breaking news
Warangal
-
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు. కేన్సర్పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనా– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
సీపీని కలిసిన ఏఎస్పీ
వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు. పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాల కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్సెంటర్గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు. నేటి నుంచి టికెట్ రిజర్వేషన్కు ఆధార్ తప్పనిసరికాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు. కలెక్టర్ను కలిసిన ప్రభుత్వ ప్రత్యేక పీపీవరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలుహన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు. -
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా రెవెన్యూ 54, గృహనిర్మాణం 20, ఇతర శాఖలకు సంబంధించినవి 56 దరఖాస్తులు రాగా ఆయాశాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు. ఆర్టీఐ, గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించి ఈ–ఫైలింగ్లో సర్క్యూలేట్ చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా తదితర శాఖలు శాఖాపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.రేషన్షాపులను మహిళా సంఘాలకు కేటాయించాలి జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్ దుకాణాలకు మహిళా గ్రూపులకు కేటాయించాలి. మహిళలకు ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుంది. చాలా వరకు రేషన్డీలర్లకు రెండేసి షాపులున్నాయి. వాటిని మహిళలకు కేటాయించాలి. – కలకోట్ల మాలతి, చింతల్ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద గ్రీవెన్స్లో 130 దరఖాస్తులు -
పండుటాకుల పడిగాపులు
నెక్కొండ: వృద్ధులు అని చూడకుండా పింఛన్ కోసం వచ్చిన వారిని పోస్టాఫీస్ చుట్టూ రోజూ తిప్పుతున్నారని పింఛనుదారులు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సా యంత్రం వరకు చెట్ల కింద పడిగాపులు కా యాల్సి వస్తోందన్నారు. ఒకవేళ అధికారులు వ చ్చినా మిషన్ పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్పుతున్నారని ఆరోపించారు. సార్ వచ్చినప్పుడు ఇస్తారని, రేపు మాపు అంటూ ప్రతీనెల తిప్పించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై బ్రాంచ్ పోస్టు మాస్టర్ అక్షయ్కుమార్, సబ్ పోస్టు మాస్టర్ రత్నమాలను వివరణ కోరగా స్థానిక పోస్టాఫీస్లో పర్మనెంట్ ఉద్యోగి లేరని, నల్లబెల్లిలో పనిచేస్తున్న ఉద్యోగికి బాధ్యతలు అప్పగించామని, అక్కడ పని ముగించుకుని ఇక్కడి రాగానే పింఛన్ ఇస్తారన్నారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయంనర్సంపేట: విద్యుత్ సరఫరాకు నేడు (మంగళవారం) అంతరాయం ఉంటుందని విద్యుత్ నర్సంపేట ఆపరేషన్ డీఈ తిరుపతి, చెన్నారావుపేట విద్యుత్ ఏఈ జోగ్యానంద్లు సోమవారం తెలిపారు. 33/11కేవీ చెన్నారావుపేట ఉపకేంద్రంలో పవర్ ట్రాన్స్ఫార్మర్ క్రమబద్ధీకరించే క్రమంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. జిల్లాలో మోస్తరు వర్షంసాక్షి, వరంగల్: జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. గత గురువారం కురిసిన వర్షంతో పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రాణం పోసినట్లు కాగా ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పంటలకు మరింత ఊపిరి పోసినట్లయింది. పత్తిలో మొలకెత్తని చోట మళ్లీ విత్తులు విత్తడంతో పాటు వరి పంటకు నారు పోసేందుకు కూడా రైతులు సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ మోస్తరు వర్షం పంటకు కాస్త ఊపిరి పోసినా.. ఇంకా భారీవర్షాలు కురిస్తేనే చెరువులు, కుంటలు నిండే అవకాశముందని వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు. ఖానాపురంలో అధిక వర్షం ఖానాపురం మండలంలో అత్యధికంగా 46.4 మిల్లీమీటర్లు, నర్సంపేట 37.2 మి.మీలు, దుగ్గొండిలో 35.6 మిమీలు, నల్లబెల్లిలో 33.2, చెన్నారావుపేటలో 30.2, వరంగల్లో 23.2, గీసుకొండలో 22.8, ఖిలావరంగల్లో 21.8, సంగెంలో 20.2, వర్ధన్నపేటలో 17.8, నెక్కొండలో 15.4, రాయపర్తిలో 13.6, పర్వతగిరిలో 12.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వ్యవసాయరంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పాలకులుసంగెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కాపులకనిపర్తిలో ఆదివారం రాత్రి రైతు సంఘం ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ పేరాల ప్రభాకర్, ఓదెల రాజయ్య, ఆవునూరి రాజు, బోనాల గోపాల్, రైతులు పాల్గొన్నారు. -
పరకాల సబ్జైలు తనిఖీ
పరకాల: పరకాల సబ్జైలును జిల్లా జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైలు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన ఖైదీలందరినీ కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఆయన వెంట జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ క్షమా దేశ్పాండే, పరకాల జూనియర్ సివిల్ జడ్జి జి.సాయిశరత్, పరకాల జైల్ సూపరింటెండెంట్ భగవాన్రెడ్డి, లీగల్ ఎయిడెడ్ కౌన్సిల్ ఎం.కవిత, స్థానిక న్యాయవాదులు పాల్గొన్నారు. పరకాల కోర్టు పరిశీలన సబ్జైలును పరిశీలించిన అనంతరం పరకాల కోర్టు ను జడ్జి డాక్టర్ కె.పట్టాభిరామారావు పరిశీలించారు. న్యాయవాదుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
రెసిడెన్షియల్ స్కూల్లో ఉద్రిక్తత
పరకాల: పరకాల మండలం మల్లక్పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్(గర్ల్స్)లో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెసిడెన్షియల్ స్కూల్లోని బాత్రూంలో పరకాలకు చెందిన విద్యార్థిని శ్రీవాణి(15) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా, బాలిక ప్రాణాలతోనే ఉందని ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, సిబ్బంది మరో ఇద్దరు ఉపాధ్యాయురాళ్లతో కలిసి ఆటోలో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. కానీ, విద్యార్థిని అప్పటికే చనిపోయింది. రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ తమకు తప్పుడు సమాచారం అందించారంటూ, కూతురు చావుకు కారణం తెలియాలంటూ మల్లక్పేట రెసిడెన్షియల్ ఎదుట తల్లిదండ్రులు ఏకు ఈశ్వర్, నీల ఆందోళన చేపట్టారు. బాలిక మృతి సమాచారం తెలియగానే పరకాల పోలీసులు రెసిడెన్షియల్లో విచారణ జరుపుతుండగానే గేట్ను నెట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. విద్యార్థిని మృతికి ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, ఉపాధ్యాయురాళ్ల వేధింపులే కారణమంటూ గొడవ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళన విద్యార్థిని శ్రీవాణి ఆత్మహత్యకు కారణమైన ప్రిన్సిపాల్ కృష్ణకుమారితోపాటు ఉపాధ్యాయురాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ రెసిడెన్షియల్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థినుల పట్ల వేధింపులు ఆగాలంటే ప్రిన్సిపాల్ కృష్ణకుమారితో పాటు మరికొందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు? గర్ల్స్ హాస్టల్లో ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయంటూ కొందరు ఉపాధ్యాయురాళ్లు తమ పిల్లలను వేధిస్తున్నారంటూ ఆందోళనలో పాల్గొన్న మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. బాలికల మధ్య ప్రేమవ్యవహారాలేంటి? అని తాము అనేకమార్లు ఉపాధ్యాయురాళ్లను నిలదీసిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు. సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పిల్లలను వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ నోటి దురుసుతో విద్యార్థినులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, తన కూతురు మృతికి కారణమైన ప్రిన్సిపాల్ కృష్ణకుమారి, హౌస్ మాస్టర్ మీరాబాయితోపాటు పీఈటీ, అసిస్టెంట్ కేర్ టేకర్, స్వీపింగ్ శానిటేషన్ కాంట్రాక్టర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాలిక తండ్రి ఏకు ఈశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతితో పరకాల(మల్లక్పేట) టీఎస్డబ్ల్యూఆర్ఎస్లో విషాదం బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల ఆందోళన ప్రేమ వ్యవహారాలంటూ వేధింపులు.. భరించలేకపోతున్నామంటున్న విద్యార్థినులు -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
రాయపర్తి: రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం రాయపర్తి మండలకేంద్రంలో రూ.14.17 కోట్ల వ్యయంతో 20 మె ట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం నిర్మాణ పనులకు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారదతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్నబియ్యం ఇస్తున్న ప్ర భుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ఆర్థిక సంక్షో భం ఉన్నా.. ప్రజా సంక్షేమం ఆగకుండా పని చేస్తుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు. ‘స్థానికం’లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
వరంగల్
లెక్కలన్నీ తేల్చుతారు.. ప్రతీ సంస్థకు సీఏ తప్పనిసరి. ఏడాదిలో చేసిన జమ, ఖర్చులకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. నేడు చార్టెర్డ్ అకౌంటెంట్ డే సందర్భంగా కథనం.వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలువాతావరణం జిల్లాలో వాతావరణ మార్పుల కారణంగా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల సాధారణ పరిస్థితి ఉంటుంది.– 8లోuమంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు.కేన్సర్పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనారైల్వే టికెట్ ధరలు పెంపు నేటి నుంచి స్వల్పంగా రైల్వే టికెట్ చార్జీలు పెంచుతున్నట్లు రైల్వే అధికారులు సోమవారం రాత్రి తెలిపారు. – 8లోu– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్గా ఫోకస్ పెట్టండి ● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్ వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులకు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్లో వార్త క్లిప్పింగ్ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రాజేశ్తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలో ఉన్న వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. -
ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే ధ్యేయం
ఎల్కతుర్తి: ముల్కనూరు సహకార సంఘం అభివృద్ధే లక్ష్యంగా సభ్యులతో కలిసి కృషి చేస్తానని సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార సంఘంలో ఇటీవల ఐదు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం ముల్కనూరు సహకార సంఘం ప్రధాన కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు సమావేశమై అధ్యక్షుడిగా అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డిని, ఉపాధ్యక్షుడిగా గజ్జి వీరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సహకార సంఘం ఎన్నికల అధికారి కోదండ రాములు సమక్షంలో అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా వారు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత కాశీ విశ్వనాథరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రధాన కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి మాట్లాడుతూ.. సభ్యులు సమష్టి నిర్ణయాలతో అభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. సహకార సంఘం చేపడుతున్న క్రయవిక్రయాలపై సంఘం కొనసాగుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సభ్యుల సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు తెలిపారు. ముల్కనూరు సహకార సంఘ బలోపేతానికి సభ్యులు మరింత కృషి చేయాలన్నారు. తనపై నమ్మకంతో సంఘం అధ్యక్ష బాధ్యతలు 39వ సారి ఏకగ్రీవంగా అప్పగించినందుకు ఆయన సంఘ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు కంది రవీందర్రెడ్డి, అంబాల రాములు, బేల కనుకమ్మ, ఈర్ల మూగయ్య, చెవ్యల్ల బుచ్చయ్య, గుగ్లోతు భాశు, బొల్లపెల్లి వీరారెడ్డి, మండ శ్రీనివాస్, కర్రె మహేందర్, సంఘం జనరల్ మేనేజర్ ఎం.రామ్రెడ్డి, తదితర సభ్యులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఐదుగురు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం -
‘ఇందిరమ్మ’ నిర్మాణాలు వేగవంతం చేయాలి
రాయపర్తి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం రాయపర్తి మండలంలోని మైలారం, రాగన్నగూడెం గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ని ర్మాణాలు చేపట్టాలన్నారు. మేసీ్త్రలు, కాంక్రీట్, సి మెంట్, ఇసుక, ఐరన్ ధరలు ఏవిధంగా ఉనన్నాయ ని అడిగి తెలుసుకునన్నారు. అనంతరం రాగన్నగూడెంలో ఈజీఎస్ కింద నిర్మిస్తున్న పాంపాండ్, రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలను పరిశీలించారు. తిర్మలాయపల్లిలోని కేజీబీవీని పరిశీ లించి పలుసూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ, ఇందిరమ్మ ఇళ్ల నోడల్ అధికారి రామిరెడ్డి, హౌసింగ్ డీఈ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తహసీలల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణి (గ్రీవెన్స్)లో స్వీకరించిన వినతుల పరిష్కారంలో ఆయా శాఖల అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణిలో వచ్చిన వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం 130 వినతులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్కు వచ్చిన అర్జీలు త్వరగా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్కుమార్, వరంగల్ -
కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్లో కొత్త ట్విస్ట్!
సాక్షి, వరంగల్: తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఇలాంటి తరుణంలో కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు.తాజాగా వరంగల్లో ఆర్యవైశ్య సంఘం కార్యక్రమంలో కొండా మురళి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొండా మురళి మాట్లాడుతూ..‘గత ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చుపెట్టి విజయం సాధించాం. నాకు 500 ఎకరాల భూమి ఉంది.. ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మాల్సి వచ్చింది. నా రాజకీయ జీవితంలో ఉన్నత వర్గాలతోనే నా పోటీ ఉంటుంది. వాసవి కన్యక పరమేశ్వరీ సాక్షిగా చెబుతున్నా నాకు ఎవరి పైసా అవసరం లేదు. నేను ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అలాగే, నేను ఎవరికీ భయపడను’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. గత కొద్దిరోజులుగా కాంగ్రెస్లో కొండా దంపతుల రాజకీయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా హస్తం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొండా మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన శనివారం గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్కు పెద్దసంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు.అనంతరం కొండా మురళి మాట్లాడుతూ.. ‘‘నా వ్యాఖ్యలపై మల్లు రవికి వివరణ ఇచ్చాను. కాంగ్రెస్ నేతలంటే నాకు గౌరవం ఉంది. కొందరు నేతలపై వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోవద్దు. నేను బలవంతుడినో, బలహీనుడినో అందరికీ తెలుసు. కార్యకర్తలను పట్టించుకోవాలని మాత్రమే కోరాను. రేవంత్ రెడ్డి మళ్లీ సీఎం కావాలి. బీసీలకు మేలు జరగాలని 40 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన మా అందరిలో ఉంది’’ అని పేర్కొన్నారు. -
సాగుకు భరోసా
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సీజన్కు సంబంధించిన పెట్టుబడి సాయం రైతులకు అందించింది. జిల్లాలోని 1,56,403 మంది రైతుల ఖాతాల్లో విడతల వారీగా రూ.162.38 కోట్లు జమ చేసింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతు భరోసా అందడంతో పంటల సాగుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీజన్కు ముందుగానే పెట్టుబడి సాయం అందడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిల్లాలో 3,08,320 ఎకరాల్లో రైతులు వివిధ పంటలను రైతులు సాగుచేస్తున్నారు. వరి 1,43,803 ఎకరాలు, మొక్కజొన్న 9,820 ఎకరాలు, పతిపత్తి 1,26,173 ఎకరాలు, కంది 1,180 ఎకరాలు, మిర్చి 9 వేల ఎకరాలు, పసుపు 950 ఎకరాలు, ఇతర పంటలు 17, 400 ఎకరాల్లో సాగవుతున్నాయి. సాగు ప్రారంభంలోనే .. సాగు పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. దుక్కులు దున్నడానికి, విత్తనాలు విత్తేందుకు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పింది. బంగారు ఆభరణాలు సైతం కుదువపెట్టి అప్పులు తేవాల్సి వచ్చేది. ఈ ఏడాది ఆ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం అమలు చేయడంతో రైతుల మోముల్లో వెలుగులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల పత్తి విత్తనాలు విత్తగా కొన్ని చోట్ల కలుపు తీస్తున్నారు. ఇప్పటి వరకు సరైన వర్షాలు లేక పోవడంతో వరిసాగు పనులు ఆలస్యమవుతున్నాయి. పచ్చిరొట్ట విత్తనాలు వేశారు. వర్షాలు పడి చెరువులు, జలాశయాలు నిండితే నార్లు పోయనున్నారు. ముందుగా బావుల కింద ఇప్పటికే నార్లుపోసి నాట్లు వేయటం ప్రారంభించారు. జిల్లాలో కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు అందుకున్న 2,203 మంది రైతులు నుంచి ఈనెల 20 వరకు వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. వీరి వివరాలను మండల వ్యవసాయ కార్యాలయాల్లో అధికారులు నమోదు చేశారు. త్వరలో వీరి ఖాతాల్లోనూ రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి. మండలాల వారీగా రైతు భరోసా జమ ఇలా (రూ.కోట్లలో) మండలం రైతులు నగదు చెన్నారావుపేట 11,407 10.92 దుగ్గొండి 14,375 13.11 ఖానాపురం 8,656 8.78 నల్లబెల్లి 13,444 14.26 నర్సంపేట 11,914 9.75 నెక్కొండ 14,819 14.98 గీసుకొండ 12,950 12.58 ఖిలా వరంగల్ 4,891 4.14 పర్వతగిరి 14,211 16.27 రాయపర్తి 19,289 24.09 సంగెం 14,846 15.03 వరంగల్ 1,716 1.44 వర్ధన్నపేట 13,885 17.03 1,56,403 162.38నాకు భరోసానిచ్చింది.. నాకు కాంట్రపల్లి గ్రామంలో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆభూమిలో ఏటా వరి సాగు చేస్తున్నా. రైతు భరోసా సాయం కింద 1.17 ఎకరాలకు రూ.8,550 బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. రెండేళ్లుగా సకాలంలో పెట్టుబడి రాక వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల్లో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి వరి సాగు చేశా. ఈ ఏడాది సకాలంలో రైతు భరోసా అందడంతో నేను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడ్డా. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశా. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటా. – ఉమాదేవి మహిళా రైతు, కాట్రపల్లి, సంగెం మండలంన్యూస్రీల్రైతులకు పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం 1,56,403 మంది ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమ వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తప్పిన ప్రదక్షిణలు జిల్లాలో 3,08,320 ఎకరాల్లో వివిధ పంటల సాగుప్రతీ సీజన్కు రైతు భరోసా.. జిల్లాలో మొత్తం 1,56,403 మంది రైతుల ఖాతాల్లో రూ.162.38 కోట్లు జమయ్యాయి. కేవలం కొద్ది రోజుల్లోనే ఇంత పెద్ద మొత్తంలో అందించింది. ఈసారి విత్తనాలు, ఎరువులు, కూలీలు, ఇతర పంటల పెట్టుబడికి ఈ డబ్బులు రైతులకు భరోసానిచ్చాయి. అలాగే, ప్రతీ సీజన్కు రైతు భరోసా సాయం జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. – అనురాధ జిల్లా వ్యవసాయ అధికారి -
పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్స్గా మార్చాలి
విద్యారణ్యపురి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సెమీరెసిడెన్షియల్గా మార్చాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్వహించిన డీటీఎఫ్ హనుమకొండ, వరంగల్ జిల్లాల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను సెమిరెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ పాలు అందించాలన్నారు. అంతరాలను పెంచేలా వివిధ రకాల పాఠశాలలు కాకుండా అందరూ కలిసి చదువుకునేలా ఒకేరకమైన పాఠశాలలను ఏర్పాటు చేసి అందరికి సమాన అవకాశాలు ఉన్న నాణ్యమైన విద్యను అందించాలన్నారు. -
బొగతలో సండే సందడి
మల్లూరులో పూజలుములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి భక్తిశ్రద్ధలతో ఆలయంలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. – మంగపేటములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు తరలివచ్చారు. దీంతో బొగత జలపాతం పరిసరాలు పర్యాటకులతో కోలాహలంగా మారాయి. పర్యాటకులు బొగత జలపాతం వద్ద ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు. ఈ క్రమంలో సమీపంలో ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా లేచి వచ్చి 20 మంది పర్యాటకులను కుట్టినట్లు తెలిసింది. –వాజేడు -
బ్యాంకు డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట : వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపా రం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగామ, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓలు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు -
నేడు ‘డయల్ యువర్ డీఎం’
హన్మకొండ: మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రయాణికుల నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 8977781103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతో పాటు, సలహాలు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడి ట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవా రం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమి షనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగర ప్రజలు ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలి రామన్నపేట: కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని గుమస్తాల సంఘం కార్యదర్శి గున్నాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. జూలై 9న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో కార్మికులంతా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సీఐటీయూ నాయకులతో కలిసి వరంగల్లోని వ్యాపారులకు ఆదివారం సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులకు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదాని, అంబానీలాంటి కార్పొరేట్ శక్తులకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. కార్మికులు సమ్మెలో పాల్గొని తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్, సహాయ కార్యదర్శి సింగారపు బాబు, జిల్లా కమిటీ సభ్యులు అప్పాజీ వాణి ఉన్నారు. -
అద్దె గదుల లీజులో అక్రమాలు!
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ ఆదాయంపై అధికారులు దృష్టి సారించడం లేదు. కొందరు లీజు అగ్రిమెంట్ చేసుకొని వాటిని సబ్ లీజుకు ఇస్తూ అక్రమ మార్గంలో నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మూడు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ లేదా టెండర్లో తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. షాపింగ్ సముదాయాల ద్వారా వస్తున్న ఆదాయం కంటే వాటిని లీజుకు పొందిన వారు ఇతరులకు వాటిని అద్దెకు ఇచ్చి మరింత సొమ్ము చేసుకుంటున్నారు. బహిరంగ వేలం వేస్తే మున్సిపాలిటీకి మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. బినామీల హవా! ఆదాయాన్ని సమకూర్చే మున్సిపాలిటీకి 94 దుకాణ సముదాయాలు ఉన్నాయి. ఇందులో 10 నుంచి 15 వరకు బినామీలతో నడుస్తున్నాయి. మున్సిపాలిటీకి ఆనుకుని ఉన్న 33 సముదాయాలతోపాటు నెహ్రూ సెంటర్లో 30, సెంట్రల్ బ్యాంకు కాంప్లెక్స్లో మరికొన్ని దుకాణ సముదాయాలకు మార్కెట్ పరంగా చూస్తే అత్యధిక డిమాండ్ ఉంది. కానీ, కొన్నేళ్లుగా రెన్యువల్ చేస్తూ వస్తుండడంతో బయటి అద్దెలకంటే తక్కువ స్థాయిలో మున్సిపాలిటీకి చెల్లిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతీ మూడు సంవత్సరాలకు ఒకసారి 33 శాతం అద్దె పెంచాల్సి ఉంది. దానికి అనుగుణంగా అద్దె పెరుగుతూ వస్తుంది. 25 సంవత్సరాలు మాత్రమే ఈ విధంగా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో అద్దెకు తీసుకున్న వ్యక్తులు బినామీకి ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలు గాలికి.. లీజుకు తీసుకున్న వారే దుకాణ సముదాయాలను ఉపయోగించుకోవాలి. సబ్ లీజు ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించకూడదు. ప్రతీ సంవత్సరం రూ.80 లక్షల ఆదాయం వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ లీజు వ్యవహారంలో అధికారులు చూసీచూడనట్లు ఉండడం వల్ల మున్సిపాలిటీకి నష్టం వాటిల్లుతోంది. క్షేత్రస్థాయిలో లీజు ఒప్పందాలకు విరుద్ధంగా ఇతరులు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. బహిరంగ వేలం నిర్వహిస్తాం.. మున్సిపాలిటీలో దుకాణ సముదాయాలకు ప్రతీ మూడేళ్లకు ఒకసారి లీజు అగ్రిమెంట్ రెన్యువల్ అవుతుంది. త్వరలో నెహ్రూ సెంటర్, గర్ల్స్ హై స్కూల్ ఏరియాల్లోని షాపింగ్ కాంప్లెక్స్లకు నిబంధనల ప్రకారం 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి బహిరంగ వేలం నిర్వహిస్తాం. లీజు పొందిన వ్యక్తులు సబ్ లీజుకు ఇస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, మున్సిపల్ కమిషనర్ ఆదాయంపై దృష్టి సారించని అధికారులు -
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే -
మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి
● తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్, కొయ్యడ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్ సతీశ్, గజ్జెల రమేశ్, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్, చెన్న విద్యాసాగర్, మీడియా ఇన్చార్జ్లుగా వేముల రాజేందర్, గూడూరు అనిల్కుమార్, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ను నూతన కార్యవర్గం సన్మానించింది. -
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 3,72,646 జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
కొత్త మెనూ.. కడుపునిండా తిను!
కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు. పెరిగిన మెస్ చార్జీలు హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది. పర్యవేక్షణతో అమలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంమెనూ ఇలా.. ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్, పాలు (బూస్ట్), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్, అరటి పండు ఇవ్వాలి. మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ ఇవ్వాలి. సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. -
బ్యాంక్ డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట: వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్రావు -
మామూళ్ల మత్తు
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రవీందర్రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మోస్తరు వర్షంహన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్ పైడిపల్లి 34.5, కమలాపూర్ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ● ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్ఎఫ్టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ● వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్ షాపుల నుంచి ప్రతినెలా యూజర్ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు. ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.వరంగల్ అర్బన్: వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫాస్ట్పుడ్ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్ కాంప్లెక్స్లు, ప్రైవేట్ హాస్టళ్లు, హోల్సేల్ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్ స్థాయి హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఫంక్షన్ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జీల వసూలేది? ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. కంపు.. కంపు బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్ల నడుమ, కాంప్లెక్స్ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.. వాణిజ్య సంస్థలను స్పెషల్ డ్రైవ్ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం. – రాజేశ్, బల్దియా సీఎంహెచ్ఓ ● లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బందిన్యూస్రీల్‘కమర్షియల్’ నుంచి కాసుల పంట శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జవాన్ల అక్రమ వసూళ్లు! యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం ఆదాయంపై పట్టించుకోని గ్రేటర్ అధికార, పాలక వర్గాలు నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి.. గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్ చార్జీలను వసూలు చేయాలి. ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో యూజర్ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్, టిఫిన్ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్ సమీపంలోది. రెండు కాంప్లెక్స్ల నడుమ ఒక మీటర్ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్లలోని పరిస్థితి.వారు అడగరు.. వీరు ఇవ్వరు! వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్లో ‘కొండా’ కల్లోలం.. ఆ పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ రాజకీయాలు.. అధికార కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. కొండా మురళీ లేఖ నేపథ్యంలో వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్యవసర భేటీ అయ్యారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు, వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్తో సహా పలువురు భేటీ అయ్యారు.కాగా, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్న లేఖ ఆ పార్టీలో కలకలం రేపుతోంది. మురళి శనివారం భారీ అనుచరగణంతో ర్యాలీగా గాంధీభవన్కు వచ్చి, నేరుగా పీసీసీ క్రమశిక్షణ కమిటీతో సమావేశమైన సంగతి తెలిసిందే. కమిటీ చైర్మన్ మల్లురవి, సభ్యులు శ్యాంమోహన్, జి.వి.రామకృష్ణ, కమలాకర్రావులతో గంటన్నరకు పైగా ఈ సమావేశం జరిగింది.ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరు పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించి, తమపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఆ లేఖలో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి.. సీఎం సన్నిహితుడు వేం నరేందర్రెడ్డి గురించి పేర్కొన్న అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.పొంగులేటి మాపై కక్షగట్టారు!: కొండా మురళి క్రమశిక్షణ కమిటీ భేటీకి వెళ్లడానికి ముందే ప్రచారంలోనికి వచ్చిన ఆ లేఖలో తొలుత మంత్రి పొంగులేటి గురించి ప్రస్తావించినట్లు సమాచారం. 2007లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన సమయంలో దళితులు, గిరిజనులకు ఎక్కువ సీట్లు వచ్చేలా తాను పనిచేశానని, అందుకే జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలు రిజర్వుడ్ కేటగిరీకి వెళ్లాయని తెలిపారు.ఈ పరిణామంతో సీటు కోల్పోయిన కాంగ్రెస్ సీనియర్ నేత రామసహాయం సురేందర్రెడ్డి.. అందుకు తానే కారణమని చెబుతూ రాజకీయాలకు దూరమయ్యారని చెప్పారు. ఇప్పుడు ఆయన అల్లుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా వచ్చి, ఆ కోపంతో తన సతీమణి, మంత్రి కొండా సురేఖపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించినట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వేం నరేందర్రెడ్డి గతంలో కొండా సురేఖపై పోటీ చేస్తే 2 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, డీలిమిటేషన్లో ఆయన సీటు ఎగిరిపోయేందుకు కూడా తానే కారణమని నరేందర్రెడ్డి కోపం పెంచుకున్నారని లేఖలో పేర్కొనట్లు సమాచారం.జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల గురించి కూడా కొండా మురళి తన లేఖలో వివరించినట్లు తెలిసింది. వర్ధన్నపేటలో తమ ప్రభావం బలంగా ఉంటుందని, స్థానిక ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుతో సత్సంబంధాలున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నుంచి గత ఎన్నికల్లో తననే పోటీ చేయాలని ప్రజలు కోరినా టీడీపీ నుంచి వచ్చిన గండ్ర సత్యనారాయణకు మద్దతిచ్చామని, ఇప్పుడు ఆయన తమకు వ్యతిరేకంగా ఇతర నేతలతో కలిశారని ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. -
కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
డబ్బుల కోసం తల్లికి నిప్పంటించి..
సంగెం: కన్న కొడుకే తల్లిపాలిట కాలయముడయ్యాడు. డబ్బులకోసం తల్లిని చంపేందుకు సిద్ధమయ్యాడు. ‘వద్దు కొడుకా’.. అంటూ తల్లి బతిమాలినా వినకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంటపల్లికి చెందిన ముత్తినేని వినోద (60), సాంబయ్య దంపతులకు ఒక కూతురు, లింగమూర్తి, సతీశ్ అనే కుమారులు ఉన్నారు. వీరిలో కొంతకాలం కిందట లింగమూర్తి అనారోగ్యంతో మరణించాడు. సాంబయ్యకు ఉన్న భూమిలో 4 ఎకరాలను ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకోసం తీసుకుంది. మరో ఎకరం భూమి ఇంకా సాంబయ్య పేర ఉంది. ప్రభుత్వం పరిహారంగా రూ.40 లక్షలు ఇచ్చింది. వీటిలో రూ.30 లక్షలను చిన్న కుమారుడు సతీశ్కు ఇచ్చారు. ఈ డబ్బులతో సతీశ్ వేరే చోట రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. సాంబయ్య పేర రూ.3 లక్షలు, తల్లి వినోద పేర రూ.3.50 లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. మిగిలిన డబ్బులో నుంచి కూడా కొంత సతీశ్కు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ రూ.2 వేలు, డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీతో కాలం వెళ్లదీస్తున్నారు. కాగా, తల్లిదండ్రుల వద్ద ఉన్న డబ్బులను కూతురుకు ఇస్తున్నారని సతీశ్ తరచూ గొడవ పడుతుండేవాడు. మిగిలిన డబ్బులను కూడా తనకు ఇచ్చేయాలని వేధించేవాడు. డబ్బులు ఇవ్వకుండా తల్లి అడ్డుపడుతోందని గతంలో తల్లి కాలు, చేయి విరగ్గొట్టాడు. దీంతో అతడిని ఇంటి నుంచి వెళ్లగొట్టారు. తల్లిపై కక్ష పెంచుకున్న సతీశ్ శుక్రవారం రాత్రి ఇంటి ముందు తల్లిదండ్రులు నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో వచ్చి తల్లి వినోదపై దాడి చేశాడు. బాటిల్లో తెచ్చిన పెట్రోల్ ఆమెపై చల్లి నిప్పు అంటించి పారిపోయాడు. భార్య అరుపులు విని లేచిన సాంబయ్య చుట్టుపక్కల వారి సాయంతో మంటలు ఆర్పారు. అప్పటికే 80 శాతం గాయాలైన వినోదను 108లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. న్యాయమూర్తి సమక్షంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్లు వినోద వాంగ్మూలం రికార్డు చేశారు. భర్త సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ శనివారం తెలిపారు. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ● ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణసాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్రాజ్కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆస్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్పై కొంత అవగాహన ఉంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజనీతిజ్ఞుడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పీవీ ఆలోచనలు, ఆర్థిక సంస్కరణలు భారత్ను అభివృద్ధివైపు తీసుకెళ్లాయన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, అంకూస్ పాల్గొన్నారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
పరకాల: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరకాల మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్రెడ్డితో కలిసి పరకాల మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ప్లానింగ్, రెవెన్యూ విభాగాల పనితీరుపై సమీక్షించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వర్షాకాలంలో ముందు జాగ్రత్తలు తీసుకోకపోపోతే ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తాచెదారం పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, విద్యా, వ్యాపార వాణిజ్య సంస్థల ముందు చెత్త వేసే వారికి జరిమానాలు విధించాలని కమిషనర్ సుష్మను ఆదేశించారు. ఫాగింగ్, స్ప్రే నిర్వహణ కోసం కావాల్సి న మిషన్లు కొనుగోలు చేయాలని, మున్సిపల్ మిగులు నిధులతో జేసీబీ, స్వచ్ఛ వాహనాలు కొనాలని సూచించారు. అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య సిబ్బందికి సమాచారాన్ని డిస్ప్లే చేయాలన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి, మున్సిపల్ విభాగాల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి రోడ్డుపై చెత్త వేసే వారికి జరిమానా -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాలలో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళీ దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి
నర్సంపేట: విద్యుత్ వినియోగదారులు, రైతులు తమ పరిధిలోని ఉన్న విద్యుత్ సమస్యలను సెక్షన్ ఆఫీసర్ (అసిస్టెంట్ ఇంజనీర్ ఆపరేషన్), గ్రామస్థాయిలో ఉండే లైన్మెన్కు తెలియజేయాలని వరంగల్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కె.గౌతంరెడ్డి సూచించారు. ఈ మేరకు నర్సంపేట డివిజన్ పరిధిలోని 33కేవీ లైన్ను శనివారం ఉపయోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని సూచించారు. భారీ వర్షాలు, గాలి దుమారంతో విద్యుత్ తీగలు తెగి పడితే వెంటనే సమాచారాన్ని ఏఈలకు తెలియజేయాలని కోరారు. తడిగా ఉన్న స్తంభాలను ముట్టుకోకూడదన్నారు. విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్త వహించాలని, ఇంటిలోకి వచ్చే సర్వీస్ వైరు ఎలాంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల గుండా వెళ్లకుండా చూడాలని తెలిపారు. ఇళ్లలో నాణ్యమైన వైరింగ్ వాడాలని, రైతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రతా ప్రమాణాలు (ఎర్తింగ్) పాటించాలని సూచించారు. రైతులు, వినియోగదారులు స్వయంగా కరెంటు పనులను చేసుకోకూడదని పేర్కొన్నారు. ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా టీజీ ఎన్పీడీసీఎల్ టోల్ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేయాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ డీఈ టెక్నికల్ ఎ.ఆనంద్, నర్సంపేట డీఈ పి.తిరుపతి, ఏడీలు, ఏఈ, సిబ్బంది పాల్గొన్నారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు కృషి
నర్సంపేట రూరల్: ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు వైద్య కళాశాలల్లో ఎన్ఎంసీ నిబంధనల మేరకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. శనివారం నర్సంపేటలోని వైద్య కళాశాల, జిల్లా ఆస్పత్రిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్, వివిధ విభాగాధిపతులతో శనివారం సమీక్ష నిర్వహించారు. వైద్య కళాశాలలో బోధన, బోధనేతర, ల్యాబ్, సిబ్బంది, కావాల్సిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య విద్యార్థినుల వసతి గృహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆస్పత్రికి సంబంధించి ఓపీ విభాగం, ఆరోగ్యశ్రీ తదితర విభాగాలను సందర్శించారు. వివిధ విబాగాల్లో వనరుల కొరత, యూజీ మెడికల్ ఎడ్యుకేషన్, ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన, సమకూర్చాల్సిన సౌకర్యాలపై క్షుణ్ణంగా చర్చించారు. ఆస్పత్రికి, వైద్య కళాశాలకు డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బంది, ఇతర పరికాలపై అడిగి తెలుసుకున్నారు. ఐపీ సేవలు తర్వితగతిన ప్రారంభించాలని, వాటికి కావాల్సి వసతుల కల్పనకు కలెక్టర్ కృషి చేస్తారని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.కిషన్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీదేవి, పలు విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
రైతుల సంక్షేమానికి పెద్దపీట
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జాతీయ ఆహార భద్రత, పోషణ్ మిషన్ ఆధ్వర్యంలో పప్పు దినుసుల విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. అలాగే, కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం (భద్రత కిట్) అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి కె.అనురాధ, సహాయ వ్యవసాయ సంచాలకులు కె.దామోదర్రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జాతీయ ఆహార భద్రతా కన్సల్టెంట్, పి.సారంగం, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, పాల్గొన్నారు. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్ను కళాశాలకు పంపేందుకు బాల్యా ద్విచక్రవాహనంపై ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందజేత
గీసుకొండ: దేశవ్యాప్తంగా జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మె సందర్భంగా ఆ రోజు తాము విధులకు హాజరు కావడం లేదంటూ ఏఐటీయూసీ నాయకులు శనివారం నర్సంపేట, వర్ధన్నపేట డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ఐ.ప్రకాశ్, డాక్టర్ కొమురయ్యకు సమ్మె నోటీసు అందజేశారు. సార్వత్రిక సమ్మెలో జాతీయ ఆరోగ్యమిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొంటారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేశ్, ఎన్హెచ్ఎం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియ న్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేశ్ఖన్నా తెలిపారు. ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. యూనియన్ ఉపాధ్యక్షుడు ఆచంట అభిషేక్, జిల్లా అధ్యక్షులు జన్ను కొర్నేలు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు యాకూబ్పాషా తదితరులు పాల్గొన్నారు. కొమ్మాల ఆలయ ఆదాయం రూ.8.39 లక్షలుగీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఈ ఏడాది ఏప్రిల్ 9 నుంచి 80 రోజలపాటు రూ.8,39,225 ఆదాయం సమకూరిందని ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. శనివారం ఆలయంలో లెక్కించగా హుండీల ద్వారా రూ.2,44,200, పలు రకాల ఆర్జిత సేవల ద్వారా రూ.5,95,025 ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకుడిగా డి.అనిల్కుమార్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, ఆలయ ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ వీరాటి లింగారెడ్డి, శ్రీరాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలురాయపర్తి: నకిలీ విత్తనాలు అమ్మితే కేసులతోపాటు కఠిన చర్యలు తప్పవని రెండో అదనపు న్యాయ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి హారిక హెచ్చరించారు. విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల కేంద్రంలోని రైతువేదికలో రైతులు, విత్తన డీలర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు గ్రామాల్లో అమ్ముతున్న ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలను కొనుగోలు చేయవద్దని కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సదస్సులో లీగల్ అడ్వయిజర్ రజిని, వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివా స్,ఎస్సై ముత్యం రాజేందర్, ఏఓ గుమ్మడి వీరభద్రం,ఏఈఓలు,రైతులు,డీలర్లు పాల్గొన్నారు. గంజాయి స్వాధీనంవర్ధన్నపేట: గంజాయి స్వాధీనం చేసుకున్న సంఘటన వర్ధన్నపేటలో జరిగింది. ఎస్సై చందర్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటలోని వరంగల్ ఖమ్మం రహదారిలో ఉన్న ఓ స్కూల్ వద్ద శనివారం తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా పల్సర్ బైక్పై గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి తనిఖీ చేశారు. రూ.1,36,000 విలువైన రెండు కిలోల 720 గ్రాముల గంజాయి, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఖమ్మం జిల్లా ముస్తాఫానగర్కు చెందిన నిందితులు అఫ్రోజ్, మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చందర్ తెలిపారు. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాల్లో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
సాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్రాజ్కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన తరచూ వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఆ స్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్పై కొంత అవగాహన ఉంది. దీంతో శాంతిభద్రతల పరిరక్షణలో కఠినంగానే ఉండే అవకాశముంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణ -
కొండా మురళి ఎపిసోడ్లో ట్విస్ట్
ఓరుగల్లు కాంగ్రెస్ వర్గపోరు పంచాయితీలో ట్విస్ట్ చోటు చేసుకుంది. గాంధీభవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరైన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. వరంగల్ జిల్లా నేతలపైనే ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లయ్యింది.హైదరాబాద్, సాక్షి: కొండా మురళి వ్యాఖ్యల వ్యవహారంపై శనివారం గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ భేటీ అయ్యింది. కమిటీ ఎదుట హాజరైన కొండా మురళి తన వ్యాఖ్యలకు వివరణ ఇస్తారని.. ఆయనపై చర్యలు తప్పవని కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చ జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన రివర్స్ కౌంటర్కు దిగారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న వరంగల్ కీలక నేతలపైనే కమిటీకి ఫిర్యాదు చేశారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డిపై ఆయన క్రమశిక్షణా కమిటీకి ఫిర్యాదు చేశారు. మొత్తం 15 పేజీలతో కొండా మురళి నివేదిక ఇచ్చారు. అందులో.. స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఇబ్బంది పెడుతున్నారని, కాంగ్రెస్ కార్యకర్తలను కడియం కష్టపెడుతున్నారని, అలాగే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి రేవూరి సహకరిస్తున్నారని.. అక్రమ క్రషర్కు సహకరిస్తున్నారని ఆరోపించారు. వీళ్లిద్దరితో పాటు నాయిని రాజేందర్రెడ్డి పేరును కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావిస్తూ.. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని ఆయన క్రమశిక్షణా కమిటీని కోరారు. ఈ నివేదికను కమిటీ స్వీకరించింది.క్రమశిక్షణ కమిటీతో కొండా మురళీ..కమిటీ ముందుకు రావాలని ఎవరూ నన్ను పిలవలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా. భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేయాలనుకున్నా. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ పోటీ చేసింది కాబట్టి నేను తప్పకున్నా. మరో పార్టీ నుంచి గండ్ర వచ్చినా ఆయన మద్దతు ఇచ్చి ప్రచారం చేశా. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. కొండా సురేఖ-సీతక్కలు కలిసే పని చేసుకుంటున్నారు. సీతక్కతో మాకు పంచాయితీ లేదు. వాళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు. కడియం కాంగ్రెస్లోకి వచ్చినప్పటి నుంచే సమస్యలు మొదలయ్యాయి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. పరకాల పూర్తిగా మాదే. రేవూరికి నిస్వార్ధంగా సహాయం చేశాం. అతనిప్పుడు మాపై గుడుపూటానీ రాజకీయాలు చేస్తున్నారు. మా మద్దతుతోనే రేవూరి గెలిచారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తున్నారు. నాయిని తనకి సంబంధం లేని మా నియోజకవర్గంలో పోస్టులు ఇప్పించుకుంటున్నాడు. వేం నరేందర్ రెడ్డి సీటు ఎగిరిపోవడానికి నేనే కారణమని నాపై కోపంగా ఉన్నట్టున్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు రాజీనామా చేసి వచ్చాను. పార్టీలోకి వచ్చేటప్పుడు 26 మంది కార్పొరేటర్లను తీసుకోవచ్చా. కొంతంది లాగా పార్టీ మారి పదవిని ఎంజాయ్ చేయడం లేదు. ఇండియాలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీని నేను అని కమిటీకి నిచ్చిన లేఖలో పేర్కొన్నారాయన. వరంగల్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్లో చిచ్చు రాజేశాయి. ఈ క్రమంలో తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చేందుకు కొండా మురళి సుమారు 60 వాహనాల్లో.. భారీ అనుచరగణంతో హైదరాబాద్లోని గాంధీ భవన్కు బయల్దేరినట్లు వచ్చారు. లోపలికి వెళ్లే ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్నెవరూ వివరణ ఇవ్వాలని కోరలేదు. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చా’’ అని అన్నారు. తన వివరణకు సంబంధించిన ఆరు పేజీల పత్రాన్ని ఆయన సమర్పించినట్లు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో కొండా మురళి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యాలు చేశారన్నది అభియోగం. ఆ వ్యాఖ్యలతో ఓరుగల్లు కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా పరస్పర విమర్శల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఆ వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల్సిందిగా క్రమశిక్షణ కమిటీ కోరింది. అలాగే.. ఆయన తన కుమార్తెను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తానని ప్రకటించడమే కాకుండా, కొందరు సీనియర్ నేతలపై విమర్శలు చేయడం పార్టీ లోపలే తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ప్రధానంగా.. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి వంటి నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు కలిసి అత్యవసరంగా సమావేశమై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా దంపతులపై చర్యలు తీసుకోవాలని AICC తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె జోక్యంతో ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ కొండా మురళికి సంజాయిషీ నోటీసులు ఇచ్చింది. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల కిందట జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను వివస్త్రను చేసి జననాంగంలో జీడిరసం పోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ‘సాక్షి’కి విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వారికి ముగ్గురు పిల్లలు. అయితే సమీప బంధువైన ఓ వివాహితతో అతను వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. సుమారు పది రోజులు ఆమెతో కలిసి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. దీంతో అతని భార్య స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వారు ఆ ఇద్దరినీ వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడి (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు. అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అంటూ బాధిత మహిళ వేడుకున్నా వినకుండా దాడి చేశారు. జననాంగంలోనుంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. ఆ తరువాత ఆ ఇద్దరినీ ఏం చేశారో ఇప్పటివరకు ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం లేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరూ ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి నెలకొంది. -
రహదారుల భద్రతపై తనిఖీలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆర్అండ్బీ, పోలీస్, జాతీయ రహదారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రహదారుల భద్రత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో రద్దీ, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి సంబంధింత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కటాక్షపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియంతో కూడిన సైన్ బోర్డులు, ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను అందజేయాలన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని, నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల, మ్యాన్హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, నేషనల్ హైవేస్ ఈఈ మనోహర్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్రాథోడ్, నారాయణ, అడిషనల్ ఏసీపీ ప్రభాకర్రావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆర్గనైజ్డ్ క్రైమ్స్పై దృష్టి పెట్టండి
వరంగల్ క్రైం: ఆర్గనైజ్డ్ క్రైమ్స్కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ టాస్క్ఫోర్స్ అధికారులను ఆదేశించారు. సీపీ శుక్రవారం టాస్క్ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ఈసందర్భంగా టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సీపీకి పూలమొక్కతో స్వాగతం పలికారు. -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
హనుమకొండ జిల్లాలో 89.95%, వరంగల్ జిల్లాలో 60.73% ఉత్తీర్ణత విద్యారణ్యపురి: ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని శుక్రవారం విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 416 మంది 89.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. బాలురు 277 మందికి 249 మంది, బాలికలకు 186 మందికి 167 మంది ఉతీర్ణులైనట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్గా వాణివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్: గణతంత్ర (జనవరి 26) దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు, అందుకు సంబంధించిన పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, నాలుగు సెట్లను రూపొందించి జూలై 25లోగా హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. అంతేకాకుండా www:https://padmaawards.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణే లక్ష్యంకాజీపేట అర్బన్: బాలల రక్షణే లక్ష్యంగా బాలల సంరక్షణ కేంద్రాలు పని చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, ఫాతిమానగర్లోని డివైన్ మెర్సీ, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలని, భవనాలకు ఫిట్నెస్ కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంస్థల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్చందర్రావు, సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
సౌదీలో చిక్కుకున్న కొప్పూరు వాసి
లక్డీకాపూల్: సౌదీ ఏడారిలో చిక్కుకుని దుర్భరజీవనాన్ని సాగిస్తున్న తన భర్తను కాపాడి స్వదేశానికి తీసుకురావాలని ఓ భార్య మొర పెట్టుకుంది. ఈమేరకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ భార్య లత తన ఇద్దరు కూతుళ్లతో ప్రజాభవన్కు వచ్చింది. ‘ఈశ్వర్ కుటుంబం భవిష్యత్ కోసం 2017లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ మొదట హౌస్ డ్రైవర్గా పని చేశాడు. కొద్ది నెలల్లోనే పని కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. మండే ఎండల్లో.. ఖర్జూర తోటలో కూలీగా చేరి అక్కడే చిక్కుకుపోయాడు. స్వదేశానికి చేరే మార్గం తెలియక ఏడేళ్లుగా కుమిలిపోతున్నాడు. అఖామా, వీసా గడువు ముగిసిపోయింది. సౌదీ పాస్పోర్ట్ అధికారుల వద్ద జమ చేయడం వల్ల ఈశ్వర్ ఖర్జూర తోటలో కూలీగా చేరాడు. ఎలాగైనా నా భర్తను స్వదేశానికి తీసుకురావాలి’ అని ఈశ్వర్ భార్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంది. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో ఈమేరకు ఆమె ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీఏడీ ఎన్నారై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా.. సౌదీ నుంచి స్వదేశానికి పంపించడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి ఇప్పటికే కరీంగర్కు చెందిన సామాజిక కార్యకర్త మొహమ్మద్ జబ్బార్ సహాయాన్ని అర్థించామని లత పేర్కొంది. ఈక్రమంలో రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి ఈశ్వర్ను స్వదేశానికి రప్పించాలని ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. స్వదేశానికి తీసుకురావాలని ప్రవాసీ ప్రజావాణిలో కుటుంబీకుల వేడుకోలు -
మహిళా డెయిరీ ఏర్పాటుకు చర్యలు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు సత్వరమే చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద, అధికారులతో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి సమీక్షించారు. ఈసందర్భంగా డెయిరీ భవన నిర్మాణం, పాల సేకరణ, డెయిరీ ద్వారా పాల సరఫరా, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మిల్క్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, సొసైటీ ఏర్పాటు, మార్కెటింగ్, చెల్లింపులు, తదితర అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, సహకార అధికారులు సంజీవరెడ్డి, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు. పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి పరిశీలన.. కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించా రు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపేయకుండా చూడాలన్నా రు. అనంతరం కేయూ జంక్షన్లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్పై చర్యలకు ఆదేశాలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగా న్ని పరిశీలించి ఆరోగ్య మహిళ పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఅప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. హాజరుశాతంపై చర్యలు తప్పవు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బ యోమెట్రిక్తో చేపట్టాలని కమిషనర్.. వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హా జరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్లో వైద్యు ల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులతో ఆస్పత్రులను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి పంపించండి.. పర్యవేక్షణ కమిటీ ౖచైర్మన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్ సస్పెన్షన్కు ఆదేశాలు -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణం కాగా, బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం. ఈఘటనకు సంబంధించి ‘సాక్షి’కి అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం మేరకు.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళతో కలిసి సుమారు పది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి భార్య తనకు జరిగిన అన్యాయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కోపంతో రగిలిపోయి లేచిపోయిన ఆ ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడీ (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు, అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అని బాధిత మహిళ వేడుకున్నా.. పలువురు ఇష్టారీతిన దాడి చేశారు. యోనిలోంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. తర్వాత ఆఇద్దరిని ఏం చేశారో ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందలేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. వివాహితపై దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతోనే.. ఘటన జరిగి ఐదు రోజులు తాటికాయల గ్రామంలో అమానవీయం -
‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం
రాయితీ అందిస్తున్న కేంద్రంహన్మకొండ: పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈక్రమంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి రాయితీని అందిస్తోంది. పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ, తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందగలిగే పట్టు పరిశ్రమ చిన్న సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. మల్బరీ పట్టు పురుగుల పెంపకం రైతులకు మంచి లాభదాయకం. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. దీనిద్వారా ప్రతి నెలా నికర ఆదాయం పొందవచ్చు. 25 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒకసారి నాటిన మల్బరీ తోట నుంచి 15 నుంచి 20 ఏళ్ల వరకు ఉపాధి పొందవచ్చు. షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కలు, ఇతర పరికరాలకు ప్రభుత్వం నుంచి రాయితీని పొందవచ్చు. హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని, 3,19,900 పట్టు గుడ్ల ద్వారా 2,30,328 పట్టు కాయల ద్వారా 38,388 కిలోల పట్టుదారాన్ని ఉత్పత్తి చేయాలని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 81 ఎకరాలను మల్బరీ తోట పెంపకానికి గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 51 గ్రామాల్లో 97 మంది పట్టు పరిశ్రమ నిర్వహిస్తున్నారు. రాయితీ వివరాలు.. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేలు సహాయాన్ని రాయితీ రూపేణా అందిస్తోంది. పట్టు పురుగుల పెంపకానికి గది నిర్మాణానికి రూ.2.25 లక్షలు, స్టాండ్స్, ఇతర పరికరాలకు రూ.37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ.2,500, నీటి పారుదల కోసం రూ.50 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మల్బరీ తోట నాటుట, నిర్వహణకు రూ.41,500, షెడ్డు నిర్మాణానికి 1,03,040 చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78 వేలు, షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, రేరింగ్ పరికరాలకు రూ.26,610, రేరింగ్ స్టాండ్స్కు 24,140, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారాలకు రూ.3,250, నీటి పారుదల సదుపాయానికి రూ.65 వేలు రాయితీగా చెల్లిస్తోంది. పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి పట్టు పరిశ్రమతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది మంచి లాభదాయక పంట. పట్టు పరిశ్రమ చేపట్టేందుకు ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. ఈ రాయితీతో తక్కువ ఖర్చుతో పట్టు పరిశ్రమ నడుపవచ్చు. ప్రతీ నెల నికర ఆదాయం వస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుంటూ రైతులు పట్టు పరిశ్రమ వైపు ముందుకు రావాలి. – జి.అనసూయ, హనుమకొండ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి -
అమ్మ పేరిట ఒక మొక్క నాటుదాం
కమలాపూర్: అమ్మ పేరిట తలా ఒక మొక్క నాటుదామని నాబార్డ్ ఏజీఎం ఎల్.చంద్రశేఖర్, డీసీఓ బి.సంజీవరెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సహకార సంఘ వారోత్సవాల్లో భాగంగా కమలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మండలంలోని గూడూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి రైతులతో కలిసి సుమారు 77 మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరాన్ని సహకార సంఘాల సంవత్సరంగా ప్రకటించిందని, దీంతో ‘ఏక్ పేడ్ మా కీ నామ్’ నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రకృతి సమతుల్య త కోసం మొక్కలు నాటాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలంటే మొక్కల పెంపకం తప్పనిసరన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచనల మేరకు రైతులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆడిట్ అధికారి కె.కోదండరాములు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ అజహరుద్దీన్, పీఏసీఎస్ చైర్మన్ పేరాల సంపత్రావు, డైరెక్టర్లు తక్కళ్లపల్లి సత్యనారాయణరావు, భావని రాజేశ్వర్రావు, మౌటం రమేశ్బాబు, కుమారస్వామి, ఏఓ రాజ్కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు అంకతి సాంబయ్య, పాక లక్ష్మీరవీందర్, సంఘ కార్యదర్శి చోటేమియా, ఏఈఓలు, రైతులు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, డీసీఓ సంజీవరెడ్డి -
సమస్యలు ఉంటే ఫోన్ చేయండి : ఎస్ఈ
దుగ్గొండి: వ్యవసాయ బావులు, ఇళ్లలో విద్యుత్ సమస్యలు ఉంటే వెంటనే సిబ్బందికి లేదా టోల్ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని ట్రాన్స్కో వరంగల్ ఎస్ఈ గౌతంరెడ్డి అన్నారు. సొంతంగా మరమ్మతులు చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. శివాజీనగర్ గ్రామంలో శుక్రవారం విద్యుత్శాఖ ఆధ్వర్యంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి రైతులతో మాట్లాడి విద్యుత్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తరచూ కరెంట్ ట్రిప్పు కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలంలో వ్యవసాయ బావుల వద్ద రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. తడిసిన సపోర్టు తీగలు, స్టార్టర్లను ముట్టుకోవద్దని చెప్పారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో డీఈ తిరుపతి, టెక్నికల్ డీఈ ఆనంద్, ఏడీ లక్ష్మణ్, ఏఈ ప్రత్యూష, విద్యుత్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
స్థల సర్వేను త్వరగా పూర్తిచేయాలి
ఖానాపురం: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్కు కావాల్సిన స్థల సర్వేను త్వరగా పూర్తిచేయాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని అశోక్నగర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం అధికారులతో కలిసి శుక్రవారం స్థలపరిశీలన చేశారు. ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థలం హద్దులు, రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ స్థలానికి సంబంధించిన సర్వేను మూడు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. సైనిక్ స్కూల్ పరిధి నుంచి వెంటనే స్థలాన్ని తీసుకుని నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. స్థలాన్ని అప్పగించిన వెంటనే ప్రభుత్వ సహకారంతో నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిందని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీఓ సునీల్కుమార్, ఎంఈఓ శ్రీదేవి, వైస్చైర్మన్ శాఖమూరి హరిబాబు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఇంకా పునాదుల్లోనే!
