breaking news
Kakinada
-
హిజ్రా స్థావరాలపై పోలీసుల దాడి
తాళ్లరేవు: జాతీయ రహదారి 216లోని యానాం బైపాస్ రహదారిలో ఉన్న హిజ్రాల స్థావరాలపై కోరంగి పోలీసులు దాడి చేసి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ కథనం ప్రకారం.. యానాం బైపాస్ రహదారిలోని పెట్రోల్ బంకు నుంచి లచ్చిపాలెం ఆంజనేయస్వామి ఆలయం వరకూ రహదారి చెంతన హిజ్రాలు స్థావరాలు ఏర్పాటు చేసుకుని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వద్ద హాజరు పరిచి బైండోవర్ చేశారు. హిజ్రాలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి వారి జీవన విధానాన్ని మార్చుకోవాలని, హితబోధ చేశారు. సెలూన్లు, స్పా సెంటర్లలో తనిఖీలు కాకినాడ క్రైం: జిల్లాలో వ్యభిచార మూలాలు విస్తృతమవుతున్న తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాకినాడలో సెలూన్లు, స్పా సెంటర్లలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో కాకినాడ ఏఎస్పీ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో నగర వన్ టౌన్, టూ టౌన్, త్రీ టౌన్, పోర్టు పీఎస్ పరిధిలో ఉన్న సెలూన్లు, స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేస్తున్నామని ఏఎస్పీ అన్నారు. సినీ దర్శకుడికి మాతృ వియోగం శంఖవరం: సినీ దర్శకుడు చంద్రమహేష్ మాతృమూర్తి ఉత్తరాది త్రివేణి (80) గురువారం మృతి చెందారు. కత్తిపూడి గ్రామంలో ఉంటూ శంఖవరం, కత్తిపూడి తదితర గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయురాలుగా పని చేశారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించారు. చంద్రమహేష్ వృత్తి రీత్యా హైదారాబాద్లో స్థిరపడ్డారు. ఆయన ప్రేయసి రావే, చెప్పాలని ఉంది, అయోధ్య రామయ్య, జోరుగా హుసారుగా, హనుమంతు తదితర సినిమాలకు దర్శకుడిగా పనిచేశారన్నారు. త్రివేణి మృతదేహానికి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, అభిమానులు నివాళులు అర్పించారు. -
వాడపల్లి హుండీల ఆదాయం రూ.1.53 కోట్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.1.53 కోట్ల ఆదాయం వచ్చిందని దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. 28 రోజుల అనంతరం దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో గురువారం హుండీలను తెరిచారు. ఆయా హుండీల్లో భక్తులు చెల్లించిన నగదుతో పాటు స్వామికి చెల్లించిన ముడుపులను స్వామివారి వసంత మండపంలోకి తెచ్చారు. దేవస్థానం సిబ్బంది, అర్చకులు, స్థానికులు, సేవాదళం భక్తులు, శ్రీవారి సేవకులు నగదు, మొక్కుబడులను విభజించి లెక్కించారు. ఆలయంలో వేంకటేశ్వరస్వామివారి, విశ్వేశ్వరస్వామివారి హుండీల ద్వారా రూ.1.26,78,200, అన్నప్రసాదం హుండీల ద్వారా రూ.26,12,993 సమకూరింది. బంగారం 47 గ్రాములు, వెండి కిలో 600 గ్రాములు, 11 దేశాల కరెన్సీ నోట్లు 24 వచ్చినట్టు ఈఓ చక్రధరరావు తెలిపారు. ఆలయ క్షేత్రపాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామివారి ఆలయ హుండీల ద్వారా రూ.3,45,300 ఆదాయం వచ్చిందన్నారు. పర్యవేక్షణ అధికారులుగా కొత్తపేట మండలం మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానం ఏసీ అండ్ ఈఓ దారపురెడ్డి సురేష్బాబు, దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ టీవీఎస్ఆర్ ప్రసాద్, అర్చకులు, గ్రామస్తులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. -
నిందితుల అరెస్ట్
కశింకోట: అనకాపల్లి జిల్లాలో తొమ్మిది చైన్ స్నాచింగ్ కేసుల్లో మైనర్తో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.26 లక్షల విలువ చేసే 26 తులాల బంగారు నగలు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి తెలిపిన వివరాలు ఇలా.. నర్సీపట్నంలో నివాసముండే తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన కర్రి నానిరెడ్డి, ఎస్.రాయవరం మండలం వాకపాడు గ్రామానికి చెందిన సెలూన్ దుకాణం నిర్వాహకుడు తారుతురి రమేష్, మరో మైనర్తో కలసి జిల్లాలో పలుచోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు నానిరెడ్డి రాజమహేంద్రవరంలో చదువు మానేసి నర్సీపట్నం వచ్చి తన తండ్రి ముత్తారెడ్డితో గ్రామాల్లో తిరుగుతూ వాయిదాల పద్ధతిపై ప్లాస్టిక్ సామాన్లు విక్రయించేవాడు. అనంతరం నర్సీపట్నంలో హోం నీడ్స్ మెటల్ దుకాణం నడుపుతూ పూర్తిగా నష్టపోయాడు. దీంతో ఫైనాన్స్ చేసిన వారు నగదు కోసం గొడవ చేస్తుండటంతో వారి ఒత్తిడిని తట్టుకోలేక యూట్యూబ్ చానల్లో మహిళల మెడలో బంగారు ఆభరణాలు దొంగతనం చేసే వీడియోలు చూసి ప్రేరణ పొందాడు. మిగిలిన ఇద్దరు నిందితులతో కలసి జిల్లాలోని ఐదు మండలాల్లో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కశింకోటలోని భవానీకాలనీకి చెందిన భార్యాభర్తలు నడిచి వెళ్తుండగా, 1న ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి ఆమె మెడలో నాలుగు తులాల బంగారు తాడును లాక్కొని పరారయ్యారు. కశింకోట నుంచి నర్సీపట్నం వరకూ సీసీ కెమెరాల ఫుటేజ్ల ఆధారంగా చోరీకి పాల్పడిన పైనిందితులను తాళ్లపాలెం వద్ద పట్టుకున్నారు. -
ప్రధానోపాధ్యాయుడిపై విచారణ
కడియం: దుళ్ల నంబరు–2 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు యార్లగడ్డ పాపారావుపై పాఠశాల ఆవరణలో గురువారం అధికారుల బృందం విచారణ చేపట్టింది. స్కూల్లో ఎనిమిదేళ్లుగా పనిచేసిన పాపారావు నిత్యం మద్యం తాగుతూ విధులకు హాజరయ్యే వారని, రికార్డులు సరిగ్గా నిర్వహించకపోవడం, ఇష్టారీతిన వ్యవహరించడంతో పిల్లలకు సరైన విద్య అందడం లేదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్లకు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు తిరుమలదాసు మాణిక్యం, కేఆర్ కిశోర్లు విచారణ చేపట్టారు. స్థానిక నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, ఫిర్యాదుదారుల నుంచి మౌఖికంగా, ప్రశ్నావళి రూపంలో వివరాలను సేకరించారు. దీనిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాష్ట్ర మంత్రికి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని మాజీ సర్పంచ్ గుర్రపు సత్యనారాయణ తెలిపారు. ఉప సర్పంచ్ తోకల శ్రీనివాసరావు, కూటమి నాయకులు ముమ్మిడి దేవీనాగేశ్వరరావు, కంటిపూడి శ్రీనివాస్, గోపి ప్రసాద్, కుపాకుల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. కొండచిలువ కలకలం నల్లజర్ల: స్థానిక ఎంపీడీఓ కార్యాలయం వెనుక తుప్పల్లో బుధవారం రాత్రి పది అడుగుల కొండ చిలువ కలకలం సృష్టించింది. ఇక్కడి పులి భాస్కరరావు ఇంటి సమీపంలో తుప్పల్లో కదలికలు రావడం చూసి పరిసర ప్రజల సాయంతో ఆయన కొండ చిలువను గుర్తించారు. తుప్పలు తొలగించి చూడగా కొండ చిలువ బయటకు వచ్చింది. దానిని యువకులు గునపాలతో పొడిచి చంపేశారు. ఆ ప్రాంతానికి ఎగువన అన్నీ ఉద్యాన తోటలే. కొంగువారిగూడెం నుంచి వచ్చే ఎర్రకాలువ కూడా ఉంది. అటవీ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. గతంలో చిన్న చిన్న పాములు కనపడుతుండేవని, ఈ తరహా కొండ చిలువ రావడం ఇదే తొలిశారని గ్రామస్తులు అన్నారు. -
ఆటంకాలు వద్దన్నా..
అల్లవరం: ఎన్నో చిత్ర విచిత్రాలు.. మరెన్నో ఆక్రమణలు.. చూసిన వారు నోరెళ్లబెట్టేలా ఘటనలు.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి వ్యవస్థ తీరు చూస్తే అర్థమవుతోంది. కాలువలు ఎక్కడికక్కడే అధ్వానంగా ఉండడంతో ఇప్పటికే సాగునీరు అందక రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడేమో ఉన్న కాలువలను బక్కచిక్కేలా చేస్తున్నా ఆ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్వయానా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇటీవల ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, కాలువల వెంబడి ఆక్రమణలను తొలగించి శివారు ప్రాంతాలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని సూచించినా ఆ ఆదేశాలను ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఆ వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలం బోడసకుర్రు పంచాయతీ ఐలావారివీధి సమీపంలో ప్రధాన కాలువను ఆనుకుని ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి రెండు అంతస్తుల భవనాన్ని యథేచ్ఛగా నిర్మిస్తున్నారు. కూటమి పార్టీలకు చెందిన కొందరు ఈ నిర్మాణానికి పూనుకున్నట్లు సమాచారం. కాలువలకు సాగునీరు విడుదల చేసేనాటికి రెండు అంతస్తుల భవనం పునాది స్థాయిలో ఉంది. అప్పటి నుంచి నేటి వరకూ ఈ విషయం ఇరిగేషన్ అధికారులకు తెలియకుండా ఉంటుందా అనేది ప్రశ్నగా మారింది. కాలువ వెంట ఆక్రమణలు తొలగించాలని జిల్లా కలెక్టర్, జేసీలు ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా ఆక్రమణ ఎక్కడా ఆగడం లేదు. ఇలా కాలువలను ఆక్రమించుకుని భవనాలు కడితే శివారు ప్రాంతాలకు సాగునీరు ఎలా అందుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదే కాలువపై ఎంట్రుకోన ఎంపీపీ స్కూల్ వద్ద ఇటీవల వంతెన నిర్మాణం చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా కాలువ వెడల్పును తగ్గించి పనులు చేస్తున్నారు. దీనివల్ల నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిందని రైతులు వాపోతున్నారు. కాలువలపై వంతెనలు, కల్వర్టులు నిర్మించేటప్పుడు ఇవన్నీ ఇరిగేషన్ అధికారులు చూడకపోవడం శోచనీయం. ఇప్పటికై నా జిల్లా స్థాయి అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం బోడసకుర్రు ప్రధాన కాలువ అంచున రెండతస్తుల భవన నిర్మాణంపై ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ చంద్రమౌళిని ‘సాక్షి’ వివరణ కోరింది. దీనిపై ఆయన మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న వారికి నోటీసులు ఇచ్చామన్నారు. తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఎంట్రుకోన వద్ద నిర్మిస్తున్న వంతెన గురించి ఇరిగేషన్ కన్జర్వేషన్ అసిస్టెంట్ శామ్యూల్ను అడగ్గా, ఈ నిర్మాణ పనులు పరిశీలించి, కాలువ వెడల్పు తగ్గినట్లు గుర్తిస్తే సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసులు ఇస్తామని చెప్పారు. కలెక్టర్ హెచ్చరిస్తున్నా బేఖాతర్ ఇరిగేషన్ స్థలం ఆక్రమణ నిబంధనలకు విరుద్ధంగా వంతెన, భవన నిర్మాణం -
శ్రావణం... ఆధ్యాత్మిక తోరణం
కల్యాణ మండపాలకు గిరాకీ ఈ నెల 26 నుంచి శుభ ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పెళ్లిళ్లు కుదుర్చుకున్న వారు తమ పిల్లల వివాహాలను ఈ ముహూర్తాల్లోనే అట్టహాసంగా జరిపించాలని భావిస్తున్నారు. ఎక్కడికక్కడ కల్యాణ మండపాలు బుక్ అయిపోయాయి. నూతన వైరెటీ కల్యాణ మండపాలు, సరికొత్త ఈవెంట్స్ను బుక్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది నవంబరు 27 వరకూ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. అమలాపురం టౌన్/ కొత్తపేట/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): శ్రావణం.. అంటే మహిళలు వరలక్ష్మీదేవిని నెలంతా మనసారా కొలిచే మాసం. ఈ నెలలో వచ్చే శుక్రవారాల్లో మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో వ్రతాలను ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవార్ల దేవస్థానాలు, ఆలయాలు ఈ నెల రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. సామూహిక లక్ష్మీదేవి వ్రతాలకు నిలయమవుతాయి. శ్రావణ మాసం ఈ నెల 25వ తేదీ శుక్రవారం నుంచి మొదలు కావడంతో జిల్లాలోని మహిళలు తమ వీలును బట్టి ఫలానా శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే నెల 8న శ్రావణ శుక్రవారం కావడంతో ఆ రోజు జిల్లాలో అధిక సంఖ్యలో మహిళలు వ్రతాలు జరుపుకొనేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ మాసమంతా ప్రతి ఇల్లూ ఓ ఆలయంగా మారి సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువైనట్లుగా భావిస్తారు. ఇళ్లలో వరలక్ష్మీదేవి వ్రతాలే కాకుండా ఇక ఆలయాలు, పలు ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక వ్రతాలు గావించే దృశ్యాలు ఆధ్యాత్మికతకు దర్పణం పడతాయి. పండగలు.. పూజలు శ్రావణ మాసంలో పలు పండగలు జరుపుకోనున్నారు. ఈ నెల 25న తొలి శుక్రవారం, వచ్చే నెల ఒకటో తేదీ రెండో శుక్రవారం, 8న మూడో శుక్రవారం, 15న నాలుగో శుక్రవారం, 22న ఐదో శుక్రవారం కావడంతో ఇళ్లలో వ్రతాలు, ఆలయాల్లో సామూహిక వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే మాసంలో ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి, అదేరోజు జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, 15న శ్రీకృష్ణాష్టమి పండగలు జరగనున్నాయి. ఈ మాసంలో మహిళలు మంగళగౌరీ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. మాంగల్యానికి అధిదేవత అయిన గౌరీదేవిని ప్రతి మంగళవారం ఆరాధిస్తారు. రూ.8 కోట్లకు పైగా వ్యాపారం మూఢం కారణంగా 48 రోజులుగా అంతగా విక్రయాలు లేకపోవడంతో పలు వ్యాపారులు నిరాశ చెందారు. శ్రావణం ఆగమనంతో తమ వ్యాపారాలు ఊపందుకుంటాయని ఆనందిస్తున్నారు. పెళ్లిళ్ల ముహూర్తాలు, శుభ కార్యక్రమాలు లేకుండా ఉన్న పురోహితులు ఈ మాసంలో ఒక్కసారిగా బిజీ కానున్నారు. బంగారు దుకాణాలు, పువ్వులు, పండ్లు, మిఠాయి దుకాణాలు రద్దీగా మారనున్నాయి. ముఖ్యంగా పురోహితులు శ్రావణ మాసమంతా బిజీ అవుతారు. బంగారు రూపుల, పువ్వులు, పండ్లు, మిఠాయిల అమ్మకాలతో జిల్లాలో సుమారు రూ.8 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచగా వేస్తున్నారు. జిల్లాలో దాదాపు 800 బంగారు దుకాణాల ద్వారా రూపుల విక్రయాలు జరుగుతాయి. వరలక్ష్మీదేవి వ్రతంలో బంగారు రూపు ఉంచితే సీ్త్రల మాంగల్యపరంగా శుభం జరుగుతుందనేది నమ్మకం. అలాగే జిల్లాలో 1,200 వరకూ పూలు, పండ్ల దుకాణాలు ఉన్నాయి. వ్రతాల్లో అన్ని రకాల పువ్వులు, పండ్లు సమర్పించి లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీ. దాదాపు రెండు వేలకు పైగా మిఠాయి (స్వీటు) దుకాణాల్లో అమ్మకాలు ఊపందుకోనున్నాయి. అమ్మవార్ల ఆలయాలకు ముస్తాబు రాజమహేంద్రవరంలోని దేవీచౌక్లో వేంచేసిన శ్రీబాలా త్రిపుర సుందరిదేవి ఆలయం, వంకాయల వారి వీధిలో వరలక్ష్మి దేవాలయం, అష్టలక్ష్మి దేవాలయాలను ముస్తాబు చేశారు. గాడాలలో వేంచేసిన గుడ్లగూబ సమేత శ్రీమహాలక్ష్మిదేవీ ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అలాగే నగరంలో కోటిలింగాల, పుష్కర, సరస్వతీ, గౌతమ, వీఐపీ ఘాట్లకు పుణ్యస్నానాలు ఆచరించడానికి వేలాదిగా భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పటి వరకూ ఘాట్లను శుభ్రం చేయకపోవడంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. నేటి నుంచి సౌభాగ్యాల కాలం వరలక్ష్మీ వ్రతాలకు మహిళల ఏర్పాట్లు ప్రారంభం కానున్న పెళ్లిళ్ల సీజన్ -
కొత్త కార్యవర్గం ఎన్నిక
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ఎస్కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘ నూతన కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా 2025– 27 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి చెవ్వూరి రవి హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కేవీ రమణారావు, ప్రధాన కార్యదర్శిగా ఐ.పంగిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మంగిన శ్రీరామారావు, ఆర్థిక కార్యదర్శిగా పల్లి రాజు, రాష్ట్ర కౌన్సిలర్లుగా కోలా సత్యనారాయణ, జి.గణపతిరావు, కె.ఫణిశేఖర్, ఉపాధ్యక్షులుగా ఆర్.విజయదుర్గ, ఎం.చిమ్మరాజుదొర, జాయింట్ సెక్రటరీలుగా జేవీ శ్రీనివాస్, పి.వెంకట్రెడ్డి, మహిళా కార్యదర్శిగా జి.ప్రమీలరాణి, సీహెచ్ సుబ్బలకి్ష్మ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త కార్యవర్గ సభ్యులతో ఎన్నికల పరిశీలకుడు చెవ్వూరి రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులపై ఉన్నతాధికారులు పని ఒత్తిడి పెంచుతున్నారని, సర్వీస్ రూల్స్ లేకపోవడం వల్ల 15 ఏళ్ల నుంచి ఎటువంటి ప్రమోషన్లు లేకుండా ఉద్యోగ విరమణ చేస్తున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి తుని: రైలు నుంచి జారిపడి మహారాష్ట్ర వాసి గురువారం మృతి చెందాడు. ఆ వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్ జిల్లా, రీసంగాన్ గ్రామానికి చెందిన పరమేశ్వర్ పాండురంగ్ వవర్ (45) లారీ క్లీనర్గా పని చేస్తున్నాడు. నాందేడ్ నుంచి లారీపై అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి లోడ్ తీసుకొచ్చాడు. లారీని డ్రైవర్కు అప్పగించి తిరుగు ప్రయాణంలో భాగంగా నాందేడ్ వెళ్లేందుకు యలమంచిలిలో రైలు ఎక్కాడు. నర్సీపట్నం రోడ్డు, గుల్లిపాడు రైల్వే స్టేషన్ల మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక జీఆర్పీ ఎస్సై జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. -
తీరంలో అలజడి
● తీరప్రాంతంలోనికి చొచ్చుకు వస్తున్న నీరు ● కోతకు గురవుతున్న ఇళ్లు, రోడ్లుకొత్తపల్లి: రెండు రోజులుగా తీరప్రాంతంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరప్రాంతంతో పాటు మత్స్యకారుల ఇళ్లు కోతకు గురవుతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో నీరు గ్రామంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై స్పందించిన పంచాయతీ అధికారులు గ్రామంలో నీరు నిలువలేకుండా కచ్చా డ్రైన్లు తువ్వుతున్నారు. ఎటువంటి తుపాన్ హెచ్చరికలు లేకపోయినా అలలు ఉధృతంగా మారడంతో తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాలలో కాకినాడ–ఉప్పాడ బీచ్రోడ్డులో సముద్రపు అలలు ఎగసి పడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. -
ఆ బండరాళ్లు పేలుళ్ల వల్ల పడలేదు
తుని రూరల్: మండలం కుమ్మరిలోవ సమీపంలో జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను కలెక్టర్ షణ్మోహన్ పర్యవేక్షించారు. బుధవారం తుని వచ్చిన ఆయన ఇటీవల ఒకటో వార్డులో బండరాళ్లు పడిన ఘటన వివరాలను అధికారులు, కాంట్రాక్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ఇళ్లపై పడిన పేలుళ్ల వల్ల పడలేదని, ఆ కంపనాలకు కొండపై నుంచి పడ్డాయని తెలిపారు. అనంతరం ఆయన తాండవ నదిపై నిర్మిస్తున్న అక్విడెక్ట్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 12 ఏళ్లుగా నిలిచిపోయిన పోలవరం ప్రధాన ఎడమ కాలువ పనులు కాలనీవాసుల సహకారంతో శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు 35 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించగా మరో 60 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉందన్నారు. ఇక్కడి నిర్వాసితుల సమస్యలను రెండు వారాల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి, పోలవరం ఇరిగేషన్ ఈఈ గోవిందు, డీఈ మురళి, తహసీల్దార్ ప్రసాద్, ఎంపీడీఓ కె.సాయినవీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆ కంపనాలకు కొండపై రాళ్లు దొర్లి ఇళ్లపై పడ్డాయి రెండు వారాల్లో నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం పోలవరం కాలువ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ షణ్మోహన్ -
అచ్చెన్న వ్యాఖ్యలు అన్యాయం
ఆడబిడ్డ నిధిపై బాధ్యతాయుతమైన మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు అన్యాయం. ఆ పథకం అమలుచేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని ఎలా అంటారు? రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందో లెక్కా పత్రం లేకుండా సార్వత్రిక ఎన్నికల్లో ఎందుకు హామీ ఇచ్చారు? అంటే ప్రజలను నిలువునా వంచన చేసి ఓట్లు వేయించుకోవడం కాదా? అధికారంలోకి వచ్చేశామనే ధైర్యంతో ఇప్పుడు ఇలా మాట్లాడతారా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. – రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్, వైఎస్సార్ సీపీ మహిళా రాష్ట్ర కార్యదర్శి. కౌడా మాజీ చైర్పర్సన్. కాకినాడ ఆడబిడ్డకు అన్యాయం చేస్తారా? అధికారంలోకి వచ్చీ రాగానే ఆడబిడ్డ పథకాన్ని అమలు చేస్తామన్నారు. 2024 జూన్ నుంచే కమ్రం తప్పకుండా పేద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామని బాబు, పవన్కల్యాణ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇలా వారి కేబినెట్లో ఒక మంత్రితో ఇలా మాట్లాడించడం మహిళలను మోసం చేయడమే. ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారంటీ’ పేరిట ప్రజలకు అందించిన బాండ్లలో సైతం ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఈ విషయంపై మహిళలకు సమాధానం చెప్పాల్సిందే. – సుంకర శివప్రసన్నవిద్యాసాగర్. వైఎస్సార్ సీపీ సిటీ అధ్యక్షురాలు, మాజీ మేయర్, కాకినాడ -
రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్షాపులు, పర్మిట్ రూమ్లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. కక్షపూరిత పాలనకు స్వస్తి పలకండి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు -
ఈ శిక్షణ మాకొద్దు..!
ప్రత్యామ్నాయం చూసుకున్నాను.. బీఎడ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడిని. ఎస్జీటీకి బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్లో చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. దీంతో అధ్యాపక వృత్తిని వదిలి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. –బొడ్డపాటి సురేష్ కుమార్, చెల్లూరు, రాయవరం మండలం ఊహించని పరిస్థితి ఎదురైంది బీఎడ్పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విద్యకు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు. బీఎడ్, ఎంఎడ్ చేసిన వారికి డీఎడ్ కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేయవచ్చు, కానీ వారిని ఎస్జీటీకి అనర్హులుగా పేర్కొనడం దారుణం. –డాక్టర్ వైవీ జగన్నాథ్, ప్రిన్సిపాల్, శ్రీక్షణ ముక్తేశ్వర బీఎడ్ కళాశాల, ముక్తేశ్వరం రాయవరం: ఉపాధ్యాయ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఉపాధ్యాయులుగా బోధించాలంటే ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొందాల్సి ఉంది. ఈ శిక్షణకు ఇంటర్ అర్హతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), డిగ్రీ అర్హతతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయ విద్య అర్హత కోర్సుల్లో బీఎడ్కు రెండేళ్ల పాటు శిక్షణ ఇవ్వాలనే నిబంధన 2016 అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి బీఎడ్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు క్రమంగా దూరమవుతున్నారు. 2015కు ముందు బీఎడ్ ప్రవేశ పరీక్షకు వేలల్లో దరఖాస్తులు రాగా, ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వందల్లోనే వస్తున్నాయి. 2025లో బీఎడ్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎడ్సెట్కు జిల్లా నుంచి దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఈ కోర్సుకు డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ఆ కళాశాలల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. 2014–15 విద్యా సంవత్సరం వరకూ బీఎడ్ శిక్షణ కాలం ఒక ఏడాది మాత్రమే ఉండగా, 2015–16 నుంచి రెండేళ్లకు పెంచారు. అదే ఏడాది కేవలం 531 మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఒకప్పుడు పోటీ.. ఇప్పుడు రారేంటి! ఒకప్పుడు ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బీఎడ్కు ఎక్కడ లేని పోటీ ఉండేది. జిల్లాలో గడిచిన దశాబ్ద కాలంగా పోటీ తగ్గింది. 2015లో బీఎడ్ ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్కు వెయ్యి మంది కూడా దరఖాస్తు చేసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 11,701 మంది దరఖాస్తు చేయగా, జిల్లా నుంచి కేవలం 531 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీఎడ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,462 దరఖాస్తులు రాగా, ప్రవేశ పరీక్షకు 1,125 మంది హాజరయ్యారు. ఒకప్పుడు వేల సంఖ్యలో రాగా ఆ సంఖ్య ఇప్పుడు వందల సంఖ్యకు పడిపోవడం బీఎడ్ కళాశాలల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఎడ్సెట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు బీఎడ్ కళాశాలల నిర్వాహకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1,200 సీట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గతంలో 36 బీఎడ్ కళాశాలలు ఉండేవి. ఈ కళాశాలల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో కళాశాలల సంఖ్య 22కు పడిపోయింది. బీఎడ్కు డిమాండ్ ఉన్న దశాబ్ద కాలం క్రితం ఒక్కో కళాశాలలో 100 వరకూ సీట్లు ఉండగా, ఇప్పుడు ఒక్కో కళాశాలకు 50 మాత్రమే ఉన్నాయి. 22 కళాశాలల పరిధిలో 1,200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ బీఎడ్ కళాశాలలో 150 సీట్లు ఉండగా, ఒక్కో ప్రైవేట్ కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. 2015–16 విద్యా సంవత్సరంలో 3,600 సీట్లు ఉండగా, కేవలం 500 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. కారణాలు ఎన్నో.. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు బీఎడ్ విద్యకు ఆదరణ తగ్గడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. బీఎడ్ ఉపాధ్యాయ శిక్షణను రెండేళ్లకు పెంచారు. ఒకప్పుడు ఏడాది శిక్షణ ఉండగా, రెండేళ్ల కాల పరిమితికి పెంచారు. ఇదిలా ఉంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ప్రతి డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులే అధికంగా ఉంటాయి. అధికంగా ఉన్న ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ చేసిన వారు అనర్హులుగా పేర్కొనడంతో బీఎడ్ విద్యకు ఒక్కసారిగా డిమాండ్ పడిపోయింది. 2027–28 విద్యా సంవత్సరం నుంచి.. ఉపాధ్యాయ శిక్షణ పొందే వారిలో బోధనాపరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) బీఎడ్ ట్రైనింగ్ కాల వ్యవధిని రెండేళ్లకు పెంచింది. అయితే రెండేళ్ల కాల వ్యవధి ఉన్న బీఎడ్కు క్షేత్ర స్థాయిలో ఆదరణ తగ్గిపోవడంతో 2027–28 విద్యా సంవత్సరం నుంచి బీఎడ్ ట్రైనింగ్ను ఏడాది కాల పరిమితికి కుదించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ఏడాది కాల పరిమితికి బీఎడ్ కోర్సు ఉంటే భవిష్యత్తులో బీఎడ్కు తిరిగి ఆదరణ ఉండే అవకాశముంటుంది. ఎడ్సెట్కు 1,462 మందే దరఖాస్తు రెండేళ్ల శిక్షణకు వెనకడుగు వేస్తున్న అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అవకాశం లేకపోవడం కారణమే -
నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా
తొండంగి: రాజమహేంద్రవరంలోని నాళంవారి సత్రానికి చెందిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలం ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమికి మూడేళ్ల కౌలు కాలం ముగిసింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 29న శృంగవృక్షంలో అధికారులు కౌలువేలం నిర్వహించగా పాత బకాయిల చెల్లింపు అనంతరం రైతులు గడువు కోరడంతో అప్పట్లో వాయిదా వేశారు. దాదాపు రెండున్నర నెలల అనంతరం రాజమహేంద్రవరం నాళం వారి సత్రంలో బుధవారం అధికారులు కౌలువేలం నిర్వహించారు. రెండు బిట్లుగా 53.04 ఎకరాలకు కౌలువేలం నిర్వహించగా మిగిలిన భూములకు కౌలువేలం వాయిదా వేసినట్టు సత్రం అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు 24 మంది రైతులు ప్రధమ ధరావతు చెల్లించి వేలంలో పాల్గొన్నారు. మొత్తం 13 బిట్లుగా విభజించి వేలం పాట ప్రారంభించగా మొదటి బిట్టు 27.19 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.3.68 లక్షలకు శృంగవృక్షానికి చెందిన యనమల నాగేశ్వరరావు, రెండవ బిట్టు 25.85 ఎకరాలకు హెచ్చుపాటగా రూ.5.01 లక్షలకు మరో రైతు అమృత లోవబాబు కౌలు వేలం ఖరారు చేసుకున్నారు. అనంతరం రైతుల మధ్య వాగ్వివాదం రావడంతో 24 మంది రైతులకు 18 మంది అక్కడి నుంచి వెళ్లిపోయారన్న కారణంతో అధికారులు కౌలు వేలాన్ని వాయిదా వేసినట్టు ప్రకటించారు. మిగిలిన 11 బిట్లు 215.06 ఎకరాలకు త్వరలో కౌలువేలం నిర్వహిస్తామని సత్రం ధర్మకర్త నాళం వెంకటేష్, ఈవో టీవీఎస్ఆర్ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. ఏలేరులో 10.36 టీఎంసీల నీటి నిల్వలు ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టులో బుధవారం నాటికి 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. ఇటీవల వర్షాలకు ప్రాజెక్టులో స్వల్పంగా నీటినిల్వలు పెరిగాయి. ఎగువ ప్రాంతం నుంచి 19.87 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో ప్రాజెక్టులో రూ.86.56 మీటర్లకు 77.15 మీటర్లు, 24.11 టీఎంసీలకు 10.36 టీఎంసీల నీటినిల్వలు ఉన్నాయి. దీంతో ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు 1200, విశాఖకు 150. తిమ్మరాజుచెరువుకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నేడు తలుపులమ్మకు సహస్ర ఘటాభిషేకంతుని రూరల్: లోవ దేవస్థానంలో గురువారం సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు వేదపండితులు, ప్రధాన అర్చకులు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 26న ప్రారంభమైన ఆషాఢ మాసోత్సవాలు ఈనెల 24 తో ముగియనున్నాయి. ముగింపు సందర్భాన్ని పురస్కరించుకుని అమ్మవారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్టు ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఇందులో భాగంగా వేదపండితులు, అర్చకులు సప్తనదీ జలాల కలశాలను ఆవాహనం చేసి విశేషంగా అలంకరించారు. భక్తులు తరలివచ్చి సహస్ర ఘటాభిషేకంలో భాగస్వాములు కావాలన్నారు. -
గుమ్మడికాయల మాటున పశువుల రవాణా
కిర్లంపూడి: పైకి గుమ్మడికాయల లోడు కానీ.. అందులో పశువులను రవాణా చేస్తున్నారు. ఈ మినీ వ్యాన్ తుని నుంచి కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్కు వెళుతోంది. దీనిని బుధవారం స్వాధీనం చేసుకుని, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన వివరాల మేరకు, మినీ వ్యాన్ తొట్టె భాగంలో రెండు ఆవులు, 8 ఎద్దులను ఎక్కించి, అవి లేవకుండా గట్టిగా తాళ్లతో రాడ్లకు కట్టారు. ఎవరికీ అనుమానం రాకుండా వాటిపై చెక్కలు అమర్చి, గుమ్మడికాయల బస్తాల లోడు వేశారు. తమకు అందిన సమాచారంతో స్థానిక ఎస్సై జి.సతీష్ తన సిబ్బందితో కృష్ణవరం టోల్ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మినీ వ్యాన్ పట్టుబడింది. పశువులను కృష్ణుడుపాలెంలో గోశాలకు అప్పగించి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై జి.సతీష్ తెలిపారు. వృద్ధురాలి మృతి జగ్గంపేట: సీతానగరం వద్ద పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దంపతుల్లో వృద్ధురాలు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఎస్సై రఘునాథరావు వివరాల మేరకు, సీతానగరం వద్ద మంగళవారం వృద్ధ దంపతులు సక్కుల సత్యనారాయణ, సక్కుల మంగతాయారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సక్కుల మంగతాయారు(65) మృతి చెందినట్టు ఎస్సై తెలిపారు. -
డిమాండ్లు నెరవేర్చాలి
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తాం. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలక యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఇది చాలా దారుణం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే తినడానికి తిండి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటమి పాలకులు వెంటనే స్పందించి మత్స్యకారుల డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. – సంగాడి ఈశ్వరరావు, మత్స్య కార్మిక సంఘం నాయకుడు, కాకినాడ ● -
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడులు
ఇద్దరు మహిళలపై కేసు పెద్దాపురం: జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం డీఎస్పీ శ్రీహరిరావు ఆధ్వర్యంలో పోలీసులు స్థానిక వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలపై కేసులు నమోదు చేసినట్టు డీఎస్పీ శ్రీహరిరావు తెలిపారు. స్థానిక వక్కలంక వారి వీధి, మసీదు వీధి, కట్టమూరు పుంత ప్రాంతాల్లో దాడులు చేశామన్నారు. మసీదు వీధికి, కట్టమూరు పుంతకు చెందిన ఇద్దరు మహిళలను మధ్యవర్తుల సమక్షంలో అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామన్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ, ఇటీవల సోషల్ మీడియాలో ఇద్దరు వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళల అంశం ప్రసారమైందన్నారు. వీరి మధ్య అనేక ఏళ్లుగా వివాదం నడుస్తోందన్నారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దాడుల్లో ట్రైనీ డీఎస్పీ జీవన, పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, ప్రత్తిపాడు సీఐలు జయశంకర్, కృష్ణభగవాన్, వైఆర్కే శ్రీనివాస్, వి.సూరిఅప్పారావు, పలువురు ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రిగ్గులతో మత్స్యకారులకు నష్టం
సముద్రంలో రిలయన్స్, ఓఎన్జీసీ రిగ్గుల వల్ల కాకినాడ జిల్లాలో అద్దరిపేట నుంచి గాడిమొగ వరకున్న తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సముద్రంలో కాలుష్యం పెరిగి, మత్స్య సంపద తగ్గి మత్స్యకారులు చేపల వేట సాగక తీవ్రంగా నష్టపోతున్నారు. తీరం వెంబడి ఉన్న వివిధ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి, చేపలు దొరక్క మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇదే విషయమై గత ఎన్నికల్లో మా సమస్యలను కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఎన్నికలయ్యాక వాటిని విస్మరించారు. దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. మూడు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేకపోగా, ఆయన ఇన్చార్జి కూడా అందుబాటులో లేక పోవడంతో మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. చివరకు మా వినతిపత్రం జనసేన నేతలు తీసుకున్నారు. వారు స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. మా డిమాండ్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు. – సీహెచ్ రమణి, ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం, ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ ● -
నడిసంద్రాన సాపాట్లు
శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ చేపల రుచులు చేదెక్కాయి. సాగర గర్భంలో పర్యావరణంలో మార్పులు చోటు చేసుకుంటుండడంతో మత్స్య సంపదకు ముప్పు ఏర్పడుతోంది. ఈ క్రమంలో పాటు లేక.. పూట గడవని మత్స్యకారులు వలసబాట పడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పెరిగిన డీజిల్ ధరలు వెరసి మత్స్యకారుల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన హామీలను, తమ డిమాండ్లను ‘కూటమి’ పెద్దలు నెరవేర్చాలని మత్స్యకారులు ఆందోళన బాట పట్టారు. పిఠాపురం: నిత్యం కాకినాడ హార్బర్తో పాటు, జిల్లాలోని వివిధ తీర ప్రాంతాల నుంచి గతంలో ప్రతి నెలా సుమారు 15,900 టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి కాగా, రొయ్యలు 11 వేల టన్నులకు పైగా ఉత్పత్తి అయ్యేవి. ప్రస్తుతం చేపలు, రొయ్యల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. పారిశ్రామికీకరణ పేరుతో ఇష్టారాజ్యంగా సముద్రంలో తవ్వకాలు జరపడంతో పాటు, వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలివేస్తుండడంతో సముద్ర గర్భంలో పర్యావరణం దెబ్బతింటోంది. కొన్ని రకాల నిషేధిత వలలు వేటకు విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల మత్స్య సంపద ఆదిలోనే అంతమవుతోంది. ముఖ్యంగా రింగు వలలు చేపల గుడ్లను సైతం వేటాడడం వల్ల మత్స్య సంపదకు శాపంగా పరిణమిస్తోంది. ఈ వలను నిషేధించినప్పటికీ, దీని అమలుకు మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకోకపోవడం తీవ్ర పరిణామాలకు దారితీస్తోంది. చేపల వేట నిషేధ సమయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల విచ్చలవిడిగా సాగిన చేపల వేటతో మత్స్య సంపద గుడ్ల దశలోనే నాశనమవుతోంది. వివిధ పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం నేరుగా సముద్రంలో కలుస్తుండడంతో, సముద్ర గర్భంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. తద్వారా కొన్ని మత్స్య రకాలు కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో టన్నుల కొద్దీ బరువైన తిమింగలాలు, సముద్ర తాబేళ్లు మత్స్యకారుల వలలకు చిక్కి, తీరానికి చేరడం సముద్ర పర్యావరణ అసమతుల్యతకు అద్దం పడుతున్నాయి. పశ్చిమ రాజగోపురం వద్ద.. కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు లారెస్ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, టూరిజం శాఖ మత్స్యకారుల డిమాండ్లివీ.. నష్ట పరిహారం రూ.11,500 ఇవ్వాలి. మత్స్యకారులకు రూ.50 లక్షల బీమా చేయించాలి. సముద్ర తీరంలో ఉన్న కంపెనీల్లో మత్స్యకారులకు 20 శాతం ఉద్యోగాలివ్వాలి. మత్స్యకారులను రైతులుగా గుర్తించి, డీసీసీబీ ద్వారా రుణాలు ఇవ్వాలి. సీఎస్సార్ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. సొసైటీలను పునరుద్ధరించి, పరికరాలకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలి. మార్కెట్లలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. సన్నగిల్లుతున్న మత్స్యకారుల జీవనోపాధి కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ డిమాండ్ల సాధనకు పోరుబాట పట్టిన మత్స్య కార్మిక, మత్స్యకార సంఘాల ఐక్యవేదిక -
పాలెం సర్పంచ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మోటిక మునియ్య మంగళవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను కిరణ్కుమార్ విలేకరులకు తెలిపారు. 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులకు సర్వే నం.10లో 5.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నం.84, 86లో సుమారు పది ఎకరాల భూమిని మాధవరాయుడుపాలెం దళితులకు కూడా ఇచ్చిందన్నారు. ఆ భూమిలో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి దళితుల భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో తన అనుచరులతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 52 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తారన్న భయంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, చేపల చెరువును కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తన రాజకీయ పలుకుబడితో రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, దిమ్మెను దౌర్జన్యంగా తొలగించారన్నారు. అందువల్ల చంటిపైనా, అతనికి సహకరించిన వారిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు కిర్లంపూడి: మాజీ మంత్రి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు (బాలు)తెలిపారు. ముద్రగడ ఇటీవల అస్వస్థతకు గురికాగా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికేమి ఢోకా లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉండడంతో తన తండ్రి వద్దకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని దయచేసి ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని వీర్రాఘవరావు కోరారు. విద్యతోపాటు క్రీడలూ అవసరమే రాజానగరం: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వాటికి కూడా తగిన సమయాన్ని కేటాయించి, క్రీడలలోనూ మంచి ప్రతిభను చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో యూనివర్సిటీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే 25 వ వుమెన్ స్పోర్ట్సు మీట్ని మంగళవారం గాలిలోకి బెలూన్స్ని వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 24 మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల నుంచి 567 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని యూనివర్సిటీ స్పోర్ట్సు క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి తెలిపారు. వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, చెస్ వంటి ఆటలలో ఈ పోటీలు జరుగుతున్నాయని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీడీ శ్రీనివాసరావు చెప్పారు. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ మిశ్రా, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన పోలిన వెంకట్రావు (70) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావు అనారో గ్యం బారిన పడ్డారు. ఆ బాధ తట్టుకోలేక సోమ వారం రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యు లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రావు మంగళవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని కుమారుడు పోలిన వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు -
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడికి చెందిన పేంటి మరియమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. ఈ నేపథ్యంలో రౌతులపూడి శివారు మరిడమ్మతల్లి గుడి వద్ద ఇద్దరు బాలుర నుంచి రూ.30వేలు నగదు, 30గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. బాలురను జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద హాజరు పరచామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ, కానిస్టేబుళ్లు బోస్, నూకరాజు, ఉదయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ముందుగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. గదిలో బీరువా తెరచి లాకర్లో దాచుకున్న రెండు కాసుల బంగారు వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకారులను రోడ్డున పడేసే కాలుష్య కారక పరిశ్రమలు నిలిపివేయాలని అరు ణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ 34వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ మంగళవారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభాస్థలి వరకు కార్మికులు ఎరజ్రెండాల చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి విమలక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తీర ప్రాంతంలో పలు విషతుల్యమైన పరిశ్రమల వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. దీనివల్ల తీర ప్రాంతంలో హేచరీస్ కనుమరుగైపోతాయని, అనేకమంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. ప్రధాన వక్త ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని విమర్శించారు. అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమరుస్తున్నారని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదిస్తూ చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గొల్ల అంజయ్య, ఏపీ ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏపీఆర్సీఎస్ సీనియర్ నాయకులు కొండ దుర్గారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు మల్సూర్, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) కన్వీనర్ డొక్కులూరి సంగీత పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం అయినవిల్లి మండలంలోని ముక్కామల సమీపంలోని ఇరుసుమండకు చెందిన చంద్రశేఖర్ తన వ్యాన్పై సమీపంలోని కొత్తపేట నుంచి లోడు వేసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రావులపాలెం వచ్చేసరికి ఒక ప్రయాణికుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. స్థానిక అంతర్రాష్ట కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడిని బయటకు తీసేందుకు పోలీసు, హైవే సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఎన్హెచ్ అంబులెన్స్పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై జి.నరేష్ కేసును నమోదు చేయగా రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇరుసుమండలో విషాద ఛాయలు అంబాజీపేట: చంద్రశేఖర్ మృత్యువాత పడటంతో ఇరుసుమండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రామలక్ష్మి, కుమారులు పవన్, చందు ఉన్నారు. అందరితో కలిసి ఉండే చంద్రశేఖర్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని స్వగ్రామం తాడేపల్లిగూ డెం మండలంలోని మిలటరి మాధవరం. అయి తే 30 ఏళ్ల క్రితం వివాహనంతరం ఇరుసుమండ వచ్చి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక వైఎస్సార్ జంక్షన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన చవల శ్రీనివాస్ (38) రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలను తీర్థాలలోను, గ్రామ గ్రామం తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అవివాహితుడైన అతను తల్లితో కలిసి కొంతమూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో పెద్దాపురంలోని మరిడమ్మ తీర్థంలో రాగి వస్తువులను అమ్ముకునేందుకు తన యాక్టివా స్కూటర్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొని, కొద్దిదూరం బైకుతో సహా ఊడ్చుకుంటూ పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అదే లారీ డ్రైవర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా యాక్టివా స్కూటర్పై ప్రయాణిస్తూ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొడుకే ఆధారంగా ఉన్న ఆ వృద్ధ తల్లి అనాథగా మిగిలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన స్థానికులు ● పురుగులు మందు కూడా తాగినట్టు పోలీసుల వెల్లడి ● సంతానం పట్టించుకోకపోవడమే కారణం? జగ్గంపేట: జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం సాగించవలిసిన వృద్ధ దంపతులు జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఘటన జరిగిన వెంటనే స్పందించి వృద్ధ దంపతులను కాపాడి జగ్గంపేటలోని సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏవీ నగరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల సక్కుల సత్యనారాయణ, 65 ఏళ్ల సక్కుల మంగతాయారు దంపతులు. సత్యనారాయణ పెద్దాపురంలో శ్రీ చక్ర హాస్పిటల్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. సంతానం ఈ దంపతుల మంచి చెడ్డలు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందినట్టు భావిస్తున్నామన్నారు. దీంతో మంగళవారం జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చెరువు వద్దకు చేరుకుని పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకారు. అయితే అక్కడ వున్న స్థానికులు దీన్ని గమనించి వారిని రక్షించి చెరువు గట్టుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని జగ్గంపేట సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం దుకాణాలు షాపులు కోనసీమ 133 13 146 తూర్పు గోదావరి 125 12 137 కాకినాడ 155 15 170● బ్రూవరీస్ కార్పొరేషన్ నిర్వాకం ● బ్రాండు ఒకటే.. ధరలే వేరు ● మద్యం వ్యాపారుల సరికొత్త దోపిడీ ● అందుబాటులో లేని రూ.99 మద్యం ఆలమూరు: బ్రూవరీస్ కార్పొరేషన్ చేస్తున్న మద్యం సరఫరా, ధరల నిర్ధారణ ఒక ప్రహసనంలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో మద్యం సిండికేట్లు కుమ్మకై ్క మద్యం ప్రియుల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారిని అనేక రూపాల్లో దోచుకుంటున్నారు. ఒకే మద్యం బ్రాండును ఒకే ధరకు విక్రయించవలసి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాండు ఒకటే అయినా ధర మాత్రం వేర్వేరుగా ముద్రించి వసూలు చేయడం ద్వారా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోంది. దీంతో మద్యం కొనుగోలుదారుల్లో మద్యం ధరలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనున్న 453 మద్యం దుకాణాలకు అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. మద్యం షాపుల స్థాయిని బట్టి 20 నుంచి 30 రకాల చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకూ అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చీప్ లిక్కర్ బ్రాండు అయిన 9 సీ హార్స్ కంపెనీ క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్లో తయారు చేసిన 179 బ్యాచ్ బాటిళ్లలో మూడు ఎంఆర్పీ ధరలు ఉండటం వినియోగదారులను నివ్వెర పరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99 ధర కలిగిన మద్యం బాటిళ్లు ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చీప్ లిక్కర్ను ఐదు కంపెనీలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో మద్యం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం లేదు. ఇదో రకం దోపిడీ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ముద్రించి దోచుకుంటున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. 9సీ హార్స్ బ్రాండుకు చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఒక్కొక్క చోట ఒక్కొ విధంగా రూ.120. రూ.130, రూ.140 ధరలు ముద్రించి ఉన్నట్లు బాటిళ్లను చూస్తే తెలుస్తోంది. ఈ ధరలు మద్యం విక్రయదారులు ముద్రించారా లేదా బ్రూవరీస్ కార్పొరేషన్ ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఈ ధరల తేడా వల్ల మద్యం కొనుగోలుదారులు సుమారు రూ.ఐదు లక్షల వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చీప్ లిక్కర్ ధరలను ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయించి ప్రజలతో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం దుకాణాల వద్ద విధిగా ఏర్పాటు చేయాల్సిన మద్యం ధరల పట్టిక కాని, స్టాకు వివరాలు కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంఆర్పీలో తేడా ప్రస్తుతం ఒక బ్రాండు కేనా మిగిలిన బ్రాండులపై కూడా తేడాగా ముద్రిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కనిపించని రూ.99 మద్యం మద్యం షాపుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మద్యాన్ని రూ.99 కే విక్రయిస్తామన్న కూటమి నాయకుల ఎన్నికల హామీ బుట్టదాఖలైంది. బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి రేషన్ పద్ధతిలో వారానికి దుకాణానికి మూడు మద్యం కేసులకు మించి సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. అలాగే రూ.99 మద్యం బాటిల్కు కమీషన్ను పూర్తిగా తగ్గించడంతో విక్రయదారులు కూడా ఆ బ్రాండ్లను అమ్మడానికి ఇష్టపడటం లేదని మద్యం ప్రియులు చెబుతున్నారు. -
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. దుళ్లలోని శ్రీశ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీ మెడికల్స్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయగా అక్కడ ఫార్మాసిస్ట్ లేకపోవడం, బిల్లులు లేకుండా అమ్మకాలు చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు లభించడం కనుగొన్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని దుకాణాలు ఇదే విధంగా ఉన్నాయని, వాటన్నింటిపై కేసులు నమోదు చేశామన్నారు. -
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సబ్సిడీ సొమ్ము విడుదల చేయలేనప్పుడు అంత హడావుడిగా రుణ ప్రణాళిక ప్రకటించడమెందుకు? రుణాల మంజూరు ప్రక్రియ మొదలై ఐదు నెలలైనా ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరికై నా రుణం మంజూరు చేసి ఉంటే చెప్పాలి. – రావూరి వెంటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం కార్యదర్శి, కాకినాడ వెంటనే మంజూరు చేయాలి కుటుంబ పోషణ కోసం వస్త్ర, కిరాణా దుకాణాలు పెట్టుకుందామని బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆ రుణం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడచినా ఇప్పటి వరకూ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే లబ్ధిదారుల లిస్టు పంపామంటున్నారు. రుణాలు మంజూరైన జాబితాయే రాలేదనీ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బీసీ రుణాలు మంజూరు చేయాలి. – గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, రాజోలు అసలు ఇస్తారా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కార్పొరేషన్ రుణాలు వస్తాయని దరఖాస్తుదారులు మూడు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. స్వయం ఉపాధికి అవకాశాలు మరింత పెంచాలి. రుణాలకు సంబంధించి సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేయకుంటే బ్యాంకులు మాత్రం ఎలా రుణాలు ఇస్తాయి? – దుర్వాసుల సత్యనారాయణ, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజమహేంద్రవరం ఆశలు ఆవిరి ప్రభుత్వం రాయితీ రుణాలిస్తుందని ఆశపడి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో జాబితాలపై పరిశీలన జరిపి, బ్యాంకుకు వెళ్లేసరికి ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు. సర్కారు ఉదాసీనత కారణంగా ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నా ఫలితం ఉండటం లేదు. అసలు రుణాలిస్తారో ఇవ్వరో అర్థం కావడం లేదు. – వేట్ల నాగేశ్వరరావు, మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు, రామచంద్రపురం -
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణాలిస్తాంమని, సగం సబ్సిడీ అని, మిగిలిన సగం బ్యాంక్ రుణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గొప్పగా డప్పేశారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు రుణాలో రుణాలంటూ దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి అందరికీ సబ్సిడీ రుణాలంటూ ఊదరగొట్టారు. మాయ మాటలతో జనాన్ని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కారు. తరువాత ఎప్పటి మాదిరిగానే నిలువునా ముంచేశారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలు రాకపోవడంతో.. స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడిన వారు హతాశులవుతున్నారు. అంతన్నారింతన్నారే చంద్రబాబు.. నట్టేట్లో ముంచేశారే.. అని మండిపడుతున్నారు. లక్ష్యం మూరెడు.. దరఖాస్తులు బారెడు బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన వారికి రాయితీ రుణాలిస్తామని సర్కారు ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి రుణ లక్ష్యాలు వందల్లోనే ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లు కలిపి సుమారు 100 యూనిట్లు కేటాయిస్తే అంతకు పది రెట్లు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్చి 11న ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించింది. ఆ నెలంతా స్వీకరించడంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాటిని ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో వడబోసిన ఎంపీడీఓలు.. ఆయా బ్యాంకులకు పంపించారు. బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. బ్యాంకుల నుంచి ఆమోదం లభించిన వారంతా శ్రావణ మాసం మంచి రోజుల్లో యూనిట్లు ప్రారంభిద్దామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. మంజూరు చేసిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు ఎక్కడా లంగరు అందకపోవడంతో ప్రభుత్వం మార్జిన్ మనీ విడుదల చేయకుండానే కార్పొరేషన్ రుణ ప్రక్రియను అప్పటికప్పుడు నిలిపివేసింది. ఈ రుణాలపై ముందుకు వెళ్లవద్దని మే 8న ఆదేశాలిచ్చింది. ఫలితంగా కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క యూనిట్ కూడా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఒక యూనిట్ విలువ రూ.2 లక్షలనుకుంటే అందులో 50 శాతం అంటే రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ. మిగిలిన రూ.లక్ష బ్యాంకు రుణం. ఇస్తానన్న 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. రుణాల పేరిట దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఎందుకు.. ఇప్పుడు తమ ఆశలను ఆడియాసలు చేయడం ఎందుకని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా ప్రభుత్వం కావాలనే సబ్సిడీ విడుదల చేయకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఈ ప్రక్రియను నిలిపివేసిందని మండిపడుతున్నారు. పెద్దాపురంలో కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలకు హాజరైన అర్జీదారులు (ఫైల్) మూడు జిల్లాల్లో ఆయా కార్పొరేషన్ల వారీగా రుణాల వివరాలురుణాల కేటగిరీ యూనిట్ల రుణాల లక్ష్యం దరఖాస్తు మంజూరు మొత్తం లక్ష్యం (రూ.లక్షలు) దార్లు చేసిన (రూ.కోట్లు) యూనిట్లు కాకినాడ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,914 3,952.00 31,859 562 1,283.55 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 2,449 41 84.42 కాపు కార్పొరేషన్ 763 2,824.00 21,454 238 5.93 తూర్పు గోదావరి జిల్లా బీసీ కార్పొరేషన్ 1,374 2,887.00 16,408 234 5.22 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 203 540.00 2,211 20 0.54 కాపు కార్పొరేషన్ 757 2,715.00 8,193 174 4.53 కోనసీమ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,394 2,954.00 15,147 246 5.87 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 1,657 12 0.24 కాపు కార్పొరేషన్ 757 2,714.00 15,644 158 4.62 ఒక్క యూనిట్ ఇస్తే ఒట్టు ఊదరగొట్టి ఉసూరుమనిపించారు మూడు నెలలైనా దిక్కుమొక్కు లేదు సబ్సిడీపై చేతులెత్తేసిన సర్కార్ -
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్ధులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మత్తులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు. డీఎల్ఎస్ఏ అందిస్తున్న సేవలను వివరించారు. హాస్టల్లో డీఎల్ఎస్ఏ కార్యదర్శి తనిఖీ -
త్వరలో కొత్త ట్రస్ట్ బోర్డు!
