breaking news
Warangal
-
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు హనుమకొండ కలెక్టరేట్లో.. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు వరంగల్ కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామన్నపేట: కరీంనగర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఈనెల 27, 28 తేదీల్లో జరిగిన తెలంగాణ మాస్టర్స్ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ నగరానికి చెందిన బలభక్తుల శ్రీహరి మూడు విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాశ్వత ప్రెసిడెంట్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రభు కుమార్గౌడ్, ట్రెజరర్ లక్ష్మి, కరీంనగర్ జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ లక్ష్మణ్ తదితరులు శ్రీహరిని ప్రత్యేకంగా అభినందించారు. బలభక్తుల శ్రీహరి ప్రస్తుతం బాలసముద్రంలోని ఎల్ఐసీ డివిజనల్ ఆఫీస్లో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎల్ఐసీ జోనల్, ఆలిండియా పోటీలలో కూడా శ్రీహరి అనేక పతకాలు సాధించారు. రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో హైదరాబాద్ భగవాన్ మహావీర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ ఆదివారం ముగిసిందని ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల్లో (శని, ఆదివారం) శిబిరం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 200 మందికి పైగా దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
మిమిక్రీ కళను చాటిన నేరెళ్ల
హన్మకొండ కల్చరల్: మిమిక్రీ అనే ఒక కళ ఉందని చాటి చెప్పిన మహానుభావుడు నేరెళ్ల వేణుమాధవ్ అని సినీ, మిమిక్రీ కళాకారుడు ఫన్స్టార్ శివారెడ్డి అన్నారు. వేణుమాధవ్ రాసిన మిమిక్రీ కళ వ్యాకరణం పుస్తకంతో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, నేరెళ్ల వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధ్వన్యనుకరణ పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతిని ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించారు. వేణుమాధవ్ కళాప్రాంగణంలో స్మారక ప్రతిభా పురస్కార ప్రదానం, మిమిక్రీ కళాకారుల స్వరార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. వేణుమాధవ్ కల్చరల్ ట్రస్ట్ కార్యదర్శి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి, కవి, గాయకుడు వరంగల్ శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీనటుడు రాకింగ్ రాకేశ్, నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ నిర్వాహకురాలు నేరెళ్ల శోభావతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరంగల్కు చెందిన కవి, కథారచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళిని శాలువా, జ్ఞాపికతో సన్మానించి పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారాన్ని అందజేశారు. అనంతరం అంపశయ్య నవీన్ మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ ప్రతిభా పురస్కారం ప్రతిష్టాత్మకమైందని పేర్కొన్నారు. వేణుమాధవ్ శిష్యుల మిమిక్రీ ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో కవి పొట్లపల్లి శ్రీనివాసరావు, నేరెళ్ల శ్రీనాఽథ్, నేరెళ్ల రాధాకృష్ణ, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.సినీ, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి -
రైతులకు చేరువైన సాంకేతికత, పథకాలు
రైతులు సాంకేతికతను, మార్కెట్ పోకడలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వం పలు పథకాలను అందుబాటులోకి తెచ్చింది. నేల ఆరోగ్యం, సమీకృత వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, సేంద్రియ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ వంటి పథకాల ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వరంగల్ రీజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ (ఆర్ఎఆర్ఎస్) కొత్త వరి వంగడాలను (ఉదాహరణకు, వరంగల్–1119 వంటివి) విడుదల చేసింది. ఇవి స్థానిక వాతావరణానికి అనుకూలంగా ఉండి, అధిక దిగుబడినిచ్చే సన్న, దొడ్డు గింజ రకాలను రైతులకు అందుబాటులో ఉంచారు. హార్టికల్చర్ ద్వారా హైబ్రిడ్ కూరగాయల విత్తన సబ్సిడీలు, పర్మనెంట్ పాండల్స్, మల్చింగ్ వంటి ప్రోత్సాహకాలు ఇచ్చారు. -
ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివి
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఫార్మసీ పూర్వ అధ్యాపకుల సేవలు మరువలేనివని వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి కొనియాడారు. నాడు నిధుల లేమి ఉన్నప్పటికీ ఉన్న వనరులను వినియోగించుకొని పరిశోధనలు జరిగాయని పేర్కొన్నారు. నాటి విద్యార్థులు దేశవిదేశాల్లోని ఫార్మసీ రంగంలో స్థిరపడి యూనివర్సిటీ కీర్తి ప్రతిష్టను పెంచారని పేర్కొన్నారు. హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించిన యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ కూడా గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలోకి అడుగిడిందని పేర్కొన్నారు. ప్రముఖ ఫార్మసీ సంస్థ అరబిందో లిమిటెడ్ ఫార్మసీ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఇంటర్న్షిప్లు, ఇండస్ట్రియల్ విజిట్కు అవకాశం ఇచ్చినందుకు అభినందనలు తెలిపారు. ఫార్మసీ పూర్వ విద్యార్థులు నాలుగు ఎండో మెంట్లెక్చర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారని పేర్కొన్నారు. పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్ట్ ఉండాలి.. కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల తమకు జీవితాన్ని నేర్పిందని, అభ్యాసనలో క్రమశిక్షణ అవసరమని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థి, అమెరికా సంయుక్త రాష్ట్రాల ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూటీ డైరెక్టర్ రమణకుమారి అన్నారు. రోగి దృక్పథంతో ఆలోచించాలని, పబ్లిక్ హెల్త్ కేంద్రంగా ఫార్మసిస్టు ఉండాలని, డ్రగ్ తయారీలో క్రిటికల్గా అంచనా వేయాలని సూచించారు. మెడికేషన్లో నూతన పోకడలు మెడికేషన్లో నూతన పోకడలు వచ్చాయని, డ్రగ్ లోపాలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అమెరికాలోని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీలో పార్మసీ డీన్ డాక్టర్ మన్సూర్ఖాన్ అన్నారు. గొప్ప డ్రగ్స్ యూనివర్సిటీ ల్యాబ్ల్లో తయారైనవేనని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఇండస్ట్రీ కొలాబరేషన్ విశ్వవిద్యాలయ అభివృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కన్వీనర్, ప్రవాస భారతీయుడు డాక్టర్ సాంబారెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి ఫార్మసీకి ఉందన్నారు. పూర్వవిద్యార్థులు తోట రాజు, జె.రాజమౌళి మాట్లాడుతూ సమాజహితంగా సైన్స్ ఉండాలని, మార్కెటింగ్పై పట్టుపెంచుకుని ఉత్పాదనపై దృష్టి సారించాలన్నారు. విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ సునీతారెడ్డి, కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, డీన్ గాదె సమ్మయ్య, ఆచార్యులు వై.నర్సింహారెడ్డి, వి.కిషన్, వి.మల్లారెడ్డి, స్వరూపారాణి, నాగరాజు, షాయోదా, పూర్వ విద్యార్థులు డాక్టర్ సూర్యకుమార్, చక్రవర్తి, హరీశ్చంద్ర పాల్గొన్నారు. కేయూను సందర్శించిన పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగిసిన అనంతరం ఆదివారం సాయంత్రం కేయూను ఫార్మసీ పూర్వవిద్యార్థులు సందర్శించారు. వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు. కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి ముగిసిన ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు -
చట్టసభల్లో ప్రస్తావించాలి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్)లో యువతకు ఉద్యోగాలివ్వాలని శని, ఆదివారం ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినట్లు రైల్వే జేఏసీ కన్వీనర్ దేవుళ్లపల్లి రాఘవేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు తెలిపారు. ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు కేఆర్ నాగరాజు, నాయిని రాజేందర్రెడ్డి, దొంతి మాధవరెడ్డిని కలిసి ఉమ్మడి జిల్లాకు 65 శాతం ఉద్యోగావకాశాలు కల్పించాలని, రైల్వే యాక్ట్ అప్రెంటీస్ పూర్తి చేసిన పిల్లలకు, తెలంగాణ నిరుద్యోగులకు 35 శాతం ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఉద్యోగాల కల్పనపై శనివారం రాజకీయ పార్టీలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ అంశాలను ప్రస్తావించాలని కోరారు. ముఖ్యమంత్రితో రైల్వే మంత్రికి ఉత్తరం రాయించేలా ఎమ్మెల్యేలు తోడ్పడాలని కోరారు. వినతి పత్రాలు ఇచ్చిన వారిలో కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలి, జలగం రంజిత్రావు, సంపత్రెడ్డి, సీపీఎం జిల్లా నాయకులు ఎం.చుక్కయ్య, సీపీఐ నాయకులు మద్దెల మల్లేశం, వెంకటరాజ్యం, వివిధ పార్టీల నాయకులు, అయోధ్యపురం భూనిర్వాసితులు, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి ఎంపీ, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చిన రైల్వే జేఏసీ బృందం -
వేతన వెతలు
దుగ్గొండి: గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నిరోధించి ప్రతిఒక్కరికీ ఆహార కొరత లేకుండా చూడాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింది. దీంతో వలసలు తగ్గిపోవడంతో పాటు ప్రతీ కుటుంబం కొంత ఆర్థిక ప్రగతి సాధించింది. జిల్లాలోని 11 గ్రామీణ మండలాలు 325 గ్రామాల్లో 1.19 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2.37 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. వీరిలో 75 వేల జాబ్కార్డులకు చెందిన 1.26లక్షల మంది పనులు చేస్తున్నారు. వీరికి పని కల్పించడంతో పాటు పనులు చేయించడం, వేతన బిల్లులు అందించడానికి ఉపాధి సిబ్బంది పని చేస్తున్నారు. రూ.1.22కోట్ల బకాయిలు.. జిల్లా వ్యాప్తంగా 172 మంది ఫీల్డు అసిస్టెంట్ట్లు, 11 మంది ఏపీఓలు, 10 మంది ఈసీలు, 36 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 23 మంది సీఓలు పనిచేస్తున్నారు. వీరందరికి గత మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు నెలకు రూ. 10వేల వేతనం కాగా రూ. 51.60 లక్షలు, ఏపీఓలకు రూ.13.20 లక్షలు, ఈసీలకు రూ. 15 లక్షలు, టీఏలకు రూ.25.92 లక్షలు, సీఓలకు రూ.16.56 లక్షలు ఇలా మొత్తంగా రూ.1.22 కోట్లకుపై వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. చాలీచాలని వేతనమైన వెట్టిచాకిరి చేస్తున్న ఫీల్డు అసిస్టెంట్లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు అయినా వేతనాలు రాకపోతాయా అని ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉపాధి సిబ్బందికి అందని వేతనాలు పూట గడవక ఇబ్బందులు జిల్లాలో రూ.1.22 కోట్ల బకాయిలుభవిష్యత్పై ఆశతో పనిచేస్తున్నాం.. గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించాలి. ఇచ్చే వేతనం చాలా తక్కువ అయినా.. భవిష్యత్ బాగుంటుందనే ఆశతో 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. గ్రామంలో ఏ ప్రభుత్వ కార్యక్రమమైన తాము పాల్గొని ప్రజల్లోకి చేరవేస్తున్నాం. ప్రభుత్వం వచ్చే సంక్రాంతి పండుగ వరకై న వేతనాలు విడుదల చేసి ఆదుకోవాలి. – కేలోతు స్వామిచౌహాన్, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రతీ నెలా వేతనాలు చెల్లించాలి.. ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు అందరూ వచ్చే వేతనంతోనే కుటుంబం గడుస్తుంది. అలాంటిది ప్రభుత్వం ప్రతీ నెల వేతనం అందించకపోవడంతో ఇల్లు గడవటం, పిల్లల ఫీజలు చెల్లించలేని పరిస్థితి ఉంది. పలు కుటుంబాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలి. – ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ల సంఘం జిల్లా అధ్యక్షుడు -
జూలై వరకు లోటు వర్షపాతం..
ఉమ్మడి వరంగల్లో జూలై మాసాంతం నాటికి 52 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. 23 మండలాల్లోనే సాధారణ వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లాలో 75 మండలాలకు ఒక్క వర్ధన్నపేట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 398.5 మిల్లీమీటర్లకు 662.10 మిల్లీమీటర్లు (66 శాతం) అధికంగా కురిసింది. 25 మండలాల్లో సాధారణం కంటే 2 శాతం నుంచి 59 శాతం అధిక వర్షం కురవగా, 48 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ములుగు, జేఎస్ భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో వాగులు పొంగిపొర్లినా ఆ జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. దీంతో రైతులు చాలా ఆందోళనకు గురయ్యారు. -
ఉపాధ్యాయ వృత్తి ఉన్నతమైంది
● ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి సంగెం: ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైందని, తరగతి గదుల్లోనే దేశభవిష్యత్ను తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అన్నారు. ఆదివారం సంగెం మండలంలోని లోహిత జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన నూకల అంజివర్ధన్రెడ్డి ఆత్మీయ సన్మానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు విధి నిర్వహణను అంకితభావంతో పనిచేస్తే విద్యార్థులు జీవితాంతం గుర్తుంచుకుంటారన్నారు. ఉద్యోగ విరమణ పొందిన అంజివర్ధన్రెడ్డిని ఘనంగా సన్మానించారు. విధుల్లో ఉన్నప్పుడు చేసిన పనులే గుర్తింపునిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ వరంగల్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్, యాకూబ్రెడ్డి, సతీష్రెడ్డి, ఉపేందర్రెడ్డి, గాఫార్, విజయ్కుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో నేడు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ: 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 97044 58273 -
సాగు హుషారు.. ‘మోంథా’తో బేజారు!
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో యూరియా యాప్ను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. యాప్ నిర్వహణలో వ్యవసాయ శాఖ, ఎరువుల డీలర్ల పాత్రను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్ ఉన్న రైతులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్లో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సొంత భూమిలో సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, తదితర రైతులు తమ సెల్ఫోన్, ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ అయి యాసింగి–2025–26లో సాగు చేయనున్న పంట వివరాలను నమోదు చేయాలి. పంట వివరాలు నమోదు చేసిన అనంతరం జిల్లాలోని ఎరువుల డీలర్ల వద్ద జాబితా, వారి వద్ద అందుబాటులో ఉన్న యూరియా బస్తాల వివరాలు యాప్లో కనిపిస్తాయి. సాగుకు అవసరమైన యూరియాను దఫాల వారీగా బుక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. యూరియా బుకింగ్ అనంతరం రైతుకు ఒక బుకింగ్ ఐడీనంబర్ వస్తుందని, ఆ ఐడీ నంబర్తో పాటు ఆధార్, పట్టాదారు పాస్బుక్ తీసుకుని సమీప డీలర్ వద్ద యూరియా పొందవచ్చన్నారు. అయితే యూరియా స్లాట్ బుకింగ్కు సంబంధించి బుకింగ్ ఐడీ కేవలం 24 గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు.యాప్ ద్వారా యూరియా స్లాట్ బుకింగ్ సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
తగ్గిన దిగుబడి.. దక్కని మద్దతు ధర
ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా వరి దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్రంగా నిరాశ పర్చింది. వానాకాలం సీజన్లో 10,39,815 మెట్రిక్ టన్నులు ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల 24 నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతుల నుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. తేమ పేరిట కనీస మద్దతు ధరలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే, ఎకరానికి పత్తి దిగుబడి 10–15 క్వింటాళ్లు వస్తుందని భావించగా ఎకరానికి 6–7 క్వింటాళ్లు కూడా రాలేదు. దీనికి తోడు తేమ నిబంధనలు 8–12 శాతంగా పెట్టి కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110గా నిర్ణయించారు. కనిష్టంగా రూ.3,969, గరిష్టంగా రూ.7,289 చెల్లించినట్లు రైతులు వాపోయారు. -
వరంగల్
సోమవారం శ్రీ 29 శ్రీ డిసెంబర్ శ్రీ 2025తల్లులకు తనివితీరా మొక్కులు మేడారం సమ్మక్క, సారలమ్మలకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆదివారం వేలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. రైతులు వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, వేరుశనగ, కందులు తదితర పంటలను విరివిగా పండిస్తారు. ప్రభుత్వం ఆధునికీకరణ, సాగునీటి సౌకర్యాల కల్పన, రైతులకు సాంకేతిక సాయం అందిస్తూ పంటల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. అయితే, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తరచూ నష్టపోతున్నారు. సాగు సమయంలో వర్షాలు.. గోదావరి జలాల కోసం ఎదురుచూశారు. వానాకాలం, యాసంగిలో ఎరువుల కొరత వెంటాడింది. రోజుల తరబడి ఎరువుల దుకాణాల ఎదుట ‘క్యూ’ కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పంటలు చేతికందే సమయంలో ‘మోంథా’ తుపాను కాటేసింది. పంటలు వేసే సమయంలో భరోసా దొరకని రైతులకు దెబ్బతిన్న పంటలపై ధీ(బీ)మా దొరకలేదు. కాస్త చేతికందిన పంటలకు మార్కెట్లో ‘మద్దతు’ దొరకలేదు. ఫలితంగా రైతులు 2025లో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. దుగ్గొండి మండలం నాచినపల్లిలో మోంథా తుపాను ప్రభావంతో మొలకలు వచ్చిన దూదిపింజలు (ఫైల్) ఖానాపురం మండలం రంగాపురంలో నేలవాలిన వరి (ఫైల్) తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్ 9704458273 -
రేపు వైకుంఠ ఏకాదశి
● వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ● ఊకల్లో శ్రీరంగనాథుడిగా నాగసుబ్రహ్మణ్యుడి దర్శనం గీసుకొండ: జిల్లాలోని పలు వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం దేవతామూర్తులను ఉత్తర ద్వార దర్శించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గీసుకొండ మండలంలోని ఊకల్ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు ఆదివారం తెలిపారు. విష్ణుమూర్తి మేనల్లుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడిగా భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. ఉత్తర ద్వార దర్శనంతో సర్వపాపాలు తొలుగుతాయన్నారు. గర్భాలయంలో శేషపాన్పు (సర్పం)పై పడుకుని నిద్రిస్తున్నట్లు భక్తులకు దర్శనం ఇస్తాడన్నారు. దీనికి సంబంధించిన విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి ఆలయంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకోవాలన్నారు. -
సింహగర్జన సభను విజయవంతం చేయాలి
నర్సంపేట: ఓసీ సింహగర్జన బహిరంగ సభకు రెడ్డి కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు గోపు జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు రెడ్డి సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షుడు కంది గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ, నూతన సర్పంచ్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహ్మదాపురం, మధిర, బుధరావుపేట, గోపాలపురం, చెన్నారావుపేట, ముదిగొండ గ్రామాల సర్పంచ్లుగా ఎన్నికై న వారిని జైపాల్రెడ్డితో పాటు జగిత్యాల జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మొట్ల వెంకటరమణారెడ్డి, నర్సంపేట అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ పున్నం రవీందర్రెడ్డి, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అండ్రు రాజేంద్రప్రసాద్రెడ్డిలు ముఖ్యఅతిథులుగా పాల్గొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 11వ తేదీన నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది గోపాల్రెడ్డి, ఎర్ర యాకుబ్రెడ్డి, నల్ల మనోహర్రెడ్డి, మొట్ల లావణ్య, గోగుల శ్రీనివాస్రెడ్డికోమల, కటుకూరి వీరారెడ్డి, పరుపాటి పద్మారఘుపతిరెడ్డి, శ్వేతాచైతన్యరెడ్డి, పొన్నం రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 25వ మండల పూజ ముగింపు వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజలో ఇరుకు కోటేశ్వర్రావు, సాగర్, బండారుపల్లి చెంచారావు, రాజేంద్ర, త్రివేణి, నాగేశ్వర్, కుసుమ కుమారి పాల్గొనగా బ్రహ్మశ్రీ శ్రీమాన్ కె.పద్మనాభనమోద్రి కేరళ వాస్తవ్యులు తాంత్రిక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాలధార స్వాములు, భక్తులు పాల్గొనగా పదునెట్టాంబడిపై మాలధార స్వాములు ఇరుముడితో దర్శనం చేసుకోగా దివ్య పడిపూజ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, దొడ్డ రవీందర్, అర్చకులు, స్వాములు పాల్గొన్నారు. నేడు ప్రజావాణిన్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి నేడు(సోమవారం) ఉదయం 10.30 గంటలకు జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం నర్సంపేట రూరల్: చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి సబ్ స్టేషన్లో 33/11కేవీలో విద్యుత్ మరమ్మతు కారణంగా నేడు (సోమవారం) ఉదయం 9 నుండి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని నర్సంపేట డీఈ తిరుపతి, నెక్కొండ ఏడీఈ శ్రీధర్, చెన్నారావుపేట ఏఈ సంపత్లు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల ప్రజలు సహకరించాలని కోరారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికఖానాపురం: మండలంలోని సైనిక్స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ గట్ల సురేందర్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులను ఆదివారం ఉపాధ్యాయులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యప్రదేశ్లోని జమాల్పూర్లో ఈనెల 23 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్–19 ఖోఖో పోటీల్లో సైనిక్స్కూల్ విద్యార్థి చందు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి పోటీలకు ఎంపిౖకైనట్లు తెలిపా రు. అలాగే ఇటీవల ములుగులో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ కరాటే పోటీల్లో అండర్–19 విభా గంలో రామ్ చరణ్ ప్రథమ బహుమతి సాధించి జాతీయస్థాయిలకు ఎంపికయ్యారన్నారు. డై రెక్టర్ దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు బట్టల షాపు దగ్ధంనర్సంపేట రూరల్: ప్రమాదవశాత్తు అగ్ని ప్ర మాదం చోటు చేసుకుని బట్టల షాపు దగ్ధమైన సంఘటన చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో ఆదివారం చోటుచేసుకుంది. బూ ర్ణం స్వర్ణలత టైలర్షాపుతోపాటు బట్టల షాపు నడిపిస్తుంది. ఆదివారం ఉదయం షాపులో దే వుడి వద్ద దీపం వెలిగించి పని నిమిత్తం బయటకు వెళ్లింది. దీంతో ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షాపు పూర్తిగా దగ్ధమైంది. ప్రభు త్వం ఆదుకోవాలనిబాధితురాలు కోరుతుంది. -
నాణ్యమైన భోజనం అందించాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు అన్నారు. ఆదివారం మండలంలోని ఇల్లంద కస్తూర్భాగాంధీ పాఠశాలలో పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వంట కార్మికులకు నగదు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి దుగ్గొండి మండలం రూ.1,500, రెండో బహుమతి వర్ధన్నపేట మండలం రూ.1,000, మూడో బహుమతి పర్వతగిరి మండలం రూ.500 బహుమతులు గెలుచుకున్నట్లు డీఈఓ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధ్యాహ్న భోజనాన్ని నిత్యం పరిశీలిస్తూ నాణ్యమైన భోజనం అందించేందుకు కృషి చేయాలన్నారు. గతంలో కంటే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ధరలు పెంచి అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కరుణశ్రీ,, వివిధ మండలాల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు -
ఎరువుల కోసం తండ్లాట!
సాగు సమయంలో పంటలకు సరిపడా ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. సాగు విస్తీర్ణం పెరగడంతో ఆ మేరకు లభించక రైతులు రోజుల తరబడి దుకాణాల చుట్టూ ఎరువుల కోసం తిరిగారు. ఎన్నో ఇబ్బందులు పడి ఎరువులు దక్కించుకుని తెగుళ్లు, కలుపు భారం నుంచి బయటపడ్డ రైతులను పంట చేతికందే సమయంలో ‘మోంథా’ ముంచేసింది. కల్లాలకు తరలించిన ధాన్యం కొట్టుకుపోయింది. ఇలా మొత్తం ఉమ్మడి జిల్లాలో 2.16 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాగా, వారికి ఎలాంటి బీమా దక్కకపోగా, ఆ మేరకు పరిహారం అందలేదని పలు సందర్భాల్లో రైతులు వెల్లడించారు. -
ఇన్నర్ రింగ్రోడ్ పనుల్లో వేగం పెంచాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ఇన్నర్ రింగ్రోడ్ పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. రింగ్ రోడ్ పనుల పురోగతిపై బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టరేట్లో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగరాభివృద్ధిలో భాగంగా ఖిలా వరంగల్, ఏనుమాముల, గొర్రెకుంట ప్రాంతాల మీదుగా నిర్మాణంలో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు భూ నిర్వాసితులకు పరిహారం వెంటనే చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్ పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు సమగ్ర నగరాభివృద్ధికి జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీఓ సుమ, కుడా పీఓ అజిత్రెడ్డి, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, ఖిలావరంగల్ తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. మద్ది మేడారం జాతరపై సమీక్ష నల్లబెల్లి మండలంలోని మద్ది మేడారంలో జనవరి 28 నుంచి జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో జాతర నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై పలు శాఖల అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతర కాలంలో భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. రోడ్ల అభివృద్ధి, ఆలయ పరిసరాల పరిశుభ్రత, అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా వైద్యసేవలు, వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యం, ఇతర సదుపాయాలు, వాహనాల రద్దీ నివారణకు ప్రత్యేక పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. జాతరలోపు పనులు పూర్తియ్యేలా ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ ఉమారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, రోడ్డు భవనాల శాఖాధికారి రాజేందర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఇజ్జగిరి, డీపీఓ కల్పన, ప్రధాన పూజారి నాగరాజు, రెవె న్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తాం..
దుగ్గొండి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా చాలాచోట్ల 10లోపు ఓట్ల తేడాతో వెలువడిన ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి, తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఓటమి పాలైన యార మోహన్రెడ్డి, ఓడేటి వనిత తిరుపతిరెడ్డి, అక్కపెల్లి సుజాత, ఆడెపు రాజు, పెండ్లి ఉమాదేవి, కందిపల్లి నవనీతను పరామర్శించి, అధైర్య పడవద్దని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు తమ పార్టీ బలపిర్చన అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల భద్రయ్య, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజుకుమార్, బొబ్బరోనిపల్లి సర్పంచ్ శంకేసి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు. -
నియంత్రణలో నేరాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024 సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ప్రజలకు ఇబ్బంది కలిగించే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు, ఇది మనం రక్షించడానికి ప్రమాణం చేసిన సమాజంలో సమష్టి ధృఢ సంకల్పం, భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నియంత్రణలో నేరాలు ఉన్నాయని తెలిపారు. నేరాల అదుపు, కేసుల పరిశోధనలో కమిషనరేట్ పరిధిలోని వివిధ స్థాయిలలోని పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని నూతన విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ సీపీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక – 2025 సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శాంతిభద్రతలకు సంబంధించి నివేదికలోని వివరాలను వెల్లడిస్తూ గత ఏడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల పెరిగిందని గత ఏడాది 14,412 కేసులు నమోదు కాగా ప్రస్తుత సంవత్సరం 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. రాబోవు 2026 నూతన సంవత్సరంలో సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సహకారం నేరాల నియంత్రణకై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శాంతి భద్రతల పరిరక్షణే వరంగల్ కమిషనరేట్ పోలీసుల ప్రధాన లక్ష్యమని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు వరంగల్ పోలీసు కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడి వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక–2025 ఆవిష్కరణ -
యూరియా కోసం బారులు
● తోపులాటలో గాయపడిన మహిళ రైతు నెక్కొండ: యాసంగి సాగు చేస్తున్న రైతులు.. యూరియా బస్తాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని నెక్కొండ, రెడ్లవాడ రైతు వేదికల్లో యూరియా వచ్చిందన్న సమాచారం మేరకు శనివారం తెల్లవారుజామున, ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా రైతులు చేరుకున్నారు. రెడ్లవాడ పీఏసీఎస్కు కేటాయించిన యూరియా బస్తాలు రైతు వేదికకు రావడంతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దాంతో వారి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో రెడ్లవాడ శివారు మూడెత్తుల తండాకు చెందిన మహిళ రైతు మూడు విజయ కిందపడిపోగా, ఆమె కాలుకు గాయమైంది. విజయను నెక్కొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి ఆమె భర్త సుమన్ తరలించాడు. కాగా, పీఏసీఎస్లు, హాకా సెంటర్ల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా పంపిణీ చేస్తున్నా అవి రైతుల అవసరాలకు సరిపోవడం లేదు. మొక్కజొన్న పంటకు మొదటి, రెండో దఫాల్లో ఎరువులు వేయాల్సిన సమయం కావడంతో వారికి ఎదురుచూపులు తప్పడంలేదు. ఈ క్రమంలో ఒకటి, రెండు బస్తాలు మాత్రమే అందించి అధికారులు చేతులెత్తేస్తున్నారు. -
సరిపడా యూరియా ఉంది
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ నెక్కొండ: సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు యూరియా అందిస్తామని, సీజన్కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 87,508 ఎకరాలు కాగా, అందుకు సరిపడా యూరియా అక్టోబర్లో 3,776 మెట్రిక్ టన్నులు, నవంబర్లో 2,769 మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 438 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు వివరించారు. ఇంకా 5,400 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్ఫెడ్లో అందుబాటులో ఉందన్నారు. ఈనెల 26న జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కేంద్రాలకు 720 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. యాసంగి సీజన్లో రైతులకు కావాల్సిన యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు అవసరం మేర యూరియా వాడుకోవాలని, అవసరానికి మించి యూరియా వినియోగిస్తే భూసారం క్షీణిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ నాగరాజు, ఏఈఓ వసంత, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి
వర్ధన్నపేట: గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. ముంపునకు గురవుతున్న మండలంలోని కట్య్రాల గ్రామాన్ని శనివారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలం ఉండి అర్హులైన వారికి, స్థలం లేని కుటుంబాలకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అదేవిధంగా కాలనీ వరద ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ప్రమాదాలకు కారణమవుతున్న మైనార్టీ కాలనీలో ఇళ్ల మీదుగా వెళ్తున్న 11కేవీ విద్యుత్ లైన్ను తొలగించి, ప్రత్యామ్నాయ మార్గం ద్వారా పునరుద్ధరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసంపూర్తి పనులను త్వరగా పూర్తిచేయాలిసంగెం / గీసుకొండ: ఉపాధి హామీ పనులు ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న పనులన్నింటిని త్వరిగతిన పూర్తి చేయాలని అధికారులను జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి ఆదేశించారు. సంగెం, గీసుకొండ మండలాల్లో పశువుల పాక, నిర్మాణంలో ఉన్న సామూహిక మరుగుదొడ్లు, నర్సరీలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీలకు అవసరమైన మట్టి, విత్తనాలను తెప్పించుకుని ఆయా గ్రామాల్లో ఉపయోగకరమైన మొక్కలు పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా గతంలో వీఓఏగా పనిచేస్తూ రాజీనామా చేసి కుంటపల్లి సర్పంచ్గా గెలుపొందిన పెంతల సువర్ణను ఆయన అభినందించారు. గీసుకొండ మండలంలోని కొనాయమాకుల, ఊకల్ గ్రామాల్లో ఉపాధి హామీ పనులను రాంరెడ్డి పరిశీలించారు. నర్సరీల్లోని బ్యాగులను ఎర్రమట్టితో నింపి విత్తనాలు పెట్టాలన్నారు. అనంతరం గ్రామాల్లో ఔషధ, నీడనిచ్చే, పూల మొక్కలను నాటాలని సూచించారు. పశువుల షెడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు పేర్ల లలిత, సువర్ణ, వజ్ర రాజు, కక్కెర్ల సుభాష్, ఎంపీడీఓ రవీందర్, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీఓలు గణేష్, చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శులు రవీందర్, వాజీద్, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలుకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్కప్ క్రికెట్–2025 (ఈస్ట్జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాల జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. -
రైతు వేదిక వద్ద హృదయ విదారక దృశ్యం
ఖిలా వరంగల్/నర్సింహులపేట: వరంగల్ నగరం ఫోర్ట్ రోడ్డులోని పీఏసీఎస్ కార్యాలయ భవనం వద్ద శనివారం రైతులు యూరి యా కోసం బారులుదీరారు. పీఏసీఎస్కు 440 బస్తాల యూరియా రాగా, క్యూలైన్లో సుమారు 600 మంది రైతులు గంటలకొద్దీ నిరీక్షించారు. రైతులు క్యూలైన్లో ఉండగానే యూరియా అయిపోవడంతో అంతసేపు క్యూలో నిల్చున్న రైతులు అందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారి విజ్ఞాన్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలపగా సాయంత్రానికి మరో 440 బస్తాల యూరియా వచి్చంది. ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేయనున్నట్లు సొసైటీ సిబ్బంది తెలిపారు. అధికారి కాళ్లపైపడ్డ రైతు.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద బస్తారాం తండాకు చెందిన రాజు అనే రైతు మొక్కజొన్న చేనుకు యారియా కోసం శనివారం రెండు గంటలపాటు క్యూలో నిలబడినా దొరకలేదు. తన పంట నష్టపోతుందని వేడుకుంటూ అదే సమయంలో బయటికి వెళ్తున్న ఏఓ కాళ్లపై పడి యూరియా కోసం విజ్ఞప్తి చేశాడు. -
రేపు సాక్షి ఫోన్ ఇన్..
ఎంజీఎం: చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, సాధారణ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డితో రేపు (సోమవారం) ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని ప్రజలు తమ సందేహాలను వైద్యాధికారికి తెలిపి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫోన్లో సంప్రదించవచ్చు. తేదీ 29–12–2025, సోమవారం సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు.. ఫోన్ చేయాల్సిన నంబర్లు 97044 58273 -
రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్ఫెయిర్కు సంబంధించిన పోస్టర్ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ అల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్రెడ్డి, వై.వెంకటేశ్వర్రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. -
నియంత్రణలో నేరాలు!
● గతేడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గుముఖం ● కమిషనరేట్ పోలీసుల పనితీరు సంతృప్తికరం ● 2026లో మరిన్ని నూతన విధానాలతో ముందుకు ● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వెల్లడిసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘2024తో పోలిస్తే పలు నేరాల సంఖ్య తగ్గింది. ఈ నివేదిక కేవలం గణాంక రికార్డు కాదు. శాంతిభద్రతల రక్షణకు భాగస్వామ్యంతో సాధించిన ఫలితాల సంకలనం’ అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడంతో నేరాలు నియంత్రణలో ఉన్నాయని తెలిపారు. కమిషనరేట్ పరిధి వివిధ స్థాయిల పోలీసు అధికారుల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మరిన్ని విధానాలతో 2026లోనూ ‘వరంగల్ కమిషనరేట్ పోలీస్.. ది బెటర్ పోలీస్’గా నిలవాలని ఆకాంక్షించారు. శనివారం హనుమకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ వార్షిక నివేదిక –25 సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నివేదికలోని వివరాలు వెల్లడిస్తూ గతేడాదితో పోలిస్తే 0.53 శాతం స్వల్పంగా నేరాల సంఖ్య పెరిగిందని గతేడాది 14,412 కేసులు నమోదు కాగా, 2025లో 14,456 కేసులు నమోదయ్యాయని వివరించారు. 2026లో సమన్వయంతో పనిచేస్తూ, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు రాజమహేంద్రనాయక్, దార కవిత, ఏఎస్పీ చేతన్, అదనపు డీసీపీ రవి, ప్రభాకర్, శ్రీనివాస్లతో పాటు, ఏసీపీలు మూల జితెందర్ రెడ్డి, సదయ్య, పింగిళి ప్రశాంత్ రెడ్డి, జాన్ నర్సింహులు, వాసాల సతీష్, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. -
ప్రతిభను వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు
● టీసీఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ● కేయూలో ఈస్ట్ జోన్ గోల్డ్కప్ క్రికెట్ టోర్నమెంట్ షురూకేయూ క్యాంపస్: గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఈస్ట్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ను శనివారం కాకతీయ యూనివర్సిటీలోని క్రీడా మైదానంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డాక్టర్ పి.విజయచందర్రెడ్డి, రాష్ట్ర బాధ్యులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణ యువత కోసం తెలంగాణ గోల్డ్కప్ క్రికెట్–2025 (ఈస్ట్జోన్) క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని 8 జిల్లాల హనుమకొండ, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, భద్రాద్రి జిల్లాలకు సంబంధించిన జట్లు ఈటోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. 20 ఓవర్ల మ్యాచ్గా లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ తాళ్లపెల్లి జయపాల్, జాయింట్ సెక్రటరీ మహమ్మద్ అలీముద్దీన్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిలువేరు రాజ్కుమార్, బాధ్యులు సామిఅక్మల్, దాసరి శ్రీనివాస్, విష్ణుదాస్, శశాంక్, మరింగంటి నవరాసన్ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు మ్యాచ్లు ఇలా.. హనుమకొండ, ఖమ్మం జిల్లా క్రికెట్ జట్లు మధ్య తొలి మ్యాచ్ నిర్వహించారు. ఇందులో ఖమ్మం జిల్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 పరుగులకు ఆల్ఔట్ కాగా, తదుపరి బ్యాటింగ్ చేసిన హనుమకొండ జట్టు 102 పరుగులకు ఆల్ఔట్ అయ్యింది. ఖమ్మం జట్టు విజయం సాధించింది. అనంతరం మహబూబాబాద్, ములుగు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో మహబూబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. జనవరి 1వ తేదీ వరకు ఈక్రికెట్ పోటీలు కొనసాగుతాయి. -
దివ్యాంగులకు ధైర్యం కల్పించాలి
రామన్నపేట: దివ్యాంగుల్లో ధైర్యం నింపడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో ఐఏఎస్ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. భగవాన్ మహావీర్ ట్రస్ట్, హైదాబాద్ వారి సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడమంటే వారు తిరిగి నడిచే ధైర్యం కల్పించడమేనని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇతరుల దయపై ఆధారపడే వ్యక్తులు కారని, వారికి సరైన అవకాశాలు అందితే గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొని శిబిరాన్ని సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శిబిరంలో ఉమ్మడి వరంగల్తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన 150 మందికిపైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇన్చార్జ్ పరికిపండ్ల వేణు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాశ్, లింగమూర్తి, ఎలగం చిన్న కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాళ్ల పంపిణీ -
లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వే పూర్తి చేయండి
డీఎంహెచ్ఓ అప్పయ్య వేలేరు: లెప్రసీ కేస్ డిటెక్షన్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని డీఎంహెచ్ఓ అప్పయ్య వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు మల్లికుదుర్ల ఆరోగ్య ఉపకేంద్రం, గుండ్లసాగర్లో నిర్వహిస్తున్న ఔట్ రీచ్ ఇమ్యునైజేషన్ సెషన్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ముందుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నాలుగు ఆరోగ్య ఉపకేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్న లెప్రసీ కేసుల డిటెక్షన్ సర్వే వివరాలు, పీహెచ్సీలోని రిజిస్టర్, రికార్డులు, మందులు పరిశీలించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మండలంలో 21,900 మంది జనాభాకు గాను 11 వేల మందికి టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. మండలంలో జనవరి 3లోగా సర్వే పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం గుండ్లసాగర్లోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న ఇమ్యునైజేషన్ ఔట్ రీచ్ సెషన్ను పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశాలు, అంగన్వాడీ టీచర్లు పిల్లలందరికీ పోషకాహారం అందించడంలో టీకాలు ఇప్పించడంలో గర్భిణుల సంరక్షణలో కలిసి పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ నవీన్కుమార్, హెల్త్ సూపర్వైజర్ కుమారస్వామి, ప్రభావతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం కాజీపేట: రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో జిల్లా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జీఓ జారీ చేయాలని కార్పొరేటర్ విజయశ్రీ రజాలీ అన్నారు. కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో శనివారం తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సహకరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈమేరకు జిల్లాలోని ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇవ్వాలని సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారయణ మాట్లాడుతూ.. భవిష్యత్ పోరాటంలో యువతను భాగస్వాములను చేయాలన్నారు. జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. ఒక మంచి లక్ష్యంతో సాగుతున్న ఉద్యమానికి అందరూ మనస్ఫూర్తిగా సహకరించడానికి మరింతగా ముందుకు రావాలని కోరారు. జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించిన ఈసమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, మాజీ కార్పొరేటర్ ఎండీ అబూబక్కర్, నార్లగిరి రమేశ్, కాటపురం రాజు, బి.రంజిత్కుమార్, సందెల విజయ్, పి.శివకుమార సుంచు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రిపబ్లిక్డే పరేడ్కు ఎన్సీసీ కేడెట్ల ఎంపిక
విద్యారణ్యపురి: న్యూఢిల్లీలో జనవరి 26న జరగనున్న ఆర్డీ (రిపబ్లిక్ డే) పరేడ్కు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన ముగ్గురు ఎన్సీసీ కేడెట్స్ ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళి తెలిపారు. జి.వెంకటలక్ష్మి (బీఎస్సీ ఎంపీసీసీఎస్ ఫైనల్ ఇయర్), బి.త్రిష (బీఎస్సీ బీజెడ్సీ ఫైనల్ ఇయర్), ఎ.భార్గవి (బీఎస్సీ ఎంపీసీఎస్ ద్వితీయ సంవత్సరం) ఉన్నారు. రిపబ్లిక్డే పరేడ్కు ఎంపికై న వీరు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ప్రిన్సిపాల్ చంద్రమౌళి, ఎన్సీసీ ఆఫీసర్ సువర్ణ, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించే ఎన్సీసీ విద్యార్థినుల్లో స్ఫూర్తి నింపుతుందని పేర్కొన్నారు. -
మహిళా.. ఏలుకో!
జిల్లాలో 316 పంచాయతీల్లో 158 మంది మహిళా సర్పంచ్లు..సంగెం: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు.. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్ కల్పించడంతో ఎక్కువ స్థానాల్లో మహిళలు సర్పంచ్లుగా పోటీ చేసి గెలుపొందారు. జిల్లాలో 317 గ్రామ పంచాయతీలు ఉండగా వంజరపల్లి మినహా 316 జీపీలకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఇందుల్లో 158 మంది మహిళలు సర్పంచ్లుగా ఎన్నికయ్యారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం సర్పంచ్లుగా ఎన్నికై న మహిళలకు పాలన కత్తి మీద సాముగా మారనుంది. సంగెం మండలంలో 32 పంచాయతీల్లో 16 మంది మహిళలు సర్పంచ్లుగా, 281 వార్డుల్లో 141 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. గెలిచిన సర్పంచ్లందరూ రాజకీయాలకు కొత్తవారే. పాలనపై పట్టులేకపోవడం, ఇంటిలో భర్త, కొడుకును కాదనలేని పరిస్థితి. వీటన్నింటిని అధిగమించి కుటుంబాన్ని సక్కదిద్దుకుంటూనే గ్రామాన్ని మరో కుటుంబంగా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధిస్తామని మహిళా సర్పంచ్లు దీమా వ్యక్తం చేస్తున్నారు. పతుల పెత్తనం కుదరదు గ్రామపంచాయతీ పాలనలో పతుల పెత్తనానికి ప్రభుత్వం చెక్ పెట్టింది. సర్పంచ్లుగా సతుల విధుల్లో పతులతో పాటుగా కుమారుడు తదితర కుటుంబసభ్యుల జోక్యం చేసుకోవద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. గతంలో మహిళా సర్పంచ్లను వంటింటికే పరిమితం చేస్తూ వారికి బదులుగా భర్తలు, కుమారులు, కుటుంబసభ్యులు సర్పంచ్లుగా పిలువబడుతూ అధికారం చెలాయించడం సర్వసాధారణమైన విషయంగా మారింది. ప్రభుత్వం ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ నుంచి మెమో నంబరు–3, 292 పేరిట పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీలకు సైతం వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో కుటుంబ సభ్యుల పెత్తనా న్ని నియంత్రించేందుకు ప్రభుత్వం గతంలో పలు ఉత్తర్వుల ను జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జిల్లాస్థాయి అధికారులు, మండలస్థాయి అ ధికారులు సైతం సతులకు బదులుగా పతులకే ప్రాధాన్యం ఇవ్వడంతో పాటుగా భర్తలనే సర్పంచ్లుగా పిలుస్తుండడంతో వారి పెత్తనం మరింతగా పెరిగింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, చివరికి 90 రోజులకు ఒకసారి జరిగే మండల సర్వసభ్య సమావేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ భార్యలకు బదులుగా భర్తలే సంతకాలు చేసి పనులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేసిన ఉత్తర్వులతో మార్పు వస్తుందా.. లేదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు సతులకు బదులు పతుల పెత్తనంపై కఠినంగా వ్యవహరించినప్పుడే భర్తల పెత్తనం తగ్గిపోయి పల్లెపాలనలో మహిళా ప్రజాప్రతినిధుల ముద్ర కనిపిస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా ఎన్నికై న మహిళా సర్పంచ్లు పురుషులకు దీటుగా పల్లెపాలన సాగిస్తామని దీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు కుటుంబం.. మరోవైపు గ్రామం.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిందే.. సతుల స్థానంలో పతుల పెత్తనం కుదరదు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
వరంగల్
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కథాశివిర్కు ఓరుగల్లు విద్యార్థులు యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు రూపొందించిన రాష్ట్రీయ కథాశివిర్కు ఉమ్మడి జిల్లా నుంచి 20 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
కాజీపేట: స్థానిక యువతకు రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు కాజీపేట చౌరస్తాలో భూనిర్వాసితులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యం ఇవ్వకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లేశం, వీరన్న, భిక్షపతి, ప్రదీప్ పాల్గొన్నారు. నేడు కాజీపేటలో రౌండ్టేబుల్ సమావేశం కాజీపేట రైల్వే కమ్యూనిటీహాల్లో శనివారం ఉదయం 10 గంటలకు రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని ఆరు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, ఆయా పార్టీల డివిజన్ల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ప్రజాసంఘాల నాయకులు హాజరవుతున్నారు. ఉద్యోగాల కల్పనపై సమావేశంలో చర్చించనున్నట్లు జేఏసీ చైర్మన్ కోండ్ర నర్సింగరావు తెలిపారు. -
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పంజాల రమేశ్ అన్నారు. శుక్రవారం సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ సెంటర్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని ఎగుర వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీపీ ఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి చేసి 101 సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. దేశ వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టి సమస్యలు పరిష్కరించిందన్నారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు అయితే యాకోబు, అక్కపెల్లి రమేశ్, జిల్లా సమితి సబ్యులు మియాపురం గోవర్ధన్, గుంపెల్లి మునీశ్వర్, నాయకులు బాధబోయిన యాదగిరి, సాంబయ్య పాల్గొన్నారు. గురుకుల పాఠశాలలో దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం విద్యార్థులు జనవరి 21వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఎంపికై న విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు ఉచిత భోజన వసతితో పాటు విద్యను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొక్కజొన్న పంట ధ్వంసంసంగెం: మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. మండలంలోని కాట్రపల్లి గ్రామానికి చెందిన గాయపు వీరారెడ్డి తన తల్లిదండ్రులు పంచి ఇచ్చిన 2.18 ఎకరాల్లో పట్టా చేయించుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన అన్న కుమారుడు గాయపు రవీందర్రెడ్డి గతేడాది నుంచి పంట వేయనియకుండా అడ్డుకుంటున్నాడని, ఈనెల 25న ట్రాక్టర్తో 20 గుంటల భూమిలోని మొక్కజొన్న పంటను దున్ని ధ్వంసం చేశాడని వీరారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవీందర్రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మొసలి లభ్యంనర్సంపేట రూరల్: మొసలి లభ్యమైన సంఘటన నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామశివారులోని శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఫారెస్టు రేంజర్ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నర్సంపేట మండలంలోని ముగ్ధుంపురం గ్రామానికి చెందిన రైతు సూర్యకు చెందిన వ్యవసాయ భూమిలో మొసలి సంచరిస్తుందని సమాచారం ఫారెస్టు అధికారులకు అందించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ మొసలిని పట్టుకొని పాకాల చెరువులో విడిచిపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట పారెస్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్, ఫారెస్టు బీట్ ఆఫీసర్ యోగి, వెంకన్న, బేస్ క్యాంప్ చందు తదితరలు పాల్గొన్నారు. -
ధరణి నవల ఆవిష్కరణ
హన్మకొండ కల్చరల్: చెలిమి సాహిత్య సాంస్కృతిక వేదిక వరంగల్ శాఖ, కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెట్టు రవీందర్ రాసిన ‘ధరణి’ నవల పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమకొండ నక్కలగుట్టలోని కాలేజీ రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ భవనంలో చెలిమి వ్యవస్థాపక అధ్యక్షుడు మెట్టు రవీందర్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్, విశిష్ట అతిథులుగా ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్, మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుప్పాల బాలరాజు, ఆర్సీటీఏటీ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ విద్యాసాగర్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు పులి సారంగపాణి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్తో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రచయిత ఈ నవలలో కళ్లకు కట్టినట్లుగా రాశారని ప్రశంసించారు. సాహితీవేత్తలు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్ విద్యార్థి, రామిరెడ్డి పాల్గొన్నారు. -
ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..
కాజీపేట: భూనిర్వాసితులతోపాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే నినాదం క్రమేణా ఊపందుకుంటోంది. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామ శివారులో శరవేగంగా సాగుతున్న రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నారు. నియామకాల్లో జిల్లా నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలనే నినాదం మొదలైంది. దాదాపు 40 ఏళ్లు పోరాట ఫలితంగా రెల్వే కోచ్ అండ్ వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రైతులు 128 ఎకరాలకు పైగా భూములను ౖఅతి తక్కువ పరిహారంతో రెల్వే శాఖకు అప్పగించారు. భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉంటుందని భూసేకరణ సమయంలో అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆ ఊసే లేకపోవడంతో తెలంగాణ రైల్వే జేఏసీ సహకారంతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో భూనిర్వాసితులు, జిల్లా నిరుద్యోగులు, రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ఏకమవుతున్నారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే డిమాండ్తో రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వరంగల్వాసుల చిరకాల వాంఛను హైదరాబాద్ నుంచి ఢిల్లీస్థాయిలో వినిపించడానికి సమాయత్తమవుతున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, సంబంధిత మంత్రులను కలిసి వినతిపత్రాలు అందించాలని తీర్మానించారు. ఉద్యోగాలు ఇవ్వాలి.. తాత, ముత్తాతల కాలం నుంచి దున్నుకుని బతుకుతున్న భూములను ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాగ్యం చేశాం. భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిపక్షంలో పోరాటాలను ఉదృతం చేయాల్సి ఉంటుంది. – గాదె యాదగిరి, బాధితుడు, అయోధ్యపురం ప్రత్యేక జీఓ తీసుకురావాలి.. గతంలో ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తాలలో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో భూనిర్వాసితులకు 38 శాతం, జిల్లాస్థాయిలో నిరుద్యోగ యువతకు 44 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఇక్కడ అదేస్థాయిలో ప్రత్యేక జీఓతో ఉద్యోగాలు ఇవ్వాలి. – దేవులపల్లి రాఘవేందర్, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ ఉద్యోగాలు ఇవ్వకుంటే పోరాటాలకు విలువ లేనట్టే.. పోరాటాల ఫలితంగా ఏర్పడిన రైల్వే మ్యాన్ఫాక్చరింగ్ యూనిట్లో స్థానిక యువత, భూనిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. లేనిపక్షంలో ఎన్నో ఏళ్లు చేసిన పోరాటాలకు విలువ లేనట్లే. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనుసరించిన విధానం ద్వారా ప్రత్యేక జీఓ జారీ చేసి ఉద్యోగాలు ఇవ్వాలి. – కోండ్ర నర్సింగరావు, తెలంగాణ రైల్వే జేఏసీ చైర్మన్ రైల్వే మ్యాన్ఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులు, భూనిర్వాసితులకు ఉద్యోగవకాశాలు కల్పించాలి రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్ రైల్వే జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో పోరుబాటు -
యువత చూపు.. ఎర్రజెండా వైపు
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు ఖిలా వరంగల్: పెట్టుబడి దారి వ్యవస్థకు కాలం చెల్లిందని, కమ్యూనిజమే ప్రత్యామ్నాయంగా ఎర్రజెండా వైపు ప్రపంచ యువత చూస్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాల ముగింపులో భాగంగా శుక్రవారం వరంగల్ నగరంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ భాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా వరకు ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సీపీఐ అనేక త్యాగాలు చేసిందని, ఎంతో మంది అమరవీరులను అందించిన చరిత్ర సీపీఐ దేనని చెప్పారు. అంతకుముందు బాష్మియాతో కలిసి జెండా ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, మేకల రవి, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్, గన్నారపు రమేష్, బద్రి, రమేష్, చంద్రకళ, రవీందర్, చెన్నకేశవులు పాల్గొన్నారు. హనుమకొండలో..న్యూశాయంపేట: సీపీఐ వంద సంవత్సరాల ఆవిర్భావ వేడుకలు హనుమకొండ బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య, నాయకులు కర్రె భిక్షపతి, ఆదరి శ్రీనివాస్, తోట భిక్షపతి, ఎల్లేష్, రాములు, లక్ష్మణ్, రాజమౌళి పాల్గొన్నారు. -
గంగదేవిపల్లిని సందర్శించిన ప్రతినిధులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిని జయశంకర్ భూపాలపల్లి, జనగామ జిల్లాల ప్రతినిధులు శుక్రవారం సందర్శించా రు. రేగొండ మండలం జూబ్లీనగర్ సర్పంచ్, ఉపసర్పంచ్లు మూలగుండ్ల లావణ్యశ్రీనివాస్రెడ్డి, బ త్తుల శ్రీధర్, యువకులు, రైతులు, మహిళా సంఘా ల సభ్యులు, రఘునాథధపల్లి మండలం ఖిలా షాపురం సర్పంచ్ శాగ కవిత, అశోక్, వార్డు సభ్యులు సందర్శించి అభివృద్ధి తీరుతెన్నులను పరిశీలించారు. ప్రజల భాగస్వామ్యంతో పలు కమిటీల ద్వా రా ఆదర్శంగా నిలిచి దేశవిదేశీ ప్రముఖుల ప్రశంసలు పొందిన తీరును గురించి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి వివరించారు. సర్పంచ్ కూ సం స్వరూప, కాంగ్రెస్ నాయకుడు కూసం రమేశ్, అభివృద్ధి కమిటీల ప్రతినిఽధి కూసం లింగయ్య, డీటీఎం కరుణాకర్ పాల్గొన్నారు. -
మేడారం, వేములవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ: జాతర, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. మేడారం జాతర, వేములవాడకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. కనీసం 30 మంది ప్రయాణికులు ఉండాలన్నారు. 2026 జనవరి నుంచి ఈ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు డీఎం పేర్కొన్నారు. ప్రయాణికులు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని వెల్స్ యూనివర్సిటీలోఈనెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సుకు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎకనామిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ శ్రీధర్కుమార్లోథ్ హాజరుకానున్నారు. సదస్సులో ‘రోల్ ఆఫ్ ట్రైబల్ ఉమెన్ ఇన్ అగ్రికల్చ ర్ యాక్టివిటీస్ ఆన్ ఎంపిరికల్ ఇన్వెస్టిగేషన్’ అంశంపై శ్రీధర్కుమార్లోథ్ పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతిలో ఉన్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఈనెల 28 నుంచి 30 వరకు 50వ అఖిల భారత సోషియాలజీ సదస్సు నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ కుంట అయిలయ్య సదస్సుకు హాజరుకానున్నారు. ‘మొబిలిటీస్ అండ్ ఇన్ క్వాలిటీస్ షిఫ్టింగ్ కాంటెక్ట్స్ చేంజింగ్ పారాడిగ్మ్స్’ అంశంపై నిర్వహించనున్న ఒక సెషన్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే ‘ఎ స్టడీ ఆన్ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్స్ ఇన్ రిలేషన్ ఇన్ సోషల్ చేంజ్ అంశంపై పరిశోధన పత్రాన్ని సమర్పించనున్నారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలావరంగల్ కోటను శుక్రవారం స్విట్జర్లాండ్ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా వారు కాకతీయుల కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదను వీక్షించారు. ఆతర్వాత ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిలగుట్ట, శృంగారపు బావిని తిలకించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను పర్యాటక శాఖ గైడ్ రవియాదవ్ వివరించారు. కోటను సందర్శించడం తాము అదృష్టంగా భావిస్తున్నామని విదేశీయులు పేర్కొన్నారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్చార్జ్ గట్టికొప్పుల అజయ్ ఉన్నారు. -
శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
వరుస సెలవులు రావడంతో నగరంలోని ప్రముఖ చారిత్రక దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గురు, శుక్రవారాలు వేలాది మంది భక్తులు శ్రీభద్రకాళి, వేయిస్తంభాల దేవాలయాలను సందర్శించారు. అమ్మవారు, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ములుగు జిల్లా ఎస్ఎస్తాడ్వాయి మండలంలోని మేడారానికి వేలాదిమంది భ క్తులు తరలివెళ్లారు. జంపన్నవాగులోని బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ కింద స్నానాలు చేసి సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. – హన్మకొండ కల్చరల్/ఎస్ఎస్తాడ్వాయి -
ఆగుతూ.. సాగుతూ!
వరంగల్: ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులు ఆగుతూ.. సాగుతున్నాయి. నిధులు విడుదలై టెండర్లు నిర్వహించినా పనులు గ్రౌండింగ్ చేయడంలో తీవ్ర జాప్యమవుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్ నాణ్యతగా పనులు చేపట్టడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు రూ.46 కోట్లతో వరంగల్ వెంకట్రామ జంక్షన్ నుంచి పోచమ్మమైదాన్ మీదుగా ఎంజీఎం జంక్షన్ వరకు ఐదేళ్ల క్రితం చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు పాలకవర్గం గడువు పూర్తికావొస్తున్నా పూర్తి కాలేదు. ఈరహదారికి ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించేందుకు భవనాల ఎదుట అధికారులు ఆక్రమణలు తొలగించారు. నేటికి ఫుట్పాత్లు పూర్తి చేయకపోవడంతో పలు షాపుల యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం డీమార్ట్ ఎదుట ప్రారంభించిన పనులు పూర్తికాలేదు. స్మార్ట్రోడ్డులో భాగంగా రహదారిపై బీటీ లేయర్లు అసంపూర్తిగా వేశారు. అవి స్పీడ్బ్రేకర్లుగా మారడంతో దిచక్రవాహనదారులకు పాట్లు తప్పడం లేదు. ఇబ్బందులకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకుల అండతో భవనాల యజమానులు అడ్డుకోవడంతో రహదారి విస్తరణ పనులు జాప్యమవుతున్నాయి. స్మార్ట్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు గ్రేటర్ వరంగల్ మేయర్, కమిషనర్ ఆదేశాలు జారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులే అడ్డు.. ● కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు సహకరించాల్సిన ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు అడ్డుగా మారుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోపాలస్వామిగుడి జంక్షన్ సమీపంలోని రోడ్డు విస్తరణకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అడ్డుపడడం, భవన యజమాని కోర్టుకు వెళ్లడంతో అక్కడ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ రహదారికి ఇరువైపులా అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం వేసిన పైపులతో జలమయంగా మారుతోంది. ● పోలీస్ కమిషనరేట్ జంక్షన్ నుంచి ములుగు రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు సైతం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అప్పటి ప్రజాప్రతినిఽధి అడ్డుపడినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డు పనులు అసంపూర్తిగా మారాయి. డ్రెయినేజీతోపాటు వెడల్పు జరిగితే ఈ రోడ్డుపై వాహనాలు వెళ్లేందుకు సులువుగా ఉండేది. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నాయకుడు సైతం రోడ్డు వెడల్పునకు జంకుతున్నట్లు సమాచారం. ● కాజీపేట డీజిల్ కాలనీ నుంచి వరంగల్ ములుగురోడ్డు వరకు చేపట్టిన స్మార్ట్సిటీ రోడ్డు పనులు పూర్తి కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్స్ నుంచి ములుగురోడ్డు వరకు రహదారి వెంట ఉన్న వ్యాపారులే ఇందుకు కారణమని, ప్రజాప్రతినిధులు సహరించకపోవడంతో పనులు పెండింగ్ పడినట్లు సమాచారం. ● వెంకట్రామ జంక్షన్ నుంచి ములుగురోడ్డు జంక్షన్ వరకు చేపట్టిన స్మార్ట్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. అదేవిధంగా కాశిబుగ్గ, పోచమ్మమైదాన్, వరంగల్ చౌరస్తాలో చేపట్టిన జంక్షన్ అభివృద్ధి పనులపై అధికారులు దృష్టి సారించడం లేదు. ● పోచమ్మమైదాన్ నుంచి రైల్వేస్టేషన్ వరకు నిర్మించిన సీసీ రోడ్డులో నాణ్యత లేకపోవడంతో అక్కడక్కడ పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ స్మార్ట్రోడ్డులో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, అప్పటి తూర్పు ప్రజాప్రతినిధి వ్యాపారుల కోసం డివైడర్ స్థానంలో సిమెంట్ కాంక్రీట్ పోయించడంతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయలేదు. అభివృద్ధి పనుల్లో కానరాని నాణ్యతాప్రమాణాలు నిధులు విడుదలైనా గ్రౌండింగ్లో జాప్యం పట్టించుకోని గ్రేటర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు -
రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
నెక్కొండ: రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.సోమయ్య డిమాండ్ చేశారు. పెన్షన్ డేను పురస్కరించుకొని మండల కేంద్రంలోని పెన్షన్ భవనంలో శుక్రవారం నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెక్కొండ శాఖ యూనిట్ అధ్యక్షుడు గటిక మల్లయ్య అధ్యక్షతన జరిగిన స మావేశంలో ఆయన మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాడ్యుటీ, కమ్యూటేషన్, జీపీఎఫ్ పెండింగ్ బి ల్లులు, కరువు భత్యం, హెల్త్ కార్డులు అందించాలన్నారు. నకారా చేసిన పోరాటంతోనే రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, సంక్షేమం పథకాలు అందుతున్నాయన్నారు. పెన్షన్దారులు సంఘటితంగా పోరాడి తమ హక్కులను పరిరక్షించుకోవాలన్నారు. అనంతరం ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఐలయ్య రిటైర్డ్ ఉద్యోగుల కు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో నెక్కొండ యూనిట్ గౌరవ అధ్యక్షుడు ఇనుగాల ఉ పేందర్రెడ్డి, కార్యదర్శి ఎస్ఏ మొహినోద్దీన్, ఆర్థిక కార్యదర్శి కె.శ్రీహరి, కార్యవర్గ సభ్యులు బి. రత్న య్య, వి. పరమేశ్వరయ్య, పెన్షనర్లు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సోమయ్య -
మరో చాన్స్ ప్లీజ్!
నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు ‘మరో చాన్స్ ప్లీజ్’ అంటూ తమ పార్టీ నేతలను వేడుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయిన వారు ప్రత్యామ్నాయ ప్రయత్నంపై దృష్టి సారించారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిశాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి సర్పంచ్గా గెలుపొందాలని ఆశపడి భంగపడ్డ నేతలు రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ పాలకవర్గాలు కొలువుదీరాయి. ఓడిపోయిన వ్యక్తులు తమ బలాబలాలను అంచనా చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపొందే పరిస్థితులను అంచనా వేసుకుంటున్నారు. సర్పంచ్గా పోటీ చేసి పరాజయం పాలైన అభ్యర్థులే రానున్న ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తే సానుభూతితో పాటు ఓడిపోయిన స్థానంలోనే గెలుపొందవచ్చని అంచనా వేసుకుంటున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన సర్పంచ్ అభ్యర్థులు రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి గెలుపొందాలని ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకోసం అన్ని వర్గాల ఓటర్లను మద్దతు కూడగట్టుకొని ముందుకు సాగుతున్నారు. గత సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి చెందడానికి ఏఏ వర్గాలు, సంఘాల సభ్యులు ఓట్లు వేశాయి, ఎవరు ఓట్లు వేయలేదు, ఎక్కడ లెక్క తప్పిందనే అంచనాలను వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగవచ్చని అంచనా వేసుకుంటూ తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీలకు చెందిన అధినేతల వద్ద తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకుంటూ టికెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీటుపైఆశావహుల గురి సర్పంచ్గా ఓటమి పాలైన అభ్యర్థుల ముమ్మర ప్రయత్నాలు సానుభూతి కలిసి వస్తుందని ముందడుగు జిల్లాలో 11 జెడ్పీటీసీ, 130 ఎంపీటీసీ స్థానాలుసానుభూతి కలిసివస్తుందని.. జిల్లాలో 130 ఎంపీటీసీ స్థానాలు, 11 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రభుత్వం రెండు నెలల నుంచి సిద్ధం చేస్తుంది. ఈ క్రమంలోనే కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిచిపోగా తర్వాత వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశావహులు పోటీ చేశారు. అయినప్పటికీ ఓటమి పాలైన వ్యక్తులు మండల స్థాయిలో రాజకీయ పలుకుబడితో గెలిచే అవకాశం ఉన్న వారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి టికెట్ పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అందులో ఎలాగైన గెలుపొందాలని ఉద్దేశంతో రిజర్వేషన్లు అనుకూలిస్తే పోటీ చేసేందుకు కసరత్తు మొదలపెట్టారు. రిజర్వేషన్ అనుకూలంగా వస్తే పార్టీ తరఫున ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేసే అవకాశం తమకే ఇవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
వారసత్వ సంపదను కాపాడుకోవాలి
హైకోర్టు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి హన్మకొండ కల్చరల్: కాకతీయుల శిల్పకళ, వారసత్వ సంపదను కాపాడుకోవాలని హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం చారిత్రక శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని సుదర్శన్రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. సుదర్శన్రెడ్డి దంపతులు శ్రీరుద్రేశ్వరస్వామి వారికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. సూర్య, విష్ణు దేవాలయాల చరిత్ర, నాట్యమండపం, స్తంభాల్లో వెంటుక్ర పట్టేంత రంధ్రాలు, తలకిందుల చాప, మనిషి, అష్ట దిక్పాలకులు, కల్యామండపం విశిష్టతను వారికి వివరించారు. కార్యక్రమంలో అర్చకులు గంగు మణికంఠశర్మ, సందీప్శర్మ, సిబ్బంది మధుకర్, రజిత, రామకృష్ణ పాల్గొన్నారు. -
వెక్కిరిస్తున్నాయి..
