breaking news
Warangal
-
భారీ వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
న్యూశాయంపేట : భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై హైదరాబాద్లోని సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితులపై సమీక్షించారు. ఆగస్టులో కురిసిన భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం అందించేందుకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అలాగే నేడు (మంగళవారం) నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కళలపై ఆసక్తి పెంచుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు తమకు ఇష్టమైన కళలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. వరంగల్ జిల్లాస్థాయి కళా ఉత్సవాన్ని వరంగల్లోని జేఎస్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానసిక వికాసమే విద్యావికాసానికి పునాది అని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాలల విద్యార్థులను రాష్ట్రస్థాయి కళాఉత్సవానికి ఎంపిక చేస్తామని తెలిపారు. కళా ఉత్సవంలో భాగంగా ఓకల్ సో, ఓకల్ మ్యూజిక్, ఇన్స్ట్రూమెంటల్ మ్యూజిక్ సో, నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలైన వారికి డీఈఓ రంగయ్యనాయుడు ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, మండల విద్యాశాఖాధికారి బత్తుల ప్రసాద్, జేఎస్ఎం పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్, ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలి
కొండపల్లి–కొత్తపల్లి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని కొండపర్తి గ్రామస్తులు కలెక్టర్ను కోరారు. రెండేళ్లుగా ఆర్అండ్బీ రోడ్డును పూర్తి చేయకుండా వదిలేయడంతో రోడ్డు అధ్వానంగా మారిందని, ప్రమాదాలబారిన పడుతున్నామని కలెక్టర్ ఎదుట ఏకరువుపెట్టారు. ప్రస్తుతం వర్షాకాలంలో రోడ్డు గుంతలమయంగా తయారైందని రోడ్డుపై ప్రయాణించే పరిస్థితులు లేవని పనులు వదిలేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవడంతో పాటు, పనులు వెంటనే చేపట్టాలని కొండపర్తి వాసులు కోరారు. స్పందించిన కలెక్టర్ ఆర్అండ్బీ జిల్లా అధికారిని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
నిమజ్జనానికి ‘దారి’ చూపండి
కీర్తినగర్ నుంచి రెడ్డిపాలెం వెళ్లే దారిగ్రేటర్ వరంగల్ పరిధిలో నెలకొల్పిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు చెరువుల వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ, ఆ చెరువులకు వెళ్లేదారులు ఇటీవల కురిసిన వర్షాలకు ఛిద్రమయ్యాయి. చిన్నవడ్డేపల్లి చెరువు, బంధం చెరువు, ఉర్సు రంగసముద్రం, ఖిలా వరంగల్ అగర్తల, హసన్పర్తి, సిద్దేశ్వర గుండం తదితర ప్రాంతాలకు వెళ్లే రోడ్లు గుంతలు గి మారాయి. ఈ రోడ్లగుండా వినాయక నిమజ్జన శోభాయాత్ర వాహనాలు దిగబడే ప్రమాదం ఉంది. బల్దియా అధికారులు స్పందించి ఆయా రోడ్లకు వెంటనే మరమ్మతు చేయాలని భక్తులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్లు, హన్మకొండ/వరంగల్ -
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
● ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులుహన్మకొండ అర్బన్ : ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ ఆకుల రాజేందర్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సోమవారం జేఏసీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జంక్షన్నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలపగా, రాజేందర్ మాట్లాడారు. వృద్ధాప్యంలో లక్షలాది ఉద్యోగుల భద్రతను, కు టుంబాల సంక్షేమాన్ని బలి తీసుకున్న స్కీమ్ సీపీఎస్ అని మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామిక వేత్తలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా సీపీఎస్ ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల జేఏసీ నేతలు అన్నమనేని జగన్మోహన్రావు, బైరి సోమయ్య, రాజు, గణిపాక రాజ్కుమార్, కిరణ్ గౌడ్, ప్రవీన్ కుమార్, వేణుగోపాల్, పుల్లూరు వేణుగోపాల్, సదానందం, రాజేష్, రాజేష్ కుమార్, హేమ నాయక్, నరేందర్ నాయక్, మోహన్ రెడ్డి, భిక్షపతి, సర్వన్, గోపాల్రెడ్డి, కత్తి రమేష్, శ్యామ్ సుందర్, సాంబయ్య, రాజు, రాజేష్ ఖన్నా తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సంబురాలు
రామన్నపేట : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆధ్వర్యంలో సోమవారం పోచమ్మ మైదాన్లో ఆ పార్టీ నాయకులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. కార్పొరేటర్లు గుండేటి నరేందర్, శిరీష శ్రీమాన్, మాజీ కార్పొరేటర్లు తత్తరి లక్ష్మణ్, దామెర సర్వేషం, బిల్ల శ్రీకాంత్, జన్ను రవి, దుపం సంపత్, జన్ను అరుణ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పరమేష్, యూత్ కాంగ్రెస్ తూర్పు అధ్యక్షుడు ఎండీ సలీం, నాయకులు వరుణ్, రాజు, ప్రభాకర్, సదానందం, లింగమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
వినతులు త్వరగా పరిష్కరించాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● ప్రజావాణిలో 179 దరఖాస్తుల స్వీకరణహన్మకొండ : ప్రజావాణిలో పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్కు 179 వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేష్, పలు శాఖల ఉన్నతాధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆస్పత్రి స్థలాన్ని కబ్జా చేశారుఎల్కతుర్తి మండలం కేశవాపూర్ పీహెచ్సీ స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని సోమవారం కలెక్టర్లో వినతిపత్రం అందజేశా. ఆరు గుంటల ప్రభుత్వ భూమిని అక్రమించుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. గతంలో ఫిర్యాదు చేయగా తహసీల్దార్ను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. దీనిపై విచారించి చర్యలు తీసుకోవాలని కోరా. – ఖాజా మోహినుద్దీన్, కేశవాపూర్ -
ఇన్స్పైర్ నామినేషన్లను పూర్తిచేయాలి
విద్యారణ్యపురి : జిల్లాలోని ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు తమతమ విద్యార్థుల ఇన్స్పైర్ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. సోమవారం తన కార్యాలయంలో జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామితో పాటు మండల కోఆర్డినేటర్లతో ఆమె సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈనెల 15వ తేదీవరకు తుదిగడువు ఉందని, 6వ తరగతినుంచి 10వ తరగతి విద్యార్థులతోపాటు 11, 12 తరగతుల విద్యార్థుల నామినేషన్లను కూడా పంపాలని సూచించారు.గూడ్స్ షెడ్కు యూరియా రాకఖిలా వరంగల్: వరంగల్ గూడ్స్ షెడ్కు సోమవారం ఉదయం ఎన్ఎఫ్ఎల్ 26,23,590 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. కలెక్టర్ సత్యశారద ఆదేశాలు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచనల మేరకు వ్యవసాయ అధికారులు నర్సింగం (ఏడీఏ), ఏఓలు రవీందర్రెడ్డి, రంజిత్రెడ్డి, విజ్ఞాన్.. కంపెనీ ప్రతినిధులతో కలిసి రికార్డుల ప్రకారం యూరియాను పరిశీలించారు. రైలు వ్యాగన్ ద్వారా చేరిన యూరియాను 60శాతం మార్క్ఫెడ్కు, 40శాతం ఫర్టిలైజర్ డీలర్లకు కేటాయించారు. లారీల ద్వారా జిల్లాలోని పీఏసీఎస్, ఫర్టిలైజర్ డీలర్ల షాపులకు యుద్ధప్రాతిపదికన తరలింపులో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో యూరియా కొరత ఎక్కువగా ఉండడంతో తొలుత డిమాండ్ ఉన్న ప్రాంతాలకు పంపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఖిలా వరంగల్ మండల వ్యవసాయ అధికారి రవీందర్రెడ్డి తెలిపారు.హన్మకొండ కల్చరల్ : రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల ఆలయంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు సోమవారం ఆరోరోజు చేరుకున్నాయి. ఇందులో భాగంగా మూలమహాగణపతిని శ్రీహేరంబ గణపతిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, పూజలు మూలగణపతిని గంధవిలేపనాలు అద్ది చతుర్ముఖాలతో శ్రీహేరంబ గణపతిగా అలంకరించి పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. విహారయాత్రలో భాగంగా విశాఖపట్నానికి చెందిన పాఠశాల విద్యార్థులు దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో టీటీడీ ఆధ్వర్యంలో భక్తిగీతాలు, భజనలు అలరించాయి.108 రకాల పిండివంటలతో నైవేద్యంకాజీపేట : కాజీపేట 63వ డివిజన్ జూబ్లీమార్కెట్ ఆవరణలోని దక్షిణ ముఖ ఆభయాంజనేయ స్వామి ఆలయంలో కొలువుదీరిన వినాయకుడికి సోమవారం భక్తులు 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం సమర్పించారు. అర్చకుడు శ్రీనివాస్ శర్మ పర్యవేక్షణలో భక్తులు గణనాథుడికి పూజలు చేశారు.వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం లాంజ్ని ఏర్పాటు చేయగా సీపీ సన్ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు. సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ లాంజ్ ఏర్పాటు చేసినట్లు సిట్టింగ్, తాగునీరు, పత్రికలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రజలు పో లీస్ కార్యాలయానికి వచ్చే సందర్భంలో వేచి ఉండే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ లాంజ్ ఉపయోగపడుతుందన్నారు. అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, డేవిడ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్ర
హన్మకొండ చౌరస్తా : బీడు భూములకు సాగునీరిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని మాజీ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి భారీ ధర్నా చేపట్టారు. అంతకుముందు బాలసముద్రంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి కాళోజీ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్, పబ్లిక్గార్డెన్, అశోకా జంక్షన్ మీదుగా హనుమకొండ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి వినయ్భాస్కర్ మాట్లాడారు. చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో 3 పిల్లర్లు కుంగాయని రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. కమీషన్ల పేరుతో కేసీఆర్పై కాంగ్రెస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. హనుమకొండ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు ముందుకు రాగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశా రు. ఈక్రమంలో పోలీసులకు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తతల నడు మ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీ కాంత్, కార్పొరేటర్లు నర్సింగరావు, కిరణ్, మధు, నాయకులు రమేష్, పున్నంచందర్, వెంకన్న, రమేశ్, శ్రీనివాస్, సునీల్, విక్టరీబాబు పాల్గొన్నారు. మాజీ చీఫ్విప్ వినయ్భాస్కర్ సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దహనం, అడ్డుకున్న పోలీసులు -
విద్యార్థులు కళలపై ఆసక్తి పెంచుకోవాలి
● డీఈఓ రంగయ్యనాయుడు ● ఉత్సాహంగా కళా ఉత్సవ్విద్యారణ్యపురి: విద్యార్థులు చదువుతోపాటు తమకు ఇష్టమైన కళలపట్ల కూడా ఆసక్తి పెంచుకోవాలని వరంగల్ డీఈఓ రంగయ్యనాయుడు సూచించారు. వరంగల్ జిల్లాస్థాయి కళా ఉత్సవాన్ని వరంగల్లోని జేఎస్ఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానసిక వికాసమే విద్యావికాసానికి పునాది అని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వివిధ పాఠశాలల విద్యార్థులను రాష్ట్రస్థాయి కళాఉత్సవానికి ఎంపిక చేస్తామని తెలిపారు. కళా ఉత్సవంలో భాగంగా ఓకల్ సో, ఓకల్ మ్యూజిక్, ఇన్స్ట్రూమెంటల్ మ్యూజిక్ సో, నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన వారికి డీఈఓ రంగయ్యనాయుడు ప్రశంస పత్రాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్ చలమల నాగేశ్వర్రావు, జిల్లా సైన్స్ అధికారి కట్ల శ్రీనివాస్, డీసీఈబీ కార్యదర్శి కృష్ణమూర్తి, మండల విద్యాశాఖాధికారి బత్తుల ప్రసాద్, జేఎస్ఎం పాఠశాల ప్రిన్సిపాల్ శివకుమార్, ఉపాధ్యాయలు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తాం..
నెక్కొండ: రైతులకు అన్యాయం చేస్తూ ఇబ్బంది పెడితే ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నాయకులు బల్ల వెంకన్న, మాదాసు రవి, జి.కుమార్ అన్నారు. రెడ్లవాడ తోపనపల్లి పీఏసీఎస్ సబ్ సెంటర్ వద్ద సోమవారం ఉదయం 6 గంటల నుంచే యూరియా కోసం అలంకానిపేట, బొల్లికొండ, వెంకటాపురం, తోపనపల్లి రైతులు బారులుదీరారు. 8 గంటలకు లారీలో 444 బస్తాల యూరియా వచ్చింది. అప్పటికే 750 మంది రైతులు క్యూలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని 222 మంది రైతులకు రెండేసి బస్తాల చొప్పున పంపిణీ చేయించగా.. మిగతా రైతులు నిరాశతో వెనుదిరిగారు. దీంతో మిగిలిన వారు నాయకులతో కలిసి గ్రామ ప్రధాన రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూరియా కోసం గంటల తరబడి రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాసేలా ప్రభుత్వం చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సూరం రాజిరెడ్డి, కర్పూరపు శ్రీనివాస్, రవీందర్రావు, నవీన్, వినోద్, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల ఆందోళన
● అరెస్ట్ చేసిన పోలీసులువర్ధన్నపేట: యూరియా కోసం రైతులు ఆందోళన చేస్తుండగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరలించిన ఘటన పట్టణ కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా యూరి యా దొరకపోవడంతో విసుగెత్తిన రైతులు.. పట్టణ కేంద్రంలోని వరంగల్ – ఖమ్మం రహదారిపై అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నాకు దిగారు. దాంతో వారిని పోలీసులు అడ్డుకొని పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. తమ సమస్యను ప్రభుత్వం పరిష్కరించకపోగా, పోలీసులతో అరెస్ట్ చేయించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం సొంత పూచీ కత్తుపై రైతులను పోలీసులు విడుదల చేశారు. -
మారని అధికారుల తీరు
న్యూశాయంపేట: ప్రతీ సోమవారం వరంగల్ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వస్తున్న అర్జీలకు పరిష్కారం లభించడం లేదు. గ్రీవెన్స్కు వచ్చిన బాధితుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించినా పరిష్కారం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి ఎంతో ఆశతో జిల్లా కేంద్రానికి ఒకటికి నాలుగు సార్లు వచ్చినా తమగోడు అధికారులు వింటున్నారే తప్ప సమస్యలను పరిష్కరించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినతులు స్వీకరించిన కలెక్టర్ ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి వినతులను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అధికారులు సోమవారం స్వీకరించారు. గ్రీవెన్స్కు 120 దరఖాస్తులు రాగా, అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన 58, జీడబ్ల్యూఎంసీకి 29, మిగితా శాఖలకు చెందినవి 33 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, వ్యవసాయశాఖ జేడీ అనురాధ, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఆర్సీఓ అపర్ణ, డీడబ్ల్యూఓ రాజమణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.ప్రజావాణికి వచ్చిన అర్జీలను పెడచెవిన పెడుతున్న వైనం కలెక్టర్ చెప్పినా, బాధితులు కాళ్లరిగేలా తిరిగినా కానరాని పరిష్కారం గ్రీవెన్స్లో వినతులు స్వీకరించిన కలెక్టర్ సత్యశారద -
భారీ వర్షాలపై సీఎం వీడియో కాన్ఫరెన్స్
న్యూశాయంపేట: భారీ వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యలపై హైదరాబాద్లోని సచి వాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిస్థితులపై సమీక్షించారు. ఆగస్టులో కురిసిన వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారం అందించేందుకు నివేదికలు సమర్పించాలన్నారు. మంగళవారం నుంచి 6వ తేదీ వరకు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అలాగే, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరును పర్యవేక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీసీపీ అంకిత్కుమార్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
యూజీడీపై కమిషనర్ సమీక్ష
వరంగల్ అర్బన్: వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టంపై హనుమకొండలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఎస్టీపీలు, స్ట్రాం వాటర్ డ్రెయినేజీలు తదితర అంశాలపై చర్చించారు. బల్దియా ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఈఈలు రవికుమార్, సంతోష్బాబు, ఇరిగేషన్ ఈఈ కిరణ్, డీఈలు హర్షవర్ధన్, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాకతీయ మ్యూజికల్ గార్డెన్ పనులపై.. నయీంనగర్: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కుడా వైస్ చైర్పర్సన్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్పాయ్.. అధికారులను ఆదేశించారు. నగరంలోని కాకతీయ మ్యూజికల్ గార్డెన్లో (కేఎంజీ) కుడా ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల పురోగతిని సోమవారం క్షేత్రస్థాయిలో సందర్శించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఫౌంటేన్, గ్రీనరీ, లైటింగ్, పాత్వే పనులు పురోభివృద్ధిలో ఉన్నాయన్నారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కుడా పీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్రావు, తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి
● తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలున్యూశాయంపేట: బేషరతుగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్కిషన్, కన్వీనర్ ఫణికుమార్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హనుమకొండ అంబేడ్కర్ జంక్షన్ నుంచి వరంగల్ కలెక్టరేట్ కార్యాలయం వరకు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో అన్ని శాఖల ఉద్యోగ, ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లో వరంగల్ కలెక్టర్ సత్యశారదకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తమ మొండి వైఖరిని విడనాడాలన్నారు. కార్యక్రమంలో ఆకుల రాజేందర్, రాంరెడ్డి, అన్నమనేని జగన్మోహన్ రావు, గాజె వేణుగోపాల్, రాజ్కుమార్, టి.కుమార్, సృజన్ప్రసాద్, గంగాధర్, అశోక్, కిషన్, సదానందం, తదితరులు పాల్గొన్నారు. -
బామ్మ బావిలో పడిందని.. నీళ్లన్నీ తోడేశారు.. తీరా చూస్తే!
దుగ్గొండి: ఓ వృద్ధురాలు బావిలో పడిందని భావించి.. అధికారులు భారీ మోటార్ల సాయంతో నీటిని తోడేశారు. చివరికి వృద్ధురాలు పత్తి చేనులో కనిపించింది. ఈ సంఘటన ఆదివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రంలో జరిగింది. దుగ్గొండికి చెందిన మాడిశెట్టి రాజ్యలక్ష్మి అనే 75 ఏళ్ల వృద్ధురాలు ఆదివారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఉదయం ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతటా వెదికారు. ఓ వ్యవసాయ బావి (agricultural well) వద్ద వృద్ధురాలి చీర, బావిలోకి జారిన గుర్తులు కనిపించాయి. దీంతో ఆమె బావిలోనే పడిందని భావించిన కుటుంబ సభ్యులు అధికారుల సాయంతో ఐదు విద్యుత్ మోటార్లు, ఫైరింజన్తో నీటినంతా తోడేశారు. సాయంత్రం వరకు వృద్ధురాలికోసం గాలిస్తూనే ఉన్నారు.ఈ క్రమంలో గాలింపు చర్యలను చూడడానికి అక్కడికి వెళ్లిన కొందరు యువకులు.. మూత్ర విసర్జన కోసం సమీపంలోని పత్తి చేను లోపలికి వెళ్లారు. అక్కడ పత్తి మొక్కల మధ్య రాజ్యలక్ష్మి నిద్రపోతూ కనిపించింది. ఇది గమనించిన యువకులు వృద్ధురాలిని నిద్రలేపి చేనులో నుంచి బయటికి తీసుకొచ్చారు. రాజ్యలక్ష్మికి మతిమరుపు సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, అగ్నిమాపక, గ్రామ పంచాయతీ సిబ్బంది దాదాపు 100 మంది వరకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రమించారు. చదవండి: నేరుగా రైతులతో మాట్లాడిన గణపయ్య! -
యూరియా కోసం రైతుల ఆరాటం
నల్లబెల్లి: యూరియా బస్తాల కోసం మండలంలోని నల్లబెల్లి పీఏసీఎస్ సొసైటీ, రాంపూర్ రైతుల వేదికల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే నల్లబెల్లి పీఏసీఎస్, మేడపల్లి రైతు వేదికల్లో యూరియా బస్తాల కోసం రైతులు క్యూలో నిల్చున్నారు. నిర్వాహకులు ప్రతి రైతుకు ఒకటే బస్తా ఇవ్వడంతో రైతులు ఆందోళన చెందారు. క్యూలో నిల్చున్న రైతులకు బస్తాలు అందకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. నల్లబెల్లి, మేడపల్లి పీఏసీఎస్ కేంద్రాల్లో 20 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపిణీ చేశారు. యారియా అయిపోగానే రైతులు ఒక్కసారిగా సొసైటీలోకి దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మేడపల్లికి చేరుకొని రైతులతో మాట్లాడారు. రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రైతులకు పూర్తి స్థాయిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెవెళ్లడంతో మేడపల్లి, నల్లబెల్లిలో రైతులకు సిబ్బంది టోకన్లు పంపిణీ చేశారు. నల్లబెల్లిలో టోకెన్లు పంపిణీ చేస్తున్న ఎస్సై పైకి రైతులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఒకటి రెండు రోజుల్లో వచ్చే యూరియా పంపిణీలో ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా కల్పిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. -
స్వచ్ఛ ఏవమ్ హరిత్
విద్యారణ్యపురి: దేశంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్స్ (ఎస్హెచ్వీఆర్) ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ్ 2025–26 రేటింగ్స్ యాప్ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని సెప్టెంబర్ 30లోగా వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్స్ కోసం వివరాలు పంపించాల ని జిల్లాల విద్యాశాఖ అధికారులు సూచించారు. అలాగే, ఆయా అంశాలకు అనుగుణంగా పాఠశాలలను స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని 14 మంది ఎంఈఓలు, స్ట్రాంగ్ టీచర్లకు స్వచ్ఛ ఏవమ్ శిక్షణపై ఇచ్చారు. ఎస్హెచ్వీఆర్ లక్ష్యాలు.. పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, బాలల స్నేహపూరిత వాతావరణం పెంపొదించడం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, వినియోగం, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండడం, విద్యార్థులు సమీకృతంగా పాఠశాల, పచ్చదనం, పరిశుభ్రత గురించి సమాజంలో మార్పునకు విద్యార్థులే రాయబారులుగా ఉండడం. జిల్లా స్థాయిలో ఎంపిక.. జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పొందుపర్చిన సమాచారం మేరకు స్టార్ రేటింగ్ ప్రకారం కలెక్టర్, డీఈఓ, వైద్యాధికారి, ఇంజనీరింగ్ అధికారి, స్వచ్ఛంద సంస్థ, ముగ్గురు ఉపాధ్యాయులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఆరు గ్రామీణ పాఠశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో.. రాష్ట్ర విద్యాశాఖ, వైద్యశాఖ, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సంచాలకులతో స్వచ్ఛంద సంస్థ, ఇద్దరు ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. 4 స్టార్ రేటింగ్, అంతకన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న 14 గ్రామీణ ఉన్నత పాఠశాలలు, 6 పట్టణ పాఠశాలలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలల ఎంపిక.. జాతీయస్థాయిలో 5 స్టార్ రేటింగ్ కలిగిన 140 గ్రామీణ, 60 పట్టణ ప్రాంతాల పాఠశాలలను ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ హరిత్ విద్యాలయ రేటింగ్స్లో ఎంపికై న ప్రతీ పాఠశాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తారు. 2014 నుంచి.. దేశంలో 2014లో స్వచ్ఛ భారత్–స్వచ్ఛ విద్యాలయగా (ఎస్బీఎస్వీ), 2016–2017లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్గా (ఎస్వీవీ) రికగ్నైజ్డ్ స్కూల్స్కు, 2017–2018లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా అవకాశం కల్పించారు. 2020–2021లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్–3లో దేశంలో 8.23 లక్షల పాఠశాలలు భాగసాములయ్యాయి. 2025–2026లో నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఎవమ్ హరిత్ విద్యాలయ (ఎస్హెచ్వీఆర్) మిషన్ లైఫ్ న్యూ కేటగిరీ క్లీన్ అండ్ గ్రీన్ ఇన్ స్కూల్స్ డెవలప్మెంట్ పొందుపర్చారు. రెండు జిల్లాల్లో పాఠశాలల సంఖ్య.. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 880 పాఠశాలలు, వరంగల్ జిల్లాలోఅన్ని యాజమాన్యాలు కలిపి 1,028 పాఠశాలలు ఉన్నాయి. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయాలుగా తమ వివరాలను పొందుపర్చి ఎన్ని పాఠశాలలు పోటీపడతాయో వేచి చూడాలి. పాఠశాలల్లో పలు అంశాలకు రేటింగ్ పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల వివరాలు ఎస్హెచ్వీఆర్ యాప్లో నమోదు సెప్టెంబర్ 30 గడువు జాతీయ స్థాయిలో ఎంపికై తే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహకంపాయింట్స్ స్టార్ 90–100 5 75–89 4 51–74 3 35–50 2మంచి నీటి వినియోగం 22 పాయింట్స్, మరుగుదొడ్ల నిర్వహణ 27, సబ్బులతో చేతులు కడుక్కోవడం 14, ప్రవర్తన, మార్పు 20, పచ్చదనం పరిశుభ్రత 21, పాఠశాలల్లో పర్యావరణ క్లబ్ల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల వినియోగం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారణ, సోలార్ ప్యానల్ ఏర్పాటు వంటి అంశాలకు 21 పా యింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్స్ ఉంటాయి. పలు విభాగాల్లో అందులోని అంశాలపై వివరాలను పొందుపరిస్తే వచ్చిన పాయింట్స్ ఆధారంగా పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇస్తారు. -
రైతులను పట్టించుకోని ఎమ్మెల్యే
● మాజీ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఖానాపురం: నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే మాధవరెడ్డి కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూరియాపై రైతులకు భరోసా కూడా కల్పించకపోవడం బాధాకరం అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న నర్సంపేట నియోజకవర్గంలో యూరియాపై కనీసం సమీక్ష కూడా నిర్వహించని ఏకై క ఎమ్మెల్యేగా మాధవరెడ్డి నిలుస్తారని ఎద్దేవా చేశారు. స్కూల్కు వెళ్లే పిల్లలు కూడా యూరియా కోసం క్యూలో నిలుచునే పరిస్థితి వస్తుందంటే ఏ స్థాయిలో యూరియా సమస్య ఉందో తెలుస్తుందన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో 11,600 మంది రైతులకు 26.60కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉండగా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. యూరియా అందించలేని అసమర్ధ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్గౌడ్, నాయకులు బందారపు శ్రీనివాస్, వల్లెపు శ్రీను, కోరె సుధాకర్, ఉపేందర్రెడ్డి, మౌలానా, మస్తాన్, పూలునాయక్, సునీత, వెంకన్న పాల్గొన్నారు. -
ఆక్సిజన్ పార్కు పూర్తయ్యేనా?