ఈ నియోజకవర్గాల నుంచే.. ఫ అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే 25 పేర్లు సిఫారసు చేసినట్లు సమాచారం. ఫ జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి ఆ పార్టీ తరఫున ఒక్కొక్కరిని ట్రస్ట్ బోర్డులో నియమించనున్నారు. ఫ అలాగే, బీజేపీ తరఫున రాజమహేంద్రవరం, ప్రత్తిపాడు నుంచి ఒకొక్కరిని మాత్రమే ట్రస్ట్ బోర్డులో నియమించనున్నారు. ఫ మిగిలిన 13 మందినీ టీడీపీ నుంచే ఎంపిక చేస్తారని సమాచారం. ఫ పెద్దాపురం నుంచి శ్రీ లలితా ఇండస్ట్రీ అధినేత మట్టే సత్యప్రసాద్ను రెండోసారి కూడా దాత కోటాలో టీడీపీ ప్రజాప్రతినిధి సిఫారసు చేసినట్లు సమాచారం. గతంలో 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కూడా ఆయనను దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యునిగా నియమించారు. ఆ తరువాత సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సత్యప్రసాద్ దంపతులు రూ. 2.5 కోట్లతో వజ్ర కిరీటాలు చేయించారు. ఇటీవల అమ్మవారికి రూ.20 లక్షల విలువైన వజ్రాల హారాన్ని ఆయన కుమారుడు మట్టే ఆదిశంకర్ దంపతులు సమర్పించారు. వీటితో పాటు రూ.5 కోట్ల వ్యయంతో సత్యదేవుని ప్రసాద తయారీ భవనం, మరో రూ.2 కోట్ల విలువైన పూజాసామగ్రి సమర్పించారు. పలు భవనాలు కూడా నిర్మించారు. ఫ తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, కాకినాడ సిటీ, పాయకరావుపేట ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి ధర్మకర్తల మండలిలో చోటు దక్కే అవకాశం ఉంది. ఫ కోనసీమ నుంచి ఒకరు, మిగిలిన ఇద్దరూ గుంటూరు, విశాఖకు చెందిన వారు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఫ టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికమైతే మాత్రం జనసేన, బీజేపీల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే చాన్స్ ఇస్తారు. టీడీపీ నుంచి మరో ఇద్దరిని నియమిస్తారు. ఫ అన్నవరం దేవస్థానానికి నెలాఖరులోగా నియమించనున్న సర్కారు ఫ 25 మంది పేర్లతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలు ఫ కొత్త ధర్మకర్తల మండలి చైర్మన్గా ఐవీ రోహిత్.. మరో 17 మంది సభ్యులు ఫ 13 పదవులు టీడీపీకే.. ఫ జనసేన, బీజేపీకి చెరో రెండింటితో సరిపెట్టాలని యోచన అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నూతన ధర్మకర్తల మండలి(ట్రస్ట్ బోర్డు)ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు కాలపరిమితి గత ఫిబ్రవరి 8న ముగిసింది. అప్పటి నుంచీ దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, ఆలయ చైర్మన్ ఐవీ రోహిత్ ట్రస్ట్ బోర్డు తరఫున అధికారులతో సమావేశమై తీర్మానాలు చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. మంచి ముహూర్తాలు ఉండటంతో ఆ మాసంలోనే ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం జరిగేలా ఏర్పాటు చేయనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఈ నెల 19వ తేదీకల్లా ధర్మకర్తల మండళ్లను ఏర్పాటు చేయాలని, అందుకు పేర్లు పంపించాలని ఆయా ఆలయాల పరిధిలోని ఎమ్మెల్యేలను ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఈ మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆశావహుల పేర్లను ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వ వడపోత ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలాఖరులోగా కొత్త ట్రస్ట్ బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని సమాచారం. గతంలో అన్ని వర్గాలకూ ప్రాధాన్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో 16 మందితో ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులో అన్ని సామాజిక వర్గాలకూ ప్రాధాన్యం కల్పించారు. మొత్తం 15 మంది సభ్యుల్లో ఏడుగురు మహిళలు కాగా, మిగిలిన ఎనిమిది మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే కావడం విశేషం. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాయీబ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యం కల్పించినదిగా ఈ ట్రస్ట్ బోర్డు దేవస్థానం చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధమైన ఫార్ములాతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొత్త ట్రస్ట్ బోర్డులో చైర్మన్తో పాటు మరో 17 మంది సభ్యులుంటారని తెలుస్తోంది. దేవదాయ శాఖ చట్టం ప్రకారం నూతన ట్రస్ట్ బోర్డుకు కూడా దేవస్థానం వ్యవస్థాపక కుటుంబానికి చెందిన ఐవీ రోహిత్ చైర్మన్గా నియమితులవ్వనున్నారు. మొత్తం సభ్యుల్లో నలుగురు లేదా ఐదుగురు మాత్రమే మహిళలుంటారని చెబుతున్నారు. అన్ని సామాజికవర్గాలతో పాటు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి కూడా ట్రస్ట్ బోర్డులో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. నాయీబ్రాహ్మణ వర్గాల నుంచి కూడా ఒకరిని నియమించనున్నారు. అలాగే, దేవస్థానం తరఫున ఆలయ ప్రధానార్చకుడు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉంటారు. జనసేన ‘పంచాయితీ’ ట్రస్ట్ బోర్డు నియామకంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి సోషల్ మీడియాలో జనసేన తరఫున పిఠాపురం రూరల్ మండలానికి చెందిన ఒక వ్యక్తి పేరు ప్రతిపాదించారు. అతడు సోషల్ మీడియాలో వైఎస్సార్ సీపీతో పాటు అక్కడి టీడీపీ, జనసేనలోని ఒక వర్గం నాయకుల మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ నియోజకవర్గ నాయకునితో పాటు జనసేనలోని కొంత మంది కూడా అతడిని హెచ్చరించారు. అయినా అతడి తీరు మారలేదని సమాచారం. ఇప్పుడు ధర్మకర్త మండలికి అతడి పేరు ఏవిధంగా సిఫారసు చేస్తారని జనసేనలోని మరో వర్గం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్గా మారింది. కాగా, టీడీపీ నుంచి కూడా ట్రస్ట్ బోర్డులో ఒకరిని నియమించాలని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయక ులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్లకు లేఖలు రాసినట్లు చెబుతున్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల పేర్లు బయటకు వస్తే మిగిలిన నియోజకవర్గాల నుంచి కూడా ఇటువంటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్నవరం దేవస్థానం -
నవోదయం ఏదీ..?
రాయవరం: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టం కట్టి, వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయంగా నవోదయ విద్యాలయం భాసిల్లుతోంది. అటువంటి నవోదయ విద్యాలయంలో సీటు వస్తే తమ పిల్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకే తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కారణాలేమైనా ఈ ఏడాది దరఖాస్తుల ప్రక్రియ మందగించడంతో.. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవోదయలో ఆరో తరగతిలో చేరాలంటే ప్రవేశ పరీక్షే ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఐదో తరగతిలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. ఈ నెల 29తో దరఖాస్తుల గడువూ ముగియనుంది. కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేయాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు, అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేకత. అవగాహన లేక..? ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు మూడు జిల్లాల నుంచి కేవలం 668 దరఖాస్తు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 2023–24లో 8,506 దరఖాస్తులు రాగా, గతేడాది మూడు జిల్లాల పరిధిలో 8,971 దరఖాస్తులు వచ్చాయి. ఇలాఉంటే, ఈ ఏడాది 9 వేల వరకు దరఖాస్తులు వస్తాయనే అంచనాతో అధికారులు ఉన్నారు. గడువు సమీపిస్తున్నా తక్కువగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించక పోవడమా, లేక వారిలో ఆసక్తి సన్నగిల్లడమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు వచ్చినా, రాకున్నా విద్యార్థులతో దరఖాస్తు చేయిస్తే, ఐదో తరగతిలోనే విద్యార్థులకు పోటీతత్వాన్ని అలవాటు చేయడం, ఆన్లైన్ పరీక్షను పరిచయం చేసినట్టవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో ఈ ఏడాది ఐదో తరగతిలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి, ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన నేటి వరకు దరఖాస్తులు దరఖాస్తులు (గతేడాది) (ఈ ఏడాది) కోనసీమ 3,869 201 తూర్పు గోదావరి 1,741 107 కాకినాడ 3,361 360 జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు గణనీయంగా తగ్గిన దరఖాస్తులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి అంతంతమాత్రం ఈ నెల 29తో ముగుస్తున్న గడువు గతేడాది వచ్చినవి 8,971 ఈ ఏడాది ఇంత వరకు 668 మాత్రమే.. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష పరీక్షా విధానమిలా.. నవోదయ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధా శక్తి(మెంటల్ ఎబిలిటీ)పై 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితం(అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రవేశానికి ఎంపికై న వారికి తొలి రెండేళ్లు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. పోటీ పరీక్షలపై అవగాహన జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో సీటు పొందడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకు ఏటా దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతారు. జిల్లాలో ఉన్న ఐదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐదో తరగతి నుంచే పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేయించాలి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేయడం ప్రధానమైన విషయంగా భావించాలి. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులను మూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపించాం. పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి, పెద్దాపురం డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి జవహర్ నవోదయలో గ్రామీణ పాంత విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయించడంతో వారికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రవేశ పరీక్షను విద్యార్థులతో రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
‘మా ఆకలి కేకలు పట్టవా?’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సుపరిపాలన తొలి అడుగు అంటూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు చేపట్టామని గొప్పలు చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎంకు తమ ఆకలి కేకలు పట్టవా అని సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద వాటర్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టి, కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీను, ఇసాక్ మాట్లాడుతూ, 19 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణ కష్టమై సమ్మె బాట పట్టామన్నారు. 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదని ఆరోపించారు. సుపరిపాలన అని చెప్పుకుంటూ తిరిగే నేతలకు తమ ఆకలి బాధ అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ సమ్మె కారణంగా సుమారు 85 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ వేతనాల విషయమై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమ్మె చేపట్టగా.. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చినప్పటికీ, అది ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం 52 మంది కార్మికుల కుటుంబాల ఆకలికేకలను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కె.రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై కార్మికుల మండిపాటు కళ్లకు గంతలతో సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది నిరసన -
అరెస్టును ఖండిస్తూ మోకాళ్లపై నిరసన
అమలాపురం రూరల్: ఎంపీ మిథున్రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆరోపణలు తప్ప, ఆధారాల్లేకుండా కూటమి ప్రభుత్వం మిథున్రెడ్డిపై కేసులు పెట్టిందని రమేష్ ఆరోపించారు. విద్యార్థి విభాగం నాయకులు పెయ్యాల సాయి, బడుగు మోహన్, వరసల సుజిత్, విన్సీ, సాగర్, ఆనంద్, రవికుమార్, సల్మాన్రాజ్ పాల్గొన్నారు. -
ఇచ్చిన హామీని పవన్కల్యాణ్ నెరవేర్చాలి
పిఠాపురం: మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీని విస్మరించారని ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సీహెచ్ రమణి ఆరోపించారు. మత్స్య కార్మిక సంఘం, మత్స్యకార సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నుంచి పిఠాపురం వరకు ర్యాలీ నిర్వహించి, పిఠాపురం జనసేన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మత్స్యకారులకు ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చాయన్నారు. ప్రధానంగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, కానీ అమలు చేయడం లేదన్నారు. దీనిపై దశలవారీ పోరాటం చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం ఇస్తామని ముందుగా తెలియజేసినప్పటికీ, ఇన్చార్జి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారని, ఇది మత్స్యకారులను అవమానించడమేనన్నారు. దీంతో వినతిపత్రం తీసుకుంటేనే కానీ కదిలేది లేదని బైఠాయించడంతో, కార్యాలయ సిబ్బంది వినతిపత్రం తీసుకున్నారన్నారు. ఇలాంటి చర్యలు కూటమి నేతలకు తగదన్నారు. నష్ట పరిహారం ఇప్పించాలి ఓఎన్జీసీ, ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల వల్ల నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం నెలకు రూ.11,500 ఇప్పించాలని రమణి డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు ఓఎన్జిసీ, ఇతర ఆయిల్ కంపెనీలు, ఫార్మా కంపెనీల కార్యకలాపాలతో వేట సరిగా జరగడం లేదన్నారు. దీంతో మత్స్యకారుల జీవనోపాధి దెబ్బ తింటుందని చెప్పారు. అందువల్ల ముమ్మిడివరం నియోజకవర్గం, యానాంలో ఇస్తున్నట్టుగా, కాకినాడ జిల్లాలోని మత్స్యకారులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు యు.సత్యనారాయణ మాట్లాడుతూ, తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మత్స్య కార్మిక నాయకులు సంగాడి ఈశ్వరరావు, తెలుగు జనతా పార్టీ నాయకులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. మత్స్యకారులకు బీమా చేయించాలని, తీరంలో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వాలని, మత్స్యకారులను రైతులుగా గుర్తించి బ్యాంకు రుణాలు ఇప్పించాలని, సీఎస్సార్ నిధులు మత్స్యకార గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని, సొసైటీలను పునరుద్ధరించాలని, సబ్సిడీపై పరికరాలు అందించాలని తదితర డిమాండ్లతో వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ నాయకులు బడే సత్యారావు, కోనాడ తాతారావు, మైలపల్లి బుజ్జి, పిక్కి రాజు, వీరబాబు, బొడ్డు నాగేశ్వరరావు, వివిధ గ్రామాల మత్స్యకారులు పాల్గొన్నారు. మత్స్య కార్మిక సంఘం, మత్స్యకార సంఘాల ఐక్య వేదిక నాయకుల డిమాండ్ పిఠాపురం జనసేన కార్యాలయం వద్ద ఆందోళన -
మిథున్రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించి, అక్రమంగా అరెస్టు చేయడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తున్నామని మాజీ ఎంపీ, ఆ పార్టీ పిఠాపురం నియోజకవర్గ సమన్వయకర్త వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ, మిథున్రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండించారు. మిథున్రెడ్డి ఎకై ్సజ్ శాఖకు సంబంధం లేని వ్యక్తి అని, అయినప్పటికీ ఆయనపై తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదు చేయడం తగదని అన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2014–19 మధ్య మద్యం మాఫియా నడిచిందని, 4,380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్ షాపులు, పర్మిట్ రూములను ప్రైవేట్ మాఫియాకు అప్పగించారని అన్నారు. ప్రివిలేజ్ ఫీజు రద్దుతో రాష్ట్రానికి ఏటా రూ.1,300 కోట్ల నష్టం జరిగినట్లు కాగ్ నివేదిక చెబుతోందని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ పాలనలో 43 వేల బెల్ట్ షాపులు మూసివేసి, లిక్కర్ ఔట్లెట్లను 4,380 నుంచి 2,934కి తగ్గించారని గీత గుర్తు చేశారు. ఈ–పేమెంట్ విధానం ద్వారా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పారదర్శకత తీసుకువచ్చిందన్నారు. మద్యం అమ్మకాలు తగ్గినా రాష్ట్ర ఆదాయం రూ.16,912 కోట్ల నుంచి రూ.24,760 కోట్లకు పెరిగిందని చెప్పారు. లిక్కర్ పాలసీపై వేసిన ఫిర్యాదులను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారించి, 2022 సెప్టెంబర్ 19న ఇచ్చిన ఉత్తర్వుల్లో మద్యం పాలసీలో ఎవ్వరికీ ఎటువంటి అన్యాయమూ జరగలేదని పేర్కొందన్నారు. వైఎస్సార్ సీపీ తీసుకొచ్చిన మంచి విధానాన్ని నాశనం చేయడానికి, 2014–19లో చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం ఈ అరెస్టుల కుట్రలు చేస్తోందని చెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రజల పార్టీ అని, తాము ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తామని, మిథున్రెడ్డికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని వంగా గీత స్పష్టం చేశారు. -
కౌలుకోనివ్వరా..!
● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వని సర్కారు ● జిల్లాలో ఈ ఏడాది లక్ష్యం 63 వేలు ● ఇప్పటి వరకూ జారీ చేసినవి 23 వేలు ● కార్డులు లేక రైతులు విలవిల బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు పైగా అయ్యింది. ఒకపక్క వరి నారు పోసుకున్న కౌలు రైతులు.. అవసరమైన ఎరువుల కోసం రైతు సేవా కేంద్రాల(ఆర్ఎస్కే)కు వెళ్తే చుక్కెదురవుతోంది. వారికి పంట సాగు హక్కు (సీసీఆర్) కార్డులు లేకపోవడంతో ఎరువులు ఇచ్చేందుకు అక్కడి సిబ్బంది ససేమిరా అంటున్నారు. దీంతో, పంట పొలాలకు కావాల్సిన ఎరువులు బయటి మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు బ్యాంకులు, సొసైటీల నుంచి పంట రుణాలు కూడా రాకపోవడంతో కౌలురైతులు నానా ఇక్కట్లూ పడుతున్నారు. బారెడు లక్ష్యం.. ఇచ్చింది స్వల్పం జిల్లావ్యాప్తంగా ప్రస్తుత ఖరీఫ్లో రైతులు 2.18 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఇందులో లక్ష ఎకరాలకు పైగా సాగు చేస్తున్నది కౌలు రైతులే. ఒక్కొక్కరు రెండు నుంచి ఐదెకరాల వరకూ కౌలుకు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు తమ పొలాలు సాగు చేసేందుకు ఇష్టపడటం లేదు. కొంత మంది సొంతంగా సాగు చేసినా కూలి రేట్లు అధికంగా ఉండటం, ఉన్న కొద్దిపాటి భూమి సాగు చేసినా లాభాలు రాకపోవడంతో కౌలుకు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తప్ప ఇతర పనులు చేసుకోలేని రైతులు ఆ భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 63 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకూ 23 వేలు మాత్రమే ఇచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో సీజన్ ప్రారంభం కాకముందే ఏటా కౌలు గుర్తింపు కార్డులు మంజూరు చేసేవారు. ఆయా గుర్తింపు కార్డుల ఆధారంగా కౌలు రైతులకు సైతం బ్యాంకులు రూ.లక్షకు తక్కువ కాకుండా రుణాలు మంజూరు చేసేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా.. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకే ఆసక్తి చూపడం లేదు. ‘గుర్తింపు’ లేక.. పంటలకు అవసరమైన ఎరువుల కోసం కౌలు రైతులు ఆర్ఎస్కేలకు, సహకార సంఘాలకు వెళ్లినా ప్రయోజనం ఉండటం లేదు. సీసీఆర్ కార్డులు చూపిస్తున్న వారికి అక్కడ ఎరువులు ఇస్తున్నారు. అయితే, ఆ కార్డులు ఇంకా ఇవ్వకపోవడంతో చాలా మంది కౌలు రైతులు ఎరువుల కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నారుమడులకు యూరియా, డీఏపీ వేయాల్సి ఉంది. గత్యంతరం లేకపోవడంతో కౌలు రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద అధిక ధరలకు ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా ఎరువుల డీలర్లు యూరియా, డీఏపీపై బస్తాకు రూ.200 అధికంగా వసూలు చేస్తున్నారని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నారుమడులకు ఎరువులు తక్కువగా వేస్తారు. వరి నాట్లు పూర్తయితే ఎకరాకు బస్తాకు పైగా యూరియా, కాంప్లెక్సు ఎరువులు మొదటి విడతగా వేయాల్సి ఉంటుంది. అప్పుడు పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని కౌలు రైతులు వాపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీసీఆర్ కార్డు ఆధారంగా కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకూ రుణాలు సైతం మంజూరు చేసేవారు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ఏడాది గుర్తింపు కార్డులిచ్చినా ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదని కౌలు రైతులు మండిపడుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం వ్యవసాయానికి సంబంధించిన ఏ పనిపై వెళ్లినా అధికారులు కౌలు గుర్తింపు కార్డులు అడుగుతున్నారు. సీజన్ ప్రారంభమైనప్పటికీ ఈ ఏడాది ఇంకా గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. రేపు మాపు అని చెబుతున్నారు. వ్యవసాయ అధికారులను అడిగితే రెవెన్యూ అధికారులు కార్డులివ్వాలని చెబుతున్నారు. – మారేళ్ల వెంకట రమణ, కౌలు రైతు, యండమూరు, కరప మండలం గత ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు గత ఏడాది ఇచ్చిన కౌలు గుర్తింపు కార్డులు పని చేయవని అధికారులు అంటున్నారు. ప్రస్తుతం కార్డులు ఇవ్వలేదు. గత ఏడాది గుర్తింపు కార్డులు ఇచ్చినా బ్యాంకు రుణం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బయటి వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, వ్యవసాయ పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఈ ఏడాదైనా కూటమి ప్రభుత్వం తక్కువ వడ్డీలకు బ్యాంకుల్లో రుణాలిప్పించే ఏర్పాట్లు చేయాలి. – ఇంటి వెంకటరావు, కౌలు రైతు, వీకే రాయపురం, సామర్లకోట మండలం -
మిథున్రెడ్డి అరెస్టు దుర్మార్గం
● తప్పుడు కేసులలో అక్రమంగా ఇరికించారు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాతుని రూరల్: రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని తప్పుడు కేసులలో ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని శివారు గెడ్లబీడు సాయి వేదికలో సోమవారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికై న మిథున్రెడ్డిని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వమే నేరుగా దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తే రూ.25 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల ఆదాయం సమకూరిందని, కానీ, అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు పాలనలోను, జగన్ ప్రభుత్వంలోను ఆదాయాలు ఎంత వచ్చాయో లెక్కలు చూడకుండానే కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే అరెస్టులు చేస్తున్నారని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా మిథున్రెడ్డిపై బురద జల్లుతున్నారన్నారు. పచ్చ మీడియా బురద జల్లుతూ కథనాలు ప్రచరిస్తోందని, ఆ మీడియాలో ఉన్న వారు కాలకేయులు, అనకొండల మాదిరిగా విషం చిమ్ముతూ శకుని పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నాయకుడు జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ నాయకులను ఎవరిని అరెస్టు చేసినా అంతకు ముందు పచ్చ మీడియాలో తప్పుడు కథనాలు, ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వంలో విక్రయించిన బ్రాండ్లనే చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలలు అమ్మిందన్నారు. మద్యం అక్రమాల ద్వారా జగన్ రూ.3,300 కోట్లు సంపాదించారని తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిని రికవరీ చేయాలనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. దీనికోసం కొత్త చట్టాలు చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినప్పుడు చంద్రబాబు, యనమల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులెంత, ఇప్పుడెంత ఉన్నాయో వెల్లడించాలని, తాను కూడా దీనికి సిద్ధమని, అదనపు ఆస్తులను ప్రజలకు పంచేద్దామా అని రాజా సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడే స్వయంగా రూ.లక్ష కోట్ల ఆస్తి ఉన్నట్టు ప్రకటించారన్నారు. రెండెకరాలతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయనకు రూ.లక్ష కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆ ఆస్తి రికవరీ చేద్దామని అన్నారు. బురద జల్లేసి మీరే కడుక్కోండని అంటున్నారన్నారు. కలసి చదువుకుంటున్న సమయంలో పెద్దిరెడ్డి ఏదో అన్నారని ఇప్పుడు ఆయన కొడుకుపై చంద్రబాబు పగ తీర్చుకుంటున్నారన్నారు. మిథున్రెడ్డిని పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి రాజమహేంద్రవరం వస్తే పిలవకుండానే లక్షలాదిగా ప్రజలందరూ మద్దతు ఇస్తారని చెప్పారు. ఆ ప్రభంజనాన్ని అడ్డుకోగలరా అని ప్రశ్నించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తే బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వస్తున్నారని అనడం సిగ్గుమాలిన ప్రేలాపనని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలూ, నాయకులు ఏకమైనా అడ్డుకోలేమన్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, వచ్చే మూడేళ్లలో లోకేష్ సీఎం కాకపోతే జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని చెప్పారు. వర్షం వస్తే రాజధాని మునిగిపోతోందని, అమరావతి ఎత్తిపోతల పథకంలా మారిందని విమర్శించారు. టీడీపీ సభలకు జనం వస్తే తమ్ముళ్లు వచ్చారని, వైఎస్సార్ సీపీకి వస్తే అల్లరి మూక వచ్చిందని పచ్చ మీడియా రాస్తోందన్నారు. వారి తప్పుడు కథనాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పవన్ కల్యాణ్ సాక్షిగా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయకుండా మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ ప్రతిపక్షాన్ని కాకుండా 143 హామీలు అమలుపై చంద్రబాబును ప్రశ్నించాలని రాజా హితవు పలికారు. -
శాకంబరిగా పురుహూతికా అమ్మవారు
పిఠాపురం: బిడ్డల ఆకలి తీర్చే కన్నతల్లిలా.. ఈ సమస్త జగత్తు ఆకలినీ తీర్చే ఆ జగజ్జనని శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠాల్లో పదోది అయిన పిఠాపురం పాదగయ క్షేత్రంలో వెలసిన పురుహూతికా అమ్మవారిని సోమవారం పలు రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు. మాలలుగా తయారు చేసిన కూరగాయలే ఆ తల్లికి వస్త్రాభరణాలయ్యాయి. ఈఓ జగన్మోహన్ శ్రీనివాస్ ఆధ్వర్యాన అమ్మవారితో పాటు ఆలయాన్ని సైతం కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దివ్యాలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు.సత్యదేవునికి ఘనంగా ఏకాదశి పూజలుఅన్నవరం: ఆషాఢ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి సోమవారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, 9 నుంచి 11 గంటల వరకూ కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. వెయ్యి వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరింది. ఉదయం ఎండ.. మధ్యాహ్నం కుండపోత ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ తీవ్ర స్థాయిలో ఎండ కాయడంతో సత్యదేవుని దర్శనానికి రత్నగిరికి వచ్చిన భక్తులు అల్లాడిపోయారు. పశ్చిమ రాజగోపురం వద్ద చెట్ల నీడను ఆశ్రయించి, సేద తీరారు. అంతలోనే మధ్యాహ్నం నుంచి కుండపోత వర్షం కురవడంతో తడిసి ముద్దయ్యారు. పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు త్వరగా నిర్మించాలని కోరుతున్నారు. ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి కాకినాడ క్రైం: జిల్లాలో రిజిస్టర్ అయిన అన్ని ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ల్యాబ్లలో సేవల ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ నరసింహ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోపు ఏర్పాటు చేసిన ధరల పట్టికల ఫొటోలను statisticalofficerkakinada@gmail.comకు పంపాలని సూచించారు. అలా పంపని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. వీటిని తమ నెత్తిన బలవంతంగా పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ వినియోగం నమోదు చేసే మీటర్ రీడర్లకు సైతం ఈ ‘స్మార్ట్’ షాక్ తగులుతోంది. దశల వారీగా అన్ని రకాల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 10 వేలకు పైగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక్క నవ్య తూర్పు గోదావరి జిల్లాలోనే 6 వేలకు పైగా బిగించారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ పూర్తయితే మొబైల్ ఫోన్ల మాదిరిగానే విద్యుత్కు కూడా రీచార్జ్ పాలసీ అమలులోకి వస్తుంది. అంటే, కరెంటు కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలన్న (ప్రీపెయిడ్) మాట. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుండగా.. మరోవైపు ఉపాధి కోల్పోయి మీటర్ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది. తొలి దశలో 5 లక్షల మీటర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 16.70 లక్షలున్నాయి. అలాగే, వాణిజ్యం 1,93,613, వ్యవసాయం 63,751, పారిశ్రామికం 6,314, హెచ్టీ 11 కేవీ 1,292 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. తొలి దశలో సుమారు 5 లక్షల మీటర్లు బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 6.70 లక్షల విద్యుత్ సర్వీసులుండగా.. తొలి విడతగా 2 లక్షల వరకూ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియకు నాంది పలికారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. రోడ్డున పడనున్న మీటర్ రీడర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా మీటర్ రీడర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారే. ప్రతి నెలా 1 నుంచి 11వ తేదీ లోపు వీరు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్ రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ మినహాయింపులు పోనూ ఒక్కో రీడర్కు చేతికి మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్కో రీడర్ నెలకు 3 వేల మీటర్ల వరకూ రీడింగ్ తీస్తారు. దీని ప్రకారం వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేలలోపే ఉంటుంది. ప్రాంతం, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు విద్యుత్ రీచార్జ్పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. ముందుగా రీచార్జి చేయించుకోని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనివలన నేరుగా లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ ఆందోళనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం అయిన తరువాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగులగొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్.. ప్రస్తుతం వీటిని వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. మీటర్ రీడర్ల డిమాండ్లివీ.. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువస్తున్నందున ఇప్పటికే కొనసాగుతున్న తమకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి రీడర్లకు విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా.. మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్లుగా నియమించాలని కోరుతున్నారు. అలాగే, ఎస్క్రో ఖాతా వెంటనే తెరవాలని, కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ శాఖనే నమ్ముకుని ఇరవయ్యేళ్లుగా బతుకుబండి లాగుతున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి కొట్టడం తగదు. అసలు మొత్తం స్మార్ట్ మీటర్ల ప్రక్రియనే విరమించుకోవాలి. ఇది అనైతికం. ప్రజల వద్ద పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేసేందుకు అమలు చేస్తున్న కుట్ర. ఒకవేళ తప్పనిసరిగా అమలు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి లో10 స్మార్ట్ విద్యుత్ మీటర్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇకపై బిల్లు తీసే ప్రక్రియకు మంగళం ఉమ్మడి జిల్లాలో 500 మందికి పైగా మీటర్ రీడర్ల ఉపాధికి గండి -
అంబులెన్స్లోనే హైదరాబాద్కు ముద్రగడ
అనారోగ్యంతో అస్వస్థతకు గురైన మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభాన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నారు. సోమవారం అంబులెన్స్లోనే రోడ్డు మార్గం గుండా ఆయనను కుటుంబ సభ్యులు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కాకినాడ/హైదరాబాద్: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. తొలుత ఎయిర్ ఆంబులెన్స్లో రాజమహేంద్రవరం ఎయిర్పోర్టు నుంచి తరలించాలని అనుకున్నారు. అయితే చివరకు రోడ్డు మార్గం గుండానే తీసుకొస్తున్నట్లు సమాచారం. అనారోగ్యంతో అస్వస్థతకు గురైన పద్మనాభంకు రెండు రోజులుగా కాకినాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యంపై వదంతులు ప్రచారంలోకి రాగా.. కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. అదే సమయంలో ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో ఆరా తీశారు. వైద్యుల సూచన మేరకు అవసరమైతే ఎయిర్లిఫ్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలకు జగన్ చెప్పారు. అయితే.. ఈ ఉదయం ముద్రగడ కోరిక మేరకు తొలుత కిర్లంపూడి నివాసానికి ఆంబులెన్స్లో కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి ఆంబులెన్స్లోనే హైదరాబాద్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్కు కృతజ్ఞతలు: ముద్రగడ తనయులుతమ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ముద్రగడ కుమారులు బాలు, గిరిబాబులు కృతజ్ఞతలు తెలియజేశారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉందని, తరలింపు నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందవద్దని వారు కోరుతున్నారు. జగన్ సూచన మేరకు ఇవాళే హైదరాబాద్కు తమ తండ్రిని తరలిస్తామని ప్రకటించారు. ముద్రగడ అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ముద్రగడ తనయుడు, పార్టీ ప్రత్తిపాడు కో ఆర్డినేటర్ గిరిబాబును ఫోన్లో పలకరించారు. పద్మనాభం ఆరోగ్య పరిస్థితి, కాకినాడ ఆస్పత్రిలో అందుతున్న వైద్యం గురించి వివరాలు అడిగి తెలుకున్నారు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లో హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాటు చేస్తామని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో కాకినాడ వైద్యులూ హైదరాబాద్ తీసుకువెళ్లడం మంచిదని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జగన్మోహన్రెడ్డి సాధ్యమైనంత త్వరగా ముద్రగడను ఎయిర్ అంబులెన్స్లో తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని పార్టీనేతలకు సూచించారు. అదివారం రాత్రి తరలించేందుకు సాంకేతికంగా ఇబ్బంది ఉండటంతో ఇవాళ తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. -
శ్రావణ మాసం వచ్చేస్తోంది..! మంచి ముహూర్తాలు ఎప్పుడంటే..