ఎత్తిపోతలను త్వరగా పూర్తిచేయాలి కొనాయమాకుల ఎత్తిపోతల పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించాలి. ఇప్పటికే చాలా ఆలస్యం జరిగింది. రైతులు ఈ పథకం ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. అవసరమైన నిధులు మంజూరయ్యే విధంగా ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలి. – సిరిసె శ్రీకాంత్, కొనాయమాకుల పిల్లర్ల దశలోనే వదిలేశారు.. గిరిజనుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం భవనాన్ని మంజూరు చేసింది. కొమ్మాల అంగడిలో దీన్ని పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. కాంట్రాక్టర్ను అడిగితే నిధులు మంజూరు చేయడం లేదన్నారు. మూడేళ్ల నుంచి పనులు ముందుకు సాగటం లేదు. త్వరగా నిధులను మంజూరు చేసి భవన నిర్మాణం చేపట్టాలి. – ఆంగోతు వీరన్న, హర్జ్యతండా సర్పంచ్ గీసుకొండ: జిల్లాలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. నిర్మాణ దశలో ఉన్న జిల్లా స్థాయి భవనాల నిర్మాణం సైతం మధ్యలోనే ఆగిపోయి దిష్టిబొమ్మల్లా వెక్కిరిస్తున్నాయి. వరంగల్ నగరానికి గీసుకొండ మండలం సమీపంలో ఉండటంతో ఇక్కడ పలు జిల్లా భవనాలను నిర్మించడానికి పనులను చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత భవనాల నిర్మాణ పనులు పూర్తి కావడంలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొనాయమాకుల ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా.. రైతులకు సాగు నీరు అందించని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా పనులు మధ్యలో నిలిచిపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2017 నుంచి నత్తనడకే.. మండలంలోని కొనాయమాకుల వద్ద శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాకతీయ ప్రధాన కాల్వ నీటిని పైకెత్తి పోసి రైతుల చేలకు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను చేపట్టారు. 2017లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకం పనులకు శంకుస్థాపన చేయగా అప్పటి నుంచి ఎందుకో ఏదో ఓ సమస్యతో పనులు పూర్తికావడం లేదు. దీంతో రైతులకు 18 ఏళ్లుగా సాగినీటి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ప్రాజెక్టు పూర్తయితే గీసుకొండ మండలానికి 7,446, దుగ్గొండి 4,509, సంగెం మండలంలో 2,166 ఎకరాల (మొత్తంగా 14వేలు) భూములకు సాగు నీరు అందే అవకాశం ఉంది. ఇటీవల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పలుమార్లు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అవసరమైన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తామన్నారు. అయినా ప్రాజెక్టు పనుల్లో పురోగతి కనిపించడం లేదని రైతులు నిరాశతో ఉన్నారు. బాలల భవన నిర్మాణం అంతే.. మండలంలోని కొనాయమాకుల గ్రామం వద్ద మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా 2022 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, గత ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిలు రూ. 87.45 లక్షల అంచనా వ్యయంతో బాలల భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తల్లిదండ్రులను కోల్పో యి అనాథలుగా మిగిలిని వారికి, బస్టాండు, రైల్వేస్టేషన్లలో తప్పిపోయిన చిన్నారులకు ఆశ్రయం ఇవ్వడానికి ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు నిధులలేమితో మధ్యలోనే నిలిచిపోయాయి. త్వరగా నిధులు మంజూరు చేయించి ఉపయోగంలోకి తేవాల్సిన అవసరం ఎంతైన ఉంది. గిరిజన భవన నిర్మాణ పరిస్థితి దారుణం.. మండలంలోని కొమ్మాల అంగడి వద్ద చేపట్టిన గిరిజన భవన నిర్మాణం పనులు తొలి దశలోనే నిలిచిపోయాయి. గత ప్రభుత్వం రూ.2 కోట్ల అంచనా వ్యయంతో గిరిజన భవనాన్ని నియోజకవర్గ స్థాయిలో మంజూరు చేసింది. నిర్మాణ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ. 50 లక్షల మేర ఖర్చు చేసి పిల్లర్ల దశ మేరకు నిర్మాణం పనులను చేపట్టారు. బిల్లుల కోసం అధికారుల వద్దకు వెళితే నియోజకవర్గ కేంద్రంలో భవనాన్ని నిర్మించాల్సి ఉండగా ఇక్కడెందుకు చేపట్టారని చెప్పడంతో వివాదం నెలకొని పనులు నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా.. పూర్తికాని కొనాయమాకుల ఎత్తిపోతల పథకం, జిల్లా బాలల, గిరిజన భవనాల నిర్మాణం ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
శుక్రవారం శ్రీ 26 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7నగరంలో అంబరాన్నంటిన వేడుకలు ● చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు నగరంలో క్రిస్మస్ వేడుకలు గురువారం అంబరాన్నంటాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని చర్చిలకు ఉదయమే క్రైస్తవులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. సెల్ఫీలు దిగి సందడి చేశారు. మతపెద్దలు క్రీస్తు జననం గురించి తెలిపి, క్రీస్తు సందేశం ఇచ్చారు. వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండలోని సీబీసీలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వాహకులు చర్చిలను అందంగా అలంకరించారు. – సాక్షి, స్టాఫ్ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ, వరంగల్ప్రార్థనల అనంతరం హనుమకొండ సీబీసీ నుంచి బయటికి వస్తున్న క్రైస్తవులు (ఇన్సెట్లో) ప్రసంగిస్తున్న ఫాదర్ నిరంజన్బాబువరంగల్ జాన్పాకలోని మన్న చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు, వరంగల్ క్రిస్టియన్ కాలనీలోని సీబీసీలో మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ, హనుమకొండ సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు -
మల్లన్న ఆలయంలో జాతర ఏర్పాట్ల పరిశీలన
ఐనవోలు: ప్రముఖ శైవక్షేత్రమైన ఐనవోలు శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే జాతర ఏర్పాట్లను గురువారం ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పార్కింగ్ స్థలాలు, క్యూలైన్లు, స్నానఘట్టాలు, తాగునీరు, లైటింగ్, సీసీ కెమెరాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం చైర్మన్ కార్యాలయంలో సమావేశమై జాతరలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని శాఖల అధికారులు సహకరించాలని చైర్మన్ కమ్మగోని ప్రభాకర్గౌడ్, ఆలయ ఈఓ కందుల సుధాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంట్రా ఏఈ రవి కుమార్, విద్యుత్ శాఖ ఏఈ సురేశ్కుమార్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఎస్హెచ్ఓ పస్తం శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
జెట్స్పీడ్లో ‘మామునూరు’
తుది అంకంలో 223 ఎకరాల భూసేకరణసాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణ పనులు జెట్స్పీడ్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వద్ద 696.14 ఎకరాలు ఉండగా.. విమానాశ్రయ పునరుద్ధరణకు అవసరమైన నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లిలోని మరో 253 ఎకరాల భూసేకరణ చివరిదశకు చేరుకుంది. ఈ 253 ఎకరాల్లో 30 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండగా, 223 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల పట్టా భూములున్నాయి. ఇందులో ఇప్పటివరకు 180 ఎకరాల వ్యవసాయ భూమి, 13 ఎకరాల వ్యవసాయేతర భూమికి సంబంధించిన వారి ఖాతాల్లో రూ.220 కోట్లు జమచేశారు. మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధంగా ఉంచారు. కోర్టు వివాదాల్లో ఉన్న భూమి 15 ఎకరాలు ఉండగా ఈ మేరకు ఆ డబ్బులను జిల్లా కోర్టులో డిపాజిట్ చేశారు. అలాగే సాదాబైనామాకు సంబంధించి ఐదు ఎకరాలు ఉండడంతో ఆ భూమి ఎక్కడినుంచి వచ్చింది, ఎవరి నుంచి కొనుగోలు చేశారు, రెవెన్యూ రికార్డుల్లో ఎలా ఉందనే వివరాలను పరిశీలిస్తూనే క్షేత్రస్థాయిలోకి వెళ్లి సర్వే చేసి క్లియర్ చేస్తున్నారు. మరో 10 ఎకరాల భూమి ఉన్న రైతుల నుంచి పట్టా పాస్బుక్లు, అలాగే 12 మంది ఇళ్లు ఉన్నవారి వివరాలు సేకరించి.. క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 330 మంది భూనిర్వాసితులు ఉంటే 260 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. మరో 40 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు బిల్లులు రెడీ అయ్యాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అవార్డు పాసైన రోజుల వ్యవధిలోనే ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు దశలవారీగా భూమిని రిజిస్ట్రేషన్ చేసి బదిలీ చేసే ప్రక్రియ మొదలైంది. ఇలా ఇప్పటివరకు సేకరించిన 213 ఎకరాలను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తోంది. అధికారుల సమన్వయంతో.. ఎయిర్పోర్టుకు సంబంధించి వివిధ విభాగాల అ ధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నా రు. కొందరికి పట్టాపాస్ పుస్తకాలు లేకపోవడం, సర్వే నంబర్ల మిస్ మ్యాచ్, కొన్ని భూములపై మా ర్ట్గేజ్ లోన్లు, సాదాబైనామా భూముల ద్వారా కాస్త ఆలస్యమైనా.. భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని రెవెన్యూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంకోవైపు భూమి సరిహద్దుల స్థిరీకరణకు ఇప్పటికే ఏఏఐ బిడ్లు పిలిచిన సంగతి తెలిసిందే. సాధ్యమైనంత తొందరగా ఏఏఐకు ఆయా కన్సల్టెన్సీ సంస్థలు ఇచ్చే మార్కింగ్ నివేదికతో ఆ తర్వాత నిర్మాణ పనులకు టెండర్లు పిలవనున్నారు. మరో రెండేళ్లలో మామునూరులో విమానాశ్రయ సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా అధికారులు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే రూ.220 కోట్లు రైతుల ఖాతాల్లో జమ మరో రూ.40 కోట్లు చెల్లింపునకు సిద్ధం -
రేవంత్రెడ్డి అధికారం మూడేళ్లే
హన్మకొండ: సీఎం రేవంత్రెడ్డి భాషను ప్రజలు ఈసడించుకుంటున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ను ఆధికారంలోకి రానివ్వనని మాట్లాడుతున్న రేవంత్రెడ్డి అధి కారంలో ఉండేది మూడేళ్లేనని హితవు పలి కారు. ఆయన బజారు బాష మాట్లాడుతున్నారని తూర్పారబట్టారు. రేవంత్రెడ్డి పరాన్నజీవి అయితే, కేసీఆర్ స్వయం ప్రకాశమైన నాయకుడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని రుజువైందని దుయ్యబట్టారు. యూరి యా కోసం రైతుల పడిగాపులు కాస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలపై ధ్యాసే లేదని ధ్వజమెత్తారు. తెలంగాణకు నంబర్ వన్ ద్రోహి..రాష్ట్రంలో జరుగుతున్న అనేక అరాచకాలను ప్రశ్ని స్తున్న హరీశ్రావు, కేటీఆర్పై కూడా దిగజారుడు భాషే మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణకు నంబర్వన్ ద్రోహి రేవంత్రెడ్డి అని అన్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, నాయకులు చింతం సదానందం, చెన్నం మధు, జోరిక రమేష్, పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్రావు, మూటిక రాజుయాదవ్, గండ్రకోట రాకేశ్యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ పాల్గొన్నారు. ఆయన భాషను ఈసడించుకుంటున్న ప్రజలు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి -
సర్కిల్.. క్రిటికల్!
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లోని పలు డివిజన్ల ప్రజలు సేవల కోసం వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. పరిపాలన వికేంద్రీకరణకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కావడం లేదు. అందుబాటులో లేని సర్కిల్ కార్యాలయాలతో ఇక్కట్లకు గురవుతున్నారు. సుపరిపాలన కోసం గత ప్రభుత్వం 2017 అక్టోబర్ 13న 267 జీఓ విడుదల చేసింది. కాశిబుగ్గ, కాజీపేట రెండుగా ఉన్న సర్కిల్ కార్యాలయాలను విభజించాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీచేశారు. 8 ఏళ్లు గడిచినా అడుగు ముందుకుపడకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దూరంలో సర్కిల్ కార్యాలయాలు.. జనన, మరణ, నూతన భవన నిర్మాణ ధ్రువీకరణ పత్రాలు, కొత్త ఇంటి నంబర్లు, ఆస్తుల విభజన, పేరు మార్పిడి, నల్లా కనెక్షన్లు, ట్రేడ్ లైసెన్స్, మార్టిగేజ్ రిలీజ్, ఇతర అభివృద్ధి పనులు, స్థానిక సమస్యలు పరిష్కారం కావాలంటే బల్దియా సర్కిల్ కార్యాలయాలను ప్రజలు ఆశ్రయించాల్సిందే. కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్కిల్ కార్యాలయాలకు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడుతున్నారు. 2013 మార్చి 19న 42 విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో 110 కిలోమీటర్లు ఉన్న నగరం 407.8 కిలోమీటర్లకు చేరింది. జనాభా 9 లక్షలకు చేరడంతో 53 డివిజన్లు 58కి చేరాయి. 2014లో కాశిబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. 2020–21 సంవత్సరంలో 58 డివిజన్లను డీలిమిటేషన్లో 66కు పెంచారు. ప్రస్తుతం నగర జనాభా 13 లక్షలకు చేరింది. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న 66 డివిజన్లను 88 డివిజన్లుగా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఆ దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 8 ఏళ్లుగా కాగితాలకే సర్కిల్ కార్యాలయాలు వ్యయప్రయాసాలకు గురవుతున్న డివిజన్ల ప్రజలు పట్టించుకోని గ్రేటర్ పాలకవర్గం, ఉన్నతాధికారులు అధికారులు, సిబ్బంది కొరతే కారణం.. గ్రేటర్లో ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 4 సర్కిళ్ల ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. కానీ, బల్దియా పాలకవర్గం, ఉన్నతధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవడం లేదు. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సర్కిళ్లను ఏర్పాటు చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. దూరభారం భరించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బల్దియాకు అధికారులు, సిబ్బంది కొరత ఉన్న దృష్ట్యా ప్రస్తుతం ఉన్న 2 సర్కిళ్లతోపాటు మరో 2 సర్కిల్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని రంగశాయిపేటలో లేదా ఉర్సు సీఆర్సీ సెంటర్, హనుమకొండ నయీంనగర్లో లేదా నక్కలగుట్టలో సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే సేవలు మరింత అందుబాటులో ఉంటాయనే డిమాండ్ ఉంది. డివిజన్ల పునర్విభజనతోపాటు అదనపు సర్కిల్ కార్యాలయాల ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి
గీసుకొండ: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగుతుందని బీజేపీ జిల్లా ఇన్చార్జ్ కొండపెల్లి శ్రీధర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం మండలంలోని ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో భారత రత్న, దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు, సర్పంచ్ల సన్మాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్రెడ్డి, రవికుమార్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అంతకుముందు వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎరబ్రెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, పుల్లారావు, సమ్మిరెడ్డి, అశోక్ రెడ్డి, హరిశంకర్, తిరుపతి రెడ్డి, రాణా ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళలకు వడ్డీ వాపస్
నల్లబెల్లి: మహిళలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను సకాలం చెల్లించిన మహిళ స్వయం సహా యక సంఘాల(ఎస్హెచ్జీ)కు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ డబ్బులు వాపస్ చేసింది. వడ్డీ లేని రుణాల కింద ప్రభుత్వం ఇటీవల జిల్లాలోని 11 మండలాలకు రూ. 6.50 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ మండలాల వారీగా వివరాలు అందించి ఆయా ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ చేసింది. అయితే 2025–2026 సంబంధించిన రుణాలు తీసుకున్న రుణాలు తీసుకున్న సంఘాలకు సంబంధించి వడ్డీని ప్రభుత్వం సంఘాలకు తిరిగి చెల్లించింది. జిల్లా వ్యాప్తంగా 7,540 సంఘాలకు మహిళలకు వడ్డీ డబ్బులను మండలాల వారీగా ఇటీవల పంపిణీ చేశారు. ఈ డబ్బులను సంఘాల ఖాతాల్లో జమచేశారు. జిల్లాలో అత్యధికంగా సంగెం మండలంలో వడ్డీ రూ.79,52,538 వాపస్ రాగా, అతి తక్కువగా నెక్కొండ మండలంలో రూ.76,958 మాత్రమే వడ్డీ వాపస్ వచ్చింది. వడ్డీను ప్రభుత్వం తిరిగి చెల్లించడంతో మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి భరోసా జిల్లాలో 11 మండలాల పరిధిలో 7,540 ఎస్హెచ్జీ సంఘాల్లోని సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేసింది. వీటిని సకాలంలో సకాలంలో వడ్డీతో సహా చెల్లించిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తిరిగి వడ్డీ రాయితీని వారి ఖాతాల్లో జమచేసింది. జిల్లాలో ప్రభుత్వం చెల్లించిన వడ్డీ నిధులు, సంఘాల వివరాలుమండలం ఎస్హెచ్జీలు వడ్డీ(రూ.లల్లో..) చెన్నారావుపేట 707 66,12,744 దుగ్గొండి 500 35,34,507 ఖానాపురం 537 43,25,633 నల్లబెల్లి 576 48,32,289 నర్సంపేట 861 69,33,272 నెక్కొండ 825 76,958 రాయపర్తి 878 56,77,709 గీసుగొండ 674 68,34,282 సంగెం 816 79,52,538 పర్వతగిరి 651 60,03,816 వర్ధన్నపేట 515 46,73,562 జిల్లాలో ఎస్హెచ్జీలకు రూ.6.50 కోట్లు విడుదల 7,540 మహిళా సంఘాలకు లబ్ధి -
62.36%
ధాన్యం సేకరణసాక్షిప్రతినిధి, వరంగల్ : వానాకాలం సేద్యం రైతులకు అచ్చి రాలేదు. పరిస్థితులు అనుకూలించి అధిక దిగుబడి వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగిలింది. పంట వేసింది మొదలు చేతికందే వరకు వరుస వర్షాలు కురవడం, పైరుకు తెగుళ్లు సోకడంతో ఈ సీజన్లో ఉత్పత్తి తగ్గిపోయింది. ఎకరాకు 25 క్వింటాళ్లకుపైగా దిగుబడి వస్తుందని ఆశించినా.. 12 నుంచి 18 క్వింటాళ్ల మధ్యే రావడం తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా కొనుగోలు కేంద్రాలకు అంచనాల మేరకు ధాన్యం రాలేదు. కేంద్రాలు మూసివేసే దశకు చేరినా.. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఈ నెల 24వ తేదీ నాటికి ధాన్యం సేకరణ 62.36 శాతానికే చేరింది. 10.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా.. ఇప్పటికీ 6.48 లక్షల మెట్రిక్ టన్నులే సేకరించారు. ధాన్యం సేకరణ అంచనాలు తారుమారు.. వానాకాలంలో సీజన్లో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 15.83 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందులో 8,78,376 ఎకరాల్లో వరి వేస్తారని భావించగా, ఎనిమిది లక్షల ఎకరాల వరకు సాగైనట్లు అధికారులు ప్రకటించారు. 10,39,815 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు 1,360 ఐకేపీ, పీఏసీఎస్, సివిల్సప్లయీస్ కేంద్రాలను పౌరసరఫరాలశాఖ ప్రతిపాదించింది. కొనుగోలు సీజన్ ప్రారంభం కాగానే ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లో 1,360 కేంద్రాలను తెరిచారు. కొనుగోళ్లు మందకొడిగా మొదలైనా ఆ తర్వాత పుంజుకుంటాయని భావించారు. కానీ, ఈ నెల 24వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో 1,43,357 మంది రైతులనుంచి రూ.1548.19 కోట్ల విలువైన ధాన్యం సేకరించినట్లు అధికారులు ప్రకటించారు. ఽమొత్తంగా ధాన్యం సేకరణ లక్ష్యం 62.36 శాతమే అయ్యింది. అత్యధికంగా జనగామ జిల్లాలో 85.59 శాతం సేకరణ జరగ్గా, అత్యల్పంగా జేఎస్ భూపాలపల్లి జిల్లాలో 40.42 శాతంగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల సరసన నిలిచే ఉమ్మడి వరంగల్లో ఈసారి ధాన్యం దిగుబడి, సేకరణ గణనీయంగా పడిపోవడం చర్చనీయాంశంగా మారింది. దిగుబడిపై అకాలవర్షాలు, తెగుళ్ల ప్రభావం.. వానాకాలం ధాన్యం దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణాలు అకాల వర్షాలు, అతి భారీ వర్షాలు, వరదలు, పంటలకు సోకిన తెగుళ్లు (కాటుక), యూరియా కొరతగా రైతులు చెబుతున్నారు. వీటి వల్ల వరి పంట నీట మునగడం, మొలకెత్తడం, గింజ రాలిపోవడం వంటి సమస్యలతో దిగుబడి గణనీయంగా తగ్గిందని, రైతులు నష్టపోయారని అధికారులు సైతం అంటున్నారు. ఇదే సమయంలో పైరుకు ‘కాటుక’ వంటి తెగుళ్లు సోకడం వల్ల మొత్తంగా ఉత్పత్తి 40 శాతం వరకు తగ్గిందని, ఇందుకు కొన్ని ప్రాంతాల్లో నుంచి వచ్చిన నివేదికలే ఉదాహరణగా చెబుతున్నారు. మోంథా తుపాను నిండా ముంచింది మోంథా తుపాను ప్రభావంతో వరి ఈసారి ఆశించినంత దిగుబడి రాలేదు. సకాలంలో యూరియా కూడా అందకపోవడం పంట దిగుబడిపై ప్రభావం చూపించింది. నాకున్న ఐదు ఎకరాల్లో వరినాటు వేస్తే 78 బస్తాలు వడ్లు పండాయి. వర్షాలతో వరి నేలకొరగడంతో చేను కోయడానికే మిషన్ ఖర్చులు రూ.24 వేలు అయ్యాయి. దీనికితోడు పొలం దున్నడం, నాటు, ఎరువులకు, ఇతరత్రా ఖర్చులు పోను ఏమీ మిగల్లేదు. – హింగే మనోహర్, రైతు, పీచర, వేలేరు సగానికి సగం దిగుబడి తగ్గిందిపోయిన వానాకాలం నాకున్న రెండెకరాలకు తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి పంటేసిన. ఎకరానికి 30 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని అనుకున్న. కానీ పంట చేతికొచ్చే దశలో కురిసిన అకాల, భారీ వర్షాల కారణంగా దిగుబడి సగానికి సగం తగ్గిపోయి ఎకరానికి సుమారు 15 క్వింటాళ్ల వరకు మాత్రమే వచ్చింది. పంట చేతికొచ్చే దశలో కురిసిన వర్షాలు రైతులను ఆగం చేశాయి. – వడ్డె వీరయ్య, కమలాపూర్ రైతుజిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలు, ధాన్యం సేకరణ ఇలా..(ధాన్యం మెట్రిక్ టన్నుల్లో) జిల్లా సేకరించాల్సిన కేంద్రాల కేంద్రాల కొనుగోలు రైతుల విలువ ధాన్యం ప్రతిపాదన ప్రారంభం ధాన్యం సంఖ్య (రూ.కోట్లలో) హనుమకొండ 1,80,355 157 157 1,03,154 25754 246.39 వరంగల్ 1,95,141 260 260 1,15,440 28604 275.77 జనగామ 1,69,662 294 294 1,45,206 36274 346.87 మహబూబాబాద్ 2,24,688 260 260 1,54,520 31334 369.06 భూపాలపల్లి 1,22,543 204 204 49,356 9616 117.89 ములుగు 1,47,426 185 185 80,702 11775 192.21 ఉమ్మడి జిల్లా రైతులకు అచ్చిరాని వానాకాలం సాగు 10.40 లక్షల టన్నులు సేకరణ లక్ష్యం.. 1,360 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు వచ్చింది 6.48 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు కేంద్రాలకు తగ్గిన ధాన్యం.. దిగుబడి తగ్గడమే కారణం రైతులను ముంచిన అకాలవర్షం.. మొదలైన యాసంగి సీజన్ -
స్థల పరిశీలన
పర్వతగిరి: పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామంలోని పల్లవి మోడల్ పాఠశాలలో త్వరలో నిర్వహించనున్న 44వ రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు అవసరమైన స్థలం, గదులను గురువారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. పాఠశాల చైర్మన్ రాచకొండ అశోకచారిను వసతుల కల్పన గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు అనుకూల వాతావరణం ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, మండల పార్టీ అధ్యక్షుడు జాటోతు శ్రీనివాస్నాయక్, సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, నాయకులు పాల్గొన్నారు. -
అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరుకుల్ల మహాలక్ష్మిశంకరమ్మ, శ్రీనివాస్రజిత దయాకర్, సాయితేజ, స్వాతిలు పడిపూజ బాధ్యులుగా పాల్గొనగా ప్రధాన అర్చకులు దేవిష్మిశ్రా తాంత్రిక పూజ విధానంలో అయ్యప్పస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అచల్ దేవిష్మిశ్రా, కేతుడి భవాని, అశోక్రెడ్డి, ఎర్ర జగన్మోహన్రెడ్డిర్మిల, లింగాల అమృతవంశీధర్రెడ్డి, పబ్బ దీప్తి, సదాశివుడు, గుట్టం వినిత్, వంశీకృష్ణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ సెమిస్టర్ పరీక్షలు వాయిదాకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 27నుంచి నిర్వహించాల్సిన ఎంబీఏ, ఎంసీఏ మూడవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ తెలిపారు. యూజీసీనెట్, టీజీసెట్, టీజీటెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఆయా పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయం మార్పునర్సంపేట: నర్సంపేట ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (కరెంటు బిల్లులు చెల్లించే కార్యాలయం) నెక్కొండ రోడ్డు నుంచి మల్లంపల్లికి రోడ్డులోని సబ్స్టేషన్ దగ్గర డివిజన్ ఆఫీస్లోకి మార్చినట్లు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఆకవరపు మధుసూదన్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించే వినియోగదారులు ఈ మార్పును గమనించి వల్లబ్నగర్ సబ్స్టేషన్ దగ్గర ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్లో బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. ‘నేరెళ్ల’ పురస్కారానికి రామా చంద్రమౌళి ఎంపిక హన్మకొండ కల్చరల్: నేరెళ్ల వేణుమాధవ్ స్మారక ప్రతిభా పురస్కారానికి వరంగల్కు చెందిన కవి, నవలా రచయిత రామా చంద్రమౌళిని ఎంపిక చేసినట్లు నేరెళ్ల వేణుమాధవ్ కల్చ రల్ ట్రస్ట్ అధ్యక్షురాలు నేరెళ్ల శోభావతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28న హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని నేరెళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో జరిగే ధ్వన్యనుకరణ సామ్రాట్ డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ 94వ జయంతి కార్యక్రమంలో రామా చంద్రమౌళికి పురస్కారం అందజేస్తామని శోభావతి పేర్కొన్నారు. -
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ: గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిలిచర్ల గ్రామంలో కాక వెంకటస్వామి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని, కాసేపు బ్యాటింగ్ చేసి నిర్వాహకులను ఉత్సాహపరిచారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో ప్రసవాల సంఖ్య పెంచాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్య ● పీహెచ్సీ తనిఖీ శాయంపేట: ప్రభుత్వాస్పత్రిలోనే ప్రసవాలు జరిగేలా వైద్య సిబ్బంది చూడాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. టీబీ ముక్త్ భారత్, ఎన్ సీడీ కార్యక్రమాలపై వైద్యులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. మండలంలో మగవారి కంటే ఆడవారి జననాల రేటు తక్కువగా ఉందని పెరిగేలా ప్రోత్సహించాలని సూచించారు. గర్భిణులు నార్మల్ ప్రసవాలు జరిగేలా చూస్తూ ప్రసవాలన్నీ ప్రభుత్వ ఆస్పత్రిలోనే జరిగేలా చూడాలన్నారు. సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అప్పయ్య హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
మీచేతుల్లోనే పంచాయతీ సమాచారం
సాక్షి, వరంగల్: మీ ఊరిలో చెత్త సమస్య ఉందా.. రాత్రి వేళ వీధి దీపాలు వెలగడం లేదా.. డ్రెయినేజీ నిండిపోయిందా.. అయినా పంచాయతీ సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదా.. ఇన్నాళ్లూ సమస్యలు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తేనే పరిష్కారం అవుతాయనే అపోహ ఉండేది. ఇప్పుడు మీరే ఆ సమస్య పరిష్కరించవచ్చు. అందుకే మీరు చేయాల్సిందల్లా మీ సెల్ఫోన్లో ఆ సమస్య తీవ్రతను తెలిపే ఫొటో తీసి ‘మేరీ పంచాయతీ’ యాప్లో కంప్లయింట్ సిస్టం అనే ఫీచర్లో జియో ట్యాగ్ వివరాలతో నిక్షిప్తం చేస్తే చాలు.. ఆ సమస్యను అక్కడున్న పంచాయతీ సిబ్బంది పరిష్కరిస్తారు. లేదంటే ఉన్నతాధికారులు ఇలా వచ్చే ఫిర్యాదులను పట్టించుకోని సిబ్బందిపై వేటు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో పాలన పారదర్శకత కోసం 2019లోనే కేంద్రం ఈ మేరీ పంచాయతీ యాప్ తీసుకొచ్చింది. ఇటీవల నుంచే పూర్తిస్థాయిలో యాప్ పనిచేస్తోంది. ఆయా పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, పంచాయతీల ఆదాయం, ఖర్చు వివరాలను అప్లోడ్ చేస్తున్నారు. ఈ యాప్లో వివరాల నమోదు సమయంలోనే జీపీఎస్ ద్వారా గుర్తించే అవకాశముంది. ఇతర చోట్ల పనులకు కేటాయించిన నిధులను వినియోగించినా తెలుసుకోవచ్చు. ఇలా చేయడంతో పాలకులు సైతం తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. అధికారులు తప్పుడు నివేదికలు రూపొందిస్తే ప్రశ్నించడానికి వీలుంటుంది. అయితే ఈ యాప్పై ప్రజలకు అవగాహన కలిగించడంతో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. గ్రామాల్లో చాలా వరకు చదువుకున్న యువతకు తప్ప మరొకరికి ఈ యాప్ ఉన్నట్లు తెలియదు. ఈ యాప్పై పంచాయతీ అధికారులు జాగృతి కల్పించాల్సిన అవసరముంది. ఇటీవల జిల్లాలో 316 పంచాయతీలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. మీ ఊరి చిట్టా మీ చేతుల్లోనే.. మేరీ పంచాయతీ యాప్ను స్మార్ట్ఫోన్లో ప్లే స్టోర్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ కావాలి. వెంటనే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు, పిన్కోడ్ ఎంచుకోవాలి. అనంతరం గ్రామపంచాయతీ పూర్తి వివరాలు ఇందులో కనిపిస్తాయి. ఈ యాప్ ద్వారా సర్పంచ్, కార్యదర్శి, గ్రామ కమిటీలు, పంచాయతీ ఆస్తుల వివరాలు తెలుసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం మంజూరు చేసే నిధులు, పనులు ఏ దశలో ఉన్నాయి, దేనికి ఎంత ఖర్చు చేశారన్న వివరాలు నమోదై ఉంటాయి. నిధుల్లో సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చులు కూడా యాప్లో నమోదు చేస్తారు. వచ్చే సంవత్సరంలో అంచనా వ్యయాల నమోదుతోపాటు గ్రామసభల వివరాలు సైతం అందుబాటులో ఉంటాయి. దీనిలో నిధుల వినియోగంలో ఎన్ని లోపాలున్నా, అక్రమాలు జరిగినా తెలుసుకోవడమే కాకుండా సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి అవకాశం ఉంది. ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం తమ ఊరిలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుందని పంచాయతీ సిబ్బంది అంటున్నారు. ఇలా పంచాయతీ పాలనను ఎక్కడినుంచైనా తెలుసుకోవచ్చు. అందుబాటులో ‘మేరీ పంచాయతీ’ యాప్ ఫొటో తీసి అప్లోడ్ చేస్తే సమస్య పరిష్కారం గడువులోగా సిబ్బంది పరిష్కరించకపోతే చర్యలు జిల్లాలో 316 గ్రామపంచాయతీలు -
క్లెయిమ్ చేయని ఆస్తులు పొందొచ్చు
హన్మకొండ అర్బన్: క్లెయిమ్ చేయని ఆర్థిక ఆస్తులను హక్కుదారులు తమ బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలను సంప్రదించి నిధులు తిరిగి పొందొచ్చని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ సూచించారు. కలెక్టరేట్లో ‘మీ డబ్బు–మీ హక్కు’ అంశంపై బుధవారం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గణేశ్ మాట్లాడుతూ.. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా ఆదాయాలు, తది తర ఆస్తులు తిరిగి పొందొచ్చని సూచించారు. ఎస్ బీఐ రీజినల్ మేనేజర్ షేక్ అ బ్దుల్ రహీం, ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్. రెహమాన్, ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ కాళీప్రకాశ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు. హక్కులపై అవగాహన కల్పించాలి.. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించాలని హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వై.వి గణేశ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ఎక్కువగా తూకాలతో నష్టపోతున్నారని, దీని నివారణకు తూనికలు కొలతల శాఖ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వినియోగదారుల ఫోరం విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీఎస్ఓ వాజీద్ అలీ, తూనికలు కొలతల శాఖ అధికారి వెంకటేశ్, రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు రతన్ సింగ్ ఠాగూర్, కార్యదర్శి సూరజ్, ఓరుగల్లు వినియోగదారుల ఫోరం సభ్యులు దండు యుగేందర్, బండ వివేకానంద, శోభ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ‘మీ డబ్బు – మీ హక్కు’ అంశంపై శిబిరం -
పల్లెల్లో డిజిటల్ బ్యాంకింగ్ సేవల విస్తరణ
నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్కాజీపేట అర్బన్: గ్రామీణ స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలను విస్తరించడంతో పాటు పాడి రైతులకు నగదు లావాదేవీలను సులభతరం చేయడానికి మైక్రో ఏటీఎంలు ఉపయోగపడతాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉదయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం డీసీసీబీ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా నాబార్డ్ సీజీఎం ఉదయ్భాస్కర్ మాట్లాడుతూ.. బ్యాంకు నిర్వాహణ పని తీరు ఎంతో సంతృప్తిగా ఉందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, నాబార్డ్ డీడీఎంలు చంద్రశేఖర్, రవి, జీఎం ఉష శ్రీ, డీజీఎం అశోక్ పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల పడిగాపులు
● అమల్లోకి రాని మొబైల్ యాప్ దుగ్గొండి/గీసుకొండ: యాసంగిలో మొక్కజొన్న, కూరగాయలు, ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులకు యూరియా కోసం పడిగాపులు తప్పడం లేదు. ఎరువులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. యాప్పై ఇటీవల రైతులకు అవగాహన కల్పించారు. ఈ నెల 22 నుంచి మొబైల్ యాప్ ద్వారా బుక్చేసుకున్న రైతులకు యూరియా బస్తాలను పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. యాప్ అమల్లోకి రాకపోవడంతో రైతులు పాత పద్ధతిలోనే యూరియా కోసం బారులుతీరాల్సిన పరిస్థితి నెలకొంది. దుగ్గొండి మండలంలోని తిమ్మంపేట పీఏసీఎస్ గోడౌన్కు యూరియా వచ్చిందని తెలుసుకున్న వందలాది మంది రైతులు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి క్యూ కట్టారు. అనంతరం సొసైటీ సిబ్బంది ఒక్కో రైతుకు ఒక్కో బస్తా అందించారు. మధ్యాహ్నం వరకు తిండి తిప్పలు లేకుండా క్యూలో ఉంటే ఒకేబస్తా వచ్చిందని రైతులు నిట్టూర్చారు. అదేవిధంగా గీసుకొండ మండలం కొనాయమాకుల రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం రైతులు బారులుదీరి కనిపించారు. -
‘పది’పై ప్రత్యేక దృష్టి సారించండి
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెన్త్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రణాళికతో ముందుకెళ్లేలా పర్యవేక్షించాలని డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలను ఆదేశించారు. బుధవారం డీఈఓ కార్యాలయంలోని డీసీఈబీ భవనంలో హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, జిల్లాలోని పాఠశాలలను తనిఖీ చేయాలని, పాఠశాలల్లో పరిశుభ్రత ఉండేలా చూడాలన్నారు. పాఠశాలల్లో 5వ తరగతినుంచి 10వ తరగతివరకు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం అర్హులైన విద్యార్థులతో ఇ–పాస్ ద్వారా దరఖాస్తులు చేయించాలని ఆదేశించారు. సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి డాక్టర్ బి.రాంధన్, సాంఘిక సంక్షేమ జిల్లా సహాయగణాంక అధికారి జి.రాహుల్, ఎంఈఓలు జి.నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఎ.శ్రీనివాస్, ఎస్.విజయ్కుమార్, ఎం.చంద్రమౌళి, పి.ఆనందం, ఎల్. రాజేశ్కుమార్, కె.శ్రీధర్, భిక్షపతి పాల్గొన్నారు. డీఈఓ గిరిరాజ్గౌడ్ ఎంఈఓలతో సమీక్ష -
స.హ.. కహా?