సాక్షి, వరంగల్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో చేపట్టిన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం నాటి ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్తో నిర్మించిన వరంగల్ పాత బస్టాండ్ను కూల్చివేసి.. ఆ స్థానంలో నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నిర్మాణ పనులు ఇంకా ఫుటింగ్ దశలోనే ఉన్నాయి. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగించి, రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో పునాదులు తవ్వి నిర్మిస్తున్నారు. మట్టిని చదును చేసి పునాది కోసం కాంక్రీట్ వేయడానికి ముందు బ్లైండింగ్ కాంక్రీట్ పొర వేస్తున్నారు. కాంక్రీట్ వేసిన తర్వాత, రాడ్లు అమర్చి కావాల్సిన మందంతో స్లాబ్ నిర్మించనున్నారు. ఇలా రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్లు నిర్మించేందుకు రెండేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా కాంట్రాక్ట్ కాలపరిమితి 18 నెలల్లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతూ పనులను వేగవంతం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఊటతో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఫుటింగ్ పనుల్లో వేగిరం పెంచారు. ఇవన్నీ పరిశీలిస్తే బస్టాండ్ నిర్మాణానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మరో రూ.50 కోట్లు అవసరం.. అన్ని జిల్లాలు, రాష్ట్రాల బస్సులతోపాటు సిటీ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకునేలా గ్రౌండ్ ఫ్లోర్లో 32 ప్లాట్ఫాంలు నిర్మించనున్నారు. మరో ఐదు అంతస్తుల్లో వ్యాపార, వినోదం తదితర వసతులు ఉండేలా కాంప్లెక్స్లు అందుబాటులోకి తేనున్నారు. సెల్లార్లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, వరంగల్ రైల్వే స్టేషన్, నియోకు అనుసంధానంగా వరంగల్ బస్టాండ్ ఉండేలా.. అండర్ వాక్ లేదంటే స్కైవాక్ నిర్మించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సెల్లార్లు, గ్రౌండ్ఫ్లోర్ కోసం కేటాయించిన రూ.75 కోట్లతోపాటు మరో రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న నిధులతో రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసి బస్సు సర్వీసులు నడిచేలా చూడనున్నారు. ఇది ఏడాదిన్నరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఆ తర్వాత వచ్చే నిధులతోనే పైఅంతస్తులు నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. ఇలా పూర్తిస్థాయిలో వరంగల్ బస్టాండ్ అందుబాటులోకి రావాలంటే మూడేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశముంది. ‘ఈ బస్టాండ్ నిర్మాణ పనులు పునాది దశల్లో ఆలస్యం అవుతాయి. రెండు సెల్లార్లు, గ్రౌండ్ఫ్లోర్ వరకు నిర్మాణ పనులు నిర్ణీత కాలపరిమితి 18 నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. కాంట్రాక్టర్కు మార్గదర్శనం చేస్తూ సాధ్యమైనంత తొందరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం’ అని కుడా అధికారి ఒకరు తెలిపారు. నిదానంగా వరంగల్ బస్టాండ్ పనులు రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం గుంతల్లో నీటిఊట రాకుండా ఫుటింగ్ వర్క్ 18 నెలల్లో పూర్తిచేస్తామంటున్న ‘కుడా’ అధికారులు అప్పటివరకు తాత్కాలిక బస్టాండ్లోనే ప్రయాణికులకు సేవలుప్రయాణికులకు తిప్పలే.. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణికుల సౌకర్యార్థం సమీపంలో తాత్కాలిక బస్టాండ్ను ఏర్పాటు చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్షం పడితే అక్కడ కూడా నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారీ వర్షం కురిస్తే తడుస్తారు. ఇలా కాలం ఏదైనా వరంగల్ ఆధునిక బస్టాండ్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులతోపాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. -
జాతీయ సదస్సులో ప్రాజెక్టు ప్రదర్శన
నర్సంపేట రూరల్: ఢిల్లీలో ఈనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన జాతీయ సదస్సులో లక్నెపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం ప్రాజెక్టును ప్రదర్శించారు. అకడమిక్ అచీవ్మెంట్ అండ్ ప్రొఫిసిఝెన్సీ ఇన్ లాంగ్వేజ్ అండ్ డిస్కోర్సెస్ ప్రాజెక్టును ఎంపిక చేయగా.. గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు వారానికి రెండు మూడు తరగతులు నిర్వహించినట్లు సత్యం తెలిపారు. విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలు, డిస్కొర్సెస్ను పెంపొందించుటకు హెచ్ఎం పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. బోధనాంశాలకు సంబంధించిన అంశాలను ఈ జాతీయ సదస్సులో ప్రదర్శించినట్లు ఆయన వివరించారు. ఈసందర్భంగా సత్యంకు సర్టిఫికెట్ అందజేశారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీశ్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు. పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి పరిశీలన.. కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించారు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపివేయకుండా చూడాలన్నారు. అనంతరం కేయూ జంక్షన్లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్పై చర్యలకు ఆదేశాలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగాన్ని పరిశీలించి ఆరోగ్య మహిళా పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఅప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. హాజరుశాతంపై చర్యలు తప్పవు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బయోమెట్రిక్తో చేపట్టాలని కమిషనర్.. వైద్యారోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హాజరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్లో వైద్యుల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులతో ఆస్పత్రులను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి పంపించండి.. పర్యవేక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్ సస్పెన్షన్కు ఆదేశాలు -
కపాలినీ, భగమాలినీ క్రమాల్లో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాల్లో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
దశలవారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
గీసుకొండ: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని, తమకు రాలేదని ఎవరూ బాధపడొద్దని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్లలో శుక్రవారం లబ్ధి దారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. పేదవారి సొంతింటి కల కాంగ్రెస్ సర్కారుతోనే తీరుతుందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విద్య, వైద్యం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. ప్రతీ కుటుంబం ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం రేవంత్రెడ్డి సంకల్పమన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్నారు. ఇంది రమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రూ.500కు వంటగ్యాస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్కార్డులు, సన్నబియ్యం, రూ.2లక్షల లోపు రైతులకు రుణమాఫీ తదితర సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. దశల వారీగా ఇళ్ల బిల్లులు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే వివరించారు. తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు కొండేటి కొమురారెడ్డి, కటకం సురేందర్, కుమారస్వామి, గోదాసి చిన్న, ఎలగొండ ప్రవీణ్కుమార్, బల్దియా అధికారులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
ఎన్నికల్లో ముదిరాజ్లను గెలిపించుకోవాలి
దుగ్గొండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయనున్న ముదిరాజ్లను గెలిపించుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ పిలుపునిచ్చారు. గిర్నిబావిలో ముదిరాజ్ మహాసభ జిల్లా విస్తృతస్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు పొన్నం మొగిలి అధ్యక్షతన శుక్రవారం గిర్నిబావిలో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బండా ప్రకాశ్ హాజరై మాట్లాడారు. 2011 జనాభా లెక్కలు, 2024 సమగ్ర కులగణన ప్రకారం రాష్ట్రంలో ముదిరాజ్లే అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. ఏ పార్టీ అయినా ఒక వ్యక్తికి అవకాశం ఇస్తే మరో పార్టీ నుంచి మన వ్యక్తి పోటీ చేయకుండా ఉండాలని సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ముదిరాజ్లను బీసీ–డీ నుంచి బీసీ–ఏలోకి మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఆగిపోయాయని వివరించారు. కులాల వారీగా రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై తనవంతు పోరాటం చేస్తానని తెలిపారు. ఉన్నతస్థాయికి చేరాలంటే ప్రతి ముదిరాజ్ తమ బిడ్డలను చదివించాలని సూచించారు. చేప పిల్లలకు బదులు మత్స్య సహకార సంఘాలకు నేరుగా నిధులు అందించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముదిరాజ్ సంఘం జిల్లా నాయకులు గజమాలతో సత్కరించారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్, ఎన్నారై సెల్ రాష్ట్ర కన్వీనర్ శానబోయిన రాజ్కుమార్, రైస్ మిల్ల ర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, జిల్లా నాయకులు చొప్పరి సోమయ్య, బుస్సా మల్లేఽశం, జినుకల కొమ్మాలు, గోనెల పద్మ, నీరటి సదానందం, గుంటుక సోమయ్య, పోలు అమర్చంద్, గుండా రాకేశ్ పాల్గొన్నారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
పురుగు మందుల దుకాణాలపై దాడులు
దుగ్గొండి: పురుగు మందుల దుకాణాలపై టాస్క్ఫోర్స్, దుగ్గొండి పోలీసులు శుక్రవారం సంయుక్తంగా దాడులు చేశారు. అనుమతి లేని, కాలం చెల్లించిన రూ.1.25 లక్షల విలువైన మందులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీగణపతి పెస్టిసైడ్స్లో రూ.25,770 విలువవైన అనుమతి లేని గడ్డిమందు, గడువుతీరిన మందులను పట్టుకున్నారు. వెంకటేశ్వర పెస్టిసైడ్స్ షాపులో రూ.48,660 విలువైన అనుమతి లేని మందులు, గడువుతీరిన మందులు, చంద్రయ్యపల్లి గ్రామంలో ఆగ్రోస్ సేవా కేంద్రంలో రూ.51,488 విలువైన గడువు తీరిన మందులు, అనుమతిలేని గడ్డి మందులు పట్టుకున్నారు. పట్టుకున్న మందులను దుగ్గొండి పోలీస్స్టేషన్లో అప్పగించారు. అనుమతిలేని మందులు విక్రయించిన కర్రె దేవేందర్, భట్టు నాగరాజు, బాషబోయిన రాజుపై కేసు నమోదు చేసినట్లు టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ శ్రీదర్, దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఫర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నల్లబెల్లి: మండలంలోని రేలకుంటలో దేవా సుధీర్బాబు ఫర్టిలైజర్ షాపు యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవా సుధీర్ తన షాపులో గడువు తీరిన పురుగు మందులు, ఎరువులు నిల్వ చేశాడనే విశ్వసనీయ సమాచారంతో గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారని తెలిపారు. గడువు తీరిన రూ.14,95,993 విలువైన ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. ఏఓ రజిత బన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మురుగు కాల్వలుకబ్జా చేస్తే చర్యలు నల్లబెల్లి: మురుగు కాల్వలు కబ్జా చేసి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి కల్పన హెచ్చరించారు. మండల కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించి పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులను పంచాయతీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ము రుగు కాల్వలపై అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించాలని ఎంపీఓ రవి, పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్కు సూచిందారు. జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణతవిద్యారణ్యపురి: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించారని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. జిల్లాలో మొత్తంగా 685 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో 416 మంది ఉత్తీర్ణత (60.73 శాతం) సాధించారని పేర్కొన్నారు. బాలురు 455 మందికి 270 మంది, బాలికలు 230 మందికి 146 మంది ఉత్తీర్ణత సాధించారని డీఈఓ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్గా వాణి వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఈమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ అర్బన్: జిల్లాలో భూసేకరణ, చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణ, సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పరిహారం, రైతులకు ఎంత చెల్లించారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూభారతి దరఖాస్తులపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్ చేసినవి, ఎన్నింటికి నోటీసులు ఇచ్చారనే అంశాలను ఆర్డీఓలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, హైవే, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెరగాలి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదుపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎంఈఓలతో సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు సమాచారాన్ని డీఈఓ వాసంతి, ఇంటర్ విద్యాశాఖ సూపరింటెండెంట్ చంద్రమౌళి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, పిల్ల లకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, యూనిఫామ్స్ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, ఏఎస్సీ రఘు చంద్రరావు, ఎంఈఓలు, సంక్షేమ అధికారులు, సీడీపీఓలు పాల్గొన్నారు. -
భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. గత కొంతకాలంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ చలాన్ కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఏసీబీ డీజీ విజయ్కుమార్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో నలుగురు డాక్యుమెంట్రైటర్ల నుంచి రూ.96,870 నగదు స్వాధీన పర్చుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా 2023–24 సంవత్సరానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. కార్యాలయంలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. డాక్యుమెంట్ రైటర్లు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, సబ్రిజిస్ట్రార్ కిషన్ నాయక్ ఆదేశాల మేరకే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, నేరుగా కార్యాలయం లోపలికి వస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. డాక్యుమెంట్ రిసీవింగ్లో రిజిస్టేషన్ చేయించిన వారిపేర్లు నమోదు చేస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా చలాన్ (రుసుం) కన్నా అధిక డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. తనిఖీల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల వద్ద లభించిన రూ.96వేల నగదు స్వాధీనం -
మత్తుకు బానిస కావొద్దు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్హసన్పర్తి: యువత మత్తుకు బానిస కావొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సన్ప్రీత్సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయన్నారు. డ్రగ్స్ విక్రయించిన, ఖరీదు చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వరంగల్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాలను తరిమికొడుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీయా, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, ఎస్వీఎస్ కళాశాల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రవికుమార్, అనిత, ఎస్సై రవీందర్, శ్రీకాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
కమిషనర్తో మాజీ కౌన్సిలర్ పంచాయితీ
పరకాల: విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా దురుసుగా.. అసభ్యంగా ప్రవర్తించిన పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్పీ జయంత్లాల్పై చర్యలు తీసుకోవాలంటూ పరకాల మున్సిపల్ కమిషనర్ కొడారి సుష్మ స్థానిక పోలీసులకు ఫి ర్యాదు చేశారు. ఈ మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. కమిషనర్ సుష్మ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర రాజయ్య అనే దంపతులు ఇంటిపక్కన అనుమతిలేకుండా తమ స్థలంలో నిర్మాణం చేసిన గోడను కూల్చివేయాలంటూ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సందీప్రెడ్డికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కార్యాలయంలోకి దూసుకొచ్చిన ఆర్పీ.జయంత్లాల్ ‘మీకు పనిచేయడం చేతకాదు’ అంటూ దురుసుగా, అసభ్యపదజాలంతో మాట్లాడారు. అక్కడినుంచి కమిషనర్ చాంబర్లోకి అనుమతి లేకుండానే దూసుకొచ్చి విధులకు ఆటంకం కలిగిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడటంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్గా ఎంతకాలం పనిచేస్తావో చూస్తా అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అక్కడే ఉన్న సూర రాజయ్య దంపతులను క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని ప్రేరేపించినట్లు కమిషనర్ సుష్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పరకాల పోలీసులు 21వ వార్డు మాజీ కౌన్సిలర్ జయంత్లాల్పై కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించారని మున్సిపల్ కమిషనర్ సుష్మ ఫిర్యాదు బీజేపీ కౌన్సిలర్ జయంత్లాల్పై కేసు నమోదు -
రౌడీ షీటర్ దారుణ హత్య
మరికొన్ని హత్యలు ఇలా.. కమిషనరేట్ పరిధిలో కలకలం రేపుతున్న వరుస హత్యలు ● వివాహేతర సంబంధం.. భూ పంచాయితీలే ప్రధాన కారణం ● మౌనం వీడని పోలీసులు.. పోలీసింగ్పై అనుమానాలు..● జనవరి 22న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత కోసం ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. సుబేదారిలోని డీమార్ట్ ఎదురుగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే నిందితుడు మాచర్ల రాజ్కుమార్ను నడిరోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేశాడు. ● ఫిబ్రవరి 20న రాత్రి 10.30 గంటల సమయంలో మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి భట్టుపల్లి దగ్గర డాక్టర్ సుమంత్రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా తన ప్రియుడు సామ్యూల్, మరో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్కుమార్తో హత్య చేయించింది. ● ఏప్రిల్ 12న నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో బానోతు కొమ్మాలు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. ● ఏప్రిల్ 18న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రి వద్ద చిద్దం సాయి ప్రకాశ్ను కిడ్నాప్ చేసి 18న హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో క్రిష్ణవేణి అనే మహిళ తన బావ కొడుకును తన ప్రియుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, మరో నలుగురు కలిసి హత్య చేశారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ /వరంగల్ క్రైం: బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ సాదిక్ హుస్సేన్ తను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకుగాను సోహెల్, బషీర్, అక్రమ్ అనే నిందితులు అతడి తలపై బండతో మోది హత్య చేశారు. ఈనెల 11న కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లిలో తనకు రావాల్సిన భూమిని ఇవ్వనివ్వడం లేదని చల్లా భూపాల్రెడ్డి తన పినతల్లి అయిన సరోజనను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈనెల 7న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని స్తంభంపల్లిలో జల్సాలకు అలవాటు పడిన రేకలపల్లి ప్రణయ్ తన మేనత్త స్వరూపను బంగారం, డబ్బుల కోసం హత్య చేశాడు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే నెలలో మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందులోనూ హనుమకొండ సబ్ డివిజన్లో ఒక్కనెలలోనే రెండు హత్యలు జరగడం, అది నగరంలో రోడ్డు మీద కిరాతకంగా చంపుతుండడంతో పోలీసింగ్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి జనం తిరుగుతున్న సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ హత్య మరోసారి సంచలనం కలిగించింది. రాత్రి 10 గంటల తరువాత నిర్వహించాల్సిన పెట్రోలింగ్ ఏమైంది? బ్లూకోల్ట్ సిబ్బంది ఎక్కడ? విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా పోలీసులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 18 హత్యలు, 32 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు.. ఆస్తి పంచాయితీలు? ఇటీవల జరుగుతున్న హత్యలకు వివాహేతర సంబంధాలు, భూ, ఆస్తి పంచాయితీలో ప్రధాన కారణా లు అవుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డ బ్బులను అడిగినందు కు సాదిక్ హుస్సేన్ హత్య కు గురికాగా, పినతల్లి తనకు రావాల్సిన భూమిని రాకుండా చేస్తుందని కేయూ పీఎస్ పరిదిలో సరోజన అనే మహిళా హత్యకు గురైంది. జల్సాలకు అలవాటు పడ్డ మరో యువకుడు ఈఎంఐలను కట్టడం కోసం సొంత మేనత్తను హత్య చేసిన సంఘటన గీసుగొండ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సులువుగా డబ్బులు సంపాదించడం.. చిన్ని చిన్న గొడవలు చివరికి హత్యల వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. హత్య కేసుల్లో పోలీసులు? పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. కానీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ యేడాది జ రిగిన మూడు హత్య కేసుల్లో నిందితులు పోలీస్లు కావడం గమనార్హం. ఇది పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్. అతను గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికి పద్ధతి మార్చుకోలేదు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్ సుమంత్రెడ్డి హత్య కేసుల్లో ఉన్న నిందితుడు ఎం.రాజ్కుమార్ ఏఆర్ కానిస్టేబుల్. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న జరిగిన చిద్దెం సాయి ప్రకాశ్ హత్య కేసు నిందితుడు బాషబోయిన శ్రీనివాస్ కూడా కానిస్టేబుల్. ఆరు నెలల్లో 18 హత్యలు.. 32 హత్యాయత్నాలు ఆర్థిక లావాదేవీలే కారణం ఇంట్లో నుంచి తీసుకొచ్చి తలపై బండరాయితో మోది ఘాతుకం నిందితుల్లో పోలీస్ కానిస్టేబుల్ – వరంగల్ క్రైం – వివరాలు 8లోu -
వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని వారాహి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్శర్మలు ఉదయం నుంచి సుప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి అభిషేక, అర్చన, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, అర్చన జరిపారు. ‘విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్త వహించాలి’హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతం రెడ్డి, మధుసూదన్రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరి జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ఇళ్లలో విద్యుత్ సరఫరా కాని ప్లాస్టిక్ దండాల(దుస్తులు ఆరేసుకునేవి)ను ఉపయోగించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మరో అవకాశంవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో గల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాట్ మరో అవకాశం కల్పించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2016, సెప్టెంబర్ 01 నుంచి 2017, ఆగస్టు 31 మధ్యలో జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. లేబర్ కోర్టు ఏజీపీగా రమణారెడ్డివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూకల వెంకటరమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐనవోలు మండలం పంఽథినికి చెందిన రమణారెడ్డి 1993లో న్యాయశాస్త్ర పట్టభద్రుడై సీనియర్ న్యాయవాది శివరావు వద్ద జూనియర్గా పనిచేశారు. 2006లో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో పారిశ్రామిక, కార్మిక వివాదాల్లో ప్రభుత్వ పక్షాన రమణారెడ్డి వాదిస్తారు. ఈస్థానంలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అధికార పార్టీ కార్పొరేటర్? నకిలీ నోట్ల చలామణి కేసులో.. వరంగల్ క్రైం: నకిలీ నోట్ల చలామణిలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలోనే సదరు కా ర్పొరేటర్పై కేసులు నమోదైనట్లు తెలిసింది. వారం రోజులనుంచి స్థానికంగా లేడని, దీంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ కార్పొరేటర్ను పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది. -
గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన
ఐనవోలు : మండలంలోని గర్మిళ్లపల్లి, కక్కిరాలపల్లి, ఐనవోలు గ్రామాల్లో గురువారం స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. తడి, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వేస్ట్ యూనిట్, గ్రామ పంచాయతీల పనితీరు, మరుగుదొడ్ల నిర్వహణ, సామాజిక తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో పరిశుభ్రత ఎలా ఉందనే అంశాలపై తనిఖీ చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్–2025లో భాగంగా స్వచ్ఛతపై గ్రామాలకు ర్యాంకింగ్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం తనిఖీలు నిర్వహించినట్లు ఎంపీఓ రఘుపతిరెడ్డి తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీఓ నక్క కుమారస్వామి, స్వచ్ఛ భారత్ కన్సల్టెండ్ సంపత్కుమార్, ఎస్ఎస్జీ టీం లీడర్ వంగ మధు, కె.జయంత్, రేవంత్, రాజు, పంచాయతీ కార్యదర్శులు రవికుమార్, నిర్మల్ కుమార్, కిశోర్, ఎఫ్ఏలు, కారోబార్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్’పై అవగాహన
పర్వతగిరి: మండలంలోని రావూరు శివారు గుగులోత్తండాలో జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్పై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులు ఆధార్, కులం, రేషన్ కార్డు, నివాసం, ఐసీడీఎస్ పోషణ్ అభియాన్, పీఎంజేఏవై ఆయుష్మాన్ భారత్, పీఎం మాతృ వందన, టీవీ ముకుత్భారత్, నిక్షన్ పోషణ్, మిషన్ ఇంద్రధనుస్సు, పీఎం జన్ధన్ యోజన, స్టాండప్ ఇండియన్ స్కీం, ముద్ర యోజన, వన్ధన్ యోజన, పీఎం విశ్మకర్మ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు, పీఎం కిసాన్, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ఏ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పంచాయతీ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారని, ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సదస్సులో ఎంపీడీఓ శంకర్నాయక్, తహసీల్దార్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి లక్ష్మణ్కుమార్ను కలిసిన ఎమ్మెల్యే దొంతి
