breaking news
Warangal
-
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య కోరారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ లష్కర్బజార్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని డీఈఓ వాసంతితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈఓ వాసంతి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ గీత, ఎంఈఓ నెహ్రూనాయక్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్రావు, డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ హిమబిందు హెచ్ఎం ఉమ ల్గొన్నారు. మంచి పేరు తీసుకురావాలి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్తోపాటు తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. ఇనిస్టిట్యూట్లోని అంబేద్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో సోమవారం నూతన పీజీ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్లో ఆయన మాట్లాడారు. నిట్లోని అత్యుత్తమ బోధనను అధ్యయనం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా ఎంబీ ఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎమ్మెసీలో అందజేస్తున్న విద్యాబోధన, ల్యాబ్స్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ కిరణ్కుమార్, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. రుద్రతత్వమే విశ్వశక్తిహన్మకొండ కల్చరల్ : రుద్రతత్వమే విశ్వశక్తి అని, భగవంతుడి ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ పేర్కొన్నారు. శ్రావణమాసం మూడవ సోమవారం ఉదయం రుద్రేశ్వరుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. సాయంత్రం సహస్రనామార్చనలు ప్రదోషకాలపూజలు భజనలు జరిగాయి. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర విద్య ప్రవేశాల గడువు పొడిగింపు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియంటేషన్ కోర్సుల్లో 2025–2026 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేష్లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి రుసుం ఆన్లైన్లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూ ఆర్ స్కాన్ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. ఎన్జీఓతో ఆర్ట్స్కాలేజీ ఒప్పందంకేయూ క్యాంపస్: మారిన పరిస్థితులకు అనుగుణంగా మహిళలు అన్నిరంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా లాంచ్ గర్ల్స్ ఎన్జీఓతో ఒప్పందం చేసుకున్నట్లు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి సోమవారం తెలిపారు. ఈ సంస్థ మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో లాంచ్గర్ల్స్ ప్రతినిధి జయవర్ధన్, కళాశాల మహిళా సాధికారిత సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మి, డాక్టర్ గిరిప్రసాద్ పాల్గొన్నారు. హెచ్పీఎస్లో అడ్మిషన్ కోసం డ్రాన్యూశాయంపేట: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(హెచ్పీఎస్) రామంతపూర్లో ఒకటవ తరగతి అడ్మిషన్ కోసం వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమక్షంలో డ్రా తీశారు. డ్రాలో కందికట్ల హర్షిణి అనే విద్యార్థిని సెలక్ట్ అయ్యింది. మొదటి వెయిటింగ్ లిస్టుగా నీరటి జష్విక, రెండవ వెయిటింగ్ లిస్టులో చింత అద్వైత ఉన్నారు. హర్షిణి సామాజిక స్థితిని పరిశీలించి అడ్మిషన్ కోసం పంపించారు. కార్యక్రమంలో భాగ్యలక్ష్మి, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనాన్ని ‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దు
హన్మకొండ: వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన వర్కర్లు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో హ నుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఇంట్లోకి ప్రవేశించకుండా గేటు వేసి అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్ల మద్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. సీఐటీ యూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి రమేశ్, నాయకులు వాణి, ప్రభాకర్, ఉపేందర్తో పాటు మధ్యాహ్న భోజన వర్కర్లను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్లు బైరబోయిన సరోజినీ యాదవ్, జారతి దేవి, కవిత, స్వర్ణలత, పుష్పలీల, రమ, మనెమ్మ, మల్లికాంబ, ఉమాదేవి, లక్ష్మి అనసూర్య, వనజ, సంధ్య, రీటా, సరిత, పద్మ, అరుణ, యాకలక్ష్మి, రజియా సుల్తానా, జఖియా బేగం, షంషాద్, ప్రమీల, శ్రావణి, మంజుల పాల్గొన్నారు. మంత్రి ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు -
నులిపురుగుల నివారణతో సంపూర్ణ ఆరోగ్యం
గీసుకొండ: నులిపురుగుల నివారణతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గీసుగొండ మండలం ధర్మారం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు కలెక్టర్ నులిపురుగుల మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం మాత్రలు తీసుకోని వారికి ఈనెల 18న మాప్–అప్ కార్యక్రమం ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ధర్మారం అంగన్వాడీ కేంద్రంలో కలెక్టర్ సత్యశారద చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, డీడబ్ల్యూఓ రాజమణి, డిప్యూటీ డీఎంహెచ్ఓలు ప్రకాశ్, డాక్టర్ కొమురయ్య, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపీడీఓ శ్రీనివాస్, డీఈఓ జ్ఞానేశ్వర్, పాఠశాల హెచ్ఎం సాంబయ్య, వైద్యాధికారులు శౌర్య శరణ్య, నేహా, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పీహెచ్సీ సిబ్బంది, ఆర్బీఎస్కే సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద విద్యార్థులకు మాత్రల పంపిణీ -
ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలి
రామన్నపేట: ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులకు త్వరగా పరిష్కారం చూపాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్.. అధికారులను ఆదేశించారు. సోమవారం బల్దియా ప్రదాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ పాల్గొని నగరవాసులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఆయా విభాగాల ఉన్నతాధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు. ఎక్కువకాలం పెండింగ్లో ఉండకుండా చూడాలని, 24 గంటల వ్యవధిలోగా శానిటేషన్ విభాగానికి అందిన ఫిర్యాదులు పరిష్కారం కావాలని ఆదేశించారు. గార్బేజ్ బిన్లు లిఫ్ట్ చేయడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పన్నుల విభాగానికి స్వీకరించిన ఫిర్యాదులు వారంలోగా పరిష్కారం చూపాలన్నారు. ఈనెల 21 వరకు నగరంలో వివిధ ప్రాంతాల్లో బోనాలు పండుగలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజావాణిలో ఇంజనీరింగ్ 23, టౌన్ ప్లానింట్ 44, హెల్త్ – శానిటేషన్ 11లతో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన మొత్తం 91 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. -
మన కుక్కల్ని ఏం చేద్దాం?
సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గుంపులు గుంపులుగా తిరుగున్న కుక్కలపై ఫిర్యాదులు రాగానే అక్కడినుంచి పట్టుకెళ్లి డాగ్ షెల్టర్లకు తరలించాక కుటుంబ నియంత్రణ, రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ నగరంలోనే వదిలేస్తుండడతో కుక్కల సంఖ్య యఽథావిధిగానే ఉంటోంది. జంతు సంరక్షణ చట్టం (ఏడబ్ల్యూపీఐ) 1960 , 2023 నిబంధనల ప్రకారం ఇదంతా చేస్తున్నా జనాలు మాత్రం కుక్కలు తీసుకెళ్లి మళ్లీ ఇక్కడే వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ నగరంలో మొత్తం 28,460 వీధి కుక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఢిల్లీలో వీధి కుక్కల్ని డాగ్ షెల్టర్లకు తరలిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మన కార్పొరేషన్ పరిధిలోనూ వీధి కుక్కల్ని డాగ్ షెల్ట ర్లకు శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలనే డిమాండ్ నగరవాసుల నుంచి వస్తోంది. అదే సమయంలో జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కల పట్ల కఠినంగా ఉండొద్దని, కాటు వేసే కుక్కల్ని గుర్తించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటున్నారు. ఇటు జనాలు, అటు జంతు ప్రేమికుల మధ్యలో కార్పొరేషన్ నలిగిపోతుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ కూడా నగర శివారుల్లో డాగ్ షెల్టర్ జోన్లు పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంట్రోల్లోకి తెచ్చేందుకు మహా ప్రయత్నం వాస్తవానికి ఆరు నెలలు దాటి ఏడాది వయస్సున్న కుక్కల్ని కుటుంబ నియంత్రణకు బల్దియా అధికారులు తీసుకెళ్తున్నారు. దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు బతికే ఈ కుక్కలకు ఒక్కో ఆడ కుక్క ఏడాదికి రెండు ఈతలు.. దాదాపు 16 కుక్కపిల్లలకు జన్మనిస్తుంది. అంటే ఐదేళ్లలో ఒక్కో కుక్క 90 పిల్లల వరకు జన్మనిస్తుంది. గతేడాది 2024–25 సంవత్సరంలో రూ.68 లక్షలకుపైగా ఖర్చు చేసి 6,154 కుక్కలకు కుటుంబ నియంత్రణతో పాటు రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. మూడురోజుల పాటు సంరక్షించాక జనావాసాల్లోకి వదిలారు. కొన్ని సంవత్సరాలుగా వేలల్లో ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణతో కంట్రోల్లోకి తేగలిగామని, ఇప్పటికి వాటిపైనే దృష్టి కేంద్రీకరించామని చెబుతున్నారు. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాలతో పాటు పాఠశాలల్లో అవగాహన కల్పిస్త్తున్నామంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే.. కుక్క కాటు వేస్తే 18004251980తో పాటు ప్రజారోగ్య అధికారి ఫోన్ నంబర్ 9701999689, మున్సిపల్ ఆరోగ్య అధికారి ఫోన్ నంబర్ 97019 99639 పశువైద్యాధికారి ఫోన్ నంబర్ 97019 99701కు వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ప్రతీరోజు 12 నుంచి 15 ఫిర్యాదులొస్తున్నాయి. షెల్టర్ జోన్లకు కుక్కలను తరలించేందుకు 12మందితో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయాలి... గ్రేటర్ వరంగల్తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జూన్, జూలై నెలల్లోనే 712 కుక్క కరిచిన ఘటనలు నమోదయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో పట్టుబడిన వీధి కుక్కలకు శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేసి, అక్కడే ఉంచి ఆహారం, వైద్యసేవలు అందించాలి. – మండల పరశురాములు, అధ్యక్షుడు, అభ్యుదయ సేవా సమితి, వరంగల్ ‘గ్రేటర్’ పరిధిలో వీధి కుక్కల బెడద ప్రజావాణిలో ఒక్కరోజే నాలుగు ఫిర్యాదులు వీధులనుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని వినతి జంతు సంరక్షణ చట్టం నిబంధనలతోనే బల్దియాకు మహా సంకటస్థితి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కుక్కలపై సుప్రీం ఆదేశాల నేపథ్యంలో చర్చ ఇక్కడ కూడా డాగ్ షెల్టర్ జోన్లు పెంచితే మంచిదంటున్న జనం ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరీటరీతోపాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను డాగ్ షెల్టర్లకు ఎనిమిది వారాల్లో తరలించాలి. ఈనేపథ్యంలో వీధి కుక్కలను అధికారులు తీసుకెళ్లకుండా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డుకుంటే, వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’. – తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ‘కాజీపేటలోని ప్రశాంత్ నగర్, కాకతీయ కాలనీ ఫేజ్–టు, వరంగల్లో రంగశాయిపేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీధి కుక్కల్ని తీసుకెళ్లాలి. వరుస కాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ బెడద నుంచి కార్పొరేషన్ అధికారులు తప్పించాలి.– సోమవారంనాటి బల్దియా ప్రజావాణిలో వచ్చిన నాలుగు ఫిర్యాదులు -
‘అక్షయపాత్ర’కు ఇవ్వొద్దని మంత్రి ఇల్లు ముట్టడి
మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్ట్ హన్మకొండ: వరంగల్, ఖిలా వరంగల్ మండలాల్లోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్రకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ ఆయా మండలాలకు చెందిన మధ్యాహ్న భోజన వర్కర్లు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు. సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి ఇంట్లోకి ప్రవేశించకుండా గేటు వేసి అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులు, సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్ల మద్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసుల చర్యలను అడ్డుకున్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి, వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి రమేశ్, నాయకులు వాణి, ప్రభాకర్, ఉపేందర్తో పాటు మధ్యాహ్న భోజన వర్కర్లను అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు, మధ్యాహ్న భోజన వర్కర్లు బైరబోయిన సరోజినీ యాదవ్, జారతి దేవి, కవిత, స్వర్ణలత, పుష్పలీల, రమ, మనెమ్మ, మల్లికాంబ, ఉమాదేవి, లక్ష్మి అనసూర్య, వనజ, సంధ్య, రీటా, సరిత, పద్మ, అరుణ, యాకలక్ష్మి, రజియా సుల్తానా, జఖియా బేగం, షంషాద్, ప్రమీల, శ్రావణి, మంజుల పాల్గొన్నారు. -
ప్రజెంట్ మేడమ్..
న్యూశాయంపేట: గత వారం ప్రజావాణిలో సమయపాలన పాటించకుండా వచ్చిన అధికారులను కలెక్టర్ మందలించారు. దీంతో సోమవారం అధికారులు గ్రీవెన్స్కు నిర్ణీత సమయంలోగా(ఉదయం 10:30లోగా) కలెక్టరేట్లోని సమావేశ హాల్కు చేరుకున్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, హౌసింగ్ పీడీ గణపతి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 120 దరఖాస్తులు రాగా.. వాటిని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో ఎక్కువగా రెవెన్యూ 50, జీడబ్ల్యూఎంసీ 21, హౌసింగ్కు 12 దరఖాస్తులు రాగా మిగితావి వివిధ శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. నూతన ఒరవడి సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కొత్త ఒరవడి సంతరించుకుంది. అధికారులకు ఎదురుగా దరఖాస్తుదారులకు సమావేశ హాల్లో ప్రత్యేకంగా సీట్లు కేటాయించారు. దరఖాస్తుదారులు సమావేశ హాల్ ఎదురుగా బయట నిరీక్షించకుండా హాల్లో సీరియల్ ప్రకారం కూర్చునేందుకు వీలుగా సీట్లు ఖాళీగా ఉంచారు. దీంతో సీరియల్ నంబర్ల వారీగా ప్రజలు దరఖాస్తులు ఇచ్చేందుకు రావడంతో ప్రజావాణి సాఫీగా సాగింది. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, సూపరింటెండెంట్ సంబంధిత శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు కోసం తప్పుడు సర్వే నా భర్త చనిపోయాడు. నాకు సొంత భూమిలేదు. ఇల్లు లేదు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. సర్వేలో సర్వేయర్ నాకు ఇంతకు ముందు ఇల్లు మంజూరైందని ఎంటర్ చేశారు. తప్పుడు సమాచారంతో నాకు ఇల్లు రాకుండా పోయింది. నాకు న్యాయం చేయాలి. – ఐత సంపూర్ణ, క్రిస్టియన్ కాలనీ, వరంగల్ సమయానికి ప్రజావాణికి వచ్చిన అధికారులు కలెక్టర్ గతవారం ఆగ్రహించడంతో అలెర్ట్ ప్రజావాణిలో ప్రత్యేక ఒరవడి సమావేశ హాల్లో దరఖాస్తుదారులకు ప్రత్యేక సీట్లు గ్రీవెన్స్కు ఒకరిద్దరు మినహా అన్ని శాఖల అధికారుల హాజరు -
రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో కావ్యకు కాంస్యం
వర్ధన్నపేట: మండలంలోని ఉప్పరపల్లి ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సీనపల్లి కావ్య ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో 63 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించినట్లు పాఠశాల హెచ్ఎం వేణు తెలిపారు. అదేవిధంగా పాఠశాలలోని పలువురు విద్యార్థులు వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ చాటినట్లు పేర్కొన్నారు. కాంస్య పతకం సాధించిన కావ్యకు పాఠశాల హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీదేవి, రాజు, లింగమూర్తి, విజయ, రూపారాణి, సదానందం, వీరస్వామి, మాధవరావు, రాజపద్మ, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ మోటారు చోరీనర్సంపేట రూరల్: నర్సంపేటలోని ద్వారకపేట గ్రామ శివారులో గుండం నర్సమ్మకు చెందిన రూ.60 వేల విలువైన వ్యవసాయ మోటారు 7 హెచ్పీ చోరీకి గురైంది. సోమవారం ఉదయం నర్సమ్మ కుమారుడు మహేందర్ వెళ్లగా మోటారు కనిపించలేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీయగా.. పక్కనే ఉన్న రైతులు చిగురు కమలాకర్, ఏలబోయిన శ్రీనివాస్ ఇద్దరు ఒకరు వైరు, ఒక మోటారు ఎత్తుకెళ్లినట్లు స్థానికులు సమాచారం అందించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విషజ్వరంతో చిన్నారి మృతినెక్కొండ: విషజ్వరంతో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతిచెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్ కాశీం (తురక కాశి) మైబూబికి కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కుమార్తె మోహ్రిన్ (5) స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఈ నెల 8న విషజ్వరం బారినపడింది. మరుసటి రోజు నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమించడంతో వరంగల్లోని అమృత ఆస్పత్రిలో చేర్చగా చికిత్స అందించారు. ఈక్రమంలో జ్వరం తీవ్రమై ఆరోగ్యం క్షీణించి, బ్రెయిన్ డెడ్ అవ్వడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జ్వరం వచ్చిన మూడు రోజులకే చిన్నారి మృతి చెందడంపై గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దూర విద్య ప్రవేశాల గడువు పొడిగింపు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి దూర విద్యాకేంద్రం అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్, ఓరియెంటేషన్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 10వ తేదీ వరకు పొడిగించినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బి.సురేశ్లాల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ, బీఎల్ఐఎస్సీ, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంఎల్ఐఎస్సీ కోర్సులతోపాటు మరో తొమ్మిది డిప్లొ మా, 14 సర్టిఫికెట్, ఏడు ఓరియెంటేషన్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. అవసరమైన సర్టిఫికెట్లు, ఫొటో జత చేసి రుసుం ఆన్లైన్లోగానీ, దూరవిద్యాకేంద్రంలో క్యూ ఆర్ స్కాన్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ నెక్కొండ: మండల కేంద్రానికి చెందిన ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రఘు తల్లి లక్ష్మి, రిటైర్డ్ టీచర్ మెట్టు నర్సింహరెడ్డి తండ్రి మోహన్రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మృతుల కుటుంబ సభ్యులను సోమవారం పరామర్శించారు. మృతుల చిత్రపటాల వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మె ల్యే వెంట నాయకు లు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, పెండెం రామానందం, నెక్కొండ, నర్సంపేట మా ర్కెట్ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీని వాస్, బక్కి అశోక్, కేవీ.సుబ్బారెడ్డి, ఆవుల శ్రీనివాస్, లావుడ్యా తిరుమల్, మాదాటి శ్రీనివాస్, ఈదునూరి సాయికృష్ణ, కొమ్మారెడ్డి సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అలా కడితే అప్పుల పాలవుతారు
హసన్పర్తి/రామన్నపేట/కాజీపేట అర్బన్: నిబంధనల మేరకు రూ.5లక్షల వరకు వ్యయంతోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం చేపట్టాలని, అలా కాకుండా స్లాబ్ను పెంచితే అప్పుల పాలవుతారని గృహ నిర్మాణశాఖ ఎండీ వీసీ గౌతమ్ సూచించారు. హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో, గ్రేటర్ వరంగల్ 31వ డివిజన్ పరిధి కాజీపేట మండలం న్యూశాయంపేటలో, 33వ డివిజన్ ఎస్ఆర్ఆర్ తోటలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈసందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎంత ఖర్చు అయ్యింది? ఇంకా ఎంత అవుతుందని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. 600 ఎస్ఎఫ్టీ మేరకు స్లాబ్లో గోడల నిర్మాణం చేపట్టి, మరో 300 నుంచి 400ఎస్ఎఫ్టీ వరకు స్లాబ్ బయట పెంచినట్లు గౌతమ్ గుర్తించారు. ఇలాచేస్తే ఆర్థిక భారమై అప్పులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మేరకు స్లాబ్తో సహా 600 ఎస్ఎఫ్టీ నిర్మాణం చేపట్టితే ఎలాంటి భారం పడే అవకాశం ఉండదన్నారు. నాణ్యమైన ఇసుక, ఇటుక, సిమెంట్, ఇనుముతో ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. మడిపల్లిలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు సత్వరం పూర్తి చేస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తీసుకొచ్చి ప్రారంభిస్తానని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కుడా చైర్మన్ వెంకట్రామిరెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్ నాయక్, తహసీల్దార్లు ప్రసాద్, బావుసింగ్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, కార్పొరేటర్ మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేట్టాలి గృహ నిర్మాణశాఖ ఎండీ గౌతమ్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులపై ఆరా..
ధర్మసాగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి తెలుసుకునేందుకు రాష్ట్ర హౌసింగ్ ఎండీ గౌతమ్ సోమవారం మండల కేంద్రంలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. అనంతరం వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిని హౌసింగ్ ఏఈ సుష్మాను అడిగి తెలుసుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసిన వారికి వెంటనే బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ సిద్దార్థ్, డీఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఎంపీఓ అఫ్జల్, తదితరులు పాల్గొన్నారు. -
కాపర్వైర్ దొంగల అరెస్ట్
ఎల్కతుర్తి: పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరును అపహరిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రానికి చెందిన బండి కుమారస్వామి, బండి సతీష్లు గత కొంతకాలంగా ఎల్కతుర్తి, వేలేరు, భీమదేవరపల్లి, సైదాపూర్, హుజూరాబాద్, శంకరపట్నం తదితర ప్రాంతాల్లో రాత్రివేళల్లో 27 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి వాటిలోని కాపర్ వైర్ను అపహరించారు. దానిని అమ్మగా వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ముల్కనూర్ ఎస్సై సాయిబాబు తన సిబ్బందితో సోమవారం భీమదేవరపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అడ్డుకున్నారు. వారివద్ద కాపర్వైరు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టేందుకు ఉపయోగించే వస్తువులు ఉండడాన్ని గమనించి అదుపులోకి తీసుకున్నారు. విచారించగా సులువుగా డబ్బులు సంపాదించేందుకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని కాపర్ వైర్ను దొంగిలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన కాపర్ వైర్ను ముల్కనూర్ గ్రామానికి చెందిన రుద్రాక్ష తిరుపతికి అమ్మినట్లు విచారణలో తేలింది. వెంటనే తిరుపతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. గతంలో నిందితులపై 2012నుంచి 53 కేసులు నమోదైనట్లు ఏసీపీ వెల్లడించారు. కాగా, నిందితులనుంచి రూ.2.50లక్షల విలువ గల 250 కిలోల కాపర్ వైర్, మోటర్ సైకిల్ను స్వాధీనపర్చుకొని వారిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ పులి రమేష్, ఎస్సైలు సాయిబాబు, ప్రవీణ్కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 250 కిలోల కాపర్ స్వాధీనం వివరాలు వెల్లడించిన కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి -
మన కుక్కల్ని ఏం చేద్దాం?
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న వీధి కుక్కలు: 28,460రేబిస్ వ్యాక్సిన్ వేసిన వీధి కుక్కల సంఖ్య: 6,154కుటుంబ నియంత్రణ చేసిన కుక్కల సంఖ్య: 6,154వీటి కోసం ఇప్పటివరకు చేసిన ఖర్చు : రూ. 68,23,936 కుక్కల తరలింపు కేంద్రాలు : చింతగట్టు, హసన్పర్తి, హనుమకొండ వీటిలో ప్రస్తుతం ఉన్న కుక్కల సంఖ్య : 76సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో గుంపులు గుంపులుగా తిరుగున్న కుక్కలపై ఫిర్యాదులు రాగానే అక్కడినుంచి పట్టుకెళ్లి డాగ్ షెల్టర్లకు తరలించాక కుటుంబ నియంత్రణ, రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చి మళ్లీ నగరంలోనే వదిలేస్తుండడతో కుక్కల సంఖ్య యఽథావిధిగానే ఉంటోంది. జంతు సంరక్షణ చట్టం (ఏడబ్ల్యూపీఐ) 1960 , 2023 నిబంధనల ప్రకారం ఇదంతా చేస్తున్నా జనాలు మాత్రం కుక్కలు తీసుకెళ్లి మళ్లీ ఇక్కడే వదిలేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ నగరంలో మొత్తం 28,460 వీధి కుక్కలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఓవైపు ఢిల్లీలో వీధి కుక్కల్ని డాగ్ షెల్టర్లకు తరలిస్తుంటే ఎవరైనా అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మన కార్పొరేషన్ పరిధిలోనూ వీధి కుక్కల్ని డాగ్ షెల్ట ర్లకు శాశ్వతంగా తరలించే కార్యక్రమం చేపట్టాలనే డిమాండ్ నగరవాసుల నుంచి వస్తోంది. అదే సమయంలో జంతు ప్రేమికులు మాత్రం వీధి కుక్కల పట్ల కఠినంగా ఉండొద్దని, కాటు వేసే కుక్కల్ని గుర్తించి రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చి సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటున్నారు. ఇటు జనాలు, అటు జంతు ప్రేమికుల మధ్యలో కార్పొరేషన్ నలిగిపోతుందనే చర్చ నడుస్తోంది. ఇక్కడ కూడా నగర శివారుల్లో డాగ్ షెల్టర్ జోన్లు పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కంట్రోల్లోకి తెచ్చేందుకు మహా ప్రయత్నం వాస్తవానికి ఆరు నెలలు దాటి ఏడాది వయస్సున్న కుక్కల్ని కుటుంబ నియంత్రణకు బల్దియా అధికారులు తీసుకెళ్తున్నారు. దాదాపు 12 నుంచి 15 సంవత్సరాలు బతికే ఈ కుక్కలకు ఒక్కో ఆడ కుక్క ఏడాదికి రెండు ఈతలు.. దాదాపు 16 కుక్కపిల్లలకు జన్మనిస్తుంది. అంటే ఐదేళ్లలో ఒక్కో కుక్క 90 పిల్లల వరకు జన్మనిస్తుంది. గతేడాది 2024–25 సంవత్సరంలో రూ.68 లక్షలకుపైగా ఖర్చు చేసి 6,154 కుక్కలకు కుటుంబ నియంత్రణతో పాటు రేబిస్ వ్యాక్సిన్లు ఇచ్చారు. మూడురోజుల పాటు సంరక్షించాక జనావాసాల్లోకి వదిలారు. కొన్ని సంవత్సరాలుగా వేలల్లో ఉన్న కుక్కలకు కుటుంబ నియంత్రణతో కంట్రోల్లోకి తేగలిగామని, ఇప్పటికి వాటిపైనే దృష్టి కేంద్రీకరించామని చెబుతున్నారు. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాల్లో బహిరంగ ప్రాంతాలతో పాటు పాఠశాలల్లో అవగాహన కల్పిస్త్తున్నామంటున్నారు. ఫిర్యాదు చేయాలంటే.. కుక్క కాటు వేస్తే 18004251980తో పాటు ప్రజారోగ్య అధికారి ఫోన్ నంబర్ 9701999689, మున్సిపల్ ఆరోగ్య అధికారి ఫోన్ నంబర్ 97019 99639 పశువైద్యాధికారి ఫోన్ నంబర్ 97019 99701కు వాట్సాప్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చు. ప్రతీరోజు 12 నుంచి 15 ఫిర్యాదులొస్తున్నాయి. షెల్టర్ జోన్లకు కుక్కలను తరలించేందుకు 12మందితో మూడు బృందాలు పనిచేస్తున్నాయి. శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేయాలి... గ్రేటర్ వరంగల్తో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో జూన్, జూలై నెలల్లోనే 712 కుక్క కరిచిన ఘటనలు నమోదయ్యాయి. కార్పొరేషన్ పరిధిలో పట్టుబడిన వీధి కుక్కలకు శాశ్వత ఆశ్రయ గృహాలు ఏర్పాటు చేసి, అక్కడే ఉంచి ఆహారం, వైద్యసేవలు అందించాలి. –మండల పరశురాములు, అధ్యక్షుడు, అభ్యుదయ సేవా సమితి, వరంగల్ ‘గ్రేటర్’ పరిధిలో వీధి కుక్కల బెడద ప్రజావాణిలో ఒక్కరోజే నాలుగు ఫిర్యాదులు వీధులనుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని వినతి జంతు సంరక్షణ చట్టం నిబంధనలతోనే బల్దియాకు మహా సంకటస్థితి ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో కుక్కలపై సుప్రీం ఆదేశాల నేపథ్యంలో చర్చ ఇక్కడ కూడా డాగ్ షెల్టర్ జోన్లు పెంచితే మంచిదంటున్న జనం ఢిల్లీలోని నేషనల్ క్యాపిటల్ టెరీటరీతోపాటు నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో అన్ని వీధి కుక్కలను డాగ్ షెల్టర్లకు ఎనిమిది వారాల్లో తరలించాలి. ఈనేపథ్యంలో వీధి కుక్కలను అధికారులు తీసుకెళ్లకుండా ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ అడ్డుకుంటే, వారు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’. – తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు ‘కాజీపేటలోని ప్రశాంత్ నగర్, కాకతీయ కాలనీ ఫేజ్–టు, వరంగల్లో రంగశాయిపేట, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో వీధి కుక్కల్ని తీసుకెళ్లాలి. వరుస కాట్లతో ఇబ్బందులు పడుతున్నాం. ఈ బెడద నుంచి కార్పొరేషన్ అధికారులు తప్పించాలి.– సోమవారంనాటి బల్దియా ప్రజావాణిలో వచ్చిన నాలుగు ఫిర్యాదులు -
వెహికల్ ట్రాకింగ్ యాప్పై అవగాహన అవసరం
బల్దియా కమిషన్ చాహత్ బాజ్పాయ్రామన్నపేట : వెహికల్ ట్రాకింగ్ అప్లికేషన్పై శాని టరీ ఇన్స్పెక్టర్లకు అవగాహన అవసరమని కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. సోమవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల ఐసీసీసీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు. వాహనాల ట్రాకింగ్ తీరును అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ వాహనాల స్థితిగతులను నమోదు చేసుకుని పూర్తినివేదికను తనకు అందజేయాలన్నారు. అదేవిధంగా హనుమకొండ బాలసముద్రంలోని వెహికల్ షెడ్డును తనిఖీ చేశారు. వెహికల్ షెడ్డు ప్రాంతంలో గుడిసెవాసులకు డబుల్బెడ్రూం ఇళ్లు కేటాయించిన నేపథ్యంలో ఆ ప్రాంతంలో శానిటేషన్ వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఖానాపురం: వ్యవసాయంలో పురాతన పద్ధతులను అలవర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా రైతులతో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ఎంఎన్ఎఫ్ (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫామింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరంగల్ జిల్లావ్యాప్తంగా 13 మండలాలున్నాయి. ఒక్కో మండలంలో వ్యవసాయ అధికారి పరిధిలో క్లస్టర్ల విభజన కావడంతో విస్తరణ అధికారులు సైతం విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 57 క్టస్టర్లు ఉన్నాయి. ఇందులో పది గ్రామాలను, వీటి పరిధిలో 1,250 మంది రైతులను ఎంపిక చేశారు. జిల్లాలో 625 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయానికి భూములను గుర్తించారు. ప్రకృతి వ్యవసాయానికి చర్యలు ఎన్ఎంఎన్ఎఫ్ కార్యక్రమం ద్వారా మండలానికి ఒక క్లస్టర్ను ఎంపిక చేసి వాటి పరిధిలో ఉన్న రైతులను గుర్తించి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం చేయించడానికి చర్యలు చేపట్టారు. ఒక్కో క్లస్టర్కు 125 మందితో సేంద్రియ వ్యవసాయం చేయించనున్నారు. ఇప్పటికే ఎంపిక చేసిన క్లస్టర్ల పరిధిలో రైతులను గుర్తించి వారికి అవగాహన సమావేశాల్ని సైతం ఏర్పాటు చేశారు. ఎంపిక చేసిన రైతులకు సంబంధించిన భూముల వద్దకు వెళ్లి భూసార పరీక్షలు చేసి ల్యాబ్లకు సైతం పంపించారు. నేలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు జీవవైవిద్యాన్ని పెంచడానికి భూమి సహజ వనరులను పరిరక్షించడానికి పథకం ద్వారా రైతులకు వివరించనున్నారు. ప్రకృతి, సేంద్రియ సేద్యం చేయిస్తూ.. సహజ పద్ధతిలో సాగు చేయించడానికి అధికారులు రైతుల్ని సిద్ధం చేస్తున్నారు. మహిళల ఎంపిక రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయించడానికి రైతులను ఇప్పటికే సిద్ధం చేశారు. ఎంపిక చేసిన క్లస్టర్లలో 125 మందిలో మహిళలను సైతం ఎంచుకున్నారు. ఒక్కో క్లస్టర్ నుంచి ఇరువురు మహిళలను ఎంపిక చేస్తున్నారు. జిల్లాలో 20 మంది మహిళల వివరాలు సేకరించారు. వీరు మహిళా సంఘాలతో అనుబంధం ఉండేలా చూస్తున్నారు. ఎంపిక చేసిన మహిళలకు ‘కృషి, సఖి’లుగా నామకరణం చేయనున్నారు. వీరికి సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు. జిల్లా స్థాయిలో ప్రతీ సమావేశానికి ఇరువురు మహిళలు హాజరుకావాల్సి ఉంటుంది. వీరు వాళ్ల క్లస్టర్ పరిధిలో ఎంపిక చేసిన రైతుల వద్దకు వచ్చి వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడంతో పాటు ఇతర రైతులతో చేయించేలా వీరు కృషి చేయాల్సి ఉంటుంది. రైతులతో చేయించేందుకు వీరికి గౌరవ వేతనం సైతం ఇవ్వనున్నారు. ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు మూడేళ్ల పాటు సాగు ఎన్ఎంఎన్ఎఫ్ పథకం కింద ఇన్పుట్ సబ్సీడీలను సైతం రైతులకు అందిస్తూ ప్రోత్సహించనున్నారు. మూగబోయిన మహిళా చైతన్య దీప్తి హనుమకొండకు చెందిన ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత సోమవారం గుండెపోటుతో కన్ను మూశారు. ఆమె మృతిపై సాహిత్యాభి మానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.– 8లోuన్యూస్రీల్జిల్లావ్యాప్తంగా 1,250 మంది రైతుల ఎంపిక ఒక్కో క్లస్టర్కు 125 మంది అందులో 20 మంది మహిళలకు అవకాశం మహిళలకు ‘కృషి, సఖి’లుగా నామకరణం 625 ఎకరాల భూమి గుర్తింపు యూనిట్కు ఇన్పుట్ సబ్సిడీలు ఎంపిక చేసిన గ్రామాలివే.. జిల్లా వ్యాప్తంగా పది గ్రామాలను ఎంపిక చేశారు. ఇందులో ఖానాపురం మండలంలోని చిలుకమ్మతండా, పర్శతండా, మంగళవారిపేట, నల్లబెల్లి మండలంలోని గోవిందాపురం, కొండాపూర్, నెక్కొండ మండలంలోని రెడ్లవాడ, పెద్దకొర్పోలు, దుగ్గొండి మండలంలోని రాజ్యతండా, నర్సంపేట మండలంలోని ముత్తోజిపేట క్లస్టర్ పరిధిలోని లైన్తండా, రాయపర్తిలోని వాంకుడోతు తండాలను ఎంపిక చేశారు. -
మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025
● 2015 నుంచి 2,481 మంది చిన్నారులకు విముక్తి ● బాలకార్మిక రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: పోలీసులు, అధికారులుబాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ప్రతీ ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరిట 2015 నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బడీడు పిల్లలు బడిలో ఉంటేనే ఆకుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాలను యజ్ఞంలా చేపడుతున్నారు. 2015 నుంచి 2016వ సంవత్సరం వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా, 2017 నుంచి 2021 వరకు వరంగల్ అర్బన్ జిల్లాలో, 2022 నుంచి 2025 సంవత్సరం వరకు హనుమకొండ జిల్లాలో 2,481 మంది చిన్నారులకు పనినుంచి విముక్తి కల్పించారు. డివిజన్కు 8 మంది సభ్యుల బృందం.. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతీ డివిజన్లో ఎస్సై, సహాయ కార్మికశాఖ అధికారి, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, మహిళా పోలీస్ కానిస్టేబుల్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధి కారి, చైల్డ్లైన్ అధికారులు బృందంగా పని చేస్తున్నారు. 14 ఏళ్లలోపు చిన్నారులను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేస్తున్నారు. చట్టాలు ఇలా.. చిన్నారులను పనిలో పెట్టుకుని శ్రమ దోపిడీకి గురి చేసే యజమానులపై బాలకార్మిక వ్యవస్థ నిషేధ, నియంత్రణ చట్టం 1996 (సవరణ 2016లో మా ర్పు చేసి చట్టాన్ని ది చైల్డ్ అండ్ అడాల్సెంట్ లేబర్ యాక్ట్ 1986) జువైనల్ జస్టిస్ యాక్ట్లు పరిగణనలోకి వస్తాయి.బాలకార్మికులను ప్రోత్సహిస్తూ తొలి సారి పట్టుబడితే ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.20 వేలు నుంచి 50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి అదే తప్పిదం జరిగితే ఏడాది పాటు జైలు శిక్షతో పాటు రూ.50 వేల నుంచి లక్ష వరకు జరిమానా విధిస్తారు. బాలకార్మిక వ్యవస్థ రహిత సమాజమే లక్ష్యం ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ద్వారా బాల కార్మిక వ్యవస్థ రహిత సమాజ నిరా్మాణమే లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. బడీడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు ఇతర రాష్ట్రాల పిల్లలను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు కృషి చేస్తున్నాం. – జయంతి, సీ్త్ర, శిశు సంక్షేమాధికారి, హనుమకొండ జిల్లా న్యూస్రీల్‘ఆపరేషన్ స్మైల్.. ఆపరేషన్ ముస్కాన్’తో చిన్నారులకు భరోసా‘బాలలు ఉండాల్సింది బడిలో.. పనిలో కాదు’ ఈ నినాదంతో దూసుకెళ్తున్నారు వరంగల్ కమిషరేట్ పరిధి పోలీసులు, ఇతర శాఖల అధికారులు. బాలల బంగారు భవిష్యత్ను రక్షిస్తూ వారి పెదాల్లో చిరునవ్వులు విరబూయిస్తున్నారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ పేరిట విస్తృత తనిఖీలు చేపడుతూ.. బాలలకు పని నుంచి విముక్తి కల్పిస్తూ బడిలో చేర్పిస్తున్నారు. – కాజీపేట అర్బన్హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇలాఆపరేషన్ స్మైల్సంవత్సరం బాలురు బాలికలు కేసులు 2022 జనవరి 96 16 2 2023 జనవరి 86 9 4 2024 జనవరి 32 3 1 2025 జనవరి 25 6 2 ఆపరేషన్ ముస్కాన్.. సంవత్సరం బాలురు బాలికలు కేసులు 2022 జూలై 86 9 4 2023 జూలై 38 9 2 2025 జూలై 36 8 4 వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా ఈఏడాది జూలైలో 177 మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. వీరిలో 149 మంది బాలలు, 28 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 97 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరిని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
గూడు కరువు.. టెంటే ఆదెరువు
