breaking news
Warangal
-
నలుగురు పిల్లల తల్లి.. భర్త కాదని ప్రియుడితో..!
వరంగల్: నలుగురు పిల్లల తల్లి (ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు).. తనకు భర్త వద్దు.. ప్రియుడే కావాలని పంచాయితీ పెద్దలకు చెప్పడంతో వారు ఆమె ఇష్టం ప్రకారం ప్రియుడుతోనే పంపించిన ఘటన మండలంలోని షోడాషపల్లి శివారు పిట్టలగూడెంలో ఇటీవల జరిగింది. భర్త కాలియ శంకర్ తెలిపిన కథనం ప్రకారం.. తనకు చంద్రమ్మతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మాకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఏడాది క్రితం లోక్యాతండా గ్రామ పంచాయతీ శివారు వేపలగడ్డ తండాకు చెందిన అజ్మీరా రాజుతో చంద్రమ్మకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడు నెలల క్రితం చంద్రమ్మ, రాజు కలిసి పారిపోగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇద్దరిని పట్టుకొచ్చారు. అనంతరం ఇరు కుటుంబాలు పెద్దలు పంచాయితీలో మాట్లాడుకుంటామని పోలీసులకు చెప్పారు. దీంతో కులపెద్దలు చంద్రమ్మను తన తల్లిగారి గ్రామమైన చిల్పూరు మండలం వెంకటాద్రిపేటకు పంపించారు. అయితే మళ్లీ చంద్రమ్మకు రాజు మాయమాటలు చెప్పి తన వెంట తీసుకువెళ్లాడు. వారంక్రితం రాజు, చంద్రమ్మ వేపలగడ్డ తండాకు వచ్చారనే విషయం తెలుసుకున్న భర్త శంకర్ కుటుంబ సభ్యులు తండాకు వెళ్లి రాజును, చంద్రమ్మను చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గొడవ జరుగకుండా నిలువరించారు. ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం చంద్రమ్మ రాజుతోనే ఉంటానని కుటుంబ సభ్యులకు తెగేసి చెప్పి అతడితోనే వెళ్లిపోయింది. తనకు తన భార్య కావాలని, తల్లి కోసం పిల్లలు ఏడుçస్తున్నారని భార్యను తనకు అప్పగించాలని భర్త శంకర్ పోలీసులను వేడుకున్నాడు. -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూని యర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా సంబంధిత ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిజిక్స్వాలా శిక్షణ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్వాలా ద్వారా సంబంధిత వెబ్సైట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్సెట్, నీట్లాంటి ఎంట్రన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించా రు. ప్రతిరోజూ ఏదో ఒక సబ్జెక్టుపై శిక్షణ ఇవ్వాలి. ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్ట్యాప్లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్లో వెబ్సైట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్చార్జ్లను నియమించారని సమాచారం. అలాగే డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక టెక్నీషియన్ చొప్పున నియమించారు. నిరంతర పర్యవేక్షణతో విద్యాబోధన మెరుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉండి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తారు. – శ్రీధర్సుమన్, డీఐఈఓ, వరంగల్ నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్వాలా శిక్షణ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా.. హనుమకొండ 9, వరంగల్ 11, మహబూబాబాద్ 10, జనగామ 7, ములుగు 8, జయశంకర్ భూపాలపల్లి 5 -
పంటలకు ప్రాణం
నర్సంపేట: జిల్లాలో సోమవారం కురిసిన వర్షాలు పంటలకు ప్రాణం పోశాయి. అన్ని పంటలు కలిపి 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఇందులో పత్తి 1.26 లక్షల ఎకరాలు, పదివేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షంతో రైతులు విత్తనాలు కొని విత్తారు. ఆ తర్వాత వర్షాలు లేకపోవడంతో కొన్ని చోట్ల పంటలు ఎండిపోయాయి. తిరిగి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి రెండోసారి నాటగా మొలకెత్తాయి. అన్ని మండలాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం పంటలకు చాలా ఉపయోగపడింది. వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువుల్లో నీరు చేరుతోంది. నర్సంపేట పట్టణంలోని రహదారులు చెరువులను తలపించాయి. 1.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.. జిల్లాలో 1.45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుండగా రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ అధికారులు సూచి స్తుండడంతో వరి నాట్ల కోసం రైతులు పనులు ప్రారంభించారు. భారీ వర్షాలు కురిస్తే జిల్లాలోని పాకాల, మాదన్నపేట, రంగాయ, కోపాకుల చెరువుల్లోకి నీరు చేరి మత్తడి పడే అవకాశం ఉంది. భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) మండలం గ్రామం వర్షపాతంఖానాపురం మంగళవారిపేట 88.3 నల్లబెల్లి మేడపల్లి 76.0 నల్లబెల్లి నల్లబెల్లి 69.3 చెన్నారావుపేట చెన్నారావుపేట 59.3 దుగ్గొండి దుగ్గొండి 44.8 నర్సంపేట లక్నెపల్లి 48.3 నెక్కొండ నెక్కొండ 43.0 పర్వతగిరి ఏనుగల్ 36.3 సంగెం సంగెం 32.8 గీసుకొండ గీసుకొండ 24.5 వర్ధన్నపేట వర్ధన్నపేట 23.8 గీసుకొండ గొర్రెకుంట 17.0 పర్వతగిరి కల్లెడ 14.5 రాయపర్తి రాయపర్తి 13.5 సంగెం కాపులకనపర్తి 10.3 వరంగల్ పైడిపల్లి(ఏఆర్ఎస్) 8.0 వరంగల్ కాశిబుగ్గ 8.5 నెక్కొండ రెడ్లవాడ 5.5 ఖిలా వరంగల్ ఉర్సు 5.5జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం మొక్కజొన్న, పత్తికి ఊపిరి వరినాట్లకు సన్నద్ధమవుతున్న రైతులు -
యూరియా కోసం బారులు
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి సొసైటీలో యూరియా కోసం రైతులు సోమవారం ఉదయం బారులు తీరారు. వారం క్రితం ఎకరానికి రెండు బస్తాల చొప్పున తీసుకున్న రైతులు సైతం క్యూలో నిల్చున్నారు. ఒక్కసారి కూడా తీసుకోని వారికి ముందు ఇస్తామని చెప్పినా వారు వినకపోవడంతో సొసైటీ చైర్మన్ రక్కిరెడ్డి మోహన్రెడ్డి, ఏఓ హరిప్రసాద్బాబు గీసుకొండ పోలీసుల సాయం కోరారు. దీంతో పోలీసులు వచ్చి పంపిణీ సజావుగా సాగేలా చర్యలు చేపట్టారు. సొసైటీకి తాజాగా 444 బస్తాల యూరియా లోడ్ రాగా ఏఈఓ శ్వేత పంపిణీ చేశారు. -
కొమ్మాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
గీసుకొండ: మండలంలోని ప్రసిద్ధ కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ అబివృద్ధికి బృహత్తర ప్రణాళికను రూపొందించి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు తెలిపారు. సోమవారం ఆలయ కార్యాలయంలో వంశపారంపర్యఽ ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులుతో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రూ. 89 లక్షల నిధులతో ఆలయ మండపం విస్తరణ పనులు, రూ.45 లక్షలతో భక్తుల క్యూలైన్ల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి అధి కారుల ఆమోదం కోసం పంపామన్నారు. భక్తుల వసతిగృహాలను నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తామని, ఒక్కో గది కోసం దాతల నుంచి రూ. 8.50 లక్షల విరాళాలు సేకరిస్తామని వివరించారు. వరంగల్లోని శ్రీశ్రీ మెడికల్ హాల్ వారు రూ.3.50 లక్షల సొంత ఖర్చుతో ధ్వజస్తంభం ఏర్పాటుకు ముందుకు వచ్చారని, రూ.1.50 లక్షల ఆలయ నిధులతో స్విహద్వారం వరకు ఆలయంలోని మంత్రోచ్ఛరణలు వినపడేలా మైక్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో నిత్యఅన్నదానం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆలయానికి ఇప్పటి వరకు రూ.1.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, ఆలయంలో ప్రేమ వివాహాలను నిలిపివేశామని, పెద్దలు కుదిర్చిన వివాహాలను అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫనీంద్ర, జూనియర్ అసిస్టెంట్ ప్రేం కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు -
బల్దియాలో పింఛన్ పొందుతున్న అనర్హులు 3వేల మంది?
● ఇటీవల తనిఖీల్లో వెలుగులోకి.. బయటికి పొక్కనీయని అధికారులు ● సోషల్ ఆడిట్ లేక ఇష్టారాజ్యం ● ఇతోధికంగా సహకరిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బంది వరంగల్ అర్బన్: ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉండాలనే ప్రభుత్వ ఆశ యం పక్కదోవ పడుతోంది. ఆసరా పింఛన్లు కొందరు అవినీతి అధికారుల జేబులు నింపడానికి ఆసరాగా మారుతున్నాయి. ఏదైనా కారణంతో లబ్ధిదారుడు మృతిచెందితే వెంటనే ప్రభుత్వానికి నివేదించాలన్న బాధ్యత కొందరు కుటుంబ సభ్యుల్లో లోపిస్తోంది. దీనికితోడు అనర్హులు, అక్రమార్కులు కూడా ఒకే ఇంటినుంచి నలుగురు వరకు పింఛన్లు పొందుతున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ చేసి ఉన్నతాధికారులకు వివరాలు అందించాల్సిన సిబ్బంది మామూళ్ల మత్తులో పడి పట్టించుకోవట్లేదన్న ఆరోపణలున్నాయి. ఇదే తరుణంలో అర్హత ఉండి పింఛన్ పొందలేకపోతున్న నిస్సహాయులు అనేక మంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్ల అవకతవకలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తేనే పథకం ఆశయం నెరవేరుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చనిపోయినా.. బ్యాంకు ఖాతాల్లో జమ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 76,379మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారు. కొంతమంది లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారి ఖాతాల్లో సొమ్ము జమవుతూనే ఉంది. వారిలో కొందరు కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డుల ద్వారా నగదు డ్రా చేస్తున్నారు. మరికొంతమంది మృతుల ఖాతాల్లో ఏళ్ల తరబడి పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లోనే మూలుగుతోంది. భర్త లేదా భార్య వారి స్థానంలో మరొకరి కొత్తగా పింఛన్ కావాలంటే మృతిచెందిన ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) సమర్పించాలి. ఆ తేదీనుంచి బ్యాంక్లో జమ అయినా సొమ్ము తిరిగి బల్దియా ట్రెజరీలో జమ చేస్తేనే దరఖాస్తు స్వీకరించి, విచారణ చేసి, కొత్త పింఛన్ కోసం ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఒక్కరే ఉండి, ఇక పింఛన్కు ఆస్కారం లేకపోతే ఆ సొమ్ము పక్కదారి పడుతోంది. బల్దియా వ్యాప్తంగా సుమారు 3వేల మంది వరకు అనర్హులు ఉన్నట్లు ఇటీవల జరిగిన తనిఖీల్లో వెలుగు చూసింది. కానీ ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనర్హులకు పింఛన్లు.. ఆధారం లేని వృద్ధులు, వితంతువులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు అందుతున్న పింఛన్లలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకే ఇంటినంబర్పై ఇద్దరు నుంచి నలుగురు బీడీ కార్మికుల పేరిట సర్కారు సొమ్ము దోపిడీ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పింఛన్లను అర్హులకు ఇవ్వాలని, ఇప్పటికే ఉన్న పింఛన్దారుల వివరాలను కట్టుదిట్టంగా పరిశీలించి అనర్హులను ఏరివేయాలని ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు ఆదేశిస్తోంది. కానీ జిల్లా అధికారుల పర్యవేక్షణాలోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది విచారణ పేరిట ఎంతో కొంత తీసుకొని వదిలేస్తుండటంతో కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగమవుతోంది. తిరిగి రాబడుతున్నాం.. మృతుల పేరిట ఖాతాల్లో పింఛన్ల నగదు జమ అవుతుందనే విషయం మా దృష్టికి వచ్చింది. పింఛన్ల సొమ్ము పేరుకుపోతే వెంటనే సమాచారం ఇవ్వాలని బ్యాంకర్లకు లేఖలు రాశాం. అనర్హులు ఉంటే ప్రత్యేకంగా సర్వే చేయిస్తాం. – జోనా, బల్దియా అడిషనల్ కమిషనర్మొత్తం పింఛన్ల లబ్ధిదారులు 76,379పింఛన్ కోసం 16వేల మంది నిరీక్షణబల్దియాలో మూడున్నరేళ్లుగా సుమారు 16వేల మంది కొత్త పింఛన్ కోసం నిరీక్షిస్తున్నారు. దరఖాస్తు పెట్టుకొని, విచారణ పూర్తయి ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉండడంతో ఎప్పుడు పింఛన్ మంజూరు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని దాటవేస్తున్నారు. దీంతో అర్హులు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. -
తేలికపాటి నుంచి భారీ వర్షం
హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సోమవా రం రాత్రి 7 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేష న్లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేటలో అత్యధికంగా 88.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లాలో మడికొండ, భీమదేరపల్లిలో అత్యల్పంగా 3.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లిలో 76 మిల్లీ మీటర్లు, నల్లబెల్లిలో 69.3, చెన్నారావుపేటలో 60.3, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 48.3, దుగ్గొండిలో 44.8, నెక్కొండలో 44.5, పర్వతగిరి మండలం ఏనుగల్లో 37.5, సంగెంలో 34.5, గీసుకొండలో 24.8, వర్ధన్నపేటలో 24, గీసుగొండ మండలం గొర్రెకుంటలో 17.3, రాయపర్తిలో 13.5, సంగెం మండలం కాపుల కనపర్తిలో 12.5, వరంగల్ కాశిబుగ్గలో 8.5, పైడిపల్లి ఏఆర్ఎస్లో 8, నెక్కొండ మండలం రెడ్లవాడలో 7.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లి గూడెంలో 33 మిల్లీ మీటర్లు, హసన్పర్తి మండలం నాగారంలో 25, ఆత్మకూరులో 24.3, శాయంపేటలో 20, దామెర మండలం పులుకుర్తిలో 19.3, నడికూడలో 17.5, దామెరంలో 17.5, కమలాపూర్లో 17, పరకాలలో 16.5, వేలేరులో 12.5, హసన్పర్తి చింతగట్టులో 8.5, కాజీపేటలో 8.5, ఎల్కతుర్తిలో 4.8, ఐనవోలు మండలం కొండపర్తిలో 3.8, ఐనవోలులో 3.8, ధర్మసాగర్లో 3.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. -
వరంగల్
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025తెలంగాణ ఉద్యమ దివిటీ దాశరథి నైజాం రాజులను ఎదురించిన తెలంగాణ ఉద్యమ దివిటీ దాశరథి కృష్ణమాచార్యులు. నేడు దాశరథి జయంతి.చెన్నారావుపేట మండలం లింగాపురం ఉన్నత పాఠశాలలో తమ ఐడియాలను కాగితంలో రాసి ఐడియా బాక్స్లో వేస్తున్న విద్యార్థులు25 నుంచి రేషన్కార్డుల పంపిణీ● వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వరంగల్ చౌరస్తా: మండల కేంద్రాల్లో ఈనెల 25 నుంచి ఆగస్టు 10 వరకు రేషన్కార్డుల పంపిణీ ప్రక్రియ ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్కార్డుల పంపిణీ తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జూలై 21 వరకు రాష్ట్రంలో దాదాపు 20 శాతంలోటు వర్షపాతం నమోదైందని, మూడు రోజులుగా వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు, డీఏఓ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. గురుకులం నుంచి తప్పించుకుపోయిన బాలిక● గంట వ్యవధిలో ఆచూకీ కనుగొన్న పోలీసులు నెక్కొండ: బాలిక తప్పించుకుపోయిన సంఘటన చింతనెక్కొండ క్రాస్రోడ్డులోని టీజీ గురుకుల పాఠశాలలో సోమవారం జరిగింది. ఎస్సై మహేందర్ కథనం ప్రకారం.. కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన అప్పయ్య కుమార్తె అక్షిత ఇటీవల ఐదో తరగతిలో గురుకులంలో చేరింది. తల్లిదండ్రులపై బెంగ, ఇక్కడ చదవడం ఇష్టం లేకపోవడంతో బాలిక మూడీగా ఉండేది. ఈ క్రమంలో పాఠశాల నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని బయటకు వెళ్లింది. కాగా, సాయంత్రం 4.30 గంటలకు రోల్కాల్ (సాయంత్రం అసెంబ్లీ)లో బాలిక లేదన్ని విషయాన్ని గురుకుల ఉపాధ్యాయులు గమనించారు. దీంతో పాఠశాల ఆవరణలో వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆందోళనకు గురైన ప్రిన్సిపాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు టీంలుగా ఏర్పడి గాలించారు. ఓ ద్విచక్రవాహనంపై బాలిక అలంకానిపేట వరకు వెళ్తోంది. ఇది గమనించిన పోలీసులు బాలికను పాఠశాలకు తీసుకొచ్చి ఉపాధ్యాయుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించారు. గంట వ్యవధిలో బాలిక ఆచూకీ తెలుసుకున్న పోలీసులను పలువురు అభినందించారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలిపర్వతగిరి: స్థానిక సంస్థల ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీశ్ అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి బీజేపీ తరపున సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీ చేయాలని కోరారు. పార్టీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి మాట్లాడుతూ రేషన్ కార్డులు, సన్నబియ్యం, మరుగుదొడ్లు, శ్మశానవాటికలు, సీసీరోడ్లు, రైతు వేదికలు, గ్రామాల్లోని డంపింగ్ యార్డులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు బత్తిని దేవేందర్, జాటోత్ రవి, మండల ఉపాధ్యక్షుడు పాయిలి యాకన్న, మండల యువమోర్చా అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గోనె సంపత్, సీని యర్ నాయకులు ఏకాంతంగౌడ్, చీమల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఏఐతో విద్యాబోధన కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్ అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల వర్క్షాప్ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించారు.సాక్షి, వరంగల్: విద్యార్థులే శాస్త్రవేత్తలయ్యే అవకాశం.. వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు చక్కని వేదిక.. ఇలా విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచన శక్తిని పెంపొందించి ఆవిష్కరణలు, పరిశోధనల వైపు ఆసక్తిని కల్పించేందుకు కేంద్రం ఏటా ‘ఇన్స్పైర్ మనాక్’ అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తోంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ విద్యాసంవత్సరం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు విద్యార్థుల్లో ఉన్న సరికొత్త ఆలోచనలను తెలుసుకునేందుకు ఆయా పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ‘ఐడియా బాక్స్’లకు విశేష స్పందన లభిస్తోంది. సమాజంలో నెలకొన్న వివిధ సమస్యలకు పరిష్కారం కనుగొనే తమ ఆలోచనలను ఓ కాగితంలో రాసి ఆ ఐడియా బాక్స్లో వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ సొల్యూషన్స్, సస్టెయినబుల్ టెక్నాలజీ, యాక్సెసబులిటీ అండ్ అసిస్టివ్ డివైజెస్, ఇతర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్న ఈ బాక్స్ల్లోని కాగితాలను రెండు వారాలకోసారి చదువుతున్న ఉపాధ్యాయులు మెరుగ్గా ఉన్న వాటిని పక్కనబెడుతున్నారు. సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అప్పటివరకు ఇంకా వీటికి మించి మెరుగైన ఐడియాలు వస్తాయనే ఆశతో ఉన్నారు. ఇలా విద్యార్థులతోనే ఆలోచనలు రప్పించి, ఆ తర్వాత ఉపాధ్యాయుడు కూడా సహకరించి వారి ప్రాజెక్టులు జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయిలో శభాష్ అనిపించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, జెడ్పీ, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్, మైనార్టీ, గురుకులాల్లో ఆరు నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2025– 26 ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం పోటీపడుతున్నారు. 2024–25లో రెండు ఆలోచనలు జాతీయస్థాయికి ఎంపికై న సంగతి తెలిసిందే. రాయపర్తి మండలంలోని కేశవపూర్ హైస్కూల్ నుంచి అడ్జస్టబుల్ అప్పర్ బెర్త్ ల్యాడర్ ఇన్ ట్రైన్, వర్ధన్నపేట ఆల్ఫోర్స్ స్కూల్కు చెందిన విద్యార్థులు రూపొందించిన తీయడానికి వీలులేని చెత్తను ట్రాలీయే తీసుకునే ఆలోచన జాతీయస్థాయికి ఎంపికై ంది. విద్యార్థులను ప్రోత్సహించాలి.. విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తిని పెంచడానికి, పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను, వారి ఆలోచన శక్తిని తట్టి లేపడానికి ఇన్స్పై ర్ మనాక్ అవార్డులు సదావకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రాజెక్టులు రూపొందించాలి. పాఠశాలల్లో ఐడియా బాక్స్, ఐడియా కాంపిటిషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం ద్వారా వినూత్న ఆలోచనలను విద్యార్థుల నుంచే రాబడుతున్నాం.. – డాక్టర్ కట్ల శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి ఇన్స్పైర్ నామినేషన్లు ఎక్కువగా ఉండాలి.. విద్యార్థులు తమ ఆలోచనలను ఉపాధ్యాయులతో పంచుకుంటూ చుట్టూ ఉండే ఎన్నో స్థానిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనేందుకు ఇదొక మంచి అవకాశం. జిల్లాలోని అన్ని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ ప్రత్యేక కార్యాచరణతో ఈ విద్యా సంవత్సరం జిల్లా తరఫున నామినేషన్ల సంఖ్య అత్యధికంగా ఉండేలా చూడాలి. ప్రతి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి ఐదుగురు విద్యార్థుల ఆలోచనలను నామినేషన్లుగా అప్లోడ్ చేయాలి. తద్వారా విద్యార్థుల్లో పరిశోధనాత్మక, ఆవిష్కరాణత్మక ఆలోచనలు, నైపుణ్యాలు పెంపొందుతాయి. – మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి●● నిరంతర పర్యవేక్షణకు సీసీ కెమెరాల ఏర్పాటు ● ఒక్కో జూనియర్ కళాశాలకు 14 నుంచి 16 వరకు కేటాయింపు ● విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన, ల్యాబ్ సౌకర్యం, ఫిజిక్స్వాలా శిక్షణ న్యూస్రీల్జపాన్కు వెళ్లే అవకాశం.. విద్యార్థులు తమ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఉపాధ్యాయుల సహకారంతో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేయాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.10 వేలను విద్యార్థి ఖాతాలో నమోదు చేస్తోంది. ఆయా నిధులతో ప్రాజెక్టులు రూపొందించి జిల్లా స్థాయి ఇౖన్స్పైర్ మనాక్ అవార్డుల ప్రదర్శనలో పాల్గొనాలి. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయికి ఎంపికై తే రూ.20 వేల నుంచి 30 వేల వరకు నగదు ఇచ్చి ప్రోత్సహిస్తారు. అలాగే, జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రాజెక్టులకు సకుర కార్యక్రమం ద్వారా జపాన్ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇన్స్పైర్ మనాక్ అవార్డుల నామినేషన్ల సంఖ్య సంఖ్యాత్మకంగా, గుణాత్మకంగా పెంచడానికి రాష్ట్ర విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యాశాఖలు జిల్లా రాష్ట్రస్థాయిలో పలు దఫాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి.ఆవిష్కరణలు, పరిశోధనల వైపు అడుగులు పాఠశాలల్లో ఐడియా బాక్స్లకు విశేష ఆదరణ ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం ఆసక్తి సెప్టెంబర్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం గతేడాది జాతీయస్థాయికి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు జిల్లాలో గత మూడేళ్లలో ఎంపికై న ప్రాజెక్టులు సంవత్సరం ఎంపికై న ప్రాజెక్టులు 2022–23 1462023–24 1472024–25 167 -
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అరిగోస
పర్వతగిరి: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్రావు అధ్యక్షతన ఎంపీటీసీల క్లస్టర్ల వారీగా సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. వారం రోజుల్లో పంటలకు సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నీళ్ల కోసం తాను పాదయాత్ర చేస్తే కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకురావడానికి మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు వద్ద లాఠీదెబ్బలు తిన్నానని గుర్తుచేశారు. ఒక బ్లాక్మెయిలర్ చేతిలో ప్రభుత్వం నడవడం బాధాకరం అన్నారు. నియోజకవర్గ ఇన్చార్జ్ జోరిక రమేశ్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డీలిమిటేషన్తో వర్ధన్నపేట జనరల్.. డీలిమిటేషన్లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గం జనరల్గా మారనుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వ్యాఖ్యానించారు. గతంలో జనరల్గా ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారని చెప్పారు. సంగెం మండలాన్ని పరకాలలో,హసన్పర్తి మండలాన్ని వర్ధన్నపేట, రాయపర్తి మండలాన్ని పాలకుర్తిలో కలిపారని చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
ప్రభుత్వ కళాశాలల్లో నిఘా
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇక నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. అందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జూని యర్ కళాశాలల్లోని తరగతి గదులు, ల్యాబ్లు, స్టాఫ్ గది, ప్రిన్సిపాల్ గది, వరండా, కళాశాల ప్రాంగణంలో సీసీ కెమెరాలు బిగించారు. ఒక్కో కళాశాలలో 14 నుంచి 16 వరకు, అవసరమైన చోట 20వరకు సీసీ కెమెరాలు అమర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ నిరంతరం కొనసాగనుంది. విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ గతంలో కేవలం ఇంటర్మీడియట్ పరీక్షల సమయంలో మాత్రమే పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేవారు. ఆ తరువాత వాటిని తీసివేసేవారు. ఈ విద్యా సంవత్సరం 2025 – 2026 నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రధానంగా విద్యార్థుల హాజరు, అధ్యాపకుల విద్యాబోధనపై నిరంతర పర్యవేక్షణ కొనసాగనుంది. ప్రతీ తరగతి గదిలో నిఘా ఉంటుంది. అకడమిక్ మానిటరింగ్ కమిటీలు, డీఐఈఓలతో పాటు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ ద్వారా అధికారులు పర్యవేక్షించనున్నారు. విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా.. గతంలో ప్రభుత్వ కళాశాలలకు విద్యార్థులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్లిపోయేవారు. దాంతో హాజరు శాతం తక్కువగా ఉండడంతో పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం కూడా తక్కువగా ఉండేది. ఈ క్రమంలో సరైన విద్యాబోధన, పరీక్షల ఫలితాలు మెరుగుపడేలా ఉన్నతాధికారులు ఇంటర్లో పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. అందులో భాగంగా తాజాగా సీసీ కెమెరాల ఏర్పాటుతో విద్యార్థుల హాజరు శాతం పెరిగే అవకాశం ఉంది. ఇకనుంచి అధ్యాపకులు కూడా సక్రమంగా విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్టు అధ్యాపకుడు ఒకరోజు రాకుంటే ఆ పీరియడ్లో వేరే అధ్యాపకుడు విద్యాబోధన చేయాల్సి ఉంటుంది. ఫిజిక్స్వాలా శిక్షణపై.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ఫిజిక్స్వాలా ద్వారా సంబంధిత వెబ్సైట్ ద్వారా జేఈఈ, ఐఐటీ, ఎప్సెట్, నీట్లాంటి ఎంట్రెన్స్ పరీక్షల కోసం ఇంటర్ విద్యార్థులకు శిక్షణ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఫిజిక్స్వాలా శిక్షణకు సంబంధించిన టైంటేబుల్ను డీఐఈఓల ద్వారా ఆయా జిల్లాల కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందించా రు.ప్రస్తుతం వివిధ కళాశాలల్లో ల్యాప్టాప్లు, కంప్యూటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ప్రతీ కళాశాలకు ఇన్ప్లాంట్స్ టేబుల్స్ కూడా రానున్నాయి. పెద్ద కంప్యూటర్ మానిటర్లో వెబ్సైట్ ద్వారా వీడియోలను విద్యార్థులు తిలకించనున్నారు. ఫిజిక్స్వాలా శిక్షణను విద్యార్థులు సరిగా వినియోగించుకుంటున్నారా లేదా అనేది హైదరాబాద్ నుంచి సంబంధిత అధికారులు కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణకు ప్రతీజిల్లాకు ఒకరి చొప్పున ఇన్చార్జ్లను నియమించారని సమాచారం. అలాగే, డీఐఈఓలు కూడా పర్యవేక్షిస్తారు. అందుకు డీఐఈఓ కార్యాలయాల్లో కూడా సీసీ కెమెరాలకు సంబంధించి డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవేళ సీసీ కెమెరాల్లో టెక్నికల్ సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేలా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక టెక్నీషియన్ చొప్పున నియమించారు. నిరంతర పర్యవేక్షణతో విద్యాబోధన మెరుగు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల నిఘాతో నిరంతర పర్యవేక్షణతో పారదర్శకత పెరగనుంది. అధ్యాపకుల బోధన, విద్యార్థుల హాజరుపై పర్యవేక్షణ ఉండడంతో విద్యాబోధన మెరుగుపడుతుంది. విద్యార్థుల హాజరు పెరగడంతోపాటు అధ్యాపకులు విద్యాబోధనతో మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రయోగాలు చేయడం, టైంటేబుల్ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. జిల్లాల్లో డీఐఈఓలతో పాటు హైదరాబాద్ నుంచి కూడా నిఘా ఉంటుంది. – శ్రీధర్సుమన్, వరంగల్ డీఐఈఓఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ కళాశాలల సంఖ్య ఇలా.. హనుమకొండ 9, వరంగల్ 11, మహబూబాబాద్ 10, జనగామ 7, ములుగు 8, జయశంకర్ భూపాలపల్లి 5 -
ఆగస్టు 10వరకు రేషన్ కార్డుల పంపిణీ
హన్మకొండ అర్బన్: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని సీఎంఓ కార్యాలయం నుంచి వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్కార్డుల పంపిణీ వంటి పలు అంశాలపై మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, సీతక్క, శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యవసాయ సాగు పనులు సజావుగా సాగేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఎంహెచ్ఓ అప్పయ్య, డీఏఓ రవీందర్సింగ్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ల వీసీలో సీఎం రేవంత్రెడ్డి -
పింగిళిలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ వడ్డేపెల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 2025 – 2026వ విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులలో విద్యాబోధనకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయో టెక్నాలజీలో –1, స్టాటిస్టిక్స్ 1, అప్లైడ్ నూట్రీషన్ 1, బీసీఏ 1, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 2, డేటాసైన్స్ 1, ఇంగ్లిష్ 1, మ్యాథమెటిక్స్ 1, బీబీఏ రిటైల్ 1, మైక్రో బయాలజీలో (1) ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 24న ఉదయం ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. పీహెచ్డీ, నెట్, స్లెట్, సెట్తో పాటు అనుభవం, అర్హతలను బట్టి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. కాకతీయ డిగ్రీ కళాశాలలో..విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 – 2026వ విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) –3, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ ఆపరేషన్స్ 1, బీసీఏ 1, బిజినెస్ అనలిటిక్స్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3, క్రాప్ ప్రొడక్షన్ 1, డేటా సైన్స్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ఫిషరీస్ 1, మైక్రో బయాలజీ 1, స్టాటిస్టిక్స్ (1) కోర్సుల విద్యాబోధనకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఈ నెల 24న సాయంత్రం 4గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాల కోసం వైస్ ప్రిన్సిపాల్ రజనీలతను సంప్రదించాలని సూచించారు. 30న జిల్లా స్థాయి జూడో పోటీలురామన్నపేట: నగరంలోని కెమిస్ట్ భవన్లో ఈ నెల 30న సబ్ జూనియర్స్, కేడెట్ విభాగాల్లో బాల బాలికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్ యాదవ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2011 – 2013వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 30 – 66 కిలోలలోపు, బాలికలు 28 – 57 కిలోల బరువు ఉండాలని పేర్కొన్నారు. కేడెట్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2008 – 2010వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 50 – 90 కిలోల లోపు, బాలికలు 40 – 90 కిలోలలోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ వెంట తీసుకొని రావాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 5, 6వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 99899 53253 నంబర్లో సంప్రదించాలని సూచించారు. రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికవరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న 10వ జూనియర్ అంతర్ జిల్లాల బాస్కెట్బాల్ పోటీలకు వరంగల్ జిల్లా బాలుర జట్టు ఎంపిక పూర్తైనట్లు వరంగల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీశ్వర్ రెడ్డి, రమేష్ తెలిపారు. ఈ నెల 6వ తేదీన హనుమకొండ కుమార్పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో జిల్లా స్థాయి ఎంపికను నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు వివరించారు. 25నుంచి పలు రైళ్లు రద్దుకాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి బైపాస్ లైన్ వర్క్స్, బల్లార్షా – కాజీపేట సెక్షన్లో రైల్వే బ్లాక్తో ఈనెల 25వ తేదీ నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. కాజీపేట మీదుగా బల్లార్షా, వరంగల్ మీదుగా కరీంనగర్ నుంచి కాగజ్నగర్ వరకు ప్రయాణించే పలు ప్యాసింజర్ రైళ్లను కాజీపేట వరకు మాత్రమే నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. -
ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు
హన్మకొండ: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ నగర్లో ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పడకేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట మేరకు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్డులు ఇవ్వగా, ఇప్పుడు తిరిగి తమ ప్రభుత్వ హయాంలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,469 కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, రవీందర్ యాదవ్, వేముల శ్రీనివాస్, విజయశ్రీ రజాలీ, మానస, పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు, చీకటి శారద, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గాండ్ల స్రవంతి, తదితరులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు పంచుడే.. హనుమకొండ బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంచనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అనుకున్నామని, సెలవు దినం కావడంతో వాయిదా వేశామన్నారు. అంబేడ్కర్నగర్, జితేందర్ నగర్కు చెందిన అర్హులందరికి ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. గత జాబితాలో నలుగురైదుగురు ఉద్యోగులున్నట్లు తేలిందన్నారు. అనర్హులను దొరకబట్టింది తామేనని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి -
ఏఐతో విద్యాబోధన: నిట్ డైరెక్టర్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్షాప్ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలోని ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ కన్నన్ మౌధాల్యా, ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ సమీర్ సహస్ర బుదే, నిట్ టీటీఆర్ చైన్నె ప్రొఫెసర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
మాంకాళీ శరణం మమః
యేపరిల్లల తోరణాలు.. గణగణనాదాల కాళ్ల గజ్జెలు.. ధనధన డప్పుల దరువు మోతలు.. రెట్టించి సప్పుడు జేసే ఢమరుక వాయిద్యాలు.. పసుపు పూసుకున్న పోతరాజులు.. వీపును వాయించే వీరగోనెలు.. జడితిచ్చే కోళ్లు, మేకలు.. నెత్తిన చేరిన బోనాల మిద్దెలు.. వీటన్నింటి నడుమన మాంకాళికి మనసారా మొక్కులు.. కాజీపేట 63వ డివిజన్ విష్ణుపురి మహంకాళి దేవాలయంలో ఆదివారం బోనాల జాతర వైభవంగా నిర్వహించారు. ఆషాఢమాసం చివరి ఆదివారం అమ్మవారిని దర్శించుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. పురవీధుల్లో అమ్మవారిని ప్రత్యేక రథంపై ఊరేగించారు. దాదాపు 70 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. – కాజీపేట -
అరటి సాగుకు ప్రోత్సాహం..
పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్ర భుత్వం రాయితీ అందిస్తోంది. వరంగల్ జిల్లాలో 393 ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 470 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. అరటిని టిష్యూ కల్చర్, పిలకల పద్ధతిలో సాగు చేస్తారు. ఈరెండు సాగు పద్ధతులకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా సాగుకు నిర్వహణ ఖర్చులకు 40 శాతం బంచు కవర్స్ సాగుకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. టిష్యూ కల్చర్ అరటి సాగుకు ఎకరాకు రూ.28 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు, బంచ్ కవర్స్ అరటి సాగుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తున్నారు. -
వ్యతిరేక ప్రచారంతోనే భద్రకాళి బోనాలు రద్దు
● మంత్రి కొండా సురేఖ ● వంచనగిరి కోట గండి మైసమ్మకు ప్రత్యేక పూజలు గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని వంచనగిరి కోట గండి మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. ఈఉత్సవాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. తాను భద్రకాళి అమ్మవారి బోనాలను వైభవంగా నిర్వహించాలని కోరుకున్నానని, అయితే కొంత మంది వ్యతిరేక ప్రచారం చేయడంతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ.. తనకు కోట మైసమ్మ తల్లి తప్ప ఇతర విషయాలేవీ తెలియవని పేర్కొన్నారు. నేటి గ్రేటర్ గ్రీవెన్స్ రద్దువరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్ సెల్ను రద్దు చేసినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యాలయానికి సెలవు ఉంటుందని పేర్కొన్నారు. నగర ప్రజలు బల్దియా ప్రధాన కార్యాలయానికి రావొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. 23 నుంచి కేయూ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎంబీఏ రెండో సెమిస్టర్ పరీక్షలు ఈనెల 23 నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆసీంఇక్బాల్ తెలిపారు. ఈనెల 23, 25, 28, 30, ఆగస్టు ఒకటి, నాలుగో తేదీల్లో పరీక్షలు జరుగుతాయని వారు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. పర్యాటకుల సందడి వాజేడు: మండల పరిధి చీకుపల్లి సమీపంలోని బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు కావడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలపాతం జలధారలను వీక్షించడంతో పాటు సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. -
సుగంధాల సిరులు
● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ● వరంగల్ జిల్లాలో 133 ఎకరాలు ● హనుమకొండ జిల్లాలో 172 ఎకరాల్లో సాగుహన్మకొండ: తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అర్జించాలన్నా.. కొంత పెట్టుబడితో అధిక రాబడిని సాధించాలన్నా.. పూల తోటల సాగు బెటర్ అని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తుండడం, అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే పూల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పూల తోటల సాగు నిలుస్తోంది. సీజన్కు అనుగుణంగా పంట చేతికొచ్చేలా సాగు చేస్తే అధిక లాభాలు అర్జించవచ్చు, పెళ్లిలు, శుభకార్యాలు, ప్రధాన పండుగలకు పంట చేతికి వచ్చేలా సాగు చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 172 ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 133 ఎకరాల్లో పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తూ పూల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన పంటల అభివృద్ది మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. విడి పూలు (మంతి, చామంతి, కనకాంబరం, మల్లె), సాగుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా 40 శాతం రాయితీని అందిస్తోంది. ఎకరానికి రూ.8 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీని పొందవచ్చు. దుంపజాతి పూల సాగు (గ్లాడియోలస్, లిల్లీ)కి 40 శాతం రాయితీ వస్తుంది. దుంప జాతి బహు వార్షిక పూలు అయిన గ్లాడియలస్, లిల్లీ, డైస్, జర్బేర వంటి సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.40 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది.వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బంతి పూల తోటను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారి -
భద్రకాళి ఆలయంలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.సుబ్రహ్మణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ధర్మకర్తలు నార్ల సుగుణ, జారతి వెంకటేశ్వర్లు, తొగరు క్రాంతి, దేవాలయ సిబ్బంది హరినాఽథ్, కృష్ణ, నవీన్, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది. పదోన్నతులకు బ్రేక్.. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం.. తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది. త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ! ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్ రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం. డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తో పాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కానీ డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. పదోన్నతులు లేక ఇన్చార్జ్లతోనే పాలన నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం -
రూ.వంద కోట్ల విలువైన చెరువు కబ్జా
హసన్పర్తి: గోపాలపురం ఊర చెరువు కబ్జాకు గురైనట్లు అధికారులు నివేదించారు. ఆక్రమణకు గురైన ఎనిమిదెకరాల భూమి విలువ ప్రస్తుతం సుమారు రూ.వంద కోట్లుగా చెప్పొచ్చు. ఇక్కడ ఎకరాకు రూ.10 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ధర పలుకుతోంది. ఆక్రమణలో ఎనిమిది ఎకరాలు హనుమకొండ మండలం గోపాలపురం ఊర చెరువు సర్వే నంబర్ 89లో సుమారు 23.10 ఎకరాల భూమి ఉంది. గతంలో ఈ చెరువు కింద సుమారు రెండు వందల ఎకరాల ఆయకట్టు ఉండేది. నగరం సమీపంలో ఉండడం వల్ల వ్యవసాయ భూములు ప్లాట్లుగా మారాయి. సుమారు 3.09 ఎకరాల చెరువు శిఖాన్ని ఓ రియల్టర్ కబ్జా చేసి వెంచర్ చేసినట్లు స్థానికులు తెలిపారు. పక్క సర్వే నంబర్ 90తో రిజిస్ట్రేషన్ చేసి సుమారు 60 ప్లాట్లు విక్రయించినట్లు వివరించారు. మరో ఐదెకరాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, కొంతమంది బడాబాబులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు చేసి విక్రయించారని ప్రజలు చెబుతున్నారు. ఇలా సుమారు ఎనిమిది ఎకరాల మేర చెరువును కబ్జాదారులు ఆక్రమించారు. ఎఫ్టీఎల్తో పాటు బఫర్ జోన్ ప్రాంతం కూడా కబ్జాకు గురైంది. శ్మశాన వాటిక లేకపోవడం వల్ల చెరువులోని కొంత ప్రాంతాన్ని గోపాలపురం వాసులు వినియోగించుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ నిబంధనలకు విరుద్ధంగా చెరువలో వెంచర్ వెలిసింది. ఆయా శాఖల అధికారులు మాముళ్లు తీసుకుని వెంచర్కు అనుమతి ఇచ్చారని స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నీటి పారుదలశాఖ అధికారులు నిరభ్యంతర పత్రాలు జారీ చేయడం వల్ల వెంచర్ వెలచినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ అధికారులు కూడా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. చెరువు మత్తడి మాయమైంది. దీంతో చెరువులోకి వరద వచ్చినప్పుడు సమీపంలోని ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెరువులో నుంచి తాత్కాలిక రోడ్డు కూడా నిర్మించారు. చెరువులో నిర్మాణాలు ఉంటే తొలగిస్తాం చెరువును ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తేలితే వాటిని తొలగిస్తాం. కబ్జాదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కబ్జాకు గురికాకుండా చెరువుకు ఉన్నతాధికారులు హద్దులు నిర్ధారించాలి. – కేఆర్.నాగరాజు, ఎమ్మెల్యే, వర్ధన్నపేట శిఖంలో వెలిసిన వెంచర్.. అక్రమ నిర్మాణాలు చెరువులో తాత్కాలిక రోడ్డు నిర్మాణం హైకోర్టులో పిటిషన్ ఉన్నా ఆగని కట్టడాలుకలెక్టర్కు నివేదిక ఎనిమిది ఎకరాల మేర గోపాలపురం చెరువు కబ్జాకు గురైందని నీటి పారుదలశాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదించారు. అక్రమ నిర్మాణాలు వెలశాయని పేర్కొన్నారు. ఈ మేరకు 2021లో ఆ ప్రాంతానికి చెందిన తుపాకుల దశరథం.. హైకోర్టులో పిటిషన్ వేశాడు. కలెక్టర్, నగర కమిషనర్, నీటి పారుదలశాఖతో పాటు ఎనిమిది విభాగాలకు చెందిన అధికారుల పేర్లను పిటిషన్లో పొందుపర్చాడు. దాంతో రెండేళ్ల క్రితం హైకోర్టు నోటీసులు జారీచేసింది. -
క్రికెట్ స్టేడియం.. స్పోర్ట్స్ స్కూల్
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్లో ప్రతిష్టాత్మకంగా క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. ఈమేరకు గ్రేటర్ వరంగల్ పరిధి ఎమ్మెల్యేలు ఆదివారం హైదరాబాద్లో ముఖ్యమంత్రిని కలిసి నగరాభివృద్ధికి పలు ప్రతిపాదనలు చేశారు. మామునూరు ఎయిర్పోర్ట్, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ తదితర పథకాల కోసం ఇప్పటికే సుమారు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించారు. తాజాగా ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, మామిడాల యశస్వినిరెడ్డి కలిసి క్రికెట్ స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ కావాలని కోరారు. ఈమేరకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలోని 50 ఎకరాలు అనువుగా ఉంటుందని వినతిపత్రం ద్వారా సీఎం రేవంత్కు ఎమ్మెల్యేలు వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం తన నివాసంలో కలిసిన ఎమ్మెల్యేల బృందంతో అరగంటకు పైగా.. ఉమ్మడి వరంగల్లో జరుగుతున్న అభివృద్ధిపై సీఎం చర్చించినట్లు తెలిసింది. ఈసందర్భంగా వివిధ క్రీడాంశాల్లో ఉమ్మడి వరంగల్ నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించిన క్రీడా దిగ్గజాలు ఉన్నారని, అందులో ద్రోణాచార్య, అర్జున అవార్డులు అందుకున్న వారు ఉన్నారని సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు వివరించారు. ప్రస్తుతం హనుమకొండలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఒక్కటే ఉందని, ఇక్కడ అనేక మంది క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేకంగా క్రికెట్ స్టేడియాన్ని మంజూరు చేస్తే మరింత క్రీడా పురోగతిని సాధించవచ్చని తెలిపారు. స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అవసరమైన స్థలం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామంలో ‘కుడా’కు చెందిన సర్వే నంబర్ 325లో 20 ఎకరాలు, పక్కనే మరో 30 ఎకరాల స్థలం జాతీయ రహదారి 163కి ఆనుకుని నగరానికి దగ్గరగా అందుబాటులో ఉందని వివరించారు. వరంగల్లో స్పోర్ట్స్ స్కూల్, క్రికెట్ స్టేడియం నగరానికి మణిహారంగా నిలుస్తాయని సీఎం రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేలు తెలిపారు. దీంతో స్పోర్ట్స్ స్కూల్, ప్రత్యేక క్రికెట్ స్టేడియం మంజూరు చేయాలన్న వినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. ఈమేరకు స్పోర్ట్స్ స్కూల్, స్టేడియం నిర్మాణాలకు కావాల్సిన ప్రతిపాదనలు పరిశీలించి, అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సంబంధిత శాఖ సెక్రటరీకి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా.. త్వరలోనే ఆరెండింటినీ మంజూరు చేస్తానని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇవ్వడంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.‘గ్రేటర్ వరంగల్’లో ఏర్పాటుకు సీఎం గ్రీన్సిగ్నల్ ఎమ్మెల్యేల బృందానికి రేవంత్రెడ్డి హామీ జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలు ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల సమీపంలో 50 ఎకరాల్లో ప్రతిపాదన మంజూరు పత్రాలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం -
సుగంధాల సిరులు
● తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి ● వరంగల్ జిల్లాలో 133 ఎకరాలు ● హనుమకొండ జిల్లాలో 172 ఎకరాల్లో సాగుహన్మకొండ: తక్కువ స్థలంలో ఎక్కువ లాభాలు అర్జించాలన్నా.. కొంత పెట్టుబడితో అధిక రాబడిని సాధించాలన్నా.. పూల తోటల సాగు బెటర్ అని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తుండడం, అధిక లాభాలు వస్తుండడంతో రైతులు ఇప్పుడిప్పుడే పూల సాగు వైపు దృష్టి సారిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటల సాగుకు ప్రత్యామ్నాయంగా పూల తోటల సాగు నిలుస్తోంది. సీజన్కు అనుగుణంగా పంట చేతికొచ్చేలా సాగు చేస్తే అధిక లాభాలు అర్జించవచ్చు, పెళ్లిలు, శుభకార్యాలు, ప్రధాన పండుగలకు పంట చేతికి వచ్చేలా సాగు చేస్తే లాభాలు ఎక్కువగా వస్తాయి. హనుమకొండ జిల్లాలో ప్రస్తుతం 172 ఎకరాల్లో, వరంగల్ జిల్లాలో 133 ఎకరాల్లో పూల తోటల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ అందిస్తూ పూల తోటల సాగు విస్తీర్ణం పెంచేందుకు ఉద్యాన పంటల అభివృద్ది మిషన్ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. విడి పూలు (మంతి, చామంతి, కనకాంబరం, మల్లె), సాగుకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా 40 శాతం రాయితీని అందిస్తోంది. ఎకరానికి రూ.8 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీని పొందవచ్చు. దుంపజాతి పూల సాగు (గ్లాడియోలస్, లిల్లీ)కి 40 శాతం రాయితీ వస్తుంది. దుంప జాతి బహు వార్షిక పూలు అయిన గ్లాడియలస్, లిల్లీ, డైస్, జర్బేర వంటి సాగుకు ఉద్యాన శాఖ ద్వారా ఎకరాకు రూ.40 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బంతి పూల తోటను పరిశీలిస్తున్న ఉద్యాన అధికారి -
కోటమైసమ్మకు బంగారు బోనం
సమర్పించిన మంత్రి సురేఖ, వంచనగిరి గ్రామస్తులు గీసుకొండ: మండల పరిధిలోని కోటగండి కోట మైసమ్మకు బంగారు బోనాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దంపతులు, భక్తులు, వంచనగిరి వాసులు ఆదివారం సాయంత్రం భారీగా తరలివచ్చారు. అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి కొండా సురేఖ, భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కూతురు సుస్మితా పటేల్, మనవరాలు శ్రేష్టా పటేల్, అల్లుడు అభిలాష్తో పాటు వారి అభిమానులు, గ్రామస్తులు తరలిరావడంతో జాతర వాతావరణం నెలకొంది. భద్రకాళి బోనాలపై వెనక్కి.. భద్రకాళి అమ్మవారి బోనాలను వైభవంగా జరపాలని కోరుకున్నానని, అయితే కొంత మంది ఈ విషయాన్ని వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్లే వెనక్కి తగ్గినట్లు మంత్రి సురేఖ మీడియాకు వెల్లడించారు. రాష్ట్రం సుభిక్షంగా, పాడి పంటలతో విరాజిల్లాలని తమ ఇష్టదైవం కోటమైసమ్మను కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి దయతో ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ తనకు కోట మైసమ్మ తల్లి తప్ప ఇతర విషయాలేవీ తెలియవని పేర్కొన్నారు. -
ఏడాదిలోపే బదిలీలు!
కాజీపేట అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా రెండు నుంచి మూడేళ్ల తర్వాత బదిలీ అవుతారు. కానీ, ఇందుకు భిన్నంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలోని అధికారులను ఏడాదిలోపే బదిలీలు చేయడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేసింది. ఇందులో భాగంగా 15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్లాట్ బుకింగ్, పారదర్శక సేవలకు ఈ–సైన్తో రిజిస్ట్రేషన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై పర్యవేక్షణ కొనసాగించే జిల్లా రిజిస్ట్రార్లకు ఏడాదిలోపే స్థానచలనం కల్పించింది. పదోన్నతులకు బ్రేక్.. జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లుగా విధులు నిర్వర్తిస్తున్న అధికారులకు జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతులు కల్పించడంలో జాప్యం అవుతోంది. సుమారు నాలుగేళ్లుగా జిల్లా రిజిస్ట్రార్ స్థానంలో అధికారులు లేకపోవడంతో ఇన్చార్జ్లతోనే పాలన కొనసాగుతోంది. కాగా, ఒక్కో జిల్లా రిజిస్ట్రార్ రెండు మూడు కార్యాలయాలకు పనిచేయాల్సి వస్తోంది. ఇటీవల కాలంలో బదిలీ అయిన ఫణీందర్ హైదరాబాద్ జిల్లా రిజిస్ట్రార్గా ఆఫీస్ డ్యూటీలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్గా, కరీంనగర్ జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్కుమార్ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. సీనియార్టీ ప్రకారం తమకు పదోన్నతి కల్పించాలని గతంలో విధులు నిర్వర్తించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్లు, వివిధ జిల్లాలకు చెందిన గ్రూప్–1 అధికారులు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పదోన్నతులకు బ్రేక్ పడింది. త్వరలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ! ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతేడాది ఆగస్టులో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అటెండర్ స్థాయి నుంచి జిల్లా రిజిస్ట్రార్ వరకు బదిలీలు అయ్యారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాధ్యతలను స్వీకరించి లాంగ్ లీవ్లోకి వెళ్లిపోయిన సబ్ రిజిస్ట్రార్లు, సహాయ రిజిస్ట్రార్ చిట్స్లు అనగా స్టేషన్ఘన్పూర్, వరంగల్ ఆర్వో చిట్స్ కార్యాలయంలోని అధికారులతోపాటు వరంగల్ ఆర్వోకు చెందిన సబ్రిజిస్ట్రార్లు సైతం స్థానచలనంలో భాగంగా నేడో రేపో బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, మేరా నంబర్ ఆయేగా అంటూ ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చర్చించుకోవడం గమనార్హం. డేంజర్ జోన్లకు వెళ్లేందుకు జంకుతున్న సబ్ రిజిస్ట్రార్లు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ఘన్పూర్ సబ్ రిజిస్ట్రార్తోపాటు ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. దీంతో ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు డేంజర్ జోన్లుగా మారిపోయాయి. ట్రాన్స్ఫర్ ఓకే కాని డేంజర్ జోన్లకు వద్దు అంటూ తలలు పట్టుకుంటున్నారు సబ్ రిజిస్ట్రార్లు. పదోన్నతులు లేక ఇన్చార్జ్లతోనే పాలన నేడో రేపో సబ్ రిజిస్ట్రార్లకు స్థానచలనం -
అరటి సాగుకు ప్రోత్సాహం..
పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్ర భుత్వం రాయితీ అందిస్తోంది. వరంగల్ జిల్లాలో 393 ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 470 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. అరటిని టిష్యూ కల్చర్, పిలకల పద్ధతిలో సాగు చేస్తారు. ఈరెండు సాగు పద్ధతులకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా సాగుకు నిర్వహణ ఖర్చులకు 40 శాతం బంచు కవర్స్ సాగుకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. టిష్యూ కల్చర్ అరటి సాగుకు ఎకరాకు రూ.28 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు, బంచ్ కవర్స్ అరటి సాగుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తున్నారు. -
మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
రాయపర్తి: పంచాయతీ ఉద్యోగ, కార్మికుల మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) వరంగల్ జిల్లా అధ్యక్షుడు గూడెల్లి ఉప్పలయ్య అధ్యక్షతన ఆదివారం పంచాయతీ ఉద్యోగ, కార్మికులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నిత్యం గ్రామాల్లో అనేక పనులు చేస్తూ సస్యశ్యామలంగా ఉంచుతున్న గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులను మల్టీపర్పస్ విధానం కట్టు బానిసలుగా చేస్తుందన్నారు. అనేక సంవత్సరాలుగా పని చేస్తున్నా పర్మనెంట్ చేయకపోవడంతో పాటు కనీస వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, చట్టపరమైన సౌకర్యాలకు నోచుకోని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేస్తామని హామీనిచ్చి మరిచిపోయిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఈనెల 23న మహబూబాబాద్ జిల్లా గార్లలో రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్పాలినల్లబెల్లి: సంక్షేమ పథకాల పేరుతో యువతను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన మేడిపల్లి రాజు గౌడ్ ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అంతకు ముందు మండల కేంద్రంలో రాజుగౌడ్ తన మద్దతు దారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో సుదర్శన్ రెడ్డి స్వగృహంలో నల్లబెల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నర్సంపేట నియోజకవర్గంలో తాను మంజూరు చేయించిన బీటీ, సీసీ రోడ్లను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రద్దు చేసి గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, పీఎసీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడుప్రవీణ్ పాల్గొన్నారు. పర్యాటకుల సందడి వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రభుత్వ సెలవు కావడంతో పర్యాటకులు భారీసంఖ్యలో తరలివచ్చి ప్రకృతి అందాలు చూసి ఫిదా అయ్యారు. జలపాతం జలదారలను వీక్షించడంతో పాటు సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. కొలనులో స్నానాలు చేయడంతో పాటు ఫొటోలు, సెల్ఫీలు దిగారు. భద్రకాళి ఆలయంలో పూజలుహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయాన్ని ఆదివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి, కన్స్ట్రక్షన్ రైల్వే సేఫ్టీ ప్రాజెక్ట్స్ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఏకే సిన్హా దంపతులు, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.సుబ్రహ్మణియన్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈఓ శేషుభారతి వారిని ఆలయమర్యాదలతో స్వాగతించారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధికసంఖ్యలో భక్తులు దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే, వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు దేవాలయ ప్రాంగణంలో ఈఓ శేషుభారతి మొక్కలు నాటారు. -
వడ్డీ బకాయిల విడుదల
ఎస్హెచ్జీలకు రెండు నెలల వడ్డీని మంజూరు చేసిన ప్రభుత్వంగీసుకొండ: బ్యాంకు లింకేజీ రుణాలు తీసుకున్న సెర్ప్ పొదుపు సంఘాల మహిళలకు రెండు నెలల వడ్డీ బకాయిలు మంజూరయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళల అభ్యున్నతికి పలు కార్యక్రమాలను చేపడుతుండగా తాజాగా వడ్డీ బకాయిల చెల్లింపు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు వడ్డీ బకాయిలను ప్రభుత్వం ఆయా సంఘాల ఖాతాల్లో జమచేసింది. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సకాలంలో వడ్డీ బకాయిలు విడుదల కాకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బందులు పడ్డారు. 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల వడ్డీ నిధులు మంజూరు చేయలేదు. విడతల వారీగా చెల్లింపులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించింది. ఈ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2023–24 సంవత్సరానికి సంబంధించి నాలుగు నెలల బకాయిలను కొన్ని నెలల క్రితం విడుదల చేసింది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ నుంచి 2025 జనవరి వరకు పది నెలల వడ్డీ బకాయిలను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల్లోని 48,717 సంఘాలకు రూ.92.74 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అలాగే, ఇటీవల ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వడ్డీ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు సంబంధించి ఎస్హెచ్జీలు 50,372 ఉండగా వారికి వడ్డీ కింద రూ.20.27 కోట్లను మంజూరు చేయడంతో పొదుపు సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వయం ఉపాధికి ఊతం.. మహిళా సంఘాల్లోని సభ్యులు బ్యాంకు లింకేజీ కింద తీసుకున్న వడ్డీ లేని రుణాల(వీఎల్ఆర్)తో ఆర్థికంగా ఎదగటంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలువురు చిన్న తరహా పరిశ్రమలు, యూనిట్లను నెలకొల్పుతున్నారు. క్యాంటీన్ల ఏర్పాటు, పెరటికోళ్ల పెంపకం, గేదెల పోషణ, కిరాణం, క్లాత్స్టోర్లు, టైలరింగ్, సానిటరీ న్యాప్కిన్ల తయారీ తదితరాలను ఎంచుకుని ఆదాయం పొందుతూ చిన్నపాటి పారిశ్రామిక వేత్తలుగా రాణిస్తున్నారు. అలాటి వారికి వడ్డీ బకాయిలను సకాలంలో అందిస్తే మరింత ఉత్సాహంతో ముందుకు సాగే అవకాశం ఉంటుందనే ఆలోచనతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం గీసుకొండ ప్రగతి మండల సమాఖ్య వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సత్యశారద, ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పొదుపు సంఘాల మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి ప్రత్యేక మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. సంఘాల వారు ఆర్టిఫీషియల్ జ్యూయలరీ, పౌల్ట్రీ, డైరీ తదితర రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో 50,372 సంఘాలు రూ.20.27 కోట్లు పొదుపు సంఘాల ఖాతాల్లో జమపాత బకాయిల చెల్లింపు ఊసేలేదు.. ఇది ఇలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు అలాగే పేరుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన హయాం నుంచి వడ్డీ బకాయిలు విడతల వారీగా చెల్లిస్తూ వస్తోంది. అయితే గత బీఆర్ఎస్ సర్కారు కాలంలో పేరుకుపోయిన భారీ మొత్తంలోని బకాయిల గురించి ఎవరూ ఊసెత్తడం లేదు. అటు అధికారులు, ప్రభుత్వం దీనిపై ఎలాంటి ప్రకటనలు చేయకపోవడంతో అయోమయం నెలకొంది. -
‘రైతులను ఆదుకోవాలి’
నర్సంపేట: రైతులకు తక్షణం సరిపడా యూరియా, పంట రుణాలు, రూ.2లక్షల రుణమాఫీ చేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఏఐకేఎఫ్(అఖిల భారత రైతు సమాఖ్య) రాష్ట్ర ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఏఐకేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వల్లెపు ఉపేందర్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు వస్కుల మట్టయ్య, ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్, సహాయ కార్యదర్శి ఎన్రెడ్డి హంసారెడ్డి, ఏఐఏడబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గోనె కుమారస్వామి ఆధ్వర్యంలో ఆదివారం ప్రతినిధి బృందం సభ్యులు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో గత సంవత్సరం కంటే 40శాతం తక్కువ పంటలు వేసినందుకు తగిన విధంగా వ్యవసాయ ప్రణాళిక రూపొందించి పంట రుణాలు, ఎరువులు, రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతుల పంటలకు సరిపడా యూరియా దొరకక రోజంతా క్యూలో ఉండి అష్టకష్టాలు పడితే ఒకటి రెండు బస్తాలకు మించి ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్షతను మాని రాష్ట్ర కోటాకు అనుగుణంగా యూరియాను పంపించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రభుత్వం తక్షణమే పంట వేసిన ప్రతీ రైతుకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంట రుణాలు ఇవ్వాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రూ.2లక్షల పంట రుణం మాఫీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పోతుగంటి కాశి, వస్సుల కిరణ్, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దుగ్గొండి: రైతులు ఆయిల్పామ్ సాగు చేసి మెలకువలు పాటించి అధిక లాభాలు పొందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఎమ్మెల్యే ఆదివారం ఆయిల్పామ్ మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్పామ్ పంటకు ప్రభుత్వం అధిక రాయితీలు అందిస్తుందన్నారు. నాలుగేళ్లపాటు ఓపిక పడితే 30 ఏళ్ల వరకు నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చని తెలిపారు. దిగుబడికి మద్దతు ధర చెల్లించే విషయంలో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందన్నారు. రైతులు యూరియాను విచ్చలవిడిగా వాడకుండా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేయాలని వెల్ల డించారు. ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, డివిజన్ అధికారి జ్యోతి, రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం సతీష్నారాయణ, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, పీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, మాజీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్లు చెన్నూరి కిరణ్రెడ్డి, నర్సింగరావు, రైతులు దామోదర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, సంపత్రావు, యుగేంధర్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
వరంగల్లో తెలంగాణ క్రీడాపాఠశాల
సాక్షి, హైదరాబాద్: వరంగల్లో తెలంగాణ క్రీడా పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలను పరిశీలించి.. అందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శితో ఆయన మాట్లాడారు. వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల బృందం కడియం శ్రీహరి నేతృత్వంలో ఆదివారం జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్రెడ్డిని కలిసింది. ఈ బృందంలో ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, నాయిని రాజేందర్రెడ్డి, మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్.నాగరాజులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ చాలాసేపు మాట్లాడారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఒక్క స్టేడియం మాత్రమే ఉందని, జిల్లా క్రీడా అథారిటీ ఆధ్వర్యంలో వివిధ క్రీడల నిర్వహణకు ఉపయోగపడుతోందని, శిక్షణ కోసం కూడా ఉపయోగిస్తున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎంకు వివరించారు. వరంగల్ అన్ని వైపులా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాభా పెరుగుతోందని, ఇందుకు అనుగుణంగా క్రీడా సేవల విషయంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అవసరాలను తీర్చలేకపోతోందని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ క్రీడా పాఠశాలను మంజూరు చేయడం ద్వారా ప్రత్యేక క్రీడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించొచ్చని, ఈ పాఠశాలు ఏర్పాటుకు అవసరమైన 20 ఎకరాల ప్రభుత్వ భూమి ధర్మసాగర్ మండలం ఉనికిచర్లలో అందుబాటులో ఉందన్నారు. వరంగల్కు చెందిన విద్యార్థులు క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో క్రికెట్ కోసం ప్రత్యేక స్టేడియం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. క్రీడా పాఠశాలతోపాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియాన్ని వీలున్నంత త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్రెడ్డి క్రీడా పాఠశాలతో పాటు ప్రత్యేక క్రికెట్ స్టేడియం ఏర్పాటుతో పాటు జిల్లా అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఆసక్తికర భేటీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రి కొండా సురేఖ దంపతులకు విభేదాలు వచ్చిన నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఇటీవల సీఎం రేవంత్ మంత్రి సురేఖ, ఆమె కుమార్తె సుస్మితా పటేల్తో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఇప్పుడు ఆమెను వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలతో భేటీ కావడంతో ఈ సమావేశంలో రాజకీయంగా ఏం చర్చ జరిగిందన్నది ఆసక్తి నెలకొంది. ఇరుపక్షాలకు సర్దిచెప్పేందుకే రేవంత్ విడివిడిగా ఉమ్మడి వరంగల్ నేతలతో సమావేశమయ్యారని, వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలను కొంతకాలం పక్కనపెట్టేలా ఈ భేటీలో చర్చలు జరిగాయని తెలుస్తోంది. -
విద్యార్థినులను జాగ్రత్తగా చూసుకోవాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హసన్పర్తి: గురుకుల పాఠశాలలో కొత్తగా ప్రవేశం పొందిన ఐదో తరగతి విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని ఉపాధ్యాయులకు కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. నగరంలోని పలివేల్పుల క్రాస్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులు, వెల్నెస్ సెంటర్తో పాటు కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. స్టోర్ రూంలో నిల్వ చేసిన బియ్యం, కూరగాయలు, ఆహార పదార్థాలను పరిశీలించారు. టాయిలెట్లతో పాటు విద్యాలయ పరిశుభ్రతపై ఆరా తీశారు. హాస్టల్లో ఏర్పాటు చేసిన ఫోన్ సౌకర్యం గురించి వాకబు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సుభాషినితో పాటు అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశీలన.. పర్యవేక్షణ
వినతుల వెల్లువకాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో కేంద్రమంత్రులు ● పలు విభాగాల్లో తిరుగుతూ పనుల పురోగతిపై ఆరా ● పనులు సంతృప్తికరమన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ● 40 ఏళ్ల కల నెరవేరుతోందన్న మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ● కాజీపేటలో మంత్రులకు ఘనస్వాగతం.. కిక్కిరిసిన జంక్షన్ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిలు శనివారం పరిశీలించారు. యూనిట్లోని పలు విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ వారి పర్యటన సాగింది. పలు విభాగా ల్లో పనుల పురోగతిపై కేంద్రమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదినాటికి యూనిట్ నుంచి మా న్యుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వరంగల్ జిల్లావాసుల 40 ఏళ్ల సాకారమవుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.సంతోష్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎంపీ సీతా రాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారావు, అరూరి రమేశ్ ఘనస్వాగతం పలికారు. రోడ్డుమార్గంలో అయోధ్యపురం యూనిట్కు.. కాజీపేట జంక్షన్ నుంచి కేంద్రమంత్రులు నేరుగా రోడ్డుమార్గంలో అయోధ్యపురంలోని యూనిట్కు చేరుకున్నారు. మొదట మంత్రులు రైల్వే యూనిట్ లే అవుట్ రూంకు వెళ్లి లే అవుట్ను పరిశీలించారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైల్వే యూనిట్ పనుల పురోగతి, కెపాసిటీని స్థానిక రైల్వే అధికారులు వివరించారు. తర్వాత వాహనాలపై రైల్వే యూనిట్ నిర్మాణ షాపులు, ట్రాక్లను తనిఖీ చేసుకుంటూ మెయిన్ షాప్ సమీపానికి చేరుకున్నారు. అక్కడినుంచి షెడ్లను తనిఖీ చేశారు. కార్మికులతో మాటామంతి.. యూనిట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మాట్లాడారు. పనులు ఎలా సాగుతున్నాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఓ కార్మికుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా రైల్వే యూనిట్ సమీపంలో గల అయోధ్యపురం రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక రైలులో మంత్రులు హైదరాబాద్కు తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, చాడా శ్రీనివాస్రెడ్డి, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం భర్షీష్కుమార్ జైన్, సీఎంపీఈసీ మధుసూదన్రావు, సీని యర్ డీఎస్టీఈ ప్రియా అగర్వాల్, సీసీఓఎం పద్మజ, సీనియర్ డీసీఎం షిఫాలి, ఆర్వీఎన్ఎల్ ఎలక్ట్రికల్ జీఎం ఆనంద్ చెక్కిల, ఈఎం మెకానికల్ వంశీ, సీపీఎం సాయిప్రసాద్, పీఈడీ మెకానికల్ మనీష్అగర్వాల్, సీపీఆర్వో ఎ.శ్రీధర్ పాల్గొన్నారు. గంట ఆలస్యంగా పర్యటన.. కేంద్ర మంత్రులు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు రావాల్సి ఉంది. కానీ, గంట ఆలస్యంగా 2:40 గంటలకు కాజీపేటకు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. మంత్రులు రాగానే వారిని కలిసేందుకు పోటీపడగా స్వల్ప తోపులాట జరిగింది. పుష్పగుచ్ఛాలు కిందపడ్డాయి. తాము మంత్రులను కలవలేకపోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే యూనిట్లో పనులను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, నాయకులు ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ తదితరులు– 8లోu -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఎల్కతుర్తి: వర్షాకాలం సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలు, రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య హెచ్చరించారు. భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచడంతో పాటు ఎన్సీడీ రీ స్క్రీనింగ్ ప్రారంభించాలని సూచించారు. ఆస్పత్రి ఆధ్వర్యంలో హైపర్టెన్షన్, డయాబెటిస్ రోగులకు క్రమం తప్పకుండా మందులు అందించాలన్నారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ఇళ్లల్లోకి దోమలు, ఈగలు ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు జాలీలు బిగించుకొని జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. అంతకుముందు వీర్లగడ్డ తండాలో వాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు టీకాలు వేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్రెడ్డి, నివేదిత, వైద్య సిబ్బంది రాజు, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
నక్షత్ర దీక్ష వాల్పోస్టర్ల ఆవిష్కరణ