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్–స్టేషన్పెండ్యాలలో నిర్మించతలపెట్టిన ఆక్సిజన్ పార్కు అటకెక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో రూ.నాలుగు కోట్లతో పార్కు నిర్మాణానికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. 99 ఎకరాల్లో 40 ఎకరాలు ఉన్న ఊర చెరువును అభివృద్ధి చేయడంతోపాటు మిగిలిన స్థలంలో మియావాకీ, బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. పార్కు ఎంట్రెన్స్లో గేట్వే నిర్మాణంతో పాటు చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, బట్టర్ ఫ్లై పార్కు నిర్మాణం చేయనున్నట్లు అప్పుడు అధికారులు తెలిపారు. చెరువులో బోటింగ్, ఫిషింగ్, యాక్టివిటీ, పాత్ వే నిర్మాణం, ఫుడ్కోర్టు, వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆక్సిజన్ పార్కులో మియావాకి ఫారెస్ట్ ప్రత్యేకత.. తక్కువ స్థలంలో ఎక్కువగా మొక్కలను పెంచడమే మియావాకీ ప్రత్యేకత. మియావాకీ రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పెరుగుతున్న జనాభాకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడమే ఈ పార్కు ముఖ్య ఉద్దేశం. అరమీటరుకు ఒకటి చొప్పున నాటిన మొక్కలు పెరిగే కొద్ది దట్టమైన అడవిలా మారుతుందని, దీని మధ్యలో ఉండే పాత్వేలో నడుచుకుంటూ వెళ్తే అడవిలో నుంచి వెళ్తున్న అనుభూతి కలిగే విధంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆక్సిజన్ పార్కులో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పర్యాటకులు, నగర ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పార్కు పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. 2017లో రూ.4 కోట్లతో కుడా శంకుస్థాపన 99 ఎకరాల్లో ఏర్పాటుకు అధికారుల ప్రణాళిక ఇప్పటివరకు 20 శాతం కూడా పూర్తికాని పనులు -
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి
న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం(నేడు) ప్రజావా ణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు ఇవ్వాలని తెలిపారు. గ్రేటర్లో.. వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో 6,683 గణేశ్ విగ్రహాలు వరంల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6,683 గణపతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయని కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2,675, ఈస్ట్జోన్ పరిధిలో 2,043, వెస్ట్జోన్ పరిధిలో 1,965 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గణపతి మండపాలను సందర్శించడంతోపాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది మొత్తం 6,354పైగా విగ్రహాలను జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు, ప్రజలు పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. నేటి నుంచి బియ్యం పంపిణీ ఖిలా వరంగల్: కొత్తకార్డులకు సన్నబియ్యం పంపిణీకి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలల విరా మం తర్వాత రేషన్ షాపులు సోమవారం తెరుచుకోనున్నాయి. జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు సన్నబియ్యం చేరుకున్నా యి. కొత్త కార్డుల పంపిణీకి ముందు ప్రతి నెలా సుమారు 509 షాపుల ద్వారా 2,66,429 మంది లబ్ధిదారులకు 50.14.541 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన లబ్ధిదా రులకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 53,82,518 టన్నుల స్టాక్ కేటాయించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు వర్ధన్నపేట : మండలంలోని ఉప్పరపల్లిలో శిథిలావస్థలో ఉన్న పురాతన అంజనేయ స్వామి ఆలయంలో గుప్తు నిధుల కోసం గుర్తు తెలియ ని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపినట్లు ఆధారాలు కనబడడంతో స్థానికులు తీవ్ర ఆశ్చర్యానికి లోనైయ్యారు. పోలీసులు చర్యలు తీసుకొని తవ్వకాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి శిక్షించాలని గ్రామస్తులను కోరుతున్నారు. టీజీ ఎస్పీ కమాండెంట్ ఉద్యోగ విరమణఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ బి.రాంప్రకాశ్ ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో డి.శివప్రసాద్రెడ్డి కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ విరమణ చేసిన రాంప్రకాశ్, దంపతులను అధికారులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్ రావు, వీరన్న, ఆర్ఐలు విజయ్, కార్తీక్, రాజిరెడ్డి, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. తైక్వాండోలో అమృతవర్షిణికి బంగారు పతకంవరంగల్ స్పోర్ట్స్: కేఎల్బీ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎదులాబాద్లో ఆదివారం నిర్వహించిన రెండో తెలంగాణ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో దుర్గావర్జుల అమృతవర్షిణి ప్రతిభ కనబరిచింది. పూంసే విభాగంలో బంగారు, కొరుగి విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. అమృతవర్షిణి వడ్డేపల్లి పరిమళకాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సంతోష్కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్ట్రిసిటీ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
రుద్రేశ్వరాలయంలో శ్రీమహాలక్ష్మీ యాగం
హన్మకొండ కల్చరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషే కం, పూజలు నిర్వహించారు. మూల(ఉత్తిష్ట) మహాగణపతికి ప్రాచీన కోనేరు నీటితో గంగా జలా భిషేకం, నారికేళాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం సర్పగణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి గణపతి సూక్త మంత్రపఠనంతో షోడశోపచారపూజలు, మహా నైవేద్యం, మహా హారతి జరిగాయి. పంచలోహ ఉత్సవమూర్తిని పద్మవాహనంపై ప్రతిష్ఠించి పల్లకీసేవ నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి రుద్రహో మం, శ్రీమహాలక్ష్మీ హోమం నిర్వహించారు. వొడ్డె ప్రకాశ్ దంపతులు, కంజుల మహేశ్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ యువత దార్మికభావా లతో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు చేశారు. నృత్యగురువు తాడూరి రేణుక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఆలయ ఈఓ ధరణికోట అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
● రాష్ట్ర జూడో అసోసియేషన్ అధ్యక్షుడు కై లాష్ యాదవ్ ఖిలా వరంగల్: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాష్ యాదవ్, జిల్లా యువజన క్రీడా మండలి అధికారి సత్యవాణి అన్నారు. జాతీయ క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన క్రీడా మండలి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలు ఆదివారం సాయంత్రం ఖిలా వరంగల్ కోటలో అట్టహాసంగా ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైనవారు సైకిల్ర్యాలీ ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని తెలిపారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన క్రీడా పాలసీని అతి త్వరలో జిల్లాల వారీగా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. క్రీడా యూనివర్సిటీలను క్రీడా పాఠశాలలను నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఆనంతరం పలు క్రీడాపోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ దామోదర్, నెహ్రూ యువ కేంద్రం అన్వేష్, వేమ, నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. పాకాల మత్తడి వద్ద జలకాలాడుతూ యువత ఉత్సాహంగా గడిపారు. బోటింగ్ చేస్తూ పాకాల సందడిని ఆస్వాదించారు. ‘దూసపాటిలొద్ది’కి అనుమతి లేదు వాజేడు: దూసపాటిలొద్ది జలపాతానికి పర్యాటకులకు అనుమతి లేదని ఎఫ్బీఓ లలిత తెలిపారు. మండల పరిధిలోని కొంగాల గ్రామ సమీపంలోని గుట్టల వద్ద ఉన్న దూసపాటి లొద్ది జలపాత సందర్శనకు ఆదివారం పలువురు పర్యాటకులు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో చెక్పోస్టు వద్ద విధుల్లో ఉన్న ఎఫ్బీఓ లలిత పర్యాటకులకు లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని తిరిగి పంపించారు. -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆది వారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్.2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలో మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. -
హేమాచలక్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు హేమాచ ల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభూ లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆల య ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేశారు. -
శాంతించిన గోదావరి
కన్నాయిగూడెం: మూడు రోజుల నుంచి ఉరకలేసిన గోదావరి ఉధృతి ఆదివారం కొంతమేర తగ్గి శాంతించింది. మండల పరిధిలోని తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి ఆదివారం సాయంత్రం వరకు 8,17,183 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటి వరకు 8,57,190 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా ఆదివారం 40 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం తగ్గి శాంతించింది. ప్రస్తుతం బ్యారేజీ 59 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 82.90 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇన్టెక్వెల్ వద్ద ఫేజ్ 2 లో ఒక మోటారును ఆన్ చేసి 247 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఇంకా నీటిలోనే రహదారులు వాజేడు: మండల పరిధిలోని పేరూరు వద్ద గోదావరి వరద క్రమేపీ తగ్గుతూ వస్తోంది. మూడు రోజుల క్రితం ముంపునకు గురైన రహదారులు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద ఇలానే తగ్గుముఖం పడితే కొన్నిచోట్ల రహదారులు బయటపడే అవకాశం ఉంది. టేకులగూడెం చివరన 163 నంబర్ జాతీయ రహదారి ముంపునకు గురికావడంతో ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు– గుమ్మడిదొడ్డి, ఏడ్జెర్లపల్లి– పూసూరు, పేరూరు–కృష్ణాపురం గ్రామాల మధ్యన రహదారులు ముంపులోనే ఉండడంతో ఆయా గ్రామాలకు ఇంకా రాకపోకలు కొనసాగడం లేదు. కోయవీరాపురం గ్రామానికి వెళ్లే రహదారి చాకలి వాగు వద్ద ప్రవాహంతో మునిగిపోయింది. సమ్మక్క సాగర్ బ్యారేజీ వద్ద 8,17,183 క్యూసెక్కుల నీటి ప్రవాహం 59 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల -
రుద్రేశ్వరాలయంలో శ్రీమహాలక్ష్మీ యాగం
హన్మకొండ కల్చరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఐదో రోజు ఆదివారం శ్రీమహాలక్ష్మీ యాగం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్శర్మ ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. మూల(ఉత్తిష్ట) మహాగణపతికి ప్రాచీన కోనేరు నీటితో గంగా జలాభిషేకం, నారికేళాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించి అనంతరం సర్పగణపతిగా అలంకరించారు. ఉత్సవ గణపతి విగ్రహానికి గణపతి సూక్త మంత్రపఠనంతో షోడశోపచారపూజలు, మహా నైవేద్యం, మహా హారతి జరిగాయి. పంచలోహ ఉత్సవమూర్తిని పద్మవాహనంపై ప్రతిష్ఠించి పల్లకీసేవ నిర్వహించారు. లోకకల్యాణార్థం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో గణపతి రుద్రహోమం, శ్రీమహాలక్ష్మీ హోమం నిర్వహించారు. వొడ్డె ప్రకాశ్ దంపతులు, కంజుల మహేశ్ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ యువత చెడు అలవాట్లను వీడి ధార్మికభావాలతో ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. నృత్యగురువు తాడూరి రేణుక శిష్య బృందం చేసిన కూచిపూడి నృత్యాలు అలరించాయి. ఈఓ అనిల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
‘దూసపాటిలొద్ది’కి అనుమతి లేదు
వాజేడు: దూసపాటిలొద్ది జలపాతానికి పర్యాటకులకు అనుమతి లేదని ఎఫ్బీఓ లలిత తెలిపారు. మండల పరిధి కొంగాల గ్రామ సమీపంలోని గుట్టల వద్ద ఉన్న దూసపాటి లొద్ది జలపాత సందర్శనకు ఆదివారం పలువురు పర్యాటకులు కార్లలో వచ్చారు. ఈ క్రమంలో చెక్పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న ఎఫ్బీఓ లలిత పర్యాటకులను లోనికి వెళ్లేందుకు అనుమతి లేదని తిరిగి పంపించారు. పర్యాటకులు ఎవరూ దూసపాటి లొద్ది జలపాతం చూసేందుకు ప్రస్తుతం రావొద్దని సందర్శనను అధికారికంగా ఉన్నతాధికారులు నిలిపివేసినట్లు ఎఫ్బీఓ లలిత వివరించారు. -
తైక్వాండోలో అమృతవర్షిణికి బంగారు పతకం
వరంగల్ స్పోర్ట్స్: కేఎల్బీ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎదులాబాద్లో ఆదివారం నిర్వహించిన రెండో తెలంగాణ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో దుర్గావర్జుల అమృతవర్షిణి ప్రతిభ కనబరిచింది. పూంసే విభాగంలో బంగారు, కొరుగి విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది. అమృతవర్షిణి వడ్డేపల్లి పరిమళకాలనీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి సంతోశ్కుమార్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలక్ట్రిసిటీ ఏఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగేళ్లుగా ఆమె కోచ్ నవీన్ దగ్గర శిక్షణ పొందుతోంది. కమిషనరేట్ పరిధిలో 6,683 గణేశ్ విగ్రహాలు● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6,683 గణపతి విగ్రహాలు పూజలందుకుంటున్నాయని కమిషనర్ సన్ప్రీత్సింగ్ తెలిపారు. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2,675, ఈస్ట్జోన్ పరిధిలో 2,043, వెస్ట్జోన్ పరిధిలో 1,965 విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణపతి నవరాత్రులు కొనసాగుతున్నాయని తెలిపారు. పోలీస్ అధికారులు, సిబ్బంది తమ పరిధి గణపతి మండపాలను సందర్శించడంతోపాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది మొత్తం 6,354పైగా విగ్రహాలను జియో ట్యాగింగ్ చేసినట్లు తెలిపారు. మండపాల నిర్వాహకులు, ప్రజలు.. పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన వేడుకలను విజయవంతం చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు. టీజీ ఎస్పీ కమాండెంట్ ఉద్యోగ విరమణఖిలా వరంగల్: మామునూరు టీజీ ఎస్పీ నాలుగో బెటాలియన్ కమాండెంట్ బి.రాంప్రకాశ్ ఆదివారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో డి.శివప్రసాద్రెడ్డి కమాండెంట్గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన రాంప్రకాశ్, దంపతులను అధికారులు గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఏసీ కృష్ణప్రసాద్, శ్రీనివాస్ రావు, వీరన్న, ఆర్ఐలు విజయ్, కార్తీక్, రాజిరెడ్డి, రవి, పురుషోత్తంరెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. నేడు గ్రేటర్ గ్రీవెన్స్ వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్బాజ్పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. వరంగల్ కలెక్టరేట్లో.. న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం (నేడు) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఖిలా వరంగల్: కొత్తకార్డులకు సన్నబియ్యం పంపిణీకి వరంగల్ జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడు నెలల విరామం తర్వాత రేషన్ షాపులు సోమవారం తెరుచుకోనున్నాయి. జిల్లాలోని ఏనుమాముల, నర్సంపేట, వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్షాపులకు సన్నబియ్యం చేరుకున్నాయి. కొత్త కార్డుల పంపిణీకి ముందు ప్రతి నెలా సుమారు 509 షాపుల ద్వారా 2,66,429 మంది లబ్ధిదారులకు 50.14.541 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. పెరిగిన లబ్ధిదారులకు అనుగుణంగా అదనంగా జిల్లాకు 53,82,518 టన్నుల స్టాక్ కేటాయించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు -
హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధి మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొంది. ఆలయంలోని స్వయంభు లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో దర్శించుకుని పూజలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హేమాచలగుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ ప్రాంగణంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించిన పూజారులు స్వామివారి విశిష్టత, ఆలయ పురాణాన్ని భక్తులకు వివరించారు. సంతానం కోసం స్వామివారి నాభిచందన ప్రసాదం స్వీకరించేందుకు వచ్చిన దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని పంపిణీ చేసి వేద మంత్రోచ్ఛరణతో ఆశీర్వచనం ఇచ్చారు. -
స్వచ్ఛ ఏవమ్ హరిత్
విద్యారణ్యపురి: దేశంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్స్ (ఎస్హెచ్వీఆర్) ఇవ్వనుంది. ఇందుకోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్ విద్యాలయ్ 2025–26 రేటింగ్స్ యాప్ను ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని సెప్టెంబర్ 30లోగా వివరాలు పంపించాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, గురుకులాల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ్ రేటింగ్స్ కోసం వివరాలు పంపించాల ని జిల్లాల విద్యాశాఖ అధికారులు సూచించారు. అలాగే, ఆయా అంశాలకు అనుగుణంగా పాఠశాలలను స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయాలుగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు హనుమకొండ జిల్లాలోని 14 మంది ఎంఈఓలు, స్ట్రాంగ్ టీచర్లకు స్వచ్ఛ ఏవమ్ శిక్షణపై ఇచ్చారు. ఎస్హెచ్వీఆర్ లక్ష్యాలు.. పాఠశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం, బాలల స్నేహపూరిత వాతావరణం పెంపొదించడం, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం, వినియోగం, విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండడం, విద్యార్థులు సమీకృతంగా పాఠశాల, పచ్చదనం, పరిశుభ్రత గురించి సమాజంలో మార్పునకు విద్యార్థులే రాయబారులుగా ఉండడం. జిల్లా స్థాయిలో ఎంపిక.. జిల్లా స్థాయిలో ప్రధానోపాధ్యాయులు పొందుపర్చిన సమాచారం మేరకు స్టార్ రేటింగ్ ప్రకారం కలెక్టర్, డీఈఓ, వైద్యాధికారి, ఇంజనీరింగ్ అధికారి, స్వచ్ఛంద సంస్థ, ముగ్గురు ఉపాధ్యాయులతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. మూడు లేదా అంతకంటే ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న ఆరు గ్రామీణ పాఠశాలలు, రెండు పట్టణ ప్రాంతాల్లో ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతారు. రాష్ట్రస్థాయిలో.. రాష్ట్ర విద్యాశాఖ, వైద్యశాఖ, పంచాయతీరాజ్, స్థానిక సంస్థల సంచాలకులతో స్వచ్ఛంద సంస్థ, ఇద్దరు ఉన్నత పాఠశాలల హెచ్ఎంలతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. 4 స్టార్ రేటింగ్, అంతకన్నా ఎక్కువ రేటింగ్ ఉన్న 14 గ్రామీణ ఉన్నత పాఠశాలలు, 6 పట్టణ పాఠశాలలను ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారు. జాతీయ స్థాయిలో 200 పాఠశాలల ఎంపిక.. జాతీయస్థాయిలో 5 స్టార్ రేటింగ్ కలిగిన 140 గ్రామీణ, 60 పట్టణ ప్రాంతాల పాఠశాలలను ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ హరిత్ విద్యాలయ రేటింగ్స్లో ఎంపికై న ప్రతీ పాఠశాలకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేస్తారు. 2014 నుంచి.. దేశంలో 2014లో స్వచ్ఛ భారత్–స్వచ్ఛ విద్యాలయగా (ఎస్బీఎస్వీ), 2016–2017లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్గా (ఎస్వీవీ) రికగ్నైజ్డ్ స్కూల్స్కు, 2017–2018లో స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలను ప్రభుత్వ యాజమాన్యాలతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు కూడా అవకాశం కల్పించారు. 2020–2021లో స్వచ్ఛ విద్యాలయ పురస్కార్–3లో దేశంలో 8.23 లక్షల పాఠశాలలు భాగసాములయ్యాయి. 2025–2026లో నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా స్వచ్ఛ ఎవమ్ హరిత్ విద్యాలయ (ఎస్హెచ్వీఆర్) మిషన్ లైఫ్ న్యూ కేటగిరీ క్లీన్ అండ్ గ్రీన్ ఇన్ స్కూల్స్ డెవలప్మెంట్ పొందుపర్చారు. రెండు జిల్లాల్లో పాఠశాలల సంఖ్య.. హనుమకొండ జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి 880 పాఠశాలలు, వరంగల్ జిల్లాలోఅన్ని యాజమాన్యాలు కలిపి 1,028 పాఠశాలలు ఉన్నాయి. స్వచ్ఛ ఏవమ్ హరిత్ విద్యాలయాలుగా తమ వివరాలను పొందుపర్చి ఎన్ని పాఠశాలలు పోటీపడతాయో వేచి చూడాలి. పాఠశాలల్లో పలు అంశాలకు రేటింగ్ పచ్చదనం, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల వివరాలు ఎస్హెచ్వీఆర్ యాప్లో నమోదు ఈనెల 30 వరకు గడువు జాతీయ స్థాయిలో ఎంపికై తే ఒక్కో పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహకంపాయింట్స్ స్టార్ 90–100 5 75–89 4 51–74 3 35–50 2మంచి నీటి వినియోగం 22 పాయింట్స్, మరుగుదొడ్ల నిర్వహణ 27, సబ్బులతో చేతులు కడుక్కోవడం 14, ప్రవర్తన, మార్పు 20, పచ్చదనం పరిశుభ్రత 21, పాఠశాలల్లో పర్యావరణ క్లబ్ల ఏర్పాటు, ఎల్ఈడీ బల్బుల వినియోగం, మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నివారణ, సోలార్ ప్యానల్ ఏర్పాటు వంటి అంశాలకు 21 పా యింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్స్ ఉంటాయి. పలు విభాగాల్లో అందులోని అంశాలపై వివరాలను పొందుపరిస్తే వచ్చిన పాయింట్స్ ఆధారంగా పాఠశాలకు స్టార్ రేటింగ్ ఇస్తారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
● జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాశ్యాదవ్ ఖిలా వరంగల్: క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని జూడో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కై లాశ్యాదవ్, జిల్లా యువజన క్రీడా మండలి అధికారి సత్యవాణి అన్నారు. జాతీయ క్రీడావారోత్సవాల్లో భాగంగా జిల్లా నెహ్రూ యువ కేంద్రం, జిల్లా యువజన క్రీడా మండలి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడోత్సవాలు ఆదివా రం సాయంత్రం ఖిలా వరంగల్ కోటలో అట్టహా సంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా వారు హాజరై సైకిల్ర్యాలీ ప్రారంభించి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందన్నారు. క్రీడా పాలసీని అతి త్వరలో జిల్లాల వారీగా తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. క్రీడా యూనివర్సిటీ, క్రీడా పాఠశాలలను నిర్వహించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. అనంతరం పలు క్రీడాపోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులు, ప్రశంసపత్రాలు అందజేసి అభినందించా రు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమ, మాజీ కార్పొరేటర్ దామోదర్, నెహ్రూ యువ కేంద్రం అన్వేశ్, వేమ, నిశాంత్ పాల్గొన్నారు. -
కడియం శ్రీహరి చేసిందేమీ లేదు
● బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్ ● మాజీ ఎమ్మెల్యే రాజయ్య పాదయాత్ర ప్రారంభంవేలేరు: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వేలేరు మండల కేంద్రం నుంచి గండిరామారం రిజర్వాయర్ వరకు సాగునీటి పనుల పూర్తి కోసం చేస్తున్న పాదయాత్రను దాస్యం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కడియం శ్రీహరికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. త్యాగాలకు కేరాఫ్ అడ్రస్ రాజయ్య అయితే, మోసాలకు కేరాఫ్ అడ్రస్ కడియం శ్రీహరి అన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సాగునీటి కోసం రూ.104 కోట్లతో కేటీఆర్ పనులు ప్రారంభించి మొదటి, రెండో దశ లిఫ్ట్ పనులు పూర్తిచేశామన్నారు. మూడో దశ పనులు పూర్తి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పైప్లైన్ పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ వేలేరు నుంచి గండిరామా రం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీడబ్లూఎంసీ కార్పొరేటర్ రాధికరె డ్డి, మాజీ జెడ్పీటీసీలు తదితరులున్నారు. -
ఆక్సిజన్ పార్కు పూర్తయ్యేనా?
మడికొండ: గ్రేటర్ వరంగల్ 46వ డివిజన్ రాంపూర్–స్టేషన్పెండ్యాలలో నిర్మించతలపెట్టిన ఆక్సిజన్ పార్కు అటకెక్కింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో రూ.నాలుగు కోట్లతో పార్కు నిర్మాణానికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు శ్రీకారం చుట్టారు. 99 ఎకరాల్లో 40 ఎకరాలు ఉన్న ఊర చెరువును అభివృద్ధి చేయడంతోపాటు మిగిలిన స్థలంలో మియావాకీ, బ్లాక్ ప్లాంటేషన్ ఏర్పాటు చేశారు. పార్కు ఎంట్రెన్స్లో గేట్వే నిర్మాణంతో పాటు చిల్డ్రన్స్ పార్కు, ఓపెన్ జిమ్, బటర్ ఫ్లై పార్కు నిర్మాణం చేయనున్నట్లు అప్పుడు అధికారులు తెలిపారు. చెరువులో బోటింగ్, ఫిషింగ్, యాక్టివిటీ, పాత్ వే నిర్మాణం, ఫుడ్కోర్టు, వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఆక్సిజన్ పార్కులో మియావాకీ ఫారెస్ట్ ప్రత్యేకత.. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచడమే మియావాకీ ప్రత్యేకత. మియావాకీ రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. పెరుగుతున్న జనాభాకు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉత్పత్తి చేయడమే ఈ పార్కు ముఖ్య ఉద్దేశం. అరమీటరుకు ఒకటి చొప్పున నాటిన మొక్కలు పెరిగే కొద్ది దట్టమైన అడవిలా మారుతుందని, దీని మధ్యలో ఉండే పాత్వేలో నడుచుకుంటూ వెళ్తే అడవిలో నుంచి వెళ్తున్న అనుభూతి కలిగే విధంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ, ఆక్సిజన్ పార్కులో అభివృద్ధి పనులు నిలిచిపోవడంతో పర్యాటకులు, నగర ప్రజలకు ఆహ్లాదం కరువైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పార్కు పనులు పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు. 2017లో రూ.4 కోట్లతో ‘కుడా’ శంకుస్థాపన 99 ఎకరాల్లో ఏర్పాటుకు అధికారుల ప్రణాళిక ఇప్పటివరకు 20 శాతం కూడా పూర్తికాని పనులు -
రైతులతో నేరుగా మాట్లాడిన గణపయ్య..!
(వరంగల్ డెస్క్): చవితి రోజు ఘనంగా పూజలందుకున్నాడు వినాయకుడు. రైతులు ప్రేమగా తెచ్చిన పత్రి, పూలు ఒంటినిండా ధరించాడు. పండ్లు, ఉండ్రాళ్లు బొజ్జ నిండా తిన్నాడు. కుటుంబ సమేతంగా వచ్చిన రైతు దంపతులను చూసి మురిసిపోయాడు. తెల్లవారి సైతం అదే రీతిన ప్రసాదాలు, పండ్లు అందాయి. కానీ.. మనసులో ఏదో వెలితి. అప్పుడు వినాయకుడు మూషిక రాజు చెవిని మెలిపెడుతూ..‘మూషికా.. నిన్న భక్తజన సందోహంతో నిండిన మండపాల్ని చూసి మురిసిపోయా.. ఇలా తెల్లారిందో లేదో పల్లెల్లోని మండపాలన్నీ వెలవెలబోతున్నాయి. రైతులు, అమ్మలు, అక్కలంతా ఎటుపోయారు? ఒక్కరూ కనిపించరేం..? రైతన్నలెందుకు పూజకు రాలేదో చూసి రాపో’ అన్నాడు. (గంట తరువాత) ‘స్వామీ.. రైతులు కుటుంబంతో సహా యూరియా కోసం సొసైటీ కార్యాలయాల వద్ద ఉంటున్నారు.. అయినా దొరకట్లేదట.. ఆందోళనలు చేస్తున్నారు.. అని బాధపడుతూ సమాధానమిచ్చాడు. ‘నా రైతులు ఇంతగనం కష్టాలు పడుతున్నారా.. వారి కష్టాలు తెలుసుకుందాం పద’ అన్నాడు. ‘నా భుజంపై ఎక్కండి. ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల దగ్గరికి తీసుకెళ్తా’ అంటూ సమాధానమిచ్చాడు మూషిక రాజు. సరే పదా.. అంటూ జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ నుంచి వారి ప్రయాణం మొదలైంది.రైతుల పంటలను చూసుకుంటూ వెళ్తున్నారు. జిట్టెగూడెం గ్రామంలో ఓ రైతు కనిపించాడు. అక్కడే ఆగిన వినాయకుడు.. ఆ రైతును పలకరించాడు. ఏమయ్యా.. నీ పేరేమిటీ?స్వామి.. నాపేరు లకావత్ సురేందర్వినాయకుడు: పొలం ఎట్లుంది? యూరియా దొరకట్లే..సురేందర్: స్వామి నాకు ఆరెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఐదెకరాలు వరి, ఒక ఎకరం పత్తి సాగు చేస్తున్నా. యూరియా బస్తాల కోసం పదిరోజుల నుంచి పనులు వదులుకుని రోజూ ఘన్పూర్కు వస్తున్నా. ఘన్పూర్ ఆగ్రోస్ సెంటర్లో శుక్రవారం స్టాక్ వచ్చిందని తెలుసుకుని ఉదయం వెళ్లా. మధ్యాహ్నం వరకు ఎండలో లైన్లో ఉన్నా యూరియా దొరకలేదు. లాభం లేదని ఇంటికి వచ్చా. ‘అయ్యో.. సురేందర్.. ఇన్ని కష్టాలా’.. అని అనుకుంటూ వినాయకుడు తన మూషికాన్ని కదిలిస్తూ మరో ఊరికి బయల్దేరాడు.చల్వాయినుంచి పోదాం అంటూ బయలుదేరిన వినాయకుడికి మార్గమధ్యలో హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లిలో ఓ రైతును పలకరించాడు. వినాయక : రైతన్నా నీపేరేంది?..రైతు : ఓదెల కొమురయ్య స్వామి..వినాయక : దిగులుగా ఉన్నావు ఏమైంది.. పొలానికి వెళ్లలే..కొమురయ్య : యూరియా దొరకడం లేదయ్యా.. వారం రోజుల క్రితం పరకాల పీఎసీఎస్లో ఇచ్చారు. ఇప్పుడు అడిగితే మాదారం సొసైటీ వారు సంబంధిత గ్రామాల రైతులకు ఇస్తున్నారు. పరకాల సొసైటీకి ఎప్పుడు వస్తదని అడిగితే ఆర్డర్ పెట్టినం అంటున్నారే తప్ప రావడం లేదు. బజార్లో వ్యాపారస్తులు అమ్ముకోవడానికి యూరియా ఉంటుంది కానీ వారు లింక్లు పెట్టి అమ్ముతున్నారు. వినాయక :అవునా.. ఏమిటీ మూషికా.. ఏ రైతన్నను పలకరించినా ఒకటే సమస్య.. వీరి కష్టాలు త్వరగా తీరాలి.. ముఖంలో నవ్వు రావాలి అంటూ తన మండపానికి వెళ్లారు.మహబూబాద్ జిల్లా కురవి మండలం ఆంధ్రా బ్యాంకు కర్షక సేవా సహకార సంఘం వద్ద చేతిలో చిట్టీ పట్టుకుని తిరుగుతున్న మోద్గులగూడేనికి చెందిన రైతు కొత్త వెంకన్నగౌడ్ను ఆపి ‘ఎందుకలా తిరుగుతున్నావ్. ఏంటి సమస్య’ అని ప్రశ్నించాడు వినాయకుడువెంకన్నగౌడ్: స్వామీ.. నేను మూడెకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. పంట కోసం ఆరు బస్తాల యూరియా కావాలి. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దొరకలేదు. వారం రోజులుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా. కష్టపడి కూపన్ సంపాదించా. కూపన్ చేతికొచ్చినా యూరియా అందలేదు. మరో రెండు రోజుల్లో లారీ వస్తుందని చెబుతున్నారు. అప్పుడైనా దొరుకుతుందో లేదో’ అని నిట్టూరుస్తూ సమాధానమిచ్చాడు. ‘దేశానికి అన్నంపెట్టే రైతుకే ఇన్ని కష్టాలా?’ అనుకుంటూ ముందుకు సాగారు మూషికరాజు, వినాయకుడు. నేరుగా.. ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం చల్వాయి గ్రామానికి చేరుకున్నారు.అరుగుపై దిగాలుగా కూర్చున్న కృష్ణారెడ్డిని పలకరిస్తూ..వినాయకుడు : ఎందుకిలా దిగాలుగా కూర్చున్నావు? కృష్ణారెడ్డి: 16 ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజుల క్రితమే పంటకు యూరియా వేయాలి. కొరత కారణంగా ఇప్పటి వరకు వేయలేదు. అదిగో, ఇదిగో బస్తాలు వస్తున్నాయంటూ అధికారులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇప్పటికీ నాలుగు సార్లు క్యూలైన్లో నిల్చుంటే ప్రతీసారి ఒకటి లేదా రెండు బస్తాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు సరిపడా యూరియా ఇవ్వట్లేదు. అధికారులు సరిపడా యూరియా పంపిణీ చేస్తారనే ఆశ కూడా రైతుల్లో లేదు. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. అని చెప్పగానే. ఇంతదారుణమా అంటూ అక్కడినుంచి వినాయక స్వామి పరకాల మీదుగా వెళ్దామని బయలుదేరారు.భళా.. ఏమిటీ ఇక్కడి రైతులంతా ఆనందంగా ఉన్నట్టున్నారే.. అన్ని చోట్లా కనిపించినట్లు. ఇక్కడ క్యూలైన్ లేదు. తోపులాట లేదు. పోలీసుల హడావిడి లేదు అంటూ.. నల్లబెల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎదుట నుంచి వెళ్లిపోబోయాడు వినాయకుడు. అప్పుడే ఒక రైతు కాళ్లీడుస్తూ.. పీఏసీఎస్ వైపు రావడం గమనించారు.‘ఏంటయ్యా.. ఇక్కడ యూరియా కొరత లేనట్టుంది. నువ్వెటు వెళ్తున్నావ్’ అని నల్లబెల్లి మండలం గోవిందాపూర్ శివారు ఎర్రచెరువు తండాకు చెందిన పాడ్యా బాలును అడిగాడు వినాయకుడు.బాలు: ఈ సీజన్లో మూడెకరాల్లో వరి, మరో మూడెకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. యూరియా కోసం 12 రోజులుగా తిరుగుతున్నా. మండలంలో ఏషాపునకు వెళ్లినా యూరియా లేదు. అయిపోయిందని చెబుతున్నారు. స్టాక్ లేదని చెబుతున్నా.. ఒక్క బస్తా అయినా దొరుకుతుందేమోనని రోజూ పీఏసీఎస్కు వచ్చి పోతున్నా.’ అని సమాధానమిచ్చాడు. .. రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో అంటూ ముందుకు కదిలాడు వినాయకుడు.సూర్యుడు నడినెత్తిమీదికొచ్చేసరికి వినాయకుడు గూడూరు మండల కేంద్రానికి చేరుకున్నాడు. పీఏసీఎస్ గోదాం వద్ద లైన్లో నిల్చున్న మర్రిమిట్టలోని బందాలగడ్డ తండాకు చెందిన భూక్య హేమ్లానాయక్ను పలకరించాడు.వినాయకుడు: ఏమిటీ హుషారుగా ఉండేవాడివి.. నిస్సత్తువగా కనిపిస్తున్నావ్. హేమ్లానాయక్: ఏం చెప్పాలి స్వామి. ఆరు ఎకరాల్లో వరి సాగు చేశా. 20 రోజులవుతోంది. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా యూరియా దొరకలేదు. 10 రోజులుగా నిత్యం నా భార్య, నేనూ యూరియా కోసం వస్తున్నాం. తీసుకున్న వాళ్లే మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. మా లాంటి వాళ్లను పట్టించుకునేటోళ్లు లేరు. కనీసం ఎకరానికి ఒక బస్తా చొప్పున 6 బస్తాలు కావాలి. ఏం చేయాలో తోచట్లేదు. లైన్లో నిలబడి, రాత్రి, పగలు తిరుగుతూ ఉంటే జ్వరం వచ్చింది. ‘అయ్యో.. హేమ్లా. ఒంట్లో జ్వరమున్నా.. పంటను కాపాడుకోవాలన్న నీ తాపత్రయం బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. అంటూ వినాయకుడు అక్కడి నుంచి బయల్దేరాడు.అయ్యో.. ఇన్ని కష్టాలా.. మానుకోట,వరంగల్ జిల్లాల్లో రైతుల బారులు, ఆందోళనలు చూసి చలించిపోయాడు వినాయకుడు. నర్సంపేట, చెన్నారావుపేట, కేసముద్రం మండలం కల్వల రైతు వేదిక వద్ద రైతుల తోపులాట, నర్సింహులపేట పీఏసీఎస్ వద్ద రైతులు చేస్తున్న రాస్తారోకో, గూడూరు మండల కేంద్రంలోని ప్రధాన బస్టాండ్ సెంటర్ జాతీయ రహదారి 365పై ఆందోళన, కురవి, కొత్తగూడలో యూరియా కోసం వచ్చిన మహిళలు çస్పృహతప్పి కిందపడిపోవడం చూసి నా రైతన్నలకు ఇన్ని కష్టాలా.. పాలకులేమి చేస్తున్నరు అంటూ లోలోన మదన పడుతూ ముందుకు సాగాడు. -
వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు
చెరువులను పరిశీలించిన మేయర్, కమిషనర్ వరంగల్ అర్బన్ : నగరంలో వినాయక నిమజ్జనానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. శనివారం వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో నిమజ్జనం జరిగే ఉర్సు రంగసముద్రం, బెస్తం చెరువులను కమిషనర్ చాహత్ బాజ్పాయ్, అధికారులతో కలిసి ఆమె సందర్శించారు. మేయర్ మాట్లాడుతూ.. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా బల్దియా తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాష్ కలెక్టర్ యంత్రం ద్వారా చెరువుల్లో కొనసాగుతున్న పూడికతీత, గురప్రు డెక్క తొలగింపు పనులు పూర్తి చేయాలన్నారు. ఇరిగేషన్ శాఖతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. బల్దియా ద్వారా రహదారులపై గ్రావెల్, తగినంత లైటింగ్, శానిటేషన్లో భాగంగా ఎప్పటికప్పుడు నిమజ్జన పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మరుపల్లి రవి, గుండు చందన, అరుణ, మానస రాంప్రసాద్, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, రాజేశ్, ఇంజనీర్లు పాల్గొన్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టండి వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు త్వరగా మరమ్మతులు చేయాలని మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమావేశమై వర్షాకాలం సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిల్వ ఉండకుండా మొరం పోసి సమాంతరం చేయాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా ఫిల్టర్ బెడ్ల వద్ద నిత్యం పరవేక్షిస్తూ అవసరమైన చోట వాల్వ్లు మార్చాలని పేర్కొన్నారు. కోటలో పర్యటన.. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఖిలావరంగల్ మధ్యకోటలోని తూర్పు, పడమర, పశ్చిమ, ఉత్తర కోటలను శనివారం ‘కుడా’ అధికారులతో కలిసి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గుండు చెరువు సుందరీకరణ, అడ్వెంచర్ స్పోర్ట్స్, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ పనులను పరిశీలించారు. కోట చుట్టూ మోట్ జీవ పునరుద్ధరణ (బయో డైవర్సిటీ) పనులు త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని ‘కుడా’ అధికారులను ఆదేశించారు. -
విద్యార్థినులు లక్ష్యంతో చదవాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● జ్యోతిబాపూలే పాఠశాల ఆకస్మిక సందర్శనఖానాపురం: విద్యార్థినులు లక్ష్యంతో చదవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మండలంలోని బుధరావుపేట శివారు ఐనపల్లిలోని మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలను శనివారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులతో కలిసి ఆటలా డిన అనంతరం కలిసి భోజనం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుపై శ్రద్ధ కనబరిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. విద్యార్థినుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల పెట్టెను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఏఓ అనురాధ, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పల త, డీసీఓ సరిత, ఆర్డీఓ ఉమారాణి, తహసీల్దార్లు రమేశ్, రవిచంద్రారెడ్డి, వ్యవసాయ అధికారి బోగ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ జయశ్రీ పాల్గొన్నారు. -
యూరియా కోసం బారులు
నర్సంపేట/ఖానాపురం: యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. చెన్నారావుపేట సొసైటీకి యూరియా లారీ వస్తుందని తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల రైతులు శనివారం తెల్ల వారుజాము నుంచే సొసైటీ ఎదుట బారులుదీరారు. 444 బస్తాల యూరియా రావడంతో ఒక్కొక్క రైతుకు రెండు బస్తాల చొప్పున సొసైటీ సిబ్బంది పోలీస్ బందోబస్తు నడుమ పంపిణీ చేశారు. కొంతమంది రైతులకు యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. యూరియా బస్తాలు సరిపడా తెప్పించి ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఖానాపురం మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు. -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
● కలెక్టర్ సత్యశారదన్యూశాయంపేట: వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ హాల్లో దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యాంగుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. దివ్యాంగుల దరఖాస్తులపై నిర్లక్ష్యం వహించొద్దని, తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సంక్షేమాధికారి రాజమణి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, అధికారులు పాల్గొన్నారు. మెరుగైన వైద్యసేవలందించాలి జిల్లాలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలందించాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్ చాంబర్లో ఏరియా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ఆర్ఎంఓలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఉత్తమ సేవలందించాలన్నారు. అధికారులు సమయపాలన పాటించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. సమీక్షలో డీఎంహెచ్ఓ సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, వైద్యులు మురళి తదితరులు పాల్గొన్నారు. -
అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు!