● నిలువ నీడలేక టెంట్కిందే మృతదేహందుగ్గొండి: నాలుగు గుంజలు. వాటి చుట్టూ పరదా. గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయే పరిస్థితి. వానపడినంత సేపూ బిక్కుబిక్కుమంటూ కాళ్లు ముడుచుకుని కూచోవాల్సిందే. అలాంటి నిరుపేద అనారోగ్యంతో మృతి చెందాడు. చివరికి అతడికి టెంట్ నీడే గతి అయ్యింది. దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రామగిరి రవి(50) అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. కూలీ పని చేసుకుని పొట్టపోసుకునే రవికి ఎలాంటి ఆస్తులు లేవు. నాలుగు గుంజలు పాతి పరదా కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో అతడు మృతి చెందడంతో ఆరుబయట టెంట్ వేసి మృతదేహాన్ని ఉంచారు. ఈ దృశ్యం అందరినీ కలచివేసింది. భార్య కళావతి, కుమారుడి రోదనలు మిన్నంటాయి. రామగిరి రవి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. ఇప్పటి వరకు అతడి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందలేదు. -
అమరధామం.. కళావిహీనం
పరకాల: నిజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ యోధుల ప్రతిమలతో పర్యాటకులను ఆకట్టుకుంటున్న అమరధామం నిర్లక్ష్యానికి గురవుతోంది. కేంద్ర మాజీ మంత్రి చెన్నమనేని విద్యాసాగర్రావు తల్లి చంద్రమ్మ స్మారకార్థం పరకాలలో నిర్మించిన అమరధామం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సి ఉండగా.. రోజురోజుకూ నిర్లక్ష్యానికి గురవుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పచ్చని గార్డెన్తో అమరధామం 2003లో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఈఅమరధామాన్ని సందర్శించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. అమరధామం నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ తీసుకున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు. రాత్రి వేళల్లో చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. పచ్చదనం కనుమరుగవుతోంది. పశువులకు ఆవాసంగా మారుతోంది. పంచాయితీలకు అడ్డగా నిలుస్తోంది. దీంతో అమరధామాన్ని చూసేందుకు వస్తున్న పర్యాటకులకు అక్కడి వాతావరణం ఇబ్బందిని కలిగిస్తోంది. విరుగుతున్న విగ్రహాలు అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు కొందరు విగ్రహాల మధ్యలోంచి అమరధామం లోపలికి చొరబడుతున్నారు. రాత్రి వేళల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపయోగం ఓపెన్ జిమ్ లక్షలాది రుపాయలు వెచ్చించి అమరధామం పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు పూర్తిగా విరిగిపోయాయి. 15 రకాల ఓపెన్ జిమ్ పరికరాల్లో కేవలం 2 మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. అదే విధంగా పార్క్లో లైటింగ్ సదుపాయం లేకపోవడంతో అమరధామం ప్రాంతమంతా చీమ్మ చీకట్లు కమ్ముకుంటోంది.శిథిలమవుతున్న విగ్రహాలు.. నిరుపయోగంగా ఓపెన్ జిమ్ పంచాయితీలు, పశువులకు అడ్డా పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో పాలకుల విఫలంపర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి.. మరో జలియన్ వాలాబాగ్ ఘటనను స్మరించుకుంటూ దేశంలో ఎక్కడ లేని విధంగా పరకాలలో నిర్మించిన అమరధామం అభివృద్ధిపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారు. నేటి పాలకులైనా అమరధామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఓపెన్ జిమ్తో పాటు చిన్నారులు ఆడుకునేందుకు పార్కు ఏర్పాటు చేయాలి. – ఎడ్ల సుధాకర్, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ నాయకుడు, పరకాల -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాకులగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయిలో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్లు ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాసిటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచా ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు.కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంప్హౌస్ పరిశీలన -
అవినీతిలో కూరుకుపోయిన హెచ్సీఏ
రామన్నపేట: పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరం గురువారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్ నగరంలోని ఐఎంఏ హాల్లో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి జైపాల్ సమన్వయంతో టీసీఏ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గురువారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ క్రికెట్ అభివృద్ధి కోసం టీసీఏ ఎన్నో ఏళ్లుగా చేస్తున్న కృషికి గుర్తింపు ఇవ్వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను క్రికెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2021 జూలై బీసీసీఐ ఇచ్చి కోలాబరేషన్ ఆదేశాలను హెచ్సీఏ పాటించలేదని బాంబే హైకోర్టు కంటెంప్ట్ ఆదేశాల ప్రకారం 29 మార్చి 2025న జరిగిన హెచ్సీఏ–టీసీఏ చర్చలకు తుదిరూపం ఇవ్వకపోవడం ద్వారా హెచ్సీఏకి తెలంగాణ క్రికెట్ అభివృద్ధిపై చిత్తుశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. పొన్నాల జగన్, విజయ్చందర్రెడ్డి, సమీ, ఎండీ జాకీర్ హుస్సేన్, స్టీఫెన్, శరత్యాదవ్, ఎండీ.మోహిన్ పాల్గొన్నారు. టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి -
నేడు డీవార్మింగ్ డే
ఎంజీఎం: జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్లలోపు వారందరికీ నేడు (సోమవారం) డీవార్మింగ్ డే సందర్భంగా నులిపురుగుల నిర్మూలన కోసం అల్బెండజోల్ మాత్రలు వేయనున్నట్లు హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జిల్లాలో సుమారు 2,35,000 మంది 1–19 వయస్సు ఉన్న పిల్లలున్నారని, కలెక్టర్ సూచన మేరకు ప్రతీ అంగన్వాడీ కేంద్రం పరిధి పాఠశాల, కళా శాలకు ఒక అంగన్వాడీ కార్యకర్త, ఆశా, ఏఎన్ఎంలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో 623 మంది ఆశా కార్యకర్తలు, 201 ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, 780 మంది అంగన్వాడీ టీచర్లు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అఽధికారి మహేందర్ మాట్లాడుతూ 1, 2 ఏళ్ల వారికి సగం మా త్ర పొడి చేసివ్వాలని, 2 ఏళ్ల నుంచి ఆపై 19 ఏళ్ల వారందరికీ ఒక మాత్ర చప్పరించి లేదా నమిలి మింగించాలన్నారు. భోజనానంతరం వీరందరికీ మాత్రలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రేపు కేయూలో లైబ్రేరియన్స్ డేకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా), యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్ విభాగం, టీఎస్ లైబ్రరీ అసోసియేషన్ (టీఎస్ఎల్ఏ) ఆధ్వర్యంలో ఈనెల 12న లైబ్రేరియన్స్ డే నిర్వహించనున్నారు. ఈమేరకు కేయూ లైబ్రరీ ఇన్చార్జ్ ఐసాక్ ప్రభాకర్, టీఎస్ఎల్ఏ ట్రెజరర్ డాక్టర్ జి.రాజేశ్వర్కుమార్, కుల్పా ట్రెజరర్ ఎం.మనోహర్రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. క్యాంపస్లోని కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా వీసీ కె.ప్రతాప్రెడ్డి హాజరుకానున్నారు. కుప్లా అధ్యక్షుడు డాక్టర్ ఎ.నాగేశ్వర్రావు అధ్యక్షత వహిస్తారు. ‘రోల్ ఆఫ్ లైబ్రేరియన్స్ ఇన్ ది డిజిటల్ ఎరా’ అంశంపై లైబ్రరీ సైన్స్విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ కె.రమణయ్య కీలకోపన్యాసం చేస్తా రు. ‘రెలవెన్స్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్ ఇన్ది ఏజ్ ఆఫ్ ఐఐ’ అంశంపై కేయూ లైబ్రరీ మెంబర్ ఇన్చార్జ్, లైబ్రరీ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ రాధికారాణి ప్రసంగిస్తారు. కుల్పా జనరల్ సెక్రటరీ వి.కృష్ణమాచార్య, టీఎస్ఎల్ఏ జిల్లా జనరల్ సెక్రటరీ ఇ.సత్యనారాయణరావు పాల్గొంటారని వారు తెలిపారు. ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తున్న బీజేపీహన్మకొండ చౌరస్తా: ఓటు వ్యవస్థను ధ్వంసం చేస్తూ.. అధికారం కోసం బీజేపీ కొనసాగిస్తున్న తంతును బహిర్గతం చేయడమే తమ బాధ్యత అని కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. హనుమకొండలోని డీసీసీ భవన్లో పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ సందేశాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు వినిపించారు. బీజేపీ కనుసన్నల్లో కేంద్ర ఎన్నికల సంఘం నడుస్తూ, దొంగ ఓట్లను సృష్టించి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈవిషయంపై క్షేత్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు జాగ్రత్తగా ఉండాలని రాహుల్గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో సందేశాన్ని అందించారు. ఇందులో ఎమ్మెల్యేలు రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, మాజీ ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, పసునూరి దయాకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, జక్కుల రవీందర్, పోతుల శ్రీమన్నారాయణ, సయ్యద్ విజయ శ్రీ, వేముల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల బాధ్యులు బంక సరళ, బొమ్మతి విక్రమ్, దేవేందర్రావు, రామకృష్ణ, సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హేమాచలుడికి భక్తిశ్రద్ధలతో పూజలు మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆలయంలోని లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామి వారిని దర్శించుకున్నారు. పూజారులు పవన్కుమార్, ఈశ్వర్చంద్ స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. భక్తుల పేరిట గోత్రనామాలతో అర్చనలు జరిపారు. -
కొత్త కాల్వలకు మోక్షం
పరకాల: ‘శానిటేషన్ సవాల్’ శీర్షికన జూలై 2న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. పరకాల పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లోని బ్రహ్మణవాడ, గండ్రవాడ, వడ్లవాడలో డ్రెయినేజీ నిర్మాణానికి మున్సిపల్ కమిషనర్ సుష్మ చర్యలు చేపట్టారు. 30ఏళ్ల క్రితం నిర్మించిన పట్టణంలో ని కాల్వలు కూరుకుపోయాయి. దీంతో రోడ్లపై నుంచి మురుగునీరు పారుతోంది. వర్షాకాలమైతే పరిస్థితి మరీ అధ్వానం. ఈనేపథ్యంలో సాక్షి ప్రచురించిన కథనంపై స్పందిస్తూ స్థానిక ఎమ్మెల్యే రేవూ రి ప్రకాశ్రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ డ్రెయినేజీ లేక ఇబ్బందులు పడుతున్న కాలనీలకు ముందుగా డ్రెయినేజీ కాల్వలు చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ చర్యలు చేపట్టారు. నెల క్రితం ప్రతిపాదనలు చేపట్టారు. పనులు ప్రారంభం కావడంతో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అయ్యిందని స్థానికులు సాక్షికి ధన్యవాదాలు చెబుతున్నారు. -
బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలి
నర్సంపేట: తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును తక్షణమే పార్లమెంటులో పెట్టి ఆమోదం తెలపాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొరబోయిన కుమారస్వామి, హన్మకొండ శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈమేరకు పట్టణంలో ఆదివారం సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అట్టడుగు వర్గాలైన బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించకుండా అణచివేస్తూ దోచుకుంటున్నారని, అందుకు బీజేపీ పాలకులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నారని ఆరో పించారు. మనువాద రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలిపారు. జనాభాలో ఆరు శాతంలేని అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించి 50శాతం పైగా ఉన్న బీసీలకు కనీసం 62శాతం రిజర్వేషన్ చట్టాన్ని తీసుకురావడానికి అనేక అడ్డంకులు కల్పిస్తూ బీసీలకు తీరని అన్యా యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగి 42 శాతం బీసీ రిజర్వేషన్ను అసెంబ్లీలో తీర్మానించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుంటిసాకులతో ఆమోదించకుండా కాలయాపన చేస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీది బాలకృష్ణ, కలకోట అనిల్, వజ్జంతి విజయ, ఉదయగిరి నాగమణి, యాకలక్ష్మి, లక్ష్మి, లింగయ్య, వీరన్న, వెంకన్న, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. నర్సంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన -
నానో నయం!
నానో యూరియా, నానో డీఏపీ● ద్రవరూపంలో నానో యూరియా, డీఏపీ.. ● గుళిక ఎరువుల కంటే పంటలకు ఎంతో మేలు ● తగ్గనున్న ఖర్చు, పెరగనున్న దిగుబడి ● రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులుసంగెం: కేంద్రప్రభుత్వం గుళికల రూపంలో ఉన్న యూరియా, డీఏపీలకు బదులుగా ద్రవరూపంలో నానో ఎరువులు తయారు చేస్తున్నది. దీంతో రైతులకు ధర తక్కువ కావడమే కాదు రవాణా ఖర్చులు, తిప్పలు తప్పుతున్నాయి. అర లీటరు నానో యూరియా, డీఏపీ బాటిల్, ఒక్క యూరియా, డీఏపీ బస్తాతో సమానంగా పంటపై ప్రభావం చూపుతుందని మండల వ్యవసాయాధికారి సాగరిక చెబుతున్నారు. నానో ఎరువుల ఉపయోగం గురించి రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులతో పాటుగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రైతులు ఇప్పుడిప్పుడే నానో ఎరువులు వాడడానికి ముందుకు వస్తున్నారు. ధర తక్కువ.. అర లీటరు నానో యూరియా బాటిల్ గుళికల రూపంలో ఉన్న 45 కేజీల బస్తాతో సమానం. అదేవిధంగా అరలీటరు నానో డీఏపీ బాటిల్ 50 కేజీల బస్తాతో సమానం. ధర విషయానికోస్తే యూరియా బస్తా రూ. 267 కాగా నానో బాటిల్ కేవలం రూ 225 మాత్రమే. డీఏపీ బస్తా రూ.1,350లు కాగా నానో డీఏపీ రూ. 600 మాత్రమే. బహుళ ప్రయోజనాలు.. గుళికల రూపంలో ఉన్న యూరియా బస్తాను ఎకరం పొలంలో వాడడం వల్ల 60 శాతం మాత్రమే మొక్క గ్రహించగలుగుతుంది. మిగతా 40శాతం గాలిలో కలిసి వాయుకాలుష్యం ఏర్పడుతుంది. డీఏపీ బస్తాను దుక్కిలో వేయాల్సి ఉంటుంది. కాని కొందరు రైతులు పైపాటుగా వేయడంతో మొక్కలకు ఎలాంటి ఫలితం దక్కడం లేదు. ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, నానో డీఏపీలను నేరుగా గాని ఒక లీటరు నీటికి 4 ఎంఎల్ చొప్పున ఏదైనా పురుగుల మందులతో కలిపి పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలపై పిచికారీ చేసుకుంటే నేరుగా ఆకుల ద్వారా మొక్క వందశాతం గ్రహిస్తుంది. ఆకుల్లో కిరణజన్య సంయోగక్రియ ద్వారా వేర్లలో కణజాల వృద్ధికి ఉపయోగపడుతుంది. వర్షాభావ పరిస్థితులు, అధిక వర్షపాతంలోనూ నానో యూరియా, డీఏపీలను పంటలపై పిచికారి చేసుకోవచ్చు. పంట వేసిన 20–25 రోజుల్లో ఒకసారి, 40–45 రోజుల్లో మరోసారి పిచికారి చేసుకుంటే పంటల ఎదుగుదల బాగుంటుంది. రైతులు రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను దుక్కిలో వేసుకుని కలియదున్ని పంటలు సాగు చేసిన తర్వాత నానో ఎరువులను పంటలపై పిచికారీ చేస్తే అధిక దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం..గుళికల రూపంలో ఉన్న రసాయనిక ఎరువుల కంటే నానో ఎరువులు మేలు. పంటలకు పైపాటుగా నానో డీఏపీ అర లీటరు, నానో యూరియా అరలీటరులను ఎకరాకు రెండు దఫాలుగా పిచికారీ చేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. –సాగరిక, ఏఓ సంగెం -
దేవాదుల పనుల్లో నిర్లక్ష్యం వీడాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: గోదావరి జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటామని, దేవాదుల పనుల్లో కాంట్రాక్టర్లు, అధికారులు నిర్లక్ష్యం వీడాలని, పనులు పెండింగ్లో ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ను డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ బలరాంనాయక్తో కలిసి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సందర్శించారు. తుపాకులగూడేనికి హెలికాప్టర్లో చేరుకున్న మంత్రులకు మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ఆ తర్వాత సమ్మక్క బ్యారేజీ వద్ద 59 గేట్లను పరిశీలించారు. నీటి నిల్వలు ఏ మేరకు ఉన్నాయని, గేట్లు ఎన్ని ఎత్తి, ఎన్ని మూశారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్లో దేవాదుల పంపుహౌస్ వద్ద ఉన్న గోదావరి నీటి నిల్వలను పరిశీలించి మోటార్ల ఎన్ని నడుస్తున్నాయని, ఎంత నీరు ఎత్తిపోశారని ఆరా తీశారు. ఇరిగేషన్ ఈఎన్సీ వెంకటేశ్వర్రావు ప్రొజెక్టర్ ద్వారా మంత్రులకు దేవాదుల స్థితిగతులను వివరించారు. అనంతరం సమీక్షలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ గోదావరి జలాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఈ హైలీ ప్రాజెక్టును టీడీపీ, బీఆర్ఎస్ పూర్తి చేయలేదని పేర్కొన్నారు. అప్పుడు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు పూర్తి చేసేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. ఇరిగేషన్కు రూ.23వేల కోట్లు బడ్జెట్లో కేటాయిస్తే రూ.16 వేల కోట్లు వడ్డీలు కట్టేందుకే సరిపోతుందన్నారు. కావేరి, గోదావరికి అనుసంధానంగా 200 టీఎంసీల కెపాటీగల ఇచ్చంపల్లి, తుమ్మడిహెట్టి ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మంత్రులతో మాట్లాడి ఎన్ఓసీ కూడా తీసుకుంటామన్నారు. 6 లక్షల ఎకరాలకు సాగు నీరు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ 17 నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని లక్ష్యంగాపెట్టుకొని దేవాదుల ప్రాజెక్టు నిర్మించామని తెలిపారు. ఇప్పుడు దీని అంచనాలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. 16.38 టీఎంసీల నుంచి 17.38 టీఎంసీలకు పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రూ.16 కోట్లు దేవాదుల భూ నిర్వాసితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామన్నారు. 72 మీటర్ల నీటిని నిల్వ చేసుకొని మోటార్ల ద్వారా ఎత్తిపోసి రిజర్వాయర్ల నుంచి కెనాల్ ద్వారా సాగు నీరు అందిస్తామని తెలిపారు. ములుగు జిల్లాకు న్యాయం చేయాలి : మంత్రి సీతక్క ములుగు జిల్లాలో వంద కిలోమీటర్ల గోదావరి నీటి ప్రవాహం ఉందని మంత్రి సీతక్క అన్నారు. సమైక్య రాష్ట్రంలో ములుగుకు అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రంలో న్యాయం చేయాలని ఆమె కోరారు. రామచంద్రపురం గ్రావిటీ కెనాల్ ద్వారా పాకాల, కొత్తగూడెం నీటి సరఫరా చేయాలి. పొట్లాపురం కెనాల్ కోసం సంబంధిత ఫైల్ను ప్రభుత్వం వద్ద ఉందని, దానిని పరిశీలించి బడ్జెట్ ఇవ్వాలని, గౌరారం, మల్లూరు, రామప్ప, లక్నవరం ప్రాంతాల్లోకి రైతులకు నీరు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసి పంటలకు నీళ్లివ్వాలని కోరారు. సమీక్షలో ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్పాటిల్, ఇరిగేషన్ ఈఈ జగదీశ్, ములుగు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, కాంగ్రెస్ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, అప్సర్పాషా పాల్గొన్నారు. కాంట్రాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి అధికారుల పనితీరులో మార్పు రావాలి భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల వద్ద పంపుహౌస్ పరిశీలన -
‘నిమ్స్’ అధికారికి ఎంపీ బలరాం నాయక్ పరామర్శ
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి గ్రామంలో హైదరాబాద్ ‘నిమ్స్’ ఆస్పత్రి లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేశ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఆదివారం డాక్టర్ రమేశ్ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అలాగే బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, రిటైర్డ్ డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తిప్పారపు రవీందర్, కాంగ్రెస్ నాయకులు బొడిగె శోభన్బాబు తదితరులు మార్త రమేశ్ను కలిసి సానుభూతి ప్రకటించారు. ‘పాకాల’లో పర్యాటకుల సందడిఖానాపురం: మండలంలోని పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. విద్యార్థులకు వరుసగా రెండురోజులు సెలవులు కావడంతో నర్సంపేట డివిజన్తోపాటు వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు. తూముద్వారా లీకేజీ అవుతున్న నీటిలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో పిల్లలు ఆటలాడారు. బోటింగ్ చేస్తూ అందాలను వీక్షించారు. 26.5 ఫీట్లకు చేరిన నీరు.. పాకాల సరస్సు నీటిమట్టం 26.5 ఫీట్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు. కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి నీటిమట్టం వచ్చి చేరింది. మరో 3.8 ఫీట్ల నీరు చేరితే సరస్సు మత్తడిపోయనుంది. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి..నల్లబెల్లి: మండల కేంద్ర శివారు మూడుచెక్కలపల్లి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్టాండ్ ఆవరణలో మహిళలు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. 15 రోజులుగా తాగునీరు అందడంలేదని వాపోయారు. గ్రామంలో అధికారులు ఐదు బోర్లు వేశారని, కానీ తరచుగా రిపేర్లకు వస్తుండడంతో ఏ ఒక్క బోరు కూడా పనిచేయడం లేదన్నారు. సర్పంచ్ల పదవీ కాలం పూర్తి అయినా.. కొన్నాళ్లు మాజీ సర్పంచ్ పూల్సింగ్ బోర్ల మరమ్మతు పనులు చేయించి మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులతో పాటు ప్రస్తుతం చేపట్టిన పనులకు సైతం అధికారులు బిల్లులు చేయకపోవడంతో మరమ్మతు పనులు చేపించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించలేనని పంచాయతీ కార్యదర్శి సెలవులో వెళ్లినట్టు సమాచారం. రోడ్డు ప్రమాదంలో తొగర్రాయి వాసి మృతిదుగ్గొండి: ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు సాగర్ (23) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిలువేరు నారాయణ చిన్న కుమారుడు చిలువేరు సాగర్ మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ఓ డిఫెన్స్ అకాడమీలో కొంతకాలంగా శిక్షణ పొందుతున్నాడు. ఈక్రమంలో సాయంత్రం తన మిత్రులు రాకేశ్, విష్ణువర్ధన్తో కలిసి ఓ ఫంక్షన్కు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్కు ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్ననాటి నుంచి దేశానికి సేవ చేయాలన్న కల నెరవేరకుండానే మృత్యుఒడిలోకి చేరాడని సాగర్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
నీలినీడ లు
గీసుకొండలో బోనాలతో తరలివెళ్తున్న మహిళలు సంగెంలో పోచమ్మ గుడి వద్ద మొక్కులు సమర్పిస్తున్న భక్తులు మత్స్యసంఘాలకు సరఫరా చేసే చేపపిల్లలను పరిశీలిస్తున్న జిల్లా మత్స్యశాఖ అధికారి నాగమణి, తదితరులు (ఫైల్)● చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా? ● గతేడాది లక్ష్యానికి సగం మేరకే పంపిణీ ● ఈ ఏడాది కనీసం టెండర్ల ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం ● ఆలస్యం కావడం, నాసిరకం చేపపిల్లల పంపిణీతో మత్స్యకారులకు నష్టం ● నగదు బదిలీ చేస్తే మేలంటున్న మత్స్యసంఘాలు గీసుకొండ: జిల్లాలో మత్స్యకారులకు ఉచిత చేపపిల్లల పంపిణీపై నీలినీడలు అలుముకున్నాయి. వంద శాతం సబ్సిడీపై 2016లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపపిల్లల ఉచిత పంపిణీకి శ్రీకారం చుట్టినా సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేపపిల్లలు చేరిన దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా చేపపిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు నెల నడుస్తున్నా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీపై ఎలాంటి సంకేతాలు లేకపోవడంతో అసలు చేపపిల్లల పంపిణీ ఉన్నట్టా..లేనట్టా అనే సందేహాలు మత్య్సకారుల సంఘాల్లో తలెత్తుతున్నాయి. సకాలంలో చేపపిల్లలను చెరువుల్లో వదలనట్లైతే వాటి ఎదుగుదల సరిగా ఉండక తాము నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు టెండర్లకు సంబంధించి ప్రభుత్వం, మత్స్యశాఖ ఊసెత్తకపోవడంతో అసలు పథకాన్ని కొనసాగిస్తారా..? లేదా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదైనా ముందస్తుగా టెండర్లు పిలుస్తారని అనుకుంటే ఇప్పటివరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఎలాంటి కసరత్తు లేదు.. ప్రతీ ఏడాది వేసవి కాలం ముగిసే నాటికే ప్రభుత్వం చేపపిల్లలకు సంబంధించిన టెండర్లు పిలిచేది. గతేడాది ఊరించి..ఊరించి ఆలస్యంగా లక్ష్యానికి కోతపెట్టి సగం మేరకే చేపపిల్లలను పంపిణీ చేశారు. ఆలస్యం కావడంతో ఆ చేపపిల్లలు ఎదుగుదల లేక మత్స్యకారులు ఇబ్బందులు పడ్డారు. సమయానికి వదలకపోవడం వల్ల చేపల్లో ఎదుగుదల లేకపోవడంతో తమకు గిట్టుబాటు ధర రావడం లేదని అంటున్నారు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే పిల్లలను సకాలంలో చెరువుల్లో వదలాల్సి ఉంటుందని, అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృద్ధి జరిగి చేతికొస్తాయని అంటున్నారు. అలాంటి చేపలకే మార్కెట్లో మంచి ధర వస్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. టెండర్ల విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారి(డీఎఫ్ఓ)నాగమణిని ‘సాక్షి’ వివరణ కోరగా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఆగస్టు లోపు వదిలితేనే.. ఆగస్టులోపు చేపపిల్లలను చెరువుల్లో వదిలితే మంచిదని మత్స్యశాఖ అధికారులే చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియ ప్రతి ఏడాది ఆలస్యంగానే జరుగుతోంది. లోపాలను అధిగమించి ముందస్తుగా నిధులను సమకూర్చుకోవడంలో మత్య్సశాఖ విఫలం అవుతోందని విమర్శలు ఉన్నాయి. గతేడాది వర్షాకాలంలో జిల్లాలోని చెరువుల్లో లక్ష్యం మేరకు కాకుండా అందులో సగమే చేపపిల్లలను మత్స్య సంఘాల వారికి పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేయాల్సి ఉండగా అందులో సగమే, అది కూడా చాలా ఆలస్యంగా పంపిణీ జరిగిందని మత్య్ససంఘాల వారు అంటున్నారు. గతేడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండటం, అదను దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని మత్స్యసంఘాల వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు. సొంతంగా కొనుగోలుకు మొగ్గు చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏడాది ఆలస్యం అవుతుండటంతో పలు మత్స్యసంఘాల వారు నీరు చేరిన జలాశయాల్లో సొంత ఖర్చుతో చేపపిల్లలను కొనుగోలు చేసి వదులుతున్నారు. ఆంధ్రా ప్రాంతం నుంచి పెద్ద సైజు (ఫింగర్ లింగ్స్) చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదలడానికి సిద్ధం అవుతున్నారు. నగదు బదిలీ చేస్తే మేలు.. జిల్లాలో చాలా మత్స్యసంఘాలు ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై అందించే చేపపిల్లలు నాసిరకంగా ఉంటున్నాయనే అభిప్రాయంతో ఉన్నాయి. టెండర్లు దక్కించుకున్న వారు చేపపిల్లలను సరైన సంఖ్య మేరకు చెరువుల్లో వదటడం లేదని, ఆంధ్రా ప్రాంతం నుంచి నాసిరకం పిల్లలను తెచ్చి పంపిణీ చేస్తుండటంతో ఎదుగుదల సరిగా లేక నష్టపోతున్నామని చెబుతున్నారు. ఈ క్రమంలో నగదు బదిలీ చేస్తే తామే మేలైన రకం చేపపిల్లలను కొనుగోలు చేసి సకాలంలో చెరువుల్లో వదిలే అవకాశం ఉంటుందని, ఈ విషయమై ప్రభుత్వం ఆలోచించాలని అంటున్నారు. జిల్లాలో మొత్తం చెరువులు 702మత్స్య సంఘాల్లోని సభ్యులు 15,741 మందిమత్స్య సంఘాలు 184మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం12,910 హెక్టార్లు -
రాయలసీమ ఎత్తిపోతలు ఆపండి
సాక్షి ప్రతినిధి వరంగల్/ఏటూరునాగారం/మధిర: శ్రీశైలం ఎగువ భాగాన రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే నిలిపేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు సమీపంలో వైరా నదిపై రూ.600 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి భట్టి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ విడుదల చేస్తేనే లక్షల ఎకరాల భూమి సాగవుతోందని, పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 11 టీఎంసీలు తరలిస్తే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు సైతం 25 రోజుల్లోనే ఖాళీ అవుతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వల్లనే ఏపీలో బనకచర్ల, శ్రీశైలం లిఫ్ట్ ఆగిపోయాయని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ వల్లే నష్టం..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కారు కలిసి దొంగచాటుగా ఆర్డినెన్స్ తెచ్చి భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఏపీలో కలిపి, గిరిజనులకు చెందిన 2 లక్షల ఎకరాలు పోలవరానికి ధారాదత్తం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. గిరిజనులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా పోలవరం ఎత్తు తగ్గించి రెండు లక్షల ఎకరాలను కాపాడాలని ఏపీ సీఎంను డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు పూర్తయ్యాక నికర జలాలు, వరద జలాల వాటా తేలాకనే బనకచర్ల ప్రస్థావన తీసుకురావాలని స్పష్టంచేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మధిర నియోజకవర్గంలోని 30 గ్రామాలను నాగార్జునసాగర్ రెండో జోన్లోకి మార్చి, రూ.600 కోట్లతో జవహర్ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇచ్చిందని తెలిపారు. అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టు దేవాదులరాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టు దేవాదుల అని భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్రెడ్డి తెలిపారు. ములుగు జిల్లా దేవాదుల చొక్యారావు ఎత్తిపోతల పథకం, సమ్మక్క–సాగర్ బరాజ్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి వారు ఆదివారం పరిశీలించారు. ముందుగా 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాదుల పంపుహౌస్ వద్ద సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి, ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూమి సేకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 28 వేల ఎకరాల భూ సేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూ నిర్వాసితులకు చెల్లించేందుకు రూ.67 కోట్లు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మరింత భూ సేకరణ కోసం రూ.179 కోట్ల వరకు అవసరమని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్ను కూల్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతేనని ఆరోపించారు. ఇచ్చంపల్లి తుమ్మిడిహెట్టి బరాజ్ను రూ.38 వేల కోట్లతో కట్టి తీరుతామని భట్టి, ఉత్తమ్ స్పష్టం చేశారు. కాగా, దేవాదుల నుంచి వేరే ప్రాంతాలకు నీళ్లు తీసుకపోతున్నారని, తన నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు. రామప్ప– లక్నవరంను అనుసంధానిస్తూ కెనాల్ నిర్మించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు దొంతి మాధవరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, కడియం శ్రీహరి, నాగరాజు, మురళీనాయక్, ఇరిగేషన్ కమిషనర్ ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా చర్యలు
వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి న్యూశాయంపేట: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ సింగరేణి సీఎండీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్స్టలేషన్పై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల వివరాలతో నిర్ణీత నమూనా ప్రకారం నివేదిక రూపొందించి వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల వివరాలను సేకరించి అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో పరీక్షల్లేవు
● కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో రసాయనాల పంపిణీ నిలిపివేత ● ఇదే అదునుగా దండుకుంటున్న దళారులు ● ఆటో ఎనలైజర్ పరికరంలో సాంకేతిక లోపం ● ‘ప్రైవేట్’ను ఆశ్రయిస్తున్న రోగులు ● నిండుకుంటున్న నిల్వలు.. ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలోని ఓ విభాగంలో నెలకొన్న సమస్య పరిష్కరించేలోపే మరో సమస్య తెర మీదకు వస్తోంది. రాష్ట్ర స్థాయిలో రావాల్సిన కోట్లాది రూపాయల బడ్జెట్ రాకపోవడంతో ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి గతంలో రసాయనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు.. ప్రస్తుతానికి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో రసాయనాలు సరఫరా చేయలేమంటూ ఖరఖండిగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా రసాయనాల లేమితో పలు రక్త పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు వందల సంఖ్యలో ప్రైవేట్కు తరులుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేస్తూ.. వైద్యం పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఈక్రమంలో రసాయనాల లేమికి తోడు ఓపీ విభాగంలో వందలాది మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే ఆటో ఎనలైజర్ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఏయే రక్త పరీక్షలు చేస్తున్నారో, చేయడం లేదో అయోమయ స్థితి నెలకొంది. పేద రోగులను దోచుకునేందుకు దళారులు, కొంత మంది వైద్యులు ఎంజీఎం ఆస్పత్రిని అడ్డాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ వైపు చూపు.. ఎంజీఎం ఆస్పత్రిలో పూర్తి స్థాయి చేయకపోవడంతో వందలాది మంది రోగులు ప్రైవేట్కు పరుగులు పెడుతున్నారు. ఓ పక్క రసాయనాల లేమి.. మరో పక్క ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపంతో ఆస్పత్రికి కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తున్న దళారులకు వరంగా మారింది. నిత్యం ఓపీ రోగులతో పాటు, ఐపీ రోగుల వద్ద నుంచి స్వయంగా వార్డులోకి వచ్చి శాంపిళ్లు సేకరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈక్రమంలో డబ్బులు లేని పేద రోగులు వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకుంటూ తర్వాత చూద్దాం లే అంటూ సగం వైద్యంతో తిరిగి వెళ్తున్న పరిస్థితి. ప్రైవేట్ ల్యాబ్లకు ఫోన్లు ఎంజీఎం వైద్యులే ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ శాంపిళ్లు పంపిస్తున్నారు. ఈక్రమంలో ఏ ల్యాబ్కు తన ద్వారా ఏన్ని శాంపిళ్లు వెళ్లాయో.. ఎంత మేర కమిషన్ తీసుకోవాలో లెక్కలు వేసుకుంటున్నట్లు చర్చ సాగుతుంది. నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుడు వార్డులోని రోగి వద్దకు వచ్చి స్వయంగా శాంపిల్స్ సేకరించిన ఘటనల చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో అదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తొంది. నిలిచిన రక్త పరీక్షలివే.. ఎంజీఎం ఆస్పత్రిలో కీలకమైన రక్తపరీక్షలు నిలిచిపోవడంతో రోగులకు తిప్పలుతప్పట్లేదు. ● కిడ్నీ వ్యాధులకు తప్పనిసరిగా చేయాల్సిన ఆర్ఎఫ్టీ పరీక్షలు ప్రధాన ల్యాబ్లో కాకుండా ఎమర్జెన్సీ ల్యాబ్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా బ్లడ్ యూరియా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్కు వెళ్లక తప్పడం లేదు. డయాలసిస్ రోగులకు ఈ పరీక్షలు తప్పనిసరి. ● సిరమ్ ఎలక్ట్రోలైడ్స్ను రోగి నడవలేని స్థితిలో మూర్ఛపోయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు చేసి అత్యవసర చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా సోడియం, వాటర్ లెవల్స్, పొటాషియం, క్లోరైడ్ వంటి శాతాన్ని గ్రహించి సోడియం ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి కీలకమైన ఎలక్ట్రోలైడ్స్ పరీక్షలు నిలిచిపోయి రోజులు గడుస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు గత్యంతరం లేక ప్రైవేట్కు పరుగులు పెడుతున్నారు. ● లిఫిడ్ ప్రొపైల్ పరీక్షల ద్వారా మనిషిలో ఏంత కొలెస్ట్రాల్ ఉంది. ట్రైగ్జిజర్ ద్వారా రక్తంలో నూనె శాతం ఎంత? వంటి అంశాలను గుర్తించి వైద్యం అందిస్తారు. పరీక్షల్లో బ్యాడ్ కోలోస్ట్రాల్, గుడ్ కోలోస్ట్రాల్ వంటి పరీక్షలు లేకపోవడంతో సీటీ రోగులకు తిప్పలు తప్పడం లేదు ● సిరం బెలిరుబిన్ వంటి పరీక్షలతో ప్రాణాంతకమైన పసకలకు వైద్యం అందిస్తారు. ఇందులో చేయాల్సిన డైరెక్ట్, ఇన్డైరెక్ట్ శాతాల పరీక్షల కోసం రసాయనాల కొరతతో ఇలాంటి పరీక్షలు సైతం కావట్లేదు. ●రోగి జబ్బుతో బాధపడుతున్న సమయంలో ఏ మేరకు ప్రొటీన్లు ఉన్నాయో తెలుసుకునే సిరమ్ ప్రోటీన్లు పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఇలాంటి కీలకమైన పరీక్షలే కాకుండా ఇంకా పదుల సంఖ్యలో రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. పరికరం అందుబాటులోకి వస్తుంది.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా గురువారం పలు రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించి అందుబాటులోకి తేస్తాం. – కిశోర్, సూపరింటెండెంట్ -
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈసందర్భంగా శేషు మాట్లాడుతూ.. పవిత్రోత్సవంతో ఆలయం, సకలజనులకు పవిత్రత చేకూరుతుందన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.ఆలయాల్లో ప్రత్యేక పూజలుహన్మకొండ కల్చరల్: రక్షాబంధన్, హయగ్రీవ జయంతి వేడుకలను పురస్కరించుకుని హనుమకొండ నగరంలోని ఆలయాల్లో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామికి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి రాఖీతో అలంకరించారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ వికాస్నగర్లోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో నిర్వాహకుడు ఆరుట్ల శ్రీనివాసాచా ర్యస్వామి హయగ్రీవ స్తోత్రపారాయణం, అర్చన నిర్వహించారు. -
సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా చర్యలు
● వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క న్యూశాయంపేట: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ సింగరేణి సీఎండీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్స్టలేషన్పై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల వివరాలతో నిర్ణీత నమూనా ప్రకారం నివేదిక రూపొందించి వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యశారద కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాల వివరాలు సేకరిస్తామని తెలిపారు. -
మరో ఏడు నెలలే..!
