ్రీవారి సేవకులు పోలీసులు, కెనరా బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. -
'పన్ను'పోటు తగ్గేనా?
సాక్షి, అమలాపురం: గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ)(వస్తు సేవల పన్ను)లో సంస్కరణలు చేయడంతో పాటు, ముఖ్యమైన ఉత్పత్తులపై జీఎస్టీ తొలగిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఉద్యాన, వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు సాగు చేసే రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. వీటిపై ఇప్పటికే 5, 12, 18 శాతం చొప్పున జీఎస్టీని విధిస్తున్నారు. దీనివల్ల వీటిపై ఆధారపడిన వ్యాపారులకు ప్రత్యక్షంగా, రైతులపై పరోక్షంగా భారం పడుతోంది. వీటిపై జీఎస్టీ తొలగిస్తే విలువ ఆధారిత ఉత్పత్తులు పెరగడంతో పాటు, సాగు లాభాసాటిగా మారుతుందని రైతులు చెబుతున్నారు. కొబ్బరిపై ఐదు శాతం గోదావరి జిల్లాల్లో వరి తర్వాత అతి పెద్ద సాగు కొబ్బరి. తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో సుమారు 1.50 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. ఏడాదికి సగటున 107 కోట్ల కాయల వరకు దిగుబడి వస్తోందని అంచనా. కొబ్బరి కాయ (పచ్చికాయ)పై జీఎస్టీ లేదు. కానీ కొబ్బరి విలువ ఆధారిత ఉత్పత్తులపై ఎండు కొబ్బరి (తయారీ కొబ్బరి)పై ఐదు శాతం జీఎస్టీ విధించారు. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారికి ఎండు కొబ్బరి క్వింటాల్పై ప్రస్తుత ధర (రూ.20 వేలు)ను బట్టి రూ.వెయ్యి వరకు భారం పడుతోంది. గతంలో.. గతంలో ఎండు కొబ్బరిపై ఎటువంటి పన్ను ఉండేది కాదు. వాణిజ్య పన్నుల శాఖ ఎండు కొబ్బరిపై నాలుగు శాతం టాక్స్ విధించగా, 2002లో అప్పటి ప్రభుత్వం రెండు శాతానికి తగ్గించింది. తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు శాతం పన్ను కూడా తొలగించారు. ఈ సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఎండు కొబ్బరి తయారయ్యేది. కేంద్రం జీఎస్టీ అమల్లోకి తెచ్చిన తర్వాత దీనిపై ఐదు శాతం జీఎస్టీ పడింది. నాటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఎండు కొబ్బరి తయారీ తగ్గుతూ వస్తోంది. అలాగే కొబ్బరి నూనెపై ఐదు నుంచి 18 శాతం వరకు జీఎస్టీ ఉంది. 15 కిలోల కొబ్బరి నూనె డబ్బాపై రూ.265 నుంచి రూ.945 వరకు భారం పడుతోంది. దీంతో జీఎస్టీ భారం లేకుండా కొందరు అక్రమార్కులు దొడ్డి దారిన కల్తీ కొబ్బరి నూనె అమ్మకాలు చేస్తున్నారు. ఎండుకొబ్బరి, కొబ్బరి నూనెపై జీఎస్టీ తొలగిస్తే.. ఇవి స్థానికంగా ఉత్పత్తి అయి రైతులకు, తయారీ కార్మికులకు, వ్యాపారులకు ఉపాధి లభిస్తుంది. పామాయిల్ పైనా.. ఆయిల్పామ్ రైతులు, వ్యాపారుల పరిస్థితి కూడా ఇంతే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. రైతులు విక్రయించే ఆయిల్ పామ్ గెలలపై జీఎస్టీ లేదు. కానీ, ఆయిల్ పామ్ పండ్ల నుంచి తీసే పామాయిల్పై ఐదు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ధరలు తగ్గించడం ద్వారా పరోక్షంగా ఈ భారం రైతుల పైనే కంపెనీలు మోపుతున్నాయి. మత్స్య ఉత్పత్తుల ఎగుమతిపై జీఎస్టీ లేకున్నా.. వీటిలో వినియోగించే మందులు, సాగుకు వినియోగించే వస్తువులపై జీఎస్టీ ఉంది. అంతే కాకుండా వ్యవసాయ, ఉద్యాన సాగులో ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్, పవర్ వీడర్, మోటార్లు, ఉత్పత్తుల తయారీ యంత్రాలు