breaking news
Warangal
-
పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంక్
వరంగల్ అర్బన్: మెప్మాకు చెందిన పట్టణ సమాఖ్యకు బల్దియా పెట్రోల్ బంకు కేటాయించేందుకు ఏర్పాట్లు వేగిరమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండు చోట్ల సెర్ప్కు పెట్రోల్ బంకులు కట్టబెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను మండలానికి ఒకటి చొప్పున బస్సులను సమాఖ్యలకు అప్పగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో.. నగర నడిబోడ్డున ఉన్న బల్దియా బంక్ను కూడా అప్పగిస్తే ఎలా? ఉంటుందనే అంశంపై గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ దృష్టి సారించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన అన్ని విభాగాల సమీక్షలో కమిషనర్ మాట్లాడుతూ.. బంక్ను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించడం సరికాదన్నారు. బంక్ కేటాయింపును రద్దు చేయాలన్నారు. మెప్మాకు అప్పగించాలా? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, ఎస్ ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు డీఈలు తదితరులు పాల్గొన్నారు. కంపోస్ట్ ఎరువును బ్రాండ్తో విక్రయించాలి బయో గ్యాస్ అథారిటీ ప్లాంట్ ద్వారా ఉత్పతవుతున్న విద్యుత్ను వినియోగించుకుంటూ, తద్వారా వెలువడే కంపోస్ట్ ఎరువును బ్రాండ్ల పేరుతో విక్రయించాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం ఉదయం హనుమకొండ పలివేల్పులలో వర్మీ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న నేపథ్యంలో కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. నిర్మిత ప్లాంట్ స్థలం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. కేయూ ఫిల్టర్ బెడ్ డ్రైవేస్ట్ రీసోర్స్ సెంటర్ను పరిశీలించారు. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వండి సమీక్షలో గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతిపత్రం ఇప్పించిన పోలీసులు -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
దుగ్గొండి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, సహాయకులకు బుధవారం శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, నియమ నిబంధనలు, బాధ్యతలను వివరించారు. నామినేషన్ నుంచి పోలింగ్ నిర్వహణ, ఎన్నికల ఫలితాల వరకు రిటర్నింగ్ అధికారులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ మోడెం శ్రీధర్గౌడ్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఎస్సై రావుల రణధీర్రెడ్డి, ఏఈలు సతీశ్, మంగ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని నర్సంపేట వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్దాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో ఈసీజీ 30 సీట్లు, డయాలసిస్ 30 సీట్లు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులతోపాటు అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్లు జతచేయాలని సూచించారు. తప్పుడు సమాచారం, సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామని పేర్కొన్నారు. నవంబర్ ఒకటిన అభ్యర్థులను ఎంపిక చేస్తామని, మరిన్ని వివరాల కోసం tgpmb.telangana.gov.in లో సంప్రదించాలని కోరారు.వంద శాతం ఎఫ్ఆర్ఎస్కాళోజీ సెంటర్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) హాజరు నమోదు వందశాతం పూర్తి చేసినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. బుధవారం హాజరు రిజిస్ట్రేషన్ తీరుతెన్నులను కళాశాలల వారీగా సమీక్షించినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,191 మంది ప్రథమ సంవత్సరం, 959 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, 187 మంది సిబ్బందికి పూర్తిస్థాయిలో రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తెలిపారు. ముఖ గుర్తింపు హాజరు రిజిస్ట్రేషన్లో వరంగల్ జిల్లా ముందంజలో ఉందని, విద్యార్థుల హాజరు మెరుగుపరిచేందుకు దృష్టి సారించాలని కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించినట్లు చెప్పారు.కబడ్డీ క్రీడాకారులకు అభినందనలునర్సంపేట: నిజామాబాద్ జిల్లా ముప్కప్లో సెప్టెంబర్ 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన నర్సంపేటకు చెందిన కబడ్డీ క్రీడాకారులు అజ్మీరా శ్రీజ, మూడు అశోక్కు జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి బుధవారం జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ సత్యవాణి మాట్లాడుతూ నర్సంపేట స్టేడియంలో ఉన్న సౌకర్యాలను ఉపయోగించుకొని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలన్నారు. భవిష్యత్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే విధంగా పట్టుదలతో శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో స్టేడియం ఇన్చార్జ్, కబడ్డీ కోచ్ యాట రవికుమార్ ముదిరాజ్, డీవైఎస్ఓ కార్యాలయ స్టాఫ్, కోచ్లు పాల్గొన్నారు.రైతులతో సమావేశంనయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరెపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ రైతులకు ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్ పూలింగ్ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. -
విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
వరంగల్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ ఓసిటీ స్టేడియంలో బుధవారం 69వ జిల్లాస్థాయి పాఠశాలల క్రీడలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొని జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపాలని, ఇందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుందని వివరించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ పాఠశాలల విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, ఖోఖో తదితర పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి రంగయ్య నాయుడు, డీపీఆర్వో అయూబ్అలీ, జిల్లా యువజన, క్రీడల అధికారి సత్యవాణి, జీసీడీఓ ఫ్లోరెన్స్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి సోనబోయిన సారంగపాణి, జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు పాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జలగం రఘువీర్, కోశాధికారి వెంకటేశం, రిటైర్డ్ పీఈటీ చెన్నబోయిన రామదాసు, పీజీ హెచ్ఎం రాజుబోయిన భిక్షపతి, హనుమకొండ జిల్లా వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి కుమార్, అండర్–19 ఎస్జీఎఫ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులు పరిష్కరించాలి నర్సంపేట: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఈ మేరకు నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని ఆరు మండలాల తహసీల్దార్లు, ఇతర సిబ్బందిలో భూ భారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. దరఖాస్తులు తిరస్కరణకు గురైతే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రవిచంద్రరెడ్డి, రాజేశ్వరరావు, రాజ్కుమార్, అబిద్అలీ, రమేశ్, కృష్ణ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి నర్సంపేట రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లు, ఆలస్యం లేకుండా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తిచేయాలని, భద్రతాపరంగా పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. లక్నెపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఓ సిటీలో జిల్లాస్థాయి పాఠశాల క్రీడలు ప్రారంభం -
స్థానిక ఎన్నికల సంరంభం
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల సంరంభం నేటి నుంచి మొదలు కానుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసి పటిష్ట ఏర్పాట్ల మధ్య నామినేషన్ల స్వీకరణకు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని కలెక్టర్లతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ఈ మేరకు మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జిల్లాల వారీగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు.. మెదటి విడత ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాల్లోని 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం గురువారం నుంచి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. హనుమకొండ జిల్లాలోని ఆరు మండలాల్లో తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగన్నాయి. భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లో 67 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ జిల్లాలో గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట జెడ్పీటీసీలు, ఆ మండలాల్లోని 64 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జనగామలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, లింగాలఘన్పూర్, చిల్పూరు, స్టేషన్ఘన్పూర్ జెడ్పీటీసీలు, 70 ఎంపీటీసీ స్థానాలకు, మహబూబాబాద్ జిల్లాలో బయ్యారం, చిన్నగూడూరు, దంతాలపల్లి, గార్ల, గూడూరు, మహబూబాబాద్, నర్సింహులపేట, పెద్దవంగర, తొర్రూరు జెడ్పీటీసీలు... 104 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి జెడ్పీటీసీలు, 58 ఎంపీటీసీ స్థానాలు, ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం జెడ్పీటీసీలు, 30 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. నేడు ఎన్నికల నోటిఫికేషన్ నామినేషన్ల స్వీకరణకు అధికారుల ఏర్పాట్లు ఉమ్మడి వరంగల్ లో మొదటి విడతలో 37 జెడ్పీటీసీ, 393 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు -
కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సా
సాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి.మూడేళ్లుగా తాత్సారం..రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి.వివాదమైనప్పుడే స్పందన..కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం మీడియా ద్వారా వైరల్, వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్ల ర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. ఈ విషయంలో జిల్లాల కలెక్టర్లు మూలాల్లోకి వెళ్లి విచారణ జరిపి సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప బకాయిపడిన మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది.మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని మింగేశారు. వారినుంచి డబ్బులు రాబట్టుకునేందుకు ఇప్పటికీ చర్యల్లేవు. -
మహాజాతరకు 112 రోజులే..
వనదేవతల ప్రాంగణ విస్తరణకు కసరత్తుఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ఇంకా 112 రోజులే సమయం మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు మహాజాతర జరుగనుంది. ఈ సారి జాతరకు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతో వనదేవతల గద్దెల ప్రాంగణం విస్తరించేందుకు జిల్లా అధికార యంత్రాంగం పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్రెడ్డి మేడారంలో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణం అభివృద్ధి పనులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ను ఇటీవల ఆవిష్కరించిన విషయం విదితమే. అప్పటి నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలయ ప్రాంగణం సాలహారం (ప్రహరీ) నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. సాలహారం నిర్మాణానికి మార్కింగ్ సాలహారం(ప్రహరీ) నిర్మాణం పనులకు అమ్మవార్ల గద్దెల ప్రాంగణం చుట్టూ ఇంజనీరింగ్ అధికారులు మార్కింగ్ చేశారు. సారలమ్మ ఆర్చి ఎగ్జిట్ గేట్ ప్రహరీ నిర్మాణానికి బయట స్థలాన్ని చదును చేశారు. ప్రహరీ నిర్మాణంతో పాటు మీడియా వాచ్ టవర్ల నిర్మాణానికి కూడా మార్కింగ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ దివాకర, రోడ్లు, భవనాలశాఖ ఇంజనీరింగ్ శాఖ ఇన్చీఫ్ మోహన్నాయక్, ఎండోమెంట్ ఎస్ఈ ఓంప్రకాశ్, ఆర్కిటెక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి మేడారం గద్దెల ప్రాంగణంలో చేపట్టనున్న పనులను పరిశీలించారు. అమ్మవార్ల దర్శనానికి పోలీస్ కమాండ్ కంట్రోల్ క్యూలైన్ ద్వారా దర్శనానికి వచ్చే భక్తులు గద్దెల ప్రాంగణంలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్టాండ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. ప్రహరీ పనుల మార్కింగ్ను కలెక్టర్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చేయాల్సిన పనులపై సూచనలు చేశారు. సాలహారంతో పాటు ఎనిమిది ఆర్చీ ద్వారాల నిర్మాణాలతో పాటు అదనంగా మరో ఆర్చీ ద్వారం నిర్మాణంపై ఇంజనీరింగ్ అధికారులు డిజైన్ మ్యాప్లను చూపిస్తూ పనుల వివరాలను కలెక్టర్కు వివరించారు. ఈ పనుల్లో ఎక్కడ కూడా సంస్కృతి, సంప్రదాయాల్లో తేడా రాకుండా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓ వీరస్వామి, డీఈ రమేశ్, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు. పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నం సమీపిస్తున్న జాతర సమయం -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ డాక్టర్ చందా మల్లయ్య డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న బీఏఎస్ బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు. లేకుంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కో–ఆర్డినేటర్ మేకల సుమన్, గుగులోత్ రాజన్న నాయక్, ధర్మ సమాజ్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మైదం రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్కూరి సునీల్, నాయకులు యేసోబు, మురళి, పేరెంట్స్ కమిటీ బాధ్యులు మహేందర్, శంకర్, రామ్మూర్తి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
హనుమకొండ అర్బన్/న్యూశాయంపేట: నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లను ఆదేశించారు. ఆమె హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద, అధికారులు హాజరయ్యారు. అధికారులతో టెలికాన్ఫరెన్స్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు నిబంధనల మేరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్న్స్ హాల్ నుంచి మొదటి విడతలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ రవి, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, ఎంసీసీ నోడల్ అధికారి ఆత్మారామ్, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ -
వైన్స్కు 11 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని 67 వైన్స్కు బుధవారం 11 దరఖాస్తులను హనుమకొండ జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్కు కలెక్టరేట్లోని డీపీఈఓ కార్యాలయంలో అందజేశారు. కాగా, టెండర్ల ప్రకటన వెలువడిన నాటి నుంచి బుధవారం వరకు 35 దరఖాస్తులు అందాయి. కేయూ క్యాంపస్: పార్ట్టైం అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని కేయూ పార్ట్ టైం అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.రాంబాబు అన్నారు. బుధవారం హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్నా, అన్ని అర్హతలు ఉన్నా, వేతనాల్లో మాత్రం వివక్ష కొనసాగుతోందన్నారు. పార్ట్ టైం అధ్యాపకులకు కూడా 65 ఏళ్ల వరకు ఉద్యోగ విరమణ ఉండేలా పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆ అసోసియేషన్ బాధ్యులు డాక్టర్ తిరుణహరిశేషు మాట్లాడుతూ.. పార్ట్టైం అధ్యాపకులను కాంట్రాక్టు అధ్యాపకులుగా అప్గ్రేడ్ చేయాలన్నారు. సమావేశంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ నరేందర్నాయక్, బాధ్యులు డాక్టర్ బూర శ్రీధర్, డాక్టర్ నివాస్, డాక్టర్ ఎర్రబొజ్జు రమేశ్ తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కరీంనగర్ జోనల్ స్థాయి నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. హనుమకొండ రాంనగర్లోని సుందరయ్య భవన్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీనంగర్ జోనల్ అధ్యక్షుడిగా సీహెచ్.రాంచందర్, కార్యదర్శిగా జి.లింగమూర్తి, ఉపాధ్యక్షుడిగా మల్లయ్య, సహాయ కార్యదిర్శిగా ఎం.రాజయ్య, కోశాధికారిగా శ్రీనివాసులు ఎన్నికయ్యారు. ఎంజీఎం: విద్యార్థులు క్రమశిక్షణతో చదివి భవిష్యత్లో ఉన్నత స్థాయికి ఎదగాలని కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సంధ్య అన్నారు. ఇటీవల జరిగిన నీట్ కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందిన నూతన విద్యార్థులకు బుధవారం కాలేజీలోని ఎన్ఆర్ఐ ఆడిటోరియంలో ఒరియెంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈకార్యక్రమాన్ని ప్రిన్సిపాల్.. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అమె మాట్లాడుతూ.. కాకతీయ మెడికల్ కాలేజీ చరిత్ర, వైద్యరంగంలో సాధించిన ప్రతిష్టాత్మక విజయాలను వివరించారు. కార్యక్రమంలో కేఎంసీ వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీపతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ చేసుకున్నట్లు బుధవారం ఆకాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి తెలిపారు. ఈ ఎంఓయూతో విద్యార్థులకు పోస్టాఫీస్లో పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటర్న్షిప్ పొందే అవకాశం ఏర్పడిందన్నారు. ఎంఓయూ ద్వారా ట్రైనింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ సర్టిఫికెట్లు అందజేస్తారని జ్యోతి వెల్లడించారు. కార్యక్రమంలో ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ హనుమకొండ డీహెచ్ఎస్డీ ప్రమోద్ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అధికారి ఎల్.జితేందర్, వైస్ ప్రిన్సిపాల్ ఎన్ఎం రెహమాన్, ఫిజిక్స్ విభాగం ఇన్చార్జ్ డాక్టర్ వరలక్ష్మి అధ్యాపకులు తదితరులున్నారు. -
ఆర్టీఐతో కీలక మార్పులు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకు వచ్చేందుకు సమాచార హక్కు చట్టం–2005 అమల్లోకి వచ్చిందని, తద్వారా పాలనలో కీలక మార్పులు వచ్చాయని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో.. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రజలు కోరిన సమాచారం అందించేందుకు పీఐఓ, ఏపీఓలు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడంలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు హనుమకొండ కలెక్టరేట్ పీఐఓ రాష్ట్ర స్థాయిలో నిలిచినందుకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐఓలు, ఏపీఐఓలతో కలెక్టర్ సమక్షంలో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సీపీఓ సత్యనారాయణరెడ్డి, సమాచార హక్కు చట్టం విషయ నిపుణులు ధరమ్సింగ్, జిల్లా స్థాయి అధికారులు, సమాచార హక్కు చట్టం యాక్టివిస్ట్, న్యాయవాది పొట్లపల్లి వీరభద్రరావు, ప్రభుత్వ కార్యాలయాల పీఓలు, ఏపీఐఓలు, అధికారులు పాల్గొన్నారు. -
రీయింబర్స్మెంట్ కోసం తల్లిదండ్రుల రాస్తారోకో
హన్మకొండ/న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ సూళ్ల విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లించాలని వరంగల్ జిల్లా విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హనుమకొండ కాళోజీ కూడలిలో రాస్తారోకో చేశారు. వీరికి విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూతో పాటు ఎమ్మార్పీఎస్, బీజేపీ, సీపీఐ మద్దతుగా నిరసనలో పాల్గొన్నాయి. రాస్తారోకో, ధర్నాతో ప్రధాన రాహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, తన బలగాలతో చేరుకుని రాస్తారోకో చేస్తున్న ఆందోళనకారులను విరమించాలని కోరగా కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే రాస్తారోకో విరమిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు కలెక్టర్తో మాట్లాడిస్తామని కొందరు తల్లిదండ్రులను వరంగల్ కలెక్టరేట్కు తీసుకెళ్లారు. గేట్ దగ్గరకు చేరుకోగానే కలెక్టర్ ఇక్కడికి రావాలని డిమాండ్ చేయడంతో పోలీసులు కలెక్టర్ సత్యశారదతో ఫోన్లో మాట్లాడించారు. కలెక్టర్ సూచనతో పోలీసులు.. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మార్టిన్ లూథర్, తల్లిదండ్రులు చెన్నకేశవులు, శ్రీనివాస్, అశోక్, జీడి ప్రసాద్, అనిల్, యాదగిరి, విజేందర్, రవీందర్, నాగరాజుతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు. కలెక్టర్ రావాలని డిమాండ్ జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇప్పించిన పోలీసులు -
రైతులతో సమావేశం
నయీంనగర్: ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం భూములు సేకరించేందుకు ఆరేపల్లి గ్రామానికి చెందిన రైతులతో బుధవారం ‘కుడా’ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్, పీఓ అజిత్రెడ్డితో కలిసి ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి రైతులతో మాట్లాడారు. ‘కుడా’ చైర్మన్ రైతులకు ప్రొజెక్టర్ ద్వారా ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చే ప్రదేశాలను చూపిస్తూ, వారికి జరిగే అభివృద్ధి గురించి, ల్యాండ్ పూలింగ్ అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోయేలా వివరించారు. భూములు సేకరించి అభివృద్ధి చేస్తామని తెలిపారు. రైతులు సానుకూలంగా స్పందించి సమయం కావాలని కోరారు. -
తలా పిడికెడు!
తిలా పాపం..కస్టమ్ మిల్లింగ్ ధాన్యంతో మిల్లర్ల జల్సాసాక్షిప్రతినిధి, వరంగల్: కస్టమ్ మిల్లింగ్ ధాన్యం (సీఎంఆర్) కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు కాసులు కురిపించే కల్పతరువుగా మారింది. సీఎంఆర్ దందా మొదలైనప్పటి నుంచి కొంతమంది వ్యాపారులు పైసా ఖర్చు లేకుండా సర్కారు ధాన్యం దారి మళ్లిస్తూ జల్సాలు చేస్తున్నారు. ఇంకొందరు ధాన్యం మరాడించి పక్క రాష్ట్రాలకు తరలించి బియ్యం అమ్ముకుని.. ఆ డబ్బుతో ఎకరాల కొద్ది భూములు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయి. మూడేళ్ల కిందట ఇచ్చిన ధాన్యంలో కొందరు సుమారు రూ.236 కోట్ల విలువైన ధాన్యాన్ని ఎగవేశారు. అయినా వారిపైన డబ్బులు రాబట్టుకునేందుకు తీసుకున్న చర్యలు లేవు. దీంతో అవినీతి, అక్రమాలకు అలవాటుపడిన కొందరు అధికారులు, రైస్మిల్లర్లకు సీఎంఆర్ ‘తిలా పాపం తలా పిడికెడు’గా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. మూడేళ్లుగా తాత్సారం.. రైతుల నుంచి వానాకాలం, యాసంగి సీజన్లలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద షరా ‘మామూలు’గా రైస్మిల్లర్లకు సరఫరా చేస్తున్నారు. అలా పంపించిన ధాన్యానికి సంబంధించి బియ్యం చెల్లించని వారిని గుర్తించిన పౌరసరఫరాలశాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఎంతకీ స్పందించకపోవడంతో ఆయా మిల్లులకు సరఫరా చేసిన లెక్కల ప్రకారం ఉండాల్సిన ధాన్యానికి 2022–23లో టెండర్లు నిర్వహించారు. అలా, ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఉన్న మిల్లుల్లో 2,92,585 మెట్రిక్ టన్నుల ధాన్యానికి టెండర్లు వేసిన వ్యాపారులు తెచ్చుకునేందుకు మిల్లులకు వెళ్లగా అక్కడ ఉండే ధాన్యం మాయమైంది. దీనిపై సుమారు ఏడాది పాటు ధాన్యం మాయమైన మిల్లుల యజమానులపై ఒత్తిడి తెచ్చిన అధికారులు ఎట్టకేలకు 1,83,985 మెట్రిక్ టన్నులు రాబట్టినట్లు అప్పట్లోనే ప్రకటించారు. సుమారు రూ.217 కోట్ల విలువ చేసే ఆ ధాన్యం ఉమ్మడి వరంగల్కు చెందిన 31 మంది రైస్మిల్లర్ల వద్ద ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తేల్చినప్పటికీ ఇప్పటికీ రాబట్టడం లేదు. ధాన్యం మాయం చేసిన మిల్లర్లపై రెవెన్యూ రికవరీ, పీడీ యాక్టులు పెట్టి వసూలు చేసే అవకాశం ఉంది. కేవలం 8 మిల్లులపై మొక్కుబడిగా 6ఏ కేసులతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం విచారణలో తేల్చిన ‘ఎన్ఫోర్స్మెంట్’ మూడేళ్లయినా పట్టించుకోని యంత్రాంగం సర్కారు ధాన్యంతో ట్రేడర్ల వ్యాపారం మిల్లర్లు, అధికారులకు పప్పుబెల్లంలా సీఎంఆర్ రికవరీపై సివిల్ సప్లయీస్ మీనమేషాలు -
వరంగల్
గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025విద్యుత్ వినియోగం తగ్గింది వరుసగా వర్షాలు కురవడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని టీజీఎన్పీడీసీఎల్ అధికారులు తెలిపారు. కొందరు అధికారుల సహకారంతో కస్టం మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టించడం ప్రతియేటా కొంతమంది మిల్లర్లకు తంతుగా మారింది. వీటిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్ల వరకూ వెళ్లినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో సీఎంఆర్ పాత బకాయిల మాట పక్కన పెడితే.. కొత్తగా తీసుకునే వాళ్లు సైతం చాలా వరకు మొండికేస్తున్నారు. 2022–23లోని సీఎంఆర్ గడువు దాటినా.. హనుమకొండ, వరంగల్, ములుగు, జేఎస్ భూపాలపల్లి. మహబూబాబాద్ జిల్లాల నుంచి బియ్యం ప్రభుత్వానికి చేరలేదు. ఈ విషయం వివాదాస్పదం అయినప్పుడే కొందరు పౌరసరఫరాల శాఖ అధికారులు, ఆపై అధికారులు స్పందిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించే కొందరు ఉన్నతాధికారులకు ‘మిల్లర్లకు నోటీసులు ఇచ్చాం.. ధాన్యం రికవరీ చేస్తున్నాం.. మీడియాలో వచ్చినంత లేదు...రిజైండర్ ఇచ్చాం..’ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు. చర్యలే నిజమైతే.. సర్కారు ధాన్యం ఎగవేసి ఆ డబ్బుతో వ్యాపారం చేసుకుంటున్న కొందరు మిల్లర్ల నుంచి మూడేళ్లవుతున్నా ఎందుకు రికవరీ కావడం లేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం లేదు. కలెక్టర్లు సీరియస్గా యాక్షన్ తీసుకుంటేనే తప్ప మిల్లర్ల నుంచి ధాన్యం డబ్బులు సర్కారు ఖజానాకు చేరే అవకాశం లేదన్న చర్చ జరుగుతోంది. వివాదమైనప్పుడే స్పందన.. -
ఓట్లను అపహరించిన బీజేపీ, బీఆర్ఎస్
ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డికాజీపేట రూరల్: బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఓట్లను అపహరించాయని, శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల వ్యత్యాసం ఉందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. ఓటు చోరీపై కాజీపేటలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వారు హాజరై మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీతో కలిసి ఓట్లను చోరీ చేస్తోందని, దీనిపై రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. ఓటు చోరీపై ఇంటింటికి తిరిగి సంతకాలు సేకరించాలని వారు సూచించారు. కార్పొరేటర్లు జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీరజాలీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్రావు, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్రావు, నేషనల్ కోఆర్డినేటర్ పులి అనిల్, మున్సిపల్ ఫ్లోర్లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షురాలు బంక సరళ, కాంగ్రెస్ నాయకులు అరారి సాంబయ్య, ఎండీ అంకూస్, గుంటి కుమార్, సుంచు అశోక్, సిరిల్లారెన్స్, దొంగల కుమార్, అజ్గర్, మనోహర్, నీలక్క, స్వరూప, సుకన్య, మానస, సమతా, రేవతి, శ్వేత పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి
పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ హన్మకొండ: బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భద్రకాళి అమ్మవారికి కేసీఆర్ బంగారు కిరీటం చేయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం భద్రకాళి చెరువు మట్టిని అమ్ముకుని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, నాయకులు మర్రి యాదవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్గౌడ్, రమేష్, పులి రజనీకాంత్ పాల్గొన్నారు. వినయ్భాస్కర్కు పోలీసుల నోటీసులు.. దాస్యం వినయ్భాస్కర్కు పోలీసులు నోటీసులు అందించారు. రైతులకు యూరియా అందించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ చౌరస్తాలో గత నెలలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వినయ్భాస్కర్ ధర్నా చేశారు. కాగా, ధర్నా చేసిన వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో హనుమకొండ ఎస్సై సదానందం నోటీసులు అందించారు. -
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి
● పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డిరాయపర్తి: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు పని చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని మహబూబ్నగర్ గ్రామ బీఆర్ఎస్కు చెందిన సుమారు 30 బీఆర్ఎస్ కుటుంబాలు కాంగ్రెస్పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే మంగళవారం ఆహ్వానించారు. అనంతరం, యశస్వినిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. ప్రజాసంక్షేమమే తమ పార్టీ లక్ష్యమని, ప్రజల పక్షాన పనిచేస్తున్న ఏకై క ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తుచేశారు. కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఐనవోలు
ఐనవోలు: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 70 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఇటీవల ఎంపిక చేశారు. అందులో ఐనవోలు పోలీస్స్టేషన్ ఒకటి. 21 అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంది. కాగా, కేంద్ర బృందం ఈ వారంలో ఐనవోలు పోలీస్ స్టేషన్ను సందర్శించనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఐనవోలు పోలీస్ స్టేషన్ను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏసీపీ వెంకటేశ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పర్వతగిరి ఇన్స్పెక్టర్, ఎస్సై పస్తం శ్రీనివాస్కు వారు పలు సలహాలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో అన్ని వసతులు ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. మరో రెండు రోజుల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ కూడా ఐనవోలు పోలీస్ స్టేషన్ను సదర్శించనున్నట్లు సమాచారం. -
విద్యార్థి దశ నుంచే శాస్త్రవేత్తగా అడుగులు
● జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్ నర్సంపేట: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే శాస్త్రవేత్తలుగా అడుగులు వేయాలని జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, ఎంఈఓ కొర్ర సారయ్య సూచించారు. స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు పోడెం కాంతారావు ఆధ్వర్యంలో పీఎంశ్రీ స్కూల్స్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నర్సంపేట, కొండూరు ఉపాధ్యాయులకు డిజిటల్ కంటెంట్తో త్రీడీ మోడల్ పరికరాలతో విద్యాబోధనపై మంగళవారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నర్సంపేట పీఎంశ్రీ గర్ల్స్ స్కూల్, కొండూరు పాఠశాలలకు మాత్రమే 25చిన్న ట్యాబులు, 10 త్రీడీ పరికరాలు, ఒక పెద్ద ట్యాబు రాగా, పంపిణీ చేసినట్లు వివరించారు. బి.రాజేష్, బి.సురేష్కుమార్, వాణి, రాజేందర్రెడ్డి, రమేష్, ఎస్.స్వరూప, టెక్నికల్ అసిస్టెంట్ సుధీర్ పాల్గొన్నారు. భవిత సెంటర్ పనులు పూర్తిచేయాలిదుగ్గొండి: ప్రత్యేక అవసరాల పిల్లల కోసం నిర్మిస్తున్న భవిత సెంటర్ నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని కమ్యూనిటీ మొబిలైజేషన్ జిల్లా అధికారి కట్ల శ్రీనివాస్ ఆదేశించారు. ఒకవేళ పూర్తి చేయకుంటే మరొకరికి అప్పగిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, వెంకట్రాంరెడ్డి, ఐఈఆర్పీలు సంజీవ్కుమార్, కుసుమ రవి, తదితరులు ఉన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి.. ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపెల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీపీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిలతో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తులతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)లను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లలో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లలో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐ పార్టీకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో స మన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం పార్టీ నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేంనరేందర్ రెడ్డిలను పొత్తుల విషయంలో కలవనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
‘స్థానికం’లో కాషాయ జెండా ఎగరేస్తాం
బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్ అరూరి రమేశ్ వరంగల్ చౌరస్తా: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ వరంగల్ జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. హంటర్ రోడ్డులోని సత్యం కన్వెన్షన్ హాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మాజీ ఎంపీ అజ్మీరా సీతారానాయక్, నాయకులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వర్రావు, ఎరబ్రెల్లి ప్రదీప్రావు, కంభంపాటి పుల్లారావు, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీశ్షా, వన్నాల వెంకటరమణ, జిల్లా నాయకులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్రెడ్డి, జక్కు రమేశ్, వనంరెడ్డి, తాళ్లపల్లి కుమారస్వామి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
‘కలెక్టరేట్లో కామాంధుడు’పై వేటు
బుధవారం శ్రీ 8 శ్రీ అక్టోబర్ శ్రీ 2025హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి యత్నించినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కామాంధుడిపై కలెక్టర్ స్నేహ శబరీష్ కొరఢా ఝుళిపించారు. సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరేట్ ఏ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని తీరుపై ‘సాక్షి’లో ప్రత్యేక కథనం వెలువడింది. దీంతోపాటు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు మేరకు ప్రాథమిక చర్యల్లో భాగంగా కలెక్టర్ స్నేహ శబరీష్.. అతనిని గత నెల 19న కలెక్టరేట్నుంచి ఎస్సారెస్పీకి బదిలీ చేశారు. ఆ వెంటనే సమగ్ర విచారణకు ఐసీసీ కమిటీని ఏర్పాటుచేశారు. తొమ్మిది మందితో ఏర్పాటైన ఐసీసీ కమిటీ.. బాధితురాలు, నిందితుడు, సాక్షులను విచారించింది. సాంకేతిక ఆధారాలు పరిశీలించింది. ఈ క్రమంలో సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్పై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కమిటీ నివేదిక ఇచ్చి నట్లు సమాచారం. వీటన్నింటిని పరిశీలించిన కలెక్టర్ న్యాయ సలహా కూడా తీసుకుని ఆ కామాంధుడిపై మంగళవారం సస్పెన్షన్ వేటు వేశారు. కాగా, ఇప్పటికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసుకున్న చాంబర్ను అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. తదుపరి చర్యలకు సిఫారసు.. కలెక్టర్.. సదరు సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ను సస్పెండ్ చేయడంతోపాటు తదుపరి కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫారసు చేసినట్లు తెలిసింది. తన కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు అనుగుణంగానే విచారణ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటూ వచ్చారు. భవిష్యత్లో మహిళా ఉద్యోగుల పట్ల అలాంటి ఆలోచన వస్తే ప్రస్తుత చర్యలు గుర్తుకు రావాలన్నట్లు కలెక్టర్ స్పందించి చర్యలకు ఉపక్రమించారు. కుల సంఘాల ఫిర్యాదు.. బాధితురాలి పక్షాన ఎస్సీ సంఘాలు, ప్రతినిధులు జిల్లా కలెక్టర్ని కలిసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఇప్పటికే విన్నవించారు. ఈ ఫిర్యాదుపై కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అంతవరకు వేచిఉండాలని కలెక్టర్ వారికి సూచించారు. పలువురు మహిళా సిబ్బందిని వేధించిన సదరు ఉద్యోగి విషయంలో కలెక్టర్ తీసుకున్న చర్యలపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ‘సాక్షి’కి అభినందనలు.. ఈ ఘటన విషయంలో మొదటి నుంచి వాస్తవాలు వెలికి తెస్తూ, కథనాలు రాసిన ‘సాక్షి’కి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాయి. సస్పెండ్ చేసిన హనుమకొండ కలెక్టర్ తదుపరి చర్యలకు సిఫారసు -
బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల కమిషన్
● ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాగరాజు వర్ధన్నపేట: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఓట్ల చోరీకి పాల్పడుతున్న కేంద్రంలోని బీజేపీకి కేంద్ర ఎన్నికల కమిషన్ సహకరిస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓటు చోరీపై సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ కనుసన్నల్లో నడుస్తూ దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ అధికారం కోసం బీజేపీ చేస్తున్న కుట్రను బహిర్గతం చేయడం అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు పౌరుడి హక్కు అని, ఆ హక్కును చోరీ చేయడం ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కు రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు. అబ్బిడి రాజిరెడ్డి, అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, ఎద్దు సత్యనారాయణ, పోశాల వెంకన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బలమున్న చోట బరి గీసి..!