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. భూసేకరణే అసలు సమస్య.. దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకు భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ(సీతక్క), ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్కసాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పంపింగ్ స్టేషన్ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్లోనే హైదరాబాద్కు బయలుదేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్లైన్ 2026 మార్చి నాటికి పూర్తయ్యేనా.. భూసేకరణకు అడ్డంకులు ఇప్పటికే నాలుగు పర్యాయాలు ప్రాజెక్టుపై సమీక్ష 9 శాతం పెండింగ్తో అసంపూర్తి... రూ.17,500 కోట్లకు అంచనా... నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా ఐదుగురు మంత్రుల రాక సమ్మక్క బ్యారేజీ పరిశీలన.. అనంతరం అధికారులతో సమీక్ష9 జిల్లాలకు ప్రయోజనం.. ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. -
ఆలయాల్లో ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: రక్షాబంధన్, హయగ్రీవ జయంతి వేడుకలను పు రస్కరించుకుని శనివా రం వేయిస్తంభాల ఆలయంలో రుద్రేశ్వరస్వామి కి రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి రాఖీతో అలంకరించారు. హయగ్రీవ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ వికాస్నగర్లోని శ్రీగోదామాధవ ఆధ్యాత్మిక ప్రచార కేంద్రంలో నిర్వాహకుడు ఆరుట్ల శ్రీనివాసాచార్యస్వామి హయగ్రీవ స్తోత్రపారాయణం, అర్చన నిర్వహించారు. అదాలత్ వెనుక ఉన్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీవేంకశ్వరస్వామి ఆలయంలో సాయంత్రం అర్చకులు దేశికన్ స్వామివారికి కల్యాణం నిర్వహించారు. ఆలయక మిటీ సభ్యులు పాల్గొన్నారు. -
హర్ఘర్ తిరంగా వేడుకలు
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శనివారం హర్ఘర్ తిరంగా సెల్ఫీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీంతో రామప్పకు వచ్చే పర్యాటకులు, భక్తులు, విద్యార్థులు హర్ఘర్ తిరంగా నినాదంతో ఉన్న ఫ్లెక్సీలో నిలబడి సెల్పీలు తీసుకున్నారు. ఈ నెల 15న హర్ ఘర్ తిరంగా వేడుకలను కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించనుంది. స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్లో శిక్షణ తరగతులుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500లు ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు మేఘనరావు తెలిపారు. ఉర్సు విజయవంతానికి సమన్వయం అవసరంపశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కాజీపేట: అఫ్జల్ బియాబానీ దర్గా ఉత్సవాలను విజయవంతం చేయడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆదేశించారు. కాజీపేట మండలం దర్గా కాజీపేట అఫ్జ్జల్ బియాబానీ దర్గాలో అధికారులతో శనివారం రాత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో జరగనున్న దర్గా ఉత్సవాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మాజీ కార్పొరేటర్ ఎండీ.అబూబక్కర్, ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి, వెంకన్నతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కాజీపేటలో తరచూ ట్రాఫిక్ జామ్కాజీపేట: కాజీపేట చౌరస్తాలో శనివారం పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. రాఖీ పౌర్ణమి కావడంతో తోబుట్టువులకు రాఖీలు కట్టడం కోసం వేలాది మంది చౌరస్తా మీదుగా వివిధ వాహనాల్లో రాకపోకలు సాగించారు. దాంతో సిగ్నల్ పాయింట్ వద్ద రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇటు ఫాతిమానగర్ బ్రిడ్జి, అటు కడిపికొండ క్రాస్ రోడ్డు వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఒకసారి సిగ్నల్ పడి వాహనాలు ఆగితే ఆగిన వాహనాలు సిగ్నల్ దాటడానికి మూడుసార్లు సిగ్నల్ పడడం కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్న చర్యలు చేపట్టారు. అదనంగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించి వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. 108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి●● డీఎంహెచ్ఓ అప్పయ్య ఆత్మకూరు: 108 సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలో గురువారం 108 అంబులెన్స్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్లో వైద్య పరికరాలు, రికార్డులు పరిశీలించారు. అంబులెన్స్లో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని సిబ్బంది ఈఎంటీ రమేశ్, పైలట్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ 108 సిబ్బంది సమయానికి చేరుకొని వైద్యసేవలు అందించాలని, ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. -
‘సెల్ఫీ విత్ రాఖీ’కి అపూర్వ స్పందన
గీసుకొండ మండలం ధర్మారంలో తమ్ముడు రేయాన్ష్కు రాఖీ కడుతున్న అక్క సన్విత సంగెం మండలం తిమ్మాపూర్లో వంశీకృష్ణ, రాంచరణ్కు రాఖీ కట్టిన గజ్జెల సాత్విక, సాగరికరాఖీ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ నిర్వహించిన ‘సెల్ఫీ విత్ రాఖీ’ శీర్షికకు పాఠకుల నుంచి విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాల నుంచి రాఖీలు కడుతూ ఆడపడుచులు పంపించిన సెల్ఫీ ఫొటోల్లో మేలిమి కొన్నింటిని ఇక్కడ ప్రచురిస్తున్నాం.– మరిన్ని ఫొటోలు 9లోu -
ఆదివాసీల సంప్రదాయాలు కాపాడాలి
● కలెక్టర్ డాక్టర్ సత్య శారద నర్సంపేట: ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ అమరవీరుల స్తూపం నుంచి పాకాల రోడ్డులోని కొమురంభీం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ సత్యశారద హాజరై కొమురంభీం విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికత నేర్పింది ఆదివాసీలేనన్నారు. ప్రకృతిని దైవంగా భావించే సంస్కృతి ఆదివాసీ గిరిజనులదన్నారు. గిరిజన సంస్కృతీసంప్రదాయాలపై డాక్యుమెంటేషన్ పక్కగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని 13 మారుమూల గిరిజన గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించడంతోపాటు గ్రామాల్లో ఉన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఆదివాసీల హక్కులను కాపాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు,. అశోక్నగర్లోని కేజీబీవీ తనిఖీ ఖానాపురం: అశోక్నగర్లోని కేజీబీవీని శనివారం కలెక్టర్ సత్యశారద తనిఖీ చేశారు. స్టోర్రూం, పరిసరాలు పరిశీలించారు. ఫిర్యాదుల పెట్టెను తెరిచి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీటీడీఓ సౌజన్య, ఎంఈఓ శ్రీదేవి, స్పెషల్ ఆఫీసర్ మేనక తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి అమ్మవారికి పవిత్రోత్సవం
హన్మకొండ కల్చరల్: శ్రావణపౌర్ణమిని పురస్కరించుకుని భద్రకాళి దేవాలయంలో అమ్మవారికి శనివారం పవిత్రోత్సవం నిర్వహించారు. చివరి రోజు ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ఊర్ణసూత్రాల దండలను శాస్త్రోక్తంగా అమ్మవారిమూర్తి, స్నపనమూర్తులకు అలంకరించారు. పసుపు, ఎరుపు, నారింజ, నీలి, గులాబీ తదితర రంగుల ఊలు దారాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ పవిత్రోత్సవంతో ఆలయం, సకల జనులకు పవిత్రత చేకూరుతుందని అన్నారు. రక్షాబంధన విశిష్టతను వివరించారు. ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.అంగడి రోడ్డుపై డీపీఓకు ఫిర్యాదుగీసుకొండ: మండలంలోని కొమ్మాల అంగడి రోడ్డు నిర్మాణంపై కాంట్రాక్టర్ గుగులోత్ రాజు డీపీఓకు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ శనివారం అంగడి ద్వారా రూ.3 లక్షల నుంచి రూ. 4 లక్షల మేర ఆదాయం రావాల్సి ఉండగా తాజాగా రూ.1.30 లక్షలు మాత్రమే వచ్చిందని తెలిపాడు. ఫలితంగా తాము నష్టపోవాల్సి వస్తోందని డీపీఓకు విన్నవించాడు. రోడ్డు నిర్మాణ పనులను మధ్యలో ఆపివేసి ఆటంకం కలిగించడంతో రైతులు, కొనుగోలుదారులు అంగడికి రావడం లేదని పేర్కొన్నారు. డీపీఓ ఆదేశాల మేరకు ఎంపీడీఓ పాక శ్రీనివాస్ రోడ్డు, అంగడి ప్రాంతాన్ని పరిశీలించారు. తనకు న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీడీఓ హామీ ఇచ్చినట్లు కాంట్రాక్టర్ శ్రీనివాస్ తెలిపాడు. రైతుబీమాకు వివరాలివ్వాలిన్యూశాయంపేట: జిల్లా పరిధిలోని రైతులందరు రైతుబీమా చేయించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద శనివారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం రైతులకు రూ.ఐదు లక్షల బీమా చేయిస్తుందని తెలిపారు. 18–59 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, పట్టాదారు పాసుబుక్ ఉన్న రైతులు అర్హులన్నారు. గత సంవత్సరం బీమా చేయించుకున్న రైతులు నామిని పేరు, ఇతర సవరణలు చేసుకోవడానికి మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీలోగా పట్టాదారు పాస్బుక్, ఆధార్, నామిని వివరాల జిరాక్స్ ప్రతుల వివరాలు సంబంధిత వ్యవసాయాధికారికి సమర్పించాలని ఆమె సూచించారు. లక్ష్మీనర్సింహస్వామికి సహస్ర పుష్పార్చనగీసుకొండ: శ్రావణ మాసం మూడో శనివారం సందర్భంగా మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వామివారికి గులాబీ పూలతో సహస్ర పుష్పార్చన, పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు, అర్చకులు కాండూరి రామాచార్యులు, విష్ణు, ఫణీంద్ర, ఆలయ ఈఓ అద్దంకి నాగేశ్వర్రావు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వీరాటి రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్పోకెన్ ఇంగ్లిష్, స్కిల్స్లో శిక్షణ తరగతులుకేయూ క్యాంపస్: కేయూలోని సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్ (సెల్ట్) ఆధ్వర్యంలో 40 రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.మేఘనరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తమ పేర్లను ఈనెల 30 వరకు నమోదు చేసుకోవాలని ఆ యూనివర్సిటీ విద్యార్థులకు రూ.200, నాన్ టీచింగ్ ఉద్యోగులకు, మహిళలకు ఇతరులకు రూ.1,500 ఫీజు చెల్లించి ఈనెల 30 వరకు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి శిక్షణ తరగతులు నిర్వహిచనున్నట్లు పేర్కొన్నారు. -
మరో ఏడు నెలలే..!
సాక్షిప్రతినిధి, వరంగల్: జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి సర్కారు గడువు దగ్గర పడుతోంది. 2004లో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం కొబ్బరికాయ కొడితే.. సుమారు 21 ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చాక మొదట 2025 డిసెంబర్ నాటికి దేవాదుల సహా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మూడు పర్యాయాలు ‘దేవాదుల’పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి, మేలో ములుగు జిల్లా కన్నాయిగూడెం, హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా 2026 మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మరో ఏడు నెలలే గడువు ఉండడంతో మంత్రులు తరచూ పర్యటించి సమీక్షలు నిర్వహిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది. భూసేకరణే అసలు సమస్య.. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తికి మూడో దశలో పెండింగ్లో ఉన్న భూసేకరణే ఇప్పుడు అసలు సమస్యగా మారింది. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో మొత్తం 33,224 ఎకరాల భూసేకరణ అవసరం కాగా, దశలవారీగా 30,268 ఎకరాలు చేశారు. జనగామ, పాలకుర్తి, గజ్వేల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు 2,956 ఎకరాల వరకు భూ సేకరణ చిక్కుముడిగా మారింది. రోజురోజుకు భూముల ధరల పెరుగుతున్న నేపథ్యంలో రైతులు భూములు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, భూములు ఇచ్చిన కొందరు ధర గిట్టుబాటు కాలేదని కోర్టుకు వెళ్లడం లాంటి కారణాలతో ఏళ్లుగా పెండింగ్ పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే.. 2004లో రూ.6,016 కోట్లున్న అంచనా వ్యయం 2020 జూన్ నాటికే రూ.14,729.98 కోట్లకు పెరిగింది. 2024 ఆగస్టు నాటికి రూ.17,500 కోట్లు దాటిందని అంచనా వేశారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు 91 శాతం పూర్తయి, సగానికి పైగా ఆయకట్టుకు నీరందిస్తున్నా.. 9 శాతం పెండింగ్ పనులతో అసంపూర్తి ప్రాజెక్టుల ఖాతాలో చేరింది. మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి సీతక్క, ఇంజనీరింగ్ ఉన్నతాధికారులు ఆదివారం ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. సమాచార పౌరసంబంధాలశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మధ్యాహ్నం 3:45 గంటలకు ములుగు జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం హెలిపాడ్కు మంత్రులు చేరుకుంటారు. 3:50 గంటలకు సమ్మక్క–సాగర్ బ్యారేజీ, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పంపింగ్ స్టేషన్ను వారు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో మంత్రులు సమీక్ష నిర్వహిస్తారు. 6 గంటలకు హెలికాప్టర్లోనే హైదరాబాద్కు బయలుదేరుతారు. డిప్యూటీ సీఎం, మంత్రుల పర్యటన సందర్భంగా అధికారులు, పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తికి సర్కారు డెడ్లైన్ 2026 మార్చి నాటికి పూర్తయ్యేనా.. భూసేకరణకు అడ్డంకులు ఇప్పటికే నాలుగు పర్యాయాలు ప్రాజెక్టుపై సమీక్ష 9 శాతం పెండింగ్తో అసంపూర్తి... రూ.17,500 కోట్లకు అంచనా... నేడు డిప్యూటీ సీఎం, ఉత్తమ్ సహా ఐదుగురు మంత్రుల రాక సమ్మక్క బ్యారేజీ పరిశీలన.. అనంతరం అధికారులతో సమీక్ష9 జిల్లాలకు ప్రయోజనం.. ఏడాదిలో 300 రోజులు 60 టీఎంసీల నీటిని వినియోగించుకుని 9 జిల్లాల్లో 5.57 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టు పూర్తి కావడానికి మరో 9 శాతం పనులు మిగిలి ఉన్నాయి. హనుమకొండ, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, ములుగు జిల్లాలతోపాటు కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని 37 మండలాలకు చెందిన 5,56,722 ఎకరాలకు నీరందించడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు 3,16,634 ఎకరాల ఆయకట్టు సాగులోకి రాగా.. మరో 2,40,088 ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. అదనంగా మరో 89 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే, మూడో దశలో నిలిచిపోయిన భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు 21 ఏళ్లయినా అసంపూర్తిగానే ఉంది. రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్ చేయడం, కోర్టు కేసులు వంటివి భూసేకరణకు అడ్డంకిగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు 31న కన్నాయిగూడెం బ్యారేజీ వద్ద జిల్లా మంత్రులు, కలెక్టర్లు, ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. ఆర్థిక ఇబ్బందులున్నా అధిగమించి 2026 మార్చిలోగా ఈ పథకాన్ని పూర్తి చేస్తామని ప్రకటించారు. -
ఎంజీఎంలో పరీక్షల్లేవు!
ఎంజీఎం: ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిలోని ఓ విభాగంలో నెలకొన్న సమస్య పరిష్కరించేలోపే మరో సమస్య తెర మీదకు వస్తోంది. రాష్ట్ర స్థాయిలో రావాల్సిన కోట్లాది రూపాయల బడ్జెట్ రాకపోవడంతో ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రికి గతంలో రసాయనాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు.. ప్రస్తుతానికి పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో రసాయనాలు సరఫరా చేయలేమంటూ ఖరాఖండిగా చెబుతున్నారు. కొద్ది రోజులుగా రసాయనాల లేమితో పలు రక్త పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు వందల సంఖ్యలో ప్రైవేట్కు తరులుతున్నారు. వందలాది రూపాయలు ఖర్చు చేస్తూ.. వైద్యం పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఈక్రమంలో రసాయనాల లేమికి తోడు ఓపీ విభాగంలో వందలాది మంది రోగులకు రక్త పరీక్షలు నిర్వహించే ఆటో ఎనలైజర్ పరికరంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రిలో ఏయే రక్త పరీక్షలు చేస్తున్నారో, చేయడం లేదో అయోమయ స్థితి నెలకొంది. పేద రోగులను దోచుకునేందుకు దళారులు, కొంత మంది వైద్యులు ఎంజీఎం ఆస్పత్రిని అడ్డాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ వైపు చూపు.. ఎంజీఎం ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకపోవడంతో వందలాది మంది రోగులు ప్రైవేట్కు పరుగులు పెడుతున్నారు. ఓ పక్క రసాయనాల లేమి.. మరో పక్క ఆటో ఎనలైజర్ పరికరంలో ఏ ర్పడిన సాంకేతిక లోపంతో ఆస్పత్రికి కేంద్రంగా చేసుకుని దందా సాగిస్తున్న దళారులకు వరంగా మారింది.నిత్యం ఓపీ రోగులతో పాటు,ఐపీ రో గు ల వద్ద నుంచి స్వయంగా వార్డులోకి వచ్చి శాంపిళ్లు సేకరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఈక్రమంలో డబ్బులు లేని పేద రోగులు వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకుంటూ తర్వాత చూద్దాం లే అంటూ సగం వైద్యంతో తిరిగి వెళ్తున్న పరిస్థితి. ప్రైవేట్ ల్యాబ్లకు ఫోన్లు ఎంజీఎం వైద్యులే ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకులకు ఫోన్లు చేస్తూ శాంపిళ్లు పంపిస్తున్నారు. ఈక్రమంలో ఏ ల్యాబ్కు తన ద్వారా ఎన్ని శాంపిళ్లు వెళ్లాయో.. ఎంత మేర కమిషన్ తీసుకోవాలో లెక్కలు వేసుకుంటున్నట్లు చర్చ సాగుతోంది. నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్వాహకుడు వార్డులోని రోగి వద్దకు వచ్చి స్వయంగా శాంపిల్స్ సేకరించిన ఘట నల చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఎంజీఎంలో అదే తంతు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నిలిచిన రక్త పరీక్షలివే.. ఎంజీఎం ఆస్పత్రిలో కీలకమైన రక్తపరీక్షలు నిలిచిపోవడంతో రోగులకు తిప్పలుతప్పట్లేదు. ● కిడ్నీ వ్యాధులకు తప్పనిసరిగా చేయాల్సిన ఆర్ఎఫ్టీ పరీక్షలు ప్రధాన ల్యాబ్లో కాకుండా ఎమర్జెన్సీ ల్యాబ్లో మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇందులో కూడా బ్లడ్ యూరియా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్కు వెళ్లక తప్పడం లేదు. డయాలసిస్ రోగులకు ఈ పరీక్షలు తప్పనిసరి. ● సిరమ్ ఎలక్ట్రోలైడ్స్ను రోగి నడవలేని స్థితిలో మూర్ఛపోయే పరిస్థితుల్లో ఈ పరీక్షలు చేసి అత్యవసర చికిత్సలు అందించాల్సి ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా సోడియం, వాటర్ లెవల్స్, పొటాషియం, క్లోరైడ్ వంటి శాతాన్ని గ్రహించి సోడియం ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మనిషి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి కీలకమైన ఎలక్ట్రోలైడ్స్ పరీక్షలు నిలిచిపోయి రోజులు గడుస్తున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు గత్యంతరం లేక ప్రైవేట్కు పరుగులు పెడుతున్నారు. ● లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల ద్వారా మనిషిలో ఎంత కొలెస్ట్రాల్ ఉంది. ట్రైగ్జిజర్ ద్వారా రక్తంలో నూనె శాతం ఎంత? వంటి అంశాలను గుర్తించి వైద్యం అందిస్తారు. పరీక్షల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలోస్ట్రాల్ వంటి పరీక్షలు లేకపోవడంతో రోగులకు తిప్పలు తప్పడం లేదు ● సిరం బెలిరుబిన్ వంటి పరీక్షలతో ప్రాణాంతకమైన పసకలకు వైద్యం అందిస్తారు. ఇందులో చేయాల్సిన డైరెక్ట్, ఇన్డైరెక్ట్ శాతాల పరీక్షల కోసం రసాయనాల కొరతతో ఇలాంటి పరీక్షలు సైతం కావట్లేదు. ● రోగి జబ్బుతో బాధపడుతున్న సమయంలో ఏ మేరకు ప్రొటీన్లు ఉన్నాయో తెలుసుకునే సిరమ్ ప్రొటీన్లు పరీక్షలు సైతం నిలిచిపోయాయి. ఇలాంటి కీలకమైన పరీక్షలే కాకుండా ఇంకా పదుల సంఖ్యలో రక్త పరీక్షల కోసం రోగులు ప్రైవేట్కు పరుగులు పెట్టాల్సి వస్తుంది. అందుబాటులోకి వస్తుంది.. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ ద్వారా గురువారం పలు రసాయనాలు అందుబాటులోకి వచ్చాయి. ఆటో ఎనలైజర్ పరికరంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని పరిష్కరించి అందుబాటులోకి తెస్తాం. – కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో రసాయనాల పంపిణీ నిలిపివేత ఇదే అదునుగా దండుకుంటున్న దళారులు ఆటో ఎనలైజర్ పరికరంలో సాంకేతిక లోపం ‘ప్రైవేట్’ను ఆశ్రయిస్తున్న రోగులు నిండుకుంటున్న నిల్వలు.. -
వేగం పెంచాల్సిందే!
సాక్షి, వరంగల్: భూ భారతి దరఖాస్తుల పరిష్కారానికి ఆది లోనే గ్రహణం పట్టుకుంది. ఈ ఏడాది జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులో 57,850 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 54,904 నోటీసులు జారీ చేసిన అధికారులు 423 దరఖాస్తులు మాత్రమే పరిష్కరించారు. అయితే, భూభారతి దరఖాస్తుల్లో వచ్చిన వాటిల్లో 25 వేలు సాదాబైనామా, 16 వేల అసైన్డ్ దరఖాస్తులు కూడా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ అధి కారులు అంటున్నారు. ఇంకోవైపు సాదాబైనామా, పీఓటీల అంశం న్యాయస్థానం పరిధిలో ఉండడం కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి మరో కారణమని చెబుతున్నారు. వచ్చిన 57,850 దరఖాస్తుల్లో సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులు కలిపి 41 వేలు ఉండగా.. మిగిలిన 16,850 దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాల్సిన ఆ దిశగా అధి కారులు పనిచేయడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఆగస్టు 15వరకు ఈ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ మేరకు రెవెన్యూ అధికారుల పనితీరు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తప్పడం లేదు. పంద్రాగస్టుకు మరో ఐదు రోజులు మాత్రమే సమయం ఉండడం, ఇప్పటికే సిబ్బంది కొరత ఉండడంతో దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా తరచూ వివిధ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో తనిఖీలు చేస్తూ సిబ్బంది పనితీరు తెలుసుకునే ప్రయత్నం చేశారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించి త్వరగా క్లియర్ చేయాలని అధికారులు, సిబ్బందికి ఆమె ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న వర్ధన్నపేట మండలంలో వచ్చిన 2,917 దరఖాస్తుల్లో క్లియరైన వాటి సంఖ్య 50కి దాటకపోవడం గమనార్హం. భూరికార్డుల్లో పేర్ల తప్పులు, భూవిస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, వారసత్వ భూముల భూమార్పిడి, డిజిటల్ సంతకం, మ్యుటేషన్ పెండింగ్, భూ సర్వే నంబర్ లేకపోవడం తదితర భూసమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలన్న కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశాలతో ఇప్పుడూ రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. పంద్రాగస్టులోపు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలించి తమ వద్ద పెండింగ్లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేసే దిశగా పనిచేస్తున్నారు. అయితే, సాదాబైనామా, అసైన్డ్ దరఖాస్తులు పోగా మిగిలిన 16,850 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 423 మాత్రమే పరిష్కరించిన అధికారులు మిగిలిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తే ప్రజలకు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధలు తప్పనున్నాయి. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి గడువు ఈనెల 15 జిల్లాలో 41వేలు సాదాబైనామా, అసైన్డ్ అప్లికేషన్స్ మిగిలిన 16,850 అర్జీల్లో క్లియరైనవి 423 క్షేత్రస్థాయిలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనిఖీలు ప్రజావాణిలో కూడా ఇవే ఫిర్యాదులు.. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి కూడా భూసమస్యలపైనా ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 133 దరఖాస్తులు వస్తే రెవెన్యూకు సంంబంధించినవే 49 ఉండడం గమనార్హం. ఇలా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావా ణికి వచ్చేవి రెవెన్యూ విభాగ సమస్యలే ఎక్కువగా ఉండడంతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్షేత్రస్థాయిలో తహసీల్దార్ కార్యాలయాలు తనిఖీలు చేస్తున్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పరిష్కరించారు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు కారణాలేంటి అని లోతుగా ప్రశ్నిస్తున్నా రు. దీంతో భూభారతి దరఖాస్తుల పరిష్కారం కాస్త పట్టాలెక్కుతోంది. కలెక్టర్ డాక్టర్ సత్యశారద పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే చాలా వరకు భూసమస్యలు పరిష్కరం కానున్నాయి. -
తగ్గుతున్న సన్నబియ్యం ధరలు
సాక్షి ప్రతినిధి, వరంగల్/నిజామాబాద్: రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి. రేషన్కార్డు దారులకు మూడు నెలల కోటా కింద సన్నబియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడమే దీనికి ప్రధాన కారణం. మరోవైపు సన్నధాన్యంపై రైతులకు బోనస్ ఇస్తుండడంతో విస్తీర్ణం పెరిగి వానాకాలం, యాసంగిలో భారీగా సన్నధాన్యం దిగుబడులు వచ్చాయి. ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు బియ్యం రీసైకిల్ దందా 90 శాతం పైగా తగ్గింది. ఇంకోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్గఢ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ధాన్యం దిగుబడి భారీగా పెరగడం... చైనా, థాయ్లాండ్, వియత్నాం తదితర దేశాల్లోనూ ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయ్యింది. దీంతో రాష్ట్రం నుంచి ఏటా భారీగా బియ్యం ఎగుమతులు చేస్తున్న మిల్లర్లపై గట్టి ప్రభావమే పడింది. ఎగుమతులు తగ్గి రైస్మిల్లులోనూ నిల్వలు పేరుకుపోయాయి.గతేడాదితో పోలిస్తే...» 2024 అక్టోబర్కు ముందుతో పోలిస్తే బహిరంగ మార్కెట్లో సన్నబియ్యం ధరలు తగ్గాయి. » బీపీటీ–5204 పాత బియ్యం క్వింటా ధర గత ఏడాది రూ.5వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.4,400లకే అమ్ముతున్నారు. కొత్త బియ్యం విషయానికి వస్తే గత అక్టోబర్కు ముందు క్వింటా ధర రూ.4,100 ఉండగా...ఇప్పుడు రూ.3,800కు చేరింది. » హెచ్ఎంటీ రకం పాత బియ్యం గతంలో క్వింటా రూ.6 వేలు ఉండగా, ప్రస్తుతం రూ.5,600కు తగ్గింది. కొత్త బియ్యం క్వింటా రూ.5,600 ఉండగా ప్రస్తుతం రూ.5వేలకు తగ్గింది. » జైశ్రీరాం రకం పాత బియ్యం గత అక్టోబర్కు ముందు క్వింటా రూ.7,600 ఉండగా, ప్రస్తుతం రూ.7,200కు తగ్గింది. జైశ్రీరాం కొత్త బియ్యం గతంలో క్వింటా రూ.7వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.6,400కు తగ్గడం గమనార్హం. రేషన్లో సన్నబియ్యం «సరఫరాతో హోల్సేల్ బియ్యం దుకాణాలు మూత పడుతున్నాయి, ఒక్క వరంగల్ ట్రైసిటీలో 5,500కు పైగా ఉన్న షాపులు జూన్, జూలై మాసాలలో 800 వరకు మూతపడినట్టు వ్యాపారులు చెబుతున్నారు. భారీగా తగ్గిన ఎగుమతులు.. రాష్ట్రం నుంచి బియ్యం దిగుమతి చేసుకునే దేశాల్లో సైతం ధాన్యం దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. మరోవైపు కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాల్లో సైతం ధాన్యం దిగుబడులు భారీగా వచ్చాయి. ఆయా రాష్ట్రాల్లో తెలంగాణ స్థాయిలో సీఎంఎఆర్ తీసుకోకపోవడంతోపాటు ధాన్యం రైతులకు బోనస్ చెల్లించే పథకం లేదు. రేషన్ దుకాణాల ద్వారా తెలంగాణ మాదిరిగా సన్నబియ్యం ఇవ్వడం లేదు. ఇక కర్ణాటకలో ప్రతి గింజను మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇతర రాష్ట్రాలు ఇచ్చిన ధరకు.. తెలంగాణ మిల్లర్లు బియ్యం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. చాలా స్వల్పస్థాయిలో మాత్రమే మార్జిన్లు వస్తుండటంతో తమకు గిట్టుబాటు కావడంలేదని రాష్ట్రానికి చెందిన రైస్ మిల్లర్లు ఎగుమతులకు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో రిటైల్ మార్కెట్లోనూ «బియ్యం ధరలు తగ్గాయి. ఇదిలా ఉండగా ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్గా నిలవడం గమనార్హం. ఈ ఏడాది రాష్ట్రంలో 2కోట్ల 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యింది. కేంద్ర నిల్వల కోసం 60 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు. 50–60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిగులుతున్నాయి. » తెలంగాణ నుంచి ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది ధాన్యం సేకరణలో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జిల్లా నుంచి గత ఏడాది వరకు మిల్లర్లు సుమారు 25 వేల టన్నుల బియ్యం దుబాయి, చైనా, ఆ్రస్టేలియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు. » ధాన్యం భారీగా పండించే వరంగల్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల నుంచి సైతం ప్రతి ఏటా సుమారు 80 వేల టన్నులకు పైగా బియ్యం ఎగుమతులు చేసేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఎగుమతులు మూడో వంతుకు పడిపోయాయి. సన్నబియ్యంతో సగం దుకాణాలు మూతపడ్డాయి సర్కారు సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో హోల్సేల్ రైస్ దుకాణాల్లో ఒక్కసారిగా అమ్మకాలు తగ్గాయి. గతంలో ఒక్కోరోజు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు అమ్మితే ఇప్పుడు రోజుకు రెండు, మూడు కూడ అమ్మడం లేదు. జూన్, జూలై మాసాల్లో అయితే ఒక్క బస్త కూడా అమ్మలేదు. వరంగల్ నగరంలో ఇప్పటికే చాలా హోల్సేల్ బియ్యం దుకాణాలు మూత పడ్డాయి. – దేవసాని తిరుపతి, హోల్సేల్ బియ్యం వ్యాపారి, వరంగల్ఎగుమతులు తగ్గించాం ఇతర రాష్ట్రాల్లో సన్న ధాన్యాన్ని బోనస్ లేదు. అక్కడ ప్రతి ధాన్యపు గింజను మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతున్న ధరకు అనుగుణంగా ఆయా రాష్ట్రాల మిల్లర్లు ఎగుమతులు చేస్తున్నా రు. తెలంగాణలో సన్నధాన్యం బోనస్ కారణంగా ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో పలుకుతున్న ధరకు బియ్యం ఎగుమతి చేయలేకపోతున్నాం. ఎగుమతులు చాలావరకు తగ్గించాం. – కాపర్తి శ్రవణ్, రైస్మిల్లర్, నిజామాబాద్ -
దోమల నియంత్రణలో భాగస్వాములవ్వాలి
హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య హన్మకొండ: దోమల నియంత్రణలో భాగస్వాములవుతూ ఆరోగ్యాన్ని కాపాడుకుందామని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ సమ్మయ్యనగర్లోని లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సీజనల్ వ్యాధులు, దోమల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సందేశాత్మకంగా ఏర్పాటు చేసిన దోమతెర, దోమలకు ఆవాసాలైన నీటి కుండీలు, తదితర ప్రదర్శనలను వీక్షించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, వైధ్యాధికారి హైదర్, జిల్లా మాస్ మీడియా అధికారి వి.అశోక్రెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు బాబు, విప్లవ్కుమార్, మరియా థామస్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డ్రై డే, జ్వర సర్వే పర్యవేక్షణలో భాగంగా గోపాల్పూర్ ప్రాంతంలోని వేంకటేశ్వర కాలనీలో పర్యటింటించి దోమలు నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతుంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతి సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. న్యూస్రీల్ -
ఎస్జీఎఫ్ఐ జిల్లా కార్యదర్శిగా ప్రశాంత్కుమార్
హన్మకొండ చౌరస్తా: పాఠశాల క్రీడల సమాఖ్య హనుమకొండ జిల్లా కార్యదర్శిగా వెలిశెట్టి ప్రశాంత్కుమార్ నియమితులైనట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన రెండేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత్కుమార్ ప్రస్తుతం కాజీపేట మండలం తరాలపల్లి జెడ్పీహెచ్ఎస్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తనను నియమించిన డీఈఓ వాసంతికి ధన్యవాదాలు తెలియజేయగా.. పీఈటీల సంఘం జిల్లా అద్యక్షుడు శీలం పార్థసారధి, కార్యదర్శి కె.మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగ సుధాకర్, పీడీలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, సుభాశ్, సురేశ్, నాగరాజు, రాజు.. ప్రశాంత్కుమార్కు అభినందనలు తెలిపారు. అనుమతి లేని స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వినతివిద్యారణ్యపురి: జిల్లాలో అనుమతిలేకుండా నడుస్తున్న స్కూళ్లపై, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి అనుమతిలేకుండా మారుస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చిబాబు, జనరల్ సెక్రటరీ మాడుగుల సంతోశ్రెడ్డి ఇతర బాధ్యులు శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్కు, డీఈఓ డి.వాసంతికి, పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ రంగయ్యనాయుడికి వేర్వేరుగా వినతి పత్రం అందించారు. హడుప్సా ట్రెజరర్ డి.శంకర్, చీఫ్ అడ్వయిజర్ వర్దమాను జనార్దన్, ఉపాధ్యక్షుడు టి.రాజేశ్వర్రావు, జిల్లా బాధ్యులు బి.వెంకటరెడ్డి, వి.మధుకర్రెడ్డి, ఆర్.నవీన్రెడ్డి, సి.రామారావు, కె.వాసుదేవరెడ్డి, అనిల్ పాల్గొన్నారు. వైద్యుడు సృజన్ సస్పెన్షన్ఎంజీఎం: వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష కేసులో ఎంజీఎం వైద్యుడు శ్రీనివాస్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమేరకు సృజన్ను సస్పెండ్ చేస్తూ.. డీఎంఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సృజన్ జూన్ 15న ప్రత్యూషను వేధించడంతో ఆమె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు సృజన్ను బీఎస్ఎన్ యాక్ట్ 108, 115(2), 292, 351(2), సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిట్తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్రెడ్డి, శంకర్, కేవీఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు. -
226 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు శిక్షణ
హన్మకొండ అర్బన్: జిల్లాలో లైసెన్స్డ్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకుని ఎంపికైన 226 మందికి క్షేత్రస్థాయి శిక్షణ కోసం 14 మండలాలు, హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని ఏడీ కార్యాలయాన్ని కేటాయించినట్లు సర్వే ల్యాండ్ రికార్డ్స్ అదనపు సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. వీరంతా 40 పనిదినాలు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సర్వేయర్లు, డీఐ, ఏడీ సమక్షంలో శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే వీరికి తరగతుల నిర్వహణ పూర్తయ్యిందని, పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. 226 మంది క్షేత్ర శిక్షణకు వచ్చినట్లు తెలిపారు. -
పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్