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తుల పరిష్కారం అథమ స్థాయిలో ఉంది. పౌరులు అడిగిన సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని దశాబ్దాల క్రితం అమల్లోకి తెచ్చింది. నిబంధన ప్రకారం దరఖాస్తు చేసిన పౌరులకు నిర్దేఽశిత కాలంలో అడిగిన సమాచారాన్ని అందించాలి. కానీ, గ్రేటర్ వరంగల్లో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు ఏళ్ల తరబడి మూలుగుతున్నాయి. సమాచారం కోసం దరఖాస్తుదారులు బల్దియా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలు ఇవీ.. సమాచార హక్కు చట్టం ప్రకారం కోరిన సమాచారాన్ని 30 రోజుల్లో దరఖాస్తుదారుడికి అందించాలి. లేకపోతే సంబంధిత అధికారి అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సమాచారం ఇవ్వడంలో జాప్యం వంద రోజులు దాటితే సంబంధిత అధికారి రూ.25 వేల వరకు అపరాధ రుసుం చెల్లించాలి. దరఖాస్తు ఏ విభాగానికి చెందినదో ఆ విభాగ అధికారి ఇందుకు బాధ్యత వహించాల్సి ఉండగా.. మహా నగర పాలక సంస్థలో కొన్ని దరఖాస్తులకు తూతూమంత్రంగా సమాచారం అందిస్తూ, మరి కొ న్నింటికి సమాచారం లేదని రాత పూర్వకంగా అందిస్తుండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వం.. బల్దియాలో పౌరులు సమాచారం కావాలని దరఖాస్తు చేస్తే నెలలు గడిచినా అడిగిన సమాచారం అందడం లేదు. ప్రశ్నలు అడిగే తీరులో లోపాలు పట్టుకుని సమాచారాన్ని తిరస్కరిస్తున్నారు. సూటిగా, స్పష్టంగా ఇవ్వకుండా తెలుగులో దరఖాస్తు చేస్తే ఇంగ్లిష్లో సమాచారం ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. తెలుగు మాత్రమే తెలిసిన వారికి ఇంగ్లిష్ సమాచారం ఎలా అర్థమవుతుందనేది అధికారులకే తెలియాలి. అప్పిలేట్ అథారిటీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అప్పీళ్లపై సహేతుకంగా విచారణలు నిర్వహించి, చర్యలు తీసుకునే విధానం తగ్గిపోయింది. దీంతో దరఖాస్తుదారులు చేసేదేం లేక మళ్లీ దరఖాస్తులు పెడుతున్నా కోరిన సమాచారం రావడం లేదంటూ ఫిర్యాదుదారులు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్ పరిధి ప్రధాన కార్యాలయంలో, కాశిబుగ్గ, కాజీపేట ఏ సర్కిల్లో సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేసినా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో సమాచార హక్కు చట్టం ద్వారా 320 పైచిలుకు దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయంటే అధికారుల నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అమలులో ‘గ్రేటర్’ అధికారుల నిర్లిప్తత కాళ్లరిగేలా అర్జీదారుల ప్రదక్షిణలు సమావేశాలు, సమీక్షలు కరువు గ్రేటర్ వరంగల్లో అధ్వాన పరిస్థితి కొరవడిన జవాబుదారీతనం సమాచార హక్కు చట్టం అమలులో వరంగల్ నగర పాలక సంస్థ అధికారులు ఆది నుంచి అలసత్వం వహిస్తున్నారు. విభాగాల వారీగా ఎన్ని దరఖాస్తులు అందాయి? నిర్ణీత గడువులోగా ఎన్నింటికి సమాచారం అందించారు? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే అంశాలపై సమీక్షలు జరగడం లేదు. దీంతో సమాచార హక్కు చట్టం దరఖాస్తులు పెద్ద ఎత్తున పెండింగ్లో పడిపోతున్నాయి. వాస్తవానికి వారానికోసారి సమీక్షలు నిర్వహించాలి. సకాలంలో సమాచారం అందించని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. -
పీఆర్సీని ప్రకటించాలి
విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీని ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికై న ఆరునెలలలోపు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం శోఛనీయమన్నారు. ఐదు డీఏలు విడుదల చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 23ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ చైర్మన్ రాజశేఖర్రెడ్డి, టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సోమశేఖర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, ఆల్ పెన్షనర్ల అసోసియేషన్ రాష్ట్ర బాధ్యులు సీతారాం, జిల్లా కార్యదర్శులు సీహెచ్.లింగారావు, మోజెస్, చంద్రయ్య, ప్రసన్నానంద్, కె.సదానందం, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.రాజారాం, ఎస్.జ్యోతి, గురుకుల బాధ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టెట్ నుంచి టీచర్లను మినహాయించాలి టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవి -
వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి సంగెం: వినియోగదారులు చైతన్యం కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివియోగదారుల హక్కులు.. బాధ్యతలు.. పరిష్కార మార్గాలు అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ స్థానం కేజీబీవీ విద్యార్థిని బి.రక్షిత, ద్వితీయస్థానం సంగెం జడ్పీహెచ్ఎస్ విద్యార్థి పెరుమాండ్ల చరణ్ సాధించారు. బుధవారం హనుమకొండలోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి చేతుల మీదుగా వారు బహుమతులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వినియోగదారుల చట్టం అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోఆర్టినేటర్ పులి రాజశేఖర్, గైడ్ టీచర్ తాటిపాముల రమేశ్, కేజీబీవీ పీఈటీ పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి పెద్ద చెరువుల్లోనే!
చేపపిల్లలను విడుదల చేసిన మత్స్యశాఖ అధికారులుగీసుకొండ: జిల్లాలోని చెరువుల్లో ఉచిత చేపపిల్ల లను వదిలే కార్యక్రమం ప్రహసనంలా మారింది. చేపపిల్లలను పెద్ద చెరువుల్లో విడుదల చేసి చిన్న చెరువులకు పంపిణీ చేయలేని పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్, అక్టోబర్లోపు ప్రతి ఏడాది చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా.. గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతో మరింత జాప్యమైంది. ఎట్టకేలకు ఈ ఏడాది నవంబర్లో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో 71 పెద్ద (పెరినియల్) చెరువులు ఉండగా ఇప్పటి వరకు 63 చెరువుల్లో సుమారు 71.43 లక్షల చేపపిల్లలు వదిలారు. ఇంకా మిగిలిన పెద్ద చెరువుల్లో 18.82 లక్షల చేపపిల్లలను పోయాల్సి ఉందని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. 635 చిన్న (సీజనల్) చెరువుల్లో ఒక్క చెరువులో కూడా చేపపిల్లలను పోయలేదని చెబుతున్నారు. ఈఏడాది చేపపిల్లల పంపిణీ టెండర్ను పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ వారు దక్కించుకున్నారు. చాలా ఆసల్యంగా టెండర్ల ప్రక్రియ ముగియడం, పంపిణీలో జాప్యం కావడంతో చిన్న చెరువులకు చేపపిల్లలను అందించలేమని వారు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. వాతావరణం అనుకూలించినా.. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. నవంబర్ మొదటి వారం వరకు వర్షాలు కురవడంతో చెరువులు మత్తడి పడ్డాయి. ఎన్నడూ లేని విధంగా చేపపిల్లల పంపిణీ ఆలస్యంగా ప్రారంభించడంతో తాము నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్య సంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది సగం మేరకు చేపపిల్లలను పంపిణీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ ఏడాది మత్స్యసంఘాల వారు సొంత డబ్బులతో ఆంధ్రప్రదేశ్తోపాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి చెరువుల్లో పోశారు. చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేకపోయినా తమకు నగదు బదిలీ చేయాలని మత్స్య సంఘాల వారు కోరుతున్నారు. నీలకంఠ రొయ్య పిల్లల పంపిణీ లేనట్లే.. జిల్లాలోని పలు జలాశయాల్లో కొంతకాలంగా మత్స్యకారులకు లాభదాయకంగా ఉండే నీలకంఠ రొయ్య పిల్లలను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది కూడా పంపిణీ చేస్తారని అనుకుంటే వారికి నిరాశే మిగిలింది. గతంలో సంగెం మండలం ఎలుగూరు రంగంపేట చెరువు, రాయపర్తి మండలం మైలారం రిజర్వాయర్, వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట చెరువు, నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు తదితర జలాశయాల్లో 10 లక్షల వరకు రొయ్యపిల్లలను పంపిణీ చేశారు. ఇవి మంచినీటి జలాశయాలు కావడంతో మత్స్యకారులు పెరిగిన రొయ్యలను వలలతో పట్టి అధిక ఆదాయం పొందేవారు. ఈ ఏడాది రొయ్య పిల్లల పంపిణీ ఉంటుందని అనుకున్నాం అదేం లేదని అధికారులు చెబుతున్నారు. మత్స్య సంఘాలు 189రిజర్వాయర్ మైలారం మొత్తం చెరువులు 706మత్స్య సంఘాల్లో సభ్యులు 15,821 చిన్నచెరువులకు పంపిణీ చేయబోమని చెప్పిన జస్వంత్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఇలాగైతే తీవ్రంగా నష్టపోతామంటున్న మత్స్య సంఘాల బాధ్యులు జిల్లాలో 635 చిన్న, 71 పెద్దచెరువులు.. 1.93 కోట్ల చేపపిల్లల పంపిణీ లక్ష్యంరాష్ట్ర అధికారులకు నివేదించాం చిన్న చెరువులకు చేపపిల్లలను పంపిణీ చేయలేమని జస్వంత ఆక్వా కంపెనీ వారు చెప్పారు. ఈ విషయాన్ని తాము రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఇప్పటికే నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగుతాం. జిల్లాలో ఇంకా చేపపిల్లలను పంపిణీ చేయని పెద్ద జలాశయాలకు ఈ నెల 31లోపు పంపిణీ పూర్తి చేస్తాం. – పిల్లి శ్రీపతిరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి -
ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు
నర్సంపేట రూరల్: ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చెన్నారావుపేట మండల కేంద్రంలోని సిద్ధేశ్వర ఆలయంలో స్వామివారిని అర్చకులు భిక్షమయ్యశాస్త్రి, సాయిశాస్త్రి, గణేశ్శాస్త్రి ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పాకాల తైబందీ ఖరారునర్సంపేట: ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు ఆయకట్టు రబీ తైబందీని నీటి పారుదలశాఖ అధికారులు, రైతుల సమక్షంలో బుధవారం ఖరారు చేసినట్లు ఈఈ సుదర్శన్రావు తెలిపారు. పాకాలలో ప్రస్తుతం 28.6 ఫీట్ల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. సంగెం కాల్వ కింద 10 వేల ఎకరాలు, జాలుబంధం కాల్వ కింద 3,515, తుంగబంధం కాల్వ కింద 1,100 ఎకరాలు(లంబాడీ లచ్చమ్మ బుర్ర వరకు), పసునూరి కాల్వ కింద 1457, మాటు వీరారం కింద 900 ఎకరాలు నిర్ణయించారు. పాకాల ఆయకట్టు కింద మొత్తం 18,193 ఎకరాలకు 16,972 ఎకరాలకు నీరు అందించనున్నట్లు ఈఈ సుదర్శన్రావు పేర్కొన్నారు జనవరి మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని, మొదటి వారంలోనే నార్లు పోసుకుని ఏప్రిల్ 30 లోపు కోతలు పూర్తిచేసుకునే విధంగా రైతులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. మాదన్నపేట చెరువు 1,020 ఎకరాలు.. నర్సంపేట రూరల్: మాదన్నపేట పెద్ద చెరువు యాసంగి తైబందీ రైతుల సమక్షంలో ఖరారు చేసినట్లు డీఈ సామ్యానాయక్ తెలిపారు. ఈ మేరకు నర్సంపేట నీటి పారుదల శాఖ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈ సామ్యానాయక్ మాట్లాడుతూ మాదన్నపేట చెరువు మొదటి నుంచి చిమ్మినేని బుర్ర వరకు (మాదన్నపేట శివారు) 220 ఎకరాలు, వైఎస్ఆర్ రోడ్డు నుంచి గొల్లె కన్నయ్య వరకు 500 ఎకరాలు, దుబ్బ కాల్వ చెరువు మొదటి నుంచి కుమ్మరిగడ్డ బుర్ర వరకు 300 ఎకరాలు మొత్తం 1,020 ఎకరాలకు తైబందీ ఖరారు చేసినట్లు తెలిపారు. ఏఈ నితిన్, రైతులు పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలిఖిలా వరంగల్: మహిళలు వ్యాపారరంగాల్లో ఆర్థికంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ బి.ఉదయ్ భాస్కర్ సూచించారు. మహిళా స్వయం సహాయ సంఘం సభ్యులకు నైపుణ్యత, సూక్ష్మ వ్యాపారాల ప్రోత్సాహం(ఎం–సువిధ)పై వరంగల్ శంభునిపేటలోని ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ నాబార్డ్ ఎప్పటికప్పుడు మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటునిస్తుందని, శిక్షణలతోపాటు నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్ పద్ధతులు కూడా మహిళలకు నేర్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు ఆన్లైన్, డిజిటల్ మార్కెటింగ్లో శిక్షణ పొందాలని, అంతర్జాతీయ మార్కెట్ను లక్ష్యంగా చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నాబార్డ్ వరంగల్ అభివృద్ధి మేనేజర్ శ్రీ చైతన్య రవి, డీజీఎం బొల్లా శ్రీనివాస్, ఏజీఎం చంద్రశేఖర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిశ్రమల అధికారి నరసింహమూర్తి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, కార్పొరేటర్ పోశాల పద్మ, గ్రామీణ బ్యాంకు రీజనల్ మేనేజర్ చైతన్యకుమార్, యూనియన్ బ్యాంకు డీజీఎం కమలాకర్, చింతల అన్వేశ్ పాల్గొన్నారు. -
ఆరంభంలోనే అవస్థలు
కమలాపూర్: యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు మొదలయ్యాయి. యూరియా వచ్చిందని తెలియగానే రైతులు పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులు తొలగించడానికి యాప్ను ప్రవేశపెట్టినప్పటికీ అది పూర్తిస్థాయిలో రైతులకు అందుబాటులోకి రాలేదు. దీంతో కమలాపూర్ పీఏసీఎస్కు ఇటీవల నాలుగు లారీల్లో 1,776 బస్తాల యూరియా రాగా, వాటిని మంగళవారం కొందరు రైతులకు పంపిణీ చేశారు. పీఏసీఎస్లో యూరియా పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో బుధవారం ఉదయం 6:30 గంటల నుంచే మండలంలోని వివిధ గ్రామాల రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులుదీరారు. మరి కొందరు రైతులు క్యూలైన్లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున పంపిణీ చేస్తుండగా, మంగళవారం ఒక్కో రైతుకు 5 బస్తాల చొప్పున పంపిణీ చేసి ఇప్పుడు తమకు 3 బస్తాలే ఎందుకు పంపిణీ చేస్తున్నారంటూ రైతులు పీఏసీఎస్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణ సిబ్బందితో కలిసి హుటాహుటిన అక్కడకు వెళ్లి రైతులకు నచ్చజెప్పారు. పోలీసు పహారాలో రైతులకు యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ పలువురు రైతులు యూరియా బస్తాలు దొరక్క నిరాశతో వెనుదిగిరి వెళ్లిపోయారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే యూరియా బస్తాల కోసం వ్యవసాయ పనులన్నీ వదులుకుని కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా గ్రామాలకే సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ఏఓ వేణు మాట్లాడుతూ.. మండలంలో యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. మరో రెండు రోజుల్లో మరింత స్టాక్ రానుందని, రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. యాసంగిలో రైతులకు తప్పని యూరియా తిప్పలు పోలీస్ పహారాలో పంపిణీ -
మద్దిమేడారం జాతరకు ఏర్పాట్లు చేయాలి
● అధికారుల సమీక్షలో కలెక్టర్ సత్యశారద నల్లబెల్లి: అధికారులు సమన్వయంతో పనిచేసి నాగరాజుపల్లి మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. అధికారులతో కలిసి మద్దిమేడారం జాతరను కలెక్టర్ బుధవారం సందర్శించారు. ఆలయ ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజు స్వాగతం పలికారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో జరగనున్న జాతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్ల మరమ్మతు, విద్యుత్ సరఫరా, లైట్ల ఏర్పాటు, తాగునీటి వసతి, పారిశుద్ధ్య పనులు, వాహనాల పార్కింగ్కు స్థలాల కేటాయింపు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రధాన పూజారి దురిశెట్టి నాగరాజుతో మాట్లాడి జాతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లపై సమగ్ర నివేదిక పంపించాలని తహసీల్దార్ ముప్పు కృష్ణను ఆదేశించారు. జాతరలో ప్లాస్టిక్ను వినియోగించొద్దని, పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్ భక్తులను కోరారు. పీఆర్ జిల్లా అధికారి ఇజ్జగిరి, ఎంపీడీఓ డాక్టర్ శుభనివాస్, సర్పంచ్లు ఎరుకలి లలిత, ఎరుకల సరోజన, ఆలయ కమిటీ చైర్మన్ గాదె సుదర్శన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, విష్ణు పాల్గొన్నారు. మేడారం భక్తులకు వసతులు కల్పించాలి.. న్యూశాయంపేట: ములుగు జిల్లా మేడారం జాతరకు వెళ్లే సమక్క–సారలమ్మ భక్తులకు వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో ఏర్పాట్లపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు ప్రణాళికతో సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం భక్తుల కోసం తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ ఏర్పాటును క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా ఆర్అండ్బీ అధికారి రాజేందర్, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, ఈఈ సునీత తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి.. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్స్పాట్లు) గుర్తించి నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకోవాలన్నారు. వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి, ఇతర ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఇజ్జగిరి, ఎన్హెచ్ అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్ ఏర్పాటు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని లైబ్రరీ సైన్స్లో దివంగత బండారి చంద్రశేఖర్, దివంగత బండారి రమణిరత్నం పేర గోల్డ్మెడల్, స్వాతంత్య్ర సమర యోధులు, జనధర్మ, వరంగల్వాణి పత్రికల వ్యవస్థాపకులు దివంగత ఎంఎస్ ఆచార్య, దివంగత రంగనాయకమ్మ స్మారకార్థం జర్నలిజం విభాగంలో మరో గోల్డ్మెడల్ ఏర్పాటు చేశారు. గోల్డ్మెడల్కింద ఆయా విభాగాల్లో రూ.3లక్షల చొప్పున జమ చేశారు. అధిక మార్కులు పొందిన విద్యార్థికి ఆ నగదు (గోల్డ్మెడల్) అందజేయనున్నారు. ఆయా ఉత్తర్వులను వీసీ కె.ప్రతాప్రెడ్డి బుధవారం జారీ చేశారు. విభాగాల అధిపతులు డాక్టర్ బి.రాధికారాణి, ఎం.రాజగోపాలచారి బి.వెంకట్రామ్రెడ్డి, డాక్టర్ సంగని మల్లేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ గుర్రం శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైక్రోబయాలజీలో రెండు, కంప్యూటర్ సైన్స్లో రెండు, తెలుగు సబ్జెక్టులో ఒక వేకన్సీ ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈనెల27 సాయంత్రం వరకు కేడీసీలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పీజీతోపాటు పీహెచ్డీ, నెట్ లేదా సెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మౌఖిక పరీక్షలు ఈనెల 29న నిర్వహించనున్నట్లు తెలిపారు. మిగతా వివరాలకు పీజీ కోర్సుల కో–ఆర్డినేటర్ డాక్టర్ వాసం శ్రీనివాస్ 98850 59533లో సంప్రదించాలని ఆయన కోరారు. శిల్ప కళా సౌందర్యం అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాలు, ఆనాటి నిర్మాణ శైలి, శిల్ప కళా సౌందర్యం మహాద్భుతంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా జడ్జి నసీమా అన్నారు. బుధవారం వరంగల్ నగరంలోని ఖిలా వరంగల్ మధ్యకోటను జడ్జి నసీమా తన కుటుంబంతో కలిసి సందర్శించారు. శిల్పాల ప్రాంగణంలోని శిల్ప కళా సంపదను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవియాదవ్.. జడ్జి కుటుంబానికి వివరించారు. జడ్జి వెంట ఎస్సై శ్రావణ, టీజీ టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్, కేంద్ర పురావస్తుశాఖ సిబ్బంది ఉన్నారు. కేయూ క్యాంపస్: చైన్నెలోని అమీట్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28వ తేదీ వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టేబుల్ టెన్నిస్ పురుషుల టోర్నమెంటుకు కేయూ పురుషుల జట్టును ఎంపిక చేసినట్లు బుధవారం స్పోర్ట్స్బోర్డు సెక్రటరీ వై.వెంకయ్య తెలిపారు. జట్టులో కె.శ్రీసాయివర్ధన్, ఎన్.యశ్వంత్ రెడ్డి, బి.చింతేశ్వర్రెడ్డి, ఎస్.ప్రేమ్దినకర్, కె.దీపక్బాబు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేశ్ కోచ్కమ్ మేనేజర్గా వ్యవహస్తారని తెలిపారు. టెన్నిస్ మెన్, ఉమెన్ జట్ల ఎంపిక..బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో ఈనెల 25నుంచి 28 వరకు జరగనున్న సౌత్జోన్ ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంటుకు కాకతీయ యూనివర్సిటీ మెన్ అండ్ ఉమెన్ జట్లను ఎంపిక చేసినట్లు వెంకయ్య తెలిపారు. టెన్నిస్ పురుషుల జట్టులో బి.మనోజ్కుమార్, కె.విశాల్ ఆదిత్య, ఎన్.గౌతమ్, ఎం.రామకృష్ణ, కె.శ్రావణ్ ఉన్నారు. ఉమెన్స్ జట్టులో డి.ప్రదీప్త, టి.సింధు, హెచ్.సంయుక్త, డి.అఖిల ఉన్నారు. ఎస్.మహేశ్ కోచ్ కమ్ మేనేజర్గా వ్యవహరించనున్నారు. -
బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి
● శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ న్యూశాయంపేట: లింకేజీ రుణాల మంజూరుకు బ్యాంకులు చిత్తశుద్ధితో పనిచేయాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్లో బుధవారం బ్యాంకర్లతో జరిగిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ మీటింగ్ (డీసీసీ సమావేశం)లో ఆయన మాట్లాడారు. బ్యాంకులు సామాజిక బాధ్యతగా అర్హులకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై బ్యాంకర్లు దృష్టి సారించి విజయవంతం చేయాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,274 కోట్లు లక్ష్యంగా ఎంచుకోగా.. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 7,169 కోట్ల రుణాలు ఇచ్చి 77.30 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు ఎల్డీఎం హవేలీ రాజు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, యూనియన్ బ్యాంకు ఆర్హెచ్ కమలాకర్, ఆర్బీఐ ఏజీఎం రహమాన్, నాబార్డ్ ఏజీఎం రవి పాల్గొన్నారు. -
200 ఏళ్లపాటు నిలిచేలా ‘మేడారం’ పనులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాలు, మనోభావాలు దెబ్బతినకుండా అనుకున్న సమయానికే మేడారం జాతర పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు 200 ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా చేస్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా ఎస్పీ సు«దీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మంత్రి పొంగులేటి మంగళవారం మేడారంలో సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్లతో పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణ, రాత్రి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్ల పనులను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని, ఇతర పనులను జనవరి 5లోగా ముగించాలని ఆదేశించారు. సెంట్రల్ లైటింగ్, విద్యుత్ స్తంభాలు ఏర్పాటు, వాటర్ ట్యాంకుల నిర్మాణం తదితర పనులను అధికారులు విభజించుకొని గడువులోపు పూర్తి చేయాలన్నారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధంగా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలతో పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాలరాతి శిల్పాలపై గిరిజన సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొందిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు సకాలంలో పూర్తవుతాయని అభిప్రాయపడ్డారు. నేడు వనదేవతల దర్శనం నిలిపివేత ఎస్ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మల దర్శనానికి భక్తుల రాకను బుధవారం నిలిపివేస్తున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ప్రకటించారు. మంగళవారం మేడారంలోని ఎండోమెంట్ కార్యాలయంలో ఈఓ వీరస్వామి, పూజారులతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల నూతన గద్దెలపై ధ్వజ స్తంభాల ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న సందర్భంగా అమ్మవార్ల దర్శనాలను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూజాకార్యక్రమాలకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గురువారం నుంచి యథావిధిగా అమ్మవార్లను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ఈ విషయంలో భక్తులు తమకు సహకరించి దర్శనాలను బుధవారం వాయిదా వేసుకోవాలని కోరారు. -
కేయూ పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జనవరి 3 నుంచి నిర్వహించాల్సిన పీజీ మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ మంగళవారం తెలిపారు. యూజీసీ నెట్, సెట్, టెట్ పరీక్షలు ఉన్నందున ఈ పరీక్షలు వాయిదావేశామని ఆయన పేర్కొన్నారు. సవరించిన పరీక్షల షెడ్యూల్ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. వరంగల్ లీగల్: నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీపై వెళ్తున్న హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పట్టాభి రామారావుకు న్యాయవాదులు మంగళవారం ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పులి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు వీడ్కోల సభలో జస్టిస్ పట్టాభి రామారావు మాట్లాడుతూ తాను 8 నెలలపాటు హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా చేసిన సేవలు సంతృప్తి కలిగించాయని అన్నారు. అదనంగా ఐదు కొత్త కోర్టులు, నూతన భవనంపై మరో అంతస్తు నిర్మాణానికి తన సారథ్యంలో హైకోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. మంచి అనుభూతులతో బదిలీ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిర్మలాగీతాంబ, హన్మకొండ జిల్లా ఇన్చార్జ్ జడ్జి అపర్ణాదేవి, న్యాయమూర్తులు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలస సుధీర్, బార్ నాయకులు కొత్త రవి, అంబేడ్కర్, వెంకటేశ్, సాంబశివరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. హసన్పర్తి: అంబులెన్స్లో ఓ మహిళ మంగళవారం ప్రసవించింది. వివరాలిలా ఉన్నాయి. హసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట ప్రాంతానికి చెందిన ఝాన్సీకి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసే క్రమంలోనే ఝాన్సీకి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో సిబ్బంది స్వాతి, పైలట్ తిరుపతి అంబులెన్స్లోనే సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డను హనుమకొండలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బందికి ఝాన్సీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ లీగల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీఏ) రాష్ట్ర కమిటీలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయవాదులకు చోటు దక్కింది. ఐఎల్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ బార్కు చెందిన సాయిని నరేందర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీనియర్ న్యాయవాది చిల్లా రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ బార్కు చెందిన సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్ను ఎన్నుకున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా జన్ను పద్మ, ఎగ్గడి సుందర్రామ్, పల్లె ప్రశాంత్, నర్సంపేట బార్కు చెందిన పండగ శ్రీనివాస్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీకి ఎన్నికై న నాయకులకు హనుమకొండ, వరంగల్ బార్ అసోసియేషన్ల అధ్యక్షులు పులి సత్యనారాయణ, వలస సుధీర్, ఐఎల్పీఏ వరంగల్, హనుమకొండ జిల్లాల కన్వీనర్లు విలాసాగరం సురేందర్గౌడ్, ముచ్చు రాజేందర్, బార్ కన్వీనర్లు పెండ్యాల అనిల్కుమార్, పూసపల్లి శ్రీనివాస్, న్యాయవాదులు అంబరీషరావు, కె.నిర్మలాజ్యోతి, లడే రమేశ్, సిరిమల్ల అరుణ, శశిరేఖ తదితరులు అభినందనలు తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ట్రైనీలకు మంగళవారం పరీక్షలు నిర్వహించారు. పలు కోర్సుల్లో శిక్షణ పొందిన 86 మందికి 85 మంది హాజరైనట్లు యువజన సర్వీసుల శాఖ సూపరింటెండెంట్ వై.విజయశ్రీ తెలిపారు. హైదరాబాద్ సెట్విన్ అధికారి మాధవి పర్యవేక్షించారు. -
క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
క్రిస్మస్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ వరంగల్: యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయ ఆవరణలో మంగళవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాస్టర్లతో కలిసి మంత్రి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. పాస్టర్లకు తన సొంత ఖర్చుతో దుస్తులు పంపిణీ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకలు ప్రేమ, దయ, కరుణకు చిహ్నంగా నిలుస్తాయని అన్నారు. వరంగల్ నగరంలోని చర్చిలకు రంగులు వేసేందుకు సీఎం నిధులు కేటాయించడం హర్షణీయమని మేయర్ సుధారాణి అన్నారు. మంత్రి ఆదేశం మేరకు నగరంలోని చర్చిలు ఉన్న ప్రాంతాల్లో కార్పొరేషన్ తరఫున శానిటేషన్, లైటింగ్కు రూ.10 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా స్టేజీపై ఎలాంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు ఆసీనులు కావడంపై పలువురు చర్చించుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, కార్పొరేటర్లు భోగి సువర్ణ, కావేటి కవిత, అనిల్కుమార్, పద్మ, రవి, సురేష్, ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య ఆత్మకూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆరోగ్య సమస్యలను మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యాధికారులను సంప్రదించాలని కోరారు. ఇక్కడ నుంచి ఎవరినైనా రెఫర్ చేసినప్పుడు తగిన ఫాలోఅప్ సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ సంవత్సరం 1,560 మహిళలను పరిశీలించి 350 మందికి అవసరమైన పరీక్షలు నిర్వహించి, 82 మందిని రెఫర్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రెఫర్ చేసిన వారికి తగిన ఫాలోఅప్ సేవలందించాలని డాక్టర్ స్పందనను ఆదేశించారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించి అవగాహన కలిగించాలని పేర్కొన్నారు లెప్రసీ నిర్ధారణ సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డాక్టర్ స్పందన, డాక్టర్ పుష్పలీల, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజల ఆశీర్వాదం ఉంటేనే గెలుపు
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కమలాపూర్: ప్రజల ఆశీర్వాదం ఉన్నప్పుడే గెలుపు వరిస్తుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ మద్దతుతో ఇటీవల గెలుపొందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంగళవారం కమలాపూర్లో ఆయన సన్మానించి మాట్లాడారు. తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలతో ఉన్న సత్సంబంధాలే బలమన్నారు. ఎన్నికల్లో గెలిచిన వాళ్లంతా మన వాళ్లేనని, కలిసి పనిచేస్తేనే విజయం సాధిస్తామన్నారు. 2021కి పూర్వం పార్టీలపరంగా కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజూరా బాద్ అని, ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయని స్పష్టం చేశారు. రాజకీయాల కన్నా రాజేందర్ అన్నతో ఉండే బంధమే ఎక్కువని ఇతర పార్టీల్లో గెలిచిన వారు తన దగ్గరకు వస్తున్నారని, ప్రేమతో ఉండే వాళ్లు మనతో ఉంటారని, ఆఽశపడే వాళ్లు ఎన్నటికీ మన వాళ్లు కాదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, పార్టీ గుర్తులు ఉండవని, చెక్ పవర్ ఉన్న ఒకే ఒక్క పదవి సర్పంచ్ అని తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కన్నా వార్డు మెంబర్, సర్పంచ్గా గెలవడమే కష్టమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో తట్టెడు మట్టి అయినా తీశాడా అని ప్రశ్నిస్తున్న వారిని ప్రజలు పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే సీఎంనైనా కలుస్తానని, పంచాయతీలకు నిధులు ఆగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే వారందరిని గెలిపించుకునే బాధ్యత తనదన్నారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ నాయకులు రాజయ్యయాదవ్, మాడ గౌతంరెడ్డి, ఎర్రబెల్లి సంపత్రావు, శీలం శ్రీనివాస్, శ్రీరాం శ్యాం, సురేందర్రాజు, తిరుపతిరెడ్డి, తుమ్మ శోభన్, కళాధర్ పాల్గొన్నారు. -
‘పుర’ పీఠాలపై ప్రధాన పార్టీల గురి..
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్తో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీల్లో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీల్లోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
రెండేళ్లు.. 11 ప్రమాదాలు
హసన్పర్తి: వడ్డేపల్లి–ఉనికిచర్ల రోడ్డును రెండేళ్ల క్రితం డబుల్గా విస్తరించారు. ఈ మార్గంలోని సుబ్బయ్యపల్లి పెట్రోల్ పంపు మలుపు ప్రమాదకరంగా మారింది. రెండేళ్లలో ఇక్కడ 11 ప్రమాదాలు జరిగి పలువురు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది. పెట్రోల్ బంకు సమీపంలో ఇసుక లారీ ఢీకొని దేవన్నపేట గ్రామానికి చెందిన చరత్కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అంతకుముందు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న ధర్మసాగర్ మండలానికి చెందిన ఓ యువకుడు, ధర్మసాగర్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి మహేశ్, ముప్పారానికి చెందిన మాచర్ల రాజు, శాయంపేటకు చెందిన రాజు, ఉనికిచర్లకు చెందిన సందెల రమేశ్ రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. రోడ్డు ప్రమాదాలపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో మృతిచెందిన వారందరూ 40 ఏళ్ల లోపు వారేనని వారు తెలిపారు. మలుపు వద్ద ఏదైనా అదృశ్య శక్తి ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుకలారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సుబ్బయ్యపల్లి పెట్రోల్బంకు మలుపు వద్ద ప్రమాదాలు జరుగకుండా హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
మేడారం.. ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టూ ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాల పనులు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం జాతర పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
పోరు..!?
ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలుసాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందను కున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు.. 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా.. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. 9 మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 9 మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్కు కూడా ఎన్నికలు జరగనున్నాయి. జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుఉమ్మడి వరంగల్లో మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు.. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలు, జనాభా, వార్డులు మున్సిపాలిటీ జనాభా వార్డులుములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16 -
కేఎంసీ ఆభివృద్ధికి కృషి
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ రమేశ్రెడ్డి ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్చాన్స్లర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన అవార్డులు, ప్రశంసపత్రాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ సంవత్సర ఎంబీబీఎస్ టాపర్లు, పీజీ యూనివర్సిటీ టాపర్లకు అవార్డులు, ప్రశంసపత్రాలు అందజేశారు. అలాగే, ఏఎంబీఐ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై న ప్రొఫెసర్ డాక్టర్ పుల్లయ్యను శాలువాతో సన్మానించారు. అనంతరం వీసీ రమేశ్రెడ్డి మాట్లాడుతూ కేఎంసీ (1979 బ్యాచ్) పూర్వ విద్యార్థిగా చదివిన తాను ఇప్పుడు ముఖ్య అతిథిగా రావడం ఆనందంగా ఉందని తెలిపారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సూచనల మేరకు ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిధిలో గుణాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అనంతరం వీసీని కళాశాల బృందం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
హన్మకొండ చౌరస్తా: భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతిని మంగళవారం హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్లో నిర్వహించారు. పీవీ కాంస్య విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనేక ఆర్థిక సంస్కరణలు చేపట్టి భారతదేశ పురోగతిలో కీలకపాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి పీవీ అని కొనియాడారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్, వేయిస్తంభాల ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు ఉన్నారు. -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లెయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్క్లెయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్ పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించారు. కార్యక్రమంలో టీఅండ్బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటేటివ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలి
నర్సంపేట: ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని శ్రీదేవనాథ జీయర్స్వామి అన్నారు. ఈ మేరకు నర్సంపేట పట్టణంలోని శ్రీవేణుగోపాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో వికాస తరంగిణి న ర్సంపేట శాఖ ఆధ్వర్యంలో అర్చకులు ఆరుట్ల వెంకటాచార్యులు, శేషాచార్య, ఆలయ చైర్మన్ గంధం నరేందర్ నేతృత్వంలో మంగళవారం ధనుర్మాసో త్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూల విరాట్టును దర్శించుకుని గోపూజ చేశారు. అనంతరం జీయర్స్వామి మాట్లాడుతూ భక్తి భవా న్ని పెంపొందించుకుంటే సుఖ శాంతులతో వర్ధిల్లుతారన్నారు. రామాలయం, వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. డఫోడిల్ హైస్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. విద్యార్థులు చిన్న తనం నుంచే భక్తి భావాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, వి కాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేదల శ్రమను దోచుకునేందుకే నూతన బిల్లు
నర్సంపేట: పేదల శ్రమను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లు తీసుకువచ్చిందని ఎంసీపీఐ (యూ) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన బిల్లుకు వ్యతిరేకంగా ఎంసీపీఐ(యూ) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నూతన బిల్లు ప్రతులను దహనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నో ప్రజా పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఉపాధి హామీ చట్టం గ్రా మీణ ప్రాంతాల్లో పేదలకు ఎంతో ఆసరాగా నిలి చిందని, ఇప్పుడు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం బిల్లుతో పేదల కూలీల ఉపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తూ 125 రోజుల పని దినాలను కల్పిస్తూ వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, కేశెట్టి సదానందం, మోటం సురేష్, ప్రభాకర్, రాజు, జన్ను నీల, సీహెచ్.పుష్ప, అచల, ప్రమీల, ఈర్ల అనూష, జన్ను విజయ, కోమల, జయ, గడ్డం శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
యాజమాన్య పద్ధతులు పాటించాలి
● జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్పర్వతగిరి: రైతులు అరటిసాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధిలో భాగంగా మండలంలోని చింతనెక్కొండ గ్రామంలో సంగని ఐలయ్య వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం అరటి రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అరటి రైతులకు అందిస్తున్న పథకాలు, అరటిలో నాణ్యత పెంపొందించుటకు మేలైన యాజమాన్య పద్ధతులపై వివరించారు. అరటి రైతులు ఫ్రూట్ బంచ్ కవర్స్ వాడడం వల్ల అరటి నాణ్యత పెరిగి అధిక ధర రావడానికి అవకాశం ఉంటుందన్నారు. వర్ధన్నపేట డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్ రాకేష్ మాట్లాడుతూ ఉద్యానశాఖ ద్వారా పండ్ల తోటలు, కూరగాయాలు, ఆయిల్ ఫామ్, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన రాయితీ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి యు.రాజర్షి, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, శివమణి, వినోద్, సర్పంచ్లు గడుదుల రమేష్, గుగులోతు కిషన్, రైతులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహించొద్దు
● డీసీపీ అంకిత్కుమార్ ఖానాపురం/దుగ్గొండి: పోలీస్ అధికారులు విధుల్లో అలసత్వం వహించొద్దని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. మంగళవారం ఖానాపురం, దుగ్గొండి మండలాల్లోని పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో పట్టుకున్న వాహనాలు, సిబ్బంది యూనిఫాంలు, ఆయుధాలను తనిఖీ చేసి సూచనలు చేశారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. చట్టవ్యతిరేఖ కార్యక్రమాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, రూరల్ సీఐ సాయిరమణ, ఎస్సైలు రఘుపతి, రణదీర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జీవన ఎరువు తయారీపై శిక్షణ దుగ్గొండి: మండలకేంద్రంలోని రైతువేదికలో జాతీయ ఆహార భద్రత సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం జీవన ఎరువు తయారీపై శిక్షణా శిబిరం నిర్వహించారు. నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి జీవన ఎరువులు ఉపయోగపడే విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఆహార భద్రత మిషన్ కన్సల్టెంట్ సారంగం మాట్లాడారు. పశువుల ఎరువులో ఎకరాకు 2 కిలోల పీఎస్బీని కలిపి కలియ చల్లాలన్నారు. జీవన ఎరువులను ఉపయోగించడం వల్ల సుస్థిర వ్యవసాయం సాధ్యంకావడంతో పాటు నేల ఆరోగ్యం బాగుపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్యామ్, టెక్నికల్ అసిస్టెంట్ రవికుమార్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ రాయపర్తి: ఇటీవల సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో జరిగిన రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్లో రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ సరిత తెలిపారు. మంగళవారం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో ఓవరాల్ చాంపియన్షిప్ జోన్లో నాలుగో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. చెస్లో దిలీషా, హ్యాండ్ బాల్ పోటీల్లో కీర్తన, వర్షిణితేజ, చందన, వర్షిత, ఖోఖోలో లాస్యనందిని, మన్వితలు ఉత్తమ ప్రతిభ కనబర్చి బహుమతులు సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయా విద్యార్థినులు ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు.. సంగెం: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ చాంపియన్షిప్ పోటీలకు మండలంలోని మొండ్రాయి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు గూడ చిన్ను, బైరి లక్ష్మిప్రసన్న, గుగులోత్ ఉమేశ్వరీలు ఎంపికై నట్లు పీడీ ముఖర్జీ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థినులను హెచ్ఎం విజయ, ఉపాధ్యాయబృందం, గ్రామస్తులు అభినందించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రియాజొద్దీన్గీసుకొండ: గీసుకొండ మండల తహసీల్దార్ ఎండీ.రియాజొద్దీన్ రెవె న్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేర కు సంఘం నాయకులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేఎంటీ, గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతో పాటు మండల ప్రజల సమస్యలను పరిష్కరించేవిధంగా సేవలందించారు. ఆయన నియామకంపై కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి కొమురారెడ్డి, నాయకులు ఎలగొండ ప్రవీన్, బెజ్జాల కుమారస్వామి, కోదండపాణి, గోపాల్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
త్వరలో ‘మున్సిపల్’ పోరు..!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : మున్సిపాలిటీల ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపాలిటీలపై సర్కారు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సంకేతాలు కూడా వచ్చినట్లు చెబుతున్నారు. మొదట ‘పంచాయతీ’ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని అందరూ భావించారు. లేదంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు అవకాశం ఉంటుందనకున్నారు. ఇదే సమయంలో గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేసింది. దీంతో పీఏసీఎస్ల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్న చర్చ జరుగుతున్న సమయంలో సోమవారం హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను తెరమీదకు తెచ్చారన్న చర్చతో అందరి దృష్టి ఆ ఎన్నికల వైపు మళ్లింది. ఉమ్మడి జిల్లాలో 12 మున్సిపాలిటీలు... 2020 జనవరి 7న తొమ్మిది మున్సిపాలిటీలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, జనగామ, తొర్రూరు, మరిపెడ, మహబూబాబాద్, డోర్నకల్ మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగ్గా. 25 ఓట్ల లెక్కింపు జరిగింది. 26న మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. తొమ్మిది మున్సిపాలిటీల పాలకవర్గానికి ఈ ఏడాది జనవరి 25న గడువు ముగిసింది. కొద్దిమాసాలు పొడిగిస్తారని పాలకవర్గాలు ఆశించినప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అదే రోజు నియమించింది. దీంతో ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తికాగా.. మున్సిపాలిటీలకు కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు మంత్రులతో సమాలోచనలు చేసిన ముఖ్యమంత్రి.. రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు చెప్పారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ ఓటర్ల ముసాయిదా, సవరణ ప్రక్రియపై త్వరలోనే మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఇదే జరిగితే ఇప్పటికే ఉన్న తొమ్మిది మున్సిపాలిటీలకు తోడు కొత్తగా ఏర్పాటైన కేసముద్రం, ములుగు, స్టేషన్ఘన్పూర్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపాలిటీ జనాభా వార్డులు (2011 ప్రకారం) పరకాల 24,444 22 నర్సంపేట 37,070 24 వర్ధన్నపేట 13,732 12 మహబూబాబాద్ 68,935 36 డోర్నకల్ 14,425 15 మరిపెడ 17,685 15 తొర్రూరు 19,100 16 భూపాలపల్లి 59,458 30 జనగామ 52,712 30 ఫిబ్రవరిలో ఎన్నికలు?.. ‘అధికార’ నేతలకు సంకేతాలు జనవరి చివరి వారంలో షెడ్యూల్కు అవకాశం మంత్రులతో సీఎం రేవంత్ సమాలోచనల్లో చర్చ ప్రధాన పార్టీల్లో మొదలైన సమీకరణలు 9 మున్సిపాలిటీలకు ఇప్పటికే ముగిసిన కాలపరిమితి కొనసాగుతున్న స్పెషల్ ఆఫీసర్ల పాలన ఈసారి కొత్తగా మరో మూడు మున్సిపాలిటీలుమున్సిపాలిటీ జనాభా వార్డులు ములుగు 16,535 20 స్టేషన్ఘన్పూర్ 23,485 18 కేసముద్రం 18,480 16‘పుర’పీఠాలపై ప్రధాన పార్టీల గురి...మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మున్సిపాలిటీలపై గురి పెడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మినహా వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్లతో పాటు ములుగు, స్టేషన్ఘన్పూర్, కేసముద్రం మున్సిపాలిటీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. గత ఎన్నికల సమయంలో 9 మున్సిపాలిటీలలో 2,50,687 మంది ఓటర్లు ఉండగా, 1,23,802 పురుషులు, 1,26,885 మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈసారి ఓటర్ల సవరణలో భాగంగా పెరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలలోని 54 వార్డుల్లో 35 వేల వరకు ఓటర్లున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే నాటికి మున్సిపాలిటీల ఓటర్లపై పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. -
వరంగల్
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించాలి 7● డీఈఓ రంగయ్యనాయుడు నర్సంపేట రూరల్/గీసుకొండ: ప్రతీ సబ్జెక్టుపై వి ద్యార్థులు పట్టు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. న ర్సంపేట మండలంలోని పట్టణ గురుకుల పాఠశాల, గీసుకొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్ ఎస్ను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, భోజనశాలను పరిశీలించారు. స బ్జెక్టుల ప్రాధాన్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇషాక్ అలీ, ఉపాధ్యాయులు ఉన్నారు. -
డిపాజిట్ సొమ్ము తీసుకెళ్లాలి
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి ● మీ డబ్బు–మీ హక్కు కార్యక్రమానికి స్పందనన్యూశాయంపేట: బ్యాంకు ఖాతాల్లో క్లైయిమ్ కాని డిపాజిట్ సొమ్మును నిబంధనల మేరకు తీసుకెళ్లాలని జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో జాతీయ ప్రాంతీయ బ్యాంకుల్లో పదేళ్లకు పైబడి అన్కై ్లయిమ్ డిపాజిట్లను వారి వారసులకు అప్పగించేందుకు యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీ డబ్బు– మీ హక్కు కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం ముత్యాల గణన్ సుప్రభాత్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ అధికారి గంట కమలాకర్లు పాల్గొని మాట్లాడుతూ బ్యాంకులో ఉన్న డిపాజిట్ సొమ్మును సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి వెంటనే క్లయిమ్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 50 మంది నామినీలకు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంకుల అంగీకార పత్రాల మొత్తాన్ని సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీ అండ్ బీ ఆర్ఎం చైతన్యకుమార్, నాబార్డ్ డీఎం రవి, ఎస్ఎల్బీసీ రిప్రజెంటీవ్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
మేడారం..ముమ్మరం
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. – ఎస్ఎస్తాడ్వాయి ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి మంత్రులు పొంగులేటి, సీతక్క ఆదేశం గద్దెల విస్తరణ, ప్రాంగణ పనుల పరిశీలన -
వేగంగా ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, వరంగల్: ఇన్నాళ్లు పంచాయతీ ఎన్నికల కోలాహలమున్నా.. ధాన్యం కొనుగోళ్లు ఎక్కడా ఆ టంకం లేకుండా యథావిధిగానే సాగింది. ఎన్నిక ల ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తీరిక దొరికిన సమయాల్లో తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయించారు. ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు వేల మెట్రిక్ టన్నులు అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు తగ్గట్టుగానే పౌర సరఫరా విభాగాధికారు ల ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బంది కలగకుండా దొడ్డు, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసి సమీప ప్రాంతాల్లోని మిల్లులకు తరలించారు. ఇలా జిల్లాలోని 251 కేంద్రాల్లోని నిర్వాహకులు ఇప్పటివరకు 1,16,578. 560 మెట్రిక్ టన్నులు సేకరించి ఆయా ప్రాంతాల్లోని 93 మిల్లులకు తరలించారు. వీటికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 170 లారీల్లో లోడ్లు చేసి ఆయా మిల్లులకు తరలించే ప్రక్రియ సాగింది. వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, గీసుకొండ, పర్వతగిరి మండలాల్లో ధాన్యం కొనుగోలు దాదాపు పూర్తి కావొచ్చింది. అయితే నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో వరి కోతలు ఇప్పుడిప్పుడే పూర్తయ్యాయి. జనవరి రెండో వారంనాటికి ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తికావొచ్చని అధికారులు అంటున్నారు. సన్న ధాన్యానికి క్వింటాకు రూ.2,389లతో పాటు రూ.500ల బోనస్, దొడ్డు ధాన్యానికి గ్రేడ్–ఏ క్వింటాకు రూ.2,389, కామన్ క్వింటాకు రూ.2,369 చెల్లిస్తోంది. రోజుల వ్యవధిలో డబ్బుల జమ జిల్లాలో ఇప్పటివరకు అధికారులు 1,16,578.560 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇందుకు సంబంధించిన డబ్బును రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారు. అలాగే ఈ నెల 20న సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రా రంభమైందని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం నిర్ధేశించిన 33 రకాల సన్న ధాన్యంరకాలను సాగు చేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగ దు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ధాన్యం డబ్బులు జమచేసే సమయంలోనే ఈ బోనస్ డబ్బులు చెల్లించేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ముందుకు వెళ్తున్నారు. కొందరు రైతులు తమ బ్యాంక్ ఖాతా కు ఆధార్ లింక్ చేసుకోకపోవడంతో వారి ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కావడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ వెబ్సైట్లోని ‘ఫార్మర్ కార్నర్’ ద్వారా రైతులు ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదంటే మండల వ్యవసాయ అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు: 251సేకరించాల్సిన లక్ష్యం: 2,50,000 మెట్రిక్ టన్నులు ఇప్పటివరకు సేకరించింది: 1,16,578మెట్రిక్ టన్నులు రైతుల ఖాతాల్లో జమ అయిన సొమ్ము: రూ.223.81 కోట్లు ఇంకా చెల్లించాల్సింది: రూ.54.682 కోట్లు పంచాయతీ ఎన్నికల సమయంలోనూ వేల మెట్రిక్ టన్నుల సేకరణ ఇప్పటివరకు కొనుగోలు చేసింది 1,16,578 మెట్రిక్ టన్నులు సేకరించాల్సిన లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు జనవరి రెండోవారం నాటికి కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం‘మోంథా’ తుపాను ప్రభావం చూపిందా?ఈ ఏడాది 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా పౌర సరఫరా విభాగాధికారులు లక్ష్యం నిర్ధేశించుకున్నారు. అయితే దొడ్డు వడ్లు 30,000, సన్న వడ్లు 2,20,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఉందని అంచనా వేశారు. ఇందుకు భిన్నంగా ఇప్పటివరకు దొడ్డు ధాన్యం 1881.840 మెట్రిక్ టన్నులు, సన్నవి 1,14,696.720 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. జనవరి 2వ తేదీ వరకు ఈ కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందనుకున్నా.. కేవలం నర్సంపేట నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లో మాత్రమే ఇంకా వరి ధాన్యం రావాల్సి ఉందని అధికారులంటున్నారు. ఈ లెక్కన ఇప్పటివరకు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు మాత్రమే చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంటే దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎటువైపు వెళ్లినట్టని, లేదా రైతులు అవసరాలకు ముందే దళారులకు అమ్ముకున్నారా అన్న చర్చ ఉంది. అదే సమయంలో ఈ ఏడాది మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 19,728 ఎకరాల్లో పంట నష్టం జరిగితే, వరినే అధికస్థాయిలో నష్టం జరిగిందని సర్వేలో అధికారులు తేల్చారు. అందుకే అనుకున్న లక్ష్యం 2,50,000 మెట్రిక్ టన్నులు రాకపోవచ్చని అధికారులు అంటున్నారు. -
వర్సిటీల సిలబస్ మార్చాలి
● రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి కేయూ క్యాంపస్: వర్సిటీలు పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా సిలబస్లు మార్చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. సోమవారం కేయూలో నిర్వహించిన రెగ్యులర్ అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సాధారణ విరామాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలన్నారు. మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ ఉండాలని, జాబ్ మార్కెట్కు తగినట్లుగా ఉండాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 వరకు పెంచారన్నారు. అధ్యాపకుల నియామక ప్రక్రియ కూడా చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఫార్మసీలో బల్క్ డ్రగ్ మాన్యుఫ్యాక్చర్ యూనిట్స్తో ఎంఓయూ ఉందని, విద్యాభివృద్ధికి అధ్యాపకులు ప్రధాన భూమికగా వ్యవహరించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం మాట్లాడారు. అకుట్ అధ్యక్షుడు బి.వెంకట్రామ్రెడ్డి, ఫార్మసీ డీన్ గాదె సమ్మయ్య, కేయూ పాలక మండలి సభ్యులు బి.సురేశ్లాల్ పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. నిధులు కేటాయించాలని అకుట్ బాధ్యులు వినతిపత్రం అందించారు. -
భక్తిశ్రద్ధలతో అయ్యప్పస్వామి పడిపూజ
నర్సంపేట: పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఆలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో 39వ రోజు సోమవారం మహా అన్నదాన ప్రసాద వితరణ, దివ్య పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవంలో గీతాంజలి స్కూల్ చైర్మన్ వేములపల్లి జయశ్రీసుబ్బారావు, అపర్ణ రాహుల్చౌదరి, అక్షిభక్తుల రచనచౌదరి, బాలాజీ, సాయివిశ్వనాథ్, డాక్టర్ సాయిసుప్రీత్, కరణ్, దొడ్డ సాయిలు పాల్గొనగా అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సైఫా సురేష్, కోశాధికారి దొడ్డ రవీందర్, ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తప్పుడు కేసుల కలకలం!
అకారణంగా కొందరిని టార్గెట్ చేస్తున్నారని.. సాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన ఏసీపీ నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. ఏం తప్పుడు కేసులంటే.. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటు సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటువరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. -
మాక్ డ్రిల్ అదుర్స్
వరంగల్: వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, 13వ డివిజన్ నవయుగ కాలనీ లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఏడీఎంఏ) ఆదేశాల మేరకు ఒకేసారి వర్షాలు, వరదలు సంభవిస్తే జిల్లా యంత్రాంగం ఎలా స్పందించాలని, స హాయక చర్యలు ఎలా నిర్వహించాలనే అంశంపై సోమవారం చేపట్టిన మాక్ డ్రిల్ ఆకట్టుకుంది. చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతం, నవయుగ కాలనీ తదితర ప్రాంతాల్లో వరద పరిస్థితులను సృష్టించి, వాటికి సంబంధించిన సహాయక చర్యలను ప్రత్యక్షంగా అమలు చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, డ్రిల్ సాధారణ పరిశీలకులు గద్వాల డీఎఫ్ఓ అశో క్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్, ఏసీపీ శుభం, వరంగల్ ఆర్డీఓ సుమ, జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి శ్రీధర్రెడ్డిలు పర్యవేక్షించారు. వర్షాలతో చెరువు నిండి నీటి ప్రవాహంలో చిక్కుకున్న పశువులను, నీటిలో మునిగి కొట్టుకుపోతున్న వ్యక్తిని, నీటిలో చిక్కుకుపోయిన వ్యక్తులను రక్షించేందుకు సహాయక చర్యల్లో అగ్నిమాపక శాఖ నుంచి 35 మంది, పోలీస్ శాఖ నుంచి 35, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది 12, ఆపదమిత్ర వలంటీర్లు 30 మంది, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో రక్షణ సహాయక చర్యలు చేపట్టారు. డ్రోన్ సహాయంతో ఆహార ప్యాకెట్లు.. వరదల్లో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను సాగించా రు. వరద నీటిలో ముంపునకు గురైన బాధితులు ఇళ్లపైకి చేరగా వారికి ఆహార ప్యాకెట్లతోపాటు నీళ్ల సీసాలను డ్రోన్ల సహాయంతో అందించారు. వరదనీటిలో కొట్టుకుపోతున్న వారిని లైఫ్ బోటుతో రెస్క్యూ బృందం సభ్యులు కాపాడారు. బాధితులకు ప్రథమ చికిత్సను అందించి మెరుగైన వైద్యం కోసం స మీపంలోని దేశాయిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాని కి 108 వాహనంలో తరలించారు. మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మాక్ డ్రిల్ పరిశీలకులు డీఎఫ్ఓ అశోక్లు మాట్లాడుతూ విపత్తుల సమయంలో ముందస్తు సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం ఎంతో కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి బాలకృష్ణ, డీఏఓ అనురాధ, వివిధ శాఖల అధికారులు గౌతమ్రెడ్డి, కిష్టయ్య, సంధ్యారాణి, సాంబశివరావు, హరీష్రెడ్డి, సమ్మయ్య, ప్రసన్నరాణి, తదితరులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మాక్ ఎక్సర్సైజ్ ముంపులో చిక్కుకున్న ప్రజలు, పశు సంపదను కాపాడిన సహాయక బృందాలు పరిశీలించిన కలెక్టర్ సత్యశారద, మేయర్ సుధారాణి -
ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలి
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ● గ్రామాల్లో కొలువుదీరిన నూతన సర్పంచ్లు వర్ధన్నపేట: గ్రామాల్లో కొలువుదీరిన నూతన సర్పంచ్లు ఆయా గ్రామాల్లో ఉత్తమ సేవలందించి ఆదర్శంగా నిలవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం మండలంలోని దమ్మన్నపేట, చంద్రుతండా, అంబేడ్కర్నగర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రమాణస్వీకారానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. తాగునీరు, వీధి దీపాలు, రోడ్డు, డ్రెయినేజీలు, పచ్చదనం తదితర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. సమస్యల పరి ష్కారానికి తనవంతు సేవలందిస్తానన్నారు. అంతకుముందు ఆయా గ్రామాల సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాయపర్తి: మండలంలోని బాల్నాయక్తండా గ్రామంలో సర్పంచ్గా ఎన్నికై న భూక్య శ్రీదేవిసమ్మయ్య ప్రమాణస్వీకారం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ పాల్గొని సర్పంచ్ దంపతులను శాలువాతో సన్మానించారు. అంచనాలు సిద్ధం చేయండి ● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: యూఐడీఎఫ్ (పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి) ద్వారా గ్రేటర్ వరంగల్లో సమర్థ నీటి సరఫరా కోసం అంచనాలు సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా కార్యాలయంలో గ్రేటర్, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లతో ఆమె సమావేశమయ్యారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్లో భాగంగా నగరంలో అదనపు పైప్లైన్లు, రిజర్వాయర్ల ఏర్పాటుతో పాటు స్కాడా సిస్టమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు ప్రతీ జోన్లో 24/7 నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టడానికి రూ.550 కో ట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో బల్దియా ఎస్ఈ సత్యనారా యణ, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు పాల్గొన్నారు. -
హక్కులు, బాధ్యతలు తెలిసి ఉండాలి
● కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రవణ్కుమార్ నెక్కొండ: వినియోగదారులు తమ హక్కులు, బాధ్యతలు తెలిసిఉంటేనే ప్రస్తుతం డిజిటల్ మార్కెట్ జరుగుతున్న మోసాలను గుర్తించవచ్చని కన్జూమర్ కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర్గుపల్లి శ్రవణ్కుమార్శాసీ్త్ర అన్నారు. స్థానిక హైస్కూల్లో సోమవారం జాతీయ వినియోగదారుల వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు తమకు చట్ట ప్రకారం సంక్రమించిన హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ సమావేశంలో హెచ్ఎం శ్రీదేవి, గైడ్ టీచర్ వినయ్కుమార్, సీఆర్పీలు శ్రీనివాస్, చారి, సుమలత, ఉపాధ్యాయులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలి ● వీసీలో రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి న్యూశాయంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను జనవరి 13వ తేదీలోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబితా మ్యాపింగ్ సమర్థవంతంగా చేపట్టాలని, ఓటరు జాబితాలో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను గుర్తించి సరిచేయాలన్నారు. ఈ వీసీలో కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, అశోక్కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి హర్షిత, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కాళోజీ సెంటర్: అంతర్జాతీయ అవార్డుకు ప్రముఖ జ్యోతిష్య పండితుడు, వాస్తు విద్వాంసులు డాక్టర్ చేవూరి రమేశ్కుమార్ ఎంపికయ్యారు. హనుమకొండ పరిమళకాలనీకి చెందిన రమేశ్ 26 సంవత్సరాలుగా జ్యోతిష్య పండితుడిగా సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు ఆయన సేవలను గుర్తించిన గ్లోబల్, ఈగల్ యూనివర్సిటీ యునిఎర్త్ హ్యుమానిటీ పీస్ ఫౌండేషన్ (యూఎస్ఏ) సంయుక్తంగా యూనివర్సల్ ఎక్సలెన్సీ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 27న మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరగనున్న సదస్సులో ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు కేతన్, భూపేశ్, గైడ్ రమణారావుతో పాటు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరం కాళోజీ సెంటర్: దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాల పంపిణీ శిబిరాన్ని ఈ నెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహవీర్ ట్రస్ట్ సౌజన్యంతో కొత్తవాడలోని పద్మశాలీ వెల్ఫేర్ ట్రస్టు ప్రాంగణంలో ఉచిత శిబిరం జరుగుతుందన్నారు. అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా నాణ్యమైన కృత్రిమ కాళ్లు అమర్చనున్నారన్నారు. ఆసక్తి గలవారు 9490133650, 9885981959, 9949446802, 7095915728 నంబర్లకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేడు జాబ్ మేళా కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు నేడు (మంగళవారం) ములుగు రోడ్డు సమీపంలోని ఐటీఐ ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఉదయం 11 గంటలకు హాజరు కావచ్చని తెలిపారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలని, ఎంపికై న వారు ఉమ్మడి వరంగల్ జిల్లా, హైదరాబాద్లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. -
విపత్తులో ప్రజలు.. కాపాడిన రెస్క్యూ టీమ్స్
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025మాక్డ్రిల్ను పరిశీలిస్తున్న బల్దియా కమిషనల్ చాహత్ బాజ్పాయ్వరదలు వచ్చినప్పుడు చేపట్టాల్సిన సహాయక చర్యలను చూపిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ● ఆకట్టుకున్న మాక్డ్రిల్ ● పరిశీలించిన అధికారులు, ప్రజాప్రతినిధులుహన్మకొండ: ‘వరదలు వచ్చినప్పుడు ఎలా అప్రమత్తంగా ఉండాలి? వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రక్షించడం ఎలా? పునరావాస కేంద్రానికి తరలించడం ఎలా?’ అనే అంశాలపై ఎస్డీఆర్ఎస్, అగ్నిమాపక శాఖ ఇతర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్డ్రిల్ ఆకట్టుకుంది. హనుమకొండలోని సమ్మయ్యనగర్, రెడ్డిపురం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన మాక్డ్రిల్ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. సమ్మయ్య నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, ఎన్సీసీ, రెడ్క్రాస్, మున్సిపల్, ఇతర శాఖల సిబ్బందికి వరద సహాయక చర్యలను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సుదర్శన్ రెడ్డి వివరించారు. ఎస్డీఆర్ఎఫ్ అధికారి రవిచౌహాన్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం సహాయక చర్యలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రిటైర్డ్ మేజర్ సుధీర్ బాహల్, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్సింగ్ మాన్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ వైవీ.గణేశ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, తహసీల్దార్లు రవీందర్రెడ్డి, కిరణ్ కుమార్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సీఎంహెచ్ఓ రాజారెడ్డి, కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, మున్సిపల్ ఫైర్ ఆఫీసర్ శంకర్ లింగం, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఏసీపీలు నరసింహారావు, సత్యనారాయణ, రెడ్క్రాస్ ఈసీ మెంబర్ శ్రీనివాసరావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రామసక్కని నేలకు రామ్సర్
పచ్చందాలకు నిలయం పాకాల. ఇక్కడి జల సంపద మంత్రముగ్ధుల్ని చేస్తుంది. సహజంగా వినిపించే ప్రకృతి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బోటింగ్ రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రపంచంలోనే మంచినీటి సరస్సుగా పేరుగాంచిన ఈ ప్రాంతానికి మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ స్థాయి (రామ్సర్ సైట్గా) గుర్తింపు లభించనుంది. ఆ దిశగా సర్వేలు కొనసాగుతున్నాయి. – ఖానాపురంపాకాలలో ఏర్పాటుకు కసరత్తు నాలుగు దఫాలుగా పక్షులపై సర్వే మొదటి విడత పూర్తి గుర్తింపు లభిస్తే.. అంతర్జాతీయంగా ప్రతిష్ట ప్రత్యేక ప్రణాళికతో అభివృద్ధికి అడుగులు -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
హన్మకొండ అర్బన్ : రాజకీయాలకు అతీతంగా నగరంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు కృషి చేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని 7వ డివిజన్లో రూ.కోటితో సైడ్ డ్రెయినేజీ, కల్వర్టు నిర్మాణం, పబ్లిక్ గార్డెన్లో చిన్న పిల్లలకు ఆట వసతుల కల్పనకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా కాకాజీ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థను పరిశీలించారు. వర్షాకాలంలో ప్రధానంగా డ్రెయిన్ ద్వారా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి నగరాభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న ఒక్కో వార్డుకు కనీసం రూ.50 లక్షలు పెట్టిన దాఖలాలు లేవని, నేడు ప్రతీవార్డుకు రూ.5కోట్ల పై మేర నిధులు కేటాయించి, పనులు పూర్తి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, యూత్ నాయకులు తోట పవన్, మాజీ కార్పొరేటర్ శేఖర్, సోమ నాగేశ్వర్ రావు, బిన్నీ లక్ష్మణ్, వాకర్ అసోసియేషన్ బాధ్యులు గాంధీ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి -
ఈ నెలాఖరులోగా నారు వేసుకోవాలి
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ కో–ఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ మండలంలోని సింగారం, ఒంటిమామిడిపల్లి, ఐనవోలు గ్రామాల్లో మొక్కజొన్న, మిరప, యాసంగి వరి నారు మడులను సోమవారం సందర్శించారు. ఈసందర్భంగా విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. యాసంగి మక్కజొన్న తొలిదశలో ఆశించే కత్తెర పురుగు నివారణకు వేపనూనెను పిచికారీ చేయాలని సూచించారు. మిరప శాఖీయ దశలో ఉందని వేరుకుళ్లు తెగులు, ఆకుముడత ప్రధాన సమస్యలుగా ఉన్నట్లు గమనించారు. అందుకు చేయాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఆకుముడత, తెల్ల దోమల నివారణకు ఎకరాకు 15 నుంచి 20 పసుపు రంగు జిగురు అట్టలను, అలాగే తామర పురుగుల నుంచి కాపాడుకోవడానికి 20 నుంచి 30 నీలం రంగు జిగురు అట్టలను పొలమంతా అమర్చుకోవాలని సూచించారు. వరి కొయ్యలను కాల్చకుండా సింగిల్ సూపర్ పాస్పేట్ వేసి పొలంలోనే కలియదున్నాలన్నారు. వరి నార్లు డిసెంబర్ నెల లోపల వేసుకోవాలన్నారు. చలి ఉధృతి పెరుగుతున్నందున ఉదయం, సాయంత్రం నారుమడుల్లో కొత్తనీరు పెట్టుకోవాలని సూచించారు. రైతులు అన్ని పంటల్లో యాజమాన్య పద్ధతులను పాటించి పెట్టుబడి తగ్గించి దిగుబడులు పెంచుకోవాలని కోరారు. రూరల్ అగ్రికల్చర్ వర్క్ ఎక్స్పీరిఝెన్స్ ప్రోగ్రాంలో భాగంగా అగ్రికల్చర్ విద్యను అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు సందర్శనలో పాల్గొన్నట్లు విజయ్భాస్కర్ తెలిపారు. శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ భాస్కర్ పంటక్షేత్రాల సందర్శన -
తప్పుడు కేసుల కలకలం!
