Warangal
-
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వైవీ.గణేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలన్నారు. మొత్తం 153 దరఖాస్తులు రాగా అందులో రెడెన్యూ 59, పీడీ హౌసింగ్ 11, జీడబ్ల్యూఎంసీ 33, వివిధ శాఖలకు సంబంధించినవి 50 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ నాగపద్మజ, ఆర్డీఓ సుమ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీపీఓ కల్పన, జిల్లా అధికారులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వైవీ గణేశ్కు వినతిపత్రం ఇస్తున్న బీఆర్ఎస్వీ నేతలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలిప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వీ నేతలు అదనపు కలెక్టర్కు విన్నవించారు. బకాయిలు రాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని నిధులు విడుదల చేయాలని కోరారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ ప్రజావాణిలో 153 దరఖాస్తులు -
బంకుల్లో బారులు
జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో సోమవారం వాహనదారులు బారులుదీరారు. పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో వినియోగదారులు క్యాన్లు, డ్రమ్ములు, బాటిళ్లతో బంకులవైపు పరుగులు తీశారు. దీంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిపోయింది. కొన్ని బంకుల్లో నోస్టాక్ బోర్డులు పెట్టారు. ప్రస్తుతం పంట కోత యంత్రాలతో పాటు మక్కలు, వరి ధాన్యం చేరవేయడానికి, దుక్కులు దున్నడానికి ట్రాక్టర్లకు, జేసీబీలకు, ట్రాలీలకు, ఆటోలకు డీజిల్ అవసరం ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ కొరతతో వ్యవసాయ పనులు కుంటుపడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. – సంగెం/ఖానాపురం/రాయపర్తి/పర్వతగిరి● క్యాన్లు, డ్రమ్ములతో వినియోగదారుల కష్టాలు ● పలు బంకుల్లో నోస్టాక్ బోర్డులు -
నేర రహిత సమాజానికి కృషి
ఖానాపురం: తెలంగాణ రాష్ట్రంలో నేర రహిత సమాజ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా అన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను సోమవారం ఆమె ప్రారంభించారు. స్వయంగా ఆమె వాహనాలకు పెట్రోల్ పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డీజీ సౌమ్యామిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో జైళ్లశాఖ ఆధ్వర్యంలో 32 పెట్రోల్ బంక్లు ఉన్నాయని, ఇందులో వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలో 8 బంక్ల నిర్వహణ సాగుతుందన్నారు. జైలు జీవితాన్ని గడిపి బయటకు వచ్చిన ఖైదీలకు ఉపాధి కల్పిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 300కి బంకుల్లో ఉపాధి కల్పించినట్లు తెలిపారు. జైలు జీవితాలు గడిపిన వారు బయటకు వస్తే పనులు లభించవని, ఉపాధి కల్పిస్తే వారిలో కూడా మార్పువస్తుందన్నారు. జైళ్లశాఖ ఆధ్వర్యంలో నడిపే పెట్రోల్బంక్లపై ప్రజల్లో మంచి నమ్మకాన్ని కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ డీఐజీ సంపత్, డీసీపీ అంకిత్కుమార్, వరంగల్ జైల్ సూపరింటెండెంట్ కళాధర్, ట్రైనీ ఐపీఎస్ మనీషామెహ్రా, డిప్యూటీ జైలర్ కృష్ణకాంత్, ఐఓసీఎల్ రిటైల్ సేల్స్ మేనేజర్ శరత్బాబు, చీఫ్మేనేజర్ స్వామినాథరావు, మహిళా జైలు సూపరింటెండెంట్ స్రవంతి, సర్పంచ్ దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 300 మందికి ఉపాధి జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా -
స్వీయ గణనలో భాగస్వాములు కావాలి
నర్సంపేట: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న జనగణన 2027 డిజిటల్ సర్వే ప్రక్రియలో పట్టణ ప్రజలందరూ స్వీయగణన (సెల్ప్ ఏంయూమరేషన్) చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ అన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడారు. ప్రతీ కుటుంబం తమ మొబైల్, కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో వివరాలను స్వచ్ఛందంగా నమోదు చేసుకోవాలన్నారు. స్వీయగణన ప్ర క్రియ ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, డీవైఎస్ఓ అడిషనల్ చార్జ్ ఆఫీసర్ విజేందర్, వార్డు ఆఫీసర్లు సుష్మ, జనగణన సర్వే అధికారుల, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలినెక్కొండ: రైతులు సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్కుమార్ అన్నారు. మండలంలోని ముదిగొండ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పున్నం రంగారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రవణ్కుమార్ మాట్లాడారు. వివిధ పంటల్లో అధిక యూరియా వాడకంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల విచక్షణ రహితంగా వాడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. భూసారాన్ని కాపాడాలని, సాగు నీటిని ఆదా చేయాలన్నారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వాడాలని సూచించారు. ఈ సమావేశంలో నెక్కొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, ఏఓ నాగరాజు, ఏఈఓ నవీన్, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. మక్కల కొనుగోలులో జాప్యంపై ధర్నా చెన్నారావుపేట: మక్కల కొనుగోలులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, వెంటనే కొనుగోలులో వేగం పెంచాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. మండలకేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులు కావస్తున్న నేటికి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదని మండల పార్టీ అధ్యక్షుడు బాల్నే వెంకన్న, కన్వీనర్ జక్క అశోక్ ఆరోపించారు. వెంటనే పూర్తి స్థాయిలో మక్కల కొనుగోలు చేసి, గోదాముకు తరలించాలని లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ధర్నాతో వాహనాలు నిలిచిపోవడంతో ఎస్సై రాజేష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోని ధర్నా విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీయూ నాయకుడు రమేష్, బీఆర్ఎస్ నాయకులు వంశీ, కుమార్, మల్లయ్య, సాంబయ్య, సర్పంచులు సుదర్శన్, రమేష్, సుధాకర్, ప్రదీప్, నరేందర్, రైతులు పాల్గొన్నారు. కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవా లు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవా రం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు నిత్యాహ్నికం, డోలోత్సవం నిర్వహించారు. ఉద యం అమ్మవారి ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, సాయంత్రం అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం పద్మశాలి సంఘం వరంగల్, హనుమకొండ, గ్రేటర్ వరంగల్ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. -
మక్కల కొనుగోళ్లలో వేగం పెంచండి
నర్సంపేట: మక్కల కొనుగోళ్లలో వేగం పెంచాలని కలెక్టర్ సత్యశారద తెలిపారు. సోమవారం నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన మొక్కజొన్న నిల్వల పరిస్థితిపై ఆరాతీశారు. అనంతరం మాట్లాడుతూ మక్కల కొనుగోళ్లలో అలసత్వం వహించకుండా వెంటవెంటనే గోడౌన్లకు తరలించాలన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం నర్సంపేట వ్యవసాయ మార్కె ట్ గోదాంను సందర్శించి ఇప్పటి వరకు వచ్చిన మక్కల నిల్వల భద్రతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయాధికారి అనురాద, డీసీఓ నీరజ, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, డీఎం మార్కెటింగ్ సురేఖ, మార్క్ఫెడ్ నిరంజన్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. పిల్లల భద్రత ప్రతీఒక్కరి బాధ్యత కాశిబుగ్గ: పిల్లల భద్రత ప్రతీఒక్కరి బాధ్యతని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ ఐఎంఏ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో పె రుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, యువతను డ్రగ్స్కు పూర్తిగా దూరంగా ఉంచాలన్నారు. ఈ సందర్భంగా బాలల సంరక్షణ గృహాల్లోని పిల్లలకు వై ద్యపరీక్షలు నిర్వహించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారా ణి, డీఆర్ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, జె డ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, డీఎంహెచ్ఓ సాంబశివరావు అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారదనెక్కొండలో.. నెక్కొండ: మండలకేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితో పాటు కలెక్టర్ సత్యశారద సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో ప్రస్తుతం 60 వేల బస్తాల మక్కలు నిల్వ ఉన్నాయని, రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో కొనుగోళ్లు జరిపిస్తామన్నారు. రైతులు రవాణా, బస్తాల భారం భరించాలని, ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయన్నారు. -
సోషల్ వెల్ఫేర్ కళాశాల బిల్డింగ్ ఖాళీ చేయించాలి
వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాలకు ఐదు సంవత్సరాల క్రితం వరంగల్ రంగశాయిపేట నాయుడుపంపు జంక్షన్లో ఉన్న నా సొంతభవనాన్ని అధికారులు అద్దెకు తీసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతీ సంవత్సరం 5శాతం అద్దె పెంపు చేస్తామన్నారు. పెంపు విషయం పక్కన బెడితే అసలు ప్రతీ నెల ఇచ్చే అద్దె కూడా ఇవ్వడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేస్తే ఈనెలలో బిల్డింగ్ ఖాళీ చేస్తామన్నారు. ఇంతవరకు ఖాళీ చేయలేదు. బకాయి డబ్బులు ఇప్పించి నాకు న్యాయం చేయాలి. – కొల్లూరి యోగానంద్, బిల్డింగ్ యజమాని, రంగశాయిపేట -
డాక్యుమెంట్ రైటర్లు!
●సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లన తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్లపర్వం తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులును ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్వో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతిరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచిముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బులు వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబా బాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లేఅవుట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడులు.. సస్పెన్షన్లకు వెరవని పరిస్థితి..వరంగల్, హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.42లక్షలకు పైగా డిజిటల్ (యూపీఐ) లావాదేవీలు జరిగినట్లు ఈ నెల 2న తనిఖీలు నిర్వహించిన ఏసీబీ తేల్చింది. దావులూరి ఆనంద్ (సబ్ రిజిస్ట్రార్–2), జమాలపురం రామనర్సింహారావు (సబ్ రిజిస్ట్రార్–1)లను అరెస్టు చేసి జైలుకు పంపారు. గతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా 26 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని ఖిలా వరంగల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ను సస్పెండ్ చేశారు. భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదంలోనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్పై కూడా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి భూమి రిజిస్ట్రేషన్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా రూ.19,200లు స్వీకరిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నస్రీన్ రూ.2.94 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. 2025 నవంబర్ 28న వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ కోసం కారు డ్రైవర్ ద్వా రా రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పెద్దవంగర తహసీల్దార్, జాయింట్ రిజిస్ట్రార్ వీరగంటి మహెందర్ను ఏసీబీ పట్టుకుంది. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి నిత్యం ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైగా అవినీతి ఆరోపణలున్న వారికే సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్)లుగా పోస్టింగ్లు ఇస్తున్న ఉన్నతాధికారుల తీరుపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడిన మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
బాలికల భద్రతకు కృషి చేయాలి
● సెంట్రల్ జోన్ డీసీపీ కవిత సంగెం: బాలికల భద్రతకు సమాజంలోని ప్రతీఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని తీగరాజుపల్లిలో తెలంగాణ పోలీస్ ఉమెన్ సెఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మైచాయిస్ ఫౌండేషన్, యంగిస్తాన్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలపంచాయతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీసీపీ కవిత హాజరై మాట్లాడుతూ బాలపంచాయతీల ద్వారా బాలల్లో అవగాహన పెంపొందించి వారి హక్కులు, భద్రతపై చైతన్యం తీసుకురావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే బాలల సమస్యలను నిర్భయంగా వినిపించే వేదికగా బాల పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, ఆన్లైన్ వేధింపుల తదితర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖలు, ప్రజాప్రతినిధులు కలిసి పని చేస్తేనే బాలలకు సురక్షిత వాతావరణం కల్పించవచ్చునన్నారు. డీఆర్ఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, బాలల భద్రతకు బాల పంచాయతీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తీగరాజుపల్లిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేష్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, ఏహెచ్టీయూ సీఐ శ్యాంసుందర్, షీటీం సీఐ సుజాత, భరోసా సీఐ సువర్ణ, ఎస్సై ప్రవీణ్, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, డీఎల్పీఓ వేదవతి, ఎంపీఓ హర్షిత్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ వసుధ, జన్ను క్రాంతి, ఎర్ర శ్రీకాంత్, సహాయ, కరుణ పాల్గొన్నారు. -
సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టండి
అదనపు కలెక్టర్ ఎన్.రవి హన్మకొండ అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రవి అర్జీలు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్, రెవెన్యూ, హౌసింగ్, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 162 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని, డీఆర్ఓ సత్యపాల్రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్, నారాయణ, డీఆర్డీఓ శ్రీను పాల్గొన్నారు. -
జీపీఎస్ ఆన్లైన్ విధానం ఎత్తేయాలి
కమలాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జీపీఎస్ ఆన్లైన్ విధానం ఎత్తేసి పాత విధానంలో కొనుగోళ్లు చేపట్టాలని మండలంలోని గూడూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు రోడ్డుపై రాస్తారో కో చేశారు. అదేవిధంగా కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పలువురు రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్పర్సన్ తౌటం ఝాన్సీ రాస్తారోకో చేస్తు న్న రైతులను నచ్చజెప్పి న్యాయవాది బండి కళాధర్తో కలిసి అదనపు కలెక్టర్తో పాటు మార్క్ఫెడ్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అదనపు కలెక్టర్, మార్క్ఫెడ్ అధికారులు ఇచ్చిన హామీతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. కమలాపూర్–గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని రైతుల రాస్తారోకో అదనపు కలెక్టర్ హామీతో ఆందోళన విరమణ -
ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
ఎల్కతుర్తి: మండలంలోని బావుపేటలోని విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద సిబ్బందిని వివరాలు అడి గారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారని, అక్కడి సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడంపై నిర్వాహకులకు ఆయన పలు సూచనలిచ్చారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, నాయబ్ తహసీల్దార్ రమేశ్, నిర్వాహకులు, రైతులు ఉన్నారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
వేలేరు: మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షాలతో చేతికి అందివచ్చిన వరితో పాటు కల్లాల్లోని ధాన్యపు రాశులు తడిసి ముద్దయ్యాయి. తూకాలకు సిద్ధం చేసిన ధాన్యం బస్తాల కిందికి నీరు వచ్చింది. కేంద్రాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడుస్తున్నా.. రెండు రోజుల కిందటి నుంచే కొనుగోళ్లు ప్రారంభించారని, తీరా అకాల వర్షాలతో ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ నిర్వాహకులు పరదాలివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
కొనసాగుతున్న కల్యాణ బ్రహ్మోత్సవాలు
అమ్మవారికి భద్రపీఠ, అశ్వవాహన సేవ హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో నిత్యాహ్నికం, చతుస్థానార్చన, డోలోత్సవం నిర్వహించారు. ఉత్సవమూరిక్తి భద్రపీఠసేవ, అశ్వవాహన సేవ నిర్వహించారు. ఉదయం అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో ముఖ్య అతిథులుగా మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ దంపతులు, విశిష్ట అతిథిగా కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. వడ్నాల నరేందర్, ఆడెపు రవీందర్, బచ్చు ఆనందం, గోరంట్ల రాజు, గోరంట్ల రాజు, బేతి అశోక్, బత్తుల రమేశ్, బాబు, కుసుమ శ్యామ్, రాజేందర్, వేణు, సమ్మయ్య, కేదాసి వెంకటేశ్వర్లు, దిడ్డి రమేశ్, తుమ్మ అశోక్, వేణుగోపాల్, పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. సాయంత్రం ఎరుకల కులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. దేవర యాదగిరి, శ్రీలత దంపతులు పాల్గొన్నారు. -
ఫర్టిలైజర్స్ దుకాణాల బంద్ విజయవంతం
పరకాల: తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫర్టిలైజర్స్ దుకాణాల బంద్ను వ్యాపారస్తులు పరకాలలో సోమవారం విజయవంతంగా నిర్వహించారు. ఆల్ ఇండియా అగ్రో ఇన్పుట్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తులంతా బైక్ ర్యాలీ చేపట్టి బంద్ను విజయవంతం చేశారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో సీతారాంపూర్ గ్రామ శివారు నుంచి పరకాల బస్ డిపో వరకు చేసట్టిన ర్యాలీలో వ్యాపారస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బంద్ను విజయవంతం చేసిన వ్యాపారస్తులకు అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్లో మరెన్నో పోరాటాలు అవసరమని, ఇదే ఐక్యతను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. -
తెలంగాణ అభివృద్ధికి ప్రతీక బీఆర్ఎస్
పరకాల: స్వరాష్ట్ర సాధన కోసం పుట్టిన గులాబీ జెండా నేడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా నిలిచిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పరకాల కూరగాయల మార్కెట్ చౌరాస్తాలో పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించి ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే సత్తా కేవలం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూధన్రెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నిప్పాని సత్యనారాయణ, కొక్కిరాల రాకేశ్రావు, దుంపేటి నాగరాజు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు -
డాక్యుమెంట్ రైటర్లు!
●సాక్షిప్రతినిధి, వరంగల్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అధికారులు ప్రతీపనికో రేటును ఫిక్స్ చేసి కొందరు ప్రైవేట్ వ్యక్తులు, డాక్యుమెంట్ రైటర్లను మధ్యవర్తులుగా పెట్టుకుని వసూలు చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరిగినా కొందరు అధికారుల తీరు మారడం లేదు. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విచ్చల విడిగా వసూళ్లపర్వం సాగుతుండగా.. తాజాగా సోమవారం జనగామ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు ఏడాదిలో జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఫైళ్లను తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. వసూళ్లపర్వం తతంగం ఇలా... ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాల ద్వారా భూములు, ఇళ్లు, అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ప్రతీ రిజిస్ట్రేషన్కు లొసుగులను ఆసరా చేసుకుని వసూళ్లు చేస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రతీరోజూ 80 నుంచి 98 దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇక్కడ ప్రతీ దస్తావేజుకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు ఆఫీస్ ఖర్చుల పేరిట.. నాలా, జీపీ ఇళ్లు, అపార్ట్మెంట్లకు రూ.5వేలనుంచి రూ.50వేల వరకు వసూలు చేసినట్లు ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో వెల్లడైంది. 126 మంది డాక్యుమెంట్ రైటర్లు ఈ కార్యాలయం పరిధిలో ఉండగా, ఇద్దరు నుంచి ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు 25 మంది డాక్యుమెంట్ రైటర్లు కేవలం డబ్బుల వసూళ్లకే పెట్టుకున్నట్లు ఏసీబీ గుట్టు విప్పింది. మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు 40–50 రిజిస్ట్రేషన్లు అవుతుండగా, లే–ఔట్ లేని ప్లాట్లు గజం రూ.200ల నుంచి రూ.400ల వరకు తీసుకున్నట్లు అక్కడ జరిగిన ఏసీబీ దాడుల అనంతరం వెల్లడైంది. ఇలా వరంగల్, జనగామ, స్టేషన్ఘన్పూర్, ములుగు, భూపాలపల్లి, భీమదేవరపల్లి తదితర సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏసీబీ దాడులు.. సస్పెన్షన్లకు వెరవని వైనం..వరంగల్, హనుమకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.42 లక్షలకు పైగా డిజిటల్ (యూపీఐ) లావాదేవీలు జరిగినట్లు ఈ నెల 2న తనిఖీలు నిర్వహించిన ఏసీబీ తేల్చింది. దావులూరి ఆనంద్ (సబ్ రిజిస్ట్రార్–2), జమాలపురం రామనర్సింహారావు (సబ్ రిజిస్ట్రార్–1)లను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గతంలోనూ నిబంధనలకు విరుద్ధంగా 26 ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని ఖిలా వరంగల్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ రాజేశ్ను సస్పెండ్ చేశారు. భూముల రిజిస్ట్రేన్లకు సంబంధించిన వివాదంలోనే జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్పై కూడా అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నుంచి భూమి రిజిస్ట్రేషన్ కోసం డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా రూ.19,200 నగదు స్వీకరిస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు.. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా నస్రీన్ రూ.2.94 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. 2025 నవంబర్ 28న వారసత్వంగా వచ్చిన భూమిని రిజిస్ట్రేషన్ కోసం కారు డ్రైవర్ ద్వా రా రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా పెద్దవంగర తహసీల్దార్, జాయింట్ రిజిస్ట్రార్ వీరగంటి మహెందర్ను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి నిత్యం ఏసీబీ దాడులు, విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. పైగా అవినీతి ఆరోపణలున్న వారికే సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్)లుగా పోస్టింగ్లు ఇస్తున్న ఉన్నతాధికారుల తీరుపైనా సర్వత్రా చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కథ’నడిపించేది వీరే.. అక్రమాలకు నిలయంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉమ్మడి వరంగల్లో ఏసీబీ వరుస దాడులు.. సస్పెన్షన్ వేటు పడినా మారని తీరు విజిలెన్స్ తనిఖీలకూ వెరవని అధికారులు.. తాజాగా సోమవారం జనగామలో తనిఖీలు -
విధుల్లో చేరిన ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని
హన్మకొండ అర్బన్: శిక్షణలో భాగంగా ట్రెయినీ ఐఏఎస్ అధికారి సాయి శివాని సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో విధుల్లో చేరారు. ఈసందర్భంగా కలెక్టరేట్లో పలువురు అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణలో భాగంగా పరిపాలన, రెవెన్యూ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సేవల నిర్వహణ తదితర అంశాలపై ప్రయోగిక అవగాహన పొందేందుకు ట్రెయినీ ఐఏఎస్ సాయి శివాని వివిధ శాఖల పనితీరును పరిశీలించనున్నారు. హన్మకొండ చౌరస్తా: మే 1 నుంచి జూన్ 5 వరకు బాలబాలికలకు లలిత కళల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా బాలభవన్ సూపరింటెండెంట్ ఝాన్సీ ఒక ప్రకటనలో తెలిపారు. మృదంగం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల తరగతులు కొనసాగుతాయని, 5 నుంచి 16 సంవత్సరాల వయస్సున్న బాలబాలికలు అర్హులని తెలిపారు. వివరాలకు జిల్లా బాలభవన్, హనుమకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 99125 00516 నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. హసన్పర్తి: హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని అన్నాసాగరం క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమాయత్తమయ్యారు. అన్నాసాగర్ క్రాస్ వద్ద జంక్షన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు సోమవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి క్షేత్రస్థాయిలో జంక్షన్ ఏర్పాటు ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. క్రాస్ వద్ద జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని ‘కుడా’ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పీఓ అజిత్రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: హనుమకొండ అంబేడ్కర్ విగ్రహం ప్రాంతంలోని ఐసీఎస్ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్లో ఈనెల 30న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు డీఐఈఓ గోపాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26లో 75 శాతం ఉత్తీర్ణతతో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన బీపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఒకేషనల్ (కంప్యూటర్ సైన్స్) విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు వేతనంతోపాటు ప్రముఖ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు కూడా చేయవచ్చని, 30న ఉదయం 11:30 గంటలకు జాబ్మేళాలో విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. హన్మకొండ: కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని, సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ‘కుడా’ మాజీ చైర్మన్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మర్రి యాదవ రెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లికి పూలమాల వేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సిరాజుద్దీన్, తాళ్లపల్లి జనార్దన్, నయీముద్దీన్, శ్రీధర్రావు, ప్రశాంత్, రఘు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్నపేట : నగరంలోని మట్టెవాడ పోలీస్స్టేషన్లో పని చేస్తున్న కానిస్టేబుల్ సుమన్పై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. పోగొట్టుకున్న మొబైల్స్ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అప్పగించే నేపథ్యంలో కానిస్టేబుల్ సుమన్ డబ్బులు డిమాండ్ చేసినట్లు నెల రోజుల క్రితం బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సీపీ సన్ప్రీత్సింగ్ ఆదేశాల మేరకు విచారణ జరపగా ఆరోపణలు నిజమని తేలడంతో అతడిని సస్పెండ్ చేశారు. -
చంటయ్యపల్లిలో విద్యుత్ విపత్తు
భీమదేవరపల్లి: మండల పరిధి చంటయ్యపల్లిలో సోమవారం సాయంత్రం విద్యుత్ షార్ట్సర్క్యూట్ గ్రామస్తులను ఉలిక్కిపడేలా చేసింది. హై ఓల్టేజీ విద్యుత్ సరఫరా కావడంతో ఎలక్ట్రానిక్ పరికరాలు పేలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన నుగూరు సంపత్రెడ్డి ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. మంటల ధాటికి ఇంట్లోని టీవీలు, బట్టలు కుట్టే మిషన్లు కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పింది. గ్రామంలో సుమారు 30 నుంచి 40 విద్యుత్ మీటర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. గ్రామ పంచాయతీ వీధి దీపాలకున్న బల్బులు, కనెక్షన్లు కాలిపోయాయి. గ్రామంలోని సుమారు 15 విద్యుత్ లైన్లు పూర్తిగా కాలిపోయాయి. ప్రతీ ఇంట్లో హైవోల్టేజీ కారణంగా టీవీలు, ఫ్రిజ్జులు, వాషింగ్ మెషిన్లు, ఫ్యాన్లు కాలిపోయాయి. కాగా, ఈ ప్రమాదంపై కొత్తకొండ విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. 6.3 కేవీ లైన్ పిన్, ఇన్సులేటర్పై ఒక పక్షి వాలడం వల్ల విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఏర్పడి మీటర్లు, పరికరాలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. రూ.2 లక్షల ఆస్తి నష్టం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వ్యవసాయం, పాడి మీద ఆధారపడి జీవించే నాకు పశుగ్రాసంతో పాటు, ఇంట్లో ఉన్న కుట్టు మిషన్, వాషింగ్ మిషన్, టీవీ, విద్యుత్ మీటర్, వైర్లు, ఎలక్ట్రానిక్ సంబంధిత పరికరాలు మొత్తం ధ్వంసమయ్యాయి. సుమారు రూ.2 లక్షలు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. – సంపత్ రెడ్డి, రైతు, చంటయ్యపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో భారీ నష్టం ఎలక్ట్రానిక్ పరికరాలు, విద్యుద్దీపాలు దగ్ధం -
కోతులు వర్సెస్ కుక్కలు భీకర ఘర్షణ
పావు గంట సేపు కొట్లాట.. స్థానికుల బెంబేలు వరంగల్లోని 14వ డివిజన్ న్యూ లక్ష్మీ గణపతి కాలనీలో శనివారం ఉదయం ఇళ్ల నడుమ కోతులు, కుక్కల గుంపు కాళ్లు దువ్వుకున్నాయి. పదుల సంఖ్యలో చేరిన ఇరు జాతులు కొట్లాటకు దిగాయి. సుమారు పావుగంటపాటు వీటి ఆగ్రహావేశాలను చూసిన స్థానికులు ఇళ్లకు తలుపులు బిగించుకున్నారు. వీటి బారిన పడి మనుషులు గాయాలపాలవుతున్నా కార్పొరేషన్ అధికారులు కనికరం చూపడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తల్లడిల్లిన గోమాతప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతనహనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్కు సమాచారం ఇవ్వగా.. ఆయన çఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం. – హన్మకొండ చౌరస్తా -
వరంగల్
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026డీఎల్ఎస్ @ 53 వసంతాలు కాజీపేటలోని డీజిల్ లోకోషెడ్ ఇండియన్ రైల్వేలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈనెల 28న 53 వసంతోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటిన వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ‘ఉమానాగ్ పా లిమర్స్’ కంపెనీపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సు మారు రూ.12 లక్షల విలువైన నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించడంతోపాటు యూనిట్కు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 16న వరంగల్ నగర శివారు తిమ్మాపూర్లోని పెన్షన్పురలో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ నిర్వాహకుడికి బల్దియా అధికారులు రూ.13,000 జరిమానా విధించారు. సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్లో తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్ల తయారీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిబంధనల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా టీ స్టాళ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్తో తయారైన గ్లాసుల్లో వేడి పానీయాలు పోస్తే రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లలో అన్నం తినేవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ, కాలేయ సమస్యలకు దారితీసే అవకాశముంది. ప్రజలు తెలియక వాడడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ గ్లాస్, ప్లేట్ల తయారీ పరిశ్రమలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతోంది. జరిమానాలు తక్కువగా ఉండడంతో తయారీదారులు తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. పోలీసుల దాడులతో ఇవి వెలుగులోకి వస్తుండడంతో ఈ అక్రమ తయారీ పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. కఠిన చర్యలతోనే దందాకు అడ్డుకట్ట.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు కనీస మందం (మైక్రాన్)ను నిర్దేశించింది. అయితే 40 నుంచి 50 మైక్రాన్ల లోపు ఉండే పలుచని ప్లాస్టిక్తో గ్లాస్లు, ప్లేట్లు తయారు చేయడం చట్టవిరుద్ధం. తక్కువ ఖర్చుతో భారీ లాభాలు వస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిన ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా.. నగరంలోని పరిశ్రమల్లో చిన్న యూనిట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు ఇతర ఉత్పత్తులు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్లు, ప్లేట్ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త్తలు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానా, యంత్రాల స్వాధీనం, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్ పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలి -
సందడిగా ఆత్మీయ సమ్మేళనం
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం 1989–90 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీ య సమ్మేళనం వైభవంగా నిర్వహించుకున్నారు. 35 ఏళ్ల తర్వాత ఒకే చోట కలిసిన స్నేహితులతో ప్రాంగణం అంతా పండుగ వాతావరణంగా మా రింది. ముందుగా తమకు విద్యాబోధన చేసిన గు రువులను ఆహ్వానించి వారిని శాలువాలు పూలమాలలతో సన్మానించారు. పూర్వ విద్యార్థులందరూ ఐక్యంగా ఉండి కష్టసుఖాల్లో పాలుపంచుకో వాలని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు. -
వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయ సమీపంలోని శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో వీరబ్రహ్మేంద్రస్వామి 333వ ఆరాధనోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అర్చకుడు కేదారీశ్వరాచారి బ్రహ్మంగారి మూలమూర్తికి పంచామృతాభిషేకం, మేలుకొలుపు, పూజలు జరిపారు. వివిధ పుష్పాలతో చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ఆవాహన, గణపతిపూజ, నవగ్రహపూజ, మంటపారాధన, ఆరాధన పూజాకార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ అక్షతాశీర్వాదాలు, అన్నప్రసాదాల వితరణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ మారేడోజు సదానందచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో 111 సంవత్సరాల వయస్సు గల ఉత్తరాఖండ్కు చెందిన హిమాలయ యోగి సంతు సదానందగిరి స్వామీజీ, తెలంగాణ అర్యక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ నూతనంగా నిర్మించిన దేవాలయం కాలక్షేప మండపాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ భూత, భవిష్యత్, వర్తమాన కాలజ్ఞాన విషయాలను తెలియజేసిన గొప్ప వ్యక్తి బ్రహ్మంగారు సాక్షాత్తు విష్ణుస్వరూపుడని, కులమతాలకు అతీతంగా తన శిష్యులుగా స్వీకరించి మత సమరస్యాన్ని పాటించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగు ఉపేంద్రశర్మ, రామోజు జయసాగర్, బాలాజీ, రుద్రోజు సుగ్రీవచారి, పెందోట చక్రపాణి, చొల్లేటి కృష్ణమాచారి, పెంటయాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అంగట్లో వేలంలా ఇంటినంబర్లు!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు అంగట్లో వేలంలా మారాయి. సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. చేయి తడిపితే చాలు దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఇంటి నంబర్ కేటాయిస్తూ కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. విచిత్రమేమిటంటే ఏ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. మీ ఓపెన్ ప్లాట్లో రెడీమెడ్ కంటైయినర్ సిద్ధం చేసి ఉంచితే చాలు రోజుల వ్యవధిలో ఇంటి నంబర్లు కేటాయిస్తుండడం వివాదాస్పదమవుతోంది. అనంతరం ఆయా కంటైయినర్లకు ఇంటి పన్నుల రూపంలో వచ్చే పన్నులను సైతం కట్టకుండా ఉండేందుకు లోపాయికారీగా ఒప్పందం చేసుకొని మమ అనిపిస్తున్నారు. వీటిపై బల్దియాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ లేకపోవడం కూడా వారు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. కొన్ని కేసుల్లో అక్రమ పద్ధతిలో పొందిన ఈ ఇంటి నంబర్లను ఆయా స్థల వివాదాల్లో కోర్టులో ఉపయోగించుకుంటుండడంతో అసలు ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తైన వాటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు నెలల తరబడి తిప్పించుకుంటున్న కొందరు అధికారులు వీటి విషయంలో మాత్రం అడిగినంత డబ్బు చేతికి అందుతుండడంతో రోజుల వ్యవధిలో కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్నాళ్లు ఓపెన్ ప్లాట్ల చుట్టూ గోడలు కట్టి ఓ చిన్న గది వేసుకుంటే ఎంతో కొంత తీసుకొని ఇంటి నంబర్ కేటాయించిన అధికారులు ఇప్పుడూ ఓపెన్ ప్లాట్లలో రెడీమెడ్ కంటైయినర్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతుండడం గమనార్హం. మచ్చుకు కొన్ని.. హంటర్రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు ఎదురుగా ఉ న్న న్యూశాయంపేట జాగీరులోని ఓ సర్వే నంబర్లోని ఓపెన్ ప్లాట్లో కంటైయినర్లు ఏర్పాటుచేసి ఇంటి నంబర్లు పొందారు. దేశాయిపేట నవయుగ కాలనీలో మున్సిపల్ లేఅవుట్ ఖాళీ స్థలం విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుండగా కొత్తగా మళ్లీ ఇంటి నంబర్లు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అలాగే జక్కులొద్దీ, మామునూరు, తిమ్మాపూర్, రంగశాయిపేట, దేశాయిపేట, పైడిపల్లి, ఉర్సు, భ ట్టుపల్లి ప్రాంతాల్లోనూ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల కేటాయించారనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులొస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల కేటాయింపు అంశంపై బల్దియా అధికారులను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. కంటైయినర్ ఉంటే నంబర్ ఇచ్చుడే.. పైసలకు కక్కుర్తి పడి అక్రమ అనుమతులు కొందరు బల్దియా అధికారుల చేతివాటంతోనే దందా అసలు ఇంటి నిర్మాణదారుడికి చుక్కలే.. -
సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
వరంగల్ స్పోర్ట్స్: సైక్లింగ్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని రెజ్లింగ్ హాల్లో నిర్వహించారు. ఎన్నికల పరిశీలకుడిగా హనుమకొండ డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్, పర్యవేక్షక్షుడిగా తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ బాధ్యుడు వేణుగోపాల్, ఒలింపిక్స్ సంఘం బాధ్యుడు దుపాకీ సంతోష్ వ్యవహరించారు. 2026 నుంచి 2030 వరకు కొనసాగే కమిటీ వివరాలను పరిశీలకులు వెల్లడించారు. అసోసియేషన్ జిల్లా చైర్మన్గా బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, అధ్యక్షుడిగా ఆడెపు వెంకటేశ్, ప్రధాన కార్యదర్శిగా ఐత కిషన్, కోశాధికారిగా గద్దల అనిల్, ఉపాధ్యక్షులుగా జె.రమేశ్, ఆదిరెడ్డి, మట్టెడ కుమార్, తుపాకుల రవి, తీగల సాధన్, సంయుక్త కార్యదర్శులుగా కోట సునీల్, సంగల ప్రణీత్, బొచ్చు రాకేశ్, ఎం.రాజు, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా వైదుగుల శ్రీనివాస్రెడ్డి, థామస్, కల్పన, సుధాకర్, సంపత్, నాగరాజు, కుమారస్వామి, శంకర్, రాజు, సంతోష్ ఎన్నికై నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియముందు జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరబోయిన కై లాశ్యాదవ్ హాజరై మాట్లాడారు. జూలైలో సబ్జూనియర్, సెప్టెంబర్లో జూనియర్, డిసెంబర్లో సీనియర్ విభాగాల జిల్లాస్థాయి పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అసోసియేషన్ నూతన కార్యదర్శి ఐత కిషన్ మాట్లాడుతు సైక్లింగ్ క్రీడలో తెలంగాణలోనే హనుమకొండ జిల్లాను ప్రథమ స్థానంలో ఉంచేలా కృషి చేస్తానని అన్నారు. -
బంద్ను విజయవంతం చేయాలి
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం నిర్వహించే ఫర్టిలైజర్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని ది డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువుల సరఫరా విషయంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛందంగా షాపుల బంద్ పాటించాలని సూచించారు. శివనగర్లోని అసోసియేషన్ భవనం వద్ద ఉదయం 8:30 గంటలకు డీలర్లు అధిక సంఖ్యలో హాజరై బంద్కు మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బీఎన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, సాంస్కృతిక కార్యదర్శులు దేసు ప్రవీణ్, ముక్కెర సతీశ్, సంయుక్త కార్యదర్శి గోమాత సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
సోమవారం శ్రీ 27 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
ఏప్రిల్ ఒకటిన వరంగల్ నగర శివారు ఏనుమాముల మార్కెట్ సమీపంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసి నిల్వ ఉంచిన ‘ఉమానాగ్ పాలిమర్స్’ కంపెనీపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.12 లక్షల విలువైన నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులు, ముడి సరుకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అధికారులు రూ.50,000 జరిమానా విధించడంతోపాటు యూనిట్కు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 16న వరంగల్ నగర శివారు తిమ్మాపూర్లోని పెన్షన్పురలో ప్రభుత్వం నిషేధించిన తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. సుమారు రూ.3 లక్షల విలువైన స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంపెనీ నిర్వాహకుడికి బల్దియా అధికారులు రూ.13,000 జరిమానా విధించారు. సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్లో తక్కువ మైక్రాన్ కలిగిన ప్లాస్టిక్ గ్లాస్లు, ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్ల తయారీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రభుత్వ నిషేధం ఉన్నప్పటికీ కొందరు నిబంధనల్ని పట్టించుకోకుండా యథేచ్ఛగా ఉత్పత్తి చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ముఖ్యంగా టీ స్టాళ్లు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, చిన్న వ్యాపార కేంద్రాలకు సరఫరా చేస్తూ ఎక్కువ మొత్తంలో లాభాలు పొందుతున్నారు. తక్కువ నాణ్యత గల ప్లాస్టిక్తో తయారైన గ్లాసుల్లో వేడి పానీయాలు పోస్తే రసాయనాలు విడుదలయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ కోటెడ్ పేపర్ ప్లేట్లలో అన్నం తినేవారికి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందన్నారు. ఇది దీర్ఘకాలంలో కిడ్నీ, కాలేయ సమస్యలకు దారితీసే అవకాశముంది. ప్రజలు తెలియక వాడడంతో వీరి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఈ ప్లాస్టిక్ గ్లాస్, ప్లేట్ల తయారీ పరిశ్రమలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అప్పుడప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో నియంత్రించలేకపోతోంది. జరిమానాలు తక్కువగా ఉండడంతో తయారీదారులు తిరిగి అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. పోలీసుల దాడులతో ఇవి వెలుగులోకి వస్తుండడంతో ఈ అక్రమ తయారీ పరిశ్రమలపై నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. కఠిన చర్యలతోనే దందాకు అడ్డుకట్ట.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అదేవిధంగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకు కనీస మందం (మైక్రాన్)ను నిర్దేశించింది. అయితే 40 నుంచి 50 మైక్రాన్ల లోపు ఉండే పలుచని ప్లాస్టిక్తో గ్లాస్లు, ప్లేట్లు తయారు చేయడం చట్టవిరుద్ధం. తక్కువ ఖర్చుతో భారీ లాభాలు వస్తుండడంతో కొందరు వ్యాపారులు ఇష్టారీతిన ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇలా.. నగరంలోని పరిశ్రమల్లో చిన్న యూనిట్లలో ఈ వ్యాపారం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బయటకు ఇతర ఉత్పత్తులు చూపిస్తూ, లోపల నిషేధిత గ్లాస్లు, ప్లేట్ల తయారీ కొనసాగిస్తున్న యూనిట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు తనిఖీలకు వస్తున్నారనే సమాచారంతో యజమానులు ఆ యంత్రాలను ఆపేసి అక్కడి నుంచి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని పర్యావరణవేత్త్తలు డిమాండ్ చేస్తున్నారు. భారీ జరిమానా, యంత్రాల స్వాధీనం, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటేనే అక్రమ వ్యాపారానికి చెక్ పడే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు. -
ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం
హన్మకొండ: ఆర్టీసీ కార్మికులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు ఒప్పుకున్న సందర్భంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండ రాంనగర్లోని ఆర్టీసీ హనుమకొండ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ముందుగా డ్రైవర్ కోలా శంకర్గౌడ్ మృతికి మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈసందర్భంగా బంక సరళ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 56 రోజుల పాటు సమ్మె చేసినా, 32 మంది కార్మికులు చనిపోయినా పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మె మొదలు పెట్టిన మూడు రోజుల్లోనే సమస్యకు పరిష్కారం చూపిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తవుటం ఝాన్సీ, తాళ్లపల్లి మేరీ, విజయ, ఇందిర, శ్వేత, సుజాత, సబితా, కళ్యాణి, తోట వెంకటేశ్వర్లు, బంక సంపత్ యాదవ్, నాయిని లక్ష్మారెడ్డి, పెరుమాండ్ల రామకృష్ణ, తాళ్లపల్లి రవీందర్, తాళ్లపల్లి సుధాకర్, నేహాల్ తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు బంక సరళ సీఎం రేవంత్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం -
ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం
నర్సంపేట: ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు. నర్సంపేట పట్టణంలోని ముత్తోజిపేట గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ చిత్రపటానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఈదురు వెంకన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డిలు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో కాలయాపన చేసిందని, రేవంత్రెడ్డి సర్కార్ సమస్యల పరిష్కానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులకు సముచిత న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు వేముల రవి, మోహన్, రంగయ్య, నాయకులు బూర సుమన్గౌడ్, గంగిడి సాంబిరెడ్డి, మోరాల మోహన్రెడ్డి, బీసీ సంఘాల నాయకులు శ్రీనివాస్గౌడ్, డాగ్యాల శ్రీనివాస్, నర్సంపేట జర్నలిస్టులు అబ్బు వెంకట్రెడ్డి, వంచ రాజేందర్రెడ్డి, కుండె సురేష్, ఊరటి రాజు, మేర్గు రాము, ఎర్రబెల్లి విద్యాసాగర్, నల్ల వంశీధర్రెడ్డి, సంగినేని ప్రశాంత్, సౌడారపు మధు, సత్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
హేమాచలక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు
● నేటి నుంచి పది రోజుల పాటు కార్యక్రమాలు ● ముస్తాబైన ఆలయం.. తరలిరానున్న భక్తజనంమంగపేట: రెండో యాదగిరిగుట్టగా పేరుగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 10 రోజుల పాటు జరిగే తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలను ఆగమశాస్త్రం ప్రకారం దేవాదా య ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యుల బృందం, ఆలయ అర్చకులతో శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఇన్చార్జ్ ఈఓ వీరస్వామి తెలిపారు. వైభవంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో జాతర ప్రారంభం హేమాచల క్షేత్రంలో నేడు(సోమవారం) ఉదయం 6 గంటల నుంచి బ్రహ్మోత్సవాల యాగ్నికులు యాగశాలలో విశ్వక్షేనపూజా, భగవత్ పుణ్యాహ వాచన, ఉత్సవ మూర్తులకు స్నపనం, తిరువంజ నం(అభిషేకం), సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పన, 28న మంగళవారం గరుడాదివాసం, 29న ధ్వజారోహనం, 30న ఎదుర్కోలు మహోత్సవం, మే 1న మధ్యాహ్నం 12.32 గంటలకు అభిజిత్ లగ్నంలో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లతో తిరు కల్యాణ మహోత్సవం, 2న రథోత్సవం, 3న సదస్యం(వేదాశీర్వచనం), 4వ తేదీన తెప్పోత్సవం, 5న మహాపూర్ణాహుతి, నాకబలి(నాగవెల్లి), 6న ఉదయం 11 గంటలకు వసంతోత్సవం, సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ వీరస్వామి తెలిపారు. -
పన్నుల వసూళ్లలో వేగం పెంచాలి
● మున్సిపల్ కమిషనర్ జోనా వర్ధన్నపేట: ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచి వందశాతం అయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ జోనా అన్నారు. ఆదివారం ఇంటి పన్నుల వసూళ్ల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటిపన్నులకు ముందస్తుగా చెల్లించే పన్నుదారులకు ప్రభుత్వం అందిస్తున్న 5 శాతం రిబేట్ ప్రయోజనాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ రిబెట్ సదుపాయం ఏప్రిల్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి పన్ను చెల్లింపులపై అవగాహన కల్పించాలన్నారు. వసూలు చేసే ప్రతీ పన్నుకు సంబంధించిన అధికారిక రశీదులు అందించాలన్నారు. సకాలంలో పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఆదివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి స్వీయ గణన ఎలా చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనగణన 2027లో భాగంగా జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి 14 చార్జెస్లోని 1,237 హౌస్లిస్టింగ్ బ్లాక్లో 1,094 ఎన్యుమరేటర్లతో జనగణన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయగణనలో భాగంగా కేంద్రం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఎస్ఈ. సీఈఎన్ఎస్యుఎస్. జీఓవీ.ఇన్ లింక్ను ఓపెన్ చేసి సెల్ప్ ఎన్యుమరేషన్ ద్వారా లాగిన్ అవ్వాలన్నారు. కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించి సమర్పించాలన్నారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినపుడు ఐడీని చూపిస్తే ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వై.వి.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. వాసవీ మాత జయంతి కలెక్టరేట్లో ఆదివారం వాలవీ మాత జయంతి సందర్భంగా కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు వాసవీ కన్యకా పరమేశ్వరీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళలులర్పించారు. వాసవీ మాత జయంతిని అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు ఆర్యవైశ్యులు అన్నారు. బడి బయట పిల్లలను గుర్తించాలి వర్ధన్నపేట: బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి వారిని బడిలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టాల ని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఇల్లందలోని బుడగ జంగాల కాలనీలో అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పిల్లల వివరాలు, పత్రాలను పరిశీలించి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బేతి సాంబయ్య, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ గ్రామస్తులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు
● వరంగల్ ఎంపీ కడియం కావ్య ధర్మసాగర్: ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇళ్లు లేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తోందని తెలిపారు. అంతకుముందు పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ కడియం కావ్యకు సర్పంచ్, గ్రామ పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులు ఘన స్వాగతం పలికారు. సర్పంచ్ తోట నాగరాజు, ఉప సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షుడు భిక్షపతి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. -
అంగట్లో వేలంలా ఇంటినంబర్లు!
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి నంబర్లు అంగట్లో వేలంలా మారాయి. సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. చేయి తడిపితే చాలు దరఖాస్తు చేసిన రోజుల వ్యవధిలోనే ఇంటి నంబర్ కేటాయిస్తూ కొందరు అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. విచిత్రమేంటంటే ఏ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం లేకున్నా.. మీ ఓపెన్ ప్లాట్లో రెడీమెడ్ కంటైయినర్ సిద్ధం చేసి ఉంచితే చాలు రోజుల వ్యవధిలో ఇంటి నంబర్లు కేటాయిస్తుండడం వివాదాస్పదమవుతోంది. అనంతరం ఆయా కంటైయినర్లకు ఇంటి పన్నుల రూపంలో వచ్చే పన్నులను సైతం కట్టకుండా ఉండేందుకు లోపాయికారీగా ఒప్పందం చేసుకొని మమ అనిపిస్తున్నారు. వీటిపై బల్దియాకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో కమిషనర్ లేకపోవడం కూడా వారు ఆడిందే ఆట, పాడింది పాటగా మారింది. కొన్ని కేసుల్లో అక్రమ పద్ధతిలో పొందిన ఈ ఇంటి నంబర్లను ఆయా స్థల వివాదాల్లో కోర్టులో ఉపయోగించుకుంటుండడంతో అసలు ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు ఏర్పడుతున్న పరిస్థితి కనబడుతోంది. అన్ని అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తైన వాటికి ఇంటి నంబర్ కేటాయించేందుకు నెలల తరబడి తిప్పించుకుంటున్న కొందరు అధికారులు వీటి విషయంలో మాత్రం అడిగినంత డబ్బు చేతికి అందుతుండడంతో రోజుల వ్యవధిలో కేటాయిస్తున్నారనే విమర్శలున్నాయి. ఇన్నాళ్లు ఓపెన్ ప్లాట్ల చుట్టూ గోడలు కట్టి ఓ చిన్న గది వేసుకుంటే ఎంతో కొంత తీసుకొని ఇంటి నంబర్ కేటాయించిన అధికారులు ఇప్పుడూ ఓపెన్ ప్లాట్లలో రెడీమెడ్ కంటైనర్లకు ఇంటి నంబర్లు కేటాయిస్తూ భారీగా అవినీతికి పాల్పడుతుండడం గమనార్హం. మచ్చుకు కొన్ని.. హంటర్రోడ్డులోని ఓ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న న్యూశాయంపేట జాగీరులోని ఓ సర్వే నంబర్లోని ఓపెన్ ప్లాట్లో కంటైనర్లు ఏర్పాటుచేసి ఇంటి నంబర్లు పొందారు. దేశాయిపేట నవయుగ కాలనీలో మున్సిపల్ లేఅవుట్ ఖాళీ స్థలం విషయంలో హైకోర్టులో కేసు నడుస్తుండగా కొత్తగా మళ్లీ ఇంటి నంబర్లు కేటాయించడం వివాదాస్పదమవుతోంది. అలాగే జక్కలొద్ది, మామునూరు, తిమ్మాపూర్, రంగశాయిపేట, దేశాయిపేట, పైడిపల్లి, ఉర్సు, భట్టుపల్లి తదితర ప్రాంతాల్లోనూ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్లు కేటాయించారనే ఉన్నతాధికారులకు ఫిర్యాదులొస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఈ అక్రమ పద్ధతిలో ఇంటి నంబర్ల కేటాయింపు అంశంపై బల్దియా అధికారులను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. హంటర్ రోడ్డులో ఏర్పాటు చేసిన కంటైనర్ కంటైనర్ ఉంటే నంబర్ ఇచ్చుడే.. డబ్బుకు కక్కుర్తి పడి అక్రమ అనుమతులు కొందరు బల్దియా అధికారుల చేతివాటంతోనే దందా అసలు ఇంటి నిర్మాణదారుడికి చుక్కలే.. -
స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రారంభమైన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఆదివారం కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్కి స్వీయ గణన ఎలా చేయాలనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. జనగణన 2027లో భాగంగా జిల్లాలో 12 మండలాలు, రెండు మున్సిపాలిటీలు కలిపి 14 చార్జెస్లోని 1,237 హౌస్లిస్టింగ్ బ్లాక్లో 1,094 ఎన్యుమరేటర్లతో జనగణన చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొదటగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు నిర్వహించనున్న స్వీయగణనలో భాగంగా కేంద్రం తొలిసారిగా ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చన్నారు. ఎస్ఈ. సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఇన్ లింక్ను ఓపెన్ చేసి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ద్వారా లాగిన్ అవ్వాలన్నారు. కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని, అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత మరోసారి పరిశీలించి సమర్పించాలన్నారు. సమర్పణ అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఐడీని చూపిస్తే ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.సంధ్యారాణి, వై.వి.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. -
బంద్ను విజయవంతం చేయాలి
ఖిలా వరంగల్: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం నిర్వహించే ఫర్టిలైజర్ షాపుల బంద్ను విజయవంతం చేయాలని ది డిస్ట్రిక్ట్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ శివనగర్లోని అసోసియేషన్ భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. ఎరువుల సరఫరా విషయంలో డీలర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం ఆల్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్, సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా స్వచ్ఛందంగా షాపుల బంద్ పాటించాలని సూచించారు. శివనగర్లోని అసోసియేషన్ భవనం వద్ద ఉదయం 8.30 గంటలకు డీలర్లు అధిక సంఖ్యలో హాజరై బంద్కు మద్దతుగా నిర్వహించే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, కోశాధికారి బీఎన్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, దేసు ప్రవీణ్, సతీశ్, సంపత్రెడ్డి పాల్గొన్నారు. -
స్వీయ గణనలో నమోదు చేసుకున్న మేయర్
వరంగల్ అర్బన్: ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్ )కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఆదివారం 28వ డివిజన్న్లోని తన నివాసంలో స్వీయ గణన వివరాలు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా గణాంక అధికారి మేయర్ నివాసానికి వెళ్లి అవసరమైన వివరాలు సేకరించి నమోదు చేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వీయ జన గణన కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. మే 10 లోగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్ అనంతరం జనరేట్ అయ్యే ఐడీ నంబర్ భద్రపర్చుకోవాలని కోరారు. మున్సిపల్ పరిధి ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ఇందులో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, మెప్మా టీఎంసీ రమేశ్, సీఓ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కట్టుకోబోయేవాడే చంపాడు..
సాక్షి, మరిపెడ: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించారు. వివాహ ముహూర్తానికి వారం రోజులే సమయం.. ఆలోగా కాబోయే భార్యపై అతనికి అనుమానం మొదలైంది. పక్కా ప్లాన్ప్రకారం పండుగ కోసం అని పిలిపించి ఓ బావిలో తోసి చంపాడు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు కటకటాల్లోకి పంపారు.మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్లో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ పవన్కుమార్ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తతండాకు చెందిన అజ్మీరా అరవింద్.. మరిపెడ మండలం ఇటుకలగడ్డతండాకు చెందిన భూక్య సంగీత రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కొంతకాలం దూరంగా ఉన్నారు. మళ్లీ మాట్లాడుకుని ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించారు. ఈనెల 29న పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు.కానీ, సంగీత వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందని అరవింద్ అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్వేశాడు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన తన ఇంట్లో ఎల్లమ్మ పండుగ ఉందని చెప్పి సంగీతను ఇంటిదగ్గరే ఉండమని చెప్పి ఆమె కుటుంబ సభ్యులను కొత్తతండాకు పిలిపించాడు. అరవింద్ ఇటుకలగడ్డతండాకు బైక్పై వెళ్లి సంగీతను ఊరి చివరకు రమ్మని చెప్పాడు. వచ్చిన తర్వాత ఆమెను బైక్పై ఎక్కించుకొని ఇదే మండలం గారిపురం శివారు రోడ్డు వెంబడి ఉన్న బావి వద్దకు తీసుకెళ్లాడు.పథకం ప్రకారం మాటల్లో పెట్టి బావిలోకి తోసేశాడు. ఆమె చనిపోయేంతవరకు అక్కడే ఉన్నాడు. చనిపోయినట్లు నిర్ధారించుకుని తిరిగి కొత్తతండాకు వచ్చాడు. మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం కాబోయే భర్త అరవిందే నిందితుడిగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు వీరభద్రరావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
మక్కల కొనుగోళ్లలో వేగం పెంచండి
● అదనపు కలెక్టర్ ఎన్.రవి ఎల్కతుర్తి: మక్కల కొనుగోళ్లలో మరింత వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి అన్నారు. శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలోని విశాల సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని, మక్కలు కొన్న వెంటనే లారీల్లో గోదాంకు తరలించాలన్నారు. టర్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ, తహసీల్దార్ ప్రసాద్రావు, ఎంపీడీఓ విజయ్కుమార్, తదితర సిబ్బంది ఉన్నారు. -
పనైతే కానీ!
హనుకొండ హంటర్ రోడ్డులో ఓ డివిజన్లో ఆరు నెలల క్రితం రూ.15 లక్షల డ్రెయినేజీ పనిని కాంట్రాక్టర్ ప్రారంభించాడు. స్థానిక కార్పొరేటర్ రూ.60 వేలు కమీషన్ అడిగాడు. కాంట్రాక్టర్ రూ.30 వేలు ఇస్తానన్నాడు. కార్పొరేటర్ పనులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. కమీషన్ ఎంతిచ్చినా పర్లేదు పని పూర్తి చేయాలని కార్పొరేటర్ ఒత్తిడి పెంచాడు. కార్పొరేటర్ల పదవీ కాలం సమీపిస్తుండడంతో కమీషన్ ఎంతిచ్చినా ఫర్లేదు పని త్వరగా పూర్తి కావాలంటున్నట్లుగా తెలుస్తోంది.డివిజన్లలో అనుమతి లేని భవన నిర్మాణాలు, అదనపు కట్టడాలు, కొత్త ఇంటి నంబర్లు, వివాదాస్పద స్థలాలు, చివరికి రోడ్లకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులను కూడా కార్పొరేటర్లు వదలట్లేదనే విమర్శలొస్తున్నాయి. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసిన వారు ప్ర స్తుతం ఎంతకొంతివ్వాలని, వసూళ్లకు ఆయా విభాగాల అధికారులను, సిబ్బందిని, అనుచరులను రంగంలోకి దింపినట్లు సమాచారం. -
గ్రామీణాభివృద్ధికి సంఘాలు కీలకం
భీమదేవరపల్లి: ములుకనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సంఘాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకాధికారి వేముల శ్రీనివాసులు, రామ్కీ పౌండేషన్ ప్రెసిడెంట్ యం.వి.రామిరెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. ఈసందర్భంగా సంఘం కార్యకలాపాలను పరిశీలించారు. సభ్యులకు అందిస్తున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. సంఘ జనరల్ మేనేజర్ మార్పాటి రాంరెడ్డి సంఘం ద్వారా రైతులకు, సభ్యులకు అందిస్తున్న రుణాలు, మార్కెటింగ్ సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరించారు. సంఘం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన వారు, ఇలాంటి సహకార సంస్థలు గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, సుద్దాల సంపత్ తదితరులున్నారు. సీఎం ప్రత్యేకాధికారి వేముల శ్రీనివాసులు ముల్కనూరు సంఘం సందర్శన -
మలేరియా రహిత సమాజమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ అప్పయ్యహన్మకొండ చౌరస్తా: మలేరియా రహిత సమాజమే లక్ష్యంగా ప్రజలను భాగస్వాములు చేస్తూ మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం హనుమకొండలోని పెద్దమ్మగడ్డ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీని అప్పయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించేలా ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. పెద్దమ్మగడ్డలోని వీధులన్నీ తిరుగుతూ మలేరియా నిర్మూలన ప్లకార్డులు ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మదన్మోహన్రావు, మాజీ కార్పొరేటర్ డిన్నా, మెడికల్ ఆఫీసర్ శ్రీదేవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరినయీంనగర్: గర్భాశయ కాన్సర్ నిరోధకత కోసం 14 ఏళ్లు నిండిన అమ్మాయిలకు హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పకుండా ఇప్పించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. శనివారం హనుమకొండ పోచమ్మకుంటలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని డాక్టర్.అప్పయ్య క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అంగన్వాడీ, ఇతర కేంద్రాల్లో నిర్వహిస్తున్న 3 సెషన్స్లో ఎంత మందికి ఏయే టీకాలు ఇవ్వాల్సి ఉంది? వారిలో ఎంతమందికి ఇచ్చారు రాకపోవడానికి కారణాలేంటి అని పరిశీలించారు. 402 మందికి హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 73 మందికి ఇచ్చినట్లు, సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారని, నెలలోపు మిగతా వారికి ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూపీహెచ్సీ డాక్టర్ దీప్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేటినుంచి స్వీయ గణన
హన్మకొండ: జనగణన ప్రక్రియలో భాగంగా.. ఈనెల 26వ తేదీ నుంచి స్వీయ గణన ప్రారంభమవుతుందని, మే 10 వరకు కొనసాగుతుందని హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి తెలిపారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం జన గణనలో భాగంగా ఈ సారి స్వీయ గణనను చేపట్టిందన్నారు. ప్రజలు ఈ ప్రక్రియను ఆన్లైన్ ద్వారా, మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా వివరాలు నమోదు చేయవచ్చన్నారు. స్వీయ గణన కోసం https://se.census.gov.in లింక్ను ఓపెన్ చేసి కుటుంబానికి సంబంధించిన సుమారు 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం 11 అంకెల ఐడీ నంబర్ జనరేట్ అవుతుందని, ఆ ఐడీని భద్రపర్చుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్ చూపిస్తే, వారు ధ్రువీకరించి ఫైనల్ చేస్తారన్నారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని స్వీయ గణనలో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సత్యనారాయణ రెడ్డి, స్టాటిస్టికల్ ఆఫీసర్ రామ్ దయాకర్రెడ్డి పాల్గొన్నారు. విస్తృతంగా అవగాహన కల్పించాలివరంగల్ అర్బన్: మహా నగర ప్రజలకు స్వీయ గణనపై విస్తృతంగా అవగాహన కల్పించాలని బల్దియా అదనపు కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో స్వీయ గణన నిర్వహణపై ఆర్పీలు, సీఓలు, వార్డు ఆఫీసర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు స్వతంత్రంగా ఆన్ లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకునేలా చూడాలన్నారు. సెన్సెస్ మాస్టర్ ట్రైనీ కంజర్ల రమేశ్ ఆధ్వర్యంలో ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. సమావేశంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, బిర్రు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి హనుమకొండ అదనపు కలెక్టర్ ఎన్.రవి -
సిరులిచ్చే తల్లికి సాలభంజిక సేవ
హన్మకొండ కల్చరల్: భద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 నిర్వహించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో 2024 , 2025 సంవత్సరాల్లో 3,567 మంది నిందితులు అరెస్టయ్యారని, వీరిలో వరంగల్ కమిషనరేట్కు చెందిన 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పర్వతగిరి–ఒకరు, సంగెంలో ఇద్దరు సుబేదారిలో ఒకరు, హనుమకొండలో ఇద్దరు, నర్సంపేటలో ఒకరు, కాజీపేటలో ఒకరు, నర్మెట్టలో ఒకరు ఉన్నట్లు వివరించారు. నిందితులు భవిష్యత్లో ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చట్టబద్ధంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మోసాలను గమనించిన వెంటనే సమీప పోలీస్స్టేషన్, సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్కు సమాచారం ఇవ్వాలని సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. విద్యారణ్యపురి: రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ వేసవి శిక్షణ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్వీ గిరిరాజ్గౌడ్ శనివారం ఒక ప్రకటనలో కోరా రు. దరఖాస్తులు ఈనెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారని పేర్కొన్నారు. శిక్షణ పొందాలనుకునేవారు 2025 జూలై1 వరకు 18 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఉండాలని తెలిపారు. టెన్త్ పరీక్ష ఉత్తీర్ణత, సంబంధిత టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ కోర్సులో లోయర్ గ్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు. దరఖాస్తులు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.తెలంగాణ.గౌ ట్.ఇన్ వెబ్సైట్లో చూడాలని సూచించారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు మే1 నుంచి జూన్ 11 వరకు 42 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ల బదిలీ.. ఖిలా వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మిల్స్కాలనీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న బొల్లం రమేశ్ శనివారం కరీంనగర్ కమిషనరేట్ పరిధి తిమ్మాపూర్ సర్కిల్కు బదిలీ అయ్యారు. ఈమేరకు మల్టీజోన్–1 ఐజీ ఎస్.చంద్రశేఖర్రెడ్డి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తిమ్మాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న గడ్డం సదన్కుమార్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శాయంపేట సీఐ..శాయంపేట: శాయంపేట మండలంలో రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్న సీఐ రంజిత్రావు బదిలీల ప్రక్రియలో భాగంగా రామగుండం కమిషనరేట్ పరిధి సుల్తానాబాద్కు బదిలీ అయ్యారు. నేర పరిశోధనలో సీఐ రంజిత్రావు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్సై జక్కుల పరమేశ్ అన్నారు. విజయ డెయిరీ వరంగల్ డీడీ శ్రవణ్..హన్మకొండ చౌరస్తా: విజయ డెయిరీ వరంగల్ మిల్క్ షెడ్ డిప్యూటీ డైరెక్టర్ కె.శ్రవణ్కుమార్ను బదిలీ చేస్తూ తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో మార్కెటింగ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న జి.ధన్రాజ్కు వరంగల్ డీడీగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
తల్లడిల్లిన గోమాత
● ప్లాస్టిక్ వ్యర్థాలు తినడంతో రెండు గంటలు నరకయాతన హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఓ సూడి ఆవు రెండు గంటలు నరకయాతన పడింది. ఆ బాధ చూడలేక ఓ సెక్యూరిటీ గార్డు డయల్ 100కు ఫోన్ చేశాడు. సలహా ఇచ్చారే కానీ, ఎవరూ స్పందించలేదు. చివరికి తెలిసిన వారి నుంచి మడికొండ వెటర్నరీ అసిస్టెంట్ రమేశ్కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల అజీర్తితో బాధపడుతున్నట్లు గు ర్తించి వైద్యం అందించాడు. కాగా, ఏప్రిల్ 25న పశు వైద్యుల దినోత్సవం.. హనుమకొండ పరిధి పశు వైద్యులకు ఫోన్ చేసినా స్పందించలేదని పలువురు వాహనదారులు చెప్పడం గమనార్హం. – హన్మకొండ చౌరస్తా -
ఉమ్మడి జిల్లాలో ఇలా..
మొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకూ పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క... ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు... సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ ‘మార్కెట్ కమిటీ తరహా నియామకం’. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు... మొదలైన ఆశావహుల పైరవీలుజిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరక్టర్ సభ్యులు స్థానాలు వరంగల్ అర్బన్ (హనుమకొండ) 12 156 30,317 వరంగల్ రూరల్ (వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 -
మినీ సఫారీకి సై
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఖానాపురం: పర్యాటక ప్రాంతాల్లో పాకాలకు ప్రత్యేక స్థానం. సరస్సు అందాలు, ఆహ్లాద వాతావరణం, పక్షులు, జంతువుల సందడితో మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది. చిన్నారులకు ఆటవస్తువులు, పర్యాటకులకు బోటింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ.. అభివృద్ధి పనులతో పాకాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. మండలంలోని అశోక్నగర్ శివారులో పాకాల పర్యాటక ప్రాంతం ఉంది. 30.3 ఫీట్లతో నీటిమట్టం, 839 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన అటవీ ప్రాంతానికి అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. సరస్సు అందాలు, పక్షులు, జంతువుల సందడి, లీకేజీ నీటిలో జలకాలాడుతూ ఆనందంగా గడుపుతుంటారు. ప్రతీ సంవత్సరం పాకాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఎఫ్ఆర్వో పుప్పాల రవికిరణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆటవస్తువులు, బోటింగ్, బటర్ఫ్లై గార్డెన్ అభివృద్ధి, సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. పాకాలలో ఏర్పాట్లు చేస్తున్న అటవీ శాఖ అధికారుల త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు పర్యాటకులకు అందుబాటులో ఉంచిన రెండు జీప్లు రెండు గంటలకు రూ.1500 చార్జ్ -
ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దు
పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు.మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆమె సందర్శించి మాట్లాడారు. వరికోత సమయంలో హార్వెస్టర్ ఆర్పీఎం 19, 20 ఉండే విధంగా చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. తహసీల్దార్ వెంకటస్వామి, డీఎం సంధ్యారాణి, డీటీ మధుసూదన్, ఎంపీఎం రాజీరు, ఏఓ ప్రశాంత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రిని తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ వర్ధన్నపేట: వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల కలెక్టర్ సత్యశారద ఆస్పత్రిని సందర్శించి అస్తవ్యస్త వైద్య సేవలను గుర్తించి వైద్యులు, సిబ్బందిని మందలించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ హాజరుపట్టిక, నిర్వహణ రికార్డులు, వార్డుల్లో రోగులకు అందించే వైద్య సేవలను పరిశీలించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు, వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు. కూలీలకు పనులు కల్పించాలిపర్వతగిరి: ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఎక్కువ పనులు కల్పించాలని డీఆర్డీఓ నాగపద్మజ అన్నారు. మండల కేంద్రంలో రూర్బన్ పథకంలో నిర్మించిన కన్వెన్షన్ హాల్ను శనివారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పనిప్రదేశాల్లో నీడ సౌకర్యం, తాగునీరు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, ఏఈ రఘువంశీ, ఏపీఓ సుశీల్, ఈసీ రాజు, టీఏ సురేష్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. చలపర్తి గోడౌన్ మేనేజర్, జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్!దుగ్గొండి: చలపర్తి గ్రామంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్(ఎస్డబ్ల్యూసీ) గోడౌన్లో రూ.4 లక్షల విలువైన 100 క్వింటాళ్ల సివిల్ సప్లయీస్ బియ్యం మాయమైన ఘటనలో పలువురిపై అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. టాస్క్ఫోర్స్ అధికారులు ఈనెల 20న దాడులు చేశారు. అనంతరం జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ సంధ్యారాణి ఈనెల 21న గోడౌన్ మేనేజర్ సహా మరో ఇద్దరిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ సాయిరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈక్రమంలో గోడౌన్ మేనేజర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్పై స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు వేటు వేసినట్లు తెలిసింది. ఈ విషయమై స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ దీపిక మాట్లాడుతూ ఘటనకు బాఽధ్యులుగా భావిస్తున్న మేనేజర్ స్వప్న, జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్పై శాఖాపరమైన చర్యలపై ప్రాసెస్ జరుగుతోందని పేర్కొన్నారు. విధుల్లో అక్రమాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని ఆమె స్పష్టం చేశారు. దూరవిద్య డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి దూరవిద్య(సీడీఓఈ/ఎస్డీఎల్సీఈ) డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ (2023–24 బ్యాచ్) పరీక్షలు మే 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొపెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ తెలిపారు. మే 7, 11, 13, 15, 18, 20 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
వివాదంలో ఉన్న భూమి పరిశీలన
గీసుకొండ: కొమ్మాల శివారులోని 165 సర్వే నంబర్లో ఉన్న 5.27 గుంటల భూమిని ఎస్సీ, ఎస్టీ కలెక్టర్ సత్యశారద శనివారం పరిశీలించారు. సూర్యతండాకు చెందిన అజ్మీరా రాందాన్కు నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారికి కొమ్మాల శివారులో 5.27 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. కుటుంబంలోని కొందరు తగాదా పడి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఆదేశాల మేరకు కలెక్టర్ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి రికార్డులను పరిశీలించి ఫిర్యాదుదారులు, కొనుగోలుదారుల స్టెట్మెంట్ను రికార్డు చేస్తామని, అక్రమాలు జరిగాయని తేలితే బాధ్యులపై కమిషన్ తీర్పు మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అసైన్డ్ భూమి కావడంతో ఎవరూ అమ్మవద్దు, కొనవద్దని ఆదేశించారు. వివాదంలో ఉన్న భూమికి సంబంధించిన పూర్తి నివేదికను కమిషన్కు నివేదిస్తామన్నారు. బాధితులకు ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే వారు సివిల్ కోర్టుకు వెళ్లవచ్చన్నారు. వరంగల్ ఆర్డీఓ సుమ, గీసుకొండ తహసీల్దార్ ఎండీ రియాజుద్దీన్, రైతులు పాల్గొన్నారు. క్రీడలతో మానసికోల్లాసం న్యూశాయంపేట: క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట దూపకుంట రోడ్డులోని మైనారిటీ గురుకులంలో ఈనెల 18 నుంచి 13 రోజుల పాటు నిర్వహిస్తున్న వేసవి క్రీడలు ప్రత్యేక క్యాంపును శనివారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. వారితో కలిసి వాలీబాల్, చెస్ ఆడారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు కలెక్డర్ సంధ్యారాణి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్, ఆర్ఎల్సీ డాక్టర్ సతీశ్, ప్రిన్సిపాల్ నీలిమాదేవి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాలి పనితీరు, లక్ష్యాలు సాధించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఐసీడీఎస్ సూపర్వైజర్లను హెచ్చరించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యలో వరంగల్ నగరంలో నిర్వహిస్తున్న బాలరక్షాభవన్, స్వధార్ గృహాలను కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలను నిర్వహరణ తీరును అడిగి తెలుసుకున్నారు. పనితీరులో వెనుకబడిన కొంతమంది సూపర్వైజర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వారి నుంచి తక్షణ వివరణ కోరారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమాధికారి రాజమణి, సంబంధిత సీడీపీఓలు, సూపర్వైజర్లు ఉన్నారు. -
‘ప్యాక్స్’ కిరీటాలు ఎవరికో?
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించే ప్రక్రియకు రంగం సిద్ధమవుతోంది. సహకార సంఘాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరి 14తో ముగియడంతో, ప్రస్తుతం వీటి బాధ్యతలను ప్రత్యేకాధికారులు నిర్వహిస్తున్నారు. తిరిగి వారి స్థానంలో అధికార పార్టీకి చెందిన నాయకులను వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల తరహాలో సహకార సంఘాలకు పాలకమండళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల (ఈ నెల 23న) జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు పీఏసీఎస్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), సహకార మార్కెటింగ్ సమాఖ్య (డీసీఎంఎస్)లకు కూడా ఇదే పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్కు చెందిన ఆశావహులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇదీ పీఏసీఎస్ల లెక్క.. ఇన్చార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలకం.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారుల వివరాల ప్రకారం 98 సహకార సంఘాలు ఉండగా, సుమారు 2.96 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. నామినేటెడ్ పద్ధతి ద్వారా ఉమ్మడి జిల్లాలో 98 చైర్మన్ పోస్టులు, 98 వైస్ చైర్మన్ పోస్టులతో పాటు మరో 1,260 మందికి డైరెక్టర్లుగా అవకాశం దక్కనుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్థానిక నేతలకు మంత్రివర్గం నిర్ణయం ద్వారా ఈ నామినేటెడ్ పదవులు పొందే అవకాశం కలగనుంది. అయితే మార్కెట్ కమిటీల మాదిరిగానే, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల ప్రతిపాదనల మేరకు పాలకవర్గాలను నియమిస్తారు. ఎమ్మెల్యే లేని నియోజకవర్గాల్లో జిల్లా మంత్రి ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. ఈ ప్రక్రియలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి కూడా కీలకంగా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ ప్రక్రియను అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ప్రస్తుత సహకార చట్టంలో మార్పులు, చేర్పులపై ఉన్నతస్థాయి కసరత్తు మొదలెట్టినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్నికల నుంచి ‘నామినేటెడ్’ వైపు.. సహకార సంఘాల ఎన్నికలు అధికారికంగా పార్టీ రహితంగా జరిగినా, పంచాయతీ ఎన్నికల మాదిరిగానే వీటిలో రాజకీయ పార్టీల ప్రమేయం పరోక్షంగా ఉండేది. ఆయా సంఘాల్లో సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే హక్కు ఉంటుంది. సభ్యులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వారై ఉండటంతో సహకార చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకోవడం.. రెండవ దశలో ఎన్నికై న ఆ డైరెక్టర్లు తమలో నుండి ఒకరిని చైర్మన్గా, మరొకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకునేవారు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ ఎన్నికల పద్ధతికి బదులుగా, మార్కెట్ కమిటీల తరహాలో నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను నియమించాలని భావిస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే, సాధారణ సభ్యులు ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకునే ప్రక్రియకు బదులుగా, ప్రజా ప్రతినిధుల సిఫార్సుతో నేరుగా ప్రభుత్వం పాలకమండళ్లను ఎంపిక చేయడమే ఈ మార్కెట్ కమిటీ తరహా నియామకం. త్వరలోనే నామినేటెడ్ ద్వారా పాలకమండళ్లను నియమించనున్నారన్న నిర్ణయం మేరకు పీఏసీఎస్ డైరెక్టర్ మొదలుకుని డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ల వరకు పదవులు పొందేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లాల వారీగా ఇలా.. జిల్లా పీఏసీఎస్లు డైరెక్టర్ సభ్యులు స్థానాలువరంగల్ అర్బన్ 12 156 30,317 (హనుమకొండ) వరంగల్ రూరల్(వరంగల్) 31 402 94,967 జనగామ 14 182 50,862 మహబూబాబాద్ 19 234 69,830 జేఎస్భూపాలపల్లి 10 130 22,773 ములుగు 12 156 27,328 నామినేటెడ్ ద్వారానే ‘సహకార’ పదవులు ఎంపికలో మంత్రులు, ఎమ్మెల్యేలే కీలకం ‘పరిషత్’ ఎన్నికలకు ముందే ప్రకటన ఆశల పల్లకిలో అధికార పార్టీ నేతలు.. మొదలైన ఆశావహుల పైరవీలుమొత్తం సహకార సంఘాలు 98సభ్యులు 2,96,077డైరెక్టర్ స్థానాలు 1,260 -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ క్రైం: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ క్రాక్డౌన్ 2.0 నిర్వహించినట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో 2024 , 2025 సంవత్సరాల్లో 3,567 మంది నిందితులు అరెస్టయ్యారని, వీరిలో వరంగల్ కమిషనరేట్కు చెందిన 9 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. స్టేషన్ల వారీగా పర్వతగిరిలో ఒకరు, సంగెంలో ఇద్దరు, సుబేదారిలో ఒకరు, హనుమకొండలో ఇద్దరు, నర్సంపేటలో ఒకరు, కాజీపేటలో ఒకరు, నర్మెటలో ఒకరు ఉన్నట్లు వివరించారు. నిందితులు ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడవద్దని హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వీరు చట్టబద్ధంగా జీవిస్తున్నట్లు తెలిపారు. సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, మోసాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్, సైబర్ క్రైం రిపోర్టింగ్ ప్లాట్ఫారంకు సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు. -
మున్సిఫ్కోర్టును అందుబాటులోకి తేవాలి
● జిల్లా న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ వర్ధన్నపేట: పట్టణానికి మంజూరైన మున్సిఫ్ కోర్టు భవనం రెనోవేషన్ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని జిల్లా న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ అన్నారు. మున్సిఫ్కోర్టు కార్యకలాపాలకు ఎంపిక చేసిన పాత మున్సిపల్ కార్యాలయ రెనోవేషన్ పనులను శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టీపీసీసీ లీగల్ సెల్ కార్యదర్శి నిమ్మాని శేఖర్రావు మాట్లాడుతూ మున్సిఫ్కోర్టుకు పాత మున్సిపాలిటీ భవనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఎంపిక చేశారని తెలిపారు. కోర్టు కార్యకలాపాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. రెనోవేషన్ పనులకు కలెక్టర్ సత్యశారద రూ.22.5 లక్షల నిధులు మంజూరుచేయగా.. టెండర్ పక్రియ సైతం పూర్తయ్యిందన్నారు. కాంట్రాక్టర్ త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. మూడు పోలీస్స్టేషన్ల పరిధిలోని కేసులు మున్సిఫ్కోర్టులో నిర్వహిస్తారని ఆయన వివరించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మున్సిపల్ కమిషనర్ జోనా, తహసీల్దార్ విజయసాగర్, కౌన్సిలర్లు పాపారావు, తిరుపల్లి వాణి కుమార్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోతాదు ప్రకారం ఎరువులు వాడాలి
● ‘ఆత్మ’ ప్రాజెక్టు డైరెక్టర్ విజయనిర్మల ● ఆరెపల్లిలో ఏరువాక సాగుబడి కార్యక్రమం గీసుకొండ: రైతులు నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను సమతుల్యంగా పంట చేలకు వేయాలని, కాంప్లెక్స్ ఎరువులను మోతాదుకు మించి వాడితే భూసారం దెబ్బతింటుందని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) విజయనిర్మల అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం ఆరెపల్లిలో ఏరువాక సాగుబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మోతాదు ప్రకారం ఎరువులను వాడితే నేలపొరల్లో పేరుకుని పోయిన భాస్వరాన్ని తిరిగి మొక్కలకు అందేలా చేయవచ్చని సూచించారు. కేవీకే శాస్త్రవేత్త సౌమ్య మాట్లాడుతూ పత్తి, మొక్కజొన్న, వరి పంటల్లో అధికంగా రసాయన ఎరువులను వాడితే నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చిరొట్ట ఎరువులతో భూసారాన్ని పెంచవచ్చన్నారు. ఉద్యానశాఖ అధికారి తిరుపతి మాట్లాడుతూ రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలన్నారు. సర్పంచ్ తుమ్మనపల్లి స్వప్నశ్రీనివాస్, ఏఓ హరిప్రసాద్బాబు, ఏఈఓ పి.స్మిత, హెచ్ఈఓ వేణుకుమార్, రైతులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి గంధోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి ఆలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి స్నపనమూర్తికి గంధోత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని సాలభంజిక వాహనంపై ఊరేగించారు. పూజా కార్యక్రమాలకు వరంగల్ ఉమ్మడి జిల్లా మున్నూరు కాపు సంఘం, బంజార సమాజం వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాలభంజిక సేవలో మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొన్నారు. ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి దంపతులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ‘కుడా’ అధికారులు అజిత్రెడ్డి, భీంరావుతో కలిసి దేవాలయం చుట్టూ నిర్మిస్తున్న మాడవీధుల పురోగతిని పరిశీలించారు. అదేవిధంగా ఐసీసీ మెంబర్ కొండపల్లి దయాసాగర్రావు అమ్మవారిని దర్శించుకున్నారు., -
ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నియంత్రణ
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: ప్రజల భాగస్వామ్యంతోనే మలేరియా నియంత్రణ సాధ్యమవుతుందని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్ నుంచి ప్రారంభమైన అవగాహన ర్యాలీని కలెక్టర్ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎంజీఎం అకడమిక్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2030 నాటికి మలేరియా రహిత సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కీటక జనిత వ్యాధులపై విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రజలు కూడా వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మలేరియా వ్యాధి నివారణ, అవగాహన కోసం తయారు చేసిన కరపత్రాలను ఆవిష్కరించి పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో మలేరియా వ్యాధి నివారణ కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మేడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఒకే కేసు నమోదైందని తెలిపారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్చంద్రారెడ్డి, జిల్లా మలేరియా అఽధికారి కె.రజిని, డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్ పాల్గొన్నారు. -
బీఏఎస్.. గిరిజన విద్యార్థులకు వరం
● ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్య ● జిల్లాలో 32 సీట్లకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) ఒక వరంగా మారింది. మారుమూల గిరిజన పల్లెల విద్యార్థులను పట్టణాల్లోని ప్రతిష్టాత్మక కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యనందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రతి ఏటా ఈ పథకం అమలవుతుంది. గిరిజన ఉపప్రణాళిక క్రింద ఎంపిక చేసిన విద్యార్థులను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తుంది. కేవలం ఫీజులే కాకుండా పుస్తకాలు, యూనిఫాం, హాస్టల్ వసతి కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఎంపిక విధానం ఇలా.. జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి మొత్తం 32 సీట్లు ఉన్నాయి. మూడో తరగతిలో 50 శాతం అనగా 16 సీట్లు, ఐదో తరగతిలో 25 శాతం అనగా 8 సీట్లు, ఎనిమిదో తరగతిలో 25 శాతం అనగా 8 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్లలో 33 శాతం బాలికలకు కేటాయిస్తారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే ఈ స్కీంకు అర్హులు. దరఖాస్తుల ఆధారంగా లాటరీ ద్వారా పారదర్శకంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు ఉండాలి. అన్ని వసతులతో నాణ్యమైన విద్య.. కార్పొరేట్ స్థాయిలో ఉన్న వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందుతుంది. ఇంగ్లిష్ మీడియంలో బోధనతో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంది. ఈ స్కీం అమలుతో డ్రాపౌట్స్ తగ్గుతాయి. ఎంపికై న విద్యార్థులు ఎలా చదువుతున్నారో తెలుసుకోడానికి ఐటీడీఏ అధికారులు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శిస్తారు. విద్యార్థుల హాజరు మార్కులు, ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంటుంది. సాధారణంగా గిరిజన విద్యార్థులు తమ గూడేల్లోని ఆశ్రమ పాఠశాలలకే పరిమితమవుతారు. ఈ స్కీం ద్వారా వారు నగరాల్లోని కార్పొరేట్ పాఠశాలల్లో అడుగుపెడుతున్నారు. విభిన్న నేపథ్యాలు కలిగిన విద్యార్థులతో కలిసి చదవడం వల్ల వారి ప్రపంచ దృక్పథం మారుతుంది. నిధులు కేటాయించి, పర్యవేక్షణను పటిష్టం చేస్తే మట్టిలో మాణిక్యాలు గిరిజన గూడేల నుంచే పుట్టుకొస్తారనడంలో సందేహం లేదు. దరఖాస్తుకు ఆఖరు తేదీ 29.. అర్హులైన విద్యార్థులు ఈనెల 29లోగా దరఖాస్తు తీసుకోవాలి. కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ, బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రస్తుతం చదుతున్న పాఠశాల నుంచి), ఆధార్కార్డులను జతచేసి దరఖాస్తు చేసుకోవాలి. పూర్తిచేసిన దరఖాస్తులను హనుమకొండ అశోక్కాలనీలోని అంబేడ్కర్ భవనం ఎదుట ఉన్న జిల్లా గిరిజన సంక్షేమాధికారి కార్యాలయంలో వచ్చేనెల 7లోగా సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. -
వ్యవసాయ రంగానికి పెద్దపీట
● స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్: తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మల్లక్పల్లిలో శుక్రవారం రూ.35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇళ్లు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు తెలిపారు. మొక్కజొన్న రైతులు ఆర్థికంగా నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొంటుందని, కొనుగోళ్లతో సీజన్కు ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల నష్టం వస్తున్నప్పటికీ రైతులకు అండగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. మల్లక్పల్లి, ధర్మాపురం రైతులకు గోదావరి జలాలు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. స్థానిక సర్పంచ్ గిన్నారపు లత, వివిధ శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పల్లకీసేవ.. చతుస్థానార్చన
హన్మకొండ కల్చరల్ : భద్రకాళి దేవాలయంలో భద్రకాళీభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి ఉత్సవ మూర్తికి పల్లకీసేవ, సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన జరిపారు. శ్రీవిద్యారణ్యుల జయంతిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయం ప్రధాన రహదారి కూడలిలోని విద్యారణ్యుల విగ్రహానికి పూలమాలవేసి పూజలు నిర్వహించారు. డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తాన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మేరుగు సాయి, అఖిల్ రిజిస్ట్రార్కు వినతిపత్రం ఇచ్చారు. -
అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలి
● నెక్కొండలో డీఎంఓను కోరిన మొక్కజొన్న రైతులు ● తమ ఇబ్బందులు పట్టించుకోరా అని జిల్లా మార్కెటింగ్ అధికారిపై ఆగ్రహంనెక్కొండ: మక్కల కొనుగోలు కేంద్రంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్య తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ అధికారి (డీఎంఓ) కె.సురేఖను రైతులు కోరారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం నెక్కొండలోని పీఏసీఎస్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని డీఎంఓ సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నిర్వాహకుల తీరుతో కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు. రైతుల ఇబ్బందులు అధికారులకు పట్టవా అని వారు డీఎంఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 20 వేల నుంచి 25 వేల గన్నీ బ్యాగులు పక్కదారి పట్టిన విషయమై విచారణ చేపట్టాలని వారు కోరారు. మార్కెట్ పెద్ద మొత్తంలో మక్కలు రావడంతో తలెత్తుతున్న సమస్యలపై ఆమె రైతులతో మాట్లాడారు. అలాగే హమాలీలు, కూలీలతో మాట్లాడి కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. హమాలీల సంఖ్యను పెంచుకొని శనివారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు. లారీ, గన్నీబ్యాగుల సమస్య తలెత్తితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాని పీఏసీఎస్ సిబ్బందిని ఆదేశించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, మార్కెట్ కార్యదర్శి కృష్ణమీనన్రావు, పీఏసీఎస్ సీఈఓ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. -
సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలి
చేనేత, జౌళి శాఖ వరంగల్ ఆర్డీడీ జయరావు కమలాపూర్: విద్యార్థులు సాంకేతిక విద్యను అందిపుచ్చుకోవాలని చేనేత, జౌళి శాఖ వరంగల్ ప్రాంతీయ ఉప సంచాలకులు కె.జయరావు సూచించారు. హైదరాబాద్లోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) ఆధ్వర్యంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్నాలజీ (డీహెచ్టీటీ) కోర్సుపై కమలాపూర్లోని చేనేత సహకార సంఘంలో శనివారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. డీహెచ్టీటీ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రముఖ వస్త్ర పరిశ్రమల్లో డిజైనర్లుగా, మేనేజర్లుగా స్థిరపడే అవకాశం ఉంటుందన్నారు. చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో చేనేత రంగం కేవలం మగ్గానికి మాత్రమే పరిమితం కాలేదని, ఐఐహెటీ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ (సీఏడీ), టెక్స్టైల్ కెమిస్ట్రీ, స్మార్ట్ గార్మెంట్ తయారీ వంటి అంతర్జాతీయ స్థాయి అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి చేనేత విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏడాదికి రూ.4,250 ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే సువర్ణావకాశాన్ని జిల్లాలోని చేనేత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించారు. చేనేత, జౌళి శాఖ డీఓ వెంకటేశ్వర్లు, ఏడీఓ సునీత, చేనేత సంఘ మేనేజర్ సామల దామోదర్, జిల్లా చేనేత శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదు
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై హైకోర్టు క్లీన్చిట్ ఇవ్వలేదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు ముందు తెలుసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీబీఐ విచారణ చేపడితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి బయటపడుతుందని తెలిపారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమే అని డివిజన్ బెంచ్ చెప్పిన మాట బీఆర్ఎస్ నాయకులకు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. నివేదికలోని టెక్నికల్ ఎర్రర్స్ను మాత్రమే హైకోర్టు తప్పు పట్టిందన్నారు. అంతే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు అని చెప్పలేదని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని బీఆర్ఎస్ నాయకులు చంకలు గుద్దుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే రైతులకు అత్యధిక బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ అని మరిచి పోయారా అని ఎమ్మెల్యే నిలదీశారు. -
లెక్కాపత్రం లేకపోతే ఎలా?
వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రాంతంలోని పలు డివిజన్ల నుంచి వెలువడుతున్న తడి, పొడి చెత్త సేకరణలో లెక్కాపత్రం లేకపోతే ఎలా? అంటూ మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ వెహికిల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించిన రిజిస్టర్ను పరిశీలించారు. నగరంలో తడి, చెత్త సేకరణ పరిమాణాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. చెత్త వర్గీకరణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను వేరు చేసి సేకరించే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని కోరారు. పనితీరు మార్చుకోవాలని సిబ్బందిని హెచ్చరించారు. మేయర్ గుండు సుధారాణి బాలసముద్రం సెకెండ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీ -
పర్శనాయక్తండాలో అగ్ని ప్రమాదం
● ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం ● రూ.పది లక్షల విలువైన ఆస్తినష్టంనర్సంపేట: నర్సంపేట పట్టణం 16వ వార్డు పర్శనాయక్తండాలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన రైతులు బానోత్ సమ్మయ్య, మేఘా, రవి, కిషన్, నారాయణ, సారయ్య, హరిసింగ్, వీరస్వామి ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగుచేశారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు పంటకు మంటలు అంటకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. సకాలంలో ఫైర్ ఇంజన్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న ఇతర పంట పొలాలకు ప్రమాదం తప్పింది. కౌన్సిలర్ బానోత్ నవీన్నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధిత రైతులను పరామర్శించారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు. అగ్ని ప్రమాదంతో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ కళ్ల ముందే పంట బూడిద కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి
గీసుకొండ: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత ముఖ్యమని డీపీఓ కె.కల్పన పేర్కొన్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని పంచాయతీలకు మరియపురం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన 9 లక్ష్యాలను మరియపురం చేరుకోవడం గొప్ప విషయం అన్నారు. సమస్యలను గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. సర్పంచ్ తిరుమల్రెడ్డి అర్పిత అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో ఎంపీఓ పాక శ్రీనివాస్, ఉపసర్పంచ్ శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శి స్వప్న, సెర్ప్ సీసీ బొజ్జ సురేశ్, నాయకులు దిలీప్రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. గ్యాస్ పైపులైన్ లీక్తో మంటలు ● ఆర్పివేసిన అగ్నిమాపక సిబ్బంది గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ కట్లమల్లన్న ఆలయం (కీర్తినగర్) సమీపంలో గొర్రెకుంట క్రాస్ నుంచి గొర్రెకుంటకు వెళ్లే రోడ్డు పక్కన మెగా కంపెనీకి చెందిన గ్యాస్ పైపులైన్ శుక్రవారం సాయంత్రం లీకై మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయడానికి నీటిని స్ప్రే చేశారు. అయినా మంటలు ఆగకపోవడంతో గ్యాస్ కంపెనీవారికి సమాచారం అందించారు. వారు జాన్పాక వద్ద పైపులైన్కు వచ్చే గ్యాస్ను నిలిపివేయడంతో మంటలు ఆగిపోయాయి. ఆర్ఐ శ్రీధర్, గీసుకొండ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జాగ్రత్త చర్యలు చేపట్టారు. చెలరేగిన మంటలతో ఎవరికి ఎలాంటి హాని కలగలేదు. తల్లిదండ్రులు మృతి.. అనాథలైన ఇద్దరు పిల్లలు పర్వతగిరి: తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారుల అనాథలయ్యారు. ఏనుగల్ గ్రామానికి చెందిన ఉడతల సుధాకర్ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కాగా, సుధాకర్ భార్య మౌనిక కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందింది. దీంతో వారి కుమారులు శివ, హన్సిక్ అనాథలుగా మారారు. శివ ఆరో తరగతి, హన్సిక్ మూడో తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రుల మృతితో వీరు స్కూల్కు వెళ్లడం ఇబ్బందిగా మారనుంది. నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. తోట వీరశేఖర్ 8801802324, గూడ నరేందర్ 9866291917 నంబర్లకు ఫోన్ పే చేయాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లించాలి విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆ కమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్ పాల్గొన్నారు. -
శంకర్గౌడ్కు కొవ్వొత్తులతో నివాళి
హన్మకొండ: ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. శుక్రవారం రాత్రి టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ఆర్టీసీ కార్మికులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద కొలా శంకర్గౌడ్కు నివాళి అర్పించారు. ఈసందర్భంగా ఆర్టీసీ జేఏసీ వరంగల్ రీజియన్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే కోలా శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చేస్తున్న కాలయాపనతోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం డిమాండ్లు నెరవేర్చాలన్నారు. సత్తయ్య, వీకే.స్వామి, బట్టు స్వామి, రమేశ్, రంజిత్, మురళి, రంగు శ్రీధర్, మహిళా కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
నైపుణ్యాభివృద్ధితో ఉపాధి అవకాశాలు
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నైపుణ్యాభివృద్థితో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఐదో రోజు శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్న్స్ హాల్లో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉపాధి అవకాశాలు సులభంగా పొందవచ్చని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత నైపుణ్య అవకాశాలు పెంపొందించుకునే విధానాన్ని సీనియర్ ప్రొఫెసర్ నవీన్ వివరించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి గణేశ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రతినిధి మురళి వేస్ట్ మెటీరియల్ నుంచి విలువైన మెటీరియల్ ఎలా తయారు చేయాలో వివరించారు. అనంతరం యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో మే 8న నిర్వహించనున్న జాబ్మేళా పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, సంక్షేమ శాఖల అధికారులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు
వరంగల్ లీగల్: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన జూనియర్ సివిల్ జడ్జిల బదిలీల్లో భాగంగా హనుమకొండ జిల్లాకు చెందిన ముగ్గురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (విజిలెన్స్) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీజీఎం) ఎన్.శాంతి సోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఈ స్థానానికి రంగా రెడ్డి జిల్లా కూకట్పల్లి మొదటి అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ప్రతీక్సిహగ్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్.శ్రావణస్వాతిని రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్లోని మొదటి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేసి ఆమె స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా పనిచేస్తున్న తాడూరి మహతివైష్ణవిని నియమించారు. హనుమకొండ మూడం మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి సిరిసల్లా ప్రియాంకను రంగారెడ్డి జిల్లా హయత్నగర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి (పీడీఎం)గా బదిలీ చేసి, రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పీసీఆర్ కోర్టు జడ్జి శ్రద్ధాసేహగల్ను నియమిస్తూ బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన జడ్జిలు ఈనెల 27 వరకు తమ ప్రస్తుత స్థానాల నుంచి రిలీవ్ కావాలని, మే 2 వరకు బదిలీ అయిన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈనెల 24, 25 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీబీఏ, బీఎస్సీ వివిధ సెమిస్టర్ల పరీక్షలు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ శుక్రవారం తెలిపారు. ఆర్టీసీ బస్సుల బంద్ నేపథ్యంలో ఈరెండు రోజుల పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి టైంటేబుల్ ప్రకారం యథావిధిగా ఆయా పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈనెల 24, 25న వాయిదా పడిన పరీక్షల తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. రిజిస్ట్రార్కు ఏబీవీపీ వినతి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని ఏబీవీపీ కేయూ కార్యదర్శి మేకల జ్ఞానేశ్వర్, బాధ్యులు మెరుగు సాయి, అఖిల్, రజనీకాంత్, ప్రణయ్ శుక్రవారం ఉదయం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంకు వినతిపత్రం అందించారు. విద్యారణ్యపురి: రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ చెల్లింపుల విషయంలో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేయాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో–కన్వీనర్ ధర్మేంద్ర, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం హనుమకొండలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన ఆసాధన కమిటీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. వంద రోజుల్లో రెవెన్యూ రీసోర్సెస్ మొబిలైజేషన్ కమిటీ ద్వారా నిధులు సమకూర్చుకుని ఇచ్చిన గడువులోగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ రాక మానసికంగా కుంగిపోయి అనారోగ్యంతో ఇప్పటి వరకు 91 మంది మరణించారన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. సమావేశంలో ఆకమిటీ సహ కార్యదర్శి మేకరి దామోదర్, ఇంద్రసేనారెడ్డి, విశ్వనాథం, బత్తిని సారయ్య, శ్యామ్, క్షీర సాగర తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శుక్రవారం డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జేఎన్ స్టేడియంలో అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హ్యాండ్బాల్, క్రికెట్, కబడ్డీ, లాన్టెన్నిస్, వాలీబాల్, ఖోఖో, బాక్సింగ్ క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు https://satgasc.telangana.gov.in వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జేఎన్ఎస్లోని డీవైఎస్ఓ కార్యాలయంలో నేరుగా సంప్రదించవచ్చని తెలిపారు. -
కేంద్ర మంత్రి రాకతో వేడెక్కిన ముత్తోజిపేట
కేంద్ర హోంశాఖ సహాయ శాఖమంత్రి బండి సంజయ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముత్తోజిపేటకు చేరుకుని శంకర్గౌడ్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంత రం శంకర్ భార్య లత, కుమారుడు హేమంత్, కూతురు, అల్లుడిని పరామర్శించారు. తనవంతు ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇచ్చారు. శంకర్ మృతదేహా న్ని నర్సంపేట డిపో వద్దకు తీసుకెళ్లి నివాళులర్పించిన తర్వాత ముత్తోజిపేటకు తీసుకొస్తామని బతిమిలాడినా పట్టించుకోవడం లేదని కుటుంబ సభ్యులు, కార్మికులు మంత్రికి విన్నవించారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడారు. డిపో వద్దకు మృతదేహాన్ని తరలించాలని కార్యకర్తలకు సంజయ్ సూచించడంతో ఫ్రీజర్లో ఉన్న శంకర్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాటలో ఫ్రీజ ర్ బాక్స్పైన గ్లాస్ మూత పగిలిపోయింది. ఫ్రీజర్బాక్స్ను సుమారు 500 నుంచి 600 మీటర్ల దూరం వరకు కార్యకర్తలు ఒక్కసారిగా లాక్కొని రావడంతో ఒక్కసారిగా ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అనుమతించని పోలీసులు.. మృతదేహాన్ని తీసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు పక్కకు తోసేశారు. సుమారు గంటపాటు మృతదేహం ఎండలోనే ఉండిపోయింది. డిపో వద్ద ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని బండి సంజయ్ హామీ ఇచ్చినా పోలీసులు అనుమతివ్వలేదు. ఒక అంబులెన్స్ తీసుకొచ్చి మృతదేహాన్ని ఎక్కించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సీపీ సన్ప్రీత్ సింగ్ వచ్చి కేంద్ర మంత్రి బండి సంజయ్కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మంత్రి కారు దిగి పక్కనే ఉ న్న ఇంటి రేకుల కిందకు వెళ్లిపోయారు. వెంటనే పోలీసులు మృతదేహం, కుటుంబ సభ్యులను ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఉత్కంఠ మధ్యాహ్నం 3.40 గంటల వరకు కొనసాగింది. పోలీసులు నచ్చజెప్పడంతో బండి సంజయ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారావు, కొండేటి శ్రీధర్, నాయకులు రావు పద్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 6 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కాగా.. 7.30 గంటలకు అంత్యక్రియలు ముగిశాయి. కాగా, శంకర్ గౌడ్ భార్య లత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
లెక్కాపత్రం లేకపోతే ఎలా?
● మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: హనుమకొండ ప్రాంతంలోని పలు డివిజన్ల నుంచి వెలువడుతున్న తడి, పొడి చెత్త సేకరణలో లెక్కాపత్రం లేకపోతే ఎలా? అంటూ మేయర్ గుండు సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని సెకండ్ వెహికిల్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మేయర్ తడి, పొడి చెత్త సేకరణకు సంబంధించిన రిజిస్టర్ను పరిశీలించారు. నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలో తడి, చెత్త సేకరణ పరిమాణాన్ని పెంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుభ్రతకు ప్రాధాన్యమిస్తూ.. చెత్త వర్గీకరణను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. తడి చెత్తను వేరు చేసి సేకరించే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని కోరారు. -
ప్రైవేట్ వాహనాల దోపిడీ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజు శుక్రవారం ఉధృతంగా సాగింది. వరంగల్ రీజియన్ వ్యాప్తంగా 8 డిపోల పరిఽధి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నర్సంపేట డిపో డ్రైవర్ కోలా శంకర్గౌడ్ ఆత్మహత్య చేసుకోగా.. ఆర్టీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. దీంతో విద్యుత్ బస్సులతో పాటు ప్రైవేట్ అద్దె బస్సులు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శంకర్గౌడ్ మృతి నేపథ్యంలో బస్సులు నడిపితే కార్మికులను రెచ్చగొట్టినట్లవుతుందని, బస్సులకు నష్టం చేకూరే అవకాశం ఉంటుందని భావించిన ఆర్టీసీ అధికారులు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా సంస్థ బస్సులతో పాటు విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నిలిపేశారు. దీంతో బస్సులు నడుస్తాయని హనుమకొండ జిల్లా బస్స్టేషన్కు వచ్చిన ప్రయాణికులు గంటల కొద్ది నిరీక్షించి కొందరు తిరిగి ఇళ్లకు వెళ్లగా, మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. అమాంతం డబుల్.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో బస్సులు నిలిచిపోవడంతో ప్రైవేట్ వాహనదారులు రెచ్చిపోయారు. అధిక చార్జీల పేరిట ప్రయాణికుల నుంచి వసూలు చేశారు. విచ్చలవిడిగా వసూళ్లతో ప్రయాణికులను జేబులకు చిల్లు పెట్టారు. ఆటోవాలాలు సైతం పొరుగు నగరాల వరకు ప్రయాణికులను చేరవేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హనుమకొండ నుంచి జగిత్యాల వరకు ఆటోలో ప్రయాణికులను చేరవేర్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రయాణికులు కూడా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు అందుబాటులో ఉన్న ప్రయాణ వనరుల్ని వినియోగించుకుంటున్నారు. అధిక చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోయారు. సమ్మె జరిగిన బుధ, గురువారాల్లో స్వల్పంగా బస్సులు నడిచాయి. బంద్ నేపథ్యంలో శుక్రవారం బస్సులు పూర్తిగా నిలిపేయడంతో ప్రైవేట్ వాహనదారుల పంట పండింది. హనుమకొండ నుంచి హైదరాబాద్కు రూ.350 తీసుకునే ప్రైవేట్ కార్లు రూ.500 వరకు వసూలు చేశారు. హనుమకొండ నుంచి ఏటూరునాగారానికి ఎక్స్ప్రెస్కు రూ.180, మంగపేటకు రూ.200 కాగా, ప్రైవేట్ వాహనదారులు రూ.400 వసూలు చేసినట్లు ప్రయాణికులు తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ఉచిత ప్రయాణం చేద్దామని వచ్చిన మహిళా ప్రయాణికులు ఖంగుతిన్నారు. కొన్ని రూట్లలో ప్రైవేట్ వాహనాలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు.రెట్టింపు చార్జీలు వసూలు ప్రయాణికుల జేబులకు చిల్లు మూడోరోజు కొనసాగిన ఆర్టీసీ సమ్మె కదలని ప్రగతి రథ చక్రాలు.. డిపోల వద్ద కార్మికుల ధర్నా -
శంకర్ గౌడ్ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
సాక్షి,వరంగల్: నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల్ శంకర్గౌడ్ మృతదేహానికి నర్సంపేట ఆర్డీవో ఉమారాణి నివాళులర్పించారు. ప్రభుత్వం తరపున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందిస్తున్నట్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తరుపున రూ.10లక్షల ఎక్స్గ్రేషియా,మృతుడి కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు.నర్సంపేట ఎమ్మెల్యే దొంతిరెడ్డి మాధవరెడ్డి రూ.5లక్షలు సహాయం చేశారు.తెలంగాణ ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే మిగిలిన మూడు హామీల విషయంలో తమకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు అధికారులు ఆర్టీసీ జేఏసీని విజ్ఞప్తి చేశారు. మూడు డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆర్టీసీ జేఏసీ పట్టుబడుతోంది.చర్చల్లో ఆర్టీసీ జేఏసీ మూడు డిమాండ్లు ఇవేఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలి. గత ప్రభుత్వం రద్దు చేసిన సంఘాలను పునరుద్ధరించాలి. 2021 వేతన సవరణ 30శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి.2025 వేతన సవరణ అమలు చేయాలి’అని డిమాండ్లు చేస్తున్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్గౌడ్ ఆత్మహత్యకు యత్నించాడు. సమ్మెలో భాగంగా రెండో రోజు డిపో వద్ద కార్మీకులు చేస్తున్న ఆందోళన వద్ద గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన తోటి ఉద్యోగులు మంటలను ఆర్పారు. అప్పటికే తీవ్రగాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి అంబులెన్స్లో తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 80 శాతానికిపైగా కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మరణించారు.కాగా తమ డిమాండ్లను పరిష్కరించాలని రెండు రోజులుగా రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులను నడుపుతుండటాన్ని నిరసిస్తూ శంకర్గౌడ్ ఒంటికి నిప్పంటించుకున్నట్లు తోటి ఉద్యోగులు చెప్పారు.ముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తతముత్తోజీపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతికకాయాన్ని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శంకర్గౌడ్ భౌతికకాయాన్ని నర్సంపేట డిపో దగ్గరకు తీసుకెళ్తామని ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతుండగా.. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో తన వాహనంలో భౌతికకాయాన్ని తీసుకెళ్లేందుకు బండి సంజయ్ ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బండిసంజయ్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బండి సంజయ్ పోలీసులే అంత్యక్రియలు చేయండంటూ ఫైర్ అయ్యారు. కుమార్తె ఇంటికి శంకర్ గౌడ్ మృతదేహం తరలించారు. -
శంకర్ గౌడ్ మృతదేహాన్ని తరలించే యత్నం.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ భౌతిక కాయానికి నివాళులర్పించి.. ఆయన కుటుంబాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. ఆ సమయంలో శంకర్ మృతదేహాన్ని డిపో వరకూ తీసుకెళ్తామని కార్మికులు ఆయనతో అన్నారు. అయితే పోలీసులు అందుకు ఒప్పుకోకపోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే విషయమై ఆర్టీసీ కార్మికులకు ఉదయం పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఆ సమయంలోనూ ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు.. శంకర్గౌడ్ ఇంటి వద్ద వేసిన టెంట్ను సైతం తొలగించారు. కాసేపటికి కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కడికి వచ్చారు. ఆ సమయంలోనూ కార్మికులు అదే డిమాండ్ చేశారు. డిపో వద్ద తమ తోటి కార్మికుడి మృతదేహానికి నివాళులర్పించేందుకు అనుమతించాలని పోలీసులను కోరారు. అందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పోలీసుల వైఖరిని బండి సంజయ్ తప్పుబట్టారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తాం.. మీరు తీసుకెళ్లండి అని కార్మికులతో అన్నారాయన. ఆ సమయంలో పోలీసులు భారీగా మోహరించడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు కొందరు కార్మికులు, బీజేపీ కార్యకర్తలు పోలీసులను దాటుకుని రోడ్డుపై శంకర్ గౌడ్ మృతదేహాన్ని నెట్టుకుంటూ తరలించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. నిన్న సమ్మె రెండు రోజు జరగ్గా.. నర్సంపేట డిపోలో డ్రైవర్గా పని చేసే కోలా శంకర్గౌడ్ ప్రభుత్వ తీరుకు నిరసగా పెట్రోల్ పోసుకుని నిప్పటించుకున్నాడు. తీవ్ర గాయాలతో(80 శాతం) హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి సమయంలో కన్నుమూశాడు. పోస్ట్మార్టం అనంతరం శంకర్ గౌడ్ మృతదేహాన్ని స్వస్థలం ముత్తోజీపేట పోలీసులు తరలించారు. -
పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు
దుగ్గొండి/నెక్కొండ: కుటీర పరిశ్రమల స్థాపన కోసం ప్రతి మహిళా పొదుపు సంఘం రూ.కోటి రుణం తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి మండలంలోని చాపలబండ, నెక్కొండ మండలంలోని అప్పల్రావుపేటలో గురువారం ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించి మాట్లాడారు. పొదుపు సంఘాలకు రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. గిర్నిబావి శివారులో త్వరలోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేదలకు వైద్య సేవలందిస్తామని హామీ ఇచ్చారు. మరిన్ని నిధులతో అప్పల్రావుపేట గ్రామాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాల్లో దుగ్గొండి తహసీల్దార్ ముస్కు సమ్మక్క, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఓ రమేశ్, చాపలబండ సర్పంచ్ అల్లాటి ప్రభు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు సంధ్య, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, ఏపీఎం రాపాక కిరణ్కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బక్కి అశోక్ పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
వరంగల్పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నంవిద్యార్థులు మొబైల్కు బానిస కావొద్దువాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. బస్సు బయటకు రావడంతో అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులుహనుమకొండ డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులుఉర్దూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి. కలెక్టర్ డాక్టర్ సత్యశారద తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలింపు.. వెంటిలెటర్పై చికిత్స ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ -
ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు
శంకర్గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ: నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. -
వరంగల్ ఏసీపీ పోస్టుపై అనాసక్తి
సాక్షి, వరంగల్: వరుస వివాదాలకు కేంద్రబిందువు అవుతున్న వరంగల్ పోలీసు డివిజన్లో ఏసీపీ పోస్టు ఖాళీగా ఉంది. అక్కడికొచ్చేందుకు ర్యాంకర్ ఆఫీసర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ డివిజన్ పరిధిలోని మిల్స్కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్గంజ్ ఠాణాల్లోనూ నమోదువుతున్న కొన్ని కేసులు కూడా రాజకీయపరమైన వైషమ్యాలకు అవకాశం ఇస్తుండడం.. వరంగల్ తూర్పులో అధికార కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉండడంతో డైలమాలో పడుతున్నట్లు తెలుస్తోంది. 2025 జూన్ 29వ తేదీ ముందు పనిచేసిన ఏసీపీ నందిరాంనాయక్ను 2025 డిసెంబర్ 22న తప్పుడు కేసులో ప్రమేయముందని తేలడంతో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 2025 జూన్ 29 తర్వాత ఏసీపీగా ఇక్కడకు వచ్చిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శుభం ప్రకాశ్ 10 నెలల తిరగకముందే పదోన్నతిపై నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్)గా వెళ్లడంతో ఇక్కడ ఏసీపీ పోస్టు ఖాళీ ఏర్పడింది. ఈయన సమయంలో ఆయా ఠాణాల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి బ్యాచ్ల ఆగడాలు, శ్రుతిమించుతున్న ఘటనలు నమోదయ్యాయి. ఒకవర్గానికి చెందిన రాజకీయ నేతల అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇలా నేరాలు ఎక్కువవుతున్నా.. పరిష్కరించడంలో వెనుకబడిపోయారు. డివిజన్ పరిధిలో నేరాలు నిత్యకృత్యం వరంగల్ పోలీసు డివిజన్ పరిధిలోని మిల్స్కాలనీ ఠాణాపరిధిలో 2025లో 643 కేసులు, 2026లో మార్చి చివరి నాటికి 260 కేసులు నమోదయ్యాయి. మట్టెవాడ పోలీసుస్టేషన్ పరిధిలో 2025లో 553 కేసులు, 2026లో 190 కేసులు నమోదయ్యాయి. ఇంతేజార్గంజ్ ఠాణా పరిధిలో 2025లో 514 కేసులు నమోదైతే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 161 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే ఈ డివిజన్ పరిధిలో వ్యాపార సముదాయాలు, మాస్ ప్రాంతాలు, మురికివాడలు ఉండడంతో ఇక్కడ నేరాలనేవి నిత్యకృత్యంగా మారాయి. దీనికితోడు రాజకీయ వైరుధ్యాలు కూడా ఇక్కడ పనిచేసే పోలీసులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. కొందరు అధికారులు బాహాటంగానే ఒక వర్గానికి మద్దతుగా పనిచేస్తుండడంతో సస్పెండ్ అవుతున్న ఘటనలు సైతం జరుగుతున్నాయి. ఈ వ్యవస్థను గాడిన పెట్టడానికి పోలీసు ఉన్నతాధికారులు ర్యాంకర్ ఆఫీసర్ను ఇస్తారా.. లేదా ఐపీఎస్ అధికారికి వరంగల్ ఏసీపీగా అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. అయితే ర్యాంకర్ అయితే రాజకీయనేతల ప్రలోభానికి ఏదో సందర్భంలో గురయ్యే అవకాశముంటుందని, అందుకే నిక్కచ్ఛిగా పనిచేసే ఐపీఎస్లకే అవకాశం ఇవ్వాలని అంటున్నారు. వివాదాలకు కేంద్రమవుతుండడంతోనే వెనుకడుగు అధికార పార్టీలో రాజకీయ వైషమ్యాలు మరో కారణం ఇప్పటికే గతంలో ఏసీపీతో పాటు పలువురిపై వేటు ర్యాంకరా...లేదా ఐపీఎస్ అధికారి వస్తారా అనే చర్చ పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి -
చెన్నారంలో గాలివాన బీభత్సం
వర్ధన్నపేట: మండలంలోని చెన్నారం గ్రామంలో గురువారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న 50 మంది రైతులకు చెందిన 500 క్వింటాళ్ల మొక్కజొన్నలు తడిసిముద్దయ్యాయి. అదేవిధంగా వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోయాయి. పలు ఇళ్ల రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పోయి గ్రామంలో అంధకారం ఏర్పడింది. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు ● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్వర్ధన్నపేట: హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టుగా ఉందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గురువారం వర్ధన్నపేటలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. రెండు పిల్లర్లు కుంగినంత మాత్రానా కావాలని ప్రాజెక్టులో నీరు నింపక ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో సబ్బండ వర్గాలను ఆదుకున్నారని కొనియాడారు. పార్టీ మండల అధ్యక్షుడు తూల్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, కౌన్సిలర్లు గుజ్జ వీరరాఘవరావు, తిరుపతి సురేశ్, బానోత్ జ్యోతి నవీన్, తుమ్మల అరుణ శ్రీధర్, నాయకులు మార్త సారంగపాణి, పూజారి రఘు, కొండేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏనుమాముల మార్కెట్లో రైతుల ఆందోళనఖిలా వరంగల్: మార్క్ఫెడ్ అధికారులు మక్కలు కొనుగోలు చేయాలని వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో రైతులు గురువారం ఆందోళన చేశారు. మార్కెట్లో మార్కెఫెడ్ మక్కల కొనుగోళ్లను నిలిపివేయడంతో నిల్వలు భారీగా పేరుకుపోయాయి. కొనుగోలు చేసిన మక్కలకు కాంటాలు వేయడం లేదు. మక్కలు నింపేందుకు గన్నీ సంచులు ఇవ్వకపోడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పది రోజులుగా మక్కల కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తక్షణమే మార్క్ఫెడ్ అధికారులు స్పందించి మక్కల కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కాగా, వర్షం వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు రైతులకు టార్పాలిన్లు అందజేశారు. -
ఆర్టీసీ డిపోల వద్ద అంబులెన్స్లు
శంకర్గౌడ్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం హన్మకొండ: వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని డిపోల వద్ద 108 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. గురువారం రాత్రి అంబులెన్స్లు డిపోల వద్దకు చేరుకున్నాయి. హనుమకొండ జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆదేశాల మేరకు అంబులెన్స్లను అధికారులు అందుబాటులో ఉంచినట్లు 108 సిబ్బంది తెలిపారు. -
ఆర్టీసీ సమ్మెలో విషాదం
పసుపు ధర ౖపైపెకి.. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు పంట ధర రోజురోజుకూ ౖపైపెకి చేరుకుంటోంది. నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నంవాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతోపాటు ఉక్కపోత ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026నర్సంపేట : నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ కోల శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడపాలని ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు చేస్తున్న ప్రయత్నాన్ని నిరసిస్తూ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్ప డడం కలకలం రేపింది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా రెండో రోజు గురువారం ఉదయమే నర్సంపేట డిపో ఎదుట డ్రైవర్లు, కండక్టర్లు బైఠాయించారు. ఈ ఆందోళనలో పాల్గొన్న శంకర్గౌడ్ ఇంటికి వెళ్లి మధ్యాహ్నం 3.45 గంటలకు ధర్నా వద్దకు చేరుకున్నాడు. తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన కార్మికులు మంటల్లో చిక్కుకున్న శంకర్ను కాపాడేందుకు 30 నిమిషాలపాటు ప్రయత్నించారు. 75 శాతం కాలిన ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత హైదరాబాద్కు తరలించారు. ప్రస్తుతం కంచన్బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో వెంటి లెటర్పై చికిత్స పొందుతున్నట్లు రాత్రి ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. కాగా, నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు డిపో వద్ద ఆందోళన నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని స్థానిక డిపో మేనేజర్ సమ్మెను నీరుగార్చే ప్రయత్నం చేయడంతోనే మనస్తాపం చెందిన శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. భారీ బందోబస్తు... నర్సంపేట డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా డీసీపీ అంకిత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించారు. బస్టాండ్ ఎదుట, వరంగల్ రోడ్డులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మిక సంఘాలతో నేడు (శుక్రవారం) చర్చలు జరుపుతామని ప్రకటించిన విషయాన్ని కార్మికులకు పోలీసులు తెలిపి ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఆర్టీసీ కార్మికులు తిరిగి డిపో వద్దకు చేరుకుని ఆందోళనలు చేశారు. ఘటనాస్థలాన్ని సందర్శించిన సీపీ నర్సంపేటలో బస్టాండ్లో ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ నిప్పంటించుకున్న స్థలాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ .. రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును పోలీస్ కమిషనర్.. స్థానిక పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, స్పెషల్ బ్రాంచ్, నర్సంపేట ఏసీపీలు జితేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ముస్క శ్రీనివాస్, సీఐలు శ్రీనివాస్, సాయి రమణ, దుగ్గొండి ఎస్ఐ రణధీర్ ఉన్నారు. డిపో ఎదుట ధర్నా, రాస్తారోకో.. డ్రైవర్ శంకర్గౌడ్ ఘటన గురించి తెలుసుకున్న బీఆర్ఎస్, బీజేపీ, బీసీ సంఘం, కమ్యూనిస్టు పార్టీల నాయకులు ఆర్టీసీ డిపో వద్దకు చేరుకుని ధర్నా, రాస్తారోకో చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైఫల్యంతోనే డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆరోపించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. బస్సు బయటకు రావడంతో అడ్డుకుంటున్న ఆర్టీసీ కార్మికులుహనుమకొండ డిపో గేటు వద్ద ధర్నా చేస్తున్న ఆర్టీసీ కార్మికులుఉర్దూకు రాష్ట్రంలో రెండో అధికార భాషా హోదా కల్పించినా నిధులు కేటాయించడం లేదు. దీంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, లైబ్రరీలు దీనస్థితికి చేరుకున్నాయి. తీవ్రగాయాలతో హైదరాబాద్కు తరలింపు.. వెంటిలెటర్పై చికిత్స ప్రభుత్వ వైఫల్యంతోనే కార్మికుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆరోపణ -
పూడికతీత పనులు పూర్తి చేయండి
హన్మకొండ అర్బన్: భద్రకాళి చెరువు పూడికతీత పనులు వేగవంతం చేసి, మట్టి తరలింపు ప్రక్రియను సాఫీగా నిర్వహిస్తూ మే 15 నాటికి పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భద్రకాళి చెరువు పూడిక మట్టి తరలింపుపై సంబంధిత శాఖల అధికారులు, కాంట్రాక్టర్తో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వరంగల్ కలెక్టర్ సత్యశారద వీడియో కాన్ఫరెన్న్స్లో పాల్గొని పలు సూచనలిచ్చారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.రవి, వైవీ.గణేశ్, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, సాగునీటి పారుదల సీఈ సుధీర్, ఎస్ఈ రాంప్రసాద్, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ‘కుడా’ సీపీఓ అజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న, ఈఈ కిరణ్ కుమార్, డీఈఈ మధుసూదన్రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం తీసుకుంటూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘పోషణ్ పక్వాడ’ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ చేతుల మీదుగా చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం నిర్వహించారు. గర్భిణులకు సీమంతం చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జీసీడీఓ సునీత, పోషణ్ అభియాన్ జిల్లా కో–ఆర్డినేటర్ సుమలత, ఆయుష్ జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ మహేందర్ కుమార్, డీపీఎం డాక్టర్ భాను ప్రకాశ్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుబీనా, డెమో అశోక్ రెడ్డి, మెప్మా డీఎంసీ రజిత రాణి, ఎఫ్ఆర్ఓ రవికృష్ణ, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు, గర్భిణులు, చిన్నారులు పాల్గొన్నారు. హనుమకొండ కలెక్టర్ చాహత్ అధికారులతో సమీక్ష -
దేశానికి ఆదర్శం ముల్కనూరు సొసైటీ
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ భీమదేవరపల్లి: ముల్కనూరు సొసైటీ మోడల్ దేశవ్యాప్తంగా అమలు చేస్తే అద్భుత ఫలితాలు సాధ్యమవుతాయని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఆమె గురువారం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ముల్కనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం సొసైటీ పరిధి గోదాం, కాటన్ మిల్లు, రైస్ మిల్లు యూనిట్లను సందర్శించి కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు. ఈసందర్భంగా సొసైటీ అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సొసైటీ నిర్వహణ, రైతులకు అందిస్తున్న సేవలు, లాభాలపై కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వివరించారు. సొసైటీ అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్రెడ్డి కార్యకలాపాలను వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ రవి, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి వాజీద్ అలీ, హనుమకొండ డీఎం మహేందర్, ఏడీఏ ఆదిరెడ్డి, తహసీల్దార్ రాజేశ్, ఏఓ పద్మ, ఏఈఓలు, ముల్కనూరు సర్పంచ్ జాలి ప్రమోద్రెడ్డి, జనరల్ మేనేజర్ రాంరెడ్డి, ఏజీఎం సతీశ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రెండున్నరేళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్
హన్మకొండ: కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండున్నరేళ్లుగా డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీర్తిని ఎవరూ తగ్గించలేరని ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ స్నేహనగర్లోని ఎస్వీ కన్వెన్షన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘోష్ కమిషన్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్కు, రేవంత్ సర్కార్కు చెంపపెట్టు వంటిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే గొప్ప సాగు, తాగు నీటి ప్రాజెక్టు అన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా కేసీఆర్ని బద్నామ్ చేసేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేసి కేసీఆర్ను దోషిగా చూపాలని యత్నిస్తున్నారని, అయితే హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. కేసులు కొట్లాటలు తమకు కొత్త కావని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. ప్రజల తరఫున బాధ్యత గల ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పోరాడుతోందన్నారు. నాయకులు మర్రి యాదవరెడ్డి, మధు, సోదా కిరణ్, సంకు నర్సింగ రావు, లోహిత రాజు, బొంగు అశోక్, జోరిక రమేశ్, పులి రజినీకాంత్, సుధాకర్రెడ్డి, రామ్మూర్తి, చిన్న, వెంకన్న పాల్గొన్నారు.బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
స్టేడియంలో ఆస్ట్రో టర్ఫ్ పిచ్
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో క్రికెటర్లకు మరింత మెరుగైన శిక్షణ అందించేందుకు ఆస్ట్రో టర్ఫ్ పిచ్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీవైఎస్ఓ కొత్త ప్రశాంత్ తెలిపారు. ఈమేరకు గురువారం రెడీమేడ్ టర్ఫ్ పించ్ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా డీవైఎస్ఓ ప్రశాంత్ మాట్లాడుతూ.. డీఎస్ఏ క్రికెట్ కోచ్ మహ్మద్ అఫ్జల్ ప్రత్యేక చొరవ, కృషితో సుమారు రూ.28 వేల విలువైన ఆస్ట్రో టర్ఫ్ పిచ్ను మీరట్ నుంచి తెప్పించినట్లు తెలిపారు. హన్మకొండ అర్బన్: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్లో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, తదితరులు పాల్గొని భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహ స్వామి, జిల్లా సగర సంఘం నాయకులు నలుబోల సతీశ్, సీతా కమలాకర్ రావు, నెక్కొండ కిషన్, వడ్లకొండ కుమారస్వామి, గాండ్ల స్రవంతి, తాడిశెట్టి విద్యాసాగర్, అయోధ్య మంగనూరి రఘు, కోడిపాక గణేశ్ కుమార్, కానిగంటి రవి తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టర్, రెడ్క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్పాయ్ని గురువారం జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్తోపాటు పాలకవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను కలెక్టర్కు వివరించారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ప్రారంభోత్సవం, డైనింగ్ హాల్ భూమిపూజ, రెడ్క్రాస్ డే కార్యక్రమాలకు హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ చైర్మన్ డాక్టర్ పి.విజయ్ చందర్ రెడ్డి, కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవీ. శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు పుల్లూరి వేణుగోపాల్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, బిళ్ల రమణారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ అర్బన్: మహా నగర వ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంచేందుకు మే 1 నుంచి 31 వరకు వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్దియా ఆధ్వర్యంలో ఇండోర్ స్టేడియంలో స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్–26 నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. బల్దియా ఇండోర్ స్టేడియంలో బాడ్మింటన్, జూడో, క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ యోగా క్రీడాంశాల్లో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 4–10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా జీడబ్ల్యూఎంసీ ఇండోర్ స్టేడియంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం 98499 09333, 97019 99651, 85229 95960, 90325 04143 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
సమయపాలన పాటించాలి
వేలేరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీలోని సిబ్బంది హాజరు, రికార్డులు, మందులు, ల్యాబ్ రూం, ఓపీ సేవల్ని పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలో హెచ్పీవీ వ్యాక్సినేషన్, ఎన్సీడీ, ఏఎన్సీ టార్గెట్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఓఆర్ఎస్ నిల్వల గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధి హమీ కార్మికులకు సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య ఉపకేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శంకర్ గౌడ్ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు -
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో విషాదం.. శంకర్ గౌడ్ మృతి
సాక్షి, వరంగల్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న హామీ నెరవేరడం లేదన్న ఆవేదనతో వరంగల్ (D) నర్సంపేట ఆర్టీసీ డిపోలో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శంకర్ గౌడ్కు ఊపిరితిత్తులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ గౌడ్ను వరంగల్ MGM నుంచి హైదరాబాద్కు తీసుకొస్తుండగా కర్మాన్ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ DRDO అపోలో ఆస్పత్రిలో ఆయన మృతదేహం ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఇక శంకర్ గౌడ్ మరణవార్త తెలియడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు డిపోల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ప్రభుత్వం చర్చలకు సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో శంకర్ గౌడ్ ఇలా బలవన్మరణం చెందడం కార్మిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నిబద్ధత కలిగిన కార్మికుడిని కోల్పోయామంటూ తోటి ఉద్యోగులు భావోద్వేగానికి లోనైయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అయితే తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం మాత్రం ఆపేది లేదని యూనియన్ నేతలు స్పష్టం చేస్తున్నారు.నేడు నర్సంపేట బంద్కు పిలుపునర్సంపేటలో ఉద్రిక్తతఆర్టీసీ డిపో ముందు మోహరించిన పోలీసులుఅర్ధరాత్రి అవుతున్న డిపో కి భారీగా చేరుకున్న ఆర్టీసీ కార్మికులు -
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, వరంగల్: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిపై వరంగల్ ఎంజీఎం వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.శంకర్ గౌడ్ పరిస్థితి నిలకడగా ఉంది. 60 నుండి 80 శాతం కాలిన గాయాలయ్యాయి. మంటల వల్ల ఊపిరితిత్తులు డ్యామేజ్ అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్నాం. ఒళ్ళంతా మంటల వల్ల ఎడిమా వచ్చింది. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం. మాట్లాడే పరిస్థితి లేదు, చికిత్సకు స్పందిస్తున్నారు’ అని ఎంజీఎం ఆర్ఎం డాక్టర్ అశ్విన్ తెలిపారు. నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తతనర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. అప్రమత్తమైన తోటి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ శంకర్కు అంటుకున్న మంటల్ని ఆర్పేశారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శంకర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలు దారితీస్తోంది. తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వానికి, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, ఈ చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ క్రమంలో నర్సంపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న శంకర్ మానకిక ఒత్తిడికి గురయ్యారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. -
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
వరంగల్ విశ్వబ్రాహ్మణ వీధిలో బాలుడిని వెంబడిస్తున్న కుక్కహనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రైసిటీలోని సుభాష్నగర్, ఎన్యూఆర్ నగర్, మార్కెట్ ఏరియాతో పాటు నగరంలో సుమారు వంద చోట్ల సమస్య తీవ్రంగా ఉంది. ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) కార్యక్రమం సరైన స్థాయిలో అమలు కాకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోంది. నిపుణులు చెబుతున్న ప్రకారం కనీసం 70 శాతం కుక్కలను స్టెరిలైజ్ చేస్తేనే నియంత్రణ సాధ్యమవుతుంది. దీంతో పాటు మాంసం దుకాణాల్లోని వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా చూడాలి. బల్దియా సిబ్బంది ఇంటింటా చెత్తను సేకరించాలని, నగర పాలక సంస్థ అధికారులు స్పందించి కుక్కల నుంచి తమను రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. గ్రేటర్ వరంగల్ నగరంలో వీధికుక్కల సమస్య పెనుసవాలుగా మారింది. రోజురోజుకూ నమోదవుతున్న కుక్క కాట్ల కేసులు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీలో సుమారు 55 వేల నుంచి 65 వేలకుపైగా స్ట్రే డాగ్స్(వీధి కుక్కలు) సంచరిస్తున్నాయి. రోజుకు 20 నుంచి 25 వరకు కుక్క కాట్ల కేసులు నమోదవుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) స్టెరిలైజేషన్, ఎనిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెబుతున్నా.. ఆ మేరకు ఫలితాలు కనిపించట్లేదు. గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు నగర ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. చర్యలేవి? 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,257 మంది కుక్కకాటుకు గురైనట్లు వరంగల్ ఎంజీఎం రికార్డులు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 600 మందికిపైగా కుక్కకాటుకు గురయ్యారు. కాగా, రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో కుక్కల సంచారం లేకుండా చర్యలు తీసుకోవాలని, వాటిని షెల్టర్ హోంకు తరలించాలని న్యాయస్థానాలు ఆదేశించినా బల్దియా అధికార యంత్రాంగం చొరవ తీసుకోవట్లేదు. ఫిర్యాదు వస్తే కాలనీల్లోకి వెళ్లి 15 నుంచి 20 కుక్కలను పట్టుకోవడం, శస్త్ర చికిత్సలు నిర్వహించడం, ఐదు రోజుల తర్వాత తిరిగి అదే ప్రాంతంలో వదిలేయడం సర్వసాధారణమైపోయింది. కాపువాడలో జనావాసాల మధ్య చెత్త కుప్ప వద్ద వీధి కుక్క● ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనసంచారం రోజుకు 20–25 మందికి కుక్కకాట్లు.. ఆస్పత్రుల చుట్టూ జనం వీధి కుక్కల నియంత్రణలో జీడబ్ల్యూఎంసీ విఫలం రూ.కోట్లు ఖర్చవుతున్నా కానరాని నియంత్రణ కుక్కల నుంచి కాపాడాలని నగర ప్రజల వేడుకోలు గ్రేటర్ వరంగల్ నగరంలో కుక్కల బెడదకు ప్రధానంగా చెత్త నిర్వహణలో లోపాలే కారణం. ఓపెన్ డంపింగ్ యార్డులు, మాంసం వ్యర్థాలను వీధుల్లో పడేయడం వంటి వాటి వల్ల కుక్కల సంచారం పెరిగింది. నగరంలో చాలా ఏరియాల్లో నిత్యం చెత్తను తీసుకెళ్లే ఆటోలు రావట్లేదు. ఏం చేయాలో పాలుపోక చాలా మంది వీధి చివరన చెత్తను పడేస్తున్నారు. ఆయా ప్రదేశాల్లో కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. అటువైపుగా వెళ్తున్న వృద్ధులు, చిన్నపిల్లలను కరుస్తున్నాయి. -
సమన్వయంతో పనిచేయండి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పరకాల: ప్రభుత్వ అధికారుల పని తీరుతోనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, అందుకోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కోరారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా అధికారులు పనిచేయాలని ఆయన ఆదేశించారు. పరకాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ శాఖల అధికారులతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అందించడంలో గ్రామ పాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమని, వారి పనితీరును బట్టి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. వేసవిలో మంచినీటి ఎద్దడి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. గంజాయి నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని పోలీసులను, ఎకై ్సజ్ శాఖ అధికారులకు స్పష్టం చేసిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
కాకతీయుల కట్టడాలు అద్భుతం
ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాల మహా అద్భుతంగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల సెక్షన్ ఆఫీసర్లు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటను వారు సందర్శించారు. శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుష్మహల్, ఏకశిల గుట్ట, మట్టి, రాతికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. కార్యక్రమంలో టూరిస్ట్ పోలీస్ అనంద్ శ్రీనివాస్ రెడ్డి, మిల్స్ కాలనీ పోలీసులు ఉన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్ : నగర ప్రజలకు వేసవికాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలని మేయర్ సుధారాణి.. ఇంజనీర్లను ఆదేశించారు. బుధవారం వరంగల్ దేశాయిపేట ఫిల్టర్బెడ్ను మేయర్ తనిఖీ చేశారు. నీటి లభ్యత, శుద్ధీకరణ, క్లోరినేషన్ తదితర అంశాలను పరిశీలించారు. -
నాటు వైద్యం వద్దు..