● ‘స్థానిక’ ఎన్నికల్లో పొత్తులు.. కాంగ్రెస్తో ‘కామ్రేడ్’లు ముందుకు ● నాలుగు జెడ్పీటీసీ స్థానాలపై గురి... ఎంపీటీసీ, సర్పంచ్లకూ పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు కామ్రేడ్లు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనలు చేశారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీటీసీ స్థానాల పేర్లను సూచించిన సీపీఐ నేతలు అందులో నాలుగు తప్పకుండా ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందుపెట్టారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస్రావు తదితరులు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డితో మంగళవారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లోనూ పొత్తుతో ముందుకు సాగాలన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాష్ట్ర వ్యాప్తంగా తమకు బలమున్న చోట పోటీ చేస్తామని సీపీఐ నేతలు చెప్పినప్పటికీ.. ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్లో జెడ్పీటీసీ సీట్ల కేటాయింపుపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి (ఎస్సీ–జనరల్), వరంగల్లో నల్లబెల్లి (బీసీ–జనరల్)ను ఇవ్వాలని సీపీఐ ప్రతినిధుల బృందం కాంగ్రెస్ నేతలకు ప్రతిపాదించింది. మహబూబాబాద్ జిల్లాలో మహబూ బాబాద్ (బీసీ–జనరల్), నెల్లికుదురు (బీసీ–జనరల్)లో ఏదే ని ఒకటి, జనగామ జిల్లాలో రఘునాథపల్లి (బీసీ–మహిళ), జఫర్గఢ్ (బీసీ–జనరల్)లో ఒకచోట జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇక ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల విషయంలో సీపీఐకి బలమున్న చోట స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని అభ్యర్థులను సూచిస్తామని కాంగ్రెస్ నేతలతో స్పష్టం చేసినట్లు తెలిసింది. కాగా, బుధవారం ఉమ్మడి వరంగల్కు చెందిన సీపీఎం నేతలు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిని పొత్తుల విషయంలో కలువనున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. -
ఎప్సెట్ కౌన్సెలింగ్ షురూ
రామన్నపేట: బీఫార్మసీ, ఫార్మ్డీ, ఫార్మాస్యూ టికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్సెట్ (బైపీసీ) కౌన్సెలింగ్ మంగళవారం వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రారంభమైనట్లు టీజీ ఎప్సెట్ అడ్మిషన్స్ హెల్ప్లైన్ సెంటర్ కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, నిర్దిష్ట సమయానికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. తొలిరోజు (మంగళవారం) 313 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం నమోదు చేసుకున్నారని, ఈనెల 9వ తేదీ వరకు సర్టిఫికెట్లషన్ ఉంటుందని వివరించారు. అనంతరం ఆప్షన్ ఫ్రీజింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు http:// tgeapcetb.nic.in వెబ్సైట్ సందర్శించాలని ఆయన కోరారు.కార్మిక చట్టాల రక్షణకు ఉద్యమించాలిన్యూశాయంపేట: కార్మిక చట్టాల రక్షణ కోసం నిరంతరం ఉద్యమించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేశ్ పిలుపునిచ్చారు. హనుమకొండలో మంగళవారం జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం రెండో మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. అనంతరం భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా టి.సారంగపాణి, ప్రధాన కార్యదర్శిగా టి.ఉప్పలయ్య, కోశాధికారిగా ఎ.యాకయ్యతోపాటు పి.రవి, పి.అశోక్, సాంబయ్య, వెంకటస్వామి, భిక్షపతి, రవీంద్రాచారి, సుదర్శన్, రవీందర్, రాజు, స్వప్నను ఎన్నుకున్నారు.సీజేఐపై దాడికి యత్నం.. న్యాయ దేవతపై దాడేవరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించడం.. న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. సీజేఐ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఇసుక, మొరం రవాణాపై విచారణ
కమలాపూర్: మొరం, మట్టి, ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, పోలీస్ శాఖతో కలిసి మైనింగ్ శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. కమలాపూర్లోని సమ్మక్క గుట్ట నుంచి కొందరు వ్యాపారులు అక్రమంగా మొరం, మట్టి తవ్వకాలు చేపట్టి యథేచ్ఛగా తరలిస్తున్నారని, నేరెళ్ల వాగు నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారని ప్రజావాణిలో ఇటీవల కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మంగళవారం మైనింగ్ శాఖ ఏడీ రవిశంకర్, రాయల్టీ ఇన్స్పెక్టర్ చంద్రకళ, స్థానిక తహసీల్దార్ సురేశ్కుమార్, ఎస్సై మధు, రెవెన్యూ, పోలీస్ శాఖ సిబ్బందితో కలిసి సమ్మక్క గుట్ట ప్రాంతం, నేరెళ్ల వాగును పరిశీలించి పంచనామా రికార్డు చేశారు. వ్యాపారులకు నోటీసులు జారీ చేసి విచారిస్తామని, విచారణ పూర్తయ్యాక నివేదికను కలెక్టర్కు అందజేస్తామని అధికారులు తెలిపారు. -
సీజేఐపై దాడి న్యాయ దేవతపై దాడే
వరంగల్ లీగల్: దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై ఓ న్యాయవాది యత్నించిన దాడి న్యాయ దేవతపై జరిగిన దాడిగానే పరిగణించాలని వరంగల్, హనుమకొండ జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ అన్నారు. ఇటీవల సీజేఐ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రెండు బార్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు జిల్లా కోర్టు ఎదుట భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవ్యవస్థ గౌరవమే ప్రజాస్వామ్యానికి మూల స్తంభమని పేర్కొన్నారు. దేశ ప్రజలు న్యాయవ్యవస్థను గౌరవించి కాపాడుకోవాలని సూచించారు. ప్రస్తుతం న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలని, అదేపరిధిలో న్యాయమూర్తుల రక్షణను కూడా చేర్చడం అత్యవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే దాడికి పాల్పడిన సదరు న్యాయవాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జయపాల్, ప్రధాన కార్యదర్శి రమాకాంత్, కోశాఽధికారి అరుణ, ఈసీ సభ్యులు సురేశ్, మేఘనాథ్, మహేందర్, బార్ కౌన్సిల్ సభ్యులు బైరపాక జయాకర్, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: స్థానిక సంస్థల ఎన్నికలు, కౌంటింగ్కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డితో కలిసి కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎం గోదాముల పరిశీలన వరంగల్ ఏనుమాముల మార్కెట్ యార్డులో జిల్లా గోదాములను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో డీపీఓ కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, హౌసింగ్ పీడీ గణపతి, తహసీల్దార్ శ్రీకాంత్, నాయబ్ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలి వర్ధన్నపేట: స్థానిక ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం, కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని హెచ్ఎం వెంకటేశ్వర్లును ఆదేశించారు. వెంకట్రావ్పల్లిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్ప న, హౌజింగ్ పీడీ గణపతి, డీబీసీడీఓ పుష్పలత, నోడల్ అధికారులు, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాయపర్తి మండలంలో ఆకస్మిక పర్యటన రాయపర్తి: రాయపర్తి మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్నికల సామగ్రి, రిటర్నింగ్, సహాయ అధికారి స్వీకరణ గదులు, జనరల్ అబ్జర్వర్, వ్యయ పరిశీలకుల గదులు, ఎన్నికల సిబ్బంది, తదితర అంశాలను కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. అనంతరం రాయపర్తి రైతువేదిక పక్కన నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించి వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, హౌజింగ్ పీడీ గణపతి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
‘బీఏఎస్’ బకాయిలు విడుదల చేయాలి
న్యూశాయంపేట: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం (బీఏఎస్)కు సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలల్లోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే బకాయిలు విడుదల చేయాలని వారు కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని ఏఓ విశ్వప్రసాద్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కందిక చెన్న కేశవులు, కళ్యాణి, రాకేష్, వెంకన్న, రాజు, భద్రు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలు పాటించాలి
న్యూశాయంపేట: ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలను స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల ప్రింటింగ్ ప్రెస్ల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రింటింగ్, ముద్రణ యాజమాన్యంతో మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నియమ, నిబంధనలతో కూడిన పత్రాలను ముందుగా వారికి అందించాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు అనుబంధం –ఏ, అనుబంధం –బీను రాజకీయ పార్టీల ప్రతినిధులు పూరించి ఇస్తే వాటిని ముద్రించాలన్నారు. -
అందరి దృష్టి హైకోర్టు తీర్పు పైనే..
సాక్షిప్రతినిధి, వరంగల్: షెడ్యూల్ వచ్చే దాకా ఒక టెన్షన్.. తేదీలు ప్రకటించాక రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై మరో టెన్షన్. ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై తేలే సమయం రానే వచ్చింది. బుధవారం వెలువడే హైకోర్టు తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతం కాగా.. అన్ని వర్గాల్లోనూ అనుకూలమా? ప్రతికూలమా? అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఆ వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఇదే సమయంలో బీసీ రిజర్వేషన్ల జీఓను సవాల్ చేస్తూ రెడ్డి జాగృతి సంఘం ప్రతినిధి వంగా గోపాల్రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో మళ్లీ గందరగోళం నెలకొంది.తీర్పు వెలువడిన తర్వాతే ముందుకు..2024 ఫిబ్రవరి మొదటి వారంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు, జూలైలో మండల, జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఈ ఏడాది జనవరిలో మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వీటన్నింటితోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు తెరమీదకు తెచ్చింది. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్లో కుల గణన చేపట్టింది. అలాగే, బీసీ డెడికేషన్ కమిటీ వేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై కులగణన నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిల్లులు రూపొందించి సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఆ ప్రక్రియలు పూర్తయ్యాక సెప్టెంబర్ నెలాఖరులో జీఓ 9 తీసుకొచ్చి వెంటనే రిజర్వేషన్లు ఖరారు చేసి, ఏకకాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్న సమయంలో బీసీ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దీంతో వేచిచూసే ధోరణికి వచ్చిన ప్రధాన పార్టీల నేతలు.. నేడు వెలువడే తీర్పు తర్వాత పరిస్థితులను బట్టి మరింత ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.తీర్పుకు ముందే ఊహాగానాలు..బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై నేడు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఉమ్మడి వరంగల్లో ఆరు జెడ్పీలు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలకు రిజర్వేషన్ల గెజిట్ ఇప్పటికే విడుదలైంది. 778 ఎంపీటీసీ, 1,708 సర్పంచ్ స్థానాలు, 15 వేల పైచిలుకు వార్డులకు కూడా రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం నుంచి మొదటి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఈ సమయంలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో జోరందుకుంటున్న ఊహాగానాలు పల్లెల్లో గందరగోళ పరిస్థితులకు అవకాశం ఇస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం హైకోర్టు బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగనున్నాయని, ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వెలువరిస్తే మాత్రం రిజర్వేషన్లలో మార్పులు చేయనున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించాల్సి రావడంతో ఇప్పుడు చేసిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు స్థానాలు తగ్గి జనరల్కు పెరుగనున్నాయని.. ఇలా రకరకాలు జరుగుతున్న ప్రచారానికి తోడు రోజు రోజుకు మారుతున్న రాజకీయ సమీకరణలతో పరిస్థితులు హాట్హాట్గా కనిపిస్తున్నాయి. -
10 రోజులు.. 1,622 వాహనాలు
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రవాణాశాఖకు పది రోజుల వ్యవధిలోనే తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్), రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం వచ్చింది. ఓవైపు దసరా పండుగ, ఇంకోవైపు వాహనాలపై విధించే జీఎస్టీ తగ్గింపుతో ఒక్కసారిగా వాహనాల విక్రయాలు ఊపందుకున్నాయి. తొలి వరుసలో బైక్లు ఉండగా, ఆ తర్వాత స్థానంలో కార్లు ఉన్నాయి. కేవలం పది రోజుల వ్యవధిలో అంటే సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు 1,622 వాహనాల విక్రయాలు జరిగాయని రవాణాశాఖ అధికారులు తెలిపారు. వాటిలో 75 శాతం బైక్లు, కార్లు ఉండగా, మిగిలినవి ఆటోరిక్షాలు, ట్రాక్టర్లు, ఓమ్నీ బస్సులు తదితర వాహనాలు ఉన్నాయి. విక్రయాలు ౖపైపెకి.. జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన సెప్టెంబర్ 22న 95 వాహన విక్రయాలు జరిగాయి. 23న 115, 24న 158, 25న 189, 26న 173, 27న 154, 28న 112, 29న 193, 30న 240, అక్టోబర్ ఒకటిన 193 వాహనాల విక్రయాలు జరిగాయి. సెప్టెంబర్ 22న 95 వాహనాలు విక్రయాలైతే, అధికంగా సెప్టెంబర్ 30న 240 వాహనాల అమ్మకాలు జరిగాయి. మిగతా రోజుల్లో సెంచరీపైనే విక్రయాలు జరిగాయని ఆర్టీఏ గణాంకాలు చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో భారీగా వాహన విక్రయాలు సెప్టెంబర్ 22న 95 విక్రయించగా, అధికంగా 30న 240 వాహనాలు జిల్లా రవాణాశాఖకు దసరా ధమాకా టీఆర్, రోడ్డు ట్యాక్స్ రూపంలో రూ.5,58,28,420 ఆదాయం -
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ ఆరోపణలు
సాక్షిప్రతినిధి, వరంగల్/హన్మకొండ చౌరస్తా: రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నాయకులు ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండ డీసీసీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య ‘‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’’ను విడుదల చేశారు. తెలంగాణలో పదేళ్లలో ప్రజలకిచ్చిన ఏమేమీ హామీలను నెరవేర్చలేదో వాటిలో కొన్నింటిని ఆ కార్డులో పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. విశ్వాసంతో మమ్మల్ని గెలిపించి, అభివృద్ధిలో భాగస్వాములను చేసిన ప్రజలకు జీవితాంతం బాకీ ఉంటామనేది వాస్తవమేనన్నారు. మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో 11 శాతం వ డ్డీపై అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిన బీఆర్ఎస్ నేతలే ప్రజలకు అసలైన బాకీదారులని ఆరోపించారు. పదేళ్ల పాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక భారాన్ని మోపిన బీఆర్ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు మారుపేరుగా నిలిచిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులకు గిన్నిస్ బుక్లో స్థానం కల్పించాలని వారు ఎద్దేవా చేశారు. సమావేశంలో వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేషన్ ఫ్లోర్ లీ డర్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు రవీందర్, విజ యశ్రీ, కిసాన్సెల్ జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య హనుమకొండలో ‘బీఆర్ఎస్ కా ధోకా కార్డు’ విడుదల -
‘స్థానిక’ంగా గెలిపించుకుంటా..
కమలాపూర్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నన్ను గెలిపించిన కార్యకర్తలు, నాయకులను రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నేను గెలిపించుకుంటా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. కమలాపూర్లో సోమవారం బీఆర్ఎస్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా పోయలేదని విమర్శించారు. ఇంటింటికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసం గెలుచుకున్నోళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామన్నారు. కమలాపూర్ మండలంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణరావు, కేడీసీసీబీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, మాజీ ప్రజాప్రతినిధులు లక్ష్మణ్రావు, నవీన్కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై గెలిచి పార్టీ మారితే తస్మాత్ జాగ్రత్త అని, ఎవరైనా పార్టీ మారితే వెయ్యి మందితో వారి ఇంటిపై దాడి చేస్తామని హెచ్చరించారు. ఉప్పల్ ఆర్ఓబీ నిర్మాణంలో కేంద్రం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. ప్రస్తుతం అక్కడ రోడ్డంతా గుంతలమయమై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే ఎమ్మెల్యేల నిధులైనా విడుదల చేస్తే రోడ్డును బాగు చేయించుకుంటామన్నారు. హుజూరాబాద్లో గులాబీ జెండా ఎగురవేద్దాం కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి -
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై చర్చ
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై క్లైమేట్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫెసిలిటీ (సీపీపీఎఫ్) ప్రతినిధులు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొని చెత్త సేకరణ, నిర్వీర్యం, ఆదాయం, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. నగరంలో భవిష్యత్లో తడిచెత్త ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టుల ఏర్పాటు, తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్టు గవర్నెన్స్ ప్లాన్, కార్పొరేషన్ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో సోమవారం డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, కుడా లేఅవుట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పార్కులో 12వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని ఆదేశించారు. సమావేశంలో ఇండస్ట్రియల్ జోనల్ మేనేజర్ స్వామి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, తహసీల్దార్లు రియాజుద్దీన్, రాజ్కుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు ప్రణాళికాబద్ధంగా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేటాయించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. చెత్తను తొలగించండి.. డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు. -
ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులు ఓకే!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో 2010లో నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎట్టకేలకు పదోన్నతులు కల్పిస్తూ కేయూ పాలకమండలి సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వీరి నియామకాలను గత పాలకమండలిలో ఆమోదించినా పెండింగ్లో ఉండిపోయింది. తాజా సమావేశంలో పదోన్నతి అంశం చర్చకు వచ్చి పదోన్నతులకు చివరికి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి క్యాస్ పదోన్నతులు లభించనున్నాయి. సోమవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించి ఆమోదించినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో రెగ్యులర్ ఆచార్యుల కొరతతో వర్క్లోడ్ అధికంగా ఉంది. ఇందుకు అనుగుణంగా పార్ట్టైం లెక్చరర్లను నియమించడం లేదు. ఇటీవల వివిధ విభాగాల్లో పేపర్ వైజ్గా నియామకాలు చేపట్టారు. పార్ట్టైం లెక్చరర్లను నియమించాలనే విషయంపై పాలక మండలిలో చర్చించారు. వర్క్లోడ్కు అనుగుణంగా 130 మందిని నియమించుకునేందుకు పాలక మండలి ఆమోదించింది. ఇందుకోసం నోటిఫికేషన్ ఇచ్చి అర్హులైనవారిని నిబంధనలకు అనుగుణంగా తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారి ఉద్యోగ విరమణ వయస్సును 60 ఏళ నుంచి 65 ఏళ్లవరకు పెంచుతూ ఆమోదించింది. రెగ్యులర్ ఆచార్యులకు మాదిరిగానే వీరికి ఉద్యోగ విరమణ ఉండనుంది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చు రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచుతూ ఆమోదించింది. యూనివర్సిటీ భూమిలో ఇల్లు కలిగి ఉండడంతో పాటు పలు ఆరోపణలతో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న ఓ అసిస్టెంట్ రిజిస్ట్రార్పై విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలని పాలకమండలి సూచించినట్లు సమాచారం. ప్రహరీ నిర్మాణంపై ప్రస్తావన.. కాకతీయ యూనివర్సిటీలోని భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాలనే విషయంపై మళ్లీ పాలకమండలిలో చర్చకు రాగా రూ.20 కోట్ల వ్యయంతో కొంత ఎత్తుగా ఉండేలా నిర్మాణాన్ని ప్రభుత్వ సంస్థ టీజీడబ్ల్యూఐడీసీకి అప్పగించాలని చర్చించినట్లు సమాచారం. పాలక మండలిలో నిర్ణయించిన ప్రకారం యూనివర్సిటీ అధికారులు ముందుకెళ్లాలని నిర్ణయించారని విశ్వసనీయంగా తెలిసింది. సమావేశంలో కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, ఉన్నత విద్య కమిషనర్ శ్రీదేవసేన, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేశ్లాల్, డాక్టర్ కె.అనితారెడ్డి, డాక్టర్ రమ, డాక్టర్ చిర్రా రాజు, సుకుమారి, మల్లం నవీన్, బాలు చౌహాన్ టి.సుదర్శన్ పాల్గొన్నారు. ఇక పార్ట్టైం లెక్చరర్ల నియామకం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయస్సు 65 ఏళ్లకు పెంపు రూ.20 కోట్లతో ప్రహరీ నిర్మాణం కేయూ పాలక మండలి సమావేశంలో ఆమోదం -
ఆరు జెడ్పీల్లో మూడు చోట్ల మహిళలే..
సాక్షి ప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మహిళలకు కలిసి వస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పురుషులకంటే మహిళలకే ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి. ఉమ్మడి వరంగల్లో జనాభా, ఓటర్ల సంఖ్యతో పాటు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లు కూడా ‘ఆమె’కే ప్రాధాన్యం ఇచ్చాయి. ఈనేపథ్యంలో.. రిజర్వేషన్లు కలిసొచ్చే (భార్య లేదా భర్త) పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ప్రధాన పార్టీల నాయకులు. సుమారు రెండేళ్ల తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సెప్టెంబర్ 29న రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. రేపటి హైకోర్టు తీర్పు వెలువడడమే తరువాయి తమకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు మహిళలు రెడీ అవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా పార్టీలకు వారు దరఖాస్తులు కూడా చేసుకున్నారు.ఓటర్లుగా ఆధిక్యం.. సీట్లలోనూ ప్రాధాన్యంజనవరి 5న ప్రకటించిన తుది జాబితా ప్రకారం.. ఉమ్మడి వరంగల్లో ఓటర్ల సంఖ్య 30,43,540కు చేరింది. పురుషులు, మహిళలు, ఇతరులు, సర్వీసు ఓటర్లు కలిపితే 30.44 లక్షలకు చేరగా.. ఈసారి మహిళలదే అగ్రస్థానం. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 12 నియోజకవర్గాల్లో మొత్తం 30,43,540 మంది ఓటర్లు ఉంటే, అందులో పురుషులు 14,89,606 కాగా, మహిళా ఓటర్లు 15,51,289 ఉన్నారు. ఇతరులు (థర్డ్జెండర్స్) 504 కాగా, సర్వీసు ఓటర్లు 2,141. ఉమ్మడి వరంగల్కు వచ్చేసరికి 12 నియోజకవర్గాల్లో అత్యధికంగా నమోదైన మహిళా ఓటర్లు పురుషులతో పోలిస్తే 61,683 మంది ఎక్కువగా ఉన్నారు. ఈనేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారికే ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్లో ఆరు జిల్లా ప్రజా పరిషత్లు ఉండగా.. ములుగు ఎస్టీ మహిళ, హనుమకొండ, జనగామ ఎస్సీ మహిళలకు కేటాయించారు. 75 జెడ్పీటీసీలకుగాను 38 మహిళలకు దక్కాయి. 39 ఎంపీపీ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. అదేవిధంగా 778 ఎంపీటీసీ స్థానాల్లో 399, 1708 గ్రామ పంచాయతీల్లో 860 చోట్ల మహిళలకే అవకాశం దక్కనున్నట్లు అధికారులు విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి.పోటెత్తుతున్న దరఖాస్తులుస్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. ఈక్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్ రెండు రోజులుగా నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. స్టేషన్ఘన్పూర్, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట తదితర నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ఆశావహులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహం చూపారు. వార్డు సభ్యుల నుంచి జెడ్పీటీసీ వరకు దరఖాస్తులు చేసుకోగా.. మహిళా రిజర్వేషన్ స్థానాల్లో ఆశావహులు గట్టిగానే తలపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. బీఆర్ఎస్, బీజేపీలు కూడా ఛాలెంజ్గా తీసుకుని అభ్యర్థుల వేటలో పడ్డాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జ్లు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఈసారి మహిళలకు అత్యధిక స్థానాలు రిజర్వ్ కావడంతో ఆ స్థానాల్లో గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా అన్ని పార్టీలు తలమునకలవుతున్నాయి. -
‘బీఏఎస్’ బిల్లులు చెల్లించండి
● విద్యార్థులను పాఠశాలలోకి రానివ్వని యాజమాన్యం ● ప్రభుత్వం స్పందించాలని రోడ్డెక్కిన బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులునెక్కొండ: ప్రభుత్వం బీఏఎస్ బిల్లులు చెల్లించలేదని మండల కేంద్రంలోని విద్యోదయ బెస్ట్ అవైలబుల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించక పోవడంతో వారి తల్లిదండ్రులు స్థానిక అంబేడ్కర్ సెంటర్లో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంట పాటు ట్రాఫిక్ స్తంభించంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా బీఏఎస్ విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు మాట్లాడారు. ప్రభుత్వం మూడేళ్లుగా బీఏఎస్ నిధులు విడుదల చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విడుదలలో జాప్యాన్ని మంత్రులు, సంబంధిత అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే బీఏఎస్ యాజమాన్యం మొండికేసిందని వాపోయారు. మూడేళ్లుగా బకాయిలు పెండింగ్లో ఉండడంతో తమ ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేక పోతున్నామని, పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్స్ వంటివి సమకూర్చుకోవడం కష్టంగా మారిందని బీఏఎస్ స్కూల్ యాజమాన్యం చెబుతోందని అన్నారు. పిల్లల చదువులు సక్రమంగా సాగకపోతే ప్రభుత్వం దిగి వచ్చే వరకు దశల వారీగా ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. సమాచారం తెలుసుకుని పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
ఎర్రబారిన వరిపొలం
● కలుపు నివారణకు మందు పిచికారీతో రంగుమారిన వైనం ● డీలర్, కంపెనీపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతు వేడుకోలు రాయపర్తి: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లైంది. ఓ రైతు పరిస్థితి. కలుపును నివారించి వరిపంటను కాపాడుకునేందుకు యత్నించిన రైతుకు డీలర్ ఇచ్చిన కలుపు నివారణ మందు శాపమైంది. మూడెకరాల్లో నాటిన వరిపంట పూర్తిగా ఎర్రబారిపోయింది. ఈ సంఘటన రాయపర్తి మండలంలోని పెర్కవేడు గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత రైతు అబ్బోజు సేనాపతి కథనం ప్రకారం గతనెల 19న వరంగల్ అండర్ బ్రిడ్జి రోడ్డులోని ఎస్బీఐ పక్కన ఉన్న మాధురి ఏజెన్సీస్ పెస్టిసైడ్స్, సీడ్స్ ఫెర్టిలైజర్ దుకాణంలో నోవిక్సిడ్, తారక్ అనే కంపెనీలకు చెందిన పిచికారీ మందులను కొనుగోలు చేశాడు. ఆ మందులను వారం రోజుల క్రితం పిచికారీ చేయగా, మూడెకరాల్లోని వరి మొత్తం నిప్పుతో కాల్చిన విధంగా ఎర్రబారింది. ఈ విషయాన్ని వరంగల్లోని డీలర్కు తెలియజేయగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కంపెనీ ప్రతినిధులు పూజిత, కుమార్.. దాటవేసే ధోరణిలో వ్యవహరించారు. అధికారులు పంటక్షేత్రాన్ని సందర్శించి కంపెనీపై, తనకు మందులు ఇచ్చిన డీలర్పై చర్యలు తీసుకొని, పంట నష్టం అందేలా చొరవ తీసుకోవాలని బాధిత రైతు సేనాపతి వేడుకుంటున్నాడు. కార్యక్రమంలో గ్రామ రైతులు తీగల సాయిలు, బండి కుమార్, నిమ్మల రాజు, సల్ల కొంరయ్య, బొమ్మెర రవి, గడ్డం సుధాకర్, బండి సంతోష్, మామిండ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘టెక్స్టైల్’ పనులు వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనులను వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్ చాంబర్లో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మితో కలిసి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని గ్రీన్ కవరింగ్, ఆర్ఓబీ, కుడా లేఅవుట్, డ్రెయినేజీ, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ తదితర పనుల పురోగతిపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల టెక్స్టైల్ పార్కు మాస్టర్ ప్లాన్ను ఆమోదించి అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించిందని గుర్తుచేశారు. టెక్స్టైల్ పార్కులో 12వేల ప్లాంటేషన్ పనులను 15రోజుల్లో పూర్తి చేయాలని హర్టికల్చర్ అధికారిని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఇండస్ట్రీయల్ జోనల్ మేనేజర్ స్వామి, కుడా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ అజిత్రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఈ గౌతంరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ మాణిక్యరావు, ఆర్అండ్బీ డీఈ దేవిక, గీసుకొండ తహసీల్దార్ రియాజుద్దీన్, సంగెం తహసీల్దార్ రాజ్కుమార్, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా నోడల్ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న నోడల్ అధికారులతో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా చూడాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, అధికారులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు ౖపైపెకి..