సాక్షి, అమలాపురం: శుభకార్యాలకు నెలవైన శ్రావణ మాసం వచ్చేస్తోంది. ఈనెల 25 నుంచి ఆరంభం కాబోతోంది. ముహూర్తాలు కూడా బాగా ఉండడంతో ఈసారి పెళ్లిబాజాలు ఘనంగా మోగనున్నాయి. ఎక్కడికక్కడ అమ్మవారి ఆలయాలను సైతం ముస్తాబు చేస్తున్నారు. మహిళలు పూజలకు సిద్ధమవుతున్నారు. ఆషాడం వీడి శ్రావణం మొదలుకానుండడంతో వ్యాపారులు, రైతులు మార్కెట్పై కొత్త ఆశలు పెట్టుకున్నారు. ఈ సీజన్లో వస్త్రాలు, పూలు, పండ్లు, స్వీట్లు, బంగారం, వెండి వస్తువులకు డిమాండ్ పెరగనుంది. వచ్చే శుక్రవారం నుంచే శ్రావణమాసం మొదలుకానుండడంతో శుభ ముహూర్తాల సీజన్ మొదలవుతుంది. నవంబరు వరకూ ఈ సుముహూర్తాల సీజన్ కొనసాగనుంది. ఇక ఈసారి భాద్రపద మాసం మినహా శ్రావణ మాసం మొదలు నవంబరు వరకు ప్రతినెలా ముహూర్తాలు ఉండటం విశేషం. ముహూర్తాల తేదీలు ఇవే..ఈ నెలలో 26, 30, 31 తేదీల్లోను, ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 తేదీల్లో ముహూర్తాలున్నాయి. అలాగే, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 21 వరకూ భాద్రపద మాసం. ఇది శూన్యమాసం కావడంతో ముహూర్తాలు లేవు. ఆ తర్వాత సెప్టెంబరులో 23 నుంచి ప్రారంభమై 24, 26, 27, 28 తేదీల్లో.. అనంతరం అక్టోబరు, నవంబరు నెలల్లో కూడా ముహూర్తాలు రికార్డు స్థాయిలో ఉన్నాయి.ఈ మాసాల్లో ఏకంగా 13 రోజుల చొప్పున శుభ ముహూర్తాలు ఉండటం విశేషం. అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31 తేదీలు.. నవంబరులో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26, 27, 29, 30 తేదీల్లో శుభ ఘడియలున్నాయి. అనంతరం.. డిసెంబరు 8 నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ ఇంచుమించు రెండు నెలలపాటు ముహూర్తాలు లేవు.పురోహితులు, వ్యాపారుల్లో ఆశలు..ఈ సంవత్సరం జూన్ 10 నుంచి ఈనెల 8 వరకూ గురు మౌఢ్యమి కావడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ప్రారంభోత్సవాల వంటి ముహూర్తాల్లేవు. ఈనెల 31న పెద్ద ముహూర్తం కావడంతో పెళ్లిళ్లు పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. గత రెండునెలలుగా శుభ కార్యక్రమాల్లేక ఇబ్బందిపడుతున్న పురోహితులతో పాటు వారికి అనుబంధంగా ఉపాధి పొందేవారికీ రానున్న కాలం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. -
ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదం తప్పించాలి
కాకినాడ సిటీ: సమాజానికి ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి జి.వీరపాండ్యన్ అన్నారు. కాకినాడ పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యాన శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం స్థానిక ఆనంద భారతి గ్రౌండ్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వీరపాండ్యన్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వస్తువుల వినియోగంతో ఎదురయ్యే దుష్పరిణామాలపై అవగాహన పెంచుకుని, ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజానికి కృషి చేయాలని అన్నారు. మరో ముఖ్య అతిథి కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ, నిత్య జీవితంలో మార్పులు చేసుకోవడం ద్వారా ప్లాస్టిక్ నిషేధాన్ని సంపూర్ణంగా సాధించవచ్చని చెప్పారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధాన్ని కలెక్టరేట్ నుంచే ప్రారంభించామన్నారు. అనంతరం కలెక్టర్ అందరితో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. పట్టణంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు, రంగోలిలో పాల్గొన్న మహిళలకు, ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ సభ్యులకు వీరపాండ్యన్, కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, ట్రైనీ కలెక్టర్ మనీషా, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కేపీ సుధాకర్, మెప్మా పీడీ బి.ప్రియంవద, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి జె.నరసింహ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ, ప్లాస్టిక్ కాలుష్యం దుష్ప్రభావాలను వివరిస్తూ మెప్మా ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన స్టాల్స్ను, మహిళలు వేసిన ముగ్గులను అతిథులు పరిశీలించారు. -
స్వామిని చూడగ.. మది మురవగ
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయానికి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుప్రభాత సేవ అనంతరం తొలి హారతితో దర్శనాలు ప్రారంభమయ్యాయి. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కులు చెల్లించారు. కొత్త ఆలయంతో పాటు పాత గుడి వద్ద కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానానికి వివిధ సేవల ద్వారా రూ.2,21,626 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు. స్వామివారిని 3,800 మంది దర్శించుకున్నారని, 2,500 మంది అన్న ప్రసాదం స్వీకరించారని వివరించారు. -
సా్థనచలనం లేని వేతనం
సమస్యను పరిష్కరించాలి పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించక పోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరు జీతాలు పొందలేకపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు, కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – మేడిచర్ల త్రివెంకట ఆది సత్య సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, కోనసీమ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి పొజిషన్ ఐడీలు రాక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పటికే ఒక నెల వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి. – చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ జిల్లా రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిశాయి. అయితే, పొజిషన్ ఐడీలు రాక పలువురికి జీతభత్యాలు నిలిచిపోయాయి. ఇలా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ స్థానానికి బదిలీ అయ్యారో ఆ స్థానానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివ రాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే వేతనా లు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్/ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. జూన్ 15వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రి య పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్త గా ఏర్పడడంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు వీరికి మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీ లోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ఈ నెల 25లోగా పొజిషన్ ఐడీలు రాకుంటే జూలై జీతం కూడా వీరు పొందలేని పరిస్థితి నెలకొంటుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పొజిషన్ ఐడీలు క్రియేట్ కాలేదు. సమస్యలు ఎక్కడెక్కడంటే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 6 రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు 9 రకాల పాఠశాలలను ప్రస్తుత సర్కారు ఏర్పాటు చేసింది. ఇందులో ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు కావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్త గా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. అ లాగే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో డీడీఓ మారడంతో అక్కడ ఏ ఒక్కరికీ జీతభత్యాలు రాని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ నెలలో ప్రతి కుటుంబంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కొనుగోలుతో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. బ్యాంకు రుణాల వాయిదాలు, బదిలీ ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో జీతాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. బదిలీలు, పదోన్నతులు సరే ఉపాధ్యాయులకు అందని జీతాలు పొజిషన్ ఐడీలు రాక అగచాట్లు ఉమ్మడి జిల్లాలో 1,500 మందిపై ప్రభావం -
ఆ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాలి
● తక్షణం కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలి ● అన్నవరం దేవస్థానానికి న్యాయవాది సలహా! అన్నవరం: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లు నకిలీ చలానాలు ఇచ్చిన విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ శానిటేషన్ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నకిలీ పీఎఫ్ చలానాల బాగోతంపై తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, శానిటేషన్ విభాగం అధికారులు న్యాయవాదిని సలహా అడిగారు. మార్చి నెలలోనే సిబ్బంది ఖాతాలో పీఎఫ్ జమ చేయకపోతే అప్పట్లోనే సిబ్బంది కాంట్రాక్టర్కు ఆ విషయం తెలియజేయాలి. అతడి నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోతే దేవస్థానానికి ఆ విషయం లిఖితపూర్వకంగా తెలియజేయాలి. అప్పుడు దేవస్థానం ఆధికారులకు చర్య తీసుకునే అధికారం ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్పై దేవస్థానం క్రిమినల్ చర్య తీసుకోవడం అంత సులువు కాదని ఆ సందర్భంగా దేవస్థానం న్యాయవాది చెప్పినట్లు సమాచారం. కాకపోతే నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించి, మోసం చేశారంటూ పీఎఫ్ అధికారులకు దేవస్థానం ఫిర్యాదు చేయవచ్చని చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని పీఎఫ్ అధికారులు పరిశీలించి, ఆ కాంట్రాక్టర్పై కేసు పెట్టవచ్చని న్యాయవాది చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో ఆ కాంట్రాక్టర్ను వెంటనే తొలగించాలని సూచించినట్లు తెలుస్తోంది. షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలని న్యాయవాది సలహా ఇచ్చినట్టు చెబుతున్నారు. టెండర్ పిలవకుండానా? దేవస్థానంలో చెత్త ట్రాక్టర్ నిర్వహణకు టెండర్ పిలిచారు. అదే విధంగా సత్రాల్లో దుప్పట్లు, కర్టెన్ల వంటివి ఉతికి, ఇసీ్త్ర చేయడానికి కూడా టెండర్ పిలిచారు. చిన్నచిన్న వాటికే టెండర్లు పిలుస్తున్నప్పుడు ప్రతి నెలా 350 మంది సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్కు టెండర్ పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో ఎటువంటి డిపాజిట్ లేకుండా, టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు శానిటేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ నకిలీ వ్యవహారానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 350 మంది పారిశుధ్య సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం జీతాలిచ్చేందుకు దేవస్థానం నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రతి నెలా దేవస్థానం 13 శాతం, సిబ్బంది వాటాగా 12 శాతం వసూలు చేసి పీఎఫ్ చెల్లించి, ఆ రసీదులు జమ చేస్తే దేవస్థానం బిల్లు ఇవ్వాలి. కానీ, మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆ సంస్థ పీఎఫ్ చెల్లించకుండానే ఫేక్ రసీదులు ఇచ్చి, సుమారు రూ.1.77 కోట్ల మేర బిల్లులు పొందింది. సిబ్బంది ఖాతాల్లో పీఎఫ్ జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు నిలదీయడంతో మూడు నెలలకు కలిపి పీఎఫ్కు సుమారు రూ.30 లక్షలు జమ చేసి కొత్త రశీదులు అందజేశారు. తద్వారా తొలుత నకిలీ రసీదులు ఇచ్చి, దేవస్థానాన్ని మోసం చేసినట్టు ఆ కాంట్రాక్టరే స్వయంగా అంగీకరించినట్లయింది. కొత్త కాంట్రాక్ట్కు మరింత సమయం! మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటికీ కలిపి ఒకే శానిటేషన్ కాంట్రాక్ట్కు పిలిచిన టెండర్ ఖరారుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ కాంట్రాక్ట్ కోసం రెండోసారి గత నెల 12న టెండర్ పిలిచారు. గత నెల 30న టెక్నికల్ బిడ్ తెరవగా తిరుపతికి చెందిన పద్మావతి సంస్థ, విజయవాడకు చెందిన చైతన్యజ్యోతి సంస్థ క్వాలిఫై అయ్యాయి. ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి, టెండర్ ఖరారు చేయాల్సి ఉండగా దేవదాయ శాఖ అధికారులు ఆ బాధ్యతను ప్రభుత్వానికి అప్పగించారు. ఆ టెండర్ ఖరారయ్యేంత వరకూ దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రసీదుల తనిఖీపై సూచనలు పీఎఫ్ రసీదులు ఒరిజనల్ లేక ఫేక్ అనే విషయం తెలుసుకోవాలనే అంశంపై దేవస్థానం సిబ్బందికి పీఎఫ్ అధికారులు శనివారం అవగాహన కల్పించారు. ఈఓ సుబ్బారావు కోరిక మేరకు కాకినాడ పీఎఫ్ ఆఫీసుకు చెందిన ఇద్దరు అధికారులు దేవస్థానానికి వచ్చి, పీఎఫ్ రసీదులపై పలు సూచనలు చేశారు. రసీదుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, గూగుల్లో పీఎఫ్ వెబ్సైట్లో తనిఖీ చేయడం తదితర అంశాలను వివరించారు. -
తడుపు.. మోపెడు
పెట్టుబడి పెరిగింది నీటి ఎద్దడి కారణంగా మొక్కజొన్న సాగులో పెట్టుబడి పెరిగింది. కాలువల్లో నీరు లేకపోవడంతో కేవలం బోర్లపై ఆధారపడి సాగు చేయాల్సి వస్తోంది. బోర్ల ద్వారా నీటిని కుంటలకు మళ్లించి, మళ్లీ అక్కడి నుంచి ఇంజిన్లతో తోటలకు మళ్లించాల్సి వస్తోంది. అదే కాలువల్లో సాగునీరుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం నీటి ఎద్దడి వల్ల ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ అదనపు భారం పడుతోంది. వినాయక చవితికి మంచి డిమాండ్ ఉంటుందని మొక్కజొన్న సాగు చేపట్టాం. కానీ, వచ్చే లాభాల కంటే పెట్టుబడి తడిసి మోపెడయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. – సుంకర సూరిబాబు, మొక్కజొన్న రైతు, తాటిపర్తి ఎద్దడి లేకపోతే.. రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతూండటంతో ఈ ఏడాది స్వీట్కార్న్ సాగు పెరిగింది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు పెట్టుబడి పోనూ ఆదాయం కూడా అధికంగా ఉంటోంది. మెట్ట, లంకలు, ఏజెన్సీకే పరిమితమైన స్వీట్కార్న్ను ప్రస్తుతం డెల్టా ప్రాంతంలోనూ సాగు చేస్తున్నారు. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలో మొక్కజొన్న సాగు అధికంగా ఉంది. అందరు రైతులకూ ఇచ్చేవి తప్ప మొక్కజొన్న రైతులకు ప్రత్యేకంగా ప్రోత్సాహకాలేవీ లేవు. నీటి ఎద్దడి లేకపోతే సాగు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. – స్వాతి, సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ, పిఠాపురం ●● మొక్కజొన్నకు నీటి ఎద్దడి ● పెరుగుతున్న సాగు పెట్టుబడి ● గగ్గోలు పెడుతున్న రైతులుపిఠాపురం: వర్షాకాలంలో వరి, పత్తి తరువాత అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. గింజల కోసమే కాకుండా.. పశువులకు పచ్చిమేత గాను ఇది ఉపయోగపడుతుంది. దీంతో, ఎక్కువ మంది రైతులు దీని సాగుకు మొగ్గు చూపుతారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, గొల్లప్రోలు, పెద్దాపురం, కిర్లంపూడి, దేవీపట్నం, సీతానగరం ప్రాంతాల్లో మొక్కజొన్న సాగును రైతులు ఎక్కువగా చేపడుతున్నారు. మెట్ట ప్రాంతం, రేగడి నేలలు అధికంగా ఉండటంతో పాటు గత ప్రభుత్వం ప్రోత్సాహం అందించడంతో కొన్నేళ్లుగా మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. కానీ, ఈ ఏడాది నీటి ఎద్దడి, మరోవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీలూ లేకపోవడంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అమాంతం పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 15 వేల హెక్టార్లు కాగా, ఈ సమయానికి 800 హెక్టార్లలో సాగు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకూ సుమారు 200 హెక్టార్లలో మాత్రమే మొక్కజొన్న సాగు జరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రుతుపవనాలు ప్రవేశించి ఇప్పటికే నెల రోజులు దాటిపోయింది. మొదట్లో భారీ వర్షాలతో దంచి కొట్టిన వరుణుడు కొన్నాళ్లుగా ముఖం చాటేశాడు. మరోవైపు గోదావరి డెల్టా కాలువలకు గత నెల ఒకటో తేదీ నుంచే నీరు విడుదల చేస్తున్నారు. అయితే, వరి సాగుకు మినహా ఈ నీరు తగినంత స్థాయిలో మొక్కజొన్న తోటలకు అందే పరిస్థితి లేకపోవడం దీని సాగుపై ప్రభావం చూపుతోంది. ప్రోత్సాహం కరవు ఆత్మ పథకం కింద వ్యవసాయ శాఖ గతంలో జిల్లావ్యాప్తంగా బ్లాకుకు రెండు మూడు రైతు క్షేత్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, మొత్తం 18 బ్లాకుల్లో మొక్కజొన్న సాగుపై రైతుల్లో అవగాహన కల్పించేది. ప్రతి రైతుకు రూ.3 వేల విలువైన స్వీట్కార్న్ (తీపి మొక్కజొన్న) విత్తనాలతో పాటు, రెండు రకాల క్రిమి సంహారక మందులు ఉచితంగా అందజేసేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహాకాలూ లేవు. ఫలితంగా మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గిపోయింది. మొక్కజొన్న తోటకు వివిధ రకాల పక్షులు, ఎలుకల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఆశిస్తూంటుంది. వీటన్నింటి నుంచి పంటను రక్షించుకుంటేనే అధిక దిగుబడి వస్తుంది. అది జరగడానికి ప్రభుత్వం నుంచి తగినంత సహకారం ఉండాలని రైతులు చెబుతున్నారు. పరిస్థితి ఎలా ఉన్నా రైతులు వినాయక చవితి ఉత్సవాలకు అందుబాటులోకి వచ్చే విధంగా కేవలం రెండు నెలల్లోనే దిగుబడి ఇచ్చే మొక్కజొన్న రకాలను సాగు చేస్తున్నారు. నీటి ఎద్దడి కారణంగా దిగుబడులు తగ్గి, నష్టపోయే అవకాశం ఉందని గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 15 వేల హెక్టార్లు ఈ ఏడాది సాగు అంచనా 10 వేల హెక్టార్లు ఇప్పటి వరకూ సాగు జరిగిన విస్తీర్ణం 200 హెక్టార్లు సాగు చేసిన రైతులు 380 మంది ఎకరాకు పెట్టుబడి సుమారు రూ.30 వేలు నీటి ఎద్దడితో పెరుగుతున్న ఖర్చు ఎకరాకు రూ.10 వేలు -
పొంచి ఉన్న నక్కలగండి
● తూతూమంత్రంగా అభివృద్ధి పనులు ● ముక్కలవుతున్న నక్కలఖండి కాలువ గట్టు ● 3 వేల ఎకరాల ఆయకట్టుకు ముంపు భయంపిఠాపురం: గత ఏడాది వచ్చిన వరదలకు గొల్లప్రోలు పరిధిలోని నక్కలఖండి కాలువకు పడమటదొడ్డి లాకుల సమీపాన పొలాల వద్ద గండి పడింది. దీంతో, సుమారు 3,000 ఎకరాల్లో రూ.కోట్ల విలువైన పచ్చని పంటలు ముంపు బారిన పడ్డాయి. ఆ గండిని అధికారులు ఇటీవల రూ.8 లక్షలు వెచ్చించి పూడ్చారు. అయితే, అత్యంత కీలకమైన ఈ పనులను తూతూ మంత్రంగా నిర్వహించారని రైతులు ఆరోస్తున్నారు. గండి పూడ్చివేత పనులు పూర్తయ్యి వారం రోజులు కూడా కాక ముందే తిరిగి అక్కడ గట్టు బీటలు వారుతూండటమే దీనికి కారణం. గట్టు అండలు అండలుగా జారిపోతోంది. ఒక మోస్తరు వర్షం కురిస్తే ఈ గట్టు తిరిగి ముక్కలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గండి పూడ్చివేత పనులను అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఎటువంటి నాణ్యతా ప్రమాణాలూ పాటించకుండా నిర్వహించినందువల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు విమర్శిస్తున్నారు. దీనికితోడు గండి పక్కనే గట్టు బలహీనంగా మారింది. అక్కడ మరో గండి పడే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ఫలితం లేదని చెబుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా తాము పంటలు సాగు చేసే అవకాశం లేదని, ఒకవేళ సాగు చేసినా ఏ క్షణంలో వరద వచ్చినా పంటలు కొట్టుకుపోతాయని అంటున్నారు. అధికారులు వెంటనే గండి పడిన చోట, బలహీనంగా ఉన్న చోట గట్టును పటిష్టపరచాలని రైతులు కోరుతున్నారు. -
రత్నగిరికి పోటెత్తిన భక్తులు
అన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. లోవ భక్తుల కోసం లక్ష ప్రసాదం ప్యాకెట్లు ఆషాఢ మాసం ఆదివారం తలుపులమ్మ తల్లి దర్శనానికి లోవ దేవస్థానానికి వెళ్లే భక్తులు తిరుగు ప్రయాణంలో అన్నవరంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు వారాల్లో సుమారు 3 లక్షల ప్రసాదం ప్యాకెట్లు కొనుగోలు చేయగా దేవస్థానానికి రూ.60 లక్షల ఆదాయం సమకూరింది. నేడు ఆషాఢ మాసంలో చివరి ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్లే అవకాశం ఉంది. వారు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదాలు కొనుగోలు చేసేందుకు వీలుగా రత్నగిరి తొలి పావంచా వద్ద స్టాల్, జాతీయ రహదారిపై రెండు నమూనా ఆలయాల వద్ద, రత్నగిరి పైన కౌంటర్లలో విక్రయానికి సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శృంగార వల్లభుని ఆలయంలో రద్దీ పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 10 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా స్వామి వారికి రూ.2,50,679 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. సుమారు 3 వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. యాని‘మేత’ర్ అరెస్టు కిర్లంపూడి: మహిళా సంఘాల డబ్బులు కాజేసి, పరారైన ఓ యానిమేటర్ను కిర్లంపూడి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్సై జి.సతీష్ కథనం ప్రకారం.. బూరుగుపూడి గ్రామానికి చెందిన దుర్గ అదే గ్రామంలో నాలుగేళ్లుగా 42 డ్వాక్రా గ్రూపులకు యానిమేటర్గా పని చేస్తోంది. 2023లో 12 మహిళా గ్రూపులకు సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించింది. అనంతరం, ఆ డబ్బులు కాజేయాలనే దురుద్దేశంతో పథకం ప్రకారం ఎనిమిది గ్రూపుల సభ్యులను మభ్యపెట్టింది. వారి ఖాతాల్లో వేరే గ్రూపులకు సంబంధించిన డబ్బులు పడ్డాయంటూ మాయమాటలు చెప్పింది. ఆ డబ్బులు డ్రా చేసే నెపంతో వారి నుంచి వేలిముద్రలు, సంతకాలు తీసుకుని సుమారు రూ.20.25 లక్షలు కాజేసింది. అనంతరం సీ్త్రనిధి లోన్ డబ్బులు కట్టాలంటూ వెలుగు సిబ్బంది ఆయా గ్రూపుల సభ్యులను అడగడంతో గుట్టు రట్టయ్యింది. దీంతో, దుర్గను గ్రూపు సభ్యులు, వెలుగు సిబ్బంది నిలదీయగా అసలు విషయం చెప్పింది. వారం రోజుల్లో ఆ డబ్బులు చెల్లిస్తానని నమ్మబలికింది. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా కుటుంబ సభ్యులతో కలసి, రాత్రికి రాత్రే గ్రామం విడిచి పరారైంది. దీనిపై దేవీశక్తి డ్వాక్రా గ్రూప్ అధ్యక్షురాలు కె.వీరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. దుర్గ మహారాష్ట్రలోని సోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి, శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అరెస్టు చేసి, శనివారం ప్రత్తిపాడు కోర్టులో హాజరుపరిచారు. నిందితురాలికి న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండు విధించడంతో రాజమహేంద్రవరంలోని మహిళా జైలుకు తరలించామని ఎస్సై సతీష్ తెలిపారు. -
ముద్రగడ ఆరోగ్యంపై వైఎస్ జగన్ ఆరా
సాక్షి, కాకినాడ జిల్లా: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఆయన ఫోన్లో మాట్లాడారు. అత్యవసరం అయితే కాకినాడ నుండి హైదరాబాద్కు ఎయిర్ లిఫ్ట్ చేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఎయిర్ లిఫ్ట్కు సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. అస్వస్థత నుండి ముద్రగడ కోలుకుంటున్నారు. ఆయన్ని వైఎస్సార్సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, వంగా గీతా పరామర్శించారు.ముద్రగడ పద్మనాభం కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
నిలకడగా ముద్రగడ ఆరోగ్యం
వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సాక్షి, ప్రతినిధి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం అస్వస్థతకు గురయ్యారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం శ్వాస సంబంధిత సమస్యతో అస్వస్థతకు గురి కావడంతో కాకినాడ అహోబిలం ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించారు. శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో మెరుగైన వైద్యం కోసం ఆయన్ను స్థానిక మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముద్రగడ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆ ప్రచారాన్ని నమ్మొద్దుముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న కథనాలను ఆయన తనయుడు ముద్రగడ గిరిబాబు ఖండించారు. ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని తెలిపారు. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు, ప్రచారాన్ని నమ్మొద్దని కోరారాయన. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు ● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క రోజులోనే హత్య కేసులో నిందితుడి అరెస్ట్
రాజోలు పోలీసులకు ఎస్పీ అభినందనలు రాజోలు: ప్రియురాలిని హత్య చేసి పరారైన నిందితుడు షేక్ షమ్మాను రాజోలు పోలీసులు 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. శుక్రవారం రాజోలు సర్కిల్ కార్యాలయంలో సీఐ టి.వి.నరేష్కుమార్, ఎస్సై బి.రాజేష్కుమార్లు వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన పుష్ప తన భర్త నుంచి విడాకులు పొంది నాలుగేళ్ల కుమారుడు, తల్లి గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్లో ఉంటోంది. ఏడాదిక్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షేక్ షమ్మాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారు ఇద్దరూ బి.సావరంలోని పుష్ప ఇంటి వద్ద సహజీవనం సాగిస్తున్నారు. కంప్యూటర్ క్లాస్ పేరుతో పుష్పను షమ్మా అమలాపురం తీసుకుని వెళ్లేవాడు. అర్ధరాత్రి వరకు ఆమెను ఇంటికి తీసుకుని వచ్చేవాడు కాదు. వ్యసనాలకు బానిస అయిన షమ్మా ఆమెను వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని బలవతం పెట్టేవాడు. ఈ విషయాన్ని ఆమె తల్లి గంగకు, వరసకు అన్న అయిన వినయ్కు చెప్పింది. ఈ నెల 16వ తేదీన అమలాపురం నుంచి ఇంటికి అర్ధరాత్రి తీసుకుని రాగా షమ్మాను తల్లి గంగ, అన్న వినయ్ ప్రశ్నించారు. దీంతో అగ్రహించిన షమ్మా కప్బోర్డులో ఉన్న చాకుతో వినయ్పై దాడికి పాల్పడ్డాడు. అతనికి అడ్డుగా వెళ్లిన పుష్పను చాకుతో గుండెల్లో పొడవగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను రక్షించేందుకు అడ్డుగా వెళ్లిన తల్లి గంగ, అన్నయ్య వినయ్లకు కత్తి గాయాలు అయ్యాయి. ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ మురళీమోహన్ సూచనల మేరకు నిందితుడిని పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుని రిమాండ్కు పంపిన సీఐ నరేష్కుమార్, ఎస్సై రాజేష్కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
40 మీటర్లు ఉన్నాయంటూ..
సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్ స్టేషన్కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు ఈపీడీసీఎల్ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్ నంబర్ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది. వీరికి కోత కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్ వర్ధన్, హర్షవర్ధన్ ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్వర్ధన్కు రూ.9 వేలు, హర్షవర్ధన్కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. -
గురుకుల పాఠశాలలో బాలికకు సీటు
జగ్గంపేట: సస్థానిక అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గంగవరం మండలం పిడతమామిడి గ్రామానికి చెందిన బాలిక వాకాడ కుసుమ అర్చనకు ఎట్టకేలకు గురుకుల పాఠశాలలో డిస్ట్రిక్ కో ఆర్డినేటర్ ఆదేశాలతో సీటు లభించింది. రెండు రోజుల క్రితం అర్చనకు సీటు ఇస్తామని గురుకుల పాఠశాల నుంచి ఫోన్ రాగా, ఆమె చదువుతున్న పాఠశాలలోంచి టీసీ, సర్టిఫికెట్లు పట్టుకుని గురుకుల పాఠశాలకు వెళ్లగా రిజర్వేషన్లో తేడా వచ్చిందని సీటు ఇవ్వలేమని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పడంతో ఆమె ఆవేదన చెందింది. ఇదే విషయమై సాక్షి పత్రిక శ్రీఅయోమయంలో 7వ తరగతి విద్యార్థినిశ్రీ అనే శీర్షికతో కథనం ప్రచురించింది. ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయ కూడా బాలికను గురుకుల పాఠశాలలో జాయిన్ చేసుకోకపోవడానికి వున్న ఇబ్బందులను జిల్లా గురుకుల పాఠశాలల కో – ఆర్డినేటర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనితో ఆమె స్పందించి వాకాడ కుసుమ అర్చనను పాఠశాలలో జాయిన్ చేసుకోమని ఆదేశాలు ఇవ్వడంతో గురుకుల పాఠశాలలో కుసుమ అర్చనను జాయిన్ చేసుకున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ విజయ తెలిపారు. -
ప్రమాదకర పరిశ్రమల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి
కాకినాడ సిటీ: ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, సమీపంలో ఉంటున్న ప్రజలకు ఆయా పరిశ్రమల్లో సంభవించే ప్రమాదాలపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డీవీవీఎస్ నారాయణ ఆధ్వర్యాన కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశంలో తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు తీరు, ప్రమాదకర రసాయనాల తయారీ, నిల్వల వివరాలు, ప్రమాదాలు చోటు చేసుకునే సందర్భాల్లో పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చించారు. ప్రమాదకర పరిశ్రమల్లో తీసుకున్న భద్రతా చర్యలను డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని ప్రమాదకర పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ప్రధానంగా 15 ప్రమాదకర పరిశ్రమలను గుర్తించామని తెలిపారు. ఆయా పరిశ్రమల్లో ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా అలారం, సెన్సార్, ఇతర భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రమాదాలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని పరికరాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎం.శంకరరావు, పరిశ్రమల శాఖ జీఎం సీహెచ్ గణపతి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి జె.నరసింహ నాయక్, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, ఓఎన్జీసీ, కోరమండల్, రాక్ సిరామిక్స్, ఏఎం గ్రీన్ అమ్మోనియా తదితర పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్ను స్టేషన్కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అభినందించారు. -
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
‘40 మీటర్ల’ సిబ్బందిపై వేటు
● ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ బదిలీ ● లైన్మన్, లైన్ ఇన్స్పెక్టర్ల సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: విద్యుత్ మీటర్ల అనుసంధానంలో ఉదాసీనంగా వ్యవహరించి, ఒక కుటుంబానికి తల్లికి వందనం రాకపోవడానికి బాధ్యులైన అధికారి, సిబ్బందిపై ఏపీ ఈపీడీసీఎల్ ఉన్నతాధికారులు వేటు వేశారు. సామర్లకోటలోని ఓ అద్దె ఇంట్లో ఉంటున్న కటకం నాగ సత్య గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ ‘మహిళ పేరుపై 40 విద్యుత్ మీటర్లు’ శీర్షికన ఈ నెల 17న ‘సాక్షి’ వార్త ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు శాఖాపరమైన విచారణ నిర్వహించారు. గంగాభవాని పేరిట ఉన్న 40 విద్యుత్ కనెక్షన్లు వాస్తవానికి ఎవరెవరి పేరున ఉన్నాయో విచారించి, వారి ఆధార్కు అనుసంధానం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిర్వహించి, బాధ్యులైన ఏపీ ఈపీడీసీఎల్ సామర్లకోట ఏఈ రమేష్ కుమార్ను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏపీ ఈపీడీసీఎల్లో కన్స్ట్రక్షన్స్ విభాగానికి బదిలీ చేశారు. లైన్మన్ టి.వెంకటేశ్వరరావు, లైన్ ఇన్స్పెక్టర్ యు.లక్ష్మణరావులను సస్పెండ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ (ఆపరేషన్స్) వరప్రసాద్ వివరించారు. -
భూముల వేలంలో పాల్గొననివ్వలేదని ఆందోళన
తొండంగి: కౌలు వేలం ద్వారా శ్రీసంస్థానం భూము లు సాగు చేసుకుంటున్న తమను వేలం ప్రక్రియలో పాల్గొననివ్వకుండా కూటమి పార్టీ నాయకులు, అధికారులు అన్యాయం చేశారంటూ బాధిత రైతులు ఆందోళన నిర్వహించారు. శ్రీసంస్థానం సత్రానికి చెందిన తొండంగిలోని భూములు సుమారు 478 ఎకరాలకు ఈ నెల 14 నుంచి తొండంగి శివాలయంలో కౌలువేలం ప్రక్రియను దేవదాయఽ ధర్మాదాయశాఖ అధికారులు నిర్వహిస్తున్న సంగతి విదితమే. రోజుకో 30 బిట్లు చొప్పున అధికారులు కౌలువేలం నిర్వహిస్తున్నారు. శుక్రవారం 30 బిట్లుగా 169.16 ఎకరాలకు వేలం నిర్వహించగా రూ.13,56,998 ఆదాయం వచ్చిందని శ్రీసంస్థానం ఈవో నున్న శ్రీరాములు తెలిపారు. గతంలో ఈ భూములకు రూ12,73,800 ఆదాయం రాగా ఈసారి రూ.80198 ఆదాయం పెరిగిందన్నారు. శనివారం మరో 25 బిట్లకు కౌలు వేలం జరుగుతుందని చెప్పారు. కాగా అర్హత ఉన్న కొంతమంది రైతులను కౌలు వేలంలోకి పాల్గొననివ్వకుండా ఆలయం బయట పోలీసుల శాంతిభద్రతల సాకుతో అడ్డుకోవడంతో బాధిత రైతులంతా ఆల యం బయట ఆందోళన నిర్వహించారు. అర్హత ఉన్నప్పటికీ వేలంలో పాల్గొనివ్వలేదని బాధిత రైతులు వాపోయారు. దీంతో వారంతా పోలీసులు, అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దేవదాయధర్మాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సక్రమంగా జరగనందున వేలంను రద్దు చేయాలంటూ బాధిత రైతులు డిమాండ్ చేశారు. -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు ● స్కూల్ను సందర్శించిన మండల అఽధికారులు జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. 217మంది విద్యార్థులకు కేవలం 5 తరగతి గదులు కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు. –పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
తలుపులమ్మకు రత్నగిరి నుంచి సారె
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారికి అన్నవరం వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానం తరఫున చీర, సారె సమర్పించారు. ఆషాఢ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో అన్నవరం దేవస్థానం సిబ్బందితో కలసి ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులు తలుపులమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె, పండ్లు, పూలు సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. శాంతి హోమం, పూర్ణాహుతిలో పాల్గొని, అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 20న ఆషాఢ బహుళ ఏకాదశి సందర్భంగా తలుపులమ్మ అమ్మవారికి విశేష పుష్పాలంకరణ, లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్టు లోవ దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. అమ్మవారికి 24న సప్తనదీ జలాలతో సహస్ర ఘటాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. రూ.1.05 లక్షల విరాళం కాకినాడ సిటీ: కాకినాడలో హాకీ టోర్నమెంట్, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ రూ.1,05,000 విరాళం సమర్పించింది. దీనికి సంబంధించిన చెక్కును సంఘం నాయకులు కలెక్టరేట్లో డీఆర్ఓ జె.వెంకటరావుకు శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కా ర్యదర్శులు ఎంవీఎస్ఎన్ఎన్ జగన్నాధం, జె.రాంబాబు, అసోసియేట్ అధ్యక్షులు ఎ.రత్నరాజు, ఏపీడీ భానుప్రకాష్, జీఎస్టీఓ స్వామి, పెద్దాపురం తాలూకా అధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. ఉద్యోగుల గ్రీవెన్స్కు 26 వినతులు కాకినాడ సిటీ: జిల్లాలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వివేకానంద హాలులో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమాని కి 26 వినతులు వచ్చాయి. ఉద్యోగుల నుంచి డీఆర్ఓ జె.వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ, సీపీఓ పి.త్రినాథ్ వినతులు స్వీకరించారు. ఈ వినతులను పరిశీలించి, పరిష్కారానికి కృషి చేయాలని సంబంధిత అధికారులకు డీఆర్ఓ సూచించారు.నేడు ‘స్వచ్ఛ దివస్’కాకినాడ సిటీ: జిల్లావ్యాప్తంగా శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కింద స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ షణ్మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనవసరమైన ప్లాస్టిక్ వస్తువులను నివారించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించుకోవాలనే థీమ్తో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణపై దృష్టి సారించాలన్నారు. -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు ● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం ● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా .. జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆందోళన కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాల నుంచి నష్టాలకు.. కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. నష్టాలు ఇలా.. పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం. –వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు. –బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు మార్కెట్లో వినియోగం తగ్గింది ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది. –గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి దిగుబడి ఉన్నా.. గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది. పెట్టుబడి.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు, వందల్లో విద్యుత్ మీటర్లు ● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి దూరమవుతున్న పేదలు ● రెవెన్యూ శాఖదీ అదే తంతు ● మండిపడుతున్న అర్హులు ● ఇదేం పాలనంటూ ఆగ్రహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత. ఈపీడీసీఎల్ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు ● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు. గుత్తుల రాజేశ్వరికార్పొరేట్ పాఠశాలలో సీటు వచ్చిందంటూ.. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు. వేరే వారి భూమి లింక్ చేయడంతో... కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్ కుమార్ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్తో లింక్ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్కు లింక్ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్ఆర్ఐల భూమి వీరి ఆధార్తో లింక్ అయ్యింది. ఆ ఎన్ఆర్ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్కు లింక్ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. -
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్క్రాప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు. -
అవి నకిలీ పీఎఫ్ చలానాలే
అన్నవరం: గత మార్చి నుంచి మే నెల వరకూ సుమారు రూ.30 లక్షల మేర ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లుగా అన్నవరం దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్ట్ సంస్థ కనకదుర్గ మ్యాన్పవర్ సర్వీసెస్ అందజేసిన రసీదులు నకిలీవేనని అధికారుల తనిఖీలో వెల్లడైంది. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఈ విషయం నిర్ధారించారు. దీంతో, ఈ అంశంపై రెండు రోజులుగా ‘సాక్షి’ ప్రచురించిన కథనాలు వాస్తవాలేనని రుజువైంది. చేసిన మోసం గుట్టు రట్టవడంతో ఆ కాంట్రాక్టర్ హడావుడిగా మూడు నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున చెల్లించి, ఆ రసీదులు దేవస్థానానికి అందజేశారు. అవి మాత్రం ఒరిజనలేనని అధికారుల పరిశీలనలో తేలింది. అయితే, మొదట ఇచ్చిన మూడు రసీదులు నకిలీవని తేలడంతో కాంట్రాక్టర్పై క్రిమినల్ కేసు నమోదుకు దేవస్థానం అధికారులు న్యాయసలహా తీసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని దేవదాయ శాఖ ఉన్నతాధికారులను కోరనున్నట్లు తెలిసింది. జూన్ రసీదు కూడా ఫేక్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి మొదట ఇచ్చిన పీఎఫ్ రసీదులు నకిలీవని రుజువై, వివాదం నడుస్తూండగా.. తాజాగా జూన్ నెలకు సంబంధించి ఈ నెల 11న చెల్లించినట్లు కాంట్రాక్టర్ సమర్పించిన పీఎఫ్ రసీదు కూడా ఫేక్ అని అధికారులు గుర్తించారు. టీఆర్ నంబర్ 1222507006348తో రూ.10,34,052 చెల్లించినట్టు ఆ రసీదులో ఉంది. దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగా టీఆర్ నంబర్ 1222504006459తో మార్చి నెలకు సంబంధించి రూ.10,09,914 చెల్లించినట్లుగా వచ్చింది. దీంతో ఆ రసీదును కూడా తిరస్కరించినట్లు అధికారులు తెలిపారు. తాజా వివాదంతో అన్నవరం దేవస్థానంలో పారిశుధ్య సిబ్బందికి ఈ నెల జీతాలు కూడా ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 12న కాంట్రాక్టర్ బిల్లు ఇచ్చినప్పటికీ జూన్ నెలకు నకిలీ పీఎఫ్ రసీదు జమ చేయడంతో తిరస్కరించారు. మళ్లీ పీఎఫ్ చెల్లించి, రసీదు సమర్పించాక, తనిఖీలో అది ఒరిజనల్ అని రుజువయ్యాకే సిబ్బందికి జీతాలు అందనున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఈ నెల 24, 25 తేదీల్లో మాత్రమే సిబ్బందికి జూన్ నెల జీతాలు అందే అవకాశం ఉంది. మోసం రుజువైంది మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పీఎఫ్ అకౌంట్కు రూ.30 లక్షలు చెల్లించినట్లు శానిటేషన్ కాంట్రాక్టర్ ఫేక్ రసీదులు జమ చేశారని తేలింది. దేవస్థానాన్ని మోసం చేసినందుకు గాను కాంట్రాక్టర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవడంపై న్యాయ సలహా తీసుకుంటున్నాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం తాజావి మాత్రం ఒరిజనల్ నిర్ధారించిన అన్నవరం దేవస్థానం అధికారులు శానిటేషన్ కాంట్రాక్టర్పై చర్యల దిశగా అడుగులు!సిబ్బంది ఖాతాలకు జమ అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ కాంట్రాక్టర్ వద్ద 350 మంది సిబ్బంది పని చేస్తున్నారు. మార్చి నెలలో 332 మందికి, ఏప్రిల్లో 335 మందికి, మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ అయినట్లు తేలింది. వివిధ కారణాలతో మార్చి నెలలో 15 మందికి, ఏప్రిల్లో 30 మందికి జమ కాలేదు. ఆ నెలలో వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే అభియోగం మోపి, కూటమి ప్రజాప్రతినిధి సిఫారసుతో 12 మంది శానిటేషన్ సూపర్వైజర్లను తొలగించి, వారి స్థానంలో అధికార పార్టీ కార్యకర్తలు 12 మందిని నియమించిన విషయం తెలిసిందే. దీంతో 24 మందికి పీఎఫ్ జమ కాలేదు. అలాగే అకౌంట్ నంబర్లలో తేడా వచ్చి మరో ఆరుగురికి జమ కాలేదని అధికారులు చెప్పారు. మే నెలలో 328 మందికి పీఎఫ్ జమ కాగా, 22 మందికి అవలేదు. వీరికి కూడా త్వరలోనే జమ అవుతాయని అధికారులు చెప్పారు. -
నకిలీలలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో శానిటేషన్ కాంట్రాక్టర్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) నకిలీ రసీదుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరుసగా మూడు నెలల పాటు పీఎఫ్ చెల్లిస్తున్నట్లు రూ.30 లక్షలకు నకిలీ రశీదులు సృష్టించి, నెలకు రూ.59 లక్షల చొప్పున కాంట్రాక్టర్ రూ.1.77 కోట్లకు శానిటేషన్ బిల్లు చేయించుకున్నా.. ఏ స్థాయిలోనూ అధికారులు కనిపెట్టలేకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇది అధికారుల నిర్లక్ష్యమా.. అవగాహనా లోపమా.. లేక లాలూచీ వ్యవహారమా అనేది అర్థం కావడం లేదు. ఈ నకి‘లీలల’పై ‘అన్నవరంలో శానిటరీ కాంట్రాక్టర్ మోసం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రిక గురువారం ప్రచురించిన వార్తకు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. టెండర్ పిలవకుండా.. సాధారణంగా దేవస్థానాల్లో ఏ పనికై నా టెండర్ పిలవడమో లేక నాలుగైదు సంస్థల నుంచి కొటేషన్లు స్వీకరించి వాటిలో తక్కువకు కోట్ చేసిన సంస్థకు కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అయితే, అన్నవరం దేవస్థానంలో శానిటేషన్ టెండర్ను మాత్రం విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు అప్పగించాలని దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్కు ఈఓ వీర్ల సుబ్బారావు నివేదిక పంపగా.. ఆయన ఆమోదం తెలిపారు. 350 మంది శానిటేషన్ సిబ్బందిని దేవస్థానంలో వివిధ చోట్ల నియమించి, వారికి ప్రతి నెలా 25 శాతం పీఎఫ్తో కలిపి నెలకు రూ.59 లక్షల బిల్లు చెల్లించేలా, నెలకు రూ.12 లక్షల శానిటరీ మెటీరియల్ను దేవస్థానం ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. సాధారణంగా దేవస్థానంలో చిన్న కాంట్రాక్ట్ అప్పగించినా అంచనా మొత్తంలో దాదాపు 15 శాతం డిపాజిట్గా జమ చేయాల్సి ఉంటుంది. కానీ, కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ నుంచి ఒక్క రూపాయి కూడా డిపాజిట్ రూపంలో తీసుకోకుండా ఈ బాధ్యతలు అప్పగించడం విచిత్రం. అప్పట్లోనే దీనిపై విమర్శలు రాగా, ఒక నెల తాత్కాలిక అడ్జస్ట్మెంట్ అని, ఏప్రిల్లో కొత్త కాంట్రాక్టర్ వస్తారని అధికారులు సమాధానం చెప్పారు. అధికారుల నిర్లక్ష్యమే అలుసుగా.. దేవస్థానం అధికారుల నిర్లక్ష్యాన్ని అలుసుగా తీసుకున్న కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ నిర్వాహకులు నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించారు. వరుసగా మార్చి, ఏప్రిల్, మే నెలలకు రూ.10.09 లక్షలు, రూ.10.64 లక్షలు, రూ.10.45 లక్షలకు చలానాలు సృష్టించి దేవస్థానానికి జమ చేసి, బిల్లు చేయించుకున్నారు. మొత్తం 350 మంది సిబ్బంది జీతాలకు నెలకు రూ.59 లక్షల చొప్పున మూడు నెలలకు కలిపి దేవస్థానం రూ.1.77 కోట్ల మేర బిల్లులు చెల్లించింది. అయితే, తమ ఖాతాలకు పీఎఫ్ మొత్తం జమ కాకపోవడంపై శానిటేషన్ సిబ్బంది ఆరా తీశారు. దీంతో, అనుమానం వచ్చిన దేవస్థానం అధికారులు.. సంబంధిత కాంట్రాక్టర్ను నిలదీశారు. విధి లేని పరిస్థితిలో ఆ కాంట్రాక్టర్ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఈ నెల 9, 14, 15 తేదీల్లో రూ.10.09 లక్షలు, రూ.9.90 లక్షలు, రూ.9.75 లక్షల చొప్పున పీఎఫ్కు చెల్లించి, ఆ రశీదులు గత మంగళవారం జమ చేశారు. దీంతో పాత రశీదులు ఫేక్ అని ఆ కాంట్రాక్టరే స్వయంగా అంగీకరించనట్లయింది. అయితే, ఆ పాత రశీదుల క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయగా.. అవి గతంలో వేరే సంస్థ తరఫున చెల్లించిన పీఎఫ్ చలానాలని, వాటి తేదీలు, మొత్తం, టీఆర్ నంబర్ మార్ఫింగ్ చేశారని తేలింది. ఆ కాంట్రాక్టర్ మూడు నెలలకు పీఎఫ్ తిరిగి చెల్లించి, రశీదులు ఇవ్వడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ అలా చెల్లించకపోయినా దేవస్థానం చేసేదేమీ లేదు. ఆ కాంట్రాక్టర్ దేవస్థానం వద్ద ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయకపోవడమే దీనికి కారణం. ఆ రసీదు కూడా నకిలీయేనా ! ఇంత జరిగినా గత నెలకు కూడా పీఎఫ్ రసీదు నకిలీదే జమ చేశారు. దానిని ఈ నెల 12న జీతాల బిల్లుతో పాటు దేవస్థానానికి పంపించారు. కాంట్రాక్టర్ ఇచ్చిన రసీదులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వచ్చిన సమాచారానికి అసలు పొంతనే లేదు. టీఆర్ నంబర్, నెల కూడా తేడాగా ఉన్నాయి. దీంతో ఇది కూడా నకిలీ అనే భావిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నిర్వాకాలపై గతంలో ‘సాక్షి’ అనేక కథనాలు ప్రచురించింది. ఏప్రిల్ 25న ‘మాకు జీతాలు ఎప్పుడిస్తారు?’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించి మార్చి నెల జీతాలు చెల్లించారు. అలాగే, ఏప్రిల్ జీతాల చెల్లించకపోవడంతో ‘వీరి కష్టం తుడిచేవారేరి’ శీర్షికన మే 26న కథనం ప్రచురించగా జూన్ 3న చెల్లించారు. మే నెల జీతాలివ్వకపోవడంతో ‘వేతనాల ఆలస్యం రివాజే’ శీర్షికన జూన్ 19న వార్త ప్రచురించాక చెల్లించారు. జూన్ నెల జీతాలు ఇంకా చెల్లించనేలేదు. వేతనాల చెల్లింపు ఆలస్యమైతే పీఎఫ్పై పెద్దగా దృష్టి ఉండదని, అందువల్ల నకిలీ చలానాలు జమ చేసినా పట్టించుకోరనే అభిప్రాయంతోనే ఆవిధంగా చేస్తున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పీఎఫ్ రసీదులు పరిశీలిస్తున్నాం కాంట్రాక్టర్ అందజేసిన పీఎఫ్ రసీదులను వెరిఫై చేయిస్తున్నాం. అదే విధంగా ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్, లేబర్ కమిషనర్ కార్యాలయ సిబ్బందిని పంపించాలని కూడా జిల్లా కలెక్టర్ను కోరాం. వారు కూడా ఆ రశీదులు పరిశీలిస్తారు. ఒకవేళ ఆ రసీదులు నకిలీవని తేలితే ఆ కాంట్రాక్టర్ను విధుల నుంచి తప్పించే విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి నిర్ణయిస్తాం. చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం. – వీర్ల సుబ్బారావు, ఈఓ, అన్నవరం దేవస్థానం శానిటేషన్ కాంట్రాక్టర్ చీటింగ్తో రత్నగిరిపై ప్రకంపనలు ‘సాక్షి’ కథనంతో బయటపడుతున్న టెండర్ లొసుగులు వివరణ కోరిన దేవదాయ మంత్రి -
మరిడమ్మ దర్శనానికి భారీగా భక్తులు
పెద్దాపురం: భక్తుల కల్పవల్లిగా ఖ్యాతికెక్కిన పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు గురువారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూ లైన్లలో బారులు తీరి మరీ అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలికాకినాడ సిటీ: మత్తు పదార్థాల వాడకం వలన కలిగే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన, చైతన్యం పెంపొందించేలా జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లోనూ ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి వాటి వాడకం, అమ్మకం, రవాణాను అరికట్టేందుకు ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈగల్) టీమ్ అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ టీమ్ మత్తు పదార్థాలు వాడే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. ప్రతి పాఠశాలలో 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో ఈగల్ క్లబ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్, జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్, ఎస్ఎస్ఏ పీఓ వేణుగోపాలరావు, ఈగల్ టీమ్ అధికారి కె.ధర్మతేజ తదితరులు పాల్గొన్నారు. 1.03 లక్షల మందిని అక్షరాస్యులను చేయాలి కాకినాడ సిటీ: అక్షరాస్యత కార్యక్రమాల్లో అధికారులందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. వయోజన విద్యా శాఖ ఆధ్వర్యాన కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లో నిర్వహించిన క్యాస్ట్ సర్వే ద్వారా జిల్లాలో 3,39,963 మంది వయోజనులైన నిరక్షరాస్యులను గుర్తించారన్న్రాు. వారిలో మొదటి విడతగా ఈ ఏడాది 1,03,081 మందిని అక్షరాస్యులుగా చేయడానికి ఆయా శాఖల ద్వారా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. తదుపరి మూడు సంవత్సరాల్లో మిగిలిన అందరినీ అక్షరాస్యులుగా చేయాలని సూచించారు. జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి అనిశెట్టి వెంకటరావురెడ్డి మాట్లాడుతూ, రెండో దఫా అక్షరాంధ్ర అక్షరాస్యత కార్యక్రమం కింద ప్రతి పది మందికి ఒక వలంటీర్ టీచర్ని ఏర్పాటు చేసి, ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకూ ఒక రోజు జిల్లా స్థాయి శిక్షణ నిర్వహిస్తామని వివరించారు. ఈ నెల 29 నుంచి ఆగస్టు 6 వరకూ మండల స్థాయిలో వలంటీర్ టీచర్లు, రిసోర్స్ పర్సన్లకు ఎంపీడీఓల ఆధ్వర్యాన శిక్షణ నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 7 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ నిరక్షరాస్యులకు ఫైనాన్షియల్, డిజిటల్, ఫంక్షనల్ లిటరసీల్లో శిక్షణ ఇచ్చి, మార్చి నెలలో పరీక్ష నిర్వహిస్తామని వివరించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో చోటు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల్లో జిల్లా నుంచి ముగ్గురికి స్థానం కల్పించారు. పార్టీ వైఎస్సార్ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జల్లిగంపల ప్రభాకర్ (ప్రత్తిపాడు నియోజకవర్గం), రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శులుగా అల్లవరపు నాగమల్లేశ్వరి, పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజులను (పిఠాపురం నియోజకవర్గం నియమించారు. -
పెత్తందార్ల కోసమే చంద్రబాబు పాలన
● పేదల కోసం కాదు ● ఆయన నిర్లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ● మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తొండంగి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పాలన పేదల కోసం కాదని, ‘పచ్చ’ మీడియాతో పాటు వందిమాగధులు, పెత్తందార్ల అభివృద్ధి కోసమేనని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమంపై తొండంగిలో గురువారం జరిగిన పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశారని, పేదలకు నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలకు అందించారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు కేవలం ఏడాది కాలంలోనే దాదాపు రూ.1.72 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్తో పాటు 143 వరకూ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను 50 శాతం మేర జగన్ పూర్తి చేశారని దాడిశెట్టి రాజా చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు 45.75 మీటర్లకు నిర్మాణ పనులు జరగ్గా.. చంద్రబాబు కేంద్రం వద్ద మాట్లాడకపోవడంతో దీనిని 41.15 మీటర్లకు తగ్గించారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గడం వల్ల లక్షలాది మంది ఆయకట్టు రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.15 వేల కోట్లు అధికంగా తెస్తే ప్రాజెక్టును పూర్తి స్థాయి ఎత్తులో నిర్మించవచ్చని వివరించారు. కేంద్రానికి టీడీపీ ఎంపీల మద్దతు అవసరం ఉన్నందున దీనిపై ఒత్తిడి తేవాలని రాజా డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి కాకపోతే బనకచర్ల ప్రాజెక్టు కట్టినా ఉపయోగం లేదన్నారు. ఎక్కడో బిహార్లో ఎన్నికలు జరుగుతూంటే కేంద్రం లక్ష కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తోందని అన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చంద్రబాబు కమీషన్ల కోసం మాట్లాడుకున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన అనుభవంతో కేంద్రానికి తలవంచకుండా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పోలవరం ప్రాజెక్టు విషయంలోను, ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని రాజా సూచించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ నేత యనమల కృష్ణుడు, పార్టీ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి కొయ్యా మురళి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మేరుగు పద్మలత, రాష్ట్ర పెరిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పురుషోత్తం గంగాభవాని, పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు తదితరులు పాల్గొన్నారు. -
15 వేల హెక్టార్లలో వరి నాట్లు
కరప: ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 93,500 హెక్టార్లలో వరి సాగు జరుగుతూండగా ఇప్పటి వరకూ 15 వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయని జిల్లా వ్యవసాయాధికారి ఎన్.విజయ్ కుమార్ తెలిపారు. ఇందులో 6 వేల హెక్టార్లలో వెదజల్లు పద్ధతి అనుసరించామన్నారు. మరో నాలుగైదు రోజుల్లో 40 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేయడానికి వరి నారు సిద్ధంగా ఉందని తెలిపారు. శివారు ప్రాంతాల్లో సాగునీటి సరఫరాను పరిశీలించేందుకు గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద విలేకర్లతో మాట్లాడారు. సాగునీటి ఎద్దడి లేని కరప, కాజులూరు, తాళ్లరేవు, పెదపూడి, సామర్లకోట, ఏలేశ్వరం మండలాల్లో వరి నాట్లు తొందరగా పూర్తి చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఎంటీయూ–7029 (స్వర్ణ), ఎంటీయూ–1318 రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారన్నారు. అవసరం మేరకే రైతులు ఎరువులు వాడాలని సూచించారు. నాట్లు పూర్తి చేసే సమయానికి మొదటి దఫాగా ఎకరానికి 25 కిలోల డీఏపీ, 10 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేస్తే సరిపోతుందన్నారు. ఈ సీజన్లో 48 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని, ఇప్పటి వరకూ 18 వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని తెలిపారు. మరో 18 వేల టన్నుల ఎరువులను మార్క్ఫెడ్ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. ఎవరైనా ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించినా, పురుగు మందులు కొంటేనే ఎరువులిస్తామని చెప్పినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాకు 42 డ్రోన్లు మంజూరయ్యాయని విజయ్ కుమార్ తెలిపారు. 36 గ్రూపులు సొమ్ము చెల్లించగా, 31 గ్రూపులకు డ్రోన్లు సరఫరా చేశామని తెలిపారు. 69 వేల మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉండగా.. ఇంతవరకూ 25 వేల మందికే ఇచ్చామన్నారు. అనంతరం కరప శివారు పేపకాయలపాలెంలో విజయ్ కుమార్ పర్యటించి పొలాలు, పంట కాలువల పరిస్థితిని పరిశీలించారు. సాగునీటి సమస్య ఉంటే తమ సిబ్బందికి తెలియజేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఐ.మంజు, కరప, కాకినాడ ఏడీఏలు కె.బాబూరావు, కె.దుర్గాలక్ష్మి, ఏఈఓ ప్రశాంత్ కూడా పాల్గొన్నారు. -
సీఎస్ఈకే క్రేజ్..!