కుక్క కరిచిన వెంటనే కనీసం 15 నిమిషాల పాటు సబ్బుతో, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం ఉపయోగించాలి. మిరియాలు, పసుపు, మూలికలు రాయడం లేదా గాయాన్ని గట్టిగా కట్టడం వంటి పద్ధతులు ఉపయోగించవద్దు. ఇవి రేబిస్ను నివారించవు. రేబిస్ ఒక అత్యంత ప్రమాదకర వ్యాధి. లక్షణాలు ప్రారంభమైన తర్వాత దాని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (టీకాలు), టెటనస్ టీకా గురించి సలహా తీసుకోండి. పిల్లలకు అవగాహన కల్పించండి. అపరిచిత కుక్కలను తాకవద్దు, వాటిని వేధించవద్దు, వాటి ముందు పరుగెత్తవద్దు. – డాక్టర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ, ఎంజీఎం -
రెండు నెలల్లో 229 మందికి కుక్క కాటు
కమలాపూర్: మండల వ్యాప్తంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కుక్కలు 229 మందిని కరిచాయి. ఎండాకాలంలో వీధి, పిచ్చి కుక్కలు మరింతగా రెచ్చిపోతున్నాయి. ఇటీవల కమలాపూర్ మండలంలోని వెంకటేశ్వర్లపల్లిలో ఒకే రోజు పిచ్చి కుక్క దాడి చేసి ముగ్గురు చిన్నారులతోపాటు మరో ఇద్దరిని కరిచి గాయపరిచింది. వీధి, పిచ్చి కుక్కలకు భయపడి గ్రామస్తులు ఇళ్లనుంచి బయటకు రావాలంటే గజగజ వణికిపోతున్నారు. రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులను కుక్కలు వెంబడిస్తుండడంతో ఇప్పటికే పలువురు వాహనదారులు ద్విచక్ర వాహనాలపైనుంచి కింద పడిపోయి గాయాలపాలయ్యారు. కుక్కలను నియంత్రించి వాటి బారినుంచి తమను రక్షించాలని మండల వాసులు వేడుకుంటున్నారు. కాగా, కమలాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కుక్క కాటుకు సంబంధించి యాంటీ రేబిస్ వ్యాక్సిన్లు 150 వరకు అందుబాటులో ఉన్నట్లు సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నరేశ్ తెలిపారు. -
‘సీకేఎం’లో ఆర్ఓ ప్లాంట్కు మరమ్మతులు
కాశిబుగ్గ: ‘దవాఖానల్లో దప్పిక’ శీర్షికన ఈ నెల 18న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్కు మరమ్మతులు చేసి, అవసరమైన కెమికల్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. పక్కనే ఉన్న నల్లాను కూడా రిపేర్ చేసి కొత్త నల్లాలు బిగించి, రోగుల అటెండెంట్లు నీరు పట్టుకునేలా ఏర్పాట్లు చేశారు. వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉదయం, సాయంత్రం శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. క్రీడలపై ఆసక్తి ఉన్న బాలబాలికలు https./satgasc. telangana.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో సాట్ నిర్ణయించిన ఫీజులు వర్తిస్తాయని, గ్రామీణ శిబిరాల్లో మాత్రం ఎలాంటి ఫీజు ఉండదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులు సైతం ఆన్లైన్ ద్వారా నమోదు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. క్రీడాసదుపాయాల మెరుగుదల కోసం నమోదు ఫీజులను వినియోగించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ క్రీడా ప్రతిభను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని డీఎస్ఏ కార్యాలయంలో సంప్రదించవచ్చని డీవైఎస్ఓ ప్రశాంత్ తెలిపారు. వరంగల్ స్పోర్ట్స్: తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరికి చోటు దక్కింది. ఈ నెల 21న హైదరాబాద్ గచ్చిబౌలిలోని గోిపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన అసోసియేషన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో 2026–30 కాలానికిగాను రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో జిల్లాకు చెందిన డాక్టర్ పింగిళి రమేశ్రెడ్డి ఉపాధ్యక్షుడిగా, డాక్టర్ మూల జితేందర్రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఎన్నికై నట్లు వారు తెలిపారు. హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్స్టేషన్ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్నకుమార్ (సీసీఎస్, వరంగల్ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్ (నల్లబెల్లి నుంచి వీఆర్, వరంగల్), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్పూర్), ీసీహెచ్.రఘుపతి (ఘన్పూర్ నుంచి వీఆర్, వరంగల్), ఈ.నర్సింహారావు (ధర్మసాగర్ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్కుమార్ (ఎల్కతుర్తి నుంచి వీర్, వరంగల్), ఎ.శ్రీకాంత్ (వీఆర్, వరంగల్ నుంచి బచ్చన్నపేట), ఎస్.కె.హమీద్ (బచ్చన్నపేట నుంచి వీఆర్, వరంగల్), బి.మంగ (వీఆర్, వరంగల్ నుంచి ట్రాఫిక్ కాజీపేట)కు బదిలీ అయ్యారు. ఇద్దరిపై వేటు ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్క తుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్కుమార్కు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయనను వీఆర్కు అటాచ్ చేశారు. బుధవారం బదిలీల్లో భాగంగా ఆయనకు వీఆర్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ చేసిన మరుక్షణమే ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్ వేటు వేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
డిపోలో బస్సులు.. ప్రయాణికుల అవస్థలు
వరంగల్ రీజియన్లో టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు బుధవారం పూర్తిస్థాయిలో సమ్మెలోకి వెళ్లారు. ఉదయమే కార్మికులు డిపోల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. హనుమకొండ డిపో వద్ద అద్దె బస్సులను నడిపించాలని చూడగా కార్మికులు అడ్డుకున్నారు. అధికారులు కొన్ని విద్యుత్, ప్రైవేట్ అద్దె బస్సులను నడిపించారు. సరిపడా బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. అత్యవసర పనులున్న వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. – హన్మకొండ సమ్మెలోకి ఆర్టీసీ కార్మికులు -
శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సేవాకార్యక్రమాలకు వరంగల్ ఆర్యవైశ్య (పట్టణ) సంఘం, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆర్యవైశ్య నాయకులు గుండా ప్రకాశ్రావు, తొనుపునూరి వీరన్న, శ్రీవైష్ణవ సంఘం ప్రముఖులు వరయోగుల సురేష్, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి పద్మశాలీలు రుద్రవంశీయులు రుద్ర శ్రీశైలం, లావణ్య, రుద్ర చెన్న కేశవులు, వాణి, రుద్ర పాండురంగశాస్త్రి, వాసవి దంపతులు ప్రతియేటా మాదిరిగానే అమ్మవారి కల్యాణానికి రెండు పోచంపల్లి పట్టుచీరలు, పట్టుదోవతులు సమర్పించారు. -
ధరిత్రి సంరక్షణలో భాగస్వాములవ్వాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: భూమిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, కాలుష్య నియంత్రణ మండలి సంయుక్తంగా ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న ‘ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ ఫోర్ట్ నైట్’ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ మాట్లాడుతూ.. పక్షం రోజుల పాటు జరుగుతున్న మదర్ ఎర్త్ ఉత్సవాల సందర్భంగా విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సైకిల్ ర్యాలీలు, ఉదయం నడక నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. వెంకట గిరిరాజ్గౌడ్, డీపీఆర్ఓ అయూబ్ అలీ, ‘కుడా’ ప్లానింగ్ అధికారి అజిత్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, ఏజీసీ కన్వీనర్ ఎస్.శ్రీనివాసస్వామి, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కమలాపూర్: ధాన్యం కొనుగోళ్ల సమయంలో కోతల పేరిట రైతులను ఇబ్బందుకు గురి చేయవద్దని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి హెచ్చరించారు. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్లో ఐకేపీ–సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్క్ఫెడ్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం, మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బుధవారం కౌశిక్రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. యూరియా కొనుగోళ్ల కోసం యాప్, వరి ధాన్యం కొనుగోలు కోసం జీపీఎస్ విధానం కాకుండా పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోళ్లకు సంబంధించి మిల్లర్లు అనేక సాకులు చూపుతూ 5 నుంచి 7 కిలోల వరకు కోత విధిస్తున్నారని, కోతల విషయాన్ని స్థానిక నేతలతో పాటు తమ దృష్టికి తీసుకొస్తే దానికి కట్టడి చేస్తామని రైతులకు సూచించారు. కార్యక్రమాల్లో సర్పంచులు పబ్బు సతీశ్, బండి వనజకళాధర్, ఏఎంసీ చైర్ పర్సన్ ఝాన్సీరవీందర్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీఓ గుండె బాబు, ఏఓ వేణు, ఐకేపీ ఏపీఎం లలితాదేవి, పీఏసీఎస్ కార్యదర్శి సురేశ్, మార్కెట్ కార్యదర్శి యాకయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సంపత్రావు, కాంగ్రెస్ నాయకుడు బాలసాని రమేశ్గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఏఎంసీ వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, డైరెక్టర్లు, ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పొంచి ఉన్న ముప్పు.. హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటుతో కమలాపూర్ మండలానికి కూడా పెను ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఏర్పాటుతో భూపాలపల్లి, పరకాల, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కమలాపూర్ మీదుగానే చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తారని, దీంతో పర్యావరణం, గాలి, నీరు కలుషితం అవుతుందని, తాగే నీరు, పీల్చే గాలి విషపూరితం అవుతుందని, పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడుతారన్నారు. వ్యవసాయ భూముల ధరలు లక్షల్లో నుంచి వేలల్లోకి పడిపోతాయన్నారు. డంపింగ్ యార్డును నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, డంపింగ్ యార్డు రద్దు కోసం గురువారం తలపెట్టిన పాదయాత్రకు నియోజకవర్గంలోని ప్రజలంతా పార్టీలకతీతంగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం -
9 మంది ఎస్సైల బదిలీ
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల్లో ఎస్సైలుగా విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మందిని బదిలీ చేస్తూ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. సాయి ప్రసన్న కుమార్ (సీసీఎస్, వరంగల్ నుంచి నల్లబెల్లి) వి.గోవర్ధన్ (నల్లబెల్లి నుంచి వీఆర్, వరంగల్), జి.రామారావు(మడికొండ నుంచి ఘన్పూర్), ీసీహెచ్.రఘుపతి (ఘన్పూర్ నుంచి వీఆర్, వరంగల్), ఈ.నర్సింహారావు (ధర్మసాగర్ నుంచి ఎల్కతుర్తి), ఎ.ప్రవీణ్కుమార్ (ఎల్కతుర్తి నుంచి వీర్, వరంగల్), ఎ.శ్రీకాంత్ (వీఆర్, వరంగల్ నుంచి బచ్చన్నపేట), ఎస్కే హమీద్ (బచ్చన్నపేట నుంచి వీఆర్, వరంగల్), బి.మంగ (వీఆర్, వరంగల్ నుంచి ట్రాఫిక్ కాజీపేట)కు బదిలీ అయ్యారు. ఇద్దరిపై వేటు.. ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్ వేటు వేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్కతుర్తి ఎస్సైగా విధులు నిర్వహించిన ఎ.ప్రవీణ్కుమార్కు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇటీవల ఆయనను వీఆర్కు అటాచ్ చేశారు. బుధవారం బదిలీల్లో భాగంగా ఆయనకు వీఆర్కు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ చేసిన మరుక్షణమే ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు వేశారు. అదేవిధంగా నర్సంపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రవిపై సస్పెన్షన్ వేటు వేశారు. అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టారు. విచారణలో రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు వేస్తూ సీపీ సన్ప్రీత్సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కొన్నది కొసరంతే!
జిల్లాలో మొక్కజొన్నల సేకరణ అంతంత మాత్రమేసాక్షి, వరంగల్: జిల్లాలో మార్క్ఫెడ్ అధికారుల ప్రణాళిక లేమితో మక్క రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మూడు లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి కేవలం ఇప్పటివరకు కొన్నది 21వేల మెట్రిక్ టన్నులే. అంటే దాదాపు 7 శాతమే అధికారులు కొనుగోలు చేశారంటే పరిస్థితి తీవ్రత ఏమిటో తెలుస్తోంది. జిల్లాలో అరకొరగా ఏర్పాటు చేసిన 13 కొనుగోలు కేంద్రాలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దీనికితోడు జిల్లాలో 50,000 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మేర గోదాములు ఉండడం కూడా ఈ మక్కల కొనుగోళ్లలో అధికారుల నిరాసక్తతకు మరో కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రతి మండలానికి ఐదుకుపైగా కేంద్రాలు ఏర్పాటుచేసి మక్కలను కొనుగోలు చేసిన అధికారులు ఇప్పుడు ఆమేర ఆలోచన చేయకపోవడంపై విమర్శలొస్తున్నాయి. అలాగే, మక్కల ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్)లో లేకపోవడం కూడా కేంద్రం కొనుగోలు చేయకపోవడం ఈ పరిస్థితికి మరో కారణం. మొక్కజొన్నను పీఎస్ఎస్ కింద చేర్చి కేంద్ర నోడల్ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తగ్గని దళారుల దూకుడు.. ఈ కొనుగోలు కేంద్రాల్లో చాలాచోట్ల మద్దతు ధర క్వింటాలుకు రూ.2400 చెల్లించాలి. తేమ శాతం 13 ఉంటేనే తీసుకుంటున్న కేంద్రం నిర్వాహకులు 51 కిలోలు బస్తాకు కాంటా వేస్తున్నారు. ఒక కిలో కాంటా బస్తా కింద తీసుకుంటున్నారు. ఎకరాకు 24.50 క్వింటాళ్ల కొనుగోలు నిబంధన మాత్రమే ఉంది. ఆ ఎకరంలో దిగుబడి వచ్చిన మరో 16 క్వింటాళ్లను రైతులు దళారులకు రూ.1,700 నుంచి రూ.1,800 మధ్య అమ్ముకునే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే ఆయా మార్క్ఫెడ్ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాల్లో వేల బస్తాల్లో మక్కలతో పాటు ఆరబోసినవి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ఆయా కేంద్రాల్లో మక్కలను సకాలంలో గోదాములకు చేర్చేందుకు 40 లారీలు అందుబాటులో ఉంచినా కూడా అనుకున్న మేర కొనుగోళ్లు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. చివరకు అధికార ప్రజాప్రతినిధులు కలెక్టర్ను కలిసి మక్కలను కొనుగోలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. రైతుల ఖాతాల్లో జమకాని నగదు... జిల్లాలో ఇప్పటివరకు 21 వేల మెట్రిక్ టన్నుల మక్కల కొనుగోళ్లు జరిగినా రైతుల ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ కాలేదని తెలుస్తోంది. దాదాపు రూ.50.40 కోట్లు రైతులకు రావాల్సి ఉంది. గతంలో వారం నుంచి 10 రోజుల్లో డబ్బులు వస్తే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు కేంద్రం నిర్వాహకులు, అధికారులు 45 రోజుల్లో నగదు జమ అవుతుందని చెబుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. దీనిపై అధికారులు సరైన స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సాధ్యమైనంత తొందరగా మరో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని, డబ్బులు కూడా నిర్ణీత సమయంలోగా రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసేలా చర్యలు తీసుకుంటామని జిల్లాకు సంబంధించిన మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. మార్క్ఫెడ్ లక్ష్యం 3,00,000 మెట్రిక్ టన్నులు.. కొనుగోళ్లు 21 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే రైతులకు చెల్లించాల్సినవి రూ.50.40 కోట్లు భారీగా పంట వస్తుందని అంచనా అధికారుల అలసత్వంతో రైతులకు తప్పని ఇబ్బందులుకొనుగోలు కేంద్రాల వివరాలు.. వరంగల్లోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, నర్సంపేట మార్కెట్, నెక్కొండ మార్కెట్ పర్వతగిరి మార్కెట్, చౌటపల్లి, దుగ్గొండి మండలంలోని మహమ్మదాపురం, నల్లబెల్లి మండల కేంద్రం, ఖానాపురం, సంగెం, వర్ధన్నపేట మార్కెట్, రాయపర్తి, వరంగల్ మండలంలోని ఆరెపల్లి, గీసుకొండ మండలంలోని ఊకల్ గ్రామంలో మార్క్ఫెడ్ కొనుగోలు ఏర్పాటు చేశారు. -
విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తాం
గీసుకొండ: గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి డీఏ–జేజీయూఏ కింద విద్యుత్ కనెక్షన్, మీటరు ఇచ్చి, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని ఎన్పీడీసీఎల్ కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ (సీఈ) జేఆర్ చౌహాన్, వరంగల్ ఆపరేషన్స్ ఎస్ఈ ఆనందం అన్నారు. సూర్యతండాలో గీసుకొండ, సంగెం మండలాల గిరిజన గ్రామాల సర్పంచ్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రతీ గ్రామంలోని ఎస్టీ కాలనీలు, గృహాలకు అంతరాయం లేకుండా విద్యుత్ను అందించడానికే ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. రెండు మండలాల్లో 2,100 విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఇప్పటికే 80 శాతం పనులు జరిగాయని చెప్పారు. అవసరమైన కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమకు లిఖిత పూర్వకంగా చెప్పాలని వారు కోరారు. సర్పంచ్లు వారి గ్రామాలకు సంబంధించిన సమస్యలను అధికారులకు విన్నవించారు. మరో నెల రోజుల్లో మిగిలిన పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ డీఈ జాటోత్ నాయక్, ఆపరేషన్స్ ఏడీఈ బానోత్ రవి, ఏడీఈ రాంరెడ్డి, సర్పంచ్లు బానోతు రాఘవేంద్ర, ఆంగోత్ వీరన్న, కేలోత్ అమృత భిక్షపతి, భూక్యా వీరేందర్, కన్నెబోయిన యమున ప్రవీణ్, ధరావత్ జ్యోతి తిరుపతి, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. -
నెక్కొండలో వానరాలకు చెక్
● ఎలుగుబంటి వస్త్రాలను ధరించిన సిబ్బంది ● గ్రామం నుంచి పరుగులు పెట్టిన కోతులునెక్కొండ: కోతుల బెడద నివారించాలని నెక్కొండ మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గం నిర్ణయించింది. గ్రామస్తులు, పంట చేళ్లను వానరాల బెడదను రక్షించాలని సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ వినూత్న రీతిలో ఆలోచన చేశారు. ఇందుకోసం రూ.10 వేలతో మూడు ఎలుగుబంటి వస్త్రాలను కొనుగోలు చేశారు. బుధవారం జీపీ సిబ్బంది ఎలుగుబంటి వేషధారణతో గ్రామంలో తిరిగారు. వీరిని చూసిన వానరాలు పరుగు తీశాయి. ఈ సందర్భంగా సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతూ కోతులను పట్టించాలంటే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుండడంతో ఎలుగుబంటి దుస్తులు కొనుగోలుచేసి తీసుకొచ్చామని తెలిపారు. మా ప్రయత్నం సత్ఫలితాలిస్తుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈఓ సదానందం, ఉప సర్పంచ్ సింగం శ్రావణి–ప్రశాంత్, వార్డు సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శోభాయమానం.. శ్రీభద్రకాళీభద్రేశ్వరుల కల్యాణోత్సవం
అమ్మవారికి సింహవాహన సేవ, గజవాహనసేవహన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన నిర్వహించి అమ్మవారిని పూలమాలలతో అలంకరించారు. ఉదయం అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై, సాయంత్రం గజవాహనంపై ఊరేగించారు. సేవాకార్యక్రమాలకు వరంగల్ ఆర్యవైశ్య (పట్టణ) సంఘం, చాత్తాద శ్రీవైష్ణవ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. ఆర్యవైశ్య నాయకులు గుండా ప్రకాశ్రావు, తొనుపునూరి వీరన్న, శ్రీవైష్ణవ సంఘం ప్రముఖులు వరయోగుల సురేశ్, రమాదేవి దంపతులు పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి పద్మశాలీలు రుద్రవంశీయులు రుద్ర శ్రీశైలం, లావణ్య, రుద్ర చెన్న కేశవులు, వాణి, రుద్ర పాండురంగశాస్త్రి, వాసవి దంపతులు ప్రతియేటా మాదిరిగానే అమ్మవారి కల్యాణానికి రెండు పోచంపల్లి పట్టుచీరలు, పట్టుదోవతులు సమర్పించారు. సారె అందజేశారు. రాత్రి ఆలయ అవరణలో పూలతో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
హింసను సంఘటితంగా నివారించాలి
గీసుకొండ: మహిళలు, బాలికలపై జరుగుతున్న హింసను సంఘటితంగా నివారించాలని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ అన్నారు. సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మండలంలోని గంగదేవిపల్లిలో గీసుకొండ, సంగెం మండలాల అంగన్వాడీ టీచర్లకు లింగాధారిత హింస, మహిళా చట్టాలపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వసుధ హాజరై మాట్లాడుతూ లింగవివక్షతో మహిళలు హింసకు గురవుతున్నారని, మహిళల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయన్నారు. ప్రతిఒక్కరూ మహిళాభివృద్ధి, సంక్షేమం, రక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లాలో బాలల పరిరక్షణ, సంక్షేమం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. మహిళలు, బాలల అభ్యున్నతికి కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట సీడీపీఓ మాట్లాడుతూ మహిళా చట్టాలు, సహకరించే సంస్థలు గురించి తెలుసుకోవాలన్నారు. సర్వోదయ సంస్థ ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఇందిర మహిళా చట్టాలు, మహిళల కోసం పనిచేసే వ్యవస్థల గురించి వివరించారు. డీసీపీఓ ఉమ, పోషణ్ అభియాయాన్ కోఆర్డినేటర్ కార్తీక్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ కల్పన, ఐసీడీఎస్ ఈఓ మౌనిక, సూపర్వైజర్లు రేవతి, ఈశ్వరి, మాధవి, కోఆర్డినేటర్ అక్తర్, వాణి, సుహాసిని, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ వసుధ -
వంద క్వింటాళ్ల బియ్యం మాయం!