వరంగల్ ఏసీపీగా పనిచేసిన నందిరాం నాయక్పై డీజీపీ వేటుసాక్షి,వరంగల్/రామన్నపేట: వరంగల్ కమిషనరేట్ పరిధిలో తప్పుడు కేసులతో పలువురు అధికారులపై వేటు పడడం కలకలం సృష్టించింది. వరంగల్ ఏసీపీగా పనిచేసిన సమయంలో తప్పుడు కేసుల నమోదులో ప్రమేయముందని తేలిన నందిరాం నాయక్ను రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సస్పెండ్ చేయడం పోలీస్శాఖ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతోపాటు ప్రస్తుత వరంగల్ సీసీఎస్ సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ కూడా మట్టెవాడ ఠాణాలో పనిచేసిన సమయంలో ఈ తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదు రావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సస్పెండ్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు వెంకటేశ్వర్లుకు చెందిన భూవివాదాల కేసులో తప్పుడు కేసు నమోదుచేసినట్టుగా విచారణాధికారులకు స్పష్టమైన సాక్ష్యాలు దొరకడంతో ఈ ముగ్గురు అధికారులపై వేటుపడిందని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా కార్పొరేటర్ గుండేటి నరేందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయంలోనూ వరంగల్ సబ్ డివిజన్లోని పోలీసులు అత్యుత్సాహం చూపడం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది తెలిసిందే. వరంగల్ సబ్ డివిజన్లో అకారణంగా కొందరిని టార్గెట్గా చేసుకుంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారని, వీటిపై పునర్విచారణ చేయాలంటూ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీని కొద్దికాలం క్రితం కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఏసీపీ నందిరాం నాయక్ ఉన్న సమయంలో కొందరు పోలీసులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. పరిధి దాటి వ్యవహరించారంటూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఏసీపీ నందిరాం నాయక్ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఇతర అధికారులను వరంగల్ పోలీస్ కమిషనరేట్కు అటాచ్ చేసి అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో పొస్టింగ్లు ఇచ్చారు. ఇదే సమయంలో తనకు జరిగిన అన్యాయంపై వెంకటేశ్ పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అవి తప్పుడు కేసులని విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఇప్పటికే గతంలో సదరు ఏసీపీతో చనువుగా ఉన్న కొందరు అధికారుల్లో అలజడి మొదలైంది. ● వరంగల్ వాసి వెంకటేశ్వర్లు తనకున్న తిమ్మాపూర్లోని 28 ఎకరాల 24 గుంటల భూమిని రూ.1.50కోట్ల వరకు విక్రయిస్తానని చెప్పి, రూ.కోటి అడ్వాన్స్గా తీసుకొని, మిగిలిన డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇవ్వాలంటూ చెప్పాడని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వి.మల్లేశ్ 2024లో మట్టెవాడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. విక్రేత రిజిస్ట్రేషన్ చేయకుండా కావాలని మోసం చేసి, కొంతభూమి ఇతరులకు అమ్మి వారి ద్వారా తనకు లీగల్ నోటీసులు పంపించాడు. అదేవిధంగా భూముల ధరలు రెట్టింపైనా, ఇప్పుడు రూ.రెండు కోట్లు ఇవ్వాలంటూ చెయ్యి చేసుకున్నాడని, ఇవ్వకుండా ఏ సాక్ష్యం లేకుండా చంపుతానని బెదిరించాడని మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ● మా బంధువులు శేఖర్, శ్రీనివాస్ తన వద్ద భూమిని కొనుగోలు చేశారని, చింతల్లో తనకున్న 2,178 చదరపు గజాలు అమ్ముతున్నానని కొనాలంటూ సంప్రదించాడని, ఇది నిజమని నమ్మి గజానికి రూ.3,800 చొప్పున ఐదేళ్ల క్రితం అడ్వాన్స్గా రూ.10లక్షలు తీసుకొని వెంకటేశ్వర్లు మోసం చేశాడని వరంగల్ ఎల్బీనగర్కు చెందిన రవి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతడికి ఏ భూమి లేదని తెలుసుకొని వెళ్లి నిలదీస్తే మరొక ప్రాంతంలో భూమి ఇస్తానన్నాడు. 2024 సెప్టెంబర్లో ఎంజీఎం మూడో గేట్ వద్దకు తన స్నేహితుడు జుపాక అనిల్తో కలిసి వచ్చి మిగిలిన నగదు ఇవ్వాలంటూ బెదిరించాడు. ఇలా రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేశ్వర్లుపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వెంకటేశ్వర్లుపై కావాలనే కేసులు నమోదు చేసినట్లు గా పోలీసు విచారణలో తేలడంతో సదరు పోలీసు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. సీఐ గోపీ, ఎస్ఐ విఠల్ను కూడా సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు మట్టెవాడ స్టేషన్లో పనిచేసిన సమయంలో ఈ తప్పిదాలు తాజా చర్యలతో వరంగల్ సబ్ డివిజన్లో కొందరు అధికారుల ఉలికిపాటు -
మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ గాదె ఇన్నయ్య ఆశ్రమంలోనూ ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఎన్ఐఏ అధికారులు.. గాదె ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కేసు నమోదు చేశారు. ఆదివారం.. నాలుగు వాహనాల్లో వచ్చిన ఎన్ఐఏ అధికారులు.. ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు.ఇన్నయ్యను అరెస్ట్చేసేందుకు ఆశ్రమానికి వచ్చిన ఎన్ఐఏ అధికారులను చిన్నారులు అడ్డుకున్నారు. ఇటీవల మృతిచెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. సంస్మరణ సభలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారని దర్యాప్తులో తేలింది. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడంతో పాటు ప్రధాని, కేంద్ర హోంమంత్రిపై ఇన్నయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇన్నయ్య అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించినట్లు సమాచారం. -
ఐనవోలు జాతరకు ఏర్పాట్లు చేయాలి
సమీక్షలో మంత్రి కొండా సురేఖ హన్మకొండ అర్బన్: ఐనవోలు మల్లికార్జునస్వామి జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 తేదీ నుంచి ప్రారంభం కానున్న ఐనవోలు జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్లో శనివారం జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రవాణా, పార్కింగ్కు ఏర్పాట్లు ఐనవోలు నుంచి కొమురవెల్లి, మేడారానికి వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనానికి టోకెన్ల విధానం అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జాతర ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తానని పేర్కొన్నారు. అనంతరం పర్యాటక శాఖ పోస్టర్ను ఆవిష్కరించారు. సమీక్షలో ఆలయ కమిటీ ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కొత్తకొండ జాతరపై సమీక్షభీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జనవరి 9 నుంచి 18 వరకు జరిగే శ్రీ వీరభద్రస్వామి జాతరకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్, ఆలయ ఈఓ కిషన్న్రావు, డాక్టర్ అప్పయ్య, ఆర్టీసీ డీఎం అర్పిత, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
బాధితులు చట్టపరమైన సాయం పొందాలి
డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ కేయూ క్యాంపస్: లైంగిక వేధింపులకు గురైన బాధితులు భయపడకుండా చట్టపరమైన సాయం పొందాలని వరంగల్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి నిర్మలాగీతాంబ అన్నారు. కేయూ పరిపాలన భవనంలో యాంటీ సెక్సువల్ హరాస్మెంట్పై శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. రంగోళి పోటీలు, షార్ట్ఫిలిం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం, టీషీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ వి.శోభ తదితరులు పాల్గొన్నారు. వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, వరంగల్ కలెక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన వారి త్యాగాలు గుర్తించి, వారి సంక్షేమం కోసం తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు. జనవరి 4న సూర్యాపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వేలాదిగా ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. న్యూశాయంపేట: ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి.శ్రీనివాస్రావు డిమాండ్ చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సీపీఐ, సీపీఎం హనుమకొండ జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వామపక్ష పార్టీల, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర చైర్మన్ రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకట్నారాయణ, వామపక్ష నేతలు కె.భిక్షపతి, చుక్కయ్య, ఎన్.హంసారెడ్డి, అప్పారావు, రాజేందర్, శ్రీనివాస్, టి.భిక్షపతి, ఎల్లేశ్, రాజమౌళి, వెంకటరాజం, స్టాలిన్, చక్రపాణి, ఉప్పలయ్య, తిరుపతి, సంపత్, భానునాయక్ తదితరులు పాల్గొన్నారు. కాళోజీ సెంటర్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్, డీఆర్డీఏ)లో పనిచేస్తున్న వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని డీఆర్డీఏ కార్యాలయంలో శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కందారి సారయ్య, కార్యదర్శిగా గుగులోతు వెంకన్న, ఉపాధ్యక్షులుగా గోలి కొమురయ్య, గుండేటి కుమారస్వామి, శారద, కోశాధికారిగా వనమ్మ, సహాయ కార్యదర్శులుగా రాజయ్య, సంపత్, యాకూబ్, కార్యవర్గ సభ్యుడిగా మెట్టు దాసు, సలహాదారులుగా అనిల్, రమేశ్, కందిక సుధాకర్ను ఎన్నుకున్నారు. -
సృజనాత్మకత పెంపునకు సైన్స్ఫెయిర్
ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు విద్యారణ్యపురి: విద్యార్థుల్లో సృజనాత్మకతకు సైన్స్ఫెయిర్ దోహదం చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు శనివారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడారు. మానవాళి ప్రకృతిని నాశనం చేస్తుండడంతో అనేక అనర్థాలు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చిన వరదలే ఉదాహరణ అన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులకు వారు బహుమతులు ప్రదానం చేశారు. విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి బి.రాంధన్, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ ఎ.సదానందం, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా జిల్లా అధ్యక్షుడు మాదాల సతీశ్కుమార్, హనుమకొండ, కాజీపేట ఎంఈఓలు నెహ్రూనాయక్, మనోజ్కుమార్, ప్రభుత్వ మర్కజీ హై స్కూల్ ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. -
ఆపదలో ఆదెరువు!
వడ్డేపల్లి చెరువులో చేరుతున్న మురుగునీరుకాజీపేట: కాజీపేట, హనుమకొండ పట్టణవాసులకు ఒకప్పుడు తాగు నీరందించిన వడ్డేపల్లి రిజర్వాయర్ ప్రస్తుతం మురుగునీటితో నిండిపోయింది. కాకతీయ రాజుల కాలంలో ప్రజల సాగు, తాగునీటి అవసరాలకు వడ్డేపల్లి చెరువును తవ్వించారు. ఈ చెరువు ద్వారా దాదాపు 600 ఎకరాల ఆయకట్టుకు నీరందేది. దాన్ని 1993లో పూర్తిగా సమ్మర్ స్టోరేజీగా అభివృద్ధి చేశారు. అనంతర కాలంలో నగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా కాజీపేట పట్టణ మురుగు నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరి నీరు కలుషితమవుతూ వస్తోంది. హైదరాబాద్లోని హుస్సేన్సాగర్ తరహాలో ఈ రిజర్వాయర్లో శవాలు తేలుతున్న ఘటనలు కూడా నగరవాసులను ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రెయినేజీలన్నీ వడ్డేపల్లి చెరువు వైపే.. కాజీపేట పట్టణ పరిధి ఆయా డివిజన్లలో నిర్మించిన డ్రెయినేజీల నీరంతా వడ్డేపల్లి చెరువులోకి చేరుతోంది. సోమిడి ఊరచెరువు తూము నుంచి మురికి కాల్వల ద్వారా కలుషిత నీరు వడ్డేపల్లి చెరువులో చేరుతోంది. ఊర చెరువును ఆక్రమించుకుని ఇళ్ల స్థలాలుగా మార్చి విక్రయించిన రియల్ వ్యాపారులు తూముకు గండి కొట్టడమే ఈ చెరువు నీరు కలుషితమవడానికి ఒక కారణం. గతంలో వడ్డేపల్లి ఫోర్షోర్ బండ్కు ఆనుకుని ఉన్న రైల్వే ట్రాక్ అవతలి వైపున మురుగు నీరు చెరువులోకి వెళ్లకుండా కట్ట మాదిరిగా రాళ్లతో నిర్మాణాలు చేపట్టారు. అయితే రాళ్ల పక్క నుంచి మురుగు నీరు సవ్యంగా వెళ్లేలా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆ నీరంతా కట్ట మీది నుంచి చెరువులోకి ప్రవేశిస్తోంది. అనుమతి పొందడంలో జాప్యం.. మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా నివారించాలంటే.. రైల్వే ట్రాక్ కింది నుంచి మోరీ నిర్మించాల్సి ఉంది. ఈ మోరీ నిర్మాణానికి రైల్వే అనుమతి తప్పనిసరి. ఇందుకోసం మున్సిపల్ అధికారులు రైల్వేశాఖకు పలుమార్లు లేఖలు రాసినా అనుమతులు రాకపోవడంతో మిన్నకుండిపోయారు. దీంతో లక్షల రూపాయలతో సోమిడి వైపు నిర్మించిన కట్ట వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని స్థానికులు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ప్రమాదం కాజీపేట 61వ డివిజన్లోని సిద్ధార్థనగర్ వైపు నుంచి మురుగు నీరు వడ్డేపల్లి చెరువులోకి వెళ్లకుండా, వడ్డేపల్లి చెరువులోని నీరు సిద్ధార్థనగర్లోకి ప్రవేశించకుండా ఉండడానికి ఫోర్షోర్ బండ్ను నిర్మించారు. ఈ బండ్ నిర్మాణం జరిగినపుడే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ బండ్ కోతకు గుౖరవుతుంది. చెరువు నీటి తాకిడికి ఈ బండ్ ఎప్పుడు గండిపడుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ ఫోర్షోర్ బండ్కు ఇరువైపులా పెద్ద ఎత్తున తుమ్మచెట్లు పెరిగాయి. అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్గా మారింది. మలమూత్రాల విసర్జన చెరువు పరిసరాలను వాడుతున్నారు. కాగా, చెరువు కింద ఉన్న కాలనీల్లోని బోరు బావుల్లో నీరు నల్లగా వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, వడ్డేపల్లి చెరువు నీరు కలుషితంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఓ మున్సిపల్ ఉన్నతాధికారిని ‘సాక్షి’ ప్రశ్నించగా.. ‘బల్లార్షా రైల్వే లైన్ కింద నుంచి సైడ్ కాల్వ నిర్మించడానికి ప్రత్యేక అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశాం. పర్మిషన్ రాగానే పనులు ప్రారంభించి చెరువు కలుషితం అవ్వకుండా చూస్తాం’ అని చెప్పారు. కలుషితం కాకుండా చూడాలి.. వడ్డేపల్లి చెరువు పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే రిజర్వాయర్ను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించాలి. అవసరమైతే ప్రజాప్రతినిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కేటాయించి తాగునీరు కలుషితం అవ్వకుండా చూడాలి. – మర్యాల కృష్ణ, కాజీపేట కాల్వలను మళ్లించాలి.. వడ్డేపల్లి రిజర్వాయర్లోకి నేరుగా ఉన్న మురికి కాలువలను అధికారులు గుర్తించి దారి మళ్లించడానికి ఉన్న అవకాశాలపై ప్రత్యేక సర్వే చేయాలి. చెరువులోకి పలు ప్రాంతాల నుంచి వస్తున్న మురికినీరు వల్ల తాగునీరు కలుషితమవుతోంది. దీని నివారణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి. – ఎండీ సోనీ, కాజీపేట కోతకు గురవుతున్న ఫోర్షోర్ బండ్ రిజర్వాయర్లో తేలుతున్న శవాలు కన్నెత్తి చూడని అధికారులు ఆందోళనలో నగరవాసులు -
యాసంగి ప్రణాళిక ఖరారు
హన్మకొండ: జిల్లాలో యాసంగి ప్రణాళికను వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసి, చెరువులు, కుంటల్లో నీరు చేరింది. భూగర్భ జలాలు పెరిగాయి. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది. జిల్లాలో అన్ని పంటలు కలిపి 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అధికారులు అంచనా వేశారు. గత యాసంగిలో వరి 1,32,280 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,29,500 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగిలో మొక్కజొన్న 63,608 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 64,100, వేరుశనగ గత యాసంగిలో 473 ఎకరాల్లో సాగు చేయగా ఈసారి 370ఎకరాల్లో సాగుచేయనున్నారు. పప్పుదినుసులు గత యాసంగిలో 238 ఎకరాల్లో సాగు చేయగా ఈ యాసంగిలో 240 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. యూరియా 28,584 మెట్రిక్ టన్నులు, డీఏపీ 10,587, ఎన్పీకే 26,466, ఎంఓపీ 8,469 మెట్రిక్ టన్నుల అవసరమని అంచనా వేశారు. ఈ మేరకు అధికారులు ఎరువులు సమకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది యాసంగిలో సాగైన విస్తీర్ణంతో పోలిస్తే వ్యవసాయ శాఖ విస్తీర్ణాన్ని తగ్గించింది. గతేడాది యాసంగిలో అన్ని పంటలు కలిపి 1,97,025 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది 1,94,210 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. గత యాసంగితో చూస్తే 2,815 ఎకరాలు తగ్గింది. పరిస్థితులు చూస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా వానాకాలంలో అన్ని పంటలు కలిపి 2,27,951 ఎకరాలు సాగు చేశారు. వానాకాలంలో చూస్తే 33,741 ఎకరాలు తగ్గింది. వానాకాలంలో పత్తితో పాటు ఇతర మెట్ట పంటలు సాగు చేయడంతో విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 1,94,210 ఎకరాల్లో పంటల సాగు యూరియా అవసరం 28,584 మెట్రిక్ టన్నులు డీఏపీ 10,587 మెట్రిక్ టన్నులు, ఎన్పీకే 26,466 మెట్రిక్ టన్నులు -
ఇప్పుడేం చేద్దాం?
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్ లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్ లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది. వరంగల్ డీసీసీబీ పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాలను రద్దు చేసిన ప్రభుత్వం అధికారులను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించింది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పర్సన్ ఇన్చార్జ్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ను ప్రభుత్వం నియమించగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లాలోని 16 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు సహకారశాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, సీనియర్ ఇన్స్పెక్టర్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించారు. పరకాల, కమలాపూర్ పీఏసీఎస్లకు పర్సన్ ఇన్చార్జ్గా ఎన్.శ్రీనివాస్రావును నియమించారు. పెగడపల్లి ఎ.కృష్ణవేణి, నందనం ఎస్.సదీప్కుమార్, ధర్మసాగర్, సింగారం కె.రవీంద్ర, హసన్పర్తికి ఎ.జగన్మోహన్రావు, దర్గా కాజీపేట, మల్లారెడ్డిపల్లి ఎం.సునీల్ కుమార్, పెంచికలపేట, శాయంపేటకు రాధిక, ఎల్కతుర్తి సీని యర్ ఇన్స్పెక్టర్ ఎండీ అఫ్జలుద్దీన్, మాదారం సీనియర్ ఇన్స్పెక్టర్ వి.జ్యోతి, పెద్దాపూర్కు సీనియర్ ఇన్స్పెక్టర్ మతీన్సుల్తాన్, వంగపహాడ్ సీనియర్ ఇన్స్పెక్టర్ జె.సత్యానందం, ఆత్మకూరు సీనియర్ ఇన్స్పెక్టర్ ఎం.రాణిశ్రీలక్ష్మిని పర్సన్ఇన్చార్జ్గా నియమించారు. సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం అన్ని పార్టీల్లో ఎలక్షన్స్పై మళ్లీ మొదలైన చర్చ 2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లుమొత్తం సహకార సంఘాలు: 99 డైరెక్టర్ స్థానాలు: 1,260 ఏకగ్రీవంగా ఎన్నికై నవి: 509 ఎన్నికలు జరిగినవి: 751 -
ఇప్పుడేం చేద్దాం?
2020 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్లు మొత్తం సహకార సంఘాలు 99డైరెక్టర్ స్థానాలు 1,260ఏకగ్రీవంగా ఎన్నికై నవి 509ఎన్నికలు జరిగినవి 751సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగిశాయి. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అందరూ భావించారు. లేదంటే మున్సిపల్ ఎన్నికలకై నా షెడ్యూల్ విడుదల కావొచ్చన్న చర్చ జరిగింది. వీటన్నింటికీ భిన్నంగా రెండు రోజుల క్రితం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్లు) పాలకవర్గాలను రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల కంటే ముందు.. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోందన్న చర్చ తెరమీదకు వచ్చింది. 2020 ఫిబ్రవరి 13న సహకార సంఘాల ఎన్నికలు జరిగాయి. నిబంధనల ప్రకారం ఐదేళ్ల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితోనే ముగియగా.. పరిపాలనాపరమైన కారణాల దృష్ట్యా అప్పట్లో ప్రభుత్వం వీటి పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించింది. ఆ పొడిగింపు గడువు కూడా ఆగస్టు 14వ తేదీతోనే ముగియగా, మరో ఆరు నెలలు పొడిగిస్తారని అందరూ భావించారు. ఇదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం పాత పాలకవర్గాలను పూర్తిగా రద్దు చేస్తూ తుది నిర్ణయం తీసుకోవడంతో అందరి దృష్టి సహకార సంఘాల ఎన్నికల వైపు మళ్లింది. 2020లో పీఏసీఎస్ ఎన్నికలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2020 ఫిబ్రవరి 13న పీఏసీఎస్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 99 సహకార సంఘాల్లో 97 సంఘాలకే ఎన్నికలు జరగగా, సంగెం, మల్యాల పీఏసీఎస్లు వాయిదా పడ్డాయి. తర్వాత ఆ రెండు సంఘాలకు కూడా నిర్వహించారు. మొదట నిర్వహించిన 97 సహకార సంఘాల్లో దాదాపుగా 88 వరకు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దక్కించుకోగా, 11 వరకు కాంగ్రెస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు గెలుచుకున్నారు. 1,260 డైరెక్టర్లకు 509 ఏకగ్రీవం కాగా 750 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని 12 సహకార సంఘాల్లో 156 డైరెక్టర్లకు 74 డైరెక్టర్లు ఏకగ్రీవం కాగా 82 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వరంగల్ రూరల్ (వరంగల్) జిల్లాలోని 31 సంఘాల పరిధిలో ఉన్న 402 డైరెక్టర్లకు 128 ఏకగ్రీవం కాగా 274 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జనగామలోని 14 సొసైటీల్లో 182 డైరెక్టర్లకు 66 ఏకగ్రీవం కాగా 116 డైర్టెర్లకు ఎన్నికలు జరిగాయి. మహబూబాబాద్ జిల్లాలోని 18 సంఘాల్లో ఉన్న 234 డైరెక్టర్లకు 114 ఏకగ్రీవం కాగా 120 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహించారు. జేఎస్ భూపాలపల్లిలోని 10 సంఘాల్లో 130 డైరెక్టర్లకు 60 ఏకగ్రీవం కాగా 70 డైరెక్టర్లకు ఎన్నికలు, ములుగు జిల్లాలోని 12 సంఘాల్లో 156 డైరెక్టర్లకు 67 ఏకగ్రీవం కాగా 89 డైరెక్టర్లకు ఎన్నికలు జరిగాయి. పర్సన్ ఇన్చార్జ్ల పాలనా? త్వరలో ఎన్నికలా? గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే సహకార సంఘాల పాలకవర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈనేపథ్యంలో పీఏసీఎస్, డీసీసీబీ నిర్వహణ స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేస్తోంది. తదుపరి ఎన్నికలు నిర్వహించే వరకు లేదా కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సంస్థల బాధ్యతలను పర్సన్ ఇన్చార్జ్లకు అప్పగించింది. ముఖ్యంగా వరంగల్ డీసీసీబీ బాధ్యతలను కలెక్టర్కు అప్పగించగా, పీఏసీఎస్లకు ఆర్డీఓ, తాలుకా, మండలస్థాయి అధికారులకు పర్సన్ ఇన్చార్జ్లుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ల సారథ్యంలో పర్సన్ ఇన్చార్జ్లు పనిచేయనున్నందున పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. ఓ వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అన్ని పార్టీలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇదే సమయంలో సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన డీసీసీబీలు, సంఘాలను పునర్వ్యవస్థీకరించిన తర్వాత ఎన్నికలకు వెళ్లవచ్చంటున్నారు రాజకీయ వర్గాలు. కాగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్ప ట్లో ఉండవన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో రద్దయిన సహకార సంఘాలకే ముందుగా ఎన్నికలు జరపవచ్చన్న చర్చ అధికార వర్గాల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మళ్లీ సహకార సంఘాల ఎన్నికల చర్చ రాజకీయ పార్టీల్లో మళ్లీ విస్తృతంగా సాగుతోంది.సహకార సంఘాల పాలకవర్గాల రద్దు కలకలం వైదొలిగిన 99 పీఏసీఎస్లు పాలకవర్గాలు.. స్పెషల్ ఆఫీసర్ల నియామకం మరోసారి పొడిగింపుపై ఆశలు.. రద్దు చేస్తూ సర్కారు కీలక నిర్ణయం సహకార సంఘాల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఎలక్షన్స్పై అన్ని పార్టీల్లోమళ్లీ మొదలైన చర్చ -
ఎస్టీలు లేకున్నా రిజర్వేషన్
వంజరపల్లి గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ కేటాయింపులో అధికారుల తప్పిదంసాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా వంజరపల్లి గ్రామంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడ అధికారులు చేసిన తప్పిదంతో ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నికే లేకుండా పోయింది. అన్ని పల్లెల్లో మూడు దశల్లో ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్లను ఎన్నుకుంటే, ఇక్కడ మాత్రం పంచాయతీ పైఅధికారుల నిర్లక్ష్యంతో గ్రామ సారధిని ఎన్నుకోలేకపోయారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డెడికేషన్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఎన్నికలు జరిగాయని అధికారులు చెబుతున్నా.. 2018లోనూ అప్పటి ప్రభుత్వం 2011 జనాభా లెక్కల ప్రకారం 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించి అప్పుడూ జనవరిలో ఎన్నికలు నిర్వహించింది. దీని ప్రకారమే వంజరపల్లిలో భాగమైన ఎస్టీ జనాభా ఉండే రేఖ్యానాయక్ తండా (212 మంది ఎస్టీ ఓటర్లు) విడిపోయి పోచమ్మ తండాలో కలిసింది. ఈ మేరకు వంజరపల్లిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో ఎస్టీ మహిళ రిజర్వ్ అయి ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు కూడా పోచమ్మ తండాలో మళ్లీ ఎస్టీ జనరల్ రిజర్వ్ కాగా, వంజరపల్లిలో మాత్రం ఒక్క ఎస్టీ లేకున్నా కూడా సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్కు రిజర్వ్ చేశారు. పనిలో పనిగా మూడు వార్డులు కూడా ఎస్టీకి అధికారులు రిజర్వ్ చేయడం చర్చనీయాంశమైంది. మిగిలిన ఐదు వార్డులకు ఎన్నికలు జరగగా, ఉపసర్పంచ్గా మోర్తాల చందర్రావు ఎన్నికయ్యారు. ముమ్మాటికి అధికారుల తప్పిదమే.. ● 2011 జనాభా లెక్కల ప్రకారం వంజరపల్లిలో 212 మంది ఎస్టీలు, 56 మంది ఎస్సీలు, 270 మంది బీసీలు మొత్తం 538 మంది జనాభా ఉంటే 438 మంది ఓటర్లున్నారు. అప్పుడూ రేఖ్యానాయక్ తండా కూడా వంజరపల్లిలోనే ఉంది. అయితే 2018లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించిన గ్రామాలు, తండాలను పంచాయతీలుగా మార్చడంతో 212 మంది ఎస్టీ జనాభా ఉన్న రేఖ్యానాయక్ తండాతో పాటు జారబండా తండా, బోరింగ్ తండా, మహారాజు తండాలు కూడా పోచమ్మ తండాలో విలీనమయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 561 మంది ఎస్టీలుండగా, 2018లో ఇతర తండాలు కలవడంతో ఓటర్ల సంఖ్య 860కు చేరుకుంది. అలాగే, వంగరపల్లిలో ఉన్న 373 మంది ఓటర్లు (324 మంది బీసీలు, 49 మంది ఎస్సీలు) ఉండడంతో 2018లో బీసీ మహిళ రిజర్వేషన్తో ఎన్నికలు జరిగాయి. ● 2018లో వంజరపల్లి గ్రామం సర్పంచ్ స్థానం మాత్రం బీసీ మహిళకు రిజర్వ్ కాగా, ఈసారి ఎస్టీ జనరల్కు అధికారులు కేటాయించారు. ఇక్కడా ఎస్టీ జనాభా లేదని, బీసీ, ఎస్సీలే ఉన్నారని 373 మంది ఓటర్ల జాబితాను పంచాయతీ అధికారులు జిల్లా అధికారులకు సమర్పించినా ఎస్టీ జనరల్కు సర్పంచ్ స్థానం, మూడు వార్డులు ఎస్టీకి రిజర్వ్ అయ్యాయి. అదే వంజరపల్లి గ్రామం నుంచి రేఖ్యానాయక్ తండా వెళ్లి కలిసిన పోచమ్మ తండాలో మాత్రం 2018లో మాదిరి గానే 860 ఓటర్లతో ఈసారి ఎన్నికలు జరిగాయి. రేఖ్యానాయక్ తండావాసులు మాలోతు రాజుకుమార్, బానోతు శ్రీదేవి వార్డు సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. దీన్నిబట్టి చూస్తే పోచమ్మ తండాకు న్యాయం జరిగితే, వంగరపల్లికి అన్యాయం జరగడమేంటని ఇప్పటికే కలెక్టర్లు, పంచాయతీ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లి, ఆ తర్వాత ప్రయోజనం లేకపోవడంతో గ్రామస్తులు హైకోర్టుకు వెళ్లారు. అయితే డ్రా తీసే సమయంలో వంజరపల్లికి ఎస్టీ జనరల్ వస్తే, అక్కడా బీసీ, ఎస్సీ ఓటర్లే ఉన్నారు కదా అని అధికారులు అప్రమత్తమై ఉంటే ఈ అన్యాయం జరిగి ఉండేది కాదని ఆ గ్రామస్తులు వాపోతున్నారు. నిర్లక్ష్యంగా ఉన్న అధికా రులపై చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ ఊరి నుంచి ఎస్టీ జనాభా వెళ్లి కలిసిన పోచమ్మ తండాకు వాస్తవ రిజర్వేషన్ 2018లో మాదిరిగానే 860 ఓట్లతో పోచమ్మ తండాలో సర్పంచ్ ఎన్నికలు అలాంటప్పుడూ ఇక్కడా ఎస్టీ జనాభా లేదని తెలిసి మరీ రిజర్వేషన్ అధికారుల నిర్లక్ష్యంతోనే వంజరపల్లికి అన్యాయమనే చర్చ ఇప్పటికై నా తప్పు సరిదిద్దుకొని ఎన్నికలు నిర్వహించాలంటున్న గ్రామస్తులుఅధికారుల తప్పిదమే.. 2018లో వంజరపల్లి, రేఖ్యానాయక్ తండా కలిసిన పోచమ్మ తండాలో బీసీ మహిళ, ఎస్టీ మహిళ అభ్యర్థులుగా పోటీచేశారు. కిందిస్థాయి అధికారులు వంజరపల్లిలో బీసీలు, ఎస్సీలే ఉన్నారంటూ ఓటరు జాబితాను సమర్పించినా కూడా పైస్థాయి అధికారుల తప్పిదంతో మా ఊరికి అన్యాయం జరిగింది. అదే పోచమ్మతండాకు మాత్రం ఆ ఊరులో కలిసిన రేఖ్యానాయక్ తండా, ఇతర తండాలతో ఓటర్లను కలుపుకొని ఈసారి ఎన్నికలు నిర్వహించారు. 2018లో మాదిరిగానే రేఖ్యానాయక్ తండా రెండు వార్డులు, మహారాజు తండా రెండు వార్డులు, పోచమ్మ తండా రెండు వార్డులు, జారుడు తండా ఒకటి, బోరింగ్ తండా ఒకటి వార్డులకు ఎన్నికలయ్యాయి. దీన్నిబట్టి చూస్తే జిల్లా ఉన్నతాధికారుల తప్పిదం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికై నా 2018లో మాదిరిగానే ఇక్కడా జనాభా ఉన్న రిజర్వేషన్ కలిపించి ఎన్నిక నిర్వహించాలి. – సోమిడి శ్రీనివాస్, వంజరపల్లి -
20 రోజులుగా తాగునీరు బంద్
నర్సంపేట: నర్సంపేట పట్టణం ఒకటో వార్డులో గత 20 రోజులుగా తాగునీరు సరిగారాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల మాట్లాడుతూ గతేడాది నుంచి మిషన్ భగీరథ పైపులైన్కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయని అన్నారు. అలాగే, పలు ఇళ్లకు మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదని తెలిపారు. లీకేజీలకు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తిరుమల విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ.అబ్దుల్పాషా, దంచనాదుల సతీష్, కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల రాజు, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య మంజుల, భూక్య సునీత, జాటోత్ విజయ, నల్లబెల్లి మంజుల, విజయ, ఎండీ.గౌస్యబేగం, ఎండి.కౌసర్, ఎండి.హసినా, ఎండి.జరానీ, ఎండి.సాజియా, ఎండి.నూర్, జాటోతు రమేష్, ఎండి.సర్వర్, బోడ శివరామకృష్ణ, శ్రీపెళ్లి రమ, మల్యాల నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానికులు, మహిళల నిరసన -
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎంను జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్నకు దరఖాస్తులున్యూశాయంపేట: జిల్లాలోని అల్పసంఖ్యాక వర్గాల (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విద్యార్థులు విదేశాల్లో పైచదువులు చదువుకొనేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు 93988 60995 నంబర్లో సంప్రదించాలన్నారు. ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానంకాళోజీ సెంటర్: జిల్లాలోని ట్రాన్స్జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం కింద రూ.75 వేల చొప్పున 8 యూనిట్లకు 100 శాతం సబ్సిడీపై అవకాశం కల్పించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. నేడు జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల ఎంపికలుసంగెం/వర్ధన్నపేట: జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ ఎంపిక పోటీలను పర్వతగిరి మోడల్ స్కూల్లో నిర్వహించనున్నట్లు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు సమ్మయ్య, కార్యదర్శి డెక్క లోకేష్, కోశాధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సీనియర్ పురుషులు, సీ్త్రల కబడ్డీ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 17 సంవత్సరాల పైబడి 85 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26నుంచి ఖమ్మంలో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77807 05024, 87901 54679 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాస్థాయి పోటీలకు ఎంపికసంగెం: జిల్లాస్థాయి గణిత ప్రతిభా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు మండల గణిత ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు సత్యమూర్తి, పులి శిరీష తెలిపారు. సంగెం జెడ్పీహెచ్ఎస్లో శనివారం నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి పోటీలకు బి.విష్ణువర్ధణ్, పి.భరత్ (జెడ్పీహెచ్ఎస్), వి.జానేశ్వరి (కేజీబీవీ సంగెం) ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభంగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంట ప్రధాన రోడ్డు ఎస్సీ కాలనీ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్శాఖ వారికి సమాచారం అందించగా వారు వచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, గొర్రెకుంట – పోతరాజుపల్లి రహదారి విస్తరణ సందర్భంగా గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా అలాగే వదిలేయడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గ్రీవెన్స్లో అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యకు పరిష్కారం లభించడం లేదని గొర్రెకుంట వాసులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
నాణ్యమైన మామిడిని పండించాలి
వర్ధన్నపేట: రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు, నీటి యాజమాన్యం పాటించి నాణ్యత కలిగిన మామిడి పంటను పండించి, మార్కెట్లో అధిక ధరలు పొందాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి ఆర్.శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో సమగ్ర ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్)లో భాగంగా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మామిడి పంట పూత దశకు వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు. మామిడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి తెలిపారు. ఎకరానికి రూ.9 వేల రాయితీ అందిస్తోందని గుర్తుచేశారు. ఫ్రూట్ కవర్లు వాడటం వలన మామిడి నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. డివిజన్ ఉద్యాన అధికారి సీహెచ్.రాకేష్ మాట్లాడుతూ ఉద్యాన శాఖ ద్వారా పండ్లు, కూరగాయలు, ఆయిల్పామ్ తోటలు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన రాయితీల గురించి రైతులకు వివరించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్, ఉద్యాన, వ్యవసాయ విస్తరణ అధికారులు రాజర్షి, మురళి, కంపెనీ ప్రతినిధులు సాగర్, సతీష్, విక్రమ్, ఆయిల్పామ్ క్షేత్రస్థాయి అధికారులు ప్రణయ్, కల్యాణ్, రైతులు సురేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాసరావు -
రేపు ప్రకృతి విపత్తులపై మాక్డ్రిల్
న్యూశాయంపేట: ప్రకృత్తి విపత్తులపై వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో సోమవారం మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కలెక్టర్ మాట్లాడారు. మాక్డ్రిల్ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు సహకరించాలని కోరారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టాల్సిన రెస్క్యూ చర్యలు, బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, వైద్య సహాయం అందించే విధానంపై అవగాహన కల్పించడమే ఈ మాక్డ్రిల్ ఉద్దేశమని వివరించారు. మాక్డ్రిల్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు కలెక్టర్ సత్యశారద సలహాలు ఇచ్చి, పలు సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలురోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. జనవరిలో జరగనున్న రోడ్ సేఫ్టీ కార్యక్రమాలపై హైదరాబాద్లోని సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్, రవాణాశాఖ కమిషనర్ ఇలాంబర్తితో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్లు) గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రోడ్లపై రుంబుల్ స్ట్రిప్ట్స్, స్టడ్స్, సూచిక బోర్డులు, బ్లింకర్స్ వంటివి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డీఓ సుమ, ఆర్అండ్బీ ఈఈ రాజేందర్, జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శోభన్బాబు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలిప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. క్రిస్మస్ సంబరాల ఏర్పాట్లపై అధికారులు, పాస్టర్లతో కలెక్టరేట్లో శనివారం జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి రూ.2 లక్షల చొప్పున కేటాయిస్తూ మూడు నియోజకవర్గాల వారీగా వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట తహసీల్దార్లకు ఏర్పాట్ల బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బాలల హక్కులకు భంగం కలిగించొద్దు
● జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి కాళోజీ సెంటర్: బాలల హక్కులకు భంగం కలిగించొద్దని, వారి హక్కులు, భవిష్యత్కు విఘాతం కలగకుండా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్నిధి అన్నారు. బాలల హక్కులపై వరంగల్లోని మట్వాడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి చదువులో రాణించాలన్నారు. అనంతరం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, పోషకాహారోత్సవంలో జడ్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, పాఠశాల హెచ్ఎం అరుణ, ఉపాధ్యాయులు భిక్షపతి, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
వయోవృద్ధుల సంక్షేమానికి న్యాయసేవలు
న్యూశాయంపేట: వయోవృద్ధుల సంక్షేమం కోసం సత్వర ఉచిత న్యాయసేవలు అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ తెలిపారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో వృద్ధుల సంక్షేమం కోసం శనివారం ఏర్పాటు చేసిన న్యాయసేవల శిబిరాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఈ ఉచిత శిబిరం కేవలం ఒక కార్యక్రమం కాదని, తమ ఇంట్లో ఉన్న వృద్ధులకు తామిచ్చే భరోసా అని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ అవసరమైన న్యాయ సహాయాన్ని సకాలంలో అందించడమే ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్, ఆర్డీఓ సుమ, డీఏఓ ఫణికుమార్ పాల్గొన్నారు. -
కాంగ్రెస్ మద్దతుతో 212 జీపీల్లో విజయం
వరంగల్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీలకు గాను 212 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్లో ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ను శనివారం కలిసి నివేదికలు అందజేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నా విషయాలను వారితో చర్చించారు. ఎన్ఆర్ఈజీఎస్లో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టినట్లు అయూబ్ తెలిపారు. -
ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: ఆయిల్పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాకు కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. ప్రతి క్లస్టర్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి.. రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. మండల క్లస్టర్స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, ఆయిల్పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు. పోలీసుల వేధింపులుడివిజన్లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్లో పెట్టించి కొట్టించిన ఘటనలున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసిన ట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు -
హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బదిలీ
వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ పట్టాభిరామారావును హైదరాబాద్ సీబీఐ కోర్ట్ చీఫ్జడ్జీగా బదిలీ చేస్తూ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు మొదటి అదనపు జిల్లా జడ్జి ఇన్చార్జ్గా ఉంటారు. సోమవారం వరకు రిలీవ్ కావాలని, ఈ నెల 29 వరకు బదిలీ అయిన స్థానంలో బాధ్యతలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మామునూరు: వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్కు చెందిన స్పెషల్ కానిస్టేబుళ్లు శుక్రవారం నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు. ఈమేరకు ఏపీ రాష్ట్రానికి కేటాయించబడిన స్పెషల్ కానిస్టేబుళ్లను రిలీవ్ చేస్తూ కమాండెంట్ శివప్రసాద్రెడ్డి సిబ్బందిని అభినందించారు. తెలంగాణలో విధులు నిర్వర్తించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లోనూ క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావంతో ప్రజలకు మంచి చేయాలని సూచించారు. విధుల్లో పేరు ప్రతిష్టతలు పెంచుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 22వ తేదీన హనుమకొండలోని జేఎన్ఎస్లో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.సారంగపాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–16, 18, 20, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో ఎంపికలు నిర్వహించున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఎంపిౖకైన క్రీడాకారులు జనవరి 2, 2026న హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరగనున్న 11వ రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. విజేతలకు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లతో పాటు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 22న ఉదయం 8గంటలకు జేఎన్ఎస్ వద్ద జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సారంగపాణి 93901 04499, సాంబమూర్తి 99120 22188, రజనీకాంత్ 70133 03330 మొబైల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. హన్మకొండ అర్బన్: ఈనెల 23న (మంగళవారం) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం రెడ్ క్రాస్ భవన్లో జిల్లా పాలకవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం హనుమకొండ కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సర్వ సభ్య సమావేశానికి సంబంధించిన బుక్లెట్ను కలెక్టర్కు అందజేశారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు ఉచిత న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేయగా.. డీఎంహెచ్ఓ అప్పయ్య లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ విజయచందర్రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు, టీబీ నివారణాధికారి హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో కేజీబీవీల్లో, మోడల్ స్కూళ్లలో తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు (పీటీఎం) సమావేశాలు ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే సమావేశంలో పిల్లల కోసం ప్రత్యేక వంటకాలు(పోషకాహారం) చేసుకుని తీసుకురావాలని తల్లిదండ్రులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం. పోషకాహారోత్సవాన్ని పాఠశాలల్లో వినూత్నంగా చేపట్టాలని నిర్ణయించినట్లు హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి శుక్రవారం తెలిపారు. -
సమస్యలెన్నో.. పరిష్కరించండి
ఐనవోలు: ఐనవోలు మల్లన్న జాతర జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో జాతర నిర్వహణపై శనివారం కలెక్టరేట్లో వివిధ అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వసతులు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. నిధులు లేక నిలిచిన డార్మెటరీ పనులు మల్లన్న ఆలయంలో కమ్యూనిటీ హాల్ కం డార్మెటరీ హాల్ నిర్మాణానికి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) గతంలోనే ఆమోదం తెలిపింది. బేస్మెంట్ వరకు పనులు చేసి నిధులు మంజూరు కాకపోవడంతో నిలిపేశారు. అర్ధంతరంగా నిలిచిన పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలయ ప్రాంగణంలో షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రతిపాదనకే పరిమితమైంది. నిర్మాణానికి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు చేయడంతోపాటు గతంలో ‘కుడా’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైటింగ్ టవర్స్ రిపేర్ చేయించాల్సి ఉంది. భక్తుల డిమాండ్లు ● ఆలయ ప్రాంగణంలో పట్నాలు, ఇతరత్రా ఆర్జిత సేవల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక లైన్ ద్వారా స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించాలి. ● సేవా టికెట్ కొనుక్కున్న భక్తుల నుంచి ఒగ్గు పూజారులు ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడాన్ని నియంత్రించాలి. ● భక్తుల సంఖ్యకు సరిపోయేలా సులభ్ కాంప్లెక్స్లు తాత్కాలిక, శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలి. ● భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి గదులు, పెద్ద డార్మెటరీ హాల్ నిర్మించాలి. ● ఆలయానికి కనీసం రూ.50 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి చేయాలి. ● ఆలయ తూర్పు, దక్షిణం వైపు ఉన్న కీర్తితోరణాలు శిథిలం కాగా మరమ్మతులు చేపట్టాలి. ● ఆర్కియాలజీ శాఖ సహకారంతో పడమర వైపు నాలుగో కీర్తి తోరణం ఏర్పాటు చేయాలి. – ఆలయానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా పేరిణి నృత్య మండపాన్ని ఆధునికీకరించాలి. ● రాజగోపురం, కోనేరు ఏర్పాటు, అలాగే ఆలయం చుట్టూ ఉన్న నేల బయ్యారాన్ని నిపుణుల సాయంతో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి. ● పూర్వం ఊరగుట్టపైనే మల్లికార్జునస్వామి వెలిశాడని ఐనవోలువాసుల నమ్మకం. ఇటీవల ఊరగుట్టపై ఆలయం తరఫున కార్తీక మాసంలో అఖండ దీపం వెలిగిస్తున్నారు. ఊర గుట్ట, కింద ఉన్న చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ● జాతర ప్రాంగణంలో 10 స్నాన ఘట్టాలు ఉండగా.. సీ్త్రల డ్రెస్సింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. ● గత జాతరలో నీటి సరఫరాలో ఇబ్బందులు పడిన కారణంగా 10 హెచ్పీ మోటార్ 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ● 40 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, రెండు అదనపు హైమాస్ట్ లైటింగ్ టవర్స్, భద్రతాపరంగా మరో 50 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడమే కాకుండా అగ్నిమాపక వాహనం జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేయాలి. ● ఆలయ ప్రాంగణంలో ఉన్న పోలీస్ స్టేషన్ను మరో చోటకు మార్చాలి. ప్రస్తుతం జాతర ప్రాంగణంలో పోలీసులు పట్టుకున్న, యాక్సిడెంట్ ఘటనలకు సంబంధించిన వాహనాలను ఉంచడంతో భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. వెంటనే మరో చోటుకు తరలించాలని పోలీస్ ఉన్నతాధికారులను ఈఓ కందుల సుధాకర్ కోరుతున్నారు. ఈసారి కలెక్టరేట్లో సమావేశం ప్రతీ ఏడాది జాతరకు సంబంధించిన సమన్వయ సమావేశం మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహించేవారు. కానీ, ఈసారి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నట్లు ఈఓ కందుల సుధాకర్ తెలిపారు. మల్లన్న ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తేనే అధికారులకు క్షేత్రస్థాయిలో సమస్యలపై, చేయాల్సిన పనులపై పూర్తి అవగాహన ఉంటుందని.. అప్పటికప్పుడు మెరుగైన వసతుల కల్పనకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేడు ఐనవోలు జాతర నిర్వహణపై సమావేశం కలెక్టరేట్లో అధికారులతో చర్చించనున్న కలెక్టర్ అభివృద్ధిపై దృష్టిసారించాలంటున్న భక్తులు -
అంగన్వాడీ సెంటర్ తనిఖీ
ఖిలా వరంగల్: వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్ బీఆర్నగర్లోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఏఎస్పీ శుభం ప్రకాశ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కార్పొరేటర్ పల్లం పద్మతో కలిసి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవలపై ఆరా తీశారు. ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని లబ్ధిదారులకు అందించాలని అంగన్వాడీ టీచర్కు సూచించారు. మంత్రి వెంట తహసీల్దార్ ఇక్బాల్, అధికారులు ఉన్నారు. రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్కు చెందిన అంబులెన్స్ డ్రైవర్కు బ్రీత్ ఆనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్న్స్ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
చలితో విలవిల
సాక్షి, వరంగల్/హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు రాత్రి ఉష్ణోగ్రత మరీ తక్కువగా నమోదవుతున్నది. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు ఆటోమేటిక్ వెథర్ స్టేషన్లో నమోదైన వివరాల మేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 సెల్సీయస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 32 సెల్సియస్ డిగ్రీల వరకు నమోదైంది. అయింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.3 డిగ్రీలుండగా అత్యధిక ఉష్ణోగ్రత 29.6 డిగ్రీలుగా నమోదైంది. వరంగల్ జిల్లా నెక్కొండలో అత్యల్ప ఉష్ణోగ్రత 10.8 సెల్సియస్ డిగ్రీలు, అత్యధిక ఉష్ణోగ్రత 30.6 సెల్సియస్ డిగ్రీలుగా నమోదైంది. వచ్చే రెండు, మూడు రోజుల్లో మరింత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఉన్ని దుస్తులకు డిమాండ్.. చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలి.. తెల్లవారుజామునుంచే పొగమంచు కురుస్తుండడంతో నిత్యావసర సరుకులైన కూరగాయలు, ఇతర సామగ్రి తీసుకెళ్లే వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని వరంగల్ కమిషనరేట్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ సమయాల్లోనే ఎదురుగా ఉండే వాహనం, ఎదురుగా వచ్చే వాహనం పొగమంచు కారణంగా కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశముందని, గతేడాది డిసెంబర్లోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహనాల పార్కింగ్ లైట్లు వేసుకోవాలన్నారు. అప్రమత్తంగా ఉండాలి.. చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు తినాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సాంబశివరావు, వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు (డిగ్రీలు సెల్సియస్లలో)ప్రాంతం అత్యల్పం అత్యధికంఎల్కతుర్తి 10.3 29.6 మరిపల్లి గూడెం 11.2 30.3 ఆత్మకూరు 10.8 28.9 నాగారం 11.3 29.9 పెద్ద పెండ్యాల 11.0 32.8 శాయంపేట 11.6 28.9 వేలేరు 11.3 29.6 నడికూడ 12.1 29.6 ధర్మసాగర్ 10.8 31.3 మడికొండ 11.1 30.6 పులుకుర్తి 12.2 30.8 కాజీపేట 11.1 32.3 చింతగట్టు 11.8 32.6 కొండపర్తి 11.1 30.2 భీమదేవరపల్లి 12.8 31.1 పరకాల 13.1 29.5 దామెర 11.5 30.1 ఐనవోలు 12.4 32.4 హనుమకొండ 12.7 30.8 కమలాపూర్ 13.5 32.1 రోజురోజుకూ ఉష్ణోగ్రతల తగ్గుముఖంతో వణుకుతున్న ప్రజలు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీలు నేడు చలి తీవ్రత మరింత పెరుగుతుందన్న వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు -
శాస్త్రసాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించాలి
విద్యారణ్యపురి: భారతదేశం శాస్త్రసాంకేతక రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తే విశ్వగురువుగా కీర్తించే అవకాశం ఉంటుందని ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యానగర్లోని సేయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో జిల్లా స్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ.. విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లోని నూతన ఆలోచనలు సృజనాత్మక ప్రతిభను వెలికి తీసేందుకు వేదికలవుతాయన్నారు. తాను సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి వచ్చే ఏడాది సైన్స్ ఫెయిర్ నాటికి జిల్లా సైన్స్కేంద్రం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానన్నారు. విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడమే ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్ఫెయిర్ అంటే ఒక మోడల్ను.. ఒక ఎగ్జిబిట్ను ప్రదర్శించడం కాదని పరస్పర విజ్ఞానాన్ని షేర్ చేసుకోవడమేనని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. విద్యార్థులు భవిష్యత్లో పరిశోధకులుగా, శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ సైన్స్ ఫెయిర్లు దోహదం చేస్తాయన్నారు. అనంతరం డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్లో విద్యార్థులు ప్రదర్శనలను తిలకించాలని సూచించారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ మేన శ్రీను, స్థానిక కార్పొటర్ నల్లా స్వరూపరాణి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాస్స్వామి, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ అధినేత నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ హరిత, వడుప్సా బాధ్యుడు మాదాల సతీశ్కుమార్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, హసన్పర్తి ఎంఈఓ ఎ.శ్రీనివాస్, కాజీపేట ఎంఈఓ బి.మనోజ్కుమార్, సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు బద్దం సుదర్శన్రెడ్డి, డాక్టర్ మన్మోహన్, బి.మహేశ్, సునీత, ఉపాధ్యాయుడు వల్స పైడి పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళిశ్రీపాల్రెడ్డి వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మక ప్రతిభ -
సోలార్ ప్లాంటుకు స్థల పరిశీలన
గీసుకొండ: కొనాయమాకుల–వంచనగిరి మధ్యలో ఉన్న 16 ఎకరాల ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వ భూమిలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంటు ప్రతిపాదనను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి అన్నారు. కాకతీయ కాల్వ వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూమిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంటును సెర్ప్ మహిళా సంఘాల వారు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అధికారులతో కలిసి కేటాయించిన భూమి హద్దులను పరిశీలించారు. ఎన్పీడీసీఎల్ డీఈ దానయ్య, ఏడీ రవి, ఏఈ సంపత్కుమార్, లైన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టీజీ రెడ్కో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఇంజనీర్ నవీన్కుమార్, డైనేరా కంపెనీ సైట్ ఇంజనీర్ ముస్తఫా, ఐబీ ఏఈ సాయిరాజు, డీపీఎం దాసు, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర సతీశ్ స్థల పరిశీలన చేసి సోలార్ ప్లాంటు ఏర్పాటుపై చర్చించారు. సర్వేయర్ భాస్కర్ ప్లాంటు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం హద్దులను అధికారులకు చూపించారు. -
అప్రమత్తంగా ఉండాలి..
చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వచ్చే అవకాశాలున్నాయి. అలాగే చెవి మూసుకుపోవడం, దురదతో పాటు నొప్పి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అధిక చలి కారణంగా చెవిలో ఇన్ఫెక్షన్ సమస్య ఎదురవుతుంది. ఈ పరిస్థితిలో నొప్పి ఎక్కువ కాకముందే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలకు బ్రోన్కియోలిటిస్ అనే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదముంది. దీనివల్ల ఊపిరితిత్తుల గాలి మార్గాల్లో శ్లేష్మం ఏర్పడి ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో బయట ఆహారం తినడం మానేయాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి● -
ఎమ్మెల్యే నాగరాజుకు చుక్కెదురు
వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో వర్ధన్నపేట ఎమ్మెల్యేకు చుక్కెదురైంది. ఎన్టీఆర్నగర్, బాలాజీనగర్, లక్ష్మీగణపతి, శ్రీసాయిగణేశ్కాలనీ, ముసలమ్మకుంట ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు నిధులు పెట్టి ముఖ్యమైన ఏనుమాములకు ఒక్క రూపాయి కూడా ఎందుకు పెట్టలేదంటూ స్థానిక ప్రజలు.. ఎమ్మెల్యే నాగరాజును ప్రశ్నించారు. 14వ డివిజన్లో సుమారు రూ.7.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు శుక్రవారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఏనుమాములకు వచ్చారు. గెలిచి రెండేళ్లయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీశారు. డివిజన్లో ముఖ్యమైన ఏనుమాములను విస్మరించడం సరికాదని ఎమ్మెల్యేతో స్థానికులు అనడంతో శ్రీనాకు తెలియదు. మీ నాయకులు వివరాలు ఇవ్వాల్సి ఉందిశ్రీ అని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. సమస్యలను చెప్పుకునేందుకు ఒంటరిగా మీ దగ్గరికి వస్తే పట్టించుకోవడం లేదని, ఎంతో అవసరమైన ఏనుమాముల శ్మశానవాటికకు కూడా నిధులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఈవిషయాలు తన దృష్టికి రాలేదని, భవిష్యత్లో మీ ప్రాంతంలో అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం, పోలీసులు రంగప్రవేశం చేసి ప్రజలను అడ్డుకోవడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఎమ్మెల్యే నాగరాజు పర్యటనలో మూడు వాహనాలు, ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 10మందికి పైగా పోలీసులు బందోబస్తులో ఉండడాన్ని గమనించిన పలువురు మంత్రి పర్యటన కంటే ఎక్కువ బందోబస్తు ఉందన్న చర్చించుకోవడం గమనార్హం. కాగా, డివిజన్లో అధికార పార్టీ ముఖ్య నాయకులు చెప్పిందే పోలీస్ స్టేషన్, ఇతర కార్యాలయాల్లో జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే నాగరాజును కలవనీయకుండా చుట్టూ ఉంటున్న నాయకులే అడ్డుపడుతున్నారని స్థానికులు వాపోయారు. పోలీసుల వేధింపులు..డివిజన్లో అధికార పార్టీ నాయకులు తమకు అడ్డుగా ఉన్న నాయకులను పోలీస్ స్టేషన్లకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక నాయకుడిని స్టేషన్లో పెట్టించి కొట్టించిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఒక గ్రామానికి వెళ్లగా అడ్డుకున్న వీడియో వైరలైంది. ఈ వీడియోను 14వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోగా కాంగ్రెస్ నాయకుడి ఆదేశంతో ఏనుమాముల ఎస్సై పిలిపించి బెదిరించడమే కాకుండా బూతు పురాణం చేసినట్లు ఆపార్టీ నాయకులు తెలిపారు. అంతేకాకుండా సాయంత్రం రావాలని ఆదేశించడంతో మిగిలిన నాయకులతో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది. అభివృద్ధి నిధులపై ప్రశ్నించిన 14వ డివిజన్ ఏనుమాముల ప్రజలు -
కుష్ఠుపై సమరం
ఈనెల 31 వరకు ఇంటింటి సర్వే గీసుకొండ: జిల్లాలో కుష్ఠు నిర్ధారణ కోసం వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ఈ నెల 18 నుంచి 31వ తేదీ వరకు ఈ సర్వే కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు. ప్రారంభఽ దశలో వ్యాధిని గుర్తించి తగిన చికిత్స అందించడానికి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొదించింది. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పీహెచ్సీల నోడల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యాధికి సంబంధించిన ప్రచార కరపత్రాలు, బ్యానర్లను గ్రామాలు, ఆరోగ్య కేంద్రాల వద్ద కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఏర్పాటు చేయిస్తున్నారు. ఇవీ వ్యాధి లక్షణాలు.. శరీరంలో తెల్లని, ఎర్రని రాగి రంగు మచ్చలు ఉండి స్పర్శ లేకుండా మొద్దుబారి ఉండడం, ముఖంపై నూనె పోసినట్లు మెరుస్తూ ఉండడం, దద్దులు రావడం, అరికాళ్లు, అరచేతుల్లో తిమ్మిర్లు రావడం, కనురెప్పలు సరిగా మూసుకోకపోవడం లాంటివి కుష్ఠు లక్షణాలు. ఇంటింటి సర్వేలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. కుష్ఠు వ్యాధితో వచ్చే అంగవైకల్యానికి చేతివేళ్లు వంకర పోవడం, ఫుట్ డ్రాప్ సమస్య ఉన్నవారికి ఉచితంగా శస్త్రచికిత్సతో సరిచేస్తారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే ఎండీటీ చికిత్స అందిస్తారు. వ్యాధి ఏ దశలో ఉన్నా సాధారణమని ప్రజలు గమనించాలని, హైరానా పడకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను కలవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వ్యాధి సోకేదిలా.. లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల కుష్ఠు సోకుతుంది. వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా దగ్గరలో ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఈవ్యాధి ముఖ్యంగా చర్మం, నరాలకు సోకుతుంది. ఇది ఒక రకమైన అంటువ్యాధి కారకం. రెండు రకాలుగా చికిత్స.. కుష్ఠు వ్యాధి సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఐదు మచ్చలు ఉంటే వారిని పాసీ బ్యాసిల్లరీ(పీబీ)గా గుర్తిస్తారు. ఇలాంటి వారికి 6 నెలల వరకు చికిత్స ఉంటుంది. కనీసం 9 నెలల్లో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది ఐదు కంటే ఎక్కువ మచ్చలు ఉంటే వారిని మల్టీ బ్యాసిల్లరీ (ఎంబీ)గా గుర్తిస్తారు. అలాంటి వారికి 12 నెలలపాటు చికిత్స అందిస్తారు. కనీసం 15 నెలల్లో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. బహుళ ఔషధ చికిత్సతో కుష్ఠును పూర్తిగా నయం చేయవచ్చని వైద్యులు అంటున్నారు. రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖరీదు చేసే మందులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 6–12 నెలల వరకు చికిత్స తీసుకుంటే వ్యాఽధి పూర్తిగా నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి అంగవైకల్యం కలుగకుండా చూడవచ్చని వారు సూచిస్తున్నారు.జిల్లాలో ప్రస్తుతం 27 మంది కుష్ఠు వ్యాఽధిగ్రస్తులు ఉన్నారని జిల్లా కుష్ఠు నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్ తెలిపారు. ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు వైద్య బృందాలు ఇంటింటికి తిరుగుతూ సర్వే చేస్తాయన్నారు. సర్వే కోసం జిల్లా వ్యాప్తంగా 545 టీంలను ఏర్పాటు చేశామని, 1,090 మంది టీం మెంబర్లు, 208 మంది సర్వేయర్లు ఉంటారన్నారు. మండలాల వారీగా లెప్రసీ నోడల్ పర్సన్లు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారన్నారు. 545 టీంలను ఏర్పాటు చేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలో ప్రస్తుతం 27 మంది వ్యాధిగ్రస్తులు బహుళ ఔషధ చికిత్సతో పూర్తిగా నయం -
నేడు జాతరలపై సమావేశం
హన్మకొండ అర్బన్: సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఐనవోలు, కొత్తకొండ జాతరలపై శనివారం కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు ఐనవోలు జాతర, సాయంత్రం 4 గంటలకు కొత్తకొండ జాతర నిర్వహణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సమీక్ష కార్యక్రమాల్లో రాష్ట్ర దేవాదాయ, శాఖ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొననున్నారు. కాగా, గతంలో ఈ విధమైన సమావేశాలు స్థానికంగా ఆలయాల్లోనే నిర్వహించినప్పటికీ ప్రస్తుతం కలెక్టర్ రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఇతర సమావేశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కావాల్సి ఉన్నందున వేదికను కలెక్టరేట్కు మార్చినట్లు సమాచారం.రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలువర్ధన్నపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలైన సంఘటన శుక్రవారం సాయంత్రం వర్ధన్నపేటలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామానికి చెందిన మంద కొమ్మాలు, రాము తండ్రి కొడుకులు. పాలకుర్తి మండలం రంగరాయిగూడెంలో తమ బంధువుల ఇంట్లో శుభ కార్యానికి వారు బైక్పై వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో వర్ధన్నపేటలోని వరంగల్–జఫర్గఢ్ ప్రధాన రహదారిపై వెనుక నుంచి అతి వేగంతో వస్తున్న బొలేరో వాహనం బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే స్థానికులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నారు. శివరామపురంలో చోరీరాయపర్తి: మండలంలోని శివరామపురంలో దొంగలు హల్చల్ చేశారు. ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావు రాజిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 18న వేములవాడకు వెళ్లాడు. దుండగులు గురువారం రాత్రి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి రూ.6.10 లక్షల నగదుతోపాటు తులం బంగారం చోరీ చేసినట్లు తెలిపారు. ఇటీవల ప్లాట్ విక్రయిస్తే వచ్చిన డబ్బులను ఇంట్లో దాచిపెట్టినట్లు బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్.. అంబులెన్స్ డ్రైవర్పై కేసు రామన్నపేట: నగరంలోని వరంగల్ – నర్సంపేట రోడ్డు రాంకీ గేటు ఎదుట శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో లోహిత హాస్పిటల్కు చెందిన అంబులెన్స్ డ్రైవర్కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 226 రీడింగ్ నమోదైంది. అత్యవసర సేవలకు ఉపయోగించే అంబులెన్స్ను మద్యం సేవించి నడపడం తీవ్ర నిర్లక్ష్యమని భావించిన పోలీసులు వెంటనే వాహనాన్ని నిలిపేసి డ్రైవర్పై కేసు నమోదు చేశారు. -
వరంగల్
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ వీసీ ప్రతాప్రెడ్డి కోరారు. కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ కేయూ క్రీడామైదానంలో ప్రారంభించారు.సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. 11.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 9.8 డిగ్రీల సెల్సియస్ మధ్య శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో 8.4 డిగ్రీలు, 9.2 డిగ్రీలు, 8 డిగ్రీలు, 6.8 డిగ్రీలు, 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం నమోదవుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, రాత్రి వేళ అవసరముంటేనే బయటకు రావాలని సూచించింది. ఉన్ని దుస్తులకు డిమాండ్..చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆయిల్పామ్పై అవగాహన కల్పించాలి
ఖిలా వరంగల్: ఆయిల్పామ్ సాగులో నిర్దేశించిన ప్రగతిని సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లో అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్పామ్ విస్తరణ పథకాన్ని జిల్లాలో అమలు చేయాలని, కేటాయించిన 4,250 ఎకరాల లక్ష్యాన్ని ఉద్యాన, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పూర్తిచేయాలని సూచించారు. రైతులను గుర్తించి అయిల్పామ్ సాగు వైపు ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సబ్సిడీలపై అవగాహన కల్పించి సాగుకు అవసరమైన సహకారం అందించాలని తెలిపారు. ప్రతి క్లస్టర్లో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారి తనకు నిర్దేశించిన 35 ఎకరాల లక్ష్యాన్ని సాధించాలన్నారు. మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహించి అయిల్పామ్ సాగు లాభాలను రైతులకు వివరించి, సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారుల ను ఆదేశించారు. యాప్ను సద్వినియోగం చేసుకోవాలి రైతులకు ఎరువులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మొబైల్ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని, ఈనెల 22 నుంచి యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. పట్టాదారులు పాస్బుక్ హోల్డర్లు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో నేరుగా లాగిన్ కావాలని, పట్టాలేని రైతులు ఆధార్కార్డుతో రిజిస్టర్ కావాలని సూచించారు. ఎరువులు తీసుకునేటప్పుడు ఆధార్కార్డు తప్పనిసరిగా చూపించాలని, కౌలు రైతులు భూయజమాని పట్టాదారు పాస్బుక్ (పీపీబీ) నంబర్ నమోదు చేయాలని చెప్పారు. యజమాని మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరణ పూర్తి చేసుకున్న తర్వాత తమ ఆధార్ నంబర్, పేరు, తండ్రి పేరు నమోదు చేయాలని, తమ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని వెరిఫై చేసిన అనంతరం యూరియా బుకింగ్ చేసుకోవాలని పేర్కొన్నారు. మండల క్లస్టర్స్థాయి వ్యవసాయ అధికారులు యాప్ వినియోగంపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్రావు, ఆయిల్పామ్ కంపెనీ జనరల్ మేనేజర్ సతీశ్ నారాయణ, వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్, ఉద్యాన అఽధికారులు, విస్తరణ అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. 22న మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించాలివరంగల్ చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ఈనెల 22న మాక్ ఎక్సర్సైజ్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అఽధికారులనుఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేందుకు చేపట్టాల్సి న తక్షణ చర్యలపై అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. హైదరాబాద్లోని టీజీ ఐసీసీసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎన్డీఎంఏ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేశ్, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మాక్ ఎక్సర్సైజ్ ఆవశ్యకత గురించి వివరించారు. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. విపత్తులు సంభవించిన సమయంలో సమర్థవంతంగా ఎదుర్కొనేలా అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. విపత్తుల నిర్వహణపై అప్రమత్తతను పెంపొందించేందుకు మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో డీఆర్వో విజయలక్ష్మి, అగ్నిమాపక శాఖ అధికారి శ్రీధర్రెడ్డి, ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్అండ్బీ, ఎస్డీఆర్ఎఫ్, పశుసంవర్థక, పోలీసు అధికారులు పాల్గొన్నారు. అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
సమన్వయంతో ఎన్నికలు ప్రశాంతం
వరంగల్ క్రైం: అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో కమిషనరేట్ పరిధిలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్్ప్రీత్ సింగ్ అన్నారు. గురువారం డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, కవిత సీపీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డు స్థాయి వరకు అందరూ ప్రణాళికాబద్ధంగా పనిచేశారని తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేశామని ఆయన పేర్కొన్నారు. హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (బీఎంఎస్ అనుబంధం) టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈది వెంకట రమణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నే శశికుమార్ తెలిపారు. హనుమకొండలో గురువారం జరిగిన యూనియన్ ఎన్పీడీసీఎల్ కార్యవర్గ సమావేశంలో వెంకటరమణను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను ఎన్నుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశికుమార్, ఎన్పీడీసీఎల్ శాఖ అధ్యక్షుడు ఆర్.రమణారెడ్డి, కార్యవర్గ సభ్యులకు వెంకటరమణ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. కేయూ క్యాంపస్: యాంటీ సెక్సువల్ హరాస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఈనెల 20న(శనివారం) ఉదయం 10:30 గంటలకు కేయూలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా కేయూ వీసీ ప్రతాప్రెడ్డి, గౌరవ అతిథిగా రిజిస్ట్రార్ రామచంద్రం, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి వీబీ నిర్మలా గీతాంబ కీలకోపన్యాసం చేయనున్నారు. వరంగల్ షీ టీం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.సుజాత, కేయూ ఉమెన్ స్టడీస్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.శోభ, కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్, కేయూ స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ మామిడాల ఇస్తారి పాల్గొంటారని కేయూ యాంటీ సెక్సువల్ సెల్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ప్రముఖ న్యాయవాది రామారావు ఫిర్యాదుతో కేసు నమోదు ఎంజీఎం: వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో ఎలుకల సంచారం ఘటనను మానవహక్కుల సంఘం (హెచ్ఆర్సీ) తీవ్రంగా పరిగణించింది. పిల్లల వార్డులో తల్లులతోపాటు శిశువులు సైతం గాయాలపాలైన ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది రామారావు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆస్పత్రిలో సెక్యూరిటీ, పరిశుభ్రత గురించి అనేక సందేహాలు వస్తున్నాయి. ఎలుకలు ఆస్పత్రి వార్డులోనే కాకుండా కారిడార్లు, శిశువుల ఊయల దగ్గర కూడా తిరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో ఎలుకలు తిరుగుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడం ఆశ్చర్యానికి గురిచేసిందని న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ కిస్ట్రినా జడ్చోంగ్త్ను ఆయన కోరారు. -
ప్రయోగాలకే పరిమితం!
