Warangal
-
విద్యుత్ కార్మికులకు కరెంట్ షాక్..
డోర్నకల్ /కేసముద్రం/నల్లబెల్లి/ముస్తాబాద్ (సిరిసిల్ల) /మల్లాపూర్: ఉమ్మడి వరంగల్, జగిత్యాల జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న వేర్వేరు విద్యుత్ ప్రమాదాల్లో నలుగురు విద్యుత్ కార్మికులు కరెంట్ షాక్కు గురయ్యారు. అందులో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే, సిరిసిల్ల జిల్లాలో కిందపడిన విద్యుత్ తీగను సరిచేస్తూ షాక్కు గురై ఓ కూలీ మరణించాడు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటకు చెందిన బి.క్రాంతికుమార్ (32) ఐదేళ్లుగా డోర్నకల్ విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శనివారం మున్నేరువాగు వద్ద ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలంటూ ప్రత్యేక యాప్ ద్వారా అనుమతి కోరగా.. సరఫరా నిలిపివేసినట్లు సమాచారం వచ్చింది. దీంతో ట్రాన్స్ఫార్మర్పైకి వెళ్లి మరమ్మతు చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. అతడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోల్పైనుంచి పడి జేఎల్ఎం దుర్మరణంవిద్యుత్ స్తంభంపైకెక్కి తీగలు సరిచేస్తుండగా కరెంట్ షాక్తో జూనియర్ లైన్మెన్ మృతి చెందాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్రావుపేటకు చెందిన దుంపేట రాజేశం (40) కొత్తదాంరాజుపల్లి సబ్స్టేషన్ పరిధిలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్నాడు. వాల్గొండలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ తీగలను సరిచేసేందుకు స్తంభంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో కరెంట్ సరఫరా కావడంతో విద్యుత్ షాక్కు గురై స్తంభంపై నుంచి కిందపడి మృతిచెందాడు. కరెంట్షాక్తో కూలీ దుర్మరణంరాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్దికి చెందిన బైతి రాజయ్య(48) ఇంట్లో శనివారం విద్యుత్ సర్వీస్ తీగ తెగిపడింది. దానిని పక్కకు తీస్తూ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు ముస్తాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. రాజయ్య భార్య గతంలోనే చనిపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.మరో రెండు ఘటనల్లో ఇద్దరికి గాయాలు..వరంగల్ జిల్లా పంతులుపల్లికి చెందిన నీలం శ్రీనివాస్ అన్మ్యాన్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు. గోవిందాపూర్ ఫీడర్లో ఎల్సీ తీసుకుని శివారు లైన్తండాలో ట్రాన్స్ఫార్మర్ మరమ్మతు పనులు చేపడుతున్నాడు. అయితే ఏఎల్ఎం బాసు.. మద్యం మత్తులో ఉండి ఎల్సీ తీసుకున్న విషయం మరిచిపోయి ఫీడర్ను ఆన్ చేశాడు. దీంతో శ్రీనివాస్ విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. ఏఎల్ఎం బాసు మద్యం తాగినట్లు గుర్తించి పోలీస్స్టేషన్కు తరలించారు. మరో ఘటనలో మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన అసిస్టెంట్ లైన్మెన్ బూర్గుల అంబేడ్కర్ రాముతండా జీపీ శివారు వీరారెడ్డిపల్లి సమీప వ్యవసాయక్షేత్రంలో ట్రాన్స్ఫార్మర్ను బిగించే క్రమంలో షాక్కు గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి పంపించారు. -
‘గ్రేటర్’ గాడిన పడేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చౌహత్ బాజ్పాయ్కి నగరంలోని పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న జీడబ్ల్యూఎంసీ, కుడా ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా... క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు కుడా వైస్ చైర్పర్సన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే... జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ బల్దియాకే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పావులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పనిచేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లాగా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ఆయన ఉన్న సమయంలోనే బల్దియా నిధుల దుర్వినియోగంతోపాటు పెద్ద సంఖ్యలో జరిగిన ఔట్ సోర్సింగ్ కార్మికుల నియామకాల్లో రూ.లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ, స్పెషల్ బ్రాంచ్లు విచారణ చేపట్టాయి. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ప్రమోషన్కు ముందు.. తర్వాత కొద్ది మాసాలు మాత్రమే ఇతర మున్సిపాలిటీలకు వెళ్తూ వెంటనే జీడబ్ల్యూఎంసీకి రావడం ఇతడికి పరిపాటి. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఇటీవల మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. ● పీహెచ్సీ వర్కర్ నుంచి టీఓ వరకు ఎదిగిన ఒకరు ‘గ్రేటర్’ను వదలడం లేదు. హెల్త్అసిస్టెంట్, శానిటరీ ఇన్స్పెక్టర్గా ఇక్కడే పనిచేసి.. కమిషనర్ పదోన్నతిపై భూపాలపల్లి, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో కొద్ది రోజులు మాత్రమే పనిచేసిన సదరు అధికారి పన్నుల విభాగం కీలక అధికారిగా చేరారు. ● ఇంజనీరింగ్ విభాగంలో చిన్న ఉద్యోగిగా విధుల్లో చేరిన ఒకరు ఓ ఉన్నతస్థాయి అధికారిగా ఎదిగి ఇక్కడే ఉద్యోగ విరమణ చేశారు. ● ‘కుడా’లో డిప్యూటీ ఈఈ నుంచి ఎస్ఈ వరకు ఇక్కడి పనిచేస్తున్న ఓ అధికారి వరంగల్ను వదలడం లేదు. ఇలా చాలామంది ఉన్నారు. కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించేనా.. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు ప్రతి పనికి రేట్ ఫిక్స్ చేసి వసూళ్లు.. అభివృద్ధి ఉన్నా అవినీతితో చెడ్డపేరు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట.. ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే..అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నగరంలో గొలుసుకట్లు చెరువులు, జీడబ్ల్యూఎంసీ స్థలాలు, కీలకమైన నాలాలను ఆక్రమించి వెంచర్ల వేయడంతో పాటు ఇండ్లు నిర్మించుకున్న వారికి అనుమతులు ఇచ్చి పెద్దమొత్తంలో వసూలు చేశారన్న ఫిర్యాదులపై ‘విజిలెన్స్’ విచారణకు ఆదేశించారు. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా పెద్దమొత్తంలో అందరూ కలిసి వాటాలు పంచుకున్నారన్న ప్రచారం ఉంది. -
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
పరకాల: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన, ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నందున విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ కె.వాసంతి కోరారు. కొత్త విద్యాసంవత్సరంలో బడిబాటలో భాగంగా పరకాలలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి, ఆర్డీఓ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్.వెంకటేశ్ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా డీఈఓ వాసంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నందున విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి అవసరమైతే దాతల సహాయం తీసుకోవాలని ఉపాధ్యాయులను, పాఠశాలల అభివృద్ధి కమిటీలను కోరారు. కార్యక్రమంలో ఎంఈఓ రమాదేవి, మాజీ కౌన్సిలర్ ఉమాదేవి, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు చక్రవర్తుల మధు, కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాణ్యమైన విద్య అందేలా కృషి చేయాలినడికూడ: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ వాసంతి అన్నారు. బడిబాటలో భాగంగా.. శుక్రవారం మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ వాసంతి పాల్గొని విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ హనుమంతరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చ సుదర్శన్, ఉపాధ్యాయులు, మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీదేవి, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు,తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసంతి సాముహిక అక్షరాభ్యాసం చేయించిన డీఈఓ, ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ -
నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాం..
వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో ఆమె కమిషనర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందన్నారు. మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే లక్ష్యం, భవన నిర్మాణ అనుమతులకు జారీ చేసే విధానం, శానిటేషన్ విభాగంలో విధులు నిర్వహించే సిబ్బంది సంఖ్య, చెత్త తరలింపు వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు, తదితర అంశాలను విభాగాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విభాగాల అధికారులు సిబ్బంది సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కమిషనర్ను డిప్యూటీ కమిషనర్లు ప్రసూనారాణి, రవీందర్, (అడ్మిన్)రాజేశ్వర్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రవీందర్ రాడేకర్, పీఆర్ఓ ఆయుబ్ అలీ డిప్యూటీ కమిషనర్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఉద్యోగ బాద్యతల స్వీకరణ -
‘ప్రీప్రైమరీ’లో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈవిద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలో 29 స్కూళ్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపెల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పన యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది.ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్కనూరు, భావుపేట కే శ్వాపూర్. ఎంపీయూఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్ లు: కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. వరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం పాఠశాలల్లో ప్రీౖప్రైమరీ విద్యను అందిస్తున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా నూతన కలెక్టర్గా స్నేహ శబరీష్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా బాధ్యతలు స్వీకరించిన స్నేహ శబరీష్ను అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ ఓ వై.వి గణేశ్, డీఆర్డీఏ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, అధికారులు పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. -
ప్రీరౖపెమరీలో ఆంగ్ల విద్య
విద్యారణ్యపురి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు మరో అడుగు ముందుకు పడింది. ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్య(ఇంగ్లిష్ మీడియం)ను ప్రవేశపెట్టింది. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గిపోతోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లిష్ మీడియం కొనసాగిస్తున్నారు. ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టడంతో విద్యార్థి ఆ పాఠశాలలోనే పూర్తిస్థాయి విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 210 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్యకు ఈ విద్యాసంవత్సరం 2025–26 నుంచి అనుమతులిస్తూ ఇటీవల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. యూకేజీ మాత్రమే.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ప్రీప్రైమరీ విద్యలో యూకేజీ విద్యార్థులు మాత్రమే ఉంటారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. యూకేజీ విద్యార్థుల పాఠాలకు సిలబస్ను కూడా ఎస్సీఈఆర్టీ సబ్జెక్టు నిపుణులు రూపకల్పన చేసినట్లు సమాచారం. యూకేజీ చిన్నారుల కోసం పాఠ్య పుస్తకాలు సైతం ఉచితంగా అందజేయనున్నట్లు తెలిసింది. అదేవిధంగా ప్రీప్రైమరీలో చేరిన చిన్నారుల విద్యాబోధనకు ఒక్కో స్కూల్కు ఒక్కో వలంటీర్ను, చిన్నారుల ఆలనాపాలనా చూసేందుకు ఒక ఆయాను కూడా నియమిస్తారని తెలుస్తొంది. కాగా.. ఒక్కో స్కూల్ ప్రీప్రైమరీలో 30 మంది చిన్నారులకు ప్రవేశాలకు ఉండనుందని సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో 29 స్కూళ్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ జిల్లాలో 16, వరంగల్ జిల్లాలో 13 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. ఈమేరకు హైదరాబాద్ నుంచే ఎంపిక చేసిన పీఎస్ల, యూపీఎస్ల జాబితాలను ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులకు పంపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31 పీఎస్లలో ప్రీప్రైమరీ విద్యను ప్రవేశపెట్టారు. మిగతా మూడు జిల్లాలు మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాలకు అవకాశం కల్పించలేదు. 12 మంది చేరిక.. హనుమకొండ ములుగు రోడ్డులోని పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని పాలెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీలో 12 మంది చిన్నారులను వారి తల్లిదండ్రులు చేర్పించారు. శుక్రవారం వీరికి ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సామూహిక అక్షరాభ్యాసం చేయంచారు. కార్యకమంలో ఎంఈఓ నెహ్రూనాయక్, గొల్లపల్లి పీఎస్లో ఇద్దరు, రాంనగర్ పీఎస్లో ఇద్దరు చిన్నారులు ప్రీప్రైమరీ విద్యలో ప్రవేశాలు పొందారు. వీరికి కూడా టీచర్లు అక్షరాభ్యాసం చేయించారు. ఈ స్కూళ్లలోనే ప్రీప్రైమరీ.. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో యూకేజీ అడ్మిషన్లు హనుమకొండ జిల్లాలో 16.. వరంగల్ జిల్లాలో 13 పాఠశాలలు నాలుగేళ్లు నిండిన బాలలకు ప్రవేశాలు పాలెం ప్రభుత్వ పీఎస్లో 12మంది చిన్నారుల చేరిక ఎస్సీఈఆర్టీ నిపుణులతో సిలబస్ రూపకల్పనవరంగల్ జిల్లాలో.. ఎంపీపీఎస్లు: స్వామిరావుపల్లి, లక్కమారిపల్లి, తొగర్రాయి, రామతీర్థం, లింగాపురం, కొండూరు, కొత్తూరు, బుర్హాపల్లి, పైడిపల్లి, జీపీఎస్ శుంభునిపేట. ఎంపీయూపీఎస్లు: రేకంపల్లి, లెంకాలపల్లి, గన్నారం.హనుమకొండ జిల్లాలో ఎంపీపీఎస్లు: పరకాల, ఎంపీపీఎస్ సీతారాంపూర్, మాణిక్యాపూర్, కొప్పూరు, (ఎస్సీ కాలనీ) ముల్క నూరు, ముల్కనూరు, భావుపేట కేశ్వాపూర్. ఎంపీయూపీఎస్లు: మైలారం, ప్రగతి సింగారం, రతన్గిరి. ప్రభుత్వ పీఎస్లు : కాజీపేట, గొల్లపల్లి, పాలెం, రాంనగర్. -
ప్రయాణికులపై టోల్ భారం
హన్మకొండ: ఆర్టీసీ ప్రయాణీకులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
కళాకారులను ప్రోత్సహించాలి
హన్మకొండ కల్చరల్: కళాకారులను ప్రొత్సహించాలని, కళారంగాన్ని కాపాడుకోవాలని అందుకు కళాపోషకులు ముందుకు రావాలని కేయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య బన్న అయిలయ్య అన్నారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 16వ జాతీయస్థాయి నాటిక పోటీలు–2025 శుక్రవారం రాత్రి ప్రారంభమయ్యాయి. ఈమేరకు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో ఆచార్య బన్న అయిలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి నాటక పోటీలు ప్రారంభించారు. అలాగే పారితోషిక దాతగా వ్యవహరించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అతిథులుగా కవి గిరిజామనోహరబాబు, బండారు ఉమామహేశ్వర్రావు, వేదిక సలహాదారు సంజయ్బాబు, తెలంగాణ రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం, మాడిశెట్టి రమేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం చిలుకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్ వారి మా ఇంట్లో మహాభారతం, నిజామాబాద్ తన్మయి ఆర్ట్స్ వారి చదువు నాటక ప్రదర్శనలు అలరించాయి. కేయూ విశ్రాంత ఆచార్యులు బన్న అయిలయ్య ప్రారంభమైన ఆహ్వాన నాటిక పోటీలు -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత తదితర అధికారులు పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గిరిజనులకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. -
‘పింగిళి’లో నాణ్యమైన విద్య
హన్మకొండ అర్బన్: వడ్డేపల్లిలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని తాజా మాజీ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం పింగిళి కళాశాల 2025–26 అడ్మిషన్ల పోస్టర్ను కలెక్టర్ ప్రావీణ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పింగిళి కళాశాలలోని సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మొదలైన అన్ని విభాగాల్లో బోధనను అందిస్తున్న అధ్యాపకులకు అత్యధిక విద్యార్హతలు, దశాబ్దాల సుదీర్ఘ బోధనానుభవం ఉండడం వల్ల నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు. అలాగే కళాశాలలో విద్యార్థినులకు కావాల్సిన అన్ని రకాల వసతులు, అత్యాధునిక బోధన ఉండడంతో విద్యార్థినులు చేరి తమ భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ సుహాసిని, దోస్త్, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ సురేశ్ బాబు, అధ్యాపకులు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికులపై టోల్ భారంహన్మకొండ: ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ భారం పెరిగింది. ఈనెల 8 నుంచి టోల్ గేట్ల వద్ద రేట్లు పెంచడంతో ఆమేరకు ఆర్టీసీ చార్జీలు పెంచింది. వరంగల్ రీజియన్ బస్సులు నడిచే రెండు రూట్లలో టోల్ గేట్లు ఉన్నాయి. హనుమకొండ – ఏటూరునాగారం రూట్లో ములుగు సమీపంలో, హనుమకొండ – హైదరాబాద్ రూట్లో రఘునాథపల్లి, బీబీనగర్ వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. ఒక్కో టోల్ గేట్కు రూ.10 చొప్పున ఆర్టీసీ అదనంగా వసూలు చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు ఉన్న చార్జీలపై ప్రతీ బస్సుకు హైదరాబాద్ రూట్లో రూ.20 చొప్పున, ఏటూరునాగారం రూట్లో రూ.10 చొప్పున, హనుమకొండ – జనగామకు రూ.10 చొప్పున, జనగామ – హైదరాబాద్ రూట్లో తిరిగే బస్సులకు రూ.10 చొప్పున ఆర్టీసీ చార్జీలు పెంచింది. రేపు చేపూరి శ్రీరాం 29వ అష్టావధానంవిద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం పదిగంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు. హనుమకొండ డీఎండబ్ల్యూఓగా గౌస్ హైదర్!న్యూశాయంపేట: హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి (డీఎండబ్ల్యూఓ)గా కేఏ.గౌస్ హైదర్ను ప్రభుత్వం నియమించనున్నట్లు సమాచారం. వరంగల్ జిల్లా వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఫారిన్ సర్వీస్లో భాగంగా వ్యవసాయ శాఖ నుంచి డిప్యుటేషన్పై మైనార్టీ సంక్షేమశాఖకు బదిలీ అయినట్లు తెలుస్తోంది. ఈమేరకు హనుమకొండ మైనార్టీ సంక్షేమాధికారిగా మంగళవారం బాధ్యతలు తీసుకోనున్నట్లు, ఈమేరకు త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు హనుమకొండ డీఎండబ్ల్యూఓగా విధులు నిర్వర్తిస్తున్న డి.మురళీధర్రెడ్డి మే నెలాఖరున ఉద్యోగ విరమణ పొందడంతో డీఎండబ్ల్యూఓ పోస్టు ఖాళీ ఏర్పడింది. తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
న్యూశాయంపేట: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం పీపీటీ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, మలేరియా అధికారి రజిని, డీబీసీడీఓ పుష్పలత పాల్గొన్నారు. గిరిజన గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు జిల్లాల్లోని గిరిజన గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడానికి ఈనెల 15 నుంచి 30 ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(పీఎం జనమన్) నిర్వహణపై అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గిరిజనులు అధికంగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి ప్రజలకు ఆధార్కార్డు, కుల ధ్రువీకరణపత్రం, ఆయుష్మాన్ భారత్ కార్డు, రేషన్కార్డు, కిసాన్కార్డులు అందించాలని ఆదేశించారు. అర్హులతో దరఖాస్తులు చేయించాలని కలెక్టర్ సూచించారు. ఈవీఎం గోదాముల తనిఖీ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్యార్డులోని జిల్లా వేర్హౌస్ గోదాముల్లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. ఇంకుడు గుంతలను నిర్మించాలి లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ఇళ్ల నుంచి వెలువడే నీరు, వర్షపు నీరు, మురుగు నీరు భూగర్భంలో ఇంకే విధంగా ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలి జిల్లాలో ఈ నెల 16న ప్రారంభించనున్న 21 రైతునేస్తం కేంద్రాల్లో వీడియో కాన్ఫరెన్స్కు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జరి గిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
గిరిజనుల సంక్షేమానికి కృషి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్వతగిరి: గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు మండలంలోని సోమారం, గోరుగుట్టతండా, జగ్గుతండాలో రూ.2.20 కోట్ల ఎస్టీఎస్డీఎఫ్ నిధులతో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా, ఆరోగ్యం, విద్య తదితర సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి, తండాల్లో వసతులు కల్పిస్తామని తెలిపారు. త్వరితగతిన అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్నాయక్, నాయకులు రాఘవులు, భాస్కర్, మహ్మద్అలీ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని బాధ్యతలు స్వీకరించిన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ శుక్రవారం రాత్రి సందర్శించారు. ఈసందర్భంగా ఆలయ ఈఓ శేషుభారతి, అర్చకులు భద్రకాళి శేషు దేవాలయానికి వచ్చిన కలెక్టర్ను ఘనంగా స్వాగతించారు. కలెక్టర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కలెక్టర్తో పాటు ఆమె తల్లిదండ్రులు, కూతురు, కుమారుడు ఉన్నారు. పూజల అనంతరం అర్చకులు మహదాశ్వీచనం అందజేశారు. ఈఓ శేషుభారతి వారికి అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. ట్రాన్స్కో, డిస్కమ్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ విజేత నల్లగొండ హన్మకొండ: తెలంగాణ ట్రాన్స్కో, డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ 2025–2026 శుక్రవారం ముగిసింది. బాల్ బ్యాడ్మింటన్ ఫైనల్లో వరంగల్, మహబూబ్నగర్ జట్లు పోటీ పడగా, వరంగల్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల జట్టు విజేతగా నిలిచింది. మహబూబ్నగర్ జట్టు ద్వితీయ స్థానంలో, నల్లగొండ జట్టు తృతీయ స్థానంలో నిలిచాయి. కబడ్డీ ఫైనల్లో నల్లగొండ, వరంగల్ జట్లు పోటీపడగా నల్లగొండ జట్టు విజేతగా నిలిచింది. వరంగల్ జట్టు ద్వితీయ స్థానం, నిజామాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ టోర్నీలో కబడ్డీలో 12 జట్లు, బాల్ బ్యాడ్మింటన్లో 9 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్ట జుజీజ్చి బి.అశోక్ కుమార్, టి.మధుసూదన్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, కన్వీనర్ ఎ.విజేందర్రెడ్డి, సభ్యులు ఎండీ యాకూబ్ పాషా, సునీల్ కుమార్, ఇ.ప్రేమ్ కుమార్, స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి, వరంగల్ టౌన్ డీఈ ఎస్.మల్లికార్జున్ పాల్గొన్నారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య సంగెం: కుమారుడు రోడ్డు ప్రమాదం చేశాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వీఆర్ఎన్ తండాకు చెందిన గుగులోత్ వెంకట్రాం (37)కు భార్య అనిత, ఇద్దరు కుమారులున్నారు. మే 29న ఆయన పెద్ద కుమారుడు లోకేశ్ పల్లారుగూడ గ్రామానికి చెందిన కక్కెర్ల చిరంజీవి ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. చిరంజీవి ఎడమకాలు విరిగి ఆస్పత్రిలో చేరాడు. తన కుమారుడిని ఢీకొట్టిన లోకేశ్పై చర్య తీసుకోవాలని ఈనెల 12న సంగెం పోలీస్స్టేషన్లో చిరంజీవి తల్లి సరోజన ఫిర్యాదు చేసింది. కుమారుడిపై కేసు నమోదైందని మనస్తాపం చెందిన వెంకట్రాం శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. ఉపాధి హామీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చిన భార్య అనిత.. వెంకట్రాం కిందపడి ఉండి నోటి నుంచి నురగలు వస్తున్నట్లు గమనించింది. వెంటనే 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆయన మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
రసాయన ఎరువులు తగ్గించాలి
సంగెం: అవసరం మేరకే పంటలకు రసాయన ఎరువులు వాడి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.ఉమారెడ్డి సూచించారు. వంజరపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ఆదా చేసి భావితరాలకు అందించాలన్నారు. పంటల మార్పిడి పాటించి సుస్థిర ఆదాయం పొందాలని, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. వరినారు మడుల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు, అపరాలు, కూరగాయల సాగు గురించి వివరించారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వీరన్న, అశ్విని, శ్రావణ్, ఏఓ యాకయ్య, ఏఈఓలు రాజేందర్, లావణ్య, రైతులు పాల్గొన్నారు. -
‘గ్రేటర్’ గాడిన పడేనా..?
సాక్షిప్రతినిధి, వరంగల్: బల్దియా కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్కి సొంత విభాగంలో పలు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు కలెక్టరేట్ల పరిధిలో విస్తరించి ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)ల ద్వారా అభివృద్ధి పనుల కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో కొన్ని విభాగాల్లో కోరలు చాస్తున్న అవినీతి, అక్రమాల వల్ల చెడ్డ పేరు వస్తోంది. పార్కులు, చెరువులు, నాలాల ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు నగరంలో విచ్చలవిడిగా సాగుతున్నా ఎవరికీ పట్టడం లేదు. భవన నిర్మాణదారుల సంఘం ఏకంగా సీఎం పేషీలోనే ఫిర్యాదు చేసింది. కార్పొరేషన్కు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధిని ఒప్పించి కాంట్రాక్టర్ల సిండికేట్కు ఎక్సెస్ టెండర్పై పనులు దక్కేలా ఇంజనీరింగ్ విభాగంలో కొందరు చక్రం తిప్పుతుండడం వివాదాస్పదమైంది. ఇదే సమయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్తోపాటు ‘కుడా’ వైస్ చైర్మన్గా ఉన్న అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడడం చర్చనీయాంశంగా మారింది. కొత్తగా శుక్రవారం బాధ్యతలు చేపట్టిన చాహత్ బాజ్పాయ్ బల్దియాపై ప్రత్యేక దృష్టి సారిస్తేనే పాలన గాడిన పడుతుందన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. ఎక్కడికెళ్లినా తిరిగి ఇక్కడికే.. జీడబ్ల్యూఎంసీలో పని చేయడానికి అలవాటు పడిన అధికారులు ఎక్కడికి వెళ్లినా కొద్దిరోజులే. ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో మళ్లీ ‘బల్దియా’కే వస్తున్నారు. ప్రస్తుతం జీడబ్ల్యూఎంసీలో ఓ విభాగానికి కీలకాధికారిగా ఉన్న ఒకరు అతడి పదవికి ముప్పు వస్తుందంటే చాలు.. పాదరసంలా పా వులు కదుపుతారు. ఈ టాలెంట్తోనే 22 నెలల కిందటి వరకు ఏడాదికోసారి రెన్యువల్ చేయించుకుని నాలుగేళ్లు గడిపిన ఆయన.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కొద్ది రోజులు పని చేశారు. పదోన్నతిపై ఆయన తిరిగి 2024 అక్టోబర్ చివరి వారంలో ‘రాజా’లా బల్దియాలోని కీలకపోస్టులో చేరారు. ● జూనియర్ అసిస్టెంట్గా చేరి ట్యాక్స్ ఆఫీసర్ స్థాయి వరకు ఎదిగిన మరో అధికారి సైతం ‘బల్దియా’ను వదల అన్నారు. ఎన్నికల నిబంధనల మేరకు ట్యాక్స్ ఆఫీసర్గా వర్ధన్నపేట మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి ఐదు రోజుల కిందటే మళ్లీ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలక పదవిలో చేరారు. వీరితోపాటు మరికొందరు ఇక్కడే తిష్టవేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల్లో పలు విభాగాలు.. ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ తదితర శాఖలపై అవినీతి ఆరోపణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఏకంగా మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారిని సైతం మెప్పించి పనులు కానిచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వరంగల్ నగరం చుట్టూ విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, నాన్ లేఅవుట్ ప్లాట్లను ‘మామూలు’గా తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్వహించిన సుమారు రూ.314 కోట్ల ఈ–ప్రొక్యూర్మెంట్ టెండర్లలోనూ కాంట్రాక్టర్లను మిలాఖత్ చేసి 4.99 శాతం ఎక్సెస్ టెండర్ పనులు దక్కేలా చక్రం తిప్పారన్న ఆరోపణలు ఉన్నాయి. బల్దియా కమిషనర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న చాహత్ బాజ్ పాయ్కొత్త కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కొరడా ఝుళిపించాల్సిందే.. జీడబ్ల్యూఎంసీ, ‘కుడా’లలో ఇష్టారాజ్యం.. పలు విభాగాలపై అవినీతి ఆరోపణలు బల్దియాలో ఏళ్ల తరబడిగా అధికారుల తిష్ట ఎక్కడికి బదిలీ చేసినా పదోన్నతులపై ఇక్కడికే..నగరాభివృద్ధికి సమష్టి కృషి చేద్దాంఅధికారులకు పిలుపునిచ్చిన కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్: నగరాభివృద్ధికి అధికారులంతా సమష్టిగా కృషి చేయాలని గ్రేటర్ కమిషనర్ చాహాత్ బాజ్ పేయి పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రేటర్ వరంగల్ మునిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) కమిషనర్గా చాహాత్ బాజ్ పేయి ప్రధాన కార్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది కమిషనర్ను కలిసి పుష్పగుచ్ఛాలు, పూల మొక్కలు అందజేశారు. అనంతరం జరిగిన పరిచయ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని, కరీంనగర్లో మున్సిపల్ కమిషనర్గా కరీంనగర్ కార్పొరేషన్లో పనిచేసిన అనుభవం ఉందని మున్సిపల్ సర్వీసులపై అవగాహన ఉందని స్పష్టం చేశారు. శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించి నగర పరిశుభ్రతకు కృషి చేయాలన్నారు. -
వరంగల్లో దారుణం.. భర్త గొంతు కోసిన భార్య
సాక్షి, వరగల్: వరంగల్ నగరంలో దారుణ ఘటన జరిగింది. భర్త గొంతును భార్య కోసేసింది. దుబాయ్ వెళ్లి సంపాదించాలని భర్తపై ఒత్తిడి చేసింది. దుబాయ్ వెళ్లనందుకు భర్తపై హత్యాయత్నం చేసింది. భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.ఎంజీఎంలో మృత్యువుతో రెహమాన్ పోరాడుతున్నాడు. గత కొద్దిరోజులుగా రహమాన్ను భార్య కుటుంసభ్యులు వేధిస్తుండగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కమిషనరేట్లో వరుస దొంగతనాలు