ఉమ్మడి తూర్పులో ఇలా... ఇంజినీరింగ్ కళాశాలలు : 34 ప్రభుత్వ : 2ప్రైవేటు : 32మొత్తం సీట్లు : 17,250సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు : 15,222 ఇంజినీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ, అనుబంధ బ్రాంచ్ల) జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. కళాశాలల్లో ఏటా ఈ బ్రాంచి సీట్లే ఎక్కువగా భర్తీ అవుతున్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు ఉండటంతో ఎక్కువ మంది సీఎస్ఈపై మక్కువ చూపుతున్నారు. ప్రముఖ కంపెనీల్లో కొలువు సాధిస్తే రూ.లక్షల్లో ప్యాకేజీలు ఉంటాయన్న ఆశతో సీఎస్ఈ బ్రాంచ్పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ కోర్సులో చేరేందుకు అత్యధిక శాతం విద్యార్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. ఆ తర్వాత ఏఐ, డేటాసైన్స్, ఎంఎల్ తదితర కోర్సులకు డిమాండ్ ఉంది. ఇదే అదనుగా భావిస్తున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ సీట్ల పరిమితి లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సీట్లు పెంచుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్ ఆప్షన్ల నమోదులో తలమునకలవుతున్నారు. ఏపీఈఏపీసెట్–2025 వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది. 22న సీట్ల అలాట్మెంట్, 23న కళాశాలలో చేరిక, వచ్చే నెల 4న క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు సీఎస్ఈ గ్రూప్నకే తమ వెబ్ ఆప్షన్లలో తొలి ప్రాధాన్యం ఇచ్చారు. రెండో ప్రాధాన్యంగా ఈసీఈ, ఏఐ కోర్సును ఎంచుకుంటున్నారు. ఒకప్పుడు తిరుగులేని గ్రూపులుగా వెలుగొందిన ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గిపోయింది. కనీసం ఈ బ్రాంచ్లను పది శాతం మంది కూడా ఎంచుకోవడం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ఈ నెల 19న జరిగే వెబ్ ఆప్షన్ల మార్పుల్లో సైతం ఇదే పంథా కొనసాగనుంది. దీన్ని బట్టి చూస్తే ఈ ఏడాది సెట్లో అర్హత సాధించిన విద్యార్థులకు ఈఈఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్లలో కన్వీనర్ కోటాలో ఏదో ఒక కళాశాలలో సీటు పక్కాగా లభించే అవకాశం ఉంది. యథేచ్ఛగా దోపిడీ సీఎస్ఈకి ఉన్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు దోపిడీకి తెర తీశాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్, డీమ్డ్, అటానమస్ ఇలా అన్ని ప్రైవేటు కళాశాలల్లో సీఎస్ఈ కన్వీనర్ కోటా సీట్లు తప్ప మేనేజ్మెంట్, పేమెంట్ సీట్లను పూర్తి స్థాయిలో ఇప్పటికే విక్రయించేశారు. ఏఐసీటీఈ గతేడాది సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్ ఎత్తివేయడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా తమ కళాశాలల్లో డిమాండ్ ఉన్న కోర్సులకు సీట్లు పెంచుకుంటున్నాయి. కళాశాల స్థాయి, పేరు ఆధారంగా ఒక్కో కోర్సుకు ఏడాదికి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నిస్తే సీటు ఇవ్వకుండా తిరస్కరిస్తారేమోనన్న భయంతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కన్వీనర్ కోటాకే పథకాల వర్తింపు కోర్సుల ఎంపికలో తల్లిదండ్రులు, విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటున్నారు. అన్ని బ్రాంచిలూ ముఖ్యమైనవేనని, విద్యార్థుల అభీష్టం మేరకు కోర్సుల్లో చేరాలంటున్నారు. కళాశాలల దోపిడీని అరికట్టాలి ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీలో ప్రైవేటు కళాశాలలు దోపిడీ బహిరంగంగా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా వర్శిటీ అధికారులు, ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రైవేటు కళాశాలలకు సీట్ల కేటాయింపు విచ్చలవిడిగా పెంచడంతో ఇదే అదునుగా భావిస్తున్న కళాశాలలు.. విద్యార్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నాయి. – ఎంవీ బ్రహ్మానందరెడ్డి, ఏపీటీపీఐఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సీఎస్ఈ అంటున్నారు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 34 ఇంజినీరింగ్ కళాశాలలున్నాయి. అందులో ప్రభుత్వ 2, ప్రైవేటు 32 ఉన్నాయి. 15,222 మంది సెట్లో అర్హత సాధించారు. 17,250 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతానికి పైగా సీఎస్ఈనే ఎంచుకునే పరిస్థితి ఉందని విద్యా నిపుణులు అంటున్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా ఉండటంతో సీఎస్ఈ గ్రూప్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా సీఎస్ఈ జనరల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చైన్ టెక్నాలజీ, క్లౌడ్ టెక్నాలజీ వంటి కోర్సుల హవా కొనసాగుతోంది. ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్దే పైచేయి సాఫ్ట్వేర్ రంగంలో డిమాండ్ ఉండటంతో విద్యార్థుల మొగ్గు సొమ్ము చేసుకోవడానికి రంగంలోకి దిగిన ప్రైవేటు కళాశాలలు కౌన్సెలింగ్ జరుగుతుండగానే విద్యార్థులను ఆకర్షించే యత్నాలు మేనేజ్మెంట్ సీట్ల భర్తీకి బేరసారాలు 70 శాతానికి పైగా సీఎస్సీ కోర్సు ఎంచుకునే అవకాశంకొత్త కోర్సులు ఇంజినీరింగ్లో ప్రస్తుతం కొత్త కోర్సులు పరిచయం అయ్యాయి. సీఎస్ఈలో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, వీఎల్ఎస్ఐ డిజైన్, ఆడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏరోస్పేస్, అగ్రికల్చర్, మైరెన్, మైనింగ్, స్కిల్ అండ్ టెక్స్టైల్ వంటి కొత్త బ్రాంచ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. -
‘జలగ’ండపై అప్రమత్తంగా ఉండాలి
పిఠాపురం: వాణిజ్య పంటలపై దాడి చేస్తున్న మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు డాక్టర్ సీతారామశర్మ, డాక్టర్ రామభద్రరాజు సూచించారు. గొల్లప్రోలు మండలంలో వాణిజ్య పంటలపై మెట్ట జలగలు దాడి చేస్తున్నాయంటూ ఈ నెల 13న ‘జలగండం’ శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో గురువారం పర్యటించారు. మెట్ట జలగలు సోకిన పత్తి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు, మాట్లాడుతూ మెట్ట జలగలు ఎక్కువగా ఉంటే ఎకరాకు రెండు కేజీల ఉప్పు వాటి శరీరంపై పడేటట్లు జల్లాలన్నారు. ఉధృతి మరీ అధికంగా ఉంటే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జలగల నివారణకు రసాయన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక వ్యవసాయ అధికారులకు సూచించారు. రైతులు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే నత్రజని ఎరువు వాడుకోవాలన్నారు. పొటాష్ కూడా వేస్తే పంటలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి, గింజ నాణ్యత బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీఏ స్వాతి, వ్యవసాయ అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కోనసీమలో దారుణం.. వ్యభిచారానికి ప్రియురాలు అంగీకరించలేదని..
సాక్షి, అంబేద్కర్ కోనసీమ జిల్లా: వ్యభిచారం చేయడానికి అంగీకరించలేదని ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కోనసీమలో కలకలం రేపుతోంది. రాజోలు మండలం బి.సావరం సిద్ధార్థ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. షేక్ షమ్మ (22) అనే యువకుడితో ఓలేటి పుష్ప(22) కొంతకాలంగా సహజీవనం చేస్తోంది.ప్రియురాలు పుష్పను వ్యభిచారం చేయడానికి తన వెంట రావాలంటూ ప్రియుడు బలవంతం చేశాడు. నిరాకరించిన పుష్పను షేక్ షమ్మ దారుణంగా చాకుతో పొడిచి హత్య చేశాడు. ఘటనలో అడ్డు వచ్చిన పుష్ప తల్లి గంగను, సోదరుడినీ కూడా గాయపరిచి నిందితుడు పారిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ!.. టీడీపీకి బిగ్ షాక్?
సాక్షి, చీరాల: ‘తెలుగుదేశం పార్టీని నమ్మి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరితే చివరకు నన్ను నిలువునా మోసం చేసి చంపేశారు. మూడు సార్లు నాకు అన్యాయమే జరిగింది. చివరి వరకు ఆశ పెట్టుకున్న చైర్మన్ పదవి కల్పించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఏదైనా విషం ఇచ్చి చంపేయచ్చుగా బాబు గారూ..!’ బాపట్ల జిల్లా, చీరాల మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్ పొత్తూరి సుబ్బయ్య ఆవేదనా పూరిత వ్యాఖ్యలివి.వివరాల్లోకి వెళితే, మే 14న చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన అనంతరం, బుధవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ స్థానానికి పొత్తూరి సుబ్బయ్య, మించాల సాంబశివరావు, మామిడాల రాములు పేర్లు బలంగా వినిపించాయి. ఎన్నికకు జిల్లా మంత్రి కొలుసు పార్థసారథి విచ్చేయగా, ఎక్స్అఫిషియో సభ్యులుగా ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య హాజరయ్యారు. అధిష్టాన నిర్ణయం మేరకు సాంబశివరావు పేరును చైర్మన్గా ఎంపీ ప్రతిపాదించగా, ఆయన ఎన్నికయ్యారు.అప్పటి వరకు తనకే ఆ అవకాశం దక్కుతుందని గంపెడు ఆశతో ఉన్న సుబ్బయ్యకు తీవ్ర పరాభవం ఎదురైంది. వెంటనే ఆయన కౌన్సిల్ హాలు నుంచి కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చీరాల మున్సిపాలిటీలో ఆర్యవైశ్య సామాజికవర్గానికి 16 వేల ఓట్లు ఉన్నాయని, 83 శాతం ఓట్లు వేయించి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని గెలిపించామన్నారు. గతంలోనూ రెండు సార్లు తనకు చైర్మన్ పదవి విషయంలో అన్యాయం జరిగిందన్నారు. 14 రకాల ఆస్తులుంటే పార్టీ కోసం 12 అమ్ముకుని ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానన్నారు. అమ్ముకోవడానికి ఇక మిగిలింది కిడ్నీలు, లివర్ మాత్రమేనని వాపోయారు. వైఎస్సార్సీపీని కాదనుకొని వస్తే.. ఇంత అన్యాయమా? వైఎస్సార్సీపీని కాదనుకొని టీడీపీలో చేరితే ఇంత అన్యాయం చేస్తారనుకోలేదని పొత్తూరి వాపోయారు. తాను ఇక పార్టీలో ఉండలేనని పేర్కొంటూ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానన్నారు. -
డిసెంబర్ నాటికి టిడ్కో ఇళ్ల పంపిణీ
కాకినాడ సిటీ: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 365/430 కేటగిరీ టిడ్కో గృహాలన్నింటినీ వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరి నారాయణ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత కలెక్టర్ షణ్మోహన్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై చేపట్టిన చర్యలను కమిటీకి వివరించారు. జిల్లాలో జీరో పావర్టీ, పీ–4 కార్యక్రమ అమలు ప్రగతిని వివరించారు. రూరల్ నియోజకవర్గం పరిధిలో 11 ఏళ్లగా ఎన్నికలు జరగని ఏడు గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు విడుదల కాక, సాధారణ నిర్వహణ కష్టమవుతోందని, ఈ పంచాయతీలను కాకినాడ నగరంలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. సమావేశంలో ఒన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ స్కీమ్ కింద పెద్దాపురం సిల్క్ చీర ఉత్పత్తులు ఎంపికై నందుకు అధికారులను, నేతన్నలను మంత్రి అభినందించారు. సమావేశంలో జేసీ రాహుల్ మీనా, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, అసిస్టెంట్ కలెక్టర్ మనీషా తదితరులు పాల్గొన్నారు. ఎరువుల దుకాణంలో తనిఖీలు శంఖవరం: మండలంలోని కత్తిపూడిలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎరువుల దుకాణాలపై బుధవారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా స్థానిక భక్తాంజనేయ ఫెర్టిలైజర్స్ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా రూ.2,49,200 విలువైన వరి విత్తనాలు, రూ.2,05,347 విలువైన ఎరువుల విక్రయాలు నిలిపివేశారు. గొడౌన్లో ఉన్న స్టాకు రిజిస్టరులో స్టాకుకు వ్యత్యాసం, రికార్డులు సక్రమంగా లేకపోవటంతో వాటిని నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ సంచాలకుడు షంషీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ పి.శివరామకృష్ణ, ఏఓ పి.గాంధీ, ఏఈఓ ఆర్.మౌళిప్రసాద్ పాల్గొన్నారు. 20న జిల్లా స్థాయి యోగాసన పోటీలు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర భారత్ యోగాసన క్రీడా సంఘం, కోకనాడ యోగాసన క్రీడా సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఆదివారం స్థానిక జేఎన్టీయూ యోగా హాల్లో జిల్లా యోగాసన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ సుధాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదేళ్లు నిండిన వారి నుంచి 14 ఏళ్ల వారి వరకు, 14 నుంచి 18 వరకు, 18 నుంచి 28 వరకు, 28 నుంచి 35 వరకు, 35 నుంచి 45 వరకు, 45 నుంచి 55 ఏళ్లవారి వరకు వివిధ కేటగిరీలలో యోగాసన పోటీలు జరుగుతాయని వారు తెలిపారు. ఆరు విభాగాల్లో బాలురు, బాలికలు పాల్గొనవచ్చునని ప్రపంచ యోగాసన, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు ఇచ్చిన సిలబస్ ప్రకారం ట్రెడిషనల్ యోగ, రిథమిక్ యోగ, ఆర్టిస్ట్ యోగ, 10 రకాల పోటీలు జరగనున్నాయన్నారు. ఈ పోటీల్లో విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామని, రాష్ట్రస్థాయిలో గెలుపొందిన వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు 91334 33491 నంబరులో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం సిటీ): రాజమహేంద్రవరంలోని ఎస్.కె.ఆర్. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేయడానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రాఘవకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. జువాలజీ, కంప్యూటర్ సైన్స్, బోటనీ, ఫిజిక్స్, ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైనన్స్ , కామర్స్లో ఖాళీలున్నాయన్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 19 తేదీ లోపు కళాశాల ఆఫీసుకు అందజేయాలన్నారు. ఇంటర్వ్యూలు ఈ నెల 23వ తేదీన ఉదయం 9 గంటలకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు వెంట తీసుకుని రావాలన్నారు. వివరాలకు 9398677385, 9866131354 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మోదీ విధానాలతో దేశానికి ప్రమాదం
సామర్లకోట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ అన్నారు. స్థానిక నీలమ్మచెరువు వద్ద జరిగిన సీపీఐ జిల్లా మహాసభకు ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం గాంధీచౌక్లో జరిగిన సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేశారు. ప్రధాని మోది మతోన్మాద విధానాలతో దేశం ప్రమాద స్థితిలో ఉన్నదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి యువతను మోసం చేసిందని ప్రభాకర్ అన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ పోరాటాల ద్వారా అనేక ప్రజా సమస్యలను పరిష్కరించిందన్నారు. పారిశ్రామిక వేత్తకు రూ.15లక్షల కోట్లు రుణ మాఫీ చేసిన కేంద్రప్రభుత్వం కౌలు రైతులకు రూ.రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేయడానికి ముందుకు రావడం లేదని ఆయన ధ్వజమెత్తారు. కాకినాడ నుంచి అమలాపురం వరకు ఉన్న గ్యాస్ నిక్షేపాలను పైపులైన్ ద్వారా మహారాష్ట్ర, గుజరాత్లకు తరలిస్తున్నారని, స్థానికంగా లభించే గ్యాస్, పెట్రోలు నిక్షేపాలను స్థానికంగా అందజేస్తే గ్యాస్ సిలిండర్ రూ.100కే వస్తుందన్నారు. రాష్ట్రంలో కూటమి నాయకుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పని చేసే పది వేల కుటుంబాలను రోడ్డున పడేశారన్నారు. వలంటీర్ల పొట్ట కొట్టిన ఘనత చంద్రబాబుకు, పవన్ కల్యాణ్కు దక్కుతుందన్నారు. వలంటీరులకు రూ.10వేలు ఇస్తామని రెండున్నర లక్షల మందిని నమ్మించి మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు ముడుపులు చెల్లిస్తే కానీ మద్యం పాటలు జరుపుకోవడానికి వీలు లేదని హుకుం జారీ చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తూ ఉన్నా అడిగే దమ్ము అధికారంలో ఉన్న వారికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అన్నారు. చంద్రబాబు నాయుడు 21 పర్యాయాలు ఢిల్లీ వెళ్తే 21 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. అమరావతికి ఒకసారి శంకుస్థాపన చేసి రెండో పర్యాయం శంకుస్థాపన చేయడం విడ్డూరంగా లేదా అన్నారు. మోది రాష్ట్రం వచ్చిన సమయంలో రూ.700 కోట్లు ఖర్చు అయిందన్నారు. పవన్ కల్యాణ్కు చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ బాయ్ అన్నట్లుగా చేశారన్నారు. సభలో సీపీఐ జాతీయ సమితి సభ్యురాలు పి.దుర్గా భవాని, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రభాకర్ -
వాడపల్లి క్షేత్రంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లిలోని శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. క్యూలైన్లు పెంచడంతో పాటు ప్రవేశ ద్వారాల వద్ద వెడల్పాటి మార్గాలను ఏర్పాటు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న లడ్డూ కౌంటర్లకు అదనంగా మరికొన్ని కౌంటర్లు పెంచనున్నామన్నారు. వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచనున్నామన్నారు. ఈ మేరకు ఏర్పాట్లను తహశీల్దార్ రాజేశ్వరరావు, డీసీ చక్రధరరావు బుధవారం పరిశీలించారు. అన్న ప్రసాద భవనానికి రూ.50 వేల విరాళం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా ఆకివీడుకు చెందిన కొల్లి వెంకటేశ్వరబాబు, వెంకటలక్ష్మి దంపతులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. దాతలకు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందించారు. దరఖాస్తుల ఆహ్వానం వాడపల్లి క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం ప్రతి శనివారం దేవస్థానం ద్వారా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. ఈ శిబిరంలో సేవ చేయడానికి నర్సింగ్ క్వాలిఫైడ్ అయిన మహిళలు / పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్టు తెలిపారు. ఆసక్తి గల వారు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
ఖాతాకు ప్రాణం పోస్తేనే కాసులు
తపాలా శాఖ ప్రత్యేక డ్రైవ్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) మ్యాపింగ్లో ఆధార్ అనుసంధానం లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని నేపథ్యంలో పోస్టల్ శాఖ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. కేవలం రూ.200 తో గ్రామ స్థాయిలో వారి ఇంటి వద్దే ఖాతా ప్రారంభిస్తుంది. బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆధునిక కాలంలో రూపాయి నుంచి ఎంత పెద్ద మొత్తమైనా డిజిటల్ లావాదేవీలే సాగుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రతి రూపాయి లబ్ధిదారు ఖాతాలో జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఏదైనా తేడా జరిగినా తప్పు ఎక్కడ జరిగిందనేది సులభంగా తెలుసుకునే వీలుంటుంది. ఉదాహరణకు తల్లికి వందనం వంటి పథకాలు చాలా మందికి చేరలేదు. వీటిలో ఖాతా వినియోగంలో లేదంటూ సగటున ప్రతి సచివాలయానికి వంద నుంచి 150 వరకూ ఫిర్యాదులు వచ్చాయి. ఈ–కేవైసీ లేకపోవడం వల్ల జిల్లాలో దాదాపు రూ.2 కోట్లకు పైగా లబ్ధిదారుల ఖాతాకు చేరలేదు. దీంతో వారంతా సచివాలయాల చూట్టు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోవడంతో ఖాతాలు యాక్టివ్గా లేవని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నివేదికలో ఉంది. గత ఏడాది నవంబర్లో 2,74,488 ఖాతాలు యాక్టివ్గా లేవని సచివాలయాల వారీగా విభజించి ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో లబ్ధిదారుల ఖాతాలను ప్రదర్శించారు. దీంతో పోస్టల్, బ్యాంకింగ్ రంగాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టగా దాదాపు లక్ష ఖాతాల వరకూ మాత్రమే యాక్టివేట్ చేసుకున్నారు. దీని ప్రకారం ఖాతాదారులందరూ వెళ్లి ఈకేవైసీ పూర్తి చేసుకునేలా ఆయా సచివాలయాల పరిధిలో సిబ్బంది ప్రోత్సహించాల్సి ఉంది. ఖాతాలు లేకపోతే జాతీయ బ్యాంకుల్లోగాని, తపాలా కార్యాలయాల్లో కానీ పొదుపు ఖాతాలు తెరవాల్సి ఉంది. అనంతరం సచివాలయ సిబ్బందికి ఇచ్చిన యాప్లో ఆయా ఖాతాలను ఎన్పీసీఐ నిబందనల ప్రకారం అప్డేట్ చేస్తారు. ఖాతాలు బతికించాలి ప్రభుత్వం నుంచి మంజురయ్యే ఏ సంక్షేమ పథఽకమైన లబ్ధిదారులకు నేరుగా అందాలంటే బ్యాంక్ ఖాతా బతికి ఉండాలి. కొందరికి రెండుమూడు ఖాతాలు ఉండి వాటిలో వినియోగంలో లేకపోవడం సమస్యలకు దారి తీస్తొంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశాన్ని గుర్తించి అర్హులకు సంక్షేమ పథకాలు చేరవేయడానికి ప్రతి బ్యాంక్ ఖాతాను లైవ్లో ఉంచాలని భావిస్తోంది. వీలైనంత డిజిటల్ లావాదేవీలు జరిగేలా ప్రొత్సహించింది. దీంతో ప్రతిపైసాకు లెక్క ఉంటుందనే ప్రధాన ఉద్దేశం. అలా జరిగినప్పుడే 18 ఏళ్లు నిండిన లబ్ధిదారుల ఖాతాలకు నవశకం బెనిపిషరీ మేనేజ్మెంట్ పోర్టల్లో ప్రభుత్వం విడుదలచేసే సంక్షేమ నిధులు కచ్చితంగా అందుతాయనే భావనతో ప్రభుత్వం ఉంది. నిరర్ధక ఖాతాలు ఎన్నున్నా నిరుపయోగమే జిల్లాలో నిర్జీవంగా ఉన్న ఖాతాలు 1,76,500 అవి పునరుద్ధరిస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన పోస్టల్ శాఖ అధిక ఖాతాలతో ఇబ్బందులు కొందరికి రెండు, మూడు ఖాతాలు ఉండి వాటిలో ఏదో ఒక ఖాతా మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు వినియోగంలో లేని ఖాతా నెంబర్ ఇవ్వడంతో సమస్యగా మారింది. ప్రతి లబ్ధిదారు ఖాతాను సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే మూసేసుకోవాలి. దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. – చందాల శ్రీవెంకట ప్రసాద్, ఎల్డీఏం కాకినాడ జిల్లా ప్రతి తపాలా కార్యాలయం ద్వారా ఐపీపీబీ ఖాతాలు ప్రతి తపాలా కార్యాలయంలో ఐపీపీబీ ఖాతాలు ప్రారంభించి ఆధార్ అనుసంధానం చేస్తున్నాం. కాకినాడ డివిజన్లో ఉన్న కాకినాడ, సామర్లకోట ప్రధాన తపాలా కార్యాలయంతో పాటు 54 ఉప తపాలా కార్యాలయాలు, 283 శాఖలలో సేవలు సద్వినియోగం చేసుకోవాలి. – దాసరి నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జి పోస్టల్ సూపరిండెంట్, కాకినాడ -
నీరుత్సాహంగా ఖరీఫ్
–8లోనిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం మామిడికుదురు: అప్పనపల్లి బాల బాలాజీ స్వామి ఆలయంలోని నిత్యాన్నదానం ట్రస్టుకు రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటగిరికి చెందిన కొంపెల్ల అలివేలు, వారి కుటుంబ సభ్యులు బుధవారం రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఆగుతూ.. ఊగుతూ.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో శానిటరీ మెటీరియల్తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్, పారిశుధ్య పనులు రీ టెండర్ ఖరారు మరింత ఆలస్యం కానుంది.గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కాకినాడ: ముందస్తు సాగుపై ప్రభుత్వం లెక్క తప్పింది. అప్పుడేమో అంతన్నారింతన్నారు.. తీరా అదును దాటిపోతున్నా పాలకులు కన్నెత్తి చూడటం లేదు. ప్రకృతి విపత్తులకు దొరక్కుండా పంట చేతికి రావాలంటే ముందస్తు సాగుకు రైతులు సమాయత్తం కావాలంటూ కూటమి సర్కార్ ఊరూవాడా ఊదరగొట్టి చివరకు చేతులెత్తేసింది. కనీసం సమయానుకూలంగా సాగునీరు అందించలేక రైతులను ‘అడకత్తెరలో పోక చెక్క’ను చేసేసింది. జూన్ ఒకటి నుంచి కాలువలకు నీరు విడుదల, జూన్ 15 కల్లా నారుమళ్లు పూర్తిచేసి అదే నెల చివరికి నాట్లు ముగించాలి. అటు గోదావరి, ఇటు ప్రాజెక్టుల నుంచి సాగునీరు విడుదలకు ఇబ్బంది ఉండదని కూటమి పెద్దలు ఘనమైన ప్రకటనలు చేశారు. జిల్లా రైతులు వారి మాటలు నమ్మి తొలకరి సాగుకు సమాయత్తమయ్యారు. తీరా చూస్తే అనుకున్నట్టుగా కాలువలు, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఖరీఫ్ ప్రశ్నార్థకమై రైతులు లబోదిబోమంటున్నారు. అప్పుడే జూలై 16వ తేదీ వచ్చేసింది. కానీ జిల్లాలోని గోదావరి కాలువ కింద, మెట్ట ప్రాంతంలో ప్రాజెక్టుల కింద ఆయకట్టులో కనీసం 10 శాతం నారుమళ్లు కూడా వేయలేకపోయారు. కేవలం బోర్లపై ఆధారపడ్డ రైతులు మాత్రమే అక్కడక్కడా నారుమళ్లు పోసుకుని సాగునీటి కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 2024–25 ఖరీఫ్ సీజన్లో వరి సాధారణ సాగు విస్తీర్ణం 94,594 హెక్టార్లు. ఖరీఫ్ అదును దాటిపోతున్నా ఇంతవరకు కేవలం 12 వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పడ్డాయి. కొన్ని మండలాల్లో సెంటు భూమిలో కూడా నాట్లు పడలేదు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణంలో కనీసం 10 శాతం సాగు కూడా ముందుకు సాగని విషయాన్ని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈస్ట్రన్ డెల్టాలో ఇప్పుడిప్పుడే.. జిల్లాలో ఈస్ట్రన్ డెల్టాతో పాటు గోదావరి కాలువ ద్వారా సాగయ్యే సామర్లకోట, కరప మండలాల్లో సాగునీరు ఇప్పుడిప్పుడే వస్తోంది. పంపా, తాండవ, ఏలేరు, పుష్కర ప్రాజెక్టుల నుంచి ఇప్పటి వరకు నీరు విడుదల కాలేదు. ఏలేరు నుంచి సాగుకు ఇప్పుడు వదిలినా అది చేలలోకి ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ పరిస్థితి. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి నారుమళ్లు వేసి జూన్ నెలాఖరుకు నాట్లు పూర్తవ్వాల్సి ఉంది. ఇదే విషయాన్ని అధికారులు ప్రచారం చేశారు. ఈ సమయంలో నారు వేసి నాట్లు వేస్తేనే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వచ్చే ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా ఉంటుందని అధికారులు చెబుతూ వచ్చారు. జూలై 16వ తేదీ వచ్చినా జిల్లాలో 10 శాతం నాట్లు కూడా పడలేదు. ఈ క్రమంలో నారు వేసే పనులు ఈ నెలాఖరుకు గాని పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఖరీఫ్ సాగు 45 రోజులు ఆలస్యం కాగా మరింత జాప్యం జరిగితే ఆశలు వదిలేసుకోవాల్సిందేనంటున్నారు. వాస్తవానికి జూన్ నాటికి ఏలేరు జలాలు విడుదల చేయాల్సి వుంది. జూలై మొదటి వారం అయినా సాగునీరు విడుదల కాలేదు. ఏలేరు నుంచి విడుదల చేశామంటున్నా.. ఏలేరు ప్రాజెక్టు నుంచి 1600 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేసినట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏలేరు రిజర్వాయర్. ఈ ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని జగ్గంపేట, ఏలేశ్వరం, కిర్లంపూడి, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు సామర్లకోట, కాకినాడ రూరల్ మండలాల పరిధిలో సుమారు 56 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి 150 క్యూసెక్కులు విశాఖ స్టీల్ ప్లాంట్కు పోను 50 క్యూసెక్కులు తిమ్మరాజు చెరువుకు, మిగిలిన 1400 క్యుసెక్కులు నాలుగు నియోజకవర్గాలు దాటి పిఠాపురం రావాల్సి ఉంది. ఈ నియోజకవర్గంలో సాగుచేస్తున్న 16,943 హెక్టార్లకు సుమారు 159 హెక్టార్లలో వరి నారుమళ్లు అవసరం. కానీ ఇప్పటి వరకూ ఎక్కడా 10 శాతం మించి నారుపోసిన దాఖలాలు లేవు. కాగా, జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 25 వేల హెక్టార్లలో వరి సాగవుతోంది. మెట్టలో రైతులు ఎక్కువగా చెరువులు, బోర్లపై ఆధారపడి వ్యవసాయం సాగిస్తుంటారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువులు నీటితో నిండటంతో రైతులు ఖరీఫ్ పనులు ముమ్మరంగా చేపట్టారు. గోకవరం మండలంలో ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా సుమారు పది వేల హెక్టార్లు సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిర్లంపూడి మండలంలో ఏలేరు కాలువ పరిధిలో సుమారు పది వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీరందక ఖరీఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జూలై నెలలో 60 శాతం ఊడ్పులు పూర్తి కాగా, ఈ సీజన్లో 20 శాతానికి మించి కాలేదు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 27 వేల ఎకరాలకు సాగు నీరందాలి. ఈ సీజన్లో ఇప్పటికీ సాగునీరు విడుదల కాలేదు. సిమెంటు పైపుల స్థానంలో నూతనంగా ఐరన్ పైపులు నిర్మించడంతో పాటు ఇతర మరమ్మతులకు రూ.55 కోట్లకు ప్రతిపాదించగా ప్రభుత్వం మొండిచేయి చూపించడంతో పుష్కర నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. బొర్రంపాలెం ఎత్తిపోతల పథకంలో ఆయకట్టుకు కూడా చుక్కనీరు విడుదల కాక రైతులు లబోదిబోమంటున్నారు. సక్రమంగా అందని గోదారి నీరు కాకినాడ రూరల్లో ఖరీఫ్ సీజన్లో సుమారు 4200 ఎకరాలలో వరి సాగు చేస్తుంటారు. చీడిగ, కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి, తూరంగి గ్రామాల ఆయకట్టుకు గోదావరి జలాలు, తిమ్మాపురం, సర్పవరం, పండూరు, పి.తిమ్మాపురం, నేమాం, తమ్మవరం, పెనుమర్తి తదితర గ్రామాల ఆయకట్టుకు ఏలేరు ఆధారంగా సాగవుతుంది. గోదావరి జలాలు విడుదల చేసినా సక్రమంగా అందడం లేదు. ఏలేరు నుంచి ఆలస్యంగా ఈనెల 7న నీరు విడుదల చేయగా కాకినాడ రూరల్ మండలంలోని ఆయకట్టు శివారుగా ఉండడంతో ఇప్పటికీ సాగునీరు సక్రమంగా అందడం లేదు. తిమ్మాపురం, పండూరు తదితర గ్రామాలలో నారుమళ్లు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వర్షాలు లేక వెదజల్లు పద్ధతిలో సాగు చేపట్టేందుకు ఎదురు చూస్తున్న రైతులు నిరాశగా ఉన్నారు. తూతూ మంత్రంగా క్లోజర్ పనులు జిల్లాలో క్లోజర్ పనులు ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో మొదలు పెట్టడంతో తూతూ మంత్రంగా చేసేసి అయ్యిందనిపించడానికేనని రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. క్లోజర్ పనులు జరుతున్నందున జూన్ నెలాఖరు నాటికి నీరు విడుదల చేస్తామని అధికారుల ప్రకటనలు గాలిలో కలిసిపోయాయి. ఖరీఫ్ దమ్ములు జరగాలంటే పూర్తి స్థాయిలో ఏలేరు రావల్సిందేనని రైతులు చెబుతున్నారు. పిఠాపురం, తుని, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో వరి పొలాల పరిస్థితి ఒకే విధంగా వుంది. ముందస్తు ఖరీఫ్ సాగు చేపడితే వరదల నుంచి తప్పించకునే అవకాశం ఉంటుందని బావించినా ప్రస్తుతం ఆలస్యం కావడంతో ఈ ఏడాది పంటలకు ముప్పు తప్పదంటున్నారు. ఏలేరు ఆయకట్టుకు అక్టోబర్ నెలలో వరద బెడద అధికం. మూడేళ్లుగా రైతులు వరదలతో నష్టపోతూనే వున్నారు. పంటల రక్షణకు జూన్లో వరి సాగు ప్రారంభించి నవంబరు, డిసెంబరు నాటికి వరికోతలు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం ముందస్తు ప్రణాళిక లేక సాగునీటి జాప్యంతో జిల్లాలో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేదా జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరికీ తమ గోడు పట్టడం లేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేస్తున్నారు. 2024–25 ఖరీఫ్ సీజన్లో సాగు విస్తీర్ణం, నాట్లు వేసిన ఆయకట్టు వివరాలు (హెక్టార్లలో) మండలం విస్తీర్ణం నాట్లు కోటనందూరు 4110 0 తుని 3276 265 రౌతులపూడి 2446 220 శంఖవరం 1253 11 ఏలేశ్వరం 2669 0 జగ్గంపేట 4086 77 కిర్లంపూడి 5144 100 ప్రత్తిపాడు 4540 120 తొండంగి 5274 39 గొల్లప్రోలు 5372 816 పెద్దాపురం 4537 313 గండేపల్లి 3908 967 సామర్లకోట 9215 2738 పిఠాపురం 8000 38.71 యు.కొత్తపల్లి 4486 26 కాకినాడ రూరల్ 1780 80 కాకినాడ అర్బన్ 167 14 పెదపూడి 7361 760 కరప 5868 2060 కాజులూరు 7570 2758 తాళ్లరేవు 3532 606 మొత్తం 94594 12008.71 లెక్క తప్పిన అధికారులు నీరందక అన్నదాత లబోదిబో వరదలకు చిక్కుకోకూడదంటూ మొదట్లోనే ముంచేసిన వైనం జూలై 16 నాటికి జిల్లాలో కనీసం 10 శాతం నాట్లు కూడా పడని వైనం రైతుల గోడు పట్టని మంత్రులు దిక్కులు చూస్తున్న అన్నదాతలు నారుమళ్లు ఎండిపోతున్నాయి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ముందుగానే సాగుకు సిద్ధం కావాలని అధికారులు చెప్పారు. వారి మాటలతో ఈ సారి ముందస్తు సాగు చేసేద్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ దుక్కులు దున్నుకోవడానికి సరైన వర్షాలు కూడా పడలేదు. వేలాది రూపాయలు వెచ్చించి వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. సాగునీరు ఎప్పుడు విడుదల చేసినా ముందుగానే నారుమళ్లు వేసుకునే వాళ్లం. కానీ ఈ సారి నారుమళ్లకు నీటి విడుదల లేకపోవడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయే వాతావరణం కనిపిస్తోంది. – గంటా కొండబాబు, కాకరాపల్లి, కోటనందూరు మండలం నీరు లేక సాగని పనులు గతంలో ఎన్నడూ ఇలా లేదు. సాగునీరు అందకపోవడంతో ఖరీఫ్లో నారుమడులు కూడా వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కనీసం ఇంజిన్లతో నీరు తోడుకుందామంటే నీరు అందడంలేదు. నీళ్లు వదిలామని అధికారులు చెబుతున్నప్పటికీ కాలువల్లో నీరు కనిపించడంలేదు. నారుమడులకు నీటి ఎద్దడి ఇలా ఉంటే, రేపు నాట్లు పడితే ఎలా ఉంటుందో తెలియడంలేదు. – లోకారెడ్డి అప్పన్నదొర, చేబ్రోలు శివారు లక్ష్మీపురం, గొల్లప్రోలు మండలం -
శాకంబరిగా మరిడమ్మ
పెద్దాపురం : మరిడమ్మ అమ్మవారు మంగళవారం శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక దర్గాసెంటర్ లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం సహకారంతో మరిడమ్మ అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లతో పండితులు అలంకరించగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. పెద్దాపురం సీఐ విజయశంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక బందోబస్తు కల్పించారు. అనంతరం వీధి సంబరాల్లో భాగంగా కుమ్మరవీధి సంబరాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మి, ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. -
యువతకు ఆసరా.. ఉపాధికి భరోసా
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) అంటే ముందుగా గుర్తుకువచ్చేది సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం. ఏపీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సేవలో కాకుండా నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్కు బాటలు వేస్తుంది. ఆసక్తి గలవారికి హెవీ వెహికల్ డ్రైవింగ్లో శిక్షణ ఇస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. 2020వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ యువత భవిష్యత్కు భరోసా కల్పించేందుకు వీటిని ప్రారంభించారు. వాహన చట్టాలపై అవగాహన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆర్టీసీ హెవీ వెహికల్లో డ్రైవింగ్ పాఠశాలలు ప్రారంభించింది. అందులో భాగంగా కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ కార్యాలయం ఏర్పాటు చేసి యువతీ యువకులను బ్యాచ్లుగా ఏర్పాటు చేసి డ్రైవింగ్లో శిక్షణ, వాహన చట్టాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు నిర్ణయించారు. శిక్షణ పూర్తి చేసేవారికి సర్టిఫికెట్తో పాటు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించి వారి జీవితానికి భరోసా కల్పిస్తున్నారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న అభ్యర్థులు భవిష్యత్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో డ్రైవర్లుగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగాల్లో అయితే ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకూ 19 బ్యాచ్లలో 305 మంది శిక్షణ పొందారు. నిరుద్యోగ యువతకు భవిష్యత్ కల్పించడం, డ్రైవింగ్లో మెళకువలు నేర్పించడం ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నిరుద్యోగులకు అండగా ఏపీఎస్ ఆర్టీసీ ఐదేళ్ల కాలంలో 305 మందికి తర్ఫీదు సుశిక్షితులైన నిపుణులతో నిర్వహణ 21 బ్యాచ్కు దరఖాస్తుల ఆహ్వానం సుశిక్షితులైన నిపుణులతో డ్రైవింగ్ శిక్షణ హెవీ వెహికల్ డ్రైవింగ్లో అభ్యర్థులకు సుశిక్షితులైన నిపుణులతో శిక్షణ అందిస్తున్నాం. రాత్రివేళ్లలో డ్రైవింగ్ నేర్పిస్తాం. సమయ పాలన ,క్రమశిక్షణ, అంకితభావంతో డ్రైవింగ్లో మెళుకువలు నేర్పుతూ రోజూ తరగతి గదిలో పాఠాలతో పాటు గ్యారేజీలో ఇంజిన్ భాగాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఘాట్రోడ్డు ఎత్తు, పల్లం వంటి ప్రాంతాలలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తున్నాం. ప్రస్తుతం 21వ బ్యాచ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. – కే.డీ.ఎం.రాజు డ్రైవింగ్ స్కూల్ ఇన్స్పెక్టర్ హెవీ లైసెన్స్కు శిక్షణ జేఎన్టీయూకేలో బీటెక్ ఇంజినీరింగ్ అభ్యసిస్తున్నాను. భవిష్యత్లో కొన్ని ఉద్యోగాలకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అడిగే అవకాఽశం ఉంది. శిక్షణతో పాటు లైసెన్స్, డ్రైవింగ్కు సంబంధించి అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. – ఎం.జోష్, కాకినాడ డ్రైవింగ్పై అవగాహన వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు సంబంధించి డిఫెన్స్ వంటి వాటికి హెవీ లైసెన్స్ తప్పనిసరిగా అడుగుతున్నారు. డ్రైవింగ్తో పాటు లైసెన్స్ జారీకు ఆర్టీసీ అందిస్తున్న సేవలు వినియోగించుకున్నాను. ఇటువంటి వాటి ద్వారా నేర్చుకుంటే అవగాహన పూర్తిగా వస్తుంది. – పి.బాలురెడ్డి, పీఆర్ డిగ్రీ కళాశాల -
3న జాతీయ చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ఇండిపెండెన్స్ చదరంగం టోర్నమెంట్ను కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఆగస్టు 3న నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ విత్తనాల హైమావతి తెలిపారు. మంగళవారం టోర్నమెంట్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ లోరియల్ హై గ్లోబల్ స్కూల్ ఆధ్వర్యంలో రూ.1,23,456 నగదు బహుమతితో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి సుమారు 400 మంది వరకు చదరంగ క్రీడాకారులు హాజరవుతారన్నారు. విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలను అందజేస్తామన్నారు. స్కూల్ డైరెక్టర్ సుంకర రవికుమార్, ప్రిన్సిపాల్ ఏక్తా, టోర్నమెంట్ డైరెక్టర్ హైమావతి, చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాలకుమార్ పాల్గొన్నారు. -
వరుస పురస్కారాలపై హర్షం
కాకినాడ సిటీ: రెడ్క్రాస్ జిల్లా శాఖ మరొకసారి పురస్కారాలు పొందడం మనకు గర్వకారణమని రెడ్క్రాస్ జిల్లా శాఖ అధ్యక్షుడు, కలెక్టర్ షణ్మోహన్ సగిలి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రెడ్క్రాస్ శాఖ అధ్యక్షుడు, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయిలో 2021–22 నుంచి 2023–24 సంవత్సరం వరకు వరుసగా మూడు సంవత్సరాలు అత్యుత్తమ జిల్లా శాఖగా కాకినాడ జిల్లా మొదటి స్థానాన్ని గెలుచుకోగా పురస్కారాలను సంస్థ చైర్మన్ వైడీ రామారావు, కోశాధికారి ఎన్వీవీఆర్కె ప్రసాద్బాబు, కార్యదర్శి కె శివకుమార్ మంగళవారం కలెక్టర్కు అందజేసిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉత్తమ జిల్లా శాఖ అవార్డులు ఏర్పాటు చేసినప్పటి నుంచి వరుసగా ఏడుసార్లు మన జిల్లా శాఖ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. చైర్మన్ వైడీ రామారావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని నూతన సేవా కార్యక్రమాల ద్వారా రెడ్క్రాస్ ప్రతిష్టను ఇనుమడింప చేయడానికి కృషి చేస్తామన్నారు. ఇటీవల రెడ్క్రాస్కు సేవలు అందించి గవర్నర్ ద్వారా పురస్కారాలు అందుకున్న ఓఎన్జీసీ, కేఎస్పీఎల్ ప్రతినిధులకు, సాయిరామ ప్రోజెన్ ఫుడ్స్ అధినేత ఎల్ సత్యనారాయణ, ఫిలిం డైరెక్టర్ బి సుకుమార్లకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణకు రక్షణ గోడ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): ఉప్పాడ తీర ప్రాంతం కోత నివారణకు రూ.323 కోట్లతో రక్షణ గోడ నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు దశాబ్దాలుగా యేటా సగటున 1.23 మీటర్లు మేర కోతకు గురవుతుండగా, ఒక్క 2017–18 ఏడాదిలోనే 26.3 మీటర్లు కోతకు గురైందన్నారు. ఇది ఉప్పాడ, నేమాం, అమీనాబాద్, సుబ్బంపేట, కొమరగిరి గ్రామాల మత్స్యకారుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. రక్షణ గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అందజేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ను చైన్నెలోని నేషనల్ సెంటర్ ఫర్ పోస్టల్ రీసెర్చ్కు పంపించగా రూ.323 కోట్లతో టెట్రాపాడ్ల ఆధారంగా శాశ్వత రక్షణ గోడ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిందన్నారు. వీటిని ఆమోదించేందుకు ఈ నెల 30న ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం జరగనుందని ఆయన తెలిపారు. వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా రాంప్రసాద్, ఆనంద్ గోకవరం/పెదపూడి: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులుగా గోకవరానికి చెందిన సీనియర్ నాయకుడు తోలేటి రాంప్రసాద్, అనపర్తి నియోజకవర్గానికి చెందిన పందిరి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా రాంప్రసాద్ భార్య తోలేటి రమ్యశ్రీ గోకవరం ఎంపీటీసీ 1గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరికి పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి అమలాపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆర్థిక బిల్లుతో ఆమోదించిన పెన్షన్ వేలిడేషన్ బిల్లు వెంటనే రద్దు చేయాలి ప్రభుత్వ పెన్షనర్లు అసోసియేషన్ జిల్లా శాఖ అధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. తొలుత పారుపూడి కృష్ణశాస్త్రి ధర్నాను ప్రారంభించారు. దశాబ్దాల పాటు పోరాటాలు చేసి పెన్షనర్స్ సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాయడం అమానుషమని, దీనిపై అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి, గుంటూరు సంయుక్తంగా పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు విధి లేని పరిస్థితులలో పోరుబాటను ఎంచుకోవలసి వచ్చిందని జిల్లా ప్రధాన కార్యదర్శి కేకేవీ నాయుడు అన్నారు. ఈ సవరణ అమలులోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా నష్టపోయే అవకాశం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్సీ, పెన్షనర్ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగ, పెన్షనర్లకు కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. -
జీజీహెచ్కు వైద్య పరికరాల అందజేత
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్కు ఓఎన్జీసీ, యూనివర్సిటీ ఆఫ్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమిని ఎడిబుల్ ఆయిల్ సంస్థలు సంయుక్తంగా రూ.78.77 విలువైన వైద్య పరికరాలను అందించాయి. ఈ యంత్ర పరికరాలతో పాటు న్యూరో ఓపీ షెడ్ను మంగళవారం కలెక్టర్ షణ్మోహన్, శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీతో కలిసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఈ సంస్థల వితరణతో ట్రామాకేర్ బ్లాక్, న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు చెందిన వైద్య పరికరాలు సమకూరాయన్నారు. అనంతరం ఆర్థోపెడిక్ ఓపీ బ్లాక్ సమీపంలో ప్రివెంటివ్ ఆంకాలజీ షెడ్ను ప్రారంభించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, రంగరాయ వైద్య కళాశాల డాక్టర్ విష్ణువర్దన్, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసన్, ఓఎన్జీసీ జీఎంహెచ్ఆర్ కె.సునీల్ కుమార్, సీపీవో త్రినాథ్, ఏపిఎంఎస్ఐజీసీ ఈఈ సీహెచ్.రత్నరాజు పాల్గొన్నారు. -
పిఠాపురం ఉద్యో‘గాల్లో’ ఎందుకుంచారు?