దుగ్గొండి: చలపర్తి గ్రామంలోని గిడ్డంగుల సంస్థకు చెందిన 10 వేల మెట్రిక్ టన్నుల గోడౌన్లో వంద క్వింటాళ్ల బియ్యం మాయమైనట్లు సమాచారం. మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గోడౌన్లలోకి మిల్లర్లు ఏసీకేల రూపంలో బియ్యం పంపిస్తారు. ఏసీకే (290 క్వింటాళ్లు) చొప్పున 6 ఏసీకేలు అంటే 1740 క్వింటాళ్లు (3,480 బస్తాలు) ఒక బెడ్గా వేస్తారు. ఇలా ఒక బెడ్లో ఉండాల్సిన బియ్యం కన్నా వంద క్వింటాళ్లు (200 బస్తాలు) తక్కువగా ఉన్నాయని విజిలెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సంధ్యారాణి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోడౌన్లో వంద క్వింటాళ్ల బియ్యం మాయం అయ్యాయని, రూ.4.37 లక్షల అవినీతి జరిగిందని బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ సాయిరమణ గోడౌన్లో బుధవారం విచారణ చేపట్టారు. గోడౌన్లో ఎన్ని లాట్లు ఉన్నాయి, లాట్లో బస్తాల సంఖ్య, రికార్డుల్లోని సంఖ్యను సరిపోల్చి నట్లు తెలిసింది. కాగా, బియ్యం మాయమైన ఘట నలో గోడౌన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది పాత్ర ఉందని అనుమానాలు వస్తున్నాయి. సూపర్ఫైన్ స్థానంలో ముక్కిన బియ్యం.. ఇదే గోడౌన్లో సూపర్ఫైన్ బియ్యానికి బదులు ముక్కిన, నాణ్యత లేని బియ్యం దిగుమతి చేసుకున్నారే సమాచారంతో ఏడాదిన్నర క్రితం విజిలెన్స్ దాడి చేసింది. విచారణ చేపట్టిన కలెక్టర్ సత్యశారద నాణ్యత లేని 9 లారీల బియ్యాన్ని వెనక్కి పంపి మళ్లీ నాణ్యత గల బియ్యాన్ని అదే మిల్లర్ చేత తెప్పించి సరిచేశారు. గోడౌన్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించడంతో అవకతవకలు జరుగుతున్నాయని, పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు. చలపర్తి గోడౌన్లో సిబ్బంది చేతివాటం అధికారుల అండదండలపై అనుమానాలు -
‘సీకేఎం’ను సందర్శించిన అదనపు కలెక్టర్
కాశిబుగ్గ: వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిని అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన లేబర్ రూం, ఐసీటీసీ వార్డు విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా వార్డులు, పరిసరాల పరిశుభ్రతపై చర్చించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్తాచెదారం, వాటర్ బాటిళ్లను తీసే పొడవైన చెత్త పికర్నుతో డెమో చేయించారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్పర్వతగిరి: మండలంలోని మోడల్ స్కూల్/కళాశాలలో ఇంటర్ సెకండియర్లో 79 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 16 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. కాగా, రాష్ట్రంలోనే అతి తక్కువ (20.25 శాతం) ఉత్తీర్ణత సాధించిన కళాశాలగా నిలిచింది. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మోడల్ స్కూల్ నిర్వాహకుల పనితీరుకు ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఔషధ, పండ్ల మొక్కలు నాటాలి : డీఆర్డీఓసంగెం: గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, ఇంటి ఆవరణలో ఔషధ, పండ్లు, నిత్యజీవితంలో ఉపయోపడే మొక్కలను నాటాలని డీఆర్డీఓ నాగపద్మజ సూచించారు. గుంటూరుపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లోని నర్సరీలను బుధవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. బొప్పాయి, కరివేపాకు, మునగ లాంటి ఆరోగ్యకరమైన చెట్లను పెంచితే మేలన్నారు. పొందుపు సంఘాల మహిళలు, రైతు సమాఖ్యలు ముందుకు వచ్చి మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టాలని కోరారు. ప్రతీ ఇంటిలో కనీసం ఐదు మొక్కలను పెంచాలని, ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం పెంపొందుతుందని పేర్కొన్నారు. అనంతరం కాట్రపల్లిలోని గౌండ్ల కుంటను సందర్శించి ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ప్రతీ 40 మందికి ఒక మేట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. పనిప్రదేశాల్లో కూలీలకు నీరు, నీడ లాంటి అవసరమైన సదుపాయాలను కల్పించాలన్నారు. ఎంపీడీఓ రవీందర్, ఏపీఓ గణేశ్, సర్పంచ్లు శ్రీకాంత్, చంద్రమౌళి, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. ఆరె సంక్షేమ సంఘం జిల్లా కమిటీ నియామకంగీసుకొండ: కొనాయమాకులలో ఆరె కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓలిగే నర్సింగరావు బుధవారం జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తుమ్మనపల్లి శ్రీనివాస్, డోలె చిన్ని, గుండెకారి జగన్, కౌడగాని తిరుపతి, కోశాధికారిగా కౌడగాని మోహన్రావు, ఉపాధ్యక్షులుగా శిరీష రాజేశ్వర్రావు, ల్యాండే రమేశ్, పుష్కురి ధర్మేంద్ర, కుసుంబ తిరుపతి, కొల్లూరి రవీందర్, కిరణ్కుమార్, ప్రచార కార్యదర్శులుగా యుగంధర్, రాజు, రాజేశ్వర్రావు, రవీందర్, విరాట్, మల్హర్రావు, అంజిబాబు, కార్యదర్శులుగా సదానందం, రాజీరు, రఘుపతి, శంకర్రావు, సంపత్రావు, జగదీశ్, రమేష్, మోహన్రావు, రాజు, కృష్ణంరాజు, ముఖ్య సలహాదారులుగా కలువల ఆనందరావు, ఇంగే రామారావు, వరికెల సాంబశివరావు, మీడియా ఇన్చార్జ్ లుగా మదన్మోహన్రావు, కమలాపురం రాజును నియమించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆరెకుల సంఘం రాష్ట్ర నాయకులు ఇంగ్లీ శివాజీ, సుకినే రాజేశ్వర్రావు, జిల్లా నాయకుడు గుండెకారి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. కాకతీయుల కట్టడాలు అద్భుతం ఖిలా వరంగల్: కాకతీయుల కట్టడాల మహా అద్భుతంగా ఉన్నాయని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాల సెక్షన్ ఆఫీసర్లు కొనియాడారు. మంగళవారం ఖిలా వరంగల్ మధ్యకోటను వారు సందర్శించారు. శిల్ప కళా సంపదను తిలకించారు. అనంతరం ఖుష్మహల్, ఏకశిల గుట్ట, మట్టి, రాతికోట అందాలను వీక్షించారు. కాకతీయుల విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. కార్యక్రమంలో టూరిస్ట్ పోలీస్ అనంద్ శ్రీనివాస్ రెడ్డి, మిల్స్ కాలనీ పోలీసులు ఉన్నారు. -
పర్యావరణాన్ని పరిరక్షించాలి
కాళోజీ సెంటర్: సహజవనరులను వినియోగించుకుని పర్యావరణాన్ని పరిక్షించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్డేను పురస్కరించుకొని ఈనెల 15 నుంచి 30 వరకు నిర్వహిస్తున్న పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో తెలంగాణ నేషనల్ గ్రీన్క్రాప్స్ వారి పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూమిని సంరక్షించడంలో పర్యావరణ సమతుల్యత ఎంతో కీలకమన్నారు. అదనపు కలెక్టర్ వైవీ గణేశ్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ 50 మొక్కలు నాటాలని కోరారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇంటింటికి ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకుంటే భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఈఓ బి.రంగయ్య నాయుడు, జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు రావొద్దు.. న్యూశాయంపేట: వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లాలోని అధికారులతో బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలని మున్సిపల్, ఇరిగేషన్, రూరల్ వాటర్ సప్లయీస్ అధికారులకు సూచించారు. వడదెబ్బ కేసులకు తక్షణ వైద్యసేవలు అందేలా వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్ఓ విజయలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులుప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సగటున రోజుకు 4.16 లక్షల మంది ప్రయాణం రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్న బస్సులుసంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. శ్రీనివాస్, ఎంప్లాయీస్ యూనియన్ రీజియన్ సెక్రటరీ డిమాండ్లు పరిష్కరించాలి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయి : సీపీ
వరంగల్ క్రైం : పోలీస్ అధికారులకు పదోన్నతులతో బాధ్యతలు పెరుగుతాయని సీపీ సన్ప్రీత్సింగ్ పేర్కొన్నారు. వరంగల్, జనగామ ఏ ఎస్పీలుగా పనిచేస్తూ పరిపాలన విభాగం అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొంది బదిలీపై వెళ్తు న్న ఏఎస్పీలు, శుభం ప్రకాష్, చేతన్ నితిన్ను మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. డీసీపీలు అంకిత్కుమార్, రాజమహేంద్రనాయక్, దార కవిత, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. హన్మకొండ: తెలంగాణ కేడర్కు చెందిన 2025 బ్యాచ్ ఐఏఏస్ ప్రొబేషనర్లకు ప్రభుత్వం జిల్లాలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరుగురు ఐఏఎస్లను వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇందులో భాగంగా సాయిశివానిని ప్రొబేషనరీ అసిస్టెంట్ కలెక్టర్గా హనుమకొండ జిల్లాకు నియమించారు. వీరు 27 వరకు విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హన్మకొండ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అద్దె బస్సుల సమస్యలపై చర్చించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారని అసోసియేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి మారిపల్లి రాంరెడ్డి తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్, అధ్యక్షుడు అబ్బ మధుకర్, సభ్యుడు కాటన్ భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. -
సామాజిక సేవలో విద్యుత్ ఉద్యోగులు
టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే కాకుండా, సామాజిక సేవలోనూ తమ ఉద్యోగులు ముందుంటారని టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వరుణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడానికి అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఉద్యోగి తమవంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, చీఫ్ ఇంజనీర్లు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, వెంకటరమణ, హనుమకొండ, వరంగల్ ఎస్ఈలు మధుసూదన్, ఆనందం, జీఎం సామ్య నాయక్, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రెడ్డి, సెక్రటరీ జనరల్ తాజుద్దీన్ బాబా, ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు నార్ల సుబ్రహ్మణేశ్వర్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంద్రసేనా రెడ్డి, జనరల్ సెక్రటరీ పి.మల్లికార్జున్, బాధ్యులు అనిల్ కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
కాశిబుగ్గ : తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (కేఎంసీ, వరంగల్ యూనిట్) నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకతీయ వైద్య కళాశాలలోని అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు రిటర్నింగ్ అధికారి డాక్టర్ రాంకుమార్ రెడ్డి తెలిపారు. కమిటీ అధ్యక్షుడిగా డాక్టర్ అంబి శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా డాక్టర్ చిన్ని కృష్ణ, కోఽశాధికారిగా డాక్టర్ చాడ రమేశ్ ఎన్నికయ్యారు. అలాగే జనరల్ కౌన్సిల్ మెంబర్లుగా డాక్టర్ బి. త్రిలోక్ చందర్, సీహెచ్ మురళి, జె.సురేందర్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పి.సమ్మయ్య, కె.మురళి, ఎస్.సునీల్ దత్, జాయింట్ సెక్రటరీలుగా డాక్టర్ పి.రవి, బి.సునిల్కుమార్, ఎల్. దివ్యశ్రీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డాక్టర్ బి.రమేష్చంద్ర, కె.రజని, మానస నరహరి, వి.మురళీక్షృష్ణ, పి.వాసుప్రకాశ్, ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు. వరంగల్ అర్బన్: ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని మేయర్ గుండు సుధారాణి అదేశించారు. మంగళవారం మేయర్, ఇన్చార్జ్ కమిషనర్ కలిసి రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పన్ను రాయితీ, సేకరణ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఐదు శాతం రాయితీని ప్రజలకు వివరించాలని కోరారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్, ఉప కమిషనర్లు బిర్రు శ్రీనివాస్, సమ్మయ్య, ప్రసన్నరాణి తదితరులు పాల్గొన్నారు. వేసవిలో నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి వేసవిలో నీటిసరఫరాపై దృష్టిసారించాలని మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి ఇంజనీరింగ్ అదికారులతో మేయర్ తాగునీటి సరఫరా, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోష్బాబు, మాదవి, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
భక్తిమార్గం.. భారతీయ తత్వశాస్త్రం
బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ హన్మకొండ కల్చరల్ : ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యులు భారతీయ తత్వశాస్త్రంలోని అద్వైత, విశిష్టాద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహనీయులని వీరి ఉపదేశాలు హిందూ ధర్మంపై ప్రభావాన్ని చూపాయని బ్రాహ్మణసేవా సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా మంగళవారం హనుమకొండ రాగన్న దర్వాజలోని బ్రాహ్మణభవన్లో బ్రాహ్మణ, వైష్ణవ సంఘాల ఆధ్వర్యంలో ఆది శంకరాచార్యులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సతీమణి నీలిమా జ్యోతిప్రజ్వలన చేసి ఆచార్యుల జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. ఉపేంద్రశర్మ మాట్లాడుతూ.. ఆదిశంకరులు, శ్రీభగవద్ రామానుజాచార్యుల బోధనలను వారి సిద్ధాంతాల ప్రాముఖ్యతను వివరించారు. అనంత రం ఆచార్యుల చిత్రపటాలతో బ్రాహ్మణభవన్ నుంచి చిన్నకొవెల వరకు శోభాయాత్ర నిర్వహించారు. -
‘ఉపాధి’ ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్శాయంపేట : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం పనులు చేపట్టే ప్రదేశాల్లో కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. మంగళవారం మండలంలోని మైలారంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ పథకాల వారోత్సవాల సందర్భంగా గ్రామంలోని ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసుకోగా తమకు మూడు నెలల నుంచి కూలీ డబ్బులు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కలెక్టర్ కూలీ డబ్బులు ఇచ్చేలా చూస్తానని తెలిపారు. అనంతరం ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మైలారం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి జీపీలో చెత్తపై నిర్లక్ష్యం ఎందుకని పంచాయతీ కార్యదర్శిని నిలదీశారు. పారిశుద్ధ్య నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పనులు త్వరగా పూర్తిచేయాలి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సందర్శించి పరిశీలించారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను అటకెందుకెక్కించారని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు వినియోగించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. చిన్నారులతో ఆంగ్ల పద్యాలను చదివించి వారి అభ్యసన స్థాయిని అంచనా వేశారు. అలాగే ప్రాథమికోన్నత పాఠశాలను, మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకొని మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. ట్యాప్స్ కూడా తక్కువగా ఉన్నాయని, టైల్స్ కూడా బాగలేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ బుక్ చేసుకోవాలని.. గ్యాస్ కొరత ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని ఎంఈఓ భిక్షపతికి సూచించారు. ఎంజేపీ పాఠశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో, ఉపాధ్యాయులతో మాట్లాడి బోధన విధానంపై వివరాలు అడిగి తెలుసుక్నునారు. డీఆర్డీఓ శ్రీను, ఆర్డీఓ నారాయణ, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, సర్పంచ్ నూనె దివ్య ఎంఈఓ భిక్షపతి, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, ఎంజేపీ ప్రిన్సిపాల్ రేవతి తదితరులు ఉన్నారు. -
భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం
హన్మకొండ కల్చరల్: కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన, ఆదిశంకరుల జయంతిని నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షులు సురేశ్కుమార్, ఉపాధ్యక్షులు కురిమిల్ల రమేశ్, శ్రీరాముల రమేశ్, నరేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్లు విజయ్కుమార్, నర్సింహారావు, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పూజల్లో వరంగల్ జిల్లా వడ్డెరకులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గండికోట సంపత్, స్వప్న, మల్ల య్య, సరోజ, మహేష్, అనూష, కంది సురేష్, మేరి, వెంకటేశ్, కమల పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్ల డించారు. నిందితులు ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ వై.సతీశ్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్పార్టీ లింగారావు, ఏఆర్ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు బాల రాజు,శ్రీరాములు, ఎండీ రబ్బానీ, రాజ్కుమార్, ఇంతేజార్గంజ్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
హాష్ ఆయిల్ స్మగ్లింగ్.. నలుగురి అరెస్ట్
వరంగల్ క్రైం: హాష్ ఆయిల్ (గంజాయి మొక్కల నుంచి తీసిన నూనె)ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని వరంగల్ డ్రగ్ కంట్రోల్, క్యాట్ పార్టీ, ఇంతేజార్గంజ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ప్రకటించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలు వెల్ల డించారు. నిందితులు ఒడిషా రాష్ట్ర మల్కాన్గిరి జిల్లా చిత్రకొండ మండలం సువ్వపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్ను, రేకపల్లి గ్రామానికి చెందిన హంటల్ సన్యాసి, కృష్ణా హంటల్, ఏపీలోని అల్లూరి జిల్లా గూడెం మండలం దారకొండకు చెందిన కండెల చిన్నబాబును అరెస్టు చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ముంబైకి వెళ్లేందుకు కోణార్క్ రైలు ఎక్కి.. ఈముఠా సభ్యులు గంజాయి మొక్కల ద్వారా 40 కిలోల హాష్ ఆయిల్ను సేకరించినట్లు ఆయన తెలిపారు. 20 కిలోల హాష్ ఆయిల్ను పాండు తీసుకోగా, మిగిలిన 20 కిలోల హాష్ ఆయిల్ను కిలో చొప్పున ప్యాకెట్లలో భద్రపరిచారు. నిందితులు ఐదు కిలోల చొప్పున హాష్ ఆయిల్ను తీసుకుని ముంబైలో విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్లోని తుని రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 19న అర్ధరాత్రి కోణార్క్ రైలులో బయలుదేరినట్లు ఆయన తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ఈనెల 20న దిగి 21న ఉదయం ముంబై వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి రూ.2.50 కోట్ల విలువైన 20కిలోల హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్సింగ్ తెలిపారు. మరో నిందితుడు కిలో పాండు పరారీలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతి భ కనబరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, వరంగల్ ఏఎప్పీ శుభం, ఏసీపీలు జితేందర్రెడ్డి, జానీ నర్సింహులు, డ్రగ్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ వై.సతీష్, ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షూకూర్, ఎస్సైలు సందీప్, తేజ ఆర్ఎస్సైలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, క్యాట్పార్టీ లింగారావు, ఏఆర్ఏ ఎస్సైలు సుబ్బిరామి రెడ్డి, బాల రాజు, శ్రీరాములు, ఎండీ రబ్బానీ తదితరులను అభినందించారు. రూ.2.50 కోట్ల విలువైన హాష్ ఆయిల్ స్వాధీనం వివరాలు వెల్లడించిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
ఆర్టీసీలో సమ్మె సైరన్
● నేటి నుంచి వరంగల్ రీజియన్ వ్యాప్తంగా నిలిచిపోనున్న బస్సులు ● ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న అధికారులుహన్మకొండ: సమస్యల సాధనకు ఆర్టీసీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి మొదటి బస్సు నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ నిర్ణయం తీసుకుంది. దీంతో బుధవారం ఉదయం నుంచి వరంగల్ రీజియన్లోని 8 డిపోల పరిధిలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వరంగల్ రీజియన్లో మొత్తం 1,036 బస్సులు సేవలు అందిస్తున్నాయి. ఇందులో 596 సంస్థ బస్సులు, 325 ప్రైవేట్ అద్దె బస్సులు, 115 విద్యుత్ బస్సులు ఉన్నాయి. మొత్తం 986 షెడ్యూల్స్ నడుస్తున్నాయి. రోజుకు 4.11 లక్షల కిలోమీటర్లు తిరిగి 4.16 లక్షల మంది ప్రయాణికులను వివిధ గమ్యస్థానాలకు చేరవేస్తూ రూ.2.06 కోట్ల ఆదాయాన్ని పొందుతుంది. సంస్థకు చెందిన 1,123 మంది డ్రైవర్లు, 1,436 మంది కండక్టర్లు సేవలు అందిస్తున్నారు. వీరితో పాటు ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ విధానంలో 140 మంది డ్రైవర్లు, 286 మంది కండక్టర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా సంస్థ ఉద్యోగులైన 368 మెకానిక్లు, 250 మంది ట్రాఫిక్ సూపర్వైజర్లు, కార్యాలయం సిబ్బంది 60 మంది, సెక్యూరిటీ సిబ్బంది 44 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో ఔట్ సోర్సింగ్ విధానంలో కొనసాగుతున్న 140 మంది డ్రైవర్లు, 286 మంది డ్రైవర్లు మినహా మిగతా వారంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో 104 మంది మెకానిక్లు, కార్యాలయ స్టాఫ్ 38 మంది. సెక్యూరిటీ 36 మంది ఉన్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరయ్యే అవకాశలున్నాయి. వీరితో బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్–2 డిపోలో 115 విద్యుత్ బస్సులున్నాయి. ఇవి పూర్తిగా ప్రైవేట్ డ్రైవర్లతో నడుస్తున్నాయి. వీటితోపాటు మరో 325 ప్రైవేట్ అద్దె బస్సులున్నాయి. విద్యుత్ బస్సులు, ప్రైవేట్ అద్దె బస్సులు తిప్పడంతో పాటు, సంస్థ బస్సులను తిప్పేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉన్నంతలో కనీసం ప్రధాన రూట్లలో బస్సులు నడిపేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. డిపో ఆర్టీసీ అద్దె హనుమకొండ 100 52 వరంగల్–1 105 41 వరంగల్–2 115 (ఈవీ) 44 జనగామ 83 39 నర్సంపేట 65 35 మహబూబాబాద్ 57 24 పరకాల 63 23 తొర్రూరు 57 43 భూపాలపల్లి 66 24డిమాండ్లు పరిష్కరించాలి..సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెకు ఒక రోజు ముందు చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తోంది. ముందుగా డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. పీఆర్సీ అమలు చేయాలని, పనిభారం తగ్గించాలి. ఎరియర్స్ ఇవ్వాలి. పని గంటలు తగ్గించాలి. ఔట్ సోర్సింగ్ విధానం తగ్గించి సంస్థ నియామకాలు చేపట్టాలి. – సీహెచ్.రాంచందర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడుసంస్థ పరిరక్షణ ముఖ్యం ఆర్టీసీ కార్మికులుగా సంస్థ పరిరక్షణ కోసం కృషి చేస్తాం. కార్మికుల ప్రయోజనాలు, సంస్థ కోసమే సమ్మెకు వెళ్తున్నాం. విద్యుత్ బస్సులు తీసుకువచ్చి సంస్థను ప్రైవేట్పరం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఆర్టీసీకే విద్యుత్ బస్సులు ఇవ్వాలి. యాజమాన్యం, ప్రభుత్వం ముందుంచిన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యూనియన్ రీజియన్ సెక్రటరీ -
టెన్త్ ఫెయిల్ అవుతాననే భయంతో బాలిక ఆత్మహత్య
దుగ్గొండి: పదో తరగతిలో ఫెయిల్ అవుతాననే భ యంతో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మల్లంపల్లి గ్రామంలో మంగళవా రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని వెంకటాపురంకు చెందిన నైనబోయిన నాగరాజు–సుమలత దంపతులకు కూతు రు నవ్య(17) ఉంది. నవ్య చిన్నతనంలోనే నాగరాజు మృతి చెందాడు. దీంతో సుమలత మల్లంపల్లి గ్రామానికి చెందిన తెప్ప భిక్షపతిని మరో వివాహం చేసుకుంది. నవ్యను సుమలత సాకుతోంది. నవ్య స్థానికంగా ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి వరకు చదివింది. 9, 10 తరగతులు గురిజాల గ్రామంలోని పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదివింది. టెన్త్ పరీక్షల అనంతరం నవ్య వెంకటాపురంలోని తన నాన మ్మ సమ్మమ్మ ఇంటికి వచ్చింది. అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు సేవలు చేయడానికి వ చ్చింది. తాను టెన్త్ పరీక్షలు సరి గా రాయలేదని, ఫెయిల్ అయి తే తల్లి సుమలత, పెంచిన తండ్రి భిక్షపతి చీవాట్లు పెడతారనే భయంతో ఈనెల 18న బీపీ మాత్రలు ఎక్కువ మోతాదులో మింగింది. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా మంగళవారం మృతి చెందింది. భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రావుల రణధీర్రెడ్డి తెలిపారు. -
భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవం
హన్మకొండ కల్చరల్: కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రకాళి దేవాలయంలో ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ఉదయం నిత్యాహ్నికం, చతుస్థానార్చన, ఆదిశంకరుల జయంతిని నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు హనుమకొండ జిల్లా నాయీ బ్రాహ్మణ సంఘం ఉభయదాతలుగా వ్యవహరించారు. పూజల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, నాగుర్ల వెంకటేశ్వర్లు, సంఘం జిల్లా అధ్యక్షులు సురేశ్కుమార్, ఉపాధ్యక్షులు కురిమిల్ల రమేశ్, శ్రీరాముల రమేశ్, నరేందర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్లు విజయ్కుమార్, నర్సింహారావు, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి రవీందర్సింగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పూజల్లో వరంగల్ జిల్లా వడ్డెరకులస్తులు ఉభయదాతలుగా వ్యవహరించారు. గండికోట సంపత్, స్వప్న, మల్ల య్య, సరోజ, మహేష్, అనూష, కంది సురేష్, మేరి, వెంకటేశ్, కమల పాల్గొన్నారు. బుధవారం రాత్రి ఏడు గంటలకు భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ రామల సునీత తెలిపారు. -
మక్కల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్యతో కలిసి మక్కల కొనుగోలు, నిల్వ లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 72వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేయగా 2.25 మెట్రిక్ టన్నుల దిగుబడి నమోదు అయ్యిందన్నారు. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి వ్యవసాయ శాఖ జేడీ అనురాధ, డీసీఓ నీరజ, డీఎం మార్క్ఫెడ్ రంజిత్రెడ్డి, తహసీల్దార్లు, మార్కెట్కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. రాయపర్తి: మండలకేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను కలెక్టర్ సత్యశారద మంగళవారం సందర్శించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ కాపిటీషన్, స్కిట్తోపాటు పెయింటింగ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు కలెక్టర్ పాల్గొని విద్యార్థులతో పలు అంశాలపై మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతి, పోషకాహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ రాంరెడ్డి, డీబీసీడీఓ పుష్పలత, ప్రిన్సిపాల్ సరిత, అధ్యాపక బృందం పాల్గొన్నారు. మెరుగైన వసతులు కల్పించాలి పర్వతగిరి: విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంక్షేమ వారోత్సవాల సందర్భంగా మంగళవారం పర్వతగిరి కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న పోటీలు, అందిస్తున్న విద్యా సదుపాయాలు, వసతి, ఆహార నాణ్యత, పరిశుఽభ్రత వంటి అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గురుకులాల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు, ఇతర సహ పాఠ్య కార్యక్రమాలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీబీసీడీఓ పుష్పలత, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, కేజీబీవీ ప్రిన్సిపాల్ సల్మా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
సర్జికల్స్ టెన్షన్
వరంగల్బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఎంజీఎం ఆస్పత్రికిమౌలిక వసతులపై దృష్టి సారించండి గ్రామాల్లో మౌలిక వసతులపై దృష్టి సారించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కోరారు. సాక్షి, వరంగల్: ఉత్తర తెలంగాణకే తలమానికమైన మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆస్పత్రిలో అత్యవసర వైద్యసేవలకు అవసరమైన ‘సర్జికల్స్’ కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత రెండేళ్లకు సంబంధించి రూ.రెండు కోట్ల బకాయిలు ఆయా సర్జికల్ సరఫరాదారులకు చెల్లించాల్సి ఉన్నా.. ఆరు నెలల క్రితం 25 శాతం చెల్లింపులు చేయడంతో ఆ తర్వాత మిగతా బిల్లులు వస్తాయన్న ఆశతో సర్జికల్ పరికరాలు ఎంజీఎంకు అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి సర్జికల్ బిల్లు వస్తుందని, రాగానే చెల్లింపులు చేస్తారని ఆశగా ఎదురుచూసిన సరఫరాదారులకు ఇంకా బిల్లులు రాకపోవడంతో అవసరమైన సర్జికల్ పరికరాలు అందివ్వడం కష్టంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా కొన్ని సందర్భాల్లో సర్జికల్ పరికరాలు సమయానికి అందుబాటులో లేక రోగులకు అందించే వైద్యసేవల్లో ఆలస్యం కనబడుతోంది. అయినా ఎంజీఎం వైద్యాధికారులు సర్జికల్ సరఫరాదారులను ఒప్పించడంతో ప్రస్తుత వైద్యసేవలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నా.. రానున్న రోజుల్లో ఇది రోగులకు అందించే సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందన్న ఆందోళన కనబడుతోంది. అయితే రాష్ట్రంలోని సర్కారు ఆస్పత్రులకు 80 శాతం మందులను రాష్ట్ర వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. 20 శాతం డీసెంట్రలైజ్డ్ బడ్జెట్ కింద ఆయా ఆస్పత్రుల నిధుల నుంచి ఔషధాలను కొనుగోలు చేస్తారు. ఇప్పటికే సప్లయర్లు 20 శాతం ఔషధాలు అవసరాల కింద సర్జికల్స్ పరికరాలను సరఫరా చేయలేమని ఇప్పటికే లేఖలు పంపిన సంగతి తెలిసిందే. శస్త్రచికిత్సలపై తీవ్ర ప్రభావం.. సర్జికల్ గ్లోవ్స్, బ్లేడ్స్, స్యూటర్స్, ఇంప్లాంట్స్, రిట్రాక్టర్లు, సక్షన్ ఆపరటస్, ఎలక్ట్రోకాటరీ, లాపరోస్కోపీ, సిరింజీలు, ఐవీ కాన్యులేలు, ఈసీజీ మెషీన్స్, నబలైజర్స్, ల్యాబ్ కెమికల్స్ వంటి ముఖ్యమైన పరికరాలు కొరత ఉంటే అది శస్త్రచికిత్సలపై ప్రభావం చూపే అవకాశముంది. కొన్నిసార్లు అత్యవసర కేసుల్లో కూడా చికిత్స ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఫలితంగా కొన్ని సందర్భాల్లో ఇవి రోగుల బంధువులే కొని తీసుకురావడం ద్వారా వారిపై ఆర్థిక భారం పడనుంది. ఈ సర్జికల్ పరికరాల లభ్యత తీవ్రరూపం దాలిస్తే ఆస్పత్రులకు రోగులు తగ్గి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ ఆస్పత్రులవైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఓవైపు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సర్జికల్ బిల్లుల చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లూ మెడికల్ బిల్లుల చెల్లింపులు ఉదాసీనంగా ఉన్న సర్కార్.. ఇటీవల ఎంజీఎంకు రూ.రెండు కోట్లు ఇవ్వడంతో వాటిని ఆస్పత్రి అధికారులు ఆయా చెల్లింపుదారులకు చెల్లిస్తున్నారు. ఇదే మాదిరిగా సర్జికల్ బిల్లులు కూడా చెల్లించాలని ఆయా సరఫరాదారులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. అత్యవసర వైద్యసేవలపై ప్రభావం చూపే అవకాశం వైద్యపరికరాలు అందుబాటులో లేక ఇబ్బందులు ప్రస్తుతం మెడికల్ బిల్లులు క్లియరెన్స్తో కాస్త ఉపశమనం మా బిల్లులు కూడా చెల్లించాలంటున్న సర్జికల్ సరఫరాదారులు -
సంక్షేమశాఖలు లక్ష్యాలను పూర్తి చేయాలి
న్యూశాయంపేట: ప్రజాపాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్ణయించిన 99 రోజుల లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంక్షేమశాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సంక్షేమశాఖల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్సియల్ స్కూల్స్లో విధ్యనభ్యసిస్తున్న విద్యార్థులకు క్రీడలు, వకృత్వ వ్యాసరచన, పాటల పోటీలు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో మేము సైతం అన్నట్లు చైతన్యపరిచేలా వారోత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రంగయ్యనాయుడు, సంక్షేమశాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెరగాలి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్లో సీకేఎం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ఆస్పత్రుల అడ్మిన్ కమిటీ సమావేశం జరిగింది. ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు. వైద్య సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవేలో భూమి కోల్పోతున్న పర్వతగిరి మండలం చింతనెక్కొండ, గీసుకొండ మండలం మునుకొండ గ్రామాలకు చెందిన రైతులతో కలెక్టరేట్లో ఆర్బిట్రేషన్ నిర్వహించారు. కేజీబీవీని సందర్శించిన అదనపు కలెక్టర్ గీసుకొండ: మండలంలోని వంచనగరి కేజీబీవీని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) వైవీ గణేశ్ మంగళవారం సందర్శించారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యాలయాన్ని సందర్శించి మధ్యాహ్న భోజనం తదితర వసతులను పరిశీలించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను పరిశీలించి, విద్యార్థులతో కొంత సేపు ముచ్చటించారు. విద్యాలయం స్పెషల్ ఆఫీసర్ హిమబింధు తదితరులు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం వర్ధన్నపేట/పర్వతగిరి: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతీ గింజ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, డీఆర్డీఓ నాగపద్మజ, డీఎం సివిల్ సప్లై సంధ్యారాణి, అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, జిల్లా సమైక్య కోశాధికారి స్వప్న, తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, ఐకెపీ ఏపీఓ రమణచారి, మహిళ సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జిల్లా స్థాయి సమావేశం న్యూశాయంపేట: విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం మంగళవారం కలెక్టరేట్ చాంబర్లో జరిగింది. ఈ సమావేశంలో పలు సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, పారదర్శకత, అలాగే లబ్ధిదారులకు అందిస్తున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఎమ్మెల్సీ బి.సారయ్య, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ముఖ్యఅథితులుగా పాల్గొనగా చైర్పర్సన్ కలెక్టర్ సత్యశారద, వైస్ చైర్పర్సన్ అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు మెంబర్ కన్వీనర్లు ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సభ్యులు హాజరైయ్యారు. -
మూడు విడతలుగా టీకా స్పెషల్ డ్రైవ్
● డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గీసుకొండ: జిల్లాలో గర్భిణులు, చిన్నారులకు ప్రత్యేకంగా నిర్వహించనున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తద్వారా మాతాశిశు ఆరోగ్య రక్షణ జరుగుతుందని డీఎంహెచ్ బి.సాంబశివరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో హెల్త్ సూపర్వైజర్లు, సంబంధిత సిబ్బందికి స్పెషల్ ఇమ్యునైజేషన్ డ్రైవ్పై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక కార్యక్రమంలో అర్హులందరికీ టీకా ఇవ్వడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మూడు రౌండ్లుగా జరుగుతుందని, ఈ నెల 27 నుంచి మే 4 వరకు మొదటి రౌండ్, జూలై 20–27 వరకు రెండవ రౌండ్, అక్టోబర్ 12–19 వరకు మూడవ రౌండ్ ఉంటుందన్నారు. టీకాలను నిల్వచేసే యూవిన్ అనే మొబైల్ యాప్ గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. టీకా తీసుకున్న చిన్నపిల్లల వివరాలను తప్పనిసరిగా యూవిన్ పోర్టల్లో నమోదుతో పాటు గర్భిణుల వివరాలను నమోదు చేసేందుకు శిక్షణ ఇచ్చారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) ప్రకాశ్ మాట్లాడుతూ టీకా కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం చేపట్టాలన్నారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇఫ్తికర్ అహ్మద్, మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ విజయ్కుమార్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఇన్చార్జ్ డీపీహెచ్ఎన్ఓ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి అర్జీల పరిష్కారానికి చర్యలు
కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన అర్జీలను వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజలు తమ సమస్యలు వినిపిస్తూ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్కి వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 129 అర్జీలు అందినట్లు తెలిపారు. వేసవి నేపథ్యంలో వడగాలుల ప్రభావం నుంచి ప్రజలను రక్షించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పక్షులు, పశుసంపదకు తాగునీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కన్నం నారాయణ, జెడ్పీ సీఈఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. వరంగల్లో 139 దరఖాస్తులు..న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొని ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 139 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుదారుల సమక్షంలోనే చర్చించి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ పరి ష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. వచ్చిన వినతుల్లో రెవెన్యూశాఖకు 54, హౌసింగ్ 21 జీడబ్ల్యూఎంపీ 18 , ఇతర శాఖలకు చెందిన 46 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో వైవీ.గణేశ్, డీఆర్ఓ విజయలక్ష్మి ఆర్డీఓ సుమ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.కాగా, తమ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం దగ్గరలో కాకుండా మరో కూడలిలో శివాజీ విగ్రహాన్ని పెట్టాలని బొల్లికుంట ఎస్సీ కులస్తులు విన్నవించారు. అదేవిధంగా నా తండ్రి నాగవెల్లి సారంగపాణి ఖోఖో క్రీడలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించారు. గతేడాది ఆగస్టులో మృతిచెందాడని, మా కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదని, ఆర్థిక సాయం లేదా కనీస నివాస సదుపాయం కల్పించాలి’అని సారంగపాణి కూతురు నాగవెళ్లి మహాలక్ష్మి వేడుకున్నారు. -
ఫ్లెక్సీలో నా ఫొటో ఏది?