● ఒక్కో పోలీస్ స్టేషన్లో పదుల సంఖ్యలో కేసులు పెండింగ్ ● స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగి పోతున్న బాధితులు ● కనిపించని పోలీస్ పెట్రోలింగ్.. ● సమీక్షలకే అధికారులు పరిమితం కమిషనరేట్ పరిధిలో చోరీలు ఇలా..● ఈ ఏడాది జనవరి 21న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని కొత్తూరుజెండా, సుభాష్కాలనీలో తాలం వేసిన ఓ ఇంట్లో దొంగలు పడి 178 గ్రాముల బంగారు అభరణాలు ఎత్తుకెళ్లారు. ఇదే నెలలో కొత్తూరుజెండాలో రూ.3.50 లక్షల విలువైన బంగారు ఆభరణాల చోరీ జరిగింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి కాకాజీ కాలనీలోని ఓ ఆస్పత్రిలో ఏప్రిల్ 8న బ్యాగులో బంగారం పెట్టి స్నానింగ్కు వెళ్లి వచ్చే సరికి బ్యాగు అపహరణకు గురైంది. అందులో 7 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ● ఏప్రిల్ 5న హనుమకొండ పోలీస్స్టేషన్ పరిధి నయీంనగర్లో 5 తులాల బంగారం, రూ.50 వేల నగదు దొంగతనం జరిగింది. ● మామునూరు పోలీస్స్టేషన్ పరిధి బొల్లికుంట, సింగారంలో ఏప్రిల్లో రూ.15 లక్షల నగదు, రూ.2.50 లక్షల విలువైన బంగారు అభరణాలు చోరీకి గురయ్యాయి. ● మే నెలలో ఖానాపూర్ మండల కేంద్రంలో చోరీ జరిగి రూ.10 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు పోయాయి. అలాగే.. కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధి కృష్ణాకాలనీలో రూ.10 లక్షల నగదు, 15 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి వెంకటేశ్వర కాలనీలో రూ.17 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ● ఈనెల 8న మిల్స్కాలనీ పోలీస్స్టేషన్ పరిధి పడమర కోటలో జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తన ప్రేయసిని సంతోష పెట్టడానికి తన ఇంట్లోనే చోరీ చేసి 16 తులాల బంగారం ఎత్తుకుపోయి పోలీసులకు చిక్కిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే పోలీస్స్టేషన్ పరిధి గణేశ్నగర్లో ఈనెల 11న చోరీ జరిగి 7 తులాల బంగారం, 70 తులాల వెండి ఆభరణాలు పోయాయి. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ట్రైసీటీల్లో ఎక్కడ ఎప్పడు దొంగతనం జరుగుతుందో.. ఎంత నష్టపోవాల్సి వస్తుందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. కమిషనరేట్ పరిధిలో అంతర్రాష్ట్ర దొంగలతోపాటు స్థానిక దొంగలు రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి, ఒకటి రెండు రోజులు హడావుడి చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. కమిషనరేట్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక్క హన్మకొండ పోలీస్స్టేషన్ పరిధిలోనే ఈ ఏడాది ఇప్పటి వరకు 35 చోరీలు జరిగాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో చోరీలు రాత్రి పూట ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవల రాత్రి, పగలు తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసులు కేవలం పండుగల సమయంలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగితా సమయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రూ.కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఇంకా రికవరీ కాలేదు. జాడలేని పెట్రోలింగ్ ఒకపక్క జోరుగా చోరీలు జురుగుతుంటే మరో పక్క పోలీస్ పెట్రోలింగ్ జాడ లేకుండా పోయిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీస్ ఉన్నత అధికారులు ప్రతీ సమీక్ష సమావేశంలో విజుబుల్ పోలీసింగ్ పెంచాలని కింది స్థాయి అధికారులకు పదే పదే చెబుతున్నా.. చాల మంది అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికారుల ఆదేశాలను అలా విని ఇలా వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్ వాహనాలు తిరగడం లేదు. స్థానిక దొంగలు ఇలాంటి విషయాలను పసిగట్టి ఆ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనం జరిగిన తర్వాత పోలీసులు అప్రమత్తమై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఫలితం లేకుండా పోతోంది. పోలీస్ ఉన్నతాధికారులు కేవలం సమీక్షలకే పరిమితం అవ్వడం వల్లే క్షేత్ర స్థాయిలో అధికారులు దొంగలను పట్టుకోవడంలో విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు దృష్టిసారించేనా..? కమిషనరేట్ పరిధిలో చోరీలతో పాటు చైన్స్నాచింగ్లు, ద్విచక్ర వాహనాలు పదుల సంఖ్యలో పోతున్నాయి. అధికారులు రికవరీ మాత్రం నామమాత్రంగా చూపిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను పోగొట్టుకున్న బాధితులు పోలీస్స్టేన్ల చుట్టూ తిరుగుతున్నా అధికారులు కేసులు నమోదు చేయడం లేదు. వెతుకుతున్నాం.. దొరికితే అప్పగిస్తాం.. కేసులు పెడితే కోర్టు నుంచి రికవరీ చేసుకోవాల్సి ఉంటుందని భయపెట్టి కేసుల నమోదులో జాప్యం చేస్తున్నారు. నెలల తరబడి తిరిగినా కేసులు నమోదు చేయకపోవడంతో బాధితులు వారి బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మధ్యలోనే వదిలేస్తున్నారు. నగరంలోని చాల పోలీస్స్టేషన్ల పరిధిలో ఎన్ని చోరీలు జరిగినా వాటి రికవరీ విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టడం లేదనే విషయం ఉన్నత అధికారుల సమీక్షల్లో వెల్లడయినా చర్యలు లేకపోవడంతో రికవరీ ఎక్కడ వెసిన గొంగ ళి అక్కడే అన్న చందంగా తయారైంది. -
విద్యార్థులకు గ్రాండ్ వెల్కమ్
విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగియడంతో విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. వివిధ చోట్ల స్కూళ్లను మామిడి తోరణాలు, పూలు, బెలూన్లతో అలంకరించి పిల్లలకు తొలిరోజే గొప్ప అనూభూతి కలిగేలా ఆహ్వానం పలికారు. పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు పూలు అందజేసి స్వాగతించారు. ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశాలు కూడా నిర్వహించారు. కొందరు తమపిల్లలతోపాటు పాఠశాలలకు వచ్చారు. వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు మారాం చేస్తుండగా బుజ్జగించడం కనిపించింది. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ హనుమకొండ జిల్లాలో 477, వరంగల్ జిల్లాలో 558 పాఠశాలల్లో తొలిరోజు హాజరైన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. హనుమకొండ పోచంపల్లి పాఠశాలలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావిణ్య, డీఈఓ వాసంతి, కమలాపూర్ భీంపెల్లిలో జెడ్పీసీఈఓ విద్యాలత, ఎలకతుర్తి మండలం వల్బాపూర్ జెడ్పీఎస్ఎస్లో అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రా యి జెడ్పీహెచ్ఎస్, పల్లారిగూడెం యూపీఎస్లను జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ సందర్శించారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ పాఠశాలలో 300ల మంది విద్యార్థులకు 150 మంది, హనుమకొండ పోచంపెల్లి పాఠశాలలో 180 మందికి 100 మంది హాజరయ్యారు. వరంగల్ జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షించారు. పునఃప్రారంభమైన పాఠశాలలు మామిడి తోరణాలతో అలంకరణ విద్యార్థులకు పూలతో స్వాగతం తొలిరోజు 30శాతం వరకే విద్యార్థుల హాజరు -
ఆన్లైన్ జీరో పర్మిట్ అమలుచేయాలి
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ పనులకు సంబంధించి చిన్న తరహా ఖనిజాలైన కంకర, మట్టి కోసం ఆన్లైన్ జీరో పర్మిట్ అమలు చేయాలి.. ఈ విధానంపై కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో మైనింగ్, టీజీఎండీసీ, రెవెన్యూ, పోలీస్, రవాణా తదితర శాఖల అధికా రులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంజనీరింగ్ శాఖల అధికారులు ప్రభుత్వ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు ఆన్లైన్ జీరో పర్మిట్కు దరఖాస్తు చేసుకుంటే వెంటనే ఆమోదించడం వల్ల అక్రమ ఖనిజ రవాణాను అరికట్టవచ్చని చెప్పారు. వాగుల్లో ఇసుక వెలికితీత, అక్రమ రవాణాపై పరిపాలనా పరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా నికి ఇసుక అవసరం ఎంతో ఉందని, సాండ్ బజార్ ద్వారా ఆన్లైన్ తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నా రు. ధర్మసాగర్, హసన్పర్తి, ఆత్మకూరు మండలా ల్లో సాండ్ బజార్ కోసం ఐదు ఎకరాల చొప్పున స్థలం గుర్తించాలని, శుక్రవారం నుంచి లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘భోజన’ పథకం పక్కాగా అమలుచేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో విద్యాశాఖ, డీఆర్డీఓ, వైద్య ఆరోగ్య, ఫుడ్ సేఫ్టీ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన స్టీరింగ్, మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 470 పాఠశాలలు ఉండగా 324 స్కూళ్లకు వంట గదిలు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటికి నిర్మించాల్సి ఉందని, ప్రతిపాదనలు త్వరగా పంపించాలని డీఆర్డీఓ మేన శ్రీనును ఆదేశించారు. అన్ని పాఠశాలల్లో అవసరమైన వంట సామగ్రికి రూ.50 లక్షలు వెచ్చించినట్లు పేర్కొన్నారు. వంట కార్మికులకు కనీసం మూడు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి సిలిండర్లు సరఫరా చేయాలని తెలిపారు. మూడు నెలలకోసారి ఆహార పదార్థాల నాణ్యత పరీక్షలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. సమావేశంలో డీఈఓ వాసంతి, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆపద సమయంలో సిద్ధంగా ఉండాలి హన్మకొండ: విపత్తు, ప్రమాదాలు వంటి ఆపద సమయాల్లో సహాయం అందించేందుకు ఆపద మిత్రలు సిద్ధంగా ఉండాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థల ఆదేశాల మేరకు జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యాన ఆపద మిత్రలకు హనుమకొండలో ని అంబేడ్కర్ భవన్లో నిర్వహించిన శిక్షణ శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుకోని ప్రమాదాలు జరిగినా.. విపత్తులు సంభవించినా వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రకృతి విపత్తులు, ఆపద సమయాల్లో కాపాడటం, సహాయం చేయడంపై శిక్షణలో నేర్చుకున్న అంశాలను పదిమందికి నేర్పించాలని పేర్కొన్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి నాగరాజు మాట్లాడుతూ మడికొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో 126 మంది, పరకాలలో 131 మంది వలంటీర్లకు 12 రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆపద మిత్ర వలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల, పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ జయశ్రీ, సైకాలజిస్ట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బాలలను పనిలో పెట్టుకోవద్దు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు విద్యారణ్యపురి: బాలలను పనిలో పెట్టుకోవద్దు.. వారితో పనిచేయించుకునేవారు చట్టపరంగా శిక్షార్హులవుతారని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పట్టాభిరామారావు అన్నారు. ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యాన హనుమకొండలోని జెడ్పీహాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్ల వయసు వరకు బాలకార్మికులే.. ఆ వయసు వారు పనుల్లో కనబడి తే దగ్గరలోని సామాజిక సహాయ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో హనుమకొండ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జడ్జి క్షమాదేశ్పాండె, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి.రాము, గవర్నమెంట్ ప్లీడర్ కె.నర్సింహారావు, అసిస్టెంట్ కమిషన ర్ ఆఫ్ లేబర్ నారాయణ స్వామి, డీడబ్ల్యూఓ జయంతి, కేయూ పాలకమండలి సభ్యురాలు డాక్టర్ కె.అనితారెడ్డి, ఎఫ్ఎంఎం ఎన్జీఓ డైరెక్టర్ సహాయసిస్టర్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఎస్ఐ పి.ఫిలిప్రాజ్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. లోక్ అదాలత్ను వినియోగించుకోవాలివరంగల్ క్రైం: ఈనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాల ని వరంగల్ సీపీ సన్ప్రీత్సింగ్ సూచించారు. చిన్న కేసులతో కక్ష పెంచుకుని కోర్టుల చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని పేర్కొన్నా రు. పోలీస్ అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, రాజీపడదగిన కేసుల్లో ఇరు వర్గాలను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, రాజీపడాలని అనుకునే వారు పోలీస్ అధికారులను సంప్రదించాలని కోరారు. -
జీజేసీలో సైన్స్గ్రూపులకు మోక్షం
ఆత్మకూరు: మండలకేంద్రానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల 2009లో మంజూరైంది. అధునాతన పక్కాభవనంలోకి 2018లో మారింది. 2009 నుంచి 16 ఏళ్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు సైన్స్ గ్రూపులకొరకు ఎదురు చూస్తున్నారు. సైన్స్ గ్రూపులు మంజూరు చేయాలని ‘సాక్షి’ పలుమార్లు కథనాలను ప్రచురించింది. మే 6న కూడా ‘కలగా మారిన సైన్స్ గ్రూపులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ విషయాన్ని గత నెల 30 వరకు ప్రిన్సిపాల్గా పనిచేసి రిటైర్డ్ అయిన ప్రిన్సిపాల్ బి.ఎన్.రెడ్డి పలుమార్లు ఇంటర్మీడియట్ అధికారుల దృష్టికి, గత నెల 13న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కళాశాలలో సైన్స్ గ్రూపుల మంజూరుకు ఉత్తర్వులు ఇప్పించారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైన్స్ గ్రూపుల అవసరాన్ని గుర్తించి పలుమార్లు కథనాలు ప్రచురించిన ‘సాక్షి’ని అభినందించారు. అడ్మిషన్లు ప్రారంభం... మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా మంజూరైన సైన్స్ గ్రూపులు బైపీసీ, ఎంపీసీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రిన్సి పాల్ డి.రమాదేవి తెలిపారు. విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 16 ఏళ్ల కల నెరవేరింది అడ్మిషన్లు ప్రారంభం -
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం : నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. సెర్ప్ ఏపీడీగా వెంకటేశ్వర్లు హన్మకొండ అర్బన్ : హనుమకొండ డీఆర్డీఏ పరిధి సెర్ప్ అదనపు డైరెక్టర్గా బొజ్జ వెంకటేశ్వర్లును నియమిస్తూ ఆ సంస్థ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ ఆధ్వర్యాన చేపట్టిన సాధారణ బదిలీల్లో ట్రాన్స్ఫర్ చేశారు. గతంలో వెంకటేశ్వర్లు జిల్లాలో డీపీఎంగా కొంతకాలం పనిచేశారు. కేయూలో నేటినుంచి జాతీయ వర్క్షాప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీజువాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలుపాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రామన్నపేట : విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను గురువారం కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశా ల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణకు వెళ్లి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సు నడుపుతున్నట్లు వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను తెలి పారు. వరంగల్–1 డిపో సూపర్ లగ్జరీ బస్(సర్వీస్ నంబర్ 92222) ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి బయలుదేరి 28న ఉదయం 6 గంటలకు ఆంధ్రప్రదేశ్లోని కాణిపాకం చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడి దర్శనం అనంతరం బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు వెల్లూరులోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధికి చేరుకుంటుందన్నారు. ఇక్కడ దర్శనం అనంతరం సాయంత్రం 7 గంటలకు అరుణాచలానికి చేరుకుంటుందని ఒక ప్రకటనలో వివరించా రు. గిరి ప్రదక్షిణ పూర్తయిన తర్వాత 29న మధ్యాహ్నం బయలుదేరి 30న ఉదయం శ్రీ జోగులాంబ అమ్మవారి శక్తిపీఠం, తర్వాత బీచుపల్లి హనుమాన్ దర్శనం అనంతరం హనుమకొండకు బయలుదేరుతుందన్నారు. ఈ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,500 నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చ ని, పూర్తి సమాచారానికి 9063407493, 7780565971, 9866373825, 9959226047 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
హనుమకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్
సాక్షిప్రతినిధి, వరంగల్ : హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యా రు. ఆమె స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సి పల్ కార్పొరేషన్లో అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ను కలెక్టర్గా నియమించారు. 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈమె గతంలో కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా పని చేశారు. స్నేహ శబరీష్ ములుగు జిల్లా ఎస్పీగా పని చేస్తున్న శబరీష్ సతీమణి. గురువారం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇక్కడి నుంచి బదిలీ అయిన 2016 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన పి.ప్రావీణ్య 2019–20లో కరీంనగర్ ట్రెయినీ కలెక్టర్గా, కొద్ది రోజులు జీహెచ్ఎంసీ లో అడిషనల్ కమిషనర్గా పనిచేశారు. ఆ తర్వా త 2021 సెప్టెంబర్ 3 నుంచి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా నియమితులయ్యారు. 2023లో వరంగల్ కలెక్టర్గా ఉన్న గోపి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన స్థానంలో అదే ఏడాది మార్చి 13న ప్రావీణ్య నియమి తులయ్యారు. కాగా హనుమకొండ కలెక్టర్గా ఉన్న సిక్తా పట్నాయక్ 2024 జూన్ 16న బదిలీ కాగా.. ఆమె స్థానంలో వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్యను నియమించిన ప్రభుత్వం.. వరంగల్ కలెక్టర్గా సత్య శారదను నియామకం చేశారు. సుమారు ఏడాదిగా హనుమకొండ కలెక్టర్గా పనిచేసిన ప్రావీణ్య అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, అధికారులు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను ముందు కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారు. బల్దియా కమిషనర్పై బదిలీ వేటు.. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు పడింది. ఆమె స్థానంలో 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చాహత్ బాచ్పాయ్ని నియమించారు. 2020 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అశ్విని తానాజీ వాకడేను 2023లో వరంగల్ అడిషనల్ కలెక్టర్ నుంచి బదిలీ చేసి వరంగల్ మున్సి పల్ కమిషనర్గా నియమించారు. బల్దియా అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యం చేయడం తదితర ఆరోపణలు ఎదుర్కొన్నారు. జీడబ్ల్యూఎంసీ, స్మార్ట్సిటీ పనుల్లో అవినీ తి, అక్రమాలు, టెండర్లు లేకుండా పనుల కేటా యింపు, బిల్లుల చెల్లింపుల్లో పర్సెంటేజీలు తదిత ర విషయాల్లో కీలక ప్రజాప్రతినిధికి వంతపాడారన్న ఆరోపణల నేపథ్యంలో ఆమెను కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియమించారన్న ప్రచారం జరుగుతోంది. కాగా ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా నియమితులైన చాహత్ బాచ్పాయ్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి సతీమణి. సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య బదిలీ బల్దియా కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ అశ్విని తానాజీ వాకడేపై బదిలీ వేటు.. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్గా నియామకం -
భూభారతి చట్టంతో భూసమస్యల పరిష్కారం
దుగ్గొండి: ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూముల సమస్యలు పరిష్కారమవుతాయని నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి అన్నారు. మండలంలోని ముద్దునూరు, పోలారం గ్రామాల్లో గురువారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దునూరు రెవెన్యూ సదస్సును ఆర్డీఓ ఉమారాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సాదాబైనామా, ఆర్ఓఆర్లో తప్పులు సరిచేయడం, సర్వేనంబర్ మిస్సింగ్ లాంటి సమస్యలు పరిష్కరించనున్నట్లు ఆమె తెలిపారు. తహసీల్దార్ రాజేశ్వర్రావు, డీటీ ఉమ, ఆర్ఐలు రాంబాబు, మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలిసంగెం: సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈస్ట్జోన్ డీసీసీ అంకిత్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను గురువారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గట్టి నిఘా పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. డీసీపీ వెంట మామునూరు ఏసీపీ వెంకటేశ్, పర్వతగిరి సీఐ రాజగోపాల్, సంగెం ఎస్సై నరేశ్ ఉన్నారు.నకిలీ పత్తి విత్తనాల పట్టివేతనర్సంపేట: నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ఫో ర్స్ పోలీసులు పట్టుకున్న సంఘటన చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నూనె స్వామి బీజీ త్రీ బీటీ నకిలీ పత్తి విత్తనాలను తయారు చేస్తున్నాడు. కిలోకు రూ.మూడు వేల చొప్పున గ్రామానికి చెందిన ఐదుగురు రైతులకు 14 కిలోల వరకు విత్తనాలు విక్రయించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు చేసి నాలుగు కిలోల విత్తనాలను అతడి నుంచి స్వాధీనం చేసుకుని చెన్నారావుపేట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు మండల వ్యవసాయ అధికారి గోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు నూనె స్వామిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు.అంగన్వాడీలు మెరుగైన సేవలందించాలివర్ధన్నపేట: చిన్నారుల బంగారు భవిష్యత్కు అంగవాడీ కేంద్రాలే పునాదులని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ అంగన్వాడీ కేంద్రంలో గురువారం అమ్మ మాట–అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు మెరుగైన సేవలందించాలని కార్యకర్తలను సూచించారు. అంగన్వాడీల్లో చేరిన పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించేలా చూడాలని అధికారులు, తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజమణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, వర్ధన్నపేట సీడీపీఓ దేహోర తదితరులు పాల్గొన్నారు.నేటినుంచి జాతీయ వర్క్షాప్కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూవాలజీ విభాగం ఆధ్వర్యాన ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు ఆ విభాగం అఽధిపతి ఆచార్య జి.షమిత తెలిపారు. ‘హ్యాండ్ ఆన్ మాలిక్యూలర్ డాకింగ్ అండ్ డ్రగ్ డిస్కవరీ టెక్నిక్స్’ అనే అంశంపై జువాలజీ సెమినార్ హాల్లో నిర్వహించే ఈ వర్క్షాప్ ప్రారంభం సమావేశంలో కేయూ వీసీ ప్రతాప్రెడ్డితోపాటు సైన్స్ డీన్ జి.హనుమంతు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మామి డాల ఇస్తారి, కన్వీనర్ వై.వెంకయ్య, బీఓఎస్ ఈసం నారాయణ పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
అస్తవ్యస్తంగా వార్డుల విభజన
నర్సంపేట: నర్సంపేట సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీలో వార్డుల విభజన ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల 8 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. కాగా, రాజకీయ పార్టీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు ఓట్లు రెండు, మూడు వార్డుల్లో ఉండడాన్ని అంగీకరించడం లేదు. గతంలో 24 వార్డులు ఉండగా వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్తో మున్సిపాలిటీలో మహేశ్వరం, మగ్ధుంపురం, రాజపల్లి, రాములునాయక్తండా, పర్శనాయక్తండా, నాగుర్లపల్లి, మాదన్నపేట, ముత్తోజిపేట విలీనమయ్యాయి. దీంతో ఓటర్ల సంఖ్య 40,561, వార్డుల సంఖ్య 30కి చేరింది. దీని ద్వారా మున్సిపాలిటీ అధికారులు చేసిన వార్డుల విభజనపై విమర్శలు వస్తున్నాయి. రెండుమూడు వార్డుల్లో ఒక గ్రామ ఓటర్లు ఒక్కో గ్రామానికి చెందిన ఓటర్లను రెండు మూడు వార్డుల్లో కేటాయించడంతో గందరగోళం నెలకొంది. మున్సిపాలిటీలో విలీనమైన మగ్ధుంపురంలో 2,026 మంది ఓటర్లు ఉండగా కొన్ని ఓట్లు పదో వార్డులో కలిపారు. మిగిలిన 1,420 ఓట్లను మగ్ధుంపురం 11వ వార్డుగా అధికారులు ఏర్పాటు చేశారు. మరికొన్ని ఓట్లను రాజపల్లిలో కలిపి 12వ వార్డుగా చేశారు. మహేశ్వరంలోని 2,993 ఓట్లను కొన్ని రాములుతండాలో కలిపి 13వ వార్డుగా ఏర్పాటు చేశారు. 1,451 ఓట్లతో మహేశ్వరం పేరుతో 14వ వార్డు విభజించారు. మరో 589 ఓట్లను పట్టణంలోని 25వ వార్డు పోచమ్మగుడి ఏరియాలో చేర్చారు. మాదన్నపేటలో 2006 ఓట్లు ఉండగా 1,489 ఓట్లతో 1వ వార్డు చేశారు. మిగిలిన ఓట్ల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో గందరగోళం నెలకొంది. అభ్యంతరాల వెల్లువ.. వార్డుల విభజన విషయంలో వినతులను స్వీకరించిన మున్సిపాలిటీకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు విలీన గ్రామాల నుంచి కూడా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. విలీన గ్రామాల్లోని ఓటర్లకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని బుధవారం పలువురు వినతిపత్రాలు అందించారు. కొత్త వార్డులను సవరించాలని పలు పార్టీల నాయకులు సమర్పించిన వినతిపత్రాలను అధికారులు పరిశీలించి చర్యలు తీసుకునేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వీరస్వామి తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఓటర్ల వివరాలు.. ప్రాంతం పురుషులు మహిళలు మొత్తం నర్సంపేట టౌన్ 13,987 15,324 29,311 ముగ్ధుంపురం 967 1,059 2,026 మహేశ్వరం 1,458 1,535 2,993 రాములునాయక్తండా 240 256 496 రాజపల్లి 573 594 1,167 మాదన్నపేట 744 754 1,498 నాగుర్లపల్లి 448 468 916 పర్శనాయక్తండా 247 259 506 ముత్తోజిపేట 761 885 1,646 -
ఉత్సాహంగా 5కే రన్
ఎంజీఎం: నేషనల్ సర్జన్స్ డేను పురస్కరించుకొని ఏఎస్ఐ వరంగల్ బ్రాంచ్ ఐఎంఏ వరంగల్ డిపార్టమెంట్ ఆఫ్ సర్జరీ, కేఎంసీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన గురువారం కేఎంసీ నుంచి ఐఎంఏ హాల్ వరకు 5కే రన్ నిర్వహించారు. ఏఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహన్దాస్, ఐఎంఏ వరంగల్ అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి జెండా ఊపి రన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ ప్రధాన కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ ఈ రన్ ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే కాకుండా సర్జన్ల పాత్రను సమాజానికి వివరిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సర్జన్ డాక్టర్లు శ్రీనివాస్గౌడ్, నాగేందర్, విద్యాసాగర్, రూప, కార్తీక్, కేఎంసీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్, పీజీ, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ఎయిర్పోర్ట్ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
న్యూశాయంపేట: మామునూరు ఎయిర్పోర్ట్ రోడ్ల కనెక్టివిటీ కోసం వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో గురువారం ఆమె పర్యటించారు. రోడ్ల నిర్మాణం చేపట్టే ప్రదేశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుంటూరుపల్లి నుంచి నేషనల్హైవే వరకు, నక్కలపల్లి నుంచి గాడిపల్లి–గాడిపల్లి బైపాస్ వరకు రోడ్ల స్థలాలను పరిశీలించి ప్రభుత్వానికి పంపడానికి త్వరితగతిన ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారి రమేశ్, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్, తహసీల్దార్ నాగేశ్వర్రావు, అధికారులు పాల్గొన్నారు. భూనిర్వాసితులకు త్వరితగతిన పరిహారంఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములిచ్చిన భూనిర్వాసితులకు పెండింగ్లో ఉన్న పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఇన్నర్ రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ లేఔట్ అనుమతుల పురోగతి తదితర అంశాలపై కలెక్టరేట్లో గురువారం కుడా చైర్మెన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గొర్రెకుంట, ఏనుమాములతోపాటు ఖిలా వరంగల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రింగ్రోడ్డు భూ నిర్వాసితులకు త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలన్నారు. మెగా టెక్స్టైల్ పార్కులో రాజీవ్ మెగా టౌన్షిప్ ఏర్పాటుకు లేఔట్ అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కేఎంటీపీ జోనల్ మేనేజర్ స్వామి, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, కుడా పీఓ అజిత్రెడ్డి, తహసీల్దార్లు నాగేశ్వర్రావు, రాజ్కుమార్, మహ్మద్ ఇక్బాల్, రియాజుద్దీన్, అధికారులు పాల్గొన్నారు. -
మోగిన బడిగంట
విద్యారణ్యపురి: వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన విద్యార్థులు గురువారం బడిబాట పట్టారు. పండుగ వాతావరణంలో ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు ఉపాధ్యాయులు పూలతో ఘన స్వాగతం పలికారు. పలు పాఠశాలలను మామిడి తోరణాలు, అరటి ఆకులు, పూలు, బెలూన్లతో అలంకరించారు. హెచ్ఎంలు, ఉపాధ్యాయులు విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కూడా నిర్వహించారు. పలు పాఠశాలలను సందర్శించిన కలెక్టర్, అధికారులు వర్ధన్నపేట మండలం ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాల, ఖిలా వరంగల్ మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద సందర్శించారు. విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. అదేవిధంగా సంగెం మండలం మొండ్రాయిలోని జెడ్పీహెచ్ఎస్, పల్లారుగూడలోని యూపీఎస్ను జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ కె.సుభాష్ పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. వరంగల్లోని కృష్ణా కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 300 మంది విద్యార్థులకు 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి ఎంఈఓ గంపా అశోక్కుమార్, ఉపాధ్యాయులు పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ అందజేశారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ పలు పాఠశాలలను పర్యవేక్షించారు. జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు మొదటి రోజు యూనిఫాం, పుస్తకాల పంపిణీ -
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయాలి
● జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ గీసుకొండ/నర్సంపేట: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థులను చేర్పిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) సుజన్తేజ అన్నారు. గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, చెన్నారావుపేట మండలంలోని పలు గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో గురువా రం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని సూచించారు. గంగదేవిపల్లి పాఠశాల హెచ్ఎం అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ పదో తరగతిలో విద్యా ర్థులు అత్యధిక మార్కులు సాధించారని పేర్కొన్నా రు. అదేవిధంగా చెన్నారావుపేటలో జరిగిన బడిబాట కార్యక్రమంలో ఏఎంఓ సుజన్తేజ, మండల విద్యాశాఖ అధికారి బైరి సరళ, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర ఈశ్వర్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. ఎమ్మార్సీ కార్యాలయంలో పాఠ్యపుస్తకాలు, రికార్డులను పరిశీలించారు. -
జల దోపిడీపై రైతులు చైతన్యం కావాలి
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి నర్సంపేట: రాష్ట్రంలో జరుగుతున్న జల దోపిడీపై ప్రజలు, రైతులు చైతన్యం కావాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నాయకులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టులకు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కేంద్రంతో కలిసి తెలంగాణలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను ఎండబెట్టే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. జిల్లాను సస్యశ్యామలం చేసే దేవాదుల, సీతారామ, రామప్ప–పాకాల, రంగాయ చెరువు లాంటి ప్రధాన ప్రాజెక్టులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను బుధవారం ఘోష్ కమిషన్ ముందుకు పిలిపించి రాక్షసానందం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు అమలు చేయలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరంగా తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దమ్ము లేదని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా పార్టీ విజయం సాధిస్తుందని పెద్ది ధీమా వ్యక్తం చేశారు. -
సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు
● పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రామన్నపేట: విద్యార్థులు, అధ్యాపకుల సమష్టి కృషితో టీజీఈసెట్లో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ అన్నారు. గురువారం కళాశాల ఆవరణలో టీజీఈసెట్–2025లో ఉత్తమ ప్రతిభ కబర్చి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన పలువురు విద్యార్థులను ప్రిన్సిపాల్తోపాటు అధ్యాపక బృందం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ మాట్లాడుతూ.. విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం కళాశాలకు ఎంతో గర్వకారణమని, ఈ స్ఫూర్తిదాయక ప్రదర్శన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. భవిష్యత్లో వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : కలెక్టర్ సత్యశారద
వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన వసతులతోపాటు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ సత్యశారద తెలిపారు. మండలంలోని ల్యాబర్తి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. గత సంవత్సరం పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించిన ందుకు విద్యార్థులు, ఉపాధ్యాయలను అభినందించారు. ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు చదువుతోపాటు స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్, వర్ధన్నపేట తహసీల్దార్ విద్యాసాగర్, ఎంఈఓ శ్రీధర్, ఎంపీడీఓ అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడిబాటను విజయవంతం చేయాలి ఖిలా వరంగల్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. ఖిలా వరంగల్ మండల పరిధి గుంటూరుపల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను కలెక్టర్ సత్యశారద, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి, విద్యార్థులకు యూనిఫామ్, బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు. ఈనెల 6వ తేదీ నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల పునఃప్రారంభమైన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి తిరిగి బడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అంతకుముందు నూతనంగా బడిలో చేరిన విద్యార్థులకు అడ్మిషన్ ఫారాలు అందించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఓ రమేశ్, ఎస్సైలు శ్రీకాంత్, కృష్ణవేణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా
సాక్షి, వరంగల్ : దత్తత ప్రక్రియలో కొందరు బాలల సంరక్షణ విభాగాధికారులు దందాకు తేర లేపారన్న ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న పిల్లల కోసం..కొందరు దంపతులు తమ వయసును తక్కువగా చూపించేందుకు కొన్ని స్కూళ్ల నుంచి స్టడీ, కండక్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు తీసుకున్నారు. కొందరైతే చదువుకోకున్నా, స్టడీ సరిఫికెట్లు తీసుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. తెర వెనుక ఉండి కొందరు అధికారులు ఈ తతంగాన్ని నడిపించనట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిరక్షరాస్యులకు వయసు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఓసిఫికేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు.లేదంటే పాన్కార్డులోని పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఎక్కువ వయసున్న దంపతులకు తక్కువ వయసు పిల్లలను దత్తత ఇచ్చే అవకాశం లేదని అధికారులే ‘మామూలు’గా మాట్లాడతారు. కొందరు ప్రైవేట్ పాఠశాలల యజమానులతో కుమ్మక్కై సర్టీఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్గా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు.వాస్తవానికి దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టీఫికెట్ల తీసుకొని దందాకు తెరలేపారు. ఇలా చేసి పిల్లల జీవితాల్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పదో తరగతి చదువుకునే సమయంలో తల్లిదండ్రులు వృద్ధాప్య దశలోకి రావడం.. పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతోంది. వరంగల్ కేంద్రంగా... వరంగల్ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటకు వచ్చింది. గత నెలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగ ఉన్నతాధికారి దత్తతకు సంబంధించి హోంస్టడీ రిపోర్టులను సమీక్షించాలని చెప్పడం, దరఖాస్తు చేసుకున్నవారు రెన్యూవల్కు వచి్చన సందర్భంలో నకిలీ సర్టిఫికెట్ల అంశం అధికారుల దృష్టికి వచ్చింది. అయినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెబ్సైట్లో అప్లోడ్ చేసిన సర్టీఫికెట్ల దర్యాప్తునకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. నర్సంపేట నుంచే నకిలీ సర్టీఫికెట్లు ⇒ వరంగల్ జిల్లాలోని నర్సంపేట కేంద్రంగా శ్రీఅరుణోదయ విద్యాలయం, అరుణోదయ విద్యాలయం, ఏకశిల హైస్కూల్ పేర్లతో రెండు దశాబ్దాల క్రితం ఒకటి, రెండు, మూడో తరగతి చదువుకున్నారంటూ కొందరు పిల్లలు లేని దంపతులకు నకిలీ డేట్ ఆఫ్ బర్త్ సర్టీఫికెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పిల్లలు లేని భార్యాభర్తలిద్దరూ చదువుకోకపోయినా, ఒకటే పాఠశాలలో చదివినట్టుగా సరిఫ్టికెట్ ఇవ్వడం, ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, రెండు దశాబ్దాల క్రితం ఒకటే పాఠశాలలో చదివినట్టుగా ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అసలు వారు చదువుకున్న సమయంలో ఆ పాఠశాలలు లేకపోవడం గమనార్హం. ⇒ పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని వివేకానంద పబ్లిక్ స్కూల్లో ఒకరు చదవుకున్నా చదివినట్టుగా పాఠశాల పేరుతో నకిలీ స్కూల్ రికార్డు షీట్ తీసుకున్నారని ఆ పాఠశాల నిర్వాహకుడు బి.సాంబయ్య లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ⇒ దత్తతకు వచ్చిన చాలామంది దంపతులు నర్సంపేటలోని పాఠశాలల నుంచే ఈ సర్టీఫికెట్లు తేవడంతో దీని వెనుక బడా నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఇక్కడే చదువుకున్నట్టుగా సర్టీఫికెట్లు తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. -
నిజాం కాలం నాటి మర్కజీ హైస్కూల్
ప్రొఫెసర్ జయశంకర్ ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే.. విద్యారణ్యపురి: వివిధ రంగాల్లో ఉన్నతస్థానాలకు ఎదగిన ఎంతో మంది మేధావులను అందించింది హనుమకొండలోని మర్కజీ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. నిజాం కాలంలో 1940లో ప్రారంభించిన ఈ పాఠశాల తొలుత ఊర్దూ మీడియంగా, తర్వాత తెలుగు మీడియంగా, ప్రస్తుతం ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులకు విద్య అందిస్తున్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఈ పాఠశాలలోనే ఉర్దూమీడియంలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు వివిధ దేశాల్లో, రాష్ట్రంలో వివిధ ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్లో ప్రస్తుతం 676 మంది విద్యార్థులు ఉండగా, 26మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 284 మంది చదువుతుండగా 10 మంది టీచర్లు ఉన్నారు. జిల్లాలో అత్యధికంగా విద్యార్థులు కలిగిన ప్రభుత్వ పాఠశాలగా గుర్తింపు పొందింది. -
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడోత్సవాలు
హన్మకొండ: విద్యుత్ ఉద్యోగులకు రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలకు విద్యుత్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు స్పోర్ట్స్ కౌన్సిల్ బాధ్యులు తెలిపారు. ఈ ఇంటర్ సర్కిల్ కబడ్డీ, బాల్బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రాష్ట్రంలోని టీజీ ట్రాన్స్కో, టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్కు చెందిన 12 జట్ల చొప్పున పాల్గొననున్నాయని స్పోర్ట్స్ కౌన్సిల్ సభ్యులు వి.సునీల్కుమార్, ఎండీ.యాకూబ్ పాషా, ఇ.ప్రేంకుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం 9 గంటలకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని టోర్నమెంట్ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ ఇన్చార్జ్ డైరెక్టర్లు, స్పోర్ట్స్ కౌన్సిల్ కమిటీ బాధ్యులు, అధికారులు పాల్గొంటారని వివరించారు. మనబడి పాట ఆవిష్కరణ విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పాలకుర్తి రవి రాసిన మనబడి పాటను బుధవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ డి.వాసంతి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఎశ్రీనివాస్, కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి, శాయంపేట ఎంఈఓ భిక్షపతి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మందల తిరుపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫలిత శ్రీహరి, ఓదెల నరేందర్, పెద్దకోడెపాక జెడ్పీహెచ్ఎస్ పధానోపాధ్యాయుడు సారయ్యనాయక్, ఉపాధ్యాయులు చంద్రయ్య, భాస్కర్, సారంగపాణి పాల్గొన్నారు. పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేతవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 28న మరణించిన వెంకటరమణ కుటుంబానికి పోలీస్ భద్రత విభాగంనుంచి మంజూరైన రూ.7.32 లక్షల చెక్కును సీపీ సన్ప్రీత్సింగ్ బుధవారం ఆ కానిస్టేబుల్ భార్య వాణికి అందజేశారు. కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సూపరింటెండెంట్ రమాదేవి పాల్గొన్నారు. పరీక్షల పర్యవేక్షణ అధికారిగా శ్రీదేవి కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. శ్రీదేవి పరీక్షల పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీ, పీజీ పరీక్షలతోపాటు ఇతర పోటీల పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను శ్రీదేవి నిర్వహిస్తారని తెలిపారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలత, డాక్టర్ నహీద తదితరులు శ్రీదేవిని అభినందించారు. నేడు జస్టిస్ పీసీ ఘోష్ పర్యటనహన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ చైర్మన్, సుప్రీంకోర్టు పూర్వ జడ్జి జస్టిస్ పీసీ ఘోష్ గురువారం హనుమకొండ, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం రాత్రి హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకున్న ఆయనకు కలెక్టర్ పి.ప్రావీణ్య మొక్క అందించి స్వాగతం పలికారు. గురువారం ఉదయం 9.30 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 10.45 గంటలకు రామప్పకు చేరుకుంటారు. రామప్పలో దైవదర్శనం చేసుకుని, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 12.15 గంటలకు రామప్పలో బయలుదేరి 1.30 గంటలకు హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి మూడు గంటలకు హైదరాబాద్ వెళ్తారు. -
రెవెన్యూ సదస్సును సమర్ధవంతంగా నిర్వహించాలి
నర్సంపేట రూరల్: భూభారతి రెవెన్యూ సదస్సులను గ్రామాల్లో సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్య శారద అన్నారు. నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును బుధవారం సందర్శించి దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టాదారు పాసు పుస్తకాల్లో వివరాల నమోదు, ఇతర ఎలాంటి సమస్యలున్నా రైతులు భూభారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులపై సమర్ధవంతంగా విచారణ చేపట్టి అర్హులందరికీ పరిష్కారం లభించేలా కృషి చేయస్తామన్నారు. భూ భారతి చట్టాన్ని రైతులు వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఉమారాణి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీ న్యూశాయంపేట: జిల్లాలో పనిచేస్తున్న పలువు రు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ సత్యశారద బుధవారం ఉత్తర్వులు జారీ చేశా రు. కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్న ఎన్.రమేష్ను ఖానాపురం తహసీల్దార్గా, చెన్నారావుపేటలో తహసీల్దార్గా పనిచేస్తున్న పీఎస్.ఫణీకుమార్ను ఆర్డీఓ వరంగల్, డీఏఓగా, వరంగల్ ఆర్డీఓ ఆఫీస్లో డీఏఓగా పనిచేస్తున్న దిలావర్ మహ్మద్ ఆబిద్అలీని చెన్నారావుపేట తహసీల్దార్గా, నర్సంపేట డిప్యూటీ తహసీల్దార్ (ఎన్నికల విభాగం)లో పనిచేస్తున్న ఏ.రాజేశ్వర్రావును దుగ్గొండి తహసీల్దార్(ఎఫ్ఏసీ)గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారం మేం మోయలేం..!● జీపీల ట్రాక్టర్ల తాళాలను ఎంపీడీఓకు అప్పగించిన పీఎస్లు గీసుకొండ: మండలంలోని 21 గ్రామపంచా యతీల ట్రాక్టర్ల తాళాలను పంచాయతీ కార్యదర్శు(పీఎస్)లు బుధవారం ఎంపీడీఓ కృష్ణవేణికి అప్పగించారు. గ్రామాల్లో సర్పంచ్ల పద వీ కాలం ముగిసిన 18 నెలల నుంచి ప్రత్యేక అధికారులు పాలన సాగుతోంది. ఈ కాలంలో పంచాయతీల్లో తాగు నీరు, పారిశుద్ధ్యం, వీధి లైట్లు, మొక్కలకు నీరుపట్టడం, తదితర నిర్వహణ ఖర్చుల విషయంలో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి సు మారు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు స్వంత డబ్బులు ఖర్చు చేశామని తెలిపారు. బిల్లులను ప్రభుత్వానికి సమర్పిస్తే చెక్కులు పాస్ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇలాంటి పరిస్థితిలో తాము ట్రాక్టర్ల డీజిల్, రిపేరింగ్ ఖర్చులు భరించలేమంటూ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల జేఏసీ పిలుపు మేరకు మూకుమ్మడిగా పంచాయతీ కార్యదర్శులు కలిసి వెళ్లి తాళం చెవిలను ఎంపీడీఓకు అప్పగించారు. పరిస్థితి ఇలాగే ఉంటే వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తప్పేలా లేదు. పరీక్షల పర్యవేక్షణాధికారిగా శ్రీదేవి కేయూ క్యాంపస్: హనుమకొండలోని యూని వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. శ్రీదేవి పరీక్షల పర్యవేక్షణాధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. డిగ్రీ, పీజీ పరీక్షలతోపాటు ఇతర పోటీల పరీక్షల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను శ్రీదేవి నిర్వహిస్తారని తెలిపారు. డ్రెయినేజీ బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్లు ఏర్పాటు చేయండి వరంగల్ అర్బన్: నగర డ్రెయినేజీల్లోని నీటి బ్లాకేజ్ ప్రాంతాల్లో మెష్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి.. ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమై వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో డివిజన్లలోని డ్రెయిన్లలో బ్లాకేజ్ ఏరియాలను గుర్తించి మెష్లు ఏర్పాటు చేయాలన్నారు. మొత్తం 66 డివిజన్లకు ఎన్ని మెష్లు అవసరమో నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్ కుమార్ పాల్గొన్నారు. -
ఆదర్శం.. ఒంటిమామిడిపల్లి పాఠశాల
మూసివేసిన బడికి పూర్వవైభవం తెచ్చిన గ్రామస్తులు ఐనవోలు: ఒకప్పుడు నిరాదరణకు గురై మూసివేసిన ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రస్తుతం 508 మంది విద్యార్థులతో జిల్లాలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామస్తులు కమిటీని ఏర్పాటు చేసుకుని పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు రూ.6 వేలు, 6 నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సంవత్సరానికి రూ.7 వేల చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో 17 మంది ఉపాధ్యాయులకు తోడుగా విద్యాకమిటీ మరో 10 మంది ఉపాధ్యాయులను నియమించి కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తోంది. డిజి టల్ తరగతి గదులు, గ్రంథాలయం, 40 కంప్యూటర్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ల కోసం ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాత్రం విద్యార్థులు క్యూ కట్టడం విశేషం. పాఠశాలను పలుమార్లు విదేశీయులు సందర్శించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
వర్ధన్నపేట: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండలంలోని ఇల్లంద సబ్ సెంటర్–2 వైద్య శిబిరాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాక్సినేషన్, రికార్డులను పరిశీలించిన అనంతరం గ్రామస్తులతో మా ట్లాడారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఇంటి చుట్టూ మురికి కాల్వల్లో నీటి నిల్వ ఉండడం వల్ల దోమల ఉధృతి అధికం అవుతుందని వివరించారు. నీటి నిల్వ ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లాలని సూచించారు. వర్షాకాలంలో బోర్లలో నీరు మారుతుందని, తాగునీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైద్య శిబిరం ప్రక్రియను సందర్శించి పలు సలహాలు, సూచనలు చేశారు. డాక్టర్ సురేష్ కుమార్, కార్యదర్శి రామారావు, ఏఎన్ఎం సరోజ, అపరంజి, కోమల, శోభ పాల్గొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి రాయపర్తి: ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి సాంబశివరావు హెచ్చరించారు. బుధవారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలైన ఇల్లంద, దమ్మన్నపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, రాయపర్తి పరిధిలోని కేంద్రాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది ప్రజలకు అందించాల్సిన సేవలు, సమయపాలన గురించి హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతాశిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు, వ్యాధినిరోధక టీకాలు అందించాలని ఆదేశించారు. అవసరమైన శస్త్రచికిత్సలు చేయకుండా సాధారణ ప్రసవాలు జరిగేటట్లు ప్రోత్సహించాలని సూచించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని కోరారు. సీజనల్కు అనుకూలంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, నీళ్ల విరేచనాలు, బంక విరేచనాలు, అంటువ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తగిన చికిత్సలు అందించాలని కోరారు. కార్యక్రమాల్లో సీసీ నాగరాజు, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు -
అంగన్వాడీల్లో చిన్నారులను చేర్పించాలి
కలెక్టర్ ప్రావీణ్యఎల్కతుర్తి: ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్లోని ఐదో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో అమ్మమాట–అంగన్వాడీ బాట ర్యాలీని కలెక్టర్ బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల నమోదు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రం ఆవరణలో చిన్నారులతో కలిసి మొక్కలు నాటి, భోజనం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా పూర్తిచేయాలి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య లబ్ధిదారులకు సూచించారు. ముల్కనూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు కనకలక్ష్మితో కలెక్టర్ మాట్లాడారు. ఇంటి నిర్మాణానికి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎంత ఖర్చయిందని, మహిళా సంఘంలో ఉన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణ పనులు వేగవంతం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నేపథ్యంలో మండలంలో ప్రైస్ కమిటీ ఉండాలని, మేసీ్త్రలతో సమావేశం నిర్వహించాలని ఎంపీడీఓ వీరేశానికి సూచించారు. పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచేయాలి పీవీ విజ్ఞాన కేంద్రం పనులు రెండు వారాల్లో పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్వగ్రామం వంగరలో చేపట్టిన పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకోగా కలెక్టర్ పరిశీలించారు. పనుల గురించి పర్యాటక శాఖ డీఈఈ ధన్రాజ్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విజ్ఞాన కేంద్రంలో ఆహ్లాదాన్ని పంచేవిధంగా మొక్కలు నాటాలని, గ్యాలరీలో ఫర్నిచర్, ఫొటోలు, జ్ఞాపికలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పీవీ విజ్ఞాన కేంద్రం సమగ్ర వివరాలను తెలిపే విధంగా బ్రోచర్లను సిద్ధం చేయాలన్నారు. ఆమె వెంట డీడబ్ల్యూఓ జయంతి, పర్యాటక శాఖ అధికారి శివాజీ, ఏఈ జీవన్రెడ్డి, తహసీల్దార్ రాజేశ్, గృహనిర్మాణ శాఖ అధికారులు సిద్ధార్థనాయక్, రవీందర్, అధికారులు ఉన్నారు. -
సంతోషంగా బడికి వెళ్లేవాడిని
మా నాన్న నన్ను పాఠశాలలో చేర్పించారు. సంతోషంగా బడికి వెళ్లే వాడిని. 1965 విద్యా సంవత్సరంలో పర్వతగిరి ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎస్సీ మొదటి సంవత్సరం ప్రారంభమైంది. 1968 సంవత్సరంలో నేను పాఠశాల టాపర్ను. 1968లో హెచ్ఎస్సీ పూర్తి చేయడం జరిగింది. ఉపాధ్యాయులు భాస్కరాచారి, పాణి, తోటి విద్యార్థుల సహకారంతో పాఠశాల భవనాన్ని శ్రమదానంతో నిర్మించడం జరిగింది. విద్యాశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రూ.5కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించి పాఠశాల రుణం తీసుకున్నా. – కడియం శ్రీహరి, ఎమ్మెల్యే, స్టేషన్ఘన్పూర్ భయపడుతూ పాఠశాలకు వెళ్లేవాడిని ఆరోజుల్లో పాఠశాలకు వెళ్లాలంటే భయపడే వాడిని. పాఠశాల తొలి రోజు మా నాన్న, మాజీ సర్పంచ్ ఎర్రబెల్లి జగన్నాథరావు పాఠశాలలో చేర్పించారు. పాఠశాలకు వెళ్లిన తొలి రోజుల్లో భయం భయంగా గడపాల్సి వచ్చేది. పాఠశాల అభివృద్ధి కోసం నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం రూ.5 లక్షలు అందించాను. – ఎర్రబెల్లి దయాకర్, మాజీ మంత్రి● -
వరంగల్
అక్రమార్కులు ఎవరు? సబ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలకు బాధ్యులను గుర్తించడంలో టీజీ ఎన్పీడీసీఎల్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గురువారం శ్రీ 12 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోuఖిలా వరంగల్: నగరంలోని కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 75 ఏళ్ల చరిత్ర ఉంది. 1950లో ఏర్పాటు చేసిన ఈ పాఠశాలలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ప్రయోజకులయ్యారు. దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 519 మంది విద్యార్థులకు 15 మంది ఉపాధ్యాయులు, 9 మంది బోధనేతర సిబ్బంది ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు మాధవి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నారు. క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నారు. ఈ సంవత్సరం పదో తరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా బోధనతోపాటు మెరుగైన వసతులు ఉన్నాయి. విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు డిజిటల్ విధానంలో పాఠాలు బోధిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో చదివే ప్రతి విద్యార్థికి రెండు జతల దుస్తులు అందజేస్తున్నారు. దీంతోపాటు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు.కరీమాబాద్లోని ప్రభుత్వ పాఠశాల ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ ● జిల్లాలో 2,49,510 పాఠ్యపుస్తకాలకు గాను 2,36,990 చేరుకున్నాయి. పర్యావరణ విద్యకు సంబంధించి పాఠ్యపుస్తకాలు రావాల్సింది. ● 1నుంచి 5వ తరగతుల విద్యార్థులకు వర్క్బుక్స్ 44,965కుగాను 35,231 వచ్చాయి. ● 2,21,750 నోట్బుక్స్ వచ్చాయి. ● 558 స్కూళ్లలో 33,878మంది విద్యార్థుల గాను యూనిఫామ్స్ 33,838 (99.8శాతం) అందజేయనున్నారు.న్యూస్రీల్ -
విత్తన విక్రయాల్లో నిబంధనలు పాటించాల్సిందే..
నెక్కొండ: విత్తనాలు, పురుగుమందుల విక్రయాల్లో వ్యాపారులు నిబంధనలు పాటించాల్సిందేనని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ అన్నారు. మండలంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల షాపులను బుధవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేట్టారు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్న వరి విత్తనాలు, పురుగుల మందులను పరిశీలించారు. ఈసందర్భంగా అనురాధ మాట్లాడుతూ.. విక్రయాలకు సిద్ధంగా ఉన్న విత్తన బ్యాగులపై సరైన ముద్రణ లేక, పురుగుల మందుల ప్రిన్సిపల్ లైసెన్స్ లేని కారణంగా విక్రయాలు నిలిపి వేశామని తెలిపారు. వరి విత్తన బ్యాగులపై సరైన లేబుల్ ముద్రణ లేని కారణంగా 190 బస్తాల విత్తనాలను విక్రయాలను నిలిపి వేశామన్నారు. వీటి విలువ సుమారు రూ.1,94,500 ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సర్టిఫికెట్ లైసెన్స్ లేకుండా విక్రయాలకు సిద్ధంగా ఉన్న రూ.1,85,600 విలువైన పురుగుల మందులను గుర్తించినట్లు తెలిపారు. వీటిని విక్రయించొద్దని ఆదేశాలు ఇచ్చామన్నారు. నిబంధలను పాటించని వారిపై శాఖ పరమైన కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఈ తనిఖీలో ఏఓ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. డీఏఓ అనురాధ -
బడికి.. రారండోయ్!
ఆటపాటలకు సెలవు.. ఇక పుస్తకాలతో కుస్తీ ● పాఠ్యపుస్తకాలు, స్కూల్ యూనిఫామ్ సిద్ధం ● ఈసారి వేసవిలోనే టీచర్లకు శిక్షణ పూర్తి ● డీఈఓ మొదలు కిందిస్థాయి సిబ్బందికి సైతం.. ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో పండుగ వాతావరణంలో స్వాగత కార్యక్రమాలు విద్యారణ్యపురి: వేసవి సెలవులు ముగిశాయి. ఇన్నాళ్లు ఆట పాటలతో గడిపిన విద్యార్థులు గురువారం నుంచి బడిబాట పట్టనున్నారు. పుస్తకాలతో కుస్తీ షురూ కానుంది. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు కూడా కొద్దిరోజులుగా సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు మొదటిరోజు పిల్లలను పండుగ వాతావరణంలో పాఠశాలల్లోకి ఆహ్వానించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పచ్చని మామిడితోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. మొదటిరోజు నుంచే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, జత యూనిఫామ్ ఇవ్వనున్నారు. డీఈఓ నుంచి ఉపాధ్యాయులు, ప్రతి విభాగం సిబ్బంది వరకు.. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఈసారి సమగ్రశిక్ష ద్వారా డీఈఓల నుంచి ఎంఈఓలు, ఉపాధ్యాయులు, చివరికి వంట మనుషుల వరకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చింది. ఒక్కో టీచర్కు ఐదు రోజులపాటు శిక్షణ పూర్తిచేసింది.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచేలా, ఐసీటీ టూల్స్ ద్వారా విద్యాభోధన చేసేలా, ఏఐ ఆధారిత విద్యాబోధన తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సుచి, శుభ్రతగా వంటలు చేయడంపై, పారిశుద్ధ్య కార్మికులకు పరిసరాల పరిశుభ్రతపై శిక్షణ ఇచ్చారు. పండుగ వాతావరణంలోస్వాగత కార్యక్రమాలు హనుమకొండ జిల్లాలో 14 మండలాల్లోని ఒక్కో పాఠశాలలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులకు స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డీఈఓ వాసంతి ఆయా ఎంఈఓలను ఆదేశించారు. విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించగానే పండుగ వాతావరణం కనిపించేలా మామిడి తోరణాలు, బెలూన్లు, పూలతో అలంకరించారు. మొదటిరోజు తల్లిదండ్రులను కూడా ఆహ్వానిస్తున్నారు.నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంటీచర్లు సమయపాలన పాటించాలి పాఠశాలలు పునఃప్రారంభం రోజున టీచర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలి. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుంది. బడిబాట ఉదయం 7 నుంచి 9 గంటల వరకు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు పెంచాలి. ఆ తర్వాత యఽథావిధిగా పాఠశాల విధుల్లో ఉండాలి. తరగతి గదుల్లో సెల్ఫోన్లు వినియోగించకూడదు. డి.వాసంతి, హనుమకొండ డీఈఓ -
ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీలు
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలోని ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రంలో అధికారులు బుధవారం సాయంత్ర తనిఖీలు చేశారు. గ్రామానికి చెందిన ఆర్ఎంపీ విలాసాగరం శ్రీనివాస్ ప్రథమ చికిత్స కేంద్రంలో అనుమతి లేకుండా మందులు నిల్వ ఉంచినట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారి కిరణ్ తెలిపారు. తనిఖీల్లో రూ.ఒక లక్ష విలువైన 71 రకాల మందులు స్వాధీనం చేసుకుని, ఆర్ఎంపీకి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి, అర్హత లేకుండా ఆర్ఎంపీలు మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారి కిరణ్ స్పష్టం చేశారు. ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రంలో తనిఖీల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు పావని, బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఆటపాటల ఒడి.. అంగన్వాడీ
నర్సంపేట: అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసేందుకు, చిన్నారుల అడ్మిషన్ల సంఖ్య ను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈనెల 12నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జిల్లాలో నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట ప్రాజెక్టుల పరిధిలో 919 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతోన్నాయి. ప్రీ ప్రైమరీ విద్య.. అంగన్వాడీ కేంద్రాల బలోపేతం కోసం ప్రీ ప్రైమరీ విద్యను అమలు చేయనున్నారు. ఈ మేరకు పిల్ల లకు అర్ధమయ్యేలా వినూత్న రీతిలో బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ర్యాలీలు.. సమావేశాలు.. అంగన్వాడీల బలోపేతంతోపాటు చిన్నారుల ప్రవేశాలకు టీచర్లు కృషి చేయనున్నారు. వారం రోజుల పాటు గ్రామాల్లో ర్యాలీలు, సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. అలాగే స్వచ్ఛ అంగన్వాడీ, పెరటి తోటల పెంపకం, సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలతో విస్తృత ప్రచారానికి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమాలు ఇలా.. ● 12వ తేదీన గ్రామంలో ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, పోషణ్ అభియాన్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించాలి. గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశాలు. ● 13న గ్రామంలో రెండేళ్ల పిల్లలను గుర్తించి, అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. కేంద్రాల్లో అందుతున్న సౌకర్యాలను తెలియజేయాలి. ● 14న స్వచ్ఛ అంగన్వాడీ కార్యక్రమం పేరుతో అంగన్వాడీ కేంద్రంలోని చెత్త, వ్యర్ధాలను తొలగించాలి. కేంద్రాల్లో మొక్కలు నాటాలి. తాగునీరు, టాయిలెట్ అందుబాటులోకి వచ్చేలా చూడాలి. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా వాతావరణం ఉండేలా చూడాలి. ● 16, 17 తేదీల్లో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించాలి. పిల్లలకు పాఠాలు, టైం టేబుల్, సాంస్కృతిక కార్యక్రమాలు, తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పించాచలి. స్టడీ మెటిరియల్ పంపిణీ చేయాలి. ఆట పాటల బడి... అంగన్వాడీ అమ్మమాట.. అంగన్వాడీ బాటలో భాగంగా 3–5 సంవత్సరాల పిల్లలను కేంద్రాల్లో చేర్పించేలా అవగాహన కల్పిస్తున్నారు. కార్పొరేట్ బడులకు ధీటుగా వారి వయస్సుకు తగ్గట్టుగా సులువైన బోధన చేపడుతున్నాం. కథలు, పాటలు, ఆంగ్ల పరిచయం, భాష అభివృద్ధితో కూడిన సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తాం. – మధురిమ, సీడీపీఓ నర్సంపేటఅడ్మిషన్ల పెంపునకు అధికారులు, సిబ్బంది ప్రణాళిక నేటి నుంచి ఈనెల 17 వరకు ప్రత్యేక కార్యక్రమాలు జిల్లాలో 919 అంగన్వాడీ కేంద్రాలు -
ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు
నర్సంపేట: రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందకు రావాలని, తద్వారా అధిక లాభాలు పొందే అవకాశం ఉందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు నర్సంపేటలో బుధవారం ఆయిల్ పామ్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారదతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతుల సౌకర్యార్థం ఆయిల్ పామ్ కంపెనీ తరఫున కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు సాగు చేసిన ఆయిల్ పామ్ సాగు ఆరు వేల ఎకరాల వరకు ఉందన్నారు. రైతులు ఇంకా ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. మార్కెట్, దళారులు, కోతలు, ధరల సమస్య లేనటువంటి పంట ఆయిల్ పామ్ అని అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తుందని, రైతులు పెద్ద ఎత్తున సాగు చేయాలని కోరారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రతీ ఏడాది స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. ఆయిల్ పామ్ పండించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందిన రైతులను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలన్నారు. అనంతరం గెలలు కొనుగోలు చేసిన తర్వాత రైతుకు చెక్కు రూపంలో ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు చెల్లించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, రామ్చరణ్, ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం నారాయణ, డీహెచ్ఎస్ఓ అనసూయ, ఉద్యాన అధికారులు జ్యోతి, తిరుపతి, రాకేష్, ఆర్డీఓ ఉమారాణి, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఆహ్లాదం.. పోచంపల్లి పాఠశాల
బడి ఆవరణలో 830 మొక్కలతో ప్లాంటేషన్ విద్యారణ్యపురి: దాతలు, ప్రేరణ ఫౌండేషన్ సహకారంతో కాజీపేటలోని పోచంపల్లి ప్రభుత్వ పాఠశాల ఆహ్లాదాన్ని పంచుతోంది. డీఆర్ఓ గణేశ్, ఉద్యానశాఖ అధికారి రమేశ్ దాతల సహకారంతో 830 మొక్కలను సమకూర్చి పాఠశాల ఆవరణలో ప్లాంటేషన్ తయారు చేయించారు. రిటైర్డ్ డీఎఫ్ఓ పురుషోత్తం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ ప్రాథమిక పాఠశాలను తీర్చిదిద్దిన హెచ్ఎం ఉప్పలయ్య 2023 డిసెంబర్లో పోచంపల్లి ప్రాథమిక పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ మురికివాడలోని పిల్లలను బడికి వచ్చేలా చేశారు. ప్రస్తుతం 180 మంది విద్యార్థులకు ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. కలెక్టర్ ప్రావీణ్య గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసి, గార్డెన్ను ప్రారంభిస్తారు. -
ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..