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఈ నెల 27న నిర్వహించనున్న నక్షత్ర దీక్ష వాల్పోస్టర్లను హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్తకొండ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు ఆయన సూచించారు. కాగా, నక్షత్ర దీక్ష మాలధారణ ఈ నెల 27న ప్రారంభమై ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగుతుందని ఆలయ అర్చకులు వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కిషన్రావు, అర్చకులు రాంబాబు, రాజయ్య, శ్రీకాంత్, వినయ్ పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు ఏడాదికోసారి జరుపుకుంటుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు పుట్టిన మరుసటి నెల నుంచే పుట్టిన రోజున సంబురాలు మొదలు పెడుతున్నారు. నెలకో థీమ్తో పిల్లలను వినూత్నంగా అలంకరిస్తున్నారు. కొత్త బట్టలు వేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. వాటన్నింటినీ 12 నెలలయ్యాక ఒక చోట చేర్చి ఫొటోఫ్రేమ్లు కట్టిస్తున్నారు. వీడియోలు మిక్సింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బర్త్ డే (సరిగ్గా ఏడాది) వేడుకల వేళ వాటన్నింటినీ బంధువుల ముందు ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వచ్చిన లైకులు, కామెంట్లకు దంపతులు మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – 8లోuభూపాలపల్లి అర్బన్: పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. మా బాబు పుట్టి శనివారంతో నెల రోజులు. అప్పటికప్పుడు ద్రాక్ష పళ్లతో అలంకరించి వేడుకలు జరుపుకున్నాం. ప్రతీ నెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, సరుకులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు దింపుకునేలా ప్లాన్ చేసుకున్నాం. బాబు పెద్దయ్యాక ఈ ఫొటోలు చూసి మురిసిపోతాడు. – తోనగర్ శిరీష, చెల్పూరు, గణపురంకాజీపేట: బర్త్ డే జరుపుకోవడానికి వన్ ఇయర్ వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెల నెలా ఒక్కో థీమ్తో మా బాబును రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే బాబు కూడా సంబురపడతాడు. ఒకప్పుడంటే కెమెరామెన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలా లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – నిత్యశ్రీ, కాజీపేట నర్సంపేట: కన్నబిడ్డ ఎదుగుదలను ఫొటోల్లో బంధించడం ఓ మధురానుభూతి. ప్రతి నెల బాబు పుట్టిన రోజును ఓ వేడుకలా నిర్వహించుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం జరిగిన రోజే మా బాబు కాసర్ల విహాన్ రామానుజన్రెడ్డి ఆరో నెల బర్త్డే జరిగింది. దీనికి గుర్తుగా ఇండియా ఫ్లాగ్, గన్ చూపుతూ చేసిన వేడుక మర్చిపోలేం. – కాసర్ల కావ్య, నర్సంపేట జనగామ: ఏడాదికి ఒక్కసారి బర్త్ డే నుంచి.. నెలనెలా వేడుకలు జరుపుకునే ట్రెండ్ కొనసాగుతోంది. మాకు ఒక కూతురు. 3 నెలల బాబు ఆదినందన్ ఉన్నారు. పుట్టగానే 21వ రోజు.. 50.. 100వ రోజుతో పాటు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి కేక్ కట్ చేస్తున్నాం. బిడ్డ జీవితంలో ఈ ఘట్టం మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతీ నెల ఫొటోలను భద్రంగా ఉంచుతూ.. ఏడాది జన్మదిన వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తాం. సాక్షి, మహబూబాబాద్: మా గారాల పట్టి మోజేస్ పాల్ (జాక్) ఈ ఏడాది ఫిబ్రవరి 28న పుట్టారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతీనెల 28వ తేదీ వచ్చిందంటే సాయంత్రం అంతా సందడే.. పిల్లలు, పెద్దలతో ఇంట్లో ప్రతీ పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ నెల పిల్ల వాడు పెరిగిన తీరును చూసుకుంటూ.. సంతోష పడతాం.. ఇలా ఇప్పటి వరకు నాలుగు నెలలు గడిచాయి.. ప్రతీ నెల ఫొటోలు తీసి జాగ్రత్తగా ఉంచుతున్నాం. మొదటి పుట్టిన రోజు సమయంలో ప్రతీ నెల తీసిన ఫొటోలు వరుస క్రమంలో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తాం.. – దామెర స్వరూప్, ప్రీతి, మహబూబాబాద్ పెద్దయ్యాక చూసి మురిసిపోతారు..న్యూస్రీల్కలకాలం గుర్తుండాలని..ప్రతిక్షణం ఓ తీపి గుర్తే..ప్రతీ నెల పండుగే..– ఉప్పల వీరవెంకట్, పద్మ, జనగామ -
రైతులు ఆందోళన చెందొద్దు
నర్సంపేట: గత సంవత్సరం కంటే ఎక్కువగా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం వ్యవసాయ, సహకార, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీలర్ల నుంచి రైతులకు యూరియా, ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు అల్ప సంతోషంతో రైతులను రెచ్చగొడుతూ పత్రికల్లో ప్రకటన కోసం హడావుడి చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, ఆర్డీఓ ఉమారాణి, ఏడీఏ దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువగా యూరియా నిల్వలు సమీక్షలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
పరిశీలన.. పర్యవేక్షణ
వినతుల వెల్లువకాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో కేంద్రమంత్రులు ● పలు విభాగాలను తిరుగుతూ పనుల పురోగతిపై ఆరా ● పనులు సంతృప్తికరమన్న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ● 40 ఏళ్ల కల నెరవేరుతోందన్న మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ● కాజీపేటలో మంత్రులకు ఘనస్వాగతం.. కిక్కిరిసిన జంక్షన్ కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డిలు శనివారం పరిశీలించారు. యూనిట్లోని పలు విభాగాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ.. పర్యవేక్షిస్తూ వారి పర్యటన సాగింది. పలు విభాగా ల్లో పనుల పురోగతిపై కేంద్రమంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదినాటికి యూనిట్ నుంచి మా న్యుఫ్యాక్చరింగ్ ప్రారంభమవుతుందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తవుతుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వరంగల్ జిల్లావాసుల 40 ఏళ్ల సాకారమవుతోందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ముందుగా ప్రత్యేక రైలులో కాజీపేట జంక్షన్కు చేరుకున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, రైల్వేస్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కె.సంతోష్రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ మంత్రి జి.విజయరామారావు, మాజీ ఎంపీ సీతా రాంనాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఎం.ధర్మారావు, అరూరి రమేశ్ ఘనస్వాగతం పలికారు. రోడ్డుమార్గంలో అయోధ్యపురం యూనిట్కు.. కాజీపేట జంక్షన్ నుంచి కేంద్రమంత్రులు నేరుగా రోడ్డుమార్గంలో అయోధ్యపురంలోని యూనిట్కు చేరుకున్నారు. మొదట మంత్రులు రైల్వే యూనిట్ లే అవుట్ రూంకు వెళ్లి లే అవుట్ను పరిశీలించారు. అనంతరం కాన్ఫరెన్స్హాల్లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రైల్వే యూనిట్ పనుల పురోగతి, కెపాసిటీని స్థానిక రైల్వే అధికారులు వివరించారు. తర్వాత వాహనాలపై రైల్వే యూనిట్ నిర్మాణ షాపులు, ట్రాక్లను తనిఖీ చేసుకుంటూ మెయిన్ షాప్ సమీపానికి చేరుకున్నారు. అక్కడినుంచి షెడ్లను తనిఖీ చేశారు. కార్మికులతో మాటామంతి.. యూనిట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి మాట్లాడారు. పనులు ఎలా సాగుతున్నాయని కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఓ కార్మికుడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రోడ్డు మార్గం గుండా రైల్వే యూనిట్ సమీపంలో గల అయోధ్యపురం రైల్వే గేట్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక రైలులో మంత్రులు హైదరాబాద్కు తరలివెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్రావు, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, చాడా శ్రీనివాస్రెడ్డి, రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ, డీఆర్ఎం భర్షీష్కుమార్ జైన్, సీఎంపీఈసీ మధుసూదన్రావు, సీని యర్ డీఎస్టీఈ ప్రియా అగర్వాల్, సీసీఓఎం పద్మజ, సీనియర్ డీసీఎం షిఫాలి, ఆర్వీఎన్ఎల్ ఎలక్ట్రికల్ జీఎం ఆనంద్ చెక్కిల, ఈఎం మెకానికల్ వంశీ, సీపీఎం సాయిప్రసాద్, పీఈడీ మెకానికల్ మనీష్అగర్వాల్, సీపీఆర్వో ఎ.శ్రీధర్ పాల్గొన్నారు. గంట ఆలస్యంగా పర్యటన.. కేంద్ర మంత్రులు షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు రావాల్సి ఉంది. కానీ, గంట ఆలస్యంగా 2:40 గంటలకు కాజీపేటకు చేరుకున్నారు. దీంతో రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. మంత్రులు రాగానే వారిని కలిసేందుకు పోటీపడగా స్వల్ప తోపులాట జరిగింది. పుష్పగుచ్ఛాలు కిందపడ్డాయి. తాము మంత్రులను కలవలేకపోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే యూనిట్లో పనులను పరిశీలిస్తున్న కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, చిత్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, నాయకులు ధర్మారావు, ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ తదితరులు– 8లోu -
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
నర్సంపేట రూరల్: ఎరువులు, పురుగు మందులు రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసె న్స్లు రద్దు చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి అనురాధ హెచ్చరించారు. నర్సంపేట పట్టణంలోని పలు ఎరువులు, పురుగు మందుల షాపులను శనవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ డీలర్లు గడవుతీరిన పురుగు మందులను రైతులకు విక్రయించొద్దని, ఎరువులను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ వ్యవసాయాఽధికారి శశికాంత్, వ్యవసాయ విస్తరణాధికారి మెండు అశోక్ తదితరులు పాల్గొన్నారు. నానో యూరియా, డీఏపీతో అధిక ప్రయోజనాలు● వరంగల్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నాగభూషణం దుగ్గొండి: పంటలకు నానో యూరియా, డీఏపీ వాడితే అధిక ప్రయోజనాలు ఉంటాయని వరంగల్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త నాగభూషణం అన్నారు. మండలంలోని నాచినపల్లి గ్రామంలో ఏరువాక– రైతు సాగుబడిపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంట పొలాలకు వేసే యూరియా, డీఏపీ 40 శాతం వరకు వృథాగా పోవడంతో పాటు భవిష్యత్లో భూమి నిస్సారంగా మారుతుందని అన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా నానో డీఏపీ, నానో యూరియా వాడాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేసే రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. పత్తి, మొక్కజొన్న పంటల్లో తెగుళ్లు, నివారణ చర్యలను వివరించారు. సదస్సులో జాతీయ ఆహార భద్రతా మిషన్ ప్రతినిధి సారంగం, ఏఓ మాధవి, ఏఈఓ విజయ్నాయక్, నాచినపల్లి, పొనకల్ గ్రామాల రైతులు పాల్గొన్నారు. కిరాణా దుకాణంలోకి దూసుకెళ్లిన మినీట్రాక్టర్● ఇద్దరికి తీవ్ర గాయాలు, రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసం నర్సంపేట రూరల్: కిరాణా దుకాణంలోకి మినీ టాక్ట్రర్ దూసుకెళ్లిన ఘటన నర్సంపేట పట్ట ణంలోని మల్లంపల్లి రోడ్డులో శనివారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. నాగుర్లపల్లి గ్రామాన్ని ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేశారు. అయితే, గ్రామపంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ను నర్సంపేటలో చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నారు. ఈక్రమంలో శనివారం చెత్త సేకరణలో భాగంగా మల్లంపల్లి రోడ్డు వైపు డ్రైవర్ ట్రాక్టర్ను తీసుకెళ్లాడు. వేగంగా వచ్చి కిరాణా డబ్బాలోకి దూ సుకెళ్లింది. డబ్బాలో ఉన్న స్వాతి కాలు విరిగి పోయింది. పక్కనే ఉన్న రాజుకు తీవ్ర గాయాలయ్యా యి. వెంటనే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ ఘటనలో రెండు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ట్రాక్టర్ సైతం బోల్తా పడింది. విషయం తెలుసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. -
మొక్కలు మళ్లీ నాటాలి : డీఆర్డీఓ
నల్లబెల్లి: ఎండిపోయిన మొక్కల స్థానంలో వమొక్కలు మళ్లీ నాటాలని డీఆర్డీఓ కౌసల్యాదేవి ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం 17వ ప్రజావేదిక శనివారం రాత్రి వరకు నిర్వహించారు. మస్టర్లోని హాజరులో వ్యత్యాసాలు, కొట్టివేతలు, ఎండిపోయిన మొక్కలు, సమాచార బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వంటి అంశాలను అధికారులు గుర్తించారు. గత సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం మార్చి వరకు రూ. 4,32,13,475 విలువైన పనులు చేపట్టారు. కూలీలకు రూ.42,54,053, మెటీరియల్కు రూ.79,422 ఖర్చు చేశారు. పంచాయతీరాజ్ విభాగంలో రూ. 47,32,554 ఖర్చు చేయగా కూలీలకు రూ.2,400, మెటీరియల్కు రూ.47,30,154 వెచ్చించారు. మన ఊరు–మన బడికి సంబంధించి రూ.17, 53,781 ఖర్చు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటికి సంబంధించి ప్రజావేదికను డీఆర్డీఓ కౌసల్యాదేవి నిర్వహించారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025సాధారణంగా పుట్టిన రోజు వేడుకలు ఏడాదికోసారి జరుపుకుంటుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. పిల్లలు పుట్టిన మరుసటి నెల నుంచే పుట్టిన రోజున సంబురాలు మొదలు పెడుతున్నారు. తొలి ఏడాదిలో నెలకో థీమ్తో పిల్లలను వినూత్నంగా అలంకరిస్తున్నారు. కొత్త బట్టలు వేసి ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. కేక్ కట్ చేస్తున్నారు. వాట న్నింటినీ 12 నెలలయ్యాక ఒక చోట చేర్చి ఫొటోఫ్రేమ్లు కట్టిస్తున్నారు. వీడియోలు మిక్సింగ్ చేస్తున్నారు. ఫస్ట్ బర్త్ డే వేడుకల వేళ వాటన్నింటినీ బంధువుల ముందు ప్రదర్శిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వచ్చిన లైకులు, కామెంట్లకు దంపతులు మురిసిపోతున్నారు. ఈనేపథ్యంలో నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. వాతావరణం జిల్లాలో ఉదయం వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం వేళ సాధారణంగా ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాద వాతావరణం ఉంటుంది. ఏడుబావులను చూడగలమా? మానుకోట జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట గ్రామ సమీపంలోని ఏడుబావుల జలపాతం సందర్శనను అధికారులు నిలిపివేశారు.– 8లోuభూపాలపల్లి అర్బన్: పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. మా బాబు పుట్టి శనివారంతో నెల రోజులు. అప్పటికప్పుడు ద్రాక్ష పళ్లతో అలంకరించి వేడుకలు జరుపుకున్నాం. ప్రతీ నెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, సరుకులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు దింపుకునేలా ప్లాన్ చేసుకున్నాం. బాబు పెద్దయ్యాక ఈ ఫొటోలు చూసి మురిసిపోతాడు. – తోనగర్ శిరీష, చెల్పూరు, గణపురంకాజీపేట: బర్త్ డే జరుపుకోవడానికి వన్ ఇయర్ వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెల నెలా ఒక్కో థీమ్తో మా బాబును రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే బాబు కూడా సంబురపడతాడు. ఒకప్పుడంటే కెమెరామెన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలా లైక్లు, కామెంట్లు వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – నిత్యశ్రీ, కాజీపేట నర్సంపేట: కన్నబిడ్డ ఎదుగుదలను ఫొటోల్లో బంధించడం ఓ మధురానుభూతి. ప్రతి నెల బాబు పుట్టిన రోజును ఓ వేడుకలా నిర్వహించుకుంటున్నాం. ఆపరేషన్ సిందూర్ పేరుతో యుద్ధం జరిగిన రోజే మా బాబు కాసర్ల విహాన్ రామానుజన్రెడ్డి ఆరో నెల బర్త్డే జరిగింది. దీనికి గుర్తుగా ఇండియా ఫ్లాగ్, గన్ చూపుతూ చేసిన వేడుక మర్చిపోలేం. – కాసర్ల కావ్య, నర్సంపేట జనగామ: ఏడాదికి ఒక్కసారి బర్త్ డే నుంచి.. నెలనెలా వేడుకలు జరుపుకునే ట్రెండ్ కొనసాగుతోంది. మాకు ఒక కూతురు. 3 నెలల బాబు ఆదినందన్ ఉన్నారు. పుట్టగానే 21వ రోజు.. 50.. 100వ రోజుతో పాటు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి కేక్ కట్ చేస్తున్నాం. బిడ్డ జీవితంలో ఈ ఘట్టం మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతీ నెల ఫొటోలను భద్రంగా ఉంచుతూ.. ఏడాది జన్మదిన వేడుకల్లో వీటిని ప్రదర్శిస్తాం. సాక్షి, మహబూబాబాద్: మా గారాల పట్టి మోజేస్ పాల్ (జాక్) ఈ ఏడాది ఫిబ్రవరి 28న పుట్టారు. ఉమ్మడి కుటుంబం కావడంతో ప్రతీనెల 28వ తేదీ వచ్చిందంటే సాయంత్రం అంతా సందడే.. పిల్లలు, పెద్దలతో ఇంట్లో ప్రతీ పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రతీ నెల పిల్ల వాడు పెరిగిన తీరును చూసుకుంటూ.. సంతోష పడతాం.. ఇలా ఇప్పటి వరకు నాలుగు నెలలు గడిచాయి.. ప్రతీ నెల ఫొటోలు తీసి జాగ్రత్తగా ఉంచుతున్నాం. మొదటి పుట్టిన రోజు సమయంలో ప్రతీ నెల తీసిన ఫొటోలు వరుస క్రమంలో పెట్టి ఫ్లెక్సీ తయారు చేస్తాం.. – దామెర ప్రీతి, మహబూబాబాద్ పెద్దయ్యాక చూసి మురిసిపోతారు..న్యూస్రీల్కలకాలం గుర్తుండాలని..ప్రతిక్షణం ఓ తీపి గుర్తే..ప్రతీ నెల పండుగే..– ఉప్పల పద్మ, జనగామ -
మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలి
గీసుకొండ: మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని ఎంపీ కడియం కావ్య సూచించారు. రూ.10 లక్షల ఎంపీ నిధులతో కొనాయమాకుల వద్ద గల సెర్ప్ ప్రగతి మండల సమాఖ్య భవన ప్రహరీ నిర్మాణానికి శనివారం ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. పొదుపు సంఘాల మహిళలు శాని టరీ న్యాప్కిన్ల తయారీలో శిక్షణ పొంది యూనిట్లను నెలకొల్పాలని ఒక డాక్టర్గా సలహా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ గతంలో మూడు శిఖలు కలిసి ఉండవనే నానుడి ఉండేదని, అయితే ఆ పరిస్థితి మారిపోయి మహిళలు ఎన్నో విజయాలు సాధిస్తున్నారన్నారు. ఎంపీ కడియం కావ్య తన నియోజకవర్గానికి రూ.65 లక్షల నిధులను కేటాయిస్తే వాటిలో ఎక్కువగా మహిళల సంక్షేమానికి కేటాయించానని తెలిపారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ కేజీబీవీల్లో కూరగాయలు, వంట సామగ్రిని మెనూ ప్రకారం అందించేందుకు గీసుకొండ సంఘాల ద్వారా ప్రయోగాత్మకంగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంఘాల వారు ఉత్పత్తి చేసిన వస్తువులను కలెక్టరేట్లో జరిగే గ్రీవెన్స్ డే రోజు స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్ముకునే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. డీఆర్డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, ఈఈ ఇజ్జగిరి, డీఈఈ జ్ఞానేశ్వర్, డీపీఎం దాసు, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాస్, ఏపీఎం సురేశ్కుమార్, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, సీసీలు కోల శోభ, కక్కెర్ల సుజాత, గడ్డి అశోక్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, ఆకుల రుద్రప్రసాద్, కూసం రమేశ్ పాల్గొన్నారు. వరంగల్ ఎంపీ కడియం కావ్య -
‘వయోవృద్ధుల’ చట్టంపై అవగాహన అవసరం
పరకాల: వయోవృద్ధుల వివిధ రకాల అవసరాలు తీర్చేందుకు తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కార మార్గాలు అనే అంశంపై వయోవృద్ధుల సంక్షేమ సంస్థ పరకాల అధ్యక్షుడు రేపాల నర్సింహారాములు అధ్యక్షతన పరకాల ఆర్డీఓ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ నారాయణ మాట్లాడుతూ చట్టం అమలుకు పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంస్థ నుంచి ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, వయోవృద్ధుల నుంచి వచ్చిన 50 ఫిర్యాదులలో 26 పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య, పరకాల ఐసీడీఎస్ సీడీపీఓ స్వాతి, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్, ట్రిబ్యునల్ సభ్యులు భూషి ప్రభాకర్రెడ్డి, కోడిపాక సమ్మయ్య, సుంకర రామన్న, సభ్యులు నర్సయ్య, రవీందర్గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శం
ధర్మసాగర్/వేలేరు : దేశంలో ఎక్కడాలేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ధర్మసాగర్, వేలేరు మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు శనివారం పంపిణీ చేశారు. ధర్మసాగర్లో 924 నూతన రేషన్ కార్డులతో పాటు మండలానికి చెందిన 17మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వేలేరు మండలంలో 439 మందికి కొత్త రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ కొత్తరేషన్ కార్డులు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఆయా కార్యక్రమాల్లో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ధర్మసాగర్ తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, వేలేరు తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఇరు మండలాల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
2026 నుంచి కాజీపేటలో చిక్బుక్ చిక్బుక్ రైలే
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో 2026 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వచ్చే డిసెంబర్ కల్లా యూనిట్ సివిల్ నిర్మాణ పనులు పూర్తవుతాయని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యూనిట్ నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు. కాజీపేట యూనిట్లో రైల్వే ఇంజిన్లతోపాటు కోచ్లు, మెట్రో రైళ్ల తయారీ, డిజైన్ పనులు కూడా చేపడతామని వెల్లడించారు. ఈ యూనిట్ ఒక మెగా ఫ్యాక్టరీగా రూపుదిద్దుకుంటోందని తెలిపారు. శనివారం హను మకొండ జిల్లా అయోధ్యపురంలోని కాజీపేట రైల్వే కోచ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లో జరుగుతున్న పనులను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, బీజేపీఎల్పీ నేత ఎ.మహేశ్వర్రెడ్డితో కలిసి అశ్వినీ వైష్ణవ్ పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలులో కాజీ పేట రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయన.. ఫ్యాక్టరీలో జరుగుతున్న పనుల గురించి రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అనంతరం ఫ్యాక్టరీ ఆవరణలోనే ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ మాట్లాడారు. ఎన్నో ఏళ్లపాటు కలగానే మిగిలిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సాకారం చేశారని అన్నారు. రూ.500 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ పరిశ్రమలో బహుళ రకాల రైల్వే మాన్యుఫాక్చరింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పురోగతిపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. మోదీ మాట తప్పరు అనేందుకు ఇదే నిదర్శనం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన మాట తప్పరు అనేందుకు కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీనే ఉదాహరణ అని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఈ ఫ్యాక్టరీ కోసం సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారని, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయనే స్వయంగా వచ్చి భూమి పూజ చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని, వరంగల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని వెల్లడించారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా, వేల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు, ఆర్ఆర్ పాలసీ ప్రకారం స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే త్వరలోనే వరంగల్కు ఎయిర్పోర్టు వరంగల్లో ఎయిర్పోర్ట్ అవసరం ఎంతో ఉందని.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు అప్పగిస్తే వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుందని కిషన్రెడ్డి తెలిపారు. భూమి కోసం గత సీఎం కేసీఆర్కు అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించానని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ‘ప్రధాని మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటివారు తమ కళ్లు తెరిచి చూడాలి. చెవులుంటే వినాలి. మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలి’అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ ఆజ్మీరా సీతారాం నాయక్, బీజేపీ వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ ఇది ఎన్నో ఏళ్ల కల.. దాన్ని ప్రధాని మోదీ సాకారం చేశారు’
హన్మకొండ జిల్లా : నాలుగు దశాబ్దాల ఓరుగల్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. కాజీపేట రైల్వేస్టేషన్కు సంబంధించి కోచ్ల తయారీ ఫ్యాక్టరీ, వ్యాగన్ తయారీ, ఓవర్ హాలింగ్ పనులు జరుగుతున్న క్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈరోజు(జూన్ 19) కాజీపేటలో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పనులను కిషన్రెడ్డితో కిలిసి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ..‘కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఎన్నో ఏళ్ల కళ. ప్రధాని మోదీ ఆ కలను సాకారం చేశారు. డిసెంబర్ వరకు సివిల్ కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి అవుతుంది. 2026లో మాన్యుఫాక్చరింగ్ మొదలవుతుంది. ఇంజన్లు, బోగీలు, మెట్రో ట్రైన్స్ తయారీ జరుగుతుంది. అతి పెద్ద మాన్యుఫాక్చరింగ్ యూనిట్గా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిలుస్తుంది. భారత్ లోనే అతిపెద్ద మెగా మ్యాన్ ఫ్యాక్టరీగా కాజిపేట్ను రూపొందిస్తున్నాం.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలతో మరింత అభివృద్ధి చేస్తాం’ అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ‘40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైంది’40 ఏళ్ల ఓరుగల్లు వాసుల కల సాకారమైందన్నారు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి. ‘ వ్యాగన్ తయారీ, కోచ్ల తయారీ, ఓవర్ హాలింగ్ మూడు యూనిట్లు మంజూరు చేశాం. మూడువలే మందికి నేరుగా ఉపాధి కలుగుతుంది. ఓరుగల్లు అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో నిధులు ఇచ్చింది. మోదీ గ్యారంటీ అంటే తప్పకుండా నెరవేరతుంది. వేయి స్తంభాల మంటపం, రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాము.త్వరలో వరంగల్కు ఎయిర్పోర్ట్ వస్తుంది. వరంగల్కు మోదీ ఏం ఇచ్చారో.. వరంగల్కు వచ్చి చూసి మాట్లాడాలి. తెలంగాణ వ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేశాం. మరిన్ని రైల్వే లైన్స్ అభివృద్ధికి పనులు చేస్తున్నాం. వరంగల్ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కమిట్మెంట్తో ఉంది. స్థానికంగా భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, కలెక్టర్ సిఫార్సు చేస్తే ఉద్యోగాలు కల్పిస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
31 వరకు ఇగ్నో అడ్మిషన్ల గడువు
రామన్నపేట: నగరంలోని ఎల్బీ కళాశాలలో శుక్రవారం ఇగ్నో టర్మ్ ఎండ్ పరీక్షల నిర్వహణను ఇగ్నో హైదరాబాద్ రీజనల్ సెంటర్ అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 31 వరకు ఇగ్నో(ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ) 2025–26లో అడ్మిషన్లకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. పలు మాస్టర్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రాంలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 98493 81085 నంబర్లో లేదా www. ignou. ac. inవెబ్సైట్ చూడాలని కోరారు. నేటి నుంచి తపాలా సేవలు బంద్ఖిలా వరంగల్: ఈనెల 22 నుంచి తెలంగాణ సర్కిల్ వ్యాప్తంగా నూతన సాఫ్ట్వేర్ అమలు చేయనున్నారు. ఈనేపథ్యంలో శనివారం(నేడు) నుంచి 21వ తేదీ వరకు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తపాలా శాఖ సేవలు నిలిపివేయనున్నట్లు వరంగల్ డివిజన్ సూపరింటెండెంట్ రవికుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు హాజరవుతారని, సేవలు మాత్రం కొనసాగవని చెప్పారు. వినియోగదారులు, ఖాతాదా రులు ఈవిషయం గమనించి సహకరించాలని ఆయన కోరారు. ఉచిత శిక్షణకు మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలి న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు బీమా రంగంలో ఉచిత శిక్షణ కమ్ ఎంప్లాయిమెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కేఏ.గౌస్హైదర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశిక్షణ హైదరాబాద్లో నెల పాటు ఉంటుందని, అర్హులైన (ముస్లిం, క్రిస్ట్రియన్, సిక్కు, జైనులు, పార్శి, బౌద్ధుల) మైనార్టీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారి కలక్టరేట్లోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయంలో కానీ.. 040–23236112 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రీ పీహెచ్డీ పరీక్ష ఫీజు చెల్లించాలికేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఆర్ట్స్, సైన్స్, సోషల్ సైన్స్, కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, లా, ఫార్మాస్యూటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విభాగాల పరిశోధకులు ప్రీ పీహెచ్డీ పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ను శుక్రవారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ సౌజన్య జారీ చేశారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 30వరకు, రూ.250 అపరాధ రుసుముతో ఆగస్టు 7వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. ఫీజు రూ.930 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఎంజీఎం అసిస్టెంట్ డైరెక్టర్ సరెండర్రిలీవ్ చేయాలంటూ ఎంజీఎం సూపరింటెండెంట్కు ఉత్తర్వులు ఎంజీఎం: ఉత్తర తెలంగాణలోని పేదలకు వైద్య సేవలందించే ఎంజీఎం ఆస్పత్రి అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) ఇస్మాయిల్ను సరెండర్ చేస్తూ డీహెచ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆస్పత్రిలో ఏడీగా విధులు నిర్వర్తిస్తున్న ఇస్మాయిల్ విధుల్లో నిర్లక్ష్యం, ఆస్పత్రిలో పలు విభాగాల ఉద్యోగులతో విబేధాలు ఉన్నట్లు రాష్ట్ర స్థాయి అధికారులు గుర్తించారు. అలాగే ఆస్పత్రి పరిపాలనల్లో కొన్ని సమస్యలు తలెత్తడానికి ఏడీ తీరే కారణమని గుర్తించిన కలెక్టర్ సత్యశారద షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలిసింది. ఈవిషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా అనారోగ్య సమస్యలతో సెలవు పెట్టినట్లు ఎంజీఎం పరిపాలనాధికారులు చెబుతున్నారు. కాగా.. సరెండర్ చేసిన ఏడీని రిలీవ్ చేయాలంటూ ఆదేశాలు సైతం ఎంజీఎం సూపరింటెండెంట్కు అందడంతో ఆస్పత్రి వర్గాలో ఏడీ సరెండర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ప్రస్తుతం ఇన్చార్జ్ ఏడీగా కొనసాగుతున్న అధికారి సైతం ఈనెల 23వ తేదీ వరకు సెలవులో ఉండడంతో, కీలక కార్డులపై సంతకాలు చేయకపోవడంతో పెద్దఎత్తున సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. వెంటనే కలెక్టర్ స్పందించి ఇన్చార్జ్ ఏడీగా మరో అధికారికి బాధ్యతలు అప్పగించి ఎంజీఎంలో ఏడీ పరిధిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. -
ఉపాధి అవకాశాలపై ఆశలు
వ్యాగన్షెడ్ టు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్.. కాజీపేట రూరల్: రైల్వే కోచ్ఫ్యాక్టరీ.. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక. అనేక ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కార్యరూపం దాల్చిన కాజీపేట రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం 80శాతం పూర్తికావొచ్చింది. ఈ యూనిట్ ఏర్పాటుతో స్థానిక యువత ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై అనేక ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తోపాటు మరో కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. శనివారం రైల్వే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను సందర్శించనున్నారు. 80శాతం పూర్తయిన విభాగాలు.. యూనిట్లోని మెయిన్షాప్, పేయింట్ షాప్, స్టోర్ వార్డు, టెస్ట్ షాప్, క్యాంటీన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, సెక్యూరిటీ పోస్టు, రెస్ట్ హౌస్, సేవగ్ ట్రీట్మెంట్ ప్లాంట్/పంప్హౌస్, టాయిలెట్ బ్లాక్స్, ప్యాకేజీ సబ్స్టేషన్, షవర్ టెస్ట్, రోడ్వే బ్రి డ్జి, పంప్హౌస్/జీఎల్ఆర్, పిట్ ట్రావెర్సర్, వ్యాగ న్ వే బ్రిడ్జి, గార్డు పోస్ట్/ట్రాక్ గేట్, ఆర్యూబీ, పార్కింగ్, పాండ్, (2000 కేఎల్ కెపాసిటీ), స్క్రాప్ బిన్స్ పనులు 80శాతం పూర్తయ్యాయి. పెండింగ్ పనులు రైల్వే కార్మికుల కోసం క్వార్టర్స్ నిర్మాణం, కోచ్ల తయారీకి షెడ్లలో మిషనరీ ఫిట్టింగ్, కనెక్టివిటీ రోడ్లు, ఎంట్రెన్స్ వద్ద రైల్వే వంతెన నిర్మాణం, ఇతరత్ర సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ జరగాల్సి ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి వచ్చే ఏడాది మార్చిలో యూనిట్ను ప్రారంభిస్తామని ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రకటించారు. వీటిపై దృష్టిపెట్టి త్వరగా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. పంజాబ్ మాదిరి ఉద్యోగావకాశాలు.. కాజీపేటలోని కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మందికి ఉపాధి లభించనుంది. అయితే ఈ ఉద్యోగాలు ఉమ్మడి జిల్లావాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ కోచ్ఫ్యాక్టరీలో ప్రత్యేక జీఓ తీసి అక్కడి ప్రజలకు ఉద్యోగవకాశాలు ఇచ్చారు. అదేమాదిరిగా ఇక్కడ కూడా ఈ ప్రాంతం వారికి ఉద్యోగవకాశాలు కల్పించాలని, దీనిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి.. అయోధ్యపురంలో రైల్వే యూనిట్కు 112మంది 160 ఎకరాల భూమి ఇచ్చారు. ఇద్దరు ఇళ్లు కోల్పోయారు. మొత్తం 114 మంది నిర్వాసితులు ఉండగా.. ప్రభుత్వం ఎకరాకు రూ.8లక్షలు చెల్లించింది. ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరాకు రూ.33 లక్షలు ఉండగా, ప్రభుత్వం రూ.8 లక్షలు రైతుకు ఇచ్చి, రూ.25లక్షలు దేవాదాయశాఖ (ఈభూమి దేవాదా యశాఖకు సంబంధించి కావడం)కు ఇచ్చారు. 8మంది రైతుల భూమి సీలింగ్ ల్యాండ్ అని పరిహారం నిలిపేశారు. ఇప్పటివరకు వారికి రాలేదు. కోట్ల రూపాయల విలువైన భూమి కోల్పోయామని, రైల్వే యూనిట్లో ఇంటికో ఉద్యోగం ఇచ్చి రైల్వేశాఖ ఆదుకోవాలని రైతులు కేంద్రమంత్రులను కోరుతున్నారు. రైల్వే మంత్రి దృష్టికి కాజీపేట డివిజన్ ప్రస్తావన.. రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ దృష్టికి ముఖ్యంగా కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు అంశాన్ని తీసుకెళ్తామని స్థానిక రైల్వే నాయకులు తెలిపారు. అదేవిధంగా టౌన్ స్టేషన్ అభివృద్ధి, ఫాతిమానగర్లో ట్రైయాంగిల్ స్టేషన్ నిర్మాణం, కాజీపేట రైల్వే ఆస్పత్రి సబ్ డివిజన్ ఆస్పత్రిగా అప్గ్రేడ్, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ప్లాట్ఫాంల నిర్మాణం, అన్ని హంగులతో కూడిన రైల్వే క్లబ్ (ఇన్స్టిట్యూట్) భవనం, బెజవాడ తరహాలో రైల్వే ఎలక్ట్రిక్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.కాజీపేట మండలం అయోధ్యపురంలో 160 ఎకరాల్లో సుమారు రూ.786 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేపట్టారు. 2023 జూలై 8వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ హనుమకొండ సుబేదారి ఆర్ట్స్కాలేజీ గ్రౌండ్లో నుంచి కాజీపేట వ్యాగన్షెడ్కు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. 2023లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కాజీపేట రైల్వే మల్టీపుల్ యూనిట్గా ప్రకటన చేసి మంజూరు చేశారు. రీ డిజైనింగ్ చేసి జపాన్ టెక్నాలజీతో మల్టీపుల్ యూనిట్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో వ్యాగన్, కోచ్, వందేభారత్, ఎల్హెచ్బీ, మెము కోచ్లు తయారు చేస్తారు.చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నేడు యూనిట్ను సందర్శించనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొంతమంది రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేనా? వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం -
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎల్కతుర్తి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. శుక్రవారం భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లోని వివిధ గ్రామాల్లో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కలెక్టర్ స్నేహ శబరీష్తో కలిసి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్తకొండ నుంచి నారాయణగిరి వరకు రూ.400 కోట్ల వ్యయంతో రోడ్డు వెడల్పు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కనూరులోని ఆరు జిమ్ సెంటర్లను ప్రారంభించారు. అక్కడి నుంచి మోడల్ స్కూల్కు వెళ్లి విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ముల్కనూరు నుంచి కొత్తపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్కతుర్తి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాన్సర్ను కొనితెచ్చుకోవద్దు ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజలు డబ్బులిచ్చి క్యాన్సర్ను కొని తెచ్చుకుంటున్నారని.. నిత్యం వినియోగించే వస్తువుల్లో ప్లాస్టిక్ను దూరం పెట్టాలన్నారు. నియోజకవర్గంలో 340 హోటళ్లు ఉంటే ఒక్కో హోటల్కు 100 చొప్పున 34 వేల స్టీల్ గ్లాస్లు అందించినట్లు తెలిపారు. భీమదేవరపల్లి మండలంలో 49 హోటళ్లకు 4,900ల స్టీల్ గ్లాస్లు అందించామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మండలానికి ఒక్క డబుల్ బెడ్రూం కూడా రాలేదన్నారు. తమ ప్రభుత్వంలో మొదటి విడతగా నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను వివరించారు. అనంతరం ఎస్ఆర్ఆర్ ఫార్మసీ కళాశాల ఆవరణలో వన మహోత్సవంలో భాగంగా విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన–ప్రగతి బాట కార్యక్రమంలో లబ్ధిదారులకు కొత్త రేషన్కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రమేశ్రాఽథోడ్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, తహసీల్దార్లు రాజేశ్, ప్రసాద్రావు, ఎంపీడీఓలు వీరేశం, విజయ్కుమార్, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన -
కేంద్రమంత్రుల షెడ్యూల్..
● శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయల్దేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ● మధ్యాహ్నం 1:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. ● 2:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. ● అక్కడి నుంచి 3 గంటలకు బయల్దేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. ● 5:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. -
కన్సాలిడేటెడ్ లెక్చరర్ టర్మినేషన్
● కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ ● ఆలస్యంగా వెలుగులోకి.. కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మంలోని వర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీలో కన్సాల్డిడేటెడ్ లెక్చరర్గా పనిచేస్తున్న శ్రీనివాస్రావును టర్మినేషన్ చేస్తూ (ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ) రిజిస్ట్రార్ వి.రామచంద్రం జూలై 1న ఉత్తర్వులు జారీ చేయగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్రావు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు యూనివర్సిటీ అధికారుల దృష్టికి రాగా.. యూనివర్సిటీ అధికారులు ఈ ఏడాది జనవరిలో విచారణ కమిటీని నియమించారు. కామర్స్అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ వరలక్ష్మి చైర్పర్సన్గా, సభ్యులుగా మ్యాథ్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌజన్య, ఇంగ్లిష్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మేఘనరావుతో విచారణ కమిటీని నియమించగా వారు విచారణ జరిపారు. విచారణ జరిపిన ఆ కమిటీ పలు ఆధారాలతో కూడిన నివేదికను యూనివర్సిటీ అధికారులకు అందజేసింది. శ్రీనివాస్రావుపై చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో పేర్కొన్నారని సమాచారం. అనంతరం రిజిస్ట్రార్ వి.రామచంద్రం కన్సాలిడేటెడ్ లెక్చరర్ శ్రీనివాస్రావుకు షోకాజ్ నోటీస్ జారీచేశారు. ఆ నోటీస్కు ఆయన వివరణ కూడా ఇచ్చారు. చివరికి శ్రీనివాస్రావును విధులనుంచి టర్మినేషన్ చేస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈ నెల 1న ఉత్తర్వులు జారీచేశారు. విచారణ కమిటీ నివేదిక ఆధారంగా శ్రీనివాస్రావును టర్మినేషన్ చేసినట్లు రిజిస్ట్రార్ శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. -
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకరు
● పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల: స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు అభ్యర్థులు దొరకరని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాలలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో శుక్రవారం పరకాల, నడికూడ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. బోగస్ హామీలతో అధి కారంలోకి వచ్చిన రేవంత్రెడ్డిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మళ్లీ రెవంత్రెడ్డి మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ప్రజాపాలన పేరుతో ప్రజల సొ మ్మును దోచుకుంటున్నారన్నారు. ఈఎన్నికల్లో బీ ఆర్ఎస్ సత్తా చాటడం ఖాయమన్నారు. అందుకో సం ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పరకాల, నడికూడ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 23న కేయూకు రాష్ట్ర విద్యా కమిషన్ రాక కేయూ క్యాంపస్: రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఈనెల 23న కాకతీయ యూనివర్సిటీకి రానున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు యూనివర్సిటీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. విద్యార్థి, ఉద్యోగసంఘాలు, పరీక్షల నియంత్రణాధికారి, విభాగాల అధిపతులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సి పాల్స్, స్టేక్ హోల్డర్లకు కేటాయించిన సమయానికి అనుగుణంగా కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. -
ఎమ్మెల్యే కవ్వంపల్లి వ్యాఖ్యలపై జూడాల నిరసన
ఎంజీఎం: అర్హతలేని వ్యక్తులను పొగుడుతూ.. ‘క్వాక్స్’ను ప్రోత్సహించేలా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాకతీయ మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్స్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం సాయంత్రం కేఎంసీ ప్రాంగణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి మెడికల్ రంగానికి వ్యతిరేకంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. తెలంగాణ వైద్యమండలి సైతం ఎమ్మెల్యేకు నోటీస్ జారీ చేసి వారంలోగా వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. -
మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి
ఖిలా వరంగల్/వరంగల్ చౌరస్తా: మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్, డిగ్రీ కళాశాలలో చేపట్టిన వనమహోత్సవం, ఎల్బీనగర్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరా మహిళాశక్తి సంబురాల్లో మంత్రి సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేర్వేరు కార్యక్రమాల్లో మంత్రి సురేఖ మొక్కలు నాటి, 100 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2.41 కోట్ల వడ్డీలేని రుణాలు, 98 సంఘాలకు రూ.12.46 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కులు, 2,690 మంది లబ్ధిదారులకు నూతన రేషన్కార్డులు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మాజీ ప్రధాని జవహర్లాల్నెహ్రూ 1951 సంవత్సరంలో వనహోత్సవాన్ని చేపట్టారని గుర్తుచేశారు. తల్లి పేరు మీద మొక్కనాటాలని ప్రధాని నరేంద్రమోదీ చేసిన విజ్ఞప్తి ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. కార్యక్రమాల్లో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎఫ్ఓ అనూజ్అగర్వాల్, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఈఓ జ్ఞానేశ్వర్, అదనపు కమిషనర్ జోనా, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ రమేశ్, హెచ్ఎం శారదాబాయి, కార్పొరేటర్లు మహమ్మద్ ఫుర్ఖాన్, కావేటి కవిత, పల్లం పద్మ, గుండు చందన పాల్గొన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ -
స్వచ్ఛతపై దృష్టి
సాక్షి, వరంగల్: వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో స్వచ్ఛతకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం నిధులు లేక ఇబ్బంది పడుతున్న కార్పొరేషన్, మున్సిలిటీలకు ‘స్వచ్ఛ భారత్ మిషన్ 2.0’ కింద 2025–26 సంవత్సరానికి నిధులు మంజూరయ్యాయి. వాటిని పకడ్బందీగా వినియోగించి చెత్త రహిత ప్రాంతాలుగా మార్చేందుకు అధికారులు దృష్టి సారించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు రూ.5,59,51,509, నర్సంపేట మున్సిపాలిటీకి రూ.6,30,215, వర్ధన్నపేట మున్సిపాలిటీకి రూ.3,16,518 నిధులు మంజూరయ్యాయి. కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రాం, నీటి వ్యర్థాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, బయోమైనింగ్ కార్యక్రమాల నిర్వహణతోపాటు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్)గా ప్రకటించిన పట్టణాల ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రజారోగ్య పరిరక్షణ కోసం పారిశుద్ధ్య కార్యక్రమాలు, యాస్సిరేషనల్ టాయిలెట్స్, జీవవైవిధ్య పరిరక్షణ, మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యర్థాల నిర్వహణకు ఈ నిధులు వినియోగించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. 2021 అక్టోబర్లో ప్రారంభమైన ఈ పథకం ఈ ఏడాది అక్టోబర్తో ముగియనుంది. రెండుసార్లు ప్రత్యేక నిధులు మంజూరు.. స్వచ్ఛభారత్ మిషన్ 2.0లో భాగంగా లక్షలోపు జనాభా కలిగిన పట్టణ, స్థానిక సంస్థలకు 2021 నుంచి ప్రతిఏటా రెండుసార్లు ప్రత్యేక నిధులు మంజూరవుతున్నాయి. ముఖ్యంగా నగరం, పట్టణాల్లో రోజురోజుకూ జనాభా పెరుగుతుండడంతో వ్యర్థాల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. ఇప్పటికే వరంగల్లో బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణకు తగిన ప్రాధాన్యమిస్తూ బల్దియా అధికారులు పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. తాజాగా స్వచ్ఛ భారత్ మిషన్ నిధులతో వరంగల్ నగరంతోపాటు నర్సంపేట, వర్ధన్నపేటలో బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణపై అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పుడు వచ్చిన నిధులతో ప్రజారోగ్య పరిరక్షణకు సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. ఈ నిధులు పూర్తిస్థాయిలో సరిపోవని, ఉన్న నిధులతో మెరుగ్గా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సంబంధిత అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్లో రాష్ట్రంలో తొలిస్థానం, జాతీయస్థాయిలో 84వ స్థానంలో నిలిచింది. ఇంటింటా చెత్త సేకరణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా (ఓడీఎఫ్ ప్లస్) నర్సంపేట మున్సిపాలిటీకి రాష్ట్రంలో 77, జాతీయస్థాయిలో 768వ ర్యాంకు వచ్చింది. వర్ధన్నపేట మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో 101వ ర్యాంకు, జాతీయస్థాయిలో 1,101వ ర్యాంకు వచ్చింది. ‘స్వచ్ఛభారత్ మిషన్ 2.0’ నిధులు మంజూరు బయోమైనింగ్ వ్యర్థాల నిర్వహణకు అధికారుల ప్రణాళిక జీడబ్ల్యూఎంసీ, మున్సిపాలిటీల్లో మెరుగుపడనున్న సౌకర్యాలు -
దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, శిక్షణ ఇచ్చేందుకు జిల్లా పరిధిలోని నిరుద్యోగ ట్రాన్స్జెండర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి సంక్షేమాధికారి పి.దివ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవింగ్, ఫొటో, వీడియోగ్రఫీ, బ్యుటీషియన్, జ్యూట్బ్యాగుల తయారీ, టైలరింగ్, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో నైపుణ్య శిక్షణకు ఈనెల 23లోగా డబ్ల్యూడీఎస్సీ.తెలంగాణ.జీఓవీ.ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాట్రపల్లి విద్యార్థులురాయపర్తి: హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు కాట్రపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం ఝాన్సీలక్ష్మి తెలి పారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈనెల 17న వరంగల్లో నిర్వహించిన జిల్లాస్థాయి సబ్ జూనియర్ స్విమ్మింగ్ పోటీల్లో వారు ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న పదో తరగతి విద్యార్థులు గొలుసుల రేవంత్, ఎండీ అలియాజ్, బెల్లి శ్రీరామ్, లకావత్ చరణ్, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎండీ అబ్దుల్తాహెర్తోపాటు పీఈటీ పుట్ట సమ్మయ్యను అభినందించినట్లు హెచ్ఎం తెలిపారు కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్పర్సన్ జి.రమ, గ్రామస్తులు పాల్గొన్నారు. నూతన రేషన్కార్డులు మంజూరున్యూశాయంపేట: జిల్లాలో అర్హులకు నూతన రేషన్కార్డులు మంజూరు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 13 మండలాల్లో ఇప్పటివరకు మొత్తం 6,815 రేషన్కార్డులు మంజూరు చేయడంతోపాటు 26,766 మంది పేర్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఇంటింటికి వెళ్లి పరిశీలించినట్లు ఆమె తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని కాపాడిన పోలీసులు సంగెం: కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. స్థానికుల కథనం ప్రకారం.. కుంటపల్లి గ్రామానికి చెందిన జక్క వేణు కుటుంబ తగాదాలతో గురువారం రాత్రి ఇంట్లో భార్యతో గొడవపడి చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలోని పట్టాలపై పడి ఆత్మహత్యకు యత్నించాడు. గేట్మెన్ గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంగెం పోలీసులు అమీర్బాబా, శ్రావణ్ వెంటనే వెళ్లి పట్టాలపై పడుకున్న వేణును కాపాడి కుంటుంబ సభ్యులకు అప్పగించారు. వేణును కాపాడిన పోలీసులను ఎస్సై నరేశ్, ఉన్నతాధికారులు, గ్రామస్తులు అభినందించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలునెక్కొండ: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఉపేందర్ ఆస్పత్రిని శుక్రవారం ఏసీపీ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఉపేందర్ ఆస్పత్రిలో ఇటీవల లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు సమాచారం అందిందని చెప్పారు. ఇక్కడ లింగనిర్ధారణ పరీక్షలు చేయించుకున్న మహిళ ఖమ్మం పట్టణం ఖానాపురం హవేలి పరిధిలోని ఓ ఆస్పత్రిలో అబార్షన్కు వెళ్లిందని వివరించారు. విషయం తెలుసుకున్న ఖమ్మం డీఎంహెచ్ఓ విచారణ చేసి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు ఖానాపురం హవేలి పోలీస్స్టేషన్లో జీఓ ఎఫ్ఐఆర్ నమోదైందని పేర్కొన్నారు. అక్కడి నుంచి నెక్కొండ పీఎస్కు కేసు బదలాయించారని ఆయన వివరించారు. దీంతో ఈ నెల 17న రాత్రి ఆస్పత్రిని నర్సంపేట డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, స్థానిక పీహెచ్సీ వైద్యాధికారులతో తనిఖీలు చేశారన్నారు. నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఎస్సై మహేందర్తో కలిసి ఏసీపీ ఆస్పత్రిని కలియదిరిగారు. ఆస్పత్రి డాక్టర్ ఉపేందర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి పరారీలో ఉన్న ఆస్పత్రి డాక్టర్ పార్థును త్వరలో అరెస్టు చేస్తామని ఏసీపీ తెలిపారు. -
ఉపాధి అవకాశాలపై ఆశలు
చివరి దశకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులుకేంద్రమంత్రుల షెడ్యూల్.. ● శంకర్పల్లి రైల్వే స్టేషన్నుంచి ఎంఆర్ ప్రత్యేక రైలులో ఉదయం 11 గంటలకు బయలుదేరి 1:30 గంటలకు కాజీపేట రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. ● 01:30 గంటలకు కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి 01:45 గంటలకు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు చేరుకుంటారు. ● 02:45 గంటల వరకు యూనిట్ను విజిట్ చేస్తారు. ● అక్కడి నుంచి 3 గంటలకు బయలుదేరి కాజీపేట రైల్వేస్టేషన్కు చేరుకుంటారు. ● 05:30 గంటలకు ఎంఆర్ ప్రత్యేక రైలులో కాచిగూడ రైల్వేస్టేషన్కు చేరుకుంటారు.● నెరవేరుతున్న జిల్లా ప్రజల చిరకాల స్వప్నం ● నేడు యూనిట్ను విజిట్ చేయనున్న కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ● కొందరు రైతులకు అందని భూ పరిహారం.. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి కల్పించేనా..? ● వీటిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ ● కాజీపేట డివిజన్ అంశాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలని రైల్వే నాయకుల నిర్ణయం -
పెండింగ్ డీఏలు చెల్లించాలి
దుగ్గొండి: ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లో డీటీఎఫ్ సభ్యత్వ నమోదును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాచినపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీని వెంటనే నియమించి, పెరిగిన ధరల ప్రకారం చెల్లించాలని, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని కోరారు. పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. డీటీఎఫ్ మండల అధ్యక్షుడు రావుల దేవేందర్, ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు భద్రయ్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చాంద్పాషానర్సంపేట రూరల్: తెలంగాణ బ్యాండ్ వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట గ్రామానికి చెందిన ఎండీ చాంద్పాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మండలంలోని గురిజాల గ్రామానికి చెందిన మడిపెద్ది వెంకన్న ఎన్నికయ్యారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు. -
చోరీలకు పాల్పడుతున్న దొంగ అరెస్ట్
నెక్కొండ: తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 26న మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య ఇంట్లో జరిగిన చోరీపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఈ కేసును సీపీ.. సీసీఎస్ పోలీసులకు అప్పగించారని పేర్కొన్నారు. పలు దొంగతనాల్లో నేరస్తుడు ఆటో డ్రైవర్ బిర్రు రమేశ్బాబు యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం నెక్కొండ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా కనిపించడంతో రమేశ్బాబును అదుపులోకి తీసుకుని విచారించగా బండారి కొమురయ్య ఇంటిలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిందన్నారు. గతంలో జనగామ, నల్లగొండ టూ టౌన్ హయత్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలు చేశాడని ఆయన వివరించారు. నిందితుడి నుంచి నెక్కొండలో చోరీ చేసిన 2 తులాల బంగారం, 33 తులాల వెండి, జనగామలో చోరీ చేసిన 6.6 తులాల బంగారం, 65 తులాల వెండి ఆభరణాలను రికవరీ చేశామని ఏసీపీ చెప్పారు. అనంతరం రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందించామన్నారు. నెక్కొండ సీఐ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.● బంగారం, వెండి ఆభరణాల రికవరీ.. ● వివరాలు వెల్లడించిన నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి -
మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే..
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ: రాష్ట్రంలో మరోమారు కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి జోస్యం చెప్పారు. కొనాయమాకులలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్లో శుక్రవారం ఆయన 294 మందికి కొత్తగా రేషన్కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ చేసి మాట్లాడారు. పరకాల, నర్సంపేట మాజీ ఎమ్మెల్యేలు సీఎం రిలీఫ్ ఫండ్ను దుర్వి నియోగం చేశారని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, కల్యాణలక్ష్మి పథకం విషయంలో వసూళ్లకు పాల్పడితే కాంగ్రెస్ నాయకులను పార్టీకి దూరం చేస్తామని హెచ్చరించారు. అలాంటివి ఏమైనా జరిగితే తనకు నేరుగా ఫోన్ చేయాలని ఆయన సూచించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఇన్చార్జ్ ఎంపీడీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం సురేశ్కుమార్, కాంగ్రెస్ నాయకులు చాడ కొమురారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాస్, జక్కుల సరిత, కొండేటి కొమురారెడ్డి, గోదాసి చిన్న తదితరులు పాల్గొన్నారు. అధికారులను హడలెత్తించిన ఎమ్మెల్యే.. రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే అధికారులను హడలెత్తించారు. సంక్షేమ పథకాల సమాచారం ఇవ్వాలని ఆయన ఏపీఎం సురేశ్కుమార్, అధికారులను ఆదేశించారు. అప్పటికప్పుడు సమాచారం ఇవ్వలేక వారు ఇబ్బందులు పడ్డారు. పలు పథకాల గురించి ఎమ్మెల్యే ప్రశ్నించడంతో అధికారులు కంగుతిన్నారు. అయితే తన ‘కొడుకు’ సమాచారం ఇస్తాడంటూ పక్కనే ఉన్న వ్యక్తిగత పీఏ నుంచి ఆయన కొన్ని వివరాలను తీసుకుని మాట్లాడారు. అంతకు ముందు ఎమ్మెల్యే కొనాయమాకుల రైతు వేదిక వద్ద మొక్కలు నాటి, కొమ్మాల బస్టాండ్ వద్ద అంగడి కోసం రూ.52 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట సిటిజన్ క్లబ్లో శుక్రవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన రేషన్కార్డులు, మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు, వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 10,209 మందిని అదనంగా చేర్చి, 2,064 నూతన రేషన్కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని 6,968 స్వయం సహాయక సంఘాల్లో 73,969 మంది సభ్యులు ఉన్నారని, 5,045 అర్హత గల సంఘాలకు రూ.20.25 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలన్నారు. కార్యక్ర మంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఎస్ఓ కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి, నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ హరిబాబు, సొసైటీ చైర్మన్ బొబ్బాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
పరకాల: మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, మహిళల స్వావలంబన దిశగా నిరంతరం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. అవసరమైతే వచ్చే నాలుగేళ్లలో మహిళల సంక్షేమానికి రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పరకాలలోని వెల్లంపల్లి రోడ్డులో మహాదేవ ఫంక్షన్హాల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో.. పరకాల నియోజకవర్గ స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబురాలు గురువారం నిర్వహించారు. ఈసంబురాలకు ముఖ్య అతిథిగా హాజరైన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారదతో కలిసి కొత్త రేషన్కార్డులు, వడ్డీలేని రుణాలతో పాటు బీమా చెక్కులు మహిళళా సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ముల్కనూరు డెయిరీ తరహాలో పరకాల నియోజకవర్గంలో రూ.32 కోట్లతో కొత్త డెయిరీ ఏర్పాటు చేసి మహిళాల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందిస్తామని తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలను, రుణాలను వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శ్రీను, ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, పరకాల ఏసీపీ సతీశ్బాబు, పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ పంచగిరి జయమ్మ పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబురాలు -
చెట్లతోనే మనిషి మనుగడ
పరకాల: మొక్కలు నాటడంతో పాటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జి.సాయి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా పరకాల కోర్టు ఆవరణలో గురువారం మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిపై పుట్టిన ప్రతీ జీవి మనుగడకు చెట్లు ముఖ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో పరకాల కోర్టు ఏజీపీ మేరుగు శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఓంటేరు రాజమౌళి, వి.చంద్రమౌళి, గండ్ర నరేశ్రెడ్డి, పి.వేణుయాదవ్, కోర్టు సూపరింటెండెంట్ నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పరకాల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి జి.సాయి పరకాల కోర్టులో వన మహోత్సవం -
రైతు సేవలో టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొలంబాట ద్వారా నేరుగా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తోంది. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ సర్వీసులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 1,261 సర్వీస్లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 1,302 వ్యవసాయ సర్వీస్లు మంజూరు చేశారు. వరంగల్ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 7,571 సర్వీస్లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 824 వ్యవసాయ సర్వీస్లు మంజూరు చేశారు. పొలం బాట ద్వారా హనుమకొండ జిల్లాలో ఇప్పటివరకు 1,216 లూజ్ లైన్లు, 476 వంగిన స్తంభాలు, 3,609 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,141 లూజ్లైన్లు, 445 వంగిన స్తంభాలు, 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్ల ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. డిపార్ట్మెంట్ వాహనాల్లోనే ట్రాన్స్ఫార్మర్ల తరలింపు.. రైతులకు వ్యవసాయ సర్వీస్ మంజూరుకు చెందిన ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందిస్తున్నారు. రైతుల ఫోన్ నంబర్కు వచ్చే ఎస్ఏంఎస్ లింకు క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా రైతులకు అందించే మెటీరీయల్ జాబితాపై వారికి పూర్తి స్పష్టత వస్తుంది. ఎస్ఎంఎస్లు కూడా తెలుగులోనే పంపుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను డిపార్ట్మెంట్ వాహనాల్లోనే తరలించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు ఎస్పీఎం హెడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు వేగంగా జరిగి వెంటనే బిగించే ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా పిడుగుల నిరోధకాలు అమర్చుతున్నారు. వేసవి కార్యాచరణలో భాగంగా అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గించేందుకు హనుమకొండ జిల్లాలో అదనంగా 181 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా 145 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. వరంగల్ జిల్లాలో అదనంగా 214 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, 213 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. పొలంబాటతో సమస్యల పరిష్కారం యుద్ధప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల మంజూరు రైతులకు తెలుగులో అంచనా ప్రతులుసాగుకు మెరుగైన విద్యుత్ సరఫరా... సాగుకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో తెలుగులో విద్యుత్ సర్వీస్ల మంజూరు, ఎస్టిమేట్ వివరాలు పంపుతున్నాం. సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – పి.మధుసూధన్రావు, ఎస్ఈ హనుమకొండ త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ల బిగింపు..కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో త్వరితగతిన వేరే ట్రాన్స్ఫార్మర్ను బిగిస్తున్నాం పట్టణాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో మార్చుతున్నాం. రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. – కె.గౌతంరెడ్డి, వరంగల్ ఎస్ఈ -
కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్కు ఉద్వాసన!
కేయూ క్యాంపస్: కేయూ విద్యా కళాశాల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రణధీర్రెడ్డి ఈసంవత్సరం విధులు నిర్వర్తించేందుకు వర్సిటీ అధికారులు ‘కాంట్రాక్టు’ను రెన్యూవల్ చేయలేదు. విద్యాకళాశాలలో గతంలో రణధీర్రెడ్డి ప్రిన్సిపాల్గా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆసమయంలో అవకతవకలకు పాల్పడినట్లు వెల్లడైంది. కళాశాలలోని బీఓఎస్ అకౌంట్లోని రూ.8.50 లక్షలు రణధీర్రెడ్డి వినియోగించుకుని, ఆతర్వాత నిధుల్ని తిరిగి రిజిస్ట్రార్ ఫండ్ అకౌంట్లోకి జమ చేసిన విషయం తెలిసిందే. ఈవ్యవహారంపై ‘నిధులు హాంఫట్’ శీర్షికన అప్పట్లోనే ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. గురువారం విద్యాకళాశాలలో రిజిస్ట్రార్ రామచంద్రం అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి రణధీర్రెడ్డి హాజరయ్యారు. సమావేశం అనంతరం రిజిస్ట్రార్ సమక్షంలో ఆవిద్యాకళాశాల ప్రిన్సిపాల్ టి.మనోహర్ మాట్లాడుతూ ‘మీ కాంట్రాక్టును వర్సిటీ అధికారులు రెన్యూవల్ చేయలేదని, ఇక నుంచి విధులకు రావొద్దని రణధీర్రెడ్డికి తెలిపారు. రెన్యూవల్ కాని ‘కాంట్రాక్టు’ రణధీర్రెడ్డిని విధులకు రావొద్దన్న ప్రిన్సిపాల్ మనోహర్ -
విద్యావంతులతోనే గ్రామాల అభివృద్ధి
ఐనవోలు: విద్యావంతులతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి వారిని ఎన్నుకోవాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొండపర్తి నుంచి గువ్వలగూడెం, ఐనవోలు నుంచి రాంనగర్ వరకు రూ.16 కోట్లతో నిర్మించిన రెండు నూతన బీటీ రోడ్లు, బ్రిడ్జిలను టీజీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్థిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు బీటీ రోడ్లు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల అమలులో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ విక్రమ్ కుమార్, మాజీ ఎంపీపీ మార్నేని మధుమతి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్, రుగ్వేద్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సాంబయ్య, రాకేష్ రెడ్డి, ఎలిషా, సుధీర్, మధు తదితరులు పాల్గొన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు -
మా పని మాకు కల్పించాలి
కమలాపూర్: ‘మా పని మాకు కల్పించాలి.. పనికి తగిన వేతనం చెల్లించాలి’ అని కమలాపూర్ మండలం ఉప్పల్లో బొగ్గు లారీలను అడ్డగించి లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులు గురువారం నిరసన ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లోడింగ్, అన్ లోడింగ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. నేతాజీ రైల్వే లోడింగ్, అన్ లోడింగ్ యూనియన్లో 287 మంది కార్మికులు ఉన్నామని, తామంతా బొగ్గు, గ్రానైట్, బియ్యం, మొక్కజొన్నలు వంటివి లోడింగ్, అన్లోడింగ్ చేసే వాళ్లమన్నారు. అందుకు కాంట్రాక్టర్లు తమకు ఒక్కో వ్యాగిన్కు రూ.11 వేలు చెల్లించే వారన్నారు. గతంలో కాంట్రాక్టర్ విజేందర్రెడ్డి తనకు మళ్లీ కాంట్రాక్ట్ దక్కితే ఒక్కో వ్యాగన్కు రూ.15 వేలు చెల్లిస్తానని చెప్పాడన్నారు. కానీ.. అతడి కాంట్రాక్ట్ ముగిసిందని, ప్రస్తుతం కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నర్సింగరావు తాను తక్కువ మొత్తానికి కాంట్రాక్ట్ వేశానేని తనకు కు ఇంత మంది కార్మికులు అవసరం లేదంటున్నాడని వాపోయారు. కేవలం పది మంది కార్మికులు సరిపోతారని అంటున్నాడని, కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తానంటున్నాడన్నారు. కాంట్రాక్టర్ తీరుతో 270 మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 287 మందికి పని కల్పించి, పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఒక్క లారీని కూడా కదలనివ్వమని హెచ్చరించారు. ఈనిరసనలో నేతాజీ రైల్వే లోడింగ్ యూనియన్ అధ్యక్షుడు జక్కుల రాజు, ఉపాధ్యక్షుడు పుల్ల విజయ్చందర్, లోడింగ్, అన్ లోడింగ్ కార్మికులు పాల్గొన్నారు. ఉప్పల్లో బొగ్గు లారీలు ఆపి లోడింగ్ కార్మికుల నిరసన ఆందోళన -
హెచ్ఐవీపై విస్తృత అవగాహన కల్పించాలి
ఎంజీఎం: హెచ్ఐవీ ఇన్ఫ్క్షన్ తగ్గడానికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంలో వైద్యారోగ్యశాఖ సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లు ముందుండాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్రావు అధ్యక్షతన నిర్వహించిన శిక్షణలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్నమాధురి, జిల్లా ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉచిత శిక్షణ కం ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నెలరోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, పార్సీ, బౌద్ధులు) మైనారిటీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు హనుమకొండ సుబేదారి షరిఫన్ మజీద్ దగ్గరలోని అపోలో ఫార్మసీ పక్కన రెండో అంతస్తులోని మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయం, 040–23236112 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా ప్రవీణ్కుమార్ కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా ప్రవీణ్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. నేడు ఢిల్లీకి కమిషనర్వరంగల్ అర్బన్: దేశ రాజధాని ఢిల్లీలో నేడు (శుక్రవారం) జరగనున్న స్వచ్ఛ భరత్ మిషన్ సమావేశానికి గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ హాజరుకానున్నారు. కేంద్ర అర్బన్, గృహ నిర్మాణ మంత్రి, ఇతరులు పాల్గొనే ఈ సమావేశంలో స్వచ్ఛ సర్వేక్షన్ విధానాలను వెల్లడించనున్నారు. భాస్కర్రావుకు బెస్ట్ టీచర్ అవార్డురామన్నపేట: నగరానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు భాస్కర్రావు నేషనల్ సుశ్రుత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన శల్యకాన్–25 జాతీయ సమావేశంలో కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 35 ఏళ్లు వైద్యవృత్తిలో కొనసాగుతూ.. 15 వేలకు పైగా.. అర్షమొలలు, ిఫి ష్టులా చికిత్సలు చేశారు. మరోవైపు సెమినార్లలో పాల్గొనడం, పరిశోధనా పత్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆయుర్వేద్విద్యా పీటీ గురువుగా పనిచేస్తున్నారు. గుర్తింపులేని పాఠశాలల్లో చేర్పించొద్దు..విద్యారణ్యపురి: అనుమతి, గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని వరంగల్ డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ముందు ఈ విద్యాసంవత్సరానికి అనుమతి ఉందా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మధ్యలోనే మూసివేసే పరిస్థితులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు మాత్రమే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా విద్యార్థులకు పెన్ (పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్) కేటాయిస్తారని తెలిపారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థికి పెన్ కేటాయించరని చెప్పారు. -
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuసాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కి ళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్ర ణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీలను త్వరలోనే అధికారులు ప్రకటించనున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూచించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబాటులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈ ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది. న్యూస్రీల్ వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఖరారు ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ సిద్ధం వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం నీటి లభ్యత ఆధారంగా నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్ 15 రోజులకోసారి విడుదల -
డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు
హసన్పర్తి: ఆర్టీసీ, ప్రైవేట్, స్కూల్బస్సుల డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నగరంలోని ఫాతిమా సెంటర్ వద్ద డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్నతోపాటు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతు సేవలో టీజీ ఎన్పీడీసీఎల్
హన్మకొండ: రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం కృషి చేస్తోంది. పొలంబాట ద్వారా నేరుగా సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తోంది. విద్యుత్ ప్రమాదాలు, భద్రతపై విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యవసాయ సర్వీసులను యుద్ధప్రాతిపదికన మంజూరు చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 1,261 సర్వీస్లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 1,302 వ్యవసాయ సర్వీస్లు మంజూరు చేశారు. వరంగల్ జిల్లాలో 2023 జూలై 15 నుంచి 2024 జూలై 14 వరకు 7,571 సర్వీస్లు, 2024 జూలై 15 నుంచి 2025 జూలై 15 వరకు 824 వ్యవసాయ సర్వీస్లు మంజూరు చేశారు. పొలం బాట ద్వారా హనుమకొండ జి ల్లాలో ఇప్పటివరకు 1,216 లూజ్ లైన్లు, 476 వంగిన స్తంభాలు,3,609 మధ్య స్తంభాలు ఏర్పా టు చేశారు. వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు 1,141లూజ్లైన్లు,445 వంగిన స్తంభాలు, 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్ల ఏర్పాటుతో ప్రయోజనం ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. డిపార్ట్మెంట్ వాహనాల్లోనే ట్రాన్స్ఫార్మర్ల తరలింపు.. రైతులకు వ్యవసాయ సర్వీస్ మంజూరుకు చెందిన ఎస్టిమేట్ కాపీలు తెలుగులో అందిస్తున్నారు. రైతుల ఫోన్ నంబర్కు వచ్చే ఎస్ఏంఎస్ లింకు క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా రైతులకు అందించే మెటీరీయల్ జాబితాపై వారికి పూర్తి స్పష్టత వస్తుంది. ఎస్ఎంఎస్లు కూడా తెలుగులోనే పంపుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లను డిపార్ట్మెంట్ వాహనాల్లోనే తరలించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుకు ఎస్పీఎం హెడ్లు ఏర్పాటు చేశారు. తద్వారా ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు వేగంగా జరిగి వెంటనే బిగించే ఆస్కారం ఉంటుంది. వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్యూర్ కాకుండా పిడుగుల నిరోధకాలు అమర్చుతున్నారు. వేసవి కార్యాచరణలో భాగంగా అధిక భారం ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై భారం తగ్గించేందుకు హనుమకొండ జిల్లాలో అదనంగా 181 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా 145 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. వరంగల్ జిల్లాలో అదనంగా 214 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయగా, 213 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ల బిగింపు.. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో త్వరి తగతిన వేరే ట్రాన్స్ఫార్మర్ను బిగిస్తున్నాం పట్టణాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో మార్చుతున్నాం. రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్య ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన సేవలు అందిస్తున్నాం. – కె.గౌతంరెడ్డి, వరంగల్ ఎస్ఈ పొలంబాటతో సమస్యల పరిష్కారం యుద్ధప్రాతిపదికన వ్యవసాయ సర్వీసుల మంజూరు రైతులకు తెలుగులో ఎస్టిమేట్ ప్రతులు -
ఇద్దరు దొంగల అరెస్ట్
నల్లబెల్లి: స్నేహితుడితో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు ఓ ఎలక్ట్రీషియన్. నిందితులను నల్ల బెల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి నుంచి రూ.19,800 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై గోవర్ధన్ వివరాలు వెల్లడించారు. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన బొడిగె ప్రశాంత్ (బక్కులు) ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. నల్లబెల్లి తిరుమల వైన్షాపులో పలుమార్లు విద్యుత్ మరమ్మతు పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ఎలక్ట్రీషియన్గా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ప్రశాంత్ దొంగతనం చేయాలనే ఆలోచనకు వచ్చాడు. వైన్ షాపులో పనిచేస్తున్న సమయంలో చోరీకి రెక్కీ నిర్వహించాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడు ఎల్ల బోయిన సాయికుమార్ (బన్నీ)తో చర్చించాడు. జల్సాలకు అలవాటుపడిన వారు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న అర్ధరాత్రి వైన్షాపు వెంటిలేటర్ను బొడిగె ప్రశాంత్ పగులగొట్టి లోపలకు చొరబడ్డాడు. క్యాష్ కౌంటర్లోని డబ్బులు దొంగిలించగా, కాపలా సాయికుమార్ ఉన్నా డు. షాపు నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిఘా పెట్టారు. గురువారం నల్లబెల్లి క్రాస్రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులకు వీరు అనుమానాస్పదంగా కనిపించారు. ఎస్సై తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని విచారించగా నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.19,800 స్వాధీనం చేసున్నామని వెల్లడించారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. సమావేశంలో హెడ్కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, హోంగార్డు రమేశ్ పాల్గొన్నారు. రూ.19,800 నగదు స్వాధీనం -
జిల్లాకు ‘కాయకల్ప’ అవార్డులు
గీసుకొండ: జిల్లాకు కాయకల్ప అవార్డుల పంట పండింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ, జాతీయ హెల్త్మిషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా 2024–2025 సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ అవార్డుకు మెరుగైన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, కలిగి ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. వాటిలో జిల్లా నుంచి మొత్తం 22 ఆరోగ్య కేంద్రాలు కాయకల్ప అవార్డుకు ఎంపికై నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు గురువారం తెలిపారు. ఎంపికై న పీహెచ్సీలు.. జిల్లాలో 14 పీహెచ్సీలు ఉన్నాయి. వాటిలో గీసుకొండ, పర్వతగిరి, సంగెం, నెక్కొండ, నల్లబెల్లి, మేడపల్లి, కేశవాపూర్, అలంకానిపేట, పైడిపల్లి పీహెచ్సీలు కాయకల్ప అవార్డుకు ఎంపికయ్యాయి. ఈ అవార్డు కింద ఎంపికై న 9 పీహెచ్సీలకు రూ.6 లక్షల నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. యూపీహెచ్సీలు.. జిల్లాలో ఏడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో కీర్తినగర్, దేశాయిపేట, చింతల్ పీహెచ్సీలను అవార్డుకు ఎంపిక చేశారు. వీటికి రూ.మూడు లక్షలను ప్రోత్సాహకంగా అందిస్తారు. 12 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం).. జిల్లాలో నర్సంపేటలో మూడు, అశోక్నగర్లో ఒకటి, తిమ్మంపేట, రెడ్లవాడ, ఇటుకాలపల్లి, ధర్మా రం, అమీనాబాద్, కోనాపురం, తూర్పుతండా, గవిచర్లలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఎంపిక చేశారు. వీటికి రూ.2.60 లక్షలను నగదు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. కలెక్టర్ అభినందనలు.. జిల్లాలోని 22 ఆరోగ్యకేంద్రాలు జిల్లాస్థాయి కాయకల్ప అవార్డుకు ఎంపిక కావడంతో కలెక్టర్ సత్యశారద వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించిన ట్లు డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు తెలిపారు. ఆరోగ్య జిల్లాగా మార్చడానికి వైద్య, ఆరోగ్య వి భాగం మరింత కృషి చేయాలని ఆయన కోరారు.కాయకల్ప కార్యక్రమం ఇలా.. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, జాతీయ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఆధ్వర్యంలో కాయకల్ప కార్యక్రమం ప్రారంభమైంది. ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత పాటించడం, ఇన్ఫెక్షన్ సోకకుండా చర్యలు చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పరిశుభ్రత, పారిశుధ్ధ్యం విషయాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించే వారికి స్వచ్ఛభారత్ అభియాన్–2015లో భాగంగా కాయకల్ప అవార్డులు ఇస్తున్నారు. ఏదైనా ఆరోగ్య కేంద్రం పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాల నాణ్యతను పెంపొందించే విషయంలో 70 శాతం స్కోర్ చేస్తే అవార్డుకు ఎంపిక చేస్తున్నారు. అవార్డు ఎంపిక కోసం ప్రతీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ పరిశీలించి స్కోర్ ఇస్తుంది. 22 ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేసిన ప్రత్యేక కమిటీ వీటిలో 9 పీహెచ్సీలు, 3 యూపీహెచ్సీలు, 12 ఏఏఎంలు -
గంగదేవిపల్లిని సందర్శించిన విదేశీయులు
గీసుకొండ: మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగదేవిపల్లిని విదేశీయులు గురువారం సందర్శించారు. బాలవికాస పీపుల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం కింద సీడీఎస్డీ కోర్సులో ఈ నెల 14 నుంచి 24 వరకు శిక్షణ పొందుతున్న విదేశీయులు క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా గ్రామాన్ని సందర్శించారు. ఇటలీ, నేపాల్, శ్రీలంక, భారతదేశంలోని జమ్మూకశ్మీర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 10 మంది పర్యటించారు. గ్రామంలో బీసీ హాస్టల్, పీహెచ్సీని ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు సాగుతామని వారికి జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి తెలిపారు. అలాగే, వితంతువుల జీవన విధానం, గ్రామ అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యం తదితర విషయాలను వివరించారు. బాలవికాస ప్రోగ్రాం డైరెక్టర్ సునీతారెడ్డి, సీనియర్ అసోసియేట్ కె.రమ, పంచాయతీ కార్యదర్శి కె.రమ్యకుమారి, పీఆర్ఏ ఎన్. శేఖర్, గ్రామ పెద్దలు కూసం లింగయ్య, రమేశ్ పాల్గొన్నారు. -
14.06 టీఎంసీలు.. 6.46 లక్షల ఎకరాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖ వరంగల్, ములుగు సర్కిళ్ల పరిధిలో వానాకాలం సాగునీటి విడుదల యాక్షన్ ప్లాన్ను ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, వర్షం, వరదలను అంచనా వేసి ఉమ్మడి వరంగల్లో ఖరీఫ్ పంటలకు నీరిందించే విధంగా ప్రణాళికను ప్రకటించింది. 2,52,623 ఎకరాల తరి, 3,94,041 ఎకరాల ఆరుతడి కలిపి మొత్తం 6,46,664 ఎకరాలకు 14.06 టీఎంసీల సాగునీటిని సరఫరా చేయనున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొంది. ఈ మేరకు ఇటీవల హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (ఎస్సీఐడబ్ల్యూఏడబ్ల్యూ (స్కివం) సమావేశం అనంతరం సాగునీటి వివరాలను ప్రకటించారు. నీటి విడుదల తేదీ త్వరలో ప్రకటన.. ఉమ్మడి వరంగల్లో వాస్తవంగా ఎస్సారెస్పీ, దేవాదుల, సరస్సులు, చిన్ననీటి వనరుల ద్వారా స్థిరీకరించిన ఆయకట్టు 9,43,530 ఎకరాలు కాగా.. ప్రస్తుత పరిస్థితులు, నీటిలభ్యతను బట్టి 6,46,664 ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ (వారబందీ) పద్ధతిన సరఫరా చేయనున్నారు. 15 రోజులు విడుదల చేసి 15 రోజులు ఆఫ్ చేసే పద్ధతిలో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ వరంగల్ సర్కిల్ పరిధిలో దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు అన్ని నింపి 2,03,641 ఎకరాలకు 11.48 టీఎంసీలు సరఫరా చేయనున్నారు. సరిపడా వరదలు వచ్చిన తర్వాత సమీక్షించి ఎల్ఎండీ దిగువన కాకతీయ కాల్వ, ఎస్సారెస్పీ–2 కాల్వల ద్వారా మరో 2,91,936 ఎకరాలకు నీటి సరఫరా చేస్తారు. ములుగు సర్కిల్ పరిధిలో 10.05 టీఎంసీలకు 2.419 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఎల్ఎండీ, దేవాదుల, రామ ప్ప, లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగుల ద్వారా 34,618 ఎకరాల తరి, 1,16,469 ఎకరాల ఆరుతడి కలిపి 1,52,087 ఎకరాలకు సుమారు 2.58 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని అధికారులను ‘స్కివం’ కమిటీ ఆదేశించింది. ఈ మేరకు 15 రోజులకోసారి ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన వానాకాలం పంటలకు నీరందించేందుకు ప్రణాళిక సిద్ధం కాగా.. నీటిని విడుదల చేసే తేదీలను త్వరలోనే అధికారులు ప్రకటించనున్నారు. చీఫ్ ఇంజనీర్ల ప్రతిపాదనలు.. ‘స్కివం’ కమిటీ సూచనలు.. ములుగు సర్కిల్ పరిధిలోని 1,03,883 ఎకరాల ఆయకట్టుకు అధికారులు 93,750 ఎకరాలు ప్రకటించగా.. వరద ఇన్ఫ్లోను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. దేవాదుల ద్వారా 4,170 ఎకరాలకు 3,570 ఎకరాలకు 0.35 టీఎంసీలు, పాకాల కింద 23,193 ఎకరాలకు 1.43 టీఎంసీలు, రామ ప్ప ద్వారా 6,780కు 0.80 టీఎంసీల నీటిని ప్రతిపాదించారు. లక్నవరం, మల్లూరు వాగు, పాలెం వాగు ద్వారా 23,794 ఎకరాల ఆయకట్టును ప్రతి పాదించగా.. ఎస్సారెస్పీలో నీటి కొరత కారణంగా ఎల్ఎండీ, ఎస్సారెస్పీ కింద ప్రతిపాదించిన ఈ ఆయకట్టు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు తగినంత ఇన్ఫ్లో వచ్చిన తర్వాత సమీక్షించనున్నట్లు ‘స్కివం’ సూ చించింది. గోదావరి నదిలో తగినంత నీరు అందుబాటులో ఉన్నందున దేవాదుల ప్రాజెక్టు పరిధిలో ని అన్ని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని కూడా కమిటీ ఆదేశించింది. ఇంకా రామప్ప సర స్సు నుంచి పాకాల సరస్సుకు పంపింగ్ అందుబా టులో ఉన్నందున ఈ ప్రాజెక్టుల కోసం ములుగులోని సీఈలు ప్రతిపాదించిన కార్యాచరణను కమిటీ అంగీకరించి అమలు చేయాలని సిఫార్సు చేసింది.వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక ఇది ‘స్కివం’ కమిటీ సమావేశంలో యాక్షన్ ప్లాన్ ఖరారు వరంగల్, ములుగు సీఈల ప్రతిపాదనలకు ఆమోదం ప్రస్తుత నీటి లభ్యతను బట్టి నిర్ణయం.. వరదలొచ్చే వరకు ఆన్ అండ్ ఆఫ్.. 15 రోజులకోసారి వారబందీ పద్ధతిన విడుదల -
మహిళల భద్రత కోసమే షీటీంలు
నర్సంపేట: మహిళలు, విద్యార్థినులకు భద్రతపై భరోసా కల్పించేందుకే నర్సంపేటలో షీటీం ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఈ మేరకు పోలీస్ సిబ్బంది నివాస ప్రాంగణంలో షీ టీం కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. నర్సంపేట షీటీం తొలి ఎస్సై స్వాతికి పోలీస్ కమిషనర్ మొక్క అందజేసి అభినందించారు. నర్సంపేటలోని షీ టీం విభాగం నిర్వర్తించాల్సిన విధుల గురించి షీ టీం ఏసీపీ సదయ్య పోలీస్ కమిషనర్కు వివరించారు. విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇప్పించాలని సీపీ అధికారులకు సూచించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మూడు షీ టీంలు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆకతాయిలు మహిళలను వేధించినా, లైంగిక వేధింపులకు గురిచేసినా తక్షణమే నర్సంపేట షీ టీం విభాగం ఫోన్నంబర్ 8712552326కు సమాచారం అందించాలన్నారు. రానున్న రోజుల్లో జనగామ జిల్లా కేంద్రంలోను షీ టీం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, ఏసీపీలు రవీందర్రెడ్డి, సదయ్య, వరంగల్ పోలీస్ కమిషనరేట్ షీ టీం ఇన్స్పెక్టర్ సుజాత, నర్సంపేట ఇన్స్పెక్టర్ రఘు, దుగ్గొండి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయిరమణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్లను సందర్శించిన సీపీ.. పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ గురువారం నర్సంపేట డివిజన్ పరిధిలోని నర్సంపేట, దుగ్గొండి, ఖానాపురం పోలీస్స్టేషన్లతోపాటు నర్సంపేట ఏసీపీ, దుగ్గొండి సర్కిల్ పోలీస్ కార్యాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని, రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని సిబ్బందికి సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ -
భాస్కర్రావుకు బెస్ట్ టీచర్ అవార్డు
రామన్నపేట: నగరానికి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు భాస్కర్రావు నేషనల్ సుశ్రుత అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన శల్యకాన్–25 జాతీయ సమావేశంలో కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. 35 ఏళ్లు వైద్యవృత్తిలో కొనసాగుతూ.. 15 వేలకు పైగా.. అర్షమొలలు, ిఫిష్టులా చికిత్సలు చేశారు. ఓవైపు వైద్యవృత్తిని కొనసాగిస్తూనే మరోవైపు సెమినార్లలో పాల్గొనడం, పరిశోధనా పత్రాలు సమర్పించారు. వివిధ దేశాల్లో 30కిపైగా అంతర్జాతీయ పరిశోధనా పత్రాలు సమర్పించిన ఘనత ఆయనది. ప్రస్తుతం ఆయన న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఆయుష్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఆయుర్వేద్విద్యా పీటీ గురువుగా పనిచేస్తున్నారు. భాస్కర్రావుకు అవార్డు రావడంపై స్నేహితులు, కుటుంబసభ్యులు, తోటి వైద్యులు అభినందనలు తెలిపారు.గుర్తింపులేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దువిద్యారణ్యపురి: అనుమతి, గుర్తింపులేని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దని డీఈఓ మామిడాల జ్ఞానేశ్వర్ ఒక ప్రకటనలో కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించే ముందు ఈ విద్యాసంవత్సరానికి అనుమతి ఉందా లేదా అనేది తెలుసుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలలను మధ్యలోనే మూసివేసే పరిస్థితులు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఆగస్టు 31 వరకు మాత్రమే పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు అవకాశం ఉందన్నారు. ఆయా విద్యార్థులకు పెన్ (పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్) కేటాయిస్తారని తెలిపారు. ఈ నంబర్ ద్వారా విద్యార్థి ఏ తరగతి చదువుతున్నాడు, ఏ పాఠశాలలో చదువుతున్నాడు, ఏ పాఠశాలకు మారాడు అనే వివరాలను యూడైస్ పోర్టల్లో ట్రాక్ చేస్తారని తెలిపారు. అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తే విద్యార్థికి పెన్ కేటాయించరని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేటప్పుడు కచ్చితంగా గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలని డీఈఓ కోరారు. మెడికల్ షాపులో చోరీనర్సంపేట రూరల్: మెడికల్ షాపులో చోరీ జరిగిందని ఎస్సై రవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. నర్సంపేట పట్టణంలోని వరంగల్ రోడ్డులో నిమ్స్ మెడికల్ షాపును చిట్టె గురు నిర్వహిస్తున్నాడు. బుధవారం రాత్రి 11.30 గంటలకు షాపు బంద్ చేసుకుని ఇంటికి వెళ్లాడు. ఉదయం షాపు తీసేందుకు రాగా షట్టర్కు వేసిన తాళాలు పగులగొట్టి కనిపించాయి. అనుమానంతో షాపు తీసి చూడగా గల్లా పెట్టెలో ఉన్న రూ.35 వేల నగదు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు షాపును పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: తెలంగాణ మైనారిటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగంలో ఉచిత శిక్షణ కం ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో నెలరోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైనులు, పార్సీ, బౌద్ధులు) మైనారిటీ అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వివరాలకు హనుమకొండ సుబేదారి షరిఫన్ మజీద్ దగ్గరలోని అపోలో ఫార్మసీ పక్కన రెండో అంతస్తులో ఉన్న మైనారిటీ సంక్షేమాధికారి కార్యాలయం, 040–23236112 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా ప్రవీణ్కుమార్ కాజీపేట అర్బన్ : రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్శాఖ వరంగల్ జిల్లా ఇన్చార్జ్ రిజిస్ట్రార్గా ప్రవీ ణ్కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా సబ్ రిజిస్ట్రార్లు రామనరసింహారావు, ఆనంద్, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. -
మూతబడి..!