పిఠాపురం: ఎంతైనా ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ నియోజకవర్గం కదా దానికి ఒక ప్రత్యేకత ఉండాలనుకున్నారో ఏమో చిరుద్యోగులను గాల్లో తిప్పుతున్నారు ఉన్నతోద్యోగులు. ఇతర ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన వారిని ఇక్కడి అధికారులు జాయిన్ చేసుకోపోవడంతో గత 28 రోజులుగా గాల్లో ఉండిపోవాల్సి వచ్చిందంటూ వాపోతున్నారు ఉద్యోగులు. ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లే వారిని రిలీవ్ చేయకపోవడంతో బదిలీలు అయిన వారు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటికే తాము పనిచేస్తున్న చోట రిలీవ్ అయిన ఉద్యోగులను ప్రస్తుతం ఇక్కడ జాయిన్ చేసుకోకపోవడంతో గాలిలో ఉన్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఆర్డీ నుంచి బదిలీ ఉత్తర్వులతో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలకు జూనియర్ అసిస్టెంట్లు తుని, సామర్లకోట మున్సిపాలిటీల నుంచి బదిలీపై వచ్చిన సిబ్బంది ఉత్తర్వులతో మున్సిపల్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప జాయినింగ్కు మాత్రం అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిగా తయారయిన చిరుద్యోగుల పరిస్థితిపై సాక్షి దినపత్రికలో జూన్ 12వ తేదీన ‘‘మీదిక్కున్నచో చెప్పుకోండి,’’ జూన్ 24న ‘‘పిఠాపురం ఉద్యోగాల్లో’’ అనే శీర్షికన రెండు కథనాలు వెలువడగా కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. పిఠాపురం, గొల్లప్రోలు నగర పంచాయతీలలో ఐదేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులు ఉండగా వారిని ఎందుకు బదిలీ చేయలేదంటూ కమిషనర్ను ప్రశ్నించింది. ఇతర ప్రాంతాల నుంచి బదిలీలపై వచ్చిన అధికారులను ఎందుకు జాయిన్ చేసుకోకుండా నెల రోజుల నుంచి కనీసం జీతాలు కూడా లేకుండా తిప్పుతున్నారంటూ ప్రశ్నించింది. బదిలీ ఉత్తర్వులను అమలు చేయాలంటూ మున్సిపల్ ఆర్డీ పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదంటూ ప్రశ్నించింది. నిబంధనలు పాటించని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ మంగళవారం కమిషనర్ కనకారావుకు మెమో జారీ చేసినట్లు మున్సిపల్ఽ అధికారిక వర్గాలు తెలిపాయి. పిఠాపురం మున్సిపల్ కమిషనర్కు మెమో జారీ చేసిన సీడీఎంఏ -
మెట్ట జలగలతో జాగ్రత్త
ఉద్యాన శాఖాధికారి సోమరాజశేఖర్పిఠాపురం: మెట్ట జలగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ప్రారంభ దశలోనే నివారణకు చర్యలు తీసుకోవాలని పిఠాపురం ఉద్యాన శాఖాధికారి వై.సోమరాజశేఖర్ రైతులకు సూచించారు. ఆయన మంగళవారం గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పర్యటించి మెట్ట జలగలు సోకిన పంటలను పరిశీలించారు. ఇటీవల గొల్లప్రోలు మండలంలో వివిధ పంటలకు మెట్ట జలగలు సోకి తీవ్ర నష్టాలను కలిగించిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ‘జల గండం’ శీర్షికన వెలువడిన కథనానికి ఉద్యాన శాఖాధికారులు స్పందించారు. ఆయన మాట్లాడుతూ వాణిజ్య పంటల్లో మెట్ట జలగలను గమనించామన్నారు. ఎక్కువగా మిరప, బొప్పాయి వంటి తోటల్లో కనిపించాయని, వీటిని తొలి దశలోనే నివారించక పోతే ఎక్కువ మొత్తంలో పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. పొలంలో తడి తగ్గించడమే కాక సాయంత్రం నీరు పెట్ట కూడదన్నారు. మిరప తోటలో కలుపు, వాడిన ఆకులు పూర్తిగా తొలగించుకోవాలన్నారు. మెట్ట జలగలకు ఆశ్రయం కలిగించే చెట్లను తొలగించాలని, రాళ్లు, చెత్త లేకుండా చూసుకుంటూ పొదల కింద వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. మెటాల్డిహైడ్ బైట్ 2.5 శాతం,1 నుంచి 2 కిలోలు ఎకరాకు ఇసుకలో కలిపి వేసుకోవాలన్నారు. ఐరన్ ఫాస్ఫేట్ బైట్ 2 నుంచి 4 కిలోలు ఎకరాకు సాయంత్రం వేళ పొలం చుట్టూ లేదా మిరప రద్దెల మధ్య చల్లుకోవాలన్నారు. దీనిని వర్షం వచ్చి పోయిన తర్వాత మళ్లీ వేయడం అవసరమన్నారు. పొగాకు పొడిని చేను అంతటా తడిగా ఉన్నప్పుడు చుట్టూ చల్లు కోవడం ద్వారా వీటిని నియంత్రివచ్చని తెలిపారు. వర్షం వచ్చి పోయిన తరువాత పొలం పరిశీలించడం ద్వారా వీటి ఉనికిని గమనించవచ్చన్నారు. పొలాల్లో మెట్ట జలగలు, నత్తలు కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రం ద్వారా ఉద్యాన శాఖ సిబ్బందికి తెలియజేస్తే వారు నివారణ చర్యలు సూచిస్తారన్నారు. -
తమ్ముళ్ల స్వరకల్పనలో వేలంపాట!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి నేతలు అన్నంత పనీ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో బరితెగించి మరీ శ్రీ సంస్థానం భూములను దోచి పెడుతున్నారు. వేలం అనే ముసుగువేసి తాంబూలం ఇచ్చిన వారికే భూములపై హక్కులు కల్పిస్తున్నారు. చేయి తడపని వారికి మొండిచేయి చూపిస్తున్నారు. టీడీపీ ముఖ్యనేతల ఆదేశాలు తు.చ. తప్పకుండా దేవదాయశాఖ అధికారులు అమలు చేస్తున్నారు. భూముల వేలాన్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. పేద విద్యార్థుల ఆకలి దప్పులు తీర్చాలన్న ఆశయంతో పిఠాపురం మహారాజా దానం చేసిన శ్రీ సంస్థానం భూములపై గద్దల్లా వాలిపోయి అడ్డగోలుగా అయినకాడికి దోచుకోవాలనుకుంటోన్న కూటమి నేతల కుట్రకోణమిది. రెండో రోజూ కొనసాగిన తంతు పిఠాపురం కేంద్రంగా ఉన్న శ్రీ సంస్థానంకు తొండంగి మండలంలో 511 ఎకరాలు భూమి ఉంది. సుమారు 29 ఎకరాల మేర పుంతలు, గట్లు ఉన్నాయి. మిగిలిన 478.46 ఎకరాలకు మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహిస్తుంటారు. ఆ గడువు కాస్తా ఇటీవల ముగిసినప్పటికీ టీడీపీ పెద్దల ఆదేశాలతో వేలం నిర్వహించకుండా దేవదాయశాఖ అధికారులు వాయిదాలపై వాయిదాలు వేసిన వైనాన్ని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిిస్థితుల్లో దేవదాయశాఖ స్పందించి తాజాగా ఈ నెల తొమ్మిదిన వేలం నిర్వహణ ప్రకటన విడుదల చేసింది. నాలుగు రోజుల పాటు వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవారం తొండంగి రామలింగేశ్వరాలయంలో శ్రీసంస్ధానం ఈవో నున్న శ్రీరాములు సమక్షంలో మొదలైన వేలం ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. మరో రెండు రోజులు వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలోనే దేవదాయశాఖ అధికారులు నిస్సిగ్గుగా సంస్థానం భూముల కౌలు వేలం నిర్వహిస్తున్న తీరుపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కూడా ఒక మొక్కుబడి తంతుగానే జరుగుతుండటంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పక్కదారి పట్టిస్తున్న అధికారులు 478.46 ఎకరాలను 175 బిట్లుగా విభజించి రోజుకు 30బిట్లు చొప్పున వేలం వేస్తున్నట్టు ప్రకటించారు. ప్రతి బిట్టులో అరెకరం నుంచి 10 ఎకరాల వరకూ ఉన్నాయి. మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తున్నట్టు పైకి చెబుతున్నారు. దేవదాయ ధర్మాదాయశాఖ కౌలు నిబంధనల ప్రకారం ప్రథమ ధరావత్తుగా ఎకరాకు రూ.3,000 చొప్పున చెల్లించడంతోపాటు రెండేళ్ల శిస్తుకు సరిపడా సాల్వెన్సీ ఽహామీ ధ్రువపత్రాలు సమర్పించాలి. వేలం ఖరారైతే ప్రఽథమ ధరావత్తుతోపాటు ఒక ఏడాది కౌలు శిస్తు ముందుగా చెల్లించాలని నిబంధనల్లో నిర్దేశించారు. ఇవేమీ తమకు వర్తించవన్నట్టు కూటమి నేతలు, ఇందుకు తలాడిస్తూ దేవదాయశాఖ అధికారులు సంస్థానం భూముల వేలాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. గడచిన రెండు రోజులుగా జరుగుతోన్న వేలం ప్రక్రియను చూసి అక్కడి కౌలు రైతులే విస్తుపోతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. కూటమి నేతల బేరసారాలతో వేలం ప్రక్రియను మొక్కుబడి తంతుగా మార్చేశారంటున్నారు. తాంబూలం ఇచ్చే ఒప్పందానికి ముందుకు వచ్చిన వారికి పాత వేలం సొమ్ముపై నామమాత్రంగా పెంపు చూపించి కట్టబెట్టేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాంబూలానికి సై అంటే గనక ఆ బిట్లు వేలంలో మరెవరూ పోటీకి రాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలుగు తమ్ముళ్లు చక్రం తిప్పుతున్నారు. గత రెండు రోజుల్లో 124 ఎకరాలకు వేలం నిర్వహిస్తే కేవలం రూ.51 వేలు అదనపు ఆదాయంగా వచ్చినట్టు చెబుతున్నారంటే కూటమి నేతల పాత్ర ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతంత మాత్రంగా పెరిగిన ఆదాయం వరి ఎకరాకు కౌలు వేలం ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.12 వేలు ఉంటుంది. దేవదాయ శాఖాధికారులు సోమవారం నిర్వహించిన వేలంలో 30 బిట్లుగా విభజించిన 61.90 ఎకరాలకు రూ.5.94 లక్షల ఆదాయం వచ్చింది. గతంలో ఇవే భూములకు వేలంలో రూ.5,79,300 వచ్చింది. ఈ లెక్కన మూడేళ్ల క్రితం నిర్వహించిన వేలంతో పోలిస్తే అదనంగా రానున్న ఆదాయం కేవలం రూ.15 వేలు కావడం గమనార్హం. మంగళవారం నిర్వహించిన కౌలు వేలంలో మరో 30 బిట్లుగా ఉన్న 63.21 ఎకరాలకు రూ.6.02 లక్షలు ఆదాయం వస్తుందని నిర్ధారించారు. ఈ భూములకు గతంలో రూ.5,66,200 ఆదాయం వచ్చింది. ఈసారి వేలంలో కేవలం రూ.36 వేలు మాత్రమే పెరగడం గమనించదగ్గ విషయం. రెండురోజులుగా నిర్వహిస్తోన్న వేలంలో గతంలో కంటే ఆదాయం రూ.51 వేలు మాత్రమే పెరిగిందంటే వేలం ప్రక్రియలో పారదర్శకత ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. వాస్తవంగా చూస్తే ఎకరాకు రూ.1,000 పెరిగినా 124 ఎకరాలకు రూ.1.50 లక్షల వరకూ ఆదాయం రావాలి అని లెక్కలు కడుతున్నారు. కౌలు రైతుల పొట్ట కొడుతున్న కూటమి నేతలు కూటమి నేతల అభీష్టానికి భిన్నంగా బహిరంగ వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చిన వారిని పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సత్రం భూముల మీద పడి జేబులు నింపుకునే ఎత్తుగడతోనే ఇంత కాలం వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చిన కూటమి నేతలు చివరకు రూ.లక్షలు దిగమింగి దొడ్డిదారిన భూములు కట్టబెట్టే కుయుక్తులు పన్నుతున్నారు. ఫలితంగా నిజంగా సాగు చేసుకునే కౌలురైతుల పొట్టకొడుతున్నారని మండిపడుతున్నారు. ప్రొటోకాల్ లేని కూటమి ద్వితీయశ్రేణి నేతలు వేలం నిర్వహిస్తోన్న వేదికను పంచుకోవడంతో రైతులు విస్తుపోతున్నారు. చంద్రబాబు తరువాత టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఇలాకాలోనే శ్రీ సంస్థానం భూముల వేలంలో జరుగుతున్న అక్రమాలతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. శ్రీ సంస్థానంలో భూ‘మాయ’ ప్రహసనంగా వేలం తంతు ముట్టచెప్పిన వారికే హక్కులు 124 ఎకరాలకు పెరిగింది రూ.51 వేలే! -
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
పెద్దాపురం: స్మార్ట్ మీటర్లను, విద్యుత్ సర్దుబాటు చార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. దీనిలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమ పోస్టర్ను సోమవారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఇంటినీ దోచుకునేలా అదానీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ, స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ కరెంటు బిల్లు వచ్చిన 15 రోజులు, నెల రోజుల లోపు సొమ్ములు కట్టేవారమని, ఇక నుంచి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్.. ఇప్పుడు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన.. ప్రజల మీద కరెంటు చార్జీలు, స్మార్ట్ మీ టర్ల రూపంలో దాడి చేస్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతంలోనూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న పాల్గొన్నారు. -
జనసేన నాయకుడి ఇసుక దందా
పెరవలి: కూటమి నాయకుల ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా జనసేన గ్రామ అధ్యక్షుడు అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన జనసేన గ్రామ అధ్యక్షుడు మేడిచెర్ల భాస్కర శివ కుమార్ అదే గ్రామంలో అక్రమంగా 700 టన్నుల ఇసుకను నిల్వ చేశాడు. దీంతో గ్రామస్తులందరూ సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు దాడి చేసి ఆ ఇసుక గుట్టను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్పై కేసు నమోదు చేయాలో లేక జరిమానా విధించాలో కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక నిల్వలపై తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. దాడిలో జిల్లా మైనింగ్ అధికారి శైలజ, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి మామిడికుదురు: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అన్నంనీడి మహాలక్ష్మి (101) సోమవారం మృతి చెందారు. ఆమె 1924 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. తొమ్మిది మంది మనవలు, మనవరాళ్లు, 16 మంది ముది మనవలు ఉన్నారు. ఆమె మరణించే వరకు తన పనులు తానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. 25 ఏళ్ల నుంచి ఒంటి పూట భోజనం చేస్తున్నారన్నారు. గ్రామంలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. 17న జాబ్మేళా కొత్తపేట: స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కేపీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) అండ్ ప్లేస్మెంట్ సెల్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్బీ మోటార్స్, కేపీపీ పేపర్స్, అవంతి ప్రోజెస్ ఫుడ్స్, ఎల్ఐసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఐజాన్ ఎక్స్పీరియన్సెస్, ఫోక్స్కాన్, హుండాయ్ మోబిస్, ఎస్ఎస్ఆర్ ఎల్టీఎల్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, శివానిక్, ఇసుజు మోటార్స్ తదితర సంస్థలు ఈ మేళాకు హాజరై తమ ఆయా కంపెనీల్లో సుమారు 820 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్, పీజీ చదివిన వారందరూ తమ సర్టిఫికెట్లతో జాబ్మేళాకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 81798 24845, 97043 02775, 98497 11253 నంబర్లను సంప్రదించాలి. ● అక్రమంగా 700 టన్నుల నిల్వ ● కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
బంగారం, నగదు చోరీ
తుని: పట్టణంలోని తామాకులవారి వీధిలో గల ఇంటిలో బంగారం, నగదును చోరీ చేశారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై బాధితుడు నక్కా లోకేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లోకేష్, కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పెద్దాపురం మరిడమ్మ తల్లిని దర్శించుకుని రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చారు. కింది పోర్షన్లోకి వెళ్లి మంచినీరు తాగి తాళాలు వేశారు. అనంతరం మేడపైకి వెళ్లి అందరూ నిద్రపోయారు. సోమవారం ఉదయం 6 గంటలకు నిద్ర లేచి కిందికి రాగా తలుపులు తెరచి, తాళాలు పగలుకొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి గమనించగా, బీరువాలోని 100 గ్రాముల బంగారం, రూ.4 వేలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు తుని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పట్టణ విజయ్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాకినాడ నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన గదిని పరిశీలించి, వేలిముద్రలను సేకరించింది. -
రూ.లక్ష విరాళం అందజేత
కాకినాడ సిటీ/కాకినాడ క్రైం: జిల్లా స్పోర్ట్స్ అఽథారిటీ మైదానంలో ఆగస్టులో జరిగే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, మహిళల హాకీ టోర్నమెంట్ల నిర్వహణకు ఏపీఎన్జీవో జిల్లా శాఖ రూ.లక్ష విరాళమిచ్చి ఆదర్శంగా నిలిచింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గత వారంలో వివిధ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ర్యాలీ, క్రీడల ఘన నిర్వహణకు సంఘాల తరఫున చేయూతనందించాలని కోరారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లో జిల్లా ఏపీఎన్జీవో శాఖ రూ.లక్ష మొత్తాన్ని సమకూర్చింది. ఈ మొత్తాన్ని చెక్ రూపంలో సోమవారం ఆ సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుద్దటి రామ్మోహన్, పేపకాయ వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ చేతుల మీదుగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు అందించారు. ఈ మేరకు సంఘ నేతలను జేసీ అభినందించారు. జేసీని కలసిన వారిలో సంఘ జిల్లా సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, సరెళ్ల చంద్రరావు, సంయుక్త కార్యదర్శి శశికుమార్ ఉన్నారు. -
దుప్పట్లు ఉతికేందుకు టెండర్
● విడుదల చేసిన అన్నవరం దేవస్థానం ● ‘సాక్షి’ కథనానికి స్పందన ● ప్రస్తుతం నామినేషన్ విధానంలో నెలకు రూ.60 వేల చెల్లింపు అన్నవరం: స్థానిక వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని సత్రాల గదులలో ఉపయోగించే దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లు, రగ్గులను ఉతికేందుకుగాను దేవస్థానం అధికారులు సోమవారం టెండర్ పిలిచారు. గత మార్చి నుంచి ఇవి ఉతికేందుకు గాను నామినేషన్ మీద నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు ఈ నామినేషన్ మీద కేటాయించారన్న విమర్శ కూడా ఉంది. టెండర్లు పిలిస్తే ఇంకా తక్కువకు వీటిని ఉతుకుతారనే అభిప్రాయం నెలకొంది. గత నెల 23న స్థానిక రజకవృత్తిదారుడు కింతాడ శ్రీనివాసరావు తాము నెలకు రూ.45 వేలకే వాటిని ఉతుకుతామని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ దినపత్రికలో ‘సత్యదేవునికే టెండర్’ శీర్షికన వార్త ప్రచురితమైంది. 21 వరకూ దరఖాస్తులకు గడువు దేవస్థానంలో రెండేళ్లపాటు పారిశుధ్య కాంట్రాక్టు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ సత్రం గదులలో మంచాలపై వేసిన దుప్పట్లు, గలేబులు, డోర్ కర్టెన్లను ఉతికించే పని కూడా నిర్వహించేది. అప్పుడు వాషింగ్ మెషీన్ల ద్వారా శుభ్రం చేసేవారు. ఆ సంస్థ కాంట్రాక్టు పూర్తి కావడంతో గత మార్చి నుంచి నెలకు రూ.60 వేలు చొప్పున చెల్లిస్తూ శుభ్రం చేయిస్తున్నారు. గత నాలుగు నెలలుగా ఈ విధానం కొనసాగుతోంది. పైగా వాటిని ఉతికేందుకు మెటీరియల్ను దేవస్థానమే అందజేస్తోంది. ప్రస్తుతం మనుషులు ఉతుకుతుండడంతో అంతగా శుభ్రంగా ఉండడం లేదని, వాసన వస్తున్నాయన్న ఫిర్యాదులు భక్తుల నుంచి వస్తున్నాయి. దీంతో వాషింగ్ మెషీన్లు టెండరు దారుడే సమకూర్చుకుని ఉతికి ఇచ్చేందుకు టెండర్ పిలిచారు. ఈ నెల 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. -
తిరుమల విద్యార్థులకు అభినందన
రాజమహేంద్రవరం రూరల్: నీట్ 2025 ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి డి.కార్తిక్ రామ్కిరీటిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. జేఈఈ అడ్వాన్స్డ్–2025లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించిన కె.యశ్వంత్ సాత్విక్, ఎస్సీ కేటగిరీలో ఆలిండియా రెండవ ర్యాంకు సాధించిన కె.ప్రణీత్లకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ ఘనతను సాధించిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును మంత్రి లోకేష్ అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలసి ఆయా విద్యార్థులు సోమవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటే చాలెంజ్ అన్నారు. దాన్ని స్వీకరించాలే తప్ప అధైర్యపడకూడదన్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కలల సాధనకు నిరంతరం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. -
బాస్కెట్ బాల్ రన్నర్గా ఏపీఎస్పీ
కాకినాడ రూరల్: రాజమహేంద్రవరం ఎస్కేవీటీ కాలేజీలో ఈ నెల 13న జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జూనియర్ బాస్కెట్ బాల్ చాంపియన్ షిప్ – 2025 రన్నర్గా కాకినాడ ఏపీఎస్పీ జట్టు నిలిచింది. ఈ విషయాన్ని ఏపీఎస్పీ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాజు తెలిపారు. రామచంద్రపురం జట్టుతో పైనల్ మ్యాచ్లో హోరాహోరీగా తలపడిందన్నారు. పోటీలో పాల్గొని ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన సోమవారం అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహేష్, శంకర్, రాజేష్, వెంకటేష్, రాజు పాల్గొన్నారు. -
సీట్ రైట్..
వసతులున్న కాలేజీలకే గుర్తింపు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఆన్లైన్ ద్వారా కళాశాలల ప్రమాణాలు పరిశీలన చేసి అనుమతి ఇవ్వాలని ఉన్నత విద్యామండలి సూచించింది. ఆ మేరకు జేఎన్టీయూ కాకినాడ ఆన్లైన్లో తనిఖీలు నిర్వహించింది. సాంకేతిక విద్యలో ఉన్నత ప్రమాణాలు పాటించడంతో పాటు అన్ని వసతులు ఉన్న వాటికే గుర్తింపు ఇచ్చాం. అటువంటి కళాశాలలో అభ్యసిస్తే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. – డాక్టర్ ఆర్.శ్రీనివాసరావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే ● జేఎన్టీయూకే పరిధిలో సీట్లు ఖరారు ● ఇంజినీరింగ్లో 62 వేల సీట్లకు అనుమతి ● 2025–26లో 106 కళాశాలలకు గుర్తింపు ● ఉన్నత విద్యామండలికి నివేదిక బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్ ప్రవేశాలల్లో వెబ్ ఆప్షన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. జేఎన్టీయూకే పరిధిలో సీట్ల ఖరారు పూర్తయ్యింది. తొలుత ఈ నెల 11వ తేదీని ప్రకటించగా, సీట్లు కొలిక్కి రాకపోవడంతో 13వ తేదీకి మార్చారు. రాష్ట్రంలోని వర్సిటీల నుంచి సీట్ల సంఖ్య నివేదికను ఉన్నత విద్యామండలికి అందిస్తేనే.. అక్కడి నుంచి కౌన్సెలింగ్కు నోటిఫికేషన్ వస్తుంది. రాష్ట్రంలో అత్యధిక కళాశాలలకు అనుబంధంతో పాటు సాంకేతిక వర్సిటీలో కీలకంగా ఉన్న జేఎన్టీయూకే ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వర్సిటీకి గతంలో పాత ఉమ్మడి జిల్లాలు 8 ఉండగా ఈ ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలు తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల కళాశాలలు అనుబంధంగా ఉన్నాయి. బీటెక్లో 62 వేల సీట్ల భర్తీకి అనుమతి 2024–25 విద్యాసంవత్సరానికి కాకినాడ వర్సిటీ పరిధిలో అనుబంధంగా ఉన్న 106 కళాశాలల్లో 62 వేల ఇంజినీరింగ్ సీట్లు భర్తీ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. వీటితో పాటు ఈ ఏడాది కొత్తగా కృష్ణా జిల్లా ఏఎన్ఆర్, ప్రకాశం జిల్లాలో శ్రీహర్షిత కళాశాలకు గుర్తింపు లభించింది. బీటెక్ విభాగంలో గత ఏడాది దాదాపు 30 కళాశాలల వరకూ డిమాండ్ ఉన్న కంప్యూటర్ సైన్స్ కోర్సు కోసం 4 వేల సీట్లకు అనుబంధ కళాశాలలు దరఖాస్తు చేసుకోగా అక్కడి సౌకర్యాలు బట్టి వాటికి అనుమతి ఇచ్చారు. కొత్త కోర్సులైన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో వీఎల్ఎస్ఐ డిజైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కోర్సులకు వెయ్యి సీట్లకు పైగా అనుమతి లభించింది. జేఈఈ అడ్వాన్స్డ్ మెయిన్స్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐఐటీ, ఎన్ఐటీలలో సీటు సాధించలేకపోయిన విద్యార్థులు ఏపీ ఈఏపీ సెట్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. వీరు ప్రైవేట్ వర్సిటీలతో పాటు ఏ గ్రేడ్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ బ్రాంచ్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆన్లైన్లో కళాశాలల తనిఖీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు అనుబంధ కళాశాలల తనిఖీలను ఆన్లైన్లో చేపట్టారు. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, కళాశాల స్థితిగతులు, వసతులు, విద్యార్థి అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్ కళాశాల పరిస్థితి, క్రీడా మైదానం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్ తదితర అంశాలను పరిశీలన చేస్తారు. ఏటా ఇంజినీరింగ్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ముందు నిజనిర్థారణ కమిటీ ఈ పర్యవేక్షణ చేయిస్తుంది. కమిటీ సిఫారసు మేరకు ఏయే కళాశాలలకు ఎన్ని సీట్లు కేటాయించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు. మరో వైపు ఏఐసీటీఈ నుంచి అనుమతి తెచ్చుకున్న ఇంజినీరింగ్ సీట్లలో ఎన్ని సీట్లకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుందనే అంశానికి నిజనిర్థారణ కమిటీ సిఫారసులే కీలకం. ఈ కమిటీలో వర్సిటీ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉంటారు. -
కోట శ్రీనివాసరావుతో ఏరా ఏరా అనుకునే స్నేహం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): కోట శ్రీనివాసరావు మరణం పట్ల నట గాయకుడు శ్రీపాద జిత్మోహన్మిత్రా తీవ్ర సంతాపం తెలిపారు. ‘కోట, నేను కలిసి దగ్గరగా 50 సినిమాలు చేశాం. ప్రాణం ఖరీదు, బాబాయి అబ్బాయి, అలీబాబా అరడజను దొంగలు, ఏవండీ ఆవిడ వచ్చింది, హై హై నాయక, చిన్నబ్బాయి, 420, కత్తి కాంతారావు తదితర చిత్రాలు అందులో ఉన్నాయి. ఏరా ఏరా అనుకునేంత స్నేహం ఉంది. రాజమండ్రిలో నా ఆర్కెస్ట్రా 25వ వార్షికోత్సవానికి కోటశ్రీనివాసరావు హాజరై స్టేజ్పై మిమిక్రీ చేశాడు. చాలా గొప్ప కళాకారుడు, విలక్షణ నటుడు, మంచి వ్యక్తి. ఆయన చనిపోవటం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అని ఆయన పేర్కొన్నారు.అన్నపూర్ణ టాకీస్ను సందర్శించిన ‘కోట’అమలాపురం రూరల్: అప్పట్లో కోట శ్రీనివాసరావు అమలాపురం మండలం సమనసలోని స్టేట్బ్యాంకుకు విచ్చేశారు. ఆయన సినిమాల్లోకి రాకముందు బ్యాంకు ఉద్యోగిగా పనిచేశారు. ఉద్యోగిగా పనిచేస్తున్న సమయంలో అమలాపురం మండలం సమనసలోని స్టేట్ బ్యాంకుకు విచ్చేశారు. అక్కడ బ్యాంకు మేనేజర్ను కలిసిన సందర్భంగా అప్పటి సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావును కలుసుకుని ఆయన నడుపుతున్న అన్నపూర్ణ టాకీస్ను సందర్శించారు. అన్నపూర్ణ టాకీస్ వద్ద కోటను సర్పంచ్ రాజారావు ఆధ్వర్యంలో సత్కరించారు. అప్పట్లో కోట శ్రీనివాసరావు ను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. 1987 లో ఈ ఘటన చోటుచేసుకోగా ఆ సమయంలో అన్నపూర్ణ టాకీస్లో ప్రతిఘటన సినిమా ఆడుతోంది. కోట శ్రీనివాసరావు ఆదివారం మృతి చెందడంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాజీ సర్పంచ్ మామిళ్లపల్లి రాజారావు గుర్తు చేసుకుని ఆయన మృతికి సంతాపం తెలిపారు. భలే ఖైదీలు షూటింగ్లో కోటతో శ్రీరామ వరప్రసాద్ రాంకీ నిరోషా హీరో హీరోయిన్లుగా బీవీఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన భలే ఖైదీలు సినిమా షూటింగ్ 1992లో కాకినాడలో జరిగింది. ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాలను కాకినాడలో చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రైవేట్ బస్సు కండక్టర్గా అమలాపురం మండలం సవరప్పాలెం గ్రామానికి చెందిన సత్తి శ్రీరామవరప్రసాద్ నటించారు. కోట శ్రీనివాసరావు, సత్యనారాయణతో కలిసి నటించిన సన్నివేశాలు ఇప్పటికీ మర్చిపోలేనని శ్రీరామ వర ప్రసాద్ తెలిపారు.‘కోట’కు చిత్ర నీరాజనంకాట్రేనికోన: ప్రముఖ చలన చిత్ర నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కోట శ్రీనివాసరావు శివైక్యం చెందడంతో కాట్రేనికోనకు చెందిన చిత్రకారుడు ఆకొండి అంజి, సినీ నటుడు పెద్దింటి సురేష్ సంతాపం తెలిపారు. ఉభయ తెలుగు రాష్టాలతోపాటు, తమిళ, కన్నడ భాషలలో సమారు 700లకు పైబడి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన కోట శ్రీనివాసరావు మృతి చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అన్నారు. ఆయన మృతికి సంతాపంగా చిత్రకారుడు ఆకొండి అంజి చిత్ర నీరాజనం తెలుపుతూ కోట శ్రీనివాసరావు చిత్రాన్ని గీశారు. -
ఫ శాకంబరీ.. కారుణ్యమూర్తీ..
భక్తవరదాయినిగా ఖ్యాతికెక్కిన తలుపులమ్మ అమ్మవారిని.. ఆషాఢ మాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని శాకంబరి దేవిగా అలంకరించారు. దీనికోసం అమలాపురానికి చెందిన అర్లపల్లి శివ, ఏలూరి అయ్యప్ప ఆరు టన్నుల కూరగాయలు వితరణ చేశారని లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. గర్భాలయంలో స్వయంభువుగా వెలసిన అమ్మవారిని, పంచలోహ విగ్రహాలను కూరగాయలతో అలంకరించి, జీడిపప్పుతో కిరీటం అమర్చామని చెప్పారు. శాకంబరి అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయులయ్యారు. – తుని రూరల్ -
పవన్.. కాకినాడ సెజ్ను మరిచారా?