నర్సంపేట: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్కుమార్ను నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నేడు జాబ్మేళాన్యూశాయంపేట: హైదరాబాద్లోని వీవీసీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉద్యోగాలకు శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్ప న అధికారి టి.రజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రికల్ వెహికిల్ సర్వీస్ టెక్నీషియన్ (30), ఆటోమోటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (30), షోరూం హోస్ట్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ (60), స్పెర్ పికర్ (15), టెలికాలర్(15), అసెసరీర్స్ (10) ఉద్యోగాలకు హనుమకొండ ములుగురోడ్డులోని ఐటీఐ క్యాంపస్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొ మా, డిగ్రీ అర్హత కలిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగులు తగిన సర్టిఫికెట్లతో హాజరుకావాలని కోరారు. ఇతర వివరాల కోసం 7093168464 నంబర్లో సంప్రదించాలని ఆమె సూచించారు. ఫర్టిలైజర్ షాపుపై దాడులు● గడువు దాటిన రూ.14,95, 993 విలువైన ఎరువులు, పురుగు మందులు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ నల్లబెల్లి: మండలంలోని రేలకుంటలో దేవా సుధీర్బాబు ఫర్టిలైజర్ షాపుపై టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం దాడులు చేశారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. రేలకుంట గ్రామానికి చెందిన దేవా సుధీర్బాబు తన ఫర్టిలైజర్ షాపులో గడువుదాటిన ఎరువులు, పురుగు మందులు అక్రమంగా నిల్వ చేశాడనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేశారు. గడువు దాటిన రూ.14,95,993 విలువైన ఎరువులు, పురుగు మందులను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ పవన్కుమార్, ఎస్సై వంశీకుమార్, ట్రైనీ ఎస్సై తేజ, ఏఓ బన్న రజిత తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలి హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాలపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతంరెడ్డి, మధుసూదన్ రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. సొంతంగా విద్యుత్ సంబంధ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని పేర్కొన్నారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరులు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. తీగలు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీనంబర్ 1912కు ఫోన్ చేయాలని కోరారు. -
పదవిని కాపాడుకోవడానికే ఎమర్జెన్సీ
● బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్రావు గీసుకొండ: పదవిని కాపాడుకునేందుకు 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్రావు అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎమర్జెన్సీ పేరుతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు, పార్టీలను ఎన్నో ఇబ్బందులు, ని ర్బంధాలకు గురిచేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, పార్లమెంటరీ విధానాన్ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటుకు నాంది పలి కారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ పేరుతో పౌర ప్రాథమిక హక్కుల ను కాలరాసిందని దుయ్యబట్టారు. ఎమర్జెన్సీ రోజు ల్లో జైలు శిక్ష అనుభవించిన భారత సురక్ష సమితి ప్రతినిధులు చిట్టిమల్ల శ్యాంప్రసాద్, చామర్తి ప్రభాకర్, యార ప్రభాకర్తో పాటు మరో 20 మందిని నాయకులు సన్మానించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీశ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, వరంగల్ మాజీ మేయర్ రాజేశ్వర్రావు, రాష్ట్ర, జిల్లా నాయకులు రత్నం సతీష్షా, గురుమూర్తి శివకుమార్, బాకం హరిశంకర్, రాణాప్రతాప్, సముద్రాల పరమేశ్వర్ పాల్గొన్నారు. -
మత్తు రహిత సమాజాన్ని నిర్మించాలి
రామన్నపేట: మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ ఎంజీఎం చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ చౌరస్తా వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డీసీపీ అంకిత్కుమార్తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ మాదకద్రవ్యాలను నివారించాలనే నినాదంతో ముందుకెళ్తున్నామని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాల గురించి పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ నివారణ కమిటీలు వేయాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ అందరం ముందడుగు వేసి వరంగల్ను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ జన్ను షీభారాణి, ట్రైనీ కలెక్టర్లు జయసింహ, హరిప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, అధికారులు, సీడీపీఓలు, పోలీస్ అధికారులు, మెప్మా సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మా రుతుందని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతారన్నారు. మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ రమేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూళ్ల నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ -
మోస్తరు వర్షం
పంచధాత్రులతో అభిషేకం, పాలాభిషేకం, వివిధ రకాల పండ్లు, చెట్ల పసరుతో అభిషేకం చేస్తున్న భద్రకాళి శేషు, శాకంబరీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారి అలంకరణ, అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులుసాక్షి, వరంగల్: పత్తి గింజలు మొలకెత్తేందుకు ఆకాశం వైపు ఎదురుచూస్తున్న రైతులకు వర్షం ఊరటనిచ్చింది. బుధవారం రాత్రి పది నుంచి గురువారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కురిసిన మోస్తరు వర్షంతో చాలావరకు పత్తి మొలకలు రావడం కనిపించాయి. రెండు వారాల నుంచి అప్పుడప్పుడు వచ్చిపోయిన వాన మాత్రం ఏకధాటిగా కొట్టింది. దీంతో జిల్లాలో ఈ నెలలోనే అత్యధికంగా ఒక్కరోజులో 34.66 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ వర్షంతో చాలావరకు దుక్కులు నాని నీరు నిలిచి వరద పోవడం కనిపించింది. వరినార్లు పోసుకునేందుకు అన్నదాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సాగు చేసిన మొక్కజొన్నకు కూడా ఈ వర్షం ఊపరి పోసింది. భూమి నానడంతో ఇంకొందరు రైతులు పసుపు పెట్టేందుకు కూడా సిద్ధం అవుతున్నారు. అయితే గురువారం కూడా ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడా వర్షం కురిసింది. ఇన్నాళ్లు ఎండలతో తల్లడిల్లిన రైతులు ఇప్పుడు సంబురంగా చేన్లకు వెళ్తుండడం కనిపిస్తోంది. నగరంలో తప్పని తిప్పలు.. బుధవారం రాత్రి పది గంటల తర్వాత కురిసిన వర్షంతో వరంగల్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు పారింది. నాలాల్లో కూడా నీటి ప్రవాహనం పెరిగింది. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో జనాలు చాలా ఇబ్బందులు పడ్డారు. రోడ్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్న కాలనీలు మాత్రం బురదమయంగా మారడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల ద్విచక్రవాహనాలు అదుపుతప్పి కిందపడి పోయారు. పలు ప్రాంతాల్లో చెత్త తరలించే వాహనాలు రాకపోవడంతో ఆయా కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు.న్యూస్రీల్పత్తి, మొక్కజొన్న పంటలకు జీవం పోసిన వాన వరినార్లు పోసేందుకు, పసుపు పంట సాగుకు అనుకూలం జిల్లాలో 34.66 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదుమండలాల వారీగా వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) మండలం వర్షపాతం ఖిలావరంగల్ 56.6 వరంగల్ 56.2 గీసుకొండ 55.2 దుగ్గొండి 46.4 ఖానాపురం 42 నర్సంపేట 41.8 నల్లబెల్లి 38 చెన్నారావుపేట 30.8 సంగెం 27 వర్ధన్నపేట 23.6 నెక్కొండ 13.2 పర్వతగిరి 12.8 రాయపర్తి 7.0 -
గిరిజన గ్రామాలకు సంక్షేమ పథకాలు
గీసుకొండ: గిరిజన గ్రామాలకు సంక్షేమ ఽపథకాలు అందించి, సమస్యలను తీర్చడానికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. నందనాయక్తండా గ్రామపంచాయతీ పరిధిలో ‘జనజాతీ గౌరవ్ ఠెళో..ధర్తి ఆభా జనభాగిధారీ అభియాన్’ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గిరిజనులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని, గుడుంబా, డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సంక్షేమ పథకాలకు అర్హులు కాదని అన్నారు. రూ.52 లక్షల పంచాయతీ నిధులతో కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణం చేపడుతామన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో 24 గిరిజన గ్రామాలను అభియాన్ కార్యక్రమానికి ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. 15 రోజులపాటు ఎంపిక చేసిన గ్రామాల్లో అధికారులు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చూస్తారన్నారు. ఈ సందర్భంగా వంచనగిరి కేజీబీవీ విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం రైతులకు విత్తన ప్యాకెట్లను ఎమ్మెల్యే, కలెక్టర్ అందించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీటీడబ్ల్యూఓ సౌజన్య, ఎల్డీఎం రాజ్కుమార్, డీఎంహెచ్ఓ సాంబశివరావు, మండల స్పెషల్ ఆఫీసర్ సురేశ్, తహపీల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏఓ హరిప్రసాద్బాబు, ఏపీఓ చంద్రకాంత్, ఏపీఎం సురేశ్కుమర్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపెల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొనాయమాకుల, మచ్చాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
అందుబాటులోకి ‘రైతు నేస్తం’
నెక్కొండ: జిల్లాలోని అన్ని రైతు వేదికలు అందుబాటులోకి రానున్నాయి. అవసరమున్న ప్రాంతాల్లో టీవీ యూనిట్లను బిగిస్తున్నారు. గతంలో మండలానికి ఒకటి చొప్పున 13 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉండగా.. ఇప్పుడు అదనంగా మరో 26 యూనిట్లు రైతు వేదికల్లో అందుబాటులోకి రానున్నాయి. వివిధ రకాల పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు జిల్లాలో 39 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం ద్వారా పంటల సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు, నూతన సాంకేతికతను అధికారులు రైతులకు వివరిస్తారు. -
మత్తు పదార్థాలు నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇంజనీరింగ్, వైద్య కళాశాలల్లో తప్పనిసరిగా తనిఖీలు చేయాలని, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా యువతలో చైతన్యం తేవాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన జిల్లాకు చెందిన 24 కుటుంబాలకు బీమా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల స్వచ్ఛతను అంచనా వేయడానికి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 ద్వారా జిల్లాలకు ర్యాంకులు ప్రకటిస్తుందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత పెంపొందించడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు అధికారులు కృషిచేయాలని ఆమె సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం మానసపల్లి ఇసుక రీచ్ నుంచి మెట్రిక్ టన్నుకు రవాణా చార్జీలతో కలిపి సుమారు 550 రూపాయలతో పొందవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి,జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరం జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు. 9 అంశాలను పరిశీలించాలి.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈ మేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరుగనున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గురువారం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, సిబ్బంది హరినాథ్, అలుగు కృష్ణ, నాగులు, చింతశ్యాంసుందర్ పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి... ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు.జూలై 10వ తేదీ వరకు నిర్వహణ మహోత్సవాలను విజయవంతం చేయాలి భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ -
జిల్లా ఉద్యానశాఖ అధికారిగా శ్రీనివాసరావు
హన్మకొండ: జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పనిచేస్తున్న సంగీతలక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఉద్యాన శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జి.అనసూయకు హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా..కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పనిచేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఆత్మకూరు(దామెర): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. దామెర మండలం ల్యాదెల్లలో నూతనంగా నిర్మిస్తున్న మినీ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్ వద్ద బుధవారం దామెర, ఆత్మకూరు, పరకాల, నడికూడ మండలాల మహిళలకు పరిశ్రమల స్థాపనకు కావాల్సిన నైపుణ్యాల అభివృద్ధి గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పాల్గొని మహిళలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... మహిళలు నైపుణ్యాలను పెంపొందించుకొని ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు. వీ హబ్ సీఈఓ సీత మాట్లాడుతూ.. మహిళలు శిక్షణను వినియోగించుకోవాలని, ఆర్థిక ప్రయోజనాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ నవీన్కుమార్, ఆర్డీఓ నారాయణ, తహసీల్దార్ జ్యోతి, వరలక్ష్మి దేవి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన దామెరలో బుధవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేగంగా నిర్మించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వెంట అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల తనిఖీ దామెర మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఎంపీపీఎస్ పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి అక్కడున్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ఉన్నత పాఠశాలలోని 6, 9వ తరగతులను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కొద్దిసేపు మాట్లాడారు. కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ కె.నారాయణ, స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి, ఎంఈఓ రాజేశ్, అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మహిళల నైపుణ్యాలపై అవగాహన సదస్సు -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్లో మజ్దూర్ యూనియన్తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మి కులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలు ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చిన ట్లు యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్ మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ నిలిపివేత!
సాక్షి, వరంగల్: దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా విచారణ తుది అంకానికి చేరుకుంటున్న క్రమంలో జిల్లా బాలల సంరక్షణ విభాగంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ అర్ధాంతరంగా నిలిపివేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. వీరి పనితీరు బాగా లేకపోవడంతో కాంట్రాక్ట్ కాలాన్ని పునరుద్ధరించలేమని జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి బుధవారం ఉత్తర్వులిచ్చారని తెలిసింది. కాంట్రాక్ట్ రెన్యువల్ కానివారిలో రాజు, సరిత, సురేశ్, ప్రణయ్, నర్సింహస్వామి, పద్మలత,, ఎన్.రాజు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడుగురు ఉద్యోగుల్లో దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందాలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారనే ప్రచారం ఉంది. విధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పనితీరు బాగాలేదనే కారణంతో మిగిలినవారి కాంట్రాక్ట్ పునరుద్ధరించకపోవడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న కలెక్టరేట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలోనే చేయాల్సిన ఈ తాత్కాలిక ఉద్యోగుల రెన్యువల్ను ఇప్పటివరకు ఆపి అకస్మాత్తుగా తెరమీదకు తీసుకొచ్చి నిలిపివేయడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా, జిల్లా సంక్షేమ విభాగంలోని కొందరు అధికారులు ఈ దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం, గతంలో వీహబ్, చైల్డ్లైన్ ఉద్యోగ నియామకాల్లో అనర్హులకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం, నకిలీ సర్టిఫికెట్లతో వీహబ్లో ఉద్యోగం పొందిన ఓ మహిళ ఏడాదికిపైగా ఉద్యోగం చేసి ఇటీవల పోలీసు కేసు కావడం తదితర కారణాలు తమకు గుదిబండగా మారుతాయనే ఉద్దేశంతోనే ‘ప్రదర్శన బాగా లేదంటూ’ కావాలనే జిల్లా ఉన్నతాధికారిని తప్పుదోవ పట్టించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గత ఏడాది వీరి పనితీరు మరోసారి పరిశీలిస్తే అర్హులకు న్యాయం జరుగుతుందని, దీనిపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా విచారణ వేళ నిర్ణయం పనితీరు బాగా లేదంటూ ఏకంగా ఏడుగురిపై అధికారుల వేటు తాజా చర్యలతో మరోసారి చర్చల్లో జిల్లా సంక్షేమ విభాగం -
ప్రభుత్వంపై యుద్ధం చేయాలి
ఖానాపురం: మంత్రివర్గంలో గొల్ల, కురుమలకు స్థానం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిన అవసరం ఉందని గొల్ల, కురుమల యూత్ రాష్ట్ర అధ్యక్షుడు ఆబోతు రాజుయాదవ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తూరులో గొల్లకురుమల ఆత్మగౌరవ సభ వాల్పోస్టర్ను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల, కురుమలను రేవంత్రెడ్డి ప్రభుత్వం చులకనగా చూస్తోందని ఆరోపించారు. కుట్రపూరితంగానే గొల్లకురుమలకు అన్యాయం చేస్తున్నారన్నారు. గొల్లకురుమల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, దామాషా ప్రకారం కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించే సభకు గొల్లకురుమలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో నాయకులు ఆబోతు అశోక్, కోరె సుధాకర్, భూస అశోక్, విక్రం, ప్రశాంత్, రవికుమార్, ఐలయ్య, వీరస్వామి, కోరె రాములు, నాంచారి కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి రాజీనామా!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ పి.శ్రీనివాస్రావు ఆపదవికి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం రాజీనామా పత్రం అందినట్లు ధ్రువీకరించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు నలుగురున్నారు. ఈనెల 23న ముగ్గురు అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వర్క్లోడ్కు అనుగుణంగా పేపర్వైజ్గా విద్యాబోధనకు తమకు క్లాస్వర్క్కు అవకాశం కల్పించి అధ్యాపకులుగా నియమించాలని ఆవిభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లో వర్క్లోడ్ చూపించి ఆయా విభాగాల అధిపతులు పేపర్వైజ్గా విద్యాబోధనకు అధ్యాపకులుగా నియమించారని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆ మాదిరిగానే వర్క్లోడ్ చూపించి తమకు అవకాశం కల్పించాలని విభాగాధిపతి శ్రీనివాస్రావును వారు కోరి వినతిపత్రం సమర్పించారు. కాగా.. వినతిపత్రాన్ని శ్రీనివాస్రావు పక్కకు వేసిరేసినట్లు.. దీంతో అభ్యర్థులు ఎందుకు విసేరేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులకు, శ్రీనివాస్రావుకు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం అదే రోజు మనస్తాపంతో శ్రీనివాస్రావు విభాగాధిపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రిజిస్ట్రార్కు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రాంచంద్రం ఆవిభాగానికి వెళ్లి మీరే విభాగాధిపతిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తాను కొనసాగనని, తనను రిలీవ్ చేయాలని శ్రీనివాస్రావు రిజిస్ట్రార్ను కోరినట్లు సమాచారం. అయితే ఈవిషయంపై ‘సాక్షి’ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా.. నలుగురు పోస్ట్డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థుల వర్క్లోడ్ తెప్పించుకుని పరిశీలిస్తానని అభ్యర్థులకు తెలియజేసినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయననే విభాగాధిపతిగానే కొనసాగించాలని తనకు వినతిపత్రం కూడా ఆయా అభ్యర్థులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాస్రావు రాజీనామాను ఆమోదించలేదని ఈనెల 26న వీసీ ఆచార్య కె ప్రతాప్రెడ్డి యూనివర్సిటీకి రానున్నారని.. ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. వర్క్లోడ్ విషయంపై తలెత్తిన వివాదం పోస్ట్ డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థులతో వివాదం శ్రీనివాస్రావే కొనసాగాలని కోరిన రిజిస్ట్రార్ నేడు వీసీ దృష్టికి వివాదం -
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్కుమార్తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 33 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈకి కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించాలి.. స్వచ్ఛ భారత్లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు. 9 అంశాలను పరిశీలించాలి.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
కుంటకట్ట వివాదంపై విచారణ
గీసుకొండ: రాంపురం శివారులోని కుంటకట్టకు అడ్డంగా కొందరు రాళ్లు వేసి రాకపోకలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని రైతుల ఫిర్యాదు మేరకు గీసుకొండ సీఐ మహేందర్ బుధవారం విచారణ చేపట్టారు. ఆయనతోపాటు ఎస్సై కుమార్ కుంటకట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. కట్టపై రాకపోకలకు ఆటంకపరిచిన వారిని స్టేషన్కు పిలిపించి మాట్లాడతానని సీఐ చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. కుంటకట్టను ధ్వంసం చేశారని ఇటీవల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాధ్యులపై కేసు నమోదు చేశారు. అయినప్పటికీ నిందితులు ఊరుకోకుండా కట్టకు అడ్డంగా రాళ్లు వేసి ఆటంకం కలిగిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. దీంతో సీఐ స్వయంగా కట్ట ప్రాంతాన్ని పరిశీలించారు. -
కేజీబీవీలో బెడ్ల పంపిణీ
సంగెం: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో చదువుకునే పేద విద్యార్థినులకు వసతి కల్పించేందుకు విరాళం అందించామని రోటరీ క్లబ్ ఆర్ఐ 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ కాట్రగడ్డ శరత్చౌదరి తెలిపారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 160 మంది విద్యార్థినులకు ఉపయోగపడే రూ.9 లక్షల విలువైన 80 బంక్ బెడ్స్ బుధవారం అందజేశారు. ఇందులో రూ.8 లక్షలు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీహిల్స్, బీజీఆర్ మైన్స్, రరూ.ఒక లక్ష కేజీబీవీఎస్ ద్వారా దాతల సహకారంతో సమకూర్చినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థినులు ఇష్టంతో చదవాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ రిటైర్డ్ ప్రెసిడెంట్ కురువెల రాజగోపాల్రావు, రిటైర్డ్ ప్రతినిధులు గంట వేణుగోపాల్, బాలకోటి, రాంప్రసాద్, ఎంఈఓ రాము, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నీలిమ, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శిగా మహేందర్రెడ్డినల్లబెల్లి: పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లబెల్లి మండల అధ్యక్షుడు నక్కిరెడ్డి మహేందర్రెడ్డి ఎన్నికయ్యారు. హనుమకొండలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీహరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడుతూ, సంఘం బలోపేతానికి కృషిచేస్తానని మహేందర్రెడ్డి పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఈదునూరి అధ్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.నాణ్యమైన విద్యుత్ అందించాలివర్ధన్నపేట: సాగుకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఈ రాజుచౌహాన్ అన్నారు. మండలంలోని ఇల్లంద సబ్స్టేషన్లో పీటీఆర్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ ఎస్ఈ గౌతమ్రెడ్డి, డీఈ హర్జినాయక్, ఏడీఈలు కన్న రాజు, సర్వేశ్వర్, నటరాజు, ఏఈ తరుణ్, లైన్మన్ లక్ష్మణ్, సిబ్బంది పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: మహేశ్వరం గ్రామంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 5, 6, 7 తరగతుల్లో ప్రవేశానికి బాలురు దరఖాస్తు చేసుకోవాలని స్పెషలాఫీసర్ ఇషాక్ అలీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 6281886163, 8106041201 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.వర్ధన్నపేట, రాయపర్తి పీఎస్లను తనిఖీ చేసిన సీపీవర్ధన్నపేట/రాయపర్తి: వర్ధన్నపేట, రాయపర్తి పోలీస్స్టేషన్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ల పరిసరాలు పరిశీలించి మొక్కలు నాటారు. రికార్డులు తనిఖీ చేశారు. అలాగే, వివిధ కేసుల పురోగతి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వెస్ట్జోన్ డీసీసీ రాజమహేంద్రనాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్రావు, ఎస్సైలు చందర్, రాజు, ముత్యం రాజేందర్ సిబ్బంది పాల్గొన్నారు.ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా శ్రవణ్కుమార్నల్లబెల్లి: ఏబీవీపీ జిల్లా కన్వీనర్గా మూడుచెక్కలపల్లి గ్రామానికి చెందిన బానోత్ శ్రవణ్కుమార్ను నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జానారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నమ్మకంతో తనను కన్వీనర్గా నియమించిన ఏబీవీపీ రాష్ట్ర శాఖ ప్రతినిధులకు శ్రవణ్కుమార్ ధన్యవాదాలు తెలిపారు. -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లెర్నింగ్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనుకబడినట్లు తేలింది. అయితే గత విద్యా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా.. మహబూబాబాద్కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా.. మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్లల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24లో మెరుగైన ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245హనుమకొండ 600 250 275మహబూబాబాద్ 600 210 229జనగామ 600 235 271జేఎస్ భూపాలపల్లి 600 220 253ములుగు 600 214 231 -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్ను డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపికలకు మొదటి రోజు 16 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈఎంపిక ప్రక్రియలో డీఎస్ఏ కోచ్లు శ్రీమన్నారాయణ, మహ్మద్ అఫ్జల్, బొడ్డు విష్ణువర్ధన్, బత్తిని జీవన్గౌడ్, ఓనపాకల శంకర్, కూరపాటి రమేశ్, రాజారపు రమేశ్, దేవిక, రాజు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్ప్రసాద్, పీడీలు ప్రేమ్ప్రసాద్రావు, కిషన్నాయక్ పాల్గొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల బాధ్యతల స్వీకరణహనుమకొండ జిల్లాకు అనసూయ, వరంగల్కు ఆర్.శ్రీనివాసరావు హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారుల్లో మార్పులు జరిగాయి. వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్, హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా జి.అనసూయ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్ కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పని చేస్తున్న సంగీత లక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఉద్యాన శాఖ కమిషనరేట్కు బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న జి.అనసూయను హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పని చేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు హనుమకొండ, సుబేదారిలోని జిల్లా సమీకృత కార్యాలయం భవన సముదాయంలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ‘మత్తు’ నియంత్రణకు పటిష్ట చర్యలుహన్మకొండ అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్ఓ గణేశ్, డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా హాళ్లలో మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్ వేసేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిరంతరం అవగాహన సదస్సు, కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడలు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కలిగేలా రూపొందించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్లో మజ్దూర్ యూనియన్తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మికులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలను ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు రవీందర్ వివరించారు. -