వీటిపై కూడా ఐదు నుంచి 12, 18 శాతం జీఎస్టీలు శ్లాబ్లు ఉన్నాయి. వీటిని తొలగిస్తే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. తొలగిస్తేనే రైతులకు మేలు ఎండు కొబ్బరి, కొబ్బరి నూనె, ఇతర ఉద్యాన ఉత్పత్తులపై జీఎస్టీ మొత్తం ఎత్తి వేయాలి. దీనివల్ల కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలు ఏర్పడతాయి. ఇదే జరిగితే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పరిశ్రమల లేనిలోటు కొంత వరకూ తీరి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. గతంలో ఎండు కొబ్బరికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించడం ద్వారా జీఎస్టీని ఎత్తివేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. – మత్యాల జమ్మి, నేషనల్ ప్లాంట్ హెల్త్ మేనేజ్ మెంట్ సభ్యుడు, అంబాజీపేట -
వేద పఠనంతో పులకించిన కుమారారామం
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరి సమేత చాళుక్య కుమారా రామభీమేశ్వరాలయం మంగళవారం వేద పఠనంతో పులకించింది. బాలాత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో 27వ వేదసభను పంచారామ క్షేత్రంలో నిర్వహించారు. సీనియర్ వేద పండితులు శ్రీపాద రాజశేఖరశర్మ అధ్యక్షత వహించారు. పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు పాల్గొన్నారు. దువ్వూరి సూర్యప్రకాశ చైనులు ఘనపాఠి, తంగిరాల సుబ్రహ్మణ్య సోమయాజులు ఘనపాఠి వేదాల ప్రాధాన్యాన్ని వివరించారు. తరుచూ వేద పారాయణ జరిగే ప్రాంతాలు ప్రగతి సాధిస్తాయని వారు తెలిపారు. సృష్టిలో ప్రతీ జీవికి వేదశాస్త్రం అనేక విధాల క్షేమకారిగా రక్షణ కలిగిస్తుందని వివరించారు. వేదాలను సరళమైన రీతిలో ప్రజలకు చేరువ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. వేదసభలో పాల్గొన్న సుమారు 200 మంది వేద పండితులు హిందూ సంస్కృతి సంప్రదాయాలను వివరిస్తూ చతుర్వేద పారాయణ, వేదస్వస్తి చెప్పారు. వేద పండితులను ఘనంగా సత్కరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ కంటే బాబు, పారిశ్రామికవేత్త నలజర్ల కామేశ్వరరావు (పెదబాబు), భక్త సంఘం నాయకులు చుండ్రు గోపాలకృష్ణ, గంజి బూరయ్య, ఆర్వీ సుబ్బరాజు, బిక్కిన రంగనాయకులు, వేదశాస్త్ర పరిషత్తు కన్వీనర్ గ్రంధి సత్యరామకృష్ణ పండితులను సత్కరించారు. వేద పరిషత్తుకు సహకరించిన దాతలను సత్కరించారు. -
రాష్ట్రంలో స్తంభించిన పరిపాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందని, ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మర్డర్లు, మహిళలపై అఘాయిత్యాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అక్రమ మద్యం కేసులో అరెస్టయి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ అయ్యారు. అనంతరం బొమ్మూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బొత్స సత్యనారాయణ ముఖ్యనేతలతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒకపక్క అధిక వర్షాలు వచ్చి రైతులకు కావాల్సిన ఎరువులను అందించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి అవగాహన, కార్యాచరణ, ముందుచూపులేకపోవడం వలన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్పీరియన్స్ అంటూ సొల్లు కబుర్లు చెప్పడమే తప్ప ఆచరణలో లేదని బొత్స విమర్శించారు. కూటమి ప్రభుత్వం మంచిపాలనను ఐదురోజుల నుంచి చూస్తున్నాం