హసన్పర్తి: జిల్లా సహకార సంఘం అధికారులపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. హసన్పర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంలో డీసీసీ బ్యాంక్ నూతన శాఖను సోమవారం కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, స్థానిక ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. జిల్లా సహకార బ్యాంక్ సీఈఓ వజీర్ సుల్తాన్పై మండిపడ్డారు. బ్యాంక్ ప్రారంభోత్సవానికి తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఆహ్వానిస్తేనే ఇక్కడికి వచ్చానని, కనీసం ఫ్లెక్సీలో కూడా తన ఫొటో ఎందుకు పెట్టలేదని అడిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీ బ్యాంక్వి ఏడు శాఖలు ఉండగా, ఇందులో నాలుగు శాఖలు తన పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం బ్యాంక్ అధికారుల సన్మానాన్ని ఎంపీ కావ్య సున్నితంగా తిరస్కరించి అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ‘కుడా’ చైర్మన్, హ నుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్రెడ్డి, డీసీసీ బ్యాంక్ సీఈఓ వజీర్సుల్తాన్ పీఏసీఎస్ ఇన్చార్జ్ జగన్మోహన్రావు, కార్పొరేటర్ శివకుమార్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నర్సింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ‘సహకార’ సీఈఓపై ఎంపీ కడియం కావ్య ఆగ్రహం డీసీసీబీ హసన్పర్తి శాఖ ప్రారంభం -
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంవిద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 11 పరీక్ష కేంద్రాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ ఎ.సదానందం ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షలు నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. డీఈఓ ఎల్వీ గిరిరాజ్ గౌడ్ నాలుగు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. కేయూ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో 115 పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ రెండో సెమిస్టర్, ఆరో సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకటయ్య సందర్శించి పర్యవేక్షించారు. హన్మకొండ అర్బన్: మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడి జయంతి వేడుకలను సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి సేవలు అమూల్యమన్నారు. బోధించిన సూత్రాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిదన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహ స్వామి, వీరశైవ లింగాయత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరి ధి సీడీఓఈ (దూరవిద్య) డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల 2024–2025, 2025–2026 బ్యాచ్లు, 2023–2024 బ్యాచ్లోని ఎక్స్ అభ్యర్థులకు మొదటి సెమిస్టర్ పరీక్షలు మంగళవారంనుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పద్మజ సోమవారం తెలిపారు. ఈనెల 21, 23, 28, 30, మే 2వ తేదీన పరీక్షలు మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని పేర్కొన్నారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే7 నుంచి మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ 2023–24 బ్యాచ్ విద్యార్థులకు మే 7వ తేదీ నుంచి పరీక్షలు జరగనున్నాయి. మే 7, 11, 13, 15, 18, 20వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారని పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మొదటి, రెండో సెమిస్టర్లు కలిపి మొత్తంగా 3,766 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని, ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాజీపేట అర్బన్ : వరంగల్ ఆర్ఓ కార్యాలయంలో చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా తస్లీమా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏడాదిన్నర క్రితం బదిలీల్లో భాగంగా యామిని చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా రాగా, కొద్ది నెలల తర్వాత ఖమ్మంకు సబ్ రిజిస్ట్రార్గా బదిలీపై వెళ్లారు. నాటినుంచి ఇన్చార్జ్గా అసిస్టెంట్ రిజిస్ట్రార్ ప్రశాంతి విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర తర్వాత పూర్తిస్థాయి చిట్స్ అసిస్టెంట్ రిజిస్ట్రార్గా తస్లీమా బాధ్యతలు స్వీకరించగా కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. హన్మకొండ: ఆర్టీసీ కార్మికుల సమ్మె విచ్ఛిన్నకర చర్యలను ప్రభుత్వం, యాజమాన్యం ఆపాలని, కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీహెచ్.రాంచందర్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సులు ఆర్టీసీకి ఇచ్చే విధానంలో మార్పులు చేసి కార్మికుల ఉద్యోగాలకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. జేఏసీతో కలిసి ఈ నెల 22 నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు.సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.వేలేరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన 108 అంబులెన్స్ వాహనాన్ని సోమవారం జిల్లా ప్రోగ్రాం మేనేజర్ మండ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలోని అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పని తీరును, మందులు, రికార్డులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. రోడ్ యాక్సిడెంట్ల సమయంలో సిబ్బంది గోల్డెన్ అవర్లో ఆస్పత్రికి చేర్చాలని సూచించారు. అలాగే గర్భిణులు, పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనం ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ వంటి కేసులు వస్తాయని అంబులెన్స్లో ఐస్ ప్యాక్, ఓఆర్ఎస్ ద్రవాణాలు నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు. వారి వెంట దినేశ్, పైలెట్ దయాకర్ పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కల్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో యాసంగి 2026–27 సంవత్సరానికి సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. స మావేశంలో అదనపు కలెక్టర్లు, అధికారులున్నారు. గార్బేజ్ పికింగ్ స్టిక్తో చెత్త సేకరణ సులభం గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా కవర్లు, చిత్తు కాగితాలను సులభంగా సేకరించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. స్టిక్ వినియోగంపై సోమవారం కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్య తను కాపాడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవం, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన -
ఎంజీఎంలో మొరాయించిన ల్యాబ్ మిషన్లు
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి క్యాజువాలిటీలోని రక్త పరీక్షలకు ఉపయోగించే మిషన్లు మొరాయించడంతో రోగుల పరీక్షల కోసం అటెండెంట్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సోమవారం ఉదయం నుంచి సీబీపీ, ఏబీజీ మిషన్లు పని చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగుల పరీక్షలు ఈ ల్యాబ్లో చేయాల్సి ఉంది. అయితే, సీబీపీ పరీక్ష కోసం 91వ నంబర్ గదిలోని ల్యాబ్కు పేషెంట్ల అటెండెంట్లు బ్లడ్ శ్యాంపిళ్లు తీసుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఇక ఏబీజీ పరీక్షల కోసం మాత్రం ప్రైవేట్ ల్యాబ్లను ఆశ్రయించాల్సి వచ్చిందని పేషెంట్ల కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే పరీక్షల కోసం అధిక డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని వాపోయారు. అయితే సాయంత్రం నుంచి ఏబీజీ మిషన్ పనిచేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. సతాయించిన సీబీపీ, ఏబీజీ మిషన్లు వైద్య పరీక్షల కోసం సిబ్బంది పరుగులు -
ఎయిర్ పోర్ట్ భూముల్లో మట్టి తవ్వకాలు ఆపాలి
మామునూర్ ఎయిర్పోర్ట్ భూముల్లో కొంత మంది అర్ధరాత్రి మట్టి తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇటీవల భూసేకరణ చేపట్టి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులకు సిద్ధమవుతున్న తరుణంలో భూముల్లో 40 అడుగుల లోతులో తవ్వకాలు జరిపి మట్టిని అమ్ముకుని లక్షలాది రూపాయలు సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వానికి నష్టం కలుగుతుంది. మట్టి తవ్వకాలను వెంటనే ఆపాలి. – కోటేశ్వర్రావు, గాడెపల్లి మా కుటుంబాన్ని ఆదుకోవాలి..మా నాన్న నాగవెల్లి సారంగపాణి ఖోఖోలో భారత జట్టుకు ప్రాతి నిధ్యం వహించారు. ఆసియా క్రీడల్లో బంగా రు పతకం సాధించారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలతో గత సంవత్సరం ఆగస్టులో మృతిచెందారు. ఆయన చనిపోయిన తర్వాత మా కుటుంబానికి ఎలాంటి ఆధారం లేదు. ఇల్లు కూడా లేదు. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడిగా మా నాన్నకు కల్పించే ఆర్థిక సాయం అందలేదు. దయచేసి ఆర్థికసాయం లేదా నివాస సదుపాయం కల్పించాలి. – నాగవెళ్లి మహాలక్ష్మి, ఖిలావరంగల్ -
వినతులకు పరిష్కారం చూపాలి
● ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులకు వెంటనే సమస్యకు పరిష్కారం చూపాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశహాల్లో సోమవారం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 139 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూశాఖకు 54, హౌసింగ్ 21 జీడబ్లూఎంసీ 18, ఇతర శాఖలకు 46 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైవీ.గణేష్, డీఆర్ఓ విజయలక్ష్మి, ఆర్డీఓ సుమ, అధికారులు పాల్గొన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై బాధ్యత లేదా?
నల్లబెల్లి: విద్యార్థుల ఆరోగ్యంపై బాధ్యత లేదా..? పాఠశాలలో వంటశాల, డైనింగ్ హాల్ ఇంత అపరి శుభ్రంగా ఉంటాయా..? అని కలెక్టర్ సత్యశారద.. హెచ్ఎం, వార్డెన్లను నిలదీశారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవం కార్యక్రమంలో సోమవారం మండలంలోని మూడుచెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వంటశాల, స్నానపు గదులు, మరుగుదొడ్లు, డైనింగ్ హాల్ను పరిశీలించారు. పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణలోని లోపాలను చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వంట పాత్రలను శుభ్రం చేసేందుకు ఎరువుల సంచి ముక్కలను వాడడం.. ఇడ్లీ పాత్రలను గమనించిన కలెక్టర్ ఇంత అపరిశుభ్రమైన పాత్రల్లో విద్యార్థులకు ఇడ్లీలు ఎలా వండి పెడతారు.. పిల్లల ఆరోగ్యంపై బాధ్యత లేదా..? అని వార్డెన్ స్వరూపపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డార్మెంటరీ హాల్, మరుగుదొడ్లు నిత్యం శుభ్రంగా ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు. అనంతరం పాఠశాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొత్త బియ్యం సరఫరా చేయడంతో అన్నం సరిగా ఉడకడంలేదని, కూర్చోవడానికి బెంచీలు లేవని విద్యార్థినులు.. కలెక్టర్కు తెలియజేశారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇబ్బందులు ఎదురైతే భయపడకుండా తనకు నేరుగా ఉత్తరాలు రాయాలని విద్యార్థినులకు కలెక్టర్ భరోసా కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రతి రోజూ కనీసం 3 లీటర్ల నీరు తాగాలని, పౌష్టికాహారం తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయాలని హెచ్ఎం శ్రీనివాస్ను ఆదేశించారు. సురక్షిత ప్రయాణంలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపై తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ప్రమాదాల నివారణలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి పుష్పలత, తహసీల్దార్ కృష్ణ, అడిషనల్ డీపీఆర్ఓ ప్రేమలత, సర్పంచ్ సపావట్ కవిత దేవ్సింగ్, హెచ్ఎం శ్రీనివాస్, వార్డెన్ స్వరూప, పాఠశాల స్టాఫ్ సెక్రెటరీ దేవిలాల్ ఉన్నారు.వార్డెన్పై కలెక్టర్ ఆగ్రహం డైనింగ్ హాల్ నిర్వహణపై అసహనం నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కలెక్టర్ సత్యశారద -
వరంగల్
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పట్ణణాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంకొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు రావొద్దుచదువుపై దృష్టిసారించాలి చదువుపై దృష్టిసారించి మొబైల్ వినియోగం తగ్గించుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాలేజీఝెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవ సేన సూచించారు. వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతతో వడగాలులు వీస్తాయి. రాత్రి సమయంలో ఉక్కపోతగా ఉంటుంది. కాళేశ్వరాలయ పునరుద్ధరణ భూమి పూజలో సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి, పొన్నం, తదితరులు, మేడిగడ్డలో జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు పరిశీలిస్తున్న సీఎం రేవంత్, సభకు హాజరైన జనంగార్బేజ్ పికింగ్ స్టిక్తో చెత్త సేకరణ సులభం న్యూశాయంపేట: గార్బేజ్ పికింగ్ స్టిక్ ఉపయోగించడం ద్వారా నేలపై ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, చిత్తు కాగితాలను సులభంగా సేకరించవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. స్టిక్ వినియోగంపై సోమవారం కలెక్టరేట్లో అవగాహన కల్పించారు. చెత్త ఎక్కువగా పోగయ్యే సంస్థలకు ఎక్కువ మంది పనిచేసే ప్రాంగణాలు, ఆస్పత్రులకు ఈ స్టిక్ ఉపయుక్తంగా ఉంటుందని అదనపు కలెక్టర్ వైవీ.గణేష్ తెలిపారు. ఇదిలాఉండగా.. అడవులు, వన్యప్రాణులను సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవం, వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వై.వీ.గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్, ఆర్డీఓలు సుమ, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ‘ఓపెన్’ పరీక్షకు 136 మంది గైర్హాజరు కాళోజీ సెంటర్ : వరంగల్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు సోమవారం ప్రారంభం కాగా 136 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. పదో తరగతి తెలుగు పరీక్షకు మొత్తం 398 విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 342 మంది హాజరు కాగా.. మరో 59 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ఉర్దూ, హిందీ పరీక్షలకు 713 మంది విద్యార్థులకు గాను 636 మంది హాజరు కాగా 77 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఇంటర్ సప్లమెంటరీ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు కాళోజీ సెంటర్ : ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగించినట్లు వరంగల్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఫెయిలైన, మార్కుల ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకొనే విద్యార్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఫీజు చెల్లించాలని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లను సంప్రదించి పరీక్ష ఫీజు చెల్లించాలని కోరారు. మక్కలు కొనుగోలు చేయాలని రైతుల ధర్నా పర్వతగిరి: మండలంలోని ఏనుగల్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో మక్కలను కొనుగోలు చేయాలని సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. గ్రామంలోని అంబేడ్కర్ సెంటర్లో రోడ్డుపై మొక్కజొన్నలు పోసి బైఠాయించి నిరసన తెలి పారు. కొనుగోలు కేంద్రంలో మొక్కజొన్నలను పోయనీయకపోవడంతో రోడ్డుపైనే రోజుల తరబడి వేచి చూస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తమ ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతుల ధర్నాతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఏనుగల్ గ్రామానికి చేరుకుని రైతులను శాంతింపజేశారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల బృందం జేఎస్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం సుడిగాలి పర్యటన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణపై సమీక్ష, రెండో విడత రైతు భరోసా విడుదల తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కాళేశ్వరాలయ పునరుద్ధరణ పూజల్లో పాల్గొన్న సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు అనంతరం మేడిగడ్డ బ్యారేజ్కి వెళ్లారు. పియర్స్ వద్ద శాంపిళ్లను పరి శీలించారు. కుంగిన ఏడో బ్లాక్ వద్ద డ్రిల్లింగ్ పనులు చూసిన సీఎంకు బ్యారేజీ వద్ద చేస్తున్న పరీ క్షలను అధికారులు వివరించారు. సీఎంతో పాటు ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్జైన్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లు ఎలా తీస్తున్నారో చూశారు. ప్రభుత్వం మొత్తం 520 శాంపిళ్లు సేకరించి సెంట్రల్ వాటర్, పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూఆర్పీఎస్)కు పంపనుంది. ల్యాబ్లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన వస్తుందని ఈ సందర్భంగా డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్కు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. ప్యార్లర్ క్రాస్ హోల్ సెస్మిక్ టెస్ట్ వివరాలను వివరించారు. సుమారు గంటపాటు అధికారులతో సమీక్ష.. మూడు బ్యారేజీల పరిస్థితిపై అధ్యయనం చేసిన సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులతో కలిసి కాళేశ్వరం వద్ద ఎల్ అండ్ టీ గెస్ట్హౌస్లో అధికారులతో సమీక్ష జరిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లోపాలపై ఎలా ముందుకెళ్లాలో చర్చించారు. ఇటీవల నియమించిన స్టీరింగ్ కమిటీ చైర్మన్ కల్నల్ పరిచిత్ మెహ్రా బృందంతో కూడా సీఎం చర్చించి పలు సూచనలు, సలహాలు తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరంలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరిని వదలమని, అలాగే రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్టును కూడా గాలికి వదలమని, నిపుణుల సలహాలు సూచనలు తీసుకుని ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులు పూర్తిగా సహకరించాలని, ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని కోరారు. ప్రతిపక్షాలపై నిప్పులు.. అభివృద్ధి, సంక్షేమానికి హామీ.. కాటారం మండలం నస్తూర్పల్లిలో జరిగిన బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టిప్రాజెక్టును యథాతథంగా కొనసాగిస్తే లాభం ఉండదని భావించిన కేసీఆర్ పేరు మార్చి, అంచనాలు మార్చి అవినీతికి తెరతీశారని, రూ.38 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.50 లక్షల కోట్లకు పెంచారని అన్నారు. తనకు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయని భావించారని, ఆనాడు గవర్నర్ నరసింహన్ను మభ్యపెట్టి అబద్ధాలు చెప్పించారన్నారు. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని 2020లోనే ఇంజనీర్లు చెప్పారని గుర్తు చేశారు. ఇంజనీర్ల లేఖలను సీఎం, ఎల్అండ్టీ సంస్థ పట్టించుకోలేదని, ఫలితంగా 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుప్పకూలి పోయిందని ఆరోపించారు. అన్ని దాచిపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నించినా, ప్రకృతి మరొకటి తలచి అది పూర్తిగాకుంగిపోవడంతో ప్రపంచానికి అసలు విషయం తెలిసిందన్నారు. సీబీఐ విచారణకు అప్పగించి 9 నెలలు అవుతున్నా కేంద్రం నుంచి స్పందన లేదని, కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరంపై ఇప్పటికీ సీబీఐ విచారణకు ఆదేశించలేదని, 2019 నుంచి ఈ ప్రాజెక్టు ద్వారా 162 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశామని తెలిపారు. రూ.లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును వృథాగా పోనీయలేమని, మరమ్మతులు పూర్తి చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, తుమ్మల, గడ్డం వివేక్, పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి, ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, బలరాంనాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, ఆది శ్రీనివాస్, విజయ రమణారావు, మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్, ప్రేమ్సాగర్, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. నస్తూర్పల్లి బహిరంగ సభలో అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‘రైతు ఉత్సవాలు’ సభలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి భూపాలపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరముక్తీశ్వర స్వామి దేవస్థానానికి రూ.200 కోట్లు నిధులు ఇచ్చామని, ఆలయ పునర్నిర్మాణ పనులు, ఇతర కట్టడాలు చేపట్టి అంగరంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలనలో భాగంగా.. కాటారం మండలం నస్తూర్పల్లి గ్రామ సమీపంలో సోమవారం ‘రైతు ఉత్సవాలు’ బహిరంగ సభ నిర్వహించారు. సభాస్థలి సమీపంలో రూ.203 కోట్లతో ఆరెంద–దామెరకుంట గ్రామాల మధ్య ఉన్న మానేరు వాగుపై రూ.203 కోట్లతో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే సత్యనారాయణరావు కోరిన ప్రతీసారి అభివృద్ధి పనులకు సరిపడా నిధులు ఇస్తున్నామన్నారు. సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహించుకున్నామని, త్వరలోనే జరుగనున్న అంత్య పుష్కరాలకు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామన్నారు. కాళేశ్వరం దేవస్థానం, ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులకు అవసరమైన నిధులిస్తామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.ముందుగా మేడిగడ్డను సందర్శించిన సీఎం, మంత్రులు, నిపుణులు ఎన్డీఎస్ఏ, స్టీరింగ్ కమిటీ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష 3 బ్యారేజీల మరమ్మతులకు నిర్ణయం బహిరంగసభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం రూ.407 కోట్లతో పథకాలకు శంకుస్థాపన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
కేసీఆర్ కాస్కో..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘కేసీఆర్ కాస్కో.. 2029 ఎన్నికల్లో నువ్వో నేనో తేల్చుకుందాం. నీకున్న ఈ ప్రతిపక్ష హోదా కూడా ఊడగొట్టకపోతే నా పేరు మార్చుకుంటా. రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. అసలు ఈ చట్టాలే లేకుంటే, అటవిక రాజ్యమే అయితే మిమ్మల్ని చెట్టుకు ఉరేసినా తప్పులేదు. కాంగ్రెస్ కార్యకర్తల తరఫున సవాల్ చేస్తున్నా..వచ్చే ఎన్నికల్లో వంద మీటర్ల లోతున పాతరేస్తాం..’అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కొందరు స్వార్థపర నాయకులు ప్రజాపాలన పోయి పాపాల భైరవుల పాలన రావాలని కోరుకుంటున్నారని, అలాంటి వారికి ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం సీఎం.. మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, డి.శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్కుమార్ గౌడ్ తదితరులతో కలిసి జేఎస్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. కాళేశ్వర ముక్తేశ్వరస్వామి ఆలయంలో పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మేడిగడ్డ బరాజ్ పరిశీలన తర్వాత కాటారం మండలం నస్తూరిపల్లిలో మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. రెండో విడత రైతుభరోసా రూ.5,700 కోట్లు ఆన్లైన్లో విడుదల అనంతరం మాట్లాడారు. జై కాంగ్రెస్ అంటూ ప్రసంగాన్ని మొదలెట్టిన ఆయన ‘తోడేలు బయటకు వెళ్లింది. ఈ సభ చూసి వారి గుండెలు అదరాలి..’అంటూ మాజీమంత్రి జీవన్రెడ్డి, జగిత్యాలలో కేసీఆర్ సభను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎవరి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి ‘రైతు ఆత్మగౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం పథకాలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రజాపాలన కావాలో.. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారిన ఆ పెద్దమనిషితో పాటు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఈ దేశానికి వెన్నెముకైన రైతును ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతోంది. రైతు సంక్షేమం అనేది కాంగ్రెస్ నినాదం కాదు విధానం. ఆ దిశలోనే ఆనాడు శాశ్వత ప్రాతిపదికన నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టులను కట్టి సాగునీరు అందించడం చరిత్ర పుటల్లో లిఖితమయ్యింది. నాడు వ్యవసాయం దండగ అన్న ప్రభుత్వాలకు చరమగీతం ఆత్మహత్యల వైపు పయనిస్తుంటే వారి ఆత్మగౌరవం నిలబెట్టాలని గిట్టుబాటు ధర కల్పన చట్టం తీసుకరావడమేగాక పంటల అధిక ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన నిలిచేలా కాంగ్రెస్ ప్రభుత్వాలు దోహదపడ్డాయి. వ్యవసాయం దండగ అని కరెంటు ఇవ్వని ప్రభుత్వాలకు చరమగీతం పాడుతూ వైఎస్సార్ పాదయాత్ర చేసి దేశంలోనే మొదటిసారి చేవెళ్ల వేదికగా ఉచిత కరెంటు అమలు చేసి రైతుకు బాసటగా నిలిచారు. రైతులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యల వైపు పయనిస్తున్నారని నాటి పీఎం మన్మోహన్సింగ్ 72 వేల కోట్ల రైతులకు రుణమాఫీ చేసి వారిని రుణ విముక్తుల్ని చేసిన ఘనత చరిత్రలో నిలిచింది. దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నాం.. తెలంగాణలో ప్రజాపాలన ఏర్పాటు కోసం రాష్ట్రంలో ఇరువైపులా నేను, సమ్మక్క సారలమ్మ సాక్షిగా బాసర టు భద్రాది వరకు భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి ఇచ్చిన మాట మేరకు రూ.2 లక్షల రుణమాఫీని దశల వారీగా నేరవేరుస్తున్నా ప్రతిపక్షాలు ఉనికి కోసం రాద్ధాంతం చేస్తున్నాయి. నాడు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. 25.35 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కలిగించాం. నేడు రైతు భరోసా కింద రూ.5,300 కోట్లు ఖాతాల్లో వేస్తున్నాం. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించుకునే దిశలో సాగునీటి ప్రాజెక్టుల పునర్నిర్మిస్తున్నాం. 3.15 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇలాంటి తరుణంలో ప్రజాపాలన పోవాలో.. పాపాల భైరవుడు కేసీఆర్ పాలన కావాలో పార్టీ మారుతున్న పెద్దమనిషి ఆత్మవిమర్శ చేసుకోవాలి..’అని సీఎం అన్నారు. జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది.. ఫామ్హౌస్లో పడుకున్న పెద్దాయనకు పాలన మళ్లీ ఎందుకని ప్రశ్నించకుండా, కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం రక్తమోడ్చి జెండాలు మోసిన కార్యకర్తలు, నాయకుల శ్రేయస్సు విస్మరించి ప్రజాపాలన వచ్చే ముందు జగిత్యాలో ఓడిన జీవన్రెడ్డి అర్హత ఏంటో తేలింది. ఇక ఆ పెద్దమనిషి పుట్టు పూర్వోత్తరాలు చెప్పక తప్పదు. 1983లో తుమ్మల నాగేశ్వర్రావు సాక్షిగా ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా టికెట్టు ఇచ్చి గెలిపించడమే గాక ఎక్సైజ్ మంత్రి పదవి ఇస్తే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి నాదెండ్లతో జట్టు కట్టినా దిక్కులేక కాంగ్రెస్లో చేరడం నిజం కాదా? కాంగ్రెస్లో 14 సార్లు ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే, ఓడినా గెలిచినా మద్దతు పలికితే సంయమనం పాటించకపోవడం అప్రజాస్వామికం కాదా? జగిత్యాల ప్రజలు నీకు ఊడిగం చేసింది వాస్తవం కాదా? ఈ వయస్సులో రాజకీయ నీతి విస్మరించి శత్రువు చేతిలోచేరి ప్రజాపాలన పోవాలి...పాపాల భైరవుడు కేసీఆర్ పాలన రావాలనడం సిగ్గు చేటు..’అంటూ సీఎం ధ్వజమెత్తారు. కుట్ర రాజకీయాలకు తావు లేదు.. ‘గతంలో వైఎస్సార్, డీఎస్ కాంబినేషన్ మాదిరి నేను, మహేశ్కుమార్గౌడ్ కలిసి పార్టీని అధికారంలోకి తెస్తాం. దళిత బిడ్డలు, బీసీలు, ఆదివాసీలను మంత్రులు చేసిన ప్రజాపాలన పోవాలనే కుట్ర రాజకీయాలకు తెలంగాణలో తావులేదు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ రాజ్యమే తప్ప మరొకటి రాదు. చరిత్ర పునరావృతం చేసేలా హైదరాబాద్ను మహానగరం చేస్తూ, పాలమూరు వంటి ప్రాజెక్టులకు పూర్తి చేస్తూ ఎవరు అడ్డొచ్చినా తొక్కుతూ ముందుకు పోతాం..’అని రేవంత్ అన్నారు. దేశంలో అత్యధిక మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే గాక రాహూల్ను ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్రావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీలు వంశీకృష్ణ, వేం నరేందర్రెడ్డి, బలరాంనాయక్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దస్తావేజుల దందా ‘మామూలే’
సాక్షి, వరంగల్: జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల సమీపంలో అవినీతి చేతులు చాస్తోంది. ఉన్నతాధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా.. ఒక్కసారైనా విచారించిన దాఖలాలు లేవు. ఇటీవల ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో వరంగల్ రూరల్, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతిపై చర్చ నడుస్తోంది. ఈ మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రోజుకు 120 నుంచి 150 వరకు దస్తావేజులు రిజిస్ట్రేషన్ అవుతుండడంతో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు దళారులుగా అవతారమెత్తి అక్రమంగా సుమారు రూ1,50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆ మొత్తంలో కొంత వాటాను కార్యాలయ సిబ్బందికి ఇస్తారనే ఆరోపణలున్నాయి. తాము తీసుకున్న సొమ్ములో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటెండర్ నుంచి సబ్ రిజిస్ట్రార్ వరకు వాటాల రూపంలో కొంతమొత్తాన్ని ఇవ్వాల్సిందేనని డాక్యుమెంట్ రైటర్లు చెబుతున్నారు. ఇదంతా బహిరంగా రహస్యమైనప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రూ.లక్షల్లో దందా ఒక ఇల్లు రిజిస్ట్రేషన్కు సుమారు రూ.5 వేలు, నాలా కోసం రూ.10 వేలు, ప్లాట్ అయితే రూ.1,500, వివాహ రిజిస్ట్రేషన్కు రూ.1,200 చొప్పున కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు వసూలు చేస్తున్నారు. ఒకవేళ దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే పైనపేర్కొన్న మొత్తానికి రెండుమూడు రేట్లు ఎక్కువగానే దరఖాస్తుదారుడు చెల్లించాల్సి వస్తుంది. ఇవేకాకుండా స్లాట్ బుకింగ్, దస్తావేజుల తయారీ పేరు మీద రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీ రిజిస్ట్రేషన్ కార్యాలయ సమీపంలోని అడ్డాల్లో అందినకాడికి దండుకుంటున్నారు. ప్రతి రోజు ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సుమారు 85, వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 25, నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 40 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఇలా ఒక్కో రిజిస్ట్రేషన్కు సగటున రూ.మూడు వేలు అనుకున్నా రూ.4,50,000 వరకు అవినీతి దందా నడుస్తోంది. తీరు మారని అధికారులు అడపాదడప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు చేస్తున్నా అధికారుల తీరు మారడం లేదనే ఆరోపణలున్నాయి. ఎవరైనా బాధితుడు అధికారులతో విసుగెత్తి ఏసీబీ అధికారులను కలిస్తే అప్పుడే మాత్రమే దాడులు జరుగుతున్నాయి. సబ్ రిజిస్ట్రార్ల పనితీరుపై ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఫిర్యాదులు అందినే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటే ఈ అవినీతికి కాస్త అడ్డుకట్ట పడే అవకాశముందని ప్రజలు అంటున్నారు. ‘ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజు తయారుచేసినందుకు మాత్రమే రుసుం తీసుకోవాలి. ఎవరైనా అక్రమంగా వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అవినీతికి అడ్డాగా జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొంతమంది డాక్యుమెంట్ రైటర్లే దళారులుగా వ్యవహరిస్తూ వసూళ్లు ఒక్కో డాక్యుమెంట్పై అదనంగా బాదుడు ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్పై ఎన్ఫోర్స్మెంట్ దాడుల నేపథ్యంలో చర్చ ‘స్థలం రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే స్లాట్ బుకింగ్, దస్తావేజుల తయారీ మీద రూ.రెండు వేల వరకు డాక్యుమెంట్ రైటర్ తీసుకున్నాడు. ఇదికాకుండా దస్తావేజుకు, కార్యాలయ ఖర్చుల కోసమంటూ రూ.1,500ల వరకు వసూలు చేశాడు. అంటే మొత్తం రూ.3,500 వరకు తీసుకొని రిజిస్ట్రేషన్ చేశాడు. రూ.లక్షలు పెట్టి ప్లాట్ కొనడంతో చకచక రిజిస్ట్రేషన్ కావాలన్న ఉద్దేశంతో రైటర్ అడిగినంత ఆ వ్యక్తి ఇచ్చేశారు.’ ‘నాలా కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి నుంచి వరంగల్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఓ వ్యక్తి రూ.ఆరు వేలు తీసుకున్నాడు. ఆ తర్వాతనే అతని పని పూర్తి అయింది. తన అవసరాల నిమిత్తం త్వరగా పని కావాలన్న ఉద్దేశంతో డాక్యుమెంట్ రైటర్ అడిగినంత ఆ వ్యక్తి ఇచ్చాడు’. -