లక్ష్యసాధనలో తోడ్పాటు అందించాలి
న్యూశాయంపేట: ప్రాధాన్యత రంగాలకు రుణాల పంపిణీ మరింత పెంచాలని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాల మంజూరు గత త్రైమాసికంలో సాధించిన ప్రగతిపై బ్యాంకులు ప్రభుత్వ శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. లీడ్ బ్యాంక్ ద్వారా 2025–26 సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ కింద రూ.9274.25 కోట్ల వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రభుత్వం యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంపొందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి పథకాల ఏర్పాటులో సంబంధిత శాఖలు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో పంట రుణాలకు రూ.1,802.08 కోట్లు రైతులకు అందించాలనే లక్ష్యం ఉండగా.. ఇప్పటివరకు రూ.1,702.కోట్లు అందించినట్లు తెలిపారు. వ్యవసాయరంగంలో ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.3,785.18కోట్లు లక్ష్యం పెట్టుకోగా రూ.3,653 కోట్లు అందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామాజిక భద్రత పథకంలో భాగంగా పీఎం జీవన్జ్యోతి పథకంలో నామినికి రూ.రెండు లక్షల చెక్కును కలెక్టర్ అందించారు. సమావేశంలో డీసీసీ కన్వీనర్ ఎల్డీఎం యూబీఐ హావేలీ రాజు, యూనియన్ బ్యాంకు ఆర్హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం యశ్వంత్, నాబార్డ్ ఏజీఎం చైతన్యరవి, బ్యాంకర్ రవి, జిల్లా అధికారులు అనురాధ, బాలకృష్ణ, సురేష్ పాల్గొన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి : వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ రామకృష్ణారావు న్యూశాయంపేట: ప్రజల భాగసామ్యంతో వనమహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం ఆయన హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆన్లైన్ ద్వారా ఈ కాన్ఫరెన్స్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా గ్రామీణాభివృద్ధి, కుడా, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఇతర శాఖల సమన్వయంతో జిల్లాలో 31 లక్షల ప్లాంటేషన్ లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో భూభారతి రెవెన్యూ సదస్సుల్లో 57,850 దరఖాస్తులు స్వీకరించామన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, విజయలక్ష్మి, సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్ఓ అనుజ్ అగర్వాల్, పీఈ హౌజింగ్ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద బ్యాంకర్లతో డీసీసీ డీఎల్ఆర్సీ సమావేశం -
జాల కుంటలో మట్టి తవ్వకాలు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువులు, కుంటలు తేడా లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు చేపడుతోంది. అనుమతులు లేకుండా మట్టి తవ్వి విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. మండలంలోని ముస్తఫాపూర్ గ్రామ శివా రులోని జాలకుంటలో ఓ సంస్థకు చెందిన వారు కొద్ది రోజులుగా మట్టి తవ్వుతున్నారు. హిటాచీలతో కుంటను చెరబట్టి టిప్పర్లతో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. కుంట నుంచి దాదాపు 500ల టిప్పర్లకు పైగా మట్టిని తరలించారు. జాల కుంటకు సంబంధించి ఇన్ప్లో, అవుట్ ఫ్లోను పూర్తిగా ధ్వంసం చేయడంతో పాటు వన్యప్రాణులకు రక్షణ లేకుండాపోయింది. దీంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. సీజ్ చేసిన టిప్పర్లు మాయం! జాలకుంటలో అక్రమ మట్టి తవ్వకాల విషయం తెలుసుకున్న ఇరిగేషన్ శాఖ డీఈ సుధాకర్ తన సిబ్బందితో మంగళవారం కుంటను పరిశీలించారు. ఈసందర్భంగా కుంట వద్ద ఉన్న రెండు హిటాచీలు, ఆరు టిప్పర్లను సీజ్ చేసి స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఇరిగేషన్ డీఈ సుధాకర్ తెలిపారు. కానీ, సీజ్ చేసిన టిప్పర్లు గంటల వ్యవధిలోనే మాయం కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై ఇరిగేషన్ శాఖ డీఈ సుధాకర్ను వివరణ కోరగా.. రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సహకరించడం లేదని మీడియాకు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మట్టి అక్రమార్కులకు అధికారులు సహకరిస్తున్నారా? లేక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మట్టి అక్రమ రవాణా వెనుక బడా నాయకుల హస్తం ఉన్నట్లు సమాచారం. ఆరుటిప్పర్లు, రెండు హిటాచీలు సీజ్! గంటల వ్యవధిలోనే సీజ్ చేసిన వాహనాలు మాయం -
వేయి స్తంభాల ఆలయం ఆదాయం రూ.15,39,722
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలోని హుండీల్లోని కానుకలను మంగళవారం ఉదయం లెక్కించారు. హుండీల్లో భక్తులలు సమర్పించిన కానుకల ద్వారా రూ.7,47,722, పూజా రుసుముల ద్వారా రూ.7,92,000 ఆదాయం మొత్తం రూ.15,39,722 ఆదాయం సమకూరినట్లు దేవాలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్ వెల్లడించారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నందున అధిక ఆదాయం నమోదైందని ఈఓ తెలిపారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు లెక్కింపు కొనసాగింది. పర్యవేక్షకులుగా దేవాదాయశాఖ పరిశీలకులు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానా ర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, లింగబత్తుల రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వెంకటేశ్వర సేవాసమితి మహిళా భక్తులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయని ఎంజీఎం అధికారులు ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నేత పని, జీవన విధానంపై డాక్యుమెంటరీ
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికుల గృహాలు, వారి పని ప్రక్రియను ఐఐసీడీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్ట్రాఫ్ట్ అండ్ డిజైన్) బృందం మంగళవారం పరిశీలించింది. పాత తరం నైపుణ్యాల్ని కాపాడేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారంతో ఐఐసీడీ ఉమ్మడి జిల్లాలోని వృత్తులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను డాక్యుమెంట్ చేయడానికి పూనుకున్నట్లు ప్రతినిదులు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది పాతతరం కళాకారులు, నేత కార్మికులు వివిధ కారణాల వల్ల తమ నైపుణ్యాన్ని తదుపరి తరానికి అందించలేకపోతున్నారని, ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈడాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈబృందానికి టీపీసీసీ నేత, చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత కార్మికుల జీవన విధానాన్ని, వారి పనితీరును వివరించారు. కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భవాని, అశోక్, డాలియా పాల్గొన్నారు. -
సన్నాల సాగు అధికమే..
ఖిలా వరంగల్: సన్నరకం వరిపంటల సాగుపై అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. మద్దతుధరపైన రూ.500 బోనస్ ఇస్తుండడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అయితే జిల్లాలోని రైతులు గత వానాకాలంలో 1.26 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా.. ఇందులో 30 వేల ఎకరాల్లో దొడ్డుగింజ రకాలు, 96 వేల ఎకరాల్లో సన్న గింజ రకాలు ఉన్నాయి. ఈ వానకాలంలోనూ 1,00,720 ఎకరాల్లో సన్న గింజ రకాలు, 30 వేల ఎకరాలకు పైగా దొడ్డు రకం సాగు చేసే అవకాశముంది. సన్న గింజ రకాల్లో సుడిదోమల వంటి చీడపీడల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడం, సస్యరక్షణ ఖర్చులు, మందుల పిచికారీ శ్రమ, లోతట్టు, వందూరు భూములు అధికంగా ఉండడంతో దొడ్డు రకాలు సైతం అధికంగానే నార్లు పోస్తున్నారు. ప్రస్తుతం మేలు రకం ధాన్యం క్వింటాకు రూ.2,320, సాధారణ రకాలకు రూ.2,300 మద్దతు ధర ఉంది. కేంద్రం క్వింటాకు రూ.69 చొప్పున పెంచిన ధరలు 2025 సెప్టెంబర్ నుంచి ఏడాదిపాటు అమల్లో ఉంటాయి. గత వానాకాలం, యాసంగిలో బోనస్ చెల్లింపులో తీవ్ర జాప్యంతో రైతులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. గత వానాకాలంలో 33 సన్నగింజ రకాలను ప్రభుత్వం గుర్తించగా నిబంధనల మేరకున్న జై శ్రీరాం తదితర రకాలను కూడా కొనుగోలు చేశారు. గింజ పొడువు 6 మిల్లి మీటర్ కన్న తక్కువ, వెడల్పు 2 మి.మీ కన్నా తక్కువ ఉండాలి. పొడవు, వెడల్పు నిష్పత్తి 2.5 మి.మీ కంటే ఎక్కువ ఉండాలి. గింజను గ్రేయిన్ కాలిపర్ మిషన్లో వేసి పొడవు, వెడల్పు కొలుస్తారు. వరంగల్ పరిశోధనా స్థానానికి చెందిన రకాలు వరంగల్ 962, వరంగల్ 1119, వరంగల్ 44, వరంగల్ 32100, వరంగల్ 697, రాజేంద్రనగర్ రకాలైన ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోన), ఆర్ఎస్ఆర్ 21278, ఆర్ఎన్ 2458, ఆర్ 2874, కేపీఎస్ 2874, హెచ్ఎంటి సోనా, జగిత్యాల పరిశోధనా స్థానానికి చెందిన జేజే ఎల్ 1798, జేజీఎల్ 3844, జేజీఎల్ 3855, జేజీఎల్ 11727, జేజీఎల్ 11118, జేజీఎల్ 17004, జేజీఎల్ 11470, జేజీఎల్ 28545, జేజీఎల్ 27356, జేజీఎల్ 384, జేజీఎల్ 3828, కూనారం పరిశోధనా స్థానం రకం కేఎన్ఎం 1638, కెఎన్ఎం733, బాపట్లకు చెందిన బీపీటీ 5204, బీపీటీ 2595, మారుటేరుకు చెందిన ఎంటీయూ 1282, నెల్లూరుకు చెందిన ఎన్డీఎల్ఆర్ 7, ఎన్ఎల్ఆర్ 34449, రుద్రూరు తదితర పరిశోధనా స్థానాల నుంచి రూపొందించిన రకాలతోపాటు మరికొన్ని ప్రైవేట్ సన్న గింజ రకాలు కూడా ఉన్నాయి. మేలైన విత్తనాలతో అధిక దిగుబడి 130 రోజుల పంటకాలం గల మధ్యకాలిక రకాలను జూలై 10 వరకు, 120 రోజుల పంటకాలం గల స్వల్పకాలిక రకాల నార్లు జూలై నెలాఖరు వరకు పోసుకోవచ్చు. ఏ రకమైనా ఆగస్టు నెలాఖరులోపు నాట్లు పూర్తి చేయాలి. నేల స్థితిగతులు, సాగు అనుభవాలతో సన్న రకాలను ఎంచుకోవాలి. సన్నాల్లో సమగ్ర యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. – రాజన్న, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కో ఆర్డినేటర్ మామునూరు సన్న రకం వరి పంటపై రైతుల ఆసక్తి రూ.500 బోనస్ చెల్లింపుతో పెరుగుతున్న విస్తీర్ణం -
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్
హన్మకొండ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతోందని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల సమీప షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. పిల్లల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీజీనాబ్ ఏసీపీ సైదులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె.ప్రహసిత్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేర్అండ్క్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్, ప్రొహిబిషన్–ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్కుమార్, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, సఖి అడ్మిన్ పి.హైమావతి, జిల్లా మహిళా శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ విద్యార్థులకు అవగాహన -
‘డొమెస్టిక్’ దందా..!
సాక్షి, వరంగల్: జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లు యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. ‘డొమెస్టిక్’ గ్యాస్ సిలిండర్ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. వరంగల్ నగరంతోపాటు ప్రధాన పట్టణాలైన వర్ధన్నపేట, నర్సంపేటతోపాటు వివిధ మండల కేంద్రాల్లో జోరుగా ఈ దందా కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా టిఫిన్ సెంటర్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్లలో దొంగచాటుగా ఇంటి సిలిండర్లను వాడుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుంది. కొంతమంది ఏజెన్సీ నిర్వాహకులకు ఇదొక తెరచాటు వ్యాపారంగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా నిరంతరంగా తనిఖీలు చేయాల్సిన సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవలి కాలంలో తనిఖీలు చేయడం మానేశారు. ఎప్పుడో ఒకసారి తనిఖీలు చేసి చేతులు దులుపేసుకుంటున్నారు. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, ఇతర వ్యాపారాలకు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలనేది ప్రభుత్వ నిబంధన. కానీ, క్షేత్రస్థాయిలో ఈ నిబంధన అమలుకావడం లేదు. ఎందుకంటే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ ధర రూ.2,185 ఉంది. అదే గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ విలువ రూ.894.6 ఈ లెక్కన కమర్షియల్ సిలిండర్కు వెచ్చించే డబ్బులతో రెండు డొమెస్టిక్ సిలిండర్లు కొనుగోలు చేయొచ్చనేది వ్యాపారుల ఆలోచనగా తెలుస్తుంది. గ్యాస్ ఏజెన్సీలను మచ్చిక చేసుకొని డొమెస్టిక్ సిలిండర్లను సబ్సిడీ లేకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలకు కూడా ఒక్కో సిలిండర్పై రూ.200 కు పైగా లాభం రావడంతో డొమెస్టిక్ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా మారింది. దీనికితోడు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏజెన్సీలతో మిలాఖత్ అయ్యారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు.. జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 12 ఏజెన్సీలు ఉన్నాయి. ఆయా ఏజెన్సీల పరిధిలో గృహ అవసర(డొమెస్టిక్) గ్యాస్ కనెక్షన్లు సుమారు నాలుగు లక్షలకుపైగా ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ కనెక్షన్లు సుమారు మూడు వేల వరకు ఉన్నాయి. నెలకు రీ ఫిల్లింగ్ అవుతున్న గృహవసర సిలిండర్లు దాదాపు 60 వేల వరకు, కమర్షియల్ సిలిండర్లు వెయ్యి వరకు ఉన్నట్లు సమాచారం. డొమెస్టిక్ సిలిండర్ రీ ఫిల్లింగ్ చేస్తే కిలోకు రూ.63, కమర్షియల్ అయితే రూ.115 వరకు వసూలు చేస్తున్నారు. ‘మామూలు’గానే తనిఖీలు... జిల్లా అంతటా హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర వ్యాపారాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్డు నుంచి జానిపీరీల వరకు, ఎంజీఎం నుంచి బట్టల బజార్ బ్రిడ్జి వరకు, పోచమ్మ మైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా స్టేషన్రోడ్డు వరకు, బీట్ బజార్, వరంగల్ ఫోర్ట్ రోడ్డు, ఇలా అనేక సెంటర్లలో యథేచ్ఛగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల వాడడం చూస్తుంటే అధికారులు ఏ మేరకు తనిఖీలు చేపడుతున్నారో తెలుస్తుంది. కమర్షియల్ సిలిండర్లు హోటళ్ల సామర్థ్యం ఆధారంగా వారంలో ఒకటి నుంచి రెండు, మరికొన్నింటిలో నెలకు ఐదు నుంచి ఎనిమిది వినియోగిస్తున్నారు. ఎంత చిన్న హోటల్ అయినా.. ఒక కమర్షియల్ సిలిండర్తో కొనసాగించడం కష్టమే.. దీంతో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తూ తమ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. కారులు, ఇతర వాహనాల్లో కూడా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు ఎక్కిస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా ఉపయోగించే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లు పక్కదారి పడుతున్నా అధికారులు మాత్రం ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే విమర్శలొస్తున్నాయి. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లు ఒక్కో సిలిండర్పై రూ.200కు పైగా వసూళ్లు ‘మామూలు’గానే అధికారుల తనిఖీలు -
దళారుల దందా
రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చేతివాటంహన్మకొండ అర్బన్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇవ్వడంతో అర్హులంతా మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో మండలానికి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు విచారణ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అవినీతికి అలవాటు పడిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు చేయడంతో పాటు కార్డు కూడా ఇప్పిస్తామంటూ ఆఫర్లు ప్రకటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నెత్తీనోరు బాదుకోవడం పేదల వంతవుతోంది. రెవెన్యూ ఉద్యోగులపైనే ఫిర్యాదులు.. జిల్లా కేంద్రంలో రేషన్ కార్డులతో పాటు ఇతర కులం, నివాసం, ఆదాయం వంటి పత్రాల కోసం నిత్యం రెవెన్యూ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే రెవెన్యూ ఉద్యోగులపైనే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా హనుమకొండ మండల కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్పై ఏకంగా ఒక దళారి కలెక్టర్కే ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే అతడి పరిస్థితి గమనించిన అధికారులు సదరు వ్యక్తి తీరుపై విస్మయానికి గురయ్యారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట మండల కార్యాలయాల్లో నిత్యకృత్యం. ఇక కొన్ని మీసేవ కేంద్రాల్లో పనిచేసే వారైతే రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్రూవల్ చేయించి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈవిషయం అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. కార్డు రాదనే భయంతో.. పదేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు రాకపోతే ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఫుడ్ సెక్యురిటీ కార్డు ఒకటి పకడ్బందీగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా కేవలం రెవెన్యూ సిబ్బందితో మాత్రమే విచారణ చేయిస్తోంది. వీరిలో కూడా కొందరు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో అధికారులు స్పందించి దళారుల బెడద నివారించి కొత్త కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కోరుతున్నారు. సమస్య ఉంటే నేరుగా ఆఫీసుకు రండి.. కార్యాలయానికి రేషన్ కార్డుల దరఖాస్తులతో వస్తున్న వ్యక్తులే పదేపదే రావడం గమనిస్తున్నాం. వీరి విషయంలో ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఈవిషయంలో దళారులను అరికట్టేందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నాం. పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. అన్ని ధ్రువపత్రాలు ఉంటే అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. లేదంటే కార్యాలయానికి వస్తే నేరుగా అధికారులను కలవండి. రేషన్ కార్డు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. – రంజిత్కుమార్, హనుమకొండ ఇన్చార్జ్ తహసీల్దార్ జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 2,28,097(జనవరి 2025 వరకు) కొత్తగా అప్రూవల్ అయినవి: 3,419(జనవరి నుంచి జూన్ 1 వరకు) రెవెన్యూ సిబ్బందిపైనే ఫిర్యాదులు వారు చెప్తేనే చేయాలని హుకుం కొన్ని మీసేవ కేంద్రాల్లో చేతివాటం రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు అంటూ ఆఫర్లు -
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
● సీపీ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కా వాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబర్లో సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్గా కృష్ణనర్సంపేట : నర్సంపేట మున్సిపల్ కమిషనర్గా కృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణ జీహెచ్ఎంసీలో విధులు నిర్వహిస్తుండగా ప్రభుత్వం ఉద్యోగోన్నతి కల్పిస్తూ నర్సంపేటకు బదిలీ చేసినట్టు తెలుస్తోంది. కాగా నెల రోజుల క్రితమే నర్సంపేట మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కాట భాస్కర్ను బదిలీ చేసినట్టు ఆదేశాలు రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. రుసా 2.0కు రుద్రగూడెం యువకుడి ఎంపికనల్లబెల్లి: రాష్ట్రీయ ఉచ్చతార్ శిక్షా అభియాణ్లో భౌతిక శాస్త్రంలో సెంటర్ ఫర్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్ అనే అంశంపై పరిశోధనలు చేసేందుకు ప్రాజెక్ట్ పెల్లోగా నల్లబెల్లి మండలంలోని రుద్రగూడెం శివారు చిన్నతండాకు చెందిన మూడు భద్రమ్మ–సారయ్య దంపతుల కుమారుడు సుమన్ ఎంపికయ్యాడు. ఈ మేరకు ప్రాజెక్ట్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం సుమన్కు అందజేశారు. సుమన్ ప్రస్తుతం కాకతీయ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేస్తున్నాడు. ప్రాజెక్ట్ పెల్లోగా ఎంపికై న సుమన్ను కుటుంబ సభ్యులు, స్థానికులు, మిత్రులు అభినందించారు. డీపీఆర్ త్వరగా సిద్ధం చేయండి ● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ వివరించారు. సి వరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీ గా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటా యింపు,తదితర అంశాలపై వివరించారు. స మావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, బిల్డ్ కాన్ ప్రతినిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ‘అనుమతి లేని ప్రైవేట్ స్కూళ్లను సీజ్ చేయాలి’నర్సంపేట: నర్సంపేట డివిజన్ పరిధిలోని ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్ స్కూళ్లను సీజ్ చేయాలని కోరుతూ ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి గడ్డం నాగార్జున ఆధ్వర్యంలో డీఈఓకు మంగళవారం వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. పట్టణంలో అనధికారికంగా తొమ్మిది ప్రైవేట్ స్కూళ్లు నడుస్తున్నాయని చెప్పారు. లాయా యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఎంఈఓ చర్యలు తీసుకోవడం లేదన్నారు. సమగ్ర విచారణ చేయించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
డ్రగ్స్ రహిత కమిషనరేటే లక్ష్యం
వరంగల్ క్రైం: డ్రగ్స్ రహిత వరంగల్ పోలీస్ కమిషనరేట్గా గుర్తింపు సాధించడమే మనందరి లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకుని డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన వాల్పోస్టర్లను మంగళవారం సీపీ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. వారోత్సవాల్లో భాగంగా విద్యాసంస్థల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో డ్రగ్స్పై అవగాహన కల్పించడంతో పాటు, ర్యాలీలు, డ్రాయింగ్, వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా మత్తు పదార్థాలు విక్రయించినా, వినియోగించినా 87125 84473 నంబర్లో సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సీసీఆర్బీ ఏసీపీ డేవిడ్ రాజు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.కేయూ వీసీని కలిసిన రీసెర్చ్ ప్రాజెక్ట్ సభ్యులుకేయూ క్యాంపస్ : రుసా 2.0 ప్రాజెక్ట్ కింద మంజూరైన ‘సెంటర్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ మెటీరియల్స్’ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఫెల్లోస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి మంగళవారం కేయూ వైస్ చాన్స్లర్ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రంను మర్యాద పూర్వకంగా కలిశారు. రుసా 2.0లో భాగంగా ఐదు కేంద్రాల్లో ఒకటిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సెంటర్లో అధిక ప్రభావం చూపే మంచి జర్నల్స్లో మెరుగైన ఫలితాలను ప్రచురించడానికి, నాణ్యమైన పరిశోధన నిర్వహించాలని వీసీ ప్రతాప్రెడ్డి.. ప్రాజెక్ట్ ఫెల్లోలకు సూచించారు. కార్యక్రమంలో శ్రీలత, అడిషనల్ కంట్రోలర్ డాక్టర్ పద్మజ, విభాగాధిపతి మంజుల, నరేందర్, రాజు, శ్రీలత, నర్సింహులు పాల్గొన్నారు.నేడు, రేపు స్పోర్ట్స్ స్కూల్స్లో ప్రవేశాలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25, 26 తేదీల్లో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. మండల స్థాయిలో ఎంపికై న విద్యార్థులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో మరోసారి సెలక్షన్స్ ఉంటాయని అందులో అర్హత సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎంపిక పోటీలకు హాజరయ్యే విద్యార్థులు తమ వెంట ఆధార్కార్డు, బోనోఫైడ్, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, మూడో తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద హాజరుకావాలని సూచించారు.వేయిస్తంభాల ఆలయ హుండీ ఆదాయం రూ.15,39,722హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం ఉదయం హుండీ లెక్కించారు. హుండీ ఆదాయం రూ.7,47,722, పూజా రుసుముల ద్వారా రూ.7,92,000గా నమోదైందని, మొత్తం ఆదాయం రూ.15,39,722గా నమోదైందని దేవాలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్ తెలిపారు. సరస్వతీ పుష్కరాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించుకున్నందున అధిక ఆదాయం నమోదైందని ఈఓ తెలిపారు. పర్యవేక్షకులుగా దేవాదాయశాఖ పరిశీలకులు ప్రసాద్ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, సిబ్బంది మధుకర్, రామకృష్ణ, రజిత, హనుమకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, వేంకటేశ్వర సేవా సమితి మహిళా భక్తులు పాల్గొన్నారు. -
పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయండి
ఎల్కతుర్తి: పీవీ విజ్ఞాన కేంద్రం పనులను ఈనెల 26 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న వీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనుల్ని మంగళవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా విజ్ఞాన కేంద్రంలో తుది దశకు చేరుకున్న మ్యూజియం, అంపి థియేటర్, ఆర్ట్ గ్యాలరీ, ప్రాంగణాన్ని కలెక్టర్ పరిశీలించి పర్యాటక అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన కేంద్రం ఆవరణలో మొక్కలు నాటాలని, గ్రీనరీ సిద్ధం చేయాలన్నారు. ‘రైతుకు భరోసా’పై వీడియో కాన్ఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందజేసిన సందర్భంగా హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఇతర మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని రైతు వేదిక నుంచి మండలంలోని వివిధ గ్రామాల రైతులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రసంగాన్ని వీక్షించారు. కార్యక్రమంలో డీఏఓ రవీందర్సింగ్, గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, ముల్కనూరు సొసైటీ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఎరువుల గోదాం పరిశీలన ముల్కనూరులోని ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను మంగళవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. వీటికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. ఆమె వెంట స్థానిక తహసీల్దార్ రాజేశ్, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
పీడీ యాక్ట్ నమోదు సరైనదే..