ఖిలా వరంగల్: చేసిన అప్పులు తీర్చేందుకు, ప్రియురాలితో కలిసి జల్సాలు చేసేందుకు ఏకంగా తన సొంత ఇంటికే కన్నం వేసిన ఓ ప్రబుద్ధుడు.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతని నుంచి 11.116 తులాల బంగారం, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ మిల్స్కాలనీ పోలీస్స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్.. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సై శ్రీకాంత్, సురేష్లతో కలిసి కేసు వివరాలు వెల్లడించారు.ప్రియురాలి కోసం సొంతింటికే కన్నం..ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన గుర్రపు రామకృష్ణ ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతడికి భార్య సవితా రాణి, ఒక కుమార్తె శ్రీనిధి, కుమారుడు గుర్రపు జయంత్ ఉన్నారు. జయంత్ హనుమకొండలోని ఓ కళాశాలలో బీబీఏ ఫైనలియర్ చదువుతున్నాడు. అదే కాలేజీలో అతడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమెతో కలిసి జల్సాలు చేసేందుకు చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంటికే కన్నం వేయాలని నిర్ణయించుకున్నాడు. సమయం కోసం చూస్తున్న అతను రామకృష్ణ.. తన తమ్ముడి (జయంత్కు బాబాయి) మనుమరాలు పుట్టినరోజు వేడుకల నిమిత్తం ఆదివారం ఉదయాన్నే హైదరాబాద్కు భార్య, కుమార్తెతో కలిసి వెళ్లారు. కానీ, జయంత్ ఇక్కడే ఉన్నాడు. అదేరోజు రాత్రి రామకృష్ణ ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉండగా.. అందులోని ఆరున్నర తులాల పెద్ద హారం, ఐదున్నర తులాల చిన్నహారం, రెండు తులాల రెండు బంగారు గొలుసులు, రెండు తులాల నెక్లెస్, మొత్తం 16 తులాల ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగిందని గ్రహించి మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ జోన్ డీసీపీ సలీమా బేగం ఆదేశాలతో వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ కేసును చాలెంజ్గా తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్ దర్యాప్తు ప్రారంభించారు. మంగళవారం ఉదయం 9గంటల సమయంలో ఫోర్ట్రోడ్డు జంక్షన్లో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా..గుర్రపు జయంత్ పోలీసులను చూసి పారిపోతుండగా అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 11.16 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.అప్పులు తీర్చి.. మిగతా డబ్బులతో జల్సా..జయంత్ బీబీఏ ఫైనలియర్ చదువుతూనే హైదరాబాద్లో ‘స్టార్ట్స్ ఓన్ వీల్స్’ పేరుతో ఒక ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తున్నాడు. వ్యాపారం కలిసిరాక అప్పులపాలయ్యాడు. జయంత్కు కాలేజీలో ఓ గర్్లఫ్రెండ్ ఉంది. చేసిన అప్పులు తీరాలన్నా.. గర్్లఫ్రెండ్తో జల్సాలు చేయాలన్నా డబ్బు కావాలనుకున్న జయంత్.. తన కుటుంబ సభ్యులు ఆదివారం హైదరాబాద్కు వెళ్లగానే ఇంట్లోని బంగారం ఆభరణాలు దొంగిలించాడు. ఆభరణాల్లో కొంత బంగారం కరిగించి అమ్ముదామని వెళ్తుండగా పోలీసులకు చిక్కాడు. అతడినుంచి 5.645 తులాల బంగారు హారం, 5.471 తులాల కరిగించిన బంగారం.. మొత్తం 11.116 తులాల బంగారం, బైక్, ఒక మొబైల్ ఫోన్ స్వా«ధీనం పర్చుకున్నారు. 24గంటల్లో కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు శ్రీకాంత్, సురేష్, సిబ్బంది ప్రవీణ్రెడ్డి, వాజీద్ పాషా, నరేందర్, హోంగార్డ్ రఫీలను ఏసీపీ నందిరామ్నాయక్ అభినందించారు. -
ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలి
ఖానాపురం: రైతులు ముందస్తుగా వరినాట్లు వేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ యాత్రలో భాగంగా ఖానాపురం రైతువేదికలో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలస్యగా వరి సాగు చేస్తే అనేక ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. ఖరీఫ్ సీజన్లో ముందస్తుగా నాట్లు వేసుకుంటే రబీలోనూ ముందస్తుగా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. జులై మొదటి వారంలో రైతులు నాట్లు వేసుకోవడానికి సమాయత్తం కావాలని సూచించారు. ఇందుకోసం నీటి విడుదలకు ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. కలెక్టర్ సత్యశారద, యూనివర్సిటీ వీసీ జానయ్య మాట్లాడుతూ పంటల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. అనంతరం రైతులకు విత్తన బస్తాలను అందజేశారు. కరపత్రాలను ఆవిష్కరించారు. డీఏఓ అనురాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఏడీఆర్ ఉమారెడ్డి, శాస్త్రవేత్తలు శ్రీధర్, రాజు, వెంకన్న, ఇరిగేషన్ ఈఈ సుదర్శన్రావు, ఏడీఏ దామోదర్రెడ్డి, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఏఓ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్రెడ్డి, రైతులు సుబ్బారావు, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్ కమలాపూర్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయ్కుమార్ సూచించారు. ఎన్సీడీ పీఓ డాక్టర్ సయ్యద్ ఇఫ్తార్ అహ్మద్తో కలిసి కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా వారు సీహెచ్సీ, పీహెచ్సీ పరిసరాలను, ఎన్సీడీ రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై, నేషనల్ హెల్త్ ప్రోగ్రాంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నాగరాజు, వైద్యులు అరుణ్, మానస, సీహెచ్సీ సూపరింటెండెంట్ నరేశ్, ఆర్ఎంఓ వరుణ్, హెచ్ఈఓ రవీందర్, పీహెచ్ఎన్ లీలావతి, హెల్త్ సూపర్వైజర్ అమృత, టీబీ నోడల్ పర్సన్ ప్రభాకర్, స్టాఫ్ నర్సులు సరిత, సంపూర్ణ, ఎల్టీ చంద్రమౌళి, హెల్త్ అసిస్టెంట్స్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత నిర్లక్ష్యమెందుకు?వరంగల్ అర్బన్: వాహనాలపై ఇంత నిర్లక్ష్యం తగదని మేయర్ గుండు సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాకు చెందిన బాలసముద్రంలోని వెహికిల్ షెడ్డును మంగళవారం మేయర్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఈసందర్భంగా మరమ్మతులకు గురైన వాహనాలు, వాటి స్థితిగతులు, ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. -
వరంగల్
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025క్రీడా పాఠశాల పిలుస్తోంది.. రాష్ట్రంలోని మూడు క్రీడా పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరానికి నాలుగో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. తేదీల వారీగా ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. – 8లోuనర్సంపేట: వానాకాలం పంటలకు కేంద్రం ఇటీవల మద్దతు ధరలు పెంచింది. దీంతో రైతులకు కాస్త ఊరట కలుగనుంది. జిల్లాలో అధికంగా పండే వరి కి మాత్రం పెంచింది చాలా తక్కువ అని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. అయితే, మొక్కజొన్న, పత్తి రైతులకు మాత్రం కొంతమేర ఊరట కలిగించే అంశం. పెరిగిన ధరలు వానాకాలం నుంచే అమల్లో కి రానున్నాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం సీజన్లో వ్యవసాయ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పొలం పనుల్లో రైతుల బిజీబిజీ.. జిల్లా వ్యాప్తంగా 3,08,500 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో అధికంగా వరి పంట కాగా.. ఆ తర్వాత పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. ఈ మేరకు రైతులు ఇప్పటికే పొలం పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. పలుచోట్ల పత్తి విత్తనాలు వేయగా.. వరి నారు పోసి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. 1,45,000 ఎకరాల్లో వరిసాగు.. జిల్లాలో 1,45,000 ఎకరాల్లో అధికంగా వరి సాగవుతుంది. వరికి కేంద్రం పెంచిన మద్దతు ధర ఏ మాత్రం అన్నదాతలకు రుచించడం లేదు. సాగుకు పెరిగిన పెట్టుబడులను చూస్తే మద్దతు ధర ఏ మూలకు సరిపోదని వారు ఆందోళన చెందుతున్నారు. కేవలం రూ.69 పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరింత మద్దతు ధర ఇస్తే బాగుండని రైతులు అభిప్రాయపడుతున్నారు. పత్తి, మొక్కజొన్నకు కాస్త మెరుగు.. జిల్లాలో వరి పంట తర్వాత పత్తి, మిరప, మొక్కజొన్న అధికంగా సాగు అవుతుంది. ముఖ్యంగా పత్తిని ఏళ్లుగా సంప్రదాయ పంటగా సాగు చేస్తూ వస్తున్నారు. ఈ పంట సాగు చేసిన రైతులు కనీస లాభాలు పొందుతున్నారు. కాగా, ఈ సంవత్సరం కేంద్రం మద్దతు ధర రూ.589 పెంచింది. దీంతో పత్తి రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, పత్తి పంట తొలగించిన తర్వాత అధికంగా మొక్కజొన్న పంట సాగు చేస్తారు. ఈ పంటకు మద్దతు ధర రూ.175 పెంచింది. పెరిగిన ఖర్చులు.. ప్రతీ సంవత్సరం వ్యవసాయ ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. పొలం చదును చేయడం మొదలు ట్రాక్టర్ దున్నడం, విత్తనాలు వేయడం, కలుపు తీయడం, పైపాటు మందులు, కూలీల ఖర్చుల వంటివి రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎకరా వరి సాగు చేసేందుకు రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. పండిన పంట మార్కెట్లో అమ్మితే ఖర్చులు పోను చేసిన పని మాత్రమే మిగులుతుంది. ఈ నేపథ్యంలో మద్దతు ధర రూ.69 పెంచడం రైతులకు రుచించడం లేదు. మద్దతు ధరలు పెంచడం హర్షణీయం రైతుల సంక్షేమం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 14 రకాల పంటలకు మద్దతు ధరలు పెంచడం హర్షణీయం. పత్తి, జొన్న పంటలకు కొంచెం లభించినప్పటికీ వరి పంటకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభించలేదు. ఎకరం వరిపంట సాగు చేస్తే రూ.30 వేల వరకు ఖర్చు వస్తుంది. పండిన పంట మార్కెట్లో అమ్మితే కనీసం పెట్టుబడి కూడా రాదు. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర రూ.69 పెంచడం సరైంది కాదు. కనీసం రూ.450కిపైగా మద్దతు ధర పెంచాలి. – నాగంపెల్లి కిరణ్కుమార్, నందిగామన్యూస్రీల్14 రకాల పంటలకు ధరలు పెంచిన కేంద్రం పత్తి, మొక్కజొన్న రైతులకు కాస్త ఊరట వరికి 69 రూపాయలు మాత్రమే పెంపు జిల్లాలో 3,08,500 ఎకరాల్లో పంటల సాగుపంటల వారీగా పెరిగిన మద్దతు ధరల వివరాలు (రూపాయల్లో) పంట పెరిగిన మద్దతు ధర వరి 69పత్తి 589ఆవాలు 820 రాగులు 596 నువ్వులు 579 వేరుశనగ 480 కంది 450 పొద్దు తిరుగుడు 441మినుములు 400 సోయాబీన్ 436 జొన్న 328 మొక్కజొన్న 175 సజ్జలు 150 పెసర 86జిల్లాలో వివిధ పంటల సాగు వివరాలు (ఎకరాల్లో) పంట 2024 2025 సంవత్సరం సంవత్సరం వరి 1,30,720 1,43,803 మొక్కజొన్న 763 9,820 పత్తి 1,20,166 1,26,173 కంది 1,074 1,180 మిర్చి 4,770 9,000 పసుపు 841 950 ఇతర పంటలు 15,818 17,400 -
సీడ్.. ఫ్రాడ్
రైతుల మెడపై నకిలీ విత్తనాల కత్తిజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నకిలీ పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నకిలీ విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తివైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా, 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ మేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈ సారి బీటీ–3 పేరిట వ్యాపారులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలులో సతమతమవుతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆ మేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఓవైపు నకిలీ బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకె ట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 ర కాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా ఇప్పటినుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా బీటీ–2 ర కాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901కు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350 నుంచి రూ.1,450 వరకు అమ్ముతున్న ట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. సీజన్ ఆరంభం నుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులు -
సీడ్.. ఫ్రాడ్
బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025– 8లోu● యాసంగిలో ములుగు జిల్లా వెంకటాపురం, కన్నాయిగూడెం, వాజేడు, మండలాల్లోని 55 గ్రామాల్లో పేరొందిన కంపెనీలవని నమ్మిన రైతులు.. 1,370 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. అవి నకిలీవి కావడంతో 618 మంది రైతులు నష్టపోగా, అందుకు బాధ్యులైన వారిపై కేసులు నమోదయ్యాయి. ● మార్చి నెలాఖరులో హనుమకొండ జిల్లాలో రూ.78.63 లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాసభ్యులు గతంలో కూడా నాసిరకం పత్తి, మొక్కజొన్న విత్తనాలు విక్రయించినట్లు కేసులున్నాయి. ● తాజాగా వరంగల్ టాస్క్ఫోర్స్, గీసుకొండ, పరకాల పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురిని అరెస్టు చేసి రూ.63.62 లక్షల విలువ చేసే 166 కిలోల నాసిరకం విత్తనాలు, 800 లీటర్ల గడ్డిమందు, నకిలీ పురుగుల మందు తయారీకి అవసరమైన సామగ్రి, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రస్తుత వానాకాలం సీజన్కు నాసిరకం పత్తి విత్తనాలు పోటెత్తుతున్నాయి. ఓ వైపు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాలనుంచి భారీగా రవాణా అవుతుండగా.. మరోవైపు ముఠాలుగా ఏర్పడిన కొందరు ఉమ్మడి వరంగల్వాసులు ఈ ‘నకిలీ’లను మార్కెట్లో విక్రయిస్తున్నారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలను కేంద్రాలుగా చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ముందు జాగ్రత్తగా టాస్క్ఫోర్స్ పోలీసులు జరిపిన దాడుల్లో బయటపడిన నాసిరకం విత్తనాలే ఇందుకు ఉదాహరణ. వరి తర్వాత పత్తి వైపే రైతుల మొగ్గు.. ఉమ్మడి వరంగల్లో వరి తర్వాత రైతులు పత్తి సాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. గత వానాకాలంలో 15,83,692 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. ఇందులో 8.72 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేయగా 6.17 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సుమారుగా 1.14 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, శనగ, పెసర తదితర పంటలు సాగయ్యాయి. గత వానాకాలం సాగు విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకున్న వ్యవసాయశాఖ.. ఈ సీజన్లో 15.85 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని, ఇందులో 9.02 లక్షల ఎకరాల్లో వరి, 5.67 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేస్తారని అంచనా వేసింది. పత్తి వర్షాధార పంట కావడంతో ఈ నెల రెండు, మూడు వారాల్లో విత్తుకునేందుకు 20 రోజుల ముందునుంచే విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈమేరకు 5.67 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కోసం ఎకరానికి రెండు బస్తాల చొప్పున సుమారు 11,34,716 ప్యాకెట్లు అవసరం. ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా బీటీ–2 రకం వాడకంలో ఉండగా, ఈసారి బీటీ–3 పేరిట వ్యాపారులు నాసిరకం విత్తనాల్ని విక్రయిస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు విత్తనాల కొనుగోలు విష యంలో ఏటూ తేల్చుకోలేక పోతున్నారు. బ్లాక్ మార్కెట్లో విత్తనాలు.. రూ.400 వరకు అదనం.. ఉమ్మడి జిల్లాలో ఈసారి 5,67,358 ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేసిన వ్యవసాయశాఖ అధికారులు.. ఆమేరకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. కానీ.. ఓవైపు నాసిరకం బెడద.. మరోవైపు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నా యి. ఎకరానికి 475 గ్రాములున్న విత్తన ప్యాకెట్లు రెండు అవసరం కాగా.. ఉమ్మడి జిల్లాకు 11.35 లక్షల విత్తన ప్యాకెట్లు కావాల్సి ఉంది. ఈ మేరకు నిల్వలు ఉన్నాయని అధికారులు చెప్తున్నా... కొందరు డీలర్లు, వ్యాపారులు మాత్రం సరిపడా రాలేదంటున్నారు. బీటీ–2 రకాలకు మార్కెట్లో డిమాండ్ ఉండగా.. ఇప్పటి నుంచే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కాగా.. బీటీ–2 రకాలకు చెందిన ఒక్కో ప్యాకెట్ను రూ.901కు విక్రయించాల్సిన వ్యాపారులు లేవు.. లేవంటూ రూ.1,350ల నుంచి రూ.1,450ల వరకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు. వర్షాలు పడితే ఆ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నాసిరకం విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు నాసిరకం విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైన వ్యాపారస్తులు, సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్న్యూస్రీల్రైతుల మెడపై నాసిరకం విత్తనాల కత్తి సీజన్ ఆరంభం నుంచే దందా పత్తి విత్తనాల కృత్రిమ కొరత... తప్పని అధిక ధరల మోత పత్తి, వరి విత్తనాల్లోనే నకిలీ ఎక్కువ.. ఇటీవల పట్టుకున్న పోలీసులు నిఘా పెంచాలని కోరుతున్న రైతులుజిల్లాల వారీగా పత్తిసాగు, విత్తనాల అంచనా జిల్లా సాగు అంచనా అవసరమయ్యే (ఎకరాల్లో..) విత్తన ప్యాకెట్లు హనుమకొండ 85,000 1,70,000 వరంగల్ 1,22,358 2,44,716 మహబూబాబాద్ 84,070 1,68,140 భూపాలపల్లి 1,01,500 2,03,000 జనగామ 1,45,000 2,90,000 ములుగు 29,430 58,860 -
రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి
కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్: భూసేకరణ పూర్తయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డితో కలిసి భీమదేవరపల్లి, వేలేరు మండలాల పరిధిలో గౌరవెల్లి ప్రాజెక్టు, పరకాల నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ప్రాజెక్ట్, జిల్లాలో వివిధ రైల్వే ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ, రైతులకు పరిహారం చెల్లింపు, భూసేకరణ పురోగతి అంశాలపై నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఆలస్యం చేయకుండా సంబంధిత రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, గౌరవెల్లి ప్రాజెక్టు డీఈ చైతన్య, నేషనల్ హైవే, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలుజిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల సత్వర పరిష్కారా నికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాలోని ఆయా మండలాల్లో జరుగుతున్న రెవె న్యూ సదస్సుల నిర్వహణ, వచ్చిన దరఖాస్తుల పరి ష్కారంపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, భూ కొలతల శాఖ ఏడీ శ్రీనివాసులు, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, తహసీల్దార్లు పాల్గొన్నారు. సఖి భవన ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలికాజీపేట అర్బన్: హనుమకొండ లష్కర్బజార్లో నూతనంగా నిర్మించిన సఖి కేంద్ర భవనాన్ని త్వరలో ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆనూతన భవనాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమాధికారి జయంతి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్బాబు, సఖి కేంద్ర కో–ఆర్డినేటర్ హైమావతి, డీఈ గోపీకృష్ణ పాల్గొన్నారు. -
రోజుకు 30సార్లు కరెంట్ పోతోంది..
దుగ్గొండి: గ్రామాల్లో రోజుకు 30సార్లు కరెంట్ పోతోందని పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్) చైర్మన్ వేణుగోపాలాచారికి ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో విద్యు త్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్, పలువురు విద్యుత్ సమస్యలను వేదిక దృష్టికి తీసుకొచ్చారు. విద్యుత్ కోతలతో రైతులు, వర్క్ ఫ్రం హోం చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ బావుల కనెక్షన్ కోసం డీడీలు తీసినా లైన్ ఇవ్వడం లేదని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందరికీ వర్తింప జేయాలని, మీటర్లు బిగించుకున్న ఎస్సీ, ఎస్టీలను గృహజ్యోతి పరిధిలోకి తేవాలని కోరారు. అనంతరం చైర్మన్ వేణుగోపాలచారి మాట్లాడుతూ విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. 200 యూనిట్ల విద్యుత్ పథకం అందరికి అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. కమిషన్ సభ్యులు చరణ్దాస్, రమేశ్, రమణారావు, డీఈ తిరుపతి, ఏడీ లక్ష్మణ్, ఏఈలు రామ్మూర్తి, ప్రత్యూష పాల్గొన్నారు. సీజీఆర్ఎఫ్ చైర్మన్ వేణుగోపాలాచారికి ప్రజల ఫిర్యాదు దుగ్గొండిలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక -
తహసీల్దార్లకు బదిలీ ఫీవర్!
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో తహసీల్దార్లకు మరోసారి బదిలీ ఫీవర్ పట్టుకుంది. కొద్దిరోజుల క్రితమే రాష్ట్రస్థాయిలో తహసీల్దార్ల బదిలీలు చేసిన ప్రభుత్వం ఇటీవల కేబినెట్లో ఈ విషయంపై మాట్లాడింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లు సొంత జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుందని నిర్ణయించింది. దీంతో రాష్ట్రస్థాయిలో మరోసారి భారీగా తహసీల్దార్ల బదిలీలు ఉంటాయన్న చర్చ అధికారుల్లో సాగుతోంది. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితమే జరిగిన బదిలీల్లో జిల్లాకు కొత్తగా నలుగురు తహసీల్దార్లు రాగా, మరికొందరు హనుమకొండనుంచి ఇతర జిల్లాలకు వెళ్లారు. జిల్లాకు వచ్చిన వాళ్లకు కలెక్టర్ ప్రావీణ్య పోస్టింగ్లు ఇచ్చారు. దీంతో అంతా సర్ద్దుమణిగింది అనుకున్న సమయంలో మరోసారి తహసీల్దార్లపై బదిలీల పిడుగు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఎవరికివారు ఈ బదిలీ గండంనుంచి బయటపడేందుకు తమవంతుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చిన వారు.. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో జిల్లాకు వచ్చిన తహసీల్దార్లు చాలావరకు ఇక్కడే ఉన్నారు. ఇటీవల బదిలీల్లో ఒకరిద్దరు మారారు. ఉద్యోగ సంఘాలు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశాయి. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి తమ సొంత జిల్లాలకు పంపించాలని కోరాయి. వారి అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో వచ్చిన వారు తిరిగి వెళ్లక తప్పదనే వినిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం హనుమకొండ జిల్లాలోని వేలేరు, ధర్మసాగర్, కాజీపేట, ఎల్కతుర్తి తహసీల్దార్లతోపాటు ఒక డీఈఓ, కలెక్టరేట్లో ఒక సూపరింటెండెంట్ ఈ బదిలీ పరిధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గత ఎన్నికల సమయంలో జిల్లా నుంచి వెళ్లిన వారిలో తహసీల్దార్లు పాక రాజ్కుమార్, రియాజ్ మహేందర్, బండి నాగేశ్వరరావు, పూజారి కిరణ్ కుమార్, తదితరులు తిరిగి జిల్లాకు వచ్చే అవకాశం ఉంటుంది. హనుమకొండ జిల్లాకు వచ్చేవారు ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఇక్కడినుంచి వెళ్లే వారికి కాస్త అసంతృప్తి ఉన్నట్లు సమాచారం. బదిలీలు తప్పించుకునేందుకు ఇక్కడివారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, రావాల్సిన వారు రెట్టింపు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. తహసీల్దార్ల బదిలీలు పూర్తయి జిల్లాలు కేటాయిస్తే వచ్చిన వారికి పోస్టింగ్స్ ఇచ్చే క్రమంలో మరోసారి జిల్లా స్థాయిలో తహసీల్దార్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉంటుంది. బదిలీ భయంతోనే శ్రీపాల్ మృతి? ఇటీవల హనుమకొండ తహసీల్దార్ శ్రీపాల్ రెడ్డి అకాల మరణం ఉద్యోగ వర్గాల్లో కలకలంరేపింది. బదిలీల విషయంపై పదేపదే ఆలోచించి ఆయన కొంత ఆందోళనకు గురైనట్లు సన్నిహితులు చెబు తున్నారు. ఇప్పటికే ప్రమాదవశాత్తు కాలు విరిగి ఇబ్బందులు పడుతున్న శ్రీపాల్రెడ్డి మరోసారి బదిలీ పేరుతో దూర ప్రాంతానికి వెళ్లడం ఎలా? అని మదనపడుతుండేవాడని సమాచారం. జిల్లానుంచి ఏడుగురు బయటకి.. వచ్చేవాళ్లు ఐదుగురు.. బదిలీ గండం తప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు -
ప్రజాస్వామ్యంపై ఏపీ ప్రభుత్వం దాడి
హన్మకొండ అర్బన్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై పాశవికంగా దాడులు చేస్తూ.. అక్రమ కేసులు నమోదు చేయడాన్ని హనుమకొండ జిల్లా జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడిగా వారు అభివర్ణించారు. ఏపీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక ప్రజలను పక్కదారి పట్టించేందుకు సాక్షి జర్నలిస్టులు, సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతోందన్నారు. ఇవి పునరావృతమైతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు సీనియర్ జర్నలిస్టులు, మేధావులు, ప్రజాసంఘాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనను భేషరతుగా విడుదల చేయాలని, పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈనిరసనలో టీయూడబ్ల్యూజే(ఐజేయూ) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గడ్డం రాజిరెడ్డి, ఎడిషన్ ఇన్చార్జ్ వర్ధెల్లి లింగయ్య, వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ వాంకే శ్రీనివాస్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు తోట సుధాకర్, టీవీ.రాజు, బొక్క దయాసాగర్, బొల్లారపు సదయ్య, పొడిశెట్టి విష్ణువర్ధన్, గాడిపెల్లి మధు, వల్లాల వెంకటరమణ, కంకణాల సంతోశ్, నల్లాల బుచ్చిరెడ్డి, అంతడుపుల శ్రీనివాస్, ఊటుకూరు సాయిరాం, నరేశ్, బత్తిని రాజేందర్గౌడ్, కొల్లా కృష్ణ్ణ కుమార్రెడ్డి, యాంసాని శ్రీనివాస్, దామెర రాజేందర్, కొలనుపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. కొమ్మినేని అరెస్ట్.. సాక్షి కార్యాలయాలపై దాడులు నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆందోళన హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిరసన -
జీఎంహెచ్ అభివృద్ధికి సీఎంను కలుస్తాం..
హన్మకొండ చౌరస్తా: పేదలకు వైద్య సేవలందించిన హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధికి కావాల్సిన నిధుల కోసం, జిల్లా ప్రజాప్రతినిధులంతా కలిసి సీఎం రేవంత్రెడ్డిని కోరుతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈఆస్పత్రిని హెరిటేజ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. మంగళవారం కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డితో కలిసి నాయిని రాజేందర్రెడ్డి ప్రసూతి ఆస్పత్రిలో జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆస్పత్రిలోని వివిధ విభాగాలు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఓపీ విభాగంలో రోగుల ఇన్ పేషెంట్ రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్షలో నాయిని మాట్లాడుతూ.. ఆస్పత్రిలోని వైద్య సేవల స్థితిగతులు, రోగులకు అవసరమైన అదనపు వసతులు తదితర అంశాలపై పలు సూచనలిచ్చారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. 16 ఏళ్ల తర్వాత ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించడం, పేదలకు వైద్య సేవలందించడం కాంగ్రెస్ సర్కార్కు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అప్పయ్య, జీఎంహెచ్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి, ఆర్ఎంఓ అంబరీష్, స్థానిక కార్పొరేటర్ లక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
నకిలీ విత్తనాలు, మందులు విక్రయిస్తే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.ఎవరై న వ్యాపారస్తులు,సంస్థలు, వ్యక్తులు రైతన్నను మోసం చే స్తూ నకిలీ విత్తనాలను,పురు గు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం.ఇందుకోసం ప్రత్యే క ప్రణాళిక రూపొందించి టీమ్లను రంగంలోకి దింపాం. నకిలీల సమాచారం తెలిస్తే తక్షణమే మాకు అందించాలి. వివరాలు గోప్యంగా ఉంచుతాం. – సన్ ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ కమిషనరేట్● -
పాకాలను అభివృద్ధి చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలను మరింత అభివృద్ధి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద పేర్కొన్నారు. పాకాలలో చేపట్టిన అభివృద్ధి పనులను డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్తో కలిసి మంగళవారం ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పాకాల అద్భుతంగా ఉందని, పర్యాటకంగా తీర్చిదిద్దడానికి నిధులు మంజూరు చేస్తామన్నారు. అనంతరం అభివృద్ధి పనులపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎఫ్ఆర్వో రవికిరణ్, డీఆర్వో రీనా, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు. రైతులు ఇబ్బంది పడొద్దు.. భూభారతి సదస్సుల్లో దరఖాస్తులు సమర్పించే రైతులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో భూభారతి రైతు సదస్సును మంగళవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణను పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున రైతులు సదస్సులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అధికారులు దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ అనురాధ, ఇన్చార్జ్ తహసీల్దార్ కృష్ణ, డీటీ రాజారేణుక, అధికారులు పాల్గొన్నారు. -
భార్య టార్చర్ను భరించలేకపోతున్నా ఫ్రెండ్స్.. ఆర్మీ జవాన్
శాయంపేట(జయశంకర్): భార్య వేధింపులు తట్టుకోలేక ఓ ఆర్మీ జవాన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబీకుల కథనం వివరాల ప్రకారం.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన అరికిల్ల ప్రవీణ్ సికింద్రాబాద్ తిరుమలగిరిలోని టెరిటోరియల్ ఆర్మీ 125 బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన రజనికతో 2020లో వివాహమైంది. కొంత కాలంగా దంపతుల మధ్య తరుచూ గొడువలు జరుగుతున్నాయి. భార్యతోపాటు అత్తింటి వారు కూడా ప్రవీణ్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రవీణ్ ఉద్యోగానికి వెళ్లకుండా ఐడీ కార్డు దాచిపెట్టి వేధించారు. ఈక్రమంలో ప్రవీణ్ రెండు నెలల క్రితం విధులకు వెళ్లగా తన భార్య బెటాలియన్ వద్దకు వెళ్లింది. అక్కడ గొడవ చేసి ప్రవీణ్ పరువు తీయడంతో మనస్తాపం చెందాడు. దీంతో సెలవుల నిమిత్తం ప్రవీణ్.. ఈ నెల 6న ఇంటికొచ్చి కుటుంబీకులతో మాట్లాడి హనుమకొండకు వెళ్లాడు. 8న హనుమకొండలోనే గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడి తన అన్న ప్రసాద్కు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే ప్రవీణ్ను తిరుమలగిరిలోని మిలటరీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి ముందు ప్రవీణ్ సూసైడ్ నోట్ రాశాడు. అందులో ‘డియర్ ఫ్రెండ్స్ నేను చనిపోతున్నా.. నా చావుకి కారణమెవరో వాళ్లకు తెలుసు. వాళ్ల టార్చర్ తట్టుకోలేకపోతున్నా. అన్నా అమ్మను జాగ్రత్తగా చూసుకో. మన గ్రామంలో వాలీబాల్ టీమ్ బతకాలి, ఎప్పుడూ గేమ్ను వదలొద్దు’ అని పేర్కొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కల్పించండి
సంగెం: ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరించి బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా ఇంటింటి వెళ్లి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు నమ్మకం కల్పించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. మండలంలోని మొండ్రాయిలో సోమవారం నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నతమైన విద్యార్హతలు, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో నైతిక విలువతో కూడిన నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్నభోజనం, రాగి జావ, యూనిఫాంలు అందుతున్నాయన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉత్తమ భవిష్యత్కు నాంది పలకాలని సూచించారు. ఈ సందర్భంగా మొండ్రాయి ప్రభుత్వ పాఠశాలలో చదివి టెన్త్లో 542 మార్కులు సాధించిన అజ్మీరా దీప కు రూ.4 వేల ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ రవీందర్, ఎంఈఓ రాము, ప్రధానోపాద్యాయులు విజయ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ బడిబాటలో ఎమ్మెల్యే రేవూరి -
ఈజీఎస్ పనుల పరిశీలన
గీసుకొండ: మండలంలోని గీసుకొండ, ఎలుకుర్తి, మనుగొండ, అనంతారం, మచ్చాపూర్, వంచనగిరి, శాయంపేట గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో చేపట్టిన భూగర్భ జల సంరక్షణ పనులను ‘జల సంచాయ్ – జల భగీరథ’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నేషనల్ వాటర్ మెషీన్ జిల్లా నోడల్ అధికారి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు, ఇతర పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ చంద్రకాంత్, ఈసీ శ్రీలత, రాజు, క్లస్టర్ సురేష్, టీఏలు సుష్మ, సత్యనారాయణ సింగ్, ఎన్ఆర్డీపీఆర్ఏ నిమ్మల శేఖర్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్ట్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: దివ్యాంగులకు సహాయ ఉపకరణాల సదుపాయాల మంజూరికి అర్హులైనవారి నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి బి.రాజమణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు tgobmms.cgg.gov.inలో తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈనెల 18వ వరకు గడువు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు మహిళలు, పిల్లలు, దివ్యాంగు, వయోవృద్దుల సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఎస్సీ న్యాయవాద పట్టభద్రులకు శిక్షణ జిల్లాలో నూతనంగా న్యాయవాద పట్టాపొందిన ఎస్పీ పట్టభద్రులకు జిల్లా ప్రభుత్వ న్యాయవాది వద్ద వృత్తి శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమాధికారి భాగ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో www. telanganaepass.cgg.gov.in వెట్సైట్ ద్వారా జూలై 31 లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాలకు హనుమకొండలోని జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలి● డీఎంహెచ్ఓ సాంబశివరావు గీసుకొండ: మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలవరీలు, వ్యాధి నిరోధక టీకాలు అందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బి.సాంబశివరావు.. వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని రిజిస్టర్ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని సూచించారు. హెల్త్ డైరెక్టర్ రవీందర్కు పరామర్శ సంగెం: రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ బానోత్ రవీందర్ నాయక్ తండ్రి శంకర్లాల్ నాయక్ అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సెన్ నాయక్ సోమవారం బీకోజీనాయక్ తండాకు వేర్వేరుగా వెళ్లి శంకర్లాల్ నాయక్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సపావట్ మహేందర్నాయక్, నాయకులు సపావట్ కిషన్, వీరన్న, వెంకన్న, మదన్లాల్, జిత్తు, సంగెం ఎస్సై నరేష్, సంగెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నాయకులు రమేష్, నర్సింహనాయక్ తదితరులు పాల్గొన్నారు. సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీనివాస్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముంజం శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వెంకటగోపినాథ్ గడువు ముగియడంతో శ్రీనివాస్ను నియమించారు. -
ముగిసిన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలు
నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల అధికారి టీవీఎల్ సత్యవాణి ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుంచి నిర్వహించిన కబడ్డీ, రెజ్లింగ్ శిక్షణ శిబిరాలు సోమవారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్, ప్రొఫెసర్ ఇన్ ఫిజికల్ ఎడ్యూకేషన్ ఎస్సార్ యూనివర్సిటీ డాక్టర్ పుల్లూరి శ్రీనివాస్గౌడ్ పాల్గొని ప్రతి రోజు శిక్షణలో పాల్గొన్న క్రీడాకారులకు మెడల్స్, అల్పాహారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట ప్రాంతంలో మినీ స్టేడియం అభివృద్ధి చేయాలన్న కృషితో ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్న డీవైఎస్ఓ సత్యవాణికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో స్థానం పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చెన్నబోయిన రామదాసు, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండేటి రవీందర్గౌడ్, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శి ఈసాల లక్ష్మయ్య, జిల్లా ప్రైవేట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం బాధ్యులు నాడెం సంతోష్, పరికి ప్రశాంత్, వజ్జ రాజేష్, ఉరుసుల శేఖర్, కుంట విజేందర్ పాల్గొన్నారు. -
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఎంజీఎం: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషంట్, ఔట్ పేషంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యసేవల గదులతోపాటు ల్యాబ్లు, పలు విభాగాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపరచాలని, సెప్టిక్ ట్యాంక్ వేగవంతంగా శుభ్రం చేయాలన్నారు. బాలింత ప్లేట్లో భోజనాన్ని గమనించిన కలెక్టర్ మెనూ పాటించకపోవడంపై వార్డు ఇన్చార్జ్ స్టాఫ్నర్స్, ఇన్చార్జ్ డైటీషియన్, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆర్ఎంఓను ఆదేశించారు. అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ను ఆస్పత్రి బయటికి మార్చాలని, ఆస్పత్రి ఇరువైపులా వెంటనే సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓలు డాక్టర్ మురళి, డాక్టర్ రమేష్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వరూప, డాక్టర్ సృజన, కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద సీకేఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ -
విమానాశ్రయానికి మరో అడుగు
సాక్షి, వరంగల్: మామునూరు ఎయిర్పోర్ట్ పునర్నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈనేపథ్యంలో సమీప గ్రామాల ప్రజల నుంచి సేకరించే భూమికి పరిహారం నిర్ణయించడం.. అందుకు భూనిర్వాసితులు సానుకూలత వ్యక్తం చేయడంతో విమానాశ్రయ నిర్మాణానికి మరో అడుగు పడినట్లయ్యింది. కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని జిల్లా చర్చల కమిటీ నిర్వాసితులతో చర్చింది. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు, వ్యవసాయేతర భూములకు చదరపు గజానికి రూ.4,887 ఇస్తామని, అంతకు మించి పెంచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. దీంతో నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి భూనిర్వాసితులు భూములు ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. వీరిలో గుంటూరుపల్లికి చెందిన కొందరు రైతులు తమ భూములు మెయిన్ రోడ్డుకు ఉన్నాయని, ఇంకాస్త ఎక్కువ ధర వస్తుందన్న ఆలోచనలో ఉన్నవారితో తహసీల్దార్, ఆర్ఐ తదితరులు చర్చించి ఎక్కువ ధర ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. కలెక్టర్ తనకున్న విచక్షణాధికారాలతో జనరల్ అవార్డు కింద రూ.65లక్షలు ఉంటే కన్సంట్ అవార్డు కింద రూ.కోటి 20లక్షల వరకు తీసుకొచ్చారని వివరించారు. ఇదిలా ఉండగా.. 253 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తాజా గా కలెక్టర్ సత్యశారద నిర్ణయంతో మరో రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్లు అదనంగా అవసరం కానుండడంతో ఇప్పటికే ఆమె రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. భూసేకరణ కాగానే పనులు మొదలు.. ఇప్పటికే ఎయిర్పోర్ట్ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమిని 136 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉండగా, అది కూడా పూర్తి కావొచ్చింది. భూ నోటిఫికేషన్ ప్రకారం రైతులు తమ భూపత్రాల వివరాలు ఇవ్వగానే, వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తూనే భూమి సేకరించనుంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించారు. ఈవిమానాశ్రయం అందుబాటులోకి వస్తే 150 నుంచి 186 మంది ప్రయాణించే వీలున్న 37.6 మీటర్లు పొడవున్న ఏ–320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి. ధరల నిర్ణయాలపై మెజార్టీ నిర్వాసితుల సానుకూలత వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు.. వ్యవసాయేతర భూములకు గజానికి రూ.4 వేలకు పైగా.. -
సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన
హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య హన్మకొండ అర్బన్ : ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి, సమన్వయంతో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యపడుతుందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఈనెల 9 నుంచి 15వ తేదీ వరకు చేపట్టనున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంపై జిల్లా సంక్షేమ అధికారి జయంతి అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ టీమ్ జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ప్రమాదకర ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. 14 సంవత్సరాల్లోపు బాల బాలికలు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత యజమానులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేయాలని, 18 సంవత్సరాల్లోపు వారైతే బాలల న్యాయ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ.. కార్మిక శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో సేకరించి నివేదికలు అందజేయాలన్నారు. అనంతరం కలెక్టర్ ప్రావీణ్య స్పెషల్ డ్రైవ్కు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ, అనంతరం లేబర్ అడ్డా వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏఎస్ వినీత, ఎన్సీఎల్పీ డైరెక్టర్ బుర్ర అశోక్ కుమార్, బాలల సంక్షేమ సమితి సభ్యులు కజాంపురం దామోదర్, సందసాని రాజేంద్ర ప్రసాద్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ప్రవీణ్ కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ ఎస్ భాస్కర్, ఏహెచ్టీయూ ఎస్సై ఫిలిప్ రాజ్, కానిస్టేబుల్ రాము, సోషల్ వర్కర్స్ శ్రీనివాసులు, సునీత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణులకు మెరుగైన వైద్యసేవలందించాలి
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ● సీకేఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు ఎంజీఎం: ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్న వైద్యసేవల గదులతోపాటు ల్యాబ్లు, పలు విభాగాలను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు పెంచాలన్నారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడి అందుతున్న వైద్యం గురించి తెలుసుకున్నారు. శానిటేషన్ వ్యవస్థ మెరుగుపర్చాలని, సెప్టిక్ ట్యాంకు వేగంగా శుభ్రం చేయాలన్నారు. బాలింత ప్లేట్లో భోజనాన్ని గమనించిన కలెక్టర్ మెనూ పాటించకపోవడంపై వార్డు ఇన్చార్జ్ స్టాఫ్ నర్స్, ఇన్చార్జ్ డైటీషియన్, కాంట్రాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమో జారీ చేయాలని ఆర్ఎంఓను ఆదేశించారు. అన్నపూర్ణ భోజనం క్యాంటీన్ను ఆస్పత్రి బయటికి మార్చాలని, ఆస్పత్రి ఇరువైపులా వెంటనే సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆస్పత్రి ఆర్ఎంఓలు మురళి, రమేశ్, ఇన్చార్జ్ సూపరింటెండెంట్ స్వరూప, సృజన, కుమార్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
దీపావళి నాటికి గృహ ప్రవేశాలు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు హన్మకొండ/హసన్పర్తి: ఇందిరమ్మ పథకం కింద ఇల్లు నిర్మిస్తున్న వారు దీపావళి నాటికి గృహ ప్రవేశాలు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. నగరంలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 65, 66వ డివిజన్ల్లోని ఇందిరమ్మ లబ్ధిదారులకు సోమవారం అంబేడ్కర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మంజూరు పత్రాలు అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. ఇళ్లు ఇప్పిస్తామని వచ్చే దళారులను నమ్మొద్దని సూచించారు. ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికస్థోమత లేనివారికి మహిళా సంఘాల ద్వారా రుణసాయం చేయాలని సూచించారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ పీడీ రవీందర్నాయక్, కార్పొరేటర్లు జక్కుల రజిత, సిరంగి సునీల్కుమార్, షీబారాణి, అరుణకుమారి, డివిజన్ అధ్యక్షుడు కిరణ్, పొన్నాల రఘు, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
సంగెం: వసతి గృహాల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం శుభ్రత, నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా బాలల సంక్షేమాధికారి కె.ఫ్లోరెన్స్ సూచించారు. జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూల్, యూఆర్ఎస్ల నుంచి వచ్చిన 63 మంది కుక్లకు సంగెం కేజీబీవీలో సోమవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకాలతో కూడిన నాణ్య మైన ఆహారం అందించడానికి మెనూలో మార్పులు తీసుకొచ్చిందన్నారు. శిక్షకులు స్రవంతి, మమ త, స్వరూప.. కుక్స్కి పోషకాహార ప్రాముఖ్యత, మసాలా కర్రీ తయారీ, మెనూ ప్రకారం వంటకాలపై గ్రూపులుగా విభజించి ప్రాక్టికల్స్ శిక్షణ నిర్వహించారు. వంటకాల్లో గుణాత్మక మార్పులు, ఆరోగ్యవంతమైన భోజనం అందించడంతో విద్యార్థినుల ఆరోగ్యం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేకాధికారి నీలిమ, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు. జీసీడీఓ ఫ్లోరెన్స్ -
సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా శ్రీనివాస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ) సైన్స్ కోర్సుల అసిస్టెంట్ డైరెక్టర్గా మైక్రోబయాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముంజం శ్రీనివాస్ను నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న వెంకటగోిపీనాథ్ ఏడాది గడువు ముగియడంతో ముంజం శ్రీనివాస్ను నియమించారు. ప్రస్తుతం శ్రీనివాస్ మైక్రోబయాలజీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నిట్ ఓపెన్ హౌస్కు అనూహ్య స్పందనకాజీపేట అర్బన్: నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్కు తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. జోసా ప్రవేశ పరీక్ష ద్వారా ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందేందుకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏమరపాటుతో ఛాయిస్ ఫిల్లింగ్లో తప్పులు చేస్తే సీటు కోల్పోయే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా అడ్మిషన్ అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలన్నారు. జోసా ప్రవేశపరీక్ష అర్హత సాధించి బీటెక్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం కళాశాల, కోర్సుల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులు, తల్లిదండ్రులు.. నిట్ ప్రొఫెసర్లతో ముఖాముఖి మాట్లాడారు. కార్యక్రమంలో నిట్ డీన్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యంహన్మకొండ అర్బన్: రాష్ట్రంలో కోటి మంది మహిళా సంఘాల మహిళలను కోటీశ్వరుల్ని చేయాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రి సీతక్క, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బడిబాట, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సమీక్ష నిర్వహించారు. ఇందులో హనుమకొండ కలెక్టరేట్ నుంచి హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యాటక ప్రదేశాలకు ఆర్టీసీ టూర్ ప్యాకేజీహన్మకొండ: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టినట్లు టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయ భాను అన్నారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీ పోస్టర్లను ఆర్ఎం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ రీజియన్లోని ఆయా డిపోల నుంచి పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. హనుమకొండ నుంచి పంచరామాలు, అరుణాచలం, భద్రాచలం, వేములవాడ, నాగార్జునసాగర్, బొగత, రామప్ప, లక్నవరం, మల్లూరు, ఇతర పర్యాటక ప్రదేశాలకు బస్సులు నడుపనున్నట్లు వివరించారు. ప్రయాణికులు ఈసౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రత్యేక టూర్ ప్యాకేజీల వివరాల కోసం వరంగల్–1 డిపో మేనేజర్ 99592 26047, వరంగల్–2 99592 26048, హనుమకొండ 89777 81103, పరకాల 99592 26051, నర్సంపేట 99592 26052, భూపాలపల్లి 99592 26707, తొర్రూరు 99592 26053, మహబూబాబాద్ 99592 26054, జనగామ డిపో మేనేజర్ 99592 26050ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ కేశరాజు భానుకిరణ్, అకౌంట్స్ ఆఫీసర్ రవీందర్, పర్సనల్ ఆఫీసర్ సైదులు, డిపో మేనేజర్లు అర్పిత, వి.జోత్స్న, ధరమ్సింగ్ పాల్గొన్నారు. -
మూడు నెలల రేషన్ కోసం మూడు రోజులు లైన్లో!