వారి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ఏవిధంగా ప్రవర్తిస్తున్నారో తెలుస్తోందన్నారు. శాసనమండలి ప్రతిపక్షనేతగా ఉన్న తాను ప్రెస్తో మాట్లాడుతుండగా డ్రోన్ ఎగురవేయడంపై ఆయన మండిపడ్డారు. ఏమైన అడిగితే లా అండ్ ఆర్డర్ సమస్య అంటారన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని, చట్టం తన పనిచేసుకునేలా ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలన్నారు. అమరావతి ముంపు సమస్యపై విలేకరుల అడిగిన ప్రశ్నకు పదిరోజుల్లో అంతా తెలుస్తుందని బొత్స బదులిచ్చారు. ఫ్రీ బస్సు ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో గొప్పగా ఇక్కడ బస్సు ఎక్కితే తిరుపతి వెళ్లవచ్చన్నారు. కానీ మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మాజీ ఎంపీలు మార్గాని భరత్రామ్, చింతా అనురాధ, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు, తలారి వెంకటరావు, పాముల రాజేశ్వరిదేవి, రౌతు సూర్యప్రకాశరావు, రాజమహేంద్రవరం పార్లమెంటు ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్లమెంటు పరిశీలకులు తిప్పల గురుమూర్తిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు దవులూరి దొరబాబు, పిల్లి సూర్యప్రకాశ్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, చిన్నమిల్లి వెంకట్రాయుడు, గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వివిధ నియోజకవర్గాల పార్టీ నేతలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స -
ఆటో యూనియిన్ కార్మికుల నిరసన
జగ్గంపేట: జగ్గంపేటలో ఆటో యూనియన్ కార్మికులు ఉచిత బస్సు వల్ల తమ ఉపాధి దెబ్బతిందని, నిరసన ర్యాలీ నిర్వహించారు. ఉచిత బస్ ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం మా కష్టాలను కూడా పట్టించుకుని అన్ని విధాల ఆదుకోవాలని కోరుతూ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, తహసీల్దార్ జేవీఆర్ రమేష్కు అందజేశారు. జగ్గంపేటలో ఉన్న నాలుగు ఆటో యూనియిన్లకు చెందిన సుమారు 1,000 మంది కార్మికులు ఆటోయూనియన్ జేఏసీ పేరుతో జగ్గంపేటలో ప్రధాన వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆటోలతో సహా ర్యాలీగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేకు తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తాము అప్పులు చేసి వాహనాలు కొన్నామని, ఉచిత బస్ వల్ల తమ ఆదాయం దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఆటో కార్మికుడుకి రూ.12,000 జీవనభృతిగా చెల్లించాలని, ఆర్టీఓ ఫిటెనెస్ సర్టిఫికెట్ విషయమై ప్రయివేటీకరణ రద్దు చేయాలని, వాహన మిత్ర పథకం ద్వారా ఏడాదికి రూ.30వేలు చెల్లించాలని, ఆటో కార్మికులు పిల్లలకు విద్యార్హతను బట్టి అందరికీ ఉద్యోగాలు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు అందజేశారు. ఆటో యూనియన్ నాయకులు ఆర్.వెంకటరమణ, ఆర్.శివశంకర్, మంజేటి సత్యనారాయణ, వి.ప్రసాద్ పాల్గొన్నారు. ఉచిత బస్ మా పొట్ట కొడుతోంది అంటూ ఆవేదన -
పంపా నీళ్లు వృథా