గీసుకొండ: పరకాల ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధి గీసుకొండ మండలంలోని మొగిలిచర్ల గ్రామానికి చెందిన ధారవత్ ధన్సింగ్ అనే గుడుంబా విక్రయదారుడి పై పీడీ యాక్ట్ సరైనదేనని హై కోర్టు తీర్పు వెలువరించిందని ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు చర్లపల్లి జైలులో ఉన్న ధన్సింగ్కు అధికారులతో కలిసి ఆయన పీడీ యాక్ట్ పత్రాలను అందజేశారు. 2024 లో డిప్యూటీ కమిషనర్తోపాటు, రూరల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ ఆదేశాల మేర కు అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్, సీఐ తాతాజీ నిందితుడి పై పీడీ యాక్ట్ నమోదు చేశారని తెలిపారు. కలెక్టర్ సత్యశారద ఉత్తర్వుల మేరకు గ తఏడాది నవంబర్ 25న నిందితుడిపై కేసు నమో దు చేసి చర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలిపారు. కాగా తన భర్త ధన్సింగ్పై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని సవాల్ చేస్తూ అతని భార్య హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. ప్రమాదకరమైన గుడుంబా కేసుల్లో పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపటం సరియైనదేనని హైకోర్టు తీర్పు వెలువరించినట్లు అంజన్ రావు తెలిపారు. పలుమా ర్లు గుడుంబా విక్రయిస్తూ పట్టుబడిన ధన్ సింగ్ పై పీడీ చట్టం ప్రయోగించినందుకు వరంగల్ రూరల్ సూ పరింటెండెంట్ అరుణ్ కుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళీధర్, పరకాల సీఐ తాతా జీ, ఎస్సై జ్యోతిని ప్రత్యేకంగా అభినందించారు. వివరాలు వెల్లడించిన ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్రావు -
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పర్వతగిరి: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మామునూరు ఏసీపీ వెంకటేష్ సూచించారు. మాదకద్రవ్యాల నిరోధంపై మండలంలోని కల్లెడ ఆర్డీఎఫ్ పాఠశాలలో మంగళవా రం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏసీపీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు, మంచి స్నేహాలను అలవర్చుకోవాలన్నారు. ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని చదువులో రాణించాలని తెలిపారు. కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులకు మంచి పేరు పిల్లల ద్వారానే వస్తుందని, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్, కాలేజ్ ప్రిన్సిపాల్ జనార్ధన్,ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజు, సంతో ష్, సైదులు, జయశంకర్, ధనలక్ష్మి పాల్గొన్నారు. మామునూరు ఏసీపీ వెంకటేష్ -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్కుమార్ అన్నారు. మండలంలోని ధర్మరావుపేట గ్రామంలో మంగళవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డెంగీ జ్వరంతో బాధపడుతుండగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. ఇంటిపరిసరాల్లో దోమల మందును పిచికారీ చేయించారు. అనంతరం అనిల్కుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఇళ్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఇతర శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్న తరుణంలో గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, సీహెచ్ఓ రాజయ్య, సబ్యూనిట్ ఆఫీసర్ నంద, కార్యదర్శి అనిత, సిబ్బంది దామోదర్రెడ్డి, భాస్కర్, కనకలక్ష్మి, సుజాత, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ అనిల్కుమార్ -
నూతన లైన్లతో సమస్యల పరిష్కారం
రాయపర్తి: నూతన విద్యుత్ లైన్లతో విద్యుత్ సరఫరాలో ఏర్పడిన సమస్యను పరిష్కరించవచ్చని ఎన్పీడీసీఎల్ చీ్ఫ్ ఇంజనీర్ రాజ్ చౌహాన్ అన్నారు. మండలంలోని సన్నూరు సబ్ స్టేషన్ నుంచి ఊకల్ సబ్స్టేషన్ వరకు కొత్తగా నిర్మించిన 33 కేవీ లైన్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లైన్ ఏర్పాటు చేయడం ద్వారా సన్నూరు ఊకల్ సబ్స్టేషన్లో అంతరాయాలను తగ్గించొచ్చని తెలిపారు. అదేవిధంగా రాయపర్తి సబ్ స్టేషన్లో పవర్ ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతమ్ రెడ్డి, ఆపరేషన్ డీఈ భిక్షపతి, కన్స్ట్రక్షన్ డీఈ హరిజి నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ చీ్ఫ్ ఇంజనీర్ రాజ్ చౌహాన్ -
నిబంధనల మేరకే ఎంటీపీ కిట్ వినియోగించాలి
ఎంజీఎం: గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, చట్టంలో సూచించిన గైడ్లైన్స్ ప్రకారమే ఎంటీపీ కిట్ విని యోగించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించా రు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఔషధ నియంత్రణ విభాగం, ఆర్ఎంపీ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మకూడదని, అలాగే ఎవరికి అమ్ముతున్నారో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్కు సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలి పారు. డీఎంహెచ్ఓ ద్వారా అనుమతి పొందిన హాస్పిటల్స్ మాత్రమే ఎంటీపీ నిర్వహించాలని ఆదేశించారు. సొంతంగా ఎంటీపీ కిట్ వినియోగం వల్ల వచ్చే అనర్థాల గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌత మ్ చౌహన్, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు నరేశ్కుమార్, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి మంజుల, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసన్నలక్ష్మి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, ఔషధ నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎంపీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి టి.సుమలత, రాజేశ్వర్రెడ్డి సుప్రియ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
వన మహోత్సవానికి సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవ మొక్కలను సిద్ధం చేయడంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచాలని, వాటి సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల కరపత్రాన్ని అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకుండా ఉన్న వారు http://trrtudycirc e.co.in వెబ్ సైట్ ద్వారా జూలై 7 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవా లని కోరారు. జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్ఓ వై.వి.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి సంస్థ అధికారి నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
నేడు రైతులతో సీఎం ముఖాముఖి
ఖిలా వరంగల్: సీఎం రేవంత్రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్ ఆఫీసర్గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు. విధుల నుంచి ఏఎల్ఎం తొలగింపు పర్వతగిరి: మండలంలోని జమాల్పురం గ్రామంలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంలో విద్యుత్ శాఖలో తాత్కాలిక పద్దతిలో విధులు నిర్వహిస్తున్న బాలాజీ తీవ్రంగా గాయపడి రెండు కాళ్లు పోగొట్టుకున్న విషయం విధితమే. కాగా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహించి ప్రమాదానికి కారకుడైన ఏఎల్ఎం(అసిస్టెంట్ లైన్మెన్) నిశాంత్వర్మను విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధుల నుంచితొలగించినట్లు విద్యుత్ శాఖ డీఈ భిక్షపతి తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పర్వతగిరి పోలీసులు తెలిపారు. రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు హన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. ‘నిట్’లో జీయాన్ వర్క్షాప్ షురూ కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జీయాన్ (గ్లోబల్ ఇన్షియేటివ్ ఆఫ్ అకాడమిక్ నెటవర్క్) ఐదు రోజుల వర్క్షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరిపేర్ అండ్ రీమాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ పార్ట్స్ యూసింగ్ డైరెక్ట్ ఎనర్జీ డీపొజిషన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టేనబుల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ నిట్శ్రీ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్షాప్నకు ముఖ్య అతిథులుగా యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరీడా ప్రొఫెసర్ నవీన్ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టీన్ ప్రొఫెసర్ డేవిడ్ బోరెల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ప్రారంభించి సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సివిల్, మెకానికల్ హెడ్స్ రవికుమార్, శంకర్, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్ధల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు.కానిస్టేబుల్కు అభినందనవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయిరాం గత వారం క్లాషిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్సింగ్.. ఆయనను అభినందించి రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీసుకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అదనపు డీసీపీ సురేశ్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్రాజ్ పాల్గొన్నారు.మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలికాజీపేట రూరల్/మడికొండ: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ (వర్ధన్నపేట) బాలుర పాఠశాల, కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలపై దర్గా పాఠశాల విద్యార్థులు నాటిక ప్రదర్శించగా.. డీసీపీ వారిని అభినందించి రూ.1,000 నగదు పురస్కారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్, హెడ్ కానిస్టేబుళ్లు జయరాజ్, రాంచందర్, కాజీపేట సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై లవన్కుమార్, స్కూల్ హెచ్ఎం ఎన్.ఎన్.ఎం.స్వామి, సెక్రటరీ కటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.రైతు భరోసా రూ.148.74 కోట్లు జమహన్మకొండ: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తోందని హనుమకొండ జిల్లా వ్యవసా య అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వానాకాలం పంటల సాగుకు సోమవారం జిల్లాలో 14 మండలాలు, 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రూ.148.74 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు.వరంగల్ రీజియన్కు ప్రాధాన్యంహన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో వరంగల్ రీజియన్కు ప్రాధాన్యం దక్కింది. ఖమ్మంలో ఈనెల 21, 22 తేదీల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. సోమవారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ రీజియన్కు చెందిన సీహెచ్.రాంచందర్(భూపాలపల్లి ఏడీసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బి.ఉపేంద్రచారి (వరంగల్–1 డిపో కండక్టర్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.ఎస్ఈగా శివలింగంవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీబ్ల్యూఎంసీ) ఇన్చార్జ్ ఎస్ఈగా బి.మహేందర్ను నియమిస్తూ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జ్ ఈనెలఖారుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
యూరియా సరిపోయేనా..?
ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరక డం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్లో యూరి యా సరఫరా ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1,11,430 టన్నుల ఎరువులు అవసరం జిల్లాకు యూరియా 47వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 16,805 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 14,270 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 6,615, ఎన్పీకే కాంప్లెక్స్ 26,740 మెట్రిక్ టన్నులు.. మొత్తం 1,11,430 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం. కానీ ప్రస్తుతం యూరియా సరఫరా తక్కువగా ఉండటంతో వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తోంది. గూడ్స్ షెడ్కు చేరిన ఎరువులు ఈనెల 21న ఆర్సీఎఫ్ యూరియా 1,315.170 టన్నులు వరంగల్ గూడ్స్ షెడ్కు చేరుకోగా.. వరంగల్కు 4,781, హనుమకొండ 4,000, ములుగు 2,666, భూపాలపల్లి 5,777, జనగామ 2,888, మహబూబాబాద్ 8,000, కమిషనర్పూల్ 1,111 బస్తాల చొప్పున కేటాయించారు. ఇందులో మార్క్ఫెడ్కు 60 శాతం, డీలర్లుకు 40 శాతం సరఫరా చేయగా.. యూరియా చేరిన రెండు రోజుల్లోనే స్టాక్ ఎక్కవ సెల్స్ పాయింట్స్లో క్లోజ్ చేయగా.. మరికొన్ని సొసైటీల్లో నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఐపీఎల్ కంపెనీకి చెందిన యూరియా 45,210 బస్తాలు రానున్నాయి. నానోపై దృష్టి.. ప్రస్తుతం యూరియా సరఫరా తగినంత లేకపోవడంతో అధికారులు నానో యూరియా వైపు రైతులను మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, అంత త్వరగా రైతులు ఆటువైపు అడుగులు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి సరిపడే నానో యూరియా ధర మాములు దానికంటే తక్కువగానే ఉన్నా స్ప్రే చేసే విధానం ఉండడంతో రైతులు ముందుకెళ్లలేకపోతున్నారు. ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా రేపు మరో 45,210 బస్తాల రాక యూరియా నిల్వలు ఉన్నాయిజిల్లాలో యూరియా కొరత వాస్తవమే.. ఫోర్ట్ రోడ్డు ఖిలా వరంగల్ సొసైటీకి 444 యూరియా బస్తాలు రాగా.. 222 బస్తాలు నిల్వ ఉన్నాయి. గోదాంకు వచ్చిన ప్రతి రైతుకు ఎలాంటి నిబంధనలు లేకుండా యూరియా విక్రయిస్తున్నాం. – కేడల జనార్దన్, ఖిలా వరంగల్ మండల సొసైటీ అధ్యక్షుడు -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
హన్మకొండ: శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని హనుమకొండ దీన్దయాళ్నగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ.. దేశం కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన జాతీయవాది, అఖండ భారత్ కోసం ప్రాణాలు వదిలిన భరతమాత ముద్దుబిడ్డ, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేంగే, నహీ చలేంగే’ అంటూ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం పోరాడుతూ.. అసువులు బాసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమం తర్వాత నాయకులు పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు దొంతి దేవేందర్రెడ్డి, రావు అమరేందర్రెడ్డి, చాడ శ్రీనివాస్రెడ్డి, గుజ్జ సత్యనారా యణరావు, మాలోతు నాను నాయక్, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రత్నలక్ష్మి, సండ్ర మధు, చల్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిట్లో జీయాన్ వర్క్షాప్ షురూ
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జీయాన్ (గ్లోబల్ ఇన్షియేటివ్ ఆఫ్ అకడమిక్ నెట్వర్క్) ఐదు రోజుల వర్క్షాప్ సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ‘రిపేర్ అండ్ రీమాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ పార్ట్స్ యూసింగ్ డైరెక్ట్ ఎనర్జీ డీపొజిషన్, అడిటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ సస్టేనబుల్ ట్రాన్స్పోర్ట్ ఎట్ నిట్’ అంశాలపై ఏర్పాటు చేసిన ఐదు రోజుల వర్క్షాప్నకు ముఖ్య అతిథులుగా యూఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరీడా ప్రొఫెసర్ నవీన్ఏలూరు, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ ఆస్టీన్ ప్రొఫెసర్ డేవిడ్ బోరెల్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్షాప్ ప్రారంభించి సావనీర్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీయాన్ కో–ఆర్డినేటర్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు, సివిల్, మెకానికల్ హెడ్స్ రవికుమార్, శంకర్, రఘురాం, ఏపీ, తెలంగాణ, కర్నాటక, పాండిచ్చేరి వివిధ విద్యా సంస్థల నుంచి 60 మంది పీజీ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
నర్సంపేట రూరల్ : నర్సంపేట వైద్య కళాశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, సిబ్బంది నియామకం, ఇతర అవసరాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, సూపరింటెండెంట్ కిషన్, అధ్యాపక బృందంతో కలెక్టర్ సత్యశారద సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై చర్చించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని సూచించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో అవసరాలు, వసతులు కల్పించేందుకు కలెక్టర్లు ఇన్చార్జీలుగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెడికల్ కళాశాల వైద్యశాల నిర్వహణకు అత్యవసరంగా ఆపరేషన్ థియేటర్స్, కావాలసిన పరికరాలు అందిస్తామని, శస్త్ర చికిత్సలు ప్రారంభించాలని చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే పరిశీలించి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సాంబశివరావు, కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్, సూపరింటెండెంట్ కిషన్, ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ తదితరులు పాల్గొన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయండి సమీక్షా సమావేశంలో కలెక్టర్ సత్యశారద సూచన -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అ యితే లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్ కు సమయం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం తదితర కారణాలతో హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలల ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడక న సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థో మత, మెటీరియల్ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. మంచి రోజులు లేవని.. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాఢ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఊపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. ఇందులో ఒక హాల్, కిచెన్, బెడ్రూం, వాష్రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది. హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ గృహాలు 9,942 కేటాయింపు పరిపాలనా మంజూరు ఇచ్చినవి 6,358 ముగ్గులు పోసినవి 3,194 వరంగల్ జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004 పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734 కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని లబ్ధిదారుల జాబితా ముహూర్తాలు లేక ఆగిన ఇళ్ల నిర్మాణాల ప్రారంభంఎంపిక.. కత్తిమీద సాము వరంగల్ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి. -
డీబీసీడీఓపై కలెక్టర్ ఆగ్రహం
నల్లబెల్లి: బీసీ హాస్టల్ పరిశీలన కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారం ఉన్నా.. ఎందుకు రాలేదు..? ఇంత నిర్లక్ష్యం ఎందుకు..? ఏమైనా తమాషా చేస్తున్నావా.. అంటూ జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి (డీబీసీడీఓ) పుష్పలతపై.. కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాతపూర్వకంగా 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో కలెక్టర్ సోమవారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతితోపాటు బీసీ హాస్టల్ను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాన్ని చూసి చలించారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. అందుకు అవసరమైన నివేదికను ఇవ్వాలని చెప్పారు. హాస్టల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను తెలిచి అందులోని ఫిర్యాదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు.. మెనూ ప్రకా రం భోజనం అందిస్తున్నారా.. అని అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చిరువూరి శారదను అడిగి తెలుసుకున్నారు. ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు భరించలేకపోతున్నామని వివరిస్తూ లబ్ధిదారురాలు తన సమస్యలను కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వాహనాన్ని సమకూర్చుకుంటే 8 ట్రాక్టర్ల ఇసుకను ఉచితంగా అందిస్తామని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అండగా ఉండేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అనుసంధానం చేసేందుకు కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఆమె వెంట జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి భాగ్యలక్ష్మి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి, డీఈ విష్ణువర్ధన్, ఎంపీఓ రవి, ఏఈ శృతి ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక దుగ్గొండి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందిస్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని సోమవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులు ప్రారంభించిన లబ్ధిదారులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ ధరకు ఇసుక కొనుగోలు చేయొద్దని సూచించారు. ప్రభుత్వం అందించే ఇసుకను వినియోగించుకుని నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. నిర్ధేశిత కొలతలతో నిర్మాణం చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుందని లబ్ధిదారులకు వివరించారు. కలెక్టర్ వెంట జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈ విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీధర్గౌడ్, హౌసింగ్ ఏఈ శ్రావణి, తదితరులు ఉన్నారు. సమాచారం ఉన్నా.. హాస్టల్ పరిశీలనకు రాని డీబీసీడీఓ -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన కుటుంబాలకు శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనుంది. అయితే లబ్ధి దారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్కు సమ యం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం తదితర కారణాలతో జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలలు ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థోమత, మెటీరియల్ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు. వరంగల్ జిల్లాలో.. జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని మొదలు పెట్టారు. ఎంపిక.. తలకు మించిన భారం వరంగల్ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకే ముందుగా మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి. మంచి రోజులు లేవని.. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాడ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఉపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురి చేస్తోంది. ఇందులో ఒక హాల్, కిచెన్, బెడ్రూం, వాష్రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది. జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004 పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734 కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా ముహూర్తాలు లేక ఆగిన ఇళ్ల నిర్మాణాల ప్రారంభం -
కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన ఉపాధ్యాయుడు
వేలేరు: మండలంలోని పీచర ప్రభుత్వ పాఠశాలలో జీవశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న తుడుం సుధాకర్ తన కుమారుడు సుశాంత్ను తాను పని చేస్తున్న పీచర పాఠశాలలోనే చేర్పించి ఆదర్శంగా నిలిచారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సుశాంత్ను గతంలో స్టేషన్ ఘన్పూర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివించగా.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివించడం ద్వారా స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పెరగాలని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు సుధాకర్ తెలిపారు. ఉపాధ్యాయుడి కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడంతో హెచ్ఎం శ్రీదేవి, తోటి ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆయనను అభినందించారు. -
దరఖాస్తులు పెండింగ్లో ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. వెబ్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో అందరూ వెబ్ కాన్ఫరెన్స్లో ప్రజావాణి ముగిసే వరకు ఉన్నారు. ప్రజావాణిలో సమస్యలపై కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు సమస్యలను పెండింగ్లో ఉంచడం సరికాదన్నారు. తమకు వచ్చిన వినతులను పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని చెప్పారు. సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలని సూచించారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది అనే విషయం ఆన్లైన్లో కనిపించేలా అప్డేట్ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈవిషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజావాణికి వివిధ సమస్యలపై 186 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, ఇతర అధికారులు పాల్గొన్నారు. రికార్డుల్లో మా భూమి ఎక్కించండి.. ధర్మారం గ్రామంలో మాకు వారసత్వంగా వచ్చిన ఎకరం 20 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో 38 గుంటలుగా నమోదైంది. ఇప్పటికి పలుమార్లు రికార్డు సరిచేయాలని తిరిగినా కాలేదు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని రికార్డులు సరిచేసి మిగిలిన 22 గుంటల భూమిని కూడా మా పేరుతో రికార్డుల్లో వచ్చే విధంగా చూడాలి. నా భర్త చనిపోయాడు. తిరగలేకపోతున్నా. అధికారులు దయచేసి న్యాయం చేయాలి. – వజ్రమ్మ, ధర్మారం(నడికూడ)అధికారులను ప్రశ్నించిన కలెక్టర్ స్నేహ శబరీష్ గ్రీవెన్స్లో వెబ్ కెమెరాలు చూస్తూ.. అర్జీలను పరిశీలించిన కలెక్టర్ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరిక -
మాకు దారి చూపండి
న్యూశాయంపేట : వ్యవసాయ పనులు చేసుకోవ డానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు కలెక్టర్ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందచేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సిఈఓ రామ్రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్, జ్ఞానేశ్వర్, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్భాల్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. కిటకిటలాడిన ప్రజావాణి.. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి ప్రజలతో కిటకిటలాడింది. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ ప్రజావాణిలో రెవెన్యూశాఖకు సంబంధించి 53, గృహనిర్మాణశాఖ 14, మిగితా శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు మొత్తంగా 121 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలి ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్.. అధికారులను ఆదేశించారు. పరిష్కరించేందుకు వీలుకాని ఫిర్యాదులపై దరఖాస్తుదారులకు వివరంగా చెప్పాలన్నారు. పరిష్కరించిన వివరాలను దరఖాస్తుదారుడి మొబైల్కి సమాచారం అందించేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆర్టీఐ దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. ఇ– ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలి జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో ఇ–ఫైలింగ్ విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. బయోమెట్రిక్ అటెండెన్స్ను అన్ని కార్యాలయాల్లో తప్పని సరిచేయాలన్నారు. వ్యవసాయ ఆరోగ్యశాఖ విద్యాశాఖ తదతర శాఖపరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి నిర్ణీత గడువులోగా పనులు పూర్తిచేయాలని, పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి లక్ష్యాలను సాధించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. డాక్టర్పై చర్య తీసుకోవాలి ములుగులో ఎంబీబీఎస్ అని చెప్పుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తూ నాకు ఓవర్ యాంటిబయోటిక్స్ ఇంజక్షన్ ఇచ్చి రెండు పోవడానికి కారకుడైన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని పీహెచ్సీ డాక్టర్ రవీందర్పై చర్యలు తీసుకోవాలి. – గుర్రం శ్రీహరి, నర్సాపూర్, ములుగు జిల్లా ఇల్లు ఇప్పించండి..నాది పేద కుటుంబం. నేను దివ్యాంగురాలిని. ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ పథకం ద్వారా ఇల్లు నిర్మించి ఇవ్వండి. – హైమావతి, శంభునిపేట, వరంగల్నా కొడుకులు బాగోగులు చూస్తలేరు నా భార్య చనిపోయింది. నాకు పక్షవాతం వచ్చింది. నా ముగ్గురు కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి. నాకు ఉన్న ఆస్తిని కుమారులు పంపకాలు చేసుకున్నారు. నా బాగోగులు చూడడంలేదు. నాకు న్యాయం చేయండి. – చేరాల సాంబయ్య(కరీమాబాద్) ప్రజావాణిలో కలెక్టర్కు పలువురి వినతి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వండి అధికారులకు కలెక్టర్ సత్యశారద సూచనపెన్షనర్స్కు ఇబ్బంది కలిగించొద్దు పార్లమెంట్కు ముందస్తు సమాచారం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లులో పెన్షనర్స్ నష్టం కలిగించే చట్టాన్ని ప్రవేశపెట్టింది. దీనిని ఉపసంహరించుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సంఘం, వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. – రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బాధ్యులు -