సంగెం: పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతోంది. అధికారులు దాడులు చేస్తున్నా.. కేసులు పెడుతున్నా.. అక్రమార్కులు కొత్త పంథాను ఎంచుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ధాన్యం మర ఆడించి బియ్యాన్ని ఇవ్వాల్సిన రైస్మిల్లర్లు ఆ ధాన్యాన్నే మింగేస్తున్నారు. సంగెం మండలంలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)లో మిల్లర్ల తీరుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈనెల 28న సంగెం మండల కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సూళ్లూరుపేట నుంచి ఓ లారీ సుమారు 30 టన్నుల దొడ్డు బియ్యం మండలంలోని ఓ సీఎంఆర్ రైస్ మిల్లుకు తరలివేళ్తోంది. లారీ డ్రైవర్ గూగుల్ మ్యాప్ ఆధారంగా సంగెంకు వచ్చి మరో గ్రామానికి వెళ్తున్న క్రమంలో సంగెం పోలీస్స్టేషన్ దారి నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు వచ్చి అటు వెళ్లలేక తిప్పుతున్న క్రమంలో లారీ దిగబడింది. స్థానికులు ఆరా తీయడంతో దొడ్డుబియ్యం దందా వెలుగులోకి వచ్చింది. దిగబడిన లారీ డ్రైవర్ దొడ్డు బియ్యం దిగుమతి చేసుకునే మిల్లర్కు విషయం చేరవేయడంతో హుటాహుటిన డీసీఎం పెట్టి హమాలీల సాయంతో లారీలోని దొడ్డు బియ్యాన్ని మిల్లుకు తరలించుకుపోయాడు. ఈ విషయంపై స్థానికులు దొడ్డు బియ్యాన్ని మిల్లులో మర ఆడించి సన్నబియ్యంగా మార్చి సీఎంఆర్కు అప్పగిస్తున్నారని చర్చించుకుంటున్నారు. మిల్లర్ల మాయాజాలం ఆంధ్రా నుంచి దొడ్డు బియ్యం దిగుమతి, మిల్లుల్లోని సన్న ధాన్యం ఎగుమతి దిగబడిన లారీతో వెలుగులోకి మిల్లర్ల అక్రమాలు అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు చర్చ -
ఆంధ్రాకు సన్నధాన్యం..
కాగా మండలంలోని సీఎంఆర్ మిల్లుల్లోని సన్నధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని పలువురు అంటున్నారు. ఈ నెల 8న కుంటపల్లి చెరువు మూలమలుపు వద్ద అదుపు తప్పి దిగబడిన లారీలో ఓ మిల్లు నుంచి సన్న ధాన్యం బయటకు తరలిస్తున్నారని చర్చించుకుంటున్నారు. ఒకే నెలలో దొడ్డు బియ్యం లారీ దిగబడటంతో అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు తరలిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై సివిల్ సప్లయీస్ జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. ఇప్పటికై న కలెక్టర్, విజిలెన్స్ అధికారులు సదరు మిల్లులపై దాడులు చేస్తే అప్పగించిన ధాన్యం ఎంత, మర ఆడించి ఇచ్చిన బియ్యం ఎంత, మిగిలిన ధాన్యం ఎక్కడకు పోయింది, దొడ్డు బియ్యం ఎందుకు కొనుగోలు చేస్తున్నారనే విషయాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
రూ.1.53 కోట్ల కరెన్సీతో అలంకరణ
వరంగల్ శివనగర్లోని వాసవి కాలనీలో వినాయక ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతిష్టించిన మట్టి విఘ్నేశ్వరుడిని శుక్రవారం రాత్రి కోటీ యాభై మూడు లక్షల, నూట పదహారు రూపాయల కరెన్సీతో అలంకరించారు. సుమారు 200 మందికిపైగా ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రతి నిధులు, కాలనీవాసులు ఈ కరెన్సీని అందజేశారు. ఈ కార్యక్రమంలో వినాయక ట్రస్టు భవనం అధ్యక్షుడు సాదుల దామోదర్, కార్యదర్శి మంచాల కృష్ణమూర్తి, కోశాధికారి రావికంటి అశోక్ పాల్గొన్నారు. – ఖిలా వరంగల్గణపతి.. ధనపతిమంచిర్యాల అర్బన్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథస్వామి ఆలయ కాలక్షేప మండపంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్టించిన వినాయకుడిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. శుక్రవారం రాత్రి రూ.25,11,116 కరెన్సీ నోట్లతో మండపాన్ని తీర్చిదిద్దారు. భక్తులు కరెన్సీ గణపతిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ధననాథుడు గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ బజారులో ఆర్యవైశ్య సంఘం, సంకా బాలాజీ గుప్తా యూత్, స్థానిక వ్యాపారుల సహకారంతో ఏర్పాటు చేసిన గణనాథుడు శుక్రవారం ‘ధన’నాథుడుగా దర్శనమిచ్చాడు. ఉత్సవ నిర్వాహకులు రూ.2.35 కోట్ల కరెన్సీ నోట్లతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. – మంగళగిరి టౌన్వినాయక లడ్డు, కలశం @రూ.49 లక్షలుప్రకాశం జిల్లా సీఎస్పురం మండలం అయ్యలూరివారిపల్లెలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 3వ రోజు శుక్రవారం గణపతి మండపం వద్ద నిర్వహించిన లడ్డు, కలశం వేలంలో లడ్డు రూ.30 లక్షలు, కలశం రూ.19 లక్షలు పలికింది. వేలంలో లడ్డును అదేగ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్రెడ్డి, కవిత దంపతులు రూ.30,00,116కు దక్కించుకోగా, కలశాన్ని అదేగ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, సర్పంచ్ ముత్యాల భారతీరెడ్డి దంపతులు రూ.19.10 లక్షలు వెచ్చించి దక్కించుకున్నారు. – సీఎస్పురం (పామూరు) -
కొండపర్తిలో జెడ్పీ సీఈఓ పర్యటన
ఐనవోలు: మండలంలోని కొండపర్తిలో జెడ్పీ సీఈఓ విద్యాలత శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ను, పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. గ్రామం నుంచి పీహెచ్సీ వరకు జరుగుతున్న ఎవెన్యూ ప్లాంటేషన్ వద్దకు వెళ్లి జరుగుతున్న పనులను గమనించి మొక్క నాటారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నర్మద, ఎంపీఓ రఘుపతిరెడ్డి, ఏపీఓ నక్క కుమారస్వామి, ఈసీ ప్రదీప్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, ఎఫ్ఏ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్ రాక్షస పాలన
● మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ● రేపు సాగు నీటి సమస్య పరిష్కారానికి పాదయాత్రవేలేరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తోందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య విమర్శించారు. శుక్రవారం వేలేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో 2023 ఫిబ్రవరిలో రూ.104 కోట్లతో పనులు ప్రారంభించి మొదటి, రెండో దశ పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే పూర్తి చేశామన్నారు. మూడో దశ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయన్నారు. మండలంలోని రైతులకు సరిపడా యూరియా అందక క్యూలో నిలబడి ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాత్రం యూరియా కొరత లేదని అబద్ధాలు చెబుతూ కాలం గడుపుతున్నాడని విమర్శించారు. మూడో దశ సాగునీటి పనులు ప్రారంభించి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 31న వేలేరు అంబేడ్కర్ సెంటర్ నుంచి గండిరామారం రిజర్వాయర్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల ఇన్చార్జ్ భూపతిరాజు, మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మండల కో–ఆర్డినేటర్ గోవింద సురేశ్, ప్రోగ్రామ్ ఇన్చార్జ్ మల్కిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సంపత్, మాజీ సర్పంచ్ మాధవరెడ్డి, గ్రామ కన్వీనర్ సూత్రపు సంపత్, నాయకులు విజేందర్రెడ్డి, జానీ, మహేందర్, శ్యామ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాలు తెలియజేయాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ ● రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశంహన్మకొండ అర్బన్: జిల్లాలో అన్ని జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో అభ్యంతరాలుంటే నేడు (శనివారం) నాటికి తెలియజేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో జీపీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలోని 210 జీపీల్లో 3,70,867 మంది ఓటర్లు, 1,986 పోలింగ్ కేంద్రాలున్నట్లు తెలిపారు. శనివారం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు చోట్ల ఓటు ఉన్నవారిని తొలగించాలని ఆ జాబితాను బీఆర్ఎస్ ప్రతినిధి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, తదితరులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీపీఓ లక్ష్మీరమాకాంత్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈవీ. శ్రీనివాస్రావు, నిశాంత్, ప్రభాకర్రెడ్డి, రజినీకాంత్, ఎండీ నేహాల్, శ్యాంసుందర్, సయ్యద్ ఫైజుల్లా, ఏసోబు, తదితరులు పాల్గొన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారానికి సత్వర చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో చర్చించిన అంశాలను ఎజెండాలో పొందుపర్చుతామన్నారు. సమావేశంలో డీఆర్ఓ వై.వి గణేశ్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి నిర్మల, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పుట్ట రవి, ఈ.వి శ్రీనివాస్రావు, చుంచు రాజేందర్, సింగారపు రవిప్రసాద్, హరి జవహర్లాల్, పరంజ్యోతి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఎంహెచ్ఓ అప్పయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, ఏసీపీలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. భూభారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూభారతి దరఖాస్తుల పరిశీలన, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై ఆర్డీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్షించారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వై.వి గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ నారాయణ, తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి!
హనుమకొండ చైతన్యపురిలోని నాగేశ్వర్రావు ఇల్లుసాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్ఓలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారట్లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు.. ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్పర్తి శివారు కోమటిపల్లిలో కొన్న సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది. అడ్డదారుల్లో కొందరు తహసీల్దార్లు, అధికారులు భూసమస్యల పరిష్కారానికి రూ.లక్షల్లో డిమాండ్ తీవ్ర ఆరోపణలు వస్తున్నా.. మారని తీరు ఆదాయానికి మించిన ఆస్తుల వివాదంలో బండి నాగేశ్వర్ ఏసీబీ దాడులతో మళ్లీ కలకలం.. రెవెన్యూ శాఖలో చర్చనీయాంశం 2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ.45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వెంకటాపూర్లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనంఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండలం ఏర్పాటైనప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని అవినీతి అధికారులు -
ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
● ఎంపీ డాక్టర్ కడియం కావ్య ● ఘనంగా క్రీడా దినోత్సవంవరంగల్ స్పోర్ట్స్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ను ప్రతీ క్రీడాకారుడు స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం ధ్యాన్చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కావ్య హాజరయ్యారు. ముందుగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో క్రీడా సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు. డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ మాట్లాడుతూ.. ధ్యాన్చంద్ చరిత్రను నేటి క్రీడాకారులకు తెలియజేసేందుకు వారం పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించామన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు తోట శ్యాంప్రసాద్, మర్కాల యాదిరెడ్డి, పీడీ, పీఈటీ, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి
ఖిలా వరంగల్: భవిష్యత్లో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని, నైపుణ్యాలను సాధించేలా, నూతన ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులకు బోధన చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. బుక్ అండ్ డిజిటల్ లెర్నింగ్ ఫర్ అటల్ పీఎం, భౌతిక, గణిత శాస్త్రాలపై ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతులు ఉర్సు గుట్ట సమీపంలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. డిజిటల్ లెర్నింగ్తో విద్యార్థులు 21వ శతాబ్దానికి తగిన నైపుణ్యాలు, జ్ఞానం పొంది భవిష్యత్ విద్యకు మార్గదర్శకంగా నిలవాలని సూచించారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు, ప్రభు, సురేశ్, గణేశ్, సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు బాలల అక్రమ రవాణా అరికట్టాలి బాలలపై అక్రమ రవాణా, దుశ్చర్యలను అరికట్టడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ శంభునిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న రెండు రోజులు శిక్షణ తరగతులు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి విద్యార్థికి 1098 చైల్డ్ లైన్ నంబర్ తెలిసి ఉండాలని, ఆపరిచిత వ్యక్తుల నుంచి ఎలాంటి ఆహార పదార్థాలు, వస్తువులు తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. బాలల అక్రమ రవాణా నివారణకు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని, పాఠశాలల్లో చైల్డ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా మానిటరింగ్ అధికారి సుజన్తేజ, కోర్సు కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, ఉజ్వల, సురేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అభ్యంతరాలు తెలియజేయాలి.. న్యూశాయంపేట: జిల్లాలోని అన్ని గ్రామపంచాయితీల్లో ప్రదర్శించిన ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీల ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల జాబితాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 317 గ్రామపంచాయతీల పరిధిలోని 2754 వార్డుల్లో 3,83,736 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటరు జాబితా ఈనెల 28న విడుదల చేశామని చెప్పారు. ఏమైనా అభ్యంతరాలను శనివారంలోపు తెలియజేస్తే పరిష్కరించి వచ్చేనెల 2న తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
పింఛన్ల కోసం రాజీలేని పోరాటం
నెక్కొండ: పింఛన్ల కోసం రాజీలేని పోరాటం చేశామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లో నిర్వహించనున్న దివ్యాంగులు, చేయూత పింఛన్దారుల మహాగర్జన సన్నాహక సదస్సు మండల కేంద్రంలోని ఓ గార్డెన్లో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. 2023 డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు రూ.6 వేలు, వృద్ధులు, ఇతర చేయూత పింఛన్లను రూ.4 వేలకు పెంచి అండగా నిలుస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం ఎప్పడు ఎమ్మార్పీఎస్ ముందుండి ఉద్యమిస్తోందని మంద కృష్ణ పేర్కొన్నారు. పింఛన్లు పెంచకుంటే హైదరాబాద్లో జరిగే మహాగర్జనలో తమ గళం విప్పుతామని ఆయన హెచ్చరించారు. సదస్సులో సంఘం జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్, నియోజకవర్గ ఇన్చార్జ్ కల్లెపల్లి ప్రణయ్దీప్, మండల అధ్యక్షుడు ఈదునూరి వెంకన్న, నాయకులు జనార్దన్, రాజుయాదవ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
నగరంలో వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ !
సాక్షి, వరంగల్: ఆధ్యాత్మికతకు నెలవైన వరంగల్ నగరం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కు కూడా వేదికయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పర్యాటక సుందరీకరణలో భాగంగా భద్రకాళి బండ్ అందుబాటులోకి రాగా.. మరోవైపు ఉర్సు గుట్టను కూడా టూరిజం హబ్ దిశగా తీసుకెళ్తున్నారు. వీటికి దీటుగా మామునూరు విమానాశ్రయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో గుట్ట నుంచి గుట్ట మధ్యలో ఉండేలా ఆనాడు కాకతీయులు నిర్మించిన దామెర చెరువును వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్గా మార్చాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆలోచన చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లోని ముఖ్యంగా వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్లను అధ్యయనం చేయడం ద్వారా ఇక్కడ మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రతిపాదనలు రూపొందించింది. దామెర చెరువుకు సంబంధించిన స్థలం కుడాకు ఇవ్వాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారదకు లేఖ రాశారు. సంబంధిత విభాగాధికారులతో కలిసి అక్కడ చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చేపల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించి, ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చింది. ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను ప్రజాప్రతినిధులతోపాటు అటు అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.దామెర చెరువులో ఏర్పాటుకు ‘కుడా’ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే ప్రజలకు ఎంటర్టైన్మెంట్ హైదరాబాద్ తరహాలో జలక్రీడలతో ఉల్లాసానికి చాన్స్ భూమి ఇవ్వాలని కలెక్టర్ సత్యాశారదకు ఇప్పటికే లేఖ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న జిల్లా ఉన్నతాధికారులు -
నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు
నెక్కొండ: ఉద్యోగులకు ఉద్యోగ విరమణ తప్పదని, ఉద్యోగంలో చేరిన నాడే విరమణ తేదీ ఉంటుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఎంఈఓ వీర రత్నమాల ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ మండలంలో 16 ఏళ్ల సుదీర్ఘ కాలం ఎంఈఓగా రత్నమాల విధులు నిర్వర్తించారని తెలిపారు. ఉపాధ్యాయురాలిగా, ఎంఈఓగా ఆమె ప్రజల మన్ననలు చూరగొన్నారని ఆయన పేర్కొన్నారు. నిబద్ధతతో పనిచేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారన్నారు. అనంతరం రత్నమాల మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన నాటి నుంచి నేటి వరకు నెక్కొండ మండల పరిసర గ్రామాల్లోనే విధులు నిర్వర్తించానని పేర్కొన్నారు. ప్రజలు, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, దామోదర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్రెడ్డి, మహేందర్రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, మాజీ ఎంపీపీ గటిక అజయ్కుమార్, మండల అధ్యక్ష, కార్యదర్శులు ప్రతాప్సింగ్, యాకూబ్రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి -
రెవెన్యూలో వేళ్లూనిన అవినీతి!
సాక్షిప్రతినిధి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూశాఖలో అవినీతి పరాకాష్టకు చేరుతోంది. కొందరు తహసీల్దార్లు, అధికారులు అక్రమాదాయానికి కొత్తదారులు వెతుక్కుని మరీ అవినీతికి పాల్పడుతుండడం వివాదాస్పదమవుతోంది. కిందిస్థాయిలో పలువురు వీఆర్వోలు, వీఆర్ఏల నుంచి పైస్థాయిలో సర్వేయర్లు, ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్ల వరకు అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతీ పనికి ఓ రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న కొందరి తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చేయి తడిపితే తప్ప దస్త్రం కదిలించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఓ వైపు శాఖాపరమైన చర్యలు.. మరోవైపు ఏసీబీ దాడులు చేస్తున్నా కొందరు తహసీల్దార్ల తీరు మారడం లేదు. తాజాగా ఖిలా వరంగల్ తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. శుక్రవారం ఆయన ఇంటితో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపై ఐదు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించడం సంచలనంగా మారింది. ప్రాథమికంగా రూ.5 కోట్ల అక్రమాస్తులను గుర్తించిన ఏసీబీ.. కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తుండడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఆది నుంచి అవినీతి ఆరోపణలు.. 2022లో వీఆర్ఎస్కు దరఖాస్తు..ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించిన కేసులో అరెస్టయిన తహసీల్దార్ బండి నాగేశ్వర్రావుపై గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ధర్మసాగర్, కాజీపేట, హసన్పర్తితోపాటు ఉమ్మడి వరంగల్, కరీంనగర్లో పలుచోట్ల పనిచేసిన సమయంలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులు అధికారులు అందాయి. తహసీల్దార్ ఉద్యోగంతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో భాగస్వామిగా చేరి రెండు చేతులా సంపాదిస్తూ ప్రభుత్వ, అసైన్డ్భూములను అప్పనంగా కట్టబెట్టారన్న ఫిర్యాదు మేరకు 2019లో అప్పుడున్న కలెక్టర్ విచారణ జరిపారు. ధర్మసాగర్ మండలంలోని ఓ గ్రామంలో గుట్టను విక్రయించి రిజిస్ట్రేషన్ చేసి పాస్పుస్తకాలు జారీ చేయడం వివాదంగా మారింది. 1976లో హసన్పర్తి శివారు కోమటిపల్లిలో కొనుగోలు చేసిన సీకేఎం కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్కు చెందిన 29 గుంటల భూమిని నగరానికి చెందిన ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసి వారి నుంచి రూ.45 లక్షలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ విషయమై బాధితులు 2022లో అప్పటి సీపీ, డీసీపీ, ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్తోపాటు ఆ ముగ్గురిపై చేసిన ఫిర్యాదుపై విచారణ జరిగినా ఇప్పటికీ నానుతోంది. వరంగల్, హైదరాబాద్లో విలాసవంతమైన భవనాలను నిర్మించడంతోపాటు ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగుచూడడంతో స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు కూడా ఆయన దరఖాస్తు చేసుకున్నారు. చివరకు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు చేయడం చర్చనీయాంశమవుతోంది.ఏసీబీ దాడులు చేస్తున్నా వెరవని అవినీతి అధికారులు2024లో భూసేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై వరంగల్ ఆర్డీఓ సిడాం దత్తును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.అంతకుముందు వరంగల్ జిల్లా సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్లో ఏకంగా సంయుక్త పాలనాధికారి సీసీ రూ 45 వేలు తీసుకుంటూ అడ్డంగా దొరికాడు.హనుమకొండ జిల్లా నడికూడ మండల ఆర్ఐ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.భూపాలపల్లిలో రెవెన్యూ అధికారులకు లంచమివ్వాలని, లేదంటే తమ పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని వృద్ధ దంపతులు భిక్షాటన చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.వెంకటాపూర్లో ఓ రైతు తనకున్న భూమిని పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి, చివరకు విసిగిపోయి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఇలా ఆరోపణలు వచ్చిన పలువురిపై బదిలీలు, సస్పెన్షన్, వీఆర్లో వేటు పడినా.. రాజకీయ పలుకుబడితో మళ్లీ కీలక మండలాల్లో పోస్టింగ్లు తెచ్చుకుని అదే తంతు కొనసాగిస్తున్నారు.నాలుగేళ్లలో అవినీతి నిరోధక శాఖ ఉమ్మడి జిల్లాలో 66కు పైగా వివిధ శాఖలకు చెందిన వారిని పట్టుకుంది. అందులో రెవెన్యూ శాఖదే అగ్రస్థానం ఉండడం గమనార్హం. అయినా ఆ శాఖలో పని చేస్తున్న కొందరిలో మార్పు రావడం లేదన్న చర్చ జరుగుతోంది.ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఫైళ్లు స్వాధీనంఖిలా వరంగల్: వరంగల్ ఫోర్ట్రోడ్డులోని ఖిలా వరంగల్ తహసీల్ధార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. బీరువా, కౌంటర్లు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతీ ఫైల్ను పరిశీలించి కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మండల ఏర్పాటు నుంచి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ధ్యాన్చంద్ను స్ఫూర్తిగా తీసుకోవాలి
● ఎంపీ డాక్టర్ కడియం కావ్య వరంగల్ స్పోర్ట్స్: భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ను ప్రతీ క్రీడాకారుడు స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జేఎన్ఎస్లో శుక్రవారం ధ్యాన్చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కావ్య హాజరయ్యారు. ముందుగా ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి సహకారంతో క్రీడా సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు. డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ మాట్లాడుతూ.. ధ్యాన్చంద్ చరిత్రను నేటి క్రీడాకారులకు తెలియజేసేందుకు వారం పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించామన్నారు. క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజీజ్ఖాన్, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు తోట శ్యాంప్రసాద్, మర్కాల యాదిరెడ్డి, పీడీ, పీఈటీ, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
బండి సంజయ్పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించం
● బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డిహన్మకొండ: కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్పై వ్యక్తిగత దూషణలు చేస్తే సహించేది లేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మంత్రి బండి సంజయ్కుమార్ను విమర్శించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ముందు ఏదో ఒక రాగం ఎత్తుకునే రాహుల్ గాంధీ బిహార్ ఎన్నికల ముందు ఓటు చోరీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, ఓటు చోరి జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి స్థాయికి మించి మాట్లాడుతున్నారన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రావుల కిషన్, కార్పొరేటర్లు రావుల కోమల, గుజ్జుల వసంత, నాయకులు సండ్ర మధు, గుజ్జుల మహేందర్రెడ్డి, శేషగిరి రావు, వేణు, శ్రావణ్, కుమారరాజు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి జంగ్ సైరన్..
ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హన్మకొండ అర్బన్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు పూర్తి కావొస్తున్నా.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవట్లేదని, ఉద్యోగుల సమస్యల సాధనకు జంగ్ సైరన్ మోగిస్తామని ఉద్యోగ సంఘాల జేఎసీ నాయకులు తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని టీఎన్జీఓస్ భవన్లో ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆకుల రాజేందర్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈసందర్భంగా రాజేందర్ మాట్లాడు తూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నేతలుగా తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యాచరణ ప్రకారం.. హనుమకొండ జిల్లా నుంచి సెప్టెంబర్ 8న బస్సు యాత్ర మొదలవుతుందని, అందులో రాష్ట్ర జేఏసీ మొత్తం హనుమకొండకు చేరుకుంటుందన్నారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 12న లక్ష మంది ఉద్యోగులతో చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం ద్వారా మన నిరసనను పెద్ద ఎత్తున తెలియజేయాలని పేర్కొన్నారు. ఈసందర్భంగా పెన్షన్ విద్రోహ దినం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం నేత అన్నమనేని జగన్ మోహన్ రావు, జేఏసీ నేతలు తిరుపతిరెడ్డి, ప్రవీ ణ్కుమార్, ఆకవరపు శ్రీనివాస్కుమార్, పెండెం రాజు, కట్కూరి శ్రీనివాస్, రాజ్కుమార్, రియాజొద్దీన్, సీతారాం, సర్వర్ హుస్సేన్, కుందూరు గోపాల్రెడ్డి, బైరి సోమయ్య, రవి ప్రకాశ్, విజయ్ మోహన్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
గణపతి నిమజ్జన ఏర్పాట్లు ముమ్మరం చేయాలి
ఆత్మకూరు: గణపతి నిమజ్జన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వరంగల్ ఈస్ట్ జోస్ డీసీపీ అంకిత్కుమార్ అన్నారు. మండలంలోని కటాక్షపూర్లో బుధవారం సాయంత్రం డీసీపీ అంకిత్కుమార్ పరకాల ఏసీపీ సతీశ్బాబుతో కలిసి చెరువు వద్ద నిమజ్జనం కోసం ఏర్పాట్లు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. గణపతి మండపాలను ఆన్లైన్ చేసుకునేలా నిర్వాహకులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోశ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన సీపీ
వరంగల్ క్రైం/వరంగల్ అర్బన్: వచ్చే నెల 5న ట్రై సిటీ పరిధిలో నిర్వహించే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి హనుమకొండ ప్రాంతంలో గణేశ్ ప్రతిమల నిమజ్జనం జరిగే కాజీపేట బంధం చెరువు, హనుమకొండ సిద్ధేశ్వర గుండం, హసన్పర్తి చెరువు, కట్టమల్లన్న, చిన్నవడ్డేపల్లి చెరువు తదితర ప్రాంతాల్లో గురువారం పోలీస్ అధికారులతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లపై క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో సీపీ సమీక్షించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సిన క్రేన్లు, సిబ్బంది నియామకం, విద్యుత్ ఏర్పాట్లు, బారికేడ్ల నిర్మాణం, తెప్పల ఏర్పాటుపై అధికారులతో చర్చించారు. ఏర్పాట్ల పరిశీలనలో వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్పాయ్, సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీ ప్రభాకర్రావు, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ ఏసీపీలు జితేందర్రెడ్డి, సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు సుధాకర్రెడ్డి, వెంకన్న, పోలీస్ అధికారులు ఉన్నారు. విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో–ఆర్డినేటర్ అనగోని సదానందం తెలిపారు. ఆయా పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈఏడాది అక్టోబర్ 6 నుంచి 13 వరకు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఓపెన్ స్కూల్, టెన్త్, ఇంటర్ విద్యార్థులు థియరీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జేఎన్ఎస్లో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ పనుల్ని గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈసందర్భంగా స్టేడియం ఆవరణలోని హాస్టల్ భవనం, ఔట్ డోర్ క్రీడా మైదానాలు, గదుల్ని పరిశీలించారు. డీవైఎస్ఓ గుగులోతు అశోక్కుమార్ను మౌలిక వసతులు, తరగతి గదుల ఏర్పాట్ల అంశాలు అడిగి తెలుసుకున్నారు. ఈనెల 31లోగా క్రీడాకారులకు అవసరమైన వసతులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్నేహ శబరీష్ వెంట అధికారులు సురేశ్, నరేందర్రెడ్డి, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది ఉన్నారు. కాజీపేట: కాజీపేట మున్సిపల్ సర్కిల్ కార్యాలయం–2లో ఉన్న సివిల్ డిస్పెన్సరీని గురువారం డీఎంహెచ్ఓ ఎ.అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిస్పెన్సరీలో రోగుల ఓపీ సేవలు, ఫార్మసీ, ఉద్యోగుల హాజరు తదితర రికార్డులు పరిశీలించారు. సిబ్బందికి వైద్య సేవలు, రికార్డుల నిర్వహణపై సూచనలిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ జయకృష్ణ, పద్మజ, సుశీల, సల్మా, పద్మజ సిబ్బంది పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: భారీ వర్షాల నేపథ్యంలో కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదా వేసినట్లు గురువారం పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. కేయూ పరిధి బీఫార్మసీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు, ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ పరీక్షలు, ఎల్ఎల్బీ ఐదేళ్ల ఆరో సెమిస్టర్ పరీక్షలు, ఎంఈడీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు తెలిపారు. దూరవిద్య డిగ్రీ ఇయర్ వైజ్ స్కీం మొదటి, ద్వితీయ, తృతీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు సైతం వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 30 నుంచి ఆయా కోర్సుల పరీక్షలు టైంటేబుల్ ప్రకారమే యథావిఽధిగా జరగుతాయని తెలిపారు. ఈనెల 28, 29 తేదీల్లో జరగాల్సి ఉండగా.. వాయిదాపడిన పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. -
భారీ వర్షం.. అప్రమత్తం
● జిల్లాలో కుండపోత ● ఇళ్లల్లోకి చేరిన వరద నీరు ● కమలాపూర్ మండలంలో 4.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కమలాపూర్/పరకాల: జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. దారులన్నీ జలమయమయ్యాయి. చెరువులు మత్తళ్లు దుంకాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. కమలాపూర్ మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని పలు గ్రామాల్లో కాలనీలు జలమయమయ్యాయి. కమలాపూర్లోని బస్టాండ్ ప్రాంతంలో హుజూరాబాద్–పరకాల ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరి వాగును తలపించింది. వరద, వర్షపు నీరు వెళ్లేందుకు అనువైన డ్రెయినేజీలు లేక ఆ నీరంతా ఇళ్లు, వ్యాపార దుకాణాల్లోకి చేరింది. ఇళ్లల్లోకి చేరిన వరద నీటిని స్థానికులు బయటకు ఎత్తి పోశారు. కొన్నేళ్లుగా భారీ వర్షం కురిసిన ప్రతీసారి వర్షపు, వరద నీరంతా ఇళ్లల్లోకి చేరి బస్టాండ్ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతుండగా.. వరద నీరు రాకుండా కొందరు డ్రెయినేజీలు మూసివేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా 4.26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. పరకాలలో.. ఎడతెరిపి లేకుండా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పరకాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఎస్సీ కాలనీ, మల్లారెడ్డి పల్లె, మమత నగర్, శ్రీనివాసకాలనీ, రాంనగర్ కాలనీల్లోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. వెంటనే మున్సిపల్ ఉద్యోగులు అప్రమత్తమై జేసీబీ ద్వారా కాల్వల్లో వరద నిలిచిపోకుండా చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ సుష్మ పలు కాలనీల్లో పర్యటించారు. చాలా మంది శిథిలమైన ఇళ్లను వదిలిపెట్టకపోవడంపై ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఒకవైపు భారీ వర్షాలు కురుస్తుంటే వాటిలోనే నివాసం ఉంటామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. రోజుల తరబడి నానితే గోడలు కూలిపోతాయని, తక్షణవే ఆయా ఇళ్లను వదిలిపెట్టి బంధువులు, మిత్రుల నివాసాలకు వెళ్లాలని సూచించారు. చలివాగు ప్రాజెక్టు పరిశీలన.. శాయంపేట : జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టును నీటిపారుదల ములుగు చీఫ్ ఇంజనీర్ కుమారస్వామి గురువారం పరిశీలించారు. ప్రాజెక్టులోని నీటి మట్టాన్ని అంచనా వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎగువన కురిసిన వర్షాలతో చలివాగు ప్రాజెక్టు నిండుకుండలా ప్రవహిస్తోందని, సమీప గ్రామస్తులు ప్రాజెక్టులో దిగవద్దని తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమృత్ ఉన్నారు. ఆకాశానికి దూదిపూలు పూసినట్లుగా మేఘాలు కమ్ముకొచ్చాయి. తరలిపోతున్న మేఘాలు చూపరులను కట్టిపడేశాయి. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్ జాతీయ రహదారిలో కనిపించిన ఈ సుమధుర దృశ్యాన్ని గురువారం ‘సాక్షి’ క్లిక్మనిపించింది. – సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ హనుమకొండ -
ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: జిల్లాలోని ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలు ప్రత్యేక దృష్టితో కృషి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం, ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యార్థుల నమోదు సంఖ్య పెంచడం, తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల రోజువారీ ఎఫ్ఆర్ఎస్ హాజరుశాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలకు రాని విద్యార్థుల గైర్హాజరుకు కారణాలు తెలియజేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ సరైన రీతిలో నమోదు చేయాలన్నారు. తరగతి గదిలో ప్రతీ విద్యార్థిని పరిశీలించి అభ్యసన సామర్థ్యాలను గురించి ఉపాధ్యాయులు అడిగి తెలుసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ వాసంతి తదితరులు పాల్గొన్నారు. బోధనలో ప్రమాణాలు పెంచాలి.. న్యూశాయంపేట: విద్యాబోధనలో ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆమె మాట్లాడారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఎంఈఓలను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీలో భాగంగా బేస్లైన్ రిజల్ట్స్ ను తెలంగాణ స్కుల్ యాప్లో ఆన్లైన్ చేయాల న్నారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, డీఈఓ రంగయ్యనాయుడు, సుజన్తేజ పాల్గొన్నారు. -
విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్ఓ అప్పయ్య శాయంపేట: ప్రజలు విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని, వైద్య సిబ్బంది మందుల పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూసుకోవాలని డీఎంహెచ్ఓ అప్పయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, పత్తిపాక, ప్రగతి సింగారంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను సందర్శించి రికార్డులు, మందులు పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఐరన్ సిరప్, యాంటీబయాటిక్ సిరప్లు కొన్ని చోట్ల ఇవ్వట్లేదని కలెక్టర్ దృష్టికి రాగా శాయంపేటలో ఉన్నాయా లేదా.. పరిశీలించి ఫార్మసిస్టులతో మాట్లాడారు. అనంతరం పత్తిపాక ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో నిర్వహిస్తున్న వ్యాధి నిరోధక టీకాలు పరిశీలించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ఎంత మందికి పరీక్షలు చేశారో తెలుసుకున్నారు. ఈసందర్భంగా డాక్టర్ అప్పయ్య మాట్లాడుతూ.. విష జ్వరాలపై వైద్యులు సిబ్బందితో సర్వే చేయించి ఎప్పటికప్పుడు వైద్యం అందించాలన్నారు. ఏ గ్రామంలో ఎక్కువ జ్వరాలు వస్తే అక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండడంతో పాటు సిబ్బంది ప్రతీరోజు 25 ఇళ్లను సందర్శించడంతో పాటు డ్రైడేపై అవగాహన కలిగించాలన్నారు. టెస్టింగ్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణ, ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. -
వలకు చిక్కిన కొండచిలువ
నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం శివారు గూడెం చెరువు మత్తడిలో కొండచిలువ కనిపించింది. గ్రామానికి చెందిన మత్స్యకారుడు మేడమీది రాజు చేపల కోసం బుధవారం రాత్రి కచ్చువల వేశాడు. గురువారం వెళ్లి చూసేసరికి కచ్చువలలో కొండచిలువ మృతి చెంది కనిపించింది. స్థానికులు మృతి చెందిన కొండచిలువను ఆసక్తిగా తిలకించారు. గ్రామాలకు పంచాయతీ కార్యదర్శుల నియామకంనర్సంపేట: గ్రామాలకు డిప్యుటేషన్, ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శులను నియమిస్తూ కలెక్టర్ సత్యశారద ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం పంచాయతీ కార్యదర్శి బి.అవినాశ్ను జల్లి గ్రామానికి ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శిగా, బోడ మాణిక్యంతండా పంచాయతీ కార్యదర్శి కె.రంజిత్కుమార్ను చెరువుకొమ్ముతండా ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శిగా, ఖాదర్పేట పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎన్.వీరన్నను సంగెం మండలం నార్లవాయి పంచా యతీ కార్యదర్శిగా డిప్యుటేషన్,నార్లవాయి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం.రమేశ్ ను ఖాదర్పేట పంచాయతీ కార్యదర్శిగా డిప్యుటేషన్పై బదిలీ చేశారు. కార్యదర్శులు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్ ఆదేశించారు. క్లీన్ ఓటరు జాబితాలు తయారు చేయాలి : ఎమ్మెల్యేవర్ధన్నపేట: గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించిన ఫొటో ఓటర్ల జాబితాలను కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు, సమన్వయ కమిటీ సభ్యులు, బూత్ కమిటీ సభ్యులు, వివిధ స్థాయిల పార్టీ శ్రేణులు పరిశీలించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30 వరకు అధికారులకు అందజేసి క్లీన్ ఓటరు జాబితాల తయారీకి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ మేరకు స్వీకరించిన అభ్యంతరాలను 31న పంచాయతీలు, వార్డుల వారీగా గ్రామాల్లో ప్రదర్శిస్తారని, అనంతరం సవరించిన తుది ఓటరు జాబితాలను సెప్టెంబర్ 2న విడుదల చేస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సాక్షి, వరంగల్: జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. దీంతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ వచ్చింది. చెరువుల్లోకి నీరు చేరడంతో వినాయక నిమజ్జనానికి ఇబ్బందులు లేవని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం ఐదు గంటల వరకు వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. వర్ధన్నపేట 50 మిల్లీమీటర్లు, నల్లబెల్లి 42.9, దుగ్గొండి 37.3, నెక్కొండ 30.2, పర్వతగిరి 27.5, రాయపర్తి 26.5, ఖానాపురం 20.8, చెన్నారావుపేట 20, నర్సంపేట 17.8, సంగెం 15.3, వరంగల్ 12.5, గీసుకొండ 10.3, ఖిలావరంగల్లో 6.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతివిద్యారణ్యపురి: జిల్లాలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ)గా పదోన్నతి కల్పిస్తూ గురువారం రాత్రి డీఈఓ రంగయ్యనాయుడు ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో 129 స్కూల్ అసిస్టెంట్ల కేటగిరీలో ఖాళీలు ఉన్నాయి. అందులో 47 మంది ఏస్ఏలకు అర్హులైన ఎస్జీటీలు లేకపోవడంతో 82 మంది ఎస్జీటీలకు 1:1 నిష్పత్తిలో వెబ్ ఆప్షన్లకు మంగళవారం రాత్రి అవకాశం కల్పించారు. కలెక్టర్ అప్రూవల్ మేరకు డీఈఓ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు 15 రోజుల సమయం ఉంటుంది. ఈనెల 29న ఎక్కువ మంది జాయిన్ అవుతారని భావిస్తున్నారు. ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి’నర్సంపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆర్టీసీ బీసీ ఉద్యోగుల సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గొలనకొండ వేణు గురువారం ఒక ప్రకటనలో కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆర్టీసీ కార్మికులు క్రియాశీలకంగా పనిచేశారని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ విస్మరించడం బాధాకరం అన్నారు. ఆర్టీసీలో ప్రభుత్వ విలీనం 90 శాతం పూర్తయిందని, ఒకే ఒక్క కలం పోటుతో విలీనం తేదీ కోసం 40 వేల మంది ఆర్టీసీ కార్మికులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. -
బండి సంజయ్పై వ్యాఖ్యలు సరికాదు
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్వరంగల్ చౌరస్తా: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్పై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ విమర్శించారు. వరంగల్ చౌరస్తాలోని బీజేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలో 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉండి ఏం లాభమని ప్రశ్నించారు. కుట్రపూరితంగా 10 శాతం ముస్లింలను కలుపుకుని అంతా బీసీ రిజర్వేషన్లే అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిపై నాయిని చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంజీఎం ఆస్పత్రి దయనీయంగా మారినా కనిపించడం లేదా అని రవికుమార్ నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీశ్, రత్నం సతీశ్షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేశ్, కోశాధికారి కూచన క్రాంతికుమార్, అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేశ్ పాల్గొన్నారు. -
పింఛన్ల పెంపు హామీ నెరవేర్చాలి
● ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గీసుకొండ/వర్ధన్నపేట: ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ పెంచకుంటే సెప్టెంబర్ 9న హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభలో తమ గళం విప్పుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. గీసుకొండ మండలం ఎస్ఎస్ గార్డె న్స్, వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డులోని ఓ ఫంక్షన్హాల్లో దివ్యాంగులతో గురువారం వేర్వేరుగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీ రుపై మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడడం లేదని మండిపడ్డారు. రెండో కుమారుడు ఎకై ్సజ్ కానిస్టేబుల్ అయిన యుగేందర్ పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి నమ్మబలికి తన పది గుంటల భూమిని పట్టా చేయించుకున్నాడని నల్లబెల్లి మండలం రుద్రగూడేనికి చెందిన వృద్ధురాలు లద్దునూరి సూరమ్మ గోడును మంద కృష్ణకు వినిపించింది. -
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థులు
వర్ధన్నపేట: రాష్ట్రస్థాయి యోగా పోటీలకు మండలంలోని ఇల్లంద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్ఎం ఎం.విజయ తెలిపారు. ఈనెల 25న హనుమకొండలోని షిర్డీ సాయిబాబా మందిరంలో జరిగిన సబ్ జూనియర్స్థాయి పోటీల్లో విద్యార్థులు రాధిక, వెన్నెల, నిహారిక, గీతాంజ లి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ట్రెడిషనల్, ఆర్టిస్టిక్ పేర్, రిథమిక్ పేర్, సప్నైన్ విభాగాల్లో మొదటి బహుమతి, ఐదు బంగారు పతకాలు గెలిచినట్లు పేర్కొన్నారు. అలాగే, సంకీర్తన, సాయిరామ్ రజత పతకాలు, చరణ్ కాంస్య పతకం గెలిచినట్లు వివరించారు. బంగారు పతకాలు సాధించిన నలుగురు విద్యార్థులు సెప్టెంబర్ 5,6,7 తేదీల్లో నిర్మల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈ మేరకు పతకాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణ, మమత, సర్వన్, ఉమాదేవి, శోభారాణి, రాజు, కిశోర్, అంజయ్య, శ్రీధర్, జ్యోతి, స్వామి, పీడీ భవాని పాల్గొన్నారు. -
ఈసారి ఆలస్యమే!