● నాలుగో వంతు సముద్రం పాలు ● గేట్లు బలహీనంతో సమస్య ● 103 అడుగుల గరిష్ట నీటిమట్టం నిర్వహించలేని దుస్థితి అన్నవరం: వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసి ఏడాది పొడవునా తాగు, సాగు అవసరాల కోసం నిర్మించిన అన్నవరంలోని పంపా రిజర్వాయర్ పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంపాలోకి వెల్లువలా వర్షపు నీరు తరలివస్తున్నా దానిని నిల్వ ఉంచుకోలేని పరిస్థితి నెలకొంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా, వివిధ కారణాల వల్ల 99 అడుగులు నీటిమట్టం వరకు మాత్రమే నిల్వ ఉంచుకోవల్సిన పరిస్థితి. అంటే నాలుగు అడుగుల మేర నీరు వృథాగా వదిలేయాల్సి వస్తోంది. రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ 0.43 టీఎంసీలు కాగా దాదాపు నాలుగో వంతు నీటిని వృథాగా వదిలేస్తున్నారు. పంపా బ్యారేజీకి కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోవడం, ఉన్న గేట్లకు కూడా మరమ్మతులు పూర్తి చేయలేకపోవడంతో ఈ నీటిని వదిలేయాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. పంపాగర్భంలో నిర్మాణంలో ఉన్న పోలవరం అక్విడెక్ట్ పనుల కారణంగా కూడా పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేయాల్సి వస్తోందని తెలిపారు. అయితే 12,500 ఎకరాల పంపా ఆయకట్టు పూర్తిగా సాగవ్వాలంటే 1.5 టీఎంసీల నీరు అవసరం. పంపా నీటి నిల్వ పరిమాణం 0.43 టిఎంసీ మాత్రమే. అంటే సుమారు మూడు సార్లు పంపా నిండితే తప్ప సాగవ్వని పరిస్థితి. పంపా నీటిమట్టం 99 అడుగులకే పరిమితం చేస్తే నీటినిల్వ పరిమాణం ఇంకా తగ్గిపోతుంది. దానివలన వర్షాలు తగ్గిన తరువాత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు విడుదల జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బలహీనంగా బ్యారేజీ గేట్లు తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో 12,500 ఎకరాలకు సాగునీరు, అన్నవరం దేవస్థానం, వివిధ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించేందుకు 55 ఏళ్ల క్రితం అన్నవరంలో పంపా రిజర్వాయర్ నిర్మించిన విషయం తెలిసిందే. పంపా బ్యారేజీకి ఏర్పాటు చేసిన ఐదు గేట్లు 20 సంవత్సరాలుగా మరమ్మతులకు గురవడంతో వీటి నిర్వహణ కష్టసాధ్యంగా మారింది. వరదల సమయంలో గేట్లు ఎత్తడం, దించడం సమస్యగా మారింది. ఫలితంగా వేల క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోయి, గ్రామాలు, పొలాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పంపా బ్యారేజీకి ఐదు గేట్లు నిర్మించేందుకు 2023 ఆగస్టులో రూ.3.36 కోట్లు మంజూరు చేసింది. 2024 ఎన్నికల కోడ్ రావడంతో ఆ నిధులు విడుదల కాలేదు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో టెండర్లు పిలిచింది. అయితే ఈ టెండర్లు మూడుసార్లు పిలిస్తే తప్ప ఖరారు కాలేదు. చివరగా మే నెలలో ఈ టెండర్లు ఖరారయ్యాయి. ఖరీఫ్లోగా కొత్త గేట్ల ఏర్పాటు సాధ్యంకాదు కనుక పాత గేట్లకు తాత్కాలికంగా మరమ్మతులు చేయడానికి నిర్ణయించారు. నాలుగో నెంబర్ గేటుకు జూలై మొదటి వారంలో మరమ్మతులు చేశారు. అయితే అప్పటికే వర్షాల వల్ల గేట్ల వద్దకు నీరు రావడంతో ఆ పని నిలిపివేశారు. దాంతో సమస్య ఎప్పటి లాగానే ఉంది. దీంతో ఐదు రోజులుగా వేయి క్యూసెక్కుల చొప్పున సముద్రానికి విడుదల చేస్తున్నారు. పోలవరం అక్విడెక్ట్ మునగకుండా ఉండాలన్నా.. పంపా రిజర్వాయర్ ఎగువన నిర్మిస్తున్న పోలవరం అక్విడెక్ట్ మునిగిపోకుండా ఉండాలంటే పంపా నీటి మట్టం 99 అడుగులకు మించకుండా ఉండాలి. అదే విషయాన్ని పోలవరం అధికారులు కలెక్టర్కు తెలియచేయడంతో ఆ మేరకు నీటిమట్టాన్ని నియంత్రిస్తున్నారు. -
మాల కార్పొరేషన్ చైర్మన్కు ప్రొటోకాల్ పాటించరా?