నర్సంపేట: చెన్నారావుపేట మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి కల్పన శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మండలంలోని 30 గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ నిర్వహించారు. గ్రామాల వారీగా ఓటరు జాబితాల తయారీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో భాగంగా తొమ్మిది అంశాలపై నివేదిక తయారు చేసి సెంట్రల్ సర్వర్ యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. విధుల్లో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అనంతరం శంకరంతండా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. పంచా యతీ కార్యదర్శి ప్రమీలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట ఎంపీడీఓ నల్ల శ్రీవాణి, చెన్నారావుపేట ఇన్చార్జ్ ఎంపీఓ రామ్మోహన్, మండల పరిషత్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వైద్యుడు సృజన్ సస్పెన్షన్ఎంజీఎం: వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ ప్రత్యూష కేసులో ఎంజీఎం వైద్యుడు శ్రీనివాస్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈమేరకు సృజన్ను సస్పెండ్ చేస్తూ.. డీఎంఈ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న సృజన్ జూన్ 15న ప్రత్యూషను వేధించడంతో ఆమె ఉరేసుకుందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు సృజన్ను బీఎస్ఎన్ యాక్ట్ 108, 115(2), 292, 351(2), సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిట్తో నోయిడా మిస్టోటెక్స్ టెక్నాలజీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో నోయిడాకు చెందిన మిస్టోటెక్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జాతీయ రహదారుల భద్రత, చలనం, వినియోగదారుల సంతృప్తిని మెరుగుపర్చే ఏఐ ఆధారిత పరిశోధన కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నిట్ రిజిస్ట్రార్ సునీల్కుమార్ మెహతా, ప్రొఫెసర్లు వెంకట్రెడ్డి, శంకర్, కేవీఆర్ రవిశంకర్, అర్పణ్ మెహర్, సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, మిస్టోటెక్స్ సంస్థ తరఫున చేతన్కుమార్, మాజీ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా స్వర్ణ సుబ్బారావు పాల్గొన్నారు. మొక్కలు నాటేలా చర్యలు రామన్నపేట: గృహాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఆర్పీ (రీసోర్స్ పర్సన్)లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. శుక్రవారం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మెప్మాకు చెందిన ఆర్పీలకు మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని కమిషనర్ చాహత్ బాజ్పాయ్ కలిసి చేపట్టారు. ఈసందర్భంగా.. మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. సోమవారం నుంచి ప్రతీ వార్డులో కార్యక్రమాలు ఏర్పాటు చేసి మొక్కలు అందజేయాలని, ఈబాధ్యత ఆర్పీలదేనని స్పష్టం చేశారు. శానిటేషన్, హార్టికల్చర్ విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ.. స్థానిక కార్పొరేటర్ల సహకారంతో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని కమిషనర్ సూచించారు. వంచనగిరిలో అదృశ్యం.. నెక్కొండలో ప్రత్యక్షంనెక్కొండ: గీసుకొండ మండలంలోని వంచనగిరిలో 85 ఏళ్ల వృద్ధురాలు తప్పిపోయి నెక్కొండలో శుక్రవారం ప్రత్యక్షమైంది. నెక్కొండ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. వంచనగిరి గ్రామానికి చెందిన గూబల నర్సమ్మ నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి తప్పిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. చివరకు మిల్స్కాలనీ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా, సదరు వృద్ధురాలు నెక్కొండ జూనియర్ కళాశాల వెనుక ఉన్న విషయాన్ని పోలీసులకు సమాచారం స్థానికులు అందించారు. పోలీసులకు సంఘటనా స్థలికి చేరుకుని స్టేషన్కు తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకున్న పోలీసులు వృద్ధురాలిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం నర్సమ్మను ఆమె కోడలు గూబల విజయ, మనుమడు ప్రేమ్కుమార్కు అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు. -
మ్యుటేషన్ చేయడం లేదని నిరసన
వర్ధన్నపేట: మ్యుటేషన్ చేయడం లేదని కుటుంబ సభ్యులు ఏకంగా వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వంటావార్పు చేసి నిరసన తెలిపారు. బాధితుల కథనం ప్రకారం.. ఇల్లంద గ్రామానికి చెందిన నాంపల్లి కుమారస్వామి తండ్రి యాకయ్య గత నవంబర్లో మరణించాడు. ఆయన పేరుతో ఉన్న వ్యవసాయ భూమిని మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారని కుమారస్వామి తెలిపాడు. అధికారుల తీరుపై విసుగుచెంది తహసీల్దార్ కార్యాలయం ఎదుట వంటా వార్పునకు సిద్ధమయ్యామని పేర్కొన్నాడు. దీంతో రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని త్వరితగతిన మ్యుటేషన్ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఈ విషయంపై ఆర్ఐ ఆసిఫ్ను వివరణ కొరగా మ్యుటేషన్కు సంబంధించిన సరైన పత్రాలు సమర్పించకపోవడంతోపాటు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం విచారణకు సహకరించకపోవడంతో ఆలస్యమైందని తెలిపారు. అధికారుల హామీతో సద్దుమణిగిన వివాదం -
జిల్లాలో దంచికొట్టిన వాన
సాక్షి, వరంగల్: జిల్లాలో భారీ వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు గీసుకొండలో అత్యధికంగా 98.4 మిల్లీమీటర్లు, ఖిలావరంగల్ లో 68.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో వరంగల్ నగరంలో ప్రధాన రహదారులన్నీ జలమయమయయ్యాయి. రాత్రి వేళ వాహనదారులు ఇళ్లకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసింది. వరంగల్లో 58.4 మిల్లీమీటర్లు, నెక్కొండలో 57.4, వర్ధన్నపేటలో 56.6, సంగెంలో 51.4, ఖానాపురంలో 48.4, నర్సంపేట 40.6, పర్వతగిరిలో 36.8, చెన్నారావుపేటలో 36.0, దుగ్గొండిలో 28.6, నల్లబెల్లిలో 24.2, రాయపర్తిలో 22.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ విభాగాధికారులు తెలిపారు. వర్షంతో ఇల్లు నేలమట్టం..నల్లబెల్లి: వర్షంతో రుద్రగూడెంలో బాషబోయిన భాస్కర్ ఇల్లు గురువారం అర్ధరాత్రి నేలమట్టమైంది. గమనించిన భాస్కర్తోపాటు కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి ఒక్కసారిగా పరుగు తీశారు. వారు బయటకు పరుగెత్తిన కొన్ని క్షణాల్లోనే ఇల్లు పూర్తిగా కూలింది. ఈ ఘటనలో త్రుటిలో ప్రాణా పాయం తప్పింది. ఇల్లు కూలడంతో గృహోపయోగ సామగ్రి ధ్వంసమైంది. స్థానిక ఆర్ఐ కార్తీక్, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. -
ఆయిల్ పామ్.. అధిక దిగుబడి
నర్సంపేట: ఒక్కసారి మొక్కలు నాటితే 30 ఏళ్ల పాటు దిగుబడి వచ్చే ఆయిల్పామ్ సాగుపై రైతులు చూపుతున్నారు. మొక్కల దగ్గరి నుంచి మార్కెటింగ్ దాకా ప్రభుత్వం సహకారం అందిస్తుండడంతో జిల్లాలో ప్రతీ సంవత్సరం సాగు పెరుగుతోంది. జిల్లాలో 5,448 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశారు. రైతులు ఈ పంటను సాగు చేయడం ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం.. దేశంలో వంట నూనెల్లో ఎక్కువగా పామాయిల్ వాడుతున్న విషయం విదితమే. అయితే, డిమాండ్కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ప్రభుత్వం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దేశీయంగా ఉత్పత్తి పెంచితే రైతులకు ఆదాయం పెరగడంతోపాటు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుందన్న లక్ష్యంతో ఆయిల్పామ్ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా నర్సరీల్లో ఒక్కో మొక్క రూ.193 ఉండగా రైతుల నుంచి రూ.20 మాత్రమే వసూలు చేస్తున్నారు. మిగతా రూ.173 90 శాతం ప్రభుత్వమే చెల్లిస్తోంది. అంతేకాకుండా మొక్కలు నాటిన తర్వాత నిర్వహణ ఖర్చుల కింద ఎకరాకు రూ.4,200 చొప్పున నాలుగేళ్ల పాటు ప్రోత్సాహకంగా అందిస్తుంది. సబ్సిడీపై డ్రిప్ పరికరాలు.. ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, బీసీలకు 90 శా తం, ఓసీ రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం, ఐదు ఎకరాలు దాటితే 80 శాతం వరకు సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందిస్తోంది. అంతేకాకుండా పంటను కొనుగోలు చేయడానికి జిల్లాకు ఒక ఆయిల్ కంపెనీకి ప్రభుత్వమే కాంట్రాక్టు ఇస్తోంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల దిగుబడి.. ఆయిల్పామ్ మొక్కలు ఎకరాకు 55 వరకు నాటుతారు. మూడేళ్లు పూర్తయిన తర్వాత నాలుగో ఏడాది నుంచి 4 టన్నుల నుంచి 6 టన్నుల దిగుబడి మొదలవుతుంది. ఐదో సంవత్సరంలో 8 టన్నుల నుంచి 10 టన్నులు, ఆరో సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో 10 టన్నుల నుంచి 15 టన్నుల దిగుబడి వస్తుంది. ఈ దిగుబడి 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ప్రస్తుతం టన్నుకు రూ.20 వేలు పలుకుతోంది. ఈ లెక్కన సగటున ఎకరాకు రూ.3 లక్షలు వచ్చినా రూ.లక్ష ఖర్చు పోగా రూ.2 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ మొక్కల మధ్య కూరగాయలు, ఆకు కూరలను అంతర పంటలుగా వేసుకోవచ్చు. నాటు, టర్కీ, గిరిరాజ లాంటి కోళ్లు, పశువులను పెంచుకోవచ్చు. నాలుగేళ్లు నిర్వహణ ఖర్చులు.. ఆయిల్పామ్ సాగు కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తోంది. సబ్సిడీ కింద మొక్కలు, డ్రిప్ పరికరాలు అందించడమే కాకుండా నాలుగేళ్ల పాటు నిర్వహణ ఖర్చులు కూడా ఇస్తోంది. ఖానాపురంలో 380, చెన్నారావుపేట 390, నెక్కొండ 390 ఎకరాల్లో మూడేళ్లుగా పంట సాగు చేస్తున్నారు. వరి, పత్తికి ప్రత్యామ్నాయంగా ఆయిల్పామ్ రైతులు వరి, పత్తి వంటి సంప్రదాయ పంటల మీదనే ఆధారపకుండా పంటల మార్పిడిపై దృష్టి సారించాలి. ఆయిల్పామ్ అనేది వరి, పత్తికి ఒక మంచి ప్రత్యామ్నాయ పంట. తక్కువ నీటితో, తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంట ఇది. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహకాలు సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్పామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. రైతులకు ఆర్థికంగా మరింత భద్రతను ఇస్తుంది. పంట దిగుబడి, మార్కెటింగ్కు కూడా ప్రభుత్వమే పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుంది. – శ్రీనివాసరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి జిల్లాలో మండలాల వారీగా మూడు సంవత్సరాల సాగు వివరాలు (ఎకరాల్లో).. మండలం 2022–23 2023–24 2024–25 చెన్నారావుపేట 187 155 60 దుగ్గొండి 170 198 111 గీసుకొండ 102 116 66 ఖానాపురం 165 140 88 ఖిలా వరంగల్ 5 43 30 నల్లబెల్లి 104 153 59 నర్సంపేట 120 157 114 నెక్కొండ 224 103 22 పర్వతగిరి 644 297 70 రాయపర్తి 317 259 40 సంగెం 220 162 43 వరంగల్ 12 25 5 వర్ధన్నపేట 379 212 71 మొత్తం 2,649 2,020 779 30 సంవత్సరాల పాటు ఆదాయం రైతులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం జిల్లాలో 5,448 ఎకరాల్లో పంటసాగు -
నేడు రక్షా బంధన్
● వృద్ధాప్యంలోనూ ప్రేమానుబంధాన్ని చాటుతున్న అక్కాచెల్లెళ్లు ● ఎక్కడున్నా.. రాఖీ పౌర్ణమికి సోదరుల ఎదురుచూపులుఅక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధాన్ని పంచి పెంచే పండుగ రక్షాబంధన్. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజున కులమతాలకతీతంగా ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. రాఖీ అంటే దారం కాదు.. అది ఒక రక్షణ కవచం, బంధాలను గుర్తుచేసే సందర్భం. సోదరుడి మణికట్టుకు సోదరి కట్టే రాఖీ అనురాగాలు, ఆప్యాయతకు ప్రతీకగా నిలుస్తోంది. వృద్ధాప్యం మీద పడినా.. ఏ పరిస్థితుల్లో ఉన్నా తన తమ్ముడికి, అన్నకు రాఖీ కట్టే అక్కలు, చెల్లెళ్లు ఎందరో ఉన్నారు. ప్రేమను పంచుతున్న అలాంటివారిపై నేడు రాఖీ పౌర్ణమి (రక్షా బంధన్) సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. బంధాలకు విలువనివ్వాలి.. మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ పట్టణానికి చెందిన 82 ఏళ్ల వయసుగల తాటిపాముల నరసింహమూర్తికి 65 ఏళ్ల చెల్లెలు గుడి విజయలక్ష్మి ప్రతి ఏడాది రాఖీ కడుతుంది. ఆత్మీయత, అనురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగ ఉంటుందని అన్నాచెల్లెళ్లు పేర్కొంటున్నారు. ప్రతిఒక్కరూ బంధాలు, బంధుత్వాలకు విలువ ఇవ్వాలని వారు కోరారు. రాఖీ పండుగ వచ్చిందంటే చాలు అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ఆ సంతోషం ఎన్నటికీ మరిచిపోలేనిదని వారు తెలిపారు.45 ఏళ్లుగా రాఖీ కడుతున్న చెల్లెలుబచ్చన్నపేట: మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళి, ఊర్మిల అన్నాచెల్లెలు. ముగ్గురు అన్నలకు చిన్నారి చెల్లె ఊర్మిల. ఈమె వివాహం 1980లో జగదేవపూర్కు చెందిన వ్యక్తితో జరిపించారు. వారు అప్పటి నుంచి వ్యాపార నిమిత్తం సిద్దిపేటలో ఉంటున్నారు. 45 సంవత్సరాలుగా ఊర్మిల బచ్చన్నపేటకు వచ్చి అన్నలు కొత్తపల్లి రాజయ్య, కాశీపతి, మురళికి తప్పకుండా రాఖీ కడుతుంది. అన్నలు ఇచ్చే కట్న కానుకలను సంతోషంగా స్వీకరిస్తుంది. ప్రతి సంవత్సరం ముగ్గురు అన్నలు చెల్లె ఊర్మిల వచ్చే వరకు ఎదురు చూస్తుంటారు. -
భూనిర్వాసితులకు ఆర్బిట్రేషన్
న్యూశాయంపేట: సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామం నుంచి వెళ్లే గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు అవార్డ్ పాస్ చేసేందుకు కలెక్టరేట్లో శుక్రవారం ఆర్బిట్రేషన్ నిర్వహించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ రాజ్కుమార్, నేషనల్ హైవే సైట్ ఇంజనీర్ ఈశ్వర్, రైతులు పాల్గొన్నారు. మంత్రికి స్వాగతం పలికిన కలెక్టర్.. హనుమకొండ బాలసముద్రంలోని అంబేడ్కర్నగర్లో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి శుక్రవారం విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలెక్టర్ డాక్టర్ సత్యశారద మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. ‘ఓపెన్’ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు గడువువిద్యారణ్యపురి: అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ 2025–26 విద్యాసంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ కోర్సులైన ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర డిప్లొమా కోర్సుల అడ్మిషన్లకు ఈనెల 13 వరకు గడువు ఉందని ఓపెన్ వర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ రెండేళ్లు, ఐటీఐ, ఓపెన్ ఇంటర్ 10 ప్లస్ 2, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆసక్తి ఉన్న వారు ‘డబ్ల్యూడబ్ల్యూబీఆర్ఏఓయూ.ఆన్లైన్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎంచుకున్న స్టడీ సెంటర్లో సంప్రదించి సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకున్న తర్వాత ట్యూషన్ ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని కోరారు. పీజీ కోర్సుల్లోని ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం ట్యూషన్, రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాలని ఆయన కోరారు. -
తల్లిపాలతో ఆరోగ్యం
● వరంగల్ కలెక్టర్ సత్యశారద ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: హనుమకొండ బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఇతర అధికారులతో కలిసి గురువారం ఇళ్లను పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేతుల మీదుగా శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. బ్లాక్ల వారీగా తాగునీరు, విద్యుత్ తదితర వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, గృహ నిర్మాణశాఖ పీడీ సిద్ధార్థనాయక్, హనుమకొండ తహసీల్దార్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. డిమాండ్కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు రావాలి.. డిమాండ్కు అనుగుణంగా చేనేత ఉత్పత్తులు తీసుకురావాలని కలెక్టర్ స్నేహ శబరీష్ చేనేత కార్మికులకు సూచించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో గురువారం కాళోజీ సెంటర్ నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు చేనేత నడక (హ్యాండ్లూమ్ వాక్) కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి జెండా ఊపి చేనేత నడకను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 800 మంది నేత కార్మికులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ కూడా చేసిందన్నారు. చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈసందర్భంగా చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు. చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. చేనేతపై నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలను సన్మానించారు. చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులు పరిష్కరించండిభూభారతి సదస్సుల్లో భూసమస్యల పరిష్కారానికి వచ్చిన దరఖాస్తుల్ని వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో భూభారతి దరఖాస్తుల విచారణ, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం హనుమకొండ ‘కుడా’ ఆఫీస్ సమీపంలోని హనుమకొండ ఆర్డీఓ కార్యాలయాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కరించడానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓ రాథోడ్ రమేశ్, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. -
ఉల్లాస్.. నిరక్షరాస్యత ఖల్లాస్!
విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్ టీచర్లను కూడా ఎంపిక చేయనున్నారు. వలంటీర్లతో విద్యాబోధన మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతి ఏడాది మార్చి– సెప్టెబర్ నెలలో జరిగే ఎన్ఐఓఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పరీక్ష నిర్వహిస్తాం, ఎన్ఎల్ఎం (నేషనల్ లిటరిసీ మిషన్ అథారిటీ, ఎన్ఐఓఎస్ కూడిన సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. నాలుగు నెలల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా ఉంది. – టి.రమేశ్రెడ్డి, వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ నిరక్షరాస్యులైన అతివలు అక్షరాస్యత వైపు.. స్వయం సహాయక సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ షురూ గ్రామస్థాయిలో వలంటీర్లకూ శిక్షణ వలంటీర్ టీచర్ల ద్వారానే బోధన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613 మంది నిరక్షరాస్యుల గుర్తింపు ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు. ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆదిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. ఇంకా మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే వారిని 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్ కార్యకమ లక్ష్యంగా ఉంది. -
మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించాలి
ఆత్మకూరు: మధ్యాహ్న భోజనంలో మెనూ పాటిస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జెడ్పీ సీఈఓ విద్యాలత అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం సందర్శించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగారు. అనంతరం ఆత్మకూరులో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లింగమడుగుపల్లిలో ఉపాధి పథకంలో రైతు నాటిన మామిడి మొక్కల్ని పరిశీలించారు. ఉపాధి పథకాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు. ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి, ఏపీఓ రాజిరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు పుల్లా నిర్మలకుమారి, జీపీ కార్యదర్శులు సంధ్య, శ్వేత, మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు ఉన్నారు. -
పోలీస్స్టేషన్ స్థలాన్ని సందర్శించిన డీసీసీ
ఐనవోలు: మండల కేంద్రంలో పోలీస్స్టేషన్కు కేటాయించిన స్థలాన్ని వరంగల్ ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గురువారం పరిశీలించారు. గతంలో పోలీస్స్టేషన్ నిర్మాణానికి ఒక ఎకరం స్థలం మాత్రమే కేటాయించారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా.. పక్కన ఉన్న మరో రెండు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని తహసీల్దార్ సహకారంతో కేటాయించారని అధికారులు డీసీపీకి తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్కుమార్ మాట్లాడుతూ త్వరలోనే పోలీస్స్టేషన్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో మామునూరు ఏసీపీ వెంకటేశ్, సీఐ రమేశ్, పర్యతగిరి సీఐ రాజగోపాల్, మామునూరు ఎస్సై శ్రీకాంత్, తహసీల్దార్ విక్రమ్, ఐనవోలు ఎస్సై పస్తం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
డీఈఓ వాసంతి వేలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హనుమకొండ డీఈఓ వాసంతి అన్నారు. గురువారం మండలంలోని కేజీబీవీ, గొల్లకిష్టంపల్లి, కట్కూరు రామయ్యపల్లి, గురుకుల పాఠశాలలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని విద్యార్థుల్ని అడగ్గా నీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరులో నుంచి నీరు రావడం లేదని, మిషన్ భగీరథ వాటర్ సరిపోవట్లేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే గురుకుల పాఠశాలలో క్లాస్ రూంలు, డైనింగ్ హాల్, స్టోర్ రూంను పరిశీలించారు. అనంతరం ప్రిన్సిపాల్.. హాస్టల్లో డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందని, విద్యార్థులు వాడుకున్న నీరు బయటకు వెళ్లకుండా పాఠశాల ఆవరణలోనే ఉంటోందని చెప్పారు. శాశ్వత పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎంఈఓ చంద్రమౌళి, కేజీబీవీ ఎస్ఓ స్రవంతి, గురుకుల ప్రిన్సిపాల్ అజయ్కుమార్, ఏఈ రూపావతి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు వరలక్ష్మీవ్రతం
హన్మకొండ కల్చ రల్: శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంరోజున వరలక్ష్మీవ్రతం జరుపుకోవడం సంప్రదాయం. ఈ మేరకు శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించేందుకు మహిళలు సిద్ధమయ్యారు. వ్రతానికి కావాల్సిన పూలు, పండ్లు, తమలపాకులు, సుగంధ ద్రవ్యాల కొనుగోళ్లతో నగరంలోని పలుకూడళ్లలో గురువారం రద్దీ ఏర్పడింది. పూల ధరలకు రెక్కలు వచ్చాయి.పవిత్రోత్సవాలు ప్రారంభంహన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో గురువారం పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈమేరకు ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితులు, వేద విద్యార్థులు హోమాలు నిర్వహించారు.కోటలో విదేశీయుల సందడిఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈసందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు. విదేశీయుల వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు.కేయూలో ముందస్తురక్షాబంధన్ వేడుకలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులు ముందస్తుగా గురువారం రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. పరిపాలనా భవనంలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ మహ్మద్అబీబుద్దీన్కు మహిళా ఉద్యోగులు డాక్టర్ ఎస్.సుజాత, బి.కృష్ణవేణి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతిఒక్కరి తోడ్పాటు అవసరమన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలతాదేవి, సూపరింటెండెంట్లు హేమారాణి, నర్మద, ఎస్.పద్మావతి, ఉద్యోగులు ఉన్నారు.చట్టాలపై అవగాహన అవసరంవిద్యారణ్యపురి: చట్టాలపై అవగాహన అవసరమని, అవసరం ఉన్నవారు ఉచిత న్యాయ సలహాలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవా సాధికార సంస్థ కార్యదర్శి జస్టిస్ క్షమాదేశ్పాండే సూచించారు. న్యాయసేవా సాధికార సంస్థ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు న్యాయవిజ్ఞాన సదస్సులు అవసరమని పేర్కొన్నారు. కేయూ పాలకమండలి సభ్యురాలు కె.అనితా రెడ్డి మాట్లాడుతూ.. చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే వాటిని వినియోగించుకోగలుగుతారన్నారు. చట్టాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, న్యాయవా ది గోపిక, కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆ ఫీసర్లు రాజ్కుమార్, దయాకర్ అధ్యాపకులు పాల్గొన్నారు.యువకుడి హల్చల్చార్మినార్: పాతబస్తీ ఘాజీబండకు చెందిన మహ్మద్ అజర్ అనే యువకుడు ఆదివారం వైట్నర్ మత్తులో చార్మినార్ కట్టడంపై హల్చల్ సృష్టించాడు. చార్మినార్ పిట్టగోడ పైకెక్కి కిందికి దూకే ప్రయత్నం చేశాడు. -
గూడ్స్ వాహనాల బ్యాటరీలు మాయం
● మూడు ప్రాంతాల్లో అపహరణ గీసుకొండ: గీసుకొండ పోలీస్స్టేషన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో దొంగలు గూడ్స్ వాహనాల బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని కావేరి వే బ్రిడ్జి సమీపంలో ధర్మారంకు చెందిన సయ్యద్ ఇస్మాయిల్ కిరాయికి ఉంటున్నాడు. నివాసం వద్ద తన లారీని నిలిపి ఉంచగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు లారీ బ్యాటరీని అపహరించుకుని తీసుకెళ్లారు. దాని విలువ సుమారు రూ. 15 వేలు ఉంటుందని అంచనా. అలాగే రెడ్డిపాలెం వద్ద దేవరపెల్లి రాజు తన డీసీఎం వాహనాన్ని నిలిపి ఇంటికి వెళ్లాడు. వచ్చి చూడగా మాయమైంది. దాని విలువ రూ.15వేలు ఉంటుంది. అలాగే హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ పక్కన ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ వద్ద చింతల్కు చెందిన మహ్మద్ అలీ తన లారీని పార్క్ చేసి వెళ్లగా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బ్యాటరీ విలువ సుమారు రూ.15 వేలు ఉంటుంది. ఈ వివరాల మేరకు గురువారం ముగ్గురు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కుమార్ తెలిపారు. 11న నులిపురుగుల నివారణ దినోత్సవం గీసుకొండ: జిల్లాలో ఈ నెల 11న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని చేపడుతున్నట్లు డీఎంహెచ్వో బి. సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని 18న నిర్వహిస్తామని వివరించారు. జిల్లాలో 1,328 విద్యా సంస్థల్లో 96,214 మంది బాలురు, 99,954 మంది బాలికుల చదువుతున్నారని తెలిపారు. వారందరికీ అల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 1–2 ఏళ్ల చిన్నారులకు సగం.. ఆ పైన 19 ఏళ్ల వరకు వయస్సు ఉన్న వారికి మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆటోను ఢీకొట్టిన లారీ వర్ధన్నపేట: ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణ కేంద్రం నుంచి ప్రయాణికులతో నందనం వైపు వెళ్తున్న ఆటోను కరీంనగర్ నుంచి బూడిద లోడ్తో వస్తున్న లారీ అంబేద్కర్ సర్కిల్ ప్రాంతంలో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి స్వల్ప గాయాలు కాగా ఇల్లంద గ్రామానికి చెందిన సంజనకు మాత్రం తీవ్రగాయాలు కాగా వెంటనే బాలికను పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కత్తితో వ్యక్తి హల్చల్ వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లి క్రాస్లోని ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద గురువారం మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్న బిహార్కు చెందిన ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించి వరంగల్ – ఖమ్మం జాతీయ రహదారి పై కత్తులు, రాళ్లు, కర్రలతో వాహనదారులు, స్థాని క గ్రామస్తులపై దాడికి యత్నించాడు. రెండు గంటల పాటు హంగామా చేసి వాహనదారులను పరుగులు పెట్టించాడు. అడ్డుకునేందుకు వెళ్లిన వారి పై రాళ్లు విసురుతూ కత్తి చేత పట్టుకొని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇంత జరిగినా గ్రానైట్ ఫ్యాక్టరీ నిర్వాహకులు స్పందించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోటలో విదేశీయుల సందడిఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను గురువారం ఇటలీ దేశస్తులు సందర్శించారు. ఈ సందర్భంగా మధ్య కోటలోని కీర్తితోరణాల నడుమ ఉన్న అద్భుత శిల్ప సంపదతోపాటు ఖుష్మహల్, రాతి, మట్టికోట అందాలు, ఏకశిల గుట్ట, శృంగారపు బావిని తిలకించారు. శిల్పాల ప్రాంగణంలో నాటి శిల్పులు చెక్కిన అద్భుత శిల్ప సంపదను ఆసక్తిగా పరిశీలించారు. క్యూర్ కోడ్ను స్కాన్ చేసి కాకతీయుల చరిత్ర, విశిష్టత తెలుసుకున్నారు. కోట విశిష్టతను పర్యాటశాఖ గైడ్ రవియాదవ్ వారికి వివరించారు. ఆనాటి కట్టడాలు, శిల్ప సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు విదేశీయుల వెంట కేంద్ర పురావస్తుశాఖ కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్చార్జ్ అజయ్ ఉన్నారు. -
ఆరోగ్యానికి ‘కిషోర రక్ష’
ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యంపై కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేయనున్నారు. గతంలో ఆర్బీఎస్కే ద్వారా వైద్యపరీక్షలు చేసినా పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి దానికనుగుణంగానే వైద్యసేవలు అందించనున్నారు. విద్యార్థులకు 13 రకాల పరీక్షలు.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కలెక్టర్ ‘కిషోర రక్ష’ కార్యక్రమం ద్వారా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. విద్యార్థులకు బ్లడ్గ్రూప్, దంత, చర్మవ్యాధులు, చెవి, క్యాన్సర్, జన్యులోపం, హిమోగ్లోబిన్తో పాటు మరో 13 రకాల పరీక్షలు చేస్తున్నారు. ఇందులో థైరాయిడ్, టీబీతో పాటు ఇతర వ్యాధులు ఉన్నట్లు తేలితే నర్సంపేట పట్టణంలోని టీహబ్కు పంపించి పూర్తిస్థాయిలో పరీక్షిస్తున్నారు. సాధారణ వ్యాధులకు అయితే నర్సంపేట ఆస్పత్రిలో వైద్యసేవలు, మిగిలిన వ్యాధులకు వరంగల్, హైదరాబాద్కు రెఫర్ చేసి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైద్య పరీక్షల్లో వచ్చిన వివరాలతో హెల్త్ ప్రొఫైల్ తయారు చేసి ‘కిషోర రక్ష’ కార్డుల్లో నమోదు చేస్తున్నారు. విద్యార్థులకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిలో నమోదు చేసి నిత్యం వైద్య పరీక్షలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు 1,620 మందికి పరీక్షలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ విద్యార్థికి వైద్య పరీక్షలు చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 75 సంక్షేమ గురుకుల పాఠశాలలు, 545 ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ఇందులో భాగంగా మొదట కేజీబీవీల్లో శ్రీకారం చుట్టారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో 2,501 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 1,620 మందికి వైద్య పరీక్షలు చేశారు. మిగిలిన విద్యార్థులు అందుబాటులో లేకపోవడంతో పరీక్షించలేకపోయారు. పరీక్షలు చేసిన వారిలో 58 మందికి మేజర్ సమస్యలను గుర్తించారు. వీరిని రెఫర్ చేయించి వైద్య పరీక్షలు అందించనున్నారు. కేజీబీవీల్లో ముగిసిన తర్వాత ఎంజేపీ, మోడల్ స్కూల్స్, సైనిక్, గిరిజన పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక, హైస్కూళ్లలోనూ ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ సత్యశారద పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చేపట్టిన ఈ కార్యక్రమంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో వైద్యపరీక్షలు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వైద్యపరీక్షలు చేసి కిషోర రక్ష కార్డుల్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు. దీంతో మొదట కేజీబీవీల్లో అమలుకు శ్రీకారం చుట్టాం. తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో వైద్యపరీక్షలు చేసి విద్యార్థుల వివరాలు కార్డుల్లో పొందుపర్చి తల్లిదండ్రులకు అందజేస్తాం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది. – సాంబశివరావు, డీఎంహెచ్ఓ విద్యార్థులపై కలెక్టర్ సత్యశారద ప్రత్యేక శ్రద్ధ పాఠశాలల్లో బాలబాలికలకు వైద్య పరీక్షలు హైల్త్ ప్రొఫెల్ తయారు చేసి కార్డుల్లో నమోదు మొదట కేజీబీవీల్లో అమలుకు శ్రీకారం -
యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు
పర్వతగిరి: యువత గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆయన పర్వతగిరి సర్కిల్ ఆఫీస్ను గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీసీపీ అంకిత్కుమార్కు ఏసీపీ, సీఐలు మొక్కను అందజేశారు. అనంతరం ఆయన పోలీస్స్టేషన్ పరిసరాలు, స్టేషన్లో రికార్డులను పరిశీలించి మాట్లాడారు. పోలీసులు శాంతిభద్రతలను కాపాడాలన్నారు. ప్రజలకు మూఢ నమ్మకాలపై అవగాహన కల్పించాలన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా ముందుకు సాగాన్నారు. క్రిమినల్ కేసులు, చైన్ స్నాచింగ్లకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మామునూరు ఏసీపీ ఎన్.వెంకటేశ్, పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.రాజగోపాల్, ఎస్సైలు బి.ప్రవీణ్, నరేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ -
పన్ను వసూళ్లపై దృష్టి సారించండి
నగర మేయర్ గుండు సుధారాణి రామన్నపేట: నీటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం అధికారుల సమీక్షలో ఆమె మాట్లాడారు. పీఓఎస్ మిషన్లకు ట్రాకింగ్ వ్యవస్థ ఉంటే ఐసీసీ కేంద్రానికి అనుసంధానం చేయాలన్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా భువన్ సర్వే చేపట్టాలని, ఐదు సంవత్సరాలుగా పేరుకుపోయిన రూ.48 కోట్ల నీటి పన్ను బకాయిలను వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లిపాలతో ఆరోగ్యం
ఎంజీఎం/న్యూశాయంపేట/రామన్నపేట/సంగెం: తల్లిపాలు తాగితే శిశువులు ఆరోగ్యంగా ఉంటారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద తెలిపారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్లోని సీకేఎం ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాలు తాగిన చిన్నారులు రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పకుండా తాగించాలన్నారు. శిశువుకు తప్పనిసరిగా ఆరు నెలలు తల్లిపాలను తాగించాలని సూచించారు. బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ నర్సింగ్ కళాశాల విద్యార్థులు బాలింతలు, గర్భిణులకు తల్లిపాల విశిష్టతను వివరిస్తూ వేసిన నాటకం ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, వైద్యాధికారులు సత్యజిత్ తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు పంద్రాగస్టు వేడుకలను పండువాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాట్లపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న ఉదయం ఖిలా వరంగల్ ఖుష్మహల్ మైదానంలో నిర్వహించే జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదిక అలంకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అఽధికారులు రాంరెడ్డి, సాంబశివరావు, కౌసల్యాదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను కలెక్టర్ పరిశీలించారు. అలాగే నగరంలోని 3వ డివిజన్ పైడిపల్లిలోని డబుల్బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. 11వ చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా వరంగల్ కొత్తవాడలోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి కెమిస్టు భవన్ వరకు నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్ను పథకాలు, సదుపాయాలను వినియోగించుకుని చేనేత కార్మికులు ఎదగాలని సూచించారు. అలాగే సంగెం ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనికీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం, మూమెంట్ రిజిస్టర్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నిమిత్త గ్రామాలకు వెళ్లిన వారి లైవ్ లొకేషన్ పెట్టాలని ఆదేశించారు. షోకాజ్ మెమో జారీ చేస్తూ ఇంక్రిమెంట్లు ఆపాలని ఎంపీడీఓను ఆదేశించారు. అనంతరం ఎంపీడీఓ పీఆర్ ఏఈ అభిరామ్, సీనియర్ అసిస్టెంట్ ఓంప్రకాశ్, జూనియర్ అసిస్టెంట్లు రజిత, షాబుద్దిన్, టైపిస్ట్ శోభ, ఫార్మసిస్టు వెంకటేశ్వర్లు, రెండో ఏఎన్ఎం సుజాతలకు మెమోలు జారీ చేశారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
ఉల్లాస్.. నిరక్షరాస్యత ఖల్లాస్!