మూణ్నాళ్లకేచొరవ చూపిస్తేనే ముందుకెళ్లేది.. ● నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామ శివారు హేమ్లా తండా ప్రాథమిక పాఠశాల 2022లో విద్యార్థులు లేకపోవడంతో మూసివేశారు. అక్కడి ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై వేరే పాఠశాలలకు పంపించారు. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఈ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు చేరడంతో ఉపాధ్యాయురాలు విజయరాణి పాఠాలు బోధిస్తున్నారు. ● విద్యార్థులు లేకపోవడంతో నర్సంపేట మండలంలోని రాజపేట గ్రామశివారు చింతగడ్డతండా ప్రాథమిక పాఠశాల 2022లో మూతబడింది. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఒకటో తరగతిలో ముగ్గురు, రెండో తరగతిలో నలుగురు విద్యార్థులు చేరారు. ఈ ఏడుగురు విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు గోవర్ధన్ పాఠాలు చెబుతున్నారు. ● నల్లబెల్లి మండలం గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేకపోవడంతో 2022లో మూతబడింది. ఈ ఏడాది బడిబాటలో భాగంగా ఉపాధ్యాయుల చొరవతో 10 మంది విద్యార్థులు చేరడంతో తిరిగి ప్రారంభమైంది. ఈ మూడు పాఠశాల్లో ఉపాధ్యాయులు రెగ్యులర్ వచ్చి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తేనే ఇవి కొనసాగుతాయి. లేదంటే ఇప్పటికే రీ ఓపెన్ అయి రోజుల వ్యవధిలోనే మూతబడిన పాఠశాలుగా మారే ప్రమాదముంది. సాక్షి, వరంగల్: బడిబాట కార్యక్రమంలో విద్యార్థులు చేరిన 6 జీరో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. పట్టుమని 10 రోజులు కాకముందే వీటిలో మూడు పాఠశాలలు మళ్లీ మూతబడడం ఆందోళన కలిగిస్తోంది. సర్కారు స్కూళ్లకు పంపండి.. చదువుతోపాటు పౌష్టికా హారం, ఉచిత పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు, కంప్యూటర్ క్లాస్లు ఉన్నాయంటూ ఉపాధ్యాయులు వందలాది మంది విద్యార్థులను చేర్పించారు. ఉపాధ్యాయుల్లో కొందరు ఆ సంఖ్యను కొనసాగించడంలో విఫలమవడంతో తిరిగి ప్రారంభమైన జీరో స్కూ ల్స్ మూతబడ్డాయి. అమ్మమ్మ ఇంటి వద్దకు వచ్చి ఈ బడుల్లో చేరిన వారు తిరిగి వెళ్లిపోగా.. ఉపాధ్యాయులు సమయానికి రాక ఇంకొందరు విద్యార్థులు,పాఠశాలల పరిసరాలు అంతా చెట్లమయంగా ఉండడం, అపరిశుభ్ర వాతావరణం, పాములు, విషపురుగుల వంటి బెడద ఉందని మరికొందరు ఈ జీరో స్కూల్స్కు దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది. కారణాలు ఏమైనా విద్యార్థులకు ప్రభుత్వ బడి చదువులపై ఆసక్తి కలిగించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోకపోవడం వల్లనే ఇలా జరిగిందని విద్యాశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అమ్మమ్మ ఇంటి నుంచి వెళ్లడంతో.. విద్యార్థులు లేకపోవడంతో నల్లబెల్లి మండలం కొండాయిల్పల్లి ప్రాథమిక పాఠశాలను 2024లో మూసివేశారు. ఈ ఏడాది బడిబాటలో భాగంగా అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న ఇద్దరు చిన్నారులు పాఠశాలలో చేరారు. జూలై తొలివారం వరకు హాజరైన ఆ విద్యార్థులు తర్వాత వారి నానమ్మ ఇంటి వద్దకు వెళ్లారు. ఇలా విద్యార్థులు బడికి గైర్హాజరవడంతో ఉపాధ్యాయులు ఖాళీగా ఉంటున్నారు. పాము కాటు భయంతో దూరంగా.. బడిబాటలో భాగంగా ఉపాధ్యాయులు నచ్చజెప్పడంతో నలుగురు విద్యార్థులు చేరడంతో పర్వతగిరి మండలం భట్టుతండాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైంది. గతంలో ఈ బడిలోనే ఓ విద్యార్థి పాముకాటుకు గురై మృత్యువాతపడ్డాడు. ఇప్పటికీ ఈ పాఠశాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్ల అడ్మిషన్లు తీసుకున్న నలుగురు విద్యార్థులు కాస్త మళ్లీ వెనుకంజ వేయడంతో ఈ బడి మూతబడినట్లయ్యింది. ఆ విద్యార్థులు వేరే పాఠశాలకు వెళ్తున్నారు. ఒక్కొక్కరు చేజారడంతో.. సంగెం మండలంలోని ముమ్మిడివరం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక 2018లో మూతబడింది. అయితే ఈ ఏడాది బడిబాటలో భాగంగా 10 మంది విద్యార్థులు చేరడంతో పునఃప్రారంభమైంది. రోజులు గడుస్తున్నా కొద్దీ ఒక్కొక్కరు పాఠశాలకు రాకపోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య మళ్లీ జీరోకు చేరింది. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కుమారస్వామిని తిరిగి డిప్యుటేషన్పై మొండ్రాయిలోని ప్రభుత్వ పాఠశాలకు పంపించారు. ఈఏడాది ప్రారంభమైన 6 జీరో స్కూళ్లలో మూడు మూసివేత ఉపాధ్యాయుల చొరవ, పరిసరాల శుభ్రత లేకపోవడమే కారణం -
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి
● డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య నడికూడ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. బుధవారం మండలంలోని రాయపర్తి పీహెచ్సీ పరిధి నార్లాపూర్, చర్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. నార్లపూర్ సబ్ సెంటర్లో విద్యుత్ సౌకర్యం లేదని సిబ్బంది తెలుపగా, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం రాయపర్తి పీహెచ్సీని సందర్శించి రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuస్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లపైన సందిగ్ధత నెలకొంది. న్యూస్రీల్75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు.. -
ఉప్పల్ రైల్వే స్టేషన్, ఆర్వోబీ పరిశీలన
కమలాపూర్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని ఉప్పల్ రైల్వేస్టేషన్ను, ఆర్వోబీని దక్షిణ మధ్య రైల్వే అసిస్టెంట్ డివిజనల్ మేనేజర్ గుప్తా బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఉప్పల్ రైల్వే స్టేషన్లోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఉప్పల్ ఆర్వోబీ పనుల పురోగతి, సత్వర పూర్తి కోసం చేపట్టాల్సిన చర్యలపై రైల్వే అధికారులు, కాంట్రాక్టర్కు పలు సూచనలిచ్చారు. అనంతరం బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్వోబీ పనుల్లో కీలకమైన రైల్వే ట్రాక్పై గడ్డర్ల బిగింపు కోసం రైళ్ల రాకపోకలను నిలపాల్సి వస్తుండడంతో పనులు చేపట్టే రోజున సుమారు 6 గంటల పాటు లైన్ బ్లాక్ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. కాంట్రాక్టర్పై సీబీఐ కేసు కారణంగా ఆర్వోబీ నిర్మాణంలో ఆలస్యం జరిగిందని, మిగతా పనుల ఆలస్యానికి గల కారణాల్ని రైల్వే అధికారులు గుర్తించారని, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశాలతో ఆర్వోబీ పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని తెలిపారు. అనంతరం ఉప్పల్ రైల్వే స్టేషన్ను ఆధునికీకరించాలని కోరుతూ.. రైల్వే అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, నాయకులు తోట సురేశ్, తుమ్మ శోభన్, బండి కోటేశ్వర్, భపతి ప్రవీణ్, పుల్ల అద్భుతరావు, చిట్టి సుందరయ్య, దండబోయిన శ్రీనివాస్, పసునూటి రాణాప్రతాప్, గుర్రం సురేశ్, మేడిపెల్లి రాజు, లచ్చన్న, రాజేందర్, రావుల ఆకాష్, చింతల రంజిత్, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
పని వదులుకుని.. పడిగాపులు
శాయంపేట: పని వదులుకుని పడిగాపులు కాసినా ప్రయోజనం లేకుండా పోతోంది. లైన్లో నిల్చున్న సగం మందికి సైతం యూరియా బస్తాలు అందడం లేదు. శాయంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా బస్తాల్ని బుధవారం అందజేశారు. ఈక్రమంలో ఉదయం 8 గంటల నుంచే రైతులు బారులుదీరారు. వీరితో పాటు మహిళా రైతులు సైతం క్యూ లైన్లలో యూరియా బస్తాల కోసం నిరిక్షీంచారు. మండలానికి గత మూడు రోజుల క్రితం కేవలం 312 బస్తాల యూరియా మాత్రమే రావడంతో రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. పీఏసీఎస్ సిబ్బంది ఒక్కో రైతుకు 2 యూరియా బస్తాలు మాత్రమే ఇచ్చారు. తప్పని తిప్పలు కమలాపూర్: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పట్లేదు. యూరియా వచ్చిందని తెలియగానే వ్యవసాయ పనులన్నీ వదులుకుని గంటల తరబడి క్యూ కడుతున్నారు. కమలాపూర్ పీఏసీఎస్కు బుధవారం 444 బస్తాల యూరియా వచ్చింది. సమాచారమందుకున్న రైతులు పెద్ద ఎత్తున పీఏసీఎస్ వద్ద బారులు తీరరు. మరి కొందరు క్యూలైన్లో చెప్పులు ఉంచారు. యూరియా పంపిణీ సమయంలో తోపులాడుకున్నారు. సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎస్సై మధు, సిబ్బందితో అక్కడకు చేరుకుని రైతులను క్యూలైన్లో పంపించారు. ఒక్కొక్కరికి 3 బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయించారు. అయినప్పటికీ రైతులందరికీ యూరియా రాకపోవడంతో సగం మంది నిరాశతో వెనుదిరిగారు. సగం మందికి సైతం దొరకని యూరియా బస్తాలు మహిళా రైతులు సైతం క్యూ లైన్లో.. నానో యారియా ప్లస్ అంటగడుతున్నారని రైతుల ఆవేదనరెండు బస్తాలే ఇచ్చారు.. నాకు ఆరెకరాల సొంత భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నా. 12 ఎకరాలకు 36 బస్తాల యూరియా అవసరం పడుతుంది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పడిగాపులు కాస్తే పీఏసీఎస్ వారు 2 బస్తాల యూరియా ఇచ్చారు. దానికి తోడు రూ.225 విలువైన అర లీటర్ నానో యూరియా ప్లస్ బాటిల్ అంటగట్టారు. నానో యూరియా ప్లస్ వద్దు అంటే యూరియా బస్తాలు ఇచ్చేలా లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని నానో యూరియా ప్లస్ లింక్ పెట్టకుండా సరిపడా యూరియా అందించాలి. – రూపిరెడ్డి రాజిరెడ్డి, రైతు పత్తిపాక -
ఇళ్లు పూర్తయితేనే అదనంగా ఇస్తాం..
పరకాల: లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటేనే ఆయా గ్రామాలకు అదనంగా ఇళ్లు మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మహిళా సంఘాల ద్వారా రుణాలు తీసుకోవచ్చని సూచించారు. పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై పరకాల మండల, మున్సిపాలిటీ పరిధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాలవారీగా, వార్డుల వారీగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అధికారులను, ఇందిరమ్మ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా అర్హులైనవారందరికీ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్ల నిర్మాణ పనులు పూర్తికాగానే నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు డబ్బులు వస్తాయన్నారు. సమావేశంలో పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, తహసీల్దార్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుష్మ, వార్డు అధికారులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులతో సమీక్ష -
పూర్తి ఫీజు రాయితీ
రామన్నపేట : టీజీ పాలిసెట్ –2025 కౌన్సెలింగ్లో పాల్గొంటున్న అభ్యర్థుల్లో ప్రభుత్వ, జిల్లా పరిషత్, నవోదయ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్ శాఖల ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ కల్పించనున్నట్లు వరంగల్ పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, టీజీ పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరాయితీ పొందాలంటే అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరంగల్ హెల్ప్లైన్ సెంటర్ను సందర్శించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94921 10750 నంబర్లో సంప్రదించాలని, లేదా అధికారిక వెబ్సైట్ http://tgpolycet. nic.inను సందర్శించాలని కోరారు. ప్రజలకు నమ్మకం కలగాలి కాజీపేట: పోలీస్ స్టేషన్కు వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారుల చర్యలు ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అన్నారు. కాజీపేట పోలీస్ స్టేషన్ను బుధవారం సీపీ వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి సిబ్బందికి సూచనలిచ్చారు. సీఐ సుధాకర్రెడ్డి సీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. సాయుధ పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీస్ సిబ్బంది చేసిన పరేడ్తో పాటు కిట్ ఆర్టికల్స్ను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్, సీసీటీఎన్ఎస్ విభాగాల పనితీరును సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డుల్ని పరిశీలించి కేసుల పూర్వాపరాలు, రికార్డుల నిర్వహణ బాగుందని అభినందించారు. పక్కనే ఉన్న ట్రాఫిక్ పీఎస్ను సందర్శించి క్షేత్రస్థాయి సమస్యలపై చర్చించారు. తనిఖీల్లో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్కుమార్, లవన్కుమార్, శివ పాల్గొన్నారు. ‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’తో ఎంఓయూ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కో–ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు. ఎంఓయూపై కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ భరత్, సీనియర్ అసోసియేట్ సౌమ్యమైరెడ్డి సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మహేందర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సంతోశ్కుమార్ పాల్గొన్నారు. ‘కే హబ్’ సందర్శనకేయూ క్యాంపస్: హైదరాబాద్లోని టీహబ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూకా, స్టాఫ్ డైరెక్టర్ బెంజిమిన్ బుధవారం కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్ను సందర్శించారు. ఈపర్యటన సందర్భంగా వారు కే హబ్లోని వసతులు, మౌలిక సదుపాయాలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి అనుకూలంగా ఉండే సాంకేతిక శాసీ్త్రయ వాతావరణ పరిస్థితులపై వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో చర్చించారు. త్వరలోనే టీ హబ్, కే హబ్కు మధ్య ఎంఓయూ చేసుకోనున్నట్లు రిజిస్ట్రార్ వి.రామచంద్రం వెల్లడించారు. కార్యక్రమంలో రూసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జున్రెడ్డి, కేయూ దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ఆచార్య బి.సురేశ్లాల్, కె హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, డెవలప్మెంట్ ఆఫీసర్ ఎన్.వాసుదేవరెడ్డి, బొల్లం కిరణ్కుమార్, సిద్ధార్థ తదితరులున్నారు. -
ఆయిల్పామ్తో అధిక లాభాలు
వేలేరు: ఆయిల్పామ్ పంట సాగుతో అధిక లాభాలున్నాయని, రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం మండలంలోని గుండ్లసాగర్లో 12 ఎకరాల విస్తీర్ణంలో కేఎన్ బయో సైన్స్ ఆధ్వర్యంలో ఆయిల్పామ్ పంట సాగు చేస్తున్న రైతు మంగ సారంగపాణి వ్యవసాయ క్షేత్రంలో గెలల మొదటి కోత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆయిల్పామ్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని, ఈ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులు ప్రోత్సాహకాలు సద్విని యోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయిల్పామ్ పంటను కొన్న కేఎన్ బయోసైన్స్ వారు రైతులకు చెక్కులను కలెక్టర్ చేతులమీదుగా అందజేశారు. కాగా.. అంతకుముందు కలెక్టర్ కొబ్బరికాయ కొట్టి ఆయిల్పామ్ పంట కోతను ప్రారంభించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు అనసూయ, శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, హనుమకొండ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సుస్మిత, కేఎన్ బయోసైన్స్ జిల్లా మేనేజర్ రంజిత్కుమార్, తహసీల్దార్ కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, మండల వ్యవసాయ అధికారులు కవిత, రాజేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ గుండ్లసాగర్లో పంట మొదటి కోత ప్రారంభం -
స్కూళ్లలో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ కసరత్తు ముగిసింది. హనుమకొండ జిల్లాలో విద్యార్థులు లేని 41 పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు నిర్వహించిన బడిబాటలో భాగంగా స్వలంగా విద్యార్థులు చేరగా.. 9 పాఠశాలలను తెరిచారు. సమీప మండలాల నుంచి కూడా సర్దుబాటు జిల్లాలోని 14 మండలాల్లో ఎంఈఓలు.. ఏ మండల పరిధిలోని టీచర్లు ఆ మండల పరిధిలో వర్క్ అడ్జెస్ట్మెంట్ చేసేందుకు కసరత్తు చేశారు. ఉదాహరణకు హనుమకొండలో పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి సబ్జెక్టు టీచర్ల కొరత ఉంటే సమీప మండలాల నుంచి కూడా సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి నుంచి 10 మంది వరకు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలకు ఒక టీచర్ చొప్పున, 11 నుంచి 60 మంది ఉంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 మంది ఉంటే ముగ్గురు టీచర్లు, 91 నుంచి 120 మంది ఉంటే నలుగురు టీచర్లు, 121 నుంచి 150 మంది ఉంటే ఐదుగురు 151 నుంచి 200 మంది విద్యార్థులు, ఆపైన విద్యార్థులు ఉంటే కూడా టీచర్లు అదనంగా ఇచ్చేలా సర్దుబాటు చేశారని సమాచారం. విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. సింగిల్ టీచర్ ఉన్న ప్రాథమిక పాఠశాలలకు అవసరమైతే మరో టీచర్ను కేటాయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా యూపీఎస్, హైస్కూళ్లలో కూడా సర్దుబాటు చేశారని సమాచారం. ఉదాహరణకు హనుమకొండ సుబేదారి హైస్కూల్లో ముగ్గురు సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లు ఉంటే అందులో ఒకరిని హనుమకొండలోని మరో ప్రభుత్వ హైస్కూల్కు సర్దుబాటు చేశారని తెసింది. విద్యార్థుల సంఖ్యను బట్టి స్కూల్ అసిస్టెంట్లను సర్దుబాటు చేశారని తెలుస్తోంది. అలాగే, పలువురు ఎస్జీటీలను కూడా అవసరం ఉన్న హైస్కూళ్లకు కేటాయించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలో కసరత్తు వరంగల్ జిల్లాలో 13 మండలాల్లో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్పై సంబంధిత ఎంఈఓలు కసరత్తు చేస్తున్నారు. పలువురు ఎంఈఓలు తమ మండల పరిధిలో టీచర్ల వర్క్ అడ్జెస్ట్మెంట్ చేసి జాబితాలను డీఈఓ కార్యాలయానికి పంపారు. కొన్నిమార్పులు చేయాలనే ఉన్నతాధికారుల సూచనతో ఇంకా కసరత్తు జరగుతోందని సమాచారం. జిల్లాలో 135 జీరో విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లు ఉండగా.. అందులో ఈవిద్యాసంవత్సరంలో బడిబాట ద్వారా 7 పాఠశాలలు తెరుచుకున్నట్లు తెలు స్తోంది. ఇంకా ఈప్రక్రియ మరో రెండు మూడు రోజులకు పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ అప్రూవల్ తర్వాత ఉత్తర్వులు.. హనుమకొండ జిల్లాలోని మొత్తం 140 మంది టీచర్లను పాఠశాలల్లో సర్దుబాటు చేశారని సమాచారం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను సర్దుబాటు చేసి ఎంఈఓలు ఫైల్ను డీఈఓ కార్యాయానికి పంపగా.. డీఈఓ పరిశీలించి కలెక్టర్ అప్రూవల్కు మంగళవారం ఫైల్ను పంపించారని తెలుస్తోంది. కలెక్టర్ పరిశీలించి అప్రూవల్ చేశాకే రెండు మూడు రోజుల్లో వర్క్ అడ్జెస్ట్మెంట్కు సంబంధించి డీఈఓ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయి. జిల్లాలో 140 మంది సర్దుబాటు -
వరంగల్
గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025ఆ తర్వాతే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలుమహిళలు ఆత్మగౌరవంతో జీవించాలికళ్లు తెరవక ముందే..కాదనుకున్నారు రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్లో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డున పడేశారు.– 8లోu75 జెడ్పీటీసీలు, 778 ఎంపీటీసీలు.. స్థానిక ఎన్నికల కోసం ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్పై గవర్నర్ సంతకం చేయడమే తరువాయి రిజర్వేషన్లను ప్రకటించనున్నారు. ముందుగా పేర్కొన్న విధంగానే మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాతే గ్రామ పంచాయతీలు, వార్డులకు జరిపించనున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా పరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలను ఖరారు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లపైన సందిగ్ధం నెలకొంది. సాక్షిప్రతినిధి, వరంగల్: త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయా? ఈ దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోందా? బుధవారం జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను ప్రకటించడం వెనుక మతలబు ఇదేనా? స్థానిక సంస్థల నేపథ్యంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచిందా?.. అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. అధికారవర్గాలు కూడా స్థానిక సంస్థల నోటిఫికేషన్ త్వరలోనే రావొచ్చని చెబుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ స్థానాలను ప్రకటించినట్లు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని భావించిన అధికారులు ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లాలో 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులు ఉన్నాయి. ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపే విధంగా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లు సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్లకు వర్తిస్తుంది. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గవర్నర్కు పంపగా, ఆయన సంతకం కాగానే ఈ స్థానాలకు రిజర్వేషన్ ఖరారు చేయనున్నారు. ఇందుకు మరో వారం, పది రోజులు పట్టినా.. వచ్చే నెల మొదటి, రెండో వారంలో నోటిఫికేషన్ రావొచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు సంకేతాలు అందినట్లు కూడా చెబుతున్నారు. ఊపందుకున్న ‘స్థానిక’ సందడి.. పోటీకి ఆశావహుల సై.. సెప్టెంబర్ మాసంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల్లో మళ్లీ సందడి జోరందుకుంది. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్కార్డులు, రైతు భరోసా తదితర పథకాల పంపిణీని కాంగ్రెస్ పార్టీ వేడుకలా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ప్రయత్నంలో కేడర్ను అప్రమత్తం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సైతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీజేపీ ఈసారి బలప్రదర్శనకు దూకుడు పెంచుతోంది. వామపక్ష పార్టీలు సైతం కార్యక్రమాలను ఉధృతం చేశాయి. కాగా, ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలుస్తున్నారు. దీంతో వారి ఇళ్ల ముందు సందడి పెరిగింది. న్యూస్రీల్‘స్థానిక’ పోరుకు సర్కారు సమాయత్తం ఉమ్మడి వరంగల్లో స్థానాల ఖరారు.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ స్థానాల వెల్లడి వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో నోటిఫికేషన్? అధికారులకు ఎన్నికల సంఘం సంకేతాలు.. సిద్ధమవుతున్న పార్టీలు ఉమ్మడి వరంగల్లో జెడ్పీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, గ్రామ పంచాయతీలు, వార్డుల వివరాలు జిల్లా జెడ్పీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు జీపీలు వార్డులు హనుమకొండ 1 12 12 129 210 1,986వరంగల్ 1 11 11 130 317 2,754భూపాలపల్లి 1 12 12 109 248 2,102మహబూబాబాద్ 1 18 18 193 482 4,110ములుగు 1 10 10 83 171 1,520జనగామ 1 12 12 134 280 2,5346 75 75 778 1,708 15,006 -
‘యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్’తో ఎంఓయూ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కళాశాలకు, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్కు మధ్య ఎంఓయూ (అవగాహన ఒప్పందం) కుదిరింది. ఈఒప్పందం ద్వారా 250 మంది విద్యార్థులకు సాఫ్ట్స్కిల్స్, డేటా సైన్స్ తదితర అంశాల్లో కేంద్రీకృత శిక్షణ ఇవ్వనున్నారు. ఈశిక్షణతో విద్యార్థుల్లో ఉద్యోగావకాశాల కోసం అవసరమైన నైపుణ్యాలు పెంపొందిస్తారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయడమే ఈ ఒప్పంద లక్ష్యం అని ఆకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ బుధవారం తెలిపారు. ఎంఓయూపై కేయూ వీసీ ఆచార్య కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం, యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ భరత్, సీనియర్ అసోసియేట్ సౌమ్య మైరెడ్డి సమక్షంలో ఎంవోయూ చేసుకున్నారు. కార్యక్రమంలో ఆకళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.మహేందర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ సంతోశ్కుమార్ పాల్గొన్నారు. -
కాలం.. ఆలస్యం
నర్సంపేట: జిల్లాలో లోటు వర్షపాతంతో పత్తి, మొక్కజొన్న పంటలు, వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది జూలై 16 నాటికి జలకళ లేక చెరువులు బోసిపోతున్నాయి. ముందు మురిపించిన వర్షాలు.. తీరా సమయానికి ముఖం చాటేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీటి వనరుల వెలవెల.. జిల్లాలో ప్రాధాన నీటి వనరులైన పాకాల, రంగాయ చెరువు, కోపాకుల, కోనారెడ్డి, ఎల్గూరు రంగంపేట చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి. గత సంవత్సరం ఇదేరోజు నాటికి 50 శాతం వరకు నీటి నిల్వ ఉండగా ఈ ఏడాది వర్షపు నీరు చేరనేలేదు. హనుమకొండ జిల్లాలోని కటాక్షపూర్ చెరువు ఆయకట్టు ఎక్కువ భాగం వరంగల్ జిల్లాలోనే ఉంది. ఈచెరువు నీటినిల్వ సామర్థ్యం 26 అడుగులు కాగా.. ప్రస్తుతం నాలుగు అడుగుల నీరు మాత్రమే ఉంది. మొత్తం 1,300 ఎకరాల ఆయకట్టు ఉంది. దీంతో ఆయా చెరువుల కింద ఉన్న ఆయకట్టు రైతులు ఈ ఏడాది పంటలపై ఆందోళన చెందుతున్నారు. 30 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం.. జిల్లాలోని 13 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొంది. ఈ ఏడాది జూలై 16 నాటికి సాధారణ వర్షపాతం 284.7 మిల్లీమీటర్లు ఉండాలి. ఇప్పటివరకు 199 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో 30 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా ఉంది. భారీ వర్షాలు కురిస్తే నే భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుకొని పంటలు పండే అవకాశం ఉంది. 3.10 లక్షల ఎకరాల్లో పంటల సాగు.. జిల్లాలో అన్ని పంటలు కలిపి 3.10 లక్షల ఎకరాల్లో సాగవుతున్నా యి. ఇందులో ప్రధానంగా వరి పంట 1.44 లక్షలు,మొక్కజొన్న 10 వేల ఎకరాలు,పత్తి 1.26 లక్షలు, మిర్చి 9 వేలు, కంది 1,200, పసుపు 950, ఇతర పంటలు 17,500 నుంచి 18 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగవుతుండగా 90 శాతం పంటలు వర్షాధారంపైనే ఉన్నాయి. జిల్లాలో ప్రధాన నీటివనరులు, వాటి సామర్థ్యం, ప్రస్తుత నీటినిల్వ, ఆయకట్టు వివరాలు.. నీటివనరు నీటి సామర్థ్యం ప్రస్తుత ఆయకట్టు (ఫీట్లు) నీటినిల్వ (ఫీట్లు) (ఎకరాల్లో)పాకాల 30 ఫీట్లు 17.5 30 వేలు ఎల్గూరు 18 12 760 రంగాయ 17 4 1,600 కోపాకుల 12 1 2,000 జిల్లాలో ఈ సంవత్సరం వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో) మండలం కురిసింది సాధారణం లోటు నర్సంపేట 223.0 330.2 –32.0 గీసుకొండ 236.5 272.9 –13.0 దుగ్గొండి 232.2 268.3 –13.0 నల్లబెల్లి 194.8 309.6 –37.0 ఖానాపురం 269.5 343.7 –22.0 చెన్నారావుపేట 241.2 317.9 –24.0 సంగెం 181.7 278.2 –35.0 వర్ధన్నపేట 163.9 214.6 –24.0 రాయపర్తి 115.3 238.8 –52.0 పర్వతగిరి 137.5 263.4 –48.0 నెక్కొండ 178.4 303.8 –41.0 ఖిలా వరంగల్ 180.5 279.3 –35.0 వరంగల్ 233.1 279.8 –17.0ఎండిపోతున్న పంటలు వెలవెలబోతున్న చెరువులు జిల్లాలో లోటు వర్షపాతం ఆందోళన చెందుతున్న రైతులుమొక్కజొన్న పంటకు నీరు అందిస్తున్న ఈ రైతు పేరు కొయ్యడి లక్ష్మయ్య. నల్లబెల్లి మండలం కన్నారావుపేట శివారులో 40 గుంటల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని 25 రోజుల క్రితం మొక్కజొన్న పంట వేశాడు. వర్షాలు కురవకపోవడంతో వాడిపోతున్న పంటను కాపాడుకునేందుకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యవసాయ బోరును అద్దెకు తీసుకున్నాడు. అక్కడి నుంచి పైపులు వేసి నీటిని అందిస్తున్నాడు. వర్షాలు సమృద్ధిగా లేకపోవడంతో నీరు అందించేందుకు ఆయన అనేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇది ఒక లక్ష్మయ్య పరిస్థితి మాత్రమే కాదు.. జిల్లాలోని అనేక మంది రైతులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. -
పంటలు ఎండిపోతున్నాయి..