హన్మకొండ అర్బన్: మండుతున్న ఎండలో రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం జనం అల్లాడుతున్నారు. ప్రభుత్వం మూడు నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఓ వైపు ఇరుకు గదుల్లో షాపులు, మరోవైపు మండుతున్న ఎండలు, తాగేందుకు నీరు, నిల్చునేందుకు నీడలేక రేషన్ లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. మరో వైపు సర్వర్ డౌన్ కారణంగా గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నగరంలో దాదాపు అన్ని రేషన్ షాపుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, కనీస వసతుల విషయంలో జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో జనం ఆపసోపాలు పడుతున్నారు. ఒక్కొక్కరికి పది నిమిషాలు.. ప్రస్తుతం ఒక్కో కార్డుకు మూడు నెలల బియ్యం ఇస్తుండడంతో నెలకు ఒక సారి చొప్పున ముడు సార్లు కాంటా వేయాలి. మూడు సార్లు లబ్ధిదారుడు బయోమెట్రిక్ ఇవ్వాలి. వాతావరణం వేడిగా ఉండడం, ఒకేసారి అందరు ఉపయోగిస్తుండడంతో సర్వర్ మొరాయిస్తోంది. ఒక్కరికి కనీసం పది నిమిషాల సమయం పడుతోంది. అది కూడా సర్వర్ సరిగ్గా ఉంటే.. దీనివల్ల గంటకు కేవలం ఐదు, లేదా ఆరుగురికి మాత్రమే రేషన్ ఇవ్వగలుగుతున్నట్లు రేషన్ డీలర్లు చెబుతున్నారు. బియ్యం ఐపోతాయని.. రాష్ట్రంలో ఎక్కడి వారైనా.. ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు అవకాశం ఉండడంతో తమకు బియ్యం వస్తాయో రావో అనే బెంగతో జనం షాపులు తెరవక ముందు నుంచే బస్తాలు, చెప్పులు, వాటర్ బాటిళ్లు లైన్లో పెట్టి ఉంచుతున్నారు. షాపు తీయగానే జనం విరగబడుతున్న పరిస్థితులు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. దీంతో.. డీలర్లు కూడా ఏం చేయలేని పరిస్థితి నెలకొంటోంది. డీలర్లు టోకెన్ పద్ధతిని ప్రారంభించారు. ఉదయం షాపు తీయడానికి అరగంట ముందు రోజుకు 50 టోకెన్లు ఇస్తున్నారు. ఇచ్చిన 50 మందికి పూర్తిగా మూడు నెలల రేషన్ ఇస్తే సాధారణ రోజుల్లో 150 మందికి ఇచ్చినట్లు లెక్క. దీనివల్ల అంతకన్నా ఎక్కువ టోకెన్లు ఇవ్వలేనమని డీలర్లు చెబుతున్నారు. కొత్త సాఫ్ట్వేర్తో ఇబ్బందులు ఇటీవల పౌరసరఫరాల శాఖ రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఈ పాస్ మిషన్లలో కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసింది. దీనిలో కేంద్ర ప్రభుత్వ కోటా ఒక్క వ్యక్తికి ఐదు కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం కోటా ఒక కిలో బియ్యం విడివిడిగా నమోదు చేయాలని, విడిగా తూకం వేయాలని చెప్పారు. దీంతో మూడు నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ క్రమంలో ఒక్కొక్కరి నుంచి ఆరుసార్లు బయోమెట్రిక్ తీసుకుంటున్నారు. ఆరుసార్లు తూకం వేస్తున్నారు. దీంతో రోజంతా ఈ ప్రక్రియ కొనసాగినా ఒక్కో డీలర్ 15 మందికి కూడా బియ్యం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి గమనించి దిద్దుబాటుగా నెలకు రెండు సార్లు బదులు ఒక్కసారి తూకం వేసేలా మార్పు చేశారు. దీనికితోడు గతంలో కన్నా అదనంగా సమాచారం నమోదు చేయాల్సి వస్తుండడం అనవసర ఆప్షన్లు ఎక్కవగా ఉండడంతో సమయం వృథా అవుతోందని డీలర్లు చెబుతున్నారు. పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యం క్షేత్రస్థాయిలో ఇంత జరగుతున్నా.. జిల్లా పౌరసరఫరాల అధికారులు మాత్రం రేషన్ షాపుల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలున్నాయి. సాధారణంగా రేషన్ షాపులకు బియ్యం నెలాఖరులో చేరవేస్తారు. నెల ఒకటో తారీఖు నుంచి 15వ తేదీ వరకు పంపిణీ చేసి అధికారులకు లెక్కలు అప్పగిస్తారు. మిగిలిన స్టాకునుబట్టి తదుపరి నెలకు కోటా కేటాయిస్తారు. అయితే ప్రస్తుతం మూడు నెలల కోటా విషయంలో జనం అయోమయానికి గురవుతున్నారు. ఎప్పటి మాదిరిగానే 15వ తేదీ వరకు షాపులు క్లోజ్ చేస్తారని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈవిషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు కార్డుదారులకు కనీసం భరోసా ఇవ్వలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు షాపుల వద్ద పరిస్థితిని పర్యవేక్షించడం లేదని అంటున్నారు. ఎండ మండుతున్నందున షాపుల వద్ద టెంట్లు వేయించడం, తాగునీరు అందుబాటులో ఉంచడం కూడా చేయడం లేదని రేషన్ లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఒక్కో వ్యక్తికి మూడు నెలల బియ్యం చేతికి అందాలంటే కనీసం మూడు రోజులపాటు లైన్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. నెలాఖరు దాకా పంపిణీ నెలాఖరుదాకా బియ్యం ఇస్తాం. ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ విషయం అధికారులు చెబితే ప్రజలు నమ్ముతారు. గతంలో మాదిరిగా 15వ తేదీ వరకు అనుకుని జనం ఎగబడుతున్నారు. సర్వర్ సమస్య తీవ్రంగా ఉంది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే మంచిది. ఎండల వల్ల జనం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. – మహేశ్వరం గౌరీశంకర్, హనుమకొండ డీలర్ల సంఘం అధ్యక్షుడు ప్రజలకు అవగాహన కల్పించని సివిల్సప్లయ్ అధికారులు నీరు, నీడ లేక జనం అవస్థలు జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు 2,31,516పంపిణీ చేస్తున్న బియ్యం (మూడు నెలల కోటా) 1,28,17,586 (మె.టన్నులు) -
యూనిఫామ్ రెడీ
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. ఓవైపు బడిబాటలో భాగంగా బడీడు పిల్లలను గుర్తించి స్కూల్లో చేర్పేంచేందుకు ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇంటింటి సర్వేను కూడా కొనసాగిస్తున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ను అందజేయాలనే కృతనిశ్చయంతో సంబంధిత విద్యాశాఖ అధికారులున్నారు. ఈమేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాలో సంబంధిత అధికారులు అన్ని మండలాల్లోని పాఠశాలల స్థాయిలోని సెల్ఫ్హెల్ప్ గ్రూపుల మహిళా సమాఖ్యలతో స్కూల్ యూనిఽఫామ్లు కుట్టించారు. పట్టణ ప్రాంతంలో మెప్మాకు సంబంధించిన టీఎల్ఎఫ్ల ద్వారా స్టిచ్చింగ్ చేయించారు. ఈసారి స్టిచ్చింగ్ డిజైన్లో మార్పులు చేశారు. ముఖ్యంగా చొక్కాలు, లాంగ్ఫ్రాక్లకు పట్టీలు, భుజాలపై కప్స్ వంటి ప్యాచ్లు లేకుండా స్టిచ్చింగ్ చేశారు. వేసవి సెలవుల్లో పాఠశాలల్లోని విద్యార్థులకు కొలతలు కూడా తీసుకుని మహిళా సమాఖ్యలకు అప్పగించడంతో కుట్టించే ప్రక్రియ కొనసాగింది. తరగతుల వారీగా యూనిఽఫామ్ ఇలా.. ఒకటి నుంచి ఐదో తరగతి బాలురకు చొక్కా, నిక్కర్, ఆరు నుంచి 12 తరగతుల బాలురకు చొక్కా, ప్యాంట్, ఒకటి నుంచి మూడో తరగతి బాలికలకు చొక్కా, లాంగ్ఫ్రాక్, 4, 5 తరగతులకు బాలికలకు షర్ట్, స్కర్ట్, ఆరు నుంచి 12వ తరగతి బాలికలకు పంజాబీ డ్రెస్ మోడల్లో ఉండేలా లాప్బాటమ్ చున్నీ లేకుండా కుట్టించారు. హనుమకొండ జిల్లాలో.. సోమవారం వరకు 317 పాఠశాలలకు 66 శాతం యూనిఫామ్స్ చేరవేశారు. హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్ఎస్ స్కూల్స్ కలిపి 477 పాఠశాలల్లో 30,922 మంది విద్యార్థులున్నారు. అందులో బాలికలకు 16,070 మంది బాలురు 14,832 మంది ఉన్నారు. జిల్లాలో 91 శాతం స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో విద్యార్థికి ఒక్కో జత కుట్టించే ప్రక్రియ పూర్తయ్యింది. ఇప్పటి వరకు 66 శాతం స్కూల్ యూనిఫామ్స్ ఆయా పాఠశాలల హెచ్ఎంలకు అందజేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ఈనెల 12వ తేదీ లోపు వందశాతం అన్ని స్కూళ్లకు చేర్చనున్నారు. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు ఒక్కో జత స్కూల్ యూనిఫామ్ అందించనున్నారు. పాఠశాల పునఃప్రారంభం రోజే అందజేస్తాం.. జిల్లాలో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కో జత విద్యార్థులకు అందజేసేందుకు మహిళా సమాఖ్యలతో వందశాతం స్టిచ్చింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. పాఠశాలలకు చేరేవేసే ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు ఎక్కువ శాతం స్కూల్ యూనిఫామ్స్ పాఠశాలలకు చేరాయి. మరో రెండు రోజుల్లో వందశాతం పూర్తి చేసేలా ఆదేశించాం. – వాసంతి, డీఈఓ, హనుమకొండ హనుమకొండ జిల్లాలో 30,922 మంది.. వరంగల్ జిల్లాలో 33,878 మంది విద్యార్థులకు ఒక్కోజత పాఠశాలలకు పంపిణీ రెండో జతకు రావాల్సి ఉన్న క్లాత్ -
గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై దృష్టి
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ: హనుమకొండ గోకుల్ జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం గోకుల్ జంక్షన్ను కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన పరిశీలించారు. కాలనీవాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వివరించారు. అశోక కాలనీ వరద ముంపునకు గురవుతోందని, భారీ వర్షానికి గోకుల్నగర్లో వరద ఉప్పొంగుతుందని, ఎగువనుంచి వస్తున్న వరద వెళ్లే మార్గం లేక కాలనీలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భవన్ నుంచి సమ్మయ్యనగర్ వరకు ప్రస్తుత డ్రెయినేజీకి ప్రత్యామ్నాయంగా మరోవైపు తాత్కాలిక కాలువ తవ్వాలని ఆదేశించారు. గోకుల్ జంక్షన్ అభివృద్ధిలో భాగంగా తగిన విద్యుద్దీపాలు, ఫుట్పాత్లు, సిగ్నల్ వ్యవస్థలు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పీసీసీ మెంబర్ ఈవీ శ్రీనివాస్రావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మారెడ్డి, బంక సంపత్ యాదవ్, అశోక కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఎం.కృష్ణారెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ నల్ల సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు సాగు చేయొద్దు
నల్లబెల్లి: రైతులు నకిలీ పత్తి విత్తనాలు సాగు చేయొద్దని నర్సంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు దామోదర్ రెడ్డి సూచించారు. మండలంలోని రుద్రగూడెం, గోవిందాపూర్, కొండాపూర్, పంతులుపల్లి, మూడుచెక్కలపల్లి గ్రామాలను సోమవారం ఆయన సంద్శించారు. బీజీ–3 పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించిందని, ఈ విత్తనాలు సాగు చేస్తే కలిగే నష్టాలను రైతులకు వివరించారు. నిషేధిత, అనుమతిలేని విత్తనాలు, అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే స్థానిక వ్యవసాయాధికారికి సమాచారాన్ని అందించాలన్నారు. లైసెన్స్ కలిగిన షాపుల్లో మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రశీదు తీసుకోవాలన్నారు. పంట కాలం పూర్తయ్యే వరకు రశీదు భద్రపరుచుకోవాలని చెప్పారు. ఆయన వెంట నల్లబెల్లి, నర్సంపేట మండలాల వ్యవసాయాధికారులు బన్న రజిత, కృష్ణ కుమార్, ఏఈఓలు ఉన్నారు. దామోదర్రెడ్డి -
లింగ వివక్షను సహించేదిలేదు
నల్లబెల్లి: ఉద్యోగుల్లో లింగ వివక్షను సహించేది లేదని కలెక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని కన్నారావుపేట, నందిగామ గ్రామాలను సోమవారం ఆమె సందర్శించి బడిబాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందిగామ హైస్కూల్లో అంగన్వాడీ కోసం తరగతి గదిని కేటాయించాలని సూపర్వైజర్ అరుణ కలెక్టర్ను కోరగా.. ఎంఈఓ అనురాధతో కలెక్టర్ చర్చించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినుల స్టాప్ రూంలు వేర్వేరుగా ఉండడం, ఉపాధ్యాయినులకు స్టోర్ రూం కేటాయించడాన్ని గమనించారు. ఈ విధానం సరైంది కాదని ఉపాధ్యాయులపై కలెక్టర్ మండిపడ్డారు. ఉద్యోగుల్లో లింగ వివక్ష సరికాదని, ఉద్యోగులందరు ఒకే చోట సోదరభావంతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. కన్నారావుపేట ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రహరీ నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హెచ్ఎం యాదగిరిని ఆదేశించారు. కన్నారావుపేట, నందిగామ గ్రామాల్లో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను కలెక్టర్ సందర్శించారు. రేషన్షాపుల్లో రద్దీ ఉన్నచోట టోకెన్ సిస్టమ్.. న్యూశాయంపేట: రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల రేషన్ సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నక్రమంలో రద్దీ ఉన్న చోట్ల టోకెన్ సిస్టమ్ అమలు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. సోమవారం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సివిల్ సప్లయీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడంతో హమాలీ, ట్రాన్స్పోర్ట్, సర్వర్జామ్ మెనేజ్మెంట్ సమస్యలు ఉత్పన్నం కావడంతో అధికారులతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎండ ఉన్న చోట్ల ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. కోటీశ్వరులను చేయడమే లక్ష్యం కోటీ మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పలు కార్యక్రమాలతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. సీఎస్ రామకృష్ణారావులతో కలిసి హైదారాబాద్ నుంచి సోమవారం బడిబాట, ఇందిరా మహిళాశక్తి కార్యక్రమాలపై కలెక్టర్లతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. జిల్లాల్లో స్కూల్ యూనిఫాంలు కుట్టడం పూర్తయిందన్నారు. ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక బృందాల ద్వారా జిల్లాలోని నర్సంపేట, వరంగల్లో అనువైన ప్రాంతాల్లో పెట్రోల్ బంక్లు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలి ప్రీ–రివిజన్ యాక్టివిటీస్లో భాగంగా 12,00 ఓటర్లు దాటిన పోలీంగ్ కేంద్రాలను గుర్తించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని ప్రధాన ఎలక్ట్రోరల్ ఆఫీసర్ సి.సుదర్శన్రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో రేషనలైజేషన్, బీఎల్ఓల నియామకం, గుర్తింపు కార్డుల జారీపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేసి పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి కొత్త పోలింగ్ కేంద్రాలను సూచించాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బీఎల్ఓ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ జూన్ 20లోగా పూర్తి కావాలన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడూతూ.. వరంగల్ నియోజకవర్గంలో 795 పోలింగ్ కేంద్రాలున్నాయని అన్ని కేంద్రాల్లో బూత్లెవల్ ఆఫీసర్లు ఉన్నారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీడబ్ల్యూఓ రాజరమణి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సివిల్ సప్లయీస్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, టీజీఎండీసీ పీఓ విష్ణువర్ధన్, జిల్లా మైనింగ్ అధికారి రవిశంకర్, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ నర్సింహమూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద ఉపాధ్యాయులపై మండిపడ్డ కలెక్టర్ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మైనింగ్ శాఖ సమన్వయ సమావేశంలో మైనింగ్ లైసెన్స్ల జారీ, ఖనిజ వనరుల నిర్వహణ, మైనింగ్ లీజుల అనుమతులు అక్రమ మైనింగ్, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. -
అయ్యో, బిడ్డా.. చివరిచూపైనా దక్కదా?
కురవి (మహబూబాబాద్): మండల కేంద్రానికి చెందిన తొడుసు నేహ(15) శనివారం సాయంత్రం మండల కేంద్రం శివారు లింగ్యా తండా వద్ద 365 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. అదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి సరిత అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూతురు నేహ మృతి చెందిన విషయం తల్లికి తెలియదు. ఈ క్రమంలో ఆదివారం నేహకు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాల మధ్య నేహ అంత్యక్రియలు పూర్తయ్యాయి. నేహ కడసారిచూపునకు నోచుకోకుండా తల్లి సరిత అచేతనావస్థలో కొట్టుమిట్టాడుతుండడంపై గ్రామస్తులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. నేహ అంత్యక్రియలకు సహ విద్యార్థినులు తరలొచ్చారు. కాంగ్రెస్ నాయకులు ఎర్ర నాగేశ్వరరావు, రాజేందర్కుమార్, మాజీ డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్. రెడ్యానాయక్, బీఆర్ఎస్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, నూతక్కి నర్సింహరావు, సంగెం భరత్, బాదె నాగయ్య, మేక నాగిరెడ్డి, గుగులోత్ రవి, నూతక్కి సాంబశివరావు, దుడ్డెల వినోద్.. నేహ మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. బిడ్డను చూసేందుకు వచ్చిన నాయకులను చూసిన తండ్రి వెంకన్న బోరున విలపించాడు. బిడ్డ నీకోసం సార్లు వచ్చారంటూ గుండెలవిసేలా రోదించాడు. -
ముగిసిన పేరిణి నాట్య శిక్షణ శిబిరం
హన్మకొండ కల్చరల్: నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ ఆధ్వర్యాన ఏప్రిల్ 24న ప్రారంభమైన పేరిణి నాట్య గురుశిష్య పరంపర–2 శిక్షణ శిబిరం ఆదివారంతో ముగిసింది. ఈమేరకు వరంగల్లోని పేరిణి నృత్యాలయంలో అకాడమీ వ్యవస్థాపకులు, పేరిణి నాట్యగురువు గజ్జెల రంజిత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శిక్షణలో పాల్గొన్న 120 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ 14వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పేరిణి నృత్య అధ్యాపకురాలు చేతరాజు నవ్యజ, అకాడమీ అధ్యక్షరాలు మోత్కూరి చంద్రకళ రామకృష్ణ, నరసింగరావు, పలనాటి శ్రీజ, బండారు వైష్ణవి, గురుదేవ్, తేజస్వీని, సంతోశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్కకు రేవంత్రెడ్డి కేబినెట్లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆశావహులకు నిరాశ.. మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యం ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకూ అవకాశమివ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్ వినిపించారు. వర్ధన్నపేట ఎమ్మె ల్యే నాగరాజు ఎస్సీ సామాజికవర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి జిల్లా నుంచి ఆశించిన ఎవరికీ అ మాత్యపదవి దక్కకపోవడం కొంత నిరాశపర్చింది. అమాత్యుల శాఖలు పదిలం మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది.ఫలించని ఓరుగల్లు సీనియర్ నేతల ప్రయత్నాలు డిప్యూటీ స్పీకర్తోనే సరిపెట్టిన పార్టీ అధిష్టానం విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా రాంచంద్రునాయక్ శాఖలను పదిలం చేసుకున్న మహిళా మంత్రులు ఊహాగానాలకు తెర దింపిన హైకమాండ్ -
కీలక పోస్టులు ఖాళీ
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను అధికారుల కొరత వేధిస్తోంది. కీలక విభాగాల్లో అధిపతులు లేకపోవడం.. పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడం, మరికొందరు అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమవుతోంది. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోకుండా దాటవేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పరిపాలన గాడి తప్పుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా గ్రేటర్ వరంగల్కు గుర్తింపు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. 8,19,469 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం 12లక్షల పైచిలుకు పెరిగినట్లు అంచనా. కొత్త కాలనీలు వెలుస్తుండడంతో జనాభా రెట్టింపవుతోంది. నగరం రోజురోజుకూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడే వరుసగా వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే, మన వార్డు–మన ప్రణాళిక, ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు తదితర పథకాల దరఖాస్తుల స్వీకరణ, సర్వే, సంక్షేమ పథకాల పంపిణీ పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో బల్దియా ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నగర ప్రజలకు సకాలంలో సేవలు లభించడం లేదు. ఈనేపథ్యంలో నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే నగర పాలక సంస్థ వింగ్ అధికారుల కొరతతోపాటు సరిపడా క్షేత్రస్థాయి సిబ్బంది లేమితో నగర పరిపాలన నత్తనడకన కొనసాగుతోంది. సిటీ ప్లానర్ పోస్టు ఖాళీ.. నగర అభివృద్ధిలో కీలక విభాగమైన పట్టణ ప్రణాళిక సిటీ ప్లానర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. రెండు డీసీపీ పోస్టులు, మరో రెండు ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాక 25 మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకుగాను కేవలం 15 మందితో నడుస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిది. క్షేత్రస్థాయి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తక్కువ మంది ఉండడంతో ఉన్న వాళ్లకే ఎనిమిది డివిజన్లు, విలీనగ్రామాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. అంతేకాక ఉన్న వారిలో సగం మందికి పైగా జిల్లాలోని మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇళ్లనిర్మాణాలకు అనుమతులు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. రెండు ఎస్ఈ పోస్టులు ఖాళీ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నా, తాగునీటి సరఫరా సవ్యంగా సాగాలన్నా ఎస్ఈ అవసరం. ఒక ఎస్ఈ 8 నెలల కిందట బదిలీపై వెళ్లారు. మరో ఎస్ఈ గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈఈ శ్రీనివాస్కు ఇన్చార్జ్ ఎస్ఈగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎస్ఈ పోస్టులకు దిక్కుమొక్కు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఈల కొరత బల్దియాను వెంటాడుతోంది. ఒక్కొకరికి రెట్టింపు డివిజన్లను కట్టబెట్టారు. పెరిగిన నగర విస్తీర్ణం దృష్ట్యా 25 మంది ఏఈలు ఉండాలి. కానీ అరకొర మందితో నెట్టుకొస్తున్నారు. వెరసి అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు కరువై మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఖాళీ కీలకమైన మూడు విభాగాల్లో డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అందులో కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణికి కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీకి, కాజీపేట డిప్యూటీ కమిషనర్కు స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్ కమిషనర్లుగా నియమించారు. ఇలా అదనపు బాధ్యతలతో అధికారులు తమ కొలువులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని నగరవాసులు కోరుతున్నారు. అస్తవ్యస్తంగా గ్రేటర్ వరంగల్ పరిపాలన ఉన్నవారిపై పెరుగుతున్న పనిభారం కొరవడిన పర్యవేక్షణ.. అభివృద్ధి పనుల్లో లోపిస్తున్న నాణ్యత కట్టుతప్పుతున్న కట్టడాలు -
పోషకాహార పంటలకు శ్రీకారం
హన్మకొండ: జాతీయ ఆహార భద్రతా మిషన్లో పోషకాహార పంటలు సాగు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు అవసరమైన పంట ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా మిషన్ను అమలు చేస్తోంది. 2025లో హనుమకొండ జిల్లాలో అపరాలు, పప్పు దినుసుల విస్తీర్ణాన్ని పెంచి వాటి ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లాలో రాగులు, కందులు, మినుములు సాగు చేయాలని వ్యవసాయ శాఖకు ఆదేశాలు అందాయి. ఈమేరకు జిల్లా వ్యవసాయ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పూర్తి రాయితీపై విత్తనాలు ఈ మిషన్లో రైతులకు పూర్తి రాయితీపై విత్తనాలు అందించనున్నారు. జిల్లాలో 545 ఎకరాల్లో రాగులు సాగు చేయాలని నిర్ణయించారు. అదే విధంగా 200 ఎకరాల్లో కంది, 100 ఎకరాల్లో మినుము పంట సాగు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఏటా ఒకే రకమైన పంటలు పండించకుండా రైతులు ఇతర పంటల వైపు.. అది కూడా ప్రజలకు పోషకాలు అందించే పంటల సాగును ప్రోత్సహిస్తోంది. 645 ఎకరాల్లో రాగుల సాగుకు 25.8 క్వింటాళ్ల విత్తనాలు అవసరం. ఒక్కో ఎకరానికి 4 కిలోల విత్తనం అవసరం. రైతుకు నాలుగు కిలోల ప్యాకింగ్తో కూడిన విత్తన సంచిని అందించనున్నారు. 200 ఎకరాల కంది సాగుకు 8 క్వింటాళ్ల విత్తనం అవసరం. ఇది కూడా నాలుగు కిలోల విత్తనంతో కూడిన కిట్ను అందిస్తారు. మినుములు కూడా నాలుగు కిలోల విత్తన సంచిని అందిస్తారు. వీటి సాగుకు అర్హులైన, ఆసక్తి కలిగిన రైతులను వ్యవసాయ అధికారులు గుర్తిస్తున్నారు. రైతులను ఎంపిక చేస్తున్నాం.. జాతీయ ఆహార భద్రతా మిషన్లో పంటల సాగుకు రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. పూర్తిగా ఒకే పంట సాగు చేయడానికి రైతు ముందుకు రాకపోతే అంతర పంటగా సాగు చేసేలా ప్రోత్సహిస్తాం. విత్తనాలు రాగానే పంపిణీ చేస్తాం. – రవీందర్ సింగ్, హనుమకొండ జిల్లా వ్యవసాయాధికారి జాతీయ ఆహార భద్రతా మిషన్లో సాగుకు నిర్ణయం హనుమకొండ జిల్లాలో 645 ఎకరాల్లో రాగులు 200 ఎకరాల్లో కందులు, 100 ఎకరాల్లో మినుములు -
భద్రకాళి ఆలయంలో చండీహోమం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉద యం అర్చకులు చండీహోమం నిర్వహించారు. అమెరికా దేశం డల్లాస్లో స్థిరపడిన రేవతి గత శనివారం 53 గ్రాములు, 57 గ్రాముల బరువు కలిగిన రెండు బంగారు కాసుల హారాలను కానుకగా భద్రకాళి అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా రేవతి దంపతులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి చండీహోమంలో పాల్గొన్నా రు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. 11 నుంచి బీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచా ర్య కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. నేటి ప్రజావాణి రద్దున్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలనాపరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇవ్వడానికి రాకూడదని కోరారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహానగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవా రం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖా స్తులు స్వీకరిస్తామని, అవకాశాన్ని నగర ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్మిక శాఖ గుర్తింపు కార్డుతో ప్రయోజనాలుహన్మకొండ చౌరస్తా: కార్మికశాఖ గుర్తింపు కార్డుతో అనేక ప్రయోజనాలు ఉంటాయి.. ప్రతీ కార్మికులు తప్పనిసరిగా కార్డు తీసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం కాజీపేటకు చెందిన 100 మందికి ఆయన లేబర్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లేబర్ కార్డు ద్వారా కార్మికులకు భద్రత, వారి కుటుంబాలకు అనేక సంక్షేమ ఫలాలు అందుతాయ ని, అర్హులందరికీ కార్డులు అందేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. -
● మృగశిర సందడి
రోహిణి ముగిసి ఆదివారం మృగశిర కార్తె ప్రారంభమైంది. మృగశిర ప్రారంభం రోజు చేపలు తినడం వల్ల వానాకాలంలో వచ్చే వ్యాధులు దూరమవుతాయని, గుండె జబ్బులు, అస్తమా వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందనేది ప్రజల నమ్మకం. ఈనేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నగరంలోని ప్రధాన రోడ్ల వెంట చేపల విక్రయాలు జోరుగా సాగాయి. కొర్రమీను, రోహు, కట్ల, రవ్వ, బొమ్మె చేపలను ఎక్కువ మంది కొనుక్కుని వెళ్లారు. కొందరు ఏపీ నుంచి రొయ్యలు, ఇతర రకాల చేపలను ఆర్డర్పై తెప్పించుకున్నారు. కాగా.. చేపలు తిననివారు ఇంగువను చిన్న ముద్దలుగా చేసి మింగారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, హనుమకొండ -
రెస్కూ ్య.. సెవెన్ అవర్స్!