సాక్షి, వరంగల్: ఈ వానాకాలంలో ఆశాజనకంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలమట్టాలు పైకి ఉబికాయి. జూన్లో సగటున 5.98 మీటర్ల లోతులో ఉన్న నీరు జూలైలో 5.66 మీటర్లు, ఆగస్టులో 3.14 మీటర్లకు పైకి ఎగబాకిన భూగర్భ జలమట్టాలు.. సెప్టెంబర్లో 2.61 మీటర్లకు సగటున వచ్చి చేరాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురవాల్సి వాన కంటే అధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఈ వానలతో చెరువులు, కుంటలు, వాగులు నిండి ఆయా ప్రాంతాల్లోని భూగర్భ జలాలు పైకి ఎగబాకాయి. దాంతో ఈ ఏడాది వ్యవసాయానికి సాగునీటికి ఢోకా లేదు. కానీ, పత్తి, మొక్కజొన్న, వరి పంటలకు మాత్రం అదనపు వర్షంతో కొంతమేర నష్టం వాటిల్లింది. జిల్లాలో 2,84,375 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా 2,53,420 ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేశారు. పత్తి 1,18,106, వరి 1,03,160, మొక్క జొన్న 13,654, ఇతర పంటలు 18,500 ఎకరాల్లో సాగవుతున్నాయి. అదనంగా వర్షాలు జూన్లో 153.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్లకు 312.8 మిల్లీమీ టర్ల వాన కురిసింది. అంటే జూన్లో లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టులో 248.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 390.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. సెప్టెంబర్ నెలలో 174.9 మిల్లీమీటర్ల వర్షానికి 245.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా చూసుకుంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు కలుపుకుంటే 854 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, 1,102.4 మిల్లీమీటర్లు కురిసింది. జూన్లో 5.98 మీటర్లలో భూగర్భ జలమట్టం తాజాగా 2.61 మీటర్లపైకి ఎగబాకిన నీరు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అధిక వర్షాలు అదనపు వానలతో సాగునీరుకు నిశ్చింతమండలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ చెన్నారావుపేట 1.46 0.32 0.12 0.01 దుగ్గొండి 4.71 3.53 0.21 0.15 గీసుకొండ 5.03 4.67 1.26 0.61 ఖానాపురం 3.34 2.92 0.69 1.06 నల్లబెల్లి 7.70 7.33 1.25 0.97 నర్సంపేట 4.97 4.10 1.15 1.60 నెక్కొండ 2.85 0.48 0.19 0.43 పర్వతగిరి 11.65 13.51 7.66 6.58 రాయపర్తి 8.06 9.63 7.05 4.17 సంగెం 3.58 3.12 2.26 2.52 వర్ధన్నపేట 8.30 7.33 5.65 5.52 వరంగల్ 2.22 1.81 1.21 1.27 ఖిలా వరంగల్ 4.65 3.87 1.70 0.32 -
రేపటి నుంచి కళాశాలల సిబ్బంది వివరాల పరిశీలన
కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఆమోదించనున్నట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటలో తెలిపారు. డీఐఈఓ ఆమోదం పొందిన సిబ్బందికి ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్మీ డియట్ బోర్డు వెబ్సైట్ https// acadtgbie.cgg.gov.in ద్వారా ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ, పుట్టిన తేదీ వంటి అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డాక్యుమెంట్లను భౌతికంగా పరిశీలించేదుకు ఆయా కళాశాలలకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించినట్లు పేర్కొన్నారు. 8, 9వ తేదీల్లో ప్రైవేట్ కళాశాలలు, 14, 15, 16వ తేదీల్లో ప్రభుత్వ కళాశాలల సిబ్బంది వివరాలను, మొత్తం 864 మంది బోధన, బోధనేతర సిబ్బంది డాక్యుమెంట్లను పరిశీలించి అఫ్రూవ్ చేయనున్నట్లు డీఐఈఓ స్పష్టం చేశారు.యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండిరామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్ పాల్గొన్నారు.చెత్తను తొలగించండి..డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు.దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారును నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.9న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలువిద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. -
మామూళ్ల మత్తులో ‘ఎకై ్సజ్’
● బెల్ట్ షాపు నుంచి నెలకు రూ.వెయ్యి, గుడుంబా సెంటర్ నుంచి రూ.2 వేల చొప్పున అక్రమంగా వసూలుపర్వతగిరి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మండలంలో ఎకై ్సజ్ అధికారుల దోపిడీ కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. మండలంలోని 33 గ్రామాల్లో సుమారు వంద బెల్ట్ షాపుల నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున, 50 గుడుంబా సెంటర్ల నుంచి నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారని తెలిసింది. అలాగే, మండలంలోని ఏనుగల్, చింత నెక్కొండ, అన్నారం షరీఫ్, పర్వతగిరి గ్రామాల్లో ఆరు వైన్ షాపుల నుంచి నెలకు రూ.20 వేల చొప్పున మామూళ్లు తీసుకుంటున్నారని సమాచారం. ఎకై ్సజ్ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా బెల్ట్ షాపులు, గుడుంబా సెంటర్లపై ఎకై ్సజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించకపోవడంతో పలు విమర్శలు తావిస్తోంది. 30 ఏళ్లుగా గుడుంబా సెంటర్ల నిర్వాహకులను తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, పదేళ్లుగా గుడుంబా నిర్వాహకులపై కేసులు పెట్టడంలో ఎకై ్సజ్ అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. డ్రైవర్ ద్వారా వసూళ్లు ఎకై ్కజ్ అధికారులు నెలవారీ మామూళ్ల వసూళ్లలో భాగంగా తమ డ్రైవర్ ద్వారా లంచాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వసూళ్లలో ఎకై ్సజ్ శాఖ డ్రైవర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట: పేద విద్యార్థుల విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రతిభ కలిగిన లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలు చదువుకు దూరమవుతున్నారని వాపోయారు. బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. ప్రభుత్వ గురుకులాల్లో సరైన సదుపాయాలు కల్పించడంలో సర్కారు విఫలమైందని తెలిపారు. -
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై చర్చ
వరంగల్ అర్బన్ : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై క్లైమేట్ ప్రాజెక్టు ప్రిపరేషన్ ఫెసిలిటీ (సీపీపీఎఫ్) ప్రతినిధులు సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులు పాల్గొని చెత్త సేకరణ, నిర్వీర్యం, ఆదాయం, ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. వరంగల్ నగరంలో భవిష్యత్లో తడిచెత్త ద్వారా బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్రాజెక్టుల ఏర్పాటు, తదితర అంశాలపై సంస్థ ప్రతినిధులు వివరించారు. ప్రాజెక్టు గవర్నెన్స్ ప్లాన్, కార్పొరేషన్ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశంలో ఎస్ఈ సత్యనారాయణ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు రవికుమార్, సంతోశ్బాబు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు. -
స్లాట్ బుకింగ్.. స్పాట్ సెల్లింగ్
పత్తి విక్రయానికి ఇక ఇబ్బందులుండవ్హన్మకొండ: పంట అమ్ముకునే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి పత్తి రైతులకు ఇక విముక్తి లభించనుంది. కనీస మద్దతు ధర అందించడంతోపాటు దళారుల ప్రమేయం లేకుండా రైతులు నేరుగా పత్తి అమ్ముకునేందుకు, క్రయవిక్రయాలు పారదర్శకంగా జరిగేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ‘కాపాస్ కిసాన్’ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి రైతులు ఈ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని పంటను అమ్ముకోవాలి. ఈ నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఈ యాప్పై ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన అధికారులు రైతుల మొబైల్ ఫోన్లో యాప్ను డౌన్లోడ్ చేయించి పత్తి బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తారు. తద్వారా పత్తి క్రయవిక్రయాలు పూర్తిగా యాప్ ద్వారానే సాగనున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి దాదాపు 5,23,848 ఎకరాల్లో సాగు చేశారు. స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకం.. రైతులు ‘కాపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తి అమ్ముకోగలుగుతారు. రైతులు ఏ మిల్లులో అమ్ముకుంటారో తెలుపుతూ స్లాట్ బుక్ చేయగానే తేదీ, సమయాన్ని అధికారులు యాప్ ద్వారా సమాచారం అందిస్తారు. అదే నిర్ణీత రోజు, నిర్ణీత సమయానికి రైతు పత్తిని తీసుకెళ్లి విక్రయించుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకోకపోతే పత్తిని అమ్ముకోలేరు. రైతులు మూడుసార్లు స్లాట్ బుక్ చేసుకుని, స్లాట్ను రద్దు చేసుకోకుండా పత్తిని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి విక్రయించకపోతే ఆ రైతు పేరు బ్లాక్లిస్టులోకి వెళ్తుంది. బ్లాక్ లిస్టులో నుంచి పేరు తొలగించి, తిరిగి పత్తి అమ్ముకోవాలాంటే సీసీఐ అధికారులతో ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పత్తి క్వింటాకు రూ.8,110 మద్దతు ధర.. కేంద్ర ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా మద్దతు ధర పొందే అవకాశాన్ని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కల్పించింది. స్మార్ట్ ఫోన్లేని రైతులు ఇతరుల స్మార్ట్ ఫోన్ నుంచి కూడా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రైతు పాస్బుక్ నంబర్ ఎంటర్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ‘కాపాస్ కిసాన్’ యాప్లో రైతు పట్టాదారు పాస్బుక్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయగానే పంట ఎంత సాగు చేశారో వివరాలు అందులో వస్తాయి. వ్యవసాయ శాఖ ఇప్పటికే డిజిటల్ క్రాప్ సర్వే చేస్తూ పంట సాగు వివరాలు నమోదు చేస్తోంది. డిజిటల్ క్రాప్ సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి దిగుబడి లెక్కిస్తారు. ఈ యాప్ ద్వారా రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. రైతులు నిరీక్షించాల్సి న బాధ తప్పుతుంది.‘కాపాస్ కిసాన్’ యాప్ను స్మార్ట్ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ముందుగా రైతు పేరు, జెండర్, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్, ఫోన్ నంబర్, కౌలురైతు/సొంతమా అనే వివరాలు నమోదు చేయాలి. పట్టాదారు పాస్ పుస్తకం నంబర్, సర్వే నంబర్, రైతుకు ఉన్న మొత్తం భూమి, ఇందులో పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వివరాలు యాప్లో నిక్షిప్తం చేయాలి. రైతుకు సంబంధించిన ఆధార్ కార్డు, పాస్బుక్, రైతు ఫొటోను యాప్లో అప్లోడ్ చేయాలి. ప్రత్యేక యాప్ను రూపొందించిన సీసీఐ ‘కాపాస్ కిసాన్’ యాప్ ద్వారా బుకింగ్ యాప్పై వ్యవసాయ అధికారులు, విస్తరణాధికారులకు శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5,23,848 ఎకరాల్లో పత్తి సాగు -
వనదేవతలకు మొక్కులు
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కల్యాణకట్టలో పుట్టువెంట్రుకలను సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు. -
10 రోజులు 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎలక్షన్స్పై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది. లక్ష్యం చేరేనా? హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.వైన్స్ అప్లికేషన్లపై ఆసక్తి కరువు 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు నడపలేం..
● ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగార్జున్రెడ్డి నెక్కొండ: ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమెన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్’ (బీఏఎస్) నిధులు విడుదల కాకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుకారుతోంది. మూడేళ్లుగా బీఏఎస్ నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయా స్కూల్స్ యాజమాన్యాలు నేటి (సోమవారం) నుంచి విద్యార్థులకు పాఠశాలల అనుమతి నిరాకరిస్తున్నామని బెస్ట్ అవైలబుల్ స్కూల్ వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రధాన సలహాదారుడు, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు చల్లా నాగా ర్జున్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాజమాన్యాలు వడ్డీలకు అప్పులు తెచ్చి, నగలు తాకట్టు పెట్టి ఇప్పటి వరకు పాఠశాలలను నడిపించామన్నారు. గత బకాయిలు తీర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించామన్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదని, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 32 స్కూళ్లు ఉన్నాయని, ఇందులో 3,500 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుతున్నారన్నారు. గతంలో నిధుల విడుదల కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎస్సీ, ఎస్టీ మంత్రి అడ్డూరి లక్ష్మణ్లను కలిసి విన్నవించామన్నారు. ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్, సోషల్ వెల్ఫేర్ కమిషనర్, ఉమ్మడి జిల్లా కలెక్టర్లకు, డీటీడబ్ల్యూ, డీఎస్డీఓ అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయామన్నారు. ఇకపై స్కూళ్ల నిర్వహణ ఆర్థిక భారాన్ని భరించలేమని, విద్యార్థులకు అనుమతించడం లేదని తల్లిదండ్రులకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా సమాచారాన్ని అందించామన్నారు. ప్రభుత్వం స్పందించి బీఏఎస్ బకాయిలు చెల్లించాలని కోరారు. -
వైద్య విద్యార్థులకు ఆర్థిక చేయూత
హన్మకొండ: వైద్య విద్యలో ప్రవేశాలు పొంది ఫీజు చెల్లించే స్థోమత లేని విద్యార్థులకు దాతలు అండగా నిలిచారు. హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యవిద్యలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు దాతలు ఆర్థికసాయం అందించారు. ఎంబీబీఎస్లో సీటు సాధించి ఫీజు చెల్లించలేని దీనస్థితిని నీట్ పేరెంట్ మల్లోజు సత్యనారాయణ చారి వీడియో రూపొందించి యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన దాతలు స్పందించి ఆర్థిక సాయాన్ని అందించారు. రవికుమార్ కొప్పకుల రూ.50 వేలు, కోర శ్రీనివాస్ రూ.25 వేలు, లక్క రాజేశ్వరి రూ.25 వేలు, ఇతరులు కలిసి మొత్తం రూ.2.50 లక్షలు విరాళంగా అందించారు. ఆమొతాన్ని ప్రతిమ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన తల్లితండ్రి లేని హనుమకొండ పెద్దమ్మగడ్డకు చెందిన ఆరుమల్లి గణేశ్కు రూ.60 వేలు, జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన నిజామాబాద్కు చెందిన నునావత్ దివ్యకు రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన చెప్యాల గౌతమి రూ.50 వేలు, ప్రతిమ మెడికల్ కళాశాలలో ప్రవేశం పొందిన మహబూబ్నగర్కు చెందిన నానికి రూ.50 వేలు అందించారు. ఇందులో నీట్ పేరెంట్స్ రావుల మధు, లడే శ్రీనివాస్, మానస, రాచమల్ల రవీందర్, దుర్గ ప్రసాద్, రాచకొండ ప్రవీణ్ పాల్గొన్నారు. -
నేటి ప్రజావాణి రద్దు
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రీవెన్స్ రద్దు చేశామన్నారు. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం జరగదన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై ప్రజలు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని ఆమె కోరారు. ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు ఈనెల 7న రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ కూతాడి అర్జున్రావు రానున్నారు. ఈసందర్భంగా శంభునిగుడి, మ్యూజియ భవనం నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఐదేళ్ల లాకోర్సు ఏడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలుగో పేపర్, 22న ఐదో పేపర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు తెలిపారు. హన్మకొండ: హనుమకొండలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 6న విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగనుందని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి తెలిపారు. కొత్తూరు, హనుమాన్నగర్ డబ్బాలు, కేయూ సెకండ్ గేట్, రెడ్డి కాలనీ, పాలజెండా, యాదవనగర్, ఏకశిల కాలేజీ, గోపాల్రావు బిల్డింగ్, కొత్తూరు మార్కెట్ ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. జవహర్కాలనీ, కొండా మురళి గెస్ట్హౌస్ రోడ్డు, ఎస్వీఎస్ హోమ్స్, విష్ణుపురి కాలనీ, నవయుగ కాలనీ, ద్వారకాసాయి కాలనీ ప్రాంతంలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు, నయీంనగర్, లష్కర్సింగారం, రాజాజీనగర్ ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: పాఠశాల క్రీడల సమాఖ్య (ఎస్జీఎఫ్) అండర్–19 ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా హసన్పర్తి మండలంలోని భీమారం జెడ్పీహెచ్ఎస్ ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న నరెడ్ల శ్రీధర్ నియమితులయ్యారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ వాసంతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. సెక్రటరీగా శ్రీధర్ రెండేళ్ల పాటు కొనసాగుతారు. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ పర్వతగిరి: తాళం వేసి ఉన్న చోరీ జరిగిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మార్కెట్ యార్డు సమీపంలోని చనమల్ల నర్సయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి నాలుగు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లో తన కూతురు కాలేజీ ఫీజు కోసం దాచిన రూ.50వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
ఆకట్టుకున్న స్వయం సేవకుల కవాతు
విద్యారణ్యపురి: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) శత జయంతిని పురస్కరించుకుని హనుమకొండ, వరంగల్, కాజీపేటలో ఆదివారం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు నిర్వహించిన పథ సంచలన్ (కవాతు) విశేషంగా ఆకట్టుకుంది. విశ్వవిద్యాలయ నగర్, కాజీపేట, భవానీ నగర్, హసన్పర్తి, హనుమకొండ, వరంగల్, ఖిలా వరంగల్, కాశిబుగ్గ తదితర ప్రాంతాల్లో 8 చోట్ల నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలు వేర్వేరుగా స్వయం సేవకులు రూట్ మార్చ్ నిర్వహించారు. పూలతో అలంకరించిన వాహనంపై భరతమాత, డాక్టర్ గురూజీ చిత్రపటాలతో పాటు భగవధ్వజాన్ని (కాషాయ జెండా) ఉంచి స్వయంసేవకులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు రిటైర్డ్ పొఫెసర్ చిలకమారి సంజీవ, పెద్దిరెడ్డి మల్లారెడ్డి, డాక్టర్ బందెల మోహన్రాజు, ప్రొఫెసర్ గద్దె రమేశ్, పృథ్వీరాజ్, కె.శ్రీనినాథ్, జూలపెల్లి కరుణాకర్, ప్రమోద్, డాక్టర్ కోదాటి సుధాకర్రావు, స్వయం సేవకులు పాల్గొన్నారు.మహానగరంలో ఆర్ఎస్ఎస్ పథసంచలన్ -
దుఃఖం
దూది రైతులఈ ఫొటోలో పత్తి కాయలు ఒలుస్తోన్న మహిళా రైతు నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బత్తిని అరుణ. తనకున్న ఎకరం భూమిలో పత్తి పంట సాగు చేసింది. సుమారు రూ.40వేల వరకు పెట్టుబడి పెట్టింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పంట నష్టపోయింది. పత్తి పంటలో వర్షం నీరు నిలవడంతో దిగుబడి తగ్గింది. ఉన్న ఒకటి, రెండు కాయలు తెంపుకొచ్చి ఇంటి దగ్గర ఒలుస్తోంది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా పత్తి రైతుల పరిస్థితి ఇలానే ఉంది.అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తిపంటనర్సంపేట: పత్తి రైతు ఏటా నష్టపోతూనే ఉన్నాడు. అకాల వర్షాలు, తెగుళ్లు, చీడపీడలతో దిగుబడి రాక, ఉన్న కొద్దిపాటి పత్తిని మద్దతు ధరకు అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెట్టిన పెట్టుబడులు పెరిగి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.8,110 ధర కూడా పెట్టడం లేదు. కొత్త నిబంధనలతో జిన్నింగ్ మిల్లులు టెండర్లకు ముందుకు రాకపోవడంతో సీసీఐ కొనుగోళ్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.7వేల వరకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. అకాల వర్షాలు, తెగుళ్లు, ఎరువుల కొరత ఈ ఏడాది మే మాసంలో కురిసిన అకాల వర్షాలతో రైతులు రోహిణి కార్తెలో పత్తి విత్తనాలు నాటారు. ఏపుగా పెరిగి కాయ దశలో తెగుళ్లు విజృంభించి పత్తి పంటను నాశనం చేశాయి. ఇదే క్రమంలో యూరియా దొరకకపోవడంతో పత్తి ఎదుగుదలలో లోపం స్పష్టంగా కనిపించింది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గింది. అయితే ఉన్న కాస్త పత్తి ఏరి ఇటీవల అమ్ముకుంటున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదు. సీసీఐ కొనుగోలు లేకపోవడంతో దళారులు వారిని నిలువునా ముంచుతున్నారు. కొత్త నిబంధనలతో... సీసీఐ కొత్త నిబంధనలు కొనుగోళ్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2022లో క్వింటా పత్తి ధర రూ.14వేలు ఉండగా అంతర్జాతీయ ప్రమాణాలతో పత్తి ధరలు భారీగా పడిపోయాయి. దీంతో రైతులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీసీఐ ధరలపై ఆధారపడుతున్నారు. కాగా సీసీఐ ఉమ్మడి వరంగల్ జి ల్లాలో 58 జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేస్తుంది. సీసీఐ, జిన్నింగ్ మిల్లుల మధ్య ఏర్పడిన వివాదంతో కొనుగోలు జరగడం లేదు. మార్క్ఫెడ్ మినహా ప్రైవేట్ వ్యాపారులు దూరంగా ఉండడంతో సీసీఐ కొనుగోలు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాలతో పత్తి అమ్మకాలు... అకాల వర్షాలతో రైతులు పత్తిని ఇంట్లో నిల్వ చేసుకోవడం లేదు. ఏరిన పత్తిని ఏరినట్లు మార్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. ఉన్న కొద్ది పాటి పత్తిని అమ్మితే మద్దతు లభించడం లేదని, కూలీల ఖర్చులు పెరిగాయని, దీంతో పెట్టిన పెట్టుబడులు మీద పడి అప్పుల పాలవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. మురిగిపోతున్న పత్తి కాయలు సీసీఐ కొనుగోళ్లపై అనుమానాలు కొత్త నిబంధనలతో టెండర్లకు దూరంగా జిన్నింగ్ మిల్లులు దళారులకు వరంగా మారిన కొనుగోళ్లు జిల్లాలో 1,26,500 ఎకరాల్లో పత్తి సాగు -
నిర్వహణ కనుమరుగు
వివిధ పనుల నిమిత్తం రోజూ వరంగల్ నగరానికి వచ్చేవాళ్లు వేల సంఖ్యలో ఉంటారు. వారికి ఒకటికో రెంటికో వస్తే నరకమే. ఏ షాపింగ్ మాలో.. పెట్రోల్ బంకో.. బస్టాండ్, రైల్వే స్టేషన్కో పరుగులు పెట్టాల్సిందే. నగరంలో అక్కడక్కడా మరుగుదొడ్లు కనిపించినా ఆ కంపునకు దరిదాపుల్లోకి వెళ్లలేని పరిస్థితి. రూ.కోట్ల ప్రజాధనంతో నిర్మించిన మరుగుదొడ్ల నిర్వహణను గాలికొదిలేశారు. కొన్ని చోట్ల ప్రజా మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నప్పటికీ నిర్వహణ పేరిట పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. – వరంగల్ అర్బన్ నగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ప్రజా మరుగుదొడ్లు.. స్థలాల లేమి పేరుతో ఇష్టారాజ్యంగా నిర్మించారు. ఈ నిర్మాణల్ల్లో పెద్ద ఎత్తున చేతులు మారాయనే విమర్శలున్నాయి. అవేమీ చాలవన్నట్లుగా ఇప్పుడు నిర్వహణ పేరిట ప్రజా సొమ్ము వాటాలుగా పంపిణీ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. గ్రేటర్ వరంగల్లో రెండున్నరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు చాలా వరకు మాయమయ్యాయి. అక్కడక్కడా మిగిలిన కొన్ని ప్రస్తుతం చెత్త కుప్పల్లా మారాయి. లూకేఫ్ సంస్థకు ఇచ్చిన కంటైనర్ తరహాలో ఏర్పాటు చేసినవి వ్యాపార కేంద్రాలుగా మారాయి. ఆర్టీసీ బస్సుల్లో ఏర్పాటు చేసిన సంచార మరుగుదొడ్లు రెండు బల్దియా ప్రధాన కార్యాలయంలో పార్కింగ్కే పరిమితయ్యాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో ఏర్పాటు చేసిన వాటికి కూడా అదే దుస్థితి. ప్రజా మరుగుదొడ్లు ప్రజలకు ఏమేర అక్కరకు వస్తున్నాయో తెలియదు కానీ, ఏజెన్సీ, అధికారులు, సిబ్బందికి మాత్రం ఆర్థిక మేలు చేకూరుస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేరుకే వెయ్యి సీటర్లు..నగరంలో ప్రత్యేకంగా ఆరు చోట్ల షీ టాయిలెట్లను నిర్మించారు. బల్దియా ప్రధాన కార్యాలయం, బాలసముద్రం, సుబేదారి, ఖిలా వరంగల్ కోట, కాజీపేట, నయీంనగర్లో ఉండగా.. ఇవి నామ మాత్రంగానే నడుస్తున్నాయి. రూ.30 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన రెండు మొబైల్ షీ టాయిలెట్లు బస్సులు మూలకు చేరి తప్పుపడుతున్నాయి. హైదరాబాద్ తరహాలో నగరంలో ఆరు ఆధునిక టాయిలెట్లను సర్వాంగ సుందరంగా నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. కాజీపేట, నిట్, హనుమకొండ కలెక్టరేట్, భీమారం, టీబీ ఆస్పత్రి, హనుమకొండ పాత బస్డిపో, వరంగల్ పోచమ్మ మైదాన్, ఖిలా వరంగల్ కోట ఖుష్మహల్ దగ్గర ప్రస్తుతం ఇవి వాడకంలో ఉన్నాయి. వీటిలో సగం సీట్లు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ములుగురోడ్డు, మట్టెవాడ పోలీస్ స్టేషన్ ఎదురుగా, చార్బౌళి, అండర్ బ్రిడ్జి, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో అధునాతన టాయిలెట్లు మొత్తంగా రూ.10 కోట్లతో 88 చోట్ల 324 సీటర్లు నిర్మించారు. అందులో పది శాతం మాత్రమే ఉపయోగంలో ఉండగా.. 40ఽ శాతం నామమత్రంగా, మరో 50 శాతం తాళాలు పడ్డాయి. ప్రైవేట్వి పని చేస్తున్నాయ్.. జీడబ్ల్యూఎంసీ అధికారులు కొన్ని ప్రాంతాల్లో బీఓటీ (బిల్డ్, ఓన్, ఆపరేట్) పద్ధతిలో నిర్మించి, రుసుము వసూలు చేసుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అనుమతి ఇచ్చారు. అలాంటివి నగరంలో సుమారు 60 వరకు 676 సీటర్లు ఉన్నాయి. అవి కూడా కొన్ని చోట్ల (సులభ్ కాంప్లెక్స్)లు అపరిశుభ్రంగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రజల నుంచి రూ.5 చొప్పన రుసుము వసూలు చేయాల్సి ఉండగా, ఒక్కొకరి నుంచి రూ.10 చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నగరంలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను పర్యవేక్షించాల్సిన అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. మరుగుదొడ్ల తనిఖీలపై బల్దియా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను తనిఖీ చేస్తాం. నిర్వహణ ఉన్న టాయిలెట్లకు నిధులు మంజూరు చేస్తాం. లేకపోతే రద్దు చేస్తాం. – రాజారెడ్డి, బల్దియా సీఎంహెచ్ఓ రూ.10 కోట్లతో 88 నిర్మాణాలు వినియోగంలో ఉన్నవి 10 శాతమే.. లేకున్నా బిల్లుల చెల్లింపులుప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలు అంటూ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రజా మరుగుదొడ్లలో సగం కనుమరుగయ్యాయి. రూ.10 కోట్లతో ఏర్పాటు చేసిన వాటిలో కొన్ని పని చేయడం లేదు. మరికొన్ని అపరిశుభ్ర వాతావరణంలో చెత్తకుప్పలుగా మారాయి. ప్రతీ నెల పబ్లిక్ మరుగుదొడ్ల నిర్వహణకు రూ.50 లక్షలు వెచ్చిస్తున్నా.. ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంపై పౌరులు మండిపడుతున్నారు. మూడేళ్లుగా అధునాతన మరుగుదొడ్ల నిర్వహణకు ఓ ఏజెన్సీకి కట్టబెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. కానీ, 90 శాతానికిపైగా పనిచేయడం లేదు. చాలా చోట్ల నీటి, విద్యుత్ సదుపాయాలు లేక కొన్ని మూలకు చేరాయి. కనీసం డోర్లు లేక మరికొన్ని అధ్వానంగా మారాయి. ఈ లెక్కాపత్రాలను వెల్లడించేందుకు ప్రజారోగ్యం, శానిటేషన్ అధికారులు ససేమిరా.. అంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కంఠమహేశ్వరుడికి జలాభిషేకం
నర్సంపేట: పట్టణంలో శ్రీకంఠమహేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం స్వామి వారి కి భక్తులు జలాభిషేకం నిర్వహించారు. కౌండిన్యుల గోత్రం కలిగిన ప్రతిఒక్కరూ ఆలయానికి డప్పు చప్పుళ్లతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, జలాలతో అభిషేకాలు చేశారు. పట్టణంలోని గౌడ కులస్తుల ఇంటి నుంచి బిందెలతో జలాలను కొత్త వస్త్రాలు ధరించి మంగళహారతులతో తరలి వచ్చి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లుగౌడ్, ప్రధాన కార్యదర్శి మద్దెల శ్రీని వాస్గౌడ్, ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్య, ఆర్థిక కార్యదర్శి నాతి సదానందం, గిరగాని కిరణ్, డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు. -
మక్క రైతులను ముంచుతున్న దళారులు
నర్సంపేట: రైతులు ఆరుగాలం కష్టించి పండించిన మొక్కజొన్నలను దళారులు, వ్యాపారులు మద్దతు ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని అఖిల భారత రైతు సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంసీపీఐ(యూ) ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం నర్సంపేట వ్యవసాయ మార్కెట్ను సందర్శించి మొక్కజొన్నలను అమ్మకానికి తీసుకువచ్చిన రైతుల ఇబ్బందులు, ధరల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేశ్ మాట్లాడుతూ రైతాంగం ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి ప్రకృతి వైఫరీత్యాలను ఎదుర్కొని మొక్కజొన్నలను పండిస్తే ప్రభుత్వాలు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించకుండా దళారులకు, వ్యాపారులకు వత్తాసు పలుకుతుందన్నారు. ఈ క్రమంలో కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 అమ్మాల్సిన మొక్కజొన్నలు రూ.1,600 నుంచి రూ.2,100 దాటడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రంలోనే మొదట దిగుబడి వచ్చే జిల్లాలో ఇంత వరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. అధిక వర్షాలతో దిగుబడి తగ్గి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగానికి పండిన మొక్కజొన్నలకై నా కనీస మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. మార్కెట్లో మొక్కజొన్నలు ఆరబోసుకుని వారాలు గడుస్తున్న కుంటి సాకులతో ధర తగ్గించడానికి కొనుగోలు జరగకపోవడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా తక్షణమే రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కనీస మద్దతు ధర అమలు అయ్యే విధంగా మార్క్ఫెడ్లను రంగంలోకి దించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసే వ్యాపారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు కన్నం వెంకన్న, డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి, ఏఐకేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేశెట్టి సదానందం, కలకోట్ల యాదగిరి, రాజేందర్, వీరన్న, సురేష్, రైతులు పాల్గొన్నారు. ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ -
10 రోజులు.. 7 దరఖాస్తులు
కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లాలోని (వరంగల్ అర్బన్) 67 వైన్స్లకు దరఖాస్తులు అందజేసేందుకు మద్యం వ్యాపారులు అనాసక్తి చూపుతున్నారు. ఇకపై వైన్స్కు పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తాయని ఆబ్కారీ శాఖ ఎదురుచూస్తోంది. 2025–27 రెండేళ్ల కాల పరిమితితో వైన్స్ నిర్వహణకు ప్రభుత్వం సెప్టెంబర్ 25న ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపునకు షెడ్యూల్ను విడుదల చేసింది. కాగా, వైన్స్ టెండర్ల పిలుపు నుంచి 10 రోజుల కావొస్తున్నా.. అరకొరగా కేవలం 7 దరఖాస్తులు మాత్రమే ఎకై ్సజ్ శాఖకు అందాయి. ఎన్నికలపై ఫోకస్తో.. గతంలో వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఈ సారి 3 లక్షలుగా దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం ఖరారు చేయడంతో మద్యం వ్యాపారులు నాన్ రీఫండ్ కదా దరఖాస్తులు వేద్దామా.. లేదా? అనే ఆలోచనలో పడ్డారు. వైన్స్ టెండర్ల తరుణంలోనే స్థానిక ఎన్నికల నిర్వహణ ఉండడంతో ఎలక్షన్స్లో తేల్చుకుందాం. వైన్స్ దరఖాస్తులకు ఎందుకు ఖర్చు. వస్తే వైన్షాపు. పోతే రూ.3 లక్షలు అంటూ వెనుకంజ వేస్తున్నట్లు 10 రోజుల దరఖాస్తులతోనే తెలిసిపోతోంది.హనుమకొండ జిల్లాలోని గతంలోని 65 వైన్స్కుగాను 2023–25 రెండేళ్ల కాలపరిమితికి 5,859 దరఖాస్తులు రాగా, ఖజానాకు రూ.117 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా 2025–27 వైన్స్ టెండర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల దరఖాస్తు ఫీజు కాగా, ఎప్పటికప్పుడు దరఖాస్తులు డబుల్ అవడంతో పాటు ఆదాయం డబుల్ అవుతుండగా.. 13 రోజుల్లో గత టార్గెట్ రీచ్ అయ్యేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైన్స్ అప్లికేషన్లపై అనాసక్తి 13 రోజుల్లో 5,859 దరఖాస్తుల టార్గెట్ చేరేనా? -
వరంగల్
ఆదివారం శ్రీ 5 శ్రీ అక్టోబర్ శ్రీ 2025కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. – ఎస్ఎస్తాడ్వాయికాపాస్ కిసాన్ యాప్పై శిక్షణ కాపాస్ కిసాన్ యాప్పై శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు శిక్షణ ఇచ్చారు. వాతావరణం జిల్లాలో ఉదయం ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. మధ్యాహ్నం ఎండ మామూలుగా ఉంటుంది. పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. చిరునవ్వుతో జీవిద్దాం! చిన్న చిరునవ్వుతో బాధలన్నీ మర్చిపోవచ్చని చెబుతున్నారు వైద్యులు. నేడు ప్రపంచ చిరునవ్వుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకం
● అదనపు కలెక్టర్ సంధ్యారాణిన్యూశాయంపేట: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డితో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిటర్నింగ్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా ఉండొద్దన్నారు. ఆర్ఓ విధులు, బాధ్యతలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రతీ మండలంలో మూడు లేదా నాలుగు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి, ప్రతీ జెడ్పీటీసీకు రిటర్నింగ్ అధికారిని నియమించామన్నారు. రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం ఎన్నికల నోటీసు ఇవ్వాలని, నామినేషన్ల స్వీకరణ, రిటర్నింగ్ అధికారి కార్యాలయం నోటీసు బోర్డుపై స్వీకరించిన అభ్యర్థుల నామినేషన్ పత్రాల జాబితా, స్వీయ ప్రకటన ప్రతులను ప్రచురించాలని, నామినేషన్ పత్రాల పరిశీలన, తిరస్కరించినట్లయితే దానికి గల కారణం తెలపాలని, నామినేషన్ పత్రాల జాబితా ప్రచురించాలని, అభ్యర్థుల ఉపసంహరణ నోటీసు స్వీకరించాలని, పోటీ చేయు జాబితా, గుర్తులు కేటాయింపు, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు. ప్రతిరోజు పీపుల్ సాఫ్ట్వేర్లో ఆర్ఓలు నివేదికలను ఎలక్షన్ ప్రాసెస్ మోడల్ను ఉంచాలన్నారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు. -
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట కార్యాచరణ రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలిసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, శాంతిభద్రతలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్పోస్టుల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, రూట్ మ్యాప్ల తయారీ, రాజకీయ పార్టీల ప్రచారానికి అనుమతులు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో 5 మండలాలు, రెండో విడతలో 6 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతాయన్నారు. ఎన్నికలు శాంతియుత నిర్వహణకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి)ను కఠినంగా అమలు చేయాలని, జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్ని కల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని, ఎన్నికల సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని నియమించి, ఎన్ని కల విధుల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలన్నారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయాలి మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. నామినేషన్ల స్కూృటిని, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు ప్రక్రియపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. పోలింగ్ రోజు పాటించాల్సి న నిబంధనలు, విధులపై అధికారులకు ముందుగానే సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత పొరపాట్లు జరగకుండా బ్యాలెట్ పేపర్ల ముద్రణ జరగాలని, ఎన్నికల నిర్వహణకు అవసరమైన వాహనాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీ ఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, జిల్లా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు షురూ నర్సంపేట: నర్సంపేట పట్టణంలో కంఠమహేశ్వరస్వామి ఉత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన ఉత్సవాల్లో సంఘం అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లుగౌడ్, కార్యదర్శి మద్దెల శ్రీనివాస్గౌడ్, సభ్యులు వేడుకలను ప్రారంభించారు. కంఠమహేశ్వరస్వామి ఆల యం, సంఘం కార్యాలయంలో పూజలు చేశా రు. అక్కడి నుంచి డప్పు చప్పుళ్లు, డీజే సౌండ్స్తో గ్రామ దేవత బొడ్రాయి వద్ద పూ జలు చేశారు. అనంతరం గ్రామంలోని శివాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి, గుడి మైసమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మతల్లి, ముత్యాలమ్మ తల్లి, పెద్దమ్మ తల్లిని బోనాలతో సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గాదగోని సాంబయ్యగౌడ్, ఆర్థిక కార్యదర్శులు నాతి సదానందంగౌడ్, గిరగాని కిరణ్ గౌడ్, డైరెక్టర్స్ శ్రీనివాస్గౌడ్, సురేష్, కృష్ణ, ర మేశ్, ప్రమోద్, రవి, కొమురయ్య, సారయ్య, కనుకయ్య, సాంబయ్యలు పాల్గొన్నారు. ‘స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’ వర్ధన్నపేట: అధికార పార్టీ కాంగ్రెస్కు స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శనివారం మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ ప్రజలకు కాంగ్రెస్ బాకీ కా ర్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడు తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టంకడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెంచాల కుమారస్వామి, తూల్ల కుమారస్వామి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
వ్యూహాలకు పదును..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహా లకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లా జెడ్పీలతో పాటు ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలో కి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టా యి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆది వారం నుంచి కార్యాచరణను అమలు చేయనుంది. బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్తో సంప్రదింపులు చేస్తున్నారు. బీజేపీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అ ధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేర కు ఆదివారం నుంచి నియోజకవర్గాల వారీగా కా ర్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థా నం నుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పా టు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జి ల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శని వారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పా ట్లు చేసుకుంటున్నారు. ఆరు జెడ్పీలపై గురి... కాంగ్రెస్, బీఆర్ఎస్... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా ప్రజాపరిషత్ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టీ పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్ ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్, జనగామలు జనరల్కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కై వసం చే సుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నా యకత్వం యోచిస్తోంది. ఇదే సమయంలో 12 అ సెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థా నాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్ పోస్టులకు రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్గా మారింది. కాగా ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజైన 9 నుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పా ర్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ సందడి జోరందుకుంటోంది. ‘స్థానిక’ ఎన్నికలకు పావులు కదుపుతున్న అగ్రనేతలు ప్రధాన రాజకీయపార్టీల్లో సాగుతున్న కసరత్తు ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేటినుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు -
దసరాకు ఫుల్ కిక్కు!