విద్యారణ్యపురి: స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిదేంద్దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా ‘అందరికి చదువు–అందరి బాధ్యత’ అనే నినాదంతో 1,61,613 మంది నిరక్షరాస్యులను గుర్తించారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను అక్షరాస్యులుగా మార్చాలనేదే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేఽశం. అక్షరాస్యత ఇలా.. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ (ప్రాథమిక అక్షరాస్యత అభ్యసన సామర్థ్యాలు), జీవన నైపుణ్యాలు, అలాగే సమాంతర విద్యను బోధిస్తారు. ఆ తర్వాత అర్హులకు 3, 5 తరగతులు, ఆపైన ఇప్పటికే చదువుకున్న వారికి ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్లో ప్రవేశాలు కల్పించేలా ప్రోత్సహిస్తారు. అవసరమైన వారికి వృత్తివిద్య, నిరంతర విద్యను అందిస్తారు. టీచర్లకు శిక్షణ ఉల్లాస్ కార్యక్రమం అమలులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి ముగ్గురు రెగ్యులర్ టీచర్లకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 18 మంది టీచర్లు శిక్షణ పొందారు. రాష్ట్రస్థాయి అధికారుల ఆదేశానుసారం గురువారం భూపాలపల్లి జిల్లాతోపాటు వరంగల్ రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వయోజన విద్యాశాఖ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు అధికారి రమేశ్రెడ్డి, హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి ఉపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇచ్చారు. మిగిలిన మూడు జిల్లాల్లో వెసులుబాటును బట్టి శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 12న మండల స్థాయిలో ఒక టీచర్, అలాగే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 19న గ్రామస్థాయిలో ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లకు శిక్షణ పొందిన రెగ్యులర్ టీచర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. సామాజిక చైతన్య కేంద్రాల ఏర్పాటు నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు గ్రామాల్లోని పాఠశాలల్లో సామాజిక చైతన్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి 8 లేదా 10 మందికి ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తారు. అంతేకాకుండా టీవీ చానల్స్, ఉల్లాస్ యాప్, ఎస్సీఆర్టీఈ రూపొందించిన దీక్ష పోర్టల్ ద్వారా వయోజనులకు బోధన చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బోధనకు ముందుకు వచ్చే వలంటీర్తో బోధన చేయిస్తారు. ఇందుకోసం వలంటీర్ టీచర్లను కూడా ఎంపిక చేయనున్నారు. వలంటీర్లతో విద్యాబోధన మహిళా స్వయం సహాయక సంఘాలల్లోని నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించాం. ఎంపిక చేసిన వలంటీర్ టీచర్లు వయోజనులకు బోధన చేస్తారు. ఒక్కో మహిళకు అక్షర వికాసం వాచకం అందజేస్తారు. అవి ఇప్పటికే జిల్లాలకు కొన్ని చేరుకున్నాయి. ప్రతి ఏడాది మార్చి– సెప్టెబర్ నెలలో జరిగే ఎన్ఐఓఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్లో పరీక్ష నిర్వహిస్తాం, ఎన్ఎల్ఎం (నేషనల్ లిటరిసీ మిషన్ అథారిటీ, ఎన్ఐఓఎస్ కూడిన సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. నాలుగు నెలల్లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా ఉంది. – టి.రమేశ్రెడ్డి, వయోజన విద్య ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఉల్లాస్ ప్రారంభానికి సన్నాహాలు.. స్వయం సహాయక సంఘాల్లోని 15 ఏళ్లపైబడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఇన్ సొసైటీ) కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి. ఆగస్టు–సెప్టెంబర్లో అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వయోజన విద్య అధికారులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సెర్ప్ సహకారంతో నిరక్షరాస్యులను గుర్తించే ప్రక్రియ చేపట్టారు. 2025–2026 సంవత్సరానికి ప్రతి జిల్లాలో కొంతమందిని గుర్తించారు. నిరక్షరాస్యులైన అతివలు అక్షరాస్యత వైపు.. స్వయం సహాయక సభ్యులందరికీ చదువు జిల్లాల్లో టీచర్లకు శిక్షణ షురూ గ్రామస్థాయిలో వలంటీర్లకూ శిక్షణ వలంటీర్ టీచర్ల ద్వారానే బోధన ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,61,613 మంది నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల గుర్తింపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను ఇటీవల అధికారులు గుర్తించారు. వీరని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆదిశగా వయోజన విద్య అధికారులు ముందుకు సాగుతున్నారు. వారిని ఉల్లాస్ యాప్లో నమోదు చేస్తారు. ఇంకా మిగిలిపోయిన నిరక్షరాస్యులు ఉంటే వారిని 2026–2027 వరకు వంద శాతం అక్షరాస్యులుగా తీర్దిదిద్దాలనేది ఉల్లాస్ కార్యకమ లక్ష్యంగా ఉంది. -
ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్కు కృషి
నెక్కొండ: మండల పరిధిలోని రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్కు కృషి చేస్తున్నట్లు మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్సింగ్ని కలిసి రైళ్ల హాల్టింగ్ విషయం గురించి వివరించి వినతి పత్రం అందించారు. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్టింగ్ నిలిపి వేయడంతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి ఎంపీ బలరాం నాయక్ దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించిన ఎంపీ మంత్రిని ఢిల్లీలో కలిసి 9 మండలాల ప్రజలు సుమారు 300 మంది రైలు మార్గం ద్వారా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తారని వివరించారు. త్వరలోనే పలు రైళ్ల హాల్టింగ్కు మోక్షం లభించనుందని ఎంపీ తెలిపారు. ఎంపీ పోరిక బలరాంనాయక్ -
కేయూలో ముందస్తు రక్షాబంధన్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఉద్యోగులు ముందస్తుగా గురువారం రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. పరిపాలనా భవనంలో వీసీ ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, ఫైనాన్స్ ఆఫీసర్ మహ్మద్అబీబుద్దీన్కు మహిళా ఉద్యోగులు డాక్టర్ ఎస్.సుజాత, బి.కృష్ణవేణి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం అభివృద్ధిలో ప్రతిఒక్కరి తోడ్పాటు అవసరమన్నారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్రీలతాదేవి, సూపరింటెండెంట్లు హేమారాణి, పి.నర్మద, ఎస్.పద్మావతి, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించాలి
నర్సంపేట: ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను, ఎస్సీ కుల వర్గీకరణకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి బేషరతుగా బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ పెంపుదల, ఎస్సీ కులాల వర్గీకరణకు శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి ఆమోదం పొందిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి దేశంలో కులగనను చేపట్టాలన్నారు. సామాజికంగా అణచివేతకు గురవుతున్న కులాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని, ఎస్సీ కులాల వర్గీకరణ బిల్లును సైతం ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే కాలంలో బీసీ, ఎస్సీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ డివిజన్ నాయకులు జక్కుల తిరుపతి, బరిగల కుమార్, గొర్రె ప్రదీప్, ఐఎఫ్టీయూ నాయకులు కొత్తూరు రవి, గొల్లన అశోక్, తదితరులు పాల్గొన్నారు. న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేందర్ -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీలక్ష్మి, గార్ల -
ఆర్టీసీ పండుగల ప్రత్యేకం
హన్మకొండ: వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి ప్రయాణికుల రద్దీ పెరగనుండడంతో టీజీఎస్ఆర్టీసీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ప్రయాణికులను సురక్షితంగా, సుఖవంతంగా గమ్యస్థానా లకు చేరవేసేందుకు ఐదు రోజులు ప్రత్యేక బస్సులు నడుపనుంది. ప్రయాణికులు ప్రైవేటు వాహనా ల్లో వెళ్లకుండా నియంత్రించడంతో పాటు ఆర్టీసీకి ఆదాయాన్ని రాబట్టుకోవడం..సురక్షితంగా ప్రయాణికులను చేరవేసేందుకు పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 8న వరలక్ష్మి వ్రతం, 9న రాఖీ పౌర్ణమి కావడంతో పాటు 10న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సొంతూళ్లకు బయలుదేరుతారు. దీంతో ప్రయాణికుల రద్దీ పెరుగనుండడంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. ఈనెల 7 నుంచి 11వ తేదీ వరకు వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి హైదరాబాద్కు ప్రత్యేక బస్సులు నడిపేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. హనుమకొండ బస్ స్టేషన్, ఉప్పల్ పాయింట్లో ప్రయాణికుల రద్దీని పర్యవేక్షించడానికి, అవసరాన్ని బట్టి బస్సులు సమకూర్చడానికి 24 గంటలు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఉప్పల్ పాయింట్లో టెంట్లు, తాగునీటి సదుపాయం, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. హనుమకొండ–హైదరాబాద్ ఉప్పల్ రూట్తో పాటు వరంగల్ రీజియన్లోని 9 డిపోల పరిధిలోని బస్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీని అనుసరించి అదనపు బస్సులు నడిపేలా అధికారులు సమాయత్తమయ్యారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం. ఈ దిశగా వరలక్ష్మివ్రతం, రాఖీ పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, క్షేమంగా గమ్యస్థానా లకు చేరేందుకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. రీజియన్ పరిధిలోని సోదరసోదరీమణులంతా ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. –డి.విజయభాను, ఆర్టీసీ ఆర్ఎం వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమికి పెరగనున్న రద్దీ నేటి నుంచి ఐదు రోజుల పాటు ప్రత్యేక బస్సులు వరంగల్ రీజియన్లో9 డిపోల నుంచి హైదరాబాద్కు బస్సుల పెంపు -
ఎంజీఎంకు వైద్య పరికరాల అందజేత
ఎంజీఎం : వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వివిధ వ్యాధులతో బాధపడే పేద రోగులకు సేవలందించడం కోసం సుబేదారిలోని కాకతీయ హైస్కూల్కు చెందిన 1990 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు ఒక డీ – ఫీబ్రీలెటర్, 12 వీల్ చైర్లను బుధవారం ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్కుమార్, డాక్టర్ రాంకుమార్రెడ్డి, ఆర్యంల సమక్షంలో ఆర్ఎంఓకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు సత్యనారాయణరావు, విజయకుమార్, శ్రీనివాస్, చిట్టి కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
వంగర పీహెచ్సీలో డీఎంహెచ్వో సందర్శన
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని వంగర పీహెచ్సీని డీఎంహెచ్వో డాక్టర్ ఎ.అప్పయ్య బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రంలో జరుగుతున్న వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. అలాగే ఎన్సీడీ స్క్రీనింగ్, ఫీవర్ సర్వే, డ్రైడే కార్యక్రమం, తల్లిపాల ప్రాముఖ్యం గురించి గర్భిణులకు సిబ్బంది వివరిస్తున్న తీరును, పోషణ లోపం ఉన్న పిల్లలను ఏవిధంగా మానిటరింగ్ చేస్తున్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు ఆరోగ్య కేంద్రాలకు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను సిబ్బంది డీఎంహెచ్వో దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా బీపీ, షుగర్ ట్రీట్మెంట్ ప్రైవేట్లో చికిత్స పొందుతున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రుల వైపు మళ్లించాలన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పీహెచ్సీలోని బిల్డింగ్ను, రూఫ్ నుంచి నీరు లీకయ్యే ప్రదేశాలను డీఎంహెచ్వో పరిశీలించారు. ఆయన వెంట జిల్లా వైద్య అధికారులతో పాటు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రహమాన్, డాక్టర్లు రుబీన అఫ్రోజ్, రాజశేఖర్, జ్యోతి, అరుణ, ఆశా కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు. -
సాగునీటి పనుల కోసం పాదయాత్ర
● స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య వేలేరు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.104 కోట్లతో ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఎమ్మెల్యే కడి యం శ్రీహరి పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. సాగునీటిపనుల పునఃప్రారంభం కోసం త్వరలోనే వేలేరు నుంచి గండిరామారం వరకు పాదయాత్ర చేస్తానని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం మండలంలోని మద్దెలగూడెం, పీచర, శాలపల్లి, గొల్లకిష్టంపల్లి, వేలేరులో ఆయన ఊరూరా సంక్షేమ ఫలాలు–ఇంటింటికీ కేసీఆర్ పథకాలు కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మండల ఇంచార్జి భూపతిరాజు, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మండల కోఆర్డినేటర్ గోవింద సురేశ్, నాయకులు రాజేశ్వర్రెడ్డి, నర్సింగరావు, సూత్రపు సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి
హన్మకొండ అర్బన్: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, జడ్జి క్షమాదేశ్ పాండే అన్నారు. బుధవారం జులైవాడలో ప్రభుత్వ బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు..బాలికలు చదువు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని, అందుకు తగినట్లుగా ప్రభుత్వం కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ఆశా యూనిట్ మెంబర్ పి.శ్రీనివాస్, సీడబ్ల్యూసీ మెంబర్ దామోదర్, హెచ్ఎం రమాదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. రేపు పాలిసెట్ స్పాట్ అడ్మిషన్లురామన్నపేట: టీజీ పాలిసెట్–2025 కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 8న(శుక్రవారం) స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్, టీజీ పాలిసెట్ హెల్ప్లైన్ సెంటర్, వరంగల్ క్యాంప్ ఆఫీసర్ బైరి ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పాట్ అడ్మిషన్లకు టీజీ పాలిసెట్–2025లో అర్హత పొందిన, పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్లో వివిధ కేటగిరీల్లో మిగిలి ఉన్న 28 సీట్లకు ఈ అడ్మిషన్లు ఉంటాయని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 8న ఉదయం 10 గంటల వరకు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో హాజరుకావాలని పేర్కొన్నారు. విద్యార్థులు వారి వెంట టీసీ, ఎస్సెస్సీ మెమో, స్టడీ, కుల సర్టిఫికెట్స్, ఆధార్కార్డు, టీజీ పాలిసెట్–2025 ర్యాంక్ కార్డు, ఇతర అవసరమైన ధ్రువపత్రాలు తీసుకొని రావాలని కోరారు. వివరాలకు http://tgpolycet.nic.in వెబ్సైట్ సందర్శించాలని వివరించారు. -
స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్
హన్మకొండ: తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు అహర్నిశలు పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకు ని హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలోని జయశంకర్ విగ్రహానికి బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చనిపోయే వరకు తెలంగాణ కోసం పోరాడారన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడంతోపాటు ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్రెడ్డి, జయశంకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్ -
ప్రకృతితో అనుబంధం
ప్రతీది ప్రకృతితో అనుబంధంగానే మా జీవన విధానం ఉంటుంది. మా పంటలు, కుటుంబాలతోపాటు, ఆడపిల్లకు సరైన వరుడిని కూడా ప్రకృతి అనుమతితోనే పొందాలన్నదే తీజ్ ఉద్దేశం. చిన్నతనంలో పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లం.. ఇప్పటికీ తీజ్ ఉత్సవాల్లో పాల్గొనడం అంటే భలే ఇష్టం. – భూక్య ఉమ, మహబూబాబాద్అంతా మేరామా యాడీ దయ మా కుల దేవతలు సేవాలాల్, మేరామా యాడీ(గౌరీ దేవి)కి పూజలు చేసి తీజ్ పండుగను ప్రారంభిస్తాం. అంతా అమ్మవారే చూసుకుంటారని నమ్మకం. అందుకోసం గోధుమలు తెచ్చి నిష్టతో తొమ్మిది రోజులు పూజలు చేస్తాం. యువతులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడడం సరదాగా ఉంటుంది. – జాటోత్ ఝాన్సీ లక్ష్మి, గార్ల -
కుట్రలో భాగమే కాళేశ్వరంపై దుష్ప్రచారం
మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్రెడ్డిహన్మకొండ: కుట్రలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ నాయకులు కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే.. కేసీఆర్ మన తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అని రుజువు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర చేస్తుంటే మాజీ మంత్రి హరీశ్రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలు వివరించారన్నారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమేనని.. జడ్జిమెంట్ కాదన్నారు. కాళేశ్వరం మూడు పిల్లర్లు కుంగితే ప్రభుత్వ పెద్దదే బాధ్యత అయితే... సివిల్ సప్లై శాఖలో రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని, దీనిని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్ చేసినట్లేనా నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, నాయకులు చెన్నం మధు, నర్సింగరావు, జనార్దన్ గౌడ్, పులి రజినీకాంత్, హరి రమాదేవి పాల్గొన్నారు. -
స్టోన్ క్రషర్లపై ‘మైనింగ్’ కత్తి
రాయల్టీ, లీజు తదితర బకాయిదారులపై దృష్టి ● లీజు రద్దు చేసి టెండర్ల ద్వారా కేటాయించే యోచన ● ఆదాయం పెంచుకునే దిశగా ప్రభుత్వం కసరత్తు ● ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఏడు గ్రానైట్ క్వారీలు, క్రషర్లు ● ముగిసిన టెండర్ల ప్రక్రియ.. త్వరలో అర్హులకు కేటాయింపుమెటల్ క్రషర్ (ఫైల్) సాక్షిప్రతినిధి, వరంగల్: గ్రానైట్ క్వారీలు, స్టోన్ క్రషర్ల అక్రమ దందాను అరికట్టేందుకు గనుల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన రాయల్టీని రూ.లక్షల్లో కాజేస్తున్న నిర్వాహకులపై కొరడా ఝుళిపించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో గ్రానైట్ క్వారీలు, రోడ్, స్టోన్ మెటల్ (కంకర) క్రషర్ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు గనులశాఖ దృష్టి సారించింది. ఇందుకు ప్రభుత్వ భూముల్లో గుట్టలు, మైనింగ్కు అనువైన స్థలాలను గుర్తించి టెండర్ ద్వారా లీజుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టింది. తొలి ప్రయత్నంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 గ్రానైట్, స్టోన్ మెటల్ క్వారీలకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అక్రమాలకు ఇక అడ్డుకట్ట.. ఉమ్మడి వరంగల్లో సుమారు 360కి పైగా కంకర క్రషర్లు, 100కు పైగా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఒక్క హనుమకొండ జిల్లాలోనే 29 బ్లాక్, 33 కలర్ గ్రానైట్, 64 స్టోన్ మెటల్, క్వార్ట్జ్, గ్రావెల్ క్వారీలు రెండు కలిపి 128 ఉన్నాయి. ఇందులో సగం వరకు రాజకీయ నాయకులు, వారి అనుచరులవే ఉన్నా యి. అనుమతి లేకుండా రాతి క్వారీలు నిర్వహిస్తు న్నా, అనుమతి తీసుకుని నిబంధనలు ఉల్లంఘించి ఫ్రాడ్ చేసినా రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.ఐదు లక్షల జరిమానా విధించే చట్టాలు చుట్టాలుగా మా రుతున్నాయి. కొన్నేళ్లుగా రూ.కోట్ల విలువ చేసే రా తి ఖనిజం కంకర,గ్రానైట్ రూపేణా దోపిడీకి గురైంది. తవ్వి తరలించిన దానికి.. ప్రభుత్వానికి రాయల్టీ కట్టే సమయంలో చూపించే లెక్కలకు పొంతన లేకపోగా.. 30నుంచి 50 శాతం వరకే చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిచోట్ల లీజు పరిమితి తీరి నా.. ఇంకా గ్రానైట్, కంకర క్వారీలు నడుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. క్వారీల్లో పేలుడుకు సంబంధించి ఇష్టారాజ్యంగా జిలెటిన్స్టిక్స్ను సరైన భద్రతా చర్యలు లేకుండా తరలిస్తున్నారు. రవాణా సమయంలో భారీ కుదుపులు వచ్చినా, ఎదురుగా ఏదైనా వచ్చి వాహనాన్ని ఢీకొన్నా భారీ పేలుడు జరిగే ప్రమాదం ఉంటుంది. అధికారుల తనిఖీలు సక్రమంగా లేకపోవడంతో అక్రమార్కులు సరైన భద్రతా వ్యవస్థ లేకుండానే జిలెటిన్స్టిక్స్ తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిపై సమీక్షలు చేసిన గనులశాఖ ప్రత్యేక బృందాలను నియమించి క్వారీల వారీగా లీజు అగ్రిమెంట్లు పరిశీలి స్తూ లీజు, రాయల్టీ బకాయిల లెక్కలు తీస్తోంది.మొదట ఏడు క్వారీలు.. ప్రభుత్వ స్థలాలు, గుట్టలను గుర్తించి గ్రానైట్, కంకర క్వారీలను టెండర్ల ద్వారా కేటాయించేందుకు శ్రీకారం చుట్టిన గనులశాఖ.. మొదట ఉమ్మడి జిల్లాలో ఏడు క్వారీల టెండర్లు ఈ నెల 12 ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లా ఊరుగొండలో రెండు స్టోన్ మెటల్, రెండు కలర్ గ్రానైట్ క్వారీలు, ఆత్మకూరు మండలం పెద్దాపూర్లో బ్లాక్ గ్రానైట్ క్వారీలు ఈ టెండర్లలో ఉన్నాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం లోహితలో కంకర క్వారీ, జనగామ జిల్లా చిల్పూరు మండలం శ్రీపతిపల్లిలో ఒకటి, జఫర్గఢ్ మండలం హిమ్మత్నగర్లో ఒకటి చొప్పున రెండు క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. కాగా, గనుల శాఖ నోటిఫికేషన్ మేరకు జూలై 17న డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 6 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ భూముల్లో క్రషర్లు నడుపుతూ రాయల్టీ, లీజు డబ్బులు చెల్లించని 22 మందికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అలాగే, కంకర, గ్రానైట్ కోసం తీసిన రాయికి రాయల్టీ కట్టని వారు.. గనులశాఖకు సూచించిన క్యూబిక్ మీటర్లను మించి రాయి తీసి తనిఖీల్లో దొరికి పెనాల్టీ చెల్లించని వారికి కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. 10–15 రోజుల్లో సదరు నిర్వాహకులు స్పందించకుంటే ఆ లీజులు సైతం రద్దు చేసి టెండర్లు పిలిచే అవకాశం ఉంటుందని మైనింగ్శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆగస్టుపైనే ఆశలు
సాక్షి, వరంగల్: జిల్లాపై వరుణుడు కరుణిస్తేనే చెరువులు, కుంటలు, వాగులు నిండనున్నాయి. ఈ ఏడాది జూన్లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా.. జూలైలో అదనంగా 15 శాతం వర్షం కురవడంతో 11 శాతం లోటు ఉంది. ఆగస్టు నెలలో సాధారణం మించి వర్షాలు కురిస్తే లోటు వర్షపాతం లెక్క సరిపోతుంది. ఫలితంగా చెరువులు, కుంటలు, వాగులు జలకళ సంతరించుకుని పంటలు పండుతాయి. భూగర్భ జలాలు పెరిగే అవకాశముంటుంది. గతేడాది ఆగస్టు మాదిరిగానే లోటు వర్షపాతం ఉంటే ఇప్పుడు ఇబ్బందులు తప్పవని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 251.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఈ నెల నాలుగో తేదీ వరకు 36.7 మిల్లీమీటర్లు కురిసింది. ఈ నెలాఖరు వరకు భారీ వర్షాలు కురిసి సాధారణ వర్షపాతం మించాలని, గతేడాది మాదిరిగానే ఈ ఏడాది సెప్టెంబర్లో అత్యధిక వర్షపాతం నమోదైతే చెరువులు, కుంటలు నిండుకుండలా మారనున్నాయి. ఇప్పటికే జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్, పర్వతగిరి, రాయపర్తి, సంగెం, నర్సంపేట, గీసుకొండ మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. వర్షాలు ఎక్కువగా కురవాలని రైతులు పూజలు చేస్తున్నారు. జూలైలో 15 శాతం ఎక్కువ.. జూన్లో 153.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 113.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో 271.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 312.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్లో 26 శాతం లోటు వర్షపాతం ఉండగా, జూలైలో 15 శాతం అదనంగా వర్షం కురిసింది. ఆగస్టు ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు 37.3 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 36.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నర్సంపేట, పర్వతగిరి, నెక్కొండ మినహాయించి మిగిలిన మండలాల్లో లోటు వర్షపాతం ఉందని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోల్చినా లోటు వర్షపాతమే.. జూన్లో 154.2 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 188.2 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో 273.2 మిల్లీమీటర్లకు 299.4 మిల్లీమీటర్లు, ఆగస్టులో 251.9 మిల్లీమీటర్లకు 181.6 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. సెప్టెంబర్ నెలలో 175 మిల్లీమీటర్లకు 367.4 మిల్లీమీటర్లు కురిసింది. అంటే 2024–25 సంవత్సరంలో జూన్, జూలై నెలలో 487.6 మిల్లీమీటర్లు కురిస్తే ఈ ఏడాది జూన్, జూలై నెలలో 426.7 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. ఈ లెక్కన చూసుకుంటే 12 శాతం లోటు వర్షపాతం ఉంది.వరుణుడు కరుణిస్తేనే లోటు వర్షపాతం అధిగమించే అవకాశం జూన్లో తక్కువ, జూలైలో ఎక్కువగా కురిసిన వర్షాలుఈ ఏడాది జూన్ నుంచి ఆగస్టు నాలుగు వరకు వర్షపాతం వివరాలు (మిల్లీమీటర్లలో).. లోటు వర్షపాతం ఎక్కడంటే.. మండలం కురవాల్సింది కురిసింది వరంగల్ 460.3 420 ఖిలా వరంగల్ 455.8 336.7 పర్వతగిరి 423.1 420.6 రాయపర్తి 376.9 250.2 సంగెం 455.4 438.5 నర్సంపేట 527.3 516 గీసుకొండ 452.9 442.9 ఎక్కువగా నమోదైన వర్షపాతం వివరాలు దుగ్గొండి 442.9 472.1 నల్లబెల్లి 513.2 515.8 ఖానాపురం 554.9 642.6 చెన్నారావుపేట 515.2 682.1 వర్ధన్నపేట 333.3 369.3 నెక్కొండ 503.4 520 -
భూ భారతి దరఖాస్తులు పరిశీలించాలి
నెక్కొండ: భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద రెవెన్యూ అధికారులను ఆదేశించారు. నెక్కొండ తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆ సమయంలో డిప్యూటీ తహసీల్దార్ రవి కార్యాలయంలో లేకపోవడంతో కలెక్టర్ మెమో జారీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను ఆమె పరిశీలించి మాట్లాడుతూ పర్సనల్, మూమెంట్ రిజిస్టర్లు నిర్వహించాలని, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. ఈ నెల 15లోగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు భూ భారతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. పాత రికార్డులను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పూర్తి చేయాలని ఆమె సూచించారు. దరఖాస్తులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీఏఓ ఫణికుమార్, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. పర్వతగిరి తహసీల్దార్ కార్యాలయం తనిఖీపర్వతగిరి: తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ భారతి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భూ భారతి దరఖాస్తులు పరిశీలించేందుకు గడువు ఆగస్టు 15 వరకు ఉందని తెలిపారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి పాత రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి గురువారంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీఏఓలు ఫణికుమార్, డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
దాడిచేసిన 8 మందిపై కేసు
సంగెం: దాడి చేసిన 8 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈ నెల 3వ తేదీన రాత్రి రామచంద్రాపురం గ్రామానికి చెందిన నక్క ప్రవళిక కూతురికి చెవులు కుట్టించే ఫంక్షన్ చేస్తోంది. అదే గ్రామానికి చెందిన జక్క సతీశ్, శ్రీనివాస్, సుధాకర్, కత్తుల రాజాలు, నాగరాజు, ఇటుకాలు కరుణాకర్, జక్క శ్రీకాంత్, చిదురాల శ్రీను వచ్చి పాతకక్షలు మనసులో పెట్టుకుని ప్రవళిక కుటుంబ సభ్యులపై దాడి చేసి చంపుతామని బెదిరించారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ‘కిషోర రక్ష’ పరిశీలన గీసుకొండ: మండంలోని వంచనగిరి కేజీబీవీలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలు అవుతున్న కిషోర రక్ష ఆరోగ్య కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ డాక్టర్ సాంబశివరావు బుధవారం పరిశీలించారు. విద్యార్థినుల కోసం చేస్తున్న వంట, కిచెన్ గార్డెన్తో పాటు పాఠశాల పరిసరాలు ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. మురుగునీటి తొలగింపుదుగ్గొండి: మండల కేంద్రంలోని రైతు వేదిక– అంగన్వాడీ కేంద్రం మధ్య పేరుకుపోయిన మురుగునీటిని తొలగించారు. ‘అలా.. కవర్ చేశారు’ శీర్షికన బుధవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ ఇన్చార్జ్ కార్యదర్శి నూనె వేణుకుమార్ జేసీబీ సాయంతో కందకం తీయించి గుంతలో నుంచి నీటిని తొలగించారు. మట్టి పోయించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. మనుబోతులగడ్డలో ట్రాక్టర్ దహనం ఖానాపురం: గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్ను దహనం చేసిన సంఘటన మనుబోతులగడ్డలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం...గ్రామానికి చెందిన బానోత్ ఈర్యనాయక్ తన ట్రాక్టర్ను సాయంత్రం ఇంటి వద్ద పార్కింగ్ చేశాడు. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఆగంతకులు పెట్రోల్ పోసి ట్రాక్టర్ను అంటించి వెళ్లిపోయారు. ఉదయాన్నే చూడగా ట్రాక్టర్ ఇంజన్ దగ్ధమై ఉండడాన్ని గమనించారు. ట్రాక్టర్ ఇంజన్ వద్ద అగ్గిపుల్లలతో పాటు పెట్రోల్ ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే పోలీస్స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి ఎస్సై రఘుపతి చేరుకుని వివరాలు సేకరించారు. రూ.1.50 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ట్రాక్టర్ను మాజీ ఎంపీపీ ప్రకాశ్రావు, నాయకులు సోమయ్య, అశోక్యాదవ్, శ్రీనివాస్, పూలునాయక్ పరిశీలించారు. నిందితులను తక్షణమే గుర్తించి శిక్షించాలని కోరారు. బీజేపీకి అండగా నిలవాలిపార్టీ జిల్లా అధ్యక్షుడు రవికుమార్ వర్ధన్నపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ కోరారు. బీజేపీ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇల్లంద గ్రామ కేంద్రంలో గడప గడపకు వెళ్లి బీజేపీ పాలనను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. మండల కన్వీనర్ రాయపురపు కుమారస్వామి, మండల ప్రభారి గోకే వెంకటేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి సత్యం ఉన్నారు. -
మా బడికి బస్సొచ్చిందోచ్!
● వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థుల హర్షం ● కలెక్టర్ ఆదేశాలతో వరంగల్ నుంచి ప్రారంభం ● ఫలించిన ప్రిన్సిపాల్ సునీత ప్రయత్నం గీసుకొండ: మండలంలోని వంచనగరి మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీకి హనుమకొండ డిపో నుంచి బస్సు సౌకర్యం కల్పించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం ఆర్టీసీ బస్సు వరంగల్ బస్టాండ్ నుంచి బయలుదేరి పలు స్టాపుల్లో మోడల్ స్కూల్ విద్యార్థులను తీసుకుని వంచనగిరి రైల్వేగేట్ వద్దకు చేరుకుంది. అక్కడ విద్యార్థులు బస్సు దిగి సమీపంలోని మోడల్ స్కూల్కు వెళ్లారు. బస్సు సౌకర్యం కల్పించాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సునీత ఇటీవల కలెక్టర్కు విన్నవించారు. దీంతో కలెక్టర్ స్పందించి బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో ప్రిన్సిపాల్తోపాటు కలెక్టర్కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. వంచనగిరి రైల్వేగేట్ అండర్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేసి స్కూల్ వరకు బస్సు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. -
గ్రూపు లీడర్, సీఓ చేతివాటం
వర్ధన్నపేట: అప్పు తీరిందని బ్యాంకుకు వెళ్లిన మహిళా సంఘం సభ్యులు.. అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్తో కంగుతిన్నారు. బాధిత మహిళలు తెలిపిన వివరాల ప్రకారం.. డీసీ తండా పరిధిలోని శ్రీతులసి మహిళా సంఘంలో 12 మంది సభ్యులు బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నారు. ఇందులో రూ.8 లక్షలు 12 మంది సభ్యులు పంచుకోగా.. మిగిలిన రూ.2 లక్షలు మాత్రం సంఘం అధ్యక్షురాలు ఆంగోత్ అమ్మి, సీఓ ఆంగోత్ సరిత వ్యక్తిగతంగా వాడుకున్నారని తెలిపారు. మూడు సంవత్సరాల నుంచి సభ్యులు తీసుకున్న రుణం రూ.8 లక్షలకు వడ్డీతో కలిపి రూ.9.40 లక్షలు బ్యాంకు చెల్లించామని, మళ్లీ ఇప్పుడు రుణం కావాలని బ్యాంకుకు వెళ్లి అడిగామని పేర్కొన్నారు. ఇంకా రూ.2 లక్షలు అసలు, వడ్డీతో కలిపి మొత్తం రూ.4.40 లక్షలు చెల్లిస్తేనే మళ్లీ రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. దీంతో కంగుతిన్న సభ్యులు సీఓను బ్యాంకుకు తీసుకొచ్చి బ్యాంకు అధికారులను స్టేట్మెంట్ అడుగగా రూ.10 లక్షలు రుణం తీసుకున్నట్లు తెలిపారు. రూ.2 లక్షలు ఎవరు వాడుకున్నారని అధ్యక్షురాలిని గట్టిగా నిలదీశారు. రూ.2 లక్షలు తానే వాడుకున్నట్లు మళ్లీ చెల్లిస్తానని అధ్యక్షురాలు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇందులో సీఓ హస్తం కూడా ఉందని పేర్కొన్నారు. వెంటనే అధ్యక్షురాలు, సీఓపై చర్య తీసుకోవాలని వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సంఘం సభ్యులు -
పుట్టగొడుగుల పెంపకం లాభదాయకం
● డీఆర్డీఓ కౌసల్యాదేవి ● దుగ్గొండిలో శిక్షణ శిబిరం పరిశీలనదుగ్గొండి: అధిక పోషక విలువలు ఉన్న పుట్టగొడుగుల పెంపకం లాభదాయకంగా ఉంటుందని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయంలో ఉన్నతి కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 10 రోజుల శిక్షణ శిబిరాన్ని ఆమె బుధవారం పరిశీలించి మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధితో మరింత ముందుకు సాగాలన్నారు. ఉపాధిలో 100 రోజులు పనిచేసిన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతితోపాటు రోజుకు రూ.307 చొప్పున ఉపాధి పథకంలో భాగంగా చెల్లించనున్నట్లు వివరించారు. నైపుణ్య శిక్షణ పొందిన వారికి లక్పతి దీదీ పథకం కింద రూ.ఐదు లక్షల రుణం అందించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అనంతరం చాపలబండ, అడవిరంగాపురం గ్రామాల్లో పండ్ల తోటలు, గ్రామ నర్సరీలు, పశువుల షెడ్లను ఆమె పరిశీలించారు. అదనపు పీడీ రేణుక, డీపీఎం సుజాత, ఎంపీడీఓ అరుంధతి, ఏపీఓ శ్రీనివాస్, ఏపీఎం రమేశ్, ట్రైనర్ బాలస్వామి, మొగిలి పాల్గొన్నారు. -
ఇడియట్ ముచ్చట్లు చెప్పకు..!