యువత సన్మార్గంలో నడిచి ఆదర్శంగా నిలవాలి
నర్సంపేట రూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉంటూ సన్మార్గంలో నడిచి, ఎంచుకున్న రంగంలో రాణించి పలువురికి ఆదర్శంగా నిలువాలని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్నారు. నర్సంపేట మండలంలోని బాలాజీ ఇంజనీరింగ్ కళాశాల, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మారకద్రవ్యాల నిరోధక అవగాహన సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. యువత మారకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్ధాలకు బానిసై బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పారు. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు యువత కష్టపడి చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై అరుణ్, రవికుమార్, కళాశాల ప్రిన్సిపాల్ హరిహరన్, అధ్యాపకులు పాల్గొన్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలి వర్ధన్నపేట : యువత మత్తుపదార్ధాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని వరంగల్ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలంలోని ఇల్లంద జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ రాజమహేంద్రనాయక్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం సమాజంలో పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. యువత సహకారంతోనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మాధక ద్రవ్యాలు ఎవరైనా విక్రయించినా.. వినియోగించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో మంచిగా చదువుకొని అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, ఎస్సైలు చందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.నవీన్కుమార్, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఇతర బాధ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వీసీని కలిసిన వారిలో ఎన్జీఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ యూనస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సతీశ్బాబు, రిక్రియేషన్ సెక్రటరీ తోట ప్రభాకర్, కోశాధికారి తాటి దామోదర్, మహిళా సెక్రటరీ బి.కృష్ణవేణి ఉన్నారు. -
ఆర్టీసీ మహాసభను జయప్రదం చేయాలి
హన్మకొండ: ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం మహాసభను జయప్రదం చేయాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం వరంగల్ రీజియన్ అధ్యక్షుడు గొలనుకొండ వేణు, కార్యదర్శి మాదారపు సాంబయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ వాల్పోస్టర్లను హనుమకొండలోని వరంగల్ –1, వరంగల్ –2 డిపోల వద్ద సంఘం నాయకులు ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహాసభ జరుగనుందని చెప్పారు. వరంగల్ రీజియన్లోని ఆర్టీసీ బీసీ ఉద్యోగులందరూ తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్, వరంగల్ –1 డిపో అధ్యక్షుడు దుంపేటి యాదగిరి, సెక్రటరీ పోతరాజు రమేష్, వరంగల్ –2 డిపో అధ్యక్షుడు కిరణ్, కార్యదర్శి శ్రీధర్ ఆర్టీసీ బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. -
కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ
సంగెం: మండలంలోని కొత్తగూడెం గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించినట్లు హనుమకొండ డిపో మేనేజర్ ధరమ్సింగ్ తెలి పారు. ఆదివారం ఆయన ఎస్సై నరేశ్తో కలిసి కొత్తగూడెంలో బస్సును ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం రోజుకు రెండు ట్రిప్పులు నడుస్తుందన్నారు. వరంగల్, ఖిలావరంగల్, స్తంభంపల్లి, వెంకటాపూర్, కాట్రపల్లి, కుంటపల్లి, సంగెం, తిమ్మాపూర్, గాంధీనగర్, కొత్తగూడెం తదితర గ్రామాల ప్రజలకు బస్సు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఏసీపీ సురేందర్, పంచాయతీ కార్యదర్శి రంజిత్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు జనగాం రమేశ్, జగన్నాథచారి, పాషా, రాంరెడ్డి, గాలి చేరాలు, ఎనబోతుల సదయ్య, సాంబయ్య, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. తండా అభివృద్ధికి కృషిచేయాలినర్సంపేట రూరల్: రాజకీయ పార్టీలకు అతీతంగా పుట్టి పెరిగిన తండా అభివృద్ధికి కృషిచేయాలని భూపాలపల్లి జిల్లా క్రైం డీఎస్పీ భూక్యా నారాయణ సూచించారు. నర్సంపేట మండలంలోని భోజ్యానాయక్తండాలో కోర్ కమిటీ (ఆత్మీయ సమ్మేళనం) సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బంజారా సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు తండా పండుగలను ఘనంగా జరుపుకోవాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా మఽధిర సీఐ సాగర్, మహబూబాబాద్ జిల్లా సీఐ శంకర్, హెడ్కానిస్టేబుల్ భూక్యా జంపయ్య, ఎల్ఎఐసీ బిజినెస్ అసోసియేట్ నాథం, టీచర్ ఆర్జ్య, హైదరాబాద్ పాలిటెక్నిక్ లెక్చరర్ అజ్మీరా శ్రీనివాస్, గ్రామానికి చెందిన 102 మంది ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకుడు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
రుణాల కింద భరోసా డబ్బుల జమ
నర్సంపేట: రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో పడిన వెంటనే పలువురు బ్యాంకర్లు పంట రుణం బకాయిలతోపాటు ఇతర బకాయిలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు పలువురు వాపోతున్నారు. దీంతో కొందరు రైతులు చేసేదేమి లేక అప్పుల కింద భరోసా డబ్బులు వదులుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది మాత్రం పెట్టుబడికి ఇబ్బందిగా ఉందని, నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. రైతు భరోసా నిధులను పంట రుణాలకు జమ చేసుకోవద్దని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కొందరు బ్యాంకర్లు రైతులకు డబ్బులు ఇవ్వడంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెట్టుబడి రెండుసార్లు.. జిల్లాలో వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు పత్తి, మొక్కజొన్న తదితర విత్తనాలను విత్తారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పెట్టిన విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలిసిన మొక్కలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. దీంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే మరోసారి విత్తనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ వర్షాకాలంలో పెట్టుబడులు పెరిగిపోనున్నాయి. వీరందరికి ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం ఉపయోగంగా మారింది. బ్యాంకర్లు మాత్రం భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవడంతో జిల్లాలోని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఆదేశించినా.. రైతులకు అందుతున్న రైతు భరోసా నిధులను బాకీల కింద జమ చేసుకోవద్దని వ్యవసాయ అధికారులతోపాటు జిల్లా అధికారులు బ్యాంకర్లకు సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే జిల్లాలోని బ్యాంకు మేనేజర్లతో సమావేశాలు కూడా నిర్వహించారు. రైతు భరోసా నిధులను పంట రుణ బకాయిల కింద జమ చేసుకుంటే రైతులు తెలియజేయాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో గ్రామాల వారీగా రైతులు, భరోసా నిధుల వివరాలు.. అధికారుల ఆదేశాలను పట్టించుకోని బ్యాంకర్లు పంటలకు పెట్టుబడి ఎలా అని రైతుల ఆందోళనఈ పక్క ఫొటోలో కనిపిస్తున్న దివ్యాంగ రైతు పేరు ధరావత్ రమేశ్. చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఈయనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి ఎకరాకు రూ.5వేల చొప్పున ఐదు ఎకరాలకు రూ.25వేలు రైతుబంధు డబ్బులు పడేవి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.30 వేలు జమయ్యాయి. దివ్యాంగుల సంఘం తరఫున ఎస్బీఐలో రూ.లక్ష రుణం తీసుకున్నాడు. దీంతో గతేడాది రూ.30 వేలు, ఈ ఏడాది రూ.30 వేల రైతు భరోసా డబ్బులను రుణం కింద అధికారులు జమ చేసుకున్నారు. దీంతో పంటల పెట్టుబడికి అప్పులు తేవాల్సిన పరిస్థితి ఆయన ఏర్పడింది. ఈ పరిస్థితి రమేశ్ ఒక్కడిదే కాదు.. అనేక మంది రైతులు ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.మండలం గ్రామాలు రైతులు నగదు(రూ.కోట్లలో) నర్సంపేట 16 12,551 10.02 చెన్నారావుపేట 11 11,834 11.20 దుగ్గొండి 18 14,805 13.32 ఖానాపురం 51 8,962 9.09 నల్లబెల్లి 24 14,108 14.71 నెక్కొండ 18 15,377 15.27 గీసుకొండ 16 14,004 12.91 ఖిలా వరంగల్ 11 6,058 4.40 పర్వతగిరి 14 14,890 16.69 రాయపర్తి 18 2,00,80 24.58 సంగెం 17 15,519 15.37 వరంగల్ 8 2,421 1.50 వర్ధన్నపేట 12 14,575 17.40 మొత్తం 234 1,65,184 166.46 -
ఉపాధ్యాయుల సర్దుబాటు నిబంధనలు సడలించాలి
● టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ విద్యారణ్యపురి: టీచర్ల సర్దుబాటు నిబంధనలను సడలించడంతోపాటు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించి పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని యూనియన్ వరంగల్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతీ తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు, పూర్వప్రాథమిక తరగతులు ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, అసంబద్ధంగా ఉన్న గురుకులాల పనివేళలను సవరించాలని పే ర్కొన్నారు. సమావేశంలో యూనియన్ బాధ్యులు తాటికాయల కుమార్, సుజనప్రసాద్రావు, ఎస్ఏ.రవూఫ్, పాక శ్రీనివాస్, నామోజు శ్రీనివాస్, విజయ్, కె.రమేశ్, గుండు కరుణాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అదనపు కమిషనర్ జోనా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పచ్చని ప్రకృతిని రక్షించాలి● జిల్లా సంక్షేమ అధికారి జయంతి కేయూ క్యాంపస్ : పచ్చని ప్రకృతిని రక్షించాలని జిల్లా సంక్షేమ అఽధికారి జయంతి అన్నా రు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్విని యోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంవారోత్సవాల్లో భాగంగా ఆదివారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్కాలేజీ మైదానంలో మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడారు. యువత మాదక ద్రవ్యాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. టీజీ ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ డ్రగ్స్ విషయంలో యువతలో సరైన అవగాహన పెరగాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్, ఎకై ్సజ్ సీఐ తిరుపతి, ఎన్సీసీ లెఫ్ట్నెంట్ స్వామి, అధ్యాపకురాలు నహేదా, నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, డీసీపీఓ ఇన్చార్జ్ ప్రవీణ్, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, ఉమెన్ హబ్ కోఆర్డినేటర్ కల్యాణి, సఖీ అడ్మిన్ హైమావతి, నషా ముక్త్ భారత్ అభియాన్ కోఆర్డినేటర్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను శిక్షించాలిహన్మకొండ: ఫోన్ ట్యాపింగ్ బాధ్యులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని స్వగృహంలో ఆదివారం జరిగిన తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ప్రజలు భారీగా మద్దతు పలికి అధికారం ఇస్తే గత పాలకులు ప్రజాస్వామ్యాన్ని కూలదోశారని ఆరోపించారు. తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఉపయోగించుకొని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని దుయ్యబట్టారు. రాజరిక వంశ పారంపర్య పాలనను చిరకాలం కొనసాగించడానికి, ప్రతిపక్ష పార్టీలను బలహీనపరచడం కోసం వేలాది మంది ఫోన్లను బీఆర్ఎస్ పాలకులు ట్యాప్ చేసి దుర్మార్గానికి ఒడిగట్టారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమంగా ఎన్నికై న ప్రజాస్వామ్య ద్రోహులు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, ప్రముఖ సామాజిక వేత్త బొమ్మినేని పాపిరెడ్డి, రాచకొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైౖమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలకోవడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది అసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత శ్రీఈ–మెయిల్స్శ్రీ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకటిరెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్ట ర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్లో చేరికలు
నర్సంపేట: ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అకర్షితులై పలు పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కందికట్ల వీరేశ్ ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన సుమారు 30 కుటుంబాలు ఎమ్మెల్యే దొంతి సమక్షంలో కాంగ్రెస్లో చేరాయి. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్ పాల్గొన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం నెక్కొండ: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చంద్రుగొండ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆరు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, మాజీ జెడ్పీటీసీ బక్కి కవిత, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, నాయకులు పెండ్యాల హరిప్రసాద్, కేవీ. సుబ్బారెడ్డి, కుసుమ చెన్నకేశవులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
క్లైమాక్స్కు ‘దత్తత దందా’
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’ విచారణ క్లైమాక్స్కు చేరుకుంది. ఇటు పోలీసులు, అటు అధికారులు వేర్వేరుగా చేసిన విచారణ నివేదికల ఆధారంగా కలెక్టర్ సత్యశారద ఆదేశాలకు అనుగుణంగా బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గతంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లతో జిల్లా సంక్షేమ విభాగంలోని వీహబ్లో ఉద్యోగం పొంది ఏడాదికిపైగా విధులు నిర్వర్తించిన సిక్కుల సుజాతపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగానే దత్తత వ్యవహారంలో నకిలీ బర్త్ సర్టిఫికెట్లతో సంబంధమున్న సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలకు అవకాశముంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారే, కొన్ని నెలల క్రితం ఓ దత్తత విషయంలో నిబంధనలు అతిక్రమించి మెమో అందుకున్నా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ ‘మంత్రి’ దగ్గరికి వెళ్లి జిల్లా పాలనాధికారిపై ఒత్తిడి తెచ్చి ఉద్యోగం పోకుండా చూసుకున్నారనే ప్రచారం ఉంది. ఈసారి కూడా నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం తన మెడకు చుట్టుకుంటుందనే ఉద్దేశంతో మరోమారు సదరు మంత్రితోపాటు ఓ ఎమ్మెల్యే నుంచి కలెక్టర్పై ఒత్తిడి తెచ్చి ఈ విచారణను నీరుగార్చేలా చేశారనే టాక్ ఉంది. ఈ కేసు విషయంలో కలెక్టర్ సత్యశారద పారదర్శక విచారణ నివేదిక తెప్పించుకుంటున్నా.. ఆలోపే బ్రేక్ వేయాలనుకుంటుండడం గమనార్హం. నకిలీ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ దందాలో 8 మందిని పోలీసులు విచారించారు. అసలే పాఠశాల లేని, అది కూడా నర్సంపేట కేంద్రంగా నకిలీ సర్టిఫికెట్లు రూపొందించడంతో విస్మయం చెందారు. డాటా ఎంట్రీ ఆపరేటర్ ఈమెయిల్ ఇవ్వడంపై అనుమానాలు.. నకిలీ సర్టిఫికెట్ల దందాపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగం డైరెక్టరేట్ కార్యాలయం నుంచి విచారణ చేసి వెంటనే నివేదిక సమర్పించాలని వచ్చిన సంబంధిత విభాగాధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కారా నిబంధనల ప్రకారం దత్తత కోరుకునే దంపతుల దరఖాస్తు సమయంలో వారి ఈమెయిల్ ఐడీ ఇవ్వాలి. లేదంటే ఆఫీస్ మెయిల్ ఐడీ కూడా ఇవ్వొచ్చు. అయితే వీరు మాత్రం పాప రావడానికి ఎంత వరుసలో ఉన్నాం, ఇంకెంత మంది ముందున్నారు, పాప రెఫరల్ వచ్చే సమాచారం కోసం సదరు అధికారితోపాటు అప్పుడు ఈ విభాగంలో పనిచేసే ఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ వ్యక్తిగత ‘ఈ–మెయిల్స్’ ఇవ్వడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. కారా నుంచి వచ్చే సమాచారం తమ మెయిల్కు రాగానే మీకు పాప మరో వారం రోజల్లో వస్తుంది, మాకేం చేస్తారనే మాటమంతీ జరిగి ఉండొచ్చని విచారణ చేసిన పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. అలాగే, విచారణ జరుగుతుండగానే బాలరక్షా భవన్లో పనిచేస్తున్న నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అతడి పాత్రపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఎందుకంటే ఏడు నకిలీ సర్టిఫికెట్లు నర్సంపేట నుంచి రావడంతో పోలీసులకు మరిన్ని అనుమానాలు బలపడేలా చేసింది. గతంలోనే చైల్డ్ హెల్ప్లైన్లో నకిలీ అనుభవ సర్టిఫికెట్ ఇచ్చి అర్హత జాబితాలో ఎక్కడో మూలకు ఉన్నా కూడా అక్కడి అధికారుల అండదండలతో ఉద్యోగం పొందారన్న ఆరోపణలున్నాయి. త్వరలో కలెక్టర్కు నివేదిక.. దత్తత దందాపై జిల్లా రెవెన్యూ అధికారి నివేదిక మేరకు కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. ఈ నివేదిక ఒకట్రెండు రోజుల్లో కలెక్టర్ వద్దకు చేరుతుంది. అలాగే, బాలరక్షాభవన్లో చైల్డ్ హెల్ప్లైన్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగి రాజీనామా అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాకే తదుపరి నిర్ణయం ఉంటుంది. – రాజమణి, వరంగల్ జిల్లా సంక్షేమ విభాగాధికారి 8 మందిని విచారించిన వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అసలు లేని పాఠశాల నుంచి నకిలీ బర్త్ సర్టిఫికెట్లపై విస్మయం ఓవైపు విచారణ.. మరోవైపు ఓ ఉద్యోగి రాజీనామాతో అనుమానాలు -
ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్
వరంగల్ స్పోర్ట్స్: అంతర్జాతీయ ఒలింపిక్ డే ను పురస్కరించుకొని వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఆదివారం నిర్వహించిన రన్లో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రహం వద్ద అసోసియేషన్ జిల్లా చైర్మన్ జంగా రాఘవరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఒలింపిక్ టార్చ్తో కాళోజీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియానికి చేరుకున్నారు. ఈసందర్భంగా నిర్వహించిన ముగింపు స మావేశంలో జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలకు ఆస్తులకు బదులు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు క్రీడల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంచాలని, దురదృష్టవశాత్తు అత్యధిక శాతం పాఠశాలలు, కళాశాలలకు కనీస మైదానాలు లేకపోవడం శోచనీయమన్నారు. మైదానాలున్న విద్యాసంస్థలకు మాత్రమే అనుమతిస్తూ వ్యాయామ ఉపాధ్యాయులను తప్పనిసరి నియమించుకునేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, స్వతహాగా క్రీడాకారుడైన సీఎం నేతృత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా క్రీడలు, యువజన అధికారి గుగులోత్ అశోక్కుమార్, వరంగల్ ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అజీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, శ్యామల పవన్కుమార్, డాక్టర్ పి.రమేశ్రెడ్డి, తోట శ్యాంప్రసాద్, మహ్మద్ కరీం, రామప్ప అకాడమీ చైర్మన్ చంద్రమోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మేడం.. ఏదో ఒకటి తేల్చండి..!
సాక్షిప్రతినిధి, వరంగల్: మంత్రి కొండా సురేఖ దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల వివాదం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరా జన్ పేషీకి చేరింది. ఇటీవల మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీ వ్యాఖ్యలను.. వారి వ్యతిరేక వర్గం ప్రజాప్రతినిధులు మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి తదితరుల బృందం ఆదివారం హైదరాబాద్లో నటరాజన్ను కలిశారు. ‘మంత్రి కొండా సురేఖ దంపతుల వ్యాఖ్యలు పార్టీని, నాయకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. వారి వైఖరి, వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడి పోతున్నాం.. ఇక భరించలేం.. మేడం.. మీరు ఏదో ఒకటి తేల్చండి.. పార్టీ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకోండి’ అని లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా కామెంట్లు చేయడం, సీనియర్లని చూడకుండా పరుషపదజాలాన్ని వాడటం పార్టీ ఇమేజ్ను దిగజార్చేలా ఉందని వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన మీనాక్షి నటరాజన్.. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటామని, అన్ని కోణాల్లో పార్టీ పరంగా విచారించేందుకు త్వరలోనే కమిటీ వేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పినట్లు సమాచారం. అక్కడి నుంచి వరంగల్ కాంగ్రెస్ నాయకులు పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవిని కలిసి కొండా దంపతులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత ఐదారు రోజులుగా వరంగల్లో జరుగుతున్న కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, కొండా దంపతుల వ్యాఖ్యలు, వైఖరిని ఆయనకు వివరించినట్లు తెలిసింది. సానుకూలంగా స్పందించిన మల్లు రవి పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగినట్లు సమాచారం. కాగా కొండా దంపతులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఇద్దరు లేదా ఐదుగురు సీనియర్లతో నేడో, రేపో కమిటీ వేసి విచారణ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఇద్దరి వ్యాఖ్యలతో ప్రజల్లో పలుచబడుతున్నాం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ వ్యతిరేక ప్రజాప్రతినిధులు హైదరాబాద్లో మీనాక్షి, మల్లు రవిని కలిసిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కమిటీ వేసి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ.. నేడో, రేపో అధికారిక ప్రకటన.. -
సోమవారం శ్రీ 23 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ)లో ఇంజనీరింగ్ విభా గం కొందరు అధికారులు, కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారింది. సాధారణంగా ప్రభుత్వ ఖజానాకు మేలు జరిగేలా పోటీ పద్ధతిన తక్కువ కోట్ చేసి టెండర్లు వేసేలా చూడాల్సిన అధికారులు, కాంట్రాక్టర్లను సిండికేట్ చేసి ఎక్సెస్ కోట్ చేసి టెండర్లు వేయిస్తున్నారు. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ చక్రం తిప్పుతూ తమకు అనుకూలమైన వారికి పనులు దక్కేలా చూస్తున్నారు. సిండికేట్గా మారిన కాంట్రాక్టర్లు పనులు పంచుకుని ప్లాన్ ప్రకారం టెండర్లు వేస్తుండగా.. కీలక ప్రజాప్రతినిధి, కొందరు కార్పొరేటర్ల సిఫారసుల మేరకు ఆ పనులు దక్కేలా అధికారులు పావులు కదుపుతున్నారు. తప్పిదారి ఇతరులెవరైనా టెండర్లు వేస్తే.. టెండర్లు తెరిచింది మొదలు అగ్రిమెంట్ వరకు చుక్కలు చూపిస్తూ తప్పుకునేలా చేస్తున్నారు. ఇదే పద్ధతిన ఆరు నెలల్లో సుమారు రూ.210 కోట్లకు పైగా విలువ చేసే పనుల టెండర్ల ఖరారు జరిగిందని ఇటీవల విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లడం చర్చనీయాంశం అవుతోంది. పనుల వివరాలపై అంతా గోప్యం.. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద అభివృద్ధి పనులకు ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో సుమారు రూ.210 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఖరారైనట్లు బల్దియాకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సుమారు రూ.68 కోట్ల విలువైన 75 పనులకు టెండర్లు పిలిచారు. ఏప్రిల్ 5 నుంచి 12 వరకు రూ.28 కోట్లతో 32 పనులకు టెండర్లు జరిగాయి. మే 27 నుంచి ఈనెల 11 వరకు సుమారు రూ.12.15 కోట్ల విలువైన 12 పనులకు బల్దియా ఇంజనీరింగ్ విభాగం టెండర్లు నిర్వహించింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లే అయినప్పటికీ కమీషన్లకు కక్కుర్తిపడి కొందరు అధికారులు కాంట్రాక్టర్లకు సాంకేతికంగా సహకరిస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. కాగా ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్ ఖరారు, పనులు పొందిన కాంట్రాక్టర్, తిరస్కరణకు గురైన కాంట్రాక్టర్ల వివరాలు, పనుల నిర్వహణ, బిల్లుల చెల్లింపులకు సంబంధించిన సమాచారం విషయంలో గోప్యతను పాటించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇవే అంశాలను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. న్యూస్రీల్ప్రతీ పనికి ఓ రేటు.. భారీగా కమీషన్కొందరు ఇంజనీర్లు ప్రతీ పనికి ఓ రేటును నిర్ణయిస్తుండగా.. ఆ మేరకు కొందరు కాంట్రాక్టర్లు చెల్లించి ఏ పనులైనా టెండర్ల ద్వారా దక్కించుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. ఇది రెండు రకాలుగా సాగుతుండగా.. మిగిలిన కాంట్రాక్టర్లందరినీ పక్కనపెట్టి మంచి ధరకు కాంట్రాక్టును అప్పగిస్తే సదరు ఇంజనీర్కు 10–20 శాతం, అందరితో పోటీపడి టెండరు దక్కించుకుంటే వేర్వేరు స్థాయిల్లోని ఇంజనీర్లు, ఆడిట్ అధికారులకు వేర్వేరు శాతాల్లో కమీషన్లు ముట్టజెప్పుతున్నారట. సహాయ ఇంజనీరుకు 3–4, డిప్యూటీ ఈఈకి 2–3, ఈఈకి 1–3, హెచ్డీకి 0.5, డీఓ(డ్రాఫ్టింగ్ ఆఫీసర్) 0.5, ఆడిట్లో 2, చెక్ సెక్షన్లో 2–4, ఎగ్జామినర్కు 1–2 శాతం కమీషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. వీరంతా కలిసి కొంత మొత్తాన్ని ప్రతినెలా ఉన్నతాధికారులకు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని అంటున్నారు. కాగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో వివిధ విభాగాల్లో కొందరు ఏళ్ల తరబడిగా తిష్టవేసి అక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న తీరుపై ఇదివరకే ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. ఏది ఏమైనా ఉన్నతాధికారులు ఏ మేరకు స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు..! ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలో ‘సిండికేట్’ అభివృద్ధి పనులకు రాజకీయ రంగు అనుకున్నోళ్లకే పనులు వచ్చేలా సిఫారసులు జీడబ్ల్యూఎంసీ వ్యవహారంపై ‘విజిలెన్స్’కు ఫిర్యాదులు -
ఆలస్యమే!