వర్షాలు లేక పంటలు మొత్తం ఎండిపోతున్నాయి. నాకు ఉన్న రెండు ఎకరాల్లో పత్తి పంట, నాలుగు ఎకరాల్లో వరి పంట సాగుచేయడానికి నారు పోశాను. ఒక ఎకరం పది గుంటల్లో మిర్చి సాగు చేయడానికి మిర్చి గింజలను తెచ్చి పోశాను. 30 గుంటలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేస్తున్నా. మొదట్లో వర్షాలు పడగానే వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంటలు వేసిన. కానీ, వర్షాలు 20 రోజులుగా పడడం లేదు. దీంతో వేసిన మొక్కజొన్న, పత్తి, వరి పంటలు, మిర్చి నారుమడి ఎండిపోతున్నాయి. వ్యవసాయ బావిలో ఉన్న కొద్ది పాటి నీటిని అందిస్తూ కాపాడుకుంటున్నాను. కానీ, బావిలో కూడా నీళ్లు మొత్తం అడుగంటిపోయాయి. ప్రతిరోజూ ఉదయం లేవగానే వర్షాలు కురిపించాలని వాన దేవుడిని మొక్కుతున్న. – బాదావత్ వస్రం, అక్కల్చెడ, చెన్నారావుపేట మండలం ● -
జూనియర్ కళాశాలలకు నిధులు
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, వివిధ మరమ్మతు పనులు చేపట్టేందుకు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ నిధులు మంజూరు చేశారు. హనుమకొండ జిల్లాలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా, అందులో ఆరింటికి రూ.73.20 లక్షలు మంజూరయ్యాయి. హనుమకొండ వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి బాలికల జూనియర్ కాలేజీకి మరమ్మతులు, వాటర్ సరఫరా, ఎలక్ట్రిఫికేషన్కు మొత్తంగా రూ.15 లక్షలు, హసన్పర్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రూ.12.80 లక్షలు, ధర్మసాగర్ జూనియర్ కాలేజీకి రూ.13 లక్షలు, ఆత్మకూరు జూనియర్ కళాశాలకు రూ.4.40 లక్షలు, పరకాల జూనియర్ కళాశాలకు రూ.13 లక్షలు, శాయంపేట కళాశాలకు రూ.15 లక్షలు మంజూరయ్యాయి. వరంగల్ జిల్లాలో కళాశాలలకు కూడా.. వరంగల్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా, అందులో పదింటికి రూ.1.36 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఖానాపురం కళాశాలకు రిపేర్లు, వాటర్ సప్లై, ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి సదుపాయం కల్పనకు రూ.15 లక్షలు, నర్సంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రూ.15 లక్షలు, నర్సంపేట బాలికల జూనియర్ కాలేజీకి రూ.15లక్షలు, వర్ధన్నపేట కాలేజీకి రూ.8.50 లక్షలు, రాయపర్తి కాలేజీకి రూ.15.30 లక్షలు, నెక్కొండ కళాశాలకు రూ.14 లక్షలు, సంగెం కళాశాలకు రూ.15 లక్షలు, గీసుకొండ కళాశాలకు రూ.8.20 లక్షలు, రంగశాయిపేట కళాశాలకు రూ.15 లక్షలు, వరంగల్లోని కృష్ణాకాలనీ బాలికల జూనియర్ కాలేజీకి రూ.15 లక్షలు నిధులు మంజూరయ్యాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకే.. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే ప్రభుత్వ జూని యర్ కాలేజీల పనులను కూడా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగించాలని ఆదేశాలు వచ్చా యి. ఆయా కళాశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసుకోవాలి. పనులను వారికి అప్పగించేందుకు ఇంటర్ విద్య అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమావేశమై ఆదేశించారు. పనులను పర్యవేక్షించాలి.. రాష్ట్ర విద్యమౌలిక సదుపాయల సంస్థలోని ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీలు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లు పనులు సరిగా జరిగేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు అధికారులకు పంపించాల్సి ఉంటుంది. – ఎ.గోపాల్, శ్రీధర్సుమన్, హనుమకొండ, వరంగల్ డీఐఈఓలు హనుమకొండకు రూ.73.20 లక్షలు, వరంగల్కు రూ.1.36 కోట్లు మౌలిక సదుపాయాల కల్పనకు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకే అప్పగింత మరమ్మతులు, నీటి సౌకర్యం తదితర పనులు చేపట్టాలి.. -
కార్మికులు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి
వరంగల్ అర్బన్ : కార్మికులు పనిచేయడంతోపాటు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి కోరారు. ‘నమస్తే’ కార్యక్రమంలో భాగంగా బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో డి స్లడ్జింగ్ ఆపరేటర్లు, డీఆర్సీసీ రాక్ పిక్కర్స్తో మేయర్ సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సమావేశమయ్యారు. ఉత్తమ ప్రతిభ చూపిన వారిని శాలువాలతో సత్కరించారు. అర్హులకు ఒక్కరికి రూ.5లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కార్డులు, పీపీఈ కిట్లు, గుర్తింపు కార్డులను అందజేశారు. సమావేశంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. అంకితభావంతో విధులు నిర్వర్తించాలి.. పారిశుద్ధ్య జవాన్లు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జవాన్లతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి వెన్నెముక వంటి వారన్నారు. జవాన్లు ప్రతీరోజు నాలుగు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని, మ్యాన్యువల్ హాజరును పరిగణనలోకి తీసుకోరన్నారు. 15 రోజులు విధులకు గైర్హాజరైతే ఔట్ సోర్సింగ్ జవాన్లను విధుల నుంచి తొలగిస్తామన్నారు. సమావేశంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అభివృద్ధి పనుల తనిఖీ బల్దియా పరిధి కొత్తపేట పైడిపల్లి, నవభారత్ కాలనీ ప్రాంతాల్లో పూర్తయిన అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుపై కమిషనర్ చాహత్ బాజ్పాయ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో నిర్మించిన అంతర్గత రోడ్లు, డ్రెయిన్ల నాణ్యత, రోడ్డు వెడల్పు, లోతు పరిశీలించారు. ఎంబీ రికార్డ్ ప్రకారమే బిల్లులు మంజూరు చేస్తామని, నాణ్యతలో లోపం ఉంటే కోతలు విధిస్తామన్నారు. తనిఖీల్లో ఈఈ సంతోశ్బాబు, స్మార్ట్ సిటీ పీఎంఈ ఆనంద్ వోలేటి, డీఈ రవికిరణ్, ఏఈలు ఉన్నారు. ‘నమస్తే’ కార్యక్రమంలో మేయర్, కమిషనర్ -
భర్తకు కూల్ డ్రింక్ లో గడ్డి మందు కలిపి..
వర్ధన్నపేట: కుటుంబ కలహాల కారణంగా ఓ భార్య కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి భర్తకు ఇవ్వడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. వర్ధన్నపేట ఎస్సై చందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం భవానికుంట తండాకు చెందిన జాటోతు బాలాజీ (44) ఈనెల 8న తండాలోని తన నివాసంలో దాటుడు పండుగ జరుపుకున్నాడు. పండుగ సందర్భంగా సాయంత్రం ఏడు గంటల సమయంలో బాలాజీ తాను మద్యం సేవించేందుకు బయటికి వెళ్తున్నానని భార్య కాంతికి చెప్పాడు. బయటికి వెళ్లొద్దని, ఇంట్లోనే మద్యం ఉందని చెప్పిన భార్య, వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసులో కూల్డ్రింక్లో గడ్డి మందు కలిపి బాలాజీకి ఇచ్చింది. ఇది తాగిన కొద్దిసేపటికే బాలాజీ గొంతులో నొప్పిగా ఉందని చెప్పడంతో కాంతి అతన్ని వదిలిపెట్టి అదే తండాలో ఉండే తన బావ అయిన వాంకుడోతు దశరు ఇంటికి వెళ్లింది. బాలాజీ పరిస్థితిని గమనించిన తండావాసులు వెంటనే వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల సూచనల మేరకు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎంనుంచి ఈనెల 13న హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించినట్లు ఎస్ఐ తెలిపారు. భర్తతో గొడవను మనసులో పెట్టుకున్న కాంతి తన బావ దశరు ప్రోత్సాహంతో గడ్డి మందును ఉద్దేశ పూర్వకంగానే బాలాజీకి తాగించినట్లు చెప్పారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్తోపాటు సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. నెక్ట్స్ ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబసభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది. కీలక అధికారుల్లో మొదలైన గుబులు.. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లలో ఒక్కొక్కరిపై దాడి.. ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
యూరియా బస్తాల సీజ్
● కేసు నమోదు నల్లబెల్లి: మండల కేంద్రంలోని ఖాజా మొయినుద్దీన్ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపులో 213 యూరియా బస్తాలను మంగళవారం సీజ్ చేసి షాపు యజమాని ఎండీ హైమద్పై కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి బన్న రజిత తెలిపారు. షాపును తనిఖీ చేసిన తను ఈపాస్ మెషిన్, బిల్లు బుక్కు, తదితర రికార్డుల్లో తేడాలను గుర్తించడంతోపాటు ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు తీసుకవెళ్లినట్లు రికార్డులో ఉన్న రైతులకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్నట్లు తెలిపారు. ఆయా రైతులు యూరియా తీసుకుపోలేదని చెప్పడంతో చర్యలకు ఉపక్రమించినట్లు పేర్కొన్నారు. ఎరువుల విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఓ వెంట ఏఈఓలు ఉన్నారు. ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న అర్హులైన బీసీ విద్యార్థులు ఈ విద్యాసంవత్సరానికి ప్రీ–మెట్రిక్ ఉపకార వేతనాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి పుష్పలత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్హత, తదితర ధ్రువీకరణ పత్రాలతో తెలంగాణ ఈపాస్.సీజీజీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేయాలని తెలిపారు. ఇతర వివరాలకు హనుమకొండ లష్కర్ బజార్లోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో బీసీ సంక్షేమాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్డులు ఉన్నవారికే యూరియా ఇవ్వాలి● జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ దుగ్గొండి: గ్రామాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు అందించిన ఎరువుల కార్డులు కలిగిఉన్న వారికే యూరియా అందించాలని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సిబ్బందికి సూచించారు. మండలంలోని మందపల్లి పీఏసీఎస్లో యూరియా పంపిణీ, ఎరువుల కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. రైతులు తమకు మ్యాపింగ్ చేసిన గ్రామాల్లోనే ఎరువులు తీసుకోవాలన్నారు. ఒక సొసైటీ పరిధి రైతులు మరో సొసైటీ పరిధిలో తీసుకోకూడదని తెలిపారు. అవసరం ఉన్నంతమేరకే యూరియా తీసుకోవాలని రైతులకు చెప్పారు. ప్రతి వారం యూరియా వస్తూందని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గుడిపెల్లి శ్రీనివాసరెడ్డి తమ సొసైటీకి వచ్చే యూరియా సరిపోవడం లేదని కోటా పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ మాధవి, ఏఈఓలు హన్మంతు, వైజయంతి, విజయ్కుమార్, రాజేష్, సొసైటీ సిబ్బంది రంగు వెంకటేశ్వర్లు, రైతులు పాల్గొన్నారు. జిల్లా స్థాయి కామిక్ రాత పరీక్ష పోటీలుఖిలా వరంగల్: ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ రాత పరీక్ష పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఏఎంఓ సృజన్ తేజ హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో ప్రథమ విజేతగా రంగశాయిపేట ఉన్నత పాఠశాల విద్యార్థి చరిత, ద్వితీయ విజేతగా సీహెచ్ దాక్షాయణి (జెడ్పీహెచ్ఎస్ ఉప్పరపల్లి), మూడో విజేతగా జి.రేణుక (జెడ్పీహెచ్ఎస్ మామునూరు క్యాంప్ హై స్కూల్) నిలిచారు. సృజన్తేజ వీరికి ప్రశంస పత్రాలతోపాటు బహుమతులను అందజేసి, మాట్లాడారు. విజేతలను త్వరలో హైదరాబాద్లో జరగనున్న రాష్ట్రస్థాయి కామిక్ రాత పరీక్ష పోటీలకు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డి నేటర్ సీహెచ్ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు రామకష్ణారెడ్డి, జ్యూరీ కమిటీ సీహెచ్ కృష్ణారెడ్డి, లక్ష్మణ్, సీఆర్పీ వెంకటాచారి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘ఎల్కతుర్తి’ జంక్షన్ పనుల్లో ఇష్టారాజ్యం
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025– 10లోuసాక్షిప్రతినిధి, వరంగల్ : ‘రాజుల పైసలు రాళ్లపాలు’ అన్నట్లుగా ఉంది కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా)లో కొందరు అధికారుల తీరు. దీని పరిధిలో చేపడుతున్న పనులకు నిధుల కేటాయింపు తీరు వివాదాస్పదమవుతోంది. ముందుగా కేటాయించిన నిధులతో పనులు పూర్తి కానప్పుడు.. అంచనాలు స్వల్పంగా పెరిగినా రీ టెండర్ ద్వారా పనులు అప్పగించాల్సి ఉంది. కానీ, ఇదేమీ పట్టని కుడా ఇంజనీరింగ్ అధికారులు రెండింతలు అంచనాలు పెంచి ఓ ఉన్నతాధికారికి బంధువైన బినామీ కాంట్రాక్టర్ (సబ్ కాంట్రాక్టర్)కే పనులు అప్పగించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జంక్షన్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ కోసం సుమారు రూ.1.54 కోట్లతో టెండర్లు పిలిచిన ఈ పనులను ఆ తర్వాత రూ.2.90 కోట్లకు పైగా పెంచి కొనసాగించడం కొత్త చర్చకు తెరలేపింది. ఈ వ్యవహారంపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కొందరు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. నిబంధనలకు మంగళం.. కాంట్రాక్టర్కు వత్తాసు.. వరంగల్ – కరీంనగర్, సిద్దిపేట – హనుమకొండ జాతీయ, రాష్ట్ర రహదారులకు సెంటర్గా ఉన్న ఎల్కతుర్తిలో సుందరంగా జంక్షన్ నిర్మించేందుకు ‘కుడా’ నుంచి నిధులు కేటాయించారు. రూ.1.60 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు ఏడాది కిందట టెండర్లు నిర్వహించారు. టెండర్ హనుమకొండ హంటర్రోడ్డులోని ఓ స్కూల్ నిర్వాహకుడు, కాంట్రాక్టర్కు దక్కింది. చివరి నిమిషంలో సదరు కాంట్రాక్టర్తో మంతనాలు జరిపిన ‘కుడా’ ఇంజనీరింగ్ అధికారి ఒకరు ఎల్కతుర్తి మండలానికి చెందిన ఒకరికి సబ్ కాంట్రాక్టు (బినామీ)గా రూ.1.60 కోట్ల పనులు కట్టబెట్టారు. రెండు హైవేలకు జంక్షన్గా ఉన్న ఎల్కతుర్తిలో ఈ పనులు జరుగుతుండగానే.. రూ.1.54 కోట్ల పనులను రూ.2.90 కోట్లకు అంచనాలు పెంచారు. త్వరలోనే మరో రూ.60 లక్షలు పెంచి మొత్తం రూ.3.50 కోట్లకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. కాగా, 1.5 శాతం కంటే ఎక్కువగా అంచనాలు పెంచరాదన్న నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ అంతకుమించి అంచనాలు పెంచడం అనివార్యమైతే పెరిగిన మొత్తానికి మళ్లీ టెండర్ నిర్వహించి పనులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా ‘కుడా’లోని ఓ ఇంజనీరింగ్ అధికారి తన సమీప బంధువుకు సబ్కాంట్రాక్టర్గా పనులు అప్పగించి ఇష్టారీతిన అంచనాలు పెంచి నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ డీజీ కార్యాలయానికి ఫిర్యాదులు అందడం కలకలం రేపుతోంది. అధికారుల తీరుతోనే అభాసుపాలు.. వరంగల్, సిద్దిపేట, కరీంనగర్కు వెళ్లే రహదారులను కలిపే ఎల్కతుర్తిలో జంక్షన్ ఏర్పాటుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ చూపారు. గతంలో అనేక సార్లు కోరినా కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభాకర్ ఈ జంక్షన్ కోసం అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్తో వరుస సమీక్షలు నిర్వహించారు. తక్షణమే నిధుల మంజూరుతో పాటు యుద్ధప్రాతిపదికన అత్యంత సుందరంగా ఎల్కతుర్తి జంక్షన్ను నిర్మించేందుకు అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు కమిషనర్, కలెక్టర్ శరవేగంగా పనులు పూర్తి చేసేందుకు కృషి చేశారు. ఎల్కతుర్తి జంక్షన్ చుట్టూ రోడ్ల విస్తరణ పనుల అప్పగింత విషయంలో కొందరు ‘కుడా’ ఇంజనీరింగ్ అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదమవుతోంది. ఇదిలా ఉండగా జంక్షన్ నిర్మాణం కోసం రూ.1.50 కోట్లతో ఆన్లైన్లో టెండర్లు జరిగాయని, తర్వాత బీటీ, రోడ్డు వెడల్పు, సైడ్ డ్రెయిన్్స్ను అదనంగా కలపడంతో మరో రూ.2 కోట్ల వరకు పెరిగిందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతుండడం గమనార్హం. న్యూస్రీల్అమాంతంగా అంచనాల పెంపు రీ టెండర్ లేకుండానే పనుల కేటాయింపు సుమారు రూ.1.54 కోట్ల నుంచి రూ.2.90 కోట్లకు పెరిగిన అంచనాలు ఓ ఇంజనీరింగ్ అధికారి చేతివాటం..? సబ్ కాంట్రాక్టర్గా బంధువుకు పనులు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ వరకు ఫిర్యాదులు అనుకున్నోళ్లకే ‘కుడా’ పనులు.. ఎల్కతుర్తిలో జంక్షన్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ కోసం సుమారు రూ.1.54 కోట్లతో ఈ టెండర్లు పిలిచిన ‘కుడా’.. మొదటి నుంచి అనుకూలమైన వారికే ఈ పనులు అప్పగించే యోచన చేసింది. ఇందులో భాగంగానే భద్రకాళి బండ్ టెండర్తోపాటు ఈ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు వర్క్ అగ్రిమెంట్ చేసే విషయంలోనూ కొందరు ఇంజనీరింగ్ అధికారులు తాత్సారం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తమకు అనుకూలమైన కాంట్రాక్టర్ కు ఈ పనులు దక్కలేదన్న కారణంతో సతాయించారన్న ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వెళ్లాయి. దీంతో సబ్కాంట్రాక్ట్ ఇచ్చే ఒప్పందం కుదుర్చుకుని పనులు ప్రారంభించగా... జంక్షన్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ తదితర సివిల్ వర్క్స్ కాకముందే ‘ముందుచూపు’తో గ్రీనరీ డెవలప్మెంట్ పనులకు షార్ట్ టెండర్లు పిలిచి టచ్లో ఉన్న కాంట్రాక్టర్లకు అప్పగించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందుకు సకాలంలో పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈ–ప్రొక్యూర్మెంట్ నిబంధనల మేరకు టెండర్లు పిలిచి అర్హులైన వారికి ఇచ్చామని ఇంజనీరింగ్ అధికారులు సమర్థించుకోవడం గమనార్హం. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
రాయపర్తి: అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని రైతువేదికలో రాయపర్తి పట్టణకేంద్రానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు మంగళవారం అధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏండ్లనాటి సొంతింటి కల నెరవేరుతుందన్నారు. ఇప్పటి వరకు పాలకుర్తి నియోజకవర్గంలో 3,200 ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో అందించే సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధిపథంలో నడుస్తుందన్నారు. బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఘన విజయం సాధించేలా కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నాగమణి, తహసీల్ధార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్నాయక్, ఎంపీఓ కూచన ప్రకాష్, తొర్రూరు బ్లాక్కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండలపార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా రైతువేదిక ఆరవణలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
ఆయిల్పామ్ తొలిపంట ప్రారంభం
దుగ్గొండి: మండలంలోని పలు గ్రామాల్లో నాలుగు సంవత్సరాల క్రితం సాగుచేసిన ఆయిల్పామ్ తొలిపంట ప్రారంభం అయింది. ఈ మేరకు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో రైతులు మాగంటి కిరణ్మయి, బాలమోహన్ వ్యవసాయక్షేత్రంలో మంగళవారం గెలలు తెంపడం ప్రారంభించారు. దీంతో రైతు బాలమోహన్ను జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించి, మాట్లాడారు. ప్రతి 15 రోజులకు ఒకసారి గెలలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం టన్నుకు రూ.21 వేలు పలుకుతుందన్నారు. గెలలు తీసే రైతులు ముందుగా ఉద్యానశాఖ అధికారులు, రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ప్రతినిధులకు సమాచారం అందిస్తే నర్సంపేటలోని పికప్ పాయింట్ నుంచి కాంటా వేసి తీసుకోవడం జరుగుతుందన్నారు. కొత్తగా సాగు చేయాలనుకునే రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్కార్డు జిరాక్స్లను అధికారులకు అందించాలని సూచించారు. కార్యక్రమంలో రామ్చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం సతీష్నారాయణ, డివిజన్ ఉద్యానశాఖ అధికారి జ్యోతి, రైతులు బాబురావు, సంపత్రావు, రమేష్, జైపాల్రెడ్డి, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి
కమలాపూర్: విద్యార్థులకు నాణ్యమైన విద్య, రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. కమలాపూర్లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో తరగతి గదులు, బోధన, భోజనశాల, వంటలు, మెనూ చార్ట్ను పరిశీలించి వసతుల గురించి ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అదిస్తున్నారా అని విద్యార్థులు, గురుకుల పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని తరగతి గదుల్లో విద్యార్థులు నేలపై కూర్చోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వనమహోత్సవంలో భాగంగా ఒక మొక్క నాటారు. అనంతరం సీహెచ్సీ, పీహెచ్సీని తనిఖీ చేశారు. ఎక్స్రే, ల్యాబ్, ఔట్, ఇన్ పేషెంట్ విభాగాలు, ఫార్మసీ, రోగులకు అందించే ఆహారాన్ని పరిశీలించారు. వైద్య సేవలు, ప్రసవాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రసవాలు ఇక్కడే చేయకుండా ఇతర ప్రభుత్వాస్పత్రులకు ఎందుకు రెఫర్ చేస్తున్నారని ఆశ కార్యకర్తలు, సిబ్బందిని మందలించి ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఎంజేపీ గురుకులాల ఆర్సీఓ రాజ్కుమార్, డీఈఓ వాసంతి, ఎంఈఓ శ్రీధర్, ప్రిన్సిపాల్ రవీందర్, డీసీహెచ్ఎస్ గౌతం చౌహాన్, డీఎంహెచ్ఓ అప్పయ్య, సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ నరేశ్, పీహెచ్సీ వైద్యాధికారి నాగరాజు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ బాబు పాల్గొన్నారు. పంగిడిపల్లి రోడ్డును బాగు చేయించండి.. హెచ్పీసీఎల్ గ్యాస్ ప్లాంట్కు వచ్చిపోయే భారీ వాహనాలతో దెబ్బతిన్న కమలాపూర్–పంగిడిపల్లి రోడ్డును బాగుచేయాలని పంగిడిపల్లి గ్రామస్తులు కలెక్టర్ను వేడుకున్నారు. వర్షాకాలంలో రోడ్డు బురదమయమై ప్రమాదాల బారిన పడుతున్నామని పేర్కొన్నారు. డబుల్ రోడ్డు విస్తరణతో భూములు కోల్పోతున్నామని కొందరు రైతులు కోర్టుకు వెళ్లారని, దీంతో కాంట్రాక్టర్ రోడ్డు పనులు మధ్యలోనే నిలిపి వేశాడని తెలిపారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయించాలని కోరారు. మాజీ సర్పంచ్లు చేలిక శ్రీనివాస్, వలిగె సాంబరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.కలెక్టర్ స్నేహ శబరీష్ -
ప్రజలకు అందుబాటులో ఉండాలి : డీఎంహెచ్ఓ
ఎంజీఎం: ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలందించాలని వరంగల్ డీఎంహెచ్ఓ సాంబశివరావు వైద్యాధికారులు, సిబ్బందిని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్, పీపీ యూనిట్ను మంగళవారం ఆయన సందర్శించి రికార్డులు పరి శీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ సాంబశివరా వు మాట్లాడుతూ వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని, పట్టణంలో పర్యటించినప్పుడు పరి సర ప్రాంతాలను పరిశీలించాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని, వర్షాకాలంలో తీసుకోవా ల్సిన జాగ్రత్తలు వివరించాలని పేర్కొన్నారు. జ్వరా లపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. కార్యక్రమంలో ఎంజీఎం పీపీ యూనిట్ వైద్యాధికారి యశస్విని, సూపర్వైజర్ నర్మద, రామా రాజేశ్ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
బోనాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి
వరంగల్ అర్బన్: శ్రావణ మాసంలో నిర్వహించే పోచమ్మ బోనాలకు ఆలయాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో మేయర్ మాట్లాడారు. ఆలయాల వద్ద లైటింగ్, అంతర్గత రహదారుల్లోని గుంతలను డస్ట్తో చదును చేయాలని కోరారు. భక్తులు అమ్మవారికి బోనాలు తీసుకొచ్చేటప్పుడు, సమర్పించేటప్పుడు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. 66 డివిజన్లలో చేపట్టిన పనులను సమీక్షించి సకాలంలో పూర్తిచేయాలని, టెండర్ ప్రక్రియలో ఉన్న పనులపై దృష్టి సారించాలని సూచించారు. ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, సంతోష్బాబు, మాధవీలత తదితరులు పాల్గొన్నారు. డ్రెయినేజీలో పూడికతీయండి.. వరంగల్ ఎంజీఎం మార్చురీ సమీపంలోని సినిమా థియేటర్ పక్కన ఉన్న డ్రెయినేజీ స్తంభించడంతో మేయర్ ప్రజారోగ్య విభాగం సిబ్బందిని మందలించారు. వెంటనే జేసీబీలతో డ్రెయినేజీలో పూడికతీయాలని ఆదేశించారు. నగర మేయర్ గుండు సుధారాణి -
వరంగల్లోనూ ఏసీబీ ఆరా..!
సాక్షిప్రతినిధి, వరంగల్: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఈఎన్సీ (జనరల్) చెట్టి మురళీధర్రావు మూలాలపై ఏసీబీ అధికారులు వరంగల్, హనుమకొండలలోనూ ఆరా తీశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల మేరకు మంగళవారం ఉదయం మురళీధర్రావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ బంజారాహిల్స్, కరీంనగర్, జహీరాబాద్ తదితర పదిచోట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే మురళీధర్రావు కుమారుడు అభిషేక్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పలువురు కాంట్రాక్టర్ల గురించి ఆరా తీసినట్లు ప్రచారం. కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ, దేవాదుల, ఎస్సారెస్పీలో కీలక పనుల సబ్ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణల నేపథ్యంలో హనుమకొండకు చెందిన కాంట్రాక్టర్ల గురించి ఆరా తీయడం చర్చనీయాంశంగా మారింది. ఇరిగేషన్లో మురళీధర్రావు కీలకంగా వ్యవహరించిన సమయంలో ఆయన కుమారుడు అభిషేక్ బినామీగా కాంట్రాక్టు సంస్థలకు మేలు జరిగేలా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు కట్టబెట్టారన్న ప్రచారం ఉంది. వర్క్ఆర్డర్లు జారీ చేసిన ఆధారాలు కూడా రాబట్టి హర్ష, సహస్ర (హనుమకొండ హంటర్రోడ్డు) కన్స్ట్రక్షన్ కంపెనీల పేర్లను బయట పెట్టినప్పటికీ.. మరో రెండు కాంట్రాక్టు సంస్థల గురించి ఆరా తీసిన ఏసీబీ పూర్తి వివరాలు బుధవారం వెల్లడించే అవకాశం ఉంది. కాగా, సహస్ర కంపెనీలో మంగళవారం సోదాలు నిర్వహించారు. తదుపరి ఎవరో.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించి అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ఒక్కొక్కరిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఏప్రిల్లో కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్ను ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని అరెస్టు చేశారు. కేసీఆర్ ఫామ్హౌస్ సమీపంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితోపాటు అమరావతిలో వాణిజ్య స్థలం, ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు ఉన్నట్లు ప్రకటించారు. ఈయన ఆధ్వర్యంలో రూ.48,665 కోట్ల పనులు జరిగినట్లు కూడా గుర్తించారు. ఆ తర్వాత ఇదే ప్రాజెక్టులో కీలకంగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఆయన కుటుంబసభ్యులు, బంధువుల్లో ఇటీవల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా నూనె శ్రీధర్ వందల కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు బయటపెట్టింది. తాజాగా, మంగళవారం ఉదయం మాజీ ఈఎన్సీ మురళీధర్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువుల్లో సోదాలు చేపట్టడం ఇరిగేషన్ వర్గాల్లో కలకలంగా మారింది. తదుపరి జాబితాలో ఎవరో? అన్న చర్చ ఇంజనీరింగ్ వర్గాల్లో సాగుతోంది. కీలక అధికారుల్లో మొదలైన గుబులు.. వరుస దాడులతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లలో గుబులు మొదలైంది. పదవీ విరమణ చేసినా వదలకుండా ఏసీబీ దాడులు నిర్వహిస్తుండడం ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్లు కీలకం. ఈ పనుల నిర్వహణ, పూర్తిలో అప్పటి సీఈ నల్లా వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరించారని అప్పటి ప్రభుత్వం ప్రశంసించి.. పదవీకాలాన్ని కూడా పొడిగించింది. మేడిగడ్డ కుంగుబాటు తర్వాత ఆయనతోపాటు 19 మంది వివిధ కేడర్లకు చెందిన అధికారులను ప్రస్తుత ప్రభుత్వం తప్పుబట్టింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, జస్టిస్ పీసీ ఘోష్ కమిటీలు కూడా విచారించి నివేదికలు రూపొందించాయి. కొందరిపైన క్రిమినల్ కేసులకు కూడా సిఫారసు చేశారు. ఈ జాబితాలో ఉండి విచారణను ఎదుర్కొన్న ముగ్గురు అధికారులపై కొద్ది రోజుల తేడాతో ఆదాయానికి మించిన ఆస్తుల కలిగి ఉన్నారన్న ఆరోపణలపైనే ఏసీబీ దాడులు నిర్వహించింది. అక్రమ ఆస్తుల గుట్టువిప్పి అరెస్టు చేయగా.. తర్వాత జాబితాలో ఎవరు? అన్న అంశం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. మాజీ ఈఎన్సీ మురళీధర్ అరెస్టు నేపథ్యం ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్వాహకుడితో సంబంధాలు మురళీధర్ కుమారుడు అభిషేక్ సన్నిహితులపై నిఘా కాళేశ్వరం ఇంజనీర్లు ఒక్కొక్కరిపై దాడి గురి.. ఏసీబీ లిస్టులో తరువాత ఎవరు..? -
మతతత్వ రాజకీయాలతో ప్రజలను విభజిస్తున్న బీజేపీ
నర్సంపేట: మతతత్వ రాజకీయాలతో దేశ ప్రజలను బీజేపీ విభజిస్తుందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. సీపీఐ సీనియర్ నాయకుడు సుంకరనేని బాలనర్సయ్య జెండా ఆవిష్కరించిన అనంతరం పట్టణంలోని మేర భవన్లో గడ్డం నాగరాజు, పిట్టల సతీష్ అధ్యక్షతన మంగళవారం సీపీఐ మండల 14వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం గొంతునొక్కుతూ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని పేర్కొన్నారు. కార్పొరేట్ శక్తులకు దాసోహం అయిందని పేర్కొన్నారు. రచయితలు, కవులు, కళాకారులు, విద్యావేత్తలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యం మంటగలుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల గుడిసెలు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ఆదివాసీలను హత్య చేస్తుందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, రాష్ట్ర సమితి సభ్యుడు పంజాల రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి షేక్ బాసుమియా, పనాస ప్రసాద్, జిల్లా కార్యవర్గసభ్యులు అక్కపల్లి రమేష్, గుంపెల్లి మునీశ్వర్, గుండె బద్రి, తోట చంద్రకళ, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కందిక చెన్నకేశవులు, దిడ్డి పార్ధసారథి, గోవర్ధన్, కవిత, యాకయ్య, సతీష్, సాంబయ్య, మమత, శైలజ, నాగరాజు, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు -
పోలీసు కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలు
రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన తుమ్మ సావిత్రమ్మ దంపతులు ఆరుబయట నిద్రలో ఉన్న సమయంలో ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని తన తోటలో పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ను వృద్ధురాలైన నల్లపు స్వర్ణలత రహదారి పక్కనే పెట్టి అమ్ముతుండగా బైక్పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. ఆమె ప్రతిఘటించినా ప్రయోజనం లేకుండా పోయింది. వర్ధన్నపేట పట్టణ శివారు ప్రాంతంలోని డీసీ తండాకు చెందిన బానోతు పూరి (65) అనే మహిళ వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి పక్కనే కిరాణ దుకాణంలో ఒంటరిగా ఉన్న సమయంలో వాటర్ బాటిల్ కావాలంటూ వచ్చిన దుండుగులు ఆమైపె దాడి చేసి మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు పుస్తెల తాడు లాకెళ్లారు. ఈ క్రమంలో దుండగులకు బాధితురాలికి మధ్య గలాటా చోటుచేసుకుంది. ఈ గలాటలో నిందితుల క్యాప్, ఓ బ్లాంకెట్ అక్కడే వదిలి వెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల జాడ కోసం గాలిస్తున్నారు. నెక్కొండ మండలం పనికర గ్రామంలో బండారి యాకయ్య కిరాణం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆయన బయటికెళ్లిన సమయంలో అతని భార్య నిరోష షాపులో ఒంటరిగా ఉండగా.. మాస్కులు, హెల్మెట్ ధరించి వచ్చిన దుండగులు ఆమెను కత్తితో బెదిరించి మెడలోని బంగారు ఆభరణాలతోపాటు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నెక్లెస్, రూ.2,32,000 దోచుకెళ్లారు. సాక్షి, వరంగల్: ఒకప్పుడు దొంగలు ఇళ్లలోని నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు అపహరించేవారు. కానీ, ప్రస్తుతం బంగారం మాత్రమే టార్గెట్గా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈమధ్యకాలంలో జిల్లాలో జరిగిన దొంగతనాలు పోలీసులకు సవాల్గా మారాయి. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని బంగారు గొలుసులను దొంగలు తెంచుకొని పరారవుతున్నారు. ఈ తరహా చోరీలు వరంగల్ పోలీసు కమిషనరేట్పరిఽధిలో ఇటీవల పెరగడంతో మహిళల్లో భయాందోళన నెలకొంది. ముఖ్యంగా కిరాణషాపులు, రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు చేసే మహిళలు, వ్యవసాయ పొలాల్లో ఒంట రిగా పనిచేస్తున్న మహిళలు, ఇంటి ఆరు బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు ‘చైన్ స్నాచింగ్’ చేస్తుండడం కలవరపెడుతోంది. వరంగల్ జిల్లాలోనే ఇటీవలి కాలంలో నాలుగు దొంగతనాలు జరగ డం పోలీసులకు కూడా సవాల్గా మారింది. ఏ ఒక్క కేసులోనూ ఇప్పటివరకు ఒక్కరినీ అరెస్టు చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేటి కాలంలో దొంగలు దొరక్కుండా పోలీసులకు సవాల్ విసరడం, ఎక్కడా కూడా తగ్గకుండా మళ్లీ చైన్ స్నాచింగ్లు చేస్తుండడంతో పోలీసుల పనితీరుపై నమ్మకం లేకుండా పోతుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మెడలోని బంగారు పుస్తెలు తాడును పవిత్రంగా భావించే మహిళలు దొంగలను త్వరగా గుర్తించి తమ ఆభరణాలను అందజేయాలని కోరుతున్నారు. రూ.లక్షలు వస్తాయనే.. తులం బంగారం ధర మార్కెట్లో రూ.లక్ష వరకు ఉంది. అందుకే దొంగలు గతంలో మాదిరిగా ఇళ్లలోకి వెళ్లి నగదు, నగలు చోరీ చేయడం కాకుండా తమ పంథా మార్చి కేవలం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ భయాందోళన కలిగిస్తున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటే వారు ప్రతిఘటించినా దొరికే అవకాశం లేకపోవడం, ఒక్కరిని టార్గెట్ చేసినా రెండు తులాలపైనే గొలుసులు ఉండే అవకాశం ఉండడంతో రూ.రెండు లక్షలు గిట్టుబాటు అవుతాయనే ఉద్దేశంతో ఈ నేరాలు చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల జరిగి న చైన్ స్నాచింగ్ ఘటనల్లో రెక్కీ నిర్వహించాకే అదను చూసుకొని ఈ దొంగతనాలు చేశారని భావిస్తున్నారు. ఎక్కడి దొంగలు..? జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడింది స్థానిక దొంగలా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా దొంగలా..? అన్న విషయంలో పోలీసులు ఏం చెప్పడంలేదు. అయితే ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినా క్షేత్రస్థాయిలో పోలీసులు అనుకున్నంత స్పీడ్ లేకపోవడంతో నిందితులను పట్టకోలేకపోతున్నారన్న టాక్ ఉంది. ఇదిలాఉండగా.. ఒంటరి మహిళలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచిస్తున్నారు.జూన్ 23జూలై 7జూలై 15జూలై 11 బంగారు ఆభరణాలే టార్గెట్ పోలీసులకు సవాల్గా మారిన చైన్స్నాచింగ్లు భయాందోళనలో మహిళలు, వృద్ధులు -
ఆర్థిక బిల్లుతో పెన్షనర్లకు అన్యాయం
హన్మకొండ అర్బన్: ఆర్థిక బిల్లులో భాగంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తీసుకొచ్చిన చట్టంతో పెన్షనర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తూపురాణి సీతారాం అన్నారు. ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ (ఏఐఎస్జీపీఎఫ్) పిలుపు మేరకు మంగళవారం టాప్రా జిల్లా కమిటీ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 25న చేసిన చట్టంతో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఆర్థిక ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు.. ఆ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అమలు చేస్తాయని తెలిపారు. బడ్జెట్ మిగిలించుకునేందుకు రాష్ట్రాలు కూడా దీని అమలుకు ప్రయత్నిస్తాయని వివరించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పోరాటం చేయకపోతే పెన్షనర్లు తమ ప్రయోజనాలు సంపూర్ణంగా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ఈ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్కు వినతిపత్రం అందజేశారు. టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణగిరి వీరన్న, బాధ్యులు పెండ్యాల బ్రహ్మయ్య, శంకరలింగం, సత్యనారాయణ, పీఎల్ఎన్ రావు, విద్యాదేవి, ప్రభాకర్రెడ్డి, సిద్ధి రాజయ్య, వెంకటేశ్వరస్వామి, మేరీ, సమ్మయ్య, సంపత్కుమార్, వనజ, రాజమల్లు పాల్గొన్నారు. టాప్రా జిల్లా అధ్యక్షుడు సీతారాం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా -
కలెక్టరేట్ భవన నిర్మాణంలో వేగం పెంచాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణంలో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ పాత ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న కలెక్టరేట్ పనులను మంగళవారం కలెక్టర్ సందర్శించారు. కలెక్టరేట్ మూడు అంతస్తుల నిర్మాణాలు, కలెక్టర్ క్వార్టర్స్, అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్, మొదటి, రెండో అంతస్తులో డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా.. లేదా.. అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫినిషింగ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అవసరమైన సిబ్బంది, వనరులను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు, ప్రహరీ పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా రోడ్డు భవనాల అధికారి రాజేందర్, డీఈ శ్రీధర్, నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్రెడ్డి ఉన్నారు. పాఠశాలల్లో గ్యాస్ కనెకన్ల ఏర్పాటు చర్యలు ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్ కనెక్షన్లు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల జిల్లా అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. కట్టెల పొయ్యితో కాకుండా గ్యాస్ ద్వారా వంటలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందుకు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు సహకరించాలని చెప్పారు. ప్రతి మండలానికి 35 నుంచి 40 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నందున ఆయా మండల ఏజెన్సీల నుంచి గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేలా చూడాలని ప్రతినిధులను కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీఈఓ జ్ఞానేశ్వర్, డీఎంహెచ్ఓ సాంబశివరావు తదితర జిల్లా అధికా రులు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిన పర సీ్త్ర, పురుష వ్యామోహం
రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా.. డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ను లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు.‘రీల్స్ గర్ల్’ మోజులో గుండైవెద్య నిపుణుడు భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ -
వరంగల్
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025కమీషన్ల కక్కుర్తి అన్నదాతల నుంచి అధిక కమీషన్ వసూలు చేసిన అడ్తిదారులు, మార్కెట్ అధికారులకు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు.వాతావరణం జిల్లాలో ఉదయం వాతావరణం సాధారణస్థితిలో ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. – 8లోuఅతడికి 42.. ఆమెకు 22 ● అతడికి వివాహమైంది. ఆమె విద్యార్థిని ● కలిసుండలేమని ఇరువురు ఆత్మహత్య పర్వతగిరి: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ వి షయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్స్టేషన్లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు.● నగరంలో ఓ వైద్యురాలి అనుమానాస్పద మృతి ● మరో ఘటనలో వ్యక్తి, విద్యార్థిని బలవన్మరణం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కలకలం రేపిన ఘటనలు ● దోషులను శిక్షించాలని బాధిత కుటుంబీకుల డిమాండ్దరఖాస్తుల ఆహ్వానంనర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలోని మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వివిధ పోస్టులపై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొఫెసర్– 9, అసోసియేట్ ప్రొఫెసర్ –16, అసిస్టెంట్ ప్రొఫెసర్ 21, సీనియర్ రెసిడెంట్ 36, ట్యూటర్ మూడు పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికార వెబ్సైట్ https://www. gmcnspt.com లో చూడాలని కోరారు. ఫర్టిలైజర్ షాపు గోదాం సీజ్● కేసు నమోదు నల్లబెల్లి: యూరియా బస్తాలు అక్రమంగా నిల్వ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గోదాంపై పెట్రోల్ చల్లి దహనం చేసేందుకు రైతులు ఆదివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నర్సంపేట ఏడీఏ దామోదర్ రెడ్డి మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపును సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రూ.3,42,719 విలువ కలిగిన 1,286 యూరియా బస్తాలు నిల్వ ఉన్నట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న రైతులు మాలోత్ దన్రాజు, జుంకిలాల్తోపాటు పలువురు రైతులు షాపు వద్దకు చేరుకుని ఏడీఏకు ఫిర్యాదు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై గోవర్ధన్ బందోబస్తు చేపట్టారు. గోదాంలో యూరియా బస్తాలు నిల్వ ఉన్నప్పటికీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే రైతుల ఫిర్యాదు మేరకు షాపు యజమాని కర్ర కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి గోదాంను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపు యజమానులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ బన్న రజిత, ఏఈఓలు ఉన్నారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా శ్రీనివాసులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా ఆవిభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెస ర్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆవిభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు కొద్దిరోజుల క్రితం రాజీనామా చేశారు. ప్రస్తుతం రెగ్యులర్ ప్రొఫెసర్లు ఎవరూ లేకపోవడంతో శ్రీనివాసులును నియమించారు. నేడు(మంగళవారం) ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన ఆవిభాగా నికి బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, విశ్వవిద్యాలయం మహాత్మాజ్యోతిరావు పూలే సెల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం.. శ్రీనివాసులు కు నియామక ఉత్తర్వులు అందజేశారు.హసన్పర్తి: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అత్తామామలకు చెప్పినప్పటికీ.. డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు. యూరియా కొరతను నివారించాలి జిల్లాలో యూరియా కొరతను నివారించి రైతులకు సరిపడా అందించాలి. న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందించాం. నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరాం. – న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నేతలు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి గీసుకొండ మండలం వంచనగిరి గ్రామ 5వ వార్డులో ఐదు సంవత్సరాల క్రితం సీసీ రోడ్డు వేశారు. ఇంజనీర్ తప్పిదంతో 200 మీటర్ల పొడవు రోడ్డు డొంకగా ఏర్పడింది. ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డును తిరిగి నిర్మించాలి. – మోహన్రావు, వంచనగిరి, 5వ వార్డు ప్రజలు కాయలు కాదు.. పక్షి గూళ్లు !●న్యూస్రీల్పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర సీ్త్ర, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. ఓ లారీడ్రైవర్.. 22 ఏళ్ల కాలేజీ యువతితో ప్రేమలో పడి ఇద్దరం కలిసి ఉండలేమనుకుని పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ చనిపోయారు. -
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
ఖిలా వరంగల్: శస్త్ర చికిత్సలు చేయకుండా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి సాంబశివరావు వైద్యాధికారులకు సూచించారు. నగరంలోని రంగశాయిపేట పీహెచ్సీని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీలోని రికార్డులను పరిశీలించి వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. అనంతరం సాంబశివరావు మాట్లాడుతూ వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని మాతా శిశు సంరక్షణ, ప్రభుత్వ హాస్పిటల్లో డెలవరీలు, వ్యాధి నిరోధక టీకాలు అందించాలన్నారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేయించి తగు చికిత్సలు అందించాలని కోరారు. కేన్సర్, పాలియాటివ్ కేర్ సర్వేలో గుర్తించిన వారికి సేవలు అందించాలన్నారు. వర్షాకాలంలో సాధారణంగా అంటు వ్యాధులు మలేరియా, ఫైలేరియా, డెంగీ, చికెన్ గున్యా, మెదడువాపు, తీవ్రమైన నీళ్ల విరేచనాలు, ఒంక విరేచనాలు, జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీని నివారణకు ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించి శుభ్రమైన నీటిని, అహారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి తగు పరీక్షలు, చికిత్సలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ కొమురయ్య, పీహెచ్సీ వైద్యాధికారి రమ్య, సీసీ నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ సాంబశివరావు -
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
న్యూశాయంపేట: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, హౌ సింగ్ పీడీ గణపతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. స్వీరించిన దరఖా స్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చే స్తూ త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా వాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించినవి 58 ఉన్నాయి. పీడీ హౌసింగ్ 25, జీడబ్ల్యూఎంసీ 13 దరఖాస్తులు రాగా వివిధ శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. జిల్లా అధి కారులు అనురాధ, నీరజ, పుష్పలత, విశ్వప్రసాద్, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు పాల్గొన్నారు. ఆస్తి లాక్కొని హింసిస్తున్నారు కుమారుడు, కోడలు నాపేరున ఉన్న ఆస్తిని లాక్కున్నారు. నాకు అన్నం పెట్టకుండా నానా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. నా పేరున ఉన్న ఇంటిని నాకు ఇప్పించి.. నాకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన. – సరోజన, ఏనుమాముల ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కలెక్టర్ సుమారు 150 దరఖాస్తులు అందజేసిన ప్రజలు -
ఆశలపల్లకిలో..