గీసుకొండ: మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, శాయంపేట హవేలి, మరియపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో లబ్ధిదారుడు మూడు నర్సింహకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పది మందికి ఇళ్లు మంజూరు కాగా, నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో సంబంధిత ఏఈ వినోద్ను వివరణ కోరారు. అందులో ఒకరి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కావడంతో జాప్యం జరిగిందని ఏఈ వివరణ ఇస్తుండగా, ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ‘నీ వయస్సు ఎంత’ అని ఏఈని ప్రశ్నించగా.. 28 ఏళ్లు అని చెప్పాడు. ఇడియట్ ముచ్చట్లు చెప్పకు డీఈకి ఫోన్ చెయ్ అంటూ పరుష పదజాలంతో ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన 45 రోజుల్లో బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టాలని, లేకుంటే అవి రద్దవుతాయని అన్నారు. నిర్మాణాల విషయంలో జాప్యం జరిగితే పంచాయతీ కార్యదర్శి, సంబంధిత ఏఈలకు మెమోలో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాలలో కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒకే కుటుంబానికి రెండు ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు తెలపగా, జక్కుల రాజ్కుమార్, సాయిలి రమాదేవికి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే రద్దు చేయాలని అధికారులను ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. కొమ్మాలలో ప్రజా గ్రంథాలయానికి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థలం కేటాయించాలని, సెర్ప్ మహిళా సంఘాలకు డైరీ ఫాం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎండీ.రియాజుదీ్దన్, ఎంపీడీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శంకర్రావు, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు దూల వెంటేశ్వర్లు, వీరాటి రవీందర్రెడ్డి, కూసం రమేష్, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, సాయిలి ప్రభాకర్, మూడు నర్సింహ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల సరిత, సెర్ప్ సీసీ కోల శోభ, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక తదితరులు పాల్గొన్నారు. -
108 వాహనం తనిఖీ
దుగ్గొండి: మండల కేంద్రంలో 108 వాహనాన్ని జిల్లా మేనేజర్ నజీర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎంత మంది రోగులకు సేవలందిస్తున్నారు, ఏ ఆస్పత్రుల్లో చేర్పిస్తున్నారు, బాధితుల నుంచి ఫోన్ వచ్చాక ఎంత సమయంలో అక్కడికి చేరి సేవలందిస్తున్నారు అనే వివరాలను అడిగి తెలుసుకున్నా రు.108 సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస్, మెడికల్ టెక్నీషియన్ రేణుక, వాహన పైలట్ కోతి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీగీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్కు చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి మంగళవారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. హనుమకొండలోని ఆయన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. లబ్ధిదారులు నిబంధనల మేరకు గుడు వులోపు ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఎవరైనా లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే నేరుగా తన దృష్టికి తేవాలన్నారు. కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పర్వతగిరి: కేంద్రం నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి ఆధ్వర్యంలో ‘ఇంటింటికి బీజేపీ–ప్రతి గడపగడపకు బూత్ అధ్యక్షుడు మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర పథకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి కీలక నిర్ణయాలతో మహిళా సాధికారత సాకరమైందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతంగౌడ్, మండల ప్రభారి రేసు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి జాటోత్ రవి, ఉపాధ్యక్షుడు గోనె సంపత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు చీమల చంద్రయ్య, బీజేవైఎం మండల అధ్యక్షుడు గొల్లపల్లి సంతోష్, మండల ఉపాధ్యక్షుడు పాయలి యాకయ్య, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బాదావత్ మారుతి, బూత్ అధ్యక్షులు నవీన్, భాస్కర్, వెంకన్న, కుమారస్వామి, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు తాటికాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్లు, రేషన్కార్డులతో పేదల్లో సంతోషం
దుగ్గొండి/నల్లబెల్లి: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్కార్డులతో పేదలు సంతోషంగా ఉన్నారని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. దుగ్గొండి, నల్లబెల్లి మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నూతన రేషన్కార్డుల పంపిణీని మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు, రేషన్కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దశలవారీగా హామీలను నెరవేరుస్తోందని తెలిపారు. యూరియా కొరత కృత్రిమంగా కొందరు సృష్టించిన వదంతులు మాత్రమేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గతంలో వచ్చిన యూరియా కంటే నియోజకవర్గానికి 150 టన్నులు అదనంగా వచ్చిందని వివరించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే యూరియా వాడాలని, నానో యూరియాతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గానికి మొదటి విడత 3,750 ఇళ్లు మంజూరు చేశామని, ఇంకా కొంతమంది పనులు ప్రారంభించలేదన్నారు. వారంతా వెంటనే పనులు ప్రారంభిస్తే మరో 3,500 ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల శాఖ అఽధికారి కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రాజేశ్వర్రావు, కృష్ణ, ఎంపీడీఓలు రవి, అరుంధతి, ఏఓలు, రజిత మాధవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేశ్, ఎర్రల్ల బాబు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరి
● డీఎంహెచ్ఓ సాంబశివరావు ఎంజీఎం: గర్భిణులు అన్ని పరీక్షలతోపాటు ఎయిడ్స్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని, ప్రసవానికి ముందు 9వ నెలలో ఎయిడ్స్ పరీక్షలు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా వైద్యాధికారి సాంబశివరావు సూచించారు. ఐఎంఏ హాల్లో డీడబ్ల్యూఓ రాజమణి అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్, కంట్రోల్ యూనిట్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు అవగాహన, శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎయిడ్స్ అంటు వ్యాధి కాదని, ఎయిడ్స్ నివారణకు ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎయిడ్స్ నిర్దారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రోగ్రాం అధికారి డాక్టర్ మోహన్సింగ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ స్వప్నమాధురి, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఐసీటీసీ సూపర్వైజర్ రామకృష్ణ, అసిస్టెంట్ అకౌంటెంట్ కమలాకర్ పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి ఖానాపురం: విద్యార్థులు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. అశోక్నగర్ కేజీబీవీలో మంగళవారం వైద్యశిబిరాన్ని నిర్వహించారు. వైద్యశిబిరాన్ని డీఎంహెచ్ఓ సాంబశివరావు సందర్శించి రికార్డులు, మధ్యాహ్న భోజనంతోపాటు కూరగాయలు పరిశీలించారు. పల్లె దవాఖానా వైద్యురాలు కల్పన, ఆర్బీఎస్కే డాక్టర్ రవీందర్, హెల్త్ సూపర్వైజర్ దామోదర్రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్ నవీన్, ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్ సబిత, సిబ్బంది రమాదేవి, రమ్య, దివ్య, అన్నపూర్ణ, ప్రిన్సిపాల్ మేనక పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’పై సర్కారు అసత్య ప్రచారం
గీసుకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు అసత్య ప్రచారం చేస్తోందని పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ అన్నారు. ఊకల్ పమీపంలోని ఎస్ఎస్ గార్డెన్లో ‘‘కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు–కమిషన్ వక్రీకరణ, వాస్తవాలు’ అంశంపై మాజీ మంత్రి హరీశ్రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన పవర్పాయింట్ ప్రజంటేషన్ను వీక్షించిన అనంతరం వారు మాట్లాడారు. గతంలో అసెంబ్లీ, కేబినెట్, గవర్నర్ ఆమోదం పొందిన ప్రాజెక్టుకు అనుమతులు లేవని, ఏకపక్షంగా నిర్ణయించారని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. గ్రామాల్లో తిరగలేని స్థితిలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ సర్కారు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఘోష్ కమిషన్ నివేదికలో ఎన్నో తప్పులు ఉన్నాయని వారు పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమకు మైక్కట్ చేయకుండా కాళేశ్వరంపై మాట్లాడే అవకాశం ఇస్తే దుమ్ము దులుపుతామని చెప్పడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. మాజీ జెడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, సుదర్శన్రెడ్డి, నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, బోడకుంట్ల ప్రకాశ్, పూండ్రు జయపాల్రెడ్డి, చల్లా వేణుగోపాల్రెడ్డి, అంకతి నాగేశ్వర్రావు, ముంత రాజయ్య, సిరిసె శ్రీకాంత్, సారంగపాణి, కోట ప్రమోద్ పాల్గొన్నారు. పరకాల, నర్సంపేట, వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్ -
నాణ్యమైన భోజనం అందించాలి
ఖానాపురం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. బుధరావుపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలు సరిగా లేకపోవడంతో ఉపాధ్యాయుడిని మందలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కొత్త బియ్యం వాడుతున్నామని మధ్యాహ్న భోజన ఇన్చార్జ్ ఉపాధ్యాయుడు చెప్పాడు. మరోసారి పరిశీలించగా పాతబియ్యం అని తేలడంతో ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. ఐనపల్లిలోని ఎంజేపీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. స్టోర్రూంలోని పాడైన బీట్రూట్, టమాటాలను స్వాధీనం చేసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్కు పంపించి, కాంట్రాక్టర్ను తొలగించాలని సూచించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కారం ఎక్కువగా వాడుతున్నందుకు అసహనం వ్యక్తం చేసి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు బోధించారు. ఆమె వెంట డీఏఓ అనురాధ, తహసీల్దార్ రమేశ్, ఏఓ శ్రీనివాస్ ఉన్నారు. క్యూఆర్కోడ్లు ఏర్పాటు చేయండి.. యూరియా పంపిణీ సమయంలో రైతులకు పేటీఎం (క్యూఆర్కోడ్)లను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. బుధరావుపేట శివారులో యూరియా పంపిణీని మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నగదు పంపిణీ చేస్తుండడంతో ఆలస్యమవుతోందని, పేటీఎం క్యూఆర్కోడ్లు ఏర్పాటు చేస్తే సమయం ఆదా అవుతుందన్నారు. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని తెలిపారు. మంగళవారిపేట, బుధరావుపేటకు వేర్వేరుగా యూరియా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని డీసీఓకు సూచించారు. డీఏఓ అనురాధ, ఏఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. గురుకులాలను తనిఖీ చేయాలి న్యూశాయంపేట: జిల్లాలోని గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను ప్రత్యేక అధికారులు తరుచూ తనిఖీలు చేయాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను అదేశించారు. కలెక్టరేట్లో గురుకుల పాఠశాలలు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక అధికారులతో మంగళవారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమించిన ప్రత్యేకాధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గురుకుల పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద బుధరావుపేట, ఐనపల్లిలో పాఠశాలల తనిఖీ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆనందం హన్మకొండ: ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు ఎ.ఆనందం అన్నారు. సోమవారం రాత్రి నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయ ఆవరణలోని స్పోర్ట్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని, ఆర్టిజన్న్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యాజమాన్యాన్ని కోరారు. అనంతరం అసోసియేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మాసు చొక్కారావు, కార్యదర్శిగా చుంచు శిరీష్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శితో పాటు మాజీ కార్యదర్శి దర్శనాల మొగిలయ్యను అసోసియేషన్ నాయకులు శాలువా కప్పి, పుష్పగుచ్చాలు అందించి సన్మానించారు. సమావేశంలో అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యదర్శి కుమారస్వామి పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
పరకాల: వర్షాకాలంలో ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ అన్నారు. మంగళవారం కమిషనర్ సుష్మ, మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారితో కలిసి మున్సిపాలిటీ పరిధి 9వ వార్డులోని శ్రీనివాసకాలనీలో పర్యటించారు. వర్షాకాలంలో వరద ముంపుతో ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంటుందని, కాల్వల నుంచి కొట్టుకొస్తున్న చెత్తా చెదారంతో కాలనీ ప్రజలు రోగాల పాలవుతున్నారని కమిషనర్కు పూర్ణాచారి వివరించారు. ఈసందర్భంగా సుష్మ మాట్లాడుతూ.. వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మిస్తున్న డ్రెయినేజీలతో పట్టణ ప్రజలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించినట్లు అవుతుందన్నారు. పారిశుద్ధ్యంతో పాటు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారితో పాటు శ్రీనివాసకాలనీవాసులు పాల్గొన్నారు. పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ వరద ముంపు ప్రాంతాల పరిశీలన -
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో స్కానింగ్ సెంటర్లు ఉన్న అన్ని ఆస్పత్రులు కచ్చితంగా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. లింగ నిర్ధారణ పరీక్షల నియంత్రణ చట్టం అమలులో భాగంగా.. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో జిల్లా స్థాయి మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. లింగ నిర్ధారణ, అబార్షన్లు నిర్వహించే వారి సమాచారాన్ని తెలి యజేసేందుకు సంబంధిత ఫోన్ నంబర్ 63000 30940 ను క్షేత్రస్థాయిలో పని చేస్తున్న ప్రతీ ఆశా కార్యకర్త, అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే మాట్లాడుతూ.. లీగల్ వలంటీర్ల ద్వారా లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వైద్య ఆరోగ్య శాఖకు సహకరిస్తామని తెలిపారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 8 సెంటర్లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీడబ్ల్యూఓ జయంతి, ఏసీపీ నరసింహారావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ మల్లయ్య, బన్ను ఆరోగ్య సేవల సొసైటీ ప్రతినిధి నీతి, ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ మంజుల, డెమో అశోక్రెడ్డి, గణాంక అధికారి ప్రసన్నకుమార్, కళ్యాణి, పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హెల్త్చెకప్ విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు హెల్త్ చెకప్ చేయించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో విద్యా, సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం తెలంగాణ ఓపెన్ స్కూ ల్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల పోస్టర్లు ఆవిష్కరించారు. ఇళ్ల పనులు ఇంకెన్నాళ్లు? హసన్పర్తి: ఆరునెలల క్రితం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు? ఇంకెన్నాళ్లు కొనసాగిస్తారు? అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రశ్నించారు. హసన్పర్తి మండలం పెంబర్తిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ పీడీ సిద్ధార్థనాయక్ తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఎంపీడీఓ రవి, ఎంపీఓ కర్ణాకర్రెడ్డి, ఏఈ సరిత, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్యసేవలు ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం ఆమె ఎల్కతుర్తి పీహెచ్సీని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఓపీ రిజిస్టర్, ఈ–ఔషధీ ఇండెంట్, రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. అనంతరం ఆశా డే సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వందశాతం ప్రసవాలు జరిగేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధి కారి శ్రీనాఽథ్, హెల్త్ సూపర్వైజర్ రామచంద్ర, నో డల్ పర్సన్ ఎండీ శుక్ర, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితర సిబ్బంది ఉన్నారు. అనంతరం ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో పై లట్ ప్రాజెక్టు కింద మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులు పరిశీలించారు. ఆమె వెంట గృహ ని ర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిద్ధార్థనాయక్, తహసీ ల్దార్ ప్రసాద్రావు, ఎంపీఓ రవి ఉన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
డెయిరీ ఏర్పాటుకు చర్యలు
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అధికారులతో అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్లో డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన అంశాలపై హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్యశారద, పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ.. డెయిరీ ద్వారా నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులను తీసుకొద్దామని, ఇందుకు అవసరమైతే ములుకనూరు మహిళా డెయిరీ సహకారం తీసుకుందామన్నారు. పాలసేకరణ నుంచి మార్కెటింగ్ వరకూ అన్నీ కూడా ప్రణాళిక ప్రకారంగా నాణ్యతగా ఉండేలా ప్రజల మన్నన పొందేలా కృషి చేయాలన్నారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. డెయిరీ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని కేటాయించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ములుకనూరు డెయిరీ జీఎం భాస్కర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. పంటలు పరిశీలించిన శాస్త్రవేత్తలు ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తల బృదం, హనుమకొండ వ్యవసాయ సంచాలకులు మంగళవారం పలు రకాల పంటలు పరిశీలించారు. ప్రస్తుతం వరిలో సల్ఫైడ్ ఇంజూరీ ఉన్నట్లుగా గుర్తించారు. నివారణకు పొలం మొత్తం ఆరబెట్టి జింక్ చెలమిన్ను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. పత్తిలో పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల బెడద, రసం పీల్చే పురుగుల బెడద ఉధృతి ఉన్నట్లు గమనించారు. వీటి నివారణకు ఆసిటామీప్రిడ్ 40గ్రామ్స్ ఎకరాకి, ఽథాయామిత్తక్సమ్ 40 గ్రామ్స్ ఎకరాకు పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వెంకట్రెడ్డి, డాక్టర్ రాములు, డాక్టర్ పద్మజ, డాక్టర్ మధు, సహాయ సంచాలకులు ఆదిరెడ్డి, మండల అధికారి ఎల్.పద్మ, ఏఈఓలు సుమలత, రవితేజ, నాగరాజు, కమలహాసన్, శైలజ, గాలయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రీజర్లకు మరమ్మతులు
ఎంజీఎం: ఎంజీఎం మార్చురీ విభాగంలో ఫ్రీజర్ల మరమ్మతులు ప్రారంభమైనట్లు ఆస్పత్రి పర్యవేక్షకుడు కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా ఫ్రీజర్లు పనిచేయక మృతదేహాలను భద్రపర్చేందుకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో.. కలెక్టర్ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించి రూ.4.95 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈపనుల్ని సర్ఫ్ సైంటిఫిక్ సంస్థ చేస్తున్నట్లు, ఏడాది పాటు నిర్వహణ బాధ్యతలు చూసుకోనున్నట్లు పేర్కొన్నారు. మార్చురీ విభాగంలో శవాల భద్రతతో కూడిన నిర్వహణ కోసం మార్చురీ కమ్ ఫ్రీజర్ల ఏర్పాటు చేయడం, అవసరమైన పునర్నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. జిల్లాలో 1,02,554 కొత్త పింఛన్లుహన్మకొండ అర్బన్: జిల్లా పరిఽధిలో 1,02,554 చేయూత పింఛన్లు మంజూరైనట్లు హైదరాబాద్ సెర్ఫ్ డైరెక్టర్ గోపాల్రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నూతనంగా ప్రవేశపెట్టిన చేయూత (ఆసరా) పెన్షన్ల పంపిణీపై అధికారులకు అవగాహన, శిక్షణ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల్రావు మాట్లాడుతూ.. తాజాగా ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ వినియోగం, పింఛన్ల పంపిణీ విధానం, నిబంధనలు, నిర్వహణపై అధికారులకు వివరించారు. ఇప్పటికే జిల్లాకు మంజూరైన వాటిలో 44,597 పెన్షన్లు (54 శాతం) పోస్టల్ శాఖ ద్వారా ఫేస్ రికగ్నైజేషన్ యాప్తో లబ్ధిదారులకు జూలై నుంచి పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, డీఆర్ఓ వై.వి గణేశ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ రవీందర్ అధికారులు పాల్గొన్నారు. నిట్తో థాయ్లాండ్ ఏఐటీ ఎంఓయూకాజీపేట అర్బన్: నిట్ వరంగల్తో థాయ్లాండ్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మంగళవారం వర్చువల్గా ఎంఓయూను కుదుర్చుకుంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ నిట్ వరంగల్ క్యాంపస్లోని కార్యాలయంలో ఎంఓయూపై సంతకం చేయగా.. థాయ్లాండ్లోని ఏఐటీలో డీన్ సంగమ్ శ్రేష్ట సంతకం చేశా రు. రెండేళ్ల పాటు కొనసాగే ఎంఓయూ ద్వారా 20 మంది విద్యార్థులు ఏఐటీలో పరిశోధనలతోపాటు మాస్టర్ డిగ్రీ పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. జూడో రాష్ట్ర స్థాయి పోటీలు షురూరామన్నపేట: వరంగల్ నగరం 22వ డివిజన్లోని కెమిస్ట్ భవన్లో మంగళవారం జూడో రాష్ట్ర స్థాయి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈపోటీల్లో 480 మంది క్రీడాకారులు పాల్గొనగా.. వివిధ వెయిట్ కేటగిరీల్లో గెలుపొందిన బాలబాలికలు సబ్ జూనియర్ విభాగంలో బిహార్లో, కెడిట్ విభాగంలో ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగే పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు జూడో రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షుడు కై లాస్ యాదవ్ పోటీలు ప్రారంభించారు. అనంతరం పోటీలు కొనసాగాయి. కివి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో బొద్దిరెడ్డి ప్రభాకర్రెడ్డి, గులాం సర్వర్ మున్నాభాయ్, రాజ్కుమార్, సోమరాజు, సంతోశ్, వీరస్వామి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ స్కూల్ వసతుల కోసం కొటేషన్ల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్ఎస్లో తాత్కాలికంగా ప్రారంభించనున్న స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, హాస్టల్లో వసతుల కల్పన కోసం సీల్డ్ కొటేషన్లను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోతు అశోక్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉడెన్ డైనింగ్ టేబుల్స్, ఐరన్ కాట్ విత్ ఫైవుడ్, పరుపులు, బెడ్షీట్లు, పిల్లోస్, ఇతర ఫర్నిచర్స్, స్పోర్ట్స్ మెటీరియల్ సప్లై కోసం ఆసక్తి ఉన్నవారు ఈనెల 8వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా క్రీడల, యువజన కార్యాలయంలో కొటేషన్లు సమర్పించాలని సూచించారు. -
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రపూరిత వైఖరి
మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హైదరాబాద్ తెలంగాణ భవన్లో చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో లైవ్లో జిల్లా బీఆర్ఎస్ శ్రేణులు వీక్షించారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగు, తాగు నీటి అవసరాలను తీర్చిందన్నారు. జలయజ్ఞం పేరిట ధనయజ్ఞంగా సాగునీటి ప్రాజెక్టులను మార్చిన అనుభవం ఉన్న కాంగ్రెస్ కాళేశ్వర ప్రాజెక్టుకు అవినీతి మరకలు అంటించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు అమలు చేసే ధైర్యం లేక కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్పై బురద చల్లే ప్రయత్నం చేస్తోందని, కాంగ్రెస్ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో ఆయా సంస్థల మాజీ చైర్మన్లు నాగుర్ల వెంకటేశ్వర్లు, సుధీర్కుమార్, మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నీటి పారుదలశాఖ సీఈగా వెంకటేశ్వర్లుహసన్పర్తి: నీటి పారుదలశాఖ వరంగల్ చీఫ్ ఇంజనీర్గా కె.వెంకటేశ్వర్లు నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జ్ సీఈగా విధులు నిర్వహించిన అశోక్కుమార్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. సూపరింటెండెంట్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న కె.వెంకటేశ్వర్లుకు పదోన్నతి కల్పిస్తూ.. ఇక్కడే సీఈగా నియమించారు. ఈనెలలో వెంకటేశ్వర్లు ఉద్యోగ విరమణ పొందనున్నారు. -
నడవలేను..ఎక్కడికీ వెళ్లలేను
‘నడవలేను..ఒకరి సహాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేను..’ అని తనకు ట్రైసైకిల్ అందించి ఆదుకోవాలని హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మోరె మొగిలి అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పదహేను సంవత్సరాల క్రితం నరాలు చచ్చుబడటంతో తన కుడిచేయి పనిచేయడం లేదని, అనేక ఆసుపత్రులకు తిరిగినా నయం కాలేదని మొగిలి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వ్యవసాయంతో పాటు ఇతరత్రా పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని వివరించారు. తనకు ముగ్గురు కుమారులు, ఒక కూతురని అందరికీ పెళ్లిలు అయ్యాయన్నారు. నరాలు చచ్చుబడటంతో ప్రస్తుతం ఒకరి సహాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. చిన్న దుకాణం పెట్టుకొని వెళ్లదీస్తున్నానని, సరుకులు తెచ్చుకోవడానికి ఒకరిపై ఆధారపడాల్సి వస్తోందని, ట్రైసైకిల్ ఇప్పించి తనను అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి..
శరీరంపై ఎర్రమచ్చలు రావడం, చెవుల్లో నుంచి రక్తం కారడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తం రావడం, యూరిన్లో రక్తం రావడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు రక్త పరీక్షలు చేసుకొని ప్లేట్లెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని భయపడొద్దు. వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే..దాదాపు దోమల బెడద నుంచి పూర్తిగా దూరమైనట్లే. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎంజీఎం ఫీవర్ వార్డులో జ్వర సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందిస్తున్నాం. –డాక్టర్ కిశోర్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి చికిత్సలు అందిస్తున్నాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తున్నాం. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మలేరియా, డెంగీ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమల నిర్మూలనతోనే వ్యాధుల నివారణ సాధ్యం అవుతుంది. –డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్యారోగ్య అధికారి, వరంగల్ -
వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణ సోమవారం పూజలు
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శ్రావణమాసంలోని ద్వితీయ సోమవారాన్ని పురస్కరించుకుని శ్రీరుద్రేశ్వరస్వామి వారికి ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ అధ్వర్యంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. 100 మంది భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు జరుపుకున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి రుద్రాభిషేకం జరిపించారు. మధ్యాహ్నం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
నేటినుంచి రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
రామన్నపేట : వరంగల్ పోచమ్మమైదాన్ సమీపంలోని కెమిస్టు అండ్ డ్రగ్గిస్ట్ భవనంలో మంగళవారంనుంచి రెండు రోజులపాటు సబ్జూనియర్, క్యాడేట్ విభాగంలో రాష్ట్రస్థాయి జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాష్ యాదవ్ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పోటీల వివరాలు వెల్లడించారు. సబ్జూనియర్ విభాగంలో పాల్గొనే అభ్యర్థులు 2011, 2012, 2013 సంవత్సరాల్లో జన్మించి ఉండి బాలుర విభాగంలో 30 నుంచి66 కేజీల లోపు, బాలిక విభాగంలో 28 నుంచి 57 కేజీల లోపు ఉండాలని పేర్కొన్నారు. క్యాడేట్ విభాగంలో పాల్గొనే బాలురు 2008, 2009, 2010లో జన్మించి 50 నుంచి 90 కేజీల లోపు ఉండాలని, బాలిక విభాగంలో 40 నుంచి 70 కేజీల లోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే బాలబాలికలకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కమారస్వామి, సోమరాజు, దుపాకి సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంచ నర్సింగరావుకు చేనేత అవార్డు ఖిలా వరంగల్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపికైన కంచ నర్సింగరావును సోమవారం టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు అభినందించారు. నగరంలోని ఉర్సు కరీమాబాద్లో నర్సింగరావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వెంకటేశ్వర్లు శాలువాతో సత్కరించారు. నర్సింగరావు నిలువు మగ్గం మీద పంజా కార్పెట్పై 4 తాబేళ్ల బొమ్మలు నేసి రాష్ట్ర చేనేత, జౌళి శాఖ నుంచి ఆయన ప్రశంసలు అందుకున్నారు. దీంతో ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 7న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లా జాలో జరిగే జాతీయ చేనేత దినోత్సవం వేడుకల్లో ఆశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతులమీదుగా అవార్డుతోపాటు రూ.25వేల నగదు, ప్రశంసపత్రం అందుకోనున్నారు. కార్యక్రమంలో బాసాని కరుణాకర్, రాజశేఖర్, సమత పాల్గొన్నారు. ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలు చేరుకోవాలి ఎంజీఎం: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో అమలవుతున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను చేరుకోవాలని హనుమకొండ డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. సోమవారం నగరంలోని న్యూశాయంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలోని ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమం అమలు, ఏఎన్సీ నమోదు, ఎన్సీడీ రీస్క్రీనింగ్, పాఠశాలలు, హాస్టళ్లలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంపులకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డెమో అశోక్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమలో అభివృద్ధి పరుగులు : ఎమ్మెల్యే నాయినిహన్మకొండ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. సోమవారం 51వ డివిజన్ హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్హౌజ్ ప్రాంతంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్ బోయినిపల్లి రంజిత్రావుతో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం వరంగల్ మహానగర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈక్రమంలో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో హనుమకొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని లక్ష్మారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు కొండ నాగరాజు, నాయకులు రవినాయక్, పోలేపెల్లి బుచ్చిరెడ్డి, కాలనీ వాసులు వీరారెడ్డి, మాధవారెడ్డి, వడ్డే రవీందర్, జయశ్రీ పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను పరిష్కరించడంలో జాప్యం చేయవద్దని అయా శాఖ అధికారులను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ స్నేహ శబరీశ్ హాజరై ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ శాఖలకు సంబంధించిన మొత్తం 205 వినతులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
ఆయిల్పామ్ రైతుల భవిష్యత్తుకు భరోసా
ఐనవోలు: ఆయిల్పామ్ సాగుచేసే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భవిష్యత్తులో 100 శాతం భరోసా ఉంటుందని జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ తెలిపారు. సోమవారం మండలంలోని గర్మిళ్లపెల్లి గ్రామంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆయిల్పామ్ క్షేత్రంలో ఉద్యానశాఖ, కేఎన్ బయోసైన్సెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్తో కలిసి హెచ్ఓ అనసూయ మొక్క నాటి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే భవిష్యత్తు ప్రయోజనాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో రైతులు గోకె కరుణాకర్, ఆకారపు రాజిరెడ్డి, రంగు శ్రీకాంత్ చంద్ర, డివిజన్ హెచ్ఓ సుస్మిత, కేఎన్ బయో సైన్సెస్ ప్రతినిధులు, ఫీల్డ్ అధికారులు విక్రమ్, నాథన్, లక్ష్మణ్ రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉద్యానశాఖ అధికారి అనసూయ -
ఎమ్మెల్యేల మధ్య ఇసుక దుమారం!
సాక్షిప్రతినిధి, వరంగల్/పరకాల: అధికార పార్టీకి చెందిన పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్రెడ్డి, గండ్ర సత్యనారాయణల నడుమ ఇసుక సరఫరా విషయంలో మాటల యుద్ధం జరిగిందా..? పరకాల నియోజకవర్గానికి భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి ఇసుక తరలింపు నిలిచిపోయిందా? ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉచిత ఇసుక సరఫరా విషయంలో మొదలైన ఈ పంచాయితీ పార్టీ కార్యకర్తల వరకు పాకిందా?.. అంటే నిజమే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ కేడర్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. కొద్ది రోజులుగా భూపాలపల్లి నియోజకవర్గంలోని వాగులనుంచి పరకాల నియోజకవర్గానికి ఇసుక తరలకుండా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు గస్తీ కాయడమే ఇందుకు నిదర్శనమంటున్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల మధ్య ఇసుక రవాణాపై సంభాషణ జరిగినా ఫలితం లేకపోవడంతో చివరకు ఈ పంచాయితీ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లిందన్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి ఇసుక.. పరకాలకు తరలకుండా.. అర్హులైన పేదలందరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి సొంతింటి కలనెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వమే ఉచితంగా ఇసుక తరలింపునకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా సమీప ప్రాంతాల్లో ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడినుంచి సరఫరా చేయాలని సూచించింది. భూపాలపల్లి నియోజకవర్గంలోని ఏ ఒక్క వాగునుంచి ఇసుక ట్రాక్టర్ పరకాలకు తరలివెళ్లకుండా రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కట్టడి చేస్తున్నారు. మండలాల సరిహద్దుల్లో సంబంధిత పోలీస్స్టేషన్ల సిబ్బంది రాత్రివేళలో మఫ్టీలో సంచరిస్తూ ఇసుక ట్రాక్టర్లను పట్టుకుంటున్నారని పరకాల వాసులు చెబుతున్నారు. కేసులు పెట్టడానికి కూడ వెనుకడుగు వేయకపోవడంతో పరకాలకు ఇసుక తరలింపు నిలిచిపోయిందని అంటున్నారు. ఇదేంటని అడిగితే పోలీసు, రెవెన్యూ అధికారులు పరకాలకు ఇసుక వెళ్తే చర్యలు తీసుకోవాలంటూ భూపాలపల్లి ఎమ్మెల్యేనుంచి ఆదేశాలున్నాయని చెబుతున్నారని పరకాల కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీంతో చిట్యాల మండలంలోని టేకుమట్ల, కాల్వపల్లి, కలకోటపల్లి, మొగుళ్లపల్లి మండలంలోని నవాబుపేట, ఇస్సిపేట, కొర్కిశాల, రేగొండ మండలంలోని కనపర్తి వాగుల నుంచి పరకాలకు ఇసుక తరలించకుండా ఆంక్షలు విఽధించినట్లు సమాచారం. ఆకాశన్నంటిన ఇసుక ధర.. గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఇసుక క్వారీలు 15 ఉండగా, వర్షాల కారణంగా అందులో 14 క్వారీలు నీట మునిగాయి. మిగతా ఒక్కటి అడవి సోమన్నపల్లి నుంచి మాత్రమే ఇసుకను తరలిస్తున్నారు. గతంలో ఒక్కో టన్నుకు రూ.800 నుంచి రూ.1000 ఉండగా ప్రస్తుతం మూడు రెట్లు అంటే రూ.2,500 వరకు నడుస్తుంది. అంటే ఒక్కో లారీ 32 టన్నులు అంటే రూ.80వేలు అవుతుంది. అంత ధర సామాన్యుడు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో పొరుగు జిల్లానుంచి, వాగుల నుంచి ఇసుక తరలించుకోవడంపై ఆంక్షలు విధించడం పరకాల నియోజకవర్గంలోని తమ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జ్ మంత్రి వద్దకు ఇసుక పంచాయితీ భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ, రేవూరి ప్రకాష్రెడ్డిల మధ్య నెలకొన్న ఇసుక పంచాయితీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరకు వెళ్లినట్లు తెలిసింది. భూపాలపల్లి నుంచి ఇసుక రాకుండా ఆంక్షలు విధించడంపై మొదట ఎమ్మెల్యే సత్యనారాయణతో మాట్లాడిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి.. ఫలితం లేకపోవడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి... ఈ మధ్యలో నిర్వహించే రివ్యూ మీటింగ్లో భూపాలపల్లి ఎమ్మెల్యేతో మాట్లాడతానని చెప్పినట్లు సమాచారం. కాగా, ఇన్చార్జ్ మంత్రి జోక్యంతోనైనా పరకాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక సమస్య తీరుతుందా..? లేదా? అనేది చూడాలి మరి.రేవూరి ప్రకాష్రెడ్డి వర్సెస్ గండ్ర సత్యనారాయణ భూపాలపల్లి ఇసుక పరకాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే ఆంక్షలు? ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి ‘పొంగులేటి’ వద్దకు చేరిన పంచాయితీ -
పావులీటర్ అంటే 150మి.లీ.అన్నమాట!
శాయంపేట: మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్స్ షాపులో ట్రైకం అగ్రి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన రన్అవుట్ 23 పురుగు మందు బాటిళ్లను సీజ్ చేసినట్లు ఏఓ గంగాజమున తెలిపారు. మండలంలోని సూరంపేట గ్రామానికి చెందిన రైతు చంద రమేశ్ పావులీటర్ రన్అవుట్ పురుగు మందు బాటిల్లో 150 మిల్లీలీటర్ల మందు మాత్రమే వస్తోందని ఇటీవల ఏఓ గంగాజమునకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె షాపులో ఉన్న 23 రన్ అవుట్ పురుగు మందు బాటిళ్ల అమ్మకాలను నిలిపివేస్తూ నోటీసులు ఇచ్చి లీగల్ మెట్రాలజీ అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ విశ్వేశ్వర్, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇస్మాయిల్ రన్అవుట్ పురుగుమందు డబ్బాలను తనిఖీ చేసి కొలువగా 250 మిల్లీలీటర్ బాటిల్లో 150 మిల్లీలీటర్ మాత్రమే ఉంది. దీంతో 23 బాటిళ్లను సీజ్ చేసి డీలర్పై, కంపెనీపై కేసు నమోదు చేయనున్నట్లు లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ తెలిపినట్లు ఏఓ గంగాజమున పేర్కొన్నారు. పురుగు మందుల కంపెనీ లెక్క ఇదీ.. 23 పురుగుమందుల బాటిళ్లు సీజ్ డీలర్, కంపెనీపై కేసు నమోదు చేయనున్నట్లు అధికారుల వెల్లడి -
ఓవరాల్ చాంపియన్ ఖమ్మం
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పరుగుపోటీలు, త్రోబాల్, హైజంప్, లాంగ్జంప్ తదితర క్రీడల్లో అథ్లెట్లు పోటీపడ్డారు. ఖమ్మం జిల్లా ఓవరాల్ చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. అండర్–16 బాలికల విజేత హనుమకొండ కై వసం చేసుకుంది. – వరంగల్ స్పోర్ట్స్ అండర్–16 బాలికల విజేత హనుమకొండ– వివరాలు 8లోu -
ఈ లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి
శరీరంపై ఎర్ర మచ్చలు రావడం, చెవుల్లో నుంచి రక్తం కారడం, మలమూత్ర విసర్జన చేసినప్పుడు రక్తం రావడం, యూరిన్లో రక్తం రావడం, ఒంటిపై దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఏమైనా ఉంటే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలతో బాధపడుతున్నప్పుడు రక్త పరీక్షలు చేసుకొని ప్లేట్లెట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. డెంగీ, మలేరియా జ్వరాలు వచ్చాయని భయపడొద్దు. వ్యాధి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఉత్తమం. ఇంటి చుట్టూ పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకుంటే దాదాపు దోమల బెడద నుంచి పూర్తిగా దూరమైనట్లే. దీంతో డెంగీ, మలేరియా వంటి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎంజీఎం ఫీవర్ వార్డులో జ్వర సంబంధిత వ్యాధుల నివారణకు చికిత్సలు అందిస్తున్నాం. – డాక్టర్ కిశోర్ కుమార్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
యూరియా కోసం బారులు
ఖానాపురం: యూరియా కోసం రైతులకు కష్టాలు తప్పడంలేదు. సొసైటీ గోదాంల వద్ద బారులుదీరుతున్నారు. మండలంలోని బుధరావుపేటలోని గోదాం వద్ద యూరియా కోసం ఉదయాన్నే రైతులు బారులుదీరారు. గోదాంకు 444 బస్తాల దొడ్డు యూరియా ఆదివారం సాయంత్రం వచ్చింది. దీంతో బుధరావు పేట, మంగళవారి పేట, నాజీతండా, వేపచెట్టు తండాతో పాటు పలు గ్రామాలకు చెందిన రైతులు సోమవారం ఉదయమే గోదాంకు వచ్చారు. మహిళలు, పురుషులు వేర్వేరు లైన్లలో నిలబడగా, మొదటగా మహిళలకు అవకాశం లభించకపోవడంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో పాటు యూరియాను కొంతమేర పంపిణీ చేసి నిలిపివేయడంతో రైతులు ఆగ్రహించారు. ఈ క్రమంలో ఎస్సై రఘుపతి అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పోలీసుల పహారా నడుమ ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 222 మందికి యూరియా పంపిణీ చేశారు. దాంతో యూరియా నిల్వలు అయిపోవడంతో మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు యూరియా కోసం భారీగా బారులుదీరారు. దీనికి తోడు పదిరోజుల నుంచి సొసైటీ పరిధికి యూరియా నిల్వలు రాలేదు. సోమవారం గోదాం వద్ద బారులుదీరినప్పటికీ యూరియా లభించకపోవడంతో బుధరావుపేట శివారులో జాతీయ రహదారి –365పై రైతులు రాస్తారోకో చేపట్టారు. జిల్లా అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రహదారిపై ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతుల వద్దకు వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఎస్సై రఘుపతి వచ్చి యూరియా నిల్వలు వచ్చిన తర్వాత అందరికీ పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బాదావత్ బాలకిషన్ మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు బోడ కిషన్నాయక్, భిక్షపతి, బాలకిషన్, బాల, రమేష్, రాజు, మహిళా రైతులు మంగమ్మ, కేలోతు సరోజన, లావుడ్య సరోజన, బుజ్జి, తదితరులు పాల్గొన్నారు. కాగా, రైతుల ధర్నాతో స్పందించిన అధికారులు బుధరావుపేట గోదాంకు 888 బస్తాల యూరియాను సోమవారం సాయంత్రం దిగుమతి చేయించారు. ఆ యూరియాను మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ వివరించారు.222 మందికి మాత్రమే పంపిణీ నిరాశతో వెనుదిరిగిన పలువురు రైతులు జాతీయ రహదారిపై ఆందోళన బుధరావుపేట గోదాంకు మరో 888 బస్తాల యూరియా రాక -
ఫీవర్రీనే..
వరంగల్మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పెరిగిన జ్వరపీడితులు ● జూన్లో 684 కేసులు.. జూలైలో ఏకంగా 1,311 కేసులు ● 50కి పైగా డెంగీ కేసులతో ఆందోళన ● సీజనల్ వ్యాధులతో జనాల బెంబేలు ● అనధికారికంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వందల్లో కేసులు ● ఎంజీఎంలో రోగుల కిటకిట.. న్యూస్రీల్ -
ఇడియట్ ముచ్చట్లు చెప్పకు..!
గీసుకొండ: మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, శాయంపేట హవేలి, మరియపురం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథపురం గ్రామంలో లబ్ధిదారుడు మూడు నర్సింహకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలిస్తూ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని అధికారులను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. పది మందికి ఇళ్లు మంజూరు కాగా, నలుగురు మాత్రమే ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించడంతో సంబంధిత ఏఈ వినోద్ను వివరణ కోరారు. అందులో ఒకరి ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ కావడంతో జాప్యం జరిగిందని ఏఈ వివరణ ఇస్తుండగా, ఎమ్మెల్యే ఘాటుగా స్పందించారు. ‘నీ వయస్సు ఎంత’ అని ఏఈని ప్రశ్నించగా.. 28 ఏళ్లు అని చెప్పాడు. ఇడియట్ ముచ్చట్లు చెప్పకు డీఈకి ఫోన్ చెయ్ అంటూ పరుష పదజాలంతో ఏఈపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ వచ్చిన 45 రోజుల్లో బేస్మెంట్ వరకు నిర్మాణం చేపట్టాలని, లేకుంటే అవి రద్దవుతాయని అన్నారు. నిర్మాణాల విషయంలో జాప్యం జరిగితే పంచాయతీ కార్యదర్శి, సంబంధిత ఏఈలకు మెమోలో జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. కొమ్మాలలో కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒకే కుటుంబానికి రెండు ఇళ్లు మంజూరైనట్లు స్థానికులు తెలపగా, జక్కుల రాజ్కుమార్, సాయిలి రమాదేవికి మంజూరు చేసిన ఇళ్లను వెంటనే రద్దు చేయాలని అధికారులను ప్రకాశ్రెడ్డి ఆదేశించారు. కొమ్మాలలో ప్రజా గ్రంథాలయానికి జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్థలం కేటాయించాలని, సెర్ప్ మహిళా సంఘాలకు డైరీ ఫాం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ఎండీ.రియాజుద్దీన్, ఎంపీడీఓ పాక శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు శంకర్రావు, ప్రశాంత్, కాంగ్రెస్ నాయకులు దూల వెంటేశ్వర్లు, వీరాటి రవీందర్రెడ్డి, కూసం రమేష్, కొమ్ము శ్రీకాంత్, నాగరాజు, సాయిలి ప్రభాకర్, మూడు నర్సింహ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జక్కుల సరిత, సెర్ప్ సీసీ కోల శోభ, ప్రగతి మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ ఏఈపై ఆగ్రహించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
నర్సంపేట రూరల్: అంతర్జాతీయ తల్లిపాల వారో త్సవాలను నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆస్పత్రిలో గైనిక్ వార్డులను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అందంగా ముస్తాబు చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, ఐసీడీఎస్ సీడీపీఓ మధురమ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు తల్లి ముర్రుపాలు తాగించాలని సూచించారు. ఈ పాలు శిశువుకు దివ్యౌషధంగా పనిచేస్తాయని చెప్పా రు. ఈ పాలతో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే అందించాలని తెలిపారు. ఆరునెలల తర్వాత అనుబంధ ఆహారంతోపాటు తల్లిపాలు కూడా అందించాలని చెప్పారు. ఇలా బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదని అన్నారు. అనంతరం ఆస్పత్రిలోని 25మంది తల్లులకు బ్రెడ్స్, పండ్లు పంపిణీ చేశారు. గైనకాలజిస్టులు, వైద్యులు నిర్మల, నవత, ప్రతాప్, సుభాన్, హెచ్ఈ వసంత, ఏఎన్ఎం కవి త, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి
సీజనల్ వ్యాధులపై వైద్యాధికారులు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి చికిత్సలు అందిస్తున్నాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తున్నాం. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న చోట అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మలేరియా, డెంగీ దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నాం. దోమల నిర్మూలనతోనే వ్యాధుల నివారణ సాధ్యం అవుతుంది. – డాక్టర్ సాంబశివరావు, జిల్లా వైద్యారోగ్య అధికారి, వరంగల్ -
సమయపాలన పాటించాలి
న్యూశాయంపేట: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం పదిన్నరకే సమావేశ మందిరానికి వచ్చిన కలెక్టర్.. సమయానికి రాని అధికారులు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని సూచించారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణికి మొత్తం 133 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించినవి 49 అర్జీలు, హౌసింగ్కు 34 దరఖాస్తులు రాగా, మిగితావి వివిధ శాఖలకు చెందిన వినతులు 50 వచ్చినట్లు అధికారులు వివరించారు. స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతిరోజూ ఫీల్డ్ విజిట్ చేసి, సంక్షేమ పథకాల పురోగతి పరిశీలించాలని కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. నివేదికలు ఎప్పటికప్పుడు గూగుల్ ష్ప్రెడ్ సీట్లో అప్లోడ్ చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ శాఖల పాఠశాలలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, ఆహారం అందించడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెడ్క్రాస్ సొసైటీలో మెంబర్షిప్ తీసుకోవాలి రెడ్క్రాస్ సొసైటీలో మెంబర్షిప్ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. మెంబర్షిప్నకు నోడల్ అధికారిగా డీసీఓ నీరజ వ్యవరిస్తారని చెప్పారు. చేనేత లక్ష్మి స్కీం పథకంలో భాగస్వాములు కావాలన్నారు. జిల్లా అధికారులు అనురాధ, కల్పన, నీరజ, ఏఓ విశ్వప్రసాద్, చేనేతజౌళి శాఖ సహాయ సంచాలకుడు శ్రీకాంత్రెడ్డి, టెస్కో డీఎంఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆలస్యంగా వచ్చిన అధికారులపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం ప్రజావాణిలో వినతుల స్వీకరణ -
లక్ష్యసాధనకు కృషి చేయాలి
న్యూశాయంపేట: వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడానికి లక్ష్యసాధనకు ప్రణాళికాబద్ధంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి ఆయా శాఖల వారీగా వన మహోత్సవంలో నాటాల్సిన మొక్కల లక్ష్యాలు, సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. జిల్లా లక్ష్యం 31,40,272 కాగా, ఇప్పటివరకు 10లక్షల 87వేల 11 మొక్కలు నాటి, 9లక్షల 8వేల 272 మొక్కలకు జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. 5లక్షల 61వేల 115 మొక్కలు ఇంటింటికి పంపిణీ చేసినట్లు వివరించారు. కిచెన్ షెడ్స్, అశోక, బోగెన్విలియన్, ఉసిరి, కరివేపాకు, గోరింటాకు, కలబంద ముఖ్యంగా అవకాడో, వేప, రాల చెట్టు, జామ, సీతాఫలం మామిడి తదితర చెట్లను నాటాలని చెప్పారు. తదుపరి సమావేశం నాటికి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారద -
‘స్థానిక’ం తర్వాతే..