చేపపిల్లల టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ● రెండేళ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ ● జిల్లాలో పేరుకుపోయిన రూ.1.50 కోట్ల బకాయిలు ● ఈ నెల 30 వరకు టెండర్లు వేయడానికి చివరి తేదీ జిల్లాలో మొత్తం చెరువులు : 702మొత్తం చెరువుల నీటి విస్తీర్ణం : 12,910 హెక్టార్లు చెరువుల్లో వదలాల్సిన చేపపిల్లలు : 1.90 కోట్లు మత్స ్య సంఘాలు : 184మత్స ్య సంఘాల్లోని సభ్యులు : 15,741 మంది గీసుకొండ: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేసే ప్రక్రియ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. అసలు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈనెల18 నుంచి 30 వ రకు టెండర్లు దాఖలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని ఇటీవల రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహ రి హైదరాబాద్లో ప్రకటించారు. ఈవిషయమై ఆన్లైన్లో టెండర్ల దరఖాస్తులు స్వీకరించడానికి మ త్స్యశాఖ సిద్ధం కాగా..కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. గడిచిన రెండేళ్ల నుంచి తమకు రావాల్సిన బకాయిలను చెల్లిస్తేనే ముందుకు వస్తామని వారు అంటున్నారు. తమవద్ద కనీసం టెండర్ దరఖాస్తు చేసేందుకు డబ్బులు లేవని వారు వాపోతున్నారు. ఈవిషయమై తమకు రావాల్సిన బకా యిలను తక్షణమే ఇప్పించాలంటూ పలు జిల్లాల కాంట్రాక్టర్లు గురువారం హైదరాబాద్లోని మత్స్యశాఖ కార్యాలయం ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. జిల్లా పరంగా చూస్తే కాంట్రాక్టర్లకు రెండేళ్లకు సంబంధించిన సుమారు రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెబుతున్నారు. సరైన సమయంలో వదిలితేనే ఎదుగుదల.. ఉచిత చేపపిల్లల పంపిణీలో ఆలస్యం చేస్తే తగిన లబ్ధి చేకూరడం లేదని,మత్స్యకారులు చెబుతున్నా రు. కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే చేపపిల్లలను ఆగస్టులోపు చెరువుల్లో వదలాల్సి ఉంటుందని,అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృద్ధిచెంది చేతికొస్తాయని చెబుతున్నారు. అలాంటి చేపలకు మార్కెట్లో మంచి ధర వస్తుందని,వాటిని ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ, గతంలో ఆలస్యంగా చేపపిల్లలను పంపిణీ చేయడంతో సరిగా ఎదుగుదల లేక మత్స్యకారులకు పెద్దగా లాభం చేకూరలేదు. గత ఏడాది సగం చేపపిల్లలే పంపిణీ గత ఏడాది వర్షాకాలంలో జిల్లాలోని చెరువుల్లో లక్ష్యం మేరకు కాకుండా అందులో సగమే చేపపిల్ల లను మత్స్య సంఘాలకు పంపిణీ చేశారు. జిల్లాలో సుమారు 1.93 కోట్ల చేపప్లిలను పంపిణీ చేయాల్సి ఉండగా అందులో సగమే.. అదికూడా చాలా ఆలస్యంగా పంపిణీ జరిగిందని మత్య్ససంఘాల నాయకులు అంటున్నారు. గత ఏడాది రెండు ఏజెన్సీలు టెండర్లను దక్కించుకుని చేపపిల్లలను అందించాయి. అయితే, చేపపిల్లలు చాలా చిన్న సైజులో నాసిరకంగా ఉండడం, అదును దాటిన తర్వాత ఆలస్యంగా చెరువుల్లో పోయడంతో పెద్దగా ఎదగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు నష్టం తప్ప లాభం రాదని చెబుతున్నారు. పలు మత్స్యసంఘాల వారు ఇప్పటికే ప్రైవేట్లో కొనుగోలు చేసి చెరువుల్లో చే పపిల్ల లను వదిలారు. నగదు బదిలీ చేస్తే తామే మేలైన రకం చేపపిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో పోసుకుంటామని వారు పేర్కొంటున్నారు,వంద శాతం సబ్సిడీపై 2016లో ఉచిత చేపపిల్ల ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సకాలంలో ఏ ఒక్క ఏడాది కూడా చెరువులకు చేప పిల్లలు చేరిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా చేపపిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో టెండర్లను ఖరారు చేయాల్సి ఉండగా ప్రతీ ఏడాది ఇదే తంతు కొనసాగుతోంది. దీంతో చేపపిల్లల సరఫరా, చెరువుల్లో పోయ డం అలస్యం అవుతోంది. అయితే, వచ్చే నెల ఒకటో తేదీన టెండర్లు తెరుస్తామని, అప్పుడు ఎవరు టెండర్లు వేశారో తెలుస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి నాగమణి తెలిపారు. -
ముమ్మరంగా రోడ్ల నిర్మాణ పనులు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట/నెక్కొండ: నియోజకవర్గంలో ముమ్మరంగా రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట, చెన్నారావుపేట మండలంలోని పాపయ్యపేట, లింగగిరి, నెక్కొండ మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నర్సంపేట మండల అధ్యక్షుడు సిద్ధన రమేశ్, జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మొగిలి వెంకట్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు బండి హరీశ్, టీపీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, నెక్కొండ, నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్లు రావుల హరీశ్రెడ్డి, పాలాయి శ్రీనివాస్, కాంగ్రెస్ నెక్కొండ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బక్కి అశోక్, కుసుమ చెన్నకేశవులు, ఉపాధ్యక్షులు గరికపాటి హన్మంతరావు, పొలివెట్టి భానుప్రకాశ్, పట్టణ అధ్యక్షుడు ఈదునూరి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ సమావేశపు హాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి గురువారం నిర్వహించిన ట్రాన్స్జెండర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆధార్కార్డు లేనివారికి కార్డులు ఇవ్వాలని, కార్డులో పేరు, జెండర్ మార్పునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వారందరికీ గుర్తింపుకార్డులు, రేషన్కార్డులు అందజేస్తామని తెలిపారు. కార్మికశాఖ ద్వారా లేబర్కార్డులు, దివ్యాంగ ట్రాన్స్జెండర్లకు పింఛన్లు మంజూరు చేస్తామని వివరించారు. ఎంజీఎం ఆస్పత్రిలో వారంలో ఒకసారి ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. స్వశక్తి మహిళా తరహాలో సంఘాలుగా ఏర్పడితే వ్యాపార యూనిట్లకు రుణాలు అందిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ, రాంరెడ్డి, డీడబ్ల్యూఓ రాజమణి, ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీ అడ్వైజర్ ఈవీ శ్రీనివాస్రావు, ట్రాన్స్జెండర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి లైల, సభ్యులు అశ్విని రీమిష, పూర్ణిమారెడ్డి, నక్షత్ర త్రిపుర, శాస్త్రి, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు. బోధనలో ప్రమాణాలు పెంచాలివిద్యాబోధనలో ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయులు చొరవచూపాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్లో గురువారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని ఎంఈఓలను ఆదేశించారు. స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీలో భాగంగా బేస్లైన్ రిజల్ట్స్ను తెలంగాణ స్కుల్ యాప్లో ఆన్లైన్ చేయాలని, ఎఫ్ఏ–1 మార్కులను సీసీఈ వెబ్పోర్టల్లో వెంటనే అప్లో డ్ చేయాలని సూచించారు. సమావేశంలో డీఆర్ఓ విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖాధికారి రంగయ్యనాయుడు, సుజన్తేజ, అధికారులు పాల్గొన్నారు. -
న్యాయ సేవల క్లినిక్లను వినియోగించుకోవాలి
వరంగల్ లీగల్: రక్షణ సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు న్యాయ సేవల క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ జస్టిస్ అపరేష్కుమార్సింగ్ తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.సామ్కోషి, న్యాయమూర్తి కె.లక్ష్మణ్తో కలిసి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో న్యాయ సేవల క్లినిక్లను సైనిక్ వెల్ఫేర్ ఆఫీసుల్లో మంగళవారం వర్చువల్గా ప్రారంభించారు. హనుమకొండ వడ్డేపల్లిలోని సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి హాజరైన వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు వీబీ నిర్మలా గీతాంబ, డాక్టర్ పట్టాభి రామారావు మాట్లాడుతూ న్యాయ సేవల క్లినిక్లో శిక్షణ పొందిన ప్యానల్ న్యాయవాది, పారా లీగల్ వలంటీర్లు ఇందిరా వైశాలి, వై.హనుకాంత్ సేవలందిస్తారని తెలిపారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ సత్యశ్రీ, న్యాయమూర్తులు, మాజీ సైనికులు, తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: అంగన్వాడీ కేంద్రాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. కేంద్రాల్లో అందిస్తున్న సేవల రికార్డుల నిర్వహణ సరిగా నిర్వహించాలని, మూడు నెలల పూర్తి సమాచారంపై నివేదిక అందించాలన్నారు. సమావేశంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి జయంతి, ిసీడీపీఓలు విశ్వజ, స్వాతి, స్వరూప, పోషణ్ అభియాన్ అధికారులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తులు వేగంగా పరిష్కరించండిశాయంపేట: మండలంలోని వివిధ గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారానికి వచ్చిన భూ భారతి దరఖాస్తుల్ని వేగవంతంగా పరిష్కార చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది కార్యాలయానికి రాకపోవడంతో మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఎదుట 15 నిమిషాల వరకు కలెక్టర్ వాహనంలో వేచి చూశారు. ఆలస్యంగా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు పరిశీలించారు. అనంతరం మండలంలోని రైతులు భూ సమ్యలపై కలెక్టర్కు వినతుల అందించారు. ఆమె వెంట పరకాల ఆర్డీఓ నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ ప్రభావతి, కార్యాలయ సిబ్బంది ఉన్నారు. -
సిద్ధమైన గ్రేటర్ వరంగల్
బుధవారం శ్రీ 27 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఆది దేవుడి ఆగమనానికి గ్రేటర్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకులు మండపాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేక నైవేద్యాల నడుమ గణనాథుడు నేడు(బుధవారం) పూజలందుకోనున్నాడు. పత్రి, పూలు, పండ్లు, కొబ్బరికాయ, నైవేద్యాలతో వినాయకుడు కొలువుదీరనున్నాడు. గణేశుడి ప్రతిమలు, పూజ సామగ్రి కొనుగోళ్లతో కాజీపేట, హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో మంగళవారం రద్దీ నెలకొంది. ఎంజీఎం సమీపంలో రోడ్డుకు ఇరువైపులా గణనాథుల విగ్రహాల విక్రయంమట్టి ప్రతిమలను పూజిద్దాంపోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వరంగల్ క్రైం: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సిబ్బందికి సూచించారు. వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వరంగల్ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా బుధవారం సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్రావు, ఏసీపీలు జితేందర్రెడ్డి, వెంకటేశ్, నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు సతీశ్, శ్రీధర్, స్వర్జన్ రాజు, ఆర్ఎస్ఐ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. ● నగరంలో వాడవాడనా మండపాలు ● విద్యుత్ దీపాలతో అలంకరణ ● జోరుగా పూజసామగ్రి, విగ్రహాల కొనుగోళ్లు ● ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు, అధికారులు ● నేటి నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభం వేయిస్తంభాల ఆలయంలో.. హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మహాగణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ డి.అనిల్కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. బుధవారం ఉదయం విగ్రహదాత శ్రీకుమార్ రేమండ్స్ షోరూం అధినేత వెనిశెట్టి సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. ఉత్సవ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ టి.మధుసూదన్ హన్మకొండ: గణపతి నవరాత్రి ఉత్సవ నిర్వాహకులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ ఆపరేషన్ డైరెక్టర్ టి.మధుసూదన్ సూచించారు. మంగళవారం హనుమకొండలో గణపతి నవరాత్రి ఉత్సవ మండపాలను హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా నిర్వాహకులు, ఎలక్ట్రిషియన్లకు పలు సూచనలిచ్చారు. రామన్నపేట: ఖైరతాబాద్ గణపతి తర్వాత వరంగల్లోని ఎల్లంబజార్లో అదే తరహాలో మహాగణపతి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది ఈ మండపాల నిర్వహకులు ఆకుతోట సంజీవ్ 40 ఫీట్లతో మట్టి గణపతి ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దానికి అదనంగా మరో ఐదు ఫీట్లకు పెంచి ప్రస్తుతం 45 ఫీట్లతో ఈ గణపతి ప్రత్యేకంగా తయారు చేయించారు. 15 మంది కార్మికులు 30 రోజుల పాటు శ్రమించి గణపతి విగ్రహాన్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించారు. -
కేఎంసీ ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మెన్స్, ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎదుట కూర్చొని నినాదాలు చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వేతనాలు బకాయిగా ఉన్నాయని, అధికారులు చేసిన తప్పులకి కార్మికులు బలవుతున్నారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ – హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లపెల్లి సుధాకర్, కార్మికులు అల్లం రమేశ్, రాణి, రాజకుమారి, అతిక్, రాము, మంద కవిత, రవి బాబు, యాకయ్య, సునీత, జ్యోతి, ప్రకాశ్, పరమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
కేఎంసీ వసతి గృహాల్లో చెత్త తొలగింపు
ఎంజీఎం: కేఎంసీలోని వసతి గృహాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం తొలగించారు. ‘కేఎంఛీ’ శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనంపై రాష్ట్ర వైదారోగ్యశాఖ మంత్రి కార్యాలయం ఆరా తీసింది. మంత్రి పేషీ అధికారులు, డీఎంఈ సైతం సమస్య తీవ్రతను గ్రహించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కేఎంసీ ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ప్రత్యేక కార్మికులతో వసతి గృహాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగింపజేశారు. దోమలు, ఈగలతో వైద్యవిద్యార్థులు విషజ్వరాల బారిన పడకుండా దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యఅనిల్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలకు సంబంధించిన బడ్జెట్ మంజూరు కోసం కలెక్టర్తోపాటు డీఎంఈ దృష్టికి తీసుకెళ్లాం. రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కారమయ్యేలా కలెక్టర్ కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. -
పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తలు
నడికూడ: మండలంలోని కంఠాత్మకూర్లో పత్తి, వరి, పసుపు పంటలను తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, వరంగల్ శాస్త్రవేత్తల బృందం మంగళవారం మండల వ్యవసాయ అధికారి పోరిక జైసింగ్తో కలిసి పంట క్షేత్రాలను పరిశీలించింది. ఈసందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త, కో–ఆర్డినేటర్ డాక్టర్ విజయ్భాస్కర్ మాట్లాడుతూ.. పత్తి పంటకు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు వేపనూనే ఎకరాకు లీటర్ మందు చొప్పున లేదా అసిఫేట్ ఎకరాకు 300 గ్రాముల చొప్పున పిచికారీ చేయాలన్నారు. ఆలస్యంగా విత్తిన పత్తిలో 1:20 నిష్పత్తిలో ఫ్లునికామైడ్ మందును నీటిలో కలుపుకుని బొట్టు పెట్టే పద్ధతి ద్వారా లేదా కాండానికి పూసుకోవాలని సూచించారు. ఆలస్యంగా వరి సాగు చేసేవారు స్వల్పకాలిక రకాలను సాగు చేయాలని, గడ్డి జాలి కలుపు మొక్కల నివారణకు ఫినాక్సి ప్రాప్ ఈథైల్ మందును ఎకరానికి 350 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచాకారీ చేయాలన్నారు. పసుపు పంటలో అధిక వర్షాల వలన దుంప కుళ్లు, దుంప పుచ్చు ఆశించే అవకాశం ఉందని, నివారణకు వర్షపు నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాజ్కుమార్, విశ్వతేజ, ఏఈఓ గోపీనాఽథ్, అభ్యుదయ రైతులు తదితరులు పాల్గొన్నారు. -
నిట్ ఉన్నతిలో భాగస్వాములు కావాలి
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ క్యాంపస్ను అన్ని రంగాల్లో అగ్రభాగంలో నిలుపుతూ, ప్రపంచ స్థాయిలో కీర్తి ప్రతిష్టలను నిలిపే భాగస్వాములుగా నూతన విద్యార్థులు నిలవాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ తెలిపారు. నిట్లో ప్రవేశం పొందిన యూజీ 1,245 మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు నిట్ వరంగల్ ఆడిటోరియంలో మంగళవారం ఓరిఝెంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ముఖ్య అతిథిగా పాల్గొని ‘సాంకేతిక విద్యకు మణిహారంగా నిలుస్తున్న నిట్ వరంగల్కు స్వాగతం’ అంటూ విద్యార్ధులను ఆహ్వానించారు. విద్యతోపాటు మానవీయ విలువలను పెంపొందించుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా రాణించాలని అన్నారు. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ -
హామీలు అమలుచేయాలి
● ఉద్యమకారుల పోస్టుకార్డు ఉద్యమంరాయపర్తి: ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు రజినీకాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని పోస్టాఫీస్లో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ 2023లో ఇచ్చిన ఎన్నికల మేని ఫెస్టోను అమలు చేయాలని రాహుల్గాంధీకి పోస్టు కార్డులు పంపారు. ఉద్యమకారులకు ఇంటిస్థలం, 25వేల పెన్షన్, పదివేల కోట్లతో సంక్షేమనిధి ఏర్పాటు, ప్రజాపథకాలలో 20శాతం వాటా కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎనగందుల శ్యామ్సుందర్, రెడ్డి సంధ్యారెడ్డి, పూలమ్మ, చల్ల వెంకన్న, కౌడగాని రాజీరు, సుదగాని వెంకటేశ్వర్లు, తాళ్ల మల్లయ్య, కొత్త సంపత్రెడ్డి, జలగం రమేశ్, అన్నపురం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద ● ఎంజీఎంలో ఆకస్మిక తనిఖీ ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద వైద్యులను అదేశించారు. మంగళవారం కలెక్టర్ ఎంజీఎం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగం డాక్టర్లు, అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ఎంజీఎంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రోగుల సౌకర్యార్థం ఆస్పత్రిలో వెంటనే టోల్ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి అన్ని విభాగాలు, వార్డుల వద్ద ప్రదర్శించాలని సూచించారు. అప్పటి వరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీనంబర్ 1800 425 3424ను సంప్రదించి వైద్యం, చికిత్సకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందరూ ఎఫ్ఆర్సీ ద్వారానే హాజరు వేయాలన్నారు. ఆస్పత్రిలో అన్ని విభాగాల వద్ద ఏర్పాటు చేసిన 20 ఫిర్యాదుల పెట్టెలను డాక్టర్ల సమక్షంలో తెరిచి సమస్యలు లేకుండా చూడాలని, డబ్బులు అడిగిన సెక్యూరిటీ గార్డులపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం ఆస్పత్రి వర్క్షాప్ ప్రాంతంలో ప్రైవేట్ దుకాణాల వెండింగ్ జోన్ పనులను కలెక్టర్ పరిశీలించారు. సమావేశంలో ఎంజీఎం పర్యవేక్షకులు డాక్టర్ కిశోర్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్లు డాక్టర్ రామ్కుమార్రెడ్డి, డాక్టర్ మురళి, ఆర్ఎంఓలు అశ్విన్కుమార్, శశికుమార్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. రోగి సహాయ సేవలు ప్రారంభం ఎంజీఎంలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోగి సహాయ సేవలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సహా య సేవల కోసం శిక్షణ పొందిన ఏడుగురు కమ్యూనిటీ హెల్త్వర్కర్లను నియమించామని ఆమె తెలి పారు. శస్త్రచికిత్స, ఈసీజీ, ఎంఓటీ, ఎక్స్రే, యూఎ స్జీ స్కాన్లు, సీటి స్కాన్ వంటి వివిధ విభాగాలకు రెఫరల్స్, ట్రాన్స్ఫర్లు, డిశ్చార్జ్ అయిన రోగులు హాస్పిటల్ పరిధి నుంచి బయటికి వెళ్లే వరకు అవసరమైన సాయం చేస్తారని వివరించారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తబా హసన్ ఆస్కారి మాట్లాడుతూ సేవలతో రోగులకు త్వరితగతిన వైద్య సేవలు అందుతాయని తెలిపారు. -
సందడే సందడి..
ఎంజీఎం సర్కిల్, రామన్నపేట, ఎంజీఎం సెంటర్, ఫోర్ట్ వరంగల్ ఏఎస్ఎం కాలేజీ సమీపంలో, నాగమయ్య గుడి సమీపంలో, నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో, ఎనుమాముల మార్కెట్ రోడ్డు, కోటిలింగాల గుడి సమీపంలో, లేబర్ కాలనీ, ధర్మారం తదితర ప్రాంతాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాల వరకు రూ.500ల నుంచి రూ.లక్షల వరకు ఖరీదు చేస్తున్నారు. ‘ఈసారి పంచాయతీ ఎన్నికలు సమీపంలో ఉండడంతో చాలామంది విగ్రహ దాతలు ముందుకు వచ్చారు. గతం కంటే ఈసారి ఎక్కువ ఎత్తున్న వినాయక విగ్రహాలను తీసుకెళ్లేందుకు పోటీపడ్డారు. రేటు ఎక్కువైనా ఎక్కడా వెనుకాడడం లేదు’ అని ఎంజీఎం సెంటర్లో విగ్రహాల విక్రయదారులు అంటున్నారు. మట్టి గణపతి విగ్రహాలను కూడా ఈసారి ఆర్డర్పై తీసుకున్నవారు కూడా పదుల సంఖ్యలో ఉన్నారని తెలి పారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదంతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు మట్టి వినాయకుడి ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. మట్టెవాడలోని ఎల్లంబజార్లో 45 అడుగుల మహా ‘విజయగణపతి’ విగ్రహం ఆకట్టుకుంటోంది. -
స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిసంగెం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి సత్తా చాటాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని కుంటపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నుంచి కడమంచి రమేశ్, రవి, పర్వతం భీములు, యాకయ్య, రాజు బీజేపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు అనుముల రాజు, నర్సయ్యలతో పాటుగా 60 మంది పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మాటి సాంబయ్యతో కలిసి ప్రకాశ్రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి అహ్వానించారు. ఈ సందర్భంగా రేవూరి మాట్లాడుతూ.. కొత్తపాత అనే తేడా లేకుండా సమన్వయంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవరెడ్డి, నియోజకవర్గ అధికార ప్రతినిధి జనగాం రమేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్, నాయకులు నాగరాజు, జగన్నాథచారి, అంజన్రావు, ప్రతాప్రెడ్డి, స్వామి, రాజు, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. -
గణ ఆగమనం!
గణేశ్ విగ్రహాల తరలింపులో నయా ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో అక్కడక్కడా కనిపించిన కల్చర్ ఇప్పుడు అంతటికీ పాకింది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో కొనుగోలు చేసిన బొజ్జ గణపయ్య విగ్రహాల తరలింపును వేడుకలా చేస్తున్నారు. డీజే చప్పుళ్లు, బాణసంచా పేలుళ్ల మధ్య.. డ్రెస్ కోడ్ పాటిస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ గణేశ్ విగ్రహాలను మండపాల వద్దకు తీసుకెళ్తున్నారు. నిమజ్జన వేడుకల్లో కనిపించే సందడి గణనాథుడి ఆగమనం వేళ కనిపించడం విశేషం. సాక్షి, వరంగల్: గ్రేటర్ వరంగల్తో పాటు జిల్లావ్యాప్తంగా వినాయకచవితి పండుగ సందడి మొదలైంది. వివిధ రూపాల్లో రూపుదిద్దుకున్న బొజ్జ గణపయ్య ప్రతిమలను పట్టణాలు, పల్లెల్లోకి తీసుకెళుతున్నారు. ప్రతిఏటా గణేశ్ నిమజ్జన వేడుకల్లో కనబడే సందడి ఈసారి గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి ముందే కనబడుతోంది. గణేశ ఆగమన వేడుకల నిర్వహణతో భక్తులు గణనాథున్ని ఘనంగా మండపాలకు తీసుకెళుతున్నారు. వినాయక విగ్రహాలను తయారీదారుల నుంచి తాము ఏర్పాటుచేసిన మండపాల వద్దకు డప్పుచప్పుళ్లతో వేడుకగా తీసుకొస్తున్నారు. మహిళలు సంప్రదాయ హారతులతో స్వాగతిస్తుండగా, సంగీతం, నృత్యం, బాణాసంచా పేలుళ్లతో గణనాథుడిని వైభవంగా మండపాలకు తరలిస్తున్నారు. నిమజ్జన సందడికి ఏమాత్రం తీసిపోకుండా ఈసారి సరికొత్త సంప్రదాయంతో వినాయకుడి విగ్రహాలను తీసుకెళ్తుండడం గ్రేటర్ వరంగల్లో ఆకట్టుకుంటోంది. సామాజిక మాధ్యమాలు విస్తృతం కావడంతో ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్లో లైక్స్ కోసం కూడా కొంతమంది వినాయక ఆగమనమాన్ని వేడుకగా నిర్వహిస్తున్నారు. మూడు రోజుల నుంచే నగరంలో చాలా మంది గణనాథులను ‘గణేశ్ అగమనం’ వేడుకలతో మండపాలకు తీసుకెళ్తున్నారు. మహిళలు, పురుషులు ప్రత్యేక డ్రెస్ కోడ్లతో ఈ ఉత్సవానికి వన్నె తెస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో ఈ గణేశ్ అగమన యాత్రల సందడి జోరుగా ఉంది. బుధవారం నుంచి తొమ్మిదిరోజుల పాటు వినాయక చవితి ఉత్సవాలు చేసేందుకు భక్తులు సిద్ధమయ్యారు. మట్టి, గోమయ విగ్రహాలకే జై కొడుతున్న భక్తులు ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాల నిర్వహణ పర్యావరణానికి హాని కలగని విధంగా పూజలునిమజ్జన సందడి మాదిరిగానే గణేశుడి స్వాగత వేడుక సంగీతం, నృత్యం, బాణాసంచా పేలుళ్లతో విగ్రహాల తరలింపు డ్రెస్ కోడ్, డీజే చప్పుళ్ల మధ్య మండపాల వద్దకు.. గ్రేటర్ వరంగల్, పట్టణాల్లో నయా ట్రెండ్ నేడు కొలువుదీరనున్న గణపయ్య -
జనహిత పేరుతో కొత్తడ్రామా
● ఏ ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్వర్ధన్నపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని, ఏ ఒక్క హామీ అమలు చేయని కాంగ్రెస్ ఇప్పుడు జనహిత కార్యక్రమం పేరుతో పర్యటించడం విడ్డూరమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆరోపించారు. మంగళవారం పట్టణకేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడుతూ..ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేసి గద్దె ఎక్కిన సీఎం రేవంత్రెడ్డి, హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వరంగల్ రెండో రాజధాని అంటూనే కనీస నిధులు విడుదల చేయకుండా ప్రజల్ని మాయచేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ.. దమ్ముంటే తక్షణమే 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రత్నం సతీశ్, రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు బన్న ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండేటి సత్యం, జిల్లా కార్యదర్శి జడ సతీశ్, అధికార ప్రతినిధి మహేందర్రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు రాయబారపు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
వృక్షరూప గణపయ్య
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ పరిధి గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్(కొత్త బీట్బజార్)లో ఈసారి పర్యావరణ హితం కోరే గణపతి విగ్రహాన్ని నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. వృక్షో రక్షతరక్షితః అనే విషయాన్ని ప్రచారంలోకి తేవడానికి స్థానిక వ్యాపారులు సిద్ధం అవుతున్నారు. వినాయకుడి విగ్రహం తలపై భాగంలో వృక్షం ఆకృతితో పచ్చని చెట్టుకొమ్మలతో పాటు స్వామివారి కాళ్లకు ఏర్లు వేళ్లూనుకుని దర్శనమిస్తోంది. ఈ విగ్రహాన్ని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో శివ అనే వ్యక్తి పలువురు కార్మికుల సహకారంతో రూపొందించారని కాంప్లెక్ అధ్యక్షుడు తోట జగన్నాధం తెలిపారు. -
కేఎంసీ ప్రిన్సిపాల్ చాంబర్ ముట్టడి
ఎంజీఎం: కాకతీయ వైద్య కళాశాల మెన్స్, ఉమెన్స్ హాస్టల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని 15 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో మంగళవారం కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎదుట కూర్చొని నినాదాలు చేశారు. ఈసందర్భంగా సీఐటీయూ హనుమకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేశ్, తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ మాట్లాడుతూ.. కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే వేతనాలు బకాయిగా ఉన్నాయని, అధికారులు చేసిన తప్పులకి కార్మికులు బలవుతున్నారన్నారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ – హెల్త్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, కార్మికులు అల్లం రమేశ్, రాణి, రాజకుమారి, అతిక్, రాము, మంద కవిత, రవి బాబు, యాకయ్య, సునీత, జ్యోతి, ప్రకాశ్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధులపై చైతన్యం కల్పించాలి
వరంగల్ అర్బన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాటల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కళాజాత ప్రదర్శనను మేయర్ సుధారాణితో కలిసి కమిషనర్ చాహత్ బాజ్పాయ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. కీటక జనిత, నీటి జనిత వ్యాధులు, పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రతపై గేయాలతో ఆలోచింపజేసేలా ఉండాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఎంహెచ్ఓ రాజేశ్, సూపరింటెండెంట్ దేవేందర్, శానిటరీ సూపర్వైజర్లు భాస్కర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్స్పెక్టర్లు ప్రకాశ్, భీమయ్య, అనిల్, సురేశ్ పాల్గొన్నారు. -
అర్జీలు పెండింగ్లో ఉంచొద్దు..
కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్లో ఉంచవద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 177 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ.గణేశ్, హనుమకొండ, పరకాల ఆర్డీఓ లు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, సీపీఓ సత్యనారాయణరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
బాలలపై లైంగిక దోపిడీని నిర్మూలించాలి
హన్మకొండ: బాలలపై లైంగిక దోపిడీని సమర్థవంతంగా నిర్మూలించాలని అడిషనల్ డీసీపీ ఎన్.రవి అన్నారు. హనుమకొండ సుబేదారిలోని అసుంత భవన్లో చిల్డ్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ బెంగళూరు, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా రాష్ట్రంలోని ఎంపిక చేసిన స్వచ్ఛంద సంస్థలకు ఆన్లైన్లో ‘బాలల లైంగిక దోపిడీని నిర్మూలించడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర’ అనే అంశంపై రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి వర్క్షాపు సోమవారం ప్రారంభమైంది. ఎన్.రవి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడంతో బాలలు అత్యధికంగా లైంగిక దోపిడీకి గురవుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. సైబర్ క్రైమ్ ఏసీపీ గిరి కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై పిల్లలు, పెద్దలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించాలన్నారు. ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ డైరక్టర్ సిస్టర్ సహాయ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిల్ట్రన్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ శుభ్రత్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల సీడబ్ల్యూసీ చైర్మన్, చైర్పర్సన్ అనిల్ చందర్ రావు, కె.నాగమణి, ఎఫ్ఎం శ్రామిక వికాస కేంద్రం డైరక్టర్ లక్ష్మణ్ రావు, స్కాపర్డ్ డైరెక్టర్ ప్రసాద్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు బత్తుల కరుణ, తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ రవి -
భూ కబ్జాల పేట
కాజీపేట: వరంగల్ ట్రై సిటీలో కాజీపేట ప్రధానమైంది. ఇక్కడి భూములకు మంచి డిమాండ్ ఉండడంతో ధరలు కూడా ఎకరాకు రూ.కోట్లు పలుకుతున్నాయి. దీంతో కాజీపేట పరిసర ప్రాంతాల్లోని పేదల భూములపై కబ్జాదారులు గద్దల్లా వాలుతూ తమ దందాను అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. ఈ మండలంలోని 19 వీలిన గ్రామాల్లో ఈ దందా ఇటీవల కాలంలో యఽథేచ్ఛగా సాగుతోంది. రాజ కీయ నాయకుల అండదండలు దండిగా ఉన్న కొంతమంది దౌర్జన్యంగా వ్యవహరిస్తూ చిన్న, మధ్య తరగతి ప్రజల భూములు, ప్లాట్లను కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా ఎదురు తిరిగితే వారిని భయానికి గురిచేస్తూ, దాడులకు దిగుతూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నారు. అదీ కుదరకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టిస్తూ బాధితులను భయబ్రాంతులకు గురి చేసి పోలీస్స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు చోటామోటా.. నేడు కోటీశ్వరులు కాజీపేట పరిధిలో ఒకప్పుడు చోటామోటాగా ఉన్న వారు నేడు భూకబ్జాలు చేస్తూ లక్షలకు, కోట్లకు పడగలెత్తుతున్నారు. బాధితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నప్పటికీ వారి విషయంలో స్పందించని సంఘాలు, నాయకులు కబ్జాదారులకు వంతపాడడంపై ప్రజలు మండిపడుతున్నారు. తమకో న్యాయం, కబ్జాదారులకో న్యాయమా.. అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పలువురు బాధితులు ఈ కబ్జాల విషయమై సీపీ సన్ప్రీత్సింగ్ను కలిసి న్యాయం చేయాలని కోరు తూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ఆ సమయంలో సీపీ వెంటనే భూకబ్జాదారులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ఇక్కడి నాయకుల జోక్యమో.. లేక కబ్జాదారుల చేతివాటమో తె లియదుగానీ కబ్జాదారుల హవా మాత్రం తగట్లేదు. సీపీ గారూ.. జర దృష్టి పెట్టండి కాజీపేట చుట్టు పక్కల గ్రామాల్లో నానాటికీ పెరుగుతున్న భూకబ్జాదారుల బాగోతాలపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ దృష్టి పెట్టాలని బాధితులు వేడుకుంటున్నారు. తాము బహిరంగంగా మాట్లాడితే కబ్జాదారులు ఏమైనా చేస్తారేమోనని భయపడుతున్నామని వాపోతున్నారు. పెట్రేగిపోతున్న భూకబ్జాదారుల ఆగడాలకు కళ్లెం వేయాలని కోరుతున్నారు. కాజీపేట పరిధిలోని పేదల భూములపై పె(గ)ద్దల కన్ను కొందరు టీంగా ఏర్పడి ఖాళీ ప్లాట్లకు ఎసరు.. సెటిల్మెంట్.. కాదని ఎదురుతిరిగితే రివర్స్గా పోలీస్ కేసు గుండెలు బాదుకుంటున్న బాధితులు కబ్జాదారులకు నాయకులు, రౌడీషీటర్ల అండ.. పట్టని అధికారులు కబ్జాల్లో కొన్ని ఇలా.. ప్రశాంత్నగర్ కాలనీలో కొంతమంది సభ్యులు ఒక టీంగా ఏర్పడి ఏకంగా దాదాపు 18 ఖాళీ ప్లాట్లకు ఎసరు పెట్టారు. కొన్ని ప్లాట్లలో భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ప్రశాంత్నగర్, వడ్డేపల్లి శివారుల్లో 25 ఏళ్ల కింద కొనుగోలు చేసిన ప్లాట్లను ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్లాట్లు కొనుగోలు చేసినప్పుడు సదరు ప్రజాప్రతినిధి పుట్టి ఉండకపోవచ్చని యజమానులు కన్నీరు పెడుతున్నారు. సిద్ధార్థనగర్ కాలనీలో ఓ ఆంగో ఇండియన్కు చెందిన విలువైన స్థలంపై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. దీని వెనుక బలమైన నాయకుడి హస్తం ఉందని కనిపించిన వాళ్లకు చెప్పుకుని రోదిస్తున్నాడు. మడికొండకు చెందిన ఓ వృద్ధురాలికి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, దాన్ని కబ్జా చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. రెవెన్యూ అధికారులు సైతం కబ్జాదారులకే వంతపాడడం చర్చనీయాంశమైంది. టేకులగూడెం గ్రామ శివారులో ఉన్న ఓ ఐటీఐ యజమానికి చెందిన 3 ఎకరాల స్థలానికి తప్పుడు కాగితాలు సృష్టించి పట్టా చేసుకోవడమే కాకుండా రెండున్నర కోట్లకు విక్రయించారు. దీనికి గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులు సహకరించారనే ఆరోపణలున్నాయి. ఈ వివాదం కోర్టులో ఉంది. -
నేడు మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయ ప్రాంగణంలో మంగళవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ సోమవారం తెలిపారు. 300 మందికి మాత్రమే అందించనున్నట్లు, భక్తులు మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.బీపీ మండల్ను ఆదర్శంగా తీసుకోవాలికేయూ క్యాంపస్: బిందేశ్వర్ ప్రసాద్ (బీపీ మండల్) ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకోవాలని కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం కోరారు. సోమవారం క్యాంపస్లోని ఆడిటోరియంలో బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ జయంతి నిర్వహించారు. బిపి మండల్ చిత్రపటానికి రిజిస్ట్రార్ రామచంద్రం, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సెల్ డైరెక్టర్ బొడిగ సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేయూ పాలక మండలి సభ్యులు చిర్రరాజు, సోషియాలజీ విభాగాధిపతి డాక్టర్ కె.అయిలయ్య, ప్రొఫెసర్ స్వర్ణలత, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి ఎ.శ్రీనివాసులు, పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి ఎస్.వెంకటయ్య, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ డాక్టర్ జి.కృష్ణయ్య, బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు, అధ్యాపకులు శ్రీకాంత్, ఫిరోజ్ పాల్గొన్నారు.ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలిహన్మకొండ అర్బన్: సీపీఎస్ విధానం ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (టీజీసీపీఎస్ఈయూ) రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శన్గౌడ్ ఆరోపించారు. సోమవారం వరంగల్, హనుమకొండ జిల్లాల పర్యటనలో భాగంగా ఆత్మగౌరవ సభ పోస్టర్ను హనుమకొండ కలెక్టరేట్లో ఉద్యోగులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా దర్శన్గౌడ్ మాట్లాడుతూ.. టీజీసీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో.. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే సీపీఎస్ ఉద్యోగుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరేశం, నర్సింహులు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, నరేంద్రప్రసాద్, శరత్, ఉద్యోగులు పాల్గొన్నారు.కేడీసీలో జాతీయ సదస్సుకేయూ క్యాంపస్: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మైక్రో బయాలజీ విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సదస్సు కన్వీనర్ డాక్టర్ పి.పల్లవి సోమవారం తెలిపారు. ‘మైక్రోబియల్ ఫ్రంట్ టైర్స్ హార్మోసింగ్ జీనోమిక్స్ సింథటిక్ బయాలజీ అండ్ మైక్రోబయోమ్ ఇన్నోవేషన్స్’ అంశంపై ఈ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈసదస్సు బ్రోచర్ను ఇటీవల కేయూలో వీసీ ప్రతాప్రెడ్డి, కేడీసీ ప్రిన్సిపాల్ ఆచార్య గుర్రం శ్రీనివాస్ ఆవిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేడీసీ వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ శ్రీనాఽథ్, బీఓఎస్ డాక్టర్ శ్రీనివాస్, అధ్యాపకులు జె.చిన్న, వి.శ్రీనివాస్, డి.వెంకన్న, యుగేందర్ తదితరులు పాల్గొన్నట్లు పల్లవి తెలిపారు. మండపాలకు ఉచిత విద్యుత్హన్మకొండ: గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈమేరకు టీజీ ఎన్పీడీసీఎల్ పరిధి 16 సర్కిళ్లలో గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ మెమో జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో అధికారులు తమ పరిధి వినాయక మండపాలను సందర్శించి వాడుకుంటున్న లోడ్ను పరిశీలించి ఏ కేటగిరి కిందికి వస్తుందో వివరాలు పంపాలని ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులను ఆదేశించింది. ఒక కిలోవాట్ వరకు రూ.1,560; ఒక కిలోవాట్ నుంచి 1.5 కిలో వాట్ల వరకు రూ.2,300; 1.5 నుంచి 2 కిలోవాట్ల వరకు 3,020; 2 కిలో వాట్ల లోడ్ పైన ప్రతీ కిలో వాట్కు 3,020తో పాటు అదనంగా రూ.1,560 చొప్పున వివరాలు సేకరించాలని టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం అధికారులకు సూచించింది. ఈ మేరకు అధికారులు ఈనెల 30లోపు మండపాల వారీగా విద్యుత్ వినియోగం వివరాలు సేకరించి పంపనున్నారు. -
వేయిస్తంభాల గుడిలో నవరాత్రి మహోత్సవాలు
హన్మకొండ కల్చరల్ : నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో శ్రీమహాగణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వరంగల్ జిల్లా దేవాదాయధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ రామల సునీత తెలిపారు. సోమవారం దేవాలయంలో జరిగిన సమావేశంలో ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేవాలయంలో రేపటి (బుధవారం) నుంచి సెప్టెంబర్ 5వతేదీ వరకు శ్రీమహాగణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈఓ అనిల్కుమార్ మాట్లాడుతూ.. ప్రతీరోజు తమగోత్రనామాలతో పూజలు జరిపించుకోవాలనుకునేవారు రూ.2,116 చెల్లించి రసీదు తీసుకోవాలన్నారు. వారికి స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, వెండిలాకెట్ అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ, గట్టు మహేష్బాబు, అమ్మవారి ఉపాసకులు సింధుమాతాజీ, రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్ నుంచి మండల కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
నోటిఫికేషనే తరువాయి..
సాక్షిప్రతినిధి, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి వేళయ్యిందా? రిజర్వేషన్లు తేలకున్నా.. ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోందా? ఈ మేరకు పార్టీ కేడర్, నాయకులకు సంకేతాలు అందాయా? పీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనుందా? ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారా?... అంటే నిజమే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ, అధికార వర్గాలు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సోమవారం కూడా జిల్లా కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు అందాయన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీల్లో మొదలైన సందడి.. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. మొదట పేర్కొన్న విధంగానే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీపీపీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సెప్టెంబర్లో నో టిఫికేషన్ వస్తే ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో ఆరు జిల్లా ప్రజాపరిషత్లు, 75 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 778 ఎంపీటీసీ స్థానాలు 75 ఎంపీపీ స్థానాలను ప్రకటించి పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఆతర్వాత 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నికలు జరిపేలా 15,021 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు ఇది వరకే ప్రకటించారు. కాగా, ఈ నెల 29న జరిగే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ ఇటీవలి సమావేశంలో జరిగే కీలక నిర్ణయాలను బట్టి ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండగా.. రాజకీయ పార్టీల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికల సందడి పెరిగింది. సెప్టెంబర్ మాసంలో ఎన్నికలు ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల టికెట్లపై పోటీ చేసేందుకు ఆశావహులు సై అంటున్నారు. ఆయా పార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలను కలిసి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సెప్టెంబర్లోనే నోటిఫికేషన్? ఆ దిశగానే కసరత్తు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ముగిసి దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. దీనిపై ఇదివరకే ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా ఎన్నికలు జరిపించాలన్న హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార పార్టీ నేతలు, సీఎం నిర్ణయించినట్లు ప్రచారం. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోయినప్పటికీ.. పార్టీ పరంగా ఆ మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం ఉన్నట్టు ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు చెబుతున్నారు. ఈనెల 29న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలపై చర్చించి ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఎప్పుడు నోటిఫికేషన్ వెలువడినా.. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, చీఫ్ సెక్రటరీల నుంచి ఆదేశాలు అందడంతో అందరూ అలర్ట్ అయ్యారు. జిల్లా జెడ్పీపీపీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ వార్డులు పోలింగ్ కేంద్రాలు హనుమకొండ 1 12 12 129 210 1,986 1,986 వరంగల్ 1 11 11 130 317 2,754 2,754 జేఎస్భూపాలపల్లి 1 12 12 109 248 2,102 2,102 మహబూబాబాద్ 1 18 18 193 482 4,110 4,110 ములుగు 1 10 10 83 171 1,520 1,535 జనగామ 1 12 12 134 280 2,534 2,534 06 75 75 778 1,708 15,006 15,021స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. ఆ తర్వాతే సర్పంచ్, ‘ఫ్యాక్స్’ల ఎన్నికలు ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు, 75 జెడ్పీటీసీ స్థానాలు.. జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం -
త్వరితగతిన పరిష్కారం
● ప్రజల ఫిర్యాదులను పెండింగ్లో ఉంచొద్దు ● ప్రజావాణిలో వినతులను స్వీకరించిన కలెక్టర్ సత్యశారదన్యూశాయంపేట: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజలనుంచి వినతులను స్వీకరించారు. పరిష్కార నిమిత్తం ఆయా శాఖల అధికారులకు అందజేశారు. ప్రజావాణిలో అధికంగా రెవెన్యూ సమస్యలు 58, జీడబ్ల్యూఎంసీ 30, గృహనిర్మాణ శాఖ 12, సహకారశాఖ 7, పౌరసరఫరాల శాఖ 5, ఇతర శాఖలకు సంబంధించిన 39 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు మానవీయ కోణంలో పరిశీలన చేసి పరిష్కరించాలన్నారు. చేపట్టిన చర్యలను ఫిర్యాదుదారులకు వివరిస్తూ సమాచారం అందజేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి,, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు పుష్పలత, సత్యపాల్రెడ్డి, ఉమారాణి పాల్గొన్నారు.ఇందిరమ్మ ఇల్లు బిల్లు చెల్లించాలినాకు ఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇల్లు మంజూరు అయ్యింది. ప్లాన్ ప్రకారం పిల్లర్లు, బెడ్ పోసుకున్నాను. అప్పుచేసి ఆ పనులు పూర్తి చేశా. రెండునెలలు అయ్యింది. బిల్లులు రాలేదు. సమస్యను పరిష్కరించాలని విన్నపం. – అందె జాన్సీ, రంగశాయిపేట, వరంగల్డీలర్లకు కమీషన్ చెల్లించాలి..డీలర్లకు ఏప్రిల్ నుంచి రావాల్సిన 5నెలల కమీషన్ డబ్బులు చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం డీలర్లకు కనీస గౌరవ వేతనం ఇవ్వాలి. – వరంగల్ జిల్లా రేషన్ డీలర్ల సంఘంఅక్రమ టెండర్ ఆపాలి.. వరంగల్ లక్ష్మిపురం కూరగాయల మార్కెట్లో కూరగాయల వర్తక సంఘం వినాయక చవితి పేరుతో అక్రమంగా టెండర్ నిర్వహించి కొందరు వ్యక్తులు డబ్బులు దండుకోవాలని చూస్తున్నారు. ఆ టెండర్ ప్రక్రియను ఆపాలి. గతంలో టెండర్ పెట్టొద్దని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ నిర్వహిస్తున్నారు. –జిల్లా హోల్సేల్, రిటైల్ కూరగాయల మార్కెట్ కమిటీ రీ–ఎంక్వయిరీ పేరుతో కాలయాపన.. నాకు దక్కాల్సి ఉన్న 24 గుంటల భూమికి సంబంధించి ఎఫ్లైన్ పిటిషన్ ద్వారా సర్వేయర్ రిపోర్ట్ ఇచ్చినా మండల అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయంతో రీ–ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తున్నారు. అధికారులు న్యాయం చేయాలి. – రాపర్తి సమ్మయ్య, మంచుప్పుల, నల్లబెల్లి ● -
మట్టిగణపతి విగ్రహాలను పూజించాలి
న్యూశాయంపేట: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో మట్టితో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ హాల్లో మట్టి గణపతులను పూజించాలనే పోస్టర్లను ఆవిష్కరించి అధికారులకు మట్టివిగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి,, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోండి న్యూశాయంపేట: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంపార్మసీ, ఫార్మ్డీ మొదలగు పోస్ట్ మెట్రిక్ కోర్సులు చదువుచున్న అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు 2025–26 విద్యాసంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ.పుష్పలత సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఈమేరకు ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు సమాచారం అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఆన్లైన్లో https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కృష్ణుడి ప్రతిమ ఊరేగింపు నర్సంపేట : త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణుడి ప్రతిమను సోమవారం ఊరేగించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నర్సంపేట పట్టణంలోని విష్ణుశర్మ వీధిలో ఏర్పాటు చేసిన స్వామి వారికి నిత్య పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఓంప్రకాశ్ ఆచారి, కాసుల లక్ష్మణ్, శంకరా, సిద్దయ్య, సురేశ్, దేవేందర్, సుధాకర్, కిరణ్, శరత్, హనుమయ్య, కట్టయ్య, పద్మ, విక్రమాచారి, భక్తులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో సిద్ధేశ్వరుడు నర్సంపేట : చెన్నారావుపేట మండలంలోని శ్రీ సిద్ధేశ్వరాలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా సిద్ధేశ్వరుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. జల్లి గ్రామానికి చెందిన కాట శ్రీనివాస్పద్మ దంపతులు పంచామృతాలు, పూలదండలను కానుకగా సమర్పించారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకం నర్సంపేట : నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో ఆలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శింగిరికొండ మాధవశంకర్గుప్తా ఆధ్వర్యంలో ఎనిమిదో మాస దివ్య పడిపూజ మహోత్సవం సోమవారం నిర్వహించారు. పూజలో బండారు విజయలక్ష్మి –దామోదర్, జనగాం సుజాత–మహేందర్రావు, కూచన వనజ–వేణుగోపాల్ పాల్గొని అయ్యప్పస్వామి, మహాలక్ష్మి అమ్మవారు విగ్రహాలకు అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాధవశంకర్ గుప్తా మాట్లాడుతూ ఆలయం నూతన నిర్మాణ అభివృద్ధిలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. -
జనహిత పాదయాత్ర
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పరిధి ఇల్లంద మార్కెట్నుంచి మండలకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్లు జనహిత పాదయాత్ర నిర్వహించారు. వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు, పార్టీ శ్రేణులు నడిచారు. సుమారు మూడు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్లో ముఖ్యనేతలు ప్రసంగించారు. – సాక్షి, వరంగల్ -
భద్రతపై శ్రద్ధచూపాలి
● విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ● క్షేత్రస్థాయి పరిశీలనలో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డినర్సంపేట: విద్యుత్ సిబ్బంది భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఎర్త్ డిశ్చార్డ్ రాడ్, సేఫ్టీ పరికరాలతో, లైన్లో విద్యుత్ సరఫరా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే పనిచేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్పాటి వరుణ్రెడ్డి సూచించారు. ఈమేరకు నర్సంపేట మండలం లక్నెపల్లి 33/11కేవీ, నర్సంపేట టౌన్, ఖానాపురం సబ్స్టేషన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగంగా హెచ్టీ సర్వీస్లకు ఏఎంఆర్లు అమర్చడంలో వివిధ సాంకేతిక విశ్లేషణను పరిశీలించారు. 33/11కేవీ సబ్స్టేషన్ ఆటోమేషన్ పురోగతి పర్యవేక్షించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ ఫెల్యూర్స్, ప్రత్యామ్నాయ లైన్లు, అదనపు ట్రాన్స్ ఫార్మర్ల బిగింపు వివరాలను సమీక్షించారు. ప్రతి ఉద్యోగి భద్రతపై అవగాహనతో పనిచేస్తూ గ్రామాల్లో, పొలాల్లో ఉన్న లూజ్లైన్లను సరిదిద్దాలని, ప్రమాకరమైన లైన్లను సరిచేసి ఎవరికీ ప్రాణహాని కలుగకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి, సంపత్రెడ్డి, జాటోత్ హర్జనాయక్, తిరుపతి డివిజన్ ఇంజనీర్లు, అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్లు పవన్కుమార్, రాజేశ్రెడ్డి, ఏఈలు పాల్గొన్నారు. ఖానాపురంలో.. ఖానాపురం: మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో అభివృద్ధి పనులను సీఎండీ వరుణ్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అంతరాయాలు, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్స్, ప్రత్యామ్నాయ లైన్లు, అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లను తనిఖీ చేశారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి, డీఈలు సంపత్రెడ్డి, హర్జినాయక్, తిరుపతి, పవన్కుమార్, రాజేశ్రెడ్డి, ఏఈ మంగమ్మ పాల్గొన్నారు. -
తరువాయి..