7 గంటల్లో ఇలా.. ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహుల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్, 11.16 గంటలకు రామ్చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్ఐ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం ● తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు ● మృతులందరివీ సాధారణ కూలీ కుటుంబాలే ● తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు ● ప్రాణాలు తీసిన ఈత సరదా.. సెల్ఫీలపై ఆసక్తి! -
వరంగల్
సోమవారం శ్రీ 9 శ్రీ జూన్ శ్రీ 2025ఇందిరమ్మ ఇళ్లు.. శ్లాబ్లు పడేదెప్పుడు! ఇందిరమ్మ లబ్ధిదారుల తుది జాబితా కొలిక్కిరాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపంతో లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం అవుతుంది.– 8లోuఅస్తవ్యస్తంగా గ్రేటర్ వరంగల్ పరిపాలన ● ఉన్నవారిపై పెరుగుతున్న పనిభారం ● కొరవడిన పర్యవేక్షణ.. అభివృద్ధి పనుల్లో లోపిస్తున్న నాణ్యత ● కట్టుతప్పుతున్న కట్టడాలువరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ను అధికారుల కొరత వేధిస్తోంది. కీలక విభాగాల్లో అధిపతులు లేకపోవడం.. పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగరాభివృద్ధికి అత్యంత కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండటం, మరికొందరు అధికారులకు అదనపు బాధ్యతలను అప్పగించడంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యమవుతోంది. అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు చాలా విషయాల్లో చొరవ తీసుకోకుండా దాట వేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో పరిపాలన గాడి తప్పుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా గ్రేటర్ వరంగల్కు గుర్తింపు ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం 8,19,469 మంది జనాభా ఉండగా, ప్రస్తుతం 12లక్షల పైచిలుకు పెరిగినట్లు అంచనా. కొత్త కాలనీలు వెలుస్తుండడంతో జనాభా రెట్టింపవుతోంది. నగరం రోజు రోజుకూ వ్యాపార, వాణిజ్య రంగాల్లో దూసుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడే వరుసగా వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే, మన వార్డు–మన ప్రణాళిక, ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డుల తదితర పథకాల దరఖాస్తుల స్వీకరణ, సర్వే, సంక్షేమ పథకాల పంపిణీ పనుల్లో అధికారులు, సిబ్బంది బిజీబిజీగా ఉంటున్నారు. దీంతో బల్దియా ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో నగర ప్రజలకు సకాలంలో సేవలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో నగర అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషించే నగర పాలక సంస్థ వింగ్ అధికారుల కొరతతోపాటు సరిపడా క్షేత్రస్థాయి సిబ్బంది లేమితో నగర పరిపాలన నత్తనడకన కొనసాగుతోంది. రెండు ఎస్ఈల పోస్టు ఖాళీ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి కావాలన్నా, తాగునీటి సరఫరా సవ్యంగా సాగాలన్నా ఎస్ఈ అవసరం. ఒక ఎస్ఈ 8 నెలల కిందట బదిలీపై వెళ్లారు. మరో ఎస్ఈ గత నెల 31న ఉద్యోగ విరమణ పొందారు. దీంతో ఈఈ శ్రీనివాస్కు ఇన్చార్జ్ ఎస్ఈగా బాధ్యతలు ఇచ్చారు. ఆయన కూడా రెండు నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎస్ఈ పోస్టులకు దిక్కుమొక్కు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏఈల కొరత బల్దియాను వెంటాడుతోంది. ఒక్కొకరికి రెట్టింపు డివిజన్లను కట్టబెట్టారు. పెరిగిన నగర విస్తీర్ణం దృష్ట్యా 25 మంది ఏఈలు ఉండాలి. కానీ, అరకొర మందితో నెట్టుకొస్తున్నారు. వెరసి అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు కరువై మూణ్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. దీంతో ప్రజాధనం పక్కదారి పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ కమిషనర్ పోస్టులు ఖాళీలు: కీలకమైన మూడు విభాగాల్లో డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. అందులో కాశిబుగ్గ డిప్యూటీ కమిషనర్ ప్రసునారాణికి కొత్తగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీకి, కాజీపేట డిప్యూటీ కమిషనర్కు స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీకి ఇన్చార్జ్ కమిషనర్లుగా నియమించారు. ఇలా అదనపు బాధ్యతలతో అధికారులు తమ కొలువులకు న్యాయం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులు చొరవ తీసుకుని పూర్తిస్థాయిలో అధికారులను నియమించాలని నగరవాసులు కోరుతున్నారు. న్యూస్రీల్సిటీ ప్లానర్ పోస్టు ఖాళీ.. నగర అభివృద్ధిలో కీలక విభాగమైన పట్టణ ప్రణాళిక సిటీ ప్లానర్ పోస్టు తొమ్మిది నెలలుగా ఖాళీగా ఉంది. డిప్యూటీ సిటీ ప్లానర్ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. రెండు డీసీపీ పోస్టులు, మరో రెండు ఏసీపీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతేకాక 25 మంది బిల్డింగ్ ఇన్స్పెక్టర్లకుగాను కేవలం 15 మందితో నడుస్తోంది. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిది. క్షేత్రస్థాయి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు తక్కువ మంది ఉండడంతో ఉన్న వాళ్లకే ఎనిమిది డివిజన్లు, విలీనగ్రామాల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. అంతేకాక ఉన్న వారిలో సగం మందికి పైగా జిల్లాలోని మునిసిపాలిటీలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు లేకపోవడంతో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ఇళ్లనిర్మాణాలకు అనుమతులు సకాలంలో ఇవ్వలేకపోతున్నారు. -
సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం
నర్సంపేట/ దుగ్గొండి/ఖానాపురం: ప్రజాప్రభుత్వం ద్వారానే పేదల సొంతింటి కల నెరవేరుతుందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నా రు. నర్సంపేట పట్టణంలోని పలు వార్డులు, చెన్నారావుపేట మండలం కేంద్రంతోపాటు అక్కల్చెడ(కట్టాయపల్లి), దుగ్గొండి మండలంలోని వెంకటాపు రం, రేబల్లె, ఖానాపురం మండలంలోని బండమీదిమామిడితండాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్ల కు ఎమ్మెల్యే మాధవరెడ్డి ఆదివారం భూమి పూజలు చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి మా ట్లాడుతూ రాష్ట్రంలో దశాబ్ధ కాలం తర్వాత నివాసం లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం, ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం హర్షనీ యం అన్నారు. గత ప్రభుత్వ పాలకుల నిర్వాకం వల్ల ధనిక రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నా రు. గత పాలకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్రూం కూడా నిర్మించలేక పోయారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తున్నట్లు చెప్పారు. అర్హులైన లబ్ధిదారులు ఇళ్లు రాలేదని బాధపడాల్సిన అవస రం లేదని, త్వరలోనే అర్హులైన వారందరికీ ఇందిర మ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హౌసింగ్ డీఈ విష్ణువర్ధన్, నర్సంపేట మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బాబు, రాజేశ్వర్రావు, రామారావు, రామానంద్, హరిబాబు, జగన్మోహన్రెడ్డి, ఎంపీడీఓ సునీల్కుమార్, వెంకటప్రసాదరావు, రాజేందర్, సాంబయ్యగౌడ్, విజయ్కుమార్, నరేందర్, యాకుబ్రెడ్డి, రజనీభారతి, సందీప్, రవికుమార్ పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ముందుగా సాగుచేస్తే అధిక దిగుబడి
ఖిలా వరంగల్: వరి పంటను ముందుగా సాగు చేయడం వల్ల తెగుళ్లు, చీడపీడల ప్రభావం తగ్గి అధిక దిగుబడి వస్తుందని అదనపు కలెక్టర్ సంధ్యారాణి సూచించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర సందర్భంగా ఆదివారం నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామంలో మామునూ రు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర, శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులు అమలు, కేంద్ర ప్రయోజిత పథకాల ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయాన్ని పోత్సహిస్తూ, రసాయన ఎరువులు, పురుగు ముందుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం వంటి అనుబంధ రంగా లపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. అనంతరం మెట్ట పంటల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. బీడు భూముల్లో సాగు చేయదగిన పంటలు, నీరు తక్కు వ ఉన్న భూముల్లో నీటి కుంటల ప్రాముఖ్యత, డ్రిప్, స్పింక్లర్ సేద్యం ద్వారా నీటి సమర్ధవంతమైన వినియోగం గురించి వివరించారు. అధిక నీటిని వినియోగించే వరి పంటకు బదులుగా ప్రత్యామ్నా య పంటలు ఎంచుకోవాలని సూచించారు. జిల్లా వ్యసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులు, అధిక దిగుబడి రకాల వివరాలతోపాటు, శాశ్వ త సాగు కోసం రైతులు వ్యవస్థాత్మకంగా ప్రణాళిక చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకన్న, డాక్టర్ వీరన్న, ఏడీఏ దామోదర్రెడ్డి, వ్యవసాయాధికారి కృష్ణకుమార్, వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి -
‘మూడో మంత్రి’పై ఆశలు ఆవిరి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఓరుగల్లు నేతలకు ఆదివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో మూడో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసిన సీనియర్ల ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించింది. బీసీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్కలకు రేవంత్రెడ్డి కేబినేట్లో స్థానం దక్కింది. సుమారు 16 నెలల తర్వాత మళ్లీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మూడో మంత్రి కోసం పలువురు సీనియర్లు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. ఆశావహులకు నిరాశ మంత్రివర్గ విస్తరణ చాలా కాలం నుంచి వాయిదా పడుతుండగా.. చివరకు శుక్రవారం పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. దీంతో మంత్రివర్గంలో చోటు కోసం ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్.. ఇలా ఎవరికి తోచిన దారిలో వారు అగ్రనేతలతో ప్రయత్నాలు చేశారన్న ప్రచారం ఉంది. ప్రధానంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి ఈసారి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జరిగింది. 2014లో టికెట్ దక్కకున్నా ఇండిపెండెంట్గా గెలుపొందిన మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చారు. 2023లో కాంగ్రెస్ టికెట్పైన గెలిచిన ఈయనకు మొదటి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఉంటుందని ఆశించినా జరగలేదు. ఈసారి కూడా తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని కోరినా దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత, మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీని వదలకుండా ఉన్న తనకు కూడా అవకాశం ఇవ్వాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి పార్టీ పెద్దలకు తన వాయిస్ వినిపించారు. మాజీ ఐపీఎస్ అధికారి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఎస్సీ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని అడిగినట్లు ప్రచారం. అయితే ఉమ్మడి వరంగల్ నుంచి ఆశించిన ఎవరికీ అమాత్యపదవి దక్కక పోవడం కొంత నిరాశ పర్చింది. అమాత్యుల శాఖలు పదిలం మంత్రివర్గ విస్తరణలో ఈసారి కనీసం నలుగురి అవకాశం ఉంటుందని భావించినా.. ముగ్గురికే అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి కోసం ప్రయత్నించిన మరో ఎమ్మెల్యే, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్కు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రానున్న కాలంలో తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తామని ఆయనకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్రెడ్డి డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టినట్లు సమాచారం. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా విస్తరణ సందర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు చెందిన శాఖల మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరిగింది. ప్రస్తుతం మంత్రి సీతక్క పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి(గ్రామీణ నీటిసరఫరా సహా), మహిళా శిశుసంక్షేమ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండా సురేఖ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన మంత్రులకు ఆదివారం రాత్రి వరకు శాఖలు కేటాయించలేదు. అలాగే ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రుల శాఖల్లో కూడా మార్పులు చేర్పులు జరగలేదు. దీంతో మంత్రుల శాఖలు మారతాయనేది ఉత్త ప్రచారమని తేలిపోయింది.ఫలించని ఓరుగల్లు సీనియర్ నేతల ప్రయత్నాలు డిప్యూటీ స్పీకర్తోనే సరిపెట్టిన పార్టీ అధిష్టానం విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా రామచంద్రునాయక్ శాఖలను పదిలం చేసుకున్న మహిళా మంత్రులు ఊహాగానాలకు తెర దింపిన హైకమాండ్ -
సైకోల వీరంగం
గీసుకొండ: మండలంలోని పలు గ్రామాల్లో సైకోలు ప్రవేశించి వీరంగం సృష్టిస్తున్నారు. ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో పని కోసం వచ్చిన ఓ వ్యక్తి గీసుకొండ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలోకి వెళ్లి పడుకున్నాడు. గమనించిన ఇంటి కుటుంబ సభ్యులు అతడిని బయటకు పంపించడానికి ప్రయత్నించగా వారిపై దాడి చేయబోయాడు. కొద్ది రోజుల క్రితం రాంపురం గ్రామానికి వెళ్లిన ఓ వ్యక్తి హిందీలో మాట్లాడుతూ పిచ్చిగా ప్రవర్తిస్తూ గ్రామస్తులపై దాడికి యత్నించాడు. స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మండల పరిధిలోని టెక్స్టైల్ పార్కు, గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతాల్లో పని చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు మద్యం, గుట్కా, ఇతర మత్తు పదార్ధాలకు బానిసలై సైకోలుగా ప్రవర్తి స్తున్నట్లు తెలుస్తోంది. అలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ‘కాల్పుల విరమణపై మోదీ వివరణ ఇవ్వాలి’నర్సంపేట: భారత్, పాక్లకు వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పి కాల్పుల విరమణకు ఒప్పించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనలపై ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య అన్నారు. ఈ మేరకు పట్టణంలోని గ్రీన్ రిసార్ట్లో ఆదివారం నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతుల్లో సీహెచ్.రంగయ్య మాట్లాడారు. ట్రంప్ జోక్యంతో కాల్పుల విరమణ జరగడంపై దేశ ప్రజలు అవమానంగా భావిస్తున్నారన్నారు. ట్రంప్ వ్యాఖ్య లను ప్రధాని మోదీ ఖండించకపోవడం సందేహాలకు తావిస్తోందని తెలిపారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడి విషయంలో రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ సింధూర్ విషయంలో మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. పహల్గాంలోపై ప్రధాని పార్లమెంట్ సమావేశం నిర్వహించి ఎంపీల అభిప్రాయాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశా రు. ప్రపంచంలోనే భారత్ నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థగా ప్రధాని మోదీ నీతి అయోగ్ సమావేశంలో చెప్పడాన్ని తప్పు ప ట్టారు. ఆపరేషన్ కగార్ను కొనసాగించడం దా రుణం అన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ నెరవేర్చాల్సిందేనన్నారు. కార్యక్రమంలో బాబు, బాబు, కుమారస్వామి, సమ్మయ్య, స్వామి, కుమార్, శ్రీధర్, బషీర్, సాంబయ్య, దుర్గయ్య, ప్రశాంత్ పాల్గొన్నారు. భద్రకాళి ఆలయంలో చండీహోమం హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో ఆదివారం ఉద యం అర్చకులు చండీహోమం నిర్వహించారు. అమెరికా దేశం డల్లాస్లో స్థిరపడిన ఎన్ఆర్ఐ రేవతి గత శనివారం 53 గ్రాములు, 57 గ్రాముల కలిగిన రెండు బంగారు కాసు ల హారాలను కానుకగా శ్రీభద్రకాళి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా రేవతి దంపతులు ఆదివారం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి చండీహోమంలో పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. 11 నుంచి బీపీఈడీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి బీపీఈడీ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13, 16, 18 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. నేటి ప్రజావాణి రద్దు న్యూశాయంపేట : కలెక్టరేట్లో సోమవారం (నేడు) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాలతో రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రెస్కూ ్య.. సెవెన్ అవర్స్!
కాళేశ్వరం: సమీప బంధువు వివాహ వేడుకలకు హాజరై.. సరదా కోసం ఈతకు వెళ్లి గల్లంతైన ఆరుగురు విద్యార్థుల మృతదేహాలను ఏడు గంటల పాటు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్లో వివిధ బృందాల గాలింపుతో పోలీసులు త్వరగా కనుగొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోవివాహ వేడుకలు ముగిసిన తర్వాత సమీపంలోని మేడిగడ్డ బ్యారేజీ చూద్దామని సరదాగా శనివారం సాయంత్రం ఆరు గంటలకు సొంత ఆటోలో పట్టి వెంకట్స్వామి అతడి ఇద్దరు కుమారులు, మరో ఐదుగురితో కలిసి వెళ్లారు. మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ అప్స్ట్రీమ్ మూడో బ్లాక్ వద్ద గోదావరి లోతు ప్రాంతంలో ఈతకు దిగిన ఏడుగురిలో ఆరుగురు గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. అన్నీ కూలీ కుటుంబాలే.. అంబట్పల్లికి చెందిన పట్టి వెంకట్స్వామి–యశోద దంపతులకు ఇద్దరు కుమారులు పట్టి మధుసూదన్(18) డిగ్రీ, చిన్నకుమారుడు పట్టి శివమనోజ్(15) (పదో తరగతి పూర్తి), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ.. వ్యవసాయ కూలీగా జీవిస్తున్నాడు. ఇద్దరు కుమారులు కళ్ల ముందే నీటిలో మునిగి కొట్టుకుపోతుండగా రక్షించే ప్రయత్నం చేసినా ఫలించకపోవడంతో ఇద్దరు మృతిచెందారు. పిల్లల చెప్పులు, బెల్టులు పట్టుకొని తండ్రి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కవలల్లో ఒకరు మృతి అంబట్పల్లికి చెందిన సమ్మయ్యకు కుమారుడు కర్ణాల సాగర్(16), స్రవంతి కవలలు. వారిద్దరూ ఇంటర్ చదువుతున్నారు. సాగర్ మృతి చెందడంతో సోదరి కన్నీటి ధారలతో వీడ్కోలు పలికింది. వారిదీ కూలీ కుటుంబమే. కొడుకు మరణంతో.. మల్హర్ మండలం మల్లారానికి చెందిన తొగరి రాజయ్య–సాంబ దంపతుల కుమారుడు తొగరి రక్షిత్(13) 9వ తరగతి చదువుతున్నాడు. వారు అంబట్పల్లిలోనే నివాసం ఉంటున్నారు. కూలీ పని చేస్తూ జీవించే వీరికి కుమార్తె కూడా ఉంది. రక్షిత్ మృత్యువాత పడడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి సాంబ రోదనలు మిన్నంటాయి. వివాహ వేడుకలకు వచ్చి.. మహాముత్తారం మండలం స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల శ్రీనివాస్–లక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు రాహుల్(19) డిగ్రీ చదువుతున్నాడు. వివాహ వేడుకలకు వచ్చి రాహుల్ మృతిచెందడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. వారు కూడా కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడి మృతితో.. మహాముత్తారం మండలం కొర్లకుంటకు చెందిన బొల్లెడ్ల వెంకటయ్య–స్వర్ణ దంపతుల పెద్ద కుమారుడు రామ్చరణ్(17) డిగ్రీ చదువుతున్నాడు. వీరు వ్యవసాయ కూలీలు.. వారికి చిన్న కుమారుడు ఉన్నాడు. రామ్చరణ్ మృతిచెందడంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది. అన్నా.. అంటూ నీటిలోకి.. పట్టి వెంకట్స్వామి చిన్న కుమారుడు శివమనోజ్ నీటిలోకి దిగి అన్నా..అన్నా అని పిలుస్తూ లోతుకు జారుకుంటున్నాడు. ఆక్రమంలో ఒడ్డున ఉన్న అన్న మధుసూదన్ తమ్ముడిని పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నం చేసి అతడు కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో పట్టి మధుసూదన్ను కాపాడే ప్రయత్నంలో పట్టి శివమణి(18) కూడా నీటిలోకి దిగి చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డాడు. సెల్ఫీలతోనే.. ఈతకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగారు. ఆ క్రమంలోనే జారి లోతు ప్రవాహంలో పడినట్లు తెలిసింది. దీంతో ఒకరిని కాపాడే క్రమంలో మరొకరు అంతా గల్లంతై మృత్యువాత పడ్డారని తెలిసింది. ముమ్మర గాలింపు.. ఆదివారం తెల్లవారుజామున ఉదయం 5 నుంచి 12 గంటల వరకు రెస్క్యూ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. భూపాలపల్లి ఏఎస్పీ నరేష్కుమార్, కాటారం డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, ఎస్డీఆర్ఎఫ్ డీఎస్పీ వేణుగోపాల్రెడ్డి, డీడీఆర్ఎఫ్, ఫైర్, స్థానిక, సిరొంచ జాలర్లు, సింగరేణి రెస్క్యూ టీంలు స్పీడ్ బోట్లు, నాటు పడవల సాయంతో ముమ్మరంగా గాలించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో ఆరుగురి మృతదేహాలు వెలికి తీశారు. అంబులెన్స్ల ద్వారా మహదేవపూర్ సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతుల కుటుంబాలకు అప్పగించారు. ఆస్పత్రి ప్రాంగణమంతా ఆర్తనాదాలతో మార్మోగింది. రాత్రి ఫలించని రెస్క్యూ ఆపరేషన్.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఘటన జరగడంతో హుటాహుటిన కదిలిన అధికారులు లైటింగ్ ఏర్పాటు చేసి కొంతమేర లోతుకు వెళ్లి పరిశీలించి రాత్రి 11.50గంటలకు వరకు వేచి చూసి నిలిపి వేశారు. శనివారం గోదావరి ప్రవాహం 5,100 క్యూసెక్కులు ఉండగా, ఆదివారం 4,500 క్యూసెక్కులకు తగ్గింది. రూ.10లక్షలు పరిహారం చెల్లించాలి : మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలను మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరిశీలించారు. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి వదిలేశారని, నీటిని నిల్వ చేసి కాపలా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. ఆరుగురు మృతి ఘటనకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబే కారణమని ఆరోపించారు. ఆరుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యం తెల్లవారుజామున 5 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలింపు మృతులందరివీ సాధారణ కూలీ కుటుంబాలే తల్లిదండ్రుల రోదనలతో దద్దరిల్లిన బ్యారేజీ పరిసర ప్రాంతాలు ప్రాణాలు తీసిన ఈత సరదా.. సెల్ఫీలపై ఆసక్తి!7 గంటల్లో ఇలా.. ఆదివారం ఉదయం 5గంటలకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. మొదట 5.41 గంటలకు తొగరి రక్షిత్, 6.50 గంటలకు పసుల రాహుల్, 9.45 గంటలకు కర్ణాల సాగర్, 10.07 గంటలకు మధుసూదన్, 11.16 గంటలకు రామ్చరణ్, 11.45 గంటలకు శివమనోజ్ మృతదేహాలను వెలికితీశారు. ఏఎస్పీ నరేశ్కుమార్, డీఎస్పీ రామ్మోహన్రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సైలు పవన్కుమార్ పర్యవేక్షించారు. మృతదేహాలను అదనపు కలెక్టర్ అశోక్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట డీటీ కృష్ణ, ఆర్ఐ జగన్మోహన్రెడ్డి, ఇరిగేషన్ డీఈ సురేశ్ ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలి..
హన్మకొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని గృహ నిర్మాణ సంస్థ హనుమకొండ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ధరావత్ రవీందర్ సూచించారు. రెండు రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయని, జిల్లాలోని లబ్ధిదా రులు 9వ తేదీలోపు ముగ్గులు పోసుకుని పనులు ప్రారంభించాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. లబ్ధిదారులు సామూహికంగా ముగ్గులు పోసుకోవాలని ఈమేరకు కలెక్టర్ ఆదేశించినట్లు ఆయన వివరించారు. రుణం పేరిట వేధింపులుకాజీపేట: కాజీపేట పట్టణంలోని కొంతమందికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేసి రుణం చెల్లించాలని బెదిరిస్తున్నారు. రుణ యాప్లో లోన్ తీసుకున్న వ్యక్తికి మీరు వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారని.. తిరిగి చెల్లించాలంటూ బెదిరిస్తున్నారు. ‘దాదారి శశిధర్ అనే యువకుడు ఐడీఎఫ్సీ బ్యాంకులో రుణం తీసుకున్నారు. దానికి మీరు షూరిటీ పెట్టినందున లోన్ మొత్తం కట్టాలి’ అంటూ బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గబ్బెట శ్రీనివాస్తో పాటు మరో ఇద్దరికి వరుసగా 81849–56121 నంబరు నుంచి ఫోన్లు వస్తున్నాయి. తాము ఎవరికీ షూరిటీ పడలేదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా కాల్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ చేసిన వ్యక్తులు తెలుగులోనే మాట్లాడుతున్నారు. ఎదుటి వారు చెప్పింది కూడా వినకుండా ఇష్టారితీన మాట్లాడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. లేదంటే తమ వద్ద ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరిస్తున్నట్లు చెబుతున్నారు. లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితులంతా శశిధర్ ఇంటికి వెళ్లగా.. తనకు ఎవరూ తెలియదని, ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగం కావొచ్చని శశిధర్ వాపోయాడు. అందరూ కలిసి శనివారం కాజీపేట పోలీస్ స్టేషన్కు వెళ్లి తమను గుర్తు తెలియని వ్యక్తులు వేధిస్తున్నట్లుగా ఫిర్యాదు చేశారు. ఘ టనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంటింటి సర్వేలో టీచర్లువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ‘బడిబాట’ కార్యక్రమంలో భాగంగా.. రెండో రోజు శనివారం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. అలాగే.. ఇంటింటి సర్వే నిర్వహించారు. జిల్లాలోని ఉపాధ్యాయులు తమ పాఠశాల గ్రామ పరిధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించారు. బడీడు పిల్లల వివరాలు సేకరిస్తున్నారు. వారి వయస్సుకు తగిన తరగతిలో చేర్పించేలా తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. అర్ధంతరంగా బడి మానేసిన విద్యార్థులుంటే వారి వివరాలు సేకరించి ఓపెన్ స్కూల్లో నమోదు చేయించాలని సూచిస్తున్నారు. జిల్లాలో 372 పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఇంటింటి సర్వేలో భాగస్వాములైనట్లు జిల్లా విద్యాశాఖ కమ్యునిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో బడిబాట కా ర్యక్రమంలో భాగంగా.. ఇంటింటి ప్రచారం, సర్వే నిర్వహించారు. ‘స్పోకెన్ ఇంగ్లిష్’ తరగతులను వినియోగించుకోవాలి..కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించనున్న స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులను వినియోగించుకోవాలని సెల్ట్ (సెంటర్ ఫర్ లాంగ్వేజ్ ఫర్ ఇంగ్లిష్ టీచింగ్) డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు శనివారం ఒక ప్రకటనలో కోరారు. సెల్ట్ ఆధ్వర్యంలో ఆరువారాల స్పోకెన్ ఇంగ్లిష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై విశ్వవిద్యాలయంలోని ఇంగ్లిష్ విభాగంలో తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ మేఘనారావు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు, గృహిణులు, బోధన, బోధనేతర ఉద్యోగులు ఈనెల 14 తేదీ వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. వర్సిటీ విద్యార్థులకు ఫీజు రూ.1,000, బయటివారికి రూ.1,500 ఉంటుందని, ఫీజును యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ నాన్ యూనివర్సిటీ ఫండ్ ఖాతాలో చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈనెల 16 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఆసక్తి ఉన్న వారు వినియోగించుకోవాలని కోరారు. ఐలోని మల్లన్నకు వరంగల్ కలెక్టర్ పూజలుఐనవోలు: ఐనవోలు మల్లికార్జునస్వామిని వరంగల్ కలెక్టర్ సత్యశారద దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్ సత్యశారద దంపతులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ముఖ్య అర్చకుడు ఐనవోలు మధుకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
నదీతీరం.. శోకసంద్రం
కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విష యం తెలియక మోకాళ్ల లోతు నీటిలో ఆడుకుంటుండగా.. ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతడిని కాపాడబోయి మరొ కరు.. ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడో బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాదం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. రాత్రి 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ‘ఆపద మిత్ర’ గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండడంతో రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపేశారు. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా.. కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండడం స్థానికులను కలచివేసింది. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11:50 వరకు సాగిన గాలింపు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదం నేను సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తర్వాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేను భయపడి ఒడ్డుకు చేరుకున్నా. -
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
ఎల్కతుర్తి: రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని కేవీకే ప్రధాన శాస్త్రవేత డాక్టర్ శ్రీధర్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో ‘వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఖరీఫ్కు సంబంధించి వ్యవసాయం, పాడి పశువులపై అవగాహన కల్పించారు. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి చర్చించి వాటిని వినియోగించుకోవాలని కోరారు. రైతులు ఒక పంటకు బదులు వివిధ రకాల పంటలను సాగు చేయడం ద్వారా నేలసారాన్ని కాపాడుకోవచ్చన్నారు. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు వివిధ రకాల నూనె గింజల పంటలు ఆముదం, నువ్వులు, కుసుమ, పప్పు దినుసులు వంటి పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. సస్యరక్షణకు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రిక రకాలను వినియోగించడం ద్వారా నాణ్యమైన దిగుబడి సాధించవచ్చన్నారు. పశువైద్య శాస్త్రవేత్త డాక్టర్ సాయికిరణ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న పథకాలను రైతులకు వివరించారు. రైతులు అడిగిన సమస్యలకు శాస్త్రవేత్తల బృందం సలహాలు, సూచనలు అందించింది. అనంతరం మండలంలో సాగు చేసిన ఆయిల్ ఫాం తోటలను సందర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ ఇండోరియా, సాయిచంద్, ఏఓ రాజ్కుమార్, ఏఈఓలు పూర్ణచందర్, బాబు తదితర రైతులు పాల్గొన్నారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ -
డైవర్లకు త్వరలోనే శిక్షణ
విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రవాణాశాఖ నిబంధనల మేరకు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తున్నాం. వందశాతం ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యేలా చూస్తాం. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నాం. పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు డ్రైవర్లకు త్వరలోనే నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. – గాదె స్వరూప్రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు
‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్ఇవీ నిబంధనలు..● 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. ● విద్యా సంస్థ పేరు, సెల్ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ● ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. ● డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి. ● ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి. ● ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. ● కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ● ఫుట్బోర్డ్పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి. ● 1,820కి ఇప్పటివరకు పూర్తి చేసుకుంది 887 ● పరీక్షలు చేసుకోవాల్సింది 917.. ● ఫిట్నెస్ తనిఖీలకు రాని వందల బస్సులు ● ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంతో చర్చ ● స్పెషల్ డ్రైవ్లకు సిద్ధమవుతున్న ఆర్టీఏ అధికారులుబడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు కోరారు. ఇలా చేస్తే మంచిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా..జిల్లా.. మొత్తం ఫిట్నెస్ చేయించు బస్సులు చేసుకున్నవి కోవాల్సినవివరంగల్ 350 172 178 హనుమకొండ 920 485 435 జనగామ 103 54 49 భూపాలపల్లి 130 58 72 ములుగు 95 46 49 మహబూబాబాద్ 222 48 134 మొత్తం 1,820 863 917 (917 బస్సుల్లో 225 బస్సులను వివిధ కారణాలతో తిరస్కరించారు) -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలుబక్రీద్ పండుగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పేదలకు ఖుర్బానీ ఇచ్చారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. హనుమకొండ బొక్కలగడ్డ ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య పాల్గొన్నారు. బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈద్గాలను సీపీ సన్ప్రీత్సింగ్ సందర్శించి శాంతిభద్రతలను పర్యవేక్షించారు. – మరిన్ని వివరాలు, ఫొటోలు: 9లో -
వరంగల్ నగరంలో మరో విద్యార్థి
మృతుడు నెక్కొండ వాసి హసన్పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేశ్ నగరంలోని అతిథి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేశ్, సాయి కిరణ్తో కలిసి గణేశ్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుతూ ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేశ్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేశ్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
లక్ష్మీనర్సింహస్వామికి కలెక్టర్ పూజలు
గీసుకొండ: మండల పరిధిలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో కలెక్టర్ సత్యశారద తన భర్త, కూతురుతో కలిసి వచ్చి శనివారం పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కలెక్టర్ను అర్చకులు కోరగా దేవాదాయశాఖ మంత్రిని కోరాలని కలెక్టర్ సలహా ఇచ్చినట్లు అర్చకులు తెలిపారు. ఈవో అద్దంకి నాగేశ్వర్రావు, వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు రామాచారి, విష్ణు, ఫణి , కాంగ్రెస్ నాయకుడు వీరాటి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఐనవోలు మల్లిఖార్జున స్వామిని కలెక్టర్ దంపతులు దర్శించుకున్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గం నర్సంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. ఈ మేరకు పట్టణంలోని గ్రీన్ రీసార్ట్లో సీపీఎం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు శనివారం రెండో రోజు పార్టీ జిల్లా కార్యదర్శి సీహెచ్.రంగయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలే మార్గం అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు, కులాలు, మతాల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేశాలు రెచ్చగొట్టి పాలన సాగిస్తుందన్నారు. దేశంలో ప్రజల ప్రజాస్వామిక హక్కులు కాలరాసి నియంతృత్వ పాలన తీసుకురావడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను సాగించాలని పిలుపునిచ్చారు. -
చిన్నారికి వైద్యసాయం అందిస్తాం..