ఫ పరిశ్రమలు పెట్టండి ఫ లేదా ఆ భూమిని పేదలకివ్వండి ఫ సీపీఐ నేత తాటిపాక మధు కాకినాడ సిటీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ సెజ్పై ఇచ్చిన హామీలు మరిచారా అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం కాకినాడ సెజ్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, లేదంటే ఆ భూములను పేదలకివ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో ఆదివారం జరిగిన సీపీఐ కాకినాడ నగర 23వ మహాసభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, సీనియర్ నాయకుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొన్నమండ రామచంద్రరావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మధు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెజ్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని అంతా ఎదురు చూస్తున్నారన్నారు. కానీ, ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. సెజ్ ఏర్పాటు చేసి 19 ఏళ్లు గడుస్తున్నా పరిశ్రమలు రాకపోగా ఆ భూములన్నీ ఖాళీగానే ఉన్నాయన్నారు. పట్టుమని పదెకరాల్లో కూడా కార్యకలాపాలు కనిపించడం లేదన్నారు. చైనాకు చెందిన పల్స్ప్లష్ అనే సంస్థ బొమ్మల తయారీ యూనిట్ నడుపుతోందన్నారు. మరో మూడు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కొందరు మహిళలకు మాత్రమే వీటిలో ఉపాధి లభిస్తోందన్నారు. కాకినాడ పెట్రో కారిడార్ పేరిట పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా హామీలు కురిపించడం తప్ప పనులు జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. రైతుల నుంచి భూములు తీసుకున్న ఉద్దేశం నెరవేరలేదన్నారు. సెజ్ రైతుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబర్ 4న పిఠాపురం పర్యటన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాకినాడ సెజ్లో పరిశ్రమలు తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు గత ఏడాది జూలై 3న జరిగిన బహిరంగ సభలో సైతం హామీ ఇచ్చారని చెప్పారు. ఇక్కడి ప్రజలు గెలిపించిన తరువాత పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో సైతం పవన్ కల్యాణ్ సెజ్ గురించి ప్రస్తావించారని అన్నారు. కానీ, ఏళ్లు గడుస్తున్నా సెజ్లో పరిశ్రమల జాడ కనిపించడం లేదని, పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎదురు చూస్తున్న యువత ఆశలపై పాలకులు నీళ్లు జల్లుతున్నారని విమర్శించారు. స్మార్ట్ కరెంటు మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని, బిల్లులు పెంచేందుకే వీటిని బిగించేందుకు సిద్ధమవుతున్నారని, వీటి రద్దుకు ఊరంతా ఏకమవ్వాలని, స్మార్ట్ మీటర్లు బద్దలుగొట్టాలని మధు పిలుపునిచ్చారు. పప్పు ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి టి.అన్నవరం, మహిళా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.భవాని తదితరులు కూడా ప్రసంగించారు. -
మరిడమ్మా.. కరుణించమ్మా..
పెద్దాపురం: ఆషాఢ మాస జాతర మహోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం మరిడమ్మ తల్లిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయం వద్ద భారీ క్యూలలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన సిబ్బంది ఏర్పాట్లు చేశారు. డీఎస్పీ శ్రీహరిరాజు ఆదేశాల మేరకు సీఐ విజయ్ శంకర్ పర్యవేక్షణలో ఎస్సై మౌనిక ఆధ్వర్యాన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. చాచా విద్యా నికేతన్ ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు. -
ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులకు పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చింతా ప్రదీప్ కుమార్, బండి నూకరాజు మాట్లాడారు. ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న 3 డీఏలు తక్షణం మంజూరు చేయాలని, 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాలని, పీఆర్సీని నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ శ్రీనివాస్, కన్వీనర్ వాకాడ వెంకట రమణ, కృష్ణకుమార్, మనోహర్, మంగారావు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలకు పాతర బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయులపై పని భారం పెంచి, విద్యా ప్రమాణాలకు కూటమి ప్రభుత్వం పాతర వేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విమర్శించారు. కాకినాడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసి విద్యా రంగానికి తీరని నష్టం చేస్తున్నారని, తరగతి గదిలో ప్రశాంతంగా పాఠం చెప్పే పరిస్థితి నేడు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే గిన్నిస్ బుక్ రికార్డుల కోసం యోగాంధ్ర, మెగా పీటీఎం వంటి కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాల ఆన్లైన్ ఉపాధ్యాయులే చేయాలన్నది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. మొబైల్ ఫ్రీ క్లాస్ రూం విధానాన్ని అమలులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఏలేరు ఆయకట్టుకు నీరు విడుదల ఏలేశ్వరం: ఖరీఫ్ సాగుకు ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆదివారం 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ నుంచి 1,357 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా 77.47 మీటర్లుగా నమోదైంది. పూర్తి స్థాయి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 10.68 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. విశాఖకు 150, తిమ్మరాజు చెరువుకు 50 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. దారులన్నీ తలుపులమ్మ సన్నిధానానికే.. తుని రూరల్: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆషాఢ మాసం మూడో ఆదివారం.. అమ్మవారిని విశేషంగా ఆరు టన్నుల కూరగాయలతో శాకంబరిగా అలంకరించడంతో భక్తులు తండోపతండాలుగా లోవ దేవస్థానానికి తరలివచ్చారు. తీవ్రమైన రద్దీతో 16వ నంబరు జాతీయ రహదారి నుంచి లోవ ఆర్చి గేటు వరకూ పలుమార్లు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాయంత్రం ఆరు గంటలకు కూడా భక్తులు ప్రత్యేక వాహనాల్లో రావడంతో తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పోలీసులు ఎన్ని ఏర్పాట్లు చేసినా మందుబాబుల ఆగడాలు.. వాహనాలు నిలిపివేయడంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోవడంతో కొంతమంది భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించి, కనిపించిన ప్రతి చెట్టుకూ ఉపారాలు సమర్పించారు. లక్ష మంది వరకూ భక్తులు రాగా క్యూలైన్ల ద్వారా ఉదయం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు అమ్మవారిని 50 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.5,51,700, పూజా టికెట్లకు రూ.6,92,720, కేశఖండన శాలకు రూ.62,500, వాహన పూజలకు రూ.3,340, వసతి గదుల అద్దెలు రూ.1,09,892, విరాళాలు రూ.2,83,244 కలిపి మొత్తం రూ.17,03,396 ఆదాయం లభించిందని వివరించారు. భక్తులకు తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించామన్నారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై కృష్ణమాచారి ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 13టియుఎన్105 : లోవ క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తులు -
రత్నగిరికి భక్తుల తాకిడి
ఫ సత్యదేవుని దర్శించిన 25 వేల మంది ఫదేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని సుమారు 25 వేల మంది దర్శించి, పూజలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు కావడంతో ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతు లు వెలిగించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులకు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఘనంగా రథ సేవ రత్నగిరిపై సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పండితులు ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద వేంచేయించారు. అర్చకులు దత్తాత్రేయశర్మ, గణేష్ తదితరులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి ప్రాకారసేవ ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి, భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఉత్సవమూర్తులను తిరిగి ప్రధానాలయానికి చేర్చారు. 1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ప్యాకెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఈ ఒక్క రోజే 1.10 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. సత్యదేవుని ఆలయానికి వచ్చిన భక్తులకు రత్నగిరిపై సుమారు 30 వేల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. మిగిలిన 80 వేల ప్యాకెట్లను లోవ దేవస్థానంలో తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో కొనుగోలు చేశారని దేవస్థానం అధికారులు తెలిపారు. 150 గ్రాముల ప్రసాదం ప్యాకెట్ రూ.20 చొప్పున లక్ష ప్యాకెట్లకు గాను దేవస్థానానికి రూ.20 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. లోవ దేవస్థానానికి వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో సత్యదేవుని ప్రసాదం కొనుగోలు చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో, కొండ దిగువన తొలి పావంచా వద్ద, పాత, కొత్త నమూనా ఆలయాల వద్ద రద్దీ నెలకొంది. తొలి పావంచా వద్ద, జాతీయ రహదారిపై సత్యదేవుని పాత నమూనా ఆలయం వద్ద చెరో 30 వేలు.. కొత్త నమూనా ఆలయం వద్ద 10 వేల చొప్పున ప్రసాదం ప్యాకెట్లు విక్రయానికి ఉంచారు. రాత్రి ఏడు గంటల సమయానికే ఈ ప్యాకెట్లన్నీ అమ్ముడయ్యాయి. దీంతో మరో 10 వేల ప్యాకెట్లు తయారు చేయించి, కౌంటర్లలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. -
బాక్స్ బద్దలవుతుందనే భయంతో..
ఫ బాక్స్ టెండర్లు నిలిపివేసిన అధికారులు ఫ ఆన్లైన్ టెండర్లకు ఆమోదం పిఠాపురం: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న పాలకవర్గాన్ని పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు చేయాలనుకున్న కూటమి నేతల ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తమ నేత మంజూరు చేసిన నిధులతో తామే పనులు చేయాలంటూ పట్టుబట్టి.. అధికారులపై ఒత్తిడి తెచ్చి.. ఆయా కాంట్రాక్టులు తమకే దక్కేలా చేసుకునేందుకు వారు చేసిన కుంతంత్రాలు చెల్లలేదు. వారి ఒత్తిడికి తలొగ్గి, పాలకవర్గాన్ని కాదని కొందరు అధికారులు చేసిన ప్రయత్నాలను కింది స్థాయి అధికారులు సైతం ఒప్పుకోలేదు. దీంతో, దిగివచ్చిన అధికారులు చివరకు నిబంధనల ప్రకారం పనులు చేయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కొన్నాళ్ల కిందట రూ.3 కోట్లు విడుదల చేశారు. తమకు కలసి వచ్చేందుకు వీలుగా ఈ పనులకు ఆన్లైన్లో కాకుండా బాక్స్ టెండర్లు పిలవాలని జనసేన నేతలు అధికారులపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు అధికారులు బాక్స్ టెండర్లకు రంగం సిద్ధం చేశారు. దీనిని మున్సిపల్ పాలకవర్గం వ్యతిరేకించింది. అయినప్పటికీ లెక్క చేయకుండా మున్సిపల్ అధికారులు బాక్స్ టెండర్లకే మొగ్గు చూపారు. దీనిపై ఆమోదిస్తే బాక్స్ బద్దలే.. శీర్షికన గత నెల 28న సాక్షి కథనం ప్రచురించింది. దీంతో, దిగి వచ్చిన అధికారులు ఎట్టకేలకు బాక్స్ టెండర్లను నిలిపివేసి, ఆన్లైన్ టెండర్లకు ప్రకటన విడుదల చేశారు. అయినప్పటికీ గత పది రోజులుగా ఏదో ఒక విధంగా బాక్స్ టెండర్లు వేసేలా చూడాలని జనసేన నేతలు అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీనికి ఒక జిల్లా ఉన్నతాధికారి కూడా మద్దతు పలకడంతో మున్సిపల్ అధికారులు బాక్సు టెండర్లకు ఏర్పాట్లు చేశారు. ఈవిధంగా నిబంధనలకు వ్యతిరేకంగా బాక్స్ టెండర్లు పిలిస్తే తాము బలైపోతామని మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగపు అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఒప్పుకోబోమని వారు స్పష్టం చేశారు. దీనికితోడు కోర్టును ఆశ్రయించేందుకు పాలకవర్గం సిద్ధమైంది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు ఆన్లైన్ టెండర్లు పిలుస్తూ శనివారం ప్రకటన జారీ చేశారు. ఆదివారం సాయంత్రం నుంచి టెండర్లు స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. -
ఇంటింటికీ ‘బాబు’ మోసాలు తీసుకువెళ్లాలి
● హామీల అమలుకు ప్రజల గళమై ప్రశ్నించాలి ● కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ పిలుపు ఏలేశ్వరం: చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తీసుకువెళ్లి, ప్రజలను చైతన్యపరచాలని వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. కిర్లంపూడిలో శనివారం జరిగిన బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ ప్రత్తిపాడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారంటీ పేరిట ప్రమాణ పత్రాలు పంపిణీ చేశారన్నారు. సాధ్యం కాని హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేశారని చెప్పారు. అధికారం చేపట్టి 13 నెలలవుతున్నా, తూతూమంత్రంగా ఒక్క గ్యాస్ సిలిండర్, అరకొరకగా తల్లికి వందనం మినహా చేసిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తున్న తమపై రాజద్రోహం కేసులు పెడతామంటూ బెదిరించడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదని, రాష్ట్రాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతిపక్షంగా తమపై ఉందని అన్నారు. ఇచ్చిన హామీలు చేసేంత వరకూ ప్రజల గొంతుకై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గత, బైబిల్, ఖురాన్గా భావించిందని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేశారని బొత్స చెప్పారు. ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిల్లో ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై రూ.19 వేల కోట్ల భారం మోపారని అన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, చంద్రబాబు, మరో ఆరుగురు కలిసి మోసాల కంపెనీని ప్రారంభించారని, చంద్రబాబు ఎండీగా, లోకేష్ సీఎండీగా, పవన్, మిగతా వాళ్లు సభ్యులుగా కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ, చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు మాట్లాడుతూ, చంద్రబాబు పాలనలో ప్రజలను మోసం చేయడం మినహా చేసిన అభివృద్ధి లేదని అన్నారు. వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, ముద్రగడ గిరిబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రులు తానేటి వనిత, తోట నరసింహం, మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, పార్టీ పెద్దాపురం కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీశివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సుజాత, పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బెహరా రాజరాజేశ్వరి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బదిరెడ్డి గోవింద్, వాసిరెడ్డి జమీలు తదితరులు పాల్గొన్నారు. -
అన్నవరప్పాడులో భక్తుల రద్దీ
పెరవలి: వేలాదిగా భక్తులు తరలిరావడంతో అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో రద్దీ ఏర్పడింది. రెండో శనివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తెల్లవారుజాము నుంచే తరలివచ్చి ఆలయ ప్రాంగణం చుట్టూ బారులు తీరారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. వందలాది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామి, అమ్మవార్లను అర్చకులు బీరకాయలతో విశేషంగా అలంకరించారు. సుమారు 7 వేల మంది భక్తులకు అన్నసమారాధన నిర్వహించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. -
తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి గ్రామంలో వెలసిన స్వయంభూ శృంగార వల్లభస్వామి ఆలయానికి శనివారం భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు సుమారు 25 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు విశేషంగా అలంకరించారు. వివిధ సేవల టికెట్లు, అన్నదానం, కేశఖండన ద్వారా దేవస్థానానికి రూ.3,73,904 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఐదు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. శాకంబరిగా నేడు తలుపులమ్మ దర్శనం తుని రూరల్: ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో తలుపులమ్మ అమ్మవారు నేడు శాకంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో విశేషంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు డిప్యూటీ కమిషనర్, లోవ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ అమ్మవారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. లోవ భక్తులకు సత్యదేవుని ప్రసాదం సిద్ధం అన్నవరం: ఆషాఢ మాసం మూడో ఆదివారం తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి లోవ వెళ్లి వచ్చే భక్తులకు సత్యదేవున్ని గోధుమ నూక ప్రసాదం సిద్ధమవుతోంది. వారికి విక్రయించేందుకు లక్షకు పైగా సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. గత ఆదివారం కొండ దిగువన, జాతీయ రహదారిపై ఉన్న నమూనా ఆలయాల వద్ద లోవ భక్తులు సత్యదేవుని ప్రసాదం ప్యాకెట్లు సుమారు 60 వేలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆదివారం అంతకన్నా ఎక్కువగా కొనుగోలు చేస్తారనే అంచనాతో అన్నవరం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం సుమారు 60 వేలలు, లోవ భక్తుల కోసం సుమారు లక్ష ప్రసాదం ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయాల ద్వారా ఆదివారం సుమారు రూ.30 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కిక్కిరిసిన రత్నగిరిఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి శనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. రెండో శనివారం, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో ఉదయం నుంచే స్వామివారి సన్నిధికి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో, ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ ప్రాకారంలో ఉదయం సత్యదేవుడు, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ఆలయానికి ఆదివారం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అమ్మవారిని టేకు రథంపై ఊరేగిస్తారు. రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ సిటీ: జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలులో సోమవారం ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకూ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ షణ్మోహన్ సగిలి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులదరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల స్థాయిలో జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి ఆయా మండలాల అధికారులందరూ విధిగా ఉదయం 9.30 గంటలకే హాజరు కావాలని సూచించారు. -
గోదావరి పరవళ్లు
● కడలిలోకి 5.29 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న వరద ఉధృతి ధవళేశ్వరం: గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో నది ఉధృతి క్రమేపీ పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు మిగులు జలాలను ఎప్పటికప్పుడు సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం శనివారం రాత్రి 10.60 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 5,29,209 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి ఆదివారం మరింత పెరిగే అవకాశం ఉంది. కాటన్ బ్యారేజీ వద్దకు సుమారు 7 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో నది ఉధృతి క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద శనివారం 41.10 అడుగులకు చేరిన నీటిమట్టం క్రమేపీ 40.90 అడుగులకు తగ్గింది. దీంతో, ఆదివారం సాయంత్రం నుంచి ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో గోదావరి నీటిమట్టాలు (మీటర్లలో) కాళేశ్వరం 8.77 పేరూరు 13.87 దుమ్ముగూడెం 11.50 కూనవరం 16.14 కుంట 7.30 పోలవరం 10.78 రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి 14.94 రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గోదావరి ఉధృతి -
● ‘తడుపు’.. మోపెడు !
పూర్వం మెట్ట రైతులు నానా ప్రయాసలూ పడి.. కావిళ్లతో నీరు మోసుకుని తెచ్చి, పొలాల్లోని మొక్కలకు నీరందించేవారు. కొన్నేళ్లుగా అన్ని సౌకర్యాలూ అందుబాటులోకి వచ్చాక ఇటువంటి పరిస్థితి ఇటీవల ఏ రైతుకూ రాలేదు. కానీ ఈ ఏడాది సాగు నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో, రైతులు బకెట్లతో నీటిని తెచ్చుకుని మొక్కలకు పోసుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. కనీసం పంట కాలువల్లో కూడా నీరు లేకపోవడంతో.. రైతులు అక్కడక్కడ ఉన్న బోర్ల నుంచి నీళ్లు మోసుకుని తెచ్చుకుని, ఎండిపోతున్న పంటను కాపాడుకోడానికి ఇలా యాతనలూ పడుతున్నారు. – పిఠాపురం -
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లిలో శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ.1,73,820 ఆదాయం వచ్చినట్లు ఈఓ సురేష్బాబు తెలిపారు. అలాగే అన్నప్రసాద పథకానికి పలువురు భక్తుల ద్వారా విరాళాల రూపంలో మరో రూ.41,203 రాగా మొత్తం 2,15,023 ఆదాయం వచ్చినట్టు ఆయన తెలిపారు. సిబ్బంది, పలువురు గ్రామస్తులు భక్తులకు అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు. తెలంగాణా ఆర్టీసీ ఎండీ/అదనపు డీజీపీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ సతీ సమేతంగా శనైశ్చరుని దర్శించి, ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు జరిపించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం దేవస్థానం అధికారులు వారికి ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. -
ప్రసూతి సేవలకు ఏఐ అనుసంధానంతో అద్భుతాలు
కాకినాడ క్రైం: ప్రసూతి సేవలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనుసంధానం చేయడం ద్వారా అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ డీఎస్వీఎల్ నరసింహం అన్నారు. తద్వారా మహిళకు అత్యంత నాణ్యమైన వైద్య సేవలు అందుతాయన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఏపీసీఓజీ) ఆధ్వర్యాన ఆంధ్రప్రదేశ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ పదో వార్షిక సదస్సు శనివారం జరిగింది. కాకినాడ ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాజికల్ సొసైటీ ఆర్గనైజింగ్ చైర్పర్సన్ డాక్టర్ వై.అనురాగమయి, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతాశ్రీ, ట్రెజరర్ డాక్టర్ లక్ష్మీకిరణ్ సంయుక్త పర్యవేక్షణలో ఈ సదస్సు నిర్వహించారు. 72 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి 1,200 మంది ప్రసూతి వైద్య నిపుణులు ఈ సదస్సుకు హాజరయ్యారు. పలు రాష్ట్రాలకు చెందిన నిపుణులు గైనకాలజీలో అందుబాటులోకి వచ్చిన అధునాతన వైద్య సేవలు, ఏఐ అనుసంధానం, నూతన వైద్య ప్రక్రియలు, ఔషధాల పని తీరు, వివిధ ఆరోగ్య స్థితులల్లో ప్రసవ ప్రక్రియలను వివరించారు. అంతకు ముందు వర్క్షాప్ చైర్మన్ డాక్టర్ కొండమూరి సత్యనారాయణ ఆధ్వర్యాన నిర్వహించిన వర్క్షాప్లలో 20 వరకూ శస్త్రచికిత్సలు చేశారు. సదస్సు నిర్వహణలో డాక్టర్ సూర్యకుమారి, డాక్టర్ శ్రీధర్ కీలకంగా వ్యవహరించారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్ధన్ మాట్లాడుతూ, రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సు శనివారం ప్రారంభమైందని తెలిపారు. నూతన ప్రసూతి వైద్య నిపుణులకు ఈ సదస్సు ఓ వరమన్నారు. సదస్సులో ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి, పాడేరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి, మాజీ ఐఏఎస్ బాబూరావు నాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. వక్తలుగా డాక్టర్ సంకేత్ పిసాట్, డాక్టర్ వినీత్ మిశ్రా, డాక్టర్ రామకృష్ణ హనుమాన్ వ్యవహరించారు. -
భారీ నష్టం వచ్చేలా ఉంది
రాత్రికి బాగున్న పంట ఉదయానికి నాశనమైపోతోంది. ఈ జలగ పురుగులను మేము ఎప్పుడూ చూడలేదు. మొదట్లో ఒకటి రెండు కనిపించగా ఉన్నట్టుండి వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం మాత్రమే ఆకులపై ప్రత్యక్షమవుతున్నాయి. రాత్రికి బాగున్న ఆకులు ఉదయానికి లేకుండా పోతున్నాయి. ఇలా పంట పూర్తిగా దెబ్బ తింటోంది. ఈ పురుగులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు. వీటిని ఎలా నివారించాలో కూడా తెలియడం లేదు. వీటి వల్ల నేను వేసిన మిరప పంట చాలా వరకూ దెబ్బ తింది. పెట్టుబడి కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. భారీ నష్టం వచ్చే అవకాశం కనిపిస్తోంది. కొన్ని పురుగు మందులు కొట్టినా అవి పోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – ఓరుగంటి వెంకట సత్యనారాయణ,మిరప రైతు, చేబ్రోలు తామర పురుగు పోయి జలగలు వచ్చాయి ఎక్కడో చెరువుల్లోనో కాలువల్లోనో చూసే జలగలు ఇప్పుడు పంటలపై దాడి చేస్తున్నాయి. ఇప్పటి వరకూ తామర పురుగుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు కొత్తగా జలగలు వచ్చి పడ్డాయి. అప్పటి వరకూ అవి ఎక్కడుంటున్నాయో కూడా తెలియడం లేదు. ఉదయం, సాయంత్రం కాగానే మొక్కలపై, ఆకులపై కనిపిస్తున్నాయి. ఒక్క రోజులోనే వందల సంఖ్యలో కనిపిస్తున్నాయి. ఏ మొక్కపై చూసినా ఇవే. ఆకుల్లోని రసాన్ని నిమిషాల్లో పీల్చేస్తున్నాయి. దీంతో సత్తువ కోల్పోయి మొక్కలు చనిపోతున్నాయి. పురుగు మందులు వాడినా ఫలితం లేదు. వీటి దాడితో మా పత్తి పంట తొలి దశలోనే నాశనమవుతోంది. – ఓరుగంటి శేఖర్, పత్తి రైతు, చేబ్రోలు చర్యలు తీసుకుంటాం ఈ జలగలు ఎక్కువగా పగలు దాక్కుని, రాత్రుళ్లు బయటకు వచ్చి, మొక్కలపై పాకుతూ, కాండం, ఆకులు తినేస్తాయి. దీంతో, మొక్క నాశనమవుతుంది. ఇవి ఎక్కువగా తేమగా ఉండే మట్టిలో కనిపిస్తాయి. నర్సరీల నుంచి తెచ్చిన మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాల్లో ఈ మెట్ట జలగలను గుర్తించారు. ఇవి మన ప్రాంతంలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇది కొంత ఆందోళనకరమైన విషయమే. ఇవి వ్యాపించిన పంటలను పరిశీలించి, శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని, నివారణ చర్యలు తీసుకుంటాం. – వై.సోమరాజశేఖర్, ఉద్యాన శాఖాధికారి, పిఠాపురం కొత్తగా కనిపిస్తున్నాయి మెట్ట జలగల వల్ల అపారనష్టం వస్తుంది. వీటి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ ప్రాంతంలో ఎక్కడా ఎప్పుడూ లేవు. వీటి ఉనికి కొత్తగా కనిపిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై శాస్త్రవేత్తలను సంప్రదిస్తాం. తోటలను పరిశీలించి, ఏ మేరకు వ్యాపించాయి, ఎంత నష్టం కలిగిస్తున్నాయనే విషయాలు తెలుసుకుని, తగు చర్యలు తీసుకుంటాం. – వీవీ సత్యనారాయణ, వ్యవసాయశాఖాధికారి, గొల్లప్రోలు ● వాణిజ్య పంటలపై మెట్ట జలగల దాడి ● పత్తి, మిర్చి పంటలకు అపార నష్టం ● రైతుల ఆందోళన పిఠాపురం: పంటలకు పురుగులు, తెగుళ్ల బెడద సర్వసాధారణం. మిడతల దండు దాడి చేసిన అరుదైన సందర్భాలూ ఉన్నాయి. కానీ, కనీవినీ ఎరుగని రీతిలో పంటలను నమిలి మింగేస్తున్న మెట్ట జలగల (డిరోసిరాస్ రెటికల్టమ్) గురించి మీరెప్పుడైనా విన్నారా! ఈ జలగలు ఇప్పుడు గొల్లప్రోలు మండలంలో స్వైర విహారం చేస్తున్నాయి. జలగ అంటే నీటిలో ఉండే జీవిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ మెట్ట జలగలు పంటలపై సంచరిస్తూ వాటికి పెను ప్రమాదంగా మారాయి. ఈ జలగలను చూస్తే ఒళ్లంతా జలదరిస్తుంది. ఇవి మెల్లగా పాకుతూ వెళ్లిన మార్గం తళతళా మెరుస్తూ ఉంటుంది. ఈ జలగలు పంటలపై దాడి చేస్తూండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నివారణకు ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం ఉండటం లేదని గగ్గోలు పెడుతున్నారు. వేలాదిగా దాడి చేస్తున్న జలగలు రాత్రికి రాత్రే పంటను నాశనం చేసేస్తున్నాయి. దీంతో రైతుకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం వాణిజ్య పంటలకు పెట్టింది పేరు. ఇక్కడ టమాటా, బెండ, మిరప, బీర, కాకర తదితర పంటలతో పాటు పత్తి కూడా రైతులు సాగు చేస్తూంటారు. ఇటీవల ఈ పంటలను మెట్ట జలగలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. మొక్కల కాండంపై పాకుతూ, ఆకులు కాండం తినేస్తున్నాయి. దీంతో, మొక్కలు చనిపోతున్నాయి. సాధారణంగా భూమిలోనే ఉంటూ కనిపించకుండా పోతున్న ఈ జలగలు ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం ఒక్కసారిగా మొక్కలపై ప్రత్యక్షమై, పంటలను నాశనం చేస్తున్నాయి. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, చెందుర్తి తదితర ప్రాంతాల్లో మిరప, పత్తి పంటలపై ఈ జగలగలు దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల్లోని రైతులు సుమారు 950 ఎకరాల్లో పత్తి, 60 ఎకరాల్లో మిరప పంటలు సాగు చేశారు. సుమారు 300 ఎకరాల్లో పత్తి, మిరప పంటలపై ఈ జలగలు వ్యాపించి, మొక్క దశలోనే పంటను నాశనం చేస్తున్నాయి. పంటలు తొలి దశలోనే పాడైపోతూండటం చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకుని పంటలను రక్షించాలని కోరుతున్నారు. పంటను తినేస్తున్న మెట్ట జలగలుజలగల దాడితో మొక్క దశలోనే దెబ్బ తిన్న పత్తి మొక్క పంట పొలాల్లో మెట్ట జలగల గుడ్లు మెట్ట జలగలు -
పులస @ రూ.15 వేలు
‘పుస్తెలు అమ్మైనా సరే.. పులస తినాలి’ అనే నానుడి గోదావరి జిల్లాలో బాగా విపిస్తుంటుంది. ‘పులస’ చేప దొరకడం చాలా అరుదు కాబట్టే.. జీవితంలో ఒక్కసారైనా పులసను తినాలని భావిస్తుంటారు. నదీ ప్రవాహానికి అతి వేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. అంతేకాదు ఈ చేప ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. అందుకే వేలంలో ఎంత ధర పెట్టడానికైనా జనాలు వెనుకాడరు. ఇప్పటికే ఎన్నో పులస చేపలు రికార్డు ధరలో అమ్ముడుపోయాయి. యానాం: గోదావరికి వరద ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకారుల వలలకు పులసలు చిక్కుతున్నాయి. శుక్రవారం యానాం (Yanam) గౌతమీగోదావరి పాయలో తొలిసారిగా పులస చేప వలకు చిక్కింది. దీంతో స్థానిక పుష్కరఘాట్ వద్ద పులస చేపను వేలం వేయగా స్థానిక మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం రూ.15 వేలకు చేపను దక్కించుకుంది. ఆపై మార్కెట్ లో రూ.18 వేలకు విక్రయించారు.గోదావరికి ఎర్రనీరు రావడంతో అరుదైన గోదావరి పులస (Pulasa) పడటంతో మిగిలిన ఆగస్టు, సెప్టెంబర్ నెలల వరకు పులసలు పడతాయని మత్స్యకారులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చదవండి: జూలైలోనూ వేసవే.. మండుతున్న ఎండలు! -
రత్నగిరి భద్రత పటిష్టతకు తొలి అడుగు
● సీసీ టీవీ దృశ్యాల రికార్డింగ్ బ్యాకప్ 90 రోజులుండేలా చర్యలు ● ఇందుకోసం రూ.70 లక్షలతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ● అన్నవరం దేవస్థానం పాలకవర్గం తీర్మానం అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో భద్రతా చర్యలపై పాలకమండలి దృష్టి సారించింది. శుక్రవారం రత్నగిరిపై చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీసీ టీవీలు రికార్డు చేసిన దృశ్యాలు 90 రోజులపాటు సర్వర్లో ఉండేలా రూ.70లక్షల వ్యయంతో ఆన్లైన్ సర్వర్లు, హార్డ్డిస్క్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. ప్రస్తుతం సీసీటీవీలు రికార్డు చేసిన దశ్యాలు 30 రోజులవి మాత్రమే సర్వర్లో ఉంటాయి. అయితే మిగిలిన ప్రముఖ దేవస్థానాలలో కనీసం 90 రోజులు సీసీటీవీ రికార్డింగ్ బ్యాకప్ సదుపాయం ఉంది. అన్నవరం దేవస్థానంలో 320 సీసీ టీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ బ్యాకప్ 90 రోజులకు పెంచుకోవాలని దేవదాయశాఖ ఉన్నతాధికారులు, పోలీస్ శాఖ పలుమార్లు దేవస్థానం అధికారులకు సూచించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఈఓ వీర్ల సుబ్బారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు వీ నూకరత్నం, వీ రామకృష్ణ, ఎలక్ట్రికల్ డీఈ వీ సత్యనారాయణ పాల్గొన్నారు. మొత్తం పది అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. తీర్మానాలు.. ● మొదటి ఘాట్ రోడ్ వద్ద నుంచి న్యూసెంటినరీ సత్రం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారికి రూ.27 లక్షల వ్యయంతో విద్యుత్ దీపాలు, సౌండ్సిస్టమ్, సీసీ టీవీలు, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ప్యానల్ బోర్డుల ఏర్పాటుకు ఆమోదం ● సత్యగిరి, రత్నగిరి ఘాట్రోడ్లలో, కొండ దిగువన ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాల రాకపోకలకు వీలుగా రూ.23 లక్షల వ్యయంతో ప్రీ కాస్ట్ ఆర్సీసీ డివైడర్స్ ఏర్పాటు ఆమోదం ● దేవస్థానంలో సత్యగిరి పవర్హౌస్ నుంచి విష్ణుసదన్ సత్రానికి ప్రస్తుతం విద్యుత్ సరఫరా చేస్తున్న కేబుల్ పాడైనందున దాని స్థానంలో అండర్ గ్రౌండ్ కేబుల్, ప్యానల్ బోర్డును రూ.26 లక్షలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం ● ప్రధానాలయం, వ్రత మంటపాలు, ఉచిత క్యూ శ్లాబ్ల, విష్ణుసదన్ సత్రం జాయింట్ బీమ్లలో లీకేజీలు అరికట్టేందుకు రూ.18.65 లక్షలతో రస్ట్ప్రూఫ్ ట్రీట్మెంట్ గ్రౌటింగ్ పనులు చేసేందుకు ఆమోదం ● రూ.16 లక్షలతో పంపా రిజర్వాయర్ పవర్ ఆఫీసు వద్ద నిర్మించిన బోర్వెల్స్ వద్దకు సిబ్బంది వెళ్లడానికి ర్యాంప్ నిర్మాణం, రత్నగిరి వై జంక్షన్ వద్ద నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమోదం -
కీచకులపై చర్యలు తీసుకోండి
కాకినాడ రూరల్: రంగరాయ మెడికల్ కళాశాల విద్యార్థినులపై వేధింపులకు పాల్పడిన కీచకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం వీడియో ప్రకటన విడుదల చేశారు. మాట్లాడుతూ రాష్ట్రంలోనే పేరున్న రంగరాయ కళాశాలను కూడా కీచకులు వదలడం లేదని, పారా మెడికల్ విద్యార్థినుల పట్ల ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్లు ప్రవర్తించిన తీరు అమానుషమని దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దాడులు, హత్యలు, లైంగిక వేధింపులు ఎక్కువ అయ్యాయన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఆరోపణలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగరాయ ఘటనపై స్పందించాలని నాగమణి కోరారు. తలుపులమ్మకు సారె సమర్పణతుని: తలుపులమ్మ అమ్మవారి లోవ దేవస్థానానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసంలో మూడో శుక్రవారం కావడంతో పలు జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. ఇళ్లల్లో స్వయంగా తయారు చేసిన పిండి వంటలతో నింపిన బిందెలను శిరస్సుపై ధరించి వస్తున్న భక్తులకు రాజగోపురం వద్ద ఆలయ ఈఓ విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. పండితులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి విశ్వనాథరాజు పర్యవేక్షించారు. కుట్ర పూరితంగా ఎస్సీవర్గీకరణ అమలు జగ్గంపేట: ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల సామాజిక వర్గాన్ని అణచివేయాలని చూస్తున్నారని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్ నేత డాక్టర్ ఆర్.ఎస్.రత్నాకర్ తెలిపారు. జగ్గంపేటలో శుక్రువారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలలో మాలల ఉనికిని దెబ్బతీయడానికి పథకం ప్రకారం నేతలు ప్రయత్నిస్తున్నా వారికి బానిసలుగా, తొత్తులుగా మారిన మాల నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. సుప్రీంకోర్టు, జడ్జిలు, దేశ సంపద, మంత్రి పదవులు తదితర వాటిలో ఎస్సీ వర్గీకరణ అవసరం లేదా, దాన్ని అమలు చేయరా అని ప్రశ్నించారు. రిజర్వేషన్ పేరుతో ఎస్సీలకు పడేసే ఎంగిలి మెతుకుల్లోనే వర్గీకరణ పేరుతో పంపకాలు పెడతారా అని ప్రశ్నించారు. దీంతో ఎస్సీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడానికి పరోక్షంగా ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ జనాభా ప్రాతిపదికన చేయలేదని అన్నారు. నేతలు కొప్పుల ప్రేమ్ బాబు, కనికళ్ల నాని, బచ్చల చిన్నా,బొండు రాజు,కూసి కొండబాబు పాల్గొన్నారు. -
ఎంపీడీవో రాజేశ్వరరావు సస్పెన్షన్
తొండంగి: శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్ ఇన్చార్జి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన కారణంగా మండల పరిషత్ ఎంపీడీవో బి.రాజేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ కమిషనర్ వి.ఆర్.కృష్ణ తేజ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022లో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల పరిషత్త్లో ఈవోపీఆర్డీ, ఇన్చార్జి ఎంపీడీవోగా బి.రాజేశ్వరరావు విధులు నిర్వహించారు. రూ.14,84,900 నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ ఆరోపణల నేపథ్యంలో అప్పటి జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు. వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడంతో క్రిమినల్ మిస్ కాండక్ట్ కింద ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా తుని మండలం ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న కె.సాయినవీన్కు తొండంగి మండలం ఎంపీడీవో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినట్టు జిల్లా పరిషత్ సీఈఓ నుంచి ఆదేశాలందాయి. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శిగా అయ్యారావు పిఠాపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించిన రాష్ట్ర మున్సిపల్ విభాగ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా గొల్లప్రోలుకు చెందిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత మొగలి మాణిక్యాలరావు (అయ్యారావు) నియమితులయ్యారు. పార్టీ అధిష్టానం తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టతకు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అయ్యారావు తెలిపారు. తనకు పదవి రావడానికి కృషి చేసిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతావిశ్వనాఽథ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఆరా కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో చోటు చేసుకున్న పారామెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపుల ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. శుక్రవారం రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అత్త లూరి విష్ణువర్దన్కు కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ ఫోన్ చేశారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. విచారణపై ఆరా తీసి, నిందితులపై కళాశాల తరఫున చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. -
సర్కారు వారి బీమా కలాపం!
అప్పులతో సతమతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు అప్పులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు ప్రయివేటు వ్యాపారస్తులు దగ్గర నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి సాగు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఏడాది రైతు నేస్తం కింద ఇస్తామన్న రూ. 20 వేలు కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టింది. ప్రస్తుతం రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమయ్యారు. మే నెలలో రైతు నేస్తం ఇస్తామన్నారు. జూన్ నెల కూడా అయిపోయింది. జులై వచ్చినా ఇంకా రైతు నేస్తం డబ్బు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ప్రస్తుతం రైతులు పెట్టుబడి కోసం అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటువంటి తరుణంలో బీమా ప్రీమియం కూడా తాము చెల్లించాలని చెప్పడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రీమియం డబ్బు కోసం ఎక్కడ అప్పు చేయాలో అర్థం కాక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబునాయుడు మాటలు నమ్మి తాము మోసపోయామని గత రబీలో ధాన్యం డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూనే తమ పైనే అదనపు భారం మోపడం న్యాయం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం ● రైతులపై ప్రీమియం భారం రూ.16 కోట్లు ● ఎకరాకు రూ.760 చొప్పున చెల్లించాలి ● వైఎస్సార్ సీపీ హయాంలో ఐదేళ్లూ ఉచితం ● జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్లో 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగు ● ఆందోళన చెందుతున్న అన్నదాతలు బోట్క్లబ్ (కాకినాడ సిటీ): విత్తు దగ్గర నుంచి కుప్ప నూర్పిడి వరకూ రైతులకు అండగా నిలిచే ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టింది. రైతులకు పంట బీమా కావాలంటే ఎకరా వరి పొలానికి రూ.769 రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జిల్లాలో 2.10 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు వరినారు వేసుకొని పంటలు దమ్ము చేసుకొంటున్నారు. ఖరీఫ్ సాగుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉచిత పంటల బీమా పథకం ఊసు తేవడం లేదు. రైతులు సొంతంగా పంట బీమా చేయించుకోవాలని మండల వ్యవసాయశాఖ ఆధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు అన్నీ చేస్తామని చెప్పి తీరా చూస్తే ప్రతీ పథకానికి గండి కొడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే రైతు నేస్తం పథకం కింద ప్రతీ ఏడాది రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గత సంవత్సరం ఖరీఫ్, రబీలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి సహాయం చేయకుండా రైతులను మోసం చేసిన కూటమి సర్కార్ ప్రస్తుతం పంట బీమా పథకానికి మోకాలడ్డు వేసింది. దీంతో జిల్లాలో రైతులపై రూ.16 కోట్ల భారం పడనుంది. బీమా భారమంతా రైతులు పైనే.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉచిత పంట బీమా పథకం అమలు చేసింది. రైతులు ఒక్క రూపాయి కూడా కట్టకుండా పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లించేది. ప్రతీ ఏడాది కాకినాడ జిల్లాలో రూ.16 కోట్లు పైబడి ప్రభుత్వం చెల్లించేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో రైతుల నుంచి ప్రీమియం కోసం ఏనాడూ డబ్బు వసూలు చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా పంటల బీమా పథకం అమలు చేయకుండా రైతులపైనే భారం వేస్తోంది. గ్రామాల్లో ఐదారెకరాలు సాగుచేసే రైతులు సుమారు రూ.4 వేలలో ప్రస్తుతం పంట బీమా చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రీమియం చెల్లించకుంటే దక్కని బీమా రైతులు ప్రీమియం చెల్లించకుంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక్క రూపాయి కూడా బీమా వర్తించదు. ఖరీఫ్లో వరి సాగు చేసే రైతులకు నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే తుపాన్ల కారణంగా నష్టం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎకరా వరి పొలానికి రూ.769 ప్రీమియం చెల్లిస్తే ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ఎకరాకు రూ.6 వేల వరకూ నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. రైతులు ఎవరైనా ప్రీమియం చెల్లించకుంటే పరిహారం రాదు. గతంలో ప్రభుత్వమే మొత్తం ప్రీమియం చెల్లించడంతో ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రతీ రైతుకు పంట నష్ట పరిహారం వచ్చేది. ప్రస్తుతం ప్రీమియం చెల్లించేందుకు చాలామంది రైతుల వద్ద డబ్బు లేని పరిస్థితి. రైతులు బ్యాంకుల నుంచి అప్పు తీసుకొంటే ప్రీమియంను మినహాయించి మిగిలిన సొమ్ము ఇస్తారు. దీంతో రుణాలు తీసుకొనే ప్రతీ రైతుకు పంట బీమా వర్తిస్తుంది. జిల్లాలో సుమారు లక్ష మందిలోపు మాత్రమే రైతులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొంటారు. మిగిలినవారు సొంతంగా పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలి ఉచిత పంటల బీమా పథకం ఎత్తివేయడంతో రైతులపై ప్రీమియం భారం పడుతోంది. నేను 5 ఎకరా లు సాగు చేస్తున్నాను. దీంతో రూ.3,845 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేది. దీంతో రైతులపై ఎటువంటి భారం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతోంది తప్ప, రైతులకు ఏ విధమైన పథకాలు అమలు చేయడం లేదు. – తుమ్మల అచ్చియ్య, రైతు పులిమేరు, పెద్దాపురం మండలం రైతులను ప్రీమియం చెల్లించమనడం దారుణం నాకు ఉన్న భూమితోపాటు అదనంగా మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాను. దీంతో పది ఎకరాలకు రూ.7,690 ప్రీమియం చెల్లించాల్సి వస్తోంది. ఇప్పడే డబ్బు లేక విత్తనాలు కొనుగోలుకు బయట అప్పులు తెచ్చాను. మళ్లీ ప్రీమియం కట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏమీ చేయాలో అర్థం కానీ పరిస్థితి. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదు సంవత్సరాలూ ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. ప్రస్తుతం రైతులను ప్రీమియం చెల్లించడమనడం దారుణం. – సుర్ల నాగేశ్వరరావు, రైతు టీజే నగరం, కోటనందూరు మండలం -
పవన్కల్యాణ్... ఇప్పుడేం అంటారు?