సాక్షి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సర్కార్ ప్రకటించడంతో జిల్లాలో బీసీలకు జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులతోపాటు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు పెరగనున్నాయి. దీంతో ఆశావహుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. న్యాయపరమైన చిక్కులను అధిగమించి మరీ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంగా ఉండడంతో బీసీల నుంచి పోటీచేసే ఆశావహుల ఆశలకు రెక్కలు తొడిగినట్లైంది. గత స్థానిక ఎన్నికల్లో అనుసరించిన రిజర్వేషన్ మారే అవకాశం ఉండడంతో అన్ని పార్టీల్లోని బీసీ నాయకులు, ఆశావహులు ఇప్పటినుంచే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేసేపనిలో పడ్డారు. జిల్లాలోని 11 మండలాల్లో 317 గ్రామాలు 2,754 వార్డులు ఉన్నాయి. అంటే 11 జెడ్పీటీసీ స్థానాలు, 317 సర్పంచ్ పదవులతో పాటు 2,754 మంది వార్డు మెంబర్లు. అంటే జెడ్పీటీసీలో నాలుగు స్థానాలు, 120 నుంచి 130 మధ్య సర్పంచ్, 1,200లకుపైగా వార్డు సభ్యులుగా బీసీలకు అవకాశముందని అంచనా వేస్తున్న ఆ సామాజికవర్గ రాజకీయ నేతలు ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాలు, గ్రామాల్లో పట్టున్న బీసీ నాయకులు ఎలాగైనా ఆయా పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకొని తమ ఉనికి చాటాలనుకుంటున్నారు. ఇలా స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ అంశం బీసీల్లో చాలామంది రాజకీయ నేతలకు భవిష్యత్ ఇస్తుందనే భరోసాతో ప్రయత్నాలు ముమ్మరం చేసుకుంటున్నారు. ఏర్పాట్లలో అధికారులు బిజీ.. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గతంలోనే అధికారులు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికల సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. మరోవైపు గ్రామాలు, మండలాల్లో రాజకీయ పార్టీల మధ్య ఎక్కడా ఎటువంటి గొడవలు జరగకుండా ఉండేందుకు నిఘా ఉంచారు. ఎన్నికల షెడ్యూల్ ఏ సమయంలో వచ్చినా పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యచరణ సిద్ధం చేసి ఉంచారు. ఇప్పటికే జిల్లాలోని 317 పంచాయతీల్లో ఓటర్ల వివరాలు సేకరించారు. అలాగే బూత్ల వారీగా ఓటర్ల విభజనకు శ్రీకారం చుట్టారు. ఒకేరోజు ఎన్నికలు.. లెక్కింపు సాధారణ ఎన్నికలకు విభిన్నంగా పంచాయతీ ఎన్నికలు మధ్యాహ్నం వరకు ఓటింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు ఒకే రోజు ఉంటుంది. అందుకే బూత్లలో ఓటర్లు తక్కువ ఉండేలా అధికారులు విభజన చేస్తున్నారు. పంచాయతీలోని ఓటర్లను లెక్కించి బూత్ల వారీగా విభజిస్తున్నారు. 11మండలాల్లోనే ఎన్నికలు జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉన్నప్పటికీ వరంగల్, ఖిలావరంగల్ మండలాలు గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాయి. దీంతో ఆ రెండు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. మిగిలిన 11 మండలాలు, ఆయా గ్రామాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిందుకు ప్రభుత్వం యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. బీసీ రిజర్వేషన్ కోటా పెంపుపై పలువురి ఆసక్తి ఎన్నికల్లో అవకాశాలు పెరగనుండడంపై హర్షం స్థానిక పోరులో రెట్టింపుకానున్న ఆశావహుల సంఖ్య మరోవైపు ఎన్నికలకు సిద్ధమవుతున్న జిల్లా అధికారులు -
42 ఏళ్ల లారీడ్రైవర్తో డిగ్రీ విద్యార్థిని వివాహేతర సంబంధం..!
వరంగల్: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ విషయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్స్టేషన్లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు. -
వైద్యుల కాపురంలో ‘బుట్టబొమ్మ’ చిచ్చు
పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర స్త్రీ, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు.వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. వరంగల్: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.అత్తామామలకు చెప్పినప్పటికీ..డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు.రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా..డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ను లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు. -
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuఅతడికి 42.. ఆమెకు 22 ● అతడికి వివాహమైంది. ఆమె విద్యార్థిని ● కలిసుండలేమని ఇరువురు ఆత్మహత్య పర్వతగిరి: అతడికి పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు. యువతి డిగ్రీ చదువుతుంది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం.. చివరికి వారి ప్రాణమే తీసింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా ఏనుమాముల ఇందిరా కాలనీ ఫేజ్–2కు చెందిన వేల్పుగొండ స్వామి(42).. ఎలిశాల గాయత్రి (22) పక్కపక్కనే ఉంటారు. కుమారస్వామికి భార్య, ఇద్దరు పిల్లలు. ఒకరు తొమ్మిది, మరొకరు ఏడో తరగతి చదువుతున్నారు. లారీడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉంటున్న గాయత్రి నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ చదువుతుంది. వీరిద్దరికి మూడేళ్లక్రితం ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారి తీసింది. స్వామికి.. గాయత్రిని వదిలేసి భార్యా, పిల్లలతో ఉండాలనే ఆలోచన వచ్చింది. విషయం గాయత్రికి తెలపగా, అందుకు అంగీకరించలేదు. ‘నువ్వు నాతోనే ఉండాలి.. మనమిద్దరం వివాహం చేసుకుందాం’ అని తెలిపింది. ఈ వి షయంలో స్వామి తన భార్యను ఒప్పించాలని ప్రయత్నించినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె బెదిరించింది. దీంతో స్వామి ఏంచేయలేక భార్యను చికిత్స కోసం ఈనెల 2న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడే వదిలేసి మళ్లీ వస్తానని వెళ్లాడు. రెండు రోజులైనా ఇంటికి రాకపోవడంతో 4న మట్టెవాడ పోలీస్స్టేషన్లో స్వామిపై మిస్సింగ్ కేసు నమోదైంది. గాయత్రి ఈనెల 2నుంచి కనిపించడం లేదని ఆమె తండ్రి కుమారస్వామి 3న ఏనుమాముల పోలీస్స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టాడు. వీరిద్దరు 2న ఇంట్లో నుంచి పారిపోయారు. తిరిగి ఇంటికెళ్తే ఇబ్బందవుతుందని, కలిసి చని పోదామని నిర్ణయించుకుని ఆదివారం ఉద యం పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ గ్రామానికి చేరుకుని గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికుడు పవన్కళ్యాణ్ ఫోన్ ద్వారా వారి బంధువులకు సమాచారం అందించి ఇద్దరిని 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందారు. మృతుడి అన్న యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పర్వతగిరి ఎస్సై ప్రవీణ్ తెలిపారు.● నగరంలో ఓ వైద్యురాలి అనుమానాస్పద మృతి ● మరో ఘటనలో వ్యక్తి, విద్యార్థిని బలవన్మరణం ● వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కలకలం రేపిన ఘటనలు ● దోషులను శిక్షించాలని బాధిత కుటుంబీకుల డిమాండ్హసన్పర్తి: ఓ డాక్టర్ కుటుంబంలో రీల్స్ గర్ల్ పెట్టిన చిచ్చు ఒకరి ప్రాణం తీసింది. ‘బుట్టబొమ్మ’ ఐడీతో ఇన్స్టా, ఫేస్బుక్ వేదికగా రీల్స్ చేసే ఆ యువతి పట్ల డాక్టర్ ఆకర్షితుడయ్యాడు. చివరికి ఇరువురు పెళ్లి చేసుకునేదాకా వెళ్లారు. దీంతో ఆ డాక్టర్ కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. చివరికి డాక్టర్ భార్య, డెంటల్ వైద్యురాలు అనుమానాస్పద మృతి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భర్త తరఫున వారు చెబుతుండగా, తన కూతురుని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి పద్మావతి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వరంగల్ నగరంలోని వైద్యవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అత్తామామలకు చెప్పినప్పటికీ.. డాక్టర్ సృజన్, రీల్స్ గర్ల్ మధ్య సంబంధంపై ఇంట్లో గొడవలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో డాక్టర్ సృజన్ తన భార్య ప్రత్యూషను శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని ప్రత్యూష తన అత్తామామలు పుణ్యవతి–మధుసూదన్కు చెప్పింది. అయినప్పటికీ వారినుంచి ఎలాంటి స్పందన రాలేదు. చివరికి వారి బంధం పెళ్లిదాకా వచ్చింది. ఇంట్లో గొడవలు సాగుతూనే వచ్చాయి. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ప్రత్యూష నగరంలోని ఎన్ఎస్ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తల్లి పద్మావతికి సృజన్ ఫోన్ చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. వెంటనే పద్మావతి ఆస్పత్రికి వచ్చి చూడగా.. విగత జీవిగా కనిపించింది. కాగా, డాక్టర్ సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలి : ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ ఎంజీఎం : డాక్టర్ ప్రత్యూష మృతదేహానికి సోమవారం ఎంజీఎం మార్చరీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈసందర్భంగా బంధువులతోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు పెద్దఎత్తున మార్చురీకి తరలివచ్చారు. ప్రత్యూష కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ.. ఓ యూట్యూబర్, రీల్స్ చేసే యువతి మాయలో పడి యువ వైద్యురాలు ప్రత్యూష మృతికి కారణమైన డాక్టర్ సృజన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, మార్చురీ వద్ద పోలీసులు మృతురాలి తల్లి పద్మావతితో మాట్లాడి వివరాలు సేకరించారు. న్యూస్రీల్పచ్చని కాపురాల్లో వివాహేతర సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పర సీ్త్ర, పురుష వ్యామోహంలో పడిన ఆలుమగలు పెళ్లి అనే పవిత్ర బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన దంపతులు అర్ధంతరంగా విడిపోతున్నారు. మరికొందరు నిండు జీవితాన్ని ఫణంగా పెట్టి లోకం విడిచివెళ్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో సోమవారం జరిగిన రెండు ఘటనలు పెళ్లి అనే బంధానికి విలువ లేకుండా చేశాయి. ఓ డాక్టర్.. రీల్స్ చేసే యువతితో ప్రేమాయణం సాగించగా, తట్టుకోలేక వైద్యురాలైన భార్య తనువు చాలించింది. ఓ లారీడ్రైవర్.. 22 ఏళ్ల కాలేజీ యువతితో ప్రేమలో పడి ఇద్దరం కలిసి ఉండలేమనుకుని పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ చనిపోయారు. -
భద్రకాళీ మాడవీధుల పనుల్లో వేగం పెంచండి
నయీంనగర్: భద్రకాళి మాడవీధుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ‘కుడా’ వీసీ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం భద్రకాళి ఆలయ మాఢవీధుల పనులు, చెరువులో ఏర్పాటు చేస్తున్న ఐలాండ్ పనుల పురోగతిని కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతాలను సందర్శించి మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, భద్రకాళి పూజారి శేషయ్య, ఈఓ శేషు భారతి తదితరులు ఉన్నారు. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ ప్రాధాన్యంహన్మకొండ: ప్రమాదాలు జరగకుండా ఆర్టీసీ డ్రైవర్లు సురక్షిత డ్రైవింగ్ చేయాలని ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను సూచించారు. సోమవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్ రీజియన్ కార్యాలయంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఆర్ఎం డి.విజయభాను మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రమాదాలు లేని వరంగల్ రీజియన్గా తీర్చిదిద్దేందుకు ఆర్టీసీ, అద్దె బస్సు, జేబీఎం బస్ డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మద్యం ముట్టుకోవద్దని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కృషి చేయాలని కోరారు. ప్రొఫెసర్ శ్రీలతకు అవార్డుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ సీజే శ్రీలతకు ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవార్డు లభించింది. శ్రీలతకు బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రముఖ సంస్థ ది అకడమిక్ ఇన్సైట్స్ నుంచి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఉన్నత విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న మహిళలకు అందజేస్తారు. అవార్డుపై సోమవారం యూనివర్సిటీలో శ్రీలత మాట్లాడుతూ.. ఇది మహిళా నాయకత్వానికి గుర్తింపు అని పేర్కొన్నారు. ఈసందర్భంగా శ్రీలతను కేయూ వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం అభినందించారు. క్రికెట్ సంఘం బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదువరంగల్ స్పోర్ట్స్: హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావుతో పాటు వరంగల్ క్రికెట్ సంఘం కార్యదర్శి శ్రీనివాస్పై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సోమవారం ‘ది తెలంగాణ క్రికెట్ సంఘం’ వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ విజయ్చందర్రెడ్డి, టి.జయపాల్ వరంగల్ సీపీ ఆఫీస్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా బీసీసీఐ, హెచ్సీఏ, క్లబ్ సభ్యుల ద్వారా వరంగల్ జిల్లా సెక్రటరీగా శ్రీనివాస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా క్రికెట్ అభివృద్ధికి రావాల్సిన నిధులను తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాంతీయ క్రీడాకారుల ప్రతిభను నిర్లక్ష్యం చేసి, క్రికెట్ పాలనను స్వార్థపూరితంగా మలుపుతిప్పారన్నారు. అవినీతికి పాల్పడ్డవారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. నేటి నుంచి టీటీడీ సాంస్కృతిక కార్యక్రమాలుహన్మకొండ కల్చరల్: నేటి నుంచి 19వ తేదీ వరకు టీటీడీ, డీపీపీ(ధర్మ ప్రచార పరిషత్) ఆధ్వర్యంలో ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యక్రమ నిర్వాహకులు రామిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. సోమవారం హనుమకొండ భవానీనగర్లోని భవానీమాత దేవాలయంలో కార్యక్రమాల బ్యానర్ను ఆవిష్కరించారు. రామిరెడ్డి కృష్ణమూర్తి మాట్లాడుతూ.. శ్రీభవా నీమాత దేవాలయంలో నేటి(మంగళవారం) నుంచి 17వ తేదీ వరకు విజయవాడకు చెందిన మండలిక శ్రీకృష్ణకుమార్ శ్రీవెంకటాచల మహత్యంపై ధార్మిక ప్రవచనాలు, 18న కుంకుమ పూజ, 19న టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమాచార్య సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టిన పర సీ్త్ర, పురుష వ్యామోహం
రీల్స్ గర్ల్ ఎంట్రీ ఇలా.. డాక్టర్ సృజన్ నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో కార్డియాలజీ వైద్యుడు. ఆస్పత్రి ప్రారంభ సమయంలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఓ యువతి ప్రమోషన్ వర్క్ కోసం అక్కడికి వచ్చింది. అక్కడున్న వైద్యులతో ముఖాముఖి నిర్వహించింది. ఆ సమయంలో ఆ యువతి పట్ల డాక్టర్ సృజన్ ఆకర్షితుడయ్యాడు. ఈసందర్భంగా ఇరువురు పరిచయం పెంచుకున్నారు. ఆమె వివిధ భంగిమల్లో చేసే రీల్స్ చూసి మరింత దగ్గరయ్యాడు. ఆ యువతి తన రీల్స్లో తాను గుండె ఆపరేషన్ను లైవ్గా చూసినట్లు పోస్టులు కూడా పెట్టింది. అంటే సృజన్ ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి కూడా తీసుకెళ్లినట్లు స్పష్టమవుతోంది. సృజన్ కారును కూడా పూర్తిగా ఆమె వాడేదని సమాచారం. ఇటీవల ప్రత్యూష రెండో కాన్పు సమయంలో తల్లిగారింటికి వెళ్లినప్పుడు ఆ యువతి విల్లాకు వచ్చిందని, అంతగా వారి ప్రేమబంధం బలపడిందని స్థానికులు చెబుతున్నారు.‘రీల్స్ గర్ల్’ మోజులో గుండైవెద్య నిపుణుడు భార్యకు శారీరక, మానసిక వేధింపులు.. దంత వైద్యురాలి మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలు పోలీసుల అదుపులో డాక్టర్.. విచారణ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతల డిమాండ్ -
పరిశీలిస్తాం.. చర్యలు తీసుకుంటాం
● పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ ● ‘డయల్ యువర్ కమిషనర్’కు స్పందన పరకాల: డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్ కార్యక్రమంలో వచ్చిన సమస్యలు, ఫిర్యాదులపై పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ తెలిపారు. సోమవారం ‘డయల్ యువర్ మున్సిపల్ కమిషనర్’ కార్యక్రమానికి పలువురు ఫోన్ చేశారు. శానిటేషన్, ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్, డ్రెయినేజీ సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఆయా విషయాలపై స్పందిస్తూ మున్సిపల్ ఏఈ, జవాన్లను సంబంధిత ప్రదేశాలకు పంపించి పరిశీలించాలని ఆదేశించనున్నట్లు, తక్షణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రవి, ఆర్ఓ రఘు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
బాధ్యత మరిచి మాట్లాడుతున్న భట్టి
హన్మకొండ: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకుడు బన్న ప్రభాకర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా.. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా కొలను సంతోశ్రెడ్డి, బన్న ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉపముఖ్యమంత్రి వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సండ్ర మధు, వరంగల్ జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూథర్, ఎస్టీ మోర్చా నాయకుడు నానునాయక్, నాయకులు శ్రీనివాస్, శివకుమార్, వెంకటేశ్, బొచ్చు శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి ఉపముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం -
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహించవద్దని అధికారులను ఆదేశించారు. అర్జీలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 23, ఆర్డీఓ హనుమకొండ 20, ఆర్డీఓ పరకాల 11, పీడీ హౌసింగ్ 18తో పాటు వివిధ శాఖలకు చెందిన మొత్తం 206 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈచిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సముద్రాల రాయలక్ష్మి. ఈమెది శాయంపేట మండలం గట్లకానిపర్తి. ఈమెకు ముగ్గురు కూతుళ్లు ఒక కొడుకు. అందరికీ పెళ్లిళ్లు చేసింది. ఉన్న రెండెకరాల భూమిని కొడుకు పేరున రాసింది. కోడలు తిడుతోందని, బాగోగులు చూడట్లేదని, నానా రకాలుగా ఇబ్బందులు పెడుతోందని కలెక్టర్కు విన్నవించింది. తన భూమి తన పేరు మీద రాసివ్వాలని, తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమైంది. -
అనధికారిక నల్లాలను గుర్తించండి
వరంగల్ అర్బన్: నగరంలోని అనధికారిక నల్లాలను గుర్తించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఈనెల 12వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన నల్లా.. కలెక్షన్లు’ కథనానికి కమిషనర్ స్పందించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాధికారులతో సమావేశమయ్యారు. నగరవ్యాప్తంగా సుమారు 70 వేల నల్లా కనెక్షన్లు (అనధికారికంగా, ఒక ఇంటికి ఒకటికి మించి, ఇంటి నంబర్లు లేకున్నా కనెక్షన్, అపార్టుమెంట్ల్లోని ప్లాట్లకు) ఉన్నట్లు పన్ను జనరేట్ అవుతోందని తెలిపారు. రెసిడెన్షియల్ నల్లా తీసుకుని కమర్షియల్గా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా 4 కేటగిరీలుగా నల్లాలను గుర్తించేందుకు 11 బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. ఒక్కో ఏరియా పరిధిలో సుమారు 3 వేల గృహాలను క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే చేయాల్సిందేనని ఆదేశించారు. సమాచారం నమోదుచేయాలని ఇందుకు సంబంధించిన ప్రొఫార్మా తయారు చేయాలని ఐటీ మేనేజర్ను కమిషనర్ ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, పన్నుల అధికారి రామకృష్ణ, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈ మాధవీలత పాల్గొన్నారు. 9 జోన్లు, 13 సబ్ జోన్లుగా యూజీడీవరంగల్ నగరవ్యాప్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్ (యూజీడీ)ని 9 జోన్లుగా, 13 సబ్ జోన్లుగా, 23 ఎస్టీపీలు, 7 సీవరేజ్ పంపింగ్ స్టేషన్ల నెట్వర్క్పై క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై ఇంజనీర్లు అధ్యయనం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం హనుమకొండలోని ‘కుడా’ కార్యాలయంలో యూజీడీ డీపీఆర్పై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ అనంతరం ఆమె సమీక్షించారు. డిజైన్ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉందన్నారు. అనంతరం ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు. అధికారులు పాల్గొన్నారు. 11 ప్రత్యేక బృందాల ఏర్పాటు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ -
కాపురంలో చిచ్చుపెట్టిన రీల్స్ చిన్నది!
సాక్షి, వరంగల్: రీల్స్ కలిపిన ప్రేమ.. పండంటి కాపురంలో చిచ్చు రాజేసింది. తన భర్త పరాయి యువతితో ప్రేమాయణం సాగించడం భరించలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన కేసు వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూష.. హసన్పర్తిలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో హసన్పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భర్త సృజన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతితో సృజన్ ప్రేమ వ్యవహారమే ప్రత్యూష మరణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సృజన్ కార్డియాలజీ డాక్టర్గా పని చేస్తున్నారు. మరో ఆస్పత్రిలో ప్రత్యూష డెంటిస్ట్గా పని చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ అమ్మాయి.. డాక్టర్ సృజన్ను ఆ మధ్య ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్గా చేసి ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం తెలిసి ప్రత్యూష భర్తను నిలదీసింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో.. పెద్దలు సర్దిచెబుతూ వచ్చారు. అయినా సృజన్లో మార్పు రాకపోవడంతో ప్రత్యూష ఇలా ఘాతుకానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బిడ్డ మరణానికి కారణమైన సృజన్ను, ఆ యువతిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
నా బిడ్డకి నాకు న్యాయం చేయండి
వరంగల్: భర్తతోనే (అతడి తల్లిదండ్రులు కాకుండా) కలిసి ఉండేలా తనకు న్యాయం చేయాలని ఓ ఇల్లాలు భర్త ఇంటి ఎదుట తన తల్లిదండ్రులు, ఐదేళ్ల కూతురితో కలిసి ఆదివారం నిరసన చేపట్టింది. మల్కాపూర్ గ్రామానికి చెందిన సాంబారి రాజేశ్వర్, మణెమ్మ దంపతులకు విద్యాసాగర్ ఒక్కడే కుమారుడు. ఆరేళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా ములు గు ఘణపురం గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమార్తె తేజస్వినితో పెళ్లి జరిపించారు. దంపతులు కొంతకాలం క్రితం వరకు అన్యోన్యంగా ఉండేవారు. అయితే మల్కాపూర్ వచ్చిన నాటి నుంచి తేజస్వినిని ఏదో రకంగా అత్తామామ ఇబ్బంది పెట్టేవారు. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కోర్టు వరకు వెళ్లింది. అయినా విద్యాసాగర్ తల్లిదండ్రుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం తేజస్విని తన తల్లిదండ్రులతో పాటు కూతురితో కలిసి మల్కాపూర్ గ్రామానికి వచ్చింది. ఇంటి ఎదుట ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన చేపట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై నవీన్కుమార్ ఆదేశంతో కానిస్టేబుల్ చారి అక్కడకు వెళ్లి గొడవ జరగకుండా చేశారు. -
భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు
సంగెం/గీసుకొండ: సంగెం మండలంలోని చింతలపల్లి భవానీశంకరాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్, సంధ్యారాణి దంపతులు ఆదివారం సందర్శించారు. కాకతీయుల కాలం నాటి భవానీశంకర మహా కాలబైరవాలయం ఆలయపూజారి సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భవానీశంకరాలయంలో రుద్రాభిషేకం, మహాకాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గీసుకొండ మండలంలోని ఊకల్లోని నాగేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీహర్ష, గుమిళ్ల విజయ్కుమారచార్యులు, కొండపాక రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎలాంటి ప్రోటోకాల్, హంగు, ఆర్బాటం లేకుండా గోప్యంగా దేవతామూర్తులను సందర్శించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించడం విశేషం. ఇదిలా ఉండగా.. తన పర్యటనకు సంబంధించి ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని, ఇది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు సమాచారం. సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10–30 నుంచి మధ్యాహ్నం 1–30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు. రామప్పలో పర్యాటకుల సందడి వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వర స్వామిని ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. అనంతరం నందీశ్వరుడి చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఆలయ ప్రధాన పూజారి హరీశ్ శర్మ భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. గైడ్ కుమార్ ఆలయ విశిష్టత గురించి పర్యాటకులకు వివరించారు. ఇంటి మెట్లు కూలి బాలుడి మృతి నర్సంపేట: ప్రమాదవశాత్తు ఇంటి మెట్లు కూలి మీద పడడంతో బాలుడు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఇదే గ్రామానికి చెందిన అర్ష మహేందర్–సునీత దంపతుల కుమారుడు అనుదీప్(13) ఆదివారం సెలవు కావడంతో గ్రామంలోని బీరన్న గుడి వద్ద తోటి మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతున్నాడు. క్రికెట్ బాల్ సమీపంలోని షేక్ ఇమామ్ ఇంటి సమీపంలో పడింది. ఆ బాల్ను తీసుకురావడానికి అనుదీప్ వెళ్లాడు. బాల్ కోసం వెతుకుతుండగా ఒక్కసారిగా ఇంటి మెట్లు కూలి అతనిపై పడ్డాయి. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. -
సివిల్స్ ఉచిత శిక్షణకు అర్హత పరీక్ష
కేయూ క్యాంపస్: సివిల్ సర్వీస్ ఉచిత శిక్షణకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నిర్వహించిన ఈ పరీక్షకు 440 మంది అభ్యర్థులు హాజరైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.జ్యోతి, షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ సెల్ గౌరవ డైరెక్టర్ డాక్టర్ జగన్మోహన్ తెలిపారు. పరీక్షల నిర్వహణ తీరును ఎస్సీ వెల్ఫేర్ అధికారి బి.నిర్మల, కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రమాదేవి పరిశీలించారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివా రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాతపూర్వకంగా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ చక్కని వేదిక అని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సంఘానికి, సభ్యులకు న్యాయం చేస్తాంవరంగల్ చౌరస్తా: వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి, సభ్యులకు న్యాయం చేస్తామని సంఘం జాతీయ నాయకుడు గట్టు మహేశ్బాబు తెలిపారు. వరంగల్ ఆర్ఎన్టీ రోడ్డులోని ఆర్యవైశ్య భవన్లో ఆదివారం తాత్కాలిక పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. అడ్వకేట్ల నడుమ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంఘం కమిటీని విస్తరించి, సభ్యుల సాదకబాధకాలు, సంఘం ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. కార్యక్రమంలో అడ్వకేట్లు చకిలం ఉపేందర్, అంజనీదేవి, సంఘం నాయకులు మునుగోటి రమేశ్, తాటికొండ రాము, పుల్లూరి మధు, తోట నవీన్, రమేశ్, ప్రవీణ్, ఆకారపు హరీశ్, శోభన్, ఉపేందర్, శైలజ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుడు రాములుకు పురస్కారంవిద్యారణ్యపురి: హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ ఉపాధ్యాయుడు సీహెచ్. రాములు మహాత్మాగాంధీ జాతీయ చరఖా అవార్డు అందుకున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రకాశంహాల్లో గాంధీ జ్ఞాన ప్రతి ష్టన్ స్వర్ణోత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో నిష్టాతులైన మేధావులు, కళాకారులను జిల్లాకు ఒకరి చొప్పున 33 మందిని ఎంపిక చేసి అవార్డులు అందజేశారు. గాంధీ భావాలు, ఆలోచనలను తన సాహిత్య రచనల ద్వారా సమాజానికి అందించిన సేవలకు హనుమకొండ జిల్లా నుంచి ఉపాధ్యాయుడు రాములును సాహిత్య శిరోమ ణి బిరుదు, అవార్డుతో సన్మానించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్టన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణహసన్పర్తి: ఇరువర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒకటో డివిజన్ ముచ్చర్లకు చెందిన అధికార పార్టీ నాయకుడితోపాటు అదే ప్రాంతానికి చెందిన మట్టెడ చంటికి మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఈక్రమంలో ఎర్రగట్టుగుట్ట సమీపంలో ఇరువర్గాలు రాళ్లతో దాడులకు దిగినట్లు స్థానికులు చెప్పారు. ఈ దాడిలో మట్టెడ చంటికి బలమైన గాయాలైనట్లు వారు పేర్కొన్నారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు చెప్పారు. -
ముగిసిన ‘సకల కళల సంబురాలు’
హన్మకొండ కల్చరల్: తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో.. తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ కోసం రెండు రోజుల పాటు నిర్వహించిన సకల కళలు సంబురాల జాతర–25 కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఉదయం వరంగల్ పోతన విజ్ఞాన పీఠంలో జరిగిన చివరి రోజు కార్యక్రమాల్లో భాగంగా 33 జిల్లాల నుంచి పలు కళారంగాల్లో నిష్ణాతులైన కళాకారులు, కళాబృందాలు హాజరై ప్రదర్శనలిచ్చారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ నిర్వాహకులు జడల శివ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యాపారవేత్త ఆడెపు రవీందర్, జ్యూరీ, చీఫ్ కో–ఆర్డినేటర్ టీవీ అశోక్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్వాహకులు జడల శివ, హరిత దంపతులకు తెలుగు బుక్ ఆఫ్ రికార్ట్స్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ ప్రదానం చేశారు. కళాకారులు సకల కళలు సంబరాల జాతర కార్యక్రమంలో భాగంగా చిన్నారుల కూచిపూడి నృత్యాలు, జానపద నృత్యాలు, ఒగ్గుకథ, బుర్రకథ, నాటకాలు ప్రేక్షకులను అలరించాయి. పాల్గొన్న కళాకారులకు ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం జడల శివ మాట్లాడుతూ.. కళాకారులకు ప్రభుత్వం నుంచి గుర్తింపు, సహాయం అందాలన్నారు. రాష్ట్ర జానపద కళాకారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అనుమాండ్ల మధుకర్, మంచిర్యాల జిల్లా నాట్య కళాకారులు సమాఖ్య రాకం సంతోశ్, కోశాధికారి రామగిరి అర్జున్, పీఆర్ ప్రసాద్ పాల్గొన్నారు. జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీకి తెలుగు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్ట్స్ -
యూరియా అక్రమ నిల్వలపై రైతుల ఆందోళన
నల్లబెల్లి: యూరియా బస్తాలను అక్రమంగా నిల్వ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్టిలైజర్ గోదాంపై పెట్రోల్ చల్లి దహనం చేసేందుకు యత్నిస్తూ రైతులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ షాపు గోదాం ఎదుట ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి, రైతులు జుంకీలాల్, ధన్రాజ్లు తెలిపిన వివరాల ప్రకారం.. బిల్ నాయక్ తండాకు చెందిన జుంకీలాల్, ధన్రాజు.. కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ షాపునకు వెళ్లి రెండు బస్తాల చొప్పున యూరియా కావాలని అడిగారు. కాగా షాపు యజమాని కృష్ణారెడ్డి తమ వద్ద యూరియా స్టాక్ లేదని తేల్చిచెప్పారు. కనీసం చెరొక బస్తా ఇవ్వాలని కోరినా నిరాకరించారు. దీంతో వారు షాపు నిర్వాహకుల గోదాంకు వెళ్లి చూసి గోదాంలో యూరియా అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. షాపు యజమాని కృష్ణారెడ్డిని నిలదీశారు. విషయాన్ని దాటవేసేందుకు యజమాని ప్రయత్నించగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా అక్రమంగా నిల్వ చేసిన గోదాంపై పెట్రోల్ చల్లి దహనం చేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఎస్సై గోవర్ధన్ అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించి అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తిస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ మేరకు ఏఓ బన్న రజితను వివరణ కోరగా విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫర్టిలైజర్ గోదాం దహనం చేసేందుకు యత్నం అడ్డుకున్న పోలీసులు -
పాలకమండలి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
కేయూ క్యాంపస్: యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 15 ఎకరాల భూమి కేటాయిస్తూ కేయూ పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. హాస్టళ్లు, రీసెర్చ్ సెంటర్లు, అధ్యయన కేంద్రాలు తదితర వాటికి భూములు అవసరమవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆది వారం వరంగల్కు వచ్చిన ఆయనకు కేయూ భూ ములు పరిరక్షించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వేరే ప్రభుత్వ స్థలంలో నిర్మించాలని పేర్కొన్నారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్ఏ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేశ్, ఎస్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, ఏఐడీఎస్ఓ జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన్, వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు ఉప్పులశివ, రాజు, రాజేశ్, చెట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ -
ఆలోచింపజేసిన ‘బుద్ధుడితో నా ప్రయాణం’
హన్మకొండ: బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అఽభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో బుద్ధునితో నా ప్రయాణం నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, లలిత ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వర్తమాన సమాజానికి గౌతమ బుద్ధుని బోధనల అవసరం ఉందని అన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క సుదర్శన్, పీఎస్ఎన్ మూర్తి, సిద్ధోజిరావు, నల్ల సూర్యప్రకాశ్, బొమ్మల్ల అంబేడ్కర్, రౌతు రమేశ్కుమార్, జిలకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. -
భూగర్భ జలాలు
స్వల్పంగా పెరిగినహన్మకొండ: గత రెండు నెలలుగా భూగర్భ జలాలు స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల నీటి వినియోగం తగ్గుతూ వస్తోంది. రుతు పవనాలకు ముందు మే నెలలో హనుమకొండ జిల్లా సగటు భూగర్భ జల మట్టం 8.55 మీటర్ల లోతులో ఉండగా.. జూన్ నెలాఖరుకు 8.37 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్లో 7.35 మీటర్ల లోతుల్లో మాత్రమే ఉంది. ఏప్రిల్లో పోలిస్తే మే నెలలో భూగర్భ జలమట్టం పడిపోయింది. మే నెలతో చూసుకుంటే జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. వరంగల్ జిల్లాలో మే మాసాంతంలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా జూన్ మాసాంతానికి 5.98 మీటర్లకు పెరిగింది. ఏప్రిల్ మాసాంతంలో 6.21 మీటర్లు భూగర్భ జల మట్టం ఉండగా.. మే, జూన్ మాసాంతానికి స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ మాసంతో సగటు భూగర్భ జల మట్టం పరిశీలిస్తే హనుమకొండ జిల్లాలో పడిపోగా, వరంగల్ జిల్లాలో స్వల్పంగా పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జల వినియోగం పెరిగే అవకాశంప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జల మట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురవక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగే కొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది. ఈమేరకు వర్షాలు సమృద్ధిగా కురవక పోతే రైతులు పూర్తిగా భూగర్భ జలాలు మీద ఆధారపడాల్సిందే. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే వర్షం దోబూచులాడుతోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. మెట్ట పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా విత్తిన మెట్ట పంటల మొలకలు ఎండిపోతున్న దశలో వారం రోజుల క్రితం కురిసిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం జీవం పోసింది. ఇప్పటి వరదలు పారే వర్షం కురువలేదు. దీంతో రైతులో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 8.37 మీటర్లుహనుమకొండ జిల్లాలో భూగర్భ జలాలు ప్రాంతం ఏప్రిల్ మే జూన్ గట్ల నర్సింగాపూర్ 11.70 10.00 7.85 జగన్నాథపూర్ 10.91 12.60 17.10 కొత్తపల్లి 10.80 11.70 9.30 వంగర 15.80 15.84 15.60 ధర్మాపూర్ 6.22 6.50 4.70 ధర్మసాగర్ 2.30 1.90 0.90 పెద్ద పెండ్యాల 9.53 10.15 8.40 నారాయణగిరి 8.6 7.95 6.8 ఎల్కతుర్తి 7.70 7.40 7.40 హనుమకొండ 6.40 6.55 6.70 నాగారం 6.90 6.40 6.50 సీతంపేట 4.72 4.50 4.13 ఎల్లాపూర్ 4.90 4.50 4.13 ఐనవోలు ––– 28.90 27.90 పున్నేలు 5.00 5.53 6.20 పంథిని 5.70 6.10 6.50 శనిగరం 4.78 5.00 4.70 పీచర 16.30 17.40 21.55 వేలేరు 7.8 6.9 5.5 ఆత్మకూరు 3.00 3.20 2.60 దామెర 8.50 8.08 7.20 చర్లపల్లి 12.70 13.30 13.75 నడికూడ 1.40 2.30 2.85 పరకాల 4.56 5.50 5.00 పత్తిపాక 5.40 5.44 5.30 -
ఆర్యూబీతో లోపాలను సరిచేయండి
నెక్కొండ: మండల కేంద్రంలోని ఆర్యూబీ (రైల్వే అండర్ బ్రిడ్జి) నిర్మాణంలో జరిగిన లోపాలను సరి చేయడంతోపాటు ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ఆదివారం ఆర్యూబీని అధికారులతో కలిసి సందర్శించి, మాట్లాడారు. ఆర్యూబీ నిర్మాణంతో వ్యాపారస్తులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని, మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తోందని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మురుగు నీరు నిలువకుండా, వ్యాపారాలు కొనసాగేలా ఆర్యూబీలో ఉన్న లోపాలను గుర్తించి, పనులు చేపట్టాలన్నారు. అలాగే రోడ్డు డివైడర్ను తొలగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సీఈ రాజేశ్వర్రావు, ఈఈ రమాదేవి, రమేశ్, ఏఈ గోపి, వ్యాపారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అధికారులకు సూచించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
భవానీశంకరాలయంలో పీసీసీ చీఫ్ పూజలు
సంగెం/గీసుకొండ: సంగెం మండలంలోని చింతలపల్లి భవానీశంకరాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్, సంధ్యారాణి దంపతులు ఆదివారం సందర్శించారు. కాకతీయుల కాలం నాటి భవానీశంకర మహా కాలబైరవాలయం ఆలయపూజారి సముద్రాల సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో వారు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భవానీశంకరాలయంలో రుద్రాభిషేకం, మహాకాలభైరవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గీసుకొండ మండలంలోని ఊకల్లోని నాగేంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో జీవీఎస్ శ్రీనివాసాచార్యులు, ఆలయ అర్చకులు శ్రీహర్ష, గుమిళ్ల విజయ్కుమారచార్యులు, కొండపాక రాజేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఎలాంటి ప్రోటోకాల్, హంగు, ఆర్భాటం లేకుండా గోప్యంగా దేవతామూర్తులను సందర్శించి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించడం విశేషం. ఇదిలా ఉండగా.. తన పర్యటనకు సంబంధించి ఎవరూ ఫొటోలు, వీడియోలు తీయొద్దని, ఇది తన వ్యక్తిగత విషయమని చెప్పినట్లు సమాచారం. -
ఆలోచింపజేసిన ‘బుద్ధుడితో నా ప్రయాణం’
హన్మకొండ: బుద్ధుడితో నా ప్రయాణం నాటక ప్రదర్శన ఆలోచింపజేసింది. అఽభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో ‘బుద్ధుడితో నా ప్రయాణం’ నృత్య రూప నాటకాన్ని ప్రదర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ రాసిన బుద్ధుడు ఆయన ధర్మం పుస్తకం ఆధారంగా రూపొందించిన నాటక ప్రదర్శన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి అతిథులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా బుద్ధిస్ట్ సొ సైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు, లలిత ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వర్తమాన సమాజానికి గౌతమ బుద్ధుడి బోధనలు అవసరం ఉందన్నారు. భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్క సుదర్శన్, పీఎస్ఎన్ మూర్తి, సిద్ధోజిరావు, నల్ల సూర్యప్రకాశ్, బొమ్మల్ల అంబేడ్కర్, రౌతు రమేశ్కుమార్, జిలకర శ్రీనివాస్, మచ్చ దేవేందర్, కొంగర జగన్మోహన్ పాల్గొన్నారు. -
యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
న్యూశాయంపేట: యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్ల్లో రైతులకు అవసరమైన మొత్తంలో యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు సరఫరాపై నివేదిక అందచేయాలని ఆదేశించారు. రైతుల రద్దీ తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా సహకార అధికారి, ఇన్చార్జ్ జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్రావు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
యూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
న్యూశాయంపేట: యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో యూరియా నిల్వలు, సరఫరా తదితర అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ ఆదివారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సీజన్లో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతీరోజు సరఫరాపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. రైతుల రద్దీ తగ్గించేందుకు టోకెన్ విధానాన్ని అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించాలని చె ప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాస్రావు పాల్గొన్నారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
మరమ్మతుల జాడేది?