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పరిశీలనలో ఉన్న డీసీసీ ఆశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మే వరకు నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చందర్రెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణా పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమాకారుల వేదిక చైర్మన్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బా ధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి,రాజిరెడ్డి,పెండెం రాజు,రవీందర్రాజు, శ్రీధర్రాజు పాల్గొన్నారు. బెనిఫిట్స్ చెల్లించాలిరిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్యూటీఎఫ్ హసన్పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు, మాజీ ఎంఈఓ రాంకిషన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
మురికి కూపం
సోమవారం శ్రీ 4 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuనర్సంపేట: గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా ఆవిర్భవించిన నర్సంపేట సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ప్రజలు సీజనల్ వ్యాధులబారిన పడుతున్నారు. దోమల కారణంగా ఆస్పత్రులకు రోజురోజుకు జ్వరపీడితులు వరుస కడుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. పారిశుద్ధ్య పనులపై దృష్టి సారించాల్సిన మున్సిపల్ అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. పైపులైన్ల లీకేజీ.. తాగునీరు కలుషితం నర్సంపేట పట్టణంలోని 30 వార్డుల్లో 60 వేల జనాభా ఉంది. మున్సిపాలిటీలోని చాలా ప్రాంతాల్లో పైపులైన్ల లీకేజీతో తాగునీరు కలుషితం అవుతోంది. వర్షాకాలంలో ప్రజలు జ్వరాలబారిన పడడానికి తాగునీటి కలుషితం కావడం కూడా ఒక ప్రధాన కారణం. నీళ్ల ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాల్సి ఉన్నా అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అమలుకు నోచుకోని ప్రణాళిక.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు అధికారులు రూపొందించిన ప్రణాళిక అమలుకు నోచుకోవడం లేదు. కొత్తగా ఏర్పడిన కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. చాలా కాలనీల్లో మురుగు నీరు వెళ్లడానికి కాల్వలు నిర్మించలేదు. దీంతో వర్షపు నీరు నిలవడంతోపాటు పిచ్చిమొక్కలు ఉండి దోమలు వృద్ధి చెందుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా కాలనీల్లో చెత్త సేకరణ కూడా రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి చేస్తున్నారు. నివారణ చర్యలు ఇలా.. ● కాలనీల్లో చాలా ప్రాంతాల్లో మురుగునీరు బయటకు వెళ్లే అవకాశం లేదు. అవసరం ఉన్న ప్రాంతాల్లో మురుగు కాల్వల నిర్మాణం చేపట్టాలి. ● దశాబ్దాల క్రితం నిర్మించిన డ్రెయినేజీలు శిథిలం కావడంతో నీరు నిలుస్తోంది. మరో వైపు పెరిగిన జనాభాకు అనుగుణంగా నూతనంగా డ్రెయినేజీలు విస్తరించాలి. ● మున్సిపాలిటీలో రోడ్ల ఆక్రమణ కారణంగా కొన్ని ప్రదేశాల్లో డ్రెయినేజీల్లో పూడిక నిండుతోంది. దుకాణా సముదాయాలు ఉన్న చోట్ల కాల్వలపై మీటర్ల దూరం వరకు సిమెంట్ స్లాబు వేయడంతో పూడిక నిండి ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటి చోట పూడిక తీసేందుకు ఏర్పాట్లు చేయాలి. ● కాలనీల్లోని ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసాలుగా మారాయి. వీటిలో పిచ్చిమొక్కలు, మురుగునీరు ఉంటోంది. వాటి యజమానులకు నోటీసులు ఇచ్చి వదిలి వేయడం కాకుండా పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలి. ● వర్షాకాలంలో ట్యాంకులు, బావులు, బోర్లను క్లోరినేషన్ చేయాలి. తాగునీటి పైపులైన్లు పగిలి తాగునీరు కలుషితం అవుతున్న ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలి. కమిషనర్ చర్యలతో ఉపశమనం.. కొన్ని సంవత్సరాలుగా నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ల ఆక్రమణలు పలు సమస్యలకు దారితీశాయి. ఇటీవల బాధ్యతలు తీసుకున్న కమిషనర్ భాస్కర్ రాజకీయాలకు అతీతంగా ఆక్రమణలను తొలగించడంతో పట్టణ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. న్యూస్రీల్ నర్సంపేట మున్సిపాలిటీలో అపరిశుభ్రత పట్టణంలో నామమాత్రంగా పారిశుద్ధ్య పనులు రోడ్లపైనే పేరుకుపోతున్న చెత్త, మురుగునీరు వ్యాధులబారిన పడుతున్న కాలనీల ప్రజలుఈ ఫొటోలో కనిపిస్తున్నది నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలం. నాలుగు సంవత్సరాలుగా పట్టణంలోని పలు కాలనీలకు చెందిన మురుగునీరు ఇందులో నిల్వ ఉంటోంది. ఇటీవల మున్సిపల్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేయగా.. మురుగునీరు, వ్యర్థాలు పోవడానికి కాల్వలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ నీరు అలాగే నిల్వ ఉండి దోమలు వృద్ధి చెంది ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. డ్రెయినేజీని శుభ్రం చేయాలి.. నర్సంపేట పట్టణంలో డ్రెయినేజీని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున రోడ్ల వెంట ఉండే చెత్తను వెంటవెంటనే తొలగించాలి. పట్టణంలో ఫాగింగ్ చేపట్టి దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. – బైకని రాజ్కుమార్, నర్సంపేటపట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం..పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్యాచరణ మొదలు పెట్టాం. ఇందులో భాగంగానే పట్టణంలోని ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టాం. ఖాళీ ప్లాట్ల యజమానులను గుర్తించాం. ఖాళీ ప్లాట్లలో నీరు నిల్వకుండా ఉండేందుకు నోటీసులు సిద్ధం చేస్తున్నాం. – భాస్కర్, మున్సిపల్ కమిషనర్, నర్సంపేట -
రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహణ భేష్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ నిర్వహణ సూపర్గా ఉందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాల్కృష్ణన్ అన్నారు. కాజీపేట జంక్షన్లో పలు విభాగాలను ఆదివారం ఆయన తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా డీఆర్ఎం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించి, రైల్వే రన్నింగ్ రూంలో డ్రైవర్లకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టును ఏడీఆర్ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్లి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన రెండు క్యారం బోర్డులు ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీని అభినందించి నిర్వహణ బాగుందని పేర్కొన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే కమ్యూనిటీహాల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి కేటాయించిన ఎస్బీఎఫ్ ఫండ్ను మంజూరు చేయాలని, రైల్వే కమ్యూనిటీహాల్కు మరో డైనింగ్హాల్ నిర్మాణం చేయాలని, ఏసీని మరమ్మతు చేయాలని, జనరేటర్ను మంజూరు చేయాలని, కుషన్ స్టీల్ చైర్లు, కావాల్సిన సామగ్రి ఇప్పించాలని కమిటీ బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నూతన భవనంతోపాటు జిమ్కు సంబంధించిన సామగ్రి ఏర్పాటు చేయాలని, ఇన్స్టిట్యూట్లో నూతనంగా టాయిలెట్స్ నిర్మించాలని డీఆర్ఎంను కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, రైల్వే అధికారులు ప్రశాంతకృష్ణసాయి, సుధీర్కుమార్, ఎన్వీ వెంకటకుమార్, టి.అనికేత్కాడే, ప్రంజల్ కేశర్వాణి, రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, దేవులపల్లి రాఘవేందర్, కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. డీఆర్ఎం గోపాలకృష్ణన్ -
సెర్ప్ ఉద్యోగుల సేవలు అభినందనీయం
గీసుకొండ: మహిళా సంఘాల ఉన్నతికి సీసీ గడ్డి అశోక్, ఏపీఎం సురేశ్కుమార్ చేసిన సేవలు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చాయని సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. గడ్డి అశోక్ ఉద్యోగ వి రమణ, ఏపీఎం సురేశ్కుమార్ ఐనవోలు మండలా నికి బదిలీ అయిన సందర్భంగా ఆదివారం కొనా యమాకులలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మెరుగైన పనితీరుతో లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని ఆకాంక్షించారు. సీసీల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు న ర్సయ్య, జిల్లా అధ్యక్షుడు గోలి కొమురయ్య, మాజీ జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు ర డం భరత్, మండల సమాఖ్య అధ్యక్షురాలు గట్టు రాధిక, సెర్ప్ సీసీ శోభారాణి, సుజాత, శ్రీకాంత్, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. అంతకు ముందు మండల ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అశోక్, సురేశ్కమార్ను సన్మానించారు. సెర్ప్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాస్ -
వేతన బాధలు తీరేనా..?
దుగ్గొండి: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు సమయానికి వేతనాలు అందక కష్టాలు పడుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి వేతనాలు అందిస్తుండడంతో ఆర్థికంగా కుటుంబ జీవనం కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీల ద్వారా కాకుండా కేంద్రీకృత విధానం ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అక్రమాలకు అస్కారం లేకపోగా కార్మికులకు మేలు జరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 11 గ్రామీణ మండలాల పరిధిలో 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. పెద్ద గ్రామంలో 8 మంది చిన్న గ్రామాల్లో ఇద్దరు పనులు చేస్తున్నారు. ఒక్కో కార్మికుడికి ప్రభుత్వం రూ.9,500 వేతనం అందిస్తుంది. ప్రతిరోజూ డ్రెయినేజీలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం, మంచినీటిని సరఫరా, దోమల నివారణ చర్యలు, పంచాయతీ కార్యాలయంలోని వివిధ రకాల పనులు చేయడం వీరి విధి. గత ఏడాదిన్నర కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకపోవడంతో పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడింది. ఫలితంగా కార్మికులకు ప్రతినెలా వేతనాలు చెల్లించే పరిస్థితి లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పుడు పంచాయతీ కార్యదర్శులు ట్రెజరీలకు బిల్లులు పంపి వేతనాలు చెల్లించారు. ఇదే తరుణంలో కేంద్రీకృత విధానం అమలు చేయాలని, టీజీ బీపాస్ ఖాతాల ద్వారా కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో వేతనాలు జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో డీపీఓలకు ఉత్తర్వులు అందాయి. ఇకనుంచి అనధికారికంగా పారిశుద్ధ్య కార్మికుల నియామకం, వేతనేతర ఖర్చుల కింద పంచాయతీ కార్యదర్శులు నిధులు డ్రా చేసుకునే అవకాశం లేదు. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా నూతన విధానాలను అమలు చేయనున్నారు. ఇక నుంచి టీజీ బీపాస్ పద్ధతిలో.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు పారిశుద్ధ్య కార్మికులు నిధులు మంజూరయ్యాయి. ఇక నుంచి ప్రతినెలా వేతనాలు టీజీ బీపాస్ పద్ధతిలో అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. –కల్పన, జిల్లా పంచాయతీ అధికారి నూతన విధానం కొనసాగించాలి నూతన విధానం ద్వారా వేతనాలు ఇవ్వడం ద్వారా కష్టాలు తీరుతాయనే నమ్మకం ఉంది. గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇక నుంచి ప్రభుత్వం ఇబ్బందులు లేకుండా చూడాలి. –పుట్టపాక రాజేందర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య కార్మికులు నెలల తరబడి పెండింగ్ తాజాగా విడుదల చేస్తూ జీఓ జారీ -
స్థానికం తర్వాతే..
సాక్షిప్రతినిధి. వరంగల్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అన్ని స్థాయిల్లో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం ఆ పార్టీ అధిష్టానం తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి నుంచి కేడర్ కదిలించేందుకు కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మండల, బ్లాక్, జిల్లా కాంగ్రెస్ కమిటీలు వేయాలని మొదట భావించింది. ఏప్రిల్ 24 నుంచి జిల్లాల వారీగా ఇన్చార్జ్ల ద్వారా సమావేశాల ఏర్పాటు చేసి ఆశావహుల పేర్లను కూడా సేకరించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టడం.. పార్టీ పరంగా కొత్త మార్గదర్శకాలను రూపొందించడంతో సంస్థాగత కమిటీల ప్రస్తావన మరుగున పడింది. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీతోపాటు సంస్థాగత కమిటీలపై చర్చ జరుగుతుండగా.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మార్పులు, చేర్పులు మంచిది కాదన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, రాష్ట్రస్థాయి కమిటీలకు డైరెక్టర్ల కోసం మాత్రం ఎమ్మెల్యేల ద్వారా పేర్లను సేకరించారు. పరిశీలనలో ఉన్న డీసీసీ అశావహుల పేర్లు ఇవే... వాస్తవానికి జిల్లా కాంగ్రెస్ కమిటీలను మేవరకు నాటికి పూర్తి చేయాలని అధిష్టానం భావించింది. ఈ మేరకు ఏప్రిల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను కలుపుకుని డీసీసీల నియామకానికి జిల్లాకు ఇద్దరు చొప్పున పరిశీలకులను నియమించింది. మే 20 నాటికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని భావించి కసరత్తు చేశారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంస్థాగత కమిటీలు వేయాలని అధిష్టానం భావిస్తే జిల్లాల వారీగా ఆశావహుల జాబితాను మరోసారి పరిశీలించి ఖరారు చేసే అవకాశం ఉందని సీనియర్లు చెబుతున్నారు. ఇదే జరిగితే జిల్లాల వారీగా ఒక్కసారి పరిశీలిస్తే హనుమకొండ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఉండగా.. ఆయన కాదంటే సీనియర్ల స్థానంలో బత్తిని శ్రీనివాస్, ఇనుగాల వెంకట్రాం రెడ్డి, పింగిళి వెంకట్రాంనర్సింహారెడ్డిలలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. వరంగల్ జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణనే కొనసాగించాలన్న ప్రతిపాదన వచ్చినా.. రాజకీయ సమీకరణలు మారితే నమిండ్ల శ్రీనివాస్, గోపాల నవీన్రాజ్, కూచన రవళిరెడ్డి పేర్లు వినిపించాయి. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న జె.భరత్చంద్రారెడ్డినే కొనసాగిస్తారన్న చర్చ ఉండగా.. ఇక్కడి నుంచి వెన్నం శ్రీకాంత్రెడ్డి, నునావత్ రాధ కూడా ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే, డోర్నకల్, మహబూబాబాద్, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, మురళీనాయక్తోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి నిర్ణయం కీలకంగా కానుంది. జయశంకర్ భూపాలపల్లి డీసీసీ అధ్యక్షుడిగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న మాజీ మావోయిస్టు నేత గాజర్ల అశోక్, చల్లూరి మధు తదితరుల పేర్లు ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి జనగామ డీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా.. ఈయనను మార్చితే హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, సింగాపురం ఇందిర, మొగుళ్ల రాజిరెడ్డి, లకావత్ ధన్వంతి పేర్లు పరిశీలించారు. ములుగు జిల్లాకు కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్కే మళ్లీ అవకాశమన్న ప్రచారం జరుగగా.. మంత్రి ధనసరి సీతక్క కుమారుడు సూర్య, మల్లాడి రాంరెడ్డి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బాదం ప్రవీణ్ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.పదవులకు ప్రామాణికం 2017 కటాఫ్.. మహిళలకు ప్రాధాన్యంరాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ హైదరాబాద్లో ఇటీవల ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ నుంచి జిల్లా ఇన్చార్జ్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతోపాటు సంస్థాగత, నామినేటెడ్ పదవులపైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి కార్పొరేషన్లకు డైరెక్టర్లుగా నియమించేందుకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు పేర్లు ఇవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించి 24 మంది పేర్లను ఎమ్మెల్యేలు సూచించాల్సి ఉంది. వరంగల్ అర్బన్ ప్రాంతాల్లో రెండింటితో సరిపెట్టలేమని, ఐదు వరకు ఇవ్వాలని ఎమ్మెల్యేలు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లగా.. పరిశీలిస్తామన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రాష్ట్రస్థాయి డైరెక్టర్లతోపాటు జిల్లాస్థాయి నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉండేలా చూడాలని, 2017 సంవత్సరం కంటే ముందు నుంచి పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు కూడా మొదటి దఫాలోనే అవకాశం ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. కష్టపడే నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నదని, ప్రజాప్రతినిధులు సీనియర్లను ఎంపిక చేయాలని మీనాక్షి సూచించినట్లు తెలిసింది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నియోజకవర్గాల వారీగా అర్హులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇదే సమయంలో సీనియర్లు, ఆశావహులు పదవుల కోసం మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డీసీసీలకు కొత్త సారథులు!? బ్లాక్, మండల అధ్యక్షులు కూడా యథాతథం పునరాలోచనలో పార్టీ అధిష్టానం నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఓకే.. త్వరలో డైరెక్టర్ పోస్టుల నియామకం అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు.. నగరాల్లో ఐదు కావాలన్న ఎమ్మెల్యేలు ఇటీవలే ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులతో సమావేశం -
ఫిరాయింపుదారులపై చర్య తీసుకోవాలి
ధర్మసాగర్: ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని స్థితిలో కడియం శ్రీహరి ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిగా కాకుండా.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిగా వ్యవహరించి, పార్టీ ఫిరాయింపులపై రాజ్యాంగం మేరకు తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఆలస్యం చేయకుండా.. మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని, ఇది రాజ్యాంగ పరిరక్షణకు గట్టి మద్దతు అని చెప్పారు. కడియం శ్రీహరి తనతో పాటు 25 మంది ఎమ్మెల్యేలతో వస్తానని తాను మంత్రినవుతానని ఆశలు పెట్టుకున్నాడు కానీ.. ఇవన్నీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వ్యవహారాలని రాజయ్య విమర్శించారు. స్పీకర్ తక్షణమే రాజ్యాంగం మేరకు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఆ పదవికి రాజీనామా చేయడం మంచిదవుతుందని తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల ఇన్చార్జ్ కర్ర సోమిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు ప్రభుదాస్, మామిడి రవీందర్, బేరే మధుకర్, బొడ్డు ప్రతాప్, రేమిడి మహేందర్రెడ్డి, మేకల విజయ్కుమార్, దంతూరి బాలరాజు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. తాటికొండ రాజయ్య -
రుద్రేశ్వరున్ని దర్శించుకున్న జైళ్ల శాఖ డీజీపీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయాన్ని తెలంగాణ జైళ్ల శాఖ డీజీపీ సౌమ్యమిశ్రా ఆదివారం సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు మంగళవాయిద్యాలతో ఘనంగా స్వాగతించారు. డీజీపీ సౌమ్యమిశ్రా ముందుగా ఉత్తిష్ట గణపతిని దర్శించుకుని రుద్రేశ్వరస్వామికి లఘన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయ నాట్య మండపంలో ఉపేంద్రశర్మ తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు, మహదాశీర్వచనం అందించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు చాలా సార్లు వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. స్వామివారిని దర్శించుకుంటే కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఆలయ ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె వెంట వరంగల్ ఏసీపీ నాగరాలె శుభం ప్రకాశ్ ఉన్నారు. టీటీసీ పరీక్షలకు 99.11 శాతం హాజరువిద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు ఆదివారం మూడు సెషన్లలో నిర్వహించారు. ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్, లష్కర్బజార్ బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పెట్రోల్బంక్ ప్రభుత్వ హైస్కూల్ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3:30 గంటల నంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. 566 మంది అభ్యర్థులకుగాను 560 మంది 99.11 శాతం హాజరైనట్లు జిల్లా విద్యాశాఖలోని ఏసీజీఈ బి.భువనేశ్వరి తెలిపారు. శంకర్కు సినారె పురస్కారంకేయూ క్యాంపస్: మహాకవి డాక్టర్ సి.నారాయణరెడ్డి 94వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఏబీఆర్ కన్వెన్షన్ బాంక్వెట్ హాల్లో ఆదివారం సినారె కళాపీఠం పలువురికి సినారె సాహిత్యపురస్కారాలు ప్రదానం చేసింది. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు, ప్రముఖ కవి డాక్టర్ నందిని సిధారెడ్డి కాకతీయ యూనివర్సిటీ తెలుగు విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మంథిని శంకర్కు పురస్కారం అందజేశారు. కళాపీఠం అధ్యక్షుడు మట్టినేని రాములు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీవరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన ఏఎస్సై వీవీఎల్ఎన్ మూర్తి, హెడ్కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్ఐలు నాగయ్య, సతీశ్, ఆర్ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన నయీంనగర్: నగరంలోని కాళోజీ కళాక్షేత్రం, హంటర్రోడ్డులోని ‘కుడా’ ల్యాండ్, భద్రకాళి ఆలయ మాడవీధులు, కాకతీయ మ్యూజికల్ గార్డెన్, వరంగల్ బస్టాండ్ పనులను ఆదివారం ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్బాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ శా ఖల అధికారుల సమన్వయంతో త్వరగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించా రు. కార్యక్రమంలో ‘కుడా’ పీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, సిబ్బంది తదితరులున్నారు. -
రైల్వే ఇన్స్టిట్యూట్ నిర్వహణ భేష్
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే జనరల్ ఇన్స్టిట్యూట్ నిర్వహణ సూపర్గా ఉందని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ ఆర్.గోపాల్కృష్ణన్ అన్నారు. కాజీపేట జంక్షన్లో పలు విభాగాలను ఆదివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్ఎం రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు పరిశీలించి, రైల్వే రన్నింగ్ రూంలో డ్రైవర్లకు కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ షటిల్ కోర్టును ఏడీఆర్ఎంతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైల్వే ఇన్స్టిట్యూట్కి వెళ్లి క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన రెండు క్యారం బోర్డులు ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ కమిటీని అభినందించి నిర్వహణ బాగుందని పేర్కొన్నారు. రైల్వే ఇన్స్టిట్యూట్, రైల్వే కమ్యూనిటీహాల్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూట్ అభివృద్ధికి కేటాయించిన ఎస్బీఎఫ్ ఫండ్ను మంజూరు చేయాలని, రైల్వే కమ్యూనిటీహాల్కు మరో డైనింగ్హాల్ నిర్మాణం చేయాలని, ఏసీని మరమ్మతు చేయాలని, జనరేటర్ను మంజూరు చేయాలని, కుషన్ స్టీల్ చైర్లు, కావాల్సిన సామగ్రి ఇప్పించాలని కమిటీ బాధ్యులు వినతిపత్రం సమర్పించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో నూతన భవనంతోపాటు జిమ్కు సంబంధించిన సామగ్రి ఏర్పాటు చేయాలని, ఇన్స్టిట్యూట్లో నూతనంగా టాయిలెట్స్ నిర్మించాలని డీఆర్ఎంను కోరారు. కార్యక్రమంలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ సీనియర్ డీఈఈ సూర్యనారాయణ, రైల్వే అధికారులు ప్రశాంతకృష్ణసాయి, సుధీర్కుమార్, ఎన్వీ వెంకటకుమార్, టి.అనికేత్కాడే, ప్రంజల్ కేశర్వాణి, రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీ దేవులపల్లి రాఘవేందర్, కమిటీ బాధ్యులు ఎం.రాజయ్య, జి.రాజేశ్వర్రావు, ధారవత్ రఘు, ఎస్.ప్రవీణ్, పి.రవికిరణ్, జి.భాస్కర్, బి.మల్లయ్య, ఎస్.లక్ష్మీనారాయణ, డి.వెంకటేశ్వర్లు, రైల్వే కార్మికులు పాల్గొన్నారు. డీఆర్ఎం గోపాలకృష్ణన్ -
అదనంగా యూరియా
గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నులు..హన్మకొండ: యూరియా కొరత అంటూ జరిగిన ప్రచారంతో రైతులు ఎరువుల షాపుల ఎదుట కొనుగోలుకు క్యూకట్టారు. దీంతో జిల్లాలో అవసరానికి మించి యూరియా సరఫరా జరిగింది. గతేడాదితో పోలిస్తే అదనపు యూరియా రైతులకు చేరింది. వ్యవసాయశాఖ వానాకాలం ప్రణాళిక మేరకు ఎరువులు, విత్తనాలు సమకూర్చుతోంది. యూరియా కొరత అంటూ విస్తృత ప్రచారంతో రైతులు ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎదుట వరుసకట్టారు. కొందరు నిలబడలేక వరుస క్రమంలో చెప్పులు పెట్టడంతో యూరియా కొరత ప్రచారం తీవ్రస్థాయికి చేరింది. సహకార సంఘాలకు తమ సభ్యులు కాని రైతులు రాకుండా నివారించేందుకు కొన్ని సంఘాలు రైతులకు గుర్తింపుకార్డులు జారీ చేశాయి. అన్ని ఎరువులు కలిపి 91,877 మెట్రిక్ టన్నుల అంచనా.. హనుమకొండ జిల్లాలో 307 ఎరువుల షాపులు, 15 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు అందిస్తున్నారు. గతేడాది వానాకాలంతో అన్ని కలిపి 57,478 మెట్రిక్ టన్నుల ఎరువులు వాడారు. ప్రస్తుత సీజన్లో అన్ని ఎరువులు కలిపి 91,877 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో యూరియా 33,523 మెట్రిక్ టన్నులు, డీఏపీ 12,416, ఎన్పీకే 31,040, ఎంవోపీ 9,932, ఎస్ఎస్పీ 4,966 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతం యూరి యా 2,853.99 మెట్రిక్ టన్నుల నిల్వ ఉంది. డిమాండ్ మేరకు ఎరువుల సరఫరా.. పత్తి, మొక్కజొన్న, కూరగాయల తోటలకు మాత్రమే యూరియా అవసరం. యూరియా కొరత ప్రచారంతో వరిసాగు రైతులు సైతం ముందుగానే యూరియాను సమకూర్చుకున్నారు. గతేడాది జూలైలో 4,900 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ప్రస్తుత జూలైలో 6,261 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. 1,361 మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా సరఫరా చేశారు. జిల్లాలో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 2,43,357 ఎకరాలు కాగా ఇప్పటివరకు 1,51,383 ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం 6,261 మెట్రిక్ టన్నుల సరఫరా జిల్లాలో 2,853 మెట్రిక్ టన్నుల నిల్వ అత్యధికంగా కొనుగోలు చేసిన వారి జాబితా సేకరణ రైతులకు కాకుండా ఇతరులకు విక్రయిస్తే చర్యలుఎరువుల విక్రయాలపై తనిఖీ.. ఎరువుల విక్రయాలు, సరఫరా, వినియోగంపై పారదర్శకత, అవకతవకలు, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు అధికారులు, పోలీసులు ఎరువుల తనిఖీలకు పూనుకున్నారు. ప్రతీనెల జిల్లాలో అత్యధికంగా ఎరువులు కొనుగోలు చేసిన 20 మంది జాబితాను వ్యవసాయ శాఖ సేకరిస్తోంది. వీరు కొనుగోలు చేసిన ఎరువులు వారే వినియోగించారా..? అక్రమాలకు పాల్పడ్డారా..? వంటి అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రైతులకు కాకుండా ఇతరులకు ఎరువులు విక్రయిస్తే ఆయా డీలర్లపై చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఈ–పాస్ మిషన్లను డీలర్లకు అందించారు. రైతు వేలిముద్ర వేస్తే ఆధార్ నంబర్తో సహా వివరాలు రాగానే వాటిని నమోదు చేస్తారు. దీంతో రైతుల వారీగా వివరాలు ప్రభుత్వం వద్ద సమాచారం ఉంటుంది. నానో యూరియా వాడాలి.. భూమిలో వేసే యూరియా బదులుగా నానో యూరియా వాడితే పంటలకు, రైతులకు మేలు. భూమిలో వేసే యూరియా 30శాతం మాత్రమే పంటకు చేరుతుంది. 70 శాతం వృథాగా పోతుంది. నానో యూరియా నేరుగా మొక్కలపై పిచికారీ చేయడం వల్ల మొక్కకు పూర్తిగా చేరుతుంది. రైతుల అవసరాల మేరకు సరఫరా చేస్తున్నాం. ఎరువుల కొరత లేదు. రైతులు ఆందోళన చెందొద్దు. – రవీందర్ సింగ్, జిల్లా వ్యవసాయాధికారి, హనుమకొండ -
కార్యకర్తలను కాపాడుకుంటా..
ఐనవోలు: కాంగ్రెస్ నాయకులకు భయపడొద్దని, కార్యకర్తలను కాపాడుకునే శక్తి తనకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఐనవోలు, పంథిని పున్నేలు, ఒంటిమామిడిపల్లి, లింగమోరిగూడెం తదితర గ్రామాలకు చెందిన 90 మంది ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్లోని కొంతమంది నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు చెప్పారు. స్థానిక ఎన్నికలకు ముందు మాత్రమే బీఆర్ఎస్లో చేర్చుకుంటామని, ఆ తర్వాత చేరుతామనేవారికి నోఎంట్రీ బోర్డు పెడతామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దుమ్ము దులుపుడే అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. మండల కన్వీనర్ తంపుల మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ తక్కళ్లపల్లి చందర్రావు, ఎన్నికల ఇన్చార్జ్ గోపాల్రావు, ఎండీ ఉస్మాన్అలీ, గుంషావలీ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
విద్యలో అంతరాలు తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె.వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయాయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ.. 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మా ట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు,రవీందర్రాజు, శ్రీధర్రాజు పాల్గొన్నారు. బెనిఫిట్స్ చెల్లించాలి..రిటైర్డ్ ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ చెల్లించాలని నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండలోని టీఎస్యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం టీఎస్యూటీఎఫ్ హసన్పర్తి మండల అధ్యక్షురాలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఎ.శోభారాణి సన్మాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. టీఎస్యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు డి.కిరణ్కుమార్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.రవీందర్రాజు, జనరల్ సెక్రటరీ పెండెం రాజు, మాజీ ఎంఈఓ రాంకిషన్రాజు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి -
సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం
హన్మకొండ/హన్మకొండ కల్చరల్: సమాజ హితాన్ని కోరుకునేదే సాహిత్యం అని, అలాంటి సాహిత్య సృజన చేసే వారి సంఖ్య పెరిగినప్పుడే సమాజంలో చైతన్యం వస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. వరంగల్ ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెండు ఉమామహేశ్వర్ కలం నుంచి జాలు వారిన ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం హనుమకొండ నయీంనగర్లోని వాగ్దేవి కళాశాల ఆడిటోరియంలో జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కృషి ఉంటేనే మనిషి ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాడన్నారు. పుస్తక రచయిత మెండు ఉమామహేశ్వర్ తన అనుభవాల సారాన్ని మనసు–మనిషి పుస్తకంలో లిఖించారని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో మానవజాతి కలుషితమైపోయిందని, ఇది అణుబాంబు కన్నా ప్రమాదకరంగా మారిందన్నారు. మన జీవితాలు ఉదయం కల్తీతో ప్రారంభమై కల్తీతో ముగుస్తున్నాయన్నారు. అద్భుతాలు సృష్టించే వారంతా అతి సాధారణ కుటుంబాల నుంచే వచ్చారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఇటీవల మరణించిన తన సోదరుడు ప్రముఖ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్కు అంకితం ఇవ్వడం సోదరుల మధ్య ఉన్న ఆప్యాయతకు నిదర్శనం అన్నారు. అనంతరం రచయితను సన్మానించారు. సమన్వయకర్తగా ఆర్.లక్ష్మణ్ సుధాకర్ వ్యవహరించారు. సీనియర్ పాత్రికేయులు దాసరి కృష్ణారెడ్డి, శంకేశి శంకర్రావు, ప్రముఖ సైకాలజిస్ట్ జి.నాగేశ్వరరావు, పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ పాల్గొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ‘మనసు–మనిషి’ పుస్తకావిష్కరణ -
నేడు ఫ్రెండ్షిప్ డే
లింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం..కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధూర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు -
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025
– 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు1. ఫ్రెండ్ షిప్ అంటే..మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది2184స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయ్యిందా..? 4. నీ ఫ్రెండ్కు ఇచ్చే స్థానం..? A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A59● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తర్వాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 61న్యూస్రీల్– సాక్షి నెట్వర్క్ -
ఐనవోలు మల్లికార్జునస్వామి హుండీ లెక్కింపు
● రూ.40.73 లక్షల ఆదాయం ఐనవోలు: ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి దేవాలయ హుండీ లెక్కింపు కార్యక్రమం దేవాదాయశాఖ పరిశీలకులు డి.అనిల్ కుమార్ పర్యవేక్షణలో శనివారం నిర్వహించారు. గత మే 6నుంచి ఈ నెల 2వ తేదీ వరకు హుండీల్లో రూ.6,53,015, వివిధ ఆర్జిత సేవా టికెట్ల ద్వారా రూ.34,20,073 రాగా, మొత్తం రూ.40,73,088ల నగదు సమకూరినట్లు ఈఓ అద్దంకి నాగేశ్వరరావు తెలిపారు. హుండీల్లో లభ్యమైన వెండి, బంగారాన్ని యధావిధిగా హుండీలోనే వేసి సీల్ చేశామన్నారు. లెక్కింపులో కానిస్టేబుళ్లు శ్రీనివాస్, జి.పరమేశ్వరి, అర్చక సిబ్బంది, ఒగ్గు పూజారులు, మహబూబాబాద్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు. ఇంటర్.. భవిష్యత్కు మార్గనిర్దేశం రామన్నపేట: ఇంటర్మీడియట్ విద్య.. భవిష్యత్కు మార్గనిర్దేశమని జూనియర్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ పూజ పేర్కొన్నారు. వరంగల్ కృష్ణాకాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సును శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ పూజ మాట్లాడుతూ విద్యార్థి దశలో సోషల్ మీడియాలో వచ్చే పోస్టింగ్లకు స్పందించవద్దని సూచించారు. కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారులు వనమాల, ప్రవళిక పాల్గొన్నారు. -
అమ్మవారిని దర్శించుకున్న దేవాదాయశాఖ ఆర్జేసీ
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయాన్ని శనివారం దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ మల్లెల రామకృష్ణారావు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన వెంట సినీ దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ ఉన్నారు. వారిని ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఘనంగా స్వాగతించారు. అమ్మవారికి పూజలు నిర్వహించుకున్న అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు తమ వివాహవార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాజీపేట జంక్షన్కు నేడు రైల్వే డీఆర్ఎంకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ఈనెల 3న దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) డాక్టర్ గోపాలకృష్ణన్ పర్యటించనున్నారు. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం ప్రత్యేక రైళ్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట జంక్షన్కు చేరుకుంటారు. అనంతరం జంక్షన్లోని రైల్వే యార్డు, డ్రైవర్ల కార్యాలయం, రన్నింగ్ రూంలను తనిఖీ చేస్తారు. కాజీపేట రైల్వే జనరల్ ఇనిస్టిట్యూట్ను తనిఖీతో పాటు కాజీపేట జంక్షన్లో నిర్మించిన షటిల్ కోర్టును ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. హనుమకొండ డీఆర్ఓగా రాజా గౌడ్హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారిగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి.రాజాగౌడ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకాలం డీఆర్ఓగా పనిచేసిన వైవీ గణేష్కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రాజాగౌడ్కు హనుమకొండ కేటాయించారు. సోమవారం ఆయన విధుల్లో చేరనున్నట్లు సమాచారం. వరంగల్ విద్యార్థులకు బంగారు పతకాలుహన్మకొండ: వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు బంగారు పతకాలు లభించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అవార్డుల ప్రదానం జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్, గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, ఐసీఏఆర్ డైరక్టర్ జనరల్, డీఏఆర్ఈ సెక్రటరీ మంగీలాల్ జాట్ ముఖ్యఅతిథిలుగా పాల్గొని అవార్డులు అందించారు. వరంగల్ వ్యవసాయ కళాశాలకు చెందిన ఆర్షియా తబస్సమ్కు నాలుగు బంగారు పతకాలు, బండెవాల శ్వేత, ఏనుగు మానసకు బంగారు పతకం అందుకున్నారు. అవార్డులు అందుకున్న విద్యార్థులను వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధ్యాపకులు అభినందించారు. వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభం హన్మకొండ అర్బన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హనుమకొండ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల కోసం ఏర్పాటు చేసిన డే కేర్ సెంటర్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ నాయిని రాజేందర్రెడ్డి శనివారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేందర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 33జిల్లాల్లో 37 డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డా.పి.విజయచందర్రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యేను సత్కరించారు. అనంతరం వృద్ధులను చేనేత టవల్స్తో సత్కరించారు. తలసేమియా పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి బొమ్మిరెడ్డి పాపిరెడ్డి, సభ్యులు ఈవీ శ్రీనివాస్రావు, వేణుగోపాల్, శేషుమాధవ్, రమణారెడ్డి, మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారి జయంతి, అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులు, సిబ్బందికి సూచించారు. హనుమకొండ టీవీ టవర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం (బీ), బాలసముద్రంలోని బాలికల వసతి గృహం (ఏ)ను శనివారం ఆమె తనిఖీ చేశారు. విద్యార్థులకు కోసం సిద్ధం చేసిన భోజనం, కూరలను పరిశీలించారు. రిజిస్టర్లు, బియ్యం, ఇతర వంట సామగ్రిని తనిఖీ చేశారు. . విద్యార్థుల సంఖ్య, వారి హాజరుశాతాన్ని వార్డెన్లను అడిగి తెలుసుకున్నారు. మెనూ చార్ట్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. తాజా కూరగాయలనే వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ డీడీ నిర్మల, ఏఎస్డబ్ల్యూ కృష్ణ, వార్డెన్లు పాల్గొన్నారు. -
నగరాన్ని తలపించేలా పరకాల
పరకాల: వరద ముంపునకు గురికాకుండా ప్రణాళికబద్ధంగా అంచెల వారీగా నగరాన్ని తలపించేలా పరకాల పట్టణాన్ని సుందరీకరించనున్నట్లు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తెలిపారు. గత పాలకుల స్వార్థపూరిత ప్రయోజనాలు, నిర్లక్ష్యం మూలంగా అభివృద్ధిలో పరకాల పట్టణం వెనకబడిపోయిందని ఆరోపించారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 14, 19వార్డులలో జరుగుతున్న డ్రైనేజీల నిర్మాణపు పనులను శనివారం ఎమ్మెల్యే రేవూరి పరిశీలించారు. అధికారుల పర్యవేక్షణలో నాణ్యతతో కూడిన పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సుమారు రూ.24 కోట్లతో పరకాల పట్టణ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని, అభివృద్ధి పనుల్లో పట్టణ ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు కలగవచ్చని, కానీ భవిష్యత్తరాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. అమృత్ పథకం కింద మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న వర్షాలకే వరద ముంపునకు గురవుతున్న పరకాలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలతో నివేదిక రూపొందిస్తామన్నారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కమిషనర్ కె.సుష్మా, ఏఈ రంజిత్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్రావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్, మడికొండ సంపత్, రాంమూర్తి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల తనిఖీ పరకాలలోని 14వవార్డులో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, పుస్తకాల పంపిణీని అడిగి తెలుసుకున్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి -
దశల వారీగా కాల్వల్లో పూడికతీత
రాయపర్తి: రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టినట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తెలిపారు. తిర్మలాయపల్లి గ్రామ పరిధిలోని డీబీఎం–55 కెనాల్లో రూ.8లక్షలతో పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనులు పూర్తయిన తర్వాత రాయపర్తి, తిర్మలాయపల్లి పరిధిలోని సుమారు 500 ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు. దశలవారీగా నియోజకవర్గంలోని అన్ని కాల్వల్లో పూడికతీత పనులు చేపడతామని చెప్పారు. ఎస్సారెస్పీ కాల్వగట్టు బురద, గుంతలమయంగా ఉండడంతో ఎమ్మెల్యే అధికారులతో కలిసి గ్రామపంచాయతీ ట్రాక్టర్పై వెళ్లి పనులు ప్రారంభించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ చంద్రమోహన్, ఇరిగేషన్ అధికారులు బాలదాసు తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
వరంగల్
ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎండ ఉంటుంది. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుంది. చిరంజీవులుగా జీవిద్దాం.. మనిషి మరణించిన తర్వాత అవయవాలను దానం చేస్తే మరొకరికి ప్రాణం పోసినట్లే. నేడు జాతీయ అవయవదాన దినోత్సవం. – 8లోu3. నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్ ఉన్నారు. A) ఇద్దరికి మించి B) ఒకరు1. ఫ్రెండ్ షిప్ అంటే.. మీ దృష్టిలో A) అవసరాలు తీర్చేది B) కల్మషం లేనిది2184స్నేహం అంటే మనుషుల్ని కలిపే వారధి. కష్టసుఖాలను పంచుకునే ఓ అనుభూతి. కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ ‘చేయి’ అందించే ఓ రూపం.. ప్రపంచంలో ప్రతీ బంధానికి ప్రత్యేకత ఉంటుంది. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు..బంధువులు సహజంగా లభిస్తారు.. కానీ, స్నేహితులు మాత్రం మనం మన చేతిగా ఎంచుకునే బంధం. అలాంటి అపూర్వమైన అనుబంధాన్ని గుర్తుచేసుకునే రోజు స్నేహితుల దినోత్సవం. ఈ నేపథ్యంలో స్నేహబంధంపై ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంపై సాక్షి సర్వే నిర్వహించింది. ఇప్పటికీ, ఎప్పటికీ కల్మషం లేనిది స్నేహబంధమని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరికి జీవితంలో ఇద్దరికంటే ఎక్కువ స్నేహితులుండాలని, అప్పుడే ఏదైనా ఆపద వస్తే అండగా ఉంటారని చెప్పారు. 36992. ఫ్రెండ్షిప్ కూడా.. కలుషితం అయిందా..! 4. నీ ఫ్రెండ్కు ఇచ్చేస్థానం..?. A) అమ్మ, నాన్న, ఫ్రెండ్ B) నాన్న, అమ్మ, ఫ్రెండ్ A59● ఇద్దరికి మించి స్నేహితులు అవసరం ● అమ్మానాన్న తర్వాత ఫ్రెండ్కే ప్రాధాన్యం ● ఉమ్మడి వరంగల్ జిల్లా యువత మనోగతంA) లేదుB) అవును2932C) ఫ్రెండ్, అమ్మ, నాన్న 61న్యూస్రీల్– సాక్షి నెట్వర్క్ -
వయోవృద్ధులకు వైద్యసేవలందించాలి
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో వయోవృద్ధులకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. సీని యర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ హనుమకొండ ఆధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007పై ఎంజీఎంలో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆమె హాజరై మా ట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులు, ఇతర సౌకర్యాలను కల్పించి వైద్య సేవలందించాలన్నా రు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు పెద్దవారిపై ప్రేమ, గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లో పిల్లలు కూడా పెద్దవారితో ప్రేమగా మెలుగుతారని తెలిపారు. ఎంజీ ఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వైద్యసేవలందిస్తున్నామని, వారికి ప్రత్యేక ఓపీ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణలో హెల్పేజ్ ఇండియా సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్యాంకుమార్ పాల్గొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ -
కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న స్నేహితులు
స్నేహితం.. సేవే అభిమతం తొర్రూరు: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1984–85 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆపదలో స్నేహితులకు ఆర్థిక చేయూతనిస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిత్రుడు చాట్ల సంపత్ను బతికించాలని రూ.1.3 లక్షలు సమీకరించి చికిత్స అందించారు. అదేవిధంగా కంఠాయపాలెం గ్రామానికి చెందిన ఆర్ఎన్ చారి అనారోగ్యం బారిన పడి ఆర్థికంగా చితికిపోగా.. గుర్తించిన మిత్రులు రూ.50 వేలు జమ చేసి అందించారు. పదో తరగతి మిత్రుడు నాగేశ్వరరావు ఆర్టీసీ కండక్టర్గా పనిచేస్తుండగా.. బస్సు ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. ఆరు నెలలు డ్యూటీ లేకుండా ఇంట్లోనే ఉండడంతో అతడి కూతురు చదువుకు ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మేమున్నామంటూ సహచర పదో తరగతి మిత్రులు రూ.70 వేలు అందించారు. ● ఆర్థికంగా ఆదుకుంటున్న పూర్వ విద్యార్థులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉమ్మడి జిల్లా దోస్తులు నేడు ఫ్రెండ్షిప్ డేలింగభేదాలకు అతీతం.. కులమతాలకు వ్యతిరేకం.. కష్టాల్లో గుండె నిబ్బరం. రంగుల కలలను రంగరించే ప్రత్యేక లోకం. అదే స్నేహ బంధం దృగంతాలను చుట్టి రావాలన్నా.. అంబరాన్ని అందుకోవాలన్నా.. సందర్భమేదైనా జిందగీలో దోస్తానా అనేది ఉంటే.. దిల్.. జిగేల్ అనాల్సిందే! అలాంటి స్నేహ మాధుర్యానికి నేడు (ఆదివారం) స్నేహితుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ అక్షర రూపం ఇచ్చింది. ప్రతిరోజూ మాట్లాడుకుంటాం..నర్సంపేట: వృత్తి రీత్యా ఒకరు పోలీసు శాఖలో సీఐ,మరొకరు ఉపాధ్యాయుడు. 30 సంవత్సరాల క్రితం డిగ్రీ చదివే సమయంలో పరి చయమయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఒకే కుటుంబంలాగా కలిసి ఉంటున్నారు. కష్టాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు వారే నర్సంపేటకు చెందిన సీఐ రఘు, ఖానాపురానికి చెందిన ఉపాధ్యాయుడు కుమార్. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు ఫోన్లో మాట్లాడుకుంటామని, వేర్వేరు వృత్తుల్లో ఉన్నా కలిసి ఉంటామన్నారు.ఆడపిల్లలకు ఆర్థిక చేయూత ఖానాపురం: మండల కేంద్రంలోని హైస్కూల్లో 1996–97లో విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకున్నారు. వీరంతా మూడేళ్ల క్రితం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించుకున్న సమయంలో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేసుకున్నారు. వీరితో పాటే 6 నుంచి 9వ తరగతి చదివిన వారిని సైతం ఇదే గ్రూప్లో యాడ్ చేసుకున్నారు. ప్రస్తుతం సుమారు 50 మందితో గ్రూప్ సాగుతోంది. గ్రూపులో ఎవరికి ఏ కష్టమొచ్చినా తామున్నామనే భరోసాను కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు 14 మంది స్నేహితుల కుమార్తెలకు ఆర్థిక చేయూతనందించారు. వివాహ సమయాల్లో ఒక చోట కలిసి ఆనందంగా గడుపుతున్నారు.స్నేహితుల సంఘం! గీసుకొండ: గ్రేటర్ వరంగల్లోని 16వ డివిజన్ ధర్మారంలోని కోట మెసమ్మ తల్లి పరపతి సంఘం (స్నేహితుల సంఘం) ఆదర్శంగా నిలుస్తోంది. 2014 ఆగస్టు 15న తొమ్మిది మంది స్నేహితులు కలిసి ఏర్పాటు చేసిన సంఘంలో ప్రస్తుతం 24 మంది సభ్యులున్నారు. రూ. 50 లక్షల టర్నోవర్తో సంఘం లావాదేవీలు నిర్వహిస్తోంది. అవసరం ఉన్నసభ్యులకు 0.5 వడ్డీతో రుణాలిస్తున్నారు. సంఘ సభ్యులెవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తున్నారు. ఏటా ఫ్రెండ్ షిప్ డే రోజున సంఘ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. కోటమైసమ్మ తల్లికి గొర్రెలను బలిచ్చి విందు చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. -
ఆడపిల్లల్లో స్నేహితుడిని చూసుకుంటూ..