సాక్షి, వరంగల్: జిల్లాలో దసరా పండుగ మద్యం వ్యాపారులకు ఫుల్ కిక్కు ఇచ్చింది. గతేడాది కంటే ఈ ఏడాది మద్యం అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయి. గతేడాది సెప్టెంబర్ నెలలో 7,22,294 బీర్లు తాగితే ఈసారి ఏకంగా 8,95,200 బీర్లు మందుబాబులు తాగారు. దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 2న వైన్స్ బంద్ ఉంటాయన్న ప్రకటనతో మందుప్రియులు ముందుగానే బీర్లను కొనుగోలు చేశారు. వీరితో పాటు బెల్ట్ షాప్ నిర్వాహకులు కూడా ఎక్కువ మొత్తంలో బీర్లను వైన్షాపుల నుంచి కొని డంప్ చేసుకున్నారు. లిక్కర్ ప్రియులు కూడా గతేడాది 41,283 కాటన్లు తాగితే ఈసారి 45,783 కాటన్లు లాగించేశారు. గతేడాది సెప్టెంబర్ నెలతో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు 23.8 శాతం పెరిగితే, లిక్కర్ విక్రయాలు 10.9 శాతం అదనంగా అమ్ముడయ్యాయని ఎకై ్సజ్ గణాంకాలు చెబుతున్నాయి. 2024 సెప్టెంబర్లో రూ.42.40 కోట్ల వ్యాపారం జరిగితే, ఈసారి రూ.51.868 కోట్ల వ్యాపారం జరిగింది. సుమారు రూ.9కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. దసరా పండుగ వేళ సెప్టెంబర్ నెలాఖరుతో పాటు అక్టోబర్ ఒకటి, మూడు తేదీల్లో రూ.9 కోట్లకు పైగానే మద్యం విక్రయాలు జరిగాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎంత వ్యాపారం అంటే.. జిల్లాలో 63 మద్యం దుకాణాలున్నాయి. నర్సంపేటలో 25, పరకాలలో 22, వర్ధన్నపేటలో 16 వైన్షాప్లు ఉండగా ఆరు బార్లు ఉన్నాయి. అయితే 2024లో నర్సంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో రూ.15.72 కోట్ల మద్యం వ్యాపారం జరిగితే ఈసారి రూ.19.763 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. పరకాల ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో రూ.16.43 కోట్ల బిజినెస్ జరిగితే ఈసారి రూ.19.082 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. వర్ధన్నపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో రూ.10.25 కోట్ల బిజినెస్ జరిగితే ఈసారి రూ.13.023 కోట్ల మద్యం వ్యాపారం జరిగింది. మొత్తంగా అన్ని ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఈ నెల 2న దసరా పండుగ, అదే రోజు గాంధీ జయంతి ఉండడంతో ఒకటి, మూడు తేదీల్లో రూ.9కోట్లకు పైగానే ఆదాయం వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు గతేడాదితో పోల్చుకుంటే బీర్ల విక్రయాలు 23.8శాతం, లిక్కర్ అమ్మకాలు 10.9 శాతం వృద్ధి ఈనెల 1, 3వ తేదీల్లోనే రూ.కోట్ల వ్యాపారంఎకై ్సజ్ స్టేషన్ 2024 సెప్టెంబర్ 2025సెప్టెంబర్ నర్సంపేట 22,654 కాటన్లు 26,335 కాటన్లు పరకాల 22798 కాటన్లు 26,891 కాటన్లు వర్ధన్నపేట 14,795 కాటన్లు 21,374 కాటన్లు -
వ్యూహాలకు పదును
సాక్షిప్రతినిధి, వరంగల్ : సా్థనిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లా పరిషత్లతో పాటు ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను కై వసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు కసరత్తు మొదలెట్టాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి నియోజకవర్గస్థాయి సమావేశాల ద్వారా దరఖాస్తులు స్వీకరించేందుకు ఆదివారం నుంచి కార్యాచరణ అమలు చేయనుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ద్వితీయ శ్రేణి నేతలు, కేడర్తో సంప్రదింపులు చేస్తున్నారు. బీపేజీ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్ర కమిటీ సందేశం పంపింది. ఇక వామపక్షాలు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం కార్యకలాపాలు చేస్తున్నాయి. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత.. జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలు జిల్లా కమిటీ అధ్యక్షులు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు ఆదివారం నుంచి నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేయనున్నారు. ఇదే సమయంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీపడే వారినుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానంనుంచి నాలుగు నుంచి ఐదు పేర్లను పరిశీలించి అధిష్టానానికి ప్రతిపాదించనున్నారు. స్థానిక అభ్యర్థులకు ఈ విషయంలో ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజాదరణ, కార్యకర్తల మద్దతు ప్రాధాన్యాంశాలు కానున్నాయని, అభ్యర్థుల ఎంపిక అధిష్టానం సూచనల మేరకు పారదర్శకంగా ఉంటుందని ఓ ప్రజాప్రతినిధి తెలిపారు. నియోజకవర్గాల వారీగా నిర్వహించే సమావేశాలు కీలకమైనందున కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా చూసుకోవాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి శనివారం జిల్లా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు ముందుగానే నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరు జెడ్పీలపై గురి... కాంగ్రెస్, బీఆర్ఎస్... ఈ రెండు పార్టీలు ఆరు జిల్లా పరిషత్ స్థానాలపై గురిపెట్టాయి. బీజేపీ సైతం గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఈసారి హనుమకొండ జెడ్పీ ఎస్సీ మహిళ, వరంగల్ ఎస్టీ జనరల్, ములుగు ఎస్టీ మహిళ, జనగామ ఎస్సీ మహిళ, మహబూబాబాద్ జనరల్, భూపాలపల్లి బీసీ జనరల్కు రిజర్వు చేశారు. వాస్తవానికి హనుమకొండ, వరంగల్, జనగామ జనరల్కు వస్తాయని ఆశావహులు భావించారు. అందుకు భిన్నంగా రిజర్వేషన్లు ఉండటంతో ఆశావహుల అంచనాలు దెబ్బతినగా.. ఈ ఆరింటిని ఎలా కైవసం చేసుకోవాలి? అన్న వ్యూహంలో ప్రధాన పార్టీల నాయకత్వం యోచిస్తోంది. 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని 75 జెడ్పీటీసీ స్థానాలు.. 75 ఎంపీపీ పదవులను దక్కించుకోవడం కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. 778 ఎంపీటీసీలు, 1,705 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ల ప్రకా రం అభ్యర్థులను ఎంపిక చేసి గెలిపించుకోవడం పెద్ద టాస్క్గా మారింది. కాగా, ఈ నెల 8న రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్పై విచారణ, తీర్పు ఉండగా.. ఆ మరుసటి రోజు 9వ తేదీ నుంచి మొదటి విడత ఎన్నికల జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులు నామినేషన్లు వేసేలా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. గెలుపు గుర్రాల ఎంపికలో ప్రధాన పార్టీలు పావులు కదుపుతుండగా.. పల్లెల్లో ‘స్థానిక’ ఎన్నికల సందడి రోజు రోజుకూ జోరందుకుంటోంది. ‘స్థానిక’ ఎన్నికలకు పావులు కదుపుతున్న అగ్రనేతలు ప్రధాన రాజకీయపార్టీల్లో సాగుతున్న కసరత్తు ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక బాధ్యత నేటినుంచి నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు బీఆర్ఎస్, బీజేపీలోనూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు గెలుపు గుర్రాల వేటలో మూడు ప్రధాన పార్టీలు.. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ -
బస్సుల కోసం పడిగాపులు
పరకాల: బతుకమ్మ, దసరా సెలవులు ముగియడంతో పరకాల ఆర్టీీసీ బస్టాండ్లో రద్దీ నెలకొంది. సొంతూళ్లకు వచ్చిన వారు తిరిగి పట్టణాలు, నగరాలకు బయలుదేరుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాకపోవడం, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించడంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా బస్టాండ్ కిటకిటలాడుతోంది. సుమారు 100 గ్రామాలు, వేలాది మంది ప్రయాణికులకు ప్రధాన కేంద్రంగా ఉండే పరకాల బస్టాండ్ తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. కానీ, సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పరకాల డిపో నుంచి వెళ్తున్న బస్సుల్లోనే సీట్లు ఉంటున్నాయి. భూపాలపల్లి డిపో బస్సుల్లో ఒక్క సీటు కూడా దొరకడం లేదు. తప్పనిపరిస్థితుల్లో కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి పండుగ సీజన్లో ఆర్టీసీ బస్సులను పెంచి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కుటుంబ వ్యవస్థను కాపాడాలి
రామన్నపేట: కుటుంబ వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత మహిళా పోలీసులపై అధికా రులపై ఉందని క్రైం ఏసీపీ సదయ్య సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రంగంపేటలోని మహిళా పోలీస్స్టేషన్ను క్రైం ఏసీపీ శనివారం సందర్శించారు. తనిఖీల్లో భాగంగా స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించడంతో పాటు కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లను పరిశీలించారు. పెండింగ్ కేసులు, ప్రస్తు తం దర్యాప్తులో కేసులు, నిందితుల అరెస్టు సంబంధించిన వివరాలను స్టేషన్ ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాఖాపరమైన సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య జరిగే గొడవలపై స్టేషన్కు వచ్చే బాధితులకు సరైన కౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య సఖ్యత కుదర్చడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మహిళా బాధితులకు సరై న న్యాయం అందించాలని ఏసీపీ తెలిపారు.హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సహాయక కేంద్రాన్ని కలెక్టర్, ఎన్నికల అధికారి స్నేహ శబరీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా 24 గంటలు సహాయక కేంద్రం పనిచేస్తుందని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై సహాయక కేంద్రం 7981975495కి నంబర్కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. కాజీపేట: స్థానిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో హనుమకొడ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం స్వీకరించే దరఖాస్తుల ప్రక్రియ నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే దాకా ప్రజావాణి ఉండదని జిల్లా ప్రజలు గుర్తించాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. కేయూ క్యాంపస్: కేయూ పరిధిలో ఐదేళ్ల లా కోర్సు మూడో సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 9వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసింఇక్బాల్ తెలిపారు. ఈనెల 9న మొదటి పేపర్, 13న రెండో పేపర్, 15న మూడో పేపర్, 17న నాలు గో పేపర్ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా శనివారం మోడల్ 29వ డివిజన్లో కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ప్రజలకు చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా 29వ డివిజన్ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రేటర్లోని 66 డివిజన్లలో కూడా అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్దే తడి చెత్తను ప్రాసెసింగ్ చేస్తే 21 రోజుల త్వరాత కంపోస్టు ఎరువు తయారు అవుతుందన్నారు. సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, శానిటరీ సూపర్వైజర్ గోల్కొండ శ్రీను, భద్రకాళి దేవస్థాన ధర్మకర్త పూర్ణ తదితరులు పాల్గొన్నారు. జంక్షన్లను ఆధునికీకరించాలి.. వరంగల్ అర్బన్: నగరంలో జంక్షన్ల ఆధునీకరణ, నిర్వహణ పక్కాగా జరగాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. శనివారం అలంకార్, జవహర్కాలనీ, వడ్డేపల్లి, ఫాతిమానగర్ జంక్షన్లలో పూర్తయిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కూడళ్ల నిర్వహణపై నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు. -
– ఎస్ఎస్తాడ్వాయి
కోయల పూర్వ మూలాలు, పడిగ బొమ్మలు, పూర్వ కోయ రాజ్యాల చరిత్ర, గొట్టు గోత్రాలు (పూర్వం ప్రకృతి సమతుల్య సిద్ధాంతంలో భాగంగా ఆదివాసీలు తమ వంశవృక్షాలను 3 నుంచి 7 గొట్లుగా ఏర్పాటు చేసుకుని ప్రకృతిలోని జంతువులు, చెట్లు, పక్షులు, రాజ్య వ్యవస్థ సింబల్ను దైవాలుగా పంచుకున్నారు)... వీటిని మేడారం అమ్మవార్ల గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై తీర్చిదిద్దనున్నారు. ఆలయం మొత్తం కొండ గుహల్లో దొరికిన పూర్వ కోయ రాజ్యాలు నడిచిన క్రమంలో రాసిన తాళపత్ర గ్రంథాల ఆధారంగా వాస్తుప్రకారం రూపుదిద్దుకోనుంది. వెయ్యేళ్లు ఆదివాసీల చరిత్ర నిలిచేలా అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయనున్నారు. మేడారం పునర్నిర్మాణంలో ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.. ఆలయంలో రానున్న ఆర్చీలు, సాలహారంపై ఆదివాసీ చరిత్ర, ప్రకృతితో వారికున్న అనుబంధం తెలిపే బొమ్మల విశేషాలే ఈ వారం సండే స్పెషల్ కథనం. వనదేవతల గద్దెల ప్రాంగణం నమూనా చిత్రంప్రధాన ఆర్చీ ద్వారం 40 ఫీట్ల ఎత్తుతో నిర్మించనున్నారు. దీనిపై బండానీ వంశం సమ్మక్క తల్లి 5వ గొట్టు వంశస్తుల పూజిత జంతువు ఒంటికొమ్ము దుప్పి, అటు ఇటు చివరన అడవిదున్న కొమ్ములు, నెమలి ఈకలు ఏర్పాటుచేస్తారు. ఇవి ఆదివాసీల అస్థిత్వానికి రూపాలు. పక్కన రెండు వైపులా నాగులమ్మ (సమ్మక్క చెల్లెలు) పాము రూపంలో ఉంటుంది. వరుసగా కోయ సమాజంలో 6వ గొట్టు ఏనుగు, 3వ గొట్టు ఎద్దు, 4వ గొట్టు ఖడ్గమృగం, 5వ గొట్టు ఒంటి కొమ్ము దుప్పి, 7వ గొట్టు మనుబోతు, 8వ గొట్టు సమ్మక్క తల్లిని చిలకలగట్టు నుంచి తీసుకువచ్చే సిద్ధబోయిన వారి సింహాలు వరుసగా ఏర్పాటు చేస్తారు. ఇందులో మూర్తి అక్కుమ్ (తూత కొమ్ము) ప్రత్యేకం. దేవత ఈ శబ్దం ద్వారానే వస్తుంది అనేది సంకేతం. కింద పిల్లర్లపై కుడి వైపు 5వ గొట్టు తెలిపేలా 5 నిలువు గీతలు, పూజిత పక్షి పావురం, నెమలి పూజిత వృక్షం వెదురు చెట్టు, బండారి చెట్టు, 4వ గొట్టు సమ్మక్క భర్త మూలం తెలిపే 4 నిలువు గీతలు, పూజిత పక్షి సోనోడి పిట్ట, పాలపిట్ట, వృక్షం బూరుగు చెట్టు, తాబేలు ఏర్పాటు చేయనున్నారు. ఆదివాసీ మూలాలు, సంస్కృతీసంప్రదాయ చిత్రాలతో ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ గద్దెల ప్రాంగణం ఆధునికీకరణకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. మొత్తంగా 8 ఆర్చీలు, గద్దెల ప్రాంగణం చుట్టూ ప్రహరీపై 700 ఆదివాసీ చిత్రాలను ఏర్పాటుచేయనున్నారు. అమ్మవార్ల గద్దెలను కదిలించకుండా కోయ మూలాలతో అభివృద్ధి పనులను చేపట్టారు. వనదేవతల వరుస క్రమంలో సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఏర్పాటు చేయనున్నారు. 300 ఫీట్ల వెడల్పు, 1000 ఫీట్ల మేర చుట్టూ ప్రహరీ నిర్మించనున్నారు. ఆదివాసీల గొట్టుగోత్రాల చిత్రాలుతాబేలుపై కోయరాజుల బొమ్మలుఅమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ పిల్లర్లు ఫీటున్నర వెడల్పు, 8 ఫీట్ల పొడవుతో ఏర్పాటు చేస్తారు. వీటిపై 340 బొమ్మలు వేయనున్నారు. పూర్తిగా సమ్మక్క వంశం సిద్ధబోయినవారి పవిత్ర బొమ్మలతోపాటు పూజావిధానం, వారి వంశ వృక్షం ఉంటుంది. సారలమ్మ గద్దె పక్కన పిల్లర్లపై కూడా ఇదే పద్ధతిలో 342 బొమ్మలు వేస్తారు. సారలమ్మ వంశం, 3వ గొట్టు పవిత్ర బొమ్మల చిత్రాలు వేస్తారు. పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై 172 చొప్పున 344 బొమ్మలు, వారి వంశవృక్షం పవిత్ర బొమ్మలు వేస్తారు. పగిడిద్దరాజు – నాగులమ్మ కొడుకు జంపన్న గద్దె జంపన్న వాగు ఒడ్డున ఉంది. అక్కడే ఈ గద్దెను అభివృద్ధి చేయాలని పూజారులు నిర్ణయించారు. జంపన్న తమ్ముడైన ముయాన్న గద్దె ఏర్పాటు, వనం పోతురాజు ఇంకా కాపలాగా ఉండే పొలిమేర దేవతల ఏర్పాటును శాసీ్త్రయబద్ధంగా పూజారులు తీసుకున్నారు. ● ఎడమ వైపు పిల్లర్లపై మూడవ గొట్టు మూలం 3 నిలువు బొట్లు, త్రిభుజం రాజ్య సింబల్, సారలమ్మ కోసం స్వయంవరంలో బాణంతో కాకిని కొట్టి కాక అడమరాజు సారలమ్మను పెళ్లి చేసుకున్న మనిషితో కూడిన బాణం ఉంటుంది. కాకి బొమ్మ, సిద్ధబోయిన వంశస్తుల వడ్డే గోత్రం వృక్షం ఇప్పచెట్టు, చిలకలగట్టునుంచి దేవతను తీసుకొచ్చే సందర్భం బొమ్మలు.. ఇలా ప్రకృతిలోని జంతువులు, పక్షులు, చెట్ల చిత్రాలను ఈ ఆర్చీలో చేర్చి మేడారం జాతర అంటే ప్రకృతి జాతర అనేలా రూపుదిద్దుతారు. ● ఆలయంలోని తూర్పు ఈశాన్యం ద్వారం ద్వారా భక్తులు వెళ్తారు. ప్రధాన ద్వారం పూర్తిగా 5వ గొట్టు మూలం బొమ్మలు 25 రకాలు ఉంటాయి. వారి వంశ వృక్షం ఉంటుంది. పక్కన ద్వారం సిద్ధబోయిన కొక్కెర వారి మూల వంశవృక్షం 25 బొమ్మలతో ఉంటుంది. మరో ద్వారం తూర్పు ఆగ్నేయంలో ఉంటుంది. ఇది పగిడిద్దరాజుది. దీనిలో 4వ గొట్టు మూలం పూర్తిగా 25 బొమ్మలతో ఉంటుంది. తాబేలు బొమ్మపై ఉన్న నలుగురు పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగుల బండడు, ముల్లూరుడిని తెలుపుతుంది. సమ్మక్క భర్త కావడంతో పగిడిద్దరాజు కుడివైపున ఉంటాడు. మధ్యలో వీరి పెళ్లి చేసిన సిద్ధబోయిన వంశం వారు ఉండేలా రూపొందించారు. వెనుక భాగంలో గోవిందరాజు ద్వారం కూడా 4వ గొట్టు మూలాన్ని తెలుపుతుంది. ● ప్రధాన ద్వారం వెనుక వైపు సారలమ్మది. దీనిపై పూర్తిగా 3వ గొట్టు మూలం జంతువులు, పక్షులు వేస్తూ కాక అడమ రాజు, సారలమ్మ మూలం తీసుకున్నారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మకి పుట్ట పోసేందుకు 5 మీటర్ల ఖాళీ స్థలం వదిలేశారు. మిగతా ద్వారాలను సాధారణ కోయ మూలాలతో ఏర్పాటు చేస్తున్నారు. ఇది దేశ పురోగమన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీ సంస్కృతి సజీవంగా నిలిచేలా ఆదివాసీ మూలాలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణం అభివృద్ధి చేయడం మా అదృష్టం. ఇది దేశ పురోగమన చరిత్ర. ఆలయ ప్రాంగణం విస్తీర్ణంలో ఆదిమ మూలం బొమ్మలు లిఖించే అవకాశం దక్కడం మంత్రి సీతక్క, సమ్మక్క– సారలమ్మ పూజారులకు, ఆదివాసీలకు మరువలేని జ్ఞాపకం. ఆదివాసీల ఆత్మగౌరవానికి అండగా ఉంటామని ప్రకటించడం చాలా సంతోషకరం. – డాక్టర్ మైపతి అరుణ్కుమార్ మేడారం గద్దెలు, సాలహారం, నూతన ఆర్చీ ద్వారాలపై 700 ఆదివాసీ చిత్రాలు 3 నుంచి 7 గొట్ల వంశస్తుల సంస్కృతీ సంప్రదాయం పరిఢవిల్లేలా ఏర్పాటు వెయ్యేళ్లు నిలిచేలా రాతికట్టడాలు, గద్దెల ప్రాంగణం విస్తీర్ణం ఆధునికీకరణ తల్లుల గద్దెలు కదిలించకుండా నిర్మాణం మారనున్న వనదేవతల గద్దెల ప్రాంగణం రూపురేఖలు అమ్మవార్ల గద్దెల పక్కన 8 పిల్లర్లు -
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
వరంగల్ అర్బన్: నిధులు కాదు.. సమస్యలపై పరిష్కారంపై దృష్టి సారించాలని కార్పొరేటర్లు కోరారు. ఈ మేరకు శనివారం వారు నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ మూడు నెలలుగా కాలనీలు చిమ్మచీకట్లో ఉంటున్నాయని, సెంట్రల్ లైటింగ్ పనిచేయడం లేదని పేర్కొన్నారు. కోతులు, కుక్కల సమస్యతో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని చెప్పారు. కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో వీధిలైట్ల ఏర్పాటు, మరమ్మతులు పూర్తయ్యాయని, వారం రోజుల్లో సమస్యలు పరిష్కారిస్తామని మేయర్, కమిషనర్ హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్లు తెలిపారు. మేయర్, కమిషనర్ను కలిసిన వారిలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, సోమిశెట్టి ప్రవీణ్, వస్కుల బాబు, బస్వరాజు కుమారస్వామి, మరుపల్లి రవి, చింతాకుల అనిల్, సురేశ్ జోషి, బాల్నె సురేశ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పల్లం రవి, దామోదర్ యాదవ్, సుంకరి శివకుమార్, ముష్కమల్ల సుధాకర్ తదితరులు ఉన్నారు. -
మెడికల్ విద్యార్థులకు అలర్ట్.. పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
వరంగల్: మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.నీట్-పీజీ అర్హత సాధించిన అర్హత సాధించిన విద్యార్థులు OCI, NRI అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ నమోదు కేవలం మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం రాష్ట్ర మెరిట్ స్థానం నిర్ణయించేందుకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. మెరిట్ జాబితా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటిస్తారు.సీట్ల వివరాలు 2025-26 విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కోటా కింద అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య వెబ్సైట్లో వెబ్ ఆప్షన్లకు ముందు ప్రకటిస్తారు. https://pvttspgmed.tsche.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకుని, స్కాన్ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలి. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
నర్సంపేట అంగడిమైదానంలో..నర్సంపేట: విజయదశమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నర్సంపేట పట్టణంలోని బొడ్రాయి, శివాంజనేయస్వామి ఆలయంలో షమీపూజలు నిర్వహించారు. అంగడి మైదానంలో రావణవధ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, ఏసీపీ రవీందర్రెడ్డి, సీఐ రఘుపతిరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్లు హాజరై రావణ వధ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రావణవధ వేడుకల్లో పాల్గొన్న ప్రజలు హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ ఎంజీఎం ఎదుట ఉన్న శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో గురువారం అమ్మవారిని వెండి చీరతో అలంకరించారు. ఆలయ అర్చకుడు ఎల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ వద్దిరాజు వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు. న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్ ఫ్రీ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్డెస్క్కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్డెస్క్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులుఉన్నట్లయితే టోల్ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద కలెక్టరేట్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు -
దసరా సంబురం
ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో అంబరాన్నంటిన వేడుకలు● 70 అడుగుల రావణుడి ప్రతిమ దహనం ● కిక్కిరిసిన ఉర్సు, కరీమాబాద్ రహదారులు ● హాజరైన మంత్రి కొండా సురేఖ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్ : వరంగల్ ఉర్సు రంగలీల మైదానంలో గురువారం రాత్రి దసరా వేడుకలు అంబరాన్నంటాయి. భక్తుల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో ప్రాంగణమంతా మార్మోగింది. లక్షలాదిగా తరలివచ్చిన జనసందోహంతో ఉర్సు, కరీమాబాద్ రహదారులు కిక్కిరిసిపోయాయి. దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్బాబు, కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఘట్టంగా రథయాత్ర.. కరీమాబాద్ రామస్వామి గుడి నుంచి సీతారామాంజనేయ, లక్ష్మణుడి విగ్రహాల ను రథంపై ప్రతిష్ఠించి దాండియా నృత్యాలు, కోలాటం, డప్పుచప్పుళ్ల నడుమ రంగలీల మైదానికి చేరుకున్నారు. అనంతరం వేదపండితులు శమీపూజ నిర్వహించి భక్తులతో పాలపిట్ట దర్శనం చేయించారు. ఎలక్ట్రిక్ రావణుడి ప్రతిమ దహనం.. రంగలీల మైదానంలో 10 తలలతో కూడిన 70 అడుగుల రావణాసురుడి ప్రతిమ ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ పరికరం ద్వారా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మంత్రి కొండా సురేఖ స్విచ్ ఆన్ చేసి రావణుడి ప్రతిమ దహన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. 100 మంది సాంకేతిక నిపుణులు పేల్చిన బాణసంచా మోతలతో రంగలీల మైదానం దద్దరిల్లింది. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన పేరిణి, శివతాండవం, కూచిపూడి నృత్యాలు అలరించాయి. రాణిరుద్రమ వేషధారణ, జానపద గేయాలు, తెలంగాణ ఆటపాటలు భక్తులను కనువిందు చేశాయి. యువకులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. పోలీసుల బందోబస్తు.. ప్రజాప్రతినిధులు రాక ఆలస్యం కావడంతో రాత్రి 8:30 గంటలకు వేడుకలు ప్రారంభమయ్యాయి. సీపీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ శుభం ప్రకాశ్ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా పర్యవేక్షణలో మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఎస్సైలు, పోలీసుల బందోబస్తు నిర్వహించారు. ప్రశాంతమైన వాతావరణంలో దసరా సంబురాలు ముగిశాయి. -
కలెక్టరేట్లో గాంధీ జయంతి
న్యూశాయంపేట: మహాత్మాగాంధీ 156వ జయంతిని పురుస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి డీఆర్ఓ విజయలక్ష్మిలు పూలమాల వేసి నివాళర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.గాంధీ చిత్ర పటానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్, అధికారులు -
ఉర్సు గుట్ట అభివృద్ధికి కృషి చేస్తా..