కాకినాడ సిటీ: జిల్లాకు వచ్చిన మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్కుమార్కు ప్రభుత్వ యంత్రాంగం ప్రొటోకాల్ పాటించని కారణంగా మాల సంఘ నాయకులు సమావేశాన్ని బాయ్కట్ చేశారు. కాకినాడ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ (డీఆర్డీఏ సమావేశపు హాలు)లో మంగళవారం మాల కార్పొరేషన్ చైర్మన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్న నాయకులకు, ఉద్యమకారులకు సరైన సమాచారం అందించలేదని మాల సంఘ నాయకులు విమర్శించారు. ఒక కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు పాటించవలసిన ప్రొటోకాల్ను పట్టించుకొనకపోవడం విచిత్రంగా ఉందని ఎస్సీ నాయకులు విమర్శించారు. చైర్మన్ వచ్చినప్పుడు కలెక్టర్గాని, ప్రభుత్వ అధికారులుకానీ ఉండాలి అలా కాకుండా సాధారణమైన వ్యక్తులను చూసినట్లుగా సమావేశాలు నిర్వహించడం సమంజసం కాదన్నారు. కలెక్టర్ సమక్షంలో సమావేశం నిర్వహించాలని అప్పటి వరకు ఎస్సీ నాయకులంతా సమావేశాన్ని బాయ్కట్ చేస్తున్నామంటూ ప్రకటించి నిరసన వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాల సంఘాల నాయకులు మాట్లాడుతూ మాల కార్పొరేషన్ చైర్మన్ను తాము వ్యతిరేకించడం లేదని, కలెక్టర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం దారుణమన్నారు. కనీసం పోలీసులు గానీ, అధికారులు కానీ హాజరు కాకపోవడం అవమానించడమేనని వివరించారు. నాయకులు తోటి చంగల్రావు, సిద్దాంతుల కొండబాబు, ఏనుగుపల్లి కృష్ణ, వుల్లం రవి, బోని సంజయ్కుమార్, మాతా సుబ్రహ్మణ్యం, ఖండవిల్లి లోవరాజు, రాగులు రాఘవులు, బొజ్జ ఐశ్వర్య, పెదపాక గురునాధం, దౌర్ల చిట్టిబాబు పాల్గొన్నారు. సమావేశాన్ని బాయ్కట్ చేసిన నాయకులు -
ఏలేరుకు వరద నీరు
ఏలేశ్వరం: పరివాహక ప్రాంతంలో పడుతున్న వర్షాలకు ఏలేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. రెండురోజులుగా పడుతున్న వర్షాలకు మంగళవారం ప్రాజెక్టులోకి 5,218 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. మరో రెండురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలపడంతో మరింతగా వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరనుంది. దీంతో అఽధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం మండలం పురుషోత్తపట్నం నుంచి 525 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 86.46 మీటర్లకు 79.25 మీటర్లు, 24.11 టీఎంసీలకు 12.59 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో విశాఖకు 200, తిమ్మరాజుచెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల నిలిపివేశారు. పంపా కాలువకు గండి తుని రూరల్: తుని మండలం టి.తిమ్మాపురం, తొండంగి మండలం వలసపాకల (పి.అగ్రహారం) సమీపంలో పంపా వరదనీటి కాలువకు సోమవారం రాత్రి గండిపడింది. ఆ ప్రాంతాన్ని, నీటమునిగిన పంట పొలాలను ఇరిగేషన్ అధికారులతో కలసి తుని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎన్.శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. యుద్ధప్రతిపాదికన గండిని పూడ్చేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రెండువేల ఇసుక బస్తాలతో తాత్కాలికంగా గండిని పూడ్చివేస్తామన్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు, పుష్కరనీరు అందుబాటులోకి రావడంతో ఇటీవల రైతులు వరినాట్లు వేస్తున్నారు. టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన 30ఎకరాలకు పైగా పంటలు నీటిముంపునకు గురైనట్టు స్థానికులు పేర్కొన్నారు. స్థల వివాదంపై 22న ట్రావెర్స్ సర్వే అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఘాట్ రోడ్ పక్కనే పంపా రిజర్వాయర్ను ఆనుకుని ఉన్న స్థలంపై దేవస్థానం, ఇరిగేషన్ శాఖల మధ్య నెలకొన్న వివాదానికి తెర దించేందుకు ఈ నెల 22న టావెర్స్ సర్వే నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ స్థలం దేవస్థానానికి చెందుతుందా లేక, ఇరిగేషన్ శాఖకు చెందుతుందా అనే దానిపై 15 సంవత్సరాలుగా ఈ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికి నాలుగుసార్లు సర్వే చేశారు. మొదటిసారి సర్వే మధ్యలో నిలిచిపోయింది. రెండోసారి నిర్వహించిన సర్వేలో స్థలం దేవస్థానానిదే అని తేలినా ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో కలెక్టర్ మూడోసారి జాయింట్ సర్వేకు ఆదేశించారు. ఏప్రిల్ ఒకటిన పెద్దాపురం ఆర్డీఓ రమణి పర్యవేక్షణలో దేవస్థానం, ఇరిగేషన్ అధికారుల సమక్షంలో సర్వే చేశారు. దానిపై ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ట్రావెర్స్ సర్వేకు ఆదేశాలిచ్చారు. ట్రావెర్స్ సర్వేలో వివాద స్థలం ముందు వెనుక గల స్ధలాలను కూడా సర్వే చేస్తారు. సర్వే అధికారులు ఎక్కడికక్కడ సర్వే రాళ్లు పాతి దీనిని నిర్వహిస్తారు. రత్నగిరి కొండ పరిధిలో గల 24 బీ సర్వే నంబర్లో స్థలంలో ట్రావెర్స్ సర్వే చేయనున్నారు. -
ట్యాబ్లతో లబోదిబో
బాలజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి విద్యార్థీ ఉన్నతంగా చదవాలి. ప్రపంచంతో పోటీ పడాలిశ్రీ అన్న లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు వెన్నుదన్నుగా నిలిచింది. సాంకేతిక విద్యపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా చర్యలు చేపట్టింది. కోట్ల రూపాయలు వెచ్చించి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఉచితంగా అందజేసింది. వీటి ద్వారా విద్యార్థులు సమోన్నతంగా ఎదిగేలా కృషి చేసింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. పనిచేయని ట్యాబ్లతో ఉపాధ్యాయులు, విద్యార్థులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని పూర్తిగా తుడిచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుందాగా వ్యవహరించాల్సింది పోయి దిగజారుడు రాజకీయాలకు తెర తీస్తోందంటున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లను అందజేసింది. 2022–23వ సంవత్సరం నుంచి వరుసగా రెండేళ్ల పాటు ట్యాబ్లు పంపిణీ చేసింది. ఆ ట్యాబ్ల ద్వారా అత్యాధునిక సాంకేతికతతో బోధించేవారు. పిల్లలు కూడా చక్కగా నేర్చుకునేవారు. రోజూ పాఠశాలకు తీసుకువచ్చి తరగతి గదిలో టీచర్లు బోధించే పాఠ్యాంశాలను విని.. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు తమతో పాటు ట్యాబ్లను తీసుకువెళ్లేవారు. పాఠశాలల్లో ట్యాబ్ల వినియోగానికి ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని నిర్వీర్యం చేస్తోంది. కనీస పర్యవేక్షణ, సాఫ్ట్వేర్ అప్డేట్ లేకపోవడంతో అవి మూలన పడాల్సిన దుస్థితి ఏర్పడింది. లీప్ యాప్లో వీడియోలు ఇటీవల కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లీప్ యాప్లో వీడియోలను రూపొందించి ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆ వీడియో పాఠాలను టీచర్లు తరగతి గదిలో డిజిటల్ ప్యానల్ టీవీ ద్వారా బోధిస్తున్నారు. అయితే ట్యాబ్ల