ఈసారీ..గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సకాలంలో ఏఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకు టెండర్లకు సంబంధించి ప్రభుత్వం, మత్స్యశాఖ ఊసెత్తకపోవడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రభుత్వం అసలు ఈ పథకాన్ని కొనసాగిస్తుందా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిద్ధంకాని మత్స్యశాఖ.. జూన్ నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు చేపపిల్లల పంపిణీ టెండర్లకు మత్స్యశాఖ సిద్ధం కాలేదని తెలుస్తోంది. దీంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతీ ఏడాది ఆలస్యంగా టెండర్లను పిలవడంతో ప్రయోజనం ఉండదని అంటున్నారు. టెండర్ల విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి (డీఎఫ్ఓ) నాగమణిని శ్రీసాక్షిశ్రీ వివరణ కోరగా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. సరైన సమయంలో వదిలితేనే ఎదుగుదల.. ఆలస్యంగా ఉచిత చేపపిల్లలు పంపిణీ చేయడంతో తగిన లబ్ధి చేకూరడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు. చెరువుల్లో సరైన సమయానికి చేపపిల్లలు వదలకపోవడంతో చేపల్లో ఎదుగుదల లేక ధర రావడం లేదని అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు ఎదగాలంటే చేపపిల్లలను ఆగస్టులోపు చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో పెరిగి చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకే మార్కెట్లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. కానీ, గతంలో చాలా ఆలస్యంగా చేపపిల్లను పంపిణీ చేయడంతో సరిగా ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దగా లాభం జరగలేదు. గత ఏడాది సగం చేపపిల్లలే పంపిణీ గత వర్షాకాలం జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపప్లిలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, అందులో సగమే ఆలస్యంగా పంపిణీ చేశారని మత్య్ససంఘాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే, చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని మత్స్యసంఘాల వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు. సొంతంగా కొనుగోలు చేసేందుకు మొగ్గు చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యం అవుతుండడంతో పలు మత్స్యసంఘాల వారు నీరు చేరిన జలాశయాల్లో సొంత ఖర్చుతో చేపపిల్లలను కొనుగోలు చేసి పోస్తున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పెద్ద సైజు (ఫింగర్ లింగ్స్) చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదలడానికి మత్స్యకారులు సిద్ధం అవుతున్నారు. నగదు బదిలీ చేయాలి..టెండర్లు పిలవడం, చేపపిల్లల పంపిణీ ప్రతి ఏడాది ఆలస్యం అవుతోంది. దీనికి బదులు ప్రతీ మత్స్య సంఘాలకు చేపపిల్లలకు బదులుగా నగదు బదిలీ చేస్తే నాణ్యమైన చేపపిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో పోసుకుంటాం. దీని వల్ల చేపల దిగుబడి కూడా అధికంగా పెరుగుతుంది. ఈ విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి. – కొత్తగట్టు కోటేశ్వర్, ఊకల్ మత్స్యసంఘం అధ్యక్షుడుజిల్లాలో మొత్తం చెరువులు: 702మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం: 12,910 హెక్టార్లు చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలు : 1.90 కోట్లు మత్స్య సంఘాలు : 184మత్స్య సంఘాల్లోని సభ్యులు: 15,741 మందిజిల్లా సమాచారం.. -
భద్రకాళి అమ్మవారికి రూ.కోటితో రథం
హన్మకొండ కల్చరల్ : కంచి కామాక్షి అమ్మవారి రథం మాదిరిగా శ్రీభద్రకాళి అమ్మవారికి రూ.కోటి వ్యయంతో రథం తయారు చేయించడానికి ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఈనెల 26 నుంచి ప్రారంభమయ్యే శాకంబరీ ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం దేవాలయ కార్యాలయంలో వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ధర్మకర్తలు, ఆలయ ప్రధానార్చకులు శేషు పాల్గొన్నారు. అమ్మవారి గుడి చుట్టూ మాడవీధుల నిర్మాణం జరుగుతున్నందున ఇకపై అమ్మవారికి నిర్వహించే వాహన, రథసేవలు మాడవీధుల గుండానే చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఆగమశాస్త్రం ప్రకారం టేకు కర్రతో రథం తయారు చేయించడానికి మండలి తీర్మానించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతికి కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డిని ధర్మకర్తల మండలి సభ్యులు కోరారు. నిత్యం ఉదయం, సాయంత్రం, రాత్రి మహాపూజ అనంతరం భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేయాలని, ఇందుకు శాశ్వత నిధిని బ్యాంకులో ఏర్పాటు చేయడానికి దాతలు విరాళం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అర్చకులు భద్రకాళి శేషు, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోతుకూరి మయూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల అంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు, పార్నంది నరసింహమూర్తి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి తీర్మానం 26 నుంచి శాకంబరీ ఉత్సవాలపై సమావేశం -
కాంగ్రెస్లో పొలిటికల్ వార్.. కొండా సురేఖపై చర్యలు తప్పవా?
సాక్షి, వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజ్కు చేరుకుంది. జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు.. మంత్రి కొండా సురేఖ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు నేతలందరూ కూటమి కట్టారు. ఇక, తాజాగా హస్తం నేతల పంచాయతీ తాజాగా కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ వద్దకు చేరుకుంది.వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్వార్టర్స్లో మీనాక్షీ నటరాజన్ భేటీ అయ్యారు. కడియం శ్రీహరి, కార్పొరేషన్ చైర్మన్, ఎర్రబెల్లి స్వర్ణ తదితర నేతలు మీనాక్షి నటరాజన్తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో చర్చలో ఏం చేస్తారు.. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే, ఇప్పటికే వరంగల్ పంచాయతీపై పీసీసీ చీఫ్కు సీనియర్ల నివేదిక అందింది. సీనియర్ల నివేదిక ఆధారంగా మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకోనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.కొండా మురళి వ్యాఖ్యల ఎఫెక్ట్.. అయితే, ఇన్ని రోజులు మంత్రి కొండా సురేఖ జిల్లాలో నేతలను కలుపుకుని పోవడం లేదన్న అసంతృప్తి ఉంది. ఇదే సమయంలో తాజాగా మంత్రి భర్త కొండా మురళి చేసిన తాజా వ్యాఖ్యలు అగ్గికి మరింత ఆజ్యం పోశాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఒకరిద్దరు నేతల్ని ఉద్దేశించి మురళి కామెంట్స్ చేశారు. పార్టీ మారినప్పుడు పదవులకు రాజీనామాలు చేసి రావాలంటూ.. మురళి అన్న ఆ మాటలే ఎమ్మెల్యేలందర్నీ ఏకం చేసినట్టు చెప్పుకుంటున్నారు. అప్పటిదాకా.. ఎవరి దారి వారిదే అన్నట్టున్నగా ఉన్న శాసనసభ్యులు.. కొండా మురళి వ్యాఖ్యలతో ఒక్క తాటి మీదికి వచ్చినట్టు సమాచారం.కొండా మురళి వ్యాఖ్యలతో.. కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి అంతా ఇప్పుడు ఏకమైనట్టు తెలిసింది. కొండా ఫ్యామిలీకి రేవూరి ప్రకాష్రెడ్డితో కూడా కయ్యం మొదలైంది. ఇప్పుడు వరంగల్ సిటీలోని ఎమ్మెల్యేలతో పాటు.. కడియం శ్రీహరి లాంటి వాళ్ళంతా కలిసి కొండా దంపతులపై సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో వీరంతా.. ఢిల్లీ వెళ్ళి అధిష్టానం పెద్దలకు మంత్రి మీద ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. -
పథకాలు పటిష్టంగా అమలు చేయాలి
హన్మకొండ అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని దిశ కమిటీ చైర్పర్సన్, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు రైతులకు అందేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని, క్యాన్సర్ స్క్రీనింగ్, పీఎంఆర్ఎఫ్ ప్రయోజనాల అమలుపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. ‘బేటీ బచావో బేటీ పడావో’పై మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, బాల్యవివాహాలు నివారించేలా గ్రామాల్ని తీర్చిదిద్దాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సూచించారు. ఐసీడీఎస్ ద్వారా బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు. దిశ కమిటీ సమావేశానికి సంబంధించి వచ్చే విడతలో రైల్వే, దేవాదాయ, పర్యాటక, యూనివర్సిటీ అధికారులు కూడా పాల్గొనాలని ఎంపీ సూచించారు. అన్ని శాఖలు తమ తమ పథకాల అమలు వివరాలతో హాజరుకావాలన్నారు. అనంతరం స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని, పల్లె, బస్తీ దవాఖానల నిర్మాణంలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయం చూడాలన్నారు. శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ మాట్లాడుతూ.. అంగన్వాడీ, వైద్యారోగ్యశాఖ సమన్వయంతో మంచి ఫలితాలు సాధించాలని, ఆశ వర్కర్ల ఖాళీల భర్తీకి జిల్లా స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ గ్రేటర్ అభివృద్ధి వివరాలు వెల్లడించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమగ్ర సమాచారంతో ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కమిటీ సభ్యులు బండ రామలీల, డీఆర్డీఓ పీడీ శ్రీను, డీఎంహెచ్ఓ అప్పయ్య ఇతర శాఖల అధిపతులు పాల్గొన్నారు. జిల్లాను అగ్రభాగంలో నిలపాలి ‘దిశ’ సమావేశంలో ఎంపీ కడియం కావ్య -
డయేరియా మరణాలను అరికట్టాలి
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: డయేరియా మరణాలను అరికట్టాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ఫోర్స్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డయేరియా నివారణకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉన్నందున గ్రామాల్లో క్లోరినేషన్ చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, కొంరయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్కుమార్, ఎంహెచ్ఓ రాజేశ్, వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ సుధీర్, డీడబ్ల్యూఓ రాజమణి, సుజన్తేజ, భవాని, అనిల్కుమార్ పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ముందస్తుగా వరి నార్లు పోసుకునేందుకు రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ, వ్యవసాయ శాఖ అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరి, పత్తి కొనుగోళ్లలో ఈ టోకెన్ సిస్టం అమలుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పత్తి, మిరప పంటల దిగుబడి, మార్కెటింగ్లో నాణ్యత పెంచేందుకు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. -
ఉద్రిక్తత.. ఉత్కంఠ
హనుమకొండలో శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉద్రిక్తత, ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని హనుమకొండ సుబేదారి పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి తరువాత శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసి నేరుగా వరంగల్కు తీసుకొచ్చారు. మాజీ ప్రజాప్రతినిధులు, విద్యార్థి నాయకుల ఆందోళన, పరామర్శలతో సుబేదారి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాత్రి ఆయనకు బెయిల్రావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. – వరంగల్ క్రైం/కాజీపేట రూరల్ ఉదయం నుంచి రాత్రివరకు సాగిన ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఎపిసోడ్ శంషాబాద్లో అరెస్ట్ చేసి హనుమకొండ సుబేదారి పోలీస్స్టేషన్కు.. బీఆర్ఎస్, విద్యార్థి నేతల ఆందోళన.. సీఎం దిష్టిబొమ్మ దహనం బెయిల్ రావడంతో కార్యకర్తల ఆనందోత్సాహం – 8లోu -
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025
ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. ఆక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెట్టే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
వాగ్దానాలు నెరవేర్చాలి..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖిలా వరంగల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి.. నిరుపేదలకు డబుల్బెడ్రూం ఇళ్లు కట్టించి ఇవ్వకుంటే సర్కారు మెడలు వంచుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివా రం వరంగల్ ఉర్సుగుట్ట వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధంపై మాట్లాడుతూ.. అమెరికా అండతో ఇజ్రాయిల్ పాలస్తీనాను దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్నదని అన్నారు. ఈ చర్య ను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నద ని చెప్పారు. సమావేశంలో నాయకులు జి.నాగయ్య, బాబు, రత్నమాల, ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కుమారస్వామి, సాంబయ్య, శ్రీధర్, మధుకర్, ప్రశాంత్, వలదాసు దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ తనిఖీ వరంగల్ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని క్వాలిటీ కంట్రో ల్ ల్యాబ్ను గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అనంతరం 31వ డివిజన్ గాయత్రి కాలనీలో నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు. వరంగల్ కాశిబుగ్గ సర్కిల్ను తనిఖీ చేశారు. ఆయా విభాగాల ఫైళ్లను పరిశీలించి, ఉద్యోగులు, అధికారుల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నా రు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. -
కారు ఢీకొని రైతు మృతి
గీసుకొండ : మోపెడ్పై పొలం వద్దకు వెళ్తున్న రైతును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని దస్రు తండాకు చెందిన రైతు ఆంగోత్ దస్రు (60) శనివారం మధ్యాహ్నం తన మోపెడ్ (వాహనం)పై వెళ్తున్నాడు. వరంగల్–నర్సంపేట రహదారిపై మూల ములుపు తిరిగే క్రమంలో వెనక నుంచి (వరంగల్ వైపు) అతివేగంగా వచ్చిన కారు దస్రు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో అతడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే వేగంతో కారు మోపెడ్ను ముందుకు తోసుకుంటూ వంద మీటర్ల దూరం వరకు వెళ్లగా మంటలు చెలరేగి మోపెడ్ దగ్ధమైంది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని గీసుకొండ ఎస్సైలు కుమార్, ప్రశాంత్ సందర్శించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు. -
ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలి
హన్మకొండ కల్చరల్: ఆలయ వ్యవహారాలు ధర్మబద్ధంగా నిర్వహించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సూచించారు. వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఈఓ శేషుభారతి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పాల్గొన్నారు. వ్యవస్థాపక ధర్మకర్త డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం మండలి చైర్మన్గా, తొనుపునూరి వీరన్న, గదె శ్రవణ్కుమార్రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీశ్, మోత్కూరి మ యూరి, గండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్రావు సభ్యులుగా, దేవాలయ ముఖ్చ అర్చకుడు పార్నంది నరసింహమూర్తి ఎక్స్–అఫీషియో సభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం ఎమ్మెల్యే వారిని సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు భద్రకాళి శేషు, పరిశీలకులు అద్దంకి విజయ్కుమార్, మట్వాడ సీఐ గోపి, సిబ్బంది, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025ఏటూరునాగారం అభయారణ్యంలోని కొండేటివాగుమేడారం–తాడ్వాయి మధ్యలో ఇటీవల కనిపించిన అడవి దున్న (ఫైల్) ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి అభయారణ్యాన్ని పర్యాటకులు చుట్టి వచ్చేందుకు అటవీశాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్ లైఫ్ శాఖ ఆధ్వర్యంలో జంగిల్ సఫారీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. పర్యాటకులు సఫారీలో అడవులను వీక్షించేందుకు సైతం రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. త్వరలోనే జంగిల్ సఫారీ పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. 17 కిలోమీటర్లు దారి.. అడవులను జంగిల్ సఫారీ ద్వారా సందర్శించేందుకు ఎస్ఎస్తాడ్వాయి హట్స్ సమీపం నుంచి కాటాపూర్ బీటీ రోడ్డు నుంచి అడవిలో 17 కిలోమీటర్ల వరకు దారి ఏర్పాటు చేశారు. దారి మధ్యలో సిమెంట్ కాజ్వేలు కూడా నిర్మించారు. అడవిలో పెద్దగుట్ట వరకు దారి ఏర్పాటు చేశారు. ఈదారి మార్గాన జంగిల్ సఫారీలో పర్యాటకులు పెద్దగుట్ట చుట్టి వచ్చేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రకృతిని ఆస్వాదించేలా.. హైదరాబాద్ పట్టణ ప్రాంతాల నుంచి బొగత, లక్నవరం, రామప్ప పర్యాటక ప్రాంతాల సందర్శనకు వచ్చే పర్యాటకులు దట్టమైన అడవుల్లోని ప్రకృతికి ఫిదా అవుతారు. గతంలో ఎస్ఎస్ తాడ్వాయి హట్స్లో బస చేసిన పర్యాటకులు ట్రెక్కింగ్, జంగిల్ సఫారీ ద్వారా అడవులను చుట్టుముట్టి వచ్చేవారు. సుమారు ఐదేళ్ల క్రితం జంగిల్ సఫారీ మూలనపడింది. దీంతో అప్పటినుంచి పర్యాటకులు ఎస్ఎస్ తాడ్వాయిలోని అడవుల సందర్శన నిలిచిపోయింది. పెరుగుతున్న పర్యాటకుల తాకిడి రోజురోజుకూ పలు ప్రాంతాల నుంచి పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటకుల తాకిడి పెరుగుతుండడంతో అటవీశాఖ అధికారులు మళ్లీ జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అడవి మార్గాల్లో రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు. రోడ్ల నిర్మాణ పనులు కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. త్వరలోనే జంగిల్ సఫారీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. తాడ్వాయి మండల పరిధిలోని దామెరవాయి అటవీ ప్రాంతంలోని ఆదిమానవుల సమాధులను పర్యాటకులు, యూనివర్సిటీ విద్యార్థులు సందర్శిస్తున్నారు. అడవుల సందర్శనతో పాటు సమాధులను వీక్షించేందుకు జంగిల్ సఫారీ వాహనం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానికులు, పర్యాటకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వా యి నుంచి మేడారం మీదుగా ఊరట్టం ఏటూరునాగారం మండలంలోని కొండాయి వెళ్లే దారిలో మూడు కిలోమీటర్ల దూరంలో కొండేటి వాగు వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పాయింట్ వరకు జంగిల్ సఫారీ ఏర్పాటు చేస్తే మేడారానికి వచ్చే భక్తులతో పర్యాటకుల సంఖ్య పెరగనుంది.రెండు నెలల్లో అందుబాటులోకి.. ఎస్ఎస్తాడ్వాయిలోని జంగిల్ సఫారీ 60 రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం. తాడ్వాయి హట్స్ నుంచి 17 కిలోమీటర్లు పెద్దగుట్ట వరకు రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా అన్ని హంగులతో అడవులను సందర్శించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి. – రమేశ్, ఎఫ్డీఓ, ఏటూరునాగారంజంగిల్ సఫారీ కోసం అడవిలో వేసిన రోడ్డున్యూస్రీల్తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో త్వరలో ‘జంగిల్ సఫారీ’ అడవుల్లో 17కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణంబోన్ల నడుమ జంతువుల్ని.. డెన్ మధ్యన పులిని.. గూళ్లలో పిచ్చుకల్ని.. నిలువ నీటి తొట్లలో తాంబేళ్లను.. అక్వేరియంలో చేపల్ని జూ పార్క్లో చూసి మురిసిపోతాం. అలాంటిది.. దట్టమైన అడవిలో పచ్చందాల నడుమ సఫారీలో ప్రయాణిస్తూ.. వేటాడే పులిని.. చెవులకింపైన పక్షుల కిలకిలారావాల్ని.. చెంగుచెంగున పరుగెత్తే లేడికూనల్ని చూస్తూ సెల్ఫోన్లలో బంధిస్తూ పర్యాటకులు మైమరచిపోయేలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకానికి మరింత శోభ తెచ్చేలా ఎస్ఎస్ తాడ్వాయి వైల్డ్లైఫ్ అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాడ్వాయి, ఏటూరునాగారం అభయారణ్యంలో హాయిగా విహరించేందుకు సాగుతున్న ‘జంగిల్ సఫారీ’ ఏర్పాట్లపై ఈవారం ‘సాక్షి’ ప్రత్యేకం. –ఎస్ఎస్తాడ్వాయి ఏర్పాట్లు చేస్తున్న అటవీశాఖ అధికారులు ఉమ్మడి జిల్లా పర్యాటకానికి మరింత శోభ -
ఆధునిక ప్రపంచానికి యోగా ఓ వరం
ఖిలా వరంగల్: ఆధునిక ప్రపంచానికి అందించిన మహాద్భుతమే యోగా అని, చారిత్రాత్మక ప్రదేశంలో యోగా చేయడం సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తుందని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఖిలా వరంగల్ మధ్యకోటలోని నాలుగు కీర్తితోరణాల మధ్య శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్, పురా వస్తుశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా హాజరైన కలెక్టర్ సత్యశారద, పద్మశ్రీ అవార్డు గ్రహీత సో మ్లానాయక్ జ్యోతి ప్రజ్వాలన చేసి యోగా ప్రారంభించారు. ఈసందర్భంగా 1,000 మంది సాధకులు, అధికారులతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ తనువు, మనస్సు ఆత్మను ఏకం చేసే సా ధనమే యోగా అన్నారు. కార్యక్రమంలో కా ర్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, పోశాల పద్మ, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆయుష్ డిప్యూటీ డైరెక్టర్ అనసూయ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ మైదం రాజు, డీపీఆర్ఓ అయూబ్ అలీ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, సీపీఓ గోవిందరాజన్, డీబీసీడీఓ పుష్పలత, తహసీల్దార్లు బండి నాగేశ్వర్రావు, ఫణికుమార్, యోగా గురువు అమృతవల్లి, నోడల్ ఆఫీసర్ రాజేందర్, పురావస్తుశాఖ అధికారి కృష్ణారెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద – మరిన్ని ఫొటోలు 9లోu -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
పర్వతగిరి: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ బి.వెంకటచంద్రప్రసన్న సూచించారు. ఈ మేరకు మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో ప్రిన్సిపాల్ పి.అపర్ణ ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిచి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 (ఏ) ప్రకారం ఉచిత న్యాయ సలహాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. పోక్సో చట్టం గురించి అవగాహన కల్పించారు. సదస్సులో చీఫ్ లీగల్ అడ్వైజర్ సురేశ్, పర్వతగిరి సీఐ బి.రాజగోపాల్, ఎస్సై ప్రవీణ్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వనమహోత్సవానికి మొక్కలను సిద్ధం చేయాలినెక్కొండ: వర్షాలు కురవగానే చేపట్టనున్న 11వ విడత వనమహోత్సవానికి అవసరమైన మొక్కలను సిద్ధం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి కల్పన ఆదేశించారు. నెక్కొండ, పనికర గ్రామాలను శనివారం ఆమె సందర్శించారు. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం నెక్కొండ గ్రామపంచాయతీ రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సూచించారు. ఆమె వెంట ఎంపీఓ దయాకర్, పంచాయతీ కార్యదర్శులు సదానందం, నరేశ్ ఉన్నారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలినర్సంపేట: ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. నర్సంపేట పట్టణం అంగడి బజారులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్ను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కలెక్టర్ సత్యశారద ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు రకాల తిను బండారాలను రుచి చూశారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ ఉమారాణి, నాయకులు పాల్గొన్నారు. కుంటలో పశువులకాపరి గల్లంతుసంగెం: ప్రమాదవశాత్తు కుంటలో పడి పశువులకాపరి గల్లంతైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం రామారం గ్రామానికి చెందిన కొంగరి వెంకటయ్య (70) ఇరవై ఏళ్ల క్రితం మండలంలోని ఆశాలపల్లి గ్రామానికి వచ్చి పశువులను కాస్తున్నాడు. భార్య మల్లమ్మతో కలిసి ముగ్గురు కూతుళ్లు నాగలక్ష్మి, రేణుక, రజితను పెంచి పెళ్లి చేశాడు. గ్రామానికి చెందిన బొల్లబోయిన స్వామి గేదెలను మేపడానికి వెళ్లిన వెంకటయ్య గ్రామానికి చెందిన నల్లకుంటలో ప్రమాదవశాత్తుపడి గల్లంతయ్యాడు. కాగా, మొరం అక్రమ తవ్వకాలతో కుంటలో సుమారు 30 అడుగుల మేర గుంతలు ఏర్పడి నీటితో నిండాయి. జాలర్లు వలలతో ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. రెండు ట్రాక్టర్ మోటార్ల ద్వారా నీటిని తోడుతూ వెంకటయ్య ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. రైతుల ఖాతాల్లో రూ.153.47 కోట్లు జమఖిలా వరంగల్: రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు భరోసా నిధులు జమచేస్తోందని కలెక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటివరకు 1,52,975 మంది రైతులకు రూ.153.47 కోట్ల పెట్టుబడి సాయం అందించిందని ఆమె తెలిపారు.