నెక్కొండ: పుట్టుకతో మూగ, చెవిటితో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారికి వైద్యసాయం అందిస్తామని వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. మండల పరిధిలోని గొట్లకొండ శివారు సూర్యతండాకు చెందిన నూనావతు శిరీషశ్రీనివాస్ దంపతుల కూతురు లిఖతశ్రీ చెవిటి తనంతో ఇబ్బందులు పడుతోంది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు ఈ నెల 6న సీఎంవో కార్యాలయానికి ఫోన్ చేసి వైద్యసాయం అందించాలని కోరారు. దీంతో సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన సమాచరంతో కలెక్టర్ సత్యశారద స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యాధికారులు సంఘనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేపు హైదరాబాద్లోని ఈఎన్టీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిఫ్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, నెక్కొండ పీహెచ్సీ వైద్యాధికారి సుమన్, ఎంఎల్హెచ్పీ మౌనిక, ఏఎన్ఎం యాకలక్ష్మి, ఆశ వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను వినియోగించుకోవాలి నర్సంపేట: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆర్టీసీ టూర్ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూనలక్ష్మి కోరారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు.భద్రాచలం, పర్ణశాల, కిన్నెరసాని, మల్లూరు, బొగత జలపాతం. కొమురవెళ్లి, వేములవాడ, కొండగట్టు ధర్మపురి, గూడెంగట్టు. నాగార్జునసాగర్, స్వర్ణగిరి, యాదగిరి. పంచరామాలు, అమరావతి, ద్రాక్షారామం, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట విజయవాడ, ద్వారకాతిరుమల, భద్రాచలానికి 40మంది ప్రయాణికులు ఉంటే మీరు కోరుకున్న ప్రదేశాలకు బస్సులను నడుపబడుతుందని తెలిపారు. వివరాలకు 9959226052, 9866373825, 9989038476నంబర్లలో సంప్రదించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి పర్వతగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామస్తులు, తండావాసుల సహకారంతో విద్యార్థుల నమోదును పెంచాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు కోరారు. ఈ మేరకు మండల పరిధిలోని రోళ్లకల్, సాద్యతండా, సోమారం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను శనివారం ఆయన సందర్శించి బడిబాట కార్యక్రమం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మన ఊరిలో ఉన్న బడిని మనమే కాపాడుకోవాలని నాయకులు, అధ్యాపకులకు సూచించారు. అనంతరం మండల పరిధిలోని సోమారం, జమాలపురం గ్రామాలకు చెందిన ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే నాగరాజు సమావేశం ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ ఇళ్లలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టారు. 15 మంది ఎస్సైల బదిలీ హసన్పర్తి: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల్లో విధులు నిర్వహిస్తున్న 15 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ శనివారం కమిషనర్ సన్ప్రీత్ సింగ్ఉత్తర్వులు జారీ చేశారు. రణధీర్రావును వరంగల్ ట్రాఫిక్నుంచి దుగ్గొండి స్టేషన్కు, వెంకటేశ్వర్లును దుగ్గొండినుంచి ఇంతేజార్గంజ్కు బదిలీ చేశారు. సుబేదారి ఈస్ఐ ఎన్.రవికిరణ్ను ఇంతేజార్గంజ్కు, మట్టెవాడ నుంచి ఎస్.విఠలను పరకాలకు, పరకాలలోని సంభాని శివకృష్ణను మట్టెవాడకు, నవీన్కుమార్ను మట్టెవాడనుంచి కేయూసీకి ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా ఆర్.రామారావును కాజీపేట ట్రాఫిక్నుంచి సీఎస్బీ వరంగల్కు, డి.రాజును సీపీటీసీనుంచి వరంగల్ ఏనుమాములకు, వీఆర్ అటాచ్డ్, ఇంతేజార్గంజ్లో ఉన్న చాంద్పాషాను కేయూసీకి, పోస్టింగ్ కోసం వేచిచూస్తున్న బి.శ్రీనివాస్ను మట్టెవాడకు, ఎం.సతీష్ను ఆత్మకూర్కు, శ్రవణ్కుమార్ను వీఆర్ కాజీపేట ట్రాఫిక్కు, బి.జనార్దన్ను సుబేదారికి, నారాయణను హనుమకొండ ట్రాఫిక్కు, సీతారాములును వరంగల్ ట్రాఫిక్కు బదిలీ చేశారు. -
నదీతీరం..శోకసంద్రం
మేడిగడ్డ వద్ద గోదావరిలో ఆరుగురు విద్యార్థుల గల్లంతు కాళేశ్వరం: ఒకటే ఊరు. వారంతా 20 ఏళ్లలోపు విద్యార్థులు. సమీప బంధువులు. అదే గ్రామానికి చెందిన బంధువుల వివాహ వేడుకల్లో విందులు, వినోదాలతో ఆనందంగా గడిపారు. సరదాగా గడుపుదామని కాళేశ్వరం గోదావరి నదికి వెళ్లారు. ఈతరాని వారు ఒడ్డున నీటిలో ఆడలాడుతున్నారు. నది నీటి మట్టం పెరిగిన విషయం తెలియక మోకాల్లోతు నీటిలో ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు లోతులోకి వెళ్లిపోతుండగా అతన్ని కాపాడబోయి మరొకరు.. ఇతన్ని కాపాడబోయి మరొకరు ఇలా ఆరుగురు గల్లంతయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామ సమీపంలోని మేడిగడ్డ ఎగువ భాగంలో మూడవ బ్లాక్ వద్ద శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో విషాధం అలుముకుంది. అర్ధరాత్రి వరకు సాగిన గాలింపు.. సాయంత్రం 6 గంటలకు ఆరుగురు విద్యార్థులు నదిలో మునగగా, సుమారు 8 గంటల సమయంలో స్థానికులు, పోలీసులకు సమాచారం అందింది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమైంది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఆరు రెస్క్యూ బృందాలతోపాటు మహారాష్ట్రలోని సిరొంచకు చెందిన ఆపద మిత్ర గజ ఈతగాళ్ల బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. కాగా రాత్రివేళ కావడం, నదిలో 5,100 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండటంతో గాలింపు చేపట్టడం సాధ్యం కాలేదు. రాత్రి 11.50 గంటలకు గాలింపు చర్యలు ఆపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించనున్నారు. కాగా కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డి గోదావరిలోకి దిగి నది ప్రవాహాన్ని అంచనా వేశారు. ఆదివారం ఉదయం గాలింపు చర్యల కోసం రెస్క్యూ టీం ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. ఐదు కుటుంబాల్లో విషాదం... పెళ్లి వేడుకలను సంతోషంగా గడిపిన ఐదు కుటుంబాల్లో ఒకే రోజులో విషాదం నెలకొంది. పట్టి వెంకటస్వామి ఇద్దరు కుమారులతో పాటు మరో నాలుగు కుటుంబాలకు చెందిన విద్యార్థులు చనిపోవడంతో ఆయా కుటుంబాలతో పాటు పెళ్లింట విషాదం నెలకొంది. బిడ్డల కోసం ఎదురుచూస్తూ... గల్లంతైన ఆరుగురు విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు రాత్రి నుంచి గోదావరి నది ఒడ్డునే ఉండి వేచి చూస్తున్నారు. అధికారులు గాలింపు చర్యలను నిలిపివేసి వెనుదిరిగినప్పటికీ గల్లంతైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉండి రోదించసాగారు. తమ పిల్లలు ప్రాణాలతో బయటకు రాకపోతారా... అని వేచి చూస్తుండటం స్థానికులను కలచివేసింది. అడ్డుకున్నప్పుడు ఆగి ఉంటే.. ఈతకు వెళ్లిన వారిలో అంబట్పల్లి గ్రామానికి చెందిన పట్టి వెంకటస్వామికి కుమారులు మధుసూదన్, శివమనోజ్ కూడా ఉన్నారు. వీరితో పాటు మిగిలిన ఐదుగురు గోదావరి నదిలో స్నానం చేసేందుకు వెళ్తుండగా నదిలో నీటి మట్టం ఎక్కువగా ఉందని, స్నానానికి వెళ్లొద్దని వెంకటస్వామి వారించాడు. అయినా వారు వినకుండా వెళ్తామనడంతో అతను కూడా వెంటవెళ్లాడు. వీరు లోపలికి వెళ్తుండగా వెళ్లొద్దని, వెనక్కి రండని పిలిచాడు. కానీ అప్పటికే లోతులోకి వెళ్లిపోయారు. కళ్లెదుటే మునిగిపోతున్నా వెంకటస్వామిది ఏమీ చేయలేని పరిస్థితి. గల్లంతైన వారు.. అంబట్పల్లి వాసులు: పట్టి మధుసూదన్(18), పట్టి శివమనోజ్(15), తొగరి రక్షిత్(13), కర్ణాల సాగర్(16) మహాముత్తారం మండలం కొర్లకుంట వాసులు: బొల్లెడ్ల రాంచరణ్(17), స్తంభంపల్లి(పీపీ)కి చెందిన పసుల రాహుల్(19) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.50 వరకు సాగిన గాలింపు చర్యలు.. లభించని ఆచూకీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో విషాదంనేనూ సచ్చిపోయేవాడినే: పట్టి శివమణి (ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్న వ్యక్తి) స్నానం చేసేందుకు మొదట నలుగురు దిగారు. తరువాత మరో ఇద్దరు దిగారు. ఒకరి వెనుక ఒకరు నీట మునిగారు. క్షణాల్లోనే అందరూ మునగసాగారు. కన్నుమూసి తెరిచే లోపే ఆరుగురు మునిగిపోయారు. మధుసూదన్ మునిగిపోతుంటే చేయి పట్టుకొని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన నీట మునిగాడు. దీంతో నేనే భయపడి ఒడ్డుకు చేరుకున్నా. -
బడి బస్.. ఫిట్‘లెస్’!
భక్తిశ్రద్ధలతోబక్రీద్ బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకేంద్రంతో పాటు నర్సంపేట, వర్ధన్నపేటతో పాటు తదితర ప్రాంతాల్లోని ఈద్గాల్లో శనివారం ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖిలా వరంగల్ పెట్రోల్బంక్ జంక్షన్లోని ఈద్గాలో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రార్థన చేస్తున్న చిన్నారులు‘పిల్లలున్నారు జాగ్రత్త’ అని బడి బస్సుల వెనకాల రాసి ఉంటుంది. కానీ.. చాలా బస్సుల నిర్వాహకులు మాత్రం.. ఆ విషయాన్నే మరిచిపోతున్నారు. నిబంధనల ప్రకారం.. ఏటా పాఠశాలల ప్రారంభానికి ముందే బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. కానీ.. క్షేత్రస్థాయిలో అవేమీ అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, వరంగల్/ఖిలా వరంగల్ బడి గంట మోగే సమయం ఆసన్నమవుతోంది.. ఇప్పటికే అడ్మిషన్ల బిజీలో ఉన్న పాఠశాలలు బడి బస్సుల భద్రతపై దృష్టి సారించడం లేదు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిట్నెస్ పరీక్షలకు వందలాది బస్సులు దూరంగా ఉండడం తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,820 పాఠశాలల, కాలేజీల బస్సులు ఉన్నా.. ఇప్పటివరకు 863 బస్సులు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికెట్లు పొందాయి. పదిహేనేళ్ల కాల పరిమితి పూర్తి చేసుకున్నా.. వివిధ కారణాల చేత 225 బస్సులను అధికారులు ఫిట్నెస్ చేయకుండా తిరస్కరించారు. ఇంకా మిగిలిన 692 బస్సులకు ఆన్లైన్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్స్ తీసుకోవాలి. మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆయా బస్సులు వచ్చి సాధ్యమైనంత త్వరగా ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆర్టీఏ అధికారులు కోరుతున్నారు. ఫిట్నెస్ పరీక్షల్లో పాసైతే విద్యార్థుల భద్రతకు భరోసా ఉంటుందని చెబుతున్నారు. ‘యాబై రోజులకుపైగా మూసి ఉన్న విద్యా సంస్థలు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇన్నాళ్లూ విద్యార్థులను తరలించే బస్సులు షెడ్డుకే పరిమితమయ్యాయి. వాటి సామర్థ్య పరీక్షల గడువు కూడా మే 15కే ముగిసింది. ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోని బడి బస్సులు వచ్చి త్వరగా చేసుకోవాలి’ అని వరంగల్ ఆర్టీఓ శోభన్బాబు కోరారు. ఇలా చేస్తే మంచిది.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ పరీక్షలను సంబంధిత అధికారులు తూతూ మంత్రంగానే నిర్వహిస్తున్నారు. కనీసం పది నిమిషాలైనా చెక్ చేయకుండానే బస్సులను పంపించేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రం అధికారులు అప్రమత్తమవుతున్నారని.. ప్రమాదాలు జరగకుండా ముందుగానే బస్సుల తనిఖీ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ‘పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి బస్సు ఫిట్నెస్ పకడ్బందీగా చూడాలి. చాలా పాఠశాలలకు ఎక్కువ సంఖ్యలో బస్సులుంటాయి. ఒకటి రెండు బస్సులను చూసే ఫిట్నెస్ అయ్యిందని మమ అనిపించకుండా ప్రతి బస్సును చెక్ చేయాలి. నెల, రెండు నెలలకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి బస్సుల పరిస్థితి డ్రైవర్ల పరిస్థితి చెక్ చేస్తూ ఉండాలి. ఏవైనా లోపాలు ఉంటే ఒత్తిళ్లకు లొంగకుండా బస్సును సీజ్ చేయాలి’ అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. – మరిన్ని ఫొటోలు 11లోuఉమ్మడి వరంగల్ జిల్లాలో పూర్తికాని బడి బస్సుల పరీక్షలు 1,820కి ఇప్పటివరకు పూర్తి చేసుకుంది 887 పరీక్షలు చేసుకోవాల్సింది 917.. ఫిట్నెస్ తనిఖీలకు రాని వందల బస్సులు ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంతో చర్చ స్పెషల్ డ్రైవ్లకు సిద్ధమవుతున్న ఆర్టీఏ అధికారులు ఇవీ నిబంధనలు.. 15 ఏళ్లు నిండిన వాహనాలను స్టూడెంట్స్ రవాణాకు ఉపయోగించకూడదు. స్కూల్ బస్సు పూర్తి కండిషన్లో ఉండాలి. విద్యా సంస్థ పేరు, సెల్ఫోన్ నంబరు, పూర్తి అడ్రస్ బస్సు ఎడమ వైపు, ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాలి. ప్రతీ విద్యాసంస్థ యాజమాన్యం డ్రైవర్ ఆరోగ్య పట్టిక నిర్వహించాలి. డ్రైవర్ షుగర్, బీపీ, కంటిచూపు వంటి ప్రాథమిక పరీక్షలను ప్రతి 3 నెలలకోసారి చేయించాలి. డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. బస్సులో ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. బస్సుకు సంబంధించి వైపర్స్, విండ్ స్క్రీన్, పార్కింగ్ లైట్స్, లైటింగ్ ఉండాలి. ప్రతి బస్సులో మంటలు ఆర్పే పరికరాలు ఉండాలి. డ్రైవర్కు విద్యార్థులు బస్సు ఎక్కడం, దిగడం స్పష్టంగా కన్పించేలా అద్దాలు అమర్చుకోవాలి. ప్రతి బస్సులో అటెండర్ ఉండాలి. బస్సులో ప్రయాణిస్తున్న స్టూడెంట్స్ పట్టిక కూడా ఉండాలి. బస్సులో స్టూడెంట్స్ బ్యాగులు పెట్టుకొనేలా అరలు ఏర్పాటు చేయాలి. కిటికీలకు మధ్యలో లోహపు కడ్డీలు కచ్చితంగా ఉండాలి. ఫుట్బోర్డ్పై మొదటి మెట్టు భూమికి 325 మిల్లీ మీటర్ల ఎత్తు మించకుండా చూడాలి. అన్ని మెట్లు జారకుండా లోహంతో నిర్మించాలి. డైవర్లకు త్వరలోనే శిక్షణవిద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. రవాణాశాఖ నిబంధనల మేరకు ఫిట్నెస్ పరీక్షలు చేయిస్తున్నాం. వందశాతం ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యేలా చూస్తాం. ఐదేళ్ల అనుభవం ఉన్న డ్రైవర్లను నియమిస్తున్నాం. రోడ్డు ప్రమాదాలకు తావులేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నాం. పిల్లలను జాగ్రత్తగా పాఠశాలలకు తీసుకెళ్లి తీసుకొచ్చేందుకు డ్రైవర్లకు త్వరలోనే నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తాం. – గాదె స్వరూప్రెడ్డి, ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడువిస్త్తృత తనిఖీలు చేపడతాం.. విద్యాసంస్థల ప్రారంభంలోగా.. బస్సులన్నింటికీ సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే విస్తృ త తనిఖీలు చేపట్టి పట్టుబడిన వాహనాలు సీజ్ చేస్తాం. జరిమానా విధిస్తాం. ఫిట్నెస్ పరీక్షలకు రాని బస్సులకు సంబంధించి యజమానులకు నోటీసులు పంపిస్తాం. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించాలి. పిల్లల భద్రతపై శ్రద్ధ తీసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – పురుషోత్తం, ఇన్చార్జ్ డీటీసీ, హనుమకొండ -
వరంగల్ నగరంలో మరో విద్యార్థి
మృతుడు నెక్కొండ వాసి హసన్పర్తి: స్నేహితులతో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని రెడ్డిపురం చెరువు వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం టేకులకుంట తండాకు చెందిన తేజావత్ గణేష్ నగరంలోని అతిథి హాస్టల్లో ఉంటూ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అదే హాస్టల్లో ఉంటున్న మాలోతు కార్తీక్, రాకేష్, సాయి కిరణ్తో కలిసి గణేష్ శనివారం రెడ్డిపురం సమీపంలోని చెరువులోకి ఈతకు వెళ్లాడు. నలుగురు చెరువులోకి దిగి ఈతకొట్టడం ప్రారంభించారు. గణేష్ ఈత కొడుకు ముందుకు వెళ్లి మునిగిపోయాడు. గణేష్ మునిగినట్లు గ్రహించిన స్నేహితులు ఈ విషయాన్ని బంధువులు, మిత్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. చెరువులోనుంచి గణేష్ మృతదేహాన్ని వెలికి తీశారు. పంచనామా చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడి తండ్రి తేజావత్ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. -
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
న్యూశాయంపేట: జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ సత్యశారద ఈద్ ఉల్ అజ్హా(బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.కప్పతల్లీ.. వానలు కురిపించు నర్సంపేట రూరల్ : కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లోని రైతులు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు విత్తుకున్నారు. వరుణుడు ముందే కరుణించాడని ఆనందపడిన అన్నదాతల ఆశలు నిరాశలు చేస్తూ వారం రోజులుగా వానలు పడడంలేదు. దీంతో విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వానలు పడాలని కోరుతూ నర్సంపేట మండలంలోని రాములునాయక్తండాకు చెందిన చిన్నారులు, ప్రజలు శుక్రవారం కప్పతల్లి ఆడారు. గ్రామస్తులంతా కప్ప, చిన్నారులపై నీళ్లారబోశారు. వర్షాలు సంవృద్ధిగా కురవాలని ప్రార్థించారు. రెండు కేజీబీవీల్లో ఎంఎల్టీ కోర్సు విద్యారణ్యపురి: జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం (2025–26) కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్) కోర్సును నూతనంగా ప్రవేశపెట్టినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేజీబీవీలో ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల బాలికలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, చెన్నారావుపేట, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం కేజీబీవీల్లో సీఈసీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు. అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీకళాశాలనుంచే పీహెచ్డీ గైడ్షిప్కోసం దరఖాస్తు చేసుకోవాల్సింటుంది. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వీరు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి,రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వరంగల్ బస్స్టేషన్ ఆలస్యంపై అసహనం వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణంలో ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతి, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అదేవిధంగా భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు. -
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
● నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47)శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న అయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లోనూ పాల్గొంటున్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల్లో ఆయనకు మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన ఇంటికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి: రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు పర్వతగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట నిరుపేదలను గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుందన్నారు. మా కుటుంబ సభ్యులు అంతా పుట్టి పెరిగిన నేల పర్వతగిరి అని తెలిపారు. పర్వతగిరి బిడ్డగా తానెప్పుడూ రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం భూ భారతి చట్టంలో అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ సత్యశారదతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య -
బిల్లులు చెల్లించలేదు..
శనిగరం హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతేడాది అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ.6.70 లక్షల నిధులను మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు అడ్వాన్స్గా రూ.2.10 లక్షలు చెల్లించింది. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మైనర్, మేజర్, ఎలకి్ట్రకల్ మరమ్మతు పనులు పూర్తి చేశాం. పనులు పూర్తి చేసి ఏడాది పూర్తయినా నేటికీ బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారుల స్పందించి బిల్లులు అందించాలి. – భాగ్యలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు, నల్లబెల్లి● -
బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విద్యార్థుల పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నా రు. బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్లో శుక్రవా రం విద్యా, సంక్షేమశాఖలు, డీఆర్డీఓ, పంచాయ తీ, కార్మిక, మున్సిపల్, మెప్మా, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన క్యాంపెయిన్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన నివేదికలను సమర్పించాలని ఎంఈఓలను కలెక్టర్ ఆదేశించారు. ఏఐ ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాల్లో 635 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటిలో 135 జీరో నమోదు పాఠశాలలు ఉన్నాయని ఆ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏపీఓ, మెప్మా, ఏపీఎంలు స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీలను గ్రామసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. ఇటుక బట్టీల దగ్గర పనిచేసే పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంతో లాభాలు నర్సంపేట: సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్లో ఉన్న రైతులు వరి పంటను ఒక నెల ఆలస్యంగా వేస్తున్నారని ముందుగా వేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించాలని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. ఈ ప్రాంతంలో 1.8లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజన్న, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కేవీకే, డాక్టర్ తమ్మి రాజు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ, ఏడీఏ దామోదర్, శాస్త్రవేత్తలు రాజు, సతీష్చంద్ర, తహసీల్దార్ ఫణికుమార్, మండల ఏఓ గోపాల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. భూభారతి సదస్సు సందర్శన అమీనాబాద్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సత్యశారద సందర్శించారు. దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నెల 20వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫణికుమార్, నాయబ్ తహసీల్దార్ రజని, గిర్దావర్లు మహ్మద్ రషీద్, మమత, జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ అంజద్ఖాన్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కల్లెపు హరిప్రియ జిల్లాస్థాయి ద్వితీయ బహుమతి, చిత్రలేఖనంలో పోటీల్లో చిలపాక ద్రాక్షాయని ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు తేజావ త్ జయ శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, గైడ్ టీచర్లు గజవెల్లి సుందర్, సంతోష్కుమార్, రాగి శశిధర్, పిన్నింటి బాలాజీరావును అభినందించారు. -
అసంపూర్తిగానే..!
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్లోనే పనులురాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించినా పైపులైన్లు బిగించలేదు. వాటర్ ట్యాంక్లు కూడా అమర్చలేదు. మరుగుదొడ్లకు తలుపులు బిగించలేదు. ఫలితంగా పాఠశాలకు సమీపంలోని బహిరంగ ప్రాంతంలో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు 220 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలల్లో పనులు చకచక చేస్తేనే ఫలితం ఉండనుంది. నర్సంపేట జెడ్పీహెచ్ఎస్ మోడల్ పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. పాత మరుగుదొడ్ల పైన పాత రేకులనే ఉంచి కాస్తా ముస్తాబు చేయగా.. కొత్త మరుగుదొడ్లకు మాత్రం స్లాబ్లు వేశారు. ఒక మరుగుదొడ్డికి తలుపు బిగించడం మరిచిపోయారు. వీటిపైన వాటర్ ట్యాంక్లు బిగించలేదు. నీటి కనెక్షన్ ఇవ్వలేదు. బడి పెయింటింగ్ పనులు పూర్తిస్థాయిలో కాలేదు. వరంగల్ నగరంలోని కృష్ణకాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. వాటర్ ట్యాంక్ అమర్చలేదు. ఈ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. పనులు పూర్తయితే బాలికలకు తిప్పలు తప్పనుంది. పాఠశాల పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెబుతున్నారు. -
రాజ్యాంగం ద్వారానే పేదలకు హక్కులు
సంగెం: రాజ్యాంగం ద్వారానే పేదవర్గాలకు హక్కులు లభిస్తున్నాయని, రాజ్యాంగ ఫలాలను అందరికీ పంచిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే బాబు జగ్జీవన్రామ్ అమలు జరిగేలా చూశాడని కొనియాడారు. ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు దక్కకుండా సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నారనే ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణపై ఒకతాటిపైకి వచ్చాయన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని ప్రధాని మోదీ గుర్తించి అమలు చేశారన్నారు. సాంఘిక, ఆర్థిక రాజకీయ వివక్షతను రూపుమాపడం కోసం భవిష్యత్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ కేవలం మాదిగల కోసం మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడి ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఉద్యోగాలు, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులు సాధించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతాళ్ల రమేష్, మాజీ జెడ్పీటీసీలు గూడ సుదర్శన్రెడ్డి, మనోజ్గౌడ్, మాజీ ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ సర్పంచ్లు సట్ల రాజు, పేరాల రాజు, కొయ్యల ఈశ్వరమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజశేఖర్, డాక్టర్ శరత్, శివ, కుమార్, రాజు, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ఫలాలు పంచిన మహనీయుడు అంబేడ్కర్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
భక్తిభావంతో శాంతి నెలకొంటుంది
నెక్కొండ: భక్తిభావాన్ని పెంపొందించుకొని గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని సూరిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన పెద్దమ్మతల్లి, పెద్దిరాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వారు శుక్రవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు. ముదిరాజ్లు రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నెక్కొండ పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ఆలయం చైర్మన్ దుంది శ్రీనివాస్, నాయకులు కొమ్ము రమేశ్యాదవ్, గుంటుక సోమయ్య, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, తోట సాంబయ్య, దొమ్మటి పురుషోత్తం, మాతంగి రాజు, తదితరులు పాల్గొన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో వెళ్లిన వారు తిరిగి అదే ప్రాంతానికి వెళా ల్సి ఉంటుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో డిప్యుటేషన్పై వచ్చిన ఆయన తిరిగి ఆసిఫాబాద్కు వెళ్తాననే బెంగ పెట్టుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
ప్రహరీ నిర్మాణానికి విరాళాల సేకరణ
పరకాల: అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.2లక్షల నిధులే మంజూరు చేయడంతో పరకాల పట్టణంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణం సాధ్యం కాదని సంబంధిత కాంట్రాక్టర్ గేట్ పిల్లర్లు వేసి చేతులు దులుపుకున్నాడు. దీంతో పాఠశాల ఆవరణలోకి పందులు, పశువులు వస్తున్నాయి. పిల్లలకు, నాటిన మొక్కలకు రక్షణ కరువైంది. విషయాన్ని గమనించిన అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు బొచ్చు చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టగా రూ.50వేల జమయ్యాయి. అయా విరాళాలతో పాఠశాల ప్రహరీ, గేట్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల్లో పనులు ప్రారంభించి..గేట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. -
అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్
కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీ కళాశాల నుంచే పీహెచ్డీ గైడ్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వారు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
భూ భారతితో సమస్యల పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వేలేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలపై తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఏర్పాటుచేసిన భూ భారతి సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీచరలో 234 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోమి, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ హేయనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
‘వరంగల్ బస్స్టేషన్’ ఆలస్యంపై అసహనం
తనిఖీ చేసిన ‘కుడా’చైర్మన్, వైస్ చైర్పర్సన్ వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణం ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అలాగే, భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు. -
ఒంటరి మహిళలే టార్గెట్గా..
కమలాపూర్ : తాళాలు వేసి ఉన్న ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న వంగపల్లికి చెందిన చిలువేరు ప్రశాంత్ (30)ను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కమలాపూర్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ డ్రైవింగ్ వృత్తి చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనికితోడు ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయి అప్పులు చేశాడు. సులువుగా డబ్బులు సంపాదించడానికి తాళం వేసిన ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 30న వంగపల్లిలోని తన తల్లిగారింట్లో ఒంటరిగా ఉన్న గర్భవతి తోట దివ్యపై రాడ్తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అదేవిధంగా తాళం వేసి ఉన్న పసుల రమాదేవి ఇంట్లో 4 తులాలు, కోడెపాక మధుసూదన్ ఇంట్లో తులం బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తాను చోరీ చేసిన బంగారం అమ్మేందుకు వెళ్తూ కమలాపూర్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.4.10 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావు, కానిస్టేబుళ్లు మోహన్, ఉదయ్కుమార్, వెంకటేశ్ను ఏసీపీ అభినందించారు. గర్భిణిపై దాడి చేసి బంగారం లాక్కెళ్లిన నిందితుడి అరెస్ట్ 8 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం -
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
– 10లోuఇటీవల పనులు ప్రారంభం.. ఈ చిత్రంలోని ఫొటోలు చూడండి. హనుమకొండలోని జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరిస్థితి. ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా పలు పనులకు రూ.3.40 లక్షలు మంజూరు చేశారు. అడ్వాన్స్గా రూ.85 వేలు (25శాతం) విడుదల చేశారు. మంజూరీ ఇచ్చి ఐదారునెలలు గడిచినా ఇటీవల పనులు మొదలెట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తయ్యేలా లేవు. ప్రధానంగా టాయ్లెట్స్ రిపేర్, తరగతి గదుల్లో పాలిష్ బండలు వేయాల్సి ఉంది. హ్యాండ్వాష్ దగ్గర పనులు చేయాల్సి ఉంది. విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభంకానున్నాయి. కానీ, వాటిలో చేపట్టిన పనులు కొన్నిచోట్ల పూర్తికాగా, మరికొన్నింటిలో అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకొన్ని అసలు చేపట్టనేలేదు. దీంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యాభాస్యం సాగించాల్సి ఉంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏయే పనులు చేపట్టాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక కొన్నినెలలకే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అందులో ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు మూత్రశాలల రిపేర్లు, తరగతి గదుల్లో మైనర్, మేజర్ మరమ్మతులు చేయాలి. ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. విడుదల చేసే నిధులను పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, హెచ్ఎంల బ్యాంక్ జాయింట్ అకౌంట్(ఏఏపీసీ)లో జమ చేస్తారు. పనులు పూర్తయినా 25శాతం నిధులే.. జిల్లాలో అక్కడక్కడ పనులు పూర్తయినా తొలుత 25శాతం అడ్వాన్స్డ్గా విడుదల చేసిన నిధులేనని, తరువాత రాలేదని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు అంటున్నారు. ఉదాహరణకు హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో మేజర్ రిపేర్, మరుగుదొడ్లు, తాగునీటి పైప్లైన్ మరమ్మతుల పనులకు రూ.10.10 లక్షల వరకు మంజూరు ఇచ్చారు. తొలుత అడ్వాన్స్గా ఇచ్చిన రూ.2.10లక్షలు మాత్రం అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ ద్వారా పనులు చేసినవారికి చెల్లింపులు చేశారు. మిగతా 75శాతం నిధులు (బిల్లులు) రావాల్సి ఉందని సంబంధిత హైస్కూల్ హెచ్ఎం నెహ్రూ తెలిపారు. పనులు చేసినవారు నిరీక్షిస్తున్నారు.. ● హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో వివిధ పనులకు రూ.4.50 లక్షల మంజూరు ఇచ్చారు. తొలుత 25శాతం నిధులు రూ.లక్షా 50వేలు విడుదల చేశారు. మిగతా పనులు పూర్తయ్యాయని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిందని సంబంధిత ఉన్నత పాఠశాల హెచ్ఎం రామారావు తెలిపారు. ● హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పనులు పూర్తయ్యాయి. ఆయా పనులకు అంచనాగా రూ.5.80లక్షలు మంజూరు ఇచ్చారు. మొదట 25శాతం నిధులు మాత్రమే విడుదల అయ్యాయని ఆ హైస్కూల్ హెచ్ఎం ఉమ తెలిపారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ● పరకాల మండలంలోని 24 పాఠశాలలకు 72 పనులకు నిధులు మంజూరయినప్పటికి కేవలం 42 పనులు(మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ మరమ్మతులు, ర్యాంప్లు) పూర్తయ్యాయి. మరో 30 పనులు పెండింగ్లో ఉండఉన్నారు. అధికారులు బిల్లులను పెండింగ్లో పెట్టడంతో కాంట్రాక్టర్లు మరింత మొండిగా వ్యవహరిస్తూ పనులను ఆపేశారు. అయా పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించినప్పటికి పనుల్లో పురోగతి కనిపించలేదు. మళ్లీ కాంట్రాక్టర్లకే పనులు .. ప్రభుత్వం పాఠశాలల్లోని అమ్మ ఆదర్శ కమిటీలకు ఈ మౌలిక సదుపాయాల పనులు అప్పగిస్తే వారికి కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, వివిధ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలోని మహిళా సమాఖ్యలు తమకు సివిల్వర్క్స్ చేయించడంలో అనుభవం లేదని, ముందుగా లక్షలు పెట్టుబడి పెట్టి పనులు చేయాల్సింటుందని ముందుకు రాలేదు. దీంతో అమ్మ ఆదర్శ కమిటీలో తీర్మానం చేయించి హెచ్ఎంలు.. ఇతర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని సమాచారం. అమ్మ ఆదర్శ కమిటీలు చేపట్టనిచోట ఇతరులకు ఇవ్వొచ్చని కూడా నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్నిచోట్ల అమ్మ ఆదర్శ కమిటీల పేరుమీదే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనుభవాల దృష్ట్యా అక్కడక్కడ కాంట్రాక్టర్లు కూడా పాఠశాలల్లో పనులు చేస్తే బిల్లులు వస్తాయా.. రావోననే అనుమానంతో ముందుకురాని పరిస్థితి నెలకొని ఉంది. దీనికితోడు ఇంజనీరింగ్ విభాగం అధికారులు బిల్లులు, ఎంబీ రికార్డులు చేయడంలో కూడా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో వరండాలో వేసిన పాలిష్ బండలున్యూస్రీల్జిల్లాలోని 416 పాఠశాలల్లో .. హనుమకొండ జిల్లాలో మొత్తం 508 పాఠశాలలు ఉండగా, అమ్మ ఆదర్శ పథకంకింద 438 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో 416 పాఠశాలలకు పరిపాలనాపరమైన మంజూరీ ఇచ్చారు. వాటిలో 1238 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.16,98,92,000 వ్యయం అవుతుందని అంచనా వేశారు. పనులు చేపట్టిన ప్రతీ స్కూల్కు తొలుత 25శాతం నిధులు అడ్వాన్స్గా అమ్మ ఆదర్శ కమిటీలు, హెచ్ఎంల జాయింట్ అకౌంట్గా ఉన్న ఏఏపీసీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ విధంగా తొలుత రూ.4.22కోట్లు విడుదల చేశారు. 1,081 పనులు గ్రౌండింగ్ చేశారు. 991 పనులు ఇప్పటివరకు పూర్తిచేశారు. అందులో 870 పనులకు ఎంబీ రికార్డు చేశారు. 784పనులకు ఇప్పటివరకు రూ. 9,39,82,000 బిల్లులు చెల్లించినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో 157 పనులు అసలే చేపట్టలేదని సమాచారం. ఇంకా జిల్లాకు రూ.7.59కోట్ల నిధులు రావాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సింటుంది పనులు మంజూరైన పాఠశాలల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి. – బి.మహేష్, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ ఐదు తరగతులకు రెండే గదులుఆత్మకూరు ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. ఎప్పుడో డిపెప్ పథకంలో నిర్మించిన రెండు గదుల్లో నడిపిస్తున్నాం. 70మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదనపు తరగతి గదులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఇప్పటికై నా గదులు నిర్మించాలి. – పెండెం రాజు, హెచ్ఎం, ఆత్మకూర్ పీఎస్ -
నిధుల లేమి!