● లైంగిక వేధింపుల ఘటనపై మీ సమాధానమేంటి ? ● కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్సార్ సీపీ మహిళా నేత జక్కంపూడి విజయలక్ష్మి కాకినాడ క్రైం: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం ఉన్న జిల్లాలోనే పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరగడం అమానవీయమని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాకి లెక్కలు చూపి మహిళలపై ఘోరాలు జరిగిపోతున్నాయని మొసలి కన్నీరు కార్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడేమంటారని నిలదీశారు. ఘటన నేపథ్యంలో శుక్రవారం ఆమె కాకినాడలోని జీజీహెచ్కు వచ్చారు. లైంగిక వేధింపులు చోటు చేసుకున్న ఏడవ నంబరు, అంబానీ ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం లెక్చర్ గ్యాలరీ సమీపంలో ఉన్న హెచ్వోడీ రూంలో ఆసుపత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్లు, వార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు ఈ ఘటనపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి అధికారుల మాటలు పొంతన లేకుండా ఉన్నాయని విమర్శించారు. నిందితులపై నేర చరిత్ర ఉందన్న విషయాన్ని ఉద్దేశ పూర్వకంగానే దాస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కీచకుల మయమని మండిపడ్డారు. శక్తి యాప్ ద్వారా ఉద్దరించిందేంటని నారా లోకేష్ను నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వేలకొద్దీ దుర్యోధనులు, లక్షల కొద్దీ దుశ్సాసనులను శక్తి యాప్ ఏం చేయగలదని ప్రశ్నించారు. కీచకుల కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం బెయిలబుల్ కేసులు పెడుతూ మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. విజయలక్ష్మి వెంట పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి దీప్తి కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు మహిళా వర్దినీడి సుజాత, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, సిటీ మహిళా అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి, పార్టీ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ సరోజ, మహిళా నేత భవానీ ప్రియ ఉన్నారు. -
సుగుణారెడ్డికి రెడ్క్రాస్ పురస్కారం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్, రెడ్క్రాస్ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ సుగుణారెడ్డికి రెడ్క్రాస్ సొసైటీ ఉత్తమ పురస్కారం అందజేసింది. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెడ్క్రాస్ వార్షిక సమావేశంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. కాకినాడ రెడ్క్రాస్ను మూడేళ్లుగా ప్రథమ స్థానంలో నిలుపుతున్న సుగుణారెడ్డికి పురస్కారం రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. ఆదిత్య యూనిట్స్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహించి, సమాజ సేవలో ముందుంటున్నారని రెడ్క్రాస్ రాష్ట్ర చైర్మన్ వైడీ రామారావు తెలిపారు. అక్కాచెల్లెళ్ల అదృశ్యం రావులపాలెం: ఇద్దరు బాలికల అదృశ్యంపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.శేఖర్బాబు తెలిపారు. గోపాపురానికి చెందిన ఇద్దరు బాలికలు అక్కాచెల్లెళ్లు. గురువారం వారి తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ అక్కాచెల్లెళ్లు కనిపించలేదు. ఈ మేరకు తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
కష్టాలు కొనసాగేలా..
అధిక ధరకు విక్రయాలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించేవారు. ఉన్న ఊళ్లోనే సేవలు అందేవి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎరువులు అందుబాటులో లేకుండా చేసింది. ప్రస్తుతం అన్ని ప్రైవేట్ షాపుల్లో ఎరువులు దొరకడం లేదు. ఉన్న షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. –పెదపూడి బాపిరాజు, అధ్యక్షుడు, కొత్తపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఎరువుల సరఫరాకు చర్యలు గ్రామాల్లో సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువులు ఇండెంట్ను గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) పెట్టాలి. ప్రస్తుతం వీఏఏల బదిలీలు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజుల్లో ఆ ప్రక్రియ ముగుస్తుంది. వీఏఏలు చేరిన వెంటనే ఎరువుల ఇండెంట్ పెట్టించి, రైతులకు కావాల్సిన ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకుంటాం. ఈ లోపు పలు సొసైటీల ద్వారా సరఫరా చేయిస్తున్నాం. –ఎం.వెంకటరామారావు, ఏడీఏ, కొత్తపేట కొత్తపేట: తొలకరి పలకరించింది.. ఖరీఫ్ సాగుకు ఆహ్వానం పలికింది.. ఎన్నో ఆశలతో ప్రతి రైతు అడుగు పొలాల వైపు పడింది.. వరి నారుమడులు, పొలాల దమ్ము పనుల్లో రైతాంగం నిమగ్నమైంది. ఇలా సాగు ఊపందుకుంటుంటే, ప్రభుత్వం నుంచి సన్నద్ధత కరవైంది. నేటికీ రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు మాత్రం అందించడం లేదు. ఎరువులు ఎప్పుడు వస్తాయో తెలియక రైతులు ఆ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, రైతు ప్రోత్సాహక పథకాలను అందించేవారు. విత్తనాలు, ఎరువులు, పంటల బీమా, తదితర సేవలు సకాలంలో అందించేవారు. ముందుగానే సర్వం సిద్ధం చేసేవారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలకు రైతు సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)గా పేరుపెట్టి వాటి ద్వారా సేవలకు మాత్రం మంగళం పాడింది. ఇవి ప్రస్తుతం అలంకారప్రాయంగా మిగిలాయని రైతులు అంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 1,74 లక్షల ఎకరాలు. ఈ సీజన్లో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ, ఎంఓపీ, సూపర్ ఎరువులు సుమారు 45,775 మెట్రిక్ టన్నుల అవసరం ఉంది. అయితే ఇంకా రైతు సేవా కేంద్రాలకు ఎరువులు రాలేదు. ఎప్పుడొస్తాయో తెలియడం లేదు. ముందస్తు అంటూ.. నిర్లక్ష్యం చూపుతూ ముందస్తు సాగుకు వెళ్లాలని అధికారులు చెబుతూనే రైతులకు సకాలంలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. దీనివల్ల సాగు పంట ఆలస్యమవుతుంది. దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో అంటే అక్టోబర్, నవంబర్ మాసాల్లో తుపాన్లు, భారీ వర్షాలకు పంట తడిసిపోయి ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పక్కాగా ముందస్తు సాగుకు చర్యలు తీసుకునేది. ఇందులో భాగంగా ముందుగానే సాగునీరు విడుదల చేసేది. సకాలంలో రాయితీపై విత్తనాలు, రసాయన ఎరువులు అందించేది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసింది. అన్నదాత సుఖీభవ ద్వారా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. గత రబీ ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటినా నేటికీ ఆ డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేయలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖరీఫ్ ప్రారంభమైనా, రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే) ద్వారా ఇంకా రాయితీపై విత్తనాలు, ఎరువులు అందించడం లేదు. ప్రైవేట్ డీలర్ల హవా ప్రస్తుతం నాట్లు వేసే సమయం. యూరియా, డీఏపీ అత్యవసరం. ఆర్ఎస్కేల వద్ద ఎరువులు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ డీలర్ల వద్ద కూడా దొరకడం లేదు. కొంతమంది వద్దే స్టాక్ ఉంది. తప్పక ఆ షాపులకు వెళితే ఎంఆర్పీ రూ.265 ఉన్న యూరియా బస్తా రూ.320 చెబుతున్నారని రైతులు అంటున్నారు. ఇదేంటని అడిగితే తామే రూ.290కి కొనుగోలు చేశామని, రూ.30 కిరాయి, రూ.5 దిగుమతి చార్జి కలిపి మొత్తం రూ.325 అయ్యిందని అంటున్నారని వాపోతున్నారు. పైగా అవసరం లేకపోయినా యూరియాతో పాటు దానికి అనుసంధానంగా జింకు, సల్ఫర్ వంటి మందులు అంటగడుతున్నారని చెబుతున్నారు. ఫ ఎరువులు అందక అన్నదాతకు తిప్పలు ఫ నిరుపయోగంగా రైతు సేవా కేంద్రాలు ఫ సాగు కాలం మొదలైనా కానరాని సన్నద్ధత -
రక్షణ కల్పించాలని ప్రజల ఆందోళన
మామిడికుదురు: ఓఎన్జీసీ డ్రిల్లింగ్ బావి వద్ద బుధవారం జరిగిన గ్యాస్ కిక్ సంఘటన నేపథ్యంలో స్థానికులు గురువారం ధర్నా చేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేపట్టారు. పాశర్లపూడి – పాశర్లపూడిలంక గ్రామాల సరిహద్దులోని డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న రిగ్ వద్ద ఈ ధర్నా జరిగింది. ఓఎన్జీసీ కార్యకలాపాలతో అనుక్షణం తాము భయం, భయంగా గడుపుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఎక్కడో కూర్చుని పరిస్థితి అదుపులో ఉందని చెప్పడం ఏంటంటూ నిరసన తెలిపారు. డ్రిల్లింగ్ జరుగుతున్న ప్రాంతానికి వచ్చి ప్రజలకు తగిన వివరణ, భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడ చేపట్టిన రిఫైర్స్ పనులను అడ్డుకున్నారు. ఈ నిరసనలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు, పొన్నమండ రామస్వామి, బిరుదుగంటి నరసింహమూర్తి, మోకా దుర్గారావు, అడబాల దొరబాబు, గోనిపాటి మధుబాబు, తాడి శ్రీనివాసు, రొక్కాల రాజశేఖర్, పొలమూరి గోపాల్, ఉండ్రు చిన్న, నాగిడి వీరవెంకటరమణ, కోలా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్
దేవరపల్లి: పొలాల్లోని వ్యవసాయ మోటార్ల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగిలిస్తున్న అంతర జిల్లా చోరీ ముఠాను దేవరపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి పలు ట్రాన్స్ఫార్మర్లు, 65 రాగి దిమ్మలను, 116.600 కిలోల రాగి తీగతో పాటు రెండు కార్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ జి.దేవకుమార్ ఆ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వీరవాసరం మండలం రాయకుదురుకు చెందిన కడలి సతీష్, ఏలూరు జిల్లా కృతివెన్ను మండలం లక్ష్మీపురానికి చెందిన వేండ్రపు దుర్గాశ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం మంచిలికి చెందిన బళ్లా విజయరత్నం, భీమవరం మండలం దెయ్యాలతిప్పకు చెందిన ఏలూరి పోసయ్య ముఠాగా ఏర్పడి రెండు కార్లు సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రెండు బైక్లతో ఉదయం సమయాల్లో రెక్కీ నిర్వహించి, రాత్రి పూట ట్రాన్స్ఫార్మర్లను బద్దలు కొట్టి వాటిలోని రాగి తీగను దొంగిలించేవారు. ఇలా తూర్పు, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను చోరీ చేశారు. అందులోని రాగి తీగను భీమవరం మండలం గొల్లవానితిప్పకు చెందిన పావురాయల కోటేశ్వరరావు, దిరుసుమర్రుకు చెందిన సవరపు భీమారావులు కొనుగోలు చేసి తీగను కరిగించి దిమ్మలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. నిందితులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2023లో 49 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించి చేబ్రోలు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాగా, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఇప్పటి వరకూ వివిధ జిల్లాల్లో 115 ట్రాన్స్ఫార్మర్లను దొంగిలించగా, 67 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండడంతో జిల్లా ఎస్పీ, రాజమహేంద్రవరం సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల సహాయంతో ఆ ముఠాను బుధవారం సాయంత్రం దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద దేవరపల్లి ఎస్సై వి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారన్నారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని చెప్పారు. ఈ ముఠాను పట్టుకోవడానికి సహకరించిన రాజమహేంద్రవరం సీసీఎస్ సిబ్బంది, దేవరపల్లి స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్, రాజమహేంద్రవరం సీసీఎస్ సీఐ శ్రీధర్, బాలశౌరీ తదితరులు పాల్గొన్నారు. -
రత్నగిరి.. భక్తజన ఝరి
అన్నవరం: స్థానిక సత్యదేవుని సన్నిధిలో వ్యాసపూర్ణిమ (ఆషాఢ పూర్ణిమ) వేడుకలను గురువారం నిర్వహించారు. దర్బారు మండపంలో వ్యాస మహర్షికి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వ్యాస మహర్షి చిత్రపటంతో ఆలయ ప్రాంగణంలో మూడు సార్లు ప్రదక్షిణలు చేశారు. అనంతరం నీరాజనమంత్ర పుష్పాలు సమర్పించి ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారావు, దేవస్థానం వేదపండితులు పాల్గొన్నారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా వ్యాస పూర్ణిమ సందర్భంగా సుమారు 20 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు వెయ్యి జరగ్గా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. సుమారు నాలుగు వేల మంది భక్తులు నిత్యాన్నదాన పథకంలో స్వామివారి ప్రసాదం స్వీకరించారు. -
గోదారి ఇబ్బందులు
రాకపోకలకు బ్రేక్ అయినవిల్లి: ముక్తేశ్వరం – కోటిపల్లి రేవులో ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారిపై ఓ ప్రయాణికుడు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి పడబోతుండగా తోటి ప్రయాణికుడు కాపాడాడు. దీంతో పెనుముప్పు తప్పింది. ఇక్కడ ప్రమాదం పొంచి ఉండటంతో రేవులో పూర్తిగా రాకపోకలను నిలిపేశారు. పి.గన్నవరం: వరద వచ్చేసింది.. నీటి ప్రవాహం ఉధృతమవుతోంది.. లంక వాసులకు కష్టాలు తెచ్చిపెడుతోంది.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి నదీపాయల్లో వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో పి.గన్నవరం మండలం బూరుగులంక రేవు వద్ద నాలుగు లంక గ్రామాల ప్రజల రాకపోకల కోసం గతేడాది వశిష్ట నదీపాయలో తాత్కాలికంగా నిర్మించిన రహదారి గురువారం ఉదయం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామాల్లో సుమారు 3 వేల మంది నివసిస్తున్నారు. గతంలో 200 మీటర్ల పొడవున మట్టితో నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోవడంతో రేవులో రెండు ఇంజిన్ పడవలను ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు పడవలపై రాకపోకలు ప్రారంభించారు. అలాగే వరద ఉధృతికి ఊడిమూడిలంక వద్ద మట్టి లారీల రాకపోకల కోసం నిర్మించిన రహదారి, యర్రంశెట్టివారిపాలెం వద్ద ఏర్పాటు చేసిన బాటలు కూడా కొట్టుకుపోయాయి. వైవీ పాలెం వద్ద బాటలు కొట్టుకుపోవడం వల్ల పి.గన్నవరం మండలానికి సరిహద్దులో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలానికి చెందిన పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. తాత్కాలిక రహదారులు కొట్టుకుపోవడంతో వరదల సీజన్ తగ్గే వరకూ సుమారు మూడు, నాలుగు నెలల పాటు ఆయా లంక గ్రామాల ప్రజలు బయటకు రావాలంటే పడవలపైనే ప్రయాణించాలి. గతంలో వరద బాధితులను పరామర్శించేందుకు ఇక్కడకు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.49.5 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం విధితమే. ఇప్పటికి 60 శాతం పనులు పూర్తయ్యాయి. వంతెన నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. ఫ జి.పెదపూడిలో వరద ఉధృతి ఫ కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి ఫ నాలుగు లంక గ్రామాలకు మార్గం కట్ -
ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేందుకు డబ్బు డిమాండ్
రాజోలు: చనిపోయిన ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడానికి లంచం అడిగిన రాజోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె.రాంబాబును గురువారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ కథనం ప్రకారం.. రాజోలుకు చెందిన గుబ్బల కృష్ణతులసి భర్త బాలకృష్ణ స్థానిక ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్గా పని చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. బాలకృష్ణ మృతి చెందడంతో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన లబ్ధిని పొందేందుకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ తదితర ధ్రువీకరణ పత్రాలకు కృష్ణతులసి దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలలుగా ఆమెకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా ఆర్ఐ రాంబాబు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆమెకు నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసేందుకు రూ. 20 వేలు డిమాండ్ చేయడంతో కృష్ణతులసి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రూ. 20 వేలు ఆర్ఐ రాంబాబు తన కార్యాలయంలో తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్, సీఐలు భాస్కరరావు, సతీష్, వాసుకృష్ణ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడు రాంబాబును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. తన భర్త బాలకృష్ణ చనిపోయిన నాటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నానని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం ఆర్ఐ రాంబాబు రూ. 15 వేలు డిమాండ్ చేస్తే ఆ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్ తీసుకున్నానని బాధితురాలు కృష్ణతులసి చెప్పారు. మళ్లీ నో ఎర్నింగ్, నో ప్రొపర్టీ సర్టిఫికెట్స్ కోసం రూ. 20 వేలు డిమాండ్ చేస్తే విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఆర్ఐ రాంబాబు నాలుగు నెలల కిందట రామచంద్రపురం నుంచి రాజోలు బదిలీపై వచ్చారు. వచ్చిన నాటి నుంచి ఆయనపై తమకు పలు ఫిర్యాదులు వచ్చాయని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 26,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 25,500 గటగట (వెయ్యి) 24,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జక్కంపూడి కుటుంబం కట్టె కాలే వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని ఆ పార్టీ యువజన విభాగం గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త జక్కంపూడి గణేష్ స్పష్టం చేశారు. తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటు తన కుటుంబ సభ్యుల వ్యక్తిత్వహననానికి పాల్పడుతూ కొందరు పనిగట్టుకుని సామాజిక మాధ్యమాల్లో చేస్తోన్న ట్రోలింగ్పై గణేష్ తీవ్రంగా స్పందించారు. గురువారం రాత్రి కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్ల మీద తమపై జనసేన నేతలు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలన్నారు. జనసేన నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఇక్కడితో కట్టిపెట్టాలన్నారు. లేదంటే అందుకు తగిన రీతిలో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. పవన్ కళ్యాణ్పై తన సోదరుడు రాజా అభివృద్ధి విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు అవాకులుచవాకులు మాట్లాడుతున్నారన్నారు. ఇదే పవన్కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు తామెంత బాధపడ్డామో వారికి తెలియదా అని గణేష్ ప్రశ్నించారు. తన తండ్రి రామ్మోహన్రావుపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న వారు గత చరిత్ర తెలుసుకుని మాట్లాడాలన్నారు. తన సోదరుడు రాజా జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేస్తున్న ప్రచారాన్ని గణేష్ ఖండించారు. తమ కుటుంబం రాజశేఖర్రెడ్డితో కలసి ప్రయాణించిందని, ఆయన బిడ్డ జగన్ వెంటే ఉంటుందన్నారు. తమ కుటుంబానికి రాజకీయాలు కొత్త కాదని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. తమ పార్టీ ఓడిపోయినా తాము మాత్రం ఎక్కడికీ పారిపోలేదన్నారు. గెలిచినప్పుడు ఎలా పని చేశామో... ఓటమి తరువాత అదే విధంగా నియోజకవర్గంలో పని చేస్తున్నామన్నారు. తన తండ్రికి దక్కిన గౌరవమే తన అన్న రాజాకు దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తన సోదరుడు మరో మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాకనే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తామన్నారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడండి 1999 ఎన్నికల్లో రాష్ట్రంలోనే కాకుండా గోదావరి జిల్లాల్లో టీడీపీ విజయం సాధిస్తే ఒకే ఒక స్థానం కడియం నుంచి జక్కంపూడి రామ్మోహనరావు మాత్రమే గెలిచిన చరిత్ర తెలుసుకుని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సహా ఆ పార్టీ నేతలు మాట్లాడాలని గణేష్ హితవుపలికారు. రాజానగరంలో బత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ ఇద్దరికీ ఒకటే భయం పట్టుకుందన్నారు. జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వచ్చేస్తే వారిని తట్టుకోలేమనే భయం వారిని వెంటాడుతోందన్నారు. జక్కంపూడి కుటుంబం చివరి వరకూ వైఎస్సార్ సీపీతోనే ఉంటుందని గణేష్ పునరుద్ఘాటించారు. తాజాగా రైజ్ అనే సంస్థ రాష్ట్రంలో ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి, అక్రమాలపై నిర్వహించిన సర్వేలో మొదటి స్థానంలో పంతం నానాజీ, రెండో స్థానంలో బత్తుల బలరామకృష్ణ ఉన్న విషయం తేటతెల్లమైందన్నారు. ఫ అనవసర ప్రేలాపనలు కట్టిపెట్టండి ఫ యువజన విభాగం ప్రాంతీయ సమన్వయకర్త గణేష్ -
కాకినాడ జీజీహెచ్లో కీచకులు
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో కీచకఘట్టం వెలుగుచూసింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన విద్యార్థినులు బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. విషయం రాష్ట్ర డీఎంఈకి చేరింది. వివరాల్లోకి వెళితే, కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్స్సీ–ఎంఎల్టీ విద్యనభ్యసిస్తున్న వారితో పాటు వివిధ ఒకేషనల్ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్లోని ల్యాబ్లలో శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో ఏడవ నంబర్, అంబానీ ల్యాబ్లలో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా, అదే ల్యాబ్లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఒక హెచ్వోడీ, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్ టెక్నీషియన్ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్ టెక్నీషియన్ ప్రసాద్లను విచారించింది. విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే వాట్సాప్ చేసే వాడనీ, వాటిని మరెవరికీ షేర్ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే, పరీక్షల్లో ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యుల్ని తక్షణమే సస్పెండ్ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు తెలిసింది. -
రోడ్డేసి ఊళ్లోకి రండి..!
కాకినాడ జిల్లా: ‘ఏలేశ్వరం నుంచి వెళ్లే ప్రధాన రహదారిని నిర్మించండి. ఆ రోడ్డు పూర్తి చేశాకనే మా ఊరిలోకి రండి. అంతవరకు దయచేయండి’ అంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. గ్రామంలో బుధవారం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిమిత్తం టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు. విషయం తెలుసుకున్న యువకులు, గ్రామస్తులు ఎంపీపీని, టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. ఏలేశ్వరం నుంచి తమ గ్రామంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని పలు మండలాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రహదారి అధ్వానంగా మారిందని, ఎన్నికల ముందు రహదారి నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు నిర్మాణం ఎందుకు చేపట్టలేదంటూ నాయకులను నిలదీశారు. రహదారి నిరి్మంచిన తరువాతే గ్రామంలోకి రావాలని భీష్మించారు. గ్రామస్తులకు సమాధానం చేప్పేందుకు టీడీపీ నాయకులు ఇబ్బంది పడ్డారు. చివరికి ఎలాగోలా గ్రామస్తులను శాంతింపజేసి తమ కార్యక్రమం కొనసాగించారు. -
గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి
గోకవరం: అప్పటి వరకూ విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. విధి నిర్వహణలో గుండెపోటుకు గురై తనువు చాలించాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. గోకవరం గ్రామానికి చెందిన బొమ్మగంటి నాగభూషణం (57) తంటికొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో లెక్కల ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. బుధవారం పాఠశాలకు వెళ్లిన ఆయన రెండు తరగతుల్లో బోధించారు. ఇంటర్వెల్ సమయంలో ఒక్కసారిగా ఆయన కుప్పకూలిపోగా తోటి ఉపాధ్యాయులు వెంటనే ఆయన్ని 108 వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన ఇటీవల రంపయర్రంపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ నుంచి బదిలీపై తంటికొండకు వచ్చారు.కుమార్తె వివాహం చేసిన నెలలోనే..ఉపాధ్యాయుడు నాగభూషణంకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు గత నెలలో ఘనంగా వివాహం జరిపించారు. ఇంతలోనే ఈ విషాద ఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
చివరికి దిగొచ్చి... కొబ్బరి కాయలు వినియోగించి..
ఐ.పోలవరం: మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారి కల్యాణంలో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించారు. కొబ్బరి ధరలు పెరగడంతో వాటిని పక్కనబెట్టి అభిషేకాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ‘సాక్షి’ దినపత్రికలో ‘వీరేశ్వరా.. క్షమించవా’ అనే శీర్షికన బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో దేవస్థానం అధికారులు స్పందించి స్వామివారికి నిర్వహించే అభిషేకాల్లో కొబ్బరి కాయలను తిరిగి వినియోగించడం మొదలు పెట్టారు. రూ.వెయ్యి పెట్టి అభిషేకం చేయించుకుంటున్న భక్తుల పేరున వినియోగించాల్సిన రెండు కొబ్బరి కాయలను వాడకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనికి స్పందించిన ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి.సత్యనారాయణ కొబ్బరికాయలతో అభిషేకం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయంలో గతంలో జరిగినట్లే కల్యాణ అభిషేకాలు జరుగుతున్నాయని తెలిపారు. కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో కల్యాణ భక్తులకు అసౌకర్యం కలిగిన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ఆలయ సూపరింటెండెంట్ను ఆరా తీయగా కొబ్బరి కాయల పాటదారుడు సకాలంలో కొబ్బరికాయలు సరఫరా చేయకపోవడం వల్ల అసౌకర్యం కలిగిందని, ఇది తన దృష్టికి రాగానే చర్యలు తీసుకున్నానని చెప్పారు. సంబంధిత సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. -
అదే వేలంకొర్రి!
కౌలు రైతులను ఇబ్బందులు పెట్టకండి శ్రీ సంస్థానంకు చెందిన తొండంగిలోని భూములకు కౌలు వేలం వేయడానికి అధికారులు మూడు నెలల నుంచి వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. వాయిదాలు వేయడం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సాగుకాలం దగ్గర పడడంతో ఇప్పటికే చాలామంది రైతులు దుక్కులు దున్నుకుని, నారుమడులకు సిద్ధపడుతున్నారు. దేవదాయశాఖ అధికారులు ఇకనైనా వాయిదా వేయకుండా వేలం నిర్వహించడం కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్న రైతులకే కౌలు కొనసాగించడం కానీ చేయాలి. – నాగం గంగబాబు, వైస్ ఎంపీపీ, తొండంగి సాక్షి ప్రతినిధి, కాకినాడ: లక్షల ఆదాయం వస్తుందని తెలిసినా దాన్ని రాబట్టుకోవడంలో దేవదాయశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. పిఠాపురం మహారాజా దానం చేసిన వందల ఎకరాల భూములకు వేలం నిర్వహించకుండా వాయిదాలు వేస్తూ దేవాదాయానికి గండికొడుతున్నారు. అధికార పార్టీ నేతల మోచేతి నీళ్లు తాగుతూ వారు చెప్పినట్టు తలాడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేలం వాయిదాకు వారు చూపుతున్న సాకులు, చెబుతున్న కారణాలు చూసి రైతులు విస్తుపోతున్నారు. మొదట మే 23, తరువాత జూన్ 6 అన్నారు. ఆ తరువాత జూన్ 20కి వాయిదా వేసి అప్పుడు కూడా వేలం నిర్వహించలేదు. తిరిగి ఈ నెల ఎనిమిదిన అన్నారు. ఆ తేదీన కూడా జరపలేదు. మళ్లీ జూలై14 తేదీకి వాయిదా వేశారు. ఒకోసారి ఒకో కుంటిసాకు చెబుతూ వేలాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. కడపలో టీడీపీ మహానాడుకు రైతులు వెళ్లిపోతున్నారని ఒకసారి, యోగా డే అని మరోసారి, తాజాగా మంగళవారం పోలీసు బందోబస్తు లేదని...ఇలా వాయిదాలు వేస్తూ అధికారులు కూటమి నేతల కొమ్ము కాస్తూవస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవదాయశాఖ కాకినాడ జిల్లా కార్యాలయం నుంచి పిఠాపురం శ్రీ సంస్థానం కార్యనిర్వాహణాధికారి కార్యాలయం వరకు అధికారులు కావాలనే కాలయాపన చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సంస్థానంకు చెందిన రెండు పంటలు పండే సారవంతమైన 511 ఎకరాలున్నాయి. ఇందులో రైతులు మకాంలు తీసేయగా సాగులో ఉన్న మిగిలిన 478 ఎకరాలకు వేలం వేయకుండా నాలుగోసారి కూడా వాయిదా వేయడం విస్మయానికి గురిచేస్తోంది. దేవదాయశాఖ చరిత్రలో ఇంత నిస్సిగ్గుగా ఇన్ని వందల ఎకరాల భూములకు వేలం వేయకుండా వాయిదాలు వేస్తున్న తీరు విస్తుగొలుపుతోంది. దేవదాయశాఖ పారదర్శకంగా వేలం వేస్తే హక్కులు దక్కించుకుందామని, కౌలుకు సాగు చేసుకుందామని సుమారు రెండు వందల మంది కౌలు రైతులు ఎదురుచూస్తున్నారు. పంపా జలాశయంలో నీటిమట్టం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఒక పక్క ఖరీఫ్ సాగుకు అదను దగ్గర పడుతోంది. వేలం ఎప్పుడు వేస్తారో? భూములు ఎవరికి దక్కుతాయా అని ఎదురుచూస్తూ ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న కౌలు రైతులు దుక్కులు దున్ని ఆకుమడుల కోసం భూములు సిద్ధం చేస్తున్నారు. అసలు భూములకు వేలం వేస్తారా లేదా అని కౌలురైతులు అనుమానపడుతున్నారు. దొడ్డిదారిన దక్కించుకోవాలని... పంపా ఆయకట్టు పరిధిలోకి వచ్చే ఈ భూములను మూడేళ్ల కాలానికి వేలం నిర్వహిస్తుంటారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వేలం నిర్వహించి మూడేళ్ల కాలానికి రైతులకు భూములు కౌలుకు ఇచ్చారు. ఎకరాకు రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కౌలు ఖాయమైంది. కౌలు గడువు ముగిసిపోయింది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. అంతే తుని ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోయారు. వేలం వేయకుండా దొడ్డిదారిన ఆ భూములను దక్కించుకోవాలనే కుయుక్తులతో అధికార పార్టీకి చెందిన తుని పెద్దన్న కనుసన్నల్లో తెలుగు తమ్ముళ్లు పెద్ద స్కెచ్ వేశారు. మొదట భూములకు వేలం వేయకుండా అడ్డుకట్ట వేయాలనేది వారి ప్లాన్. అంత వరకు వారు దేవదాయశాఖ అధికారుల తోడ్పాటుతో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు వారంతా భూములు ఎలా దక్కించుకోవాలనే ఎత్తుగడలకు పదును పెడుతున్నారు. శ్రీ సంస్థానం భూముల వేలంపాట మళ్లీ వాయిదా దేవాదాయానికి ‘తమ్ముళ్ల’ తూట్లు ఏటా రూ.70 లక్షల ఆదాయానికి గండి నాలుగోసారి వాయిదా పడిన వైనం చక్రం తిప్పుతున్న తుని పెద్దన్న ఎంతకాలం వాయిదాలు వేస్తారు? వాస్తవానికి ఈ భూముల వేలం ద్వారా ఏటా శ్రీ సంస్థానానికి సుమారు రూ.70 లక్షల ఆదాయం వస్తోంది. అదే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా పారదర్శకంగా గనుక వేలం నిర్వహిస్తే మూడేళ్ల కాలానికి రూ.2.15 కోట్ల ఆదాయం వస్తుంది. ఇంతటి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా దేవదాయశాఖ అధికారులు మాత్రం అధికారపార్టీ నేతలకు కొమ్ము కాస్తూ వాయిదాలతోనే కాలక్షేపం చేస్తున్నారు. నాడు పిఠాపురం రాజా బాటసారులు, పాదగయ, కుక్కుటేశ్వరస్వామి తదితర ఆలయాలకు వచ్చే భక్తుల ఆకలితీర్చాలనే ఆశయంతో 511 ఎకరాలు దానం చేశారు. శ్రీ సంస్థానం సత్రం పిఠాపురంలో ఉన్నప్పటికీ భూములు మాత్రం తుని నియోజకవర్గం తొండంగి మండలంలో ఉన్నాయి. తొండంగి మండలంలో 538, 545, 553, 535, 623, 565, 690 సర్వే నంబర్లలో ఈ భూములున్నాయి. ఇన్ని ఎకరాలకు వేలం వేయకుండా ఎంతకాలం వాయిదాలు వేస్తారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. పవన్ పట్టించుకోవడం లేదేం? ఇదిలా ఉండగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పెద్ద యుద్ధమే చేస్తున్నారని పవన్ అభిమానులు గొప్పగా చెప్పుకొంటున్నారు. అటువంటి పవన్ శ్రీ సంస్థానం భూముల వేలం నిర్వహించకపోవడంపై ఎందుకు దృష్టి పెట్టడంలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. భూములున్నది తుని నియోజకవర్గంలో అయినా భూములిచ్చింది పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పిఠాపురం రాజా అనే విషయాన్ని పవన్ అభిమానులు గుర్తించకుంటే ఎలా అంటున్నారు. చివరకు శ్రీ సంస్థానం కార్యాలయం కూడా పిఠాపురంలో ఉండటాన్ని గుర్తుచేస్తున్నారు. -
ప్రచారం ఇదేండబ్బా
ప్రచారం.. పనిభారం ఈ కార్యక్రమ మార్గదర్శకాల్లోనే నాలుగైదు రోజుల ముందు నుంచే ఏమేమి చేయాలో కార్యకలాపాలను పొందుపర్చారు. పాఠశాలల్లో పాఠా లు చెప్పాల్సిన ఉపాధ్యాయులను తల్లికి వందనం పథకాన్ని ప్రచారం చేసేవారిగా ప్రభుత్వం మార్చేసింది. 17 కమిటీలను వేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయమని ప్రభుత్వం చెప్పడంతో ఉపాధ్యాయులంతా ఇదే పనికి తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఇందులో ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు సచివాలయ, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులను భాగస్వాములను చేశారు. వీరిని ఒక్కో పాఠశాలకు పర్యవేక్షకులుగా నియమించారు. వారి శాఖల పనిని పక్కన పెట్టి ప్రభుత్వ ఆదేశాలను పాటించే స్థితికి తీసుకొచ్చారు. కపిలేశ్వరపురం: చేసేది తక్కువ... గొప్పలెక్కువ అన్నట్టు కూటమి ప్రభుత్వ తీరు ఉంది. విలువైన ప్రజాధనాన్ని ప్రచారానికే కేటాయిస్తుంది. ఇప్పటి వరకూ యోగా దినోత్సవం పేరుతో సుమారు రూ.300 కోట్లను ఖర్చు చేసింది. అంతర్జాతీయంగా కూటమి ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయంటూ గొప్పలు చెప్పుకొంది. అదే కోవలో నేడు మరో ప్రచారానికి సిద్ధం చేసింది. మెగా పేరెంట్స్, టీచర్స్ డే కార్యక్రమాన్ని మెగా పీటీఎం 2.0 పేరుతో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించేందుకు కార్యాచరణ చేసింది. విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ కార్యక్రమం వెనుక కూటమి ప్రభుత్వ ప్రచారం దాగి ఉంది. దీని నిర్వహణకు పరిమితంగా నిధులను కేటాయించి, స్కూల్ కాంపోజిట్ గ్రాంట్ నుంచి ఖర్చు పెట్టుకోమని చెబుతోంది. ప్రైవేట్ సంస్థల్లో ఆ యాజమాన్యం సొంత ఖర్చుతో కార్యక్రమాన్ని పండగలా చేయాలని సూచించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ప్రస్తుతం ఈ కార్యక్రమం తలకు మించిన భారంగా మారుతోంది. నేడు విద్యాసంస్థల్లో కార్యక్రమాలు జిల్లావ్యాప్తంగా ఉన్న 2,150 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు, ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలలో అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల ఫలితాల వివరాలతో కూడిన హోలెస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను విద్యార్థులకు అందజేయనున్నారు. వీటితోపాటు మరికొన్ని కార్యక్రమాలు రూపొందించినప్పటికీ ప్రధాన అజెండా కూటమి ప్రభుత్వ ప్రచారమే. తల్లికి వందనం సాయం అందజేశామన్న విషయాన్ని ఫోకస్ చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు ఈ నెల 4న ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్స్కు అమలాపురం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం సన్నాహక సమావేశం నిర్వహించారు. 8న జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు కరస్పాండెంట్స్, ప్రిన్సిపాల్స్కు జిల్లా సన్నాహక సమావేశం జరిపారు. పిల్లలకు పాఠాలు చెప్పే పనిని పర్యవేక్షించాల్సిన విద్యా సంస్థ నిర్వాహకులు, బాధ్యులను కూటమి ప్రభుత్వ ప్రచారాన్ని సమయాన్ని కేటాయించమనడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇది సాధ్యమయ్యేనా? పాఠశాలల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులతో మొక్కలను నాటాలని సూచించారు. ఆ మొక్కలను విద్యార్థి బాధ్యతగా సంరక్షించాలని చెబుతున్నారు. రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అది సాధ్యం కాదు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంటే మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ ప్రత్యేక నిధులను, సిబ్బందితో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. వివాదాలు రాకుండా చూడాలని.. పేరెంట్స్ మీటింగ్ అనగానే తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సాయం వివరాలను తెలుసుకోవాలని అనుకుంటారు. ఇటీవల తల్లికి వందనం లబ్ధిదారుల్లో అనేక మంది అర్హులకు సాయం అందలేదు. వారు అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం పేరెంట్స్ మీటింగ్లో వివాదాలు రాకుండా చూసుకునే బాధ్యత నిర్వాహకులదే అని, ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలంటూ సూచించింది. మెగా పీటీఎం 2.0 పేరుతో కార్యక్రమం తల్లికి వందనంపై సొంత బాకా ఉపాధ్యాయులకు పనిభారం పక్కదారి పట్టిన విద్యాబోధన -
కనకదుర్గమ్మకు ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల సందర్భంగా బుధవారం ఘనంగా చండీహోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీహోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేశారు. చండీ హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు సంతోష్ అవధాని, ఆలయ అర్చకుడు చిట్టెం గోపీ, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ నిర్వహించారు. నలుగురు భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. ఆర్టీసీలో లైంగిక వేధింపుల ఫిర్యాదుపై విచారణ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కాకినాడ ఆర్టీసీ డిపోలో కండక్టర్లుగా పనిచేస్తున్న మహిళలపై డిపోకు చెందిన ఒక ఉద్యోగి లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు విజయవాడ నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేసేందుకు బుధవారం వచ్చారు. అయితే ఫిర్యాదు దారు పేరు లేకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీలో పనిచేస్తున్న అందరి మహిళలను ఉన్నతాధికారులు విచారించారు. తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని మహిళా కండక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొందరు వ్యక్తులు కావాలని ఆర్టీసీ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసినట్లు అక్కడ ఉద్యోగులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి నివేదిక ఉన్నతాధికారులు సమర్పిస్తామని చెప్పారు. రైల్వే ఉద్యోగుల ధర్నా సామర్లకోట: రైల్వే ఉద్యోగులకు అమలు చేస్తున్న నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైల్వే ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు. రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీరు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్ ప్రతీ కార్మికుని హక్కు అని, దాని సాధనకు కార్మికులందరూ ఐక్యంగా కలిసి రావాలని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం.రమేష్ కోరారు. రైల్వే ఉద్యోగుల న్యాయబద్ధమైన కోర్కెలను అమలు చేయాలని నినాదాలు చేశారు. సంఘ చైర్మన్ టి.ఈశ్వరరావు, వర్కింగ్ చెర్మన్ రామకృష్ణ, అసిస్టెంట్ సెక్రటరీ విశ్వప్రసాద్, వైస్ చైర్మన్ గోపాలరెడ్డి, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ గౌరవ అధ్యక్షుడు కెవీ వెంకటేశ్వరరావు, ఇంజినీరు రామసుబ్బారావు పాల్గొన్నారు. -
దళిత మహిళపై దాడి అమానుషం
అనపర్తి: దుప్పలపూడి గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళ కొమ్ము బుజ్జిపై దాడికి పాల్పడిన టీడీపీ నేత ఎన్.వెంకటరెడ్డి, అతని అనుచరులను 24 గంటల్లో అరెస్టు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని మాదిగ న్యాయవాదుల సమాఖ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. బుధవారం అనపర్తి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బుజ్జిని వారు పరామర్శించారు. నిందితులు ఎంత పలుకుబడి కలిగిన వారైనా భయపడాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ న్యాయవాదుల సమాఖ్య అధ్యక్షుడు కొండేపూడి ఉదయ్కుమార్ మాట్లాడుతూ ఈ నెల 6న దుప్పలపూడి గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఎన్.వెంకటరెడ్డి (ఎన్వీ) దళిత మహిళ బుజ్జిపై అమానుషంగా దాడి చేయడంతో మాదిగ సంఘాల తరఫున నిజ నిర్ధారణ కమిటీగా తాము ఇక్కడకు వచ్చామని తెలిపారు. తమ పరిశీలనలో ఇది కచ్చితంగా కుల వివక్షతోనే జరిగిన దాడిగా గుర్తించామన్నారు. గతంలో జరిగిన ప్రమాదంలో పోలీసులు కేసు నమోదు చేయడం బుజ్జి మరిది వీరబాబు బెయిల్ పై రావడం వ్యవహారం కోర్టులో నడుస్తుండగా దళితులను, అమాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ వెంకటరెడ్డి తన అధికార మదంతో ఇంటి వద్ద ప్రైవేట్ పంచాయితీ నిర్వహించడమేంటని ఆయన ప్రశ్నించారు. చట్టవిరుద్ధంగా ఇటువంటి పనులను చేస్తున్న వెంకటరెడ్డిని మూడు రోజులు కావొస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. 24 గంటల్లో నిందితులను అరెస్టు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్సీఎస్ నాయకులు కొత్తపల్లి ప్రసాద్, ధూళి జయరాజు, ఆకుమర్తి చిన్నా, మానవ హక్కుల సంఘ సభ్యురాలు ఖండవిల్లి లక్ష్మి, ఎమ్మార్పీఎస్ నాయకులు గాలంకి నాగేశ్వరరావు, పల్లేటి శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు. నిందితుడు ఎన్వీ రెడ్డిని అరెస్టు చేయాలి మాదిగ సంఘాల నాయకుల డిమాండ్ -
లేటరైట్ రవాణా వాహనాల అడ్డగింపు
రౌతులపూడి: గిరిజన ప్రాంతాల్లో సహజ వనరుల దోపిడీ ఆపాలంటూ సబ్ప్లాన్ ఏజెన్సీ వాసులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ మేరకు సబ్ప్లాన్ ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా లేటరైట్ రవాణా చేసే లారీలను జల్దాం, మాతయ్యపేటకు చెందిన పలువురు గిరిజనులు అడ్డుకున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు దోచేస్తున్నారంటూ గగ్గోలు పెట్టిన నాటి ప్రతిపక్ష నాయకులు (నేటి పాలకులు) మూడేళ్ల క్రితం సబ్ప్లాన్ ఏజెన్సీలో పర్యటించి గిరిజన ప్రాంతాలను ఉద్దరిస్తామంటూ చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని వారు ప్రశ్నించారు. అధికారరంలోకి వచ్చింది సహజ వనరులు దోపిడీకేనా అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్దు ప్రాంతంలో లాటరైట్ను వందలాది భారీ వాహనాల్లో భారీగా రవాణా సాగించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. శబ్ధ,వాయు కాలుష్యాలకు గురై నిత్యం అనారోగ్యాల పాలవుతున్నామని, రహదారులు ఛిద్రమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు వాపోయారు. రహదారికిరువైపులావున్న వ్యవసాయ భూములు నాశనమవుతన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక రెవెన్యూ, మండల పరిషత్ కార్యాలయాల్లోను, స్థానిక పోలీస్ స్టేషన్లోను జిల్లా కలెక్టర్కు గతంలో ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. సీఎంఓ కార్యాలయానికి, అటవీ, పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి, డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్కు ఫిర్యాదు చేశామని వారు వివరించారు. స్థానిక గిరిజనులను మభ్యపెట్టి లాటరైటను తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే లాటరైట్ తరలింపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లారీలు అడ్డగించడంతో రవాణా చేసేవారికి గిరిజనులకు కొంతసేపు వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై లాటరైట్ నిర్వాహకులకు తెలియజేసి తక్షణమే లాటరైట్ రవాణాను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన నాయకులు గంటిమళ్ల గంగరాజు, రావుల తారక్, ఆమూరి సుధారాణి, ఆమూరి చంద్రారెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు అంటేనే మోసం..దగా
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా సామర్లకోట: చంద్రబాబు అంటేనే మోసం..దగా అని దీనిని ప్రజలందరూ గుర్తించారని కాకినాడ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు. పెద్దాపురం నియోజవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు ఽఅధికారం కోసం ఏదైనా చేస్తారన్నారు. నాలుగుసార్లు మోసం చేయడంతో తనను నమ్మరని తెలిసి పవన్కల్యాణ్ను అడ్డు పెట్టుకున్నారన్నారు. గత ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మరో పర్యాయం మోసం చేశారని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేశారని తెలిపారు. రైతులను, మహిళలను, యువతను ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దానికి ప్రభుత్వం సిగ్గు పడాలన్నారు. జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటన చేసిన ప్రజలు ఉప్పెనలా రావడంతో చంద్రబాబు చూడలేక పోతున్నారని తెలిపారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లే వారిపై కేసులు పెడతామని చెప్పి 1,200 మందిపై కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్య రంగాలను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాస్పత్రులలో మందులు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ఇంగ్లిషు మీడియంను రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సూపర్ సిక్స్లో రెండు పథకాలు మాత్రమే అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. సూపర్ సిక్స్పై పవన్ కల్యాణ్ బాధ్యత తీసుకొవాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని, అవసరమైతే పోరాటాలకు సిద్ధమని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో ఏక పక్షంగా విజయం సాధించే విధంగా కార్యకర్తలు ఐక్యతతో పని చేయాలన్నారు. దొరబాబును ఎమ్మెల్యేగా చేయడానికి ప్రతీ ఒక్కరూ పని చేయాలని సూచించారు. అర్హతే ప్రామాణికంగా పథకాలు... జగన్మోహన్రెడ్డి ప్రజలకు అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేశారని, వైఎస్సార్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. సీఎం స్థానంలో ఉన్నవారికి మేనిఫెస్టోపై బాధ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో తాను మాట్లాడిన దానికి తప్పుడు అర్థాలు తీయడం ఏమిటని ప్రశ్నించారు. తమది ఉడత బెదిరింపులకు భయపడే కుటుంబం కాదని, ప్రజల తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామన్నారు. పవన్ కల్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకొని ఎదిగి, వారికి ఏమి మేలు చేశారని ప్రశ్నించారు. కాకినాడ జిల్లా పరిశీలకులు దాట్ల సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్లు ఇంటింటికీ సంక్షేమ పథకాలతో కుటుంబానికి ఏడాదికి ఎంత లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ బాండ్లు పంపిణీ చేశారని, అధికారంలోనికి వచ్చాకా మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. -
నానాటికీ ప్రభంజనం..