వరంగల్మంగళవారం శ్రీ 26 శ్రీ ఆగస్టు శ్రీ 2025నోటిఫికేషనే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం ● సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించే అవకాశం ● ‘స్థానిక’ంలో బీసీలకు 42 శాతం అవకాశం.. పార్టీ కేడర్కు కాంగ్రెస్ సంకేతాలు ● ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ..ఆ తర్వాతే సర్పంచ్, ‘ప్యాక్స్’ల ఎన్నికలు ● ఉమ్మడి జిల్లాలో 6 జెడ్పీలు,75 జెడ్పీటీసీ స్థానాలు.. ● జిల్లా కలెక్టర్లకూ సీఎస్ సమాచారం.. -
సొసైటీలో మోసం
● రూ.6లక్షలు కాజేసిన గోదాం కీపర్ ● రికవరీ, విధుల నుంచి తొలగింపు సంగెం: సొసైటీ ఎరువుల గోదాం కీపర్ రూ.6లక్షలు మోసం చేసి దొరికిపోయిన ఘటన సంగెం మండలంలో చోటుచేసుకుంది. సోమవారం విలేకర్ల సమావేశంలో కాపులకనిపర్తి సొసైటీ చైర్మన్ దొమ్మాటి సంపత్గౌడ్, సీఈఓ రమణాచారి మోసానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాపులకనిపర్తి గ్రామానికి చెందిన పసునూరి రమేశ్ను సొసైటీ ఎరువుల గోదాం ఇన్చార్జ్(తాత్కాలిక ఉద్యోగి)గా గత ఏడాది నియమించుకున్నారు. ఈ ఏడాది జూన్ 21న గోదాంలో విక్రయించిన 220 బస్తాల వివిధ రకాల ఎరువులు అమ్మినా రూ.1,00,077లు సొసైటీకి జమ చేయలేదు. 10,11 నంబర్ బిల్లు బుక్లు కన్పించకుండా పోయాయి. డబ్బులు జమచేయాలని నిలదీయడంతో రమేశ్ చెప్పకుండా ఎటో వెళ్లిపోయాడు. దీంతో రమేశ్పై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పాలకవర్గం సభ్యులు, రమేశ్ తండ్రి రాజ య్య ఇతరుల సమక్షంలో గోదాంలోని ఎరువులను లెక్కించగా 4,96,312 రూపాయల విలువైన వివిధ రకాలు 432 బస్తాలు తక్కువగా ఉన్నాయి. దీంతో మొత్తం రూ.5,96,389లు మోసం జరిగినట్లు తేల్చగా పెద్దమనుషుల సమక్షంలో ఒప్పుకున్న రమేశ్ రూ.లక్ష జమచేశాడు. మిగిలినవాటిలో సెప్టెంబర్ 6న రెండు లక్షలు, మిగి లినవి నవంబర్లో చెల్లించేవిధంగా ఒప్పందపత్రం రాయించుకున్నట్లు తెలిపారు. రమేశ్ను విధుల నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. డైరెక్టర్ బానోత్ కిషన్నాయక్, భిక్షపతి పాల్గొన్నారు. -
టెక్స్టైల్ పార్కుకు ఆర్టీసీ బస్సు ప్రారంభం
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల కోసం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ సత్యశారద ఆస్టీసీ బస్సును సోమవారం ప్రారంభించారు. కేఎంటీపీ నుంచి ఊకల్ హవేలి, కొనాయమాకుల, ధర్మారం, జాన్పాక మీదుగా వరంగల్ బస్టాండుకు ఆర్టీసీ బస్సు నడుస్తుందని వారు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్సులు కేఎంటీపీ నుంచి వరంగల్ బస్టాండ్ వరకు, బస్టాండ్ నుంచి కేఎంటీపీకి నడుస్తాయన్నారు. టీజీఐఐసీ జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామినాయక్, ఆర్టీవో సత్యపాల్రెడ్డి, ఆర్టీసీ డీఎం ధరమ్ సింగ్, యంగ్వన్, గణేషా కంపెనీ ప్రతినిధులు కృష్ణమూర్తి, ఎంవీ రెడ్డి, తహసీల్దార్ ఎండీ రియాజొద్దీన్, ఎంపీడీవో పాక శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. -
పీసు తోడింది..పంట ఎండింది
నర్సంపేట: నకిలీ మొక్కజొన్న విత్తనాలు నట్టేట ముంచాయి. వేల రూపాయల పెట్టుబడులు పెట్టి మొక్కజొన్న విత్తనాలతో తీవ్రనష్టం వాటిల్లింది. దీంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. వివరాల్లోకి వెళితే... చెన్నారావుపేట మండలంలోని బోడ మాణిక్యంతండా గ్రామానికి చెందిన భూక్య వాలునాయక్ గోద్రెజ్ 105 కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను నర్సంపేటలోని పరమేశ్వర సీడ్స్ షాపులో రూ.8,500లు వెచ్చించి ఐదు ప్యాకెట్లను కొనుగోలు చేశాడు. జూన్లో తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో మొక్కజొన్న విత్తనాలను వేసి సాగు చేశాడు. మొక్కజొన్న కర్రలు ఏపుగా పెరిగి పీసులు తోడాయి. కానీ మొక్కజొన్న కర్రలకు కంకులు లేవు.. గింజలు లేవు. మొక్కజొన్న చేనంతా ఎండిపోతోంది. దీంతో బాధిత రైతు లబోదిబోమంటూ పరమేశ్వర సీడ్స్ యజమానిని నిలదీశాడు. దీంతో అతడు గోద్రెజ్ 105 విత్తన కంపెనీ సేల్స్ ఆఫీసర్కు సమాచారం అందించాడు. సేల్స్ ఆఫీసర్ ఐదు రోజుల క్రితం వచ్చి పంటను పరిశీలించి వెళ్లిపోయాడు. కానీ ఇప్పటివరకు స్పందించడం లేదని రైతు వాలునాయక్ ఆవేదన వ్యక్తం చేశాడు. మొక్కజొన్న పంట సాగు చేయడానికి రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టానని ఆందోళన చెందుతున్నాడు. వ్యవసాయ శాఖ అధికారులు మొక్కజొన్న పంటను పరిశీలించి నకిలీ మొక్కజొన్న విత్తనాలను అంటగట్టిన పరమేశ్వర సీడ్స్ షాపు యజమాని, గోద్రెజ్ 105నకిలీ మొక్కజొన్న విత్తన కంపెనీపై తగిన చర్యలు తీసుకొని తనకు నష్టపరిహారం అందించాలని బాధిత రైతు భూక్య వాలునాయక్ వేడుకుంటున్నాడు. నట్టేట ముంచిన నకిలీ మొక్కజొన్న విత్తనాలు రెండున్నర ఎకరాల్లో సాగు చేస్తే తీవ్ర నష్టం ఆదుకోవాలని బాధిత రైతు వేడుకోలు -
ర్యాగింగ్కు పాల్పడితే క్రిమినల్ చర్యలు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్వరంగల్ క్రైం: విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ వంటి వికృత చేష్టలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై పోలీస్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్కు పాల్పడడం అనేది తీవ్రమైన నేరమని, ఈ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్ నియంత్రణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని, నూతనంగా వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సులు, వర్క్షాపులు నిరంతరం నిర్వహించాలని, విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 24గంటల హైల్ప్లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎవరైనా ర్యాగింగ్కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం, పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలిసి పనిచేసినప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలమని పోలీస్ కమిషనర్ తెలిపారు. -
ఉత్సాహంగా స్పోర్ట్ ్స డే రన్
వరంగల్ స్పోర్ట్స్: హాకీ క్రీడా దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ డీఎస్ఏ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పోర్ట్స్డే రన్లో యువత, క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వద్ద డీవైఎస్ఓ గుగులోత్ అశోక్కుమార్ జెండా ఊపి రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధ్యాన్చంద్ను స్మరించుకుంటూ ఈ నెల 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం మీదుగా తిరిగి స్టేడియానికి చేరుకుంది. కార్యక్రమంలో హ్యాండ్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్, డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓపెన్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలి
విద్యారణ్యపురి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఈవిద్యాసంవత్సరం 2025–26 లో డిగ్రీ, పీజీ ప్రవేశాలు పొందాలని ఆ యూనివర్సిటీ స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ వై.వెంకటేశ్వర్లు కోరారు. డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ఆదివారం వెంకటేశ్వర్లు ఆ యూ నివర్సిటీ సెంటర్ ఫర్ స్టాఫ్ ట్రైనింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటరమణతో కలిసి హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీల అధ్యయన కేంద్రాలను వేర్వేరుగా సందర్శిచారు. ప్రవేశాల పోస్టర్లను ఆవి ష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలు పొందే విద్యార్థులకు రిటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని వెల్లడించారు. విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 30 వరకు అడ్మిషన్లకు గడువు ఉందని తెలి పారు. పూర్తి వివరాలకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ వెబ్సైట్లో చూడాలన్నారు. కేడీసీలో పోస్టర్ల ఆవి ష్కరణ కార్యక్రమంలో కేడీసీ కో–ఆర్డినేటర్ డాక్టర్ అలువాల సంజీవయ్య, అధ్యాపకులు డాక్టర్ బి.వెంకట గోపీనాథ్, ఎం.సదానందం, సురేశ్, పూర్ణచందర్, దుర్గం రవి, రమేశ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
ముగిసిన చదరంగం పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగం సమాఖ్య ఆధ్వర్యంలో హనుమకొండ పబ్లిక్గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లాస్థాయి మూడో ర్యాంకింగ్ చదరంగ పోటీలు ముగిశాయి. ముఖ్య అతిథిగా ఎన్ఐటీ టెక్నికల్ ఆఫీసర్ సుధాకర్ హాజరై విజేతలకు సర్టిఫికెట్లు, పతకాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరిగేసి అర్జున్ను స్ఫూర్తిగా తీసుకుని చదరంగంలో రాణించాలని సూచించారు. నిర్వహణ కార్యదర్శి పి.కన్నా మాట్లాడుతూ అండర్–7,9,11,13,15 బాలబాలికల విభా గాల్లో పోటీలకు జిల్లా వ్యాప్తంగా 70 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్ ఆర్బిటర్లు ప్రేమ్సాగర్, వైశాలి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అధిక ధరలకు సరుకులు విక్రయిస్తే లైసెన్స్లు రద్దుఖిలా వరంగల్: వరంగల్ లక్ష్మీపురం కూరగా యల మార్కెట్లో కమీషన్ ఏజెంట్ వ్యాపారులు, వర్తక సంఘం ప్రతినిధులు టెండర్ పేరుతో సరుకులను అధిక ధరలకు విక్రయిస్తే లైసె న్స్లు రద్దు చేస్తామని మార్కెట్ కార్యదర్శి గుగులోత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్కు వచ్చే రైతులు, వినియోగదారులతో ఏజెంట్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలివిద్యారణ్యపురి: జిల్లాలోని ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిచాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో టీపీటీఎఽఫ్ బాధ్యులతో కలిసి సత్యనారాయణ సూపరింటెండెంట్ ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎం.రఘుపతి, జిల్లా మాజీ అధ్యక్షుడు బీమళ్ల సారయ్య, జిల్లా బాధ్యులు రవి, రాజు, సదానందం పాల్గొన్నారు. నేడు ‘గ్రేటర్’ గ్రీవెన్స్వరంగల్ అర్బన్: జీడబ్ల్యూఎంసీ గ్రీవెన్స్ను సోమవారం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమస్యలపై రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. నేడు కలెక్టరేట్లో ప్రజావాణి న్యూశాయంపేట: ప్రజల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్లో సోమవారం(నేడు) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించాలని సూచించారు. గణపతి రుద్రుడిగా రుద్రేశ్వరస్వామికి అలంకరణహన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో భాద్రపద మాసం శుద్ధ పాడ్యమి ఆదివారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని గణపతి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు పానుగంటి ప్రణవ్, పెండ్యాల సందీప్శర్మ పూజలు నిర్వహించారు. డీఈఈ సెట్ స్పాట్ అడ్మిషన్లువిద్యారణ్యపురి: డైట్ కళాశాలల్లో ప్రవేశాలకు డీఈఈ సెట్ అభ్యర్థులకు స్పాట్ అడ్మిషన్ల రెండో దశ ప్రక్రియ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ వరంగల్, హనుమకొండ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్హై ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా డీఈఈసెట్–2025లో అర్హత సాధించి ఉండాలని, ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈనెల 26న, ప్రైవేట్ కళాశాలల్లో ఈనెల 28న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారు ఈనెల 29న ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. -
ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతి
● సీనియార్టీ జాబితాల విడుదల ● నేడు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా తత్సమానమైన పీఎస్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించే పక్రియలో భాగంగా సీనియారిటీ జాబితా వెల్లడించారు. తొలుత 1:3 నిష్పత్తిలో సీనియారిటీ జాబితా వెల్ల డించి అభ్యంతరాలు స్వీకరించారు. ఆదివారం 1:1 సీనియారిటీ జాబితా ప్రకటించారు. అందులో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తున్నారు. ఈనెల 25న వెబ్ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఈనెల 26న పదోన్నతులు పొందినవారికి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జిల్లాలో 147 ఎస్ఏల పోస్టులు ఖాళీగా చూపారు. అయితే, వివిధ కేటగిరీల్లో పదోన్నతులకు అర్హులైనవారు లేరు. అందులో 105 స్కూల్అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్జీటీలకు పదోన్నతి కల్పించనున్నారు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాలో ఎస్జీటీలకు ఎస్ఏలుగా పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి సీనియారిటీ జాబితా వెల్లడించడంలో జాప్యం జరిగింది. ఆదివారం 1:3 నిష్పత్తిలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా వెల్లడించారు. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మరోవైపు తుది జాబితాపై కూడా డీఈఓ కార్యాలయంలో సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. 1:1 నిష్పత్తిలో సీనియారిటీ జాబితా సోమవారం వెల్లడించనున్నట్లు ఇన్చార్జ్ డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. అదేరోజు ఉపాధ్యాయులకు వెబ్ఆప్షన్లకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. జిల్లాలో పదోన్నతులకు 122 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి. -
ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతల స్వీకరణ
● సన్మానించిన ఉద్యోగులు విద్యారణ్యపురి: వరంగల్ ఫుల్ అడిషనల్ చార్జ్(ఎఫ్ ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రంగయ్యనాయుడు ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 23న కలెక్టర్ సత్యశారద వరంగల్ ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడును నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన డీఈఓగా విధుల్లో చేరేందుకు తొలుత విముఖత వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ, సూపరింటెండెంట్లు బాబ్జి, జ్యోతి, ఏఎస్ఓ వేణుగోపాల్, టీ ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం, జగదీశ్వర్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. రంగయ్యనాయుడికి హనుమకొండ జిల్లా, వరంగల్ జిల్లా ఎఫ్ఏసీ డీఈఓగా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. -
జనహితకు సిద్ధం!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు, అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుంది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో ఉమ్మడి జిల్లామంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారి రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. జనహిత పాదయాత్ర ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి పాదయాత్ర ఏర్పాట్లపై మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండలోని డీసీసీ భవన్లో కూడా పార్టీ ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఏర్పాట్లతో పాటు అది విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో అక్కడికొచ్చే వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. జనహిత పాదయాత్రతోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సమన్వయలోపం గాడినపడుతుందా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొందరు ముఖ్యనేతల మధ్య ఫిర్యాదుల పర్వం సాగింది. కొన్ని కార్యక్రమాల వేదికగా వారి మధ్య అనైక్యత కూడా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల వేళ ఈ ముఖ్యనేతల మధ్య ఈ పాదయాత్ర వల్లనైనా సయోధ్య కుదరాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ వీరికి ఏవిధంగా దిశానిర్దేశం చేస్తారోనని వేచిచూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికను అందుకున్న మీనాక్షి నటరాజన్ ఆ మేరకు ప్రజాప్రతినిథులతో మాట్లాడి పార్టీ పటిష్టత కోసం ఐక్యంగా ముందుకెళ్లాలని సూచిస్తారని తెలిసింది. అయితే రెండోరోజుల పాటు వీరి పర్యటన ఉండగా మంగళవారం నిర్వహించాల్సిన వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రమదానం, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సమావేశం అర్ధంతరంగా రద్దవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతి ముఖ్యమైన సమావేశం ఉంటే పార్టీ ముఖ్యులతో ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా పార్టీ బలోపేతానికి ఉపయోగపడేదని క్షేత్రస్థాయి కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.వర్ధన్నపేటలో నేడు కాంగ్రెస్ నేతల పాదయాత్ర పాల్గొననున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమీక్షలు ఇల్లంద నుంచి వర్ధన్నపేట టౌన్ వరకు పాదయాత్ర సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలుకాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి రెండో విడత జనహిత పాదయాత్రని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ ముఖ్యనాయకులకు దిశానిర్ధేశం చేశారు. వర్ధన్నపేటటౌన్లోని ఎమ్మెల్యే అధికార క్యాంప్ కార్యాలయంలో ము ఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అంతకుముందే ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించే స్థలాన్ని క్షేత్రస్థాయిలో నాయకుల, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరుశాతం విజయం సాధించి తీరుతామని ఆశాభావం వ్యక్తంచేశారు. -
బార్బరిక్ చిత్ర బృందం సందడి
హన్మకొండ చౌరస్తా: స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్పై విజయ్పాల్రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. ఈనెల 29న విడుదల కానున్న బార్బరిక్ సినిమా స్పెషల్ ప్రీమియర్ షోను ఆదివారం హనుమకొండలోని శ్రీదేవీ ఏషియన్మాల్లో ప్రదర్శించారు. షో కు విచ్చేసిన దర్శకుడు మోహన్ శ్రీవాత్సవ, నిర్మాత విజయపాల్రెడ్డి, నటి ఉదయభాను, నటీనటులు వశిష్ట, ఎన్.సింహా, సత్యంరాజేశ్, క్రాంతికిరణ్, సాంచీరాయ్ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. చిన్న సినిమాలను ఆదరించాలని కోరారు. సినిమా చూసిన ఎమ్మెల్యే నాయిని స్పెషల్ ప్రీమియర్ షో కు హాజరైన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, చిత్ర బృందంతో కలిసి కాసేపు సినిమాను తిలకించారు. ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వెంట కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్, వద్దిరాజు వెంకటేశ్వర్లు, కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘జనహిత’కు సిద్ధం!
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ చేపట్టిన జనహిత పాదయాత్రకు జిల్లాలో ఏర్పాట్లు చేశారు. సోమవారం సాయంత్రం 4:30 నుంచి ఇల్లంద మార్కెట్ నుంచి వర్ధన్నపేట టౌన్ అంబేద్కర్ సెంటర్ వరకు, అనంతరం కార్నర్ మీటింగ్ ఉంటుంది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పాదయాత్రలో ఉమ్మడి జిల్లామంత్రులు కొండా సురేఖ, సీతక్క, ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఉమ్మడి జిల్లాకు తొలిసారి రానున్న నేపథ్యంలో ఆమె పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారు. జనహిత పాదయాత్ర ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మీ, టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు క్షేత్రస్థాయిలో పర్యటించి పాదయాత్ర ఏర్పాట్లపై మార్గదర్శనం చేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండలోని డీసీసీ భవన్లో కూడా పార్టీ ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర ఏర్పాట్లతో పాటు అది విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలో అక్కడికొచ్చే వారికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలిరావాలి.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని విభాగాల శ్రేణులు స్వచ్ఛందంగా వేలాదిగా తరలివచ్చి రెండో విడత జనహిత పాదయాత్రని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పార్టీ ముఖ్యనాయకులకు దిశానిర్ధేశం చేశారు. వర్ధన్నపేటటౌన్లోని ఎమ్మెల్యే అధికార క్యాంప్ కార్యాలయంలో ముఖ్యఅతిథిగా వరంగల్ పార్లమెంట్ ఇన్చార్జ్ పీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్రాజ్తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో ఆదివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అంతకుముందే ఇల్లంద గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించే స్థలాన్ని క్షేత్రస్థాయిలో నాయకుల, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన 20 నెలల్లో దేశంలోనే ఏ ప్రభుత్వం చేపట్టలేని అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా అమలు జరుగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. మీనాక్షి నటరాజన్ మహేశ్కుమార్ గౌడ్ వర్ధన్నపేటలో నేడు కాంగ్రెస్ నేతల పాదయాత్ర పాల్గొననున్న కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి ఏర్పాట్లపై ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధుల సమీక్షలు ఇల్లంద నుంచి వర్ధన్నపేట టౌన్ వరకు పాదయాత్ర సభకు ఏర్పాట్లు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాజరుకానున్న పీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలుపాదయాత్రతోనైనా ‘సఖ్యత’ వస్తుందా.. జనహిత పాదయాత్రతోనైనా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సమన్వయలోపం గాడినపడుతుందా అన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినబడుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలోని కొందరు ముఖ్యనేతల మధ్య ఫిర్యాదుల పర్వం సాగింది. కొన్ని కార్యక్రమాల వేదికగా వారి మధ్య అనైక్యత కూడా రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికల వేళ ఈ ముఖ్యనేతల మధ్య ఈ పాదయాత్ర వల్లనైనా సయోధ్య కుదరాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. మీనాక్షి నటరాజన్ వీరికి ఏవిధంగా దిశానిర్దేశం చేస్తారోనని వేచిచూస్తున్నారు. ఇప్పటికే ఇక్కడి పార్టీ పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదికను అందుకున్న మీనాక్షి నటరాజన్ ఆ మేరకు ప్రజాప్రతినిథులతో మాట్లాడి పార్టీ పటిష్టత కోసం ఐక్యంగా ముందుకెళ్లాలని సూచిస్తారని తెలిసింది. అయితే రెండోరోజుల పాటు వీరి పర్యటన ఉండగా మంగళవారం నిర్వహించాల్సిన వర్ధన్నపేట పట్టణంలోని ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రమదానం, ఉమ్మడి జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులతో సమావేశం అర్థంతరంగా రద్దవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమైన సమావేశం ఉంటే పా ర్టీ ముఖ్యులతో ఎక్కువ సమయం వెచ్చించడం ద్వారా పార్టీ బలోపేతానికి ఉపయోగపడేదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. -
పొద్దటినుంచే బారులు
● యూరియా కోసం రైతుల పడిగాపులు ● పలుచోట్ల పోలీస్ పహారా మధ్య పంపిణీ ● సరిపడా బస్తాలు రాకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్న రైతులు నర్సంపేట: యూరియా కష్టాలు తీరడం లేదు. ఉదయం నుంచే గోదాంల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామపంచాయతీ, పాపయ్యపేట గ్రామాలలోని సొసైటీ గోదాముల వద్ద ఆదివారం పడిగాపులు కాశారు. అమీనాబాద్ గ్రామపంచాయతీ కార్యాలయంలో టోకెన్లు ఇస్తున్నారన్న విషయం తెలుసుకొని గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. రైతులు భారీగా తరలిరావడంతో పోలీ సుల పహారా మధ్య యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. యూరియా అందని రైతులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. రైతులు ఆందోళన చెందవద్దని, యూరియాను తెప్పించి అందజేస్తామని చెన్నారావుపేట, అమీనాబాద్ సొసైటీ చైర్మన్లు చింతకింది వంశీ, మురహరి రవి తెలిపారు. నర్సంపేట మండలంలో..నర్సంపేట రూరల్ : మండలంలోని కమ్మపల్లి గ్రామంలో యూరియా లారీ వచ్చిందనే సమాచారం రావడంతో ఆదివారం ఒక్కసారిగా మండలంలోని పలుగ్రామాల నుంచి సొసైటీ గోదాం వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. నర్సంపేట ఎస్సై రవికుమార్ పోలీస్ సిబ్బందితో గ్రామానికి చేరుకోని రైతులకు తొక్కిలాటకాకుండా క్యూలైన్లో నిలబెట్టించారు. లోడ్ అయిపోవడంతో కొంతమంది రైతులు వెనుదిరిగి పోయారు. ఖానాపురంలో.. ఖానాపురం: మండలంలోని అశోక్నగర్ సొసైటీ గోదాముకు శనివారం సాయంత్రం 444 బస్తాలు వచ్చాయి. ఆదివారం ఉదయం 444 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు ఉదయం 3.30 గంటల నుంచే టోకెన్ల కోసం రైతువేదిక వద్ద బారులు తీరారు. వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ అధికారులు అశోక్నగర్కు చేరుకుని టోకెన్లు అందజేశారు. ఎస్సై రఘుపతి సిబ్బందితో పర్యవేక్షణ చేపట్టారు. వర్ధన్నపేటలో.. వర్ధన్నపేట: పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తారని అధికారులు సమాచారం ఇవ్వడంతో భారీగా రైతులు రైతువేదిక వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే పడిగాపులు కాస్తున్న ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. సంగెంలో.. సంగెం: మండలంలోని నల్లబెల్లి, పల్లారుగూడ గ్రామాల్లో పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ ఆదివారం చేశారు. సంగెం సొసైటీ పరిధిలో నల్లబెల్లి, ఊకల్ సొసైటీ పరిధిలో పల్లారుగూడ గ్రామాల్లో 444 బస్తాల చొప్పున యూరియా వచ్చినట్లు తెలుసుకుని తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. నెక్కొండలో.. నెక్కొండ: నెక్కొండ సొసైటీ గోదాం వద్ద ఆదివారం ఉదయం 6 గంటలనే రైతులు బారులు తీరారు. విషయం తెలుసుకున్న ఏఓ నాగరాజు, పోలీసులు అక్కడి చేరుకుని క్యూలైన్లో ఉంచి రైతులకు యూరియా అందించేలా చర్యలు తీసుకున్నారు. -
జాగ్రత్తే రక్ష..
నర్సంపేట: జిల్లావ్యాప్తంగా గణేశ్ వేడుకల సందడి నెలకొంది. గణపతి కమిటీలు సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈనెల 27న వినాయకచవితి నుంచి నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. దీంతో విగ్రహాల కొనుగోళ్లు, మండపాల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈనేపథ్యంలో విగ్రహాల తరలింపు, విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మండపాల వద్ద కనెక్షన్ల కోసం సిబ్బందిని సంప్రదించాలని సూచిస్తున్నారు. విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు.. ● విగ్రహాల తరలింపులో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ● విగ్రహాలను మండపాలకు తరలించే క్రమంలో ముందుగా రూట్మ్యాప్ సిద్ధం చేసుకోవాలి. ● వెళ్లే దారిలో విద్యుత్ తీగల వల్ల ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే సిబ్బందికి తెలియజేసి సమస్యను పరిష్కరించుకోవాలి. ● నిమజ్జనానికి చెరువులు, వాగులు, వంకల వద్ద కు వెళ్లే సమయంలో వరుసక్రమంలో వెళ్లాలి. ● ఊరేగింపు సమయంలో చీకటి వేళ విద్యుత్ తీగలు కనబడవు. జాగ్రత్తగా వ్యవహరించాలి. మండపాల వద్ద పాటించాల్సిన నియమాలు.. ● వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీ బాధ్యులు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ● విద్యుత్ సరఫరా కోసం స్తంభాలు ఎక్కకూడదు. సిబ్బంది ద్వారా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ● నాణ్యమైన ప్రమాణాలు కలిగిన విద్యుత్ బోర్డులు, వైర్లు, స్విఛ్లు వాడాలి. ● అతుకులతో కూడిన సర్వీస్ వైర్లు వినియోగించవద్దు. కెపాసిటీ కలిగిన ఎంసీబీ వినియోగించడం ద్వారా ప్రమాదాలను తప్పించుకోవచ్చు. విద్యుత్ కనెక్షన్ పొందే సమయంలో పరిసరాలను క్షుణ్ణంగా గమనించాలి. ● ఎవరికై నా ప్రమాదం జరిగితే వెదురు, ప్టాస్టిక్ బొంగులతో రక్షించే ప్రయత్నం చేయాలి. ● మండపాలు, ఊరేగింపులు, శోభయాత్రల సమయంలో విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నంబర్ 1912కి కాల్ చేయాలి. ఆందోళన కలిగిస్తున్న ఇటీవల ప్రమాదాలు.. ఇటీవల శ్రీకృష్ణాష్టమి, వినాయక విగ్రహాల తరలింపులో విద్యుత్ ప్రమాదాలు జరిగి పలువురు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లో శ్రీకృష్ణ వేడుకలు సందర్భంగా తొమ్మిది మంది విద్యుదాఘాతానికి గురై అందులో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. అలాగే హైదరాబాద్తో పాటు నిజామాబాద్లోనూ వినాయక విగ్రహాలను తరలిస్తూ విద్యుదాఘాతానికి పలువురు మృతి చెందారు. దీంతో వినాయక వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ అధికారులు సూచిస్తున్నారు. గణేశ్ నవరాత్రులకు సర్వం సిద్ధం వినాయక విగ్రహాలను బుకింగ్ చేస్తున్న కమిటీలు విగ్రహాల తరలింపు, ప్రతిష్ట, శోభాయాత్రలో అప్రమత్తతే మేలు -
ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు బాధ్యతలు
● సన్మానించిన ఉద్యోగులు విద్యారణ్యపురి: వరంగల్ పుల్ అడిషనల్ చార్జి(ఎఫ్ ఏసీ) డీఈఓగా పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ బి.రంగయ్యనాయుడు ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 23న కలెక్టర్ సత్యశారద వరంగల్ ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన డీఈఓగా విధుల్లో చేరేందుకు తొలుత విముఖత వ్యక్తం చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డి నేటర్ సుజన్తేజ, సూపరింటెండెంట్లు బాబ్జి, జ్యోతి, ఏఎస్వో వేణుగోపాల్, టీ ఎన్జీవోజిల్లా ఉపాధ్యక్షుడు రామానుజం, జగదీశ్వర్ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. రంగయ్యనాయుడికి హనుమకొండ జిల్లా , వరంగల్ జిల్లా ఎఫ్ఏసీ డీఈఓగా గ తంలో బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది. -
డెంగీ.. పంజా
ఎంజీఎం :సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ జ్వరాలు పంజా విసురుతున్నాయి. కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురిసిన వర్షాలతో ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఆగస్టు ప్రారంభం నుంచి నేటి వరకు విషజ్వరాలతో బాధపడుతూ ఔట్ పేషంట్లు అధిక సంఖ్యలో చికిత్స పొందుతున్న క్రమంలో ఇన్పేషంట్గా 1,522 మంది అడ్మిట్ అయ్యారు. ఇందులో 59మంది బాధితులకు డెంగీ పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. కాకతీయ మెడికల్ కళాశాల కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్య లోపం హాస్టల్లో ఉండే వైద్యవిద్యార్థులు డెంగీ బారిన పడుతున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో ఓ పీజీ వైద్యుడితో పాటు నర్సింగ్ విద్యార్థులు సైతం డెంగీ బారినపడ్డారు. అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామానికి చెందిన బుచ్చిమల్లు–కవిత దంపతుల కుమార్తె సాత్విక (9) విషజ్వరంతో బాధపడగా ఎంజీఎం ఆస్పత్రికి తీసుకు రాగా డెంగీ బారినపడి ఇటీవల మృతి చెందింది. వైద్య విద్యార్థులకు తప్పని తిప్పలు.. ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందించే వైద్య విద్యార్థులు కాకతీయ మెడికల్ కాలేజీలోని హాస్టళ్లలో ఉంటూ చదువుతున్నారు. పది రోజులుగా హాస్టల్స్ పనిచేసే కార్మికులకు వేతనాలు రాకపోవడంతో విధులు బహిష్కరించి వారు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి చెత్త్తాచెదారం పేరుకుపోయి దోమల ఉధృతి పెరగడంతో వైద్యవిద్యార్థులు సైతం విషజ్వరాల బారిన పడుతున్నారు. అధికారికంగా ఓ పీజీ వైద్యుడికి డెంగీ పాజిటివ్గా నిర్ధారణ కాగా, పదుల సంఖ్యలో వైద్యవిద్యార్థులు విషజ్వరాలబారిన పడి ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు.. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో 8 మంది డెంగీబారిన పడి చికిత్స పొందుతున్నారు.వీరితో పాటు ఒకరు మలేరియాతో బాధపడుతుండగా డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. కిక్కిరిసిపోతున్న ప్రైవేట్ ఆస్పత్రులు.. సీజనల్గా విజృంభించే విషజ్వరాలతో ప్రైవేట్ ఆస్పత్రులు సైతం కిక్కిరిసిపోతున్నాయి. పేద, మధ్య తరగతి ప్రజలు ఎంజీఎంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకంలేని వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి వైద్య సేవలు పొందుతున్నారు. డెంగీబారిన కేఎంసీ వైద్యవిద్యార్థులు చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి మృతి ఎంజీఎంలో 20 రోజుల్లో 59 మందికి డెంగీ నిర్ధారణ -
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
పోలీస్ శాఖలో అందరూ సమానమే అనేలా పురుషులతో సమానంగా మహిళా అధికారులతో విధులు చేయిస్తున్నాం. ఆర్మీలో పురుషులతో సమానంగా అన్ని రకాల విధులు మహిళా అధికారులు చేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఇక్కడ డ్యూటీలు వేస్తున్నాం. ఏ డ్యూటీ వేసినా వారు చక్కగా రాణిస్తున్నారు. గతంలో కూడా అన్ని రకాల డ్యూటీలను మహిళా అధికారులు చేశారు. ప్రస్తుతం మరోసారి వారు అన్ని రకాల విధుల్లో రాణిస్తున్నారు. – సన్ప్రీత్సింగ్, పోలీస్ కమిషనర్, వరంగల్ పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వహిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రిళ్లు సైతం విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైం డయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూకోల్ట్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ విధుల్లో భాగస్వామ్యమవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు.ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో..సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వహించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నతాధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్స్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్అండ్ రెస్టారెంట్ల వద్ద ఎదురయ్యే ఆకతాయిల గొడవలు, అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రాత్రి పూట రోడ్ల వెంట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూస్తున్నారు. లాఅండ్ ఆర్డర్కు సంబంధించి పెద్ద ఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. కూడళ్లు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో తనిఖీలు పురుషులతో సమానంగా విధులు వరంగల్ కమిషనరేట్లో తమదైన ముద్రకష్టతరమై నప్పటికీ విధులకు.. -
తార స్థాయికి లారీఓనర్స్ అసోసియేషన్ గొడవ
● కొండా, రేవూరి వర్గాలుగా ఏర్పడి ఫైట్గీసుకొండ: గొర్రెకుంట పారిశ్రామిక ప్రాంతంలోని ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్లో వివాదాలు తార స్థాయికి చేరాయి. అసోసియేషన్ ఒకటైనా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేరు చెప్పి ఓ వర్గం, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి పేరు చెప్పి మరో వర్గం గొడవలకు దిగుతున్నాయి. ఫిరోజ్అలీ, షేక్ అజ్మల్ (రేవూరి వర్గం) కొంత కాలంగా అసోసియేషన్కు సంబంధించి లారీ ఓనర్లు, కార్మికులకు చెందిన రూ.32 లక్షలు కాజేశారని, బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.10 లక్షల లెక్కలు చూపించడం లేదని కొండా వర్గంగా చెప్పుకుంటున్న ఎండీ షకీల్ అహ్మద్, వేముల శ్రీకాంత్, ఇజగిరి శంకర్ ఆరోపిస్తున్నారు. లోడింగ్ ఆపవద్దని చెప్పినా వినకుండా.. కొందరు లారీల లోడింగ్ను అడ్డుకోవడంతో కలెక్టర్ సత్యశారద మూడు రోజుల క్రితం ఇరువర్గాలను పిలిచి లోడింగ్ ఆపవద్దని, ఎవరూ అడ్డుకోవద్దని చెప్పినా వినకుండా అడ్డుకుంటున్నారని రేవూరి వర్గం వారు వాపోతున్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం తమ లారీకి లోడింగ్ లేకపోవడంతో లారీ యజమాని సయ్యద్ ఇస్మాయిల్ .. వైరి వర్గం నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్కూటీపై వెళ్తుండగా కోటగండి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో తీవ్ర గాయాలైన ఆయనను వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇస్మాయిల్ కుమారుడు ఫిరోజ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ తెలిపారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన.. విషయం తెలుసుకున్న రేవూరి వర్గం లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గాయపడ్డ సయ్యద్ ఇస్మాయిల్ భార్య అబేగా ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ తన భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. వైరల్ అవుతున్న ఆడియో ఈ గొడవ ఇలా జరుగుతుండగా కొండా మురళి అనుచరుడు గోపాల నవీన్రాజు.. రేవూరి వర్గానికి చెందిన ఫిరోజ్ అలీని బెదిరిస్తూ మాట్లాడినట్లు సోషల్ మీడియాలో ఓ ఆడియో వైరల్ అవుతోంది. వెంటనే అసోసియేషన్కు వచ్చే డబ్బులు చెల్లించాలని, లేదంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటావని అతడిని బెదిరించినట్లు వాట్సాప్లో ఆడియో చక్కర్లు కొడుతోంది. -
న్యాయం కోసం వివాహిత పోరాటం
● అత్తింటివారు ఇంటిలోకి రానివ్వడం లేదని ఆందోళన నర్సంపేట: న్యాయం కోసం వివాహిత పోరాటం చేస్తున్న సంఘటన చెన్నారావుపేట మండలం గురిజాల గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ గ్రామానికి చెందిన ఈశ్వరి–యుగేంధర్రెడ్డి దంపతుల కూతురు రజితను.. గురిజాల గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి కుమారుడు రవికుమార్కు సుమారు రూ.50 లక్షల వరకట్నం వచ్చి వివాహం జరిపించారు. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉంది. కొద్ది రోజులుగా గొడవలు జరుగుతుండడంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించారు. రజిత–రవికుమార్ కలిసి ఉండాలని పెద్దమనుషులు చెప్పి పంపించారు. మళ్లీ కొద్ది రోజులుగా తన భర్త రవికుమార్ ఆయన సోదరి చెప్పే మాటలు విని ఇబ్బందులు పెడుతున్నాడని వాపోయింది. కట్నం కింద ఇచ్చిన రూ.50 లక్షలతో తన పేరు మీద ఇల్లు కొనుగోలు చేయాలని అడిగితే రవికుమార్ తన తల్లిదండ్రుల పేరుతో కొనుగోలు చేశాడని తెలిపింది. కూతురు, తల్లితో కలిసి అత్తగారి ఇంటికి శుక్రవారం సాయంత్రం రాగా అత్తమామ తనను ఇంటిలోకి రానివ్వకుండా గేటు వేశారని, శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారు జామువరకు ఇంటి ఎదుటే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని పేర్కొంది. ఇప్పటికైనా గ్రామస్తులు, పోలీసులు, ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రజిత వేడుకుంటోంది. -
నర్సంపేట సబ్జైలర్ సస్పెన్షన్
నర్సంపేట రూరల్: నర్సంపేట సబ్జైలర్ (సూపరింటెండెంట్) లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా జైలర్ పరావస్తు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని మహిళా సబ్జైలులో రిమాండ్ ఖైదీ పెండ్యాల సుచరిత అనారోగ్యంతో బాధపడుతుండగా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా లక్ష్మీశృతి నిర్లక్ష్యం చేసింది. దీంతో సుచరిత మృతి చెందింది. ఆమె మృతికి విధుల్లో నిర్లక్ష్యమే కారణమంటూ ప్రాథమిక విచారణలో తేలడంతో లక్ష్మీశృతిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ జైలర్ స్రవంతికి నర్సంపేట ఇన్చార్జ్ సబ్ జైలర్గా బాధ్యతలు అప్పగించారని, ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ట్రాక్టర్ కిందపడి వృద్ధురాలి మృతినర్సంపేట: ట్రాక్టర్ కింద పడి వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చెన్నారావుపేట మండలం అక్కల్చెడ గ్రామ శివారు కట్టయ్యపల్లెలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కట్టయ్యపల్లెకు చెందిన మంకు శశిరేఖ (60) నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటి ఎదుట శనివారం ట్రాక్టర్ సాయంతో మొరం పోయిస్తోంది. అక్కల్చెడ గ్రామానికి చెందిన పడిదం ప్రదీప్ ట్రాక్టర్ను అతి వేగంగా రివర్స్ తీస్తూ వెనుక ఉన్న శశిరేఖను ఢీకొట్టాడు. దీంతో ఇంజన్ వెనుక ఉన్న టైర్ కింద ఆమె పడి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడు ప్రదీప్రెడ్డి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్రెడ్డి తెలిపారు. వివాహిత అదృశ్యంగీసుకొండ: వివాహిత అదృశ్యమైన ఘటన గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గొర్రెకుంటకు చెందిన మౌనికకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొడిశాల గ్రామానికి చెందిన కలకోటి సురేశ్తో 12 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సురేశ్ ఉద్యోగరీత్యా కుటుంబంతో కలిసి ఒంగోలులో కిరాయి ఇంటిలో ఉంటున్నాడు. ఇంటి యజమాని వారు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయమని చెప్పడంతో భార్య, పిల్లలను తీసుకుని గొర్రెకుంటలోని మౌనిక తల్లిగారింటికి ఈ నెల 20 వచ్చాడు. ఇల్లు దొరికిన తర్వాత భార్య, పిల్లలను తీసుకుని వెళ్తానని చెప్పి అతడు వెళ్లిపోయాడు. ఈ నెల 21న మధ్నాహ్నం సుమారు 2 గంటల సమయంలో మౌనిక ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. మౌనిక అక్క రేవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ మహేందర్ తెలిపారు. ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలివర్ధన్నపేట: గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య సూచించారు. వర్ధన్నపేటలో శనివారం శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలన్నారు. యువకుడి రిమాండ్నెక్కొండ: నేరారోపణలు ఎదుర్కొన్న మండల కేంద్రానికి చెందిన ఈదునూరి విష్ణువర్ధన్ (బబ్లూ)పై శనివారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. హైదరాబాద్లో గంజాయి రవాణా చేస్తుండగా బబ్లూ పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. అలాగే, 2024లో ఓ వ్యక్తిని కొట్టిన ఘటనలో అతడిపై కేసు నమోదైంది. ఈ నెల 20న నెక్కొండ తెలంగాణ తల్లి సెంటర్లో అకారణంగా ఓ వ్యక్తిపై గొడవపడి దాడి చేయగా కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. అంతేకాకుండా మండల కేంద్రానికి వచ్చిపోయే వారిని ఇబ్బందులు పెడుతూ గొడవ పడుతుంటాడని ఆయన చెలిపారు. దీంతో అతడిపై పలు కేసులున్న కారణంగా అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. -
వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ధర్మసాగర్: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. మండలంలోని కరుణాపురం మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాల, పాఠశాలలో శనివారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వైద్య శిబిరంలో 109 మంది విద్యార్థులను పరీక్షించి వారి ఆరోగ్య సమస్యలకు తగిన మందులు అందజేశారు. దాదాపు 67 మందికి ఆర్డీటీ పరీక్షలు నిర్వహించగా.. అందరికీ మలేరియా నెగిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శృతి, డాక్టర్ రుచిత, డాక్టర్ మహేందర్ రావు, హెల్త్ సూపర్వైజర్లు ప్రసన్న కుమారి, రామ్మోహన్ రావు, హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం రజిత, ఆశ వర్కర్లు స్వరూప, రేణుక, రజిత, లక్ష్మి, రాణి, మహేశ్వరి, రాధిక, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకొని రోడ్లపై అరవడం, డ్యాన్సులు చేయడం చేస్తున్నారు. వీరిని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చినం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్● -
ఎఫ్ఏసీ డీఈఓగా రంగయ్యనాయుడు
విద్యారణ్యపురి: ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్ఏసీ) డీఈఓగా వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ)గా విధులు నిర్వర్తిస్తున్న బి.రంగయ్యనాయుడిని నియమిస్తూ కలెక్టర్ సత్యశారద శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏడీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే డీఈఓగా అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. డీఈఓ ఎం.జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్నికోలస్ ఈనెల 22న ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. డీఈఓగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. ఈ నేపథ్యంలో రంగయ్యనాయుడిని ఎఫ్ఏసీ డీఈఓగా కలెక్టర్ నియమించారు. విధుల్లో చేరేందుకు రంగయ్యనాయుడు విముఖత.. ఎఫ్ఏసీ డీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు రంగయ్యనాయుడు విముఖత చూపారు. ఆరోగ్య సమస్యలు ఉన్నందున విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్కు కూడా తెలిపారని సమాచారం. ఈ విషయంపై సాక్షి ఆయనను వివరణ కోరగా తాను డీఈఓగా విధుల్లో చేరబోనని స్పష్టం చేశారు. డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలుడీఈఓ విధుల నుంచి జ్ఞానేశ్వర్ను రిలీవ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు శనివారం హనుమకొండలోని వరంగల్ డీఈఓ కార్యాలయం ఎదుట సంబురాలు చేసుకున్నారు. బాణ సంచా కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నం సునీల్ మాట్లాడుతూ డీఈఓ వైఖరి పై తమ సంఘం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని తెలిపారు. టీఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెరిపోతు ల వంశీకృష్ణ, బాధ్యులు నాగారం మణితేజ, హనుమకొండ జి ల్లా అధ్యక్షుడు కందుకూరి యువకిశోర్, ప్రధాన కార్యదర్శి రామంచ శ్రీను, కార్యదర్శి కోట నాగరాజు పాల్గొన్నారు. -
స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మనదే
● రాష్ట్ర మంత్రులు లక్ష్మణ్, సీతక్క ● జనహిత పాదయాత్రపై సమీక్ష సమీక్షలో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, చిత్రంలో మంత్రి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు, యశస్వినిరెడ్డి, ఠాకూర్, ఎమ్మెల్సీ సారయ్య, ఎంపీలు కావ్య, బలరాంనాయక్ తదితరులు ఈ నెల 25, 26 తేదీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టనున్న జనహిత పాదయాత్ర విజయవంతానికి శనివారం హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మంత్రులు లక్ష్మణ్, సీతక్క హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వందశాతం విజయం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. – హన్మకొండ చౌరస్తా -
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
● రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్కుమార్ ● హనుమకొండ, వరంగల్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష హన్మకొండ: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, వరంగల్ కలెక్టర్ సత్యశారదతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల అమలు తీరు, సంక్షేమ, గురుకుల పాఠశాలల, కళాశాలల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులకు అందుతున్న భోజన, వసతి, జరుగుతున్న లోపాల్ని గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల, ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫిర్యాదులు పెట్టె క్రమం తప్పకుండా పరిశీలించాలని, ఫిర్యాదుల బాక్సులో వస్తున్న ఫిర్యాదులు వాటికి గల కారణాలను వెంటనే తెలుసుకొని పరిష్కార మార్గాలను చూడాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాదించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కే.ఆర్.నాగరాజు, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేష్, ఆయా గురుకులాల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
అనుమానం వస్తే తనిఖీ చేస్తున్నాం..