విషయం మరిచిపోయారు. ట్యాబ్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోవడంతో చాలావరకు అవి పనిచేయడం లేదు. కొన్ని అసలు ఆన్ కావడం లేదు. ఎక్కడైనా టీచర్లు చొరవ తీసుకుని ట్యాబ్ ద్వారా బోధిద్దామని యత్నించినా పనిచేయడం లేదు. ట్యాబ్లను సరఫరా చేసిన సంస్థ టెక్నీషియన్లు పర్యవేక్షణ విభాగాన్ని మూసివేయడం మరింత ఇబ్బందిగా మారింది. డిజిటల్ అసిస్టెంట్లు ప్రతి నెలా పాఠశాలల సందర్శన విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లు దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ బాధ్యతలను డీఈఓ, డీవైఈఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు గత ప్రభుత్వంలో అప్పగించేవారు. డిజిటల్ అసిస్టెం ట్లు ప్రతినెలా కనీసం ఒక్కసారి ప్రతి పాఠశాలనూ సందర్శించి ట్యాబ్లు పనితీరును చెక్ చేసి మరమ్మతు బాధ్యతలు కూడా వారే చూసేవారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పాఠశాలను సందర్శించి ప్రతి శుక్రవారం ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుడి ట్యాబ్లకు వైఫై కనెక్ట్ చేసి వినియోగ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. బైజూస్, డిక్షనరీలను అందుబాటులో ఉంచి అప్డేట్ చేయడానికి ఎంఆర్సీ సిబ్బంది, సీఆర్పీలకు, పాఠశాల హెచ్ఎంలు, యాక్టివ్ టీచర్లు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చేవారు. పాఠశాల స్థాయిలోనే అప్డేట్ చేయించేవారు. అప్డేట్ చేసే క్రమంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. జిల్లా సమాచారం ఒక్కొక్క ట్యాబ్కు రూ.30 వేల ఖర్చు గత ప్రభుత్వంలో 8వ తరగతి విద్యార్థులకు పంపిణీ సాఫ్ట్వేర్ సమస్యలను పట్టించుకోని కూటమి సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు స్పందించని అధికారులు సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని గత ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాఠ్యాంశాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా బైలింగ్విల్ పద్ధతిలో పుస్తకాలను ముద్రించింది. 2022–23లో జిల్లాలోని విద్యార్థులు, టీచర్లకు కలిపి మొత్తం 23,099 ట్యాబ్లను పంపిణీ చేసింది. దీనికోసం రూ.67.23 కోట్లు ఖర్చు చేయగా 2023–24లో 380 పాఠశాలల్లో దాదాపు రూ.64 కోట్ల ఖర్చుతో 19,982 మందికి ట్యాబ్లను పంపిణీ చేసింది. ఇందుకోసం ఒక్కో ట్యాబ్పై సుమారు రూ.30 వేల దాకా ఖర్చుచేశారు. తమ వద్ద ఉన్న ట్యాబ్లు సాఫ్ట్వేర్ సమస్యలతో మొరాయిస్తున్నాయని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. సమస్యను టీచర్లు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందనా లేదు. పర్యవేక్షించాలి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఇచ్చిన విలువైన ట్యాబ్లు ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్డేట్ సమస్యతో పనిచేయడం లేదు. గత ప్రభుత్వం ఆ ట్యాబ్లను ఇవ్వడంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి. విద్యాభివృద్ధి విషయంలో పర్యవేక్షణ లోపం ఉండడం సరైన పద్ధతి కాదు. వెంటనే ట్యాబ్లకు మరమ్మతులు చేయాలి. – ఎం.గంగాసూరిబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విద్యార్థులకు ఉపయోగం గత ప్రభుత్వం హయాంలో విద్యార్థులకు అందజేసిన ట్యాబ్లు ఎంతో ఉపయోగకరమైనవి. దేశంలో ఎక్కడా విద్యార్థులకు ట్యాబ్లు ఇచ్చిన దాఖలా లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. వారికి అందజేసిన ట్యాబ్లు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. – కె.లలిత్కుమార్, స్టేట్ స్టూడెంట్ బెవలప్మెంట్ కన్వీనర్, విద్యార్థి పరిషత్ -