‘ప్రతిపక్షాలపై బీజేపీ ఆరోపణలు సరికాదు’
కాశిబుగ్గ: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్లో హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్తో పోల్చి మాట్లాడటం బీజేపీ నాయకులకు సరైంది కాదని హెచ్చరించారు. గతంలో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టే తీసుకువచ్చిందని, మహిళలకు పెద్దపీట వేసి దేశానికి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిన ఘతన కూడా కాంగ్రెస్ పార్టీదేనని కొనియాడారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మోడల్ స్కూల్స్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 160 మంది విద్యార్థులకు 113 మంది హాజరుకాగా 47 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కార్యాలయ ఏసీజీ భువనేశ్వరి తెలిపారు. అలాగే, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 114 మంది విద్యార్థులకు 67 మంది హాజరుకాగా.. 47 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. 22 నుంచి సమ్మెకు సిద్ధం నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కొందరు యాని యన్ నాయకులు, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీజియన్ జేఏసీ నాయకులు శ్రీనివాస్, యాకస్వామి, శ్రీనివాస్, జీఎస్.పాణి, మండరాజు, బాలరాజు, రమేశ్, పోతరాజు, వలీధర్, కుమార్, రవీందర్, అర్చన, కల్పన, నవత, ఉమారాణి, కవిత, సుమతి, కార్మికులు పాల్గొన్నారు. మండే ఎండ.. ఠండా ఠండా! న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. -
పరిసరాల పరిశుభ్రతలో ఓసిటీ కాలనీ ఆదర్శం
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీలోని ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనాన్ని ఇతర కాలనీ వాసులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీ కాలనీలో నిర్వహిస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కలెక్టర్ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కాలనీవాసులందరు కలిసి ఏడు విడతలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, పచ్చదనం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, టెర్రస్ గార్డెనింగ్ను కూడా ప్రోత్సహించాలని వారికి సూచించారు. అనంతరం, పచ్చదనం, ప్లాస్టిక్ నిర్మూలనపై ఓసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించి, క్లాత్ సంచులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి బజ్జూరి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్ఓ ప్రేమలత, శానిటరీ ఇన్స్పెక్టర్ భూమయ్య, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
అన్లోడ్లో నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
● జాతీయ రహదారిపై రాస్తారోకో నల్లబెల్లి: మొక్కజొన్న బస్తాలను దిగుమతి చేయడంలో గోదాం నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండలంలోని బజ్జుతండా శివారులోని జాతీయ రహదారిపై రైతులు ఆదివారం రాస్తారోకో చేశారు. మూడు రోజులుగా మొక్కజొన్న బస్తాలతో వాహనాలు గుండ్లపహాడ్ గోదాం వద్ద వేచి ఉన్నా అధికారులు దిగుమతి చేసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ట్రాక్టర్ను అడ్డుపెట్టి బైఠాయించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ అక్కడికి చేరుకుని రైతులతో చర్చించి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నల్లబెల్లి కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా పంట ఉత్పత్తులను నిర్వాహకులు దిగుమతి చేసుకోవడం లేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు వేడుకున్నారు. -
కేసీఆర్ పేరు వింటే రేవంత్కు దడ
● మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్వర్ధన్నపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అంటే సీఎం రేవంత్రెడ్డికి దడ పుడుతోందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. గ్రామంలో తొలుత కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కేసీఆర్ను తట్టుకోలేక రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నిక హామీల్లో కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం ఏమైందని, పింఛన్ల పెంపు ఏదని, విద్యార్థినులకు స్కూటీలు ఏమయ్యాయని, రైతుబంధు ఎప్పుడు ఇస్తారని, రైతులకు ఎప్పుడు న్యాయం చేస్తారని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీల సీట్లను కై వసం చేసుకుంటామని అరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, తూల్ల కుమారస్వామి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మేడిగడ్డలో జియో ఫిజికల్, టెక్నికల్ పరీక్షల పరిశీలన.. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జన సమీకరణ కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులుముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలుభూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి నేడు (సోమవారం) కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి రానున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
న్యూశాయంపేట: విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, ఆర్ట్, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని తెలంగాణ మైనార్టీ గురుకులాల విద్యాసంస్థ(టెమ్రిస్) రీజినల్ కో–ఆర్డినేటర్ జంగా సతీశ్ అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో విద్యనభ్యసిస్తున్న (5 నుంచి 8వ తరగతి) విద్యార్థులకు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణలో భాగంగా పదిరోజుల పాటు నిర్వహించే సమ్మర్ క్యాంప్ను ఆదివారం వరంగల్ శంభునిపేట, వరంగల్(జి2) గురుకులంలో ప్రారంభించారు. ప్రిన్సిపాల్ తాళ్ల నీలిమాదేవి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జంగా సతీశ్ మాట్లాడుతూ.. సమ్మర్క్యాంపునకు బాలికలకు, శంభునిపేట గురుకులంలో, బాలురకు జక్కలొద్ది గురుకులంలో సౌకర్యాలు కల్పించి పదిరోజుల పాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 400 మంది విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధి కారులు సయ్యద్ అక్బర్, మక్బూల్పాషాతో పాటు, పీఈటీలు, ఆర్ట్స్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. టెమ్రిస్ ఆర్ఎల్సీ సతీశ్ -
అద్దె బస్సుల స్కీం కొనసాగించాలి
హన్మకొండ: ఆర్టీసీలో అద్దె బస్సుల స్కీం కొనసాగించాలని ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్ కోరారు. హనుమకొండ హంటర్రోడ్డులోని అభిరాం గార్డెన్స్లో ఆర్టీసీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ రీజియన్ స్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో లక్కం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగులు 25 సంవత్సరాలుగా ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతూ ఉపాధి పొందుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్టీసీలకు అనుసంధానంగా 0.033 వాహనాలు నడుస్తున్నాయన్నారు. ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతూ నిరుద్యోగుల పొట్ట కొట్టాలని చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాలుష్యం నివారణ పేరుతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడితే సరిపోదని, ఇతర వాహనాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్బ మధుకర్రెడ్డి మాట్లాడుతూ 2007, 2009 బస్సుల స్థానంలో రిప్లేస్మెంట్ బస్సులను ఇవ్వాలని, డిపో మేనేజర్లతో ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఆర్ఎం కార్యాలయంలో సంయుక్త సమావేశం నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు. అసోసియేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు మారిపల్లి రాంరెడ్డి, అసోసియేషన్ ప్రతినిధులు బాలవర్ధన్రెడ్డి, ఎన్.ప్రసాద్, హబీబ్, జె.వెంకట్రెడ్డి, కె.సదానందం, ఎండి పర్వేజ్, జి.వెంకన్న, కె.భాస్కర్రెడ్డి, కుమార్, బి.రామలింగారెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ హైర్బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు లక్కం ప్రభాకర్ -
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
భూపాలపల్లి అర్బన్: ముఖ్యమంత్రి నేడు (సోమవారం) కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామానికి రానున్న నేపథ్యంలో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. పరకాల నుంచి మహదేవపూర్ వరకు ఉన్న ఎన్హెచ్ 353–సీ రహదారిపై బొగ్గు, ఇసుక లారీలు, ట్రాక్టర్లు, ఇతర భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్థానిక సీఐ నరేష్శ్మార్ ప్రకటనలో తెలిపారు. రహదారి ఇరువైపులా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. మంజూర్నగర్ నుంచి బాంబులగడ్డ వరకు ఈ నిబంధనలు కఠినంగా అమలులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కాన్వాయి కాటారం వైపు ప్రయాణించనున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు సహకరించి, పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. -
మండే ఎండ.. ఠండా ఠండా!
● జూపార్కులో చల్లదనం కోసం స్ప్రింక్లర్లు, చలువ పందిళ్ల ఏర్పాటు ● ఉష్ణోగ్రతలు పెరగకుండా అధికారుల ఏర్పాట్లు న్యూశాయంపేట: ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో జంతువులు, పక్షులు, సరీసృపాలకు ఉపశమనం కలిగించేందుకు మూగజీవాలు వడదెబ్బ బారిన పడకుండా వరంగల్ నగరంలోని హంటర్రోడ్డు కాకతీయ జూవలాజికల్ పార్కులో జూ క్యూరేటర్ బి.లావణ్య, అసిస్టెంట్ క్యూరేటర్ బి.మయూరి నేతృత్వంలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జంతువులకు వేసవి తాపం తెలియకుండా ఉండేందుకు అటు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్క్లోజర్లో ఉండే క్రూర మృగాల కోసం ఉష్ణోగ్రతలు పెరగకుండా వాటర్ స్పింక్లర్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా పక్షుల కోసం చలువ పందిళ్లు, తడి తడకలు, గడ్డితో కూడిన పందిళ్లు ఏర్పాట్లు చేసి రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. జంతువుల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు అధికారులు ఆహార నియమాల్లో కీలక మార్పులు చేసి నీటితో కలిపి ఎలక్ట్రోలైట్స్ తదితర బలవర్థక ద్రావణాలు, ఆహారం అందిస్తున్నారు. జంతువులకు, పక్షులకు చల్లటి నీటితో స్నానాలు చేయించి ఎండ వేడి బారిన పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
జేఎన్ శర్మకు ‘నాటక మణిచంద్ర’ బిరుదు ప్రదానం
హన్మకొండ కల్చరల్: వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ పద్యనాటక కళాకారుడు, పోతన విజ్ఞానపీఠం మేనేజర్ జేఎన్శర్మ ‘నాటక మణిచంద్ర’ బిరుదు అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం జనగామలోని సెయింట్ మేరీ స్కూల్లో కవులు, కళాకారులు ఐక్యవేదిక ఏడో వార్షికోత్సవాన్ని నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు నెల్లుట్ల రవీంద్రరావు అధ్యక్షతన జరిగిన వేడుకలో ముఖ్య అతిథిగా శాసనసభ కార్యదర్శి బేతి శివారెడ్డి, డాక్టర్ నామోజు బాలాచారి హాజరై జేఎన్ శర్మకు బిరుదు ప్రదానం చేశారు. -
నేడు ముఖ్యమంత్రి కాళేశ్వరం టూర్
భూపాలపల్లి/కాళేశ్వరం: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం పర్యటనకు సోమవారం (నేడు) రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాళేశ్వరం హెలిపాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా కాళేశ్వరం దేవస్థానం చేరుకుని ముందుగా శ్రీకాళేశ్వరముక్తీశ్వరుడిని దర్శించుకుంటారు. తర్వాత కాళేశ్వరం దేవస్థానంలోని తూర్పు ఈశాన్య స్థలంలో రూ.200 కోట్ల వ్యయంతో రాతి నిర్మాణ పనుల భూమిపూజలో పాల్గొంటారు. కాళేశ్వరాలయం గర్భాలయం, శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. మేడిగడ్డలో జియో ఫిజికల్, టెక్నికల్ పరీక్షల పరిశీలన.. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో 19, 20వ పియర్లు, వంతెన కుంగిన విషయం తెలిసిందే. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో కూడా సీపేజీ లీకేజీలు ఏర్పాడ్డాయి. అప్పటి నుంచి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యాంసేఫ్టీ అథారిటీ) సూచనల మేరకు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం మరమ్మతులు చేసి నీటిని ప్రజలకు అందించడానికి ముందుకు రావడంతో సీఎం పర్యటన ఖరారు చేసినట్లు తెలిసింది. దీంతో 3.45 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుంటారు. మేడిగడ్డ బ్యారేజీలో జరుగుతున్న జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలు, బోర్హోల్స్ పనులను పరిశీలిస్తారు. అక్కడ ఇరిగేషన్శాఖ ఇంజనీర్లతో సమీక్షిస్తారు. సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గం ద్వార నస్తుర్పల్లికి చేరుకుంటారు. 6.30 గంటలకు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. రాత్రి 7.45 గంటల అనంతరం రోడ్డు మార్గం ద్వార వెళ్తారని అధికారులు తెలిపారు. మూడు చోట్ల హెలిపాడ్ల ఏర్పాటు.. సీఎం పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం దేవస్థానం, మేడిగడ్డ, నస్తుర్పల్లిలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మూడు చోట్ల హెలిపాడ్లు సిద్ధం చేశారు. కాళేశ్వరం దేవస్థానంలో పూలతో డెకెరేషన్స్ చేశారు. పూజా కార్యక్రమాలు, భూమిపూజ కోసం దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మేడిగడ్డలో సమీక్ష నిర్వహిస్తుడండంతో అంబట్పల్లిలోని గెస్ట్హౌస్లో ఏర్పాట్లు చేశారు. నస్తుర్పల్లిలో సుమారు 40 ఎకరాల్లో సభాప్రాంగణం, విద్యుత్ లైట్లు, ఇతర ఏర్పాట్లు చేశారు. 20 ఎకరాల్లో పార్కింగ్ స్థలాలు, హెలిపాడ్ సిద్దం చేశారు. జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, డీఎస్పీ సూర్యనారాయణతో పాటు జిల్లా అధికారుల పనులు పూర్తి చేశారు. జనసమీకరణ.. కాటారం సబ్డివిజన్తో పాటు పక్క జిల్లాల నుంచి భారీ ఎత్తున సభకు ప్రజలు, రైతులు తరలి రావడానికి నాయకులు జన సమీకరణ చేపట్టారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు సమకూర్చనున్నారు. భారీగా ప్రజలను సభకు తీసుకురావాలని సర్పంచ్లు, మాజీ ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీధర్బాబు సూచించారు. రూ.200 కోట్లతో కాళేశ్వరాలయం రాతి నిర్మాణ పనులకు భూమి పూజ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ సందర్శన కాటారం మండలం నస్తుర్పల్లిలో రైతు భరోసా నిధుల విడుదల ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు -
పరిసరాల పరిశుభ్రతలో ఓసిటీ కాలనీ ఆదర్శం
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద కాశిబుగ్గ: వరంగల్ ఓసిటీలోని ప్లాస్టిక్ నిర్మూలన, పచ్చదనాన్ని ఇతర కాలనీలవాసులు ఆదర్శంగా తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. వరంగల్ ఓసిటీ కాలనీలో నిర్వహిస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కలెక్టర్ ఆదివారం పాల్గొని మాట్లాడారు. కాలనీవాసులంతా కలిసి ఏడు విడతలుగా ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ, పచ్చదనం కాపాడుతుండడం అభినందనీయమని ప్రశంసించారు. వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, టెర్రస్ గార్డెనింగ్ను కూడా ప్రోత్సహించాలని వారికి సూచించారు. అనంతరం, పచ్చదనం, ప్లాస్టిక్ నిర్మూలనపై ఓసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రూపొందించిన కరపత్రాలను ఆమె ఆవిష్కరించి, క్లాత్ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొబ్బల శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి బజ్జూరి వేణుగోపాల్, ఉద్యాన శాఖ అధికారి లక్ష్మారెడ్డి, డీపీఆర్ఓ ప్రేమలత, శానిటరీ ఇన్స్పెక్టర్ భూమయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.విద్యారణ్యపురి: మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం పరీక్ష నిర్వహించారు. హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి, కమలాపూర్, భీమదేవరపల్లి మోడల్ స్కూళ్లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 160 మంది విద్యార్థులకు 113 మంది హాజరుకాగా 47 మంది గైర్హాజరయ్యారని డీఈఓ కార్యాలయ ఏసీజీ భువనేశ్వరి తెలిపారు. అలాగే, 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం మధ్యాహ్నం సెషన్లో నిర్వహించిన పరీక్షకు 114 మంది విద్యార్థులకు 67 మంది హాజరుకాగా.. 47 మంది గైర్హాజరయ్యారని ఆమె పేర్కొన్నారు. కాశిబుగ్గ: పార్లమెంట్లో మహిళా బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అయూబ్ అన్నారు. ఎల్బీనగర్లోని అబ్నూస్ ఫంక్షన్లో హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ వ్యూహాలను తిప్పికొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తుచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్తో పోల్చి మాట్లాడడం బీజేపీ నాయకులకు సరైంది కాదని హెచ్చరించారు. గతంలో మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టే తీసుకువచ్చిందని, మహిళలకు పెద్దపీట వేసి దేశానికి ఇందిరాగాంధీని ప్రధానమంత్రిని చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదేనని ఆయన కొనియాడారు. కాశిబుగ్గ : వరంగల్ 23వ డివిజన్ కొత్తవాడలో కలుషితమైన పసుపు పచ్చని నీళ్లు సరఫరా అవుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి వాసనతో కూడిన నల్లా నీళ్లు రావడంతో వాటిని పట్టుకోవడానికి వెనుకాడుతున్నారు. పచ్చని రంగుతో పాటు దుర్వాసనతో కూడి ఉండడంతో తాగునీటిగా వాడట్లేదు. అలాగే వాడుకోవడానికి సైతం ఈ నీళ్లు పనికిరావడం లేదంటూ స్థానికులు వాపోతున్నారు. ఈ నీటితో ముఖం కడుక్కోవడానికి ఉపయోగిస్తే నీటి వాసన భరించలేకపోతున్నామంటూ స్థానికుడు యాకుబ్పాషా ఆవేదన వెలిబుచ్చారు. అధికా రులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటి కైనా గ్రేటర్ అధికారులు, పాలకవర్గం స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని వారు కోరుతున్నారు. -
22 నుంచి సమ్మెకు సిద్ధం
నయీంనగర్: సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ బస్టాండ్ ఆవరణలోని వరంగల్–1 డిపో ఎదుట రీజియన్ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఈదురు వెంకన్న, థామస్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఈ నెల 22వ తేదీ నుంచి కార్మికులమంతా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. జేబీఎం ఎలక్ట్రిక్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తులుగా ఉండి మోడీ విధానాన్ని అమలు చేస్తోందన్నారు. గత రెండేళ్లుగా ముఖ్యమంత్రిని, రవాణా శాఖ మంత్రిని కలిసినా పట్టించుకోని పక్షంలో సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు. రవాణా కమిషనర్ చర్చలకు పిలిచిన యాజమాన్యం, ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదన్నారు. అధిక పని భారమైనప్పటికీ మహాలక్ష్మీ పథకాన్ని ఆర్టీసీ కార్మికులు విజయవంతం చేశారన్నారు. కొందరు యాని యన్ నాయకులు, అధికారులు సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని వారికి కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో రీజియన్ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్, యాకస్వామి, టి.శ్రీనివాస్, జీఎస్.పాణి, మండరాజు, బాలరాజు, రమేశ్, పోతరాజు, వలీధర్, కుమార్, రవీందర్, అర్చన, కల్పన, నవత, ఉమారాణి, కవిత, సుమతి, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న -
స్విమ్మింగ్.. బెట్టింగ్!
ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో ఐపీఎల్ క్రికెట్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న టి.భరత్తో పాటు బెట్టింగ్రాయుళ్లు ఎం.శ్రీనివాస్, ఎల్.వెంకన్న, పి.శ్రీధర్, వి.రమేశ్ను టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. వీరి నుంచి రూ.1,02,000 నగదు, ఐదు స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిర్వాహకుడు, ఇద్దరు బెట్టింగ్రాయుళ్లు అక్కడి నుంచి పరారయ్యారు. హనుమకొండ గోపాలపురంలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన గట్ల రాజేశ్ ఇంటిలో ఈనెల 10న ఐపీఎల్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. అతడితో పాటు 11 మంది బెట్టింగ్రాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,06,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సాక్షి, వరంగల్: ఐపీఎల్ వేళ బెట్టింగ్ నిర్వాహకులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు సరికొత్త పంథాలో అడ్డాలను ఎంచుకుంటూ వ్యాపారం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఇళ్లు, హోటళ్లు, హాస్టళ్లు ఉంటే.. ఇప్పుడు పోలీసులు పెద్దగా దృష్టి సారించని స్విమ్మింగ్ పూల్స్, రిసార్ట్లు, ఫాంహౌస్ల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఖిలా వరంగల్ మండలంలోని ఓ స్విమ్మింగ్ పూల్లో శుక్రవారం రాత్రి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని మిల్స్కాలనీ పోలీసులకు అప్పగించారు. ఎంజాయ్మెంట్ పేరుతో యువతను ఆకర్షించి బెట్టింగ్లోకి లాగుతున్నట్లు పోలీసులు దాడులతో తెలుస్తోంది. అయితే రిసార్ట్లు, ఫాంహౌస్లపై కూడా పోలీసులు దృష్టి సారిస్తే బెట్టింగ్ను నిలువరించవచ్చన్న డిమాండ్ వినిపిస్తోంది. నిర్వాహకులకు కమీషన్, లాభాల్లో వాటా.. ఇన్స్ట్రాగామ్లో యాడ్స్గా వస్తున్న క్రిక్ఎక్స్బెట్.99.విన్, బీఎస్ఎఫ్2020.కామ్ తదితర క్రికెట్ బెట్టింగ్ యాప్ల్లో నిర్వాహకులు కొందరు యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందుతున్నారు. వీరికి ప్రతి బెట్టింగ్పై ఐదు నుంచి పది శాతం కమీషన్, అలాగే లాభాలను 70ః30 నిష్పత్తిలో ఇస్తున్నారు. వీరే బెట్టింగ్రాయుళ్లను ఒక ప్రదేశానికి రప్పించి వారి నుంచి డబ్బు తీసుకొని ఈ బెట్టింగ్ వైపు మళ్లిస్తున్నారు. ప్రతి మ్యాచ్, ప్రతి బాల్పై కూడా లైవ్ యాడ్స్ చూపించి బెట్టింగ్ కాసేలా చూస్తున్నారు. ఇలా డిపాజిట్, బెట్టింగ్, ఫలితం, విత్ డ్రా నిమిషాల్లోనే ముగుస్తుంది. కొన్ని సైట్లు చిన్న మొత్తాలు చెలించి నమ్మకం కలిగించి పెద్ద మొత్తాలు పెట్టగానే వారి ఆశను క్యాష్ చేసుకుంటున్నాయి. కొన్ని సందర్భాల్లో మ్యూల్ అకౌంట్ల ద్వారా చెల్లింపులు చేసి ట్రేస్ కాకుండా చూసుకుంటున్నారు. ఎక్కువ మంది బెట్టింగ్రాయుళ్లు ఓడిపోవడమే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉందని పోలీసులు గుర్తించారు. ఇళ్లు, హోటళ్లు కాదు.. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ అడ్డా ఖిలా వరంగల్ మండలంలో టాస్క్ఫోర్స్ దాడులతో వెలుగులోకి ఎంజాయ్మెంట్ పేరుతో యువకులకు వల.. ఆపై దందా -
జాగ్రత్తగా వాహనాలు నడపాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖిలా వరంగల్: యువకులు నిర్లక్ష్యంగా, వేగంగా డ్రైవ్ చేయొద్దని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ గవిచర్ల క్రాస్రోడ్డు, ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వద్ద జిల్లా రవాణాశాఖ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు ఆధ్వర్యంలో శనివారం అరైవ్–అలైవ్ కార్యక్రమం ముగింపు సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలను నడిపి ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని పేర్కొన్నారు. మత్తు పానీయాలు సేవించకూడదని, ఏకాగ్రతతో రోడ్డు పై దృష్టిసారించి వాహనాన్ని నడుపాలన్నారు. తెల్ల వారుజామున, సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. అందరి భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాల నివారణకు పాటుపడాలని కోరారు. జనగణన పారదర్శకంగా చేయాలి వర్ధన్నపేట: జనగణన పారదర్శకంగా చేపట్టాలని, ఇంటింటా ఎన్యుమరేటర్లు తిరిగి వివరాలు నమో దు చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వర్ధన్నపేట రైతువేదికలో శనివారం జనగణన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ముందుగా ఇళ్ల జాబితా, జనగణన నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అందించిన అధికారిక యాప్ను ఉపయోగించాలని సూచించారు. కుటుంబ వివరాలను పారదర్శకంగా సేకరించి నమోదు చేయాలని ఆదేశించారు. శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ పాల్గొన్నారు. సాండ్బజార్కు స్థ్థల సేకరణ చేయాలి.. న్యూశాయంపేట: వర్ధన్నపేట మండలం కట్య్రాల సమీపంలో సాండ్బజార్కు సుమారు ఐదు ఎకరాలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కోసం స్థల సేకరణ చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, అధికారులు పాల్గొన్నారు. -
మిద్దె తోటలతో ఆహ్లాదం
వరంగల్ అర్బన్: మిద్దె తోటల (టెర్రాస్ గార్డెనింగ్)తో పచ్చదనం, ఆహ్లాదం, ఆరోగ్యం కలుగుతుందని, అందుకోసం బల్దియా ప్రోత్సాహం ఇస్తుందని మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పురపాలక శాఖ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల పెంపకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మేయర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టెర్రాస్ గార్డెనింగ్ వల్ల గాలిలోని హానికర వాయువులు నియంత్రణలోకి వస్తాయని పేర్కొన్నారు. మిద్దైపె సహజ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసుకోవడంతో ఆరోగ్యకర ఆహారం అందుబాటులోకి వస్తుందని, శుద్ధమైన గాలి లభిస్తుందన్నారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, ప్రత్యేకంగా ఉద్యానవన విభాగ సిబ్బందిని నియమించాలన్నారు. అనంతరం సీడీఎంఏ నుంచి వచ్చిన హార్టికల్చర్ అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా బాలసముద్రం ప్రాంతంలో సీటీజీ సభ్యురాలు రాణి ఇంటి వద్ద నిర్వహిస్తున్న మిద్దె తోటను పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర టెర్రస్ గార్డెన్ నోడల్ అధికారి హేమలత, రాష్ట్ర అర్బన్ ఫార్మింగ్ హార్టికల్చర్ అధికారి మంగ, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, సీహెచ్ఓ రమేశ్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, హెచ్ఓ లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఎఫ్ఆర్ఓ పురుషోత్తం, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీనివాస్, నరేందర్, టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు, ఔత్సాహికులు తదితరులు పాల్గొన్నారు. మేయర్ గుండు సుధారాణి పెంపకంపై అవగాహన సదస్సు -
మీరే ఓ ఎన్యుమరేటర్..
ప్రశ్నావళికి సమాధానాలివ్వండివరంగల్ అర్బన్: జనగణన ప్రక్రియ ఆరంభమైంది. ప్రజలే స్వచ్ఛందంగా పొర్టల్లో స్వీయ గణన చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. గతంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి వివరాలు సేకరించే వారు. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ల్యాప్టాప్ ద్వారా స్వయంగా ఎవరికి వారే వివరాలు నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం నిర్వహించే జనాభా గణన లేదా ఇతర సరేల్లో ప్రజలు ఎన్యుమరేటర్లు కీలక పాత్ర పోషించేవారు. కానీ, జనగణనలో ఎన్యుమరేటర్ల సహాయం లేకుండానే అధికారిక పోర్టల్ ద్వారా తమ కుటుంబ సభ్యులు, ఇతర వివరాలు నమోదు చేసుకునేందుకు సెల్ఫ్ ఎన్యుమరేషన్ తీసుకొచ్చారు. సమాచార గోప్యంతోపాటు సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. లాగిన్ అవ్వండిలా.. తొలుత ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీవోవి.ఇన్’ అనే అధికారిక పొర్టల్ను సందర్శించాలి. అక్కడ లాగిన్ ప్రక్రియలో రాష్టం, క్యాప్చా నమోదు చేసి వెరిఫై చేయాలి. అనంతరం యాజమాని పేరు, ఫోన్ నంబరు. ఈ మెయిల్ ఐడీ నమోదు చేస్తే ఫోన్కు ఆరు అంకెల ఓటీపీ వస్తోంది. వీటిని నమోదు చేసిన అనంతరం ప్రక్రియ ప్రారంమవుతుంది. శాటిలైట్ మ్యాప్ కనిపిస్తూనే చిరునామా, పిన్కోడ్ నమోదు చేయమని అడుగుతుంది. మీరిచ్చే సమాచారం ఆధారంగా ఆక్షాంశాలు, రేఖాంశాల వివరాలు తీసుకుని.. మీ ఇంటిని మ్యాప్లో నమోదు చేస్తోంది. అనంతరం ప్రశ్నావళి మొదలవుతుంంది. మీ ఇల్లు మట్టితో కట్టిందా? సిమెంట్ ఇటుకలతోనా? గోడల పరిస్థితి ఏంటి? ఇల్లు ప్రస్తుతం ఏస్థితిలో ఉంది? ఇలా సూమారు 30 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, ఇలా అన్నీ నమోదు చేశాక సేవ్ చేసుకుంటూ వెళ్లాలి. చివరకు ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక ఓ రెఫరెన్స్ నంబర్ వస్తుంది. దాన్ని ము న్ముందు ఎన్యుమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే చాలు. మళ్లీ మన వివరాలను వారికీ చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈనెల 16 నుంచి 30 వరకు స్వీయ లెక్కింపునకు అవకాశం కల్పించారు. పోర్టల్లో తెలుగు సహా అన్ని ప్రాంతీయ భాషల్లో వివరాలు నమో దు చేసుకునే సౌకర్యం కల్పించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా చూడాలని హనుమకొండ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మహా నగర ప్రజలంతా ఈ ప్రక్రియలో భాగస్వాములై స్వీయ గణన చేసుకునే వెసులుబాటును వినియోగించుకోవాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. వివరాల్ని సొంతగా నమోదు చేసుకునే అవకాశం నగరంలో ప్రారంభమైన స్వీయ జనగణన విస్తృతంగా ప్రచారం చేయండి: హనుమకొండ కలెక్టర్