ప్రమాదంలో పాకాల సరస్సు తూములునర్సంపేట: సాగునీటి పరంగా జిల్లాకు తలమానికంగా నిలిచిన పాకాల సరస్సు తూములు శిథిలావస్థకు చేరాయి. సాగునీటి కాల్వలు చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. దీంతో వ్యవసాయ అవసరాలకు నీరుసరిపడా సక్రమంగా అందడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 3,8,500 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో వరి పంటకు పాకాల సరస్సు ప్రధాన నీటి వనరు. జిల్లా మొత్తంలో లక్షా 45 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగవుతుండగా అందులో 40 నుంచి 50 వేల ఎకరాలకు పాకాల సరస్సు ద్వారా రెండు పంటలకు నీరు అందుతుంది. శిథిలావస్థలో తూములు జిల్లాలో ప్రాధాన్యత గల పాకాల తూములు శిథిలావస్థలోకి చేరుకున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా తూముల షెట్టర్లకు రంధ్రాలు పడి నీరు వృథాగా పోతుంది. తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారే తప్ప శాశ్వత మరమ్మతులు లేకపోవడంతో వృథాను అరికట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి ప్రత్యేక శ్రద్ధతో చెరువు అభివృద్ధికి ప్రత్యేక ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించారు. అయినప్పటికీ అభివృద్ధి పనులు ఆలస్యం అవుతుండడంతో చెరువు మనుగడకు ముప్పు నెలకొంది. భూగర్భ జలాల అభివృద్ధికి దోహదం.. పాకాల సరస్సులోకి ఇటీవల కాలంలో గోదావరి జలాలను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో వరంగల్ జిల్లాలో సాగవుతున్న లక్ష 45వేల ఎకరాల వరి, పది వేల ఎకరాల మొక్కజొన్న, లక్షా 36వేల 500 ఎకరాల్లో విస్తీర్ణం సాగవుతున్న పత్తి, 1,200 ఎకరాల్లో సాగవుతున్న కంది, 9వేల ఎకరాల్లో సాగవుతున్న మిర్చి, వెయ్యి ఎకరాల్లో సాగువుతున్న పసుపు, 17,500 ఎకరాల్లో సాగవుతున్న ఇతర పంటలకు వ్యవసాయ బావులు, బోర్ల నుంచి నీరు అందించేందుకు పాకాల సరస్సు నీరు ద్వారా భూగర్భ జలాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. వృథాగా పోతున్న నీరు చెట్లు, ముళ్లపొదలతో నిండిన కాల్వలు సాగు, తాగు నీటికి ఇబ్బందులు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు తాగునీటికీ ప్రధానమే.. పాకాల సరస్సు నుంచి అధికారికంగా 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా.. అనధికారికంగా మరో 25 వేల ఎకరాలకు పాకాల సరస్సు ప్రధాన వనరుగా ఉంది. దీంతోపాటు నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు కూడా తాగునీటి పరంగా పాకాల నీరే ప్రధానంగా నిలుస్తుంది. పంటలకు సాగునీరుగానే కాకుండా వాగుల ద్వారా మూడు నియోజకవర్గాల నుంచి ప్రవహిస్తూ తాగునీటిగానూ ఉపయోగపడుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పాకాల సరస్సు తూముల మరమ్మతులు వెంటనే చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. -
మరమ్మతులు చేసి ఆధునికీకరించాలి
చారిత్రాత్మక పాకాల చెరువు ఆయకట్టు రైతుల పంటలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే కాల్వలు, తూముల మరమ్మతులు చేసి ఆధునికీకరణ పనులు చేపట్టాలి. పాకాల చెరువు కింద అధికారికంగా, అనధికారికంగా సుమారు 50వేల ఎకరాల వరి పంట సాగు అవుతుంది. సరిపడా సాగునీటిని అందించేందుకు ఉన్న తుంగబంధం, జాలుబంధ, సంగెం కాల్వలు పిచ్చి మొక్కలు చెట్లతో నిండిపోయాయి. పలుచోట్ల తెగిపోయి శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో సాగునీరు పారించడం రైతులకు ఇబ్బందిగా మారింది. గతంలో నాణ్యతతో పనులు చేయకపోవడంతో త్వరగా పాడయ్యాయి. ఇప్పటికై నా తగినవిధంగా బడ్జెట్ కేటాయించి, మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలి. – పెద్దారపు రమేష్, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి -
ఇదేనా స్వచ్ఛత ?
మసకబారుతున్న ఓరుగల్లు ఖ్యాతి..2012 క్లీన్సిటీ చాంపియన్షిప్ కార్యక్రమంలో వరంగల్ నగరానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. పారిశుద్ధ్య పనుల్లో మంచి మార్కులు తెచ్చుకున్న ఓరుగల్లుకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో దేశవ్యాప్తంగా మూడో బహుమతి, ఐఎస్ఓ–14001 సర్టిఫికెట్, హడ్కో లాంటి పురస్కారాలు వచ్చాయి. దీంతో దేశంలో వరంగల్ రోల్ మోడల్గా నిలవడంతో వందల సంఖ్యలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాలు, అధికారులు ఇక్కడ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘనత వహించిన ఓరుగల్లు ఖ్యాతి మసకబారుతోంది. స్వచ్ఛ మాటలు, ప్రణాళికలు, ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. స్మార్ట్సిటీగా పేరుగాంచిన వారసత్వ నగరం స్వచ్ఛత విధానాల అమలులో వెనుకంజలో ఉంది.వరంగల్ అర్బన్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్ పరిస్థితి. స్వచ్ఛ సర్వేక్షణ్లో డొల్లతనం బయట పడింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ ఏడాది 3 నుంచి 10 లక్షల జనాభా నగరాల్లో స్వచ్ఛ భారత్, సూపర్ లీగ్, స్వచ్ఛ లీగ్ సిటీస్ కేటగిరీల్లో సర్వే చేపట్టింది. ఈ సర్వేలో చోటు లభించిన నగరాల వివరాలను శనివారం సాయంత్రం వెల్లడించింది. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్, కంటోన్మెంట్ మినహా ఏ కార్పొరేషన్లకు, మున్సిపాలిటీలు అర్హత సాధించలేకపోయాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కార్పొరేషన్లు స్వచ్ఛతలో చోటు సంపాదించుకుని కేంద్ర పురస్కారాలకు అర్హత పొందాయి. నామమాత్రంగా చెత్త సేకరణ ఘనవ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్)లో గ్రేటర్ వరంగల్ వెనుకబడుతోంది. ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ నామమాత్రంగా జరుగుతోంది. రోజుకు 470 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా.. 20 మెట్రిక్ టన్నుల చెత్త డ్రై వేస్ట్ రిసోర్స్ సెంటర్లకు చేరుతోంది. వాహనాలపై నిఘా లేక 30 టన్నుల చెత్త మేరకు నగరంలో పోగవుతోంది. చెత్త సేకరణలో పర్యవేక్షణ లోపం, డ్రెయినేజీలు శుభ్రం చేయకపోవడం, ప్లాస్టిక్ నిషేధించకపోవడం వంటి అంశాలు స్వచ్ఛతలో వెనుకబాటుకు కారణమవుతున్నాయి. ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. శాసీ్త్రయ పద్ధతిలో చెత్త పూడ్చివేత ఆశించిన మేర ముందుకు సాగడం లేదు. భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.నాలుగు వేలకు కోట్లకుగా పైగా నిధులు కేటాయించారు. డీపీఆర్లకు తుదిమెరుగులు దిద్దకపోవడం, నిధులు విడుదల కాకపోవడంతో వెనుకబాటుకు గురవుతోంది. సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్టీపీ) రెండు మాత్రమే పూర్తయ్యాయి. నగరం నుంచి 120 నుంచి 150 మియన్ లీటర్ ఫర్ డే (ఎంఎల్డీలు) మురుగు వస్తోంది. వీటి శుద్ధి పెద్దగా జరగడం లేదు. మరికొన్ని ఎస్టీపీలను నిర్మించాల్సిన అవసరం ఉంది. రూ.250 కోట్ల స్మార్ట్సిటీ నిధులతో అమ్మవారిపేటలో నిర్మిస్తున్న మానవ వ్యర్థాల ప్లాంట్ త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరో రెండు చోట్ల గార్బేజీ ట్రాన్స్ఫర్లు స్టేషన్లు ఏర్పాటు చేయాలి. వర్మీ కంపోస్టు, బయోమిథనైజేషన్ ప్లాంట్లను నెలకొల్పాలి. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో ఆశించిన మేర కార్యక్రమాలు నిర్వహించడం లేదని నగరప్రజలు పేర్కొంటున్నారు. పౌర స్పృహ పట్టింపేది? పౌర స్పృహ పెంచేందుకు గడిచిన దశాబ్ద కాలంలో అనేక ప్రయోగాలు చేశారు. బల్దియా వీటి అమలులో నిర్లక్ష్యం, ఉదాసీనతతో వ్యవహరిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. మేయర్, కమిషనర్ ఆకస్మిక పర్యటనలు చేసినప్పుడు జరిమానా విధిస్తామని హెచ్చరించడం వరకే యంత్రాంగం పరిమితమవుతోంది. పట్టుదల, కార్యదక్షత బల్దియా వర్గాల్లో ఏ మాత్రం కనిపించడం లేదు. క్షేత్రస్థాయిలో బలమైన యంత్రాంగం ఉన్నా.. పౌర స్పృహ కొరవడిన సందర్భాల్లో జరిమానా విధించే సౌలభ్యం ఉంది. నిర్లక్ష్యంతోనే ప్రకటనలు అపహాస్యానికి గురవుతున్నాయన్నది సుస్పష్టం. కేవలం పారిశుద్ధ్య పనుల కోసం 2,800 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ప్రజారోగ్యం, పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టం (యూజీడీ) నిర్మాణం, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఎస్ఎఫ్టీ), అదనంగా మానవ వ్య ర్థాల శుద్ధీకరణ ప్లాంట్ (ఎఫ్ఎస్టీ), శాసీ్త్రయ పద్ధతులు తదితర అంశాల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. దీంతో గ్రేటర్ వరంగల్ స్వచ్ఛతకు ఎంపిక కాలేదని భావిస్తున్నాం. – రాజారెడ్డి, గ్రేటర్ వరంగల్ సీఎంహెచ్ఓ పరిశుభ్ర నగరాల జాబితాలో గ్రేటర్కు దక్కని చోటు స్వచ్ఛ సర్వేక్షణ్లో బయటపడిన డొల్లతనం చెత్త సేకరణలో కరువైన అధికారుల పర్యవేక్షణ -
ప్రొఫెసర్ శ్రీనివాస్రావుకు అవార్డు
కేయూ క్యాంపస్: సేవాజ్యోతి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు 2025ను కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం విభాగం ప్రొఫెసర్ పెద్దమళ్ల శ్రీనివాస్రావు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీలో ఆదివారం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రస్ట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి చేతుల మీదుగా ఈఅవార్డును శ్రీనివాస్రావు అందుకున్నారు. రెండేళ్ల ప్రాయంలోనే పోలియో వచ్చి దివ్యాంగుడైనప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఆయన కష్టపడి చదువుకున్నారు. కేయూలో ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆవిభాగాధిపతిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ఏపీలో దివ్యాంగుల సంక్షేమం పథకాల పనితీరుపై పీహెచ్డీ చేసి డాక్టరేట్ పొందారు. దివ్యాంగుల సమస్యలపై కూడా అనేక పోరాటాలు చేశారు. ‘ఎ సొసైటీ ఫర్ రైట్స్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఫరెంట్లీ ఎబుల్డ్ పర్సన్స్’ చైతన్యం చేసే సంస్థను ఆయన నడుపుతున్నారు. -
పెరిగిన భూగర్భ జలాలు
హన్మకొండ: భూగర్భ జలాలు గత రెండు నెలలుగా స్వల్పంగా పెరిగాయి. యాసంగి సాగు పంటలు చేతికి రావడంతో భూగర్భ జలాల వినియోగం పెరుగుతూ వస్తోంది. రుతు పవనాలకు ముందు మే నెల చివర్లో జిల్లాలో 6.14 మీటర్ల లోతులో భూగర్భ జలాలుండగా జూన్ మాసాంతానికి 5.98 మీటర్లుగా నమోదైంది. ఏప్రిల్ చివరినాటికి 6.21 మీటర్లు భూగర్భ జలమట్టం ఉండగా.. మే, జూన్ చివరినాటికి స్వల్పంగా పెరిగింది. ఏప్రిల్ మాసంతో సగటు భూగర్భ జలమట్టం పరిశీలిస్తే జిల్లాలో స్వల్పంగా పెరిగింది. నీటి వినియోగం పెరిగే అవకాశం ప్రతీ నెల చివరి వారంలో భూగర్భ జలమట్టాన్ని ఫీజో మీటర్ల ద్వారా రికార్డు చేస్తారు. వర్షాలు కురిసి చెరువులు, కుంటల్లో వరద నీరు చేరితే భూగర్భ జలాలు మరింత పెరుగుతాయి. వర్షాలు కురవక వరి సాగుకు భూగర్భ జలాలు తోడితే భూగర్భ జలాలు పడిపోయే అవకాశముంది. ప్రస్తుతం రైతులు మెట్ట పంటల సాగు పనుల్లో బిజీగా ఉన్నారు. వరి సాగు కోసం రైతులు నారు పోస్తున్నారు. నారు ఎదిగే కొద్ది పొలం దమ్ము చేస్తే భూగర్భ జలాల వినియోగం పెరిగే అవకాశముంది. ఈమేరకు వర్షాలు సమృద్ధిగా కురవకపోతే రైతులు పూర్తిగా భూగర్భ జలాల మీద ఆధారపడాల్సిందే. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే వర్షం దోబూచులాడుతోంది. వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క భారీ వర్షం కూడా కురవలేదు. మెట్ట పంటల పరిస్థితి దయనీయంగా మారింది. ముందుగా విత్తిన మెట్ట పంటల మొలకలు ఎండిపోతున్న దశలో సుమారు పది రోజుల క్రితం కురిసిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం జీవం పోసింది. ఇప్పటి వరకు వరదలు పారే వర్షం కురువలేదు. దీంతో రైతులో ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలమట్టం వివరాలు ప్రాంతం ఏప్రిల్ మే జూన్ చెన్నారావుపేట 1.83 1.56 1.46 దుగ్గొండి 3.95 4.85 4.71 గీసుకొండ 5.54 5.25 5.03 వంచనగిరి 5.83 5.50 5.25 ఖానాపురం 3.62 3.78 3.34 నారక్కపేట 7.78 7.64 7.70 నర్సంపేట 4.66 4.73 4.97 అమీన్పేట 2.39 243 2.85 నాగారం 5.50 5.61 5.42 అన్నారం షరీఫ్ 12.33 11.51 11.65 పర్వతగిరి 12.83 12.02 11.83 కూనూరు 8.69 7.83 8.06 రాయపర్తి 5.02 8.40 8.42 సంగెం 6.68 3.70 3.58 తీగరాజుపల్లి 12.52 11.82 11.62 వర్ధన్నపేట 8.36 9.27 8.30 చార్బౌళి 3.15 2.75 2.22 మామునూరు 4.61 4.85 4.65 లోహిత 11.61 10.70 10.56 ఇల్లంద 6.15 6.34 6.75 రెడ్లవాడ 0.9 1.55 1.65 ఉప్పరపల్లి 4.67 4.50 3.64 మంగళవారిపేట 5.62 5.72 4.9 మేడపల్లి 4.89 5.17 5.32 నాగూర్లపల్లి 4.23 4.13 4.41 రేకంపల్లి 8.09 8.13 7.30 జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 5.98 మీటర్లు మెట్ట పంటల సాగులో రైతుల బిజీ వరిసాగు ముమ్మరమైతే పెరగనున్న నీటి వినియోగం -
హరిత పాఠశాల.. పోచంపల్లి..
విద్యారణ్యపురి : శాయంపేట మండలం పోచంపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇది. 2023 డిసెంబర్లో జి.ఉప్పలయ్య అనే ప్రధానోపాధ్యాయుడు రాకతో ఆ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. విద్యార్థుల నమోదుపై దృష్టిపెట్టడమే గాకుండా పాఠశాలలో హరితం తమ పంతం అనే విధంగా తన సహచర ఉపాధ్యాయులతో కలిసి హరితవనంగా మార్చేశారు. ఇప్పటివరకు సుమారుగా 900కు పైగా మొక్కలు నాటించారు. అందులో 120 రావి, 130 వేప, పొగడ 150 వరకు మొక్కలు నాటించారు. మిగితావి వివిధ రకాల మొక్కలతోపాటుగా పూల మొక్కలు ఉన్నాయి. షో, పూలమొక్కలు, రాయల్ ఫార్మ్, బోగన్ విలియి, టెంపుల్ ట్రీస్, మహాగని ట్రీస్, యూఫర్ బియా మొక్కలను జిల్లా రెవెన్యూ అధికారి గణేష్ ఇప్పించి నాటించారు. వీటి సంరక్షణకు ఇద్దరు వర్కర్లను పెట్టుకుని హెచ్ఎం, ఉపాధ్యాయులు సొంతంగా వేతనాలు ఇస్తున్నారు. -
ఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోuగోరింటాకు వేడుకల్లో సాయినగర్ కాలనీ మహిళలుమైదాకు చెట్టు పెంచుకోవాలి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. నేడు గోరింటాకు (మైదాకు) చెట్లు కనుమరుగైపోతున్న తరుణంలో కోన్లకు ప్రాధాన్యమిస్తున్నారు. అందుకే ప్రతి ఇంట్లో నేలపై గాని కుండీల్లో గోరింటాకు చెట్టు పెంచుకోవాలి. – నూకల ఉషారెడ్డి, గృహిణి, సాయినగర్ కాలనీ చిన్ననాటి నుంచి కొనసాగిస్తున్న.. నా చిన్నతనం నుంచి గోరింటాకు పెట్టుకోవడం అలవాటు. అప్పట్లో స్నేహితురాళ్లతో కలిసి గోరింటాకు సేకరించేది. ఆషాఢమాసంలో రెండు సార్లు పెట్టుకుంటాం. ప్రస్తుతం గోరింటాకు పెట్టుకునే రోజు ముందురోజే పనులన్నీ పూర్తి చేసుకుంటాం. గోరింటాకు తెచ్చుకుని రాత్రికి తొందరగా భోజనం చేసి కుటుంబసభ్యులందరం చేతులకు, కాళ్లకు పెట్టుకుంటాం. ఇంట్లో పండుగ వాతావరణంలా ఉంటుంది. –ముత్తిరెడ్డి జీవన, గృహిణి, సాయినగర్కాలనీ ● -
హరిత ప్రాంగణం
మడికొండ: మడికొండ శివారులోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఎటుచూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్లుగా ఉంటుంది. కార్యాలయం ముందు ఏపుగా పెరిగిన అశోక చెట్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. హరిత హారంలో భాగంగా ఇప్పటి వరకు నిమ్మ, పనస, టేకు, సపోటా, మామిడి, నారింజ, అలోవేర, బత్తాయి, 30 రకాల మొక్కలు 400లకు పైగా నాటినట్లు ప్రాంగణం జిల్లా మేనేజర్ జయశ్రీ తెలిపారు. ఈ కేంద్రంలో బ్యుటీషియన్, టైలరింగ్, డీటీపీ, ఎంపీహెచ్డబ్ల్యూ తదితర కోర్సుల్లో మహిళలు శిక్షణ పొందుతుంటారని, వారి కోసం పూలు, పండ్ల మొక్కలను నాటుతున్నామని పేర్కొన్నారు. -
నిట్ @ మియావాకీ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లో అతి తక్కువ స్థలం ఎక్కువ మొక్కలు నాటే టెక్నాలజీని ఉపయోగించి మియావాకీ ఫారెస్ట్ను ఆవిష్కరించారు. 2019, ఆగస్టు 15న నాటి డైరెక్టర్ ఎన్వీ.రమణారావు చేతుల మీదుగా ప్రొఫెసర్లు, విద్యార్థులు ప్రారంభించిన మియావాకీ ఫారెస్ట్ను నేటి డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సైతం కొనసాగిస్తున్నారు. ప్రతీ శనివారం మొక్కలు నాటుతున్నారు. క్యాంపస్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్, ల్యాబ్స్, క్లాస్ రూం, హాస్టల్ ఏరియాలోని ఖాళీ స్థలాన్ని రెండెకరాలు గుర్తించి మొక్కలు నాటుతున్నారు. నిట్లోని మియావాకీ ఫారెస్ట్లో 4వేల పండ్లు, ఔషధ, పూలతోపాటు వివిధ రకాల మొక్కలు పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యానికి తోడ్పడుతూ గ్రీన్ క్యాంపస్గా మార్చివేశాయి. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్కతుర్తి : వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి అప్పయ్య సూచించారు. శనివారం ఎల్కతుర్తి పీహెచ్సీ పరిధిలోని సూరారం, ఇందిరానగర్, వల్బాపూర్ గ్రామాల్లోని ఆరోగ్య ఉప కేంద్రాలను సందర్శించారు. చిన్నారులకు అవుట్ రీచ్ ఇమ్యునైజేషన్లో భాగంగా టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వే నిర్వహిస్తున్న సమయంలో జ్వరం లక్షణాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో మలేరియా, ఆర్డీటీ టెస్టులు చేసి మందులు అందించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతోపాటు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సౌమ్య, సూపర్వైజర్ రామ్చందర్, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు. జిల్లా వైద్యాధికారి అప్పయ్య -
అతడి ఇల్లే ఒక వనం
శాయంపేట : ఆ ఇంటి ఆవరణలోకి వెళ్లగానే రకరకాల మొక్కలు రారమ్మని స్వాగతం పలుకుతాయి. ఎటు చూసిన పచ్చని తివాచీ పరిచినట్లు కనిపిస్తాయి. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు కొమనేని రఘు,స్వాతి దంపతులు తమ ఇంటి ఆవరణలో 200 రకాల మొక్కలు పెంచుతున్నారు. అందులో సుమారు 80కి పైగా కాక్టస్ మొక్కలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా ఎడారి ప్రాంతాల్లో ఉండే ఈ ముళ్ల రకం మొక్కలు ఇక్కడ పెరుగుతాయి. ఇది ఇంట్లో విడుదలైన కార్బన్ డయాకై ్సడ్ని గ్రహించి.. గాలిని శుభ్రమైన ఆక్సిజన్గా మారుస్తుంది. అదేవిధంగా పెర్షియన్ కార్పెట్, బ్రహ్మకమలం, ఫుట్బాల్ లిల్లీతో పాటు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) గుర్తించిన స్పైడర్ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, స్వార్ట్ పెర్న్, అలోవెరా, లుగ్లోనెమా, డ్రసీనియా, ఫెల్లో డెండ్రోస్, జెడ్ జెడ్ ప్లాంట్ మొదలైనవి ఉన్నాయి. వీటిని ఇంట్లో పెంచుకుంటే గాలిని శుద్ధిచేసి ఆరోగ్యానికి మేలు చేస్తాయని నాసా పేర్కొన్నట్లు కొమనేని రఘు తెలిపారు. -
● ఆషాఢమాసమంతా అతివల సందడి ● శరీరానికి మేలు చేసే గోరింటాకు ● నగరంలోని సాయినగర్కాలనీలో వేడుకలు
హన్మకొండ కల్చరల్ : గోరింటాకును గౌరిదేవి ప్రతీకగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన అమ్మాయిలు ఆషాఢమాసంలో పుట్టింటికి వస్తారు. వారు తమ కుటుంబసభ్యులతో కలిసి గోరింటాకును ఒకరికొకరు చేతులకు పెట్టుకోవడం.. అక్కచెల్లెల్లు, వదిన మరదల్ల మధ్య ప్రేమానురాగాలు పరిమళిస్తాయి. కాలనీల్లో, అపార్టుమెంట్లలో మహిళలు ఒకచోట చేరి గోరింటాకు నూరి చేతులకు పెట్టుకుంటారు. దీంతో స్నేహితుల మధ్య అనుబంధం బలపడుతుంది. అదేవిధంగా గోరింటాకు అందంతోపాటు ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే మహిళలు ఇంట్లో గోరింటాకు పెట్టుకుని సందడి చేస్తుంటారు. హనుమకొండ పూరిగుట్టలోని సాయినగర్కాలనీలో మహిళలు ఆషాఢమాసం సందర్భంగా శనివారం ఒక్కచోటకు చేరారు. సంప్రదాయబద్ధంగా గోరింటాకు సేకరించి రోలులో వేసి నూరారు. అనంతరం పాటలు పాడుతూ ఒకరికొకరు చేతులకు గోరింటాకు పెట్టుకున్నారు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని ఆనందంతో మురిసిపోయారు. గోరింటాకు మంగళకరమైనది.. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది మన ఆచారం. గోరింటాకు గౌరి ఇంటి ఆకు కాబట్టి మంగళకరమైనది. గోరింటాకు ఎరుపు చూసి కుంకుమ బాధ పడుతుందట.. నన్నెవరు చూస్తారని అప్పుడు గౌరిదేవి గోరింటాకు శరీరభాగాలలో ఎక్కడైనా పండుతుంది కానీ, నుదుట మాత్రం పండదని, నుదుటకుంకుమ మాత్రమే ఎర్రగా ఉండాలని వరమిచ్చిందట.. ఇలా గోరింటాకుపై పురాణగాథలు ఉన్నాయి. –రత్నమాల, ఎకై ్సజ్కాలనీ, హనుమకొండ -
హరితం.. వీరి పంతం!
మొక్కల పెంపకమే ఓ వృత్తిగా పెట్టుకున్న వారు కొందరు.. తాముపనిచేసే చోటును హరితమయంగా మార్చాలన్న ఆశయం మరికొందరిది.. ఉన్న ఇంటిని గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, ఔషధ మొక్కలతో మినీ బృందావనం మార్చుకున్న ఇంకొందరు.. వీరందరి పంతం.. సతతం.. హరితం.. మొక్కలు నాటి సంరక్షిస్తే మనల్ని కాపాడుతాయన్న నమ్మకం. తాము పాటిస్తూ పది మందిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములను చేయాలన్న తపన. గ్రేటర్ వరంగల్ పరిధిలో పాఠశాలలు, కార్యాలయాలు, ఇళ్లను హరితమయంగా మార్చిన పలువురి స్ఫూర్తిదాయక కథనాలే ఈ వారం సండే స్పెషల్. మొక్కల పెంపకమే వృత్తిగా పలువురు వనజీవులు హరితమయంగా కార్యాలయాలు, పలు పాఠశాలలు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు పలువురి ఇళ్లు.. మినీ బృందా‘వనాలు’ స్ఫూర్తిదాయకులు.. ఈ పర్యావరణ పరిరక్షకులు -
ప్రకృతి ప్రేమికుడు రామస్వామి
హన్మకొండ: మొక్కలు నాటడంతో అవి నిలదొక్కుకునే వరకు వాటి సంరక్షణను చూసుకుంటున్నాడు ప్రకృతి ప్రేమికుడు తాళ్లపల్లి రామస్వామి. హనుమకొండ పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లపల్లి రామస్వామి పోలీసు శాఖలో కార్యాలయం సూపరింటెండెంట్గా రిటైర్డ్ అయ్యారు. ప్రకృతి అంటే ఇష్టమున్న రామస్వామి ఇప్పటి వరకు దాదాపు 10వేల మొక్కలు నాటారు. 80 ఏళ్లకు పై బడిన వయస్సులో ఉన్న ఆయన ఎంత దూరమైనా వెళ్లి తను నాటిన మొక్కల బాగోగులు చూసి వస్తాడు. తనకు ప్రకృతి, జీవరాశులు అంటే వల్లమాలిన ప్రేమ అని రామస్వామి తెలిపారు. పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పక్షులు, జంతువులకు, ఇతర జీవులకు ఆహారం దొరుకుతుందని అంటున్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామని తెలిపారు. -
వనజీవి పరిచయంతో..
కాజీపేట: పద్మశ్రీ వనజీవి రామయ్యతో ఏర్పడిన పరిచయం ఓ యువకుడి ఆలోచన ధోరణిని మార్చివేసి పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయించింది. కాజీపేట పట్టణానికి చెందిన కొలిపాక ప్రకాశ్కు ఐదేళ్లక్రితం ఓ రోజు రామయ్యతో పరిచయమైంది. దీంతో అతను ప్రకాశ్ మేధిని అనే సంస్థను స్థాపించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటడం, నాటించడం చేయిస్తున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంటూ వాటి ఆవరణల్లో మొక్కలు నాటించడం చేస్తున్నారు. ఇప్పటివరకు 10వేల మొక్కలను నాటించడంలో సఫలీకృతుడైన ప్రకాశ్ అనుకున్న లక్ష్యానికి చేరువ అవుతాడని ఆశిద్దాం.. -
ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అవకాశవాది
కమలాపూర్ : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఒక అవకాశవాది అని, ఓ వైపు బీజేపీని విమర్శిస్తూ.. మరోవైపు వారితో దోస్తాన చేస్తున్నాడని, అతని తీరు చూస్తుంటే త్వరలో బీజేపీలో చేరుతాడనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ ఆరోపించారు. మండలంలోని 26 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివారం ఆయన కమలాపూర్లో పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని తెలిపారు. హుజూరాబాద్కు కౌశిక్రెడ్డి ఐరన్ లెగ్గా తయారయ్యాడని, పని చేయడం మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల విషయంలో గడువు తీరినవి లబ్ధిదారులకు పంపిణీ చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నాడన్నారు. కమలాపూర్ కాంగ్రెస్లో ఎలాంటి గ్రూపులు లేవని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరాణిరవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్గౌడ్, డైరెక్టర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. త్వరలో బీజేపీలో చేరుతాడని అనుమానం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్