కన్నబాబు ఇంట విషాదం
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ రూరల్: వైఎస్సార్ సీపీలో అందరికీ బాబాయ్గా సుపరిచితులైన మాజీ మంత్రి, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు తండ్రి సత్యనారాయణ(76) మృతి చెందడంతో ఆ పార్టీ శ్రేణుల్లో విషాదం అలుముకుంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణను తొలుత కాకినాడ,హైదరాబాద్కు అక్కడి నుంచి తిరిగి కాకినాడలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తూ వచ్చారు. ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ట్రస్టు ఆస్పత్రిలో కన్నుమూశారు. భౌతికకాయాన్ని పార్టీ నేతలు, పార్టీ శ్రేణుల సందర్శనార్థం వైద్యనగర్లోని కన్నబాబు ఇంటికి తీసుకువచ్చారు. సత్యనారాయణ భౌతిక కాయాన్ని చూసి కన్నబాబు తల్లి, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన సత్యనారాయణ ఏజెన్సీలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు సోదరులు, ఇద్దరు తోబుట్టువులు, భార్య కృష్ణవేణి, కుమారులు కన్నబాబు, సురేష్బాబు, కళ్యాణ్ కృష ఉన్నారు. వీరిలో కన్నబాబు, సురేష్బాబు జర్నలిస్టులు, కళ్యాణ్ కృష్ణ సినీ దర్శకుడు. ప్రముఖుల నివాళి రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ నేతలు, శ్రేణులు తరలివచ్చి కాకినాడ వైద్యనగర్లోని కన్నబాబు స్వగృహం వద్ద సత్యనారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల విజ్జపు రెడ్డి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ముందుగా వైద్యనగర్లో నివాసం నుంచి ఊరేగింపుగా అంతిమ యాత్ర నిర్వహించారు. బంధువులు, పార్టీ అభిమానులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. తండ్రి భౌతిక కాయానికి హిందూ సంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు కన్నబాబు అంత్యక్రియలు నిర్వహించారు. కన్నబాబుకు పరామర్శ కన్నబాబును జెడ్పీ చైర్పర్సన్లు విపర్తి వేణుగోపాలరావు, చిన్ని శ్రీను, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, అనంతబాబు, పేరాబత్తుల రాజశేఖర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, తోట నరసింహం, మేరుగ నాగార్జున, మాజీ ఎంపీలు వంగా గీత, చింతా అనురాధ, మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, నల్లమిల్లి శేషారెడ్డి, కరణం ధర్మశ్రీ, కంబాల జోగులు, అన్నంరెడ్డి అనుదీప్, పాముల రాజేశ్వరి, తిప్పల నాగిరెడ్డి, జి.శ్రీనివాస్ నాయుడు, తలారి వెంకట్రావు, పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, పిల్లి సూర్య ప్రకాశరావు, గన్నవరపు శ్రీనివాస్, పార్టీ నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ నేతలు రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, జమ్మలమడక నాగమణి, గుబ్బల తులసీకుమార్, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, పిల్లంక శ్రీనివాసరాజు పరామర్శించారు. అంతిమ యాత్రలో పాల్గొన్న కన్నబాబు, చిత్రంలో జక్కంపూడి రాజా తదితరులు కాకినాడ వైద్యనగర్ నివాసంలో తండ్రి భౌతిక కాయం వద్ద కన్నబాబు, కుటుంబ సభ్యులు తండ్రి సత్యనారాయణ కన్నుమూత ప్రముఖుల పరామర్శ అంతిమ యాత్రలో వైఎస్సార్ సీపీ శ్రేణులు