Warangal
-
బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి
● కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: విద్యార్థుల పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యశారద అన్నా రు. బడిబాట కార్యక్రమంపై కలెక్టరేట్లో శుక్రవా రం విద్యా, సంక్షేమశాఖలు, డీఆర్డీఓ, పంచాయ తీ, కార్మిక, మున్సిపల్, మెప్మా, తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని, బడిఈడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గత నెలలో నిర్వహించిన క్యాంపెయిన్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన నివేదికలను సమర్పించాలని ఎంఈఓలను కలెక్టర్ ఆదేశించారు. ఏఐ ద్వారా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన జరుగుతుందని ప్రజలకు వివరించాలన్నారు. జిల్లాల్లో 635 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని వాటిలో 135 జీరో నమోదు పాఠశాలలు ఉన్నాయని ఆ పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏపీఓ, మెప్మా, ఏపీఎంలు స్వయం సహాయక బృందాలు, అంగన్వాడీలను గ్రామసభల్లో భాగస్వాములను చేయాలన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. ఇటుక బట్టీల దగ్గర పనిచేసే పిల్లలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. డీఈఓ జ్ఞానేశ్వర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్రెడ్డి, ఉమారాణి, డీపీఓ కల్పన పాల్గొన్నారు. సమగ్ర వ్యవసాయ విధానంతో లాభాలు నర్సంపేట: సమగ్ర వ్యవసాయ విధానం ద్వారా అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈ మేరకు కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. నర్సంపేట డివిజన్లో ఉన్న రైతులు వరి పంటను ఒక నెల ఆలస్యంగా వేస్తున్నారని ముందుగా వేయాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించాలని, రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ, చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. ఈ ప్రాంతంలో 1.8లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్లోని శాస్త్రవేత్తల సలహాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా అధిక దిగుబడిని సాధించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వికసిత్ కృషి సంకల్ప్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజన్న, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ కేవీకే, డాక్టర్ తమ్మి రాజు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బాలకృష్ణ, ఏడీఏ దామోదర్, శాస్త్రవేత్తలు రాజు, సతీష్చంద్ర, తహసీల్దార్ ఫణికుమార్, మండల ఏఓ గోపాల్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. భూభారతి సదస్సు సందర్శన అమీనాబాద్లో కొనసాగుతున్న భూ భారతి రెవెన్యూ సదస్సును కలెక్టర్ సత్యశారద సందర్శించారు. దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ నెల 20వరకు జిల్లాలో వర్ధన్నపేట మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఫణికుమార్, నాయబ్ తహసీల్దార్ రజని, గిర్దావర్లు మహ్మద్ రషీద్, మమత, జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ అంజద్ఖాన్ పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కల్లెపు హరిప్రియ జిల్లాస్థాయి ద్వితీయ బహుమతి, చిత్రలేఖనంలో పోటీల్లో చిలపాక ద్రాక్షాయని ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు తేజావ త్ జయ శుక్రవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, గైడ్ టీచర్లు గజవెల్లి సుందర్, సంతోష్కుమార్, రాగి శశిధర్, పిన్నింటి బాలాజీరావును అభినందించారు. -
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
● నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47)శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న అయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లోనూ పాల్గొంటున్నారు. సహచర ఉద్యోగులు, అధికారుల్లో ఆయనకు మంచిపేరు, గుర్తింపు ఉన్నాయి. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన ఇంటికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
న్యూశాయంపేట: జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్ సత్యశారద ఈద్ ఉల్ అజ్హా(బక్రీద్) పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.కప్పతల్లీ.. వానలు కురిపించు నర్సంపేట రూరల్ : కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లోని రైతులు వివిధ పంటలకు సంబంధించిన విత్తనాలు విత్తుకున్నారు. వరుణుడు ముందే కరుణించాడని ఆనందపడిన అన్నదాతల ఆశలు నిరాశలు చేస్తూ వారం రోజులుగా వానలు పడడంలేదు. దీంతో విత్తనాలు విత్తిన రైతులు వర్షం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో వానలు పడాలని కోరుతూ నర్సంపేట మండలంలోని రాములునాయక్తండాకు చెందిన చిన్నారులు, ప్రజలు శుక్రవారం కప్పతల్లి ఆడారు. గ్రామస్తులంతా కప్ప, చిన్నారులపై నీళ్లారబోశారు. వర్షాలు సంవృద్ధిగా కురవాలని ప్రార్థించారు. రెండు కేజీబీవీల్లో ఎంఎల్టీ కోర్సు విద్యారణ్యపురి: జిల్లాలోని దుగ్గొండి, పర్వతగిరి కేజీబీవీల్లో ఈ విద్యాసంవత్సరం (2025–26) కళాశాల స్థాయిలో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ (మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్) కోర్సును నూతనంగా ప్రవేశపెట్టినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో కేజీబీవీలో ప్రథమ సంవత్సరానికి 40 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఆసక్తిగల బాలికలు వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలోని ఖానాపురం, రాయపర్తి, వర్ధన్నపేట కేజీబీవీల్లో ఎంపీసీ, బైపీసీ, చెన్నారావుపేట, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం కేజీబీవీల్లో సీఈసీ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందాలని ఆయన కోరారు. అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీకళాశాలనుంచే పీహెచ్డీ గైడ్షిప్కోసం దరఖాస్తు చేసుకోవాల్సింటుంది. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్ధులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యాసంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వీరు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి,రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కాలేజీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. వరంగల్ బస్స్టేషన్ ఆలస్యంపై అసహనం వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణంలో ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్ స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతి, తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అదేవిధంగా భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు. -
అసంపూర్తిగానే..!