‘అమ్మ ఆదర్శం’..సర్కారు పాఠశాలల్లో అసంపూర్తిగా మౌలిక వసతుల పనులు ● జిల్లాలో ఈ పథకం కింద 438 స్కూళ్ల ఎంపిక ● ఇప్పటివరకు 80శాతం పూర్తి.. మిగతా వాటి పరిస్థితి ఏమిటో..? ● రూ 9.39 కోట్ల నిధులు విడుదల.. ఇంకా రావాల్సినవి రూ.7.59 కోట్లు ● పనులు చేసినవారు బిల్లుల కోసం నిరీక్షణ గ్రౌండ్ రిపోర్ట్ -
బోనస్.. మైనస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా బోనస్ పైకం చేరలేదు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. కానీ నెలన్నరగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం సన్నాల బోనస్ ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో కూడా స్పష్టత లేకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 3,66,491 మంది రైతుల నుంచి 22.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించిన ప్రభుత్వం బోనస్ కింద రూ. 1110.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని, ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి వరంగల్కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫొటోలోని రైతు పేరు కట్కూరి జయపాల్రెడ్డి. హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన ఆయన ఏడెకరాల్లో సన్న, దొడ్డు రకం వరి సాగు చేశాడు. రెండున్నర ఎకరాల్లో 57 క్వింటాళ్ల వడ్లు రాగా కొనుగోలు కేంద్రంలో నెల క్రితం విక్రయించాడు. ఆన్లైన్ ప్రొక్యూ ర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బులు ఖాతాలో పడ్డాయి. అయితే ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్నక్వింటాకు రూ. 500 బోనస్ మాత్రం ఇప్పటివరకు పడలేదు. వానాకాలం పనులు మొదలవడంతో ప్రభుత్వం తన బోనస్ డబ్బు రూ. 28,500 ఇస్తే పంట పెట్టుబడులకు పనికొస్తాయని జయపాల్రెడ్డి అంటున్నాడు.బోనస్ డబ్బులు పడలేదు..నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఎకరంన్నరలో సన్న వడ్లు, మూడు ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగు చేశా. సన్నాల దిగుబడి 24 క్వింటాళ్లు వచ్చింది. తినేందుకు 12 క్వింటాళ్లు నిల్వ చేసు కున్నాం. వానాకాలం పెట్టుబడి కోసం మిగిలిన 12 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని 20 రోజుల క్రితం ఐకేపీ సెంటర్లో విక్రయించా. రూ. 500 చొప్పున బోనస్ పడలేదు. ఈ పైసలు వస్తే పెట్టుబడికి ఎవరినీ అడగకుండా ఉంటది. – నీల సంపత్, అబ్దుల్నాగారం, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా -
సన్నబియ్యం పంపిణీ చేయాలి
ధర్మసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం మండలంలోని ముప్పారంలో రేషన్ షాపును అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 17వ నంబర్ షాపులో ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. ఏయే సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయి..కుటుంబ సభ్యుల చేర్పుల కార్డులు ఉన్నాయా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యంను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నారు.. సన్నబియ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించి, రెవెన్యూ సదస్సు సందర్భంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన వివిధ సహాయక కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాతంపల్లి గ్రామ పరిధిలోని సయ్యద్నగర్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి కొమురయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, డీఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య భూ భారతి రెవెన్యూ సదస్సు పరిశీలన -
ప్రజాపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
న్యూశాయంపేట : ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఎం హనుమకొండ జిల్లా విస్తృత సమావేశం గురువారం ఓ ఫంక్షన్హాల్ జిల్లా కమిటీ సభ్యుడు రాగుల రమేశ్, జి.రాములు, బి.చక్రపాణిల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుదర్శన్ హాజరై మాట్లాడుతూ..కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, వాటి అనుబంధ రూల్స్ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందుకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు చుక్కయ్య, జి.వెంకట్, వీరన్న, తిరుపతి, లింగయ్య, భాను నాయక్, మండల, ఏరియా కార్యదర్శులు, గ్రామశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్ -
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు.. హనుమకొండ జిల్లాలో అసలు విద్యార్థులు లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 41 ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గతేడాది విద్యార్థులున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఆయా పాఠశాలలను తెరిచేందుకు డీఈఓ వాసంతి అవకాశం ఇచ్చారు. 41 పాఠశాలల్లోని టీచర్లు బడిబాట కార్యక్రమం ద్వారా తమతమ ప్రాంతాల పాఠశాలల పరిధిలో విద్యార్థులను నమోదు చేయిస్తే అవే పాఠశాలల్లోనే ఆయా టీచర్లు కొనసాగించేందుకు కూడా నిర్ణయించారు. కనీసం పది మంది విద్యార్థులను చేర్పించిన కూడా ఆయా పాఠశాలలు కొనసాగనున్నాయి. విద్యార్థులను చేర్పించలేని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల టీచర్లను విద్యార్థులున్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లాలో 10లోపు విద్యార్థులున్న పాఠశాలలు మరో 45 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల టీచర్లు కూడా తమతమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకోవాల్సిందే. 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా కొన్నింటిలో తక్కువగానే విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగించేలా కృషిచేసి విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలలో సర్దుబాటు చేశారు.విద్యార్థులను చేర్పించని పాఠశాలల టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. రోజువారీగా కార్యక్రమాలు ఇలా.. ● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి. ● 7న ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి. ● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికివె వెళ్లి ప్రచారం చేయటంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. అందులోని బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేలా ప్రోత్సహించాలి. ● 11న బడిబాట ద్వారా చేసిన ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి. ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి. ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి. ● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు లక్ష్యం.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్, కోఆర్డినేటర్ నేటినుంచి 19వరకు నిర్వహణ వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు జిల్లాల్లో విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే.. కనీసం పదిమందినైనా చేర్పించాలి.. హనుమకొండలో 41, వరంగల్లో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య జిల్లాలో పాఠశాలల వివరాలు జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూల్స్ హనుమకొండ 314 72 147 -
‘ఆయుష్మాన్’లో నాణ్యమైన వైద్యసేవలు
● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎల్కతుర్తి : ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు. మండలంలోని కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఎల్కతుర్తి పీహెచ్సీని డీఎంహెచ్ఓ గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల విశ్వసనీయత, సౌకర్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నాణ్యత, హామీ ప్రమాణాలు (ఎన్క్యూఎస్) ప్రారంభించిందన్నారు. గతేడాది నుంచి జాతీయస్థాయిలో అవార్డు కోసం ఎల్కతుర్తి ప్రాథమిక ఆర్యోకేంద్రం పరిధిలోని కేశవాపూర్ ఆయుష్మాన్ హెల్త్ ఆండ్ వెల్నెస్ సెంటర్ పోటీ పడుతోందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీనాథ్, డాక్టర్ అరవింద్, దుర్గాప్రసాద్, కవిత, భవాని, రుక్మొద్దిన్, రవీందర్, ఉమాదేవి, ఏఎన్ఎంలు శుక్ర, స్వరూప, సునీత, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. పీహెచ్సీలను శుభ్రంగా ఉంచాలి ఎంజీఎం/హసన్పర్తి : జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంతో పాటు లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణం శుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలని సూచించారు. అదేవిధంగా టీబీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు. హసన్పర్తి మండల కేంద్రంలోని దళితవాడ పాఠశాలలో టీబీ టెస్ట్లు నిర్వహించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజాహైదర్, హెల్త్ సూపర్వైజర్ బాబు, ఎంజీఎం సూపర్వైజర్ నర్మద, విప్లవకుమార్, టీబీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు, టెక్నీషియన్ అయ్యుతరావు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్, నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్లు, ప్రొఫెసర్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేరుగా హజరుకాలేకపోతున్న వారి కోసం నిట్ అధికారిక యూట్యూబ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నిట్ను అగ్రగామిగా నిలబెడదాంనిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ మోహన్రెడ్డి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీకాజీపేట : కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు, ఈ–చలాన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా తిరగడం, మైనర్ డ్రైవింగ్ వంటి విషయాల్లో ఎవరిని ఉపేక్షించొద్దని సిబ్బందికి సూచించారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐ వెంకన్న, ఎస్సైలు కనక చంద్రం, రామారావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీనుంచి 13వ తేదీలోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశోధనపత్రాల ప్రొసీడింగ్స్ ఆవిష్కరణకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈఏడాది మార్చి 11, 12వ తేదీల్లో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ యానిమల్ బయా టెక్నాలజీ అండ్ ఇమ్యునాలజీ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ జాతీయ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన 26 పరిశోధన పత్రాలతో కూడిన ప్రొసీడింగ్స్ (పుస్తకం)ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ షమిత, ఆ విభాగం ప్రొఫెసర్లు మామిడాల ఇస్తారి, డాక్టర్ వెంకయ్య, ఈసం నారాయణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కమలాపూర్ : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు రైతులు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి అంబాలలో 230, గూడూరులో 161 దరఖాస్తులు స్వీకరించారు. ఏఎంసీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, తహసీల్దార్ ఎం.సురేష్కుమార్, నాయబ్ తహసీల్దార్ శోభారాణి, సర్వేయర్ గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
‘బడిబాట’కు వేళాయె..
జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూళ్లు హనుమకొండ 314 72 147 వరంగల్ 321 68 123 విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు.. వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. విద్యార్థులను చేర్పించని టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. రోజువారీగా కార్యక్రమాలు ఇలా.. ● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి. ● 7న ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి. ● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. ● 11న బడిబాట ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి. ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి. ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి. ● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి.నేటినుంచి 19 వరకు నిర్వహణ చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే.. జిల్లాలో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య విద్యార్థుల నమోదే లక్ష్యం.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్, కో–ఆర్డినేటర్ -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
నర్సంపేట రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని మండల న్యాయసేవ సంస్థ చైర్మన్, సబ్ కోర్టు జడ్జి వరూధిని అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్కుమార్, కార్యదర్శి మోటూరి రవి, న్యాయవాదులు దాసి రమేశ్, పుట్టపాక రవి, సునీత, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో.. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా నర్సంపేటలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు ఎరబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ రఘుపతిరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సై రవికుమార్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరగాని సుదర్శన్, స్వయం కృషి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, కాసుల వెంకటాచారీ, గుంటి సంజీవ, పోలీసులు వీరన్న, శ్రీలత, మహేశ్, భిక్షపతి, రవి తదితరులు పాల్గొన్నారు. -
వరంగల్
ఉద్యాన పంటల సాగు లాభదాయకం రైతులు తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ పొందుతూ ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని ఉద్యాన అధికారి సుస్మిత తెలిపారు.సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?వాతావరణం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025ఖిలా వరంగల్: ‘వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. పంటకు విత్తే మూలం.. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలను అవలంబిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయి’ అని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫోన్ ఇన్లో జిల్లా నలుమూలల నుంచి రైతులు సాగుకు అనువైన విత్తనాలు, అందుబాటులో ఉన్న రకాల వివరాలే కాకుండా సాగు విధానాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అనురాధ ఇచ్చిన సమాధానాలు ఇలా.. ప్రశ్న: ప్రస్తుత వర్షాలకు వరి నార్లు పోసుకోవచ్చా? ఏరకం విత్తనాలు మేలు?– రైతు మెండె రమేశ్, పనికెరగ్రామం, నెక్కొండ జవాబు: జూన్ మొదటి వారం తర్వాత వరినార్లు పోసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన సన్న రకాలను విత్తుకుంటే మద్దతు ధరతోపాటు బోనస్ వస్తుంది. ప్రశ్న: పచ్చిరొట్ట విత్తన ధరలు గతేడాదిలో పోలిస్తే పెరిగాయి ఎందుకని? – జి.సురేందర్ చంద్రగొండ నెక్కొండ జవాబు: విత్తనోత్పత్తి తగ్గడంతో కొంత మేర ధర పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ప్రశ్న: డీఏపీ కాంప్లెక్స్ ఎరువులకు సైతం మరింత సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉందా?– రావుల భాస్కర్, రాయపర్తి జవాబు: యూరియా వాడకం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ యూరియా పాళ్లు ఉంటాయి. ఫార్మల్ ఐడీ విధానం అమలైతే భూమి ఆధారంగా కోటా నిర్ధారించే అవకాశం ఉంది. ప్రశ్న: పెసర ఎప్పుడు, ఏరకాలు విత్తుకోవచ్చు? – తోటకూరి సాయిలు, పెర్కేడు రాయపర్తి మండలం జవాబు: వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు దుక్కలు సిద్ధం చేసుకుని 60మి.మీల వర్షపాతం నమోదయ్యాక జూన్ మొదటి వారం నుంచి పెసర విత్తుకోవచ్చు. ఎంజీజీ రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రశ్న: పంటల సాగుపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా? – ఏసీరెడ్డి ప్రభాకర్, తూర్పు కోట జవాబు: రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైసెన్స్డ్ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే నాసిరకం బెడద ఉండదు. ప్రశ్న: వానాకాలంలో సాగు చేసే సన్న గింజ వరి రకాలు తెలపండి? – కందుల సారంగం బొల్లికుంట జవాబు: సన్నరకాల్లో డబ్ల్యూజీఎల్ 44(సిద్ది) జూన్ 15 వరకు నార్లు పోసుకుని దీర్ఘకాలిక రకం.. కేఎన్ఎం 1638 రకం, సల్ప కాలిక రకంలో జూలై నెలలో నారు పోసుకునేందుకు అనువైన రకం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వంటివి సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: వరిలో చౌడు నేలలను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే రకాలేంటి? – పులి అశోక్, లింగగిరి గ్రామం, చెన్నారావుపేట జవాబు: చౌడు నేలలను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే దొడ్డు రకం కేఎన్ఎం రకం 118 సాగుకు అనుకూలం. ప్రశ్న: వర్షాధారంగా సాగు చేసే కంది రకాలను వివరించండి?– చంద్రమౌళి ల్యాబర్తి, వర్ధన్నపేట జవాబు: పీఆర్జీ 176, టీడీఆర్జీ 4, డబ్ల్యూఆర్ జీఈ97, డబ్ల్యూర్జీఈ 121, వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులు ఏవి? – వెంకటేశ్వర్లు పర్వతగిరి జవాబు: రైజోబియం 200 గ్రాములు, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి 24 గంటల్లోపు విత్తనాన్ని విత్తుకోవాలి. ప్రశ్న: ఆయిల్ ఫామ్లో మొక్కజొన్నను అంతర పంటగా వేసుకోవచ్చా?– మల్లికార్జున్, చింతకుంట, పర్వతగిరి జవాబు: 19 నెలల వయస్సు ఉన్న తోటలో అంతర పంటగా మొక్కజొన్న కంటే కూరగాయలు, పెసర, మినుము సాగు మేలు. దుక్కి ఎక్కువగా దున్నకూడదు. అలా చేస్తే ఆయిల్ ఫామ్ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. యాసంగి పంటగా మాత్రం మొక్కజొన్నకు అవకాశం ఉంది. ప్రశ్న: మెట్ట వరి సాగులో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏవి? – నాగుల్ల కుమారస్వామి, పర్వతగిరి జవాబు: మెట్టలో వరి సాగు చేస్తే అంతగా దిగుబడులు రాకపోగా.. సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలుపు, తెగుళ్ల సమస్యలు ఉంటాయి. అలాగే ఆరుతడి వరి సాగులో ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ప్రశ్న: పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – ఎం.తిరుపతిరెడ్డి, మామునూరు జవాబు: రైతుల కోసం అందుబాటులో ఉంచే పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పడితే సహించేది లేదు. ఎవరైనా సరే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తీసుకున్న విత్తనాలపై అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ బుకింగ్ చేయిస్తాం. ప్రశ్న: ఈవర్షాలతో పత్తి సాగు చేయొచ్చా? పెసర పంట వేసుకోవచ్చా? – గుండాల కమలాకర్, నల్లబెల్లి జవాబు: ఈఏడాది రోహిణి కార్తెలోనే వానలు కురుస్తున్నాయి. నేలలో పదును ఆధారంగా జూన్ 10 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. పెసర కూడా జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ రకాలు, వరంగల్ రకాలు అనుకూలం. ప్రశ్న: విత్తనాలు నాసిరకానివి, మంచివి ఎలా గుర్తించాలి? – వేముల రమేశ్, నల్లబెల్లి జవాబు: లైసెన్స్డ్ విత్తన షాపుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. అన్ని వివరాలతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మాయమాటలతో అమ్మే విత్తనాలు నకిలీవని భావించాలి. ప్రశ్న: బెండ సాగు చేస్తున్నా.. ఆకులు, కాయలు తెల్లగా మారుతున్నాయి? – ధరావత్ నాగు, సూర్యపేట తండా, చెన్నారావుపేట జవాబు: తెల్లదోమ ద్వారా తెగులు వాప్తి చెందుతుంది. నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాములు ఏపీఫెట్ 3 మిల్లీ లీటర్ల వేపనూనె (3000 పీపీఎం) కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రశ్న: ఆయిల్ ఫాం సాగుకు రాయితీ ఉందా? సాగు చేసుకోవచ్చా? – సింగారపు యాకూబ్ జల్లి, చెన్నారావు జవాబు: ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. తక్కువ పెట్టుబడితో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే ఈపంటను సాగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలతోపాటు రాయితీ ఇస్తోంది. ప్రశ్న: ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. పత్తి గింజలు విత్తుకోవచ్చా? – బత్తుల ప్రవీణ్, బాపునగర్, చెన్నారావుపేట జవాబు: వర్షాలు కురిసినప్పటికీ నేల నుంచి వేడి తగ్గలేదు. సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతే (జూన్ 10 తర్వాతే) విత్తనాన్ని విత్తుకుంటే వందశాతం మెలక వస్తుంది. న్యూస్రీల్పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కలెక్టర్ సత్యశారద ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సమగ్ర యాజమాన్య పద్ధతితోనే అధిక దిగుబడి అనుమతి ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచనలు, సలహాలు ‘సాక్షి’ ఫోన్ ఇన్కు విశేష స్పందన -
రేషన్కార్డుదారులూ.. ఆందోళన వద్దు
న్యూశాయంపేట: ‘ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది.. పంపిణీలో కొంత జాప్యం జరుగుతున్నా.. జూన్ మాసాంతం వరకు అందరికీ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటాం’ అని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిషయాన్ని రేషన్ డీలర్లు వినియోగదారులకు వివరించాలని, షాపుల వద్ద క్యూలైన్ లేకుండా ప్రతీ రోజు కొంత మందికి టోకెన్లు అందించి క్రమపద్ధతిలో బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటి.. ప్రతిజ్ఞ చేసిపర్వతగిరి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మండల ప్రత్యేక అధికారి, డీసీఓ ఎం.నీరజ అన్నారు. ఈమేరకు మండలంలోని అనంతారం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో మొక్కలు నాటి ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సోమారం గ్రామంలోని కిరాణా దుకాణాదారులకు షాప్లో ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని అవగాహన కల్పించారు. అనంతరం జమలాపురం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్నాయక్, హౌసింగ్ ఏఈ డి.ఉదయశ్రీ, సోమారం, జమలాపురం కార్యదర్శులు, జమాల్పురం ఇందిరమ్మ కమిటీ సభ్యులు జిల్లా కనకయ్య, ఏఫ్ఏలు, మహిళా సంఘం సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే రోళ్లకల్లో తహసీల్దార్ వెంకటస్వామి, అన్నారం గ్రామంలో మండల పంచాయతీ అధికారి శేషాంజన్స్వామి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ నియంత్రణపై ర్యాలీగీసుకొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. గురువారం మండలంలోని మచ్చాపూర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నియంత్రణ, మోదుగ ఆకులతో విస్తర్ల తయారీపై నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. డీపీఓ కటకం కల్పన, డీఎల్పీఓ వేదవతి, స్పెషల్ ఆఫీసర్ సురేశ్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు. ‘నిట్ను అగ్రగామిగా నిలబెడదాం’కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లించాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు. -
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
న్యూశాయంపేట : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీ ఎఫ్) భీమా నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్లో బుధవారం ప్లాస్టిక్ ప్రీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించి, ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. రైల్వేవర్క్స్ సెక్షన్ల తనిఖీ కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్నీరోడ్ సెక్షన్లో చేపట్టనున్న రైల్వే ఎన్ఐ ఇంజనీరింగ్ వర్క్స్ లోకేషన్ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే అధికారులు తనిఖీ చేశారు. రైల్వే ఏడీఆర్ఎం ఆపరేటింగ్ విభాగం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఎన్ఐ బ్లాక్ సెక్షన్లను పరిశీలించి తనిఖీ చేసి పలు సాంకేతిక విషయాలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా బెల్లంపల్లి–రెచ్నీ మధ్య ఎన్ఐ ఇంజనీరింగ్ బ్లాక్ పనులు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని, దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట–బల్లార్షా రూట్లలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, దూరం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు వివరించారు. 1,220 దరఖాస్తుల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులనుంచి 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదసుల్లో సర్వే నంబర్ల మిస్సింగ్–90, పెండింగ్ మ్యూటేషన్–17, డీఎస్ పెండింగ్–49, ఎక్స్టెంట్–113, అసైన్డ్ భూ సమస్యలు–179, సక్సేషన్–101, ఇతర సమస్యలపై 625లతో పాటు తదితర సమస్యలపై మొత్తం 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి న్యూశాయంపేట: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం ఏనుమాములలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలాజీనగర్లో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు. హిందీ పరీక్షకు 8మంది హాజరువిద్యారణ్యపురి : జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్షకు మొత్తం 12మందికి 8మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ముగ్గురు, బస్టాండ్ రోడ్డులోని ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో ఇద్దరు, పెట్రోల్ పంపు బాలికల హైస్కూల్ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు. -
మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం
హన్మకొండ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని బీజేపీ నేత, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. సంకల్పంతో సాకారం అనే అంశంపై హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో ఒక్క రూపాయీ అవినీతి లేకుండా పాలన కొనసాగించారని గుర్తుచేశారు. యూపీఏ హయాం అంతా కుంభకోణాలమయమే అని ఆరోపించారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సండ్ర మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్: చరిత్రాత్మక దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించతలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ముందు రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఆక్రమించినవారు స్వచ్ఛందంగా భూములను తిరిగి ఇవ్వాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా దేవాలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి దేవాలయం అభివృద్ధిలో భాగంగానే భద్రకాళి మాడవీధుల నిర్మాణం కోసం రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్ాధ్యన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీని వల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని దేవాలయాలను పరిశీలించి సరైన మాస్టర్ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు. వైభవంగా పూజాకార్యక్రమం... ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదా యశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్ బాబు, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి,ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం.. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఏసీపీ నర్సయ్య వర్ధన్నపేట: మతసామరస్యంతో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఏసీపీ నర్సయ్య అన్నారు. బుధవారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో బక్రీద్ పండుగ నిర్వహణపై హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై చందర్, రాయపర్తి ఎస్సై శ్రవణ్కుమార్, జఫర్గఢ్ ఎస్సై రామ్ చరణ్, పాలకుర్తి ఎస్సై మహేందర్రెడ్డి, మతపెద్దలు పాల్గొన్నారు. ఆర్టీసీ విలీనంపై కీలక ప్రకటన చేయాలినర్సంపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచి వాలయంలో నేడు (గురువారం) సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మా ట్లాడుతూ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021, 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులుజీవితాంతం రుణపడి ఉంటారన్నారు. నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనంగీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులోని గుంటూరుపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుపల్లికు చెందిన బిరెడ్డి మర్రెడ్డి అనే వ్యక్తి మెదక్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి వద్ద నుంచి పత్తి విత్తనాలను తక్కు వ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు గీసుకొండ ఏఓ హరిప్రసాద్, ఎస్సై ప్రశాంత్బాబు లు సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. ఈ తని ఖీల్లో హెచ్టీబీటీ రకం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని మర్రెడ్డి, సందీప్రెడ్డిలపై కేసు నమోదు చేశామని, మర్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, సందీప్రెడ్డి పరా రీలో ఉన్నాడని సీఐ మహేందర్ తెలిపారు. -
గడువుదీరిన పురుగు మందులు స్వాధీనం
పరకాల : వ్యవసాయ పనులు మొదలవడమే ఆలస్యం.. నాసిరకం విత్తనాలు, ఎరువులు, గడువుతీరిన పురుగుల మందులు విక్రయిస్తూ రైతులను మోసం చేయడానికి కొందరు వ్యాపారస్తులు సిద్ధమవుతున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల జారీచేయడంతో పరకాల ఏసీపీ సతీష్కుమార్ పర్యవేక్షణలో విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారస్తులు గ్రామాల్లో ఉండే దుకాణాలను అడ్డాగా మార్చుతున్నారు. మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీరాజరాజేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణంతోపాటు యజమాని ఇంట్లో తనిఖీ చేయగా రూ.2.49లక్షల విలువైన కాలం చెల్లిన షీన్వా, ఎక్స్పోనస్, ఎలక్టో, ఓబెన్ కంపెనీకి చెందిన పురుగు మందులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని యజమాని ఎం.తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. పోలీసుల అదుపులో మరికొందరు.. పోలీసుల నిరంతర దాడులతో పరకాల పట్టణానికి చెందిన కొందరు కాలం చెల్లిన పురుగు మందులను, అనుమతి లేని ప్రాంతాల్లో నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. పురుగు మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విక్రయాల వెనక పరకాల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. నాగారంలోని ఓ దుకాణంపై పోలీసుల దాడి రూ.2.49లక్షల విలువైన పెస్టిసైడ్స్ పట్టివేత విచారణ చేపట్టిన పరకాల పోలీసులు -
ఆదరణ బాగానే ఉంది..
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పొట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినంరోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకుబ్, కాజీపేట -
ఆయిల్పామ్ నర్సరీ పరిశీలన
సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలోని గల ఆయిల్పామ్ నర్సరీని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి జి.అనసూర్య బుధవారం సందర్శించి పరిశీలించారు. సెకండరి నర్సరీలో ఉన్న మొక్కలను పరిశీలించి చేపట్టాల్సిన ఎరువుల, నీటి యాజమాన్య పద్ధతులపై సూచనలు, సలహాలు అందించారు. కల్లింగ్ మొక్కలను తీసివేయాలన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని రాంచరణ్ ఇండస్ట్రీస్ నర్సరీ ఇన్చార్జ్ కిరణ్కుమార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి ఎన్. తిరుపతి, టెక్నికల్ సిహెచ్. రాకేష్, రాంచరణ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వరంగల్ మండల పరిధిలోని ఏనుమాములలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతు ల సందేహాలను నివృత్తి చేశారు. తహసీల్దార్, నా యబ్ తహసీల్దార్ నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు రెండు గ్రామాల్లో సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్డెస్క్, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్ తదితర సి బ్బంది పాల్గొన్నారు. అనంతరం బాలాజీ నగర్లో రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి రేషన్సక్రమంగా అందుతుందా అని ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలు ప్రజల కు కనిపించే విధంగా ఫ్లెక్సీ ప్రదర్శించాలన్నారు. ‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన బృందం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎంలో అత్యవసరంగా కావాల్సిన అవసరాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు, వారి అటెండెన్స్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వరంగల్
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202 పొట్టేల్.. అధరహో..శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి ఖరీఫ్ పంటలు, విత్తనాల నాణ్యత, సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ఏడీఆర్ ఉమారెడ్డి తెలిపారు.– 12లోuకాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఏర్పడింది. ట్రై సిటీతో పాటు 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ పండుగ ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. వారు కొంత మాంసం వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్బానీ (దానం) ఇస్తారు.పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలుగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి తాము అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
ఆదరణ బాగానే ఉంది
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పోట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినం రోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకూబ్, కాజీపేట -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన
వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ స్కూల్ నిర్మా ణం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని స్థానిక నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును కోరడంతో మున్సిపాలిటీ పరిధిలోనే స్కూల్ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ విజయ్సాగర్, ఆర్ఐ అసిఫ్, మండల సర్వేయర్ గీత, అసిస్టెంట్ సర్వేయర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ సంపత్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ (గువ్వల బోడు) దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అన్మిరెడ్డి కృష్ణారెడ్డి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తూల్ల రవి, నాయకులు సిలివేరు శ్రీధర్, పులి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వ నిర్లక్ష్యం పేదలకు శాపం
సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతిహన్మకొండ అర్బన్: హనుమకొండ అంబేడ్కర్ కాలనీలోని పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, అర్హులైన పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆరోపించారు. అంబేడ్కర్ కాలనీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 592 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, స్థానికంగా 20 నుంచి 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి ఇస్తామని చెప్పి, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు చొరవ తీసుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్ పాల్గొన్నారు. ఓరుగల్లు రంగస్థల కళాకారుల సంస్మరణ సభ హన్మకొండ కల్చరల్: ఇటీవల మరణించిన వరంగల్కు చెందిన రంగస్థల కళాకారులు చక్రహరి సురేందర్రావు, బలగం ఫేం జీవీ బాబు, శతపతి శ్యామలరావు సంస్మరణ సభను వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన సభలో కళాకారులు ఎన్ఎస్ఆర్ మూర్తి, జేఎన్.శర్మ, ఓడపల్లి చక్రపాణి, శ్రీరామోజు సుందరమూర్తి, పందిళ్ల అశోక్బాబు, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లిం చాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు. -
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధ్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ఎదుట రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా ఆలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి ఆలయం అభివృద్ధిలో భాగంగానే మాడవీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీనివల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాలను పరిశీలించి సరైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు. వైభవంగా పూజా కార్యక్రమం.. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్బాబు, కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి కొండా సురేఖ రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం.. -
‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు
ఎంజీఎం : రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన సభ్యులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసరంగా కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో హిటింగ్ వెంటిలేషన్, ఏయిర్ కండిషన్ సిస్టం మరమ్మతులతోపాటు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ ఈనెల 10వ తేదీలోగా రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు వారి అటెండెంట్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, సంబంధిత శాఖల అధికారులు, డాక్టర్లు ఉన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సదుపాయాలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం -
పొట్టేల్.. అధరహో..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025– 12లోuకాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఉంటుంది. ట్రైసిటీతో పాటు నగరంలోని 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ వేడుకను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను బలిఇస్తారు. వారు కొంత మటన్ను వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్చానీ (దానం) ఇస్తారు.పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు నగరానికి వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
● ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్గీసుకొండ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పీడ కలలు కంటున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్కే ప్రభాకర్ అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పదకొండేళ్ల మోదీ పాలనపై జిల్లా కార్యశాల నిర్వహించిన సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ సాధించిన విజయా ల గురించి ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రజలకు వివరించడానికి ప్రతీ కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, కార్యక్రమ కోకన్వీనర్లు వడ్డేపల్లి నర్సింహులు, ముండ్రాతి వెంకటేశ్వర్లు, బీజేపీ కార్యాలయ కార్యదర్శి క్రాంతికుమార్, నాయకులు పాల్గొన్నారు. -
1.20
ఎకరం @కోట్లురూ.సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అవా ర్డు కింద ఈ మేరకై తే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన డిస్ట్రిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు. జనరల్ అవా ర్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామని రైతులు చెప్పారు. ఇప్పటికే 240 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం గుంటూరు పల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్లో నేగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు. ‘మామునూరు’ వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయంమరో రూ.83 కోట్లు అవసరమేవ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరా లకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నా యి. ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లు కేటా యించింది. ఎకరాకు రూ.కోటి20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరా ల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లిస్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కలెక్టర్ విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద పరిహారం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామన్న రైతులు -
కష్టాల సాగు.. !
ఖానాపురం: ధాన్యాగార కేంద్రమైన పాకాల ఆయకట్టు కింద వరినాట్లు సాగవుతుంటాయి.. ఆయకట్టు కింద రాష్ట్ర షెడ్యుల్కు అనుగుణంగా కాకుండా సుమారు నెలరోజుల ఆలస్యంగా సాగు జరుగుతుంటాయి. ఇలా ఆలస్యం కావడంతో చివరగా ధాన్యం విక్రయించుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే విషయంపై జిల్లా అధికారులు ఽకొనుగోలు కేంద్రాల తనిఖీలకు వచ్చిన సమయంలోనూ రైతుల వద్ద ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సంవత్సరమైన సాగు ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఆయకట్టు పరిధిలో సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. జిల్లాలో పాకాల ఆయకట్టు కింద 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతుంటాయి. ఆయకట్టు కింద ప్రతీ సంవత్సరం నాట్లు వేసుకోవడం ఆలస్యమవుతూనే ఉన్నాయి. సరస్సులో నీరు ఉన్నప్పటికీ నీటి విడుదల ఆలస్యం అవుతుండటంతో నార్లను సైతం ఆలస్యంగా పోసుకుంటున్నారు. తద్వారా వరి కోతలు, ధాన్యం విక్రయాలు ఆయకట్టు పరిధిలో ఆలస్యమవుతూ ఉన్నాయి. పాకాల సరస్సులో ఉన్న నీటిని ముందస్తుగా విడుదల చేస్తే రైతులు నార్లు పోసుకొని నాట్లు ఆలస్యం కాకుండా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పాకాల ఆయకట్టు పరిధిలో ఆగస్టు 20వ తేదీ వరకు నాట్లు వేస్తూనే ఉంటారు. వాస్తవంగా త్వరగా నీటిని విడుదల చేస్తే జులై 5 లోపు నార్లు సిద్ధమై జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నాట్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే రైతులకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వర్షాకాలంలో నాట్లు ఆలస్యంగా వేసుకోవడంతో కోత దశ సైతం ఆలస్యమవుతుంది. ధాన్యం విక్రయాలు చాలా కష్టంగా మారుతుంది. రాష్ట్రంలో ముందస్తు నాట్లు వేయడంతో కోతలు ముందుగా జరిగి ఇతర జిల్లాలకు చెందిన ధాన్యం జిల్లాలోని మిల్లులకు వస్తున్నాయి. ఆయకట్టు కింద ఆలస్యంగా విక్రయాలు జరగడంతో అప్పటికే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయి దిగుమతులకు నిరాకరిస్తున్న సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. అధికా రులు, రైతుల ఒత్తిడితో దిగుమతులు చేసుకోవడానికి మిల్లర్లు కొర్రీలు పెడుతున్న సందర్భాలు అనేకంగా ఉంటున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ముందస్తు నాట్లు వేసుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా నాట్లు వేసుకోవాలి.. పాకాల ఆయకట్టు పరిధిలో రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి. పాకాల సర స్సు ద్వారా నీటి విడుదల త్వరగా జరిగితే నార్లు ముందస్తుగా పోసుకొని నాట్లు త్వరగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాగు ఆలస్యమైతే ధాన్యం విక్రయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం పాకాల ఆయకట్టులో ప్రతీ సంవత్సరం వరినాట్లు ఆలస్యం ధాన్యం విక్రయాల్లో వెనకబడుతున్న రైతులు ముందస్తు సాగుతోనే తొలగనున్న సమస్యలు నీరు విడుదలైతేనే పనులు ముందుకు..