అర్ధరాత్రి యువత బర్త్డేలు చేసుకుని రోడ్లపై అరుస్తున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. వద్దని వారిస్తే వాగ్వాదానికి దిగుతున్నారు. బస్టాండ్, చౌరస్తా వంటి ప్రాంతాల్లో మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా వారి ఫింగర్ ప్రింట్ తీసుకుని పాత నేరస్తులు అయితే ప్రశ్నించి ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాత్రి పూట విధులు కొంత కష్టమైనప్పటికీ పోలీస్శాఖలోకి వచ్చాం కాబట్టి సంతోషంగా నిర్వహిస్తున్నాం. – ఎం.వినూష, కానిస్టేబుల్ -
పంట పొలాలను సందర్శించిన శాస్త్రవేత్తల బృందం
ఐనవోలు: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం వరంగల్ శాస్త్రవేత్తల బృందం మండలంలోని పలు గ్రామాల్లో వివిధ పంటలు, కూరగాయల సాగు క్షేత్రాలను శనివారం సందర్శించింది. ఈసందర్భంగా సీనియర్ శాస్త్రవేత్త ఎ.విజయ్భాస్కర్ మాట్లాడుతూ.. పత్తి పంటలో రసం పీల్చే పురుగుల నివారణకు వేప నూనె (1,500 పీపీఎం) ఎకరాకు లీటరు చొప్పున, ఎకరాకు 300 గ్రాముల అసిఫేట్ పిచికారీ చేయాలని సూచించారు. మొక్కజొన్న, సోయా చిక్కుడు పంటల్లో పిచికారీ చేసుకోవాల్సిన మందుల గురించి వివరించారు. వరినాట్లు ఆలస్యంగా జరుగుతున్నందున కలుపు యాజమాన్యంపై జాగ్రత్త వహించాలన్నారు. కూరగాయల పంటలైన టమాట, వంగ తోటల్లో ప్రస్తుతం చేయాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. రైతులు లింగాకర్షణ బుట్టలు పెట్టుకుని రెక్కల పురుగులను అదుపు చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజ్కుమార్, డాక్టర్ విశ్వతేజ, మండల వ్యవసాయ అధికారి సునీల్కుమార్, ఏఈఓలు అనూష, సువర్ణ, హీనా కౌసర్, ప్రసన్న లక్ష్మి, అఫ్రీన్తో పాటు అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. -
వరంగల్
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025గూడూరు మండల పరిధిలో దట్టమైన అడవిలోని భీముని పాదం జలపాతం ప్రకృతి ప్రేమికును ఆకర్షిస్తోంది. చాలెంజింగ్ విధులు...రాత్రిపూట విధులు నిర్వహించడం మహిళా పోలీసులకు చాలెంజింగ్ మారింది. బ్లూకోల్ట్ సిబ్బందితో సమానంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిర్దేశించిన డ్యూటీని నిర్వహిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న హాస్టళ్ల పరిసరాలను పరిశీలించడంతోపాటు బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర ఎదురయ్యే ఆకతాయిల గొడవలు మొదలు కొని, అనుమానిత వ్యక్తుల వివరాలు సేకరిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో బ్యాగులు తదితర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేయడం, రౌడీ షీటర్ల ఇళ్లను సందర్శించి ఉన్నారో, లేదో తెలుసుకోవడం, రాత్రి పూట నిర్వహించే వ్యాపారాలను బంద్ చేసి ఎక్కడా చిన్న ఘటన జరగకుండా చూసుకోవడం చేస్తున్నారు. దీంతోపాటు ఏదైనా లాఅండ్ఆర్డర్కు సంబంధించి పెద్ద సంఘటన జరిగితే వెంటనే బ్లూకోల్ట్స్ సిబ్బంది సహకారం తీసుకుని పరిష్కరిస్తున్నారు. పోలీస్స్టేషన్కు వెళ్లగానే చిరునవ్వుతో ఆహ్వానించే ఓ రిసెప్షనిస్ట్. అక్రమార్కుల తాట తీసే ఓ టాస్క్ఫోర్స్ టీం మెంబర్. ఇలా శాఖలోని అన్ని విభాగాల్లో ముందుంటున్నారు మహిళా పోలీసులు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అందరూ సమానమే అనేలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇన్నాళ్లు కొన్ని విధులకే పరిమితమైన వారంతా ఉన్నతాధికారుల నిర్ణయాలతో రోడ్డెక్కి విధులు నిర్వర్తిస్తున్నారు. ‘మీ భద్రతే మా బాధ్యత’ అంటూ రాత్రి వేళ సైతం విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులపై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. – వరంగల్ క్రైండయల్ 100 కాల్స్ మొదలుకుని కష్టతరమైన ఫిర్యాదుల విచారణకు సైతం మహిళా పోలీసులు సై అంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో పురుషులతో సమానంగా స్వీకరిస్తూ రంగంలోకి దిగుతున్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బ్లూ కోల్ట్స్ విధుల్లో పురుషులతో కలిసి సమర్థంగా రాణిస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. మహిళా నేరస్తులను జైళ్లకు తరలించే క్రమంలో ఎస్కార్ట్గా, నేతల సభలకు షార్ట్ వెపన్లతో హాజరై సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లలో రూల్కాల్ ఉదయం 9 గంటలకు చేపడుతున్నారు. అప్పటి నుంచి 2 గంటల వరకు విధులు నిర్వహించి.. ఆ తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు డ్యూటీలో కొనసాగుతున్నారు. రాత్రి డ్యూటీ ఉన్నవారు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. రిసెప్షన్ విధులు నిర్వర్తించే మహిళలు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు డ్యూటీలో ఉంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి 9 గంటల వరకు మరొకరు విధులు చేపడుతున్నారు. వీరికి 24 గంటల పాటు రెస్ట్ దొరుకుతుంది. మహిళా పోలీస్ అధికారులు అత్యంత హుషారుగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇందుకు వేతనంతో పాటు 30 శాతం అదనంగా చెల్లిస్తారు. దీనికి తోడు ఉన్నత అధికారుల నుంచి విధులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతో ట్రాఫిక్ విధుల్లో మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ట్రైసిటీ పరిధి ట్రాఫిక్ పోలీస్స్టేషన్లలో ఒక ఇన్స్పెక్టర్, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఏడుగురు కానిస్టేబుళ్లు, ఒకరు హోంగార్డు విధుల్లో కొనసాగుతున్నారు. పోస్టు సంఖ్య డీసీపీ 01సీఐ 02 ఎస్సై 24 ఏఎస్సై, హెడ్కానిస్టేబుళ్లు 245కానిస్టేబుళ్లు 352 హోంగార్డులు 70 -
పాదయాత్రను విజయవంతం చేయాలి
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వర్ధన్నపేట: ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ ఈ నెల 25న ఇల్లంద మార్కెట్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు చేపట్టిన జనహిత పాదయాత్రను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చా రు. పాదయాత్ర ఇన్చార్జ్లు ఎమ్మెల్సీ శంకర్నాయక్, పులి అనిల్, జూలూరి ధనలక్ష్మి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, నమిండ్ల శ్రీనివాస్, బొంతు రామ్మోహన్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనుబాబు, పల్లె శ్రీనివాస్, మోత్కూరి ధర్మారావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి ఎమ్మెల్యే నాగరాజు శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తోందని తెలిపారు. చీకటి ఒప్పందం కుదుర్చుకుని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో లక్ష ఓట్ల మెజారి టీ వచ్చిన వారిని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. నాయకులు కేఆర్ దిలీప్రాజ్, పిన్నింటి అనిల్రావు, తూళ్ల రవి, ఎద్దు సత్యనారాయణ, అబ్బిడి రాజిరెడ్డి పాల్గొన్నారు. -
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత
ధర్మసాగర్: బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె పట్టాభి రామారావు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్. కె.పట్టాభిరామారావు, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రామలింగం, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రావణ స్వాతితో కలిసి మాట్లాడారు. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తే చట్టరీత్య నేరమని, అందుకు సహకరించిన వారు శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం అర్చక సమాఖ్యతో పాటు పురోహితులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జాగృతి పోలీస్ కళా బృందం వారు నాటక ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సీఐ, ప్రవీణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్ సంతోశ్, జిల్లా బాలల పరిరక్షణ ఇన్చార్జ్ అధికారి ఎస్.ప్రవీణ్ కుమార్, సఖి వన్ స్టాప్ సెంటర్ అడ్మిన్ హైమావతి, జిల్లా మిషన్ శక్తి కో–ఆర్డినేటర్ కళ్యాణి, ఎస్ఐ జానీ పాషా, జాగృతి పోలీస్ కళా బృందం, మండల ప్రాజెక్ట్ మేనేజర్, ఏఓ రాజేశ్, సర్వోదయ యూత్ ఆర్గనైజషన్, జెండర్ ఎక్స్పర్ట్ ఇందిర, అంగన్వాడీ టీచర్లు, గ్రామైక్య సంఘం వీఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచండి
● సెప్టెంబర్ 15 నాటికి గృహ ప్రవేశాలకు సిద్ధమవ్వాలి ● కలెక్టర్ స్నేహ శబరీష్కమలాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండలంలోని గూడూరు, కమలాపూర్, మర్రిపల్లిగూడెంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాలను, మండలంలోని దేశరాజుపల్లిలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని గృహ నిర్మాణ, ఆర్అండ్బీ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో మౌలిక వసతుల కల్పన, దేశరాజుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి గురించి ఆయా శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సెప్టెంబర్ 15 వరకు గృహ ప్రవేశాలకు సిద్ధం చేసి ఉంచాలని లబ్ధిదారులు, అధికారులకు సూచించారు. 45 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభించకపోతే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీఓ గుండె బాబు, తహసీల్దార్ సురేశ్కుమార్, హౌసింగ్ డీఈ సిద్ధార్థ నాయక్, ఆర్అండ్బీ డీఈ రాజు పాడ్యా, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
● డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య నడికూడ: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని కంఠాత్మకూరులో ఇంటింటికీ తిరిగి పరిసరాలను పరిశీలించారు. గ్రామస్తులకు డెంగీ నివారణపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉంటే సీజన్ వ్యాధులతో పాటు, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ప్రజలకు ఫీల్డ్లో అందుబాటులో ఉంటూ.. ఇంటింటికీ వెళ్లి చికిత్స అందించాలన్నారు. సమయపాలన పాటిస్తూ.. మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ దివ్య, ఏఎన్ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు. -
శనివారం శ్రీ 23 శ్రీ ఆగస్టు శ్రీ 2025
విద్యారణ్యపురి: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంపునకు (శనివారం) నుంచి ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) (ఏఐ ఆధారిత ముఖ గుర్తింపు)ను అమలు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ బోర్డు అధికారులు సెంటర్ బోర్డ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) సాంకేతిక సహకారంతో టీజీబీఐఈ – ఎఫ్ఆర్ఎస్ యాప్ను ఇప్పటికే సిద్ధం చేశారు. ప్రతీరోజు రెండు సార్లు (ఉదయం, మధ్యాహ్న భోజనం తర్వాత) హాజరు తీసుకుంటారు. ఈమేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. కళాశాలకు ఏ విద్యార్థి అయినా హాజరుకాకుంటే అతడి తల్లిదండ్రుల ఫోన్కు సందేశం వెళ్తుంది. ఈ హాజరును ఆ కళాశాల ప్రిన్సిపాల్, డీఐఈఓ, రాష్ట్ర అధికారులు కూడా పర్యవేక్షిస్తారు. ఎఫ్ఆర్ఎస్ అమలుపై గత గురువారం ఆయా జిల్లాల్లో డీఐఈఓలు.. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమావేశాలు నిర్వహించి హాజరు అమలు విధానాన్ని తెలియజేశారు. హనుమకొండ, వరంగల్లో డీఐఈఓలు ఎ.గోపాల్, శ్రీధర్సుమన్ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, విద్యార్థుల వివరాలురోజుకు రెండుసార్లు హాజరు నమోదు ● గైర్హాజరైతే తల్లిదండ్రుల ఫోన్లకు సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 50 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు2,9002,013● అధ్యాపకులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి టీజీబీఐ ఈ –ఎఫ్ఆర్ఎస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందులో విద్యార్థుల ఫొటోతో సహా వివరాలు నమోదు చేయాలి. ● తరగతి ప్రారంభమయ్యాక స్మార్ట్ ఫోన్లో ఆ యాప్ ద్వారా కెమెరా ఓపెన్ చేసి వీడియా మాదిరిగా కూర్చున్న విద్యార్థులను తీసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా ఫొటో క్యాప్చర్ అయి హాజరు నమోదవుతుంది. ● ఈ విధానంతో 15నుంచి 20 సెకన్లలోనే 80మంది విద్యార్థుల వరకు హాజరు నమోదు చేయవచ్చని చెబుతున్నారు. ● ముఖ హాజరుకు శుక్రవారంనుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు. ఇంకా చేపట్టనివారు ఉంటే ఈనెల 23న చేపడతారు. ● కళాశాలల సమయం ఉదయం 9:30 గంటల నుంచి ప్రతీ తరగతి గదిలోని తొలి పీరియడ్ తీసుకునే అధ్యాపకుడు విద్యార్థుల ఎఫ్ఆర్ఎస్ హాజరు నమోదు చేస్తారు. ● మళ్లీ మధ్యాహ్నం లంచ్ తర్వాత 2గంటలకు మరోసారి నమోదు చేస్తారు. ప్రతీ జిల్లాకు ఇద్దరికి ఏఐ చాంపియన్లుగా శిక్షణ ఇంటర్ విద్యలో కృత్రిమ మేధ పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర బోర్డు నిర్ణయించింది. విద్యలో నాణ్యత పెంపు, విద్యార్థుల్లో నైపుణ్యాల అ భివృద్ధి, సరికొత్త సాంకేతికత పరిచయం కోసం ఏఐని విని యోగించుకోనున్నారు. దీనిపై పట్టున్న సిబ్బందిని గుర్తించి ఏఐ చాంపియన్లుగా ఎంపిక చేసింది. ప్రతీ జిల్లాలోని అకడమిక్ మానిటరింగ్ సెల్లోని ఇద్దరు లెక్చరర్లు, ఒక లైబ్రేరియన్, ప్రతీ జిల్లాకు ఏఐ చాంపియన్లుగా ఎంపికై న ఒక లెక్చరర్, నాన్టీచింగ్ సిబ్బందికి శుక్రవారం హైదరాబాద్లో సంబంధిత ఉన్నతాధికారులు ఏఐ ఎఫ్ఆర్ఎస్ అమలు, వినియోగంపై శిక్షణ ఇచ్చారు. 1,2721,000విద్యార్థులకు రోజుకు రెండు సార్లు హాజరు మానుకోట1,3501,200734821520535యాప్ డౌన్లోడ్ విధానం తన మొబైల్ ద్వారా చూపిస్తున్న వరంగల్ డీఐఈఓ శ్రీధర్ సుమన్ జనగామ1,050950ఇంటర్లో హాజరుశాతాన్ని పెంచేందుకే.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు తక్కువగానే ఉంటోంది. ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థుల్లో మధ్యాహ్నం భోజనం కోసం కొందరు ఇంటికి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. తిరిగి రావడం లేదు. ఇంటివద్ద కాలేజీకి అని చెప్పి డుమ్మా కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. పరీక్షల్లో ఉత్తీర్ణత తక్కువగా రావడానికి కూడా విద్యార్థులు తరగతులకు సరిగా హాజరుకాకపోవడమే అనేది ఇంటర్బోర్డు అధి కారులు భావిస్తున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారంగానే ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారన్నది స్పష్టమవుతోంది. నేటినుంచే అమలు.. రిజిస్ట్రేషన్ షురూ -
గత పాలకుల దోపిడీతో దిగజారిన ఆర్థిక స్థితి
● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపరకాల: గత పాలకుల దోపిడీతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారి ఆర్థిక పరిస్థితి దిగజారిందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. పరకాల మండలం నాగారం, పోచారం గ్రామాల్లో అంగన్వాడీ భవనాలకు, అలియాబాద్ గ్రామంలో కొత్త గ్రామపంచాయతీ కార్యాలయ భవనానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా ఇచ్చిన మాటలకు కట్టుబడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుబాటు చేసుకుంటూ అంచలవారీగా ప్రాధాన్య క్రమంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీను, పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ధర్మకర్తల ప్రమాణ స్వీకారం
కమ్మగోని ప్రభాకర్గౌడ్(కొత్తపల్లి), కూస చిరంజీవి (పెరుమాండ్ల గూడెం), గడ్డం రేణుక(ఐనవోలు), బరిగెల ఆనందం (ఐనవోలు), నూనావత్ కీమా (డీసీ తండా), గుంటి కుమారస్వామి (ఇల్లంద), బందెల వెంకన్న (దౌలత్నగర్), బోయిని మహేందర్ (వెంకటాపురం), బాలబోయిన రాజయ్య (గర్మిళ్లపెల్లి), మందల నర్సింహారెడ్డి (కొండపర్తి), మడూరి రాజు (పంథిని), ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్ పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేశారు. ధరం పూర్ణచందర్ (పర్వతగిరి), దాత సిరిమిల్ల వరలక్ష్మి (రంగారెడ్డి జిల్లా), పోలెపల్లి బుచ్చిరెడ్డి (నర్సింహులగూడెం) ప్రమాణ స్వీకారం చేయలేదు. వీరు 30 రోజుల్లోపు ప్రమాణ స్వీకారం చేయవచ్చని ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ఐనవోలు: సుప్రసిద్ధ ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో శుక్రవారం ధర్మకర్తల పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం జరిగింది. డివిజన్ ఇన్స్పెర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ అధ్యక్షుడు మార్నేని రవీందర్రావు హాజరయ్యారు. ముందుగా.. ధర్మకర్తలతో పదవీ, గోప్యత ప్రమాణ స్వీకారం చేయించారు. 15 మంది ధర్మకర్తలకుగాను 12 మంది మాత్రమే హాజరయ్యారు. 12 మందిలో చైర్మన్గా కమ్మగోని ప్రభాకర్ను సభ్యుడు మడూరి రాజు ప్రతిపాదించగా.. బందెల వెంకన్న బలపర్చారు. మిగిలిన సభ్యులు ఆమోదించారు. దీంతో కమ్మగోని ప్రభాకర్ను చైర్మన్గా నియమించారు. నేటి నుంచి సంవత్సర కాలం పాటు వీరు పదవిలో కొనసాగనున్నారు. ఆలయ ఈఓ కందుల సుధాకర్.. కమిటీ సభ్యులను, చైర్మన్ను పూలమాలలు వేసి కండువాలతో సత్కరించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టీజీ క్యాబ్ చైర్మన్ నాయకులకు అభినందనలు తెలిపి సత్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి సరైన ప్రణాళికలు వేసుకుని నూతన కమిటీతో అభివృద్ధి చేస్తామన్నారు. అంతకుముందు మండలంలోని ఉడుతగూడెంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాలనికి శంశుస్థాపన చేశారు. చైర్మన్గా కమ్మగోని ప్రభాకర్ 15 మంది సభ్యులకు 12 మంది హాజరు -
జాతీయ రహదారులకు వరంగల్ మహానగరం అనుసంధానం
సాక్షిప్రతినిధి, వరంగల్ : ‘భారత్ మాల’ప్రాజెక్టు గ్రేటర్ వరంగల్కు వరంగా మారనుంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన జాతీయ రహదారులు వరంగల్ నగరాన్ని తాకేలా రూపుదిద్దుకుంటున్నాయి. ఇప్పటికే భువనగిరి – ఆరెపల్లి నేషనల్ హైవే పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. సిద్దిపేట – ఎల్కతుర్తి (765 డీజీ) హైవే రూ.578 కోట్లతో 64 కి.మీ.లు పూర్తి చేశారు. ఆ రోడ్డు సైతం 563 ఎన్హెచ్ నుంచి వరంగల్ ఔటర్ రింగు రోడ్డును తాకేలా డిజైన్ చేశారు. జగిత్యాల – కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి (ఎన్హెచ్ 563) నిర్మాణ పనులు సగం వరకు పూర్తయ్యాయి. తాజాగా వరంగల్ – ఖమ్మం నేషనల్ హైవేను సైతం భారత్ మాల కింద ఫోర్లేన్ రోడ్డుగా మార్చనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. వీటికి తోడుగా నాగపూర్– విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే వరంగల్ మీదుగానే వెళ్తుండడంతో గ్రేటర్ వరంగల్ జాతీయ రహదారులకు సెంటర్ పాయింట్ కానుంది. త్వరలోనే ఎయిర్పోర్టు రానుండడం... ఎన్హెచ్ల అనుసంధానంతో రవాణా పరంగా వరంగల్కు ఉపయోగం కలగనుంది. ఔటర్ రింగ్ రోడ్డుతోనూ లింకు.. కరీంనగర్ – వరంగల్ మధ్యన ఈ రహదారి పొడవు 68.34 కిలోమీటర్లు కాగా, రూ.2,164 కోట్లతో ఈ పనులు సాగుతున్నాయి. గ్రేటర్ వరంగల్ను తాకుతూ వెళ్తున్న మంచిర్యాల–విజయవాడ జాతీయ రహదారికి.. మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 112 కి.మీ.లు, రూ.2,490 కోట్లు కేటాయించారు. మంచిర్యాల నుంచి మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పరకాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర మీదుగా వెళ్లే రోడ్డు పనులు మొదట భూసేకరణ వల్ల ఆలస్యమైనా ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. వరంగల్ – ఖమ్మం మధ్య రహదారి 107 కి.మీ.ల కోసం రూ. 2,249 కోట్లు కేంద్రం కేటాయించగా, 1,410 ఎకరాల భూసేకరణ ప్రకియ జరిగింది. మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలో ఉండే ఈ రహదారి.. గ్రేటర్ వరంగల్ విలీన ప్రాంతాలతోపాటు ఊరుగొండ, గీసుకొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం తదితర ముఖ్య పట్టణాలను తాకుతుంది. 765 డీజీగా పేరున్న సిద్దిపేట – ఎల్క తుర్తి రోడ్డు పొడవు 64 కి.మీ.లు కాగా.. ఈ రోడ్డు కోసం రూ.578 కోట్లు కేటాయించారు. ఆ రోడ్డు నిర్మాణం పూర్తి కాగా.. సిద్దిపేట, హుస్నాబాద్, ఎల్కతుర్తి ద్వారా వరంగల్కు చేరుకుంటున్నారు. ఐదేళ్ల కిందట అప్పటి సీఎం కేసీఆర్ సంగెం వద్ద శంకుస్థాపన చేశారు. వరంగల్ నూతన మాస్టర్ప్లాన్లో కొత్త ప్రాజెక్టు రీజినల్ ఔటర్ రింగురోడ్డు నగర శివారు నుంచి వెళ్లే ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానం చేసేలా డిజైన్ చేసినా పెండింగ్లో ఉంది. సుమారు 135 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ ఓఆర్ఆర్ కూడా అసంపూర్తిగా ఉంది. తక్షణమే ఆర్ఆర్ఆర్, ఓఆర్ఆర్లకు నిధులు విడుదల చేసి పూర్తి చేస్తే.. ఐదు జాతీయ, రాష్ట్ర రహదారులతో గ్రేటర్ వరంగల్కు మహర్దశ పట్టనుంది. నగరాభివృద్ధికి దోహదం నగరం చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారుల విస్తరణతోపాటు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే నగరాభివృద్ధికి ఎంతగానే తోడ్పడతాయి. భారీ ట్రక్కులు, ఇతర వాణిజ్య వాహనాలు నగరంలోకి వెళ్లకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు నగరానికే మణిహారంగా నిలుస్తుంది. – మేరుగు అశోక్, శివనగర్, వరంగల్రవాణా వ్యవస్థ బలోపేతం.. రహదారుల నిర్మాణం వల్ల నగరంలో వాణిజ్య కార్యకలాపాలు అధికంగా పెరుగుతాయి. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో నగరంలో ట్రాఫిక్ తగ్గి ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్ ఉంది. మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. అదేవిధంగా మామునూరు ఎయిర్పోర్ట్ట్ పూర్తి చేస్తే వాణిజ్యంగా అభివృద్ధి చెందుతుంది. – గడ్డం రవి, వరంగల్ కొత్త పరిశ్రమలకు అవకాశం జాతీయ రహదారుల వల్ల వరంగల్ నగరం వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతుంది. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశం ఉంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సైతం మెరుగుపడతాయి. – రామచంద్రారెడ్డి, రైతు, హసన్పర్తి తాజా నిర్ణయంతో ఫోర్ లేన్ రోడ్డుగా వరంగల్–ఖమ్మం హైవే మామునూరు ఎయిర్పోర్ట్కూ కొత్త రోడ్డు స్పీడ్గా మంచిర్యాల – విజయవాడ, వయా వరంగల్ గ్రీన్ఫీల్డ్ హైవే పనుల్లో వేగం -
కుష్టు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
ఎంజీఎం: కుష్టు వ్యాధి రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కుష్టు నివారణ బృంద సభ్యులు అన్నారు. శుక్రవారం దేశాయిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బృందం సందర్శించింది. అక్కడి వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు వ్యాధిపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రిపోర్ట్స్, రికార్డ్ని పరిశీలించి కుష్టు వ్యాధి సర్వేపై వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర బృంద సభ్యులు డీపీఎంఓ వెంకటేశ్వర చారి, సకలరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏపీఎంఓ అరుణ సుందర్, డిప్యూటీ డీఎంహెచ్ఓ కొమురయ్య, జిల్లా లెప్రసీ అధికారి మోహన్సింగ్, డీపీఎంఓ అనుపమ, వెంకన్న, స్థానిక మెడికల్ ఆఫీసర్ భరత్ కుమార్, నోడల్ పర్సన్లు జన్ను కొర్నెల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈవిద్యాసంవత్సరం 2025–26లో ప్రవేశాలకు టీజీఐసెట్ అభ్యర్థులకు శుక్రవారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పారంభమైంది. ఈమేరకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో, హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ హెల్ప్లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభమైంది. ఆర్ట్స్ కాలేజీలో ధ్రువపత్రాలను ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి అందజేశారు. కేడీసీలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గుర్రం శ్రీనివాస్ అందజేశారు. కాజీపేట అర్బన్: హనుమకొండ జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి ప్రేమకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో ఎస్జీటీ, పీడీ, స్కూల్ అసిస్టెంట్, హిందీ పండిట్, టీపీ–2 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 30లోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. విద్యారణ్యపురి: జిల్లాలోని ఇన్స్పైర్ మనక్ 2025–26పై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు ఈనెల 23న హనుమకొండలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సదస్సు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూళ్లలోని ఇన్స్పైర్ ఇన్చార్జ్లు విద్యార్థులతో నామినేషన్లు వేయించేలా శిక్షణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈనెల 23న ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే సమావేశానికి భీమదేవరపల్లి, దామెర, హనుమకొండ, హసన్పర్తి, కాజీపేట, ఐనవోలు మండలాల ఉపాధ్యాయులు పాల్గొనాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే సమావేశానికి ఆత్మకూరు, ధర్మసాగర్, ఎల్క తుర్తి, కమలాపూర్, నడికూడ, పరకాల, శాయంపేట, వేలేరు మండలాల ఉపాధ్యాయులు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు. -
అభివృద్ధి కోసమే ‘పనుల జాతర’
ఎల్కతుర్తి: వివిధ అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకే పనుల జాతర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం భీమదేవరపల్లి మండలం మాల్లారంలో రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్లగడ్డ తండాలో రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. వీరభద్రస్వామి దేవాలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగానే హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం తన బాధ్యత అని, అనాడు ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్రెడ్డి అని, ఈనాడు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు కేటాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియకు రైతులు సహకరించాలని కోరారు. వీర్లగడ్డ తండాలోని గ్రామ పంచాయతీ ఆవరణలో అధికారులు, స్థానికులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. స్థానికులు బస్సు, తాగునీటి సౌకర్యాల గురించి మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ డెరెక్టర్ సురేశ్బాబు, డీఆర్డీఓ మేన శ్రీను, ఆర్డీఓ రమేశ్ రాఽథోడ్, పంచాయతీ రాజ్ ఈఈ ఆత్మారాం, తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ -
అభివృద్ధి పనులు మరింత పారదర్శకం
హన్మకొండ అర్బన్: గ్రామీణ ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా, ఫలప్రదంగా ఉండేలా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ .. అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పనుల జాతర – 2025 ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ఆగస్టు 22న జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రూ.15.61 కోట్లతో 2,802 పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. వీటిల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు భాగస్వాములు కావాలని తెలిపారు. ఆగస్టు 22న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ అధ్వర్యంలో గత సంవత్సరం చేపట్టి పూర్తయిన పనులను ప్రజాప్రతినిధులను ఆహ్వానించి ప్రారంభోత్సవాలు, కొత్తగా చేపట్టిన పనుల భూమి పూజ చేసి మొదలుపెట్టించాలని ఆదేశించారు. వనమహోత్సవం నిర్వహించి పండ్లు, నీడ నిచ్చే మొక్కలను నాటించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, తదితర అధికారులు పాల్గొన్నారు. ● కలెక్టర్ స్నేహ శబరీష్ -
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
● అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, ముల్కనూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ముందుగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అనంతరం కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని సందర్శించారు. విద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. కూరల్లో నీళ్లు ఎక్కువగా ఉన్నాయని, ఫుడ్ పాయిజన్ కాకుండా నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఓ జ్యోతికి సూచించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఔషధ నిల్వలు, ఫీవర్ సర్వే, సుఖ ప్రసవాలు, తదితర అంశాల నమోదు తీరును డాక్టర్ ప్రదీప్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఉనికచర్లలో ఇసుక బజార్ ఏర్పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల కోసం మూడు రోజుల క్రితం ధర్మసాగర్ మండలం ఉనికిచెర్ల గ్రామంలో ఇసుక బజార్ను ప్రారంభించినట్లు వెంకట్రెడ్డి తెలిపారు. ఈ ఇసుక బజార్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టన్నుకు ఇసుక రూ.వెయ్యి ఉంటుందని, రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాలన్నారు. త్వరలో భూ భారతి దరఖాస్తులను పరిశీలిస్తామని, వారసత్వం, మ్యుటేషన్, మిస్సింగ్, సర్వేనంబర్ల దరఖాస్తులను దశలవారీగా పరిశీలించి సర్వే అనంతరం పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీధర్, విజయ్భాస్కర్ తదితరులు ఉన్నారు.యోగా ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేయండి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న భీమదేవరపల్లి మండలం ముల్కనూరు ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల యోగా ఇన్స్పెక్టర్కు మెమో జారీ చేయాలని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి.. ఆ వైద్యశాల డాక్టర్ సరితకు ఆదేశాలు జారీ చేశారు. హోమియోపతి వైద్యశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో యోగా ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సురేశ్ కొద్ది రోజులుగా విధులకు గైర్హాజరు అవుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో వైద్యాధికారి డాక్టర్ సరితను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అతడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని, మెమో జారీ చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలు శారీరక రుగ్మతల బారిన పడకుండా హోమియో వైద్యశాలల్లో హెల్త్ వెల్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసి యోగా శిక్షణ అందిస్తున్నామన్నారు. విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. -
నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
● రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖహన్మకొండ: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం హనుమకొండ రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో మేయర్ గుండు సుధారాణి, వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీష్, కమిషనర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి రెండు జిల్లాల్లో వివిధ అభివృద్ధి పనులు, వాటి పురోగతి, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పరిస్థితులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ కల త్వరలో సాకారం కానుందని, ఇందుకు అవసరమైన భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. 2057 జనాభాను దృష్టిలో పెట్టుకొని రూ.4,170 కోట్లతో వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్ధను ఏర్పాటు చేస్తున్నామని, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాల్సి ఉందన్నారు. భద్రకాళి ఆలయ మాడ వీధులతోపాటు కల్యాణ మండపం, పూజారి నివాసం, విద్యుత్ అలంకరణలను వచ్చే దసరా నాటికి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళికను రూపొందించుకొని పనిచేయాలని ఆదేశించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్ బస్ స్టేషన్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, ఇందిరమ్మ ఇళ్ల, డబుల్ బెడ్రూంలు, ఇతర అభివృద్ధి పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, సాగునీటి పారుదల శాఖ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ రాంప్రసాద్, ‘కుడా’ పీఓ అజిత్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరంనుంచి పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విష యం తెలిసిందే. ఇప్పటికే పలు పాఠశాలల్లో చిన్నారులకు అడ్మిషన్లు కల్పించారు. ప్రభుత్వం తాజాగా సమగ్ర శిక్ష ద్వారా పూర్వ ప్రాథమిక తరగతుల విద్యార్థుల కోసం నిధులు మంజూరు చేసి విడుదల చేసింది. ఒక్కో స్కూల్కు రూ.1.70లక్షల నిధులను కలెక్టర్లకు జమ చేశారు. హనుమకొండ జిల్లాలో 45 పూర్వ ప్రాథమిక తరగతులకు నిధులు మంజూరై విడుదలయ్యాయి. అందులో 25 స్కూళ్లకు రూ.1.70లక్షల చొప్పున, మరో 20 స్కూళ్లకు రూ.50వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. రంగులు, విద్యార్థులకు ఆట వస్తువులు ఆయా పాఠశాలల్లోని పూర్వ ప్రాథమిక తరగతి గదికి రూ.50వేలు వెచ్చించి రంగులు వేయించాల్సి ంటుంది. ఆట వస్తువులు కొనుగోలు చేయాలి. ఒక్కో విద్యార్థికి రూ.1,000 కేటాయించి బ్యాగ్, షూస్, బెల్ట్, టై తదితర వస్తువులు కొనుగోలు చేయాలి. ఈ నిధులు జిల్లా కలెక్టర్లకు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంపై కూడా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్.. డీఈఓలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాల కలెక్టర్లు ప్రతీ పూర్వ ప్రాథమిక తరగతి విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టర్ నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. జిల్లా పాఠశాలలు నిధులు హనుమకొండ 65 52.50 వరంగల్ 32 54.40 ములుగు 08 13.60 మహబూబాబాద్ 22 37.40 భూపాలపల్లి 54 78.60 జనగామ 15 21.90 కొన్నింటికి రూ.1.70లక్షలు, మరికొన్నింటికి రూ.50వేల చొప్పున విడుదల తరగతి గదికి కలర్, ఆటవస్తువులకు, విద్యార్థులకు బ్యాగ్, షూస్, టై, బెల్టులు త్వరలోనే ఆయాలు, ఇన్స్ట్రక్టర్ల నియామకం -
మాజీ కౌన్సిలర్ సహా కుమారుడిపై దాడి
● భార్య అడ్డుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు ● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలు పరకాల: పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు ప్రశాంత్పై నడిరోడ్డుపై దాడి చేశారు. ఈ ఘటన పరకాలలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం ఈ వీడియో వైరలైంది. రెండు నెలల్లో రెండుసార్లు అల్లె దశరథంపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. పాత గొడవల కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. దశరథం ఇటీవల అంబాల రోడ్డులో బైక్పై వెళ్తుండగా కొందరు వ్యక్తుల చేతుల్లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే బుధవారం వెల్లంపల్లి రోడ్డులోని బంధువుల శుభకార్యం వద్ద జరిగిన వివాదం చివరకు మాజీ కౌన్సిలర్ అల్లె దశరథంతోపాటు అతడి కుమారుడు దాడికి దారితీసినట్లు సమాచారం. తండ్రీకొడుకులిద్దరిని నలుగురు వ్యక్తులు నడిరోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దశరథం భార్య రజిత ఒకవైపు భర్తను.. మరోవైపు రోడ్డుపై పడిపోయిన కొడుకును కొట్టొదంటూ అడ్డుకోవడానికి ప్రయత్నించింది. ఈ ఘటనపై ఇరువర్గాలు స్థానిక పోలీసులను ఫిర్యాదు చేసుకోగా కేసు నమోదు చేశారు. ఓ ఫంక్షన్ వద్ద జరిగిన వివాదం దాడికి దారితీసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. ఆయుధాలతో దాడులు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. -
పదోన్నతులతోపాటు బాధ్యతలూ పెరుగుతాయి
వరంగల్ క్రైం : ఉద్యోగులకు పదోన్నతులతోపాటు బాధ్యతలు పెరుగుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సూచించారు. కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన సుధాకర్, సంపత్ కుమార్, రవీందర్, కిరణ్ కుమార్, శ్రీనివాస్, జె. శ్రీనివాస్, శ్రీనివాస్రావు, రమేశ్, ప్రభాకర్, కిషన్ రావు, రవీందర్, ప్రభాకర్, కీర్తి నాగరాజు, నరేందర్, వెంకటస్వామి గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై సీపీ స్వయంగా పట్టీలను అలంకరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే బాధితులకు పోలీసులపై భరోసా, నమ్మకాన్ని కలిగించాలన్నారు. నిరుపేదలకు పోలీస్ అధికారులు అండగా నిలవాలని సూచించారు. హన్మకొండ అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ జరపనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. హన్మకొండ చౌరస్తా: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గురువారం ఢిల్లీలో మర్యాద పూర్వకంగా కలిశారు. వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ను త్వరితగతిన ప్రారంభించాలని మంత్రి నడ్డాకు వినతిపత్రం అందించారు. సానుకూలంగా స్పందించిన ఆయన త్వరలోనే ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు ఎంపీ కావ్య తెలిపారు. హన్మకొండ : మెరుగైన సేవల కోసం ప్రయాణికులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నేడు (శుక్రవారం) ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, తరిగొప్పుల, పాలకుర్తి రూట్ ప్రయాణికులు 99592 26047 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. రామన్నపేట: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం టీజీఐసెట్ –2025 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా నేటి (శుక్రవారం) నుంచి వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్లైన్ సెంటర్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని ఆ కళాశాల ప్రిన్సిపాల్, వరంగల్ టీజీఐసెట్ హెల్ప్లైన్ క్యాంప్ ఆఫీసర్ డా.బైరి ప్రభాకర్ తెలిపారు. ఈనెల 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, 25 నుంచి 30వ తేదీ వరకు ఆప్షన్ ఎంట్రీ, 30న ఆప్షన్ ఫ్రీజింగ్, సెప్టెంబర్ 2 తేదీ లోపు సీట్ల ప్రొవిజనల్ అలాట్మెంట్, 2వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ట్యాషన్ ఫీజు చెల్లింపు, స్వీయ రిపోర్టింగ్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు తమ డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకొని, సమయపాలన పాటించి కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. -
డీటీఓ కార్యాలయాలు!