ఆలమూరు: భారతదేశం జన ప్రభంజనం అవుతుంది.. నియంత్రించకుంటే భవిష్యత్ అధోగతిగా మారుతుంది.. చిన్న కుటుంబం– చింతలు లేని కుటుంబం. ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు. ఈ నినాదాలకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడుతోంది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశ జనాభా కేవలం 35 కోట్లు కాగా, 80 ఏళ్ల అనంతరం నాలుగు రెట్లకు పైగా చేరుకుందని అంచనా. రోజు రోజుకూ పెరిగిపోతున్న జనాభా వల్ల నానాటికీ కరిగిపోతున్న వనరులతో భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారింది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాలైన ఆహారం, ఉపాధి, వివిధ అవసరాలు తీర్చడం ప్రభుత్వాలకు భారం అవుతోంది. అధిక జనాభాతో అడవులు సైతం అంతరించి పోతుండగా పంట భూములు ఆవాస ప్రాంతాలుగా మారిపోతున్నాయి. దీనివల్ల పర్యావరణంలో సమతుల్యత లోపించి భవిష్యత్లో పుడమికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సామాజికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి అధిక జనాభా వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం నిర్వహిస్తుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జాతీయ జనాభా 2011 గణాంకాల ప్రకారం 51,54,296 మంది ఉండగా, ఇందులో 25,69,888 మంది పురుషులు, 25,84,608 మంది సీ్త్రలు ఉన్నారు. అయితే 2025 మార్చి 31 నాటికి ఈ జనాభా సుమారు 55.38 లక్షలుగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పరిపాలన సౌలభ్యం కోసం ఉమ్మడి జిల్లాను 2022 ఏప్రిల్ 4న అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మూడు జిల్లాలుగా విభజించింది. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కాగా, రంపచోడవరం నియోజకవర్గాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విలీనం చేశారు. దీంతో జనాభా గణాంకాల్లో తీవ్రమైన వ్యత్యాసం ఏర్పడింది. జిల్లాలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10.98 శాతంగా ఉన్న పెరుగుదల 2011కు వచ్చేసరికి 13.86 శాతంగా ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ జనాభా శాతం మరింత పెరిగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనివల్ల ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కష్టతరం అవుతుంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. అందువల్ల వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గణనకు షెడ్యూల్ విడుదల జనాభా నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కృషి చేస్తే దేశ భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 2011లో జరిగిన జనగణన తరువాత పదేళ్ల తరువాత 2021లో జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో కోవిడ్–19 ప్రభావం అధికంగా ఉండటంతో వాయిదా పడుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం గణనలో భాగంగా 2026 ఏప్రిల్ ఒకటి నుంచి తొలుత ఇళ్లు, ఆస్తుల వివరాలు నమోదు చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. అనంతరం 2027 ఫిబ్రవరి నుంచి జన, కుల గణనలను ఒకేసారి చేపట్టేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ జన, కుల, ఆస్తుల గణనలో ప్రతి ఒక్కరి నుంచి 36 ప్రశ్నలకు సంబంధించి సమాచారాన్ని సేకరించనుంది. ప్రాధాన్యం ఇస్తే మేలు ఉమ్మడి జిల్లాలో అధిక జనాభా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. జనాభా పెరుగుదలతో కలిగే దుష్ఫరిణామాలను ప్రజలకు వివరించేందుకు ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కల్పించాలి. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసి ప్రోత్సాహకాలను అందజేయాలి. సమాజంలో వీలైనంత మేరకు అధిక వయసు పెళ్లిళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివాహం చేసుకున్న ప్రతి జంట స్వచ్ఛంద నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉంది. అధిక జనాభాతో వనరుల లభ్యత కరవు 2027 ఫిబ్రవరి 1 నుంచి జన, కులగణన రేపు ప్రపంచ జనాభా దినోత్సవం జిల్లాల వారీగా జనాభా వివరాలు జిల్లా జనాభా పురుషులు సీ్త్రలు వైశాల్యం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 17,19,013 8,58,632 8,60,381 2,083 కి.మీ కోనసీమ కాకినాడ 20,92,374 10,45,269 10,47,105 3,020 కి.మీ తూర్పుగోదావరి 18,32,332 9,15,325 9,17,007 2,561 కి.మీ -
బంగారు కుటుంబాలను ప్రతి ఉద్యోగి దత్తత తీసుకోవాలి
పెద్దాపురం/జగ్గంపేట: ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అన్నారు. పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో దొండపాటి చార్లెస్, స్వర్ణలత కుటుంబాన్ని దత్తత తీసుకున్న ఆయన.. మంగళవారం వారి ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబ వివరాలు, ఆర్థిక స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ, జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో శాంతా దుర్గమ్మ, ప్రత్తిపాడులో మాదే రమణ కుటుంబాలను కూడా తాను దత్తత తీసుకున్నానని చెప్పారు. అట్టడుగున ఉన్న కుటుంబాలను గుర్తించి సంపన్న కుటుంబాలు సాయం అందిచడమే పీ–4 లక్ష్యమని అన్నారు. అనంతరం వడ్లమూరులో మొక్కలు నాటారు. కాట్రావులపల్లిలో పర్యటించిన కలెక్టర్ షణ్మోహన్ పీ–4 కార్యక్రమంలో స్థానిక ఏగులమ్మ గుడి వద్ద ఉన్న శాంతా దుర్గమ్మ కుటుంబాన్ని కలిశారు. ఆమె భర్త సాంబశివరావు ఏడాది క్రితం మృతి చెందారు. ఎటువంటి ఉపాధీ లేకపోవడంతో ఇద్దరు పిల్లలతో ఆమె ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని కలెక్టర్ దత్తత తీసుకున్నారు. ఇంటి స్థలం మంజూరు చేసి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహకారం అందిస్తామని చెప్పారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎంచుకునే ఉపాధి చెబితే సహకరిస్తామని తెలిపారు. నెల రోజుల సమయం తీసుకుని మండల అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీఓ కె.శ్రీరమణి, జిల్లా ప్రణాళికాధికారి త్రినాథ్, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎ.శ్రీనివాస్, పెద్దాపురం, జగ్గంపేట తహసీల్దార్లు, ఎంపీడీఓలు వెంకటలక్ష్మి, జేవీఆర్ రమేష్, శ్రీలలిత, ఏవీఎస్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మద్యం అనుబంధ నేరాలు నియంత్రించాలి కాకినాడ క్రైం: మద్యం అనుబంధ నేరాలను నియంత్రించాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.చైతన్య మురళి అన్నారు. కాకినాడలోని కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కోనసీమ జిల్లా అమలాపురం మండలం పేరూరులో గత నెల 23న లిక్కర్ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై కె.రవితేజ, కానిస్టేబుళ్లు జి.హనుమంతరావు నాయుడు, ఎం.భావనారా యణలను ఘనంగా సత్కరించారు. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిందని, పది మంది ముద్దాయిలను అరెస్టు చేశారని తెలిపారు. ఈ కేసు ద్వారా పాలకొల్లు, పాయకరావుపేట, కావలిల్లో స్ఫూరియస్ లిక్కర్ కేసులను ఛేదించామని చైతన్య మురళి చెప్పారు. -
ఆ క్రెడిట్ కొట్టేద్దామని..
కూటమి ప్రభుత్వ ప్రమేయమే లేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రసాద్ నిధుల విడుదల, పనుల ప్రారంభోత్సవం జరిగాయి. ఇందులో కూటమి ప్రభుత్వ ప్రమేయమేదీ లేదు. ప్రస్తుతం టెండర్లు మాత్రమే ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయి. సత్యదేవుని దర్శనానికి ఏటా లక్షలాదిగా భక్తులు, పర్యాటకులు వస్తూంటారు. వారి సౌకర్యార్థం నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్రం ప్రసాద్ నిధులు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. దీనికి ప్రధాని మోదీకి, కేంద్ర టూరిజం మంత్రి కిషన్రెడ్డికి, ఆ శాఖ అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అప్పటి ఈఓ ఎంతో సహకరించారు. వాస్తవానికి రూ.92 కోట్లతో నిర్మాణాలు చేపట్టేందుకు అప్పట్లో ప్రతిపాదించాం. ప్రస్తుత ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మిగిలిన నిధులు సాధించి, అప్పుడు ప్రచారం చేసుకోవాలి. – వంగా గీతా విశ్వనాథ్, కాకినాడ మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి ఫ ‘ప్రసాద్’ను తన ఖాతాలో వేసుకునేందుకు ఎంపీ ప్రయాస ఫ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ పథకం కోసం కృషి ఫ ఈ నిధుల కోసం అవిశ్రాంతంగా పని చేసిన నాటి ఎంపీ వంగా గీత ఫ అప్పటి కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని పలుమార్లు కలసి అభ్యర్థనలు ఫ ఫలితంగా పచ్చజెండా ఊపిన కేంద్రం ఫ అప్పట్లోనే వర్చువల్గా శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ ఫ అయినప్పటికీ ఇదంతా తన కృషి వల్లనేనంటూ తంగెళ్ల ప్రచారం ఫ నవ్వుకుంటున్న జనం అన్నవరం: కష్టపడింది ఎవరైనా.. దానికి మంచి ఫలితం వస్తే చాలు.. ఏమాత్రం జంకూగొంకూ లేకుండా ఆ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి పెద్దలు తెగ తాపత్రయపడుతూంటారు. ఆ విషయంలో కూటమిలోని జనసేన పార్టీకి చెందిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్.. రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంటున్నారనే విమర్శ వస్తోంది. అన్నవరం దేవస్థానంలో ‘ప్రసాద్’ స్కీమును తన ఖాతాలో వేసుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నమే దీనికి కారణమవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన అనేక నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేస్తూ.. అవన్నీ తమ ఘనతేనంటూ చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలు.. తాజాగా అన్నవరం దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ స్కీము కూడా తమ చలవేనంటూ ఆ క్రెడిట్ కొట్టేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసి జనం నవ్వుకుంటున్నారు. ఏం జరిగిందంటే.. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పిలిగ్రిమేజ్ రీజువెనేషన్ అండ్ స్పిరిచ్యువల్ అగ్మంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీముకు అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం 2016లో ఎంపికై ంది. అయితే, 2019 వరకూ ఉత్తరాది రాష్ట్రాల్లోని వారణాశి, మధుర తదితర పుణ్యక్షేత్రాల అభివృద్ధి పైనే కేంద్రం దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాకినాడ ఎంపీగా వంగా గీతా విశ్వనాథ్ ఎన్నికయ్యారు. రాష్ట్రాన్ని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రసాద్ స్కీము ద్వారా ఎక్కువ నిధులు సాధించి, అన్నవరం దేవస్థానంలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అప్పటి ఎంపీ వంగా గీతను నాటి సీఎం జగన్ ఆదేశించారు. అప్పటి నుంచీ ఆమె ఈ స్కీము నిధుల కోసం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ అధికారులతో పలు దఫాలు చర్చలు జరిపారు. అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి అన్నవరం దేవస్థానానికి అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయాలని కోరారు. తొలుత అన్నవరం దేవస్థానానికి రూ.100 కోట్లు మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని కేంద్రం చెప్పింది. ఆవిధంగా ప్రతిపాదించగా అందులో రూ.8 కోట్లు తగ్గించి, రూ.92 కోట్లకు పరిమితం చేసింది. చివరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) వద్దకు వచ్చేసరికి రూ.54 కోట్లకు తగ్గించింది. చివరకు కేంద్రం రూ.20.06 కోట్లు మాత్రమే మంజూరు చేయడం కొంత అసంతృప్తికి కారణమైంది. ఒక దశలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరు చేస్తారనే సమాచారం రావడంతో నాటి ఎంపీ గీత.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలసి, ప్రసాద్ స్కీము నిధులు పెంచాలని కోరారు. ఆమె కృషితో కేంద్రం ఎట్టకేలకు రూ.20.06 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.11.09 కోట్లతో రెండంతస్తుల్లో అన్నదాన భవనం, రూ.5.9 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.61.78 లక్షలతో టాయిలెట్ బ్లాకులు, రూ.1.08 కోట్లతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్, రూ.91.96 లక్షలతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రూ.కోటి వ్యయంతో 2 బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. ఈ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుంచి గత ఏడాది మార్చి 7న వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో అప్పటి ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వంగా గీత, పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నాటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ పాల్గొన్నారు. అనంతరం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రసాద్ పనుల కోసం మూడుసార్లు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఇటీవల టూరిజం శాఖ సీఈ ఈశ్వరయ్య తదితరులు ప్రసాద్ స్కీము నిర్మాణాల స్థలాలను పరిశీలించి వెళ్లారు. త్వరలో టెండర్లు ఖరారు చేసి, ఈ నెలాఖరు నుంచి నిర్మాణాలు ప్రారంభిస్తామని చెప్పారు. పనులు ప్రారంభమయ్యే సూచనలతో.. ప్రసాద్ స్కీము పనులు ఈ నెలాఖరున ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టారు. ప్రసాద్తో పాటు అనేక విషయాల్లో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి తాను కృషి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మాజీ ఎంపీ వంగా గీత అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019–24 మధ్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కాకినాడ ఎంపీగా ఉన్న తాను ప్రసాద్ స్కీము కోసం మొక్కవోని పట్టుదలతో కృషి చేసి నిధులు సాధించానని గుర్తు చేశారు. అయితే, ఇదంతా ఆయన గొప్పే అన్నట్టు ప్రస్తుత ఎంపీ తంగెళ్ల ప్రచారం చేసుకోవడం దారుణమని విమర్శించారు. -
10 నుంచి పొగాకు విత్తనాల విక్రయం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరంలోని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్ –నిర్కా) (పూర్వపు సీటీఆర్ఐ)లో 2025–26 సీజన్కు ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నాణ్యమైన వర్జినియా పొగాకు విత్తనాలు విక్రయించనున్నారు. వీటిని ఎస్బీఎస్, ఎస్ఎల్ఎస్, ఎన్బీఎస్, ఎన్ఎల్ఎస్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్కా డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ మంగళవారం ప్రకటనలో కోరారు. అలాగే 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి కందుకూరులోని వాణిజ్య వ్యవసాయ పరిశోధనాసంస్థ (పూర్వపు సీటీఆర్ఐ)లో కూడా పొగాకు విత్తనాల విక్రయాలు ప్రారంభమవుతాయన్నారు. జీబీఆర్ఎస్ పాస్బుక్ ఉన్న రైతులకు ప్రతి బ్యారన్కు 500 గ్రాముల చొప్పున కిలో రూ.1,300కు విక్రయిస్తారన్నారు. కావాల్సిన రైతులు బ్యారన్ రిజిస్ట్రేషన్ పాస్బుక్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. క్యాష్లెస్ లావాదేవీలు అనగా యూపీఐ (గూగుల్ పే, ఫోన్ పే ), క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మాత్రమే అనుమతి ఉందన్నారు. పొగాకు బోర్డు ద్వారా రిజిస్టర్ చేయించిన కమర్షియల్ నారుమడులకు సంబంధించిన రైతులకు కిలో విత్తనాలను రూ.2,200కు విక్రయిస్తారన్నారు. -
ఆర్టీసీలో కారుణ్య నియామకాలు
రాజమహేంద్రవరం సిటీ: ఏపీఎస్ ఆర్టీసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ వివిధ సహజ మరణాలతో పాటు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పత్రాలను అందజేసినట్లు డీపీటీఓ వైఎస్ఎన్ మూర్తి తెలిపారు. రాజమహేంద్రవరంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో పది మందిని కండక్టర్ గ్రేడ్–2 ఉద్యోగం కోసం ఎంపిక చేసి, నియామక పత్రాలు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, కోనసీమ జిల్లా ప్రజా రవాణా అధికారి రాఘవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఈవోలదే సీసీ కెమెరాల నిర్వహణ బాధ్యత
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): అన్ని ఆలయాలలో సీసీ కెమెరాలు పని చేసేలా చూడాలని, అవి పనిచేయకపోతే ఈవోలే పూర్తి బాధ్యత వహించాలని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్బాబు అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని దేవదాయశాఖ ఆలయాలు, సత్రాల ఈవోలతో మంగళవారం కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయ కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రమేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో దేవుడి వెండి, బంగారం ఆభరణాలకు బీమా చేయించాలన్నారు. ఆలయాలు, సంస్థలకు సంబంధించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా అన్యాక్రాంతమైతే సంబంధిత ఈవోలు వెంటనే నోటీసులు ఇచ్చి, వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. సమావేశంలో జ్యుయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ విళ్ల పళ్లంరాజు, దేవదాయశాఖ ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ డిప్యూటీ తహసీల్దార్ దాసరి భారతి, జిల్లా దేవదాయశాఖాదికారులు కె.నాగేశ్వరరావు, ఈవీ సుబ్బారావు పాల్గొన్నారు. -
వీరేశ్వరా.. క్షమించవా..
ఐ.పోలవరం: మురమళ్ల భఽధ్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి కొబ్బరి కాయలతో అభిషేకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. అధికారుల నిరక్ష్యంతో కొబ్బరికాయలు పక్కదారి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఆలయంలో ప్రతి రోజూ రాత్రి జరిగే కల్యాణాలకు సంబంధించి ఉదయం అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ అభిషేకానికి సంబంధించి ఒక టిక్కెట్టుకు రెండు కొబ్బరి కాయలు కేటాయిస్తారు. పండితులు వీటితో భక్తుల గోత్రనామాలతో స్వామికి, వినాయకునికి అభిషేకాలు చేస్తారు. ప్రతి నిత్యం సుమారు 116 కల్యాణాలు ఇక్కడ జరుగుతాయి. అంటే రోజుకు 232 కొబ్బరికాయలు కొట్టాలి. కానీ ఆలయంలో 15 రోజులకు సంబంధించి కేవలం ఒక్క రోజు మాత్రమే స్వామికి అభిషేకాల కొబ్బరి కాయలు కొట్టారు. మిగిలిన రోజులు స్వామికి ఎగనామం పెట్టేశారు. అభిషేకాలకు సంబంధించిన కొబ్బరి కాయలు ఎక్కడకు వెళ్లాయో తెలియదు. భక్తుల ఆవేదన స్వామివారి కల్యాణానికి రుసుము రూ.1,000 తీసుకుంటారు. భక్తుల నమ్మకాన్ని కొందరు అవినీతి పరులు సొమ్ము చేసుకొంటున్నారు. స్వామివారి అభిషేకానికి ఉపయోగించాల్సిన కొబ్బరి కాయలను పక్కదారి పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అనాదిగా వస్తున్న ఆచార, సంప్రదాయాలను, పూజాది కార్యక్రమాలు తుంగలోకి తొక్కేస్తున్నారు. కొబ్బరి ధర హెచ్చును సాగుగా చూపుతూ కొబ్బరి నీళ్ల అభిషేకానికి స్వస్తి పలికేశారు. దీనిపై ఆగ్రహించిన కొందరు భక్తులు నేరుగా ఆలయ సహాయ కమిషనర్ వి.సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపొయింది. కొబ్బరి కాయల పాటదారునికి షోకాజ్ నోటీసులు ఇస్తామని ఆయన తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అయితే అభిషేకాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించే అన్నప్రసాదాలకు రుచి, శుచి కరువైయ్యిందనే భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై సహాయ కమిషనర్ వి.సత్యనారాయణను వివరణ కోరగా కొబ్బరి కాయలు ఇవ్వడం లేదని తన దృష్టికి వచ్చిందని, సంబంధిత పాటదారునికి నోటీసులు అందజేసి యథావిధిగా అభిషేకాలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. అభిషేకానికి ఉపయోగించే కొబ్బరి కాయలు పక్కదారి మురమళ్ల ఆలయంలో ఘటన అధికారుల నిర్లక్ష్యంపై భక్తుల ఆగ్రహం -
రక్కసీ కోత
ప్రస్తుతం మాయాపట్నం వద్ద కడలిలో కలిసిపోయిన జియోట్యూబ్ రక్షణ గోడఉప్పాడ శివారు మాయాపట్నం వద్ద బీచ్ రోడ్డుకు రక్షణగా వేసిన జియో ట్యూబ్ రక్షణ గోడ (ఫైల్) ● కరిగిపోతున్న ఉప్పాడ తీరం ● సముద్రంలో కలసిపోతున్న భూములు ● రక్షణ చర్యలు చేపట్టని ప్రభుత్వం ● నెరవేరని పవన్ కల్యాణ్ హామీ పిఠాపురం: ఉప్పాడ తీరంలో సముద్రం తరచూ ఉగ్రరూపం దాల్చుతుంటుంది. తుపాను రానప్పటికీ, ఉపద్రవాల హెచ్చరికలు లేనప్పటికీ సముద్ర కెరటాలు ఒక్కసారిగా ఉప్పొంగుతుంటాయి. దీంతో తీరం వెంబడి భూమి మీటర్ల మేర కోతకు గురవుతోంది. ఉప్పాడతో పాటు దాని శివారు గ్రామాలు కడలిలో కలిసి పోతుంటాయి. ఇలా సుమారు శతాబ్ద కాలంగా కడలి కబలించేస్తున్నా శాశ్వత రక్షణ చర్యలు మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నవి గుడిసెలే కదా అని రూ.లక్షల్లో ఉన్న ప్రతిపాదనలను పట్టించుకోక పోవడం వల్ల వందల ఎకరాల పంట భూములు, పురాతన ఆలయాలు, భవంతులు కడలి గర్భంలో కలిసిపోయాయి. కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభం లాంటి బీచ్ రోడ్డు నిర్మించిన నాటి నుంచే కడలిపాలవుతూనే ఉంది. ఉప్పాడ రక్షణకు చర్యలు ఉత్తిమాటేనా? కోతకు గురవుతున్న ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు రూ.వందల కోట్లతో చర్యలు తీసుకుంటున్నట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరిచిపోయారు. గత ఏడాది ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన రక్షణ చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో తీర ప్రాంత రక్షణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్లో గత ఏడాది జూలై 24న కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎఫ్ఓ భరణి, నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ (ఎన్సీసీఆర్) జాయింట్ సెక్రటరీ రమణ మూర్తి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉప్పాడ నుంచి కాకినాడ పోర్టు వరకు తీర ప్రాంతం అభివృద్ధి, ఉప్పాడ తీరం కోత, ఇతర ప్రాంతాల్లో సముద్ర కోత నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఇవన్నీ జరిగి ఏడాది పూర్తవుతున్నా కనీసం ప్రణాళికలు కూడా తయారు కాలేదు. పెరిగిన కోత గత కొన్ని నెలలుగా ఉప్పాడ తీర ప్రాంతం తీవ్ర కోతకు గురవుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో సంబంధం లేకుండా నిత్యం కోత బారిన పడుతోంది. ఇప్పటి వరకు రక్షణగా ఉన్న జియోట్యూబ్ టెక్నాలజీ రక్షణ గోడ పూర్తిగా కడలిలో కలిసి పోగా, పక్కనే ఉన్న పంట పొలాలు సైతం సముద్రంలో మునిగిపోతున్నాయి. ఇలా ఇప్పటి వరకు 1,360 ఎకరాల పంట భూమి కోతకు గురై కడలి గర్భంలో కలిసి పోయింది. ఈ తీర ప్రాంత రక్షణకు రూ.250 కోట్లతో ప్రణాళికలు అన్న మాట కాగితాలకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్సీసీఆర్ అధ్యయనం ప్రకారం కోస్తా తీరంలో ఉప్పాడ కొత్తపల్లి, సఖినేటిపల్లి మండలాలు ప్రమాద స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. 1956 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఉప్పాడ గ్రామంలోనే సుమారు 85 ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయినట్లు గుర్తించారు. కోతకు కారణమేదే! గోదావరి ఇసుక కొట్టుకు రావడం వల్ల కాకినాడ సమీపంలో ఏర్పడిన హోప్ ఐలాండ్ కారణంగానే ఉప్పాడ ప్రాంతం కోతకు గురవుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. ఈ ఐలాండ్ సముద్రంలో 40 చదరపు మైళ్ల విస్తీర్ణం గల లోతు లేని అగాధం (కాకినాడ బే) సృష్టించడం వల్ల దీని సమీపంలోని ఉప్పాడకు ముప్పు ఉందని నిర్ధారించారు. ఉత్తరం వైపు నుంచి తెరుచుకుని ఉండే ఈ అగాధం దక్షిణ వైపు నుంచి తీరానికి వెళ్లే అలలను అడ్డుకుంటోంది. దీంతో అలలతో పాటు వెళ్లే పదార్థాలు (లిట్టోకల్ డ్రిప్టు) తీరం చేరడం లేదు. దానివల్ల అలల తాకిడితో హోప్ ఐలాండ్లో ఇసుక దిబ్బలు పెరుగుతుండగా, ఉప్పాడ తీరంలో ఇసుక మేటలు వేయడానికి బదులు తీరంలో మట్టి కోతకు గురవుతుంది. గ్రామాలు కోతకు గురైన భూమి (ఎకరాల్లో) ఉప్పాడ 84.51 రమణక్కపేట 13.01 అమరవిల్లి 133.50 సుబ్బంపేట 141.30 కోనపాపపేట 233.56 మూలపేట 359.78 కొమరగిరి 362.83 మొత్తం 1,360 పొంచిఉన్న ప్రమాదం కాకినాడ – విశాఖ మధ్య పారిశ్రామికాభివృద్ధికి మూలస్తంభమైన ఉప్పాడ తీరం శాశ్వత రక్షణకు చర్యలు చేపట్టలేకపోతే, ప్రత్యామ్నాయం అయినా చూడాలి. ఉప్పాడ కోతకు అడ్డుకట్ట వేస్తానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ నెరవేరుతుందని ఆశించిన తీర ప్రాంత వాసులకు నిరాశ మిగిలింది. దీంతో గ్రామాలను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సముద్ర కోత కారణంగా ఇప్పటి వరకూ సుమారు 32 వేల నివాస గృహాలు కడలిలో కలసిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. 75 ఏళ్ల క్రితమే.. 1950లోనే ఉప్పాడ తీరానికి సముద్ర కోత వల్ల ముప్పు ఉందని అఽధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఈ మేరకు సర్వే జరిపిన విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ శాస్త్రవేత్తల బృందం తేల్చి చెప్పింది. 1971లో కోత తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1992లో పూణేలోని అప్పటి పీడబ్ల్యూఆర్ఎస్ డైరెక్టర్ సీవీ గోలే అధ్యక్షతన ఒక సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం సాంకేతిక పరంగా సర్వేలు జరిపి ఉప్పాడ ప్రాంతం కోత.. విశేష స్వభావం కలిగినదిగా తెలిపింది. -
నూతన సేద్య పద్ధతులతో కోకోలో అధిక దిగుబడి
అంబాజీపేట: కోకో సాగులో నూతన సేద్య పద్ధతులు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ ఎం.ముత్యాల నాయుడు అన్నారు. అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో డైరెక్టర్ ఆఫ్ క్యాష్వేనట్ అండ్ కోకో డెవలప్మెంట్ ప్రోత్సాహంతో మంగళవారం కోకో సాగుపై శిక్షణ నిర్వహించారు. ముత్యాల నాయుడు మాట్లాడుతూ కోకో తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. కొమ్మ కత్తిరింపు, పురుగుల నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కొబ్బరి తోటల్లో అంతర పంటగా కోకోను సాగు చేయడం వల్ల అదనపు రాబడి పొందవచ్చన్నారు. డాక్టర్ నామాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కోకో కాయ తయారయ్యే సమయంలో తోటలను రైతులు పరిశీలించి ఎలుకల బెడద ఉంటే నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. హార్టికల్చర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కోకో ప్రొడక్షన్, కోకో వాల్యూ అడిషన్, ప్రోసెసింగ్ విధానాలను వివరించారు. శాస్త్రవేత్తలు బి.నీరజ, ఎ.కిరీటి, వి.అనూష తదితరులు కోకోలో సూక్ష్మపోషకాల యాజమాన్య విధానాలను తెలిపారు. -
వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసు అధికారి
కాకినాడ క్రై: సాధారణ గస్తీలో భాగంగా కాకినాడలో భద్రతను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్ కుమార్ ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సర్పవరంలోని విశాఖ డైయిరీ సమీపంలో మంగళవారం తెల్లవారుజాము 3.30 గంటల సమయంలో ఒక వ్యక్తి రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో అతడికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. గస్తీలో భాగంగా అటుగా వెళ్లిన సీఐ సునీల్ కుమార్ ఆ వ్యక్తిని చూశారు. వెంటనే మంచినీరు తాగించి, సపర్యలు చేసి కూర్చోబెట్టారు. నీరసంతో పడిపోయానని అతడు చెప్పడంతో పోలీసులు సురక్షిత ప్రాంతానికి చేర్చి, ఓఆర్ఎస్ ద్రావణాలు కొని ఇచ్చారు. కాగా.. రోడ్డుపై పడిఉన్న వ్యక్తి ప్రాణాలను కాపాడిన సునీల్ కుమార్ను ఎస్పీ బిందుమాధవ్, డీఎస్పీ దేవానంద్ పాటిల్ అభినందించారు. -
ఎస్బీఐ ఏటీఎం దగ్ధం
● పక్కనే ఉన్న బైక్లు, కారు సైతం అగ్నికి ఆహుతి ● విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం యానాం: పట్టణంలోని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కాలిపోయిన ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. కొత్త బస్టాండ్ సమీపంలోని పోలీస్ కార్వర్ట్స్ వెనుక ఉన్న కంచర్ల కాంప్లెక్స్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున మంటలు వ్యాపించాయి. అవి ఆ పక్కనే ఉన్న మల్లిపూడి శ్రీనివాసరావుకు చెందిన మోటార్ మెకానిక్ షాపునకు విస్తరించాయి. దీంతో అక్కడే రిపేర్కు వచ్చిన నాలుగు బైక్లు, ఒక కారు కాలిపోయాయి. పోలీస్ క్వార్టర్ ఆవరణలో ఇంటి వాకిలి తుడుస్తున్న ఓ మహిళ ఆ మంటలను చూసి అగ్నిమాపక దళ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ జగడం మీరా సాహెబ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాద స్థలాన్ని సీఐ అడలరసన్, ఎస్హెచ్ఒ–2 కట్టా సుబ్బరాజు, ఏఎస్సై పంపన మూర్తి, ఎస్బీఐ అధికార్లు పరిశీలించారు. ఏటీఎంలో నగదు ఎంత ఉందనేది ఇంకా తెలియలేదు. మెకానిక్ షాపు యజమాని మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో సుమారు రూ.15 లక్షల విలువైన బైక్లు, కారు కాలిపోయాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. -
పశువైద్యాధికారి శ్రీనివాసు మృతి
ఆలమూరు: నాన్ గ్రాడ్యుయేట్ వెటర్నరీ ఏడీ నాన్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చైర్మన్, పినపళ్ల గ్రామీణ పశు వైద్యాధికారి ఈదల శ్రీనివాసు (61) మంగళవారం మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గుమ్మిలేరు, చింతలూరు, మూలస్థాన అగ్రహారం, జొన్నాడ, పినపళ్ల గ్రామాల్లో ఆయన పశువైద్యాధికారిగా సేవలందించారు. ముగ్గురు అవినీతి అధికారులకు జైలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ముగ్గురు అవినీతి అధికారులను ఏసీబీ పట్టుకుందని ఆ శాఖ రాజమహేంద్రవరం డీఎస్పీ ఎం.కిశోర్ కుమార్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. మార్చి 24న పిఠాపురంలో రూ.20 వేలు లంచం అడిగిన కేసులో సబ్ ఇన్స్పెక్టర్ ఎల్.గుణశేఖర్, మార్చి 28న కాకినాడ రిజిస్ట్రార్ కె.ఆనందరావు, జూన్ 25న వీఆర్వో పరస శ్రీమన్నారాయణను అరెస్టు చేసి జైలుకి పంపామన్నారు. ఎవరైనా లంచం అడిగితే తనకు 94404 46160, రాజమహేంద్రవరం ఇన్స్పెక్టర్ ఎన్వీ భాస్కర్ 94404 46161, కాకినాడ జిల్లా ఇన్స్పెక్టర్ డి.వాసు 83329 71041, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇన్స్పెక్టర్ వై.సతీ ష్ 94404 46163లతో పాటు అవినీతి నిరోధకశాఖ రాజమహేంద్రవరం ల్యాండ్లైన్ నంబర్ 0883 2467833కు సమాచారం ఇవ్వాలన్నారు. ఇసుక లారీ కింద పడి వ్యక్తి మృతి ధవళేశ్వరం: ఇసుక లారీ కింద పడి ధవళేశ్వరం మసీదు వీధి కొండ మెరక ప్రాంతానికి చెందిన పువ్వల లక్ష్మణ్ (39) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పువ్వల లక్ష్మణ్ పెయింటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పని కోసం రాజమహేంద్రవరానికి మోటారు సైకిల్పై బయలుదేరాడు. ధవళేశ్వరం క్వాయర్ బోర్డు ఎదురుగా ఆటోను తప్పించే ప్రయత్నంలో రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వెనుక వచ్చిన ఇసుక లారీ.. లక్ష్మణ్ కుడి కాలి పైనుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసును ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బంగారు, వెండి ఆభరణాల చోరీ ఆలమూరు: కాంట్రాక్ట్ అధ్యాపకురాలి ఇంట్లో బంగారం వెండి వస్తువులను దొంగలు చోరీ చేశారు. పెదపళ్ల గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇవి. గ్రామానికి చెందిన నరసింహదేవర వెంకటదుర్గ అచ్యుత విశాలక్ష్మి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె ఈనెల నాలుగున తన కుటుంబ సభ్యులతో కలసి తిరుపతి వెళ్లారు. అనంతరం ఈ నెల ఏడున తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలకు వెళ్లి పరిశీలించగా బీరువాలోని సుమారు రూ.8 లక్షల విలువైన 11 కాసుల బంగారు ఆభరణాలు, అర కిలో వెండి వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సై జి.నగేష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 10 నుంచి బిక్కవోలు – అనపర్తి రైల్వే గేటు మూసివేత సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని బిక్కవోలు – అనపర్తి మధ్య ఉన్న 415 రైల్వే గేటు (605/9–11) ను ఈ నెల 10 నుంచి 13 వరకూ మూసివేయనున్నట్టు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రామ సుబ్బారావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. రైల్వే గేటులోని ప్రధాన ట్రాక్ మరమ్మతుల కోసం ఈ గేటు మీదుగా రాకపోకలు నిలిపివేస్తున్నామన్నారు. ఈ మేరకు అనపర్తి తహసీల్దార్, పోలీసు అధికారి, అనపర్తి, లక్ష్మీనారాయణపురం, కాపవరం పంచాయతీ అధికారులకు, లారీ, ఆటో యూనియన్ అసోసియేషన్లకు సమాచారం ఇచ్చామన్నారు. ఇటుగా రాకపోకలు సాగించే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. -
కూటమి సర్కారు.. కూకటి వేళ్లతో కదిలేలా..
వైఎస్సార్ సీపీ పిఠాపురం సోషల్ మీడియా గ్రూపులు హ్యాక్!పిఠాపురం: తమ సోషల్ మీడియా గ్రూపులను కూటమి నాయకులు హ్యాక్ చేశారని పిఠాపురం వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. గొల్లప్రోలులో జరిగిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన జనాదరణను సహించలేక కూటమి నాయకులు.. తమ సోషల్ మీడియా గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపించారని తెలిపారు. తమ సోషల్ మీడియా ప్రతినిధులు అప్రమత్తమై గ్రూపులను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను అణగదొక్కే కుట్రగా అనుమానం వ్యక్తం చేశారు. ● గొల్లప్రోలులో కదం తొక్కిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ● బాబు మోసంపై విరుచుకుపడ్డ నేతలు ● పార్టీ విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ పిఠాపురం: కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో కదిలేలా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వేలాదిగా కదం తొక్కారు. సీఎం చంద్రబాబు మోసంపై విరుచుకుపడ్డారు. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ కార్యక్రమానికి శ్రేణులను సమాయత్తం చేసే లక్ష్యంతో.. వైఎస్సార్ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జి వంగా గీతా విశ్వనాథ్ అధ్యక్షతన గొల్లప్రోలులో సోమవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అయ్యింది. నేతల ప్రసంగాలు స్థానిక నాయకులు, కార్యకర్తల్లో ఉత్తేజం నింపాయి. అబద్ధాల్లో బాబును మించిన కొడుకు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఏ తండ్రి అయినా కొడుకు తన కంటే ప్రయోజకుడు కావాలని కోరుకుంటారని, కానీ, అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కొడుకు మాత్రం తండ్రిని మించిన తనయుడిలా ఉన్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 100 అబద్ధాలు ఆడితే, ఆయన కుమారుడు లోకేష్ 200 అబద్ధాలు ఆడుతూ తండ్రిని మించిపోయారని అన్నారు. ఏప్రిల్, మే నెలల్లో అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని మంత్రి లోకేష్ శాసన మండలి సాక్షిగా చెప్పారని, జూన్ వెళ్లి జూలై వచ్చినా ఇంకా అమలు కాలేదని బొత్స దుయ్యబట్టారు. ఇలాంటి అబద్ధాలు ఆడేవారిని మోసగాళ్లు, దగాకోరులు అనాలా, వద్దా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట మార్చి ప్రజల్ని మోసం చేశారని దుయ్యబట్టారు. జరిగిన మోసాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తాటా తీస్తానని చంద్రబాబు.. మక్కెలు విరగ్గొడతానని పవన్ కల్యాణ్ అంటున్నారన్నారు. వాళ్లు తాట తీసి, మక్కెలు విరగ్గొడితే కొట్టించుకోడానికి వైఎస్సార్ సీపీ నేతలు కార్యకర్తలేమైనా చేతకానివారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పథకాలు ఇస్తామని మోసం చేసిన చంద్రబాబు, పవన్ మోసగాళ్లు కాదా? అబద్ధపు వాగ్దానాలు చేసిన వీరిద్దరూ అబద్ధపుకోరులు కాదా?’ అని బొత్స ప్రశ్నించారు. దమ్ముంటే ఈ ఇద్దరు నాయకులూ గ్రామాలకు వెళ్లి, తాము ఇచ్చిన హామీలపై ప్రజలతో మాట్లాడాలని, ఎవరు ఎవరి తాట తీస్తారో, ఎవరి మక్కెలు ఎవరు విరగ్గొడతారో అప్పుడు తెలుస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఈవిధంగా బెదిరించడం భావ్యమేనా అని ప్రశ్నించారు. చేసే సత్తా లేనప్పుడు వాగ్దానాలు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అడిగే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అడిగిన వారిని అణగదొక్కుదామంటే ఇంకా పైకి లేచి మరింత తిరగబడతారని హెచ్చరించారు. చంద్రబాబు, పవన కల్యాణ్ కలసి పలు హామీలిచ్చి అమలు చేస్తామంటూ ప్రజలకు బాండు రాసిచ్చారన్నారు. ఇప్పుడు ఆ బాండ్లను ప్రజలకు చూపించి, వారిద్దరూ చేసిన మోసాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికే బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ప్రతి కార్యకర్తా ప్రతి గ్రామంలోనూ ఇద్దరు నేతల మోసాలను వివరించి, ప్రజలను చైతన్యపరచాలని బొత్స పిలుపునిచ్చారు. మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేసేంత వరకూ రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ కలిగిన బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని, పోరాడుతూనే ఉంటామని చెప్పారు. దీనిని అధికార పక్షం విస్మరిస్తే మెడలు వంచి మరీ గుర్తు చేసే బాధ్యత వైఎస్సార్ సీపీపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రతి నాయకుడు, కార్యకర్త కూటమి మేనిఫెస్టో అమలు చేసేంత వరకూ ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూ పోరాడాలని బొత్స అన్నారు. విచ్చలవిడిగా గంజాయి, మద్యం పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి, గ్రామాల్లో ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయని, మద్యం ఏరులై పారుతోందని అన్నారు. కొన్ని పత్రికల్లో మాత్రం ‘గంజాయి రహిత రాష్ట్రంగా మారింది‘ అంటూ రాయడం హాస్యాస్పదంగా ఉందని దుయ్యబట్టారు. గంజాయి వ్యాపారంలో ఆరితేరింది వాళ్ల నాయకులేనని, ఎకరానికి ఇంత అని కమీషన్లు తీసుకుని, గంజాయితో పాటు విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పేపర్లలో రాయించుకోవడంపై పెట్టిన దృష్టి గంజాయి నిర్మూలనపై పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూచించారు. ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అన్ని హామీలూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలసి వచ్చి ప్రమాణం చేసి హామీలు అమలు చేస్తామన్నారు కాబట్టే ప్రజలు నమ్మి కూటమికి ఓట్లు వేశారన్నారు. చివరికి మోసపోయామంటూ అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై తిరగబడే రోజులు వచ్చేశాయని చెప్పారు. ఎన్నో ప్రలోభాలు, ఆశలు పెట్టి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ కేడర్ను లాక్కునే ప్రయత్నం చేసినా ఏ ఒక్కరూ కూటమి పార్టీల వైపు చూడలేదని, అధినేత వైఎస్ జగన్, వంగా గీతలపై ఉన్న నమ్మకమే దీనికి కారణమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ కూటమి ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజా అన్నారు. ఆదర్శంగా తీసుకోవాల్సింది వారిని.. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, వంగవీటి మోహనరంగా, ముద్రగడ పద్మనాభం, బొత్స సత్యనారాయణ, వంగా గీతా విశ్వనాథ్ వంటి కాపు నేతలు ప్రజల కోసం పని చేసిన వారని అన్నారు. యువత ఇలాంటి నేతలను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. ఒక సినీ హీరోను ఆదర్శంగా తీసుకుని, ఆయన వెనుక తిరుగుతున్న వారు ఒకసారి దీనిపై ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పవన్ కల్యాణ్ తాను ముఖ్యమంత్రి కావడం కోసం పని చేస్తున్నారా.. లేక మామ కు వెన్నుపోటు పొడిచిన, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పడానికి కారకులైన వ్యక్తిని సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా చూసేందుకు పని చేస్తున్నారా అనేది ఆయన వెనుక ఉన్న వారు ఆలోచించుకోవాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ పవన్ కల్యాణ్కు కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో గాజువాక ప్రజలు ఎడమ కాలితో, భీమవరం ప్రజలు కుడి కాలితో తంతే 2024 ఎన్నికల్లో పిఠాపురం వచ్చి పడిన పవన్ కల్యాణ్ను పిఠాపురం ప్రజలు పెద్ద మనసుతో శాసన సభకు పంపించారన్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన రాష్ట్రానికి, జిల్లాకు లేదా పిఠాపురం ప్రాంతానికి గడచిన ఏడాది కాలంలో ఏం చేశారని చూస్తే గుండుసున్నా కనిపిస్తుందన్నారు. వేలాది మంది మహిళలు అదృశ్యమవుతున్నారంటూ ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీపై, వలంటీర్ వ్యవస్థపై బురద జల్లిన పవన్.. అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ఎంతమందిని వెనక్కి తీసుకొచ్చారో చెప్పగలరా అని రాజా ప్రశ్నించారు. వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి కట్టుబడి, ప్రలోభాలకూ లొంగకుండా బలమైన కేడర్గా ఉన్నారని కొనియాడారు. మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ, పిఠాపురంలో జనసేన విజయం తర్వాత వైఎస్సార్ సీపీ ఖాళీ అంటూ తప్పుడు ప్రచారం చేశారని, కానీ, వంగా గీత సారథ్యంలో పార్టీ చాలా బలంగా ఉందనడానికి ఈ సమావేశానికి పోటెత్తిన జనమే నిదర్శనమని అన్నారు. సమావేశంలో పార్టీ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, ప్రత్తిపాడు, పెద్దాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలు ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట రాంజీ, మాజీ ఎంపీ గిరిజాల స్వామి నాయుడు, నేతలు కర్రి పాపారాయుడు, యనమల కృష్ణుడు, మాకినీడి శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.