కేసముద్రం: బాల్యమిత్రుడు మృతి చెందాడు. అతడి ఇద్దరు కూతుళ్లు అనాథలయ్యారు. ఆ ఆడబిడ్డల్లో స్నేహితుడిని చూసుకుంటున్నారు కేసముద్రంలోని ఎస్వీవీ హైస్కూల్కు చెందిన 1996–97 ఎస్సెస్సీ బ్యాచ్ మిత్రులు. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన గాండ్ల అశోక్కు ఇద్దరు కుమార్తెలు. మొదటి భార్యకు కూతురు పుట్టగానే ఆమె మృతిచెందింది. ఆతర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. కాగా.. రెండో భార్యకు మరో కూతురు జన్మించగానే అశోక్ చనిపోయాడు. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించిన ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వవిద్యార్థులు ఆ ఇద్దరు ఆడపిల్లల పేరుమీద సుకన్య సమృద్ధి యోజన కింద ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏటా రూ.45 వేల ఫీజు చెల్లిస్తూ పెద్దకూతురు శివానిని(6వ తరగతి) నర్సంపేటలోని ఓప్రైవేట్ పాఠశాలలో చదివిస్తున్నారు. వారు చదువుకున్నంత కాలం తాము చదివిస్తామని బాల్యమిత్రులు చెబుతున్నారు. -
బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్
హన్మకొండ: సమాజానికి సేవ చేయాలనే సదుద్దేశంతో 10 మందితో మొదలైంది బెస్ట్ ఫ్రెండ్స్ ఫౌండేషన్. ప్రస్తుతం వెయ్యి మందితో నడుస్తోంది. ఆర్థిక సమస్య కారణంగా ఎవరూ చదువు మధ్యలోనే ఆపేయవద్దనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు పులి దేవేందర్, డిప్యూటీ తహసీల్దార్ పతంగి భాస్కర్తో పాటు మరికొంత మంది మిత్రులు. 2020లో మొదలైన ఈ ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేద విద్యార్థులకు ఆర్థికసాయం, పాలిసెట్ బుక్స్ పంపిణీ, పోటీ పరీక్షల పుస్తకాలు, మెటీరియల్ అందజేత, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సాయం. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తూ వారికి ఆర్థిక చేయూతనందిస్తూ ముందుకుసాగుతోంది. -
ఎన్జీటీ సూచనలు అమలు చేయండి
న్యూశాయంపేట: నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సూచనలు అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కలెక్టర్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్జీటీ నిబంధనల ప్రకారం వరంగల్ కోట చెరువును శుభ్రం చేయించాలని, ప్రస్తుతం ఉన్న లెగసి వ్యర్థాలను టెండర్ ప్రాసెసింగ్ చేయాలన్నారు. ఎన్జీటీ విధివిధానాల ప్రకారం 17 ఎకరాల భూమిని రాంపూర్ డంప్యార్డ్లో నిర్వహించడంతోపాటు బయోమైనింగ్ పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ల్యాండ్కు టెండర్ ప్రక్రియ పూర్తి చేసినట్లు, నియంత్రించడానికి ఎన్ఫోర్స్మెంట్ బృందాలు ఏర్పాటు చేసినట్లు బల్దియా కమిషనర్ చాహత్బాజ్పాయ్ తెలిపారు. వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక ప్రతిమలను ప్రతిష్ఠించాలని సూచించారు. డీఆర్ఓ విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సునీత, బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఎంహెచ్ఓ రాజేశ్ పాల్గొన్నారు. రెడ్క్రాస్లో సభ్యత్వం తీసుకోవాలి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలో ప్రజలు, యువకులు సభ్యత్వం తీసుకొని సేవచేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికా రుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గవర్నర్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బ్రాంచ్లో సభ్యత్వ నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రపాలక మండలి సభ్యుడు శ్రీనివాస్రావు, డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సహకార అధికారి నీరజ, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఐఆర్ఎస్ ఎంసీ మెంబర్ నాడెం శాంతికుమార్, కోశాధికారి రాజేశ్వర్ ప్రసాద్ ఉన్నారు. పంట మార్పిడిపై అవగాహన ఉండాలి మామునూరు: పంట మార్పిడిపై రైతులు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన ఏరువాక రైతుబడి కార్యక్రమంలో పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నుంచి పర్చువల్గా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమాన్ని కలెక్టర్, రెతులు వీక్షించారు. డీఏఓ అనురాధ, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్రావు ఉన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
వరంగల్ అబ్బాయి.. అమెరికా అమ్మాయి
రామన్నపేట : వరంగల్ అబ్బాయి, అమెరికా అమ్మాయి ప్రేమ వివాహం గురువారం నగరంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఇరుకుటుంబాల సమక్షంలో వైభవంగా జరిగింది. వరంగల్లోని పోచమ్మమైదాన్కు చెందిన డాక్టర్ అశోక్, సునీత దంపతుల కుమారుడు రితేశ్, అమెరికాలోని పీట్స్బర్గ్కు చెందిన జూలియాన్ మనస్సులు కలవడంతో పెద్దలను ఒప్పించి బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కాగా, అమెరికా అమ్మాయి అయినా అచ్చ తెలుగు సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగడంపై అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. -
చేతులు, కాళ్లను చున్నీతో కట్టి.. మరో చున్నీతో మెడ బిగించి..
ఖిలా వరంగల్ : ప్రేమించి పెళ్లి చేసున్నాం.. అన్ని మర్చిపోయి సంతోషంగా జీవిద్దామని భార్యను ప్రాధేయపడినా.. మనసు మార్చుకోకపోవడంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి వరంగల్ ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ నగర్లోని కమ్మల గుడి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం.. ఉత్తర్ప్రదేశ్కు చెందిన రితేష్ సింగ్ ఠాకూర్ అలియాస్ పడ్డు ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం వరంగల్ వచ్చి కమ్మల గుడి వద్ద నివాసముంటూ ఐస్క్రీమ్ వ్యాపారం కొనసాగిస్తున్నాడు. ఐదేళ్ల క్రితం రితేష్ సింగ్ ఠాకూర్ను ఏనుమాముల రోడ్డులోని లక్ష్మీ గణపతి కాలనీకి చెందిన ఎండి. మహబూబ్ కుమార్తె రేష్మా సుల్తానా ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు సురాజ్, సరస్వతి ఉన్నారు. దంపతులు ఐస్ క్రీమ్ వ్యాపారం నిర్వహించుకుంటూ అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం రేష్మా సుల్తానాకు ఉత్తర్ప్రదేశ్కు చెందిన సన్నీతో పరిచయం ఏర్పడింది. సన్నీ, రితేష్ సింగ్ ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ వాసులు కావడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సన్నీ తరచూ ఇంటికి రావడంతో రేష్మా సుల్తానా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం రితేష్ సింగ్కు తెలియడంతో భార్యను మందలించాడు. తర్వాత తమ నివాసాన్ని శాంతినగర్కు మార్చాడు. మూడు రోజుల క్రితం రేష్మా సుల్తానా బాలాజీ నగర్లోని తల్లి ఇంటికి వచ్చింది. ఆ వెంటనే భర్త రితేష్ సింగ్ కూడా వచ్చి సన్నీని మర్చిపో.. సంతోషంగా జీవిద్దామని రేష్మా సుల్తానాకు సర్ది చెప్పాడు. అనంతరం జూలై 30న తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయగా.. ఆమె గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. అనంతరం జూలై 31న రాత్రి 8 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంట్లో లేని సమయంలో రితేష్ సింగ్.. భార్యతో గొడవ పడి ఆమె చేతులు, కాళ్లను చున్నీతో కట్టి, మరో చున్నీతో మెడకు బిగించి ఉరివేసి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. శుక్రవారం ఉదయం 5.30 గంటలకు రేష్మా సుల్తానా తల్లి ఇంటికి వచ్చి చూడగా.. కుమార్తె చనిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న ఏనుమాముల ఇన్స్పెక్టర్ సురేశ్ ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలి సోదరుడు యాకూబ్పాషా ‡ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ జే.సురేశ్ తెలిపారు. -
ఓరుగల్లు ఖ్యాతి.. జాతీయస్థాయికి
హన్మకొండ కల్చరల్ : ఓరుగల్లు ఖ్యాతి జాతీయస్థాయిలో మారుమోగింది. ‘ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మతీరు కొంగులోనా దాసిపెట్టి కొడుకు ఇచ్చేప్రేమ వేరు’.. అంటూ పొద్దుపొడిచినప్పటినుంచి పల్లెటూరి బంధాలు, అనుబంధాలు, వాతావరణాన్ని వినసొంపుగా పాటరూపంలో బలగం సినిమాకు అందించిన కాసర్ల శ్యామ్కు శుక్రవారం బెస్ట్ లిరిక్స్ కేటగిరిలో నేషనల్ అవార్డు ప్రకటించారు. హనుమకొండలోని బ్రాహ్మణవాడకు చెందిన కాసర్ల శ్యామ్ జానపద పాటలు పాడటం, రాయడంలో నేర్పరి. ఈ నేపథ్యంలో జిల్లావాసికి అవార్డు రావడంతో పలువురు కళాకారులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉంది.. నేషనల్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ముందుగా బలగం టీముకు ధన్యవాదాలు తెలుపుతున్నా. పాటకు భీమ్స్ సంగీతంపాటు మంగ్లీ, రామ్ మిర్యాల వాయిస్లు తోడుకావడం వల్ల సంపూర్ణత్వం వచ్చింది. చిన్నతనంలో పల్లెటూర్లు తిరిగాను. పాట వింటేనే పల్లెటూరి జీవనం గుర్తుకు వచ్చేలా రాయాలని అనుకున్నా. తెలంగాణ పల్లెటూర్లలో నివసించే ప్రజలు తెల్లవారుజాము 4గంటలకే లేచి, వారు చేసే పనులు, మనుషుల మధ్య ప్రేమానుబంధాలను గుర్తు చేసుకుంటూ పాటరూపంలో రాశా. – కాసర్ల శ్యామ్, పాటల రచయిత జిల్లావాసి కాసర్ల శ్యామ్కు నేషనల్ అవార్డు ఉత్తమ లిరిక్ రైటర్గా గుర్తింపు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు -
స్కూళ్లలో ఎఫ్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ షురూ
జనగామ: రాష్ట్ర వ్యాప్తంగా (పెద్దపల్లి మినహా) ప్రభుత్వ పాఠశాలల్లో బోధనచేసే టీచర్లకు ఫేషియల్ అటెండెన్స్(ఎఫ్ఆర్ఎస్) నమోదు శుక్రవారం నుంచి ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల ర్యాంకులు (శాతం) విడుదల చేశారు. వరంగల్–8, హనుమకొండ–16, మహబూబాబాద్–26, జనగామ–27, ములుగు–29, భూపాలపల్లి–33వ స్థానంలో నిలిచాయి. మొబైల్ ఫోన్లో విద్యార్థితోపాటు ఉపాధ్యాయులు, స్కూల్ సిబ్బందికి సంబంధించి ఒకే లాగిన్లో వేర్వేరుగా అటెండెన్స్ తీసుకునే అవకాశం కల్పించారు. కొంతకాలంగా విద్యార్థులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం కొనసాగుతుండగా.. కొత్తగా టీచర్లకు అమలు చేస్తున్నారు. ఉదయం 9.05 గంటలకు, సాయంత్రం 4.15 గంటల తర్వాత టీచర్లు, స్టాఫ్ ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. కాగా, అటెండెన్స్ తీసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ తర్వాత ఫొటో అప్లోడ్ అయ్యేందుకు అరగంట సమయం పట్టిందని పలువురు ఉపాధ్యాయులు తెలిపారు. సాంకేతిక సమస్య ఇలాగే కొనసాగితే అటెండెన్స్ కోసమే సమయం వృథా చేయాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. -
మాడవీధుల పనుల పరిశీలన
హన్మకొండ కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ స్థపతి వల్లీనాయగం శుక్రవారం శ్రీభద్రకాళి దేవాలయాన్ని సందర్శించారు. రాజగోపురాల నిర్మాణంపై, అమ్మవారి ఆలయానికి దక్షిణంవైపు మాడవీధుల నిర్మాణానికి పలు సూచనలు చేశారు. స్థపతి సూచనలను ఈవో ద్వారా దేవాదాయశాఖ ఆమోదానికి పంపిస్తామని కుడా అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు భద్రకాళి శేషు, పరి శీలకులు అద్దంకి విజయ్కుమార్, కుడా పీవో అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, డీఈఈ రఘుబా బు, కాంట్రాక్టర్ శ్రీధర్రావు పాల్గొన్నారు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని పూజలు జరుపుకున్నారు. అనంతరం మాడవీధుల నిర్మాణ పనులను పరిశీలించారు. హకీంపేటకు దీటైన క్రీడా పాఠశాలవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్కు దీటుగా హనుమకొండలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్(క్రీడా పాఠశాల) కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, కడి యం శ్రీహరి తెలిపారు. శుక్రవారం వారు కలెక్టర్ స్నేహ శబరీశ్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ చౌహాన్ బాజ్పాయ్, వివిధ శాఖల అధికారులతో కలిసి హనుమకొండలో ని జవహర్లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియంలో కొనసాగుతున్న రీజినల్ స్పోర్ట్స్ హాస్టల్ బాలబాలికల భవనాలను పరి శీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, ఇతర వివరాలను డీవైఎస్వో గుగులోతు అశోక్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. మొదటగా తాత్కాలిక పాఠశాలను ప్రారంభించేందుకు కావాల్సిన సౌకర్యాల కల్పనపై చర్యలు చేపట్టా రు. దీని కోసం కచ్చితమైన ప్రణాళిక అమలు కు కసరత్తు చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. రేపు భక్తి మందారాలు పుస్తకావిష్కరణహన్మకొండ కల్చరల్ : కాకతీయ పద్యవేదిక ఆధ్వర్యంలో ‘కవిచంద్ర’ నర్సింగోజు లక్ష్మయ్య రాసిన భక్తి మందారాలు పుస్తకావిష్కరణ కార్యక్రమం ఈనెల 3న ఉదయం 9గంటలకు హనుమకొండలోని ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరుగుతుందని కవితావేదిక కార్యదర్శి చేకూరి శ్రీరామ్, కన్వీనర్ అక్కెర కరుణాసాగర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పద్యకవి కమ్మేళనం ఉంటుందని, జిల్లా కవులు, కళాకారులు పాల్గొనాలని కోరారు. రోగులకు అందుబాటులో ఉండాలిఎంజీఎం/హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా సమయపాలన పాటించాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆయన నగరంలోని పెద్దమ్మగడ్డ పీహెచ్సీని సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో డ్రైడే కార్యక్రమం తీరును పరిశీలించారు. ఏఎన్ఎం నమోదు, ఎన్సీడీ రీ స్క్రీనింగ్, ఫీవర్ సర్వే జరుగుతున్న తీరు, ల్యాబ్ ఫార్మసీని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ..తల్లిపాల వారోత్సవాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలని, అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సమిష్టి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సంజయ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ రుక్ముద్దేన్, ఆర్.వినోద్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పశువైద్యాధికారిగా డాక్టర్ రాధాకిషన్హన్మకొండ: హనుమకొండ జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారిగా డాక్టర్ వై.రాధాకిషన్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. జనగామ జిల్లా పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా పశు వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ వై.రాధాకిషన్కు డిప్యూటీ డైరెక్టర్గా పదోన్నతి కల్పిస్తూ హనుమకొండ జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారిగా నియమించారు. ఈయన కంటే ముందు హనుమకొండ జిల్లా పశు వైద్యాధికారిగా పరకాల సహాయ సంచాలకుడు డాక్టర్ విజయభాస్కర్ పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు. -
కోడిగుడ్ ..విధానం!
సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకే ఆన్లైన్ ప్రక్రియ●● విద్యాలయాల్లో 7.33 కోట్ల కోడిగుడ్లకు.. సుమారు రూ.40.60 కోట్లు ● ఉమ్మడి వరంగల్లో ఐదు జిల్లాలకే టెండర్లు.. భూపాలపల్లిలోనూ త్వరలో ప్రక్రియ ● ఈ నెల 6 నుంచి 12 వరకు షెడ్యూల్ దాఖలు.. 12 నుంచి 18 వరకు టెండర్లు ఓపెన్ ● అర్హులైన వారికి కాంట్రాక్టు అప్పగింత.. ఏటా ఒక్కరికే ఇవ్వడంపై ఆరోపణలుఉమ్మడి వరంగల్ జిల్లాలో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు జిల్లా సరఫరా చేయాల్సిన కేటాయించిన కోడిగుడ్లు డబ్బులు (రూ.లలో) హనుమకొండ 1,31,14,397 6,71,45,713 వరంగల్ 1,40,76,730 7,89,70,455 మహబూబాబాద్ 1,77,87,502 10,01,43,636 జనగామ 1,26,05,592 7,09,69,483 ములుగు 78,11,600 4,39,79,308 జేఎస్ భూపాలపల్లి 79,54,004 4,47,81,042 మొత్తం 7,33,49,825 40,59,89,637సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రభుత్వ విద్యాలయాల్లో కోడిగుడ్ల పంపిణీకి 2025–26 సంవత్సరానికిగాను టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అర్హులైన కాంట్రాక్టర్ల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు అగ్మార్క్ నియమాల ప్రకారం కోడిగుడ్ల సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఆరు జిల్లాల్లో 2025–26 సంవత్సరానికి గాను 7,33,49,825 కోడిగుడ్లు సరఫరా కోసం రూ.40,59,89,637లు ప్రతిపాదించారు. జిల్లాల వారీగా కలెక్టర్ల పర్యవేక్షణలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు ఈ టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. జేఎస్ భూపాలపల్లి మినహా మిగతా ఐదు జిల్లాల్లో ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా గతనెల 23 నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వా నించారు. ఈ మేరకు ఐదు జిల్లాల్లో ఈ నెల 6 నుంచి 12 వరకు టెండర్ షెడ్యూల్లు దాఖలు చేయడానికి చివరి తేదీలుగా ప్రకటించారు. అంతకు ముందు ఆయా జిల్లా కేంద్రాల్లో కాంట్రాక్టర్లతో కలెక్టర్లు ఫ్రీ బిడ్ సమావేశాలు కూడా నిర్వహించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే.. వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు కోడిగుడ్లు సరఫరా చేసేందుకు గతంలో జిల్లా పర్చేజింగ్ కమిటీ సిఫారసు చేసేది. కలెక్టర్ చైర్మన్గా ఉండే ఈ కమిటీ అగ్మార్క్ నియమాల ప్రకారం అవసరమైన కోడిగుడ్లను సరఫరా చేసేందుకు అర్హులైన కాంట్రాక్టర్లను ఎంపిక చేసేది. ఆ తర్వాత కాంట్రాక్టు పొందిన వారు కోడిగుడ్ల పరిమాణం తగ్గించి సరఫరా చేయడం, టెండర్లో పేర్కొన్న విధంగా కాకుండా గుడ్లను పంపిణీ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ–ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించింది. అర్హులైన కాంట్రాక్టర్లు బిడ్ డాక్యుమెంట్లను టౌన్లోడ్ చేసుకుని ఆన్లైన్లో బిడ్లను సమర్పించాలని నోటిఫికేషన్లో సూచించారు. సమర్పించిన బిడ్ల హార్డ్ కాపీలను ఈ నెల 6 నుంచి 12 వరకు (జిల్లాల వారీగా) జిల్లా కలెక్టరేట్/షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయాలలో అందజేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ నెల 12 నుంచి 18 వరకు ఆయా జిల్లాల్లో కేటాయించిన విధంగా టెక్నికల్ బిడ్లు, ధరల బిడ్లను తెరిచి అర్హులైన వారిని ఎంపిక చేయనున్నారు. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రేటు... హనుమకొండ, వరంగల్లో తక్కువ.. ఉమ్మడి వరంగల్లోని ఒక్కో జిల్లాలో ఒక్కో రేటును ప్రతిపాదించారు. 45–52 గ్రాముల బరువు గల కోడిగుడ్లను సరఫరా చేసేందుకు ఈ ధరలను అధి కారులు నిర్ణయించారు. హనుమకొండ జిల్లాలో 1,31,14,397 కొడిగుడ్లకు మొత్తం ధర రూ.6,71,45,713లుగా నిర్ణయించగా సగటును ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.12లుగా ఉంది. వరంగల్ జిల్లాలో 1,40,76,730 కోడిగుడ్లకు రూ.7,89,70,455లు అవుతుండగా ఒక్కో గుడ్డు ధర సగటున రూ.5.38లు పడుతోంది. అదే విధంగా మహబూబాబాద్, ములుగు, జనగామ జిల్లాల్లో సరఫరా చేయాల్సిన కోడిగుడ్లు, కేటాయించిన డబ్బులు చూస్తే ఒక్కో గుడ్డుకు రూ.5.63లు అవుతోంది. కాగా కాంట్రాక్టర్లు ఈ టెండర్లపై ఎలా స్పందిస్తారు? ఎక్కువ రేటును కోట్ చేస్తారా? ప్రభుత్వం సూచించిన ధరలకే మొగ్గు చూపుతారా? అన్న చర్చ ఓ వైపు జరుగుతుండగా.. ఈ ఆన్లైన్ టెండర్లలోనూ కొందరు కాంట్రాక్టర్లు సిండికేట్ కడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
చకచకా పనులు
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025– 8లోuసాక్షి, వరంగల్: జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. సకాలంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో లేదోననే సందిగ్ధంలో ఉన్న లబ్ధిదారులు.. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చాలామంది ముగ్గులు పోసి ఇంటి నిర్మాణాలు కూడా చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ‘వీక్లీ పేమెంట్ సిస్టం’ తీసుకొచ్చింది. దీంతో జిల్లాలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 3,068 ఇళ్లలో 1,336 ఇళ్ల నిర్మాణాన్ని శ్రావణం మొదలయ్యాకే ప్రారంభించారని గృహనిర్మాణ విభాగాధికారులు చెబుతున్నారు. ఎందుకంటే 1,722 మంది లబ్ధిదారులకు బేస్మెంట్, రూఫ్ లెవల్, స్లాబ్ లెవల్ వరకు రూ.లక్ష నుంచి రూ.నాలుగు లక్షలు ఇస్తోంది. వీటిలో చాలా ఇళ్లు రూఫ్లెవల్ వరకు పూర్తయ్యాయి. ఇప్పటికే ముగ్గు పోసి నిర్మాణానికి సిద్ధంగా ఉన్న 2,306 మంది లబ్ధిదారులు కూడా త్వరలోనే పనులు ప్రారంభించేలా అక్కడి పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు కూడా అవగాహన కలిగిస్తున్నారు. వీరిలో చాలామందికి స్వయం సహాయక సంఘాలతో రుణాలు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఇప్పించి, బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక వచ్చిన డబ్బులను ఎస్హెచ్జీల ఖాతాల్లో జమ అయ్యేలా కూడా అధికారులు చొరవచూపుతున్నారు. ఈ మేరకు లబ్ధిదారుల నుంచి డీఆర్డీఏ దరఖాస్తులు తీసుకుంది. ఈ రుణం మంజూరుకాగానే వందలాది ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యే అవకాశముందని గృహనిర్మాణ విభాగాధికారులు పేర్కొంటున్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద వివిధ గ్రామాల్లో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకోవడంతోపాటు పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓలు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తుండడంతో పనులు ఊపందుకున్నాయి. గతంలో పైలట్ ప్రాజెక్టులో ఎదురైన ఇబ్బందులతో ఎక్కడ పొరపాటు జరుగకుండా పకడ్బందీగా యాప్లో అన్ని వివరాలు నమోదుచేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. డబ్బులు లేక ఆగుతున్న లబ్ధిదారులు.. జిల్లావ్యాప్తంగా 8,761 ఇళ్లు మంజూరుకాగా.. 5,374 మంది ముగ్గులు పోశారు. 3,068 మంది ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. 2,036 మంది ముగ్గులు పోసి.. డబ్బులు లేకపోవడంతో నెల రోజుల సమయం ఇవ్వాలని గృహనిర్మాణ విభాగాధికారులను అడుగుతున్నారు. మిగిలిన 3,387 ముగ్గు పోయని వారిలో కొందరు శ్రావణ మాసంలో ముగ్గు పోసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇంకొందరు స్వయం సహాయక సంఘాల నుంచి రుణం రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు.. న్యూస్రీల్ శ్రావణ మాసంలో ఊపందుకున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని అవగాహన కల్పిస్తున్న అధికారులు వీక్లీ పేమెంట్ సిస్టంతో లబ్ధిదారుల్లో పెరిగిన విశ్వాసం ఆషాఢంలో మంచి రోజుల కోసం ఎదురుచూపులుమంజూరైన ఇళ్లు : 8761 ముగ్గులు పోసినవి : 5374 ముగ్గులు పోయనవి : 3,387 నిర్మాణంలో ఉన్నవి : 3,068 ప్రారంభించాల్సినవి : 2,306ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు ఎలగొండ కేత. నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ఈమె ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. అధికారులు పరిశీలించి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేశారు. 32 రోజుల క్రితం పనులు ప్రారంభించింది. 20 రోజుల్లో పునాదిస్థాయి వరకు పనులు పూర్తి చేసింది. అధికారులు కొలతలను యాప్లో నమోదు చేశారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన వారం రోజులకు ప్రభుత్వం మొదటి విడతలో భాగంగా లబ్ధిదారు కేత బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేసింది.లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నాం.. గతంలోలాగా ఇల్లు వద్దంటున్నవారు లేరు. ఇంటి నిర్మాణం కోసం డబ్బులు తెచ్చుకునేందుకు నెలరోజుల సమయం కావాలని అడుగుతున్నారు. కొందరు ముహూర్తాల కోసం ఎదురుచూశారు. ఇప్పుడూ శ్రావణమాసంలో ప్రారంభిస్తామని చెబుతున్నారు. ఇంటి నిర్మాణానికి ఆసక్తి చూపని వారు ఎవరైనా ఉంటే వారికి గడువు ఇచ్చి, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం. పూర్తిస్థాయిలో అందరూ కట్టుకునేలా ప్రోత్సహిస్తూ అందరం పనిచేస్తున్నాం. – గణపతి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ మంచిరోజుల కోసం చూశాంప్రభుత్వం మా కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసింది. ఆషాఢ మాసం కావడంతో ముగ్గుపోసి వదిలేశాం. మంచి రోజుల కోసం ఇన్నాళ్లు వేచిచూశాం. శ్రావణమాసంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాం. – త్రికోవెల రామ్మోహన్, నల్లబెల్లి -
తల్లిపాలతో రోగ నిరోధకశక్తి
ఎంజీఎం: తల్లిపాలతో బిడ్డలో రోగ నిరోధకశక్తి మెరుగవుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ తల్లిపాలతో బిడ్డలు మానసికంగా అభివృద్ధి చెందడతోపాటు ఎదుగుదలకు దోహదపడుతాయని పేర్కొన్నారు. తల్లి బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా బరువు తగ్గుతారని, గర్భాశయం సాధారణ స్థితికి వస్తుందని, క్యాన్సర్లు రాకుండా ఉండడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ప్రతి బిడ్డ తన తల్లిపాలు తాగే విధంగా చూడాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈనెల 7వ తేదీ వరకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తల్లిపాల అవగాహన సదస్సులో సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ డాక్టర్ మురళి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్చన, సిబ్బంది, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు -
యూనిఫామ్లు ఇంకా ఇవ్వలేదా?
వేలేరు: పాఠశాలలు ప్రారంభమై నెలల గడుస్తున్నా యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు ఎందుకు ఇవ్వలేదని సంబంధిత అధికారులపై కలెక్టర్ స్నేహ శబరీష్ మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని పీఎంశ్రీ తెలంగాణ బాలుర గురుకుల పాఠశాల, శాలపల్లిలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను ప్రశ్నించగా..కొంతమంది విద్యార్థులు తమకు ఇంకా పాఠ్యపుస్తకాలు, యూని ఫామ్స్ రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్టోర్ రూమ్ను పరిశీలించగా కొన్ని కూరగాయలు కుళ్లిపోయి ఉండటంతో వంట సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్ను సందర్శించి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు మెనూ పక్రారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం శాలపల్లిలోని అంగన్వాడీల్లో మెనూ పాటించడం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి బిల్లులు సకాలంలో వస్తున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీవో లక్ష్మీప్రసన్న, ఎంపీవో భాస్కర్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అజయ్కుమార్ను ఇతర శాఖల అధికారులు ఉన్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు.. హన్మకొండ అర్బన్: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను వేగంగా మంజూరు చేయాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో డీఆర్వో వైవీ గణేశ్, డీఆర్డీవో మేన శ్రీను, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్ సింగ్, డీపీవో లక్ష్మీరమాకాంత్, రవాణా శాఖ ఎంవీఐ వేణుగోపాల్, విద్యుత్ ఎస్ఈ మధుసూదన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ సునీత, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మహేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, డీటీడీవో ప్రేమలత, టీజీఐసీసీ మేనేజర్ మహేశ్, జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ కమిషనర్ రవీందర్, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యంపై అవగాహన కల్పించాలి.. తల్లిపాల ప్రాముఖ్యంపై ప్రజలకు, పాలసీ నిర్ణేతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులకు సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జయంతి, డీఎంహెచ్వో అప్పయ్య, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి మహేందర్, సీడీపీవోలు విశ్వజ, స్వాతి, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ సుమలత, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుళ్లిన కూరగాయలతో కూరలు వండుతారా.. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి అధికారులు, సిబ్బందిపై కలెక్టర్ స్నేహ శబరీష్ ఆగ్రహం వేలేరు మండలంలో గురుకుల పాఠశాల, అంగన్వాడీల్లో తనిఖీలు -
రికార్డ్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్
శాయంపేట: రికార్డ్ చేసిన తర్వాతే సాదాభైనామా దరఖాస్తుల భూములను రిజిస్ట్రేషన్ చేసి పట్టా పాస్పుస్తకాన్ని అందించాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తులను, ఫ్యామిలీ మెంబర్ దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మా జ్యోతిబాఫూలే బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనంలో కోడిగుడ్డు ఎందుకు లేదని, గుడ్లు సప్లై చేసిన వారికి నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2014 సంవత్సరంలో భూములను కొని 2020 సంవత్సరంలో సాదాభైనామాలో దరఖాస్తు చేస్తుకున్న రైతులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చలాన కట్టించి రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఆర్డీవో నారాయణ, తహసీల్దార్ సత్యనారాయణ, మండల వైద్యాధికారి సాయికృష్ణ, ఎంజేపీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రేవతి, పంచాయతీ కార్యదర్శి రత్నాకర్ ఉన్నారు. అప్పుడే సాదాభైనామా దరఖాస్తులకు పాస్పుస్తకాలు అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి తహసీల్దార్ కార్యాలయం, ఎంజేపీ గురుకుల పాఠశాలలో తనిఖీలు