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ కమిషనర్లు మారిన ప్రతీసారి వారు అమలు పారిశుద్ధ్య నిర్వహణ విధానాలూ మారుతున్నాయి. ఒక కమిషనర్ రూపకల్పన చేసిన విధానాలను మరో కమిషనర్ లెక్క చేయడం లేదనే ఆరోపణ లున్నాయి. వీరి ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా అమల్లో ఉన్న నిబంధనలకు పదును పెట్టి మరిన్ని ఫలితాలు సాధించాలి. కానీ, రూ.కోట్లు వెచ్చించి చేసిన ప్రయోగాలు విఫలమవుతున్నాయి. 2012 నుంచి అదే వరుస.. సుప్రీం కోర్టు 2001లో చెత్త ప్రక్షాళన నిబంధనావళి (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) మార్గదర్శకాలను జారీ చేసింది. 2012 అక్టోబర్ 10–17 తేదీల్లో అప్పటి కమిషనర్ వివేక్యాదవ్ క్లిన్ సిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చెత్త రెడ్యూస్, రీయూజ్, రీ సైక్లింగ్ చేపట్టారు. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ చేపట్టారు. డస్ట్బిన్ లెస్ నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలను జాగృతం చేసి మంచి ఫలితాలు రాబట్టగలిగారు. బాలసముద్రంలో బయోగ్యాస్ గ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లు నెలకొల్పారు. విద్యుత్తోపాటు సేంద్రియ ఎరువు ఉత్పత్తికి అంకురార్పణ చేశారు. ఈనేపథ్యంలో నగరానికి పెద్ద ఎత్తున అవార్డులు, ప్రశంసపత్రాలు లభించాయి. దేశ వ్యాప్తంగా నగరాల దృష్టి వరంగల్పై పడింది. ‘క్లీన్ సిటీ.. అగ్లీ సిటీగా మారింది’ 2013 తర్వాత అది కాస్తా తిరోగమన దిశగా పయనించింది. కమిషనర్గా జి.సువర్ణ పండాదాస్ వచ్చారు. నగరంలో క్లిన్సిటీ వాస్తవ పరిస్థితులను పరిశీలించి క్లిన్సిటీ అగ్లీసిటీగా మారిందన్నారు. విజయవాడలో రూపొందించిన వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టును రూపొందించాలని ఆదేశించారు. తడి, పొడి చెత్త కాకుండా అంతా సేకరించాలని ఆదేశాలిచ్చారు. నగర వీధుల్లో చెత్త కుప్పలు పేరుకుపోతున్నాయని, డస్ట్బిన్ డబ్బాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతో క్లిన్సిటీ నిర్ణయాలు నిరూపయోగమయ్యాయి. మారుతున్న కమిషనర్లు, ప్రణాళికలు తొలుత తోపుడు బండ్లు, రిక్షాలు, ఇప్పుడు స్వచ్ఛ ఆటోలు ఇలా.. కమిషనర్లు మారినప్పుడల్లా మార్పులు జరుగుతూనే ఉన్నాయి. పొడి చెత్త సేకరణ డ్రై వేస్ట్ కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. డీఆర్సీసీ సెంటర్లు మాత్రం విజయవంతంగా నడుస్తున్నాయి. రోడ్ల వెంట డస్ట్ బిన్లకు సుమారు రూ.2 కోట్లు వెచ్చించారు. ఇవి మచ్చుకు కూడా కనిపించట్లేదు. వరంగల్ గోపాలస్వామి దేవాలయం బస్ స్టాప్, హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కరీంనగర్ రోడ్డులోని పోలీస్ కమిషనరేట్ ప్రహరీ పక్కన రూ. 17లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన భూగర్భ డస్ట్ బిన్లు కాలగర్బంలో కలిపోయాయి. వరంగల్ హెడ్పోస్టాఫీస్ సెంటర్లోని బల్దియా షెట్టర్లలో ఆర్గానిక్ కంపోస్ట్ ఎరువు పరికరాలు రూ.11 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా ఇవీ ఎందుకూ పనికి రాకుండా పోయాయి. ఫలితాలు నామమాత్రం విధానాల మార్పుతో ప్రజాధనం దుర్వినియోగం గ్రేటర్ కమిషనర్లది ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు -
రైతులకు యూరియా కష్టాలు
ఐనవోలు: మండలంలోని రైతులకు యాసంగిలో యూరియా కష్టాలు ప్రారంభమయ్యాయి. గురువారం కక్కిరాలపల్లి గ్రామంలోని ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కు 200 యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకున్న రైతులు తెల్లవా రక ముందే సెంటర్కు చేరుకుని క్యూలో నిల్చున్నారు. గ్రామ పంచాయతీ వద్ద చిట్టీలు ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో సుమారు 300 మంది రైతులు పరుగెత్తుకుంటూ వెళ్లి క్యూలో నిల్చున్నారు. నిర్వాహకులు ఒక్కరికి ఒక బస్తా యూరియా టోకెన్ రాసిచ్చారు. అందరికీ చిట్టీలు అందకపోవడంతో సుమారు వంద మంది రైతులు నిరాశతో వెనుతిరిగారు. 60 టన్నులకు డబ్బులు కడితే 10 టన్నుల యూరియా మాత్రమే వచ్చిందని, రెండు రోజుల్లో మరో లోడ్ యూరియా వస్తుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి యూరియా పంపిణీని ప్రారంభించి పూర్తి చేశారు. యూరియాతోపాటు ఇతర మందులు బలవంతంగా అంటగడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక బస్తా యూరియా రూ.280కి రావాల్సి ఉండగా.. రూ.410 పెట్టి కొనుక్కోవాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
సైన్స్ ఫెయిర్కు సర్వం సిద్ధం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. హనుమకొండ విద్యానగర్లోని సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో శుక్ర, శనివారాల్లో విద్యావైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వికసిత్భారత్, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా శాస్త్రసాంకేతికత, గణితం, ఇంజనీరింగ్ ప్రధాన ఇతివృత్తంగా ఈ ప్రదర్శనలు ఉంటాయి. ఏడు ఉప అంశాలతో ఎగ్జిబిట్లు జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో ఉప అంశాల ఎగ్జిబిట్లు ఉంటాయి. సుస్థిర వ్యవసాయం, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం, గ్రీన్ ఎనర్జీ, ఉద్భవిస్తున్న సాంకేతికత, గణిత నమూనాలు, ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణ అనే ఏడు ఇతివృత్తాల అంశాలతో విద్యార్థులు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. 300 మంది విద్యార్థులు తమ గైడ్టీచర్లతో హాజరుకానున్నారు. ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు ఇన్స్పైర్కు 93 మంది విద్యార్థులు హాజరై ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్నారు. ఒక్కో విద్యార్థి కేంద్ర ప్రభుత్వంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా రూ.10 వేల చొప్పున అవార్డు పొందారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు.. జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు గురువారం మధ్యాహ్నం నుంచి విద్యార్థులు తమ ఎగ్జిబిట్లు, గైడ్ టీచర్లతో సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్కు చేరుకున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనకు సంబంధిత ఉపాధ్యాయ కమిటీల వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. సాయంత్రం 5 గంటలరకు 170 మంది సైన్స్ ఫెయిర్కు, 70 మంది ఇన్స్పైర్ ఎగ్జిబిట్లతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎగ్జిబిట్ల కోసం గదులను కేటాయించారు. మిగిలిన విద్యార్థులు కూడా శుక్రవారం ఉదయం వరకు చేరుకుంటారు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు : డీఈఓ జిల్లా విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు హనుమకొండ డీఈఓ ఎల్వీ గిరిరాజ్గౌడ్ తెలిపారు. గురువారం సాయంత్రం హనుమకొండలోని సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విద్యావైజ్ఞానిక ప్రదర్శనలకు సంబంఽధించిన వివరాలను వెల్ల డించారు. సైన్స్ఫెయిర్లో విద్యార్థులు ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తారని తెలిపారు. ఈనెల శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యావైజ్ఞానిక ప్రదర్శనల ప్రారంభోత్సవానికి పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్, అధికారులు హాజరవుతారని వివరించారు. 20న సాయంత్రం ముగింపు కార్యక్రమంలో బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జిల్లాస్థాయిలో ప్రతిభచూపిన విద్యార్థుల ఎగ్జిబిట్లను రాష్ట్రస్థాయికి కూడా ఎంపిక చేస్తారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభచూపితే జాతీయ స్థాయి ప్రదర్శనలకు కూడా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల విద్యార్థులు ఎగ్జిబిట్లను తిలకించేందుకు కూడా ఏర్పాట్లు చేశామని తెలిపా రు. విద్యావైజ్ఞానిక ప్రదర్శనకు 15 కమిటీలు ఏర్పా టు చేశామని, విద్యార్థులకు కావాల్సిన సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, ఎంఈఓలు నెహ్రూనాయక్, బి.మనోజ్కుమార్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎసదానందం, గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ, సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్ అఽఽధినేత నారాయణరెడ్డి, వడుప్సా అధ్యక్షుడు సతీష్కుమార్, బాధ్యులు ముక్తీశ్వశ్వర్రావు ,శ్రీకాంత్రెడ్డి, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఎల్.నరేందర్నాయక్ పాల్గొన్నారు. నేడు, రేపు ఎగ్జిబిట్లు ప్రదర్శించనున్న విద్యార్థులు హనుమకొండ సెయింట్ పీటర్స్ ఎడ్యూస్కూల్లో ఏర్పాట్లు -
గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు నాగయ్య ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య పాల్గొన్నారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మించిన మున్నూరు కాపు సంఘ భవనంను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మేయర్ సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ ప్రతిభ, ఆర్ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, నాయకులు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, సురేశ్, దామోదర్యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్ఫత్, ఎండీ చాంద్పాషా, మహ్మద్ ముగ్ధుం పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ అభివృద్ధి పనులు ప్రారంభం -
నిఘా నీడలో కలెక్టరేట్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో భద్రతా నిఘాను కలెక్టర్ మరింత కట్టుదిట్టం చేశారు. అధికారుల విధి నిర్వహణతోపాటు కలెక్టరేట్కు వచ్చిపోయే వారిపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్ ప్రాంగణమంతటా సీసీ కెమెరాల సంఖ్యను గణనీయంగా పెంచారు. గతంలో ప్రధాన ప్రాంతాలు, రోడ్ల వెంట వచ్చేపోయే వారిని గమనించేందుకు సుమారు 30 సీసీ కెమెరాలు మాత్రమే ఉండగా.. తాజా ఏర్పాట్లతో మొత్తం సీసీ కెమెరాల సంఖ్య 78కి పైగా చేరనున్నట్లు సమాచారం. కలెక్టరేట్ చుట్టూ పరిసరాలకే పరిమితం కాకుండా కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్ఓ చాంబర్లతో పాటు రెవెన్యూ సిబ్బంది కార్యాలయాలు వంటి కీలక విభాగాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వయంగా కూడా నిఘా వ్యవస్థను పర్యవేక్షించే విధంగా వ్యవస్థను రూపకల్పన చేసినట్లు తెలిసింది. ఆదర్శంగా కలెక్టర్ నిర్ణయం నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసే విషయంలో కలెక్టర్ తన కార్యాలయం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. పైస్థాయి నుంచి క్రమశిక్షణ మొదలవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. ఇక ఆలస్యానికి తావులేదు.. కలెక్టరేట్లోని కొన్ని విభాగాల్లో సిబ్బంది సమయపాలనపై కొంతకాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఉద్యోగులు ఉదయం 11 గంటల తర్వాత విధులకు హాజరుకావడం, సాయంత్రం త్వరగా కార్యాలయాలు విడిచిపెట్టడం వంటి అంశాలపై విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితిని పర్యవేక్షించాల్సి న కొంతమంది అధికారులు కూడా ఉదాసీనంగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నిఘాను మరింత కట్టుదిట్టం చేయడంతో ఇటువంటి వ్యవహారాలకు ఇక చెక్ పడినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యోగుల బదిలీలు తదితర క్రమశిక్షణ చర్యలతో గాడిన తప్పిన వ్యవస్థను సరిచేస్తున్న కలెక్టర్.. తాజా నిఘా చర్యలతో పనితీరును మరింత కట్టుదిట్టం చేసినట్లు కనిపిస్తోంది. దీని ప్రభావంతో ఉద్యోగుల సమయపాలన కూడా గాడిన పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఆర్డీఓ చాంబర్లలోనూ సీసీ కెమెరాలు అధికారుల విధులు, కార్యాలయానికి వచ్చివెళ్లే వారిపై పర్యవేక్షణ -
‘పంచాయతీ’పై పోస్టుమార్టం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు విడతల్లో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు పోస్టుమార్టం చేస్తున్నాయి. పార్టీ గుర్తు లేనప్పటికీ.. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు? ఎక్కడ, ఎందుకు పంచాయతీ స్థానాలు తగ్గాయి? పార్టీ బలపర్చిన అభ్యర్థుల ఓటమికి కారణాలు ఏంటి? అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే జరిగిందా? అలాగైతే రెబల్స్ ఎందుకు బరిలో ఉన్నారు? ఓటమికి వెన్నుపోట్లు కారణమా? అలాగైతే ఏయే జిల్లాల్లో ఈ వెన్నుపోట్లు ప్రభావం చూపాయి? అన్న కోణాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ విశ్లేషిస్తున్నాయి. త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికల్లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు. ఫలితాలపై విశ్లేషణ.. విడతల వారీగా వెలువడిన ఫలితాలపై ప్రధాన పార్టీలు విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్లో 1,682 గ్రామ పంచాయతీలకు మూడు వితల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కలిపి అధికార కాంగ్రెస్ 1,036 పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్ 479 స్థానాలతో వెనుకబడింది. బీజేపీ 31 స్థానాలు, ఇతరులు 136 గ్రామ పంచాయతీలు దక్కించుకున్నారు. మొదటి విడతలో 555 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 333, బీఆర్ఎస్ 148, బీజేపీ 17, ఇతరులు 57 మంది గెలుపొందారు. రెండో విడతలో 563కు కాంగ్రెస్ 332, బీఆర్ఎస్ 181 గెలుచుకుని పుంజుకుంది. బీజేపీ 9, ఇతరులు 41 దక్కించుకున్నారు. మూడో విడత 564 స్థానాలకు 371 కాంగ్రెస్, 150 బీఆర్ఎస్, 5 బీజేపీ, 38 మంది ఇతరులను ప్రజలు సర్పంచ్లుగా ఎన్నుకున్నారు. ఇంకొంత దృష్టి సారిస్తే మరిన్ని గ్రామ పంచాయతీలు గెలుచుకునే అవకాశం ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి తగ్గడంపై ఎక్కడ లోపం జరిగింది? అన్న కోణంలో బీఆర్ఎస్ అగ్రనేతలు నియోజకవర్గ స్థాయి నాయకులను ఆరా తీస్తున్నారు. వెన్నుపోట్లు, రెబల్స్.. అధిష్టానాలు సీరియస్ పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములు, కొరవడిన సమన్వయంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సీరియస్గానే స్పందించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 65 చోట్ల కాంగ్రెస్, 34 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులపై ఆయా పార్టీలకు చెందిన వారు రెబల్స్గా బరిలోకి దిగారు. 41 చోట్ల కాంగ్రెస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందారు. మిగతా 24 చోట్లపార్టీ అభ్యర్థులు గెలిచినా.. నానా తిప్పలుపడి 30 నుంచి 50 ఓట్ల మెజార్టీనే వచ్చింది. అదేవిధంగా 20 పంచాయతీల్లో బీఆర్ఎస్ రెబల్స్, స్వతంత్రులు గెలుపొందగా, 14 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అతికష్టం మీద గెలిచారు. జనగామ, హనుమకొండ, వరంగల్, జేఎస్ భూపాలపల్లి జిల్లాల్లో అత్యధికంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయని కాంగ్రెస్, బీఆర్ఎస్ అధిష్టానాలకు ఫిర్యాదులు వెళ్లాయి. పార్టీ బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని టీపీసీసీ.. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు నేతలతో మాట్లాడిన బీఆర్ఎస్ అధిష్టానం కూడా భవిష్యత్లో ఇలాంటి పరిణామాలకు తావులేకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సింగిల్విండో ఎన్నికలు రానున్న దృష్ట్యా నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతలను అప్రమత్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎక్కడ ఎందుకు తగ్గాయి.. ఎక్కడ పెరిగాయి? ఫలితాలపై ఆరా తీస్తున్న అన్ని పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికలో ఏమరుపాటు.. చాలాచోట్ల ఫలితాలు తారుమారు పార్టీలు బలపర్చిన అభ్యర్థులకు వెన్నుపోట్లు.. రెబల్స్గా బరిలో నెగ్గిన పలువురు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు -
మరుగుదొడ్లను పట్టించుకోరా?
● నిర్వహణ సక్రమంగా ఉండాలి ● నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: రూ.లక్షలు వెచ్చించి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాం.. వృథాగా వదిలేస్తే ఎలా అంటూ నగర మేయర్ గుండు సుధారాణి ప్రజారోగ్య విభాగం అధికారులను మందలించారు. గురువారం వరంగల్ ఫైర్ స్టేషన్ను ఆనుకొని ఉన్న పబ్లిక్ టాయిలెట్ల స్థితిగతులను మేయర్ పరిశీలించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ నగరంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. టాయిలెట్ల నిర్వహణ కోసం కేటాయించిన సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, లేనిపక్షంలో బిల్లుల చెల్లింపులు నిలిపివేయాలని పేర్కొన్నారు. అనంతరం పోతననగర్లోని సెకండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను పరిశీలించారు. ఎన్ని కంటైనర్లు పనిచేస్తున్నాయి అని అడిగి తెలుసుకున్నారు. కంటైనర్లు మరమ్మతులకు గురైతే వెంటనే పునరుద్ధరించాలని, ట్రాన్స్ఫర్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని, ఉద్యానశాఖ సిబ్బంది మొక్కలు నాటాలని మేయర్ సూచించారు. ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్లు పసునూరి భాస్కర్, గోల్కొండ శ్రీను పాల్గొన్నారు. -
మేడారానికి భారీగా తరలివచ్చిన భక్తులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గురువారం సమ్మక్క రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించారు. అమ్మవార్ల గద్దెల వద్ద పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు ఆరగించారు. ఈఓ వీరస్వామి భక్తుల రద్దీని పర్యవేక్షించారు. గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం పనులు జరుగుతున్న సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా దగ్గరుండి చూడాలని సిబ్బందిని ఆదేశించారు. -
బీజేపీ కార్యాలయం ముట్టడి
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారం వద్ద గల బీజేపీ జిల్లా కార్యాలయాన్ని గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు ముట్టడించారు. కేంద్రంలోని మోదీ సర్కారు నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్గాంధీపై అక్రమంగా కేసులు పెట్టి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని, శ్రీకేడీ మోదీశ్రీ అంటూ నినదించారు. వరంగల్ నగరంతోపాటు గీసుకొండ మండలం నుంచి ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ జెండాలతో తరలివచ్చి ముందుగా బీజేపీ కార్యాలయానికి వెళ్లేదారిలో ధర్నా చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, వర్దన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అయూబ్ పాల్గొన్నారు. వారు ధర్నా చేస్తున్న సమయంలో కారులో అటుగా వెళ్తున్న బీజేపీ జిల్లా కార్యదర్శి రాణాప్రతాప్రెడ్డి అక్కడ ఆగి తన వాహనాన్ని పార్టీ కార్యాలయం వైపు తిప్పి ధర్నా చేస్తున్న వారి వద్ద హారన్ మోగించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇది గమనించిన బీజేపీ కార్యాలయంలోని ఆ పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకోగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఇరు పార్టీల వారు తోపులాటకు దిగడంతో గీసుకొండ సీఐ విశ్వేశ్వర్, ఎస్సై కుమార్ సిబ్బందితో వెళ్లి వారిని చెదరగొట్టారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కార్యాలంలోకి వెళ్లిపోగా , కాంగ్రెస్ నాయకులు కొంత సేపు నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ విశ్వేశ్వర్ పోలీసు వాహనాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతోపాటు ముఖ్య నాయకులను గీసుకొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూడా వారు నినాదాలు చేస్తూ మోదీ సర్కారు తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాగరాజు మాట్లాడారు. నాయకులు నల్లగొండ రమేశ్, గుండేటి నరేందర్, బస్వరాజు శ్రీమాన్, తుమ్మనపెల్లి శ్రీనివాస్, వీసం సురేందర్రెడ్డి, సిల్వేరు శ్రీనివాస్, దుపాకి సంతోష్, కూసం రమేశ్, కరాటే ప్రభాకర్, మన్నె బాబూరావు, పరమేశ్వర్, గోరంట్ల రాజు, దూలం సంపత్, సయ్యద్ ఇంతియాజ్ పాల్గొన్నారు. కార్యాలయ ముట్టడి నీతిమాలిన చర్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించడం, ఆందోళన చేసి దాడులకు పాల్పడటం నీతిమాలిన చర్య అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో మోదీ సర్కారు తీరుపై నిరసన పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలతోపాటు పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు రెండు పార్టీల నాయకులతో తీవ్ర ఉద్రిక్తత ఆందోళనకారులను చెదరగొట్టి శాంతింపజేసిన పోలీసులు -
అంతర్మథనం
శుక్రవారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎక్కడెక్కడ ఏ పార్టీ స్థానాలు ఎన్నంటే.. పంచాయతీలు 316కాంగ్రెస్ 198 ఇతరులు ½BÆŠ‡-G‹Ü˘ 9916 నర్సంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 23 పెద్ద పంచాయతీలుంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 11 స్థానాలను దక్కించుకుంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హోరాహోరీ పోరు జరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో నాలుగు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ దక్కించుకుంటే, బీఆర్ఎస్ సైతం మూడింటిని సొంతం చేసుకుంది. రాయపర్తి మండలంలో మూడింటిలో కాంగ్రెస్, ఒకచోట బీఆర్ఎస్ రెబల్, మరొక చోట స్వతంత్రులు ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం చేసినా పెద్ద పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది. సంగెం మండలంలోని తొమ్మిది పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ ఐదు, బీఆర్ఎస్ మూ డు, బీజేపీ ఒకటి గెలుచుకుంది. గీసుకొండ మండలంలోని రెండు పెద్ద పంచాయతీలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం అయినా.. తప్పని తర్జనభర్జన పల్లె పోరులో బీఆర్ఎస్ పట్టుపై హైరానా సవాల్గా మారనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పంచాయతీ ఫలితాలపై ముఖ్యనేతల పోస్టుమార్టంసాక్షి, వరంగల్: జిల్లాలో మూడు దశల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు కొత్త పంచాయితీ తీసుకొచ్చినట్లైంది. 316 పంచాయతీ లకు 198 స్థానాలు దక్కించుకున్నా.. ఏ మాత్రం ప్రభావం లేదని చెప్పిన బీఆర్ఎస్ కూడా 98 స్థానాలు కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఎక్కడ లోటుపా ట్లు జరిగాయనే విషయాలపై పోస్టుమార్టం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వార్ వన్సైడ్ ఉండేలా చేసేందుకు ఏం చేయాలి. పంచాయతీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని గ్రామాల్లో ఈసారి ఎలా సత్తా చాటాలనే అంశాలపై, పార్టీల గుర్తులపై జరిగే ఈ పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి కూడా ఫలితాలపై అభిప్రాయాలు తీసుకొని పార్టీని పటిష్టం చేయడంపై దృష్టి సారించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగరి మండలాల్లోని 51 స్థానాల్లో కాంగ్రెస్ 29, బీఆర్ఎస్ 17, ఒకటి బీజేపీ బలపరిచిన అభ్యర్థులతోపాటు ఇద్దరు స్వతంత్రులు గెలిచా రు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ గెలిచినా.. ఇక్కడ బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యనేతలు లేకున్నా కూడా గులాబీ పార్టీ ప్రదర్శన బాగుండడంతో ఎక్కడ లోటుపాట్లు జరిగాయని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. మాజీ ఎమ్మెల్యే అరూరి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన తర్వాత పూర్తిస్థాయిలో పట్టించుకునే నాయకుడు లేకున్నా పల్లెపోరులో మెరుగైన ఫలితాలు రావడం కాంగ్రెస్కు షాక్. నర్సంపేట నియోజవకర్గంలోని 172 స్థానాల్లో 105 పంచాయతీల్లో కాంగ్రెస్, 66 స్థానాల్లో బీఆర్ఎస్, ఒక స్థానంలో బీజేపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందగా.. ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించారు. దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో 63 స్థానాల్లో 33 పంచాయతీలు కాంగ్రెస్, 27 పంచాయతీలు బీఆర్ఎస్, బీజేపీ ఒకటి, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని 109 పంచాయతీలకు 72 కాంగ్రెస్, 33 బీఆర్ఎస్, నాలుగు ఇతరులు గెలుచుకున్నారు. మొత్తంగా అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకున్నా, ఇక్కడ కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ కై వసం చేసుకోవడంతో గులాబీ పార్టీ పట్టు నిలుపుకుందనే చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రచారంతో జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడ బీఆర్ఎస్ సీట్లు సొంతం చేసుకుందని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి. జిల్లా మొత్తంగా బీఆర్ఎస్కు 99 స్థానాలొస్తే ఈ నియోజకవర్గంలోనే 60 స్థానాలు ఉండడం గమనార్హం. పరకాల నియోజకవర్గంలోని సంగెం, గీసుకొండ మండలాల్లో 53 పంచాయతీల్లో 37 కాంగ్రెస్, 13 బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. సంగెం మండలంలో 10 స్థానాలు నెగ్గిన బీఆర్ఎస్, గీసుకొండలో మూడింటికి మాత్రమే పరిమితమైంది. గీసుకొండ మండలంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ సొంతూరు వంచనగిరి ఉండడంతో ఎప్పటి నుంచో వారి ప్రాబల్యం ఉండడం హస్తం పార్టీకి కలిసొచ్చింది. ఎమ్మెల్యే రేవూరి కూడా పల్లెల్లో ఎన్నికల ప్రచారం చేయడం, కొన్నిచోట్ల అభ్యర్థులు వర్గాలుగా పోటీచేసినా విజయం సాధించారు. పాలకుర్తి నియోజకవర్గంలోని 40 పంచాయతీ ల్లో 27 స్థానాల్లో కాంగ్రెస్, తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్, నలుగురు స్వతంత్రులు గెలిచారు. ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంచాయతీ ఎన్నికల ప్రచారం చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో బీఆర్ఎస్ ప్రదర్శన లేదు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఈ మండలంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించడంతో అధిక స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో హస్తం పార్టీ శ్రేణుల్లో జోష్ ఉంది.పెద్ద గ్రామ పంచాయతీల్లో ఇలా.. మూడు విడతల్లో కలిపి జిల్లాలోని పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 46 పెద్ద పంచాయతీల్లో కాంగ్రెస్ 26 స్థానాలు గెలిస్తే, బీఆర్ఎస్ 17 స్థానాలను దక్కించుకుంది. కాంగ్రెస్ రెబల్ ఒకటి, బీజేపీ ఒకటి, స్వతంత్రులు ఒకటి కై వసం చేసుకున్నారు. -
ఇక కొరతలేకుండా యారియా
ఖిలా వరంగల్: రైతులకు అవసరమయ్యే యూరియాను ముందుగా బుక్ చేసి తెచ్చుకునేలా వ్యవసాయ శాఖ కొత్త యాప్ను అందుబాటులోకి తెస్తోంది. వానాకాలంలో యూరియా కోసం రైతులు బారులుదీరి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లాలోని పలు మండలాల్లో అవసరం మేరకు యూరియా లభ్యం కాకపోవడంతో అన్నదాతలు ఆందోళనలు చేశారు. పలువురు డీలర్లు అధిక ధరలకు యూరియా విక్రయించారు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి నుంచి అక్రమాలకు అడ్డుకట్టవేయడంతోపాటు రైతులకు సరిపడా లభించేలా కొత్త బుకింగ్ విధానం అమల్లోకి తీసుకొస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. దీనిపై రాష్ట్ర స్థాయిలో శిక్షణ పూర్తికాగా, జిల్లాల వారీగా వ్యవసాయాధికారులతోపాటు డీలర్లు, రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమవుతోంది. జిల్లాలో పంటల సాగు.. జిల్లాలో యాసంగి సీజన్ మొదలైంది. పంటల సాగు నెమ్మదిగా ముందుకెళ్తోంది. 2025–26 యాసంగి పంట, విత్తనాలు, ఎరువులు లభ్యత, అమ్మకాలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట 26,510 ఎకరాలు, కూరగాయలు, ఇతర ఉద్యాన పంటలు 6,877 ఎకరాల్లో సాగు అవుతున్నాయి. వరి పంట 1,15,200 ఎకరాల సాగు అంచనా, అందుకు అవసరమైన వరి విత్తనాలు 23,040 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. మొక్కజొన్న 1,08,500 ఎకరాల్లో సాగు అంచనా, అందుకు అవసరమైన 8,680 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. యాసంగి పంట కాలానికి సంబంధించి అక్టోబర్ 2025 నుంచి నేటి వరకు 12,719 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాలో సరఫరా చేశారు. మార్కెఫెడ్ 4,240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల వద్ద 4,819 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. వ్యవసాయ శాఖ తీసుకొస్తున్న యాప్లో బుక్ చేసుకొంటే నేరుగా మీకు యూరియా అందుతుంది. ఈకొత్త సాంకేతిక వ్యవస్థను వ్యవసాయ శాఖ ఈనెల 20 నుంచి అమల్లోకి తెస్తుంది. విడతల వారీగా సరఫరా.. రైతులు యాప్ను మొబైల్ ఫోన్లోని ప్లేస్టోర్ నుంచి డైన్లోడ్ చేసుకొని ఒకేసారి కాకుండా విడతల వారీగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయిదు ఎకరాల్లోపు ఉన్న రైతులు రెండు విడతల్లో 5 నుంచి 20 ఎకరాలున్న రైతులు మూడు, అంతకంటే ఎక్కువ ఉన్న రైతులు నాలుగు విడతల్లో యూరియా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ 48 గంటలు మాత్రమే.. వ్యవసాయ శాఖ యాప్లో బుకింగ్ కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ లోగా యూరియా తీసుకోనట్లయితే తిరిగి అది స్లాట్లోకి వెళ్తుంది. ఈ యాప్లో జిల్లా మొత్తంలో పీఏసీఎస్, ఫర్టిలైజర్స్లో యూరియా ఎక్కడెక్కడ ఎంత అందుబాటులో ఉందనే సమాచారం అధికారులు, రైతులు తెలుసుకోవచ్చు. పాస్ పుస్తకంతో నమోదు యాప్లో పట్టాదారు పాసుపుస్తకం నంబర్ నమోదు చేయగానే లింక్ చేసిన ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఇది నమోదు చేయగానే సదరు రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఏ పంట వేశారనే వివరాలతోపాటు పంటకు ఎంత యూరియా అవసరమనే సమాచారం బుకింగ్ ఐడీ వస్తుంది. ఏదైనా అధీకృత రీటైలర్, లేదా సహకార సంఘాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం రైతుకు కల్పిస్తారు. ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే యూరియా అందజేత ఈనెల 20 నుంచి జిల్లాలో నూతన విధానం అమలుఎరువుల పంపిణీకి ప్రత్యేక యాప్ గీసుకొండ: రైతులకు సకాలంలో ఎరువులు అందేలా, విక్రయ కేంద్రాల్లో బారుల వద్ద రద్దీని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ను రూపొందించిందని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలపారు. వ్యవసాయ శాఖ కమిషనర్ గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కొనాయమాకుల రైతు వేదిక నుంచి ఏఈ ఓలు, ఎరువుల డీలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కా ర్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇక నుంచి ఈ ప్రత్యేక యాప్ ద్వారానే ప్రభుత్వం ఎరువులను అందిస్తుందన్నారు. పట్టాదారు పాస్పుస్తకం ఉన్నవారు నేరుగా పట్టా నంబర్తో, లేని వారు ఆధార్కార్డు ద్వారా యాప్లో లాగిన్ అవ్వాలన్నారు. ఎరువుల ను తీసుకునే క్రమంలో తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని, సాగు విస్తీర్ణం ఆధారంగా యూరి యా, తదితర ఎరువులను విడతల్లో తీసుకోవాలని, ఎన్ని బస్తాలు వస్తాయో స్వయంగా యాప్ లెక్కచెబుతుందన్నారు. ఎకరం వరకు మొత్తం బస్తాలను ఒక వాయిదాలో, 5 ఎకరాల వరకు రెండు వాయిదాల్లో, 5 నుంచి 20 ఎకరాల వరకు మూడు వాయిదాల్లో, 20 ఎకరాల పైన నాలుగు వాయిదాల్లో ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఒక విడత ఎరువులను తీసుకున్న తర్వాత మళ్లీ 15 రోజుల తర్వాతే యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. ఇలా బుక్ చేసుకున్న 24 గంటల్లో డీలర్ల నుంచి ఎరువులను తీసుకోవచ్చన్నారు. ఆలస్యం చేస్తే బుకింగ్ రద్దు అవుతుందన్నారు. -
మైసంపల్లి సర్పంచ్గా న్యాయవాది..
● తండ్రి పారిశుద్ధ్య కార్మికుడు.. కొడుకు సర్పంచ్దుగ్గొండి: మండలంలోని మైసంపల్లి గ్రామ సర్పంచ్గా న్యాయవాది వేముల ఇంద్రదేవ్ ఎన్నికయ్యారు. ఇంద్రదేవ్ తండ్రి వేముల సారంగం చాలాఏళ్లుగా గ్రామ పంచాయతీ సిబ్బందిగా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో ఎంఏ, బీఈడీ, ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఇంద్రదేవ్ గత కొంతకాలంగా వరంగల్ కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికలు రావడం, రిజర్వేషన్ అనుకూలించడంతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే కాంక్షతో ఇంద్రదేవ్ బరిలోకి దిగి ప్రత్యర్థిపై 59 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక నుంచి సర్పంచ్ సీటులో కొడుకు ఇంద్రదేవ్ ఆసీనులు కానుండగా ఆయన తండ్రి సారంగం పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేయనున్నారు. అయితే సారంగం మాట్లాడుతూ ప్రజలు అందించిన పదవితో తన కుమారుడు గ్రామాన్ని అభివృద్ధి చేస్తే తాను మాత్రం గ్రామ ప్రజలకు సేవచేసే కార్మికుడిగానే పనిచేస్తానని చెప్పాడు. ఇంద్రదేవ్ మాట్లాడుతూ మారుమూల గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దడంతోపాటు విద్యారంగంలో విషయంలో ముందుకు తీసుకువెళ్తానన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన ధ్యేయంగా పనిచేయడంతో పాటు ప్రజలందరికీ న్యాయ బద్దంగా పాలన అందిస్తానని చెప్పారు. -
మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీట
ఖిలా వరంగల్: మైనార్టీల సంక్షేమాభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. విద్యార్థులు, యువత క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలని, సీనియర్ క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్లు అంతరించి పోతున్న ప్రాచీన గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ఆదేశించారు. గురువారం వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి ప్రాంగణంలోని క్రీడామైదానంలో జరుగుతున్న క్రికెట్ కీడా పోటీలను మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభం ప్రకాశ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఖిలా వరంగల్ ఈద్గా మైదానంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈద్గా అభివృద్ధి పనులను ఈద్గా కమిటీ ప్రతినిధి ఎంఏ జబ్బార్, మైనార్టీ పెద్దలతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. 38వ డివిజన్ పడమర కోటలో రూ.73 లక్షల వ్యయంతో నిర్మిచిన మున్నూరు కాపు సంఘ భవనం (మహిళా కమ్యూనిటీ హాల్)ను, వరంగల్ 37వ డివిజన్ ఎంఎంనగర్లో లబ్ధిదారుడు రూ.5 లక్షల వ్యయంతో నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లును నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియాకమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఏఎస్పీ శుభంప్రకాశ్ స్థానిక కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమతో కలిసి మంత్రి సురేఖ ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు మంత్రి నూతన వస్త్త్రాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఆర్ఐ ప్రతిభ, ఆర్ఓ శ్రీనివాస్, ఏఈ తేజస్విని, కాంగ్రెస్ నేతలు గోపాల నవీన్రాజు, మీసాల ప్రకాశ్, బోగి సురేశ్, దామోదర్యాదవ్, శ్రీరాం రాజేశ్, పగడాల సతీశ్, ఎండి ఉల్పాత్, ఎండి చాంద్పాషా, మహ్మద్ ముగ్ధుం, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు వరంగల్: జిల్లాలో మూడు దశలుగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో కీలకంగా పని చేసిన పోలీస్, రెవెన్యూ, పంచాయతీ రాజ్, విద్య శాఖ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, జోనల్, రూట్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అదేవిధంగా హెల్త్ శాఖ, అంగన్వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ, డీఆర్డీఏ అధికారులతో సహా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన అన్ని శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా, సమగ్రంగా కవరేజ్ అందించిన ప్రింట్, ఎలక్టాన్రిక్ మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బాల మాయాదేవి, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు సునయానా చౌహాన్లను పరిశీలకులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల విభాగానికి చెందిన అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామప్పలో సెంట్రల్ రైల్వే కమిషనర్ వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని గురువారం సెంట్రల్ రైల్వే సీనియర్ కమిషనర్ (ఆర్పీఎఫ్) సీహెచ్ చిత్రేష్ జోషి సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని ఆయన దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్పకళసంపద బాగుందని కొనియాడారు.