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పెండింగ్లోనే పనులురాయపర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించినా పైపులైన్లు బిగించలేదు. వాటర్ ట్యాంక్లు కూడా అమర్చలేదు. మరుగుదొడ్లకు తలుపులు బిగించలేదు. ఫలితంగా పాఠశాలకు సమీపంలోని బహిరంగ ప్రాంతంలో విద్యార్థులు మలమూత్ర విసర్జనకు వెళ్లాల్సిన పరిస్థితి. దాదాపు 220 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలల్లో పనులు చకచక చేస్తేనే ఫలితం ఉండనుంది. నర్సంపేట జెడ్పీహెచ్ఎస్ మోడల్ పాఠశాల ఆవరణలోని ప్రాథమిక పాఠశాలలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ ఆధ్వర్యంలో చేపట్టిన మరుగుదొడ్ల పనుల్లో నిర్లక్ష్యం కనబడుతోంది. పాత మరుగుదొడ్ల పైన పాత రేకులనే ఉంచి కాస్తా ముస్తాబు చేయగా.. కొత్త మరుగుదొడ్లకు మాత్రం స్లాబ్లు వేశారు. ఒక మరుగుదొడ్డికి తలుపు బిగించడం మరిచిపోయారు. వీటిపైన వాటర్ ట్యాంక్లు బిగించలేదు. నీటి కనెక్షన్ ఇవ్వలేదు. బడి పెయింటింగ్ పనులు పూర్తిస్థాయిలో కాలేదు. వరంగల్ నగరంలోని కృష్ణకాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. వాటర్ ట్యాంక్ అమర్చలేదు. ఈ పాఠశాలలో వందలాది మంది విద్యార్థులు చదువుతున్నారు. పనులు పూర్తయితే బాలికలకు తిప్పలు తప్పనుంది. పాఠశాల పునఃప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ చెబుతున్నారు. -
బిల్లులు చెల్లించలేదు..
శనిగరం హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గతేడాది అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం రూ.6.70 లక్షల నిధులను మంజూరు చేసింది. పనులు చేపట్టేందుకు అడ్వాన్స్గా రూ.2.10 లక్షలు చెల్లించింది. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మైనర్, మేజర్, ఎలకి్ట్రకల్ మరమ్మతు పనులు పూర్తి చేశాం. పనులు పూర్తి చేసి ఏడాది పూర్తయినా నేటికీ బిల్లులు చెల్లించడం లేదు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారుల స్పందించి బిల్లులు అందించాలి. – భాగ్యలక్ష్మి, మండల సమైక్య అధ్యక్షురాలు, నల్లబెల్లి● -
అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పర్వతగిరి: రాష్ట్రంలో పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడం, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. ఈ మేరకు పర్వతగిరిలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ సత్యశారద, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు ప్రతీక అని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట నిరుపేదలను గత ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చేసినా పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుందన్నారు. మా కుటుంబ సభ్యులు అంతా పుట్టి పెరిగిన నేల పర్వతగిరి అని తెలిపారు. పర్వతగిరి బిడ్డగా తానెప్పుడూ రుణపడి ఉంటానని, ఇక్కడి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తీర్చడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. ఇక్కడి ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం భూ భారతి చట్టంలో అప్పీలు ద్వారా భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. మండలంలోని అన్నారం గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ సత్యశారదతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ భారతి రెవెన్యూ సదస్సులో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ల వద్ద సదుపాయాలు, రైతులు సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఆధార్ ఎలా ఉందో అలానే భూములకు భూదార్ జారీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటస్వామి, రెవెన్యూ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య -
రాజ్యాంగం ద్వారానే పేదలకు హక్కులు
సంగెం: రాజ్యాంగం ద్వారానే పేదవర్గాలకు హక్కులు లభిస్తున్నాయని, రాజ్యాంగ ఫలాలను అందరికీ పంచిన మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మండలంలోని షాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పిస్తే బాబు జగ్జీవన్రామ్ అమలు జరిగేలా చూశాడని కొనియాడారు. ఎస్సీ కులాలకు రిజర్వేషన్లు దక్కకుండా సామాజిక న్యాయానికి దూరంగా ఉన్నారనే ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని ప్రారంభించామన్నారు. ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణపై ఒకతాటిపైకి వచ్చాయన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని ప్రధాని మోదీ గుర్తించి అమలు చేశారన్నారు. సాంఘిక, ఆర్థిక రాజకీయ వివక్షతను రూపుమాపడం కోసం భవిష్యత్లో ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రయాణం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మార్పీఎస్ కేవలం మాదిగల కోసం మాత్రమే పరిమితం కాలేదని అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడి ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, తెలంగాణ అమరవీరుల కుటంబాలకు ఉద్యోగాలు, మహిళల రక్షణ కోసం ఫాస్ట్ట్రాక్ కోర్టులు సాధించినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాతాళ్ల రమేష్, మాజీ జెడ్పీటీసీలు గూడ సుదర్శన్రెడ