సాక్షిప్రతినిధి, వరంగల్: రవాణాశాఖ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలు ఆగడం లేదు. అన్ని పనులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ఏజెంట్లు, ప్రైవేట్ వ్యక్తులు రూ.లక్షలకు పడగలెత్తుతుండగా.. అధికారుల ఆదాయం, అక్రమాస్తులకు హద్దూపద్దు లేదు. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు జరిపిన దాడుల్లో వెల్లడవుతున్న ఆస్తుల వివరాలే ఇందుకు సాక్ష్యం. మే 7న ఏకంగా వరంగల్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంటిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై దాడులు చేసిన ఏసీబీ.. ఆ తర్వాత ఈ జిల్లాలో పనిచేసి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న జగిత్యాల డీటీఓ భద్రునాయక్ రూ.22 వేలు తీసుకుంటుండగా ఆగస్టు 6న పట్టుకున్నారు. తాజాగా వరంగల్, హనుమకొండలో ఎంవీఐగా పనిచేసిన జి.వివేకానంద రెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం రవాణాశాఖలో కలకలం రేపుతోంది. నెల రోజుల కిందట వివిధ పనుల కోసం ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణల మేరకు వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ.. కొందరు సీనియర్ ఎంవీఐల ఆస్తులపై ఆరా తీస్తుండడం హాట్టాపిక్గా మారింది. అంతులేని ఆదాయం.. పోస్టింగ్ కోసం పోటాపోటీ రవాణాశాఖలో అంతులేని ఆదాయం ఉండటంతో కొందరు అధికారులు పోటీపడి పోస్టింగ్లు కొడుతున్నారు. కొందరు మోటారు వెహికిల్ ఇన్స్పెకర్లు ఇప్పుడు ఇన్చార్జ్ డీటీఓలుగా కూడా అన్నీ తామై వ్యవహరిస్తున్నారు. ఇందులో కూడా కొన్నిచోట్ల సీనియర్లు తిరకాసు చేసి జూనియర్లను ముందుంచి తెరవెనుక అక్రమ ఆదాయమార్గాలపై చక్రం తిప్పుతున్నారు. హనుమకొండ డీటీఓ పోస్టు కూడా ఖాళీ అయిన సమయంలో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్గా ఉన్న 1994 బ్యాచ్కు చెందిన సీనియర్ ఎంవీఐ డీటీఓగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. అయితే తెరపైన కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతనే ఆ పోస్టుపై విముఖత చూపడంతో 2012 బ్యాచ్కు చెందిన ఒకరికి ఆ పోస్టు కట్టబెట్టి ఆ సీనియర్ ఎంవీఐ అన్నీ తానై చూస్తుండటం వల్లే మామూళ్లు రెండింతలయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే ఇన్చార్జ్ల కోసం అన్ని జిల్లాల్లో పోటీ ఉంది. వరంగల్లో ఎంవీఐగా ఉన్న ఒకరు మహబూబాబాద్ ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తుండగా, పెద్దపల్లి ఎంవీఐగా ఉన్న ఓ అధికారి ఆ పోస్టుతోపాటు ములుగు ఎంవీఐగా, ఇన్చార్జ్ డీటీఓగా వ్యవహరిస్తున్నారు. భూపాలపల్లిలో ఎంవీఐగా, ఇన్ఛార్జ్ డీటీఓగా ఒక్కరే చూస్తున్నారు. ఇలా.. ఏళ్లతరబడిగా ఉమ్మడి వరంగల్లో పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధికారుల తీరుపై ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ పో స్టుల్లో కొనసాగుతున్నారంటున్నారు. అక్రమ సంపాదనే లక్ష్యంగా కొత్త పద్ధతులు పెడుతూ అర్జాదారులనుంచి అడ్డగోలుగా వసూలు చేస్తూ చివరికి ఏసీబీకి చిక్కుతున్నారంటూ ఆ శాఖ ఉ ద్యోగులే చర్చించుకోవడం గమనార్హం. రవాణా శాఖలో పెచ్చుమీరుతున్న అవినీతిపై కొందరు అవి నీతి నిరోధకశాఖ అధికారులు కూడా ద్వంద్వ వైఖ రితో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. వ్యక్తిగత పరి చయాల ఆధారంగా లెక్కకు మించిన అవినీతి జరి గినా ఆ కార్యాలయాలు, అధికారులపై ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హనుమకొండ డీటీఓలో రెండింతలు పెరిగిన వసూళ్లు.. హనుమకొండ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వివిధ పనుల కోసం లంచాలు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఏడాది క్రితం వచ్చిన ఓ సీనియర్ ఎంవీఐ.. ఈ కార్యాలయానికి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్నెస్ కోసం వచ్చే వాళ్లనుంచి చేసే వసూళ్లు రెండింతలు చేశారన్న ఫిర్యాదులు కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లాయి. లెర్నింగ్ లైసెన్స్కు ఏడాది కిందట రూ.500 వరకు తీసుకుంటే ప్రస్తుతం రూ.1,000కి పెంచారని, రూ.700–800లు ఉన్న లైసెన్స్ మామూళ్లు రూ.2,000లకు పెరిగిందని బాధితులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు కొనుగోలు చేసుకొని వచ్చిన అర్జీదారుడికి అసలు కంటే కొసరే ఎక్కువగా భారమవుతుందని తెలుస్తోంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అసలు సొమ్మును కట్టినా తనిఖీ అధికారులు కొసరుగా వేరే రేట్లను ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గతంలో ఒక్కో వాహనానికి రూ.2200 ఉంటే దానిని ఏకంగా రూ.5500 పెంచినట్లు ఆరోపణలున్నాయి. ఇలాగే ఇటీవల జూన్ మాసంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ ధరలు ఒక్కోబస్సుకు రూ.4,500ల వరకు వసూలు చేయడం వివాదాస్పదమైంది. కాగా ముఖ్యంగా వాహన ఫిట్నెస్లు, లెర్నింగ్ లైసెన్సు, డ్రైవింగ్ లైసెన్సుల పైళ్లపైనే కోడ్లు ఉండడం బహిరంగ రహస్యం. కోడ్లేని ఫైళ్లను.. చిన్న చిన్న పొరపాట్లను సాకుగా చూపుతూ కొర్రీలు పెడుతూ ఫిట్నెస్ అపడం.. వాహనదారుడు దానికి వేరే రేటు ఇచ్చుకుంటే పూర్తి చేయడం ద్వారా రూ.వేలు చేతులు మారుతున్నాయి. ఏసీబీ దాడులకు వెరవని రవాణాశాఖ అధికారులు వసూళ్లకు ‘ప్రైవేట్’ వ్యక్తులు, ఏజెంట్లే మధ్యవర్తులు కాసుల కక్కుర్తితో అడ్డంగా దొరికిపోతున్న అధికారులు ఆదాయాన్ని మించిన ఆస్తులు.. ఆ ఫిర్యాదులపైనే పలువురిపై దాడులు ప్రతి పనికీ రేటు.. ఇటీవలే రెండింతలు హనుమకొండ డీటీఓ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు -
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి
● ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గౌతంరెడ్డినల్లబెల్లి: రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు కృషి చేయాలని ఎన్పీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గౌతంరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మామిండ్లవీరయ్యపల్లిలో పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. హాజరైన గౌతంరెడ్డి రైతులతో మాట్లాడి పంటల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా, పంప్సెట్ల వినియోగం, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ వంటి అంశాలపై చర్చించి సూచనలిచ్చారు. అధికారులు చేపట్టాల్సిన చర్యలను వివరించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమయానుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు తెలిపిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ ఆనంద్, డీఈఈ తిరుపతి, ఏడీఈ లక్ష్మణ్, ఏఈ హరిబాబు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
సీనియర్ సిటిజన్లు మార్గనిర్దేశకులు
● న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబవరంగల్ లీగల్: ప్రస్తుత సమాజానికి సీనియర్ సిటిజన్లు మార్గదర్శకులని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ వీబీ నిర్మలా గీతాంబ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా గురువారం వరంగల్ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.సాయికుమార్ అధ్యక్షతన జిల్లా కోర్టులో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. తల్లిదండ్రులను దైవసమానులుగా భావించినప్పుడే జీవితానికి అర్థమన్నారు. చట్టపరమైన వయోవృద్ధుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ సమాజంలో గౌరవంగా జీవించేందుకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చేలా న్యాయసేవాధికార సంస్థలు కృషి చేస్తాయని తెలిపారు. కుటుంబాల్లోని వయోవృద్ధులు ఎలాంటి ఇబ్బందులకు గురవకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలుస సుధీర్, సీనియర్ న్యాయవాది తీగల జీవన్గౌడ్, న్యాయవాదులు, ఉమ్మడి వరంగల్ జిల్లా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ డిమాండ్!
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు ఈ ఏడాది ఆఖరులోగా మొదలు పెట్టాలని కేంద్రం కృతనిశ్చయంతో ఉంది. అందుకు అవసరమయ్యే భూమిని సేకరించి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద 696 ఎకరాల భూమి ఉంది. రన్వే విస్తరణకు అవసరమయ్యే 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం ఇటీవల రూ.205 కోట్లు కేటాయించింది. పరిపాలనాపరమైన అనుమతులివ్వడంతో కన్సెంట్ ఇచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయి. ఇప్పటి వరకు 48 మంది రైతుల ఖాతాల్లో రూ.34,86,05,298 జమ చేశారు. వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు చెల్లిస్తుండడంతో చాలా మంది రైతులు ఇప్పటికే కన్సెంట్ ఇచ్చారు. రెట్టింపు కావాలని డిమాండ్ వ్యవసాయేతర భూముల (ఓపెన్ ప్లాట్లు)కు చదరపు గజానికి రూ.4,887లు ఇస్తామని వరంగల్ కలెక్టర్ సత్యశారద నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ పలుదఫాలుగా సమావేశమై నిర్ణయించింది. అందుకు రెట్టింపు కావాలంటూ చాలా మంది భూనిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వ్యవసాయేతర భూముల యజమానులతో మరోసారి సమావేశం నిర్వహించనున్నారు. చివరిగా మరో చదరపు గజానికి రూ.500 నుంచి రూ.600ల వరకు పెంచే వీలుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా భూ యజమానులు పరిహారం తీసుకోకపోతే ఆ డబ్బును కోర్టులో డిపాజిట్ చేసి చట్ట ప్రకారం భూమి సేకరించాలని అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. రూ.12 వేలకు గజం ఇస్తా..నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా. నెక్కొండ ప్రధాన రహదారిపై గుంటూరుపల్లిలో 968 గజాల ఇంటి స్థలం ఉంది. ఈస్థలం మామునూరు ఎయిర్పోర్ట్ రన్వే కింద పోతోంది. బహిరంగ మార్కెట్ ప్రకారం భూ పరిహారం చెల్లించాలి. నాకు 968 గజాల స్థలం ఉండగా.. ప్రభుత్వం రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు గజం ఇచ్చేందుకు ముందుకు వస్తోంది. మార్కెట్ ధర కాకుండా గజం రూ.12 వేలు పరిహారం ఇస్తే భూమి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. – ఎం.రాంబాబు, గుంటూరుపల్లి విమానాశ్రయ నిర్మాణానికి నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి గ్రామాల్లో 240 ఎకరాల వ్యవసాయ భూమి, సుమారు 13 ఎకరాల (61,134.5 చదరపు గజాల) వ్యవసాయేతర భూమి సేకరించాల్సి ఉంది. సాగుకు సంబంధించిన 240 ఎకరాలకు భూపరిహారం కింద రూ.288 కోట్లు అవుతున్నాయి. 61,134.5 చదరపు గజాలకు రూ.29,87,61,858 భూనిర్వాసితులకు చెల్లించాలి. మొత్తంగా రూ.317 కోట్లు అవసరం అవుతుండడంతో మరోదఫా ప్రభుత్వం రూ.112 కోట్లు నిధులు కేటాయించాల్సిన అవసరం కనబడుతోంది. వ్యవసాయేతర భూముల రైతులకు చదరపు గజానికి మరో రూ.600లు పెంచినా రూ.ముడు నుంచి రూ.నాలుగు కోట్లు అదనంగా అవసరమవుతాయి. ఈ లెక్కన రూ.320 కోట్లకుపైగా అవసరం కానుంది.వ్యవసాయ భూముల రైతుల ఖాతాల్లో జమవుతున్న నగదు రేటు పెంచాలంటున్న వ్యవసాయేతర భూ యజమానులు తుది సమావేశం నిర్వహించే యోచనలో అధికారులు -
నేడు హనుమకొండ కలెక్టరేట్లో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో నేడు (శుక్రవారం) పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్నేహ శబరీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ అదాలత్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పెన్షన్, జీపీఎఫ్ కేసులు, ఖాతాల సమస్యలు చర్చించి పరిష్కరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఆయా ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.సిమెంట్ పోల్ ఏర్పాటుదుగ్గొండి: ‘ఇనుప స్తంభానికి విద్యుత్’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన వార్తకు విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని తిమ్మంపేట గ్రామంలో నారాయణతండా రోడ్డుకు సమీపంలోని వ్యవసాయ బావుల వద్ద ప్రమాదకరంగా ఉన్న ఇనుప స్తంభం తొలగించి గురువారం సిమెంట్ స్తంభం ఏర్పాటు చేశారు. వైర్లు సరిచేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఏఈ ప్రత్యూష, లైన్ ఇన్స్పెక్టర్ అజీంపాషా, సిబ్బంది పాల్గొన్నారు.రేకులతండాలో తాగునీటికి కటకటనెక్కొండ: మండలంలోని పెద్దకొర్పోలు గ్రామ శివారు రేకులతండాలో తాగు నీటి కటకట ఏర్పడింది. తండాలో తీజ్ ఉత్సవాల వేళ తాగు నీటి సరఫరా నిలిచిపోవడంతో గిరిజనులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈసందర్భంగా తండావాసులు మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచి మిషన్ భగీరథ నీరు రావట్లేదని, 15 రోజుల క్రితం నల్లాల బావి మోటారు కాలిపోయిందన్నారు. తీజ్ పండుగ వేళ రోడ్డెక్కి నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. ఈవిషయమై ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేశ్ను వివరణ కోరగా.. పొంతన లేని సమాధానాలతో దాటవేశారు.అతివల అక్షరాస్యతకు ‘ఉల్లాస్’నెక్కొండ: గ్రామీణ ప్రాంతాల్లో చదవడం, రాయడం రాని వృద్ధులు, మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) అనే పథకానికి శ్రీకారం చుట్టాయని జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి సుజన్తేజ అన్నారు. స్థానిక హైస్కూల్లో ఎంఈఓ రత్నమాల అధ్యక్షతన ఉల్లాస్పై మహిళా సంఘాల వీఓలకు గురువారం శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ రంగారావు, ఏపీ ఓ కిరణ్, మండల రిసోర్స్పర్సన్స్ ప్రతాప్, రా మ్మోహన్, వీఓఏలు, ఉపాధ్యాయులున్నారు.గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలిడీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ఖిలా వరంగల్: దైనందిన జీవితాన్ని సుఖమయం చేసుకోవడంతోపాటు గుణాత్మక విద్యనభ్యసిస్తూ ఎదగాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ దివ్యాంగ విద్యార్థులకు సూచించారు. గురువారం వరంగల్ శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ (ఎలిమ్కో) వారి సౌజన్యంతో మానసిక శారీరక, ఆటిజం, బహుళ వైకల్యం, కృత్రిమ అవయవాల వినియోగం, ఉపయోగాలపై దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్, డాక్టర్ కోమల్పహడ్, డాక్టర్ శివకృష్ణ, డాక్టర్ శివమ్ శుక్ల, మెడికల్ ఆఫీసర్ రమ్య, ఫిజియో థెరఫిస్ట్ స్వాతి, ఐఈఆర్పీ నరసింహస్వామి, సంజీవ్, శ్రీకాంత్, రవి పాల్గొన్నారు. -
వాహనాల వేలం
నర్సంపేట రూరల్: నర్సంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో పట్టుబడిన వాహనాలకు బుధవారం వేలం నిర్వహించినట్లు అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మురళీధర్ తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అధికారి అరుణ్కుమార్ ఆదేశాల మేరకు 19 వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించగా ప్రభుత్వానికి రూ.3,11,460 ఆదా యం సమకూరినట్లు ఆయన పేర్కొన్నారు. నర్సంపేట ఎకై ్సజ్ సీఐ నరేశ్రెడ్డి, ఎకై ్స జ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. 13 మంది సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 13 మంది సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్. వెంకన్న వీఆర్ నుంచి దేవరుప్పుల పీఎస్, జి.శ్రీదేవి తరిగొప్పుల నుంచి వరంగల్ సీసీ ఎస్, ఎం.రాజు గీసుకొండ నుంచి ముల్కనూ రు, ఎన్.సాయిబాబు ముల్కనూరు నుంచి వర్ధన్నపేట, బి.చందర్ వర్ధన్నపేట నుంచి టాస్క్ ఫోర్స్, జి.అనిల్కుమార్ వీఆర్ నుంచి గీసుకొండ, టి.విజయ్రాజు వీఆర్ నుంచి గీసుకొండ, ఎం.కుమారస్వామి వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, ఈ.రతీశ్ వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, హెచ్.ఆనందం వీఆర్ నుంచి సీఎస్బీ వరంగల్, టి.యాదగిరి వరంగల్ ట్రాఫిక్ నుంచి సీసీఎస్ వరంగల్, ఈ.నారయణ హనుమకొండ ట్రాఫిక్ నుంచి వీఆర్ వరంగల్కు బదిలీ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ సివిల్ జడ్జిల నియామకంవరంగల్ లీగల్: రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఎంపికై న 49 మంది జూనియర్ సివిల్ జడ్జిలను వివిధ జిల్లాలకు నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదుగురు జూనియర్ సివిల్ జడ్జిలను నియమించారు. వరంగల్ నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (ఎకై ్సజ్ కోర్టు) జడ్జిగా రాజ్నిధి, నర్సంపేట జూనియర్ సివిల్ జడ్జిగా ఊట్లూరి గిరిధర్, హనుమకొండ రెండో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు (పీసీఆర్ కోర్టు) జడ్జిగా బానావత్ అనూష, పరకాల మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టుకు బొడ్డు శ్రీవల్లి శైలజ, ములుగు మొబైల్ కోర్టు జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా దక్కన్నగారి మధులిక తేజను నియమించారు. రెండు కిలోల ఎండు గంజాయి స్వాధీనంనర్సంపేట రూరల్: ఎండు గంజాయిని బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు నర్సంపేట టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ద్వారకపేట బైపాస్ రోడ్డు– మహబూబాబాద్ రోడ్డు సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతున్న యువకులను ఆపి తనిఖీ చేశారు. ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంకు కవర్లో రెండు కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. వారిని విచారించగా భద్రాద్రి జిల్లా చింతూరు మండలం మోతుగూడేనికి చెందిన నాగు అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలుచేసినట్లు తెలిపారని అన్నారు. అరెస్టు చేసిన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉసిరికాయపల్లికి చెందిన వరుణ్దొర, ఇల్లందులోని జేకే కాలనీకి చెందిన ప్రవీణ్కుమార్ ఉన్నారు. గంజాయి, ద్విచక్రవాహనం, సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
చలాన్లు.. చాలానే..
ట్రాఫిక్ స్టేషన్ల వారీగా పెండింగ్ ఇలా.. వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యతోపాటు ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువవుతున్నాయి. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో పోలీసులు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో జరిమానాలు విధిస్తున్నారు. ఇలా కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ చలాన్లు చాంతాడంత పేరుకుపోయాయి. వాహనదారులు తరువాత చెల్లించొచ్చనే ఆలోచనతో రోజురోజుకు పెండింగ్ జరిమానాలు పెరిగిపోతున్నాయి. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 1,27,194 వాహనాలపై మొత్తం 11,71,094 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. వీటి మొత్తం సుమారు రూ.33.28కోట్ల జరిమానాలు చెల్లించాల్సి ఉంది. పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో వాహనాల వివరాలు.. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల పూర్తి వివరాలు పోలీస్ కంప్యూటర్ డేటా బేస్లో నమోదు చేసినట్లు సీపీ చెబుతున్నారు. ఈ చలాన్లను క్లియర్ చేసేందుకుగాను ఇకపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు. తనిఖీ సమయంలో చలాన్లు గుర్తిస్తే వెంటనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగరంలో అన్ని కూడళ్లలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు అమర్చారు. వీటి ఆధారంగా వాహనదారుడు ప్రయాణించే మార్గంలోని పోలీస్ ట్యాబ్లకు సమాచారం వెళ్తుంది. అక్కడి పోలీసులు మీ వాహనాలను రోడ్డుపై నిలిపివేసి జరిమానాలు క్లియర్ చేస్తారు. జరిమానాలు సరే.. ట్రాఫిక్ క్లియరెన్స్ ఏదీ? వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడం లేదని, సెల్ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ క్రాసింగ్ ఇలా చలాన్లు విధిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రోడ్లపై ట్రాఫిక్ను క్లియర్ చేయడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాజీపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లోని కూడళ్లలో, హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఆటోలు, ఇతర వాహనాలు ఇష్టారాజ్యంగా నిలిపి ఉంచి మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరించడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సిబ్బంది వాహనాలను క్రమబద్ధీకరించకుండా కెమెరా, ఫోన్తో వాహనదారుల ఫొటోలు తీయడంలోనే బిజీగా ఉంటున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. చలాన్లు క్లియర్ చేయకపోతే వాహనం సీజ్ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయని పక్షంలో వాహనాలను సీజ్ చేసి పోలీస్స్టేషన్లకు తరలిస్తారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలను నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికమవుతున్నాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో పోలీసులు జరిమానాలు విధిస్తారు. జరిమానాలు సకాలంలో చెల్లించాలి. – వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్లో భారీగా 11,71,094 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఇందులో రూ.10 లక్షల వరకు గ్రేటర్ వరంగల్ పరిధిలోనివే.. నిబంధనల ఉల్లం‘ఘనుల’పై ఆన్లైన్, ఆఫ్లైన్లో జరిమానాలు జమ చేయకుంటే వాహనం సీజ్ చేస్తామంటున్న సీపీ -
శాఖల వారీగా నిధుల కేటాయింపు వివరాలు (రూ.కోట్లలో)
పంచాయతీరాజ్ 51.30తాగునీరు, శానిటేషన్ ఆర్డబ్ల్యూఎస్ 15.15జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయం 11.62ఐఅండ్పీఆర్ 0.57పశుసంవర్థకం 0.30అగ్నిమాపక 0.30ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ 8.57ఇరిగేషన్, సీఏడీడీ 5.90రోడ్లు, భవనాలు 9.95పోలీస్ 14.50వైద్య ఆరోగ్య 1.07అటవీ 0.50మత్స్య 0.23ఎండోమెంట్ 1.75రెవెన్యూ శాఖ 14.38సీ్త్ర శిశు సంక్షేమ 0.25ఎన్పీడీసీఎల్ 5టీజీ ఆర్టీసీ 5 ఎకై ్సజ్, ప్రొహిబిషనరీ 0.25టూరిజం 0.90 గిరిజన సంక్షేమం (ఐటీడీఏ) 2.50 -
మహాజాతరకు.. నిధుల వరద
సాక్షిప్రతినిధి, వరంగల్/ఏటూరునాగారం: వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ కుంభమేళా, సమ్మక్క, సారలమ్మల మేడారం మహాజాతరకు భారీగా నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.150 కోట్లు మంజూరు చేస్తూ శాఖలవారీగా బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భారీగా నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు రాష్ట్ర సీ్త్ర శిశుసంక్షేమ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపుపొందింది. ఈ జాతర తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. అందుకే మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తరలివచ్చే భక్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసేందుకు నిధులు మంజూరు చేసింది. 2026 జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మహాజాతర నిర్వహించనున్నారు. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ పూజారులు జాతర తేదీలను ప్రకటించారు. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దైపెకి చేరుకుంటారు. రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. మూడో రోజు జనవరి 30న సమ్మక్క సారలమ్మను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవిందరాజు, పగిడిద్దరాజు వనప్రవేశంతో జాతర ముగియనుంది.ఇతర రాష్ట్రాల నుంచి భక్తుల రాక..మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ క్రమంలోనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.గత ఏడాది రూ.110 కోట్లుగత ఏడాది 2024 మహాజాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.110కోట్లు మంజూరు చేసి మేడారంలో పలు అభివృద్ధి పనులు చేసింది. భక్తుల సౌకర్యాలను మరింత పెంచేందుకు ఈసారి అదనంగా రూ.40 కోట్లు పెంచి రూ.150కోట్లు చేయడం గమనార్హం. 2022లో అప్పటి ప్రభుత్వం రూ.75 కోట్లను మేడారం జాతర నిర్వహణకు మంజూరు చేసింది.