రాష్ట్ర అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖిలా వరంగల్ : చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానం విస్తరణకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానంలో గురువారం రాత్రి ఆమె దసరా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో మైసూరు తర్వాత వరంగల్ రంగలీల మైదానంలో భారీగా దసరా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రంగలీల మైదానాన్ని అభివృద్ధి చేసి, మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ కోరారు. కళలు, సంస్కృతికి పుట్టినిల్లయిన ఓరుగల్లులో వైభంగా దసరా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు నగర నలుమూల నుంచి హాజరైన భక్తులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, పోశాల పద్మ, ముస్కమల్ల అరుణ, జలగం అనిత, పల్లం పద్మ, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు
పర్వతగిరి: జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. భక్తులు తొమ్మిదిరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేశారు. పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఊరేగింపులో భాగంగా దయాకర్రావు అమ్మవారి ఊరేగింపు ట్రాక్టర్ను నడిపారు. హామీలు ఏమయ్యాయని నిలదీయండి.. రాయపర్తి: రానున్న ఎన్నికల్లో ఓటు అడగడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం మండలంలోని పెర్కవేడు గ్రామంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, కుమార్గౌడ్, పూస మధు, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం
నర్సంపేట: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఈ మేరకు పట్టణంలో శుక్రవారం శ్రీకాంగ్రెస్ బాకీ కార్డ్స్శ్రీను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా నేడు, రేపు బాకీ కార్డ్స్ను పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్ని ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు బాకీ పడిందన్నారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీ, మండల కేంద్రాలు, గ్రామాల్లో వార్డుల వారీగా ప్రతీ నాయకుడు ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డ్స్ని పంపిణీ చేస్తూ విధిగా సెల్ఫీ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు కోసం వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు బాకీ కార్డు చూపించి హామీలను అమలు చేయాలని నిలదీయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో చోరీ ఖానాపురం: మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరీ జరిగిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దబ్బీర్పేట హైస్కూల్ శనివారం నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామానికి చెందిన అనూష పాఠశాలలో శుభ్రపర్చేందుకు వెళ్లగా తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి వెంటనే ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లి చూడగా కంప్యూటర్లకు సంబంధించిన రూ.30 వేల విలువ చేసే ఆరు బ్యాటరీలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుడు మధన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు. జంతుబలి నిషేధించినా.. నెక్కొండ: గాంధీ జయంతిని పురస్కరించుకొని దసరా వేడుకల్లో జంతుబలి నిషేధించిగా.. మండలంలో పలు గ్రామాల్లో పోలీసుల సమక్షంలోనే జంతు బలి యథేచ్ఛగా సాగిందని పలువురు ఆరోపిస్తున్నారు. గురువారం దసరా వేడుకల్లో భాగంగా మండలంలోని పనికర, చంద్రుగొండ, తదితర గ్రామాల్లో జంతు బలి ఇచ్చారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోనుందని పలువురు అంటున్నారు. వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈగా సత్యనారాయణను నియమిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన నేడు (శనివారం) కమిషనర్ చాహత్ బాజ్పాయ్ను కలిసి విధుల్లో చేరనున్నారు. కొద్ది నెలలుగా ఇన్చార్జ్ ఎస్ఈగా పనిచేసిన మహేందర్ ఈఈగా కొనసాగనున్నారు. హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులతోపాటు అమరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
విజయానికి ప్రతీక విజయదశమి
● ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: చెడుపై మంచి సాధించిన విజయమే దసరా పండుగ అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గురువారం దసరా సందర్భంగా పట్టణ కేంద్రంతో పాటు ఇల్లంద గ్రామంలో నిర్వహించిన రావణవధ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరై రావణవధను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ పండుగను ఆనందోత్సాహాల మధ్య ప్రతీ కుటుంబం జరుపుకోవాలన్నారు. అనంతరం గ్రామస్తులు పాలపిట్ట దర్శనం చేసుకుని జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి ఆకును తెంపుకుని పెద్దలకు పంచుతూ ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే రామాలయంలో జరిగిన పూజల్లో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, అర్చకులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లో ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ శ్రీనివాస్లు ఆయుధ పూజ నిర్వహించారు. -
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్యావాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై నిర్వహించిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు జరిపించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యావాహికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు.పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
న్యూశాయంపేట: ఎన్నికల సంఘం జారీ చేసిన నియమ, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. శుక్రవారం కలెక్టర్లో ఆమె మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని తెలిపారు. ఏదైనా అసౌకర్యం కలిగితే ప్రజలు టోల్ఫ్రీ నంబర్ 1800 425 3424, 91542 52936, 0870 2530812 నంబర్లకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రత్యేక హెల్ప్డెస్క్కు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, హెల్ప్డెస్క్లో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని, సజావుగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. మహాత్మాగాంధీకి నివాళి మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు శ్రీనివాస్రావు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు.వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద -
వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు భవనాల పరిశీలన
కాజీపేట : వరంగల్ నగరంలో పెన్షన్దారులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను మంజూరు చేసింది. ఎంపీ కడియం కావ్య ప్రత్యేక చొరవతో వెల్నెస్ సెంటర్కు అనుమతి లభించింది. కాగా ట్రైసిటీలోని కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న భవనాలతో పాటు హనుమకొండలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం, వరంగల్ నగరంలో ఉన్న భవనాలను శుక్రవారం ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి పరిశీలించారు. కాజీపేట సర్కిల్ కార్యాలయం ఆవరణలో గతంలో 30 పడకల ఆస్పత్రికి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉండటంతో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వరంగల్చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర జాగృతి వరంగల్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా నగరానికి చెందిన నూకల రాణిని నియమిస్తూ వ్యవస్థాపకురాలు కవిత ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించినందుకు రాణి కవితకు కృతజ్ఞతలు తెలిపారు. వీరన్న సన్నిధిలో భక్తుల సందడికురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామిని దర్శించుకునేందుకు క్యూలో వేచి ఉన్నారు. దసరా సందర్భంగా వాహన పూజలు అధికంగా జరిగాయి. ఆలయం ఎదుట వాహనాలు బారులుదీరి కనిపించాయి. రూ.2,50,002 ధర పలికిన దుర్గామాత పట్టుచీరమహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ పట్టణంలోని జై భవాని యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు అలంకరించిన పట్టుచీరను రూ.2,50,002 కు కాంగ్రెస్ నాయకుడు పద్మం ప్రవీణ్ కుమార్–ధనలక్ష్మి దంపతులు శుక్రవారం దక్కించుకున్నారు. దుర్గామాత భక్తులకు మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చిన సందర్భంలో అలంకరించిన పట్టుచీరను వారు కై వసం చేసుకున్నారు. -
ఉర్సుగుట్ట అభివృద్ధికి కృషి..
● రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెడుపై మంచి విజయం సాధించడమే విజయ దశమి అని, రంగలీల మైదానం విస్తరణకు కృషి చేస్తానని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగలీల మైదానంలో గురువారం రాత్రి ఆమె దసరా వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో మైసూరు తర్వాత వరంగల్ రంగలీల మైదానంలో భారీగా దసరా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రంగలీల మైదానాన్ని అభివృద్ధి చేసి, మరింత పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ కోరారు. కళలు, సంస్కృతికి పుట్టినిల్లయిన ఓరుగల్లులో వైభంగా దసరా వేడుకలు నిర్వహించడం అభినందనీయమని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. హైదరాబాద్తోపాటు నగర నలుమూలల నుంచి హాజరైన భక్తులకు ఆమె దసరా శుభాకాంక్షలు తెలిపారు. తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్లు మరుపల్లి రవి, పోశాల పద్మ, ముస్కమల్ల అరుణ, జలగం అనిత, పల్లం పద్మ, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రంగలీల మైదానంలో దహనమవుతున్న 70 అడుగుల రావణుడి ప్రతిమ -
గాంధీ మార్గం అనుసరించాలి
హన్మకొండ : మహాత్మా గాంధీ చూపిన మార్గం అనుసరణీయమని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి సీఎండీ వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ ఎంచుకున్న శాంతి, అహింసా మార్గం అందరికి మార్గదర్శనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీ చూపిన మార్గాన్ని అనుసరిస్తేనే ఆయన కలల సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న, వాటిని అధిగమించి మహాత్ముడు ఓ వ్యక్తి నుంచి మహాశక్తిలా మారాడని కొనియాడారు. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచిన మహోన్నత వ్యక్తి, జాతిపిత బాపూజీ అని పేర్కొన్నారు. ఆయన సూక్తులను స్మరించుకుంటూ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడానికి ఉద్యోగులు కంకణ బద్ధులై పనిచేయాలని పిలుపు నిచ్చారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు రాజు చౌహన్, వెంకట రమణ, సీజీఎం రవీంద్రనాథ్, జీఎం సత్యనారాయణ, డీఈలు సంపత్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్, ఏఎస్ హేమంత్ కుమార్, రమణ రెడ్డి, ఎస్ఏఓ ఎన్.ఉపేందర్ పాల్గొన్నారు. రామప్ప శిల్పకళాసంపద అద్భుతంవెంకటాపురం(ఎం) : రామప్ప శిల్పకళాసంపద అద్భుతమని టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన సతీమణి వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ విశిష్టత గురించి వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని వారు కొనియాడారు, కార్యక్రమంలో టీజీఎన్పీడీసీఎల్ ములుగు డీఈ నాగేశ్వర్రావు, విద్యుత్ అధికారులు వేణుగోపాల్, రమేష్, సాంబరాజు, సురేష్, కృష్ణాకర్తో పాటు తదితరులు పాల్గొన్నారు.టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి -
కమిషనరేట్లో ఆయుధ పూజ
వరంగల్ క్రైం: విజయదశమి పండుగను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో గురువారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ఆయుధ భాండాగారం వద్ద, ఎంటీ విభాగం, దుర్గామాతకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆయుధ పూజలు నిర్వహించారు. శమీ వృక్షానికి పూజలు నిర్వహించిన అనంతరం జమ్మి ఆకులను పోలీసు అధికారులు, సిబ్బందికి పంచి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్ కుమార్, క్రైం డీసీపీ గుణశేఖర్, అదనపు డీసీపీలు సురేశ్కుమార్, శ్రీనివాస్, ఏఎస్పీ శుభం, ఏసీపీలు నాగయ్య, మధుసూదన్, అనంతయ్య, సరేంద్ర, ఆర్ఐలు స్పర్జన్రాజ్, శ్రీనివాస్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్ఎస్సైలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
రుద్రేశ్వరాలయంలో త్రిశూల తీర్థోత్సవం
హన్మకొండ కల్చరల్ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, సందీప్శర్మ, ప్రణవ్ రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహం, త్రిశూలం, ఆయుధాలను పూజించిన అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి దేవాలయంలోని ప్రాచీన కోనేరులో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం నిర్వహించారు. అనంతరం శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి నిత్యపూజా కై ంకర్యాల కోసం దేవాలయంలో రుద్రేశ్వరుడిని సన్నిధిలో ప్రతిష్ఠించారు. త్రిశూల స్నానంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులతోపాటు అమరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, మామిడాల గణపతి, కొడిశాల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
హసన్పర్తి : కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హసన్పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయగా దయాకర్రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటీ వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు బండి రజనీకుమార్, పావుశెట్టి శ్రీధర్, విక్టర్బాబు, భగవాన్రెడ్డి, జట్టి రాజేందర్, రాణి, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం శుక్రవారం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం పూజారులు నిత్యావాహికం జరిపి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. రాత్రి శోభాయమానంగా అలంకరించిన వేదికపై నిర్వహించిన భద్రకాళిభద్రేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వీక్షించిన వందలాది మంది భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం తదితర కార్యక్రమాల అనంతరం శతఘటాభిషేకం నిర్వహించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లుకడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర తంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగల్యధారణ కార్యక్రమాలు జరిపించారు. కల్యాణం అనంతరం పుష్పయాగం చేశారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముగిసిన శరన్నవరాత్రి ఉత్సవాలు.. విజయ దశమితో దేవాలయంలో గురువారం శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఉదయం నిత్యావాహికం, కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం, చక్రతీర్థోత్సవం, ధ్వజారోహణం జరిపారు.పూజల్లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి దంపతులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పుష్పరథ సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూ రాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమాలకు గోవా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ రాణే, గోవా ఎమ్మెల్యేలు దేవ్యారాణే, ఐశ్వర్యరాణే, అరుంధతి రాణే ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం పుష్పరథసేవ నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ రామల సునీత పర్యవేక్షించారు. హన్మకొండ కల్చరల్: మహిషాసురమర్దిని అమ్మవారిని కొలిచిన వారికి సర్వశత్రు భయాలు తొలుగుతాయని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జరుగుతున్న దేవీశరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా యాగశాలలో బుధవారం మహాచండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఉత్సవమూర్తిని మహిషాసురమర్దినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. బెల్లం అన్నం, పులిహోర నైవేద్యం నివేదన చేశారు. వేదపండితులు గుదిమెళ్ల విజయకుమారాచార్యులు లోకకల్యాణార్థం గణపతినవగ్రహ సుదర్శన మహా చండీహోమం నిర్వహించారు. అనంతరం ఫలపుష్పాలు, సుగంధపరిమళ ద్రవ్యాలు, పట్టువస్త్రంతో మహాపూర్ణాహుతి చేశారు. హోమంలో శాసనమండలి వైస్చైర్మన్ బండా ప్రకాశ్ పాల్గొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ సౌజన్యంతో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. హైకోర్టు జడ్జి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, కేంద్ర పురావస్తుశాఖ తెలంగాణ రాష్ట్ర సూపరింటెండెంట్ నిఖిల్దాస్ దంపతులు పూజలు నిర్వహించారు. సాయంత్రం తిరునగరి శ్రవణ్కుమార్ భక్తిగీతాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్ పర్యవేక్షించారు. వరంగల్ డీఐఈఓ శ్రీధర్సుమన్ విద్యారణ్యపురి: జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి బోర్డు వెబ్సైట్ ద్వారా ప్రత్యేక యూనిక్ ఐడీని జారీ చేయనున్నట్లు వరంగల్ డీఐఈఓ డాక్టర్ శ్రీధర్సుమన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా స్టాఫ్ డేటా, ఎంట్రీలో ఆధార్, బ్యాంకు అకౌంట్ నంబర్, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఇంటర్బోర్డు భవిష్యత్లో నిర్వహించే పరీక్షలు మూల్యాంకనం, రెమ్యునరేషన్ చెల్లింపులు యూనిక్ ఐడీ ద్వారానే చెల్లించనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు పూర్తి వివరాలను నమోదు చేయించాలన్నారు. త్వరలో సంబంధిత డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
ఓరుగల్లు ఖ్యాతి చాటేలా ఉత్సవాలు
సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: వరంగల్ ఉర్సుగుట్ట రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా గురువారం దసరా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్న ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దాతలు 70 అడుగుల రావణుడి ప్రతిమను తయారు చేయించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖ స్విచ్ నొక్కి రావణ దహనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను అలరించనున్నాయి. ఊరేగింపుతో సీతారాములు రాక.. కరీమాబాద్లోని రంగనాథస్వామి దేవాలయం నుంచి సీతారాముల ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు అలంకరించిన ఎడ్లబండిపై ఉత్సవమూర్తులను ఉంచి భారీ ఊరేగింపుతో రంగలీల మైదానానికి తీసుకొస్తారు. అక్కడ రాముడు, రావణుడి డిజిటల్ బొమ్మలు ఏర్పాటు చేశారు. రావణుడి బొమ్మను బాణాలతో రాముడు కాల్చే ప్రక్రియ నేత్రపర్వంగా నిర్వహిస్తారు. పటిష్టమైన భద్రత.. వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో ఏఎస్పీ శుభం నేతృత్వంలో దసరా ఉత్సవాలు జరుగనున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా వేర్వేరుగా విశాలమైన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. డీసీపీ సలీమా, ఏసీపీలు, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించనున్నారు. కాగా, బుధవారం సాయంత్రం ఏఎస్సీ శుభం రంగలీల మైదానంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 10 రోజులుగా అధికారుల ఏర్పాట్లు వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ పరిధిలో దసరాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 10 రోజులుగా వివిధ శాఖల అధికారులు చేశారు. వరంగల్లోని ఉర్సు రంగలీల మైదానం, పద్మాక్ష్మిగుట్ట వద్ద విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రోడ్లను చదును చేసి తుమ్మ, పిచ్చి మొక్కలను తొలగించారు. తాత్కాలికంగా వీధిలైట్లు అమర్చారు. ప్రత్యేకంగా నాలుగు వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసినట్లు బల్దియా ఇంజనీర్లు తెలిపారు. ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు వరంగల్ క్రైం: ఉర్సు రంగలీల మైదానంలో జరిగే దసరా ఉత్సవాల సందర్భంగా గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి శుక్రవారం ఉదయం 5 గంటల వరకు ట్రైసిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ● ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా కరీంనగర్, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు పున్నేలుక్రాస్ నుంచి ఐనవోలు ఆర్చ్, వెంకటాపురం, కరుణాపురం మీదుగా వెళ్లాలి. ● కరీంనగర్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు, కొత్తపేట, ఏనుమాముల, లేబర్కాలనీ, తెలంగాణ జంక్షన్, ఫోర్ట్రోడ్డు జంక్షన్ మీదుగా వెళ్లాలి. ● హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లాల్సిన వాహనాలు కరుణాపురం, వెంకటాపురం, ఐనవోలు, పున్నేలు క్రాస్ నుంచి వెళ్లాలి. ● హనుమకొండ హంటర్ రోడ్డు నుంచి ఉర్సు గుట్టకు వచ్చే వాహనాలు కొలంబో హాస్పిటల్ ఎదుట ఉన్న గానుగ ఆయిల్ పాయింట్ దగ్గర, ఆకుతోట ఫంక్షన్హాల్, నాని గార్డెన్, జేఎస్ఎం స్కూల్లో పార్కింగ్ చేసుకోవాలి. కడిపికొండ నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● ఆర్టీఓ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు లవ్లీ ఫంక్షన్ హాల్ ఓపెన్ ప్లేస్, తాళ్ల పద్మావతి కళాశాల దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. ● కరీమాబాద్ నుంచి వచ్చే వాహనాలు బీరన్న గుడి దగ్గర పార్కింగ్ చేసుకోవాలి. రంగలీల మైదానంలో దసరాకు ఏర్పాట్లు హాజరుకానున్న లక్షలాది మంది భక్తులు ఈసారి 70 అడుగుల రావణుడి ప్రతిమ దహనం -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అది నేటికీ కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
పకడ్బందీగా ఎన్నికల నిర్వహణ
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఎన్నికల నిర్వహణకు నియమించిన జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీంతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనల మేరకు చట్టబద్ధంగా సిబ్బంది పనిచేయాల్సిన అవసరముందన్నారు. ఎన్నికల సంఘం నియమావళిని, నిబంధనలను ఆకలింపు చేసుకొని సంబంధిత విషయాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. జోనల్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, మరుగుదొడ్లు, లైటింగ్, వెబ్ కాస్టింగ్ తదితర కనీస సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని, రూట్ మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు సమన్వయంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదించాలన్నారు. పోలింగ్ సిబ్బందిని సురక్షితంగా చేర్చడం, పోలింగ్ పూర్తయిన తర్వాత మెన్ అండ్ మెటీరియన్ రిసెర్షన్ సెంటర్లో చేర్చే బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, అక్రమ ప్రచారాలు వంటి ఉల్లంఘనలపై ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు నిరంతరం నిఘా పెట్టి, తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రామిరెడ్డి, డీపీఓ కల్పన, డీబీసీడీఓ పుష్పాలత, డిప్యూటీ సీఈఓ వాసుమతి, జోనల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పాల్గొన్నారు. -
మద్యం, మాంసం ముట్టరు
దుగ్గొండి: దసరా అంటే మద్యం, మాంసం. ఇదే సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ బొడ్రాయి వద్ద గొర్రెపిల్లను బలిచ్చే ఆనవాయితీ ఉంది. కానీ, మైసంపల్లి గ్రామంలో 50 ఏళ్లుగా ఆర్య సమాజ్ పద్ధతిలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నారు. గ్రామస్తులంతా బొడ్రాయి వద్ద చలువ పందిళ్ల కింద సామూహిక హోమాలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హోమం చేసి సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిష్టగా ఉండి నేలపై పడుకుంటారు. ఆ రోజు మద్యం, మాంసం ఆ ఊరిలో నిషేధం. కనీసం ఇంట్లో మద్యం బాటిల్ కూడా ఉండనివ్వరు. కాగా, చుట్టు పక్క గ్రామాల ప్రజలు వేడుకలు చూసేందుకు వందల సంఖ్యలో తరలివస్తారు. నిష్టగా ఉంటారు.. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా ఆర్యసమాజ్ పద్ధతిలో దసరా జరుగుతోంది. అన్ని గ్రామాల్లో మద్యం, మాంసం ఏరులై పారినా మా గ్రామస్తులు దసరా పండుగ రోజున నిష్టగా ఉంటారు. కుల దైవాలు, ఇష్టదైవాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అందరూ కలిసి ఒక్కచోట చేరి హోమాలు నిర్వహిస్తాం. గ్రామం అంతా ఒక్కచోటికి వచ్చిన తరుణం చాలా సంతోషంగా ఉంటుంది. ఐకమత్యానికి అద్దం పడుతుంది. – వేముల ఇంద్రదేవ్, గ్రామస్తుడు -
వరంగల్
గురువారం శ్రీ 2 శ్రీ అక్టోబర్ శ్రీ 2025నాలుగు కత్తులు కలిస్తేనే దసరా!గీసుకొండ: ఆ గ్రామంలో నాలుగు కత్తులు ఒక చోట కలిస్తేనే దసరా. ఈ ఆచారం సంవత్సరాలుగా కొనసాగుతోంది. గ్రేటర్ 16వ డివిజన్ ధర్మారంలో 4 కుటుంబాలకు చెందిన 4 కత్తులను గ్రామంలోని ‘కచ్చీర్’కు తీసుకుని వచ్చి దసరా ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. గంగుల వీరయ్య కుటుంబం నుంచి ఒకటి, కొట్టె లక్ష్మయ్య కుటుంబం నుంచి ఒకటి, పోలెబోయిన వారి కుటుంబాల నుంచి రెండు కత్తులకు పూజలు చేసి ఇళ్ల నుంచి మందీ మార్బలంతో అట్టహాసంగా తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత ఆయుధ పూజ చేసి కత్తుల(ఆయుధాల)తో సోరకాయను కట్చేసి కంకణాలు కట్టి దసరా పండుగను జరుపుకుంటారు. కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. -
జెడ్పీ పీఠంపై కన్ను!
స్థానిక సంస్థల ఎన్నికల్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి కీలకం కానున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఖానాపురం, నర్సంపేట రూరల్ స్థానాల్లో గెలిచిన వారు జెడ్పీచైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆశీస్సుల కోసం రెండు మండలాలకు చెందిన ఎస్టీ సామాజికవర్గ నాయకులు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ప్రధానంగా సింగ్లాల్ పేరు వినిపిస్తుంది. ఈయనతో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పూల్సింగ్, సారంగం, పకీర్లతో పాటు మరికొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి. సింగ్లాల్కు జెడ్పీటీసీ అవకాశం కలిగితే చైర్మన్ పీఠం కై వసం చేసుకోవడానికి సైతం ఎమ్మెల్యే మాధవరెడ్డి మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలిసింది.నర్సంపేట: వరంగల్ జెడ్పీ చైర్మన్ పీఠంపై ఖానాపురం కన్నేసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందడానికి ఆశావహులు ఆశల పల్లకిలో తేలియాడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి బీ ఫాం కోసం ఇప్పటి నుంచే పరుగులు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆయా పార్టీల పెద్దల ఆశీస్సులు పొంది జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఎవరిని వరిస్తాయో అంటూ ఖానాపురంలో ఆసక్తి రేపుతున్నాయి. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు పొంది గెలుపు కోసం సిద్ధమవుతున్నారు. వరంగల్ జెడ్పీస్థానం ఎస్టీకి రిజర్వు కావడంతో జిల్లాలో జెడ్పీటీసీ స్థానాల్లో ఖానాపురం ఎస్టీ జనరల్, నర్సంపేట రూరల్ ఎస్టీ మహిళకు రిజర్వు అయింది. దీంతో జెడ్పీ చైర్మన్ పోటీకి నర్సంపేట నియోజకవర్గంలోని రెండు మండలాలకు మాత్రమే అవకాశం దక్కనుంది. రెండు స్థానాల నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయా పార్టీల నుంచి అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే అభ్యర్థి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి జెడ్పీటీసీగా గెలిస్తే జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకొని భవిష్యత్లో రాజకీయాల్లో క్రియాశీలకం అయ్యే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఇరుపార్టీలకు చెందిన అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకోవడానికి పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పెద్ది ప్రత్యేక దృష్టి.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖానాపురం జెడ్పీటీసీ అభ్యర్థి నియామకానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సైతం ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి జెడ్పీటీసీగా గెలుపు వరిస్తే జిల్లాలోని సమీకరణాలతో జెడ్పీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉండటంతో ఎంపిక కీలకం కానుంది. ఖానాపురం నుంచి ప్రధానంగా బాధావత్ బాలకిషన్, దబ్బీర్పేటకు చెందిన రాజు, ఐనపల్లికి చెందిన రామస్వామిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరిలో పలువురు నాయకులు తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులను మచ్చిక చేసుకొని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి వద్దకు పరుగులు పెడుతున్నారు. తమకు సీటు కేటాయించాలని పట్టుబడుతున్నట్లు తెలిసింది. దీంతో పాటు సామాజిక నాయకులతో పాటు ఆయా గ్రామాల్లోని మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి మద్దతు కూడగట్టుకోవడంతో పాటు తాయిలాల సమర్పణ సైతం మొదలు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రెండు పార్టీల నుంచి ప్రధాన అభ్యర్థులను ఎంపిక చేసి జెడ్పీచైర్మన్ పీఠం కై వసానికి అడుగులు వేస్తుండటంతో నర్సంపేట నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తి రేపుతున్న పరిస్థితి నెలకొంది. ఖానాపురం, నర్సంపేట రూరల్ జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీకి కేటాయింపు ఈ స్థానాల్లో గెలిస్తే జెడ్పీ పీఠం ఖాయం ఎమ్మెల్యే దొంతి ఆశీస్సులు ఎవరికో? బీఆర్ఎస్ నుంచి పోటీకి ఆశావహుల పోటీ ఆసక్తి రేపుతున్న ఎన్నికలు -
దసరాకు సర్వం సిద్ధం
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● నర్సంపేట అంగడి మైదానంలో రావణవధనర్సంపేట: జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వే డుకలను ఘనంగా నిర్వహించుకోనున్నారు. పలు ఆలయాల్లో షమీ పూజ, జమ్మి ఆకు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో రావణవధకు ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నర్సంపేట పట్టణంలోని అంగడి మైదానంలో జరగనున్న దసరా వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అండర్ రైల్వే గేట్ ప్రాంతంలోని ఉర్సు రంగలీల మైదానంలో ఓరుగల్లు ఖ్యాతి చాటేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. -
వినూత్నం.. విజయదశమి
గార్ల: దేశభక్తిని చాటుతూ దసరా రోజు మహబూబాబాద్ జిల్లా గార్లలో జాతీయ జెండాను ఆవిష్కరించడం ఆనవాయితీగా వస్తోంది. పండుగకు ఒకరోజు ముందు స్థానిక మసీదు సెంటర్లోని జెండా గద్దెకు రంగులు వేసి సిద్ధం చేస్తారు. ని జాం కాలంలో ప్రతీ దసరా రోజున నాటి తహసీల్దార్లు నెలవంక జెండాను ఎగురవేసేవారు. 1952లో గార్ల టౌన్ ము న్సిపల్ చైర్మన్ మాటేడి కిషన్రావు కాంగ్రెస్ జెండా ఆవిష్కరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య ఘర్షణలు జరిగాయి. మెజారిటీ కౌన్సిలర్లు కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారే ఉండడంతో వారు హైకోర్టును ఆశ్రయి ంచారు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు దేశభక్తికి చిహ్నంగా పార్టీలకు అతీతంగా దసరా రోజు జాతీయజెండాను ఎగురవేయాలని తీర్పు ఇచ్చింది. దీంతో 1958 నుంచి మాటేడి కిషన్రావు జాతీయజెండాను ఎగురవేశారు. కొన్నేళ్ల తర్వాత గార్ల మున్సిపాలిటీని మేజర్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్రథమ పౌరుడైన సర్పంచ్ దసరా రోజు జాతీయజెండా ఆవిష్కరిస్తున్నారు. గత ఏడాది సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ మంగమ్మ జెండా ఆవిష్కరించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి (దసరా)ని జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలిచిన అనంతరం ఈరోజు విశిష్ట పూజలు చేస్తారు. అయితే, ఈసారి దసరా, గాంధీ జయంతి (అహింసా దినోత్సవం) ఒకేరోజు రావడంతో ఉమ్మడి జిల్లాలో పలువురు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని తీర్మానించారు. పలు ప్రాంతాల్లో వినూత్నంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకు న్నారు. పులివేషధారణ, కత్తిసాము, విన్యాసాలు, పిట్టల దొర, బొమ్మల కొలువులు ఇలా ఎన్నోరకాలుగా పల్లెలు, పట్టణాల్లో సందడి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు (గురువారం) వినూత్నంగా నిర్వహించనున్న దసరా వేడుకలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..మైసంపల్లిలో హోమం నిర్వహిస్తున్న ప్రజలు (ఫైల్) ప్రత్యేకంగా వేడుకలు జరుపుకునేందుకు ఏర్పాట్లు మద్యం, మాంసాహారానికి పలువురు దూరం ఉమ్మడి జిల్లాలో నేడు దసరా ఉత్సవాలు -
జాతీయ జెండాల ఆవిష్కరణ
లింగాలఘణపురం: మండలంలోని నెల్లుట్ల, వనపర్తి గ్రామాల్లో దసరా ఉత్సవాల్లో జాతీయ జెండాలు ఆవిష్కరించడం ప్రత్యేకం. నెల్లుట్లలో పంచాయతీ కార్యాలయ సమీపంలోని బురుజుపై ఆనవాయితీగా జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. పూర్వం పటేల్, పట్వారీ వ్యవస్థ ఉన్న కాలంలో మాల్పటేల్ అనే వ్యక్తి విజయానికి సూచికగా దసరా పండుగకు జాతీయ జెండా ఎగురవేశారు. అదీ నేటికి కొనసాగిస్తూ ప్రస్తుతం చిట్ల వంశానికి చెందిన వారు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అదేవిధంగా వనపర్తిలో బొడ్రాయి వద్ద ఒక రాతి స్తంభానికి జెండాను కట్టి స్థానికులు ఎగుర వేస్తారు. కొన్నేళ్లుగా ఆయా గ్రామాల పెద్దలు ఉదయమే అక్కడికి వచ్చి జెండాలను ఆవిష్కరించిన అనంతరం సాయంత్రం దసరా వేడుకలు నిర్వహిస్తారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్
ఖానాపురం: యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు మండలంలోని బుధరావుపేట గ్రామానికి చెందిన లోకేష్ సెప్టెంబర్ 27, 28 తేదీల్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో యూత్ ఏసియన్ పారా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబర్చి అండర్ –80 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించాడు. దీంతో బుధవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లోకేష్ను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుబాయ్లో నిర్వహించనున్న ఏషియన్ గేమ్స్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి, రాష్ట్రానికి మరింత పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్ తరాల యువతకు ఆదర్శంగా నిలవాలన్నారు. దుగ్గొండి: మండలంలోని నాచినపల్లి గ్రామానికి చెందిన పెండ్యాల తిరుపతి–సుమలత దంపతుల కుమార్తె కావ్య నీట్ పరీక్షలో 410 మార్కులు సాధించి నిజామాబాద్ మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకుంది. టెన్త్ వరకు నర్సంపేట బిట్స్, హనుమకొండలో ఇంటర్ పూర్తి చేసింది. నీట్ రెండవ ఫేస్ కౌన్సిలింగ్లో మెడిసిన్ సీటు లభించింది. నిరుపేద కుటుంబానికి చెందిన కావ్యకు మెడిసిన్ సీటు రావడంతో గ్రామస్తులు అభినందించారు. హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదో రోజు బుధవారం అమ్మవారిని మహిషాసురమర్దినిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి శరభవాహన సేవ, శుంభహాదుర్గార్చన జరిపారు. నవరాత్రి మహోత్సవాల చండీహోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. హోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందికొండ నర్సింగరావు దంపతులు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి–నీలిమ దంపతులు, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, దేవాలయ చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: గాంధీ జయంతి సందర్భంగా గురువారం వరంగల్ మహా నగర పరిధిలో మాంసం దుకాణాలను పూర్తిగా బంద్ చేసి యాజమానులు, విక్రయదారులు, మార్కెట్ నిర్వాహకులు సహకరించాలని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కోరారు. ఈ మేరకు కమిషనర్ పేరుతో వ్యాపారులకు నోటీసులు జారీ అయ్యాయి. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతాన్ని ప్రతిఒక్కరూ గౌరవించాలని కోరారు. కోళ్లు, గొర్రెలు, మేకలు, ఎద్దులను వధించకూడదన్నారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలోని జంతు వధశాలలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆదేశాలను ధిక్కరిస్తే మున్సిపల్ చట్టం ప్రకారం తగిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. కాగా దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు కావడం, మాంసం విక్రయాల బంద్ నేపథ్యంలో మాంసం ప్రియులు బుధవారం మటన్, చికెన్ సెంటర్ల వద్ద ఎగబడ్డారు. -
మటన్, చికెన్ షాపులు తెరవొద్దు
వరంగల్ అర్బన్: దసరా పర్వదినం, గాంధీ జయంతి సందర్భంగా డ్రై డే పాటించాలని బల్దియా ప్రజారోగ్యం అధికారులు మటన్, చికెన్ నిర్వాహకులకు, వ్యాపారులకు మంగళవారం సర్క్యూలర్ జారీ చేశారు. షాపులు తెరవొద్దని, డ్రై డే తప్పనిసరిగా పాటించాలని హెచ్చరికలు చేస్తున్నారు. గిర్మాజీపేట, లక్ష్మీపురం, కాజీపేట జంతువధ శాలలను బంద్ చేస్తామని గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్ఓ రాజారెడ్డి ప్రకటించారు.ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఉండదని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకపోతే ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి, జరిమానాలు విధిస్తామని, కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఒకవైపు వైన్ షాపులు, మరోవైపు మాంసం షాపులు మూసివేస్తుండడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. కొంతమంది మాత్రం ముందస్తుగా కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు వ్యక్తంగా గొర్రెలు, మేకలు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్నారు. వ్యక్తిగతంగా ఇళ్ల వద్ద వధించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
‘స్థానిక’ ఏర్పాట్లలో నిమగ్నం
హన్మకొండ: హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఎన్నికలను సజావుగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసింది. నామినేషన్ల ఘట్టం సమీపిస్తుండడంతో ఈ దిశగా ఏర్పాట్లు చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు విడతల్లో జరగనున్నాయి. అవసరమైన సిబ్బందిని సమకూర్చుకోవడం, కావాల్సిన సదుపాయాలు ఒక్కోటి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. హనుమకొండ జిల్లా ప్రజాపరిషత్ సీఈఓ, సంబంధిత విభాగం ఉద్యోగులు, కలెక్టరేట్ ఉద్యోగులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. 631 పోలింగ్ స్టేషన్లు.. జిల్లాలో మొత్తం 3,70,871 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 1,80,666, మహిళలు 1,90,201 మంది ఉన్నారు. ఇతరులు నలుగురు ఉన్నారు. జిల్లాలో 210 గ్రామ పంచాయతీలుండగా 631 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 400లోపు ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 25, 401 నుంచి 500 ఓటర్లున్న పోలింగ్ స్టేషన్లు 67, 501 నుంచి 750 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 539 ఉన్నాయి. జెడ్పీటీసీ నామినేషన్లు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎంపీటీసీల నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్లను గుర్తించారు. జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలకు గాను నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్లు గుర్తించారు. మండలంలోని ఎంపీటీసీ సంఖ్యను బట్టి రెండు నుంచి ఆరు వరకు క్లస్టర్లు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం.. నామినేషన్ల స్వీకరణకు 58 మంది రిటర్నింగ్ అధికారులు, 58 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 500 మంది ఓటర్లలోపు ఉన్న పోలింగ్ స్టేషన్లకు ఒక ప్రిసైడింగ్ అధికారితోపాటు నలుగురు సిబ్బందిని, 500 మంది ఓటర్ల పై ఉన్న పోలింగ్ స్టేషన్ ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఐదుగురు సిబ్బందిని నియమించేలా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు 757 మంది పోలింగ్ ఆఫీసర్లను, 3,666 మంది సిబ్బందిని నియమించి శిక్షణ కూడా ఇచ్చారు. పెద్ద బ్యాలెట్ బాక్స్లు 696, మీడియం బ్యాలెట్ బాక్స్లు 232 సమకూర్చుకుంటున్నారు. జిల్లాను 40 జోన్లుగా 74 రూట్లుగా గుర్తించారు. ప్రశాంత పోలింగ్ స్టేషన్లుగా 149, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా 240, సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా 227, షైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లుగా 15 గుర్తించా రు. నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటినుంచే పూర్తి చేస్తున్నారు. ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం మరోవైపు గ్రామాల్లో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ప్రజల మద్దతు కూడగట్టడంతోపాటు పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్ పరంగా అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకుసాగుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పార్టీ గుర్తులపై జరగనుండడంతో ఎలాగైనా పార్టీ టికెట్ సాధించుకోవాలనే పట్టుదలతో అగ్రనేతల ఆశీస్సులు అందుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు హన్మకొండ: హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్ధల ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 29న షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడత పోలింగ్ అక్టోబర్ 23న. రెండో విడత అక్టోబర్ 27న జరగనుండగా నవంబర్ 11న ఓట్లు లెక్కిస్తారు. జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో మొత్తం 12 మండలాలున్నాయి. 12 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. ఇందులో మొదటి విడతల్లో ఆరు మండలాలు భీమదేవరపల్లి, ధర్మసాగర్, ఎల్కతుర్తి, హసన్పర్తి, ఐనవోలు, వేలేరు మండలాల్లోని 67 ఎంపీటీసీ స్థానాలకు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రెండో విడతలో ఆత్మకూరు, దామెర, నడికూడ, పరకాల, శాయంపేట, కమలాపూర్ మండలాల్లోని 62 ఎంపీటీసీ స్థానాలకు, ఆరు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటినుంచే ఎన్నికల ప్రణాళికలో అధికార యంత్రాంగం నామినేషన్ల స్వీకరణకు 46 క్లస్టర్లు, 58 మంది రిటర్నింగ్ అధికారులు -
సిద్ధిధాత్రి అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు సిద్ధిధాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ఖడ్గమాల, నవవర్ణ అర్చన, అలంకారం, శ్రీచక్రార్చన, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ మాట్లాడుతూ.. సిద్ధిధాత్రి రూపంలో అమ్మవారు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ్వితం, వశిత్వం అనే అష్టసిద్ధులు ప్రసాదిస్తుందని తెలియజేశారు. ఈమె కరుణతోనే పార్వతీదేవి శివుడి అర్ధ శరీరం పొందినట్లుగా పురాణ కథనం ఉందన్నారు. అమ్మవారి వాహనం సింహం, చతుర్భుజాలతో కమలంపై ఆసీనురాలై ఉంటుందన్నారు. కుడి వైపు చేతులలో శంఖం, గద, ఎడమ వైపు చేతులలో శంఖం, కమలం ఉంటుందని భక్తులకు వివరించారు. ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్ శర్మ, దేవేందర్, ఆలయ ఉద్యోగులు, భక్తులు పాల్గొన్నారు. -
తప్పుల తడకగా రిజర్వేషన్లు!
కమలాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లన్నీ తప్పులతడక అని, ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కమలాపూర్లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ సమస్యలను మొదటగా పట్టించుకునేది వార్డు స్థాయిలో వార్డు సభ్యుడు, గ్రామ స్థాయిలో గ్రామ సర్పంచ్, మండల స్థాయిలో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లని, రెండేళ్లయినా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలన్నీ వల్ల కాడులుగా మారిపోయాయన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తప్ప కింద రాజకీయ వ్యవస్థ ఎక్కడా కనిపించడం లేదన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు సౌకర్యాలు మెరుగు పర్చాలని అనేక సార్లు డిమాండ్ చేశామని, నిన్ననే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కౌన్సిల్లో, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించారో దానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఆ తీర్మానాన్ని విజయవంతం చేయడంలో తాము కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేశామని, తాము బీసీల 42 శాతం రిజర్వేషన్లకు విరుద్ధమైనోళ్లం కాదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని సీతంపేట, శ్రీరాములపేట, వాగొడ్డు రామన్నపల్లిలో కమలాపూర్ మండలంలోని గుండేడులో ఒకటో, రెండో వైశ్య కుటుంబాలు ఉన్నా అక్కడ ఓసీలకు రిజర్వ్ చేశారన్నారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఇలా ఉంటే 119 నియోజకవర్గాల్లో ఎన్ని తప్పులు దొర్లి ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలని, ఎన్నికలు నిర్వహించాలనే తాము కోరుకుంటున్నామని, తమపై బురద జల్లి దాడి చేసే ప్రయత్నం చేయవద్దన్నారు. ఇప్పటికై నా వెంటనే తాము ప్రకటించిన రిజర్వేషన్లను యఽథావిధిగా కొనసాగిస్తూ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందకు పూర్తి బాధ్యత మాదేనని ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్, బీజేపీ నాయకులు దేశిని సదానందంగౌడ్, మాడ గౌతంరెడ్డి, బండి కళాధర్, చేలిక శ్రీనివాస్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల పేరిట ఊళ్లల్లో గందరగోళం.. కావాలనే ప్రభుత్వం చేస్తోంది.... హుజూరాబాద్ నియోజకవర్గంలో రిజర్వేషన్లలో అక్రమాలు బీజేపీ నేత, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్గా రోహిత్ నేత
కమలాపూర్: మండల కేంద్రానికి చెందిన తౌటం రోహిత్ నేత ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. తౌటం సురేందర్–రాధిక దంపతుల కుమారుడు రోహిత్. తండ్రి సురేందర్ పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్, తల్లి రాధిక గృహిణి, సోదరి సౌమ్య ఉన్నత విద్య కోసం యూఎస్ఏ వెళ్లారు. రోహిత్ ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో, ఇంటర్, బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత ప్రతిభ కనబర్చిన రోహిత్ బీటెక్ పూర్తి కాగానే ఏడాది పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉద్యోగం వదిలి రెండేళ్లు సివిల్స్, గ్రూప్–1 కోసం కఠోర సాధన చేసి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్గా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వద్ద రిపోర్ట్ చేశాడు. రోహిత్ నేత మాట్లాడుతూ... ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఉద్యోగం వదిలేసినా తనను తన తల్లిదండ్రులు నిత్యం ప్రోత్సహించారని, ఉన్నత స్థితికి తన తల్లిదండ్రులే కారణమని కొనియాడాడు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన తాను బలహీన వర్గాల కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, అందుకే పేదల అభ్యున్నతి కోసం సేవ చేయాలన్నదే తన ఏకై క లక్ష్యమని, ఈ బాధ్యతను ఒక అవకాశంగా మాత్రమే కాకుండా తన పవిత్ర ధర్మంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన పరిపాలనా విధానంలో పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, యువ, మహిళా శక్తీకరణకు ప్రాధాన్యమిస్తానని తెలిపారు. -
అయినా తగ్గేదేలే..
కాజీపేట అర్బన్: మందుబాబులకు మద్యం కిక్కు, ప్రభుత్వ ఖజానాకు ఎకై ్సజ్ శాఖ వైన్స్ షాపుల టెండర్లతో కిక్కు అన్న చందంగా ఉంది. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్న లిక్కర్ సేల్స్తో ఎకై ్సజ్ శాఖ తన మార్క్ను నిలబెట్టుకుంటుంది. దీంతో మద్యం వ్యాపారాన్ని ఎంచుకున్న వారికి ఓన్లీ బెనిఫిట్స్ తప్ప లాస్ లేని బిజినెస్గా మద్యం వ్యాపారం అంటూ ఏటా మద్యం వ్యాపారాన్ని తమ బిజినెస్గా ఎంచుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టెక్స్టైల్స్తో పాటు పొలిటీషియన్లు సైతం లిక్కర్ బిజినెస్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పెరిగిన ఫీజు.. ఎకై ్సజ్ టెండర్ల ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా? అంటూ వేచి ఉండేవారు తమ లక్కు కిక్కును పరీక్షించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో రెండేళ్ల కాల పరిమితితో వచ్చే వైన్స్ టెండర్లలో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వం దరఖాస్తుల ఫీజును సైతం పెంచుకుంటూ పోతూ దరఖాస్తుల ఫీజు తగ్గేదేలే ఆదాయం తగ్గేదేలే అంటూ రేట్లు పెంచేస్తున్నారు. కాగా.. 2019–21 వరకు రూ.1 లక్ష ఉన్న దరఖాస్తు ఫీజును 2021–23, 2023–25 వరకు దరఖాస్తు ఫీజును రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలు పెంచారు. కాగా తాజాగా 2025–27 రెండేళ్ల కాలపరిమితితో వైన్స్ టెండర్లకు దరఖాస్తు ఫీజును రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. నాన్ రీఫండ్ అయినా.. ‘వైన్స్ దరఖాస్తుల ఫీజు నాన్ రీఫండ్ అయినా ఫర్వాలేదు టెండర్లలో పాల్గొంటాం’ అంటూ మద్యం వ్యాపారులు దూసుకొస్తున్నారు. రియల్, టెక్స్టైల్, పొలిటీషియన్లతో పాటు సిండికేట్ రాయుళ్లు వంద సంఖ్యలో దరఖాస్తులను వేస్తూ ఖజానాకు ఆదాయాన్ని దండిగా ఇస్తున్నారు. కాగా, వరంగల్ అర్బన్ (హనుమకొండ) జిల్లాలోని గతంలో 65 వైన్స్గాను 2023–25కు 5,859 దరఖాస్తులకుగాను రూ.117 కోట్లు ఆదాయం రాగా, ఈసారి 2025–27కు దరఖాస్తులు డబుల్ అయ్యి 250 కోట్ల ఆదాయం టార్గెట్గా వస్తుందని అంచనా. వైన్స్ దరఖాస్తుల ఫీజు రూ. లక్ష నుంచి రూ.3 లక్షలకు ఎకై ్సజ్ శాఖ టెండర్లతో ఖజానా గలగల వివరాలు ఇవీ.. సంవత్సరం దరఖాస్తులు ఆదాయం 2021–23 2,983 రూ.59 కోట్లు 2023–25 5,859 రూ.117 కోట్లు -
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్
ఐనవోలు: మండలంలోని ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నమని శివకుమార్కు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆగస్టు 29న డాక్టరేట్ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా.. మంగళవారం హైదరాబాద్లోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆడిటోరియంలొ నిర్వహించిన 26వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చాన్స్లర్ అండ్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ డాక్టరేట్ను శివకుమార్కు ప్రదానం చేశారు. తొమ్మిదో తరగతి విద్యార్థుల జీవశాస్త్ర సాధనపై జీవిత నైపుణ్యాలు, అధ్యయన అలవాట్ల ప్రభావంపై శివకుమార్ సమర్పించిన థీసిస్కు డాక్టరేట్ లభించింది. శివకుమార్ ఎమ్మెస్సీ బోటని, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎంఈడీ, పీజీ డిప్లమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, నెట్ ఇన్ ఎడ్యుకేషన్తో పాటు ప్రస్తుతం పీహెచ్డీ పూర్తి చేశారు. శివకుమార్కు ఒంటిమామిడిపల్లి గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ప్రయాణం ఇక సాఫీ!
కాజీపేట: కాజీపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మరమ్మతులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.59 లక్షలు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దాదాపు 50 ఏళ్ల కింద అప్పటి ప్రజల రవాణా కష్టాలను పరిగణనలోకి తీసుకుని నిర్మించిన బ్రిడ్జి నానాటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న రేలింగ్ ముట్టుకుంటే కూలిపోయేలా ఉంది. ఏటా ఎంతో కొంత నిధులు మంజూరు అవుతున్నప్పటికీ గోడలకు రంగులు వేయడంతోనే సరిపెడుతున్నారు. బ్రిడ్జి కింది వైపు నుంచి రాకపోకలు సాగించే వెంకటాద్రి నగర్ కాలనీవాసులకు ఈ గోడలు పెను ప్రమాదంగా మారాయి. పెళ్లలు పడి బాటసారులు స్వల్పంగా గాయపడిన ఘటనలు ఉన్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు బ్రిడ్జిపై గుంతలు పడడం సాధారణంగా మారింది. ఈ గుంతలను సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో నిత్యం రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. వాహనదారుల బాధలను చూడలేక ట్రాఫిక్ పోలీసులు జోక్యం చేసుకుని గుంతలను పూడుస్తున్నారు. స్పందించిన ఎమ్మెల్యే నాయిని కాజీపేట రైల్వే బ్రిడ్జి వల్ల కలుగుతున్న ఇబ్బందులను చూసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సమస్య తీవ్రతను సీఎం దృష్టికి తీసుకెళ్లి రూ.59 లక్షలు మంజూరు చేయించారు. ఈనిధులతో బ్రిడ్జిపై ఉన్న సమస్యలన్నింటికీ అంచనాలు తయారు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో చాలాకాలం తర్వాత బ్రిడ్జికి పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగనున్నాయని పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రూపు మార్చుకోనున్న కాజీపేట రైల్వే ఫ్లై ఓవర్ మరమ్మతులకు రూ.59 లక్షలు మంజూరు -
జూడా నాయకుల ఏకగ్రీవ ఎన్నిక
ఎంజీఎం: ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) జాతీయ ప్యానెల్లో తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) నాయకులు మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఫైమా జాతీయ కో–చైర్మన్గా డాక్టర్ దుబ్యాల శ్రీనాథ్, జాతీయ కార్యదర్శిగా డాక్టర్ ఇస్సాక్ న్యూటన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో మద్దతు ఇచ్చిన సహచర వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం తరఫున బలమైన ప్రాతినిథ్యం వహిస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వీరికి జూడా నాయకులు, వైద్య సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. న్యూశాయంపేట: మైనార్టీ పథకాల దరఖాస్తు కోసం మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే వెబ్సైట్ను పునరుద్ధరించాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాకూబ్పాషా మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రభుత్వం తీసుకొచ్చిందని పథకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 6 వరకు గడువు ఉన్నా సోమవారం నుంచి ఎలాంటి సమాచారం లేకుండా వెబ్సైట్ను నిలిపేశారన్నారు. ఈ అంశాన్ని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్లా కొత్వాల్ దృష్టికి తీసుకెళ్లగా.. ఎన్నికల కోడ్ కారణంగా సైట్ తాత్కాలికంగా ఆగిపోయిందని తెలిపారన్నారు. ఎన్నికల కోడ్ రాకముందే పథకం ప్రారంభమైనందున సైట్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఈవిద్యాసంవత్సరంలో 45 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఒక్కో పాఠశాలకు ప్రీప్రైమరీ తరగతుల విద్యాబోధనకు ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా నియామకానికి జిల్లా విద్యాశాఖ దరఖాస్తులు ఆహ్వానించింది. 45 ప్రీప్రైమరీ తరగతులకు 45 మంది ఇన్స్ట్రక్టర్లకు, 45 మంది ఆయాలకు దరఖాస్తులు స్వీకరించారు. ఇన్స్ట్రక్టర్లకు ఇంటర్ అర్హత నిర్ణయించగా.. 1,114 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. ఆయాలకు ఏడో తరగతి అర్హత ఉండగా.. 267 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఎక్కువగా దరఖాస్తులు రావడంతో కొద్ది రోజులుగా వాటిని పరిశీలించి కసరత్తు చేసి 45 మంది ఆయాలుగా ఎంపిక చేశారు. 44 మంది ఇన్స్ట్రక్టర్లను ఎంపిక చేశారు. జిల్లాలోని పెద్దకొడపాక బాలుర ప్రాథమిక పాఠశాలకు ఇన్స్ట్రక్టర్గా ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. ఈఎంపిక ప్రక్రియకు కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు. సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన ఇన్స్ట్రక్టర్ల, ఆయాల జాబితాను వెల్లడించారు. ప్రతీ నెల ఒక్కో ఇన్స్ట్రక్టర్కు రూ.8 వేలు, ఆయాకు నెలకు రూ.6 వేలు చొప్పున రెమ్యూనరేషన్ చెల్లిస్తారు. విద్యారణ్యపురి: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిని, ఉద్యోగ విరమణకు ఆరు నెలలలోపు సమయం ఉన్నవారిని మినహాయించాలని మంగళవారం తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు ఇతర బాధ్యులు జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్ను కలిసి వినతిపత్రం అందించారు. అదేవిధంగా ఏడాదిలోపు వయస్సున్న పిల్లల తల్లులకు, గర్భిణి ఉద్యోగులకు వివిధ శస్త్ర చికిత్సలు చేసుకున్నవారిని, దివ్యాంగ ఉద్యోగులకు ఈ ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. స్పందించిన లక్ష్మీరమాకాంత్ ఒక కమిటీని మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు రాజు తెలిపారు. సీనియార్టీ స్కేల్స్ ప్రాతిపదికన ఎన్నికల బాధ్యతలను అప్పగించాలని తాము కోరినట్లు రాజు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, జిల్లా కార్యదర్శి సీఎస్ఆర్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.12.9 కోట్ల అమ్మకాలు
సాక్షి, వరంగల్: జిల్లాలో మద్యం అమ్మకాలు పెరిగాయి. దసరా, గాంధీ జయంతి గురువారం రావడంతో మద్యంప్రియులు ముందస్తుగా మద్యం కొనుగోలు చేస్తున్నారు. కేవలం గత సోమవారం, మంగళవారం రోజుల్లో బీర్లు, లిక్కర్ కలిపి రూ.12.9కోట్ల మద్యం విక్రయాలు జరిగిందని ఎౖక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. రేపు (గురువారం) వైన్షాపులు బంద్ కానుండడంతో బుధవారం ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు రూ.కోట్లలో వ్యాపారం జరగనుందని అంచనా వేస్తున్నారు. రూ.50.9కోట్ల అమ్మకాలు గతేడాది దసరాకు రూ.42 కోట్ల విలువైన లిక్కర్, బీర్ల విక్రయాలు జరగగా ఈసారి ఏకంగా రూ.50.9 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎకై ్సజ్ అధికారులు చెబుతున్నారు. చాలామంది మద్యంప్రియులు పండుగ కోసం ముందే కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. మంగళవారం జిల్లాలోని పలు వైన్షాప్ల వద్ద సందడి కనిపించింది. బుధవారం కూడా ఈ తరహా వాతావరణం ఉండే అవకాశం కనబడుతోంది. మూడే దరఖాస్తులు జిల్లాలో వైన్ షాపుల దరఖాస్తుల సందడి పెద్దగా కనిపించడం లేదు. మద్యం దుకాణాల దరఖాస్తులకు నోటిఫికేషన్ వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటివరకు కేవలం మూడు దరఖాస్తులే గమనార్హం. ఓవైపు దసరా పండుగకి మందుబాబులు మందును ముందుగానే కొనేస్తుంటే.. వైన్షాపులను దక్కించుకునేందుకు ఔత్సాహికులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అయితే అక్టోబర్ 18 వరకు సమయం ఉండడం, ఆలోపు స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండడంతో అప్పుడు దరఖాస్తులు పెరగొచ్చని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో 63 మద్యం దుకాణాలు ఉన్నాయి. అయితే పెద్దగా వ్యాపారం లేవని వరంగల్ రూరల్ జిల్లా నుంచి ఆరు వైన్ షాప్లు పొరుగున ఉన్న జిల్లాలకు తరలించారు. దీంతో ఆరు వైన్ షాప్లు తగ్గడంతో ఆ సంఖ్య 57కు చేరింది. మద్యం దుకాణాల టెండర్ల కోసం ఇప్పటివరకు ఐదు దరఖాస్తులు వచ్చాయి. అది కూడా నర్సంపేటలోని వైన్స్ కోసం ఈ దరఖాస్తులొచ్చాయి. అక్టోబర్ 18 వరకు సమయం ఉండడంతో ఆ లోపు దరఖాస్తులు పెరిగే అవకాశముంది. రూ.మూడు లక్షల డీడీ, లేదా చెక్కు, పాస్పోర్ట్ సైజు ఫొటోతో పాటు రిజర్వేషన్ల ప్రకారం కులధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ కార్డు జిరాక్స్లను జతపరిచి దరఖాస్తులు అందజేయాలని వరంగల్ రూరల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.అరుణ్ కుమార్ తెలిపారు. రెండు రోజుల్లోనే పెరిగిన మద్యం అమ్మకాలు దసరా, గాంధీ జయంతి ఒకేరోజు కావడంతో ముందస్తుగా కొనుగోలు చేస్తున్న మద్యంప్రియులు -
కనువిందు చేసిన సూరీడు
దుగ్గొండి: భగ భగ మండే సూర్యుడి చుట్టూ ఓ అందమైన రూపం మంగళవారం మధ్యాహ్నం కనువిందు చేసింది. వారం రోజులుగా ముసురువానతో ఉన్న వాతావరణం మంగళవారం ఎండ వేడిమితో ఉక్కపోసింది. ఇదే తరుణంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు భగ భగ మండుతుండగా సూర్యుడి చుట్టూ ఇంద్రదనస్సు లాంటి రంగులతో కూడిన వృత్తాకార వలయం కనువిందు చేసింది. ప్రజలు ఈ అరుదైన దృశ్యాన్ని చూసి ఫొటోలు తీసుకుని ఆసక్తిగా తిలకించారు. ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి నర్సంపేట: జిల్లా కేంద్రంలో అక్టోబర్ 5వ తేదీన జరిగే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ఎం/డీఎఫ్సీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ జిల్లా ఆవిర్భావ సదస్సును విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ స్టేట్ కో ఆర్డినేటర్ ముంజాల రాజేందర్గౌడ్ కోరారు. ఈ మేరకు పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు, కుల సంఘాలు, నాయకులు, వివిధ సామాజిక నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ రామగిరి యాదగిరిస్వామి, జిల్లా నాయకులు సంగాల శివకృష్ణ, ముంజాల సంజీవకుండే, ప్రభాకర్ నల్లబెల్లి, కత్తి ఆనంద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్, పూలే స్ఫూర్తితో ముందుకు సాగాలి నర్సంపేట: గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా దేశవ్యాప్తంగా మహనీయులు నడియాడిన ప్రాంతాలను సందర్శిస్తూ అక్షరాల వ్యాప్తికి, గ్రంథాలయాల అభివృద్ధికి ముందుకు సాగుతున్నట్లు లీడ్ గ్రంథాలయం వ్యవస్థాపకుడు, ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకర్త, కవి కాసుల రవికుమార్శోభారాణి దంపతులు తెలిపారు. ఈ మేరకు ముంబాయిలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ స్మారక స్థూపం చైత్యభూమి, బాబాసాహెబ్ నివాస స్థలం రాజగృహ, పూణేలోని మహాత్మా జ్యోతి బాపూలే, సావిత్రిబాయిపూలే స్మారక స్థలాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహనీయుల ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. పేద విద్యార్థుల చదువులకు, గ్రంథాలయ ఉద్యమ వ్యాప్తికి ప్రయత్నిస్తామని తెలిపారు. యూరియా కోసం ఆందోళన పర్వతగిరి: మండలంలోని చౌటపల్లి గ్రామానికి యూరియా బస్తాలు కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయంటూ మంగళవారం రై తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సొసైటీ ఎదుట ధ ర్నా చేపట్టారు. గ్రామంలో సొసైటీకి వచ్చిన యూరియా బస్తాలను చౌటపల్లి రైతులకు ఇవ్వకుండా సొసైటీ పరిధిలోని ఇతర గ్రామాల రైతులకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొ సైటీ కార్యాలయం చౌటపల్లి గ్రామంలో ఉన్న రైతులకు యూరియా బస్తాలు అందడం లేదని మండిపడ్డారు. వెంటనే గ్రామానికి సరిపడా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు. రంగు పడింది..● ‘స్థానిక’ కోడ్ అమలులో అధికారులు సంగెం: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కూయడంతో అధికారులు అప్రమత్తం అ య్యారు. ఎన్నిక ల కోడ్ అమలు చేస్తున్నారు. గ్రామాల్లోని పలు పార్టీల జెండా గద్దెలకు రంగు వేయించడంతోపాటు ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు తొలగిస్తున్నా రు. జాతీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని పంచా యతీ కార్యదర్శులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోడ్ అమలు చేస్తున్నారు. -
పాకాలలో పర్యాటకుల సందడి
మత్తడి పోస్తున్న పాకాల సరస్సు ఖానాపురం: ఖానాపురం మండలంలోని పాకాలలో పర్యాటకుల సందడి నెలకొంది. పండుగ సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చి పాకాల మత్తడి వద్ద సందడి చేశారు. బోటింగ్ చేయడంతో పాటు లీకేజీ నీటిలో జళకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. దీంతో పాకాలలో సందడి నెలకొంది. పరవళ్లు తొక్కుతున్న పాకాల ధాన్యాగార ప్రాంతానికి ప్రధాన నీటి వ నరు పాకాల. ఈ సరస్సు ఆగస్టు 15వ తేదీ నుంచి నేటి వరకు మత్తడి పోస్తోంది. సరస్సు పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు కాగా పూర్తిస్థాయిలో నిండుకొని 47 రోజులుగా మత్తడి పోస్తుంది. కురుస్తున్న వర్షాలతో సరస్సు నిండుకుండలా ఉండటంతో మత్తడి పరవళ్లు కొనసాగుతోంది. -
రెండు విడతల్లో ఎన్నికలు
● కలెక్టర్ సత్యశారద ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం న్యూశాయంపేట: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపధ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నామినేషన్, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్హాల్లో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. అక్టోబర్ 23న మొదటి విడతలో వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 5 మండలాలు (గీసుకొండ, సంగెం, రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట), 27న రెండవ విడతలో నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాలు (చెన్నారావుపేట, దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ, నర్సంపేట, ఖానాపురం) మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులకు జిల్లాల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి విడతలో 5 మండలాల్లో 157 సర్పంచ్, 1,350 ఎంపీటీసీలకు, రెండవ విడతలో 6 మండలాల్లో 160 సర్పంచ్, 1,404 వార్డుల సభ్యులకు ఎన్నికలు జరుగుతాయన్నారు. మొత్తంగా జిల్లాలోని 317 గ్రామపంచాయతీల్లో 2,754 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించిన రోజున ఫలితాలు వెలువడతాయని, ఆ తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు ప్రతీ మూడు, నాలుగు మండలాలకు ఒక ఆర్ఓను నియమిస్తున్నామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అర్హతలు, దరవాత్తు, వివరాలు, ఎన్నికల వ్యయం నామినేషన్ ప్రక్రియ తదితర వివరాలను అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి వివరించారు. అనంతరం పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధుల సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. ఈ సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, జిల్లా అధికా రులు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన ఖిలా వరంగల్: రంగలీల మైదానంలో ఈ నెల 2న జరిగే దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామని, అందుకు తగిన ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కరీమాబాద్ ఉర్సు రంగలీల మైదానంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లను బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, డీసీపీ సలీమా, ఏఎస్పీ శుభం, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సంబంధిత అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రంగలీల మైదానంలో అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు, రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, తహసీల్దార్ ఇక్బాల్, ఇన్స్పెక్టర్ బొల్లం రమేశ్, ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు నాగపూరి సంజయ్బాబు, మేడిది మధుసూదన్, ఉపాధ్యక్షుడు గొనె రాంప్రసాద్, కోశాధికారి మండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
‘గెస్ట్’ పోలీస్ స్టేషన్!
వరంగల్ జిల్లా: గీసుకొండ పోలీస్ స్టేషన్కు ‘గెస్ట్’ పోలీస్ స్టేషన్ అనే పేరుంది (నిక్నేమ్). పోలీసు అధికారులు ఈ స్టేషన్కు అలా గెస్ట్లా వచ్చి కొన్ని రోజులు పని చేసి బదిలీపై వెళ్లిపోతుంటారు. సీఐలు అయితే మహా అంటే ఏడాది లోపు.. ఎస్సైల విషయం చెప్పాల్సిన పనే లేదు. బదిలీపై వచ్చిన ఎస్సైలు ఇక్కడ ఎన్ని నెలలు ఉంటారో లేదో తెలియదు. కొందరైతే పోస్టింగ్పై వచ్చి రెండు, మూడు నెలల లోపే బదిలీ అవుతున్నారు. గతంలో అయితే బదిలీపై వచ్చిన పోలీసు అధికారులు కనీసం ఏడాది, రెండేళ్ల వరకు విధులు నిర్వర్తించేవారు. దీంతో వారికి స్థానిక పరిస్థితులపై, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో అవగాహన కోసం అవసరమైన సమయం ఉండేది. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. వచ్చిన అధికారికి మండలంలోని గ్రామాల పేర్లు, రూట్లు, స్థానిక స్థితిగతులు తెలుసుకునే లోపే బదిలీ అవుతుండడం విశేషం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ పోలీస్ స్టేషన్కు ప్రత్యేకత ఉంది. ఈ పోలీస్ సేషన్ పరిధిలోని గీసుకొండ రూరల్ మండలంలోని గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ నగరంలోని 15,16,17 డివిజన్లు ఉన్నాయి. నివురుగప్పిన నిప్పులా ఉండే మండలంలో ప్రశాంతంగా ఉన్నట్లే కనిపించినా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయని ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన పలువురు పోలీసు అధికారులే చెబుతున్నారు.అలాంటి పరిస్థితిలో డ్యూటీలో చేరిన నెలలోపే బదిలీ చేస్తుండడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా గీసుకొండ సీఐ మహేందర్ను ఇక్కడి నుంచి పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ఇక్కడికి వచ్చి ఏడాది కూడా కాలేదు. ఆయన స్థానంలో పోలీస్ కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న డి. విశ్వేశ్వర్ను గీసుకొండకు బదిలీ చేశారు. విశ్వేశ్వర్ ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్సైగా 2012 జూలై నుంచి 2013 ఆగస్టు వరకు పని చేశారు. అప్పట్లో ఆయన పనితీరును చూసి మండల వాసులు గబ్బర్సింగ్ అని పిలిచేవారు. -
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి హాజరైన కలెక్టర్లు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ తప్పకుండా పాటిస్తూ పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆయా సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, వరంగల్ డీపీఓ కల్పన, వాసుమతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
కమిషనరేట్లో పోలీస్ అధికారుల బదిలీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలువురు పోలీస్ అధికారులను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ కంట్రోల్ రూం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న డి.విశ్వేశ్వర్ గీసుకొండకు, గీసుకొండ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఆకునూరి మహేందర్ పోలీస్ కంట్రోల్ రూంకు బదిలీ అయ్యారు. టాస్క్ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కె.వంశీకృష్ణ గీసుకొండ పోలీస్ స్టేషన్కు, సంగెంలో పని చేస్తున్న నరేశ్ను మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్కు, బి.రామారావు సుబేదారి నుంచి జఫర్గఢ్ పోలీస్ స్టేషన్నుకు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ గణితశాస్త్ర విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్గా (బీఓఎస్)గా ఆవిభాగం ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిని నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు బీఓఎస్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య కొనసాగారు. ఆమె పదవీ కాలం పూర్తి కావడంతో మల్లారెడ్డిని నియమించారు. మల్లారెడ్డి రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కేయూ వీసీ ప్రతాప్రెడ్డి బీఓఎస్ ఉత్తర్వులు మల్లారెడ్డికి అందించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ ఇన్చార్జ్ విభాగాధిపతిగా దూర విద్యా కేంద్రంలోని డాక్టర్ నల్లాని శ్రీనివాస్ను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం విద్యా కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ అండ్ హెడ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈపదవిలో నల్లాని శ్రీనివాస్ ఒక సంవత్సరం పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఉంటారని రిజిస్ట్రార్ ఉత్తర్వులో పేర్కొన్నారు. వీసీ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులను నల్లాని శ్రీనివాస్కు అందజేశారు. -
మహా దుర్గ అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఎనిమిదో రోజు సోమవారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చన, త్రిపురోపనిషత్, దేవ్యుపనిషత్ పారాయణాలు, ఆవరణ పూజ, సువాసిని పూజ, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకారాలను దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు కోరారు. కార్యక్రమంలో వేదపండితులు గట్టు పురుషోత్తం శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్ శర్మ, దేవేందర్, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధి ష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 జీపీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకు 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీస్ కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. సర్పంచ్ ఎన్నికల వివరాలు ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534తొలి, రెండో విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వివరాలువిడత నామినేషన్లు చివరి తేదీ పరిశీలన ఉపసంహరణ ఎన్నికలు ఓట్ల లెక్కింపు 1 అక్టోబర్ 9 అక్టోబర్ 11 అక్టోబర్ 12 అక్టోబర్ 15 అక్టోబర్ 23 నవంబర్ 11 2 అక్టోబర్ 13 అక్టోబర్ 15 అక్టోబర్ 16 అక్టోబర్ 19 అక్టోబర్ 27 నవంబర్ 11 1 అక్టోబర్ 17 అక్టోబర్ 19 అక్టోబర్ 20 అక్టోబర్ 23 అక్టోబర్ 31 అక్టోబర్ 31 2 అక్టోబర్ 21 అక్టోబర్ 23 అక్టోబర్ 24 అక్టోబర్ 27 నవంబర్ 4 నవంబర్ 4 3 అక్టోబర్ 25 అక్టోబర్ 27 అక్టోబర్ 28 అక్టోబర్ 31 నవంబర్ 8 నవంబర్ 8 -
పీడీఎం కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా అమృతరావు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా రోడ్డ అమృతరావును నియమిస్తూ రాష్ట్ర న్యాయ వ్యవహారాల శాఖ సెక్రెటరీ బి.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈమేరకు అమృతరావు ప్రభుత్వ సంబంధిత సివిల్ కేసులు వాదించనున్నట్లు పేర్కొన్నారు. ఈహోదాలో అతను మూడు సంవ్సరాల కాల పరిమితి లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే దాకా ఉండనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా అమృతరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, వర్ధన్నపేట అధికార ప్రతినిధి నిమ్మని శేఖర్రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ ముదాసిర్ ఖయ్యూం, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
పరకాల: పశువుల సంతలో బతుకమ్మ ఆడుతున్న మహిళలుపద్మాక్షి గుండం వద్ద బతుకమ్మలతో మహిళల కోలాహలంవరంగల్ ఆకారపు విశ్వేశ్వర దేవాలయంలో..వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ..వేయిస్తంభాల దేవాలయంలో..బతుకమ్మలతో వస్తున్న ఆడపడుచులు ఆత్మకూరు: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం సద్దుల బతుకమ్మ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులుగా యూరియా బస్తాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు మోరె మహేందర్, నాయకులు గుర్రం వేణు, స్వప్న రాజ్కుమార్, అరవింద్, శ్రీనివాస్, రాజ్కుమార్, రాజు, నగేశ్, రవి, పోశాలు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరకాల: పట్టణంలో బతుకమ్మలతో వస్తున్న మహిళలుసంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ముద్దబంతులు మురిసిపోయాయి. చామంతులు చెమక్కున మెరిశాయి. తంగేడు వనాలు బంగారు వర్ణాలయ్యాయి. అల్లిపూలు అందంగా విరిశాయి. కట్లపూలు, కనకాంబరాలు కనువిందు చేశాయి. సీతజడలు సిగ్గుపడ్డాయి. స్వస్తికాలు సంబురపడగా.. గుమ్మడి పూలు గౌరమ్మగా మారాయి. గునుగు గుభాలించగా.. మహిళల చేతుల్లో పూల శిఖరాలు పురుడుపోసుకున్నాయి. వారంతా చల్లని తల్లిని పాటలతో స్మరిస్తూ.. చప్పట్లతో గొప్పదనాన్ని వర్ణిస్తూ బతుకునివ్వమని వేడుకున్నారు. గౌరమ్మకు పూజలు చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం పద్మాక్షి దేవాలయ పరిసరాల్లో సద్దుల వేడుకలు వైభవంగా నిర్వహించారు. తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి ఆడపడుచులు ఆడిపాడి సందడి చేశారు. -
మహా దుర్గ అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా ఎనిమిదో రోజు సోమవారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రాతఃకాల అర్చన, త్రిపురోపనిషత్, దేవ్యుపనిషత్ పారాయణాలు, ఆవరణ పూజ, సువాసిని పూజ, నిత్యాహ్నికం, శ్రీ సూక్తపారాయణం, మహానివేదన, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలు ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
స్థానిక సమరానికి సై..!
వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం వివరాలుజెడ్పీలు 06జెడ్పీటీసీలు 75 ఎంపీపీలు 75 ఎంపీటీసీలు 778 సర్పంచ్లు 1,708సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు సోమవారం నగారా మోగింది. పొలిటికల్ కొలువులు ఎన్నికల ద్వారా భర్తీకి సమయం ఆసన్నమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు రెండు విడతలు.. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కానుండగా.. నవంబర్ 11న ఓట్ల లెక్కింపుతో ముగియనుంది. మొత్తం ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. వచ్చే నెల 9, 17 తేదీల్లో నోటిఫికేషన్.. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అక్టోబర్ 9 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు దశల్లో, సర్పంచ్ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడుత పోలింగ్, అదే నెల 27న రెండో విడత పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 17న సర్పంచ్ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అక్టోబర్ 31న సర్పంచ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఉంటుంది. అక్టోబర్ 21 నుంచి రెండో విడత నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 4న రెండో విడత పోలింగ్, మూడో విడత ఎన్నికలకు అక్టోబర్ 25 నుంచి నామినేషన్లు స్వీకరించి, నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తారు. ఉమ్మడి వరంగల్లోని 6 జిల్లాల్లో 6 జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీలు, 75 ఎంపీపీలు, 778 ఎంపీటీసీలు, 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు జరుగునున్నాయి. ఇందుకోసం 15,258 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 45 రోజులపాటు ఎన్నికల కోడ్ షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించా రు. మండల, జిల్లాల సరిహద్దుల్లో 25 చెక్పోస్టుల ఏర్పాటుకు పోలీసు కమిషనర్, ఎస్పీలు స్థల పరిశీలన చేశారు. సుమారు 45 రోజులు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుండగా, అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాలకు బ్రేక్ పడనుంది. నగరాలు, పట్టణాలు, పల్లెల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా పోలీసు నిషేధాజ్ఞలు అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు. గెలుపు గుర్రాల వేటలో పార్టీలు.. షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్ఎస్, బీజేపీ కూడా చాలెంజ్గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు సైతం ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ స్థానాలు, ఆరు జిల్లా పరిషత్లను గెలుచుకునేందుకు ఆ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలపై అధిష్టానం ఈ బాధ్యతలు మోపనుండగా.. బీఆర్ఎస్, బీజేపీ సైతం త్వరలోనే ఇన్చార్జ్లను నియమించనున్నాయి. ఎట్టకేలకు మోగిన ‘లోకల్’ ఎన్నికల నగారా ఎంపీటీసీ, జెడ్పీటీటీలకు రెండు విడతలు మూడు విడతల్లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ఉమ్మడి వరంగల్లో అమల్లోకి ఎన్నికల కోడ్ మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాటు. గెలుపు గుర్రాల వేటలో ప్రధాన రాజకీయ పార్టీలుజిల్లాల వారీగా జెడ్పీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, వార్డుల వివరాలుజిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులుహనుమకొండ 1 12 12 129 210 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 భూపాలపల్లి 1 12 12 109 248 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 ములుగు 1 10 10 83 171 1,520 జనగామ 1 12 12 134 280 2,534స్థానిక రిజర్వేషన్లు ఖరారు -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● ఇన్చార్డ్ డీఆర్డీఓ రాంరెడ్డి నర్సంపేట రూరల్: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జెడ్పీ సీఈఓ, ఇన్చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి హెచ్చరించారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామపంచాయతీలకు సంబంధించి 2024–25 సంవత్సరం జాతీయ ఉపాధి హామీ పనుల 16వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. పనుల్లో మస్టర్లు సక్రమంగా రాయకపోవడం, కొలతలు సరిగా తీయకపోవడం, పనిప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకపోవడం, ఒకే పనిపై రెండుసార్లు మస్టర్ల రాయడం తదితర వాటిని తనిఖీ బృందంగా గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. వీటిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సామాజిక తనిఖీల్లో రూ.46,558 రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు 3,825, ఫీల్డ్ అసిస్టెంట్లు 25,090, టెక్నికల్ అసిస్టెంట్లు 4,245, ఈసీ 1,000, ఏపీఓ 1,000, ఏఈ 1,531, ఇతరుల నుంచి 9,867 రికవరీ చేయాలని అధికారులు పేర్కొన్నారు. జిల్లా విజిలెన్స్ అధికారి అలివేలు, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి మాధవి, జిల్లా క్వాలిటీ కంట్రోల్ అధికారి పుష్పలత, డీఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్ రమేశ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ రామ్మోహన్, ఏపీఓ ఫాతిమామేరీ, పంచాయతీ కార్యదర్శులు, టీఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎఫ్ఏలు, సామాజిక తనిఖీ బృందం అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సద్దుల సంబురం
జిల్లాలో అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలుజిల్లాలో సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం రాత్రి అంబరాన్నంటాయి. మహాలయ అమావాస్య రోజు ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులపాటు మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో వాడవాడలా పూల జాతర కనులపండువగా నిర్వహించారు. మహిళలు తీరొక్క పూలు, రంగులతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సాయంత్రం కూడళ్లు, ఆలయాలు, చెరువు గట్ల వద్దకు బతుకమ్మలతో తరలివెళ్లి ఆడిపాడారు. వాయినాలు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేసి గౌరమ్మను సాగనంపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. – సాక్షి, నెట్వర్క్ -
డిప్యూటీ కలెక్టర్గా మంద అపూర్వ
హనుమకొండ: హనుమకొండకు చెందిన కాకతీయ యూనివర్సిటీ ఎకనావిుక్స్ రిటైర్డ్ ప్రొఫెసర్ మంద అశోక్కుమార్–రజినీదేవి దంపతుల కూతురు అపూర్వ గ్రూప్–1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. ఈనెల 27న హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం డిప్యూటీ కలెక్టర్గా పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్నారు. ఇప్పటికే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో–2022లో అఖిలభారత స్థాయిలో 646వ ర్యాంకు సాధించిన అపూర్వ ప్రస్తుతం ముంబైలో మినిస్ట్రీ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ఉద్యోగంచేస్తూనే గ్రూప్–1 కూడా రాసి విజయం సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. ఆమె తల్లి రజినీదేవి భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ పాఠశాలలో ప్రధానోపా«ధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అపూర్వ భర్త రఘుకార్తీక్ ప్రముఖ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. -
ఎస్టీలు లేకున్నా సర్పంచ్ స్థానం రిజర్వ్
వరంగల్: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రకటన సంగెం మండలంలో చర్చనీయాంశమైంది. జనాభా ప్రాతి పదికన కేటాయించిన రిజర్వేషన్లల్లో ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చకు దారి తీసింది. మండలంలోని ఆశాలపల్లిలో ఎస్సీ జనాభా లేకపోగా 2011లో జనాభా లెక్కల్లో జరిగి న తప్పిదంతో ప్రస్తుతం ఎస్సీ మహిళకు సర్పంచ్ రిజర్వేషన్ కేటాయించబడిందనే విషయం తెలిసిందే.. ఇలాంటిదే మరో అంశంపై తెరపైకి వచ్చింది. మండలంలోని వంజరపల్లి సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్కు కేటాయింబడింది. కానీ, ఈ గ్రామంలో ఎస్టీ ఓటర్లు లేకపోవడం గమనార్హం. వంజరపల్లి పంచాయతీ పరిధిలో గతంలో రేఖియానాయక్ తండా ఉండేది. గత 2018లో తండాలు, శివారు గ్రా మాలను నూతన పంచాయతీలుగా చేసిన సమయంలో వంజరపల్లి పరిధిలోని రేఖియానాయక్ తండాను పోచమ్మతండా పంచాయతీలో విలీనం చేశారు. అప్పట్లో రెండు వార్డులు ఎస్టీలకు కేటా యించడంతో ఎస్టీలు లేక ఆ వార్డులు ఖాళీగానే ఉ న్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేష న్లు కేటాయించడంతో ఇప్పుడు వంజరపల్లి ఎస్టీ జనరల్కు రిజర్వ్ అయింది. వంజరపల్లిలో 520 జనాభా 374 ఓటర్లుండగా ఒకరు కూడా ఎస్టీ లేకపోవడంతో సర్పంచ్ పదవి ఖాళీగా ఉండనుందా.. మార్చుతారా.. అనే చర్చ మొదలైంది. 2 -
ఒకే ఎస్సీ మహిళ! సర్పంచ్ రిజర్వేషన్తో జాక్పాట్!! కానీ..
సాక్షి, వరంగల్: మండలంలోని ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశమైంది. గ్రామంలో ఉన్న ఒకేఒక ఎస్సీ మహిళ సర్పంచ్గా ఏకగ్రీవంగా కానుంది. వివరాలిలా ఉన్నాయి. ఆశాలపల్లిలో ఎస్సీ కుటుంబాలు లేవు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ, వెంకటయ్య దంపతులు 10 సంవత్సరాల కిత్రం బతుకుదెరువు కోసం పాలేరు పనికి ఆశాలపల్లికి వచ్చారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా పెళ్లి చేశారు. మల్లమ్మ, వెంకటయ్య ఇద్దరే ఎస్సీ ఓటర్లుగా నమోదయ్యారు. కాగా, మూడు నెలల క్రితం వెంకటయ్య గేదెలను మేపడానికి వెళ్లి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా గ్రామంలో నమోదై ఉంది. ఇప్పుడు ప్రకటించిన ఆశాలపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కానుంది. దీంతో సర్పంచ్ రిజర్వేషన్ మార్చాలని కోరుతూ మాజీ సర్పంచ్ కిశోర్యాదవ్తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు రమేశ్, నాగరాజు, సంపత్, నరహరి తదితరులు డీపీఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాగా, ఒక్కసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత మార్చడానికి వీలు లేదని, మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్ కావడం ఖాయమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.అధికారులు లెక్కలు సరిచేయకపోవడంతోనే..2011 జనాభా లెక్కల ప్రకారం 1,807 జనాభా ఉంది. 350 మంది ఎస్సీలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. కానీ, వాస్తవంగా ఆ గ్రామంలో ఎస్సీలు లేరు. అధికారులు ఆ లెక్కలను సరిచేయకపోవడంతోనే రిజర్వేషన్ ఎస్సీ మహిళకు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికై జాక్పాట్ కొట్టనుంది. -
పాడి గేదె.. ఎకరం భూమితో సమానం
● కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిగీసుకొండ: ఒక పాడి గేదె.. ఎకరం భూమితో సమానమని, దాని ద్వారా సుమారు రూ.1.25 లక్షల వరకు సంపాదించవచ్చని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. కొనాయమాకుల రైతు వేదికలో గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, గీసుకొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాల తహసీల్దార్లు ఎండీ.రియాజుద్దీన్, రాజ్కుమార్, ఇక్బాల్, మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, కాంగ్రెస్ జిల్లా, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుంచి ఇప్పటి వరకు 500 మందికిపైగా కల్యాణలక్ష్మి, శాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన దానికి గుర్తుగా రేవూరి ప్రకాశ్రెడ్డి కేక్ కట్ చేశారు. -
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ స్ఫూర్తి
న్యూశాయంపేట: తెలంగాణ ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఎంతో శ్రమించారని, ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బాపూజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్తవాడ జంక్షన్లోని బాపూజీ విగ్రహానికి సంధ్యారాణితో పాటు అధికారులు పూలమాలలు వేసి శనివారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, తెలంగాణ పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమాచారమిస్తే నిఘా పెంచుతాం
నర్సంపేట: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు ఊరెళ్లే క్రమంలో ప్రజలు వారి పరిధిలోని పోలీస్స్టేషన్లలో సమాచారం ఇస్తే నిఘా పెంచుతామని నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి అన్నారు. పండుగ సమయంలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని శనివారం చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన పలు ప్రశ్నలకు ఏసీపీ సమాధానం ఇచ్చారు. ప్రశ్న: గతంలో దసరా సందర్భంగా నల్లబెల్లి మండ ల కేంద్రంలో గొడవలు జరిగాయి. అలా జరగకుండా ప్రస్తుతం ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు? – బద్రీనాథ్, నల్లబెల్లిఏసీపీ: ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పండుగ సమయంలో ఎలాంటి గొడవలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రశ్న: పండుగ పూట ఇబ్బంది కలగకుండా చూడాలి – నల్ల లింగయ్య, తొగర్రాయిఏసీపీ: పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా మండలాల పోలీస్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేస్తాం. వ్యవసాయ పనులకు వెళ్లే వారి వాహనాలకు జరిమానాలు విధించకుండా చూస్తాం. ప్రశ్న: ముందస్తు హెచ్చరికలు చేస్తారా? – మాదాసి రవి, అలంకానిపేటఏసీపీ: పండుగల సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. ప్రజలకు శాంతిభద్రతలపై అవగాహన కల్పిస్తాం. రాత్రి సమయాల్లో సైరన్తో కూడిన పెట్రోలింగ్ చేస్తూ చోరీలు, అల్లర్లు జరగకుండా చూస్తాం. ప్రశ్న: దొంగతనాల నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపడతారు? – నరేష్ – నల్లబెల్లి, రాజమౌళి – మాదన్నపేట ఏసీపీ: దొంగతనాల నియంత్రణకు బ్లూ కోట్స్ గస్తీ పెంచుతాం. పోలీసులకు స్థానిక యువకులు సైతం పోలీసులకు సహకరించాలి. దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతాం. ప్రశ్న: సీసీ కెమెరాలు పని చేయడం లేదు – చింతకింది కుమారస్వామి, నల్లబెల్లి ఏసీపీ: ప్రజలు, వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలు అదనంగా పెట్టించడంతో పాటు పనిచేయని వాటికి మరమ్మతులు చేపడతాం. రాత్రి సమయాల్లో అసాంఘిక కలాపాలను నియంత్రిస్తాం. ప్రశ్న: ఊరెళ్తే విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకోవచ్చా? – కందిక చెన్నకేశవులు, నెక్కొండ ఏసీపీ: విలువైన బంగారం, ఆభరణాలు, నగదు, ఇతర వస్తువులను బ్యాంక్ లాకర్లలో పెట్టుకుంటే మంచిది. ఊరెళ్లే ముందు పోలీసులకు సమాచారం అందిస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీ, పెట్రోలింగ్ పెంచుతాం. ప్రశ్న: సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఎలాంటి చర్యలు చేపడతారు? – మోడెం విద్యాసాగర్, తిమ్మంపేట ఏసీపీ: ప్రతీ మండలంలో సమస్యాత్మక గ్రామాలు గుర్తించాం. ఆయా గ్రామాల్లో ఘర్షణలు జరగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకునే విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. ప్రశ్న: బెల్ట్ షాపులను నియంత్రించాలి – తిరుపతి యాదవ్, బంధంపల్లి ఏసీపీ: గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను మూసివేయిస్తాం. ఎకై ్సజ్ శాఖతో కలిసి వాటి నియంత్రణకు కృషి చేస్తాం. పండుగ పూట బెల్ట్ షాపుల వల్ల ఇబ్బందులు ఏర్పడితే పోలీసులకు సమాచారం అందించాలి. ప్రశ్న: మహిళలకు అవగాహన కల్పిస్తారా? – తలారి గణేష్, మర్రిపల్లి ఏసీపీ: పండుగ సమయంలో మహిళలు ఆభరణాలు ధరిస్తే జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసుకులకు సమాచారం అందించాలి. ప్రశ్న: జీవహింసను నియంత్రిస్తారా..? – కాట శ్రీనివాస్ – జల్లి, ఈదునూరి వెంకటేశ్వర్లు – నెక్కొండ, మాలోతు బాబులాల్ – నెక్కొండఏసీపీ: దసరా పండుగ, గాంధీ జయంతి అక్టోబర్ 2న వస్తుండడంతో ప్రజలు స్వచ్ఛందంగా మద్యపానం, మాంసం విక్రయాలకు దూరంగా ఉండాలి. ఎలాంటి జీవహింసకు పాల్పడొద్దు. ప్రశ్న: హాస్టల్ పిల్లలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారా..? – మచ్చిక రాజు, మహేశ్వరం ఏసీపీ: మహేశ్వరంలో ఉన్న హాస్టల్ పిల్లలు బయట తిరగకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. హాస్టల్ ఇన్చార్జ్లతో మాట్లాడి ప్రత్యేక చర్యలు చేపడతాం. ప్రశ్న: సైబర్ క్రైంలో డబ్బులు పోతే ఎలా..? – ఆబోతు అశోక్యాదవ్, మనుబోతుల గడ్డ ఏసీపీ: సైబర్ వలలో పడి మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలి. గంటలోపు సమాచారం ఇస్తే లావాదేవీలను నిలిపివేస్తాం. ఈ క్రమంలో స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తే బాధితులకు సహకారం అందిస్తాం. ప్రశ్న: ప్రయాణికుల కష్టాలు తీరుస్తారా..? – గోర్కటి రాజ్కుమార్, వెంకటాపురం ఏసీపీ: గిర్నిబావి వద్ద ఆర్టీసీ బస్సులు పండుగ సమయంలో ఆపేవిధంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇబ్బందులను తొలగిస్తాం. ట్రాఫిక్ కానిస్టేబుల్ను అంటుబాటులో ఉంచుతాం. విలువైన వస్తువులు బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలి ఆపద సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలి ‘సాక్షి’ ఫోన్ ఇన్లో ఏసీపీ రవీందర్రెడ్డి -
జనరల్ తగ్గింది.. బీసీ పెరిగింది
సాక్షి, వరంగల్: 2011వ జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, సాంఘిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన ప్రకారం వరంగల్ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు ఐదు బీసీ, రెండు ఎస్టీ, రెండు ఎస్సీ, రెండు జనరల్ స్థానాల్లో ఐదు స్థానాలు మహిళలకు అధికారులు కేటాయించారు. 2019 ఎన్నికల రిజర్వేషన్లతో పోలిస్తే ఈసారి జెడ్పీటీసీ రిజర్వేషన్లలో నాలుగు జనరల్ స్థానాలు, ఒక ఎస్టీ రిజర్వేషన్ తగ్గగా, మూడు బీసీ స్థానాలు పెరిగాయి. గత ఎన్నికల్లో రిజర్వేషన్లు లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు కేటాయించారు. జిల్లాలో 11 ఎంపీపీ స్థానాలకు ఐదు బీసీ, రెండు ఎస్టీ, రెండు జనరల్, రెండు ఎస్సీ స్థానాల్లో ఐదు స్థానాలు మహిళలకు కేటాయించారు. ఎంపీపీ రిజర్వేషన్లను గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నాలుగు జనరల్ స్థానాలు, ఒక ఎస్టీ స్థానం తగ్గగా, మూడు బీసీ స్థానాలు పెరిగాయి. ఈసారి ఎస్సీలకు రెండు స్థానాలు కేటాయించారు. మొత్తంగా బీసీ స్థానాలు పెరిగాయి. జెడ్పీటీసీలో ఒక మహిళ స్థానం పెరిగింది జెడ్పీటీసీ రిజర్వేషన్లను పరిశీలిస్తే 2019వ సంవత్సరంలో రెండు బీసీ స్థానాలు ఉంటే ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. మూడు ఎస్టీలుంటే ఈసారి రెండు ఎస్టీలు, గతంలో రిజర్వేషన్ లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు, అప్పుడు ఆరు జనరల్ స్థానాలుండగా ఈసారి రెండింటికి పరిమితమయ్యాయి. మహిళా రిజర్వేషన్ కోటా విషయంలో 2019లో నాలుగు మహిళా స్థానాలు రిజర్వ్ కాగా, మూడు జనరల్, ఒక ఎస్టీకి కేటాయించారు. ఈసారి ఐదు మహిళా స్థానాలు రిజర్వ్ కాగా, రెండు బీసీలకు, జనరల్, ఎస్టీ, ఎస్సీలకు ఒక్కోస్థానం కేటాయించారు. మహిళలకు తగ్గిన ఎంపీపీ స్థానాలు ఎంపీపీ రిజర్వేషన్లను పరిశీలిస్తే 2019వ సంవత్సరంలో రెండు బీసీ స్థానాలుంటే ఈసారి ఆ సంఖ్య ఐదుకు పెరిగింది. మూడు ఎస్టీలుంటే ఈసారి రెండు, గతంలో రిజర్వేషన్లు లేని ఎస్సీలకు ఈసారి రెండు ఎస్సీ స్థానాలు, అప్పుడు ఆరు జనరల్ స్థానాలుంటే ఈసారి రెండు జనరల్ స్థానాలకు పరిమితమైంది. మహిళా రిజర్వేషన్ కోటాలో 2019లో ఆరు మహిళా స్థానాలు ఉండగా మూడు జనరల్, రెండు బీసీ, ఒక ఎస్టీకి కేటాయించారు. ఈసారి ఒకటి తగ్గి ఐదు స్థానాలు కేటాయించగా రెండు బీసీ, జనరల్, ఎస్టీ, ఎస్సీలకు ఒక్కో స్థానం కేటాయించారు. అంటే గతంలో మూడు జనరల్ మహిళ స్థానాలుండగా ఈసారి ఒక్క దాంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వరంగల్ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్కు కేటాయించారు. జిల్లా జెడ్పీ ప్రకారమే రిజర్వేషన్లు 2019లో జెడ్పీ ఎన్నికలు జరిగిన సమయంలో వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలు ఉండేవి. ఆ సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలో పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు ఉన్నాయి. 2021 ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లా కాస్త వరంగల్ జిల్లాగా మారింది. వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండ జిల్లాగా మారిన సమయంలో వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల, ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాలు కలిశాయి. అయినా, జెడ్పీ వరంగల్ రూరల్ జిల్లాగానే కొనసాగింది. జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం గడువు ముగిసిన తర్వాత 2024, నవంబర్ 27న జీఓఎంఎస్ నంబరు 68 ప్రకారం వరంగల్ రూరల్ను వరంగల్ జిల్లా జెడ్పీగా, వరంగల్ అర్బన్ను హనుమకొండ జిల్లా జెడ్పీగా ఏరా్పాటుచేశారు. దీంతో ఆయా జిల్లాల్లో ఉన్న సందిగ్ధతకు తెరపడినట్లైంది. దాని ప్రకారమే ఇప్పుడు రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. 2019తో పోల్చుకుంటే ఈసారి జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో మార్పు అప్పుడు ఆరు జనరల్ స్థానాలుంటే, ఇప్పుడు రెండే స్థానాలు జెడ్పీటీసీలో ఒక మహిళ స్థానం పెరగగా, ఎంపీపీలో తగ్గింది రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో కేటాయించిన అధికారులు వరంగల్ రూరల్ జెడ్పీ నుంచి వరంగల్ జెడ్పీగా ఏర్పాటు వరంగల్ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్టీ జనరల్జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్ల వివరాలుమండలం 2019 2025 చెన్నారావుపేట ఎస్టీ జనరల్ జనరల్ మహిళ దుగ్గొండి బీసీ జనరల్ జనరల్ ఖానాపురం జనరల్ మహిళ ఎస్టీ జనరల్ నల్లబెల్లి జనరల్ మహిళ బీసీ జనరల్ నర్సంపేట జనరల్ మహిళ ఎస్టీ మహిళ నెక్కొండ ఎస్టీ మహిళ బీసీ జనరల్ వర్ధన్నపేట జనరల్ ఎస్సీ మహిళ పర్వతగిరి ఎస్టీ జనరల్ బీసీ జనరల్ రాయపర్తి జనరల్ బీసీ మహిళ సంగెం బీసీ జనరల్ బీసీ మహిళ గీసుకొండ జనరల్ ఎస్సీ జనరల్ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లు మండలం 2019 2025 చెన్నారావుపేట ఎస్టీ జనరల్ జనరల్ మహిళ దుగ్గొండి బీసీ మహిళ జనరల్ గీసుకొండ జనరల్ మహిళ ఎస్సీ జనరల్ ఖానాపురం జనరల్ ఎస్టీ మహిళ నల్లబెల్లి బీసీ మహిళ బీసీ జనరల్ నర్సంపేట జనరల్ మహిళ ఎస్టీ జనరల్ నెక్కొండ ఎస్టీ జనరల్ బీసీ మహిళ వర్ధన్నపేట జనరల్ ఎస్సీ మహిళ పర్వతగిరి ఎస్టీ మహిళ బీసీ జనరల్ రాయపర్తి జనరల్ బీసీ మహిళ సంగెం జనరల్ మహిళ బీసీ జనరల్ -
అందాలకు నెలవు మన పర్యాటకం
హన్మకొండ: చరిత్రను, మన సంస్కృతిని తెలిపే గొప్ప పర్యాటక ప్రాంతాలున్న ప్రదేశం ఓరుగల్లు అని హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్ అన్నారు. శనివారం హరిత కాకతీయలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకున్నారు. రాథోడ్ రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేసి ప్రారంభించి మాట్లాడుతూ.. జిల్లా పర్యాటక రంగం అభివృద్ధికి సూచికగా ఎదుగుతోందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టూరిజం పోటెన్షియల్ ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం 60 మంది విజేతలకు రాథోడ్ రమేశ్, శివాజీ ప్రశంసపత్రాలు అందించారు. విద్యార్థులు, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సామాజిక వేత్త నిమ్మల శ్రీనివాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హరిత కాకతీయ మేనేజర్ శ్రీధర్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ట్రెజరీ ఆఫీసర్ శ్రీనివాస్, కుమారస్వామి, ధనరాజ్, కుసుమ సూర్య కిరణ్, కె.లోకేశ్వర్, డి.చిరంజీవి, శరత్, సతీశ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులకు ప్యాకేజీ టూర్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డీఈఓ వాసంతి సహకారంతో వ్యాసరచన పోటీలు నిర్వహించి, అందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రత్యేక ప్యాకేజీ టూర్ నిర్వహించారు. విద్యార్థుల కోసం వెయ్యి స్తంభాల ఆలయం, ఖిలా వరంగల్ ప్రాంతాలను చూపించి, గైడ్ సహకారంతో ఆయా ప్రాంత చరిత్రను వివరించారు. ఆర్డీఓ రాథోడ్ రమేశ్ హరిత కాకతీయలో ఘనంగా పర్యాటక ఉత్సవాలు -
పూలను పూజించే పండుగ బతుకమ్మ
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: పూలను పూజించే పండుగ బతుకమ్మ అని కలెక్టర్ స్నేహ శబరీశ్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నాయకులకు కలెక్టర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఉద్యోగినులు పెద్ద సంఖ్యలో తీరొక్క పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో కలెక్టరేట్లో సందడి చేశారు. జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని, కలెక్టరేట్లో ఘనంగా నిర్వహిచేందుకు సహకరిస్తున్న కలెక్టర్, అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆకవరపు శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ.. కలెక్టరేట్లో ప్రతీ సంవత్సరం రాష్ట్రంలో ఎడ్కడా లేని విధంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అనంతరం ఉత్తమ బతుకమ్మలకు కలెక్టర్ బహుమతులు అందజేశారు. ఐసీడీఎస్ బతుకమ్మకు ప్రథమ, డీఆర్డీఏ, హార్టికల్చ ర్వారికి సంయుక్తంగా ద్వితీయ, మిషన్ భగీరథ వారికి వారికి తృతీయ, తర్వాతి స్థానంలో నాల్గవ తరగతి ఉద్యోగుల బతుకమ్మకు లభించాయి. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు బైరి సోమయ్య, డాక్టర్ ప్రవీణ్, పుల్లూరు వేణుగోపాల్, పనికెల రాజేశ్, శ్యామ్సుందర్, మాధవరెడ్డి, వాసం శ్రీనివాస్, కత్తి రమేశ్, రామునాయక్, రాజ్యలక్మి, బోనాల మాధవి, మల్లారం అరుణ, పావని, జ్యోత్స్న, రజిత, సరస్వతి, శ్రీలత, రాజమణి, యమున, ఇందిరా ప్రియదర్శిని, విజయలక్ష్మి, లక్ష్మీప్రసాద్, రాజీవ్, అనూప్, ప్రణయ్, పృథ్వీ, నిఖిల్, అనిల్ రెడ్డి, రాజమణి, నాగరాణి పాల్గొన్నారు -
భద్రతపై భయం వద్దు..
వరంగల్ క్రైం: భద్రతపై ప్రజలు భయపడొద్దని హనుమకొండ ఏసీపీ నరసింహారావు సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. శనివారం హనుమకొండ ఏసీపీ పూనాటి నరసింహారావుతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ప్రజలు ఫోన్చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ప్రశ్న : గోపాల్పూర్లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ కనిపించడం లేదు. – డాక్టర్ కట్కూరి నరసింహ, గోపాల్పూర్ జవాబు: ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహిస్తాం. ముఖ్య కూడళ్ల వద్ద చెక్ పాయింట్లు ఉంటాయి. పెట్రోలింగ్ చేసే అధికారి కచ్చితంగా సందర్శించి రిజిస్టర్లో సంతకాలు చేస్తారు. ప్రశ్న : దసరాకు ఊరెళ్తున్నాం.. ఎవరికి సమాచారం ఇవ్వాలి? – దొమ్మటి భద్రయ్య, రేణుకాఎల్లమ్మ కాలనీ జవాబు: మీరు ఉంటున్న కాలనీ కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడకు వెళ్లి వివరాలు ఇవ్వండి. మీ ప్రాంతంలో రాత్రి పూట గస్తీని పెంచుతారు. బీరువా తాళాలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉంచరాదు. ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలి. దొంగలు కాలనీల్లో తిరిగినప్పటికీ ఇంటికి తాళం వేసినట్లు అనుమానం రాదు. ప్రశ్న : ఇంటి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ పోయింది. ఇప్పటి వరకు దొరకలేదు. – బండారి శివ, బాలసముద్రం జవాబు: రోడ్ల మీద వాహనాలను పార్కింగ్ చేయడం సరికాదు. దీంతో వాహనాలు చోరీకి గురయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇంటి ఆవరణలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలకు తాళాలు ఉంచి మరిచిపోరాదు. ప్రశ్న : మేం హైదరాబాద్ వెళ్తుండగా బ్యాగు ఎవరో దొంగిలించారు. ఇప్పటి వరకు దొరకలేదు. –సురేశ్, బాలసముద్రం జవాబు: బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వెంట తీసుకెళ్లిన బ్యాగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు ఉన్న బ్యాగును ఎట్టి పరిస్థితుల్లో పరిచయం లేని వ్యక్తులకు అప్పగించొద్దు. ముఖ్యంగా మహిళలు ఒంటిమీద ఉన్న నగలపై అప్రమత్తంగా ఉండాలి. ప్రశ్న : మా కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా? అనే అనుమానం ఉంది. – జి.కవిత జులైవాడ, పి.రమేశ్ పోస్టల్ కాలనీ జవాబు: హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 5,300, కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో 2,500, సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో 6,400 కెమెరాలు పనిచేస్తున్నాయి. దొంగలను పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చే కాలనీ ప్రజలకు పోలీసుల సహకారం ఉంటుంది. ప్రశ్న : జంక్షన్ల వద్ద ఆకతాయిలు ఉంటున్నారు. బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. –రేణుకుంట్ల రమాకాంత్, కుమార్పల్లి జవాబు : కొంతమంది యువకులు పుట్టిన రోజు వేడుకలను రాత్రి పూట రోడ్లపై చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. వెంటనే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టాం. తీరుమార్చుకోని వారిపై కేసులు కూడా నమోదు చేశాం. ఎవరికై నా ఇబ్బంది కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. ఆకతాయిల ఆట కట్టిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలు రాత్రి పూట ఎక్కడ తిరుగుతున్నారో గమనించాలి. ప్రశ్న : హనుమాన్ జంక్షన్, డబ్బాల వద్ద ఉదయం పూట ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి సరిచేయండి. – వెంకటేశ్వర్రెడ్డి, హన్మాన్ జంక్షన్ జవాబు: కచ్చితంగా ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడి సమస్య త్వరలో పరిష్కరిస్తారు. ప్రశ్న : దొంగతనం జరగకుండా ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – డాక్టర్ రహీం, గోపాల్పూర్ జవాబు: రెండు మూడు ఇళ్ల వారు కలిిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. స్మార్ట్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు తాళం తీసినా, పగులగొట్టినా వెంటనే ఫోన్కు సమాచారం వస్తుంది. దీంతో దొంగలను దొంగతనం చేయకముందే పట్టుకోవచ్చు. కాలనీల్లో ప్రజలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి సాక్షి ఫోన్ ఇన్లో హనుమకొండ ఏసీపీ నరసింహారావు -
కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకం
హన్మకొండ అర్బన్: తెలంగాణ కోసం ఉద్యమించిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం స్ఫూర్తిదాయకమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బీసీ సంక్షేమ శాఖ కలెక్టరేట్లో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి ఎంపీ కావ్య, కలెక్టర్ స్నేహ శబరీష్, అధికారులు పూలమాల వేసి నివాళుర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ బాపూజీ జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. దేశానికి బాపూజీ మహాత్మా గాంధీ అని, తెలంగాణకు బాపూజీ కొండా లక్ష్మణ్ అని పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆమోదించిందన్నారు. బీసీ భవన్, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటుకు ప్రతిపాదనలిస్తే ఎమ్మెల్యేతో కలిసి వాటి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో బీసీ భవన్ ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చందా మల్లయ్య, బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, అధికారులు, పద్మశాలి సంఘం నాయకులు గడ్డం కేశవమూర్తి, శ్యాంసుందర్ పాల్గొన్నారు. లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన న్యూశాయంపేట: కొండా లక్ష్మణ్ బాపూజీ స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర సాధన సాధ్యమైందని వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ కొత్తవాడ జంక్షన్ వద్ద బాపూజీ విగ్రహానికి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీబీసీడీఓ పుష్పలత, అధికారులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు ప్రభాకర్, నాయకులు ఎలగం సత్యనారాయణ, చిన్న కొమురయ్య, శామంతుల శ్రీనివాస్, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
అంచనాలు తారుమారు
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు నిరాశ పర్చాయి. ప్రధానంగా ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులుగా పోటీ చేయాలనుకుంటున్న వారి ఆశలు గల్లంతయ్యాయి. శనివారం ప్రకటించిన ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు వారిని పునరాలోచనలో పడేశాయి. అవకాశం ఉంటే ఇప్పటికై నా మార్పులు చేర్పులు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు.. 2019లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లకు భిన్నంగా ఉంటాయని ఆశించిన ద్వితీయశ్రేణి నాయకులకు శరాఘాతంలా మారాయి ఈ రిజర్వేషన్లు. అప్పుడు వరంగల్ అర్బన్ (హనుమకొండ)లో ఏడు మండలాలు ఉండగా.. మహిళలకు నాలుగు, జనరల్కు మూడు ఎంపీపీ స్థానాలను కేటాయించారు. వీటిలో ఎస్సీలకు రెండింటిలో ఒకటి మహిళ, ఒకటి జనరల్ (మహిళలు, పురుషులు)కు ఇచ్చారు. బీసీలకు రెండింటిలో ఒకటి మహిళకు, మరోటి జనరల్కు, అన్ రిజర్వుడ్ కోటాలోని మూడింటిలో రెండు మహిళలు, ఒకటి జనరల్కు రిజర్వు చేశారు. అదేవిధంగా వరంగల్ రూరల్గా వరంగల్ జిల్లాలో 16 మండలాలు ఉంటే.. మహిహిళలకు 7, జనరల్కు 9 కేటాయించారు. మూడు ఎస్టీల్లో ఒకటి మహిళకు, రెండు జనరల్ (మహిళలు/పురుషులు)లకు, ఎస్సీలకు కేటాయించిన మూడింటిలో ఒకటి మహిళకు, రెండు జనరల్కు రిజర్వ్ చేశారు. బీసీలకు రిజర్వ్ చేసిన రెండింటిలో ఒకటి మహిళకు, ఒకటి జనరల్కు, అన్రిజర్వుడ్ కేటగిరి కింద కేటాయించిన 8 ఎంపీపీలకు నాలుగు మహిళలకు, 4 జనరల్కు రిజర్వ్ చేశారు. అలాగే, జెడ్పీటీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి వరంగల్ రూరల్లో 16 స్థానాలకు 8 మహిళలు, 8 జనరల్కు కేటాయించారు. వరంగల్ అర్బన్లో 4 మహిళలు, మూడు జనరల్కు ఇచ్చారు. తాజా రిజర్వేషన్లు ఇలా.. 2021 ఆగస్టులో వరంగల్ అర్బన్ జిల్లా హనుమకొండగా, వరంగల్ రూరల్ జిల్లా వరంగల్గా మారిన తర్వాత మండలాలు అటు ఇటుగా మారాయి. హనుమకొండలో 15 మండలాలు కాగా, వరంగల్లో 13 మండలాలు మిగిలిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న హనుమకొండ జిల్లాలోని మండలాల నుంచి ఎంపీపీలు, జెడ్పీటీసీలు కావాలనుకున్న వారికి గత రిజర్వేషన్లకు భిన్నంగా రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎల్కతుర్తి మండలం గత ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్సీలకే రిజర్వ్ చేశారు. ఈసారి కచ్చితంగా బీసీలకు చాన్స్ ఉంటుందని అక్కడి నేతలు భావించారు. కానీ, అందుకు భిన్నంగా మళ్లీ ఎస్సీలకే రిజర్వు అయ్యాయి. జెడ్పీటీసీ రిజర్వేషన్లలో ఆత్మకూరు బీసీకి, పరకాల అన్ రిజర్వుడ్, శాయంపేట, దామెర బీసీలకు, ధర్మసాగర్, వేలేరు అన్రిజర్వుడ్ (మ), నడికూడ అన్రిజర్వుడ్, హసన్పర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి బీసీ మహిళలకు రిజర్వు చేశారు. మిగిలిన మండలాల్లోనూ ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఆశించిన మేర రాలేదన్న నిరాశ అన్ని పార్టీల కేడర్ల నుంచి వినిపిస్తోంది.హనుమకొండ జిల్లాలో రిజర్వేషన్లు ఇలా.. మండలం జెడ్పీటీసీ ఎంపీపీఆత్మకూరు బీసీ జనరల్ బీసీ జనరల్ భీమదేవరపల్లి బీసీ మహిళ బీసీ మహిళ దామెర బీసీ జనరల్ బీసీ మహిళ ధర్మసాగర్ మహిళ జనరల్ మహిళ జనరల్ ఎల్కతుర్తి ఎస్సీ జనరల్ ఎస్సీ మహిళ హసన్పర్తి ఎస్సీ మహిళ ఎస్సీ జనరల్ ఐనవోలు ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ కమలాపూర్ బీసీ మహిళ బీసీ మహిళ నడికూడ జనరల్ జనరల్ పరకాల జనరల్ జనరల్ శాయంపేట బీసీ జనరల్ బీసీ జనరల్ వేలేరు జనరల్ మహిళ జనరల్ మహిళ వరంగల్ జిల్లాలో ఇలా..చెన్నారావుపేట జనరల్ మహిళ జనరల్ మహిళ దుగ్గొండి జనరల్ జనరల్ ఖానాపురం ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళ నల్లబెల్లి బీసీ జనరల్ బీసీ జనరల్ నర్సంపేట ఎస్టీ మహిళ ఎస్టీ జనరల్ నెక్కొండ బీసీ జనరల్ బీసీ మహిళ వర్ధన్నపేట ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ పర్వతగిరి బీసీ జనరల్ బీసీ జనరల్ రాయపర్తి బీసీ మహిళ బీసీ మహిళ సంగెం బీసీ మహిళ బీసీ జనరల్ గీసుకొండ ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్ నిరాశకు గురిచేసిన స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎంపీపీ, జెడ్పీటీసీగా పోటీ చేసే వారి ఆశలు గల్లంతు మార్పులు చేయాలని నేతల చుట్టూ ప్రదక్షిణలు -
కాత్యాయని అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం మండల కేంద్రంలోని మల్లికార్జునస్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో నవశక్త్యార్చన, దుర్గా సూక్త పారాయణం, శ్రీ లలిత ఖడ్గమాల అష్టోత్తర శతనామార్చన, త్రిశతి, శ్రీచక్రార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమశర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భానుప్రసాద్, మధుశర్మ, శ్రీనివాస్, నరేశ్శర్మ, దేవేందర్, ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లాలో మోస్తరు వర్షం
నెక్కొండ మండలం సీతారాంపురంలో మత్తడి పోస్తున్న మాటు ● జలకళ సంతరించుకున్న చెరువులు, కుంటలు ● సగటు వర్షపాతం 36.61 మిల్లీమీటర్లుసాక్షి, వరంగల్: జిల్లాలో మళ్లీ వాన దంచికొట్టింది. 9 మండలాల్లో మోస్తరు వర్షం, మిగిలిన నాలుగు మండలాల్లో తేలికపాటి జల్లులు కురి శాయి. గురువారం ఉదయం 8.30 నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో 36.61 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వర్షాలతో మొక్కజొన్న చేనులోనే కంకులు మొలకలు వస్తున్నాయి. పత్తి పంట జాలువారి ఎర్రగా మా రుతోంది. దీంతో 50 శాతం మేర పంటలు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారీగా వర్షపాతం వివరాలు.. జిల్లాలో అత్యధికంగా గీసుకొండలో 59.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్లో 58.2, ఖిలా వరంగల్లో 52.8, దుగ్గొండిలో 36.5, వర్ధన్నపేటలో 34.3, నల్లబెల్లిలో 24.6, సంగెంలో 20.9, రాయపర్తిలో 16.5, ఖానాపురంలో 16.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, నర్సంపేటలో 14.5 మిల్లీమీటర్లు, చెన్నారావుపేటలో 11.8, నెక్కొండలో 10.7, పర్వతగిరిలో 9.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 816 జలాశయాల్లోకి నీరు.. ఈ నెల తొలివారంలో కురిసిన వర్షంతో అన్ని ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లావ్యాప్తంగా ఉన్న 816 జలాశయాలు నిండాయి. ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలతో వర్ధన్నపేట మండలంలోని 68 చెరువులు, రాయపర్తిలో 96 చెరువులు, నెక్కొండలో 81 చెరువులు, ఖానాపురంలో 23 చెరువులు, నర్సంపేటలోని 67 చెరువులు, చెన్నారావుపేటలోని 45 చెరువులు, పర్వతగిరిలోని 63 చెరువులు, సంగెంలోని 73 చెరువులు, నల్లబెల్లిలోని 84 చెరువులు, దుగ్గొండిలోని 73 చెరువులు, గీసుకొండలోని 76 చెరువులు, వరంగల్లో 20 చెరువులు, ఖిలావరంగల్లోని 47 చెరువుల్లో వందశాతం నీరు వచ్చి చేరిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. -
చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నెక్కొండ: భూస్వాములు, రజాకార్లను తరిమికొట్టి, దేశ్ముఖ్లకు ముచ్చెమటలు పట్టించిన ధీశాలి చాకలి (చిట్యాల) ఐలమ్మ అని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో హైస్కూల్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఐలమ్మ విగ్రహాన్ని శుక్రవారం ఎమ్మెల్యే దొంతి ఆవిష్కరించి మాట్లాడారు. వీరనారి చాకలి ఐలమ్మ అని ఆయన కొనియాడారు. తను పండించిన ధాన్యం విషయమై ప్రారంభమైన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి ఆమె ఊపిరి పోసిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఐలమ్మ కుటుంబానికి ఆంధ్రమహాసభ అండగా నిలిచిందని చెప్పారు. రజకులు ఐలమ్మ స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. నెక్కొండ చెరువు కట్టపై రజకుల కుల దైవం మడేలయ్య ఆలయ నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, విగ్రహ దాత విద్యుత్ రిటైర్డ్ ఏఈ చల్లా రఘోత్తంరెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, గ్రామ కార్యదర్శి సదానందం, కాంగ్రెస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆవుల శ్రీనివాస్, మాదాటి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు గరికపాటి హన్మంతరావు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలివ్వండి.. నిధులు తెస్తా
● ఎంపీ కడియం కావ్య ● కలెక్టరేట్లో అధికారులతో సమావేశం హన్మకొండ అర్బన్: జిల్లాలో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందిస్తే వాటి కోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో ఎంపీ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రైల్వే సంబంధిత అంశాల్ని, సమస్యల్ని తన దృష్టికి తీసుకొస్తే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వరద నీరు నిల్వకుండా తీసుకునే చర్యలపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలందించేందుకు జిల్లాకు సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరైందని పేర్కొన్నారు. అనంతరం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ప్రస్తావించారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ వైవీ గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ‘కుడా’ సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, కాజీపేట, హనుమకొండ తహసీల్దార్లు భావ్సింగ్, రవీందర్రెడ్డి, మున్సిపల్, కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా, మాజీ కార్పొరేటర్ అబూబక్కర్, అధికారులు -
పాడితోనే మహిళల ఆర్థికాభివృద్ధి
సంగెం/గీసుకొండ: పాడిపశువుల పెంపకంతోనే మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ఢిల్లీ (ఎన్ఆర్ఎల్ఎం) రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జయవర్ధన్, డాక్టర్ సిజియో అన్నారు. ఈ మేరకు సంగెం మండలంలోని గుంటూరుపల్లి, వెంకటాపూర్, గీసుకొండ మండలంలోని ఊకల్హవేలి, మరియపురం గ్రామాల్లో శుక్రవారం వారు పర్యటించారు. పాలసేకరణ, విక్రయాలు, లాభాలు ఎలా ఉన్నాయని మహిళా పాల ఉత్పత్తిదారుల సొసైటీలను అడిగి తెలుసుకున్నారు. త్వరలో పరకాల ఇందిరా క్రాంతి మహిళా డెయిరీ ద్వారా అందించనున్న గేదెలు, సేకరించే పాలు తదితరాల అంశాలపై అధ్యయనం కోసం పర్యటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ నుంచి డాక్టర్ సతీశ్, ఖమ్మం వెటర్నరీ ఏపీఓ డాక్టర్ నరసింహా, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వరలక్ష్మి, ఏపీఎంలు రాజ్కుమార్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. -
‘సీల్డ్ కవర్’లో నివేదిక!
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో ఇటీవల ఓ అధికారి మహిళా ఉద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె అధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఈఘటనపై ఏర్పాటైన ఐసీసీ కమిటీ ఎట్టకేలకు శుక్రవారం సీల్డ్ కవర్లో తుది నివేదికను కలెక్టర్కు అందజేసినట్లు సమాచారం. అసమగ్ర నివేదికపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కాగా, కలెక్టర్ ఆదేశాలతో కమిటీ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమై తాము సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదిక రూపొందించి సీల్డ్ కవర్లో కలెక్టర్లో అందజేసినట్లు తెలిసింది. పర్యవేక్షణ లేకనేనా.. కలెక్టరేట్లో ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఇలాంటి ఘటన జరగడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. అయితే సిబ్బంది పనితీరు, జరుగుతున్న వ్యవహారాలపై సరైన పర్యవేక్షణ లేకనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని తెలుస్తోంది. ఒక సెక్షన్లో జరుగుతున్న ఘటనలు సిబ్బంది పనితీరు వంటి వ్యవహారాలపై సెక్షన్ సూపరింటెండెంట్లకు కనీస సమాచారం లేకపోవడం నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. కాగా, కొన్ని సందర్భాల్లో ఉన్నతాధికారుల సూచనలు కూడా సూపరింటెండెంట్లు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్యూటీలు ఎప్పుడు ఎక్కడ ఎవరికి కేటాయించాలనే దానిపై స్పష్టత లేకపోవడం కూడా ఇలాంటి ఘటనకు కారణం అవుతుందని కలెక్టరేట్ సిబ్బంది అంటున్నారు. ప్రస్తుత ఘటనతో అయినా పర్యవేక్షకులు కళ్లు తెరిచి పాలనపై పట్టు సాధిస్తారనే నమ్మకం ఉద్యోగుల్లో లేకుండాపోయింది. చర్యలపై మీనమేషాలు కలెక్టరేట్లో జరిగిన ఘటనపై బాధితులు స్వయంగా గోడు వెళ్లబోసుకున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ దాకా వస్తే కానీ తెలియదన్నట్లుగా కొందరు అధికారుల తీరు ఉండడం విమర్శలకు తావిస్తోంది. సమావేశం ఏర్పాటు చేయండి ఇప్పటికై నా కలెక్టరేట్ ఉద్యోగులతో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తరచూ సమావేశాలు ఏర్పాటు చేసి అంతర్గత సమస్యలపై చర్చించాలని వారి నుంచి సూచనలు స్వీకరించాలని ఉద్యోగులు ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఉద్యోగులకు సూచించినట్లు తెలిసింది. ఇలాంటి కార్యక్రమాల వల్ల కొంతైనా ఫలితం ఉండొచ్చని ఉద్యోగులు అంటున్నారు. కలెక్టర్ చర్యలపై ఉత్కంఠ కలెక్టర్కు చేరిన సీల్డ్ కవర్ నివేదికపై ఉద్యోగుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ విషయంలో నిందితుడిని మరొక చోటుకు స్థానచలనం కల్పించిన కలెక్టర్.. నివేదిక రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, ప్రస్తుతం నివేదిక చేతికందడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచేనా? కలెక్టరేట్ పాలన గాడిన పడేనా? గుణపాఠం నేర్చుకుంటారా? -
ఉత్సాహంగా 2కే రన్
వరంగల్ స్పోర్ట్స్: బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికారిత సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం 2కే రన్, సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. ఈ రన్ హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, పబ్లిక్ గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా స్టేడియం చేరుకుంది. రన్, సైక్లింగ్ పోటీలను హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో స్నేహపూరిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం 2కే రన్ విజేతలు శివ, రవితేజ, ఆరోగ్యపాల్, సైక్లింగ్ విజేతలు చరణ్తేజ్, భార్గవ్, హర్శిత్కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వరంగల్ ఒలింపిక్స్ సంఘం కోశాధికారి తోట శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాయబారపు నవీన్కుమార్, దేవరకొండ ప్రభుదాస్, శ్రీమన్నారాయణ, దేవిక, కూరపాటి రమేశ్, రాజు, మహ్మద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో వైన్స్ దరఖాస్తుల స్వీకరణ
కాజీపేట అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లోని సెల్లార్లో వైన్స్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కలెక్టరేట్లోని ఎకై ్సజ్ సూపరిండెంట్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలావరంగల్ స్టేషన్ల పరిధిలో గతంలో 65 వైన్స్ ఉండగా.. వరంగల్ రూరల్ నుంచి వర్ధన్నపేట, పరకాల నుంచి రెండు వైన్స్ అదనంగా రావడంతో ప్రస్తుతం 67 వైన్స్కుగాను 2025–27 రెండేళ్ల కాలపరిమితికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు దరఖాస్తు రుసుము రూ.3 లక్షలు డీపీఈఓ పేరిట డీడీ లేదా చలాన్ను నేషనల్ బ్యాంక్ ద్వారా తీసుకుని దరఖాస్తుతో సమర్పించాలని సూచించారు. అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అక్టోబర్ 23న లక్కీ డ్రా ద్వారా వైన్స్ కేటాయింపు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్ ఎకై ్సజ్ స్టేషన్ల సీఐలు చంద్రమోహన్, దుర్గాభవాని, ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ -
స్కందమాత అలంకరణలో భ్రమరాంబిక
ఐనవోలు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో భ్రమరాంబిక అమ్మవారు స్కందమాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా ఆలయంలో నిత్యాహ్నికం, నవావర్ణ అర్చన, భావనోపనిషత్ పారాయణం, చండీ సప్తశతి పారాయణం, చండీ హవనం విశేషంగా నిర్వహించారు. మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం తదితర కార్యక్రమాలతో ఐదో రోజు కార్యక్రమాలు ముగించారు. అమ్మవారి విశేష అలంకారాలను దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ కోరారు. చండీహామంలో ఈఓ కందుల సుధాకర్, సూపరిండెంట్ అద్దంకి కిరణ్కుమార్ దంపతులు, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి, అర్చకులు నందనం భాను ప్రసాద్, మధు శర్మ, శ్రీనివాస్, నరేష్శర్మ, దేవేందర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి : డీపీఓ
సంగెం: ఎన్నికల్లో పీఓలు జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని జిల్లా పంచాయతీ అధికారి కల్ప న ఆదేశించారు. సంగెం రైతువేదికలో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం ప్రిసైడింగ్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటిస్తూ విధులు నిర్వర్తించాలన్నారు. అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు పకడ్బందీగా విధులు నిర్వర్తించేలా చూడాలని సూచించారు. ఎంపీడీఓ రవీందర్, ఏంఈఓ రాము, పీఓలు పాల్గొన్నారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు పరీక్షలు న్యూశాయంపేట: వరంగల్ ఏనుమాముల మార్కెట్యార్డు ప్రాంతంలో 184 మంది లైసెన్స్ డ్ సర్వేయర్లకు శుక్రవారం నిర్వహించిన పరీక్షలను జిల్లా అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి పరిశీలించారు. ఈనెల 27, 29 తేదీల్లో జరిగే ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ల్యాండ్ సర్వే సంచాలకులు శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు హాజరు గీసుకొండ: ఇంటర్ విద్యార్థులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) హాజరు పద్ధతి ప్రారంభించామని ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి శ్రీధర్ సుమన్ అన్నారు. శుక్రవారం గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ గుర్తింపుతో హాజరు శాతం పెరిగి అధికంగా ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి పలు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని ఆన్లైన్ తరగతులు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కె.శోభాదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు, అధ్యాపకుల సమావేశాలు విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ కళాశాల కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘డ్రంకెన్ డ్రైవ్’లో ఒకరికి జైలుదుగ్గొండి: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్షపడింది. ఎస్సై రణధీర్రెడ్డి కథనం ప్రకారం.. బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన గాదం రాజు ఈ నెల 24న సాయంత్రం మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతో ఎస్సై రణధీర్రెడ్డి కేసు నమోదు చేసి నర్సంపేట అదనపు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. రాజు కు మూడు రోజుల జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఈ మేరకు ఆయనను మహబూబా బాద్ సబ్ జైలుకు తరలించారు. కేయూ క్యాంపస్: కేయూలోని యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిరంజన్ శ్రీనివాస్, బయోటెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధికను నియమిస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాదిపాటు వీరు పదవిలో ఉంటారు. వర్సిటీలోని స్టూడెంట్స్ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ఇద్దరు బాధ్యతలు నిర్వర్తిస్తారు. బాయ్స్కు ఒకరు, గర్ల్స్కు మరొకరు యూత్ ఆఫీసర్లుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. -
పండుగ అడ్వాన్స్ ఇవ్వాలి
గీసుకొండ: జాతీయ ఆరోగ్య మిషన్ కింద పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు దసరా పండుగ అడ్వాన్స్ ఇవ్వాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేశ్ఖన్నా, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గన్నారపు రమేశ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ అనిల్కుమార్కు వారు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రతీ ఉద్యోగికి కనీసం పండుగ అడ్వాన్స్ కింద రూ. 20 వేలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు నూర సంపత్, జన్ను కొర్నేలు తదితరులు పాల్గొన్నారు. -
కారు డ్రైవర్ అదృశ్యం
సంగెం: కారు డ్రైవర్ అదృశ్యమైన ఘటన మొండ్రాయిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మొండ్రాయి గ్రామానికి చెందిన పరికి విజయ్(30) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విజయ్కి భార్య, ఓ కూతురు ఉన్నారు. దంపతులకు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆమె పుట్టింటికి వెళ్లి రావడం లేదు. వరంగల్ నగరంలో కారు డ్రైవింగ్ చేసుకుంటున్న విజయ్ అప్పుడప్పుడు ఇంటికి వస్తుపోతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి కారు డ్రైవింగ్ కోసం వెళ్లాడు. తర్వాత రెండు రోజులకు కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. విజయ్ నల్లని జీన్స్ పాయింట్, ఆకుపచ్చ టీషర్ట్ ధరించాడు. 5.4 ఎత్తు నల్లని రంగు కలిగి ఉంటాడు. విజయ్ ఆచూకీ తెలిసినవారు 8712685243, 8712685029 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై నరేశ్ కోరారు. -
ఎలుకుర్తిని సందర్శించిన అధికారులు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలిని రాష్ట్రంలోని పలు జిల్లాల డీఆర్డీఓలు, సెర్ఫ్ డైరెక్టర్లు, ఏపీ, మేఘాలయ రాష్ట్రాలకు చెందిన 42 మంది అధికారుల బృందం శుక్రవారం సందర్శించింది. స్టడీ టూర్లో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) పనితీరును పరిశీలించారు. మహిళా సాధికారత సాధించడానికి సంఘాలు ఎలా పనిచేస్తున్నాయనే విషయాలను తెలుసుకున్నారు. సంఘాల పనితీరు బాగుందని, పేదరిక నిర్మూలనకు అందిస్తున్న తోడ్పాటును బృందం సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా అధికా రులను డీఆర్డీఓ రాంరెడ్డి సన్మానించారు. అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనిల్, ఏపీఎంలు ఈశ్వర్, రాజు, సారయ్య, సీసీ శ్రీలత, వీఓలు పద్మ, స్రవంతి, లలిత, లావణ్య, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, మాజీ సర్పంచ్ పూండ్రు జైపాల్రెడ్డి, జై సంతోషిమాత గ్రామైక్య సంఘం మహిళలు, కేసీఆర్పీలు పాల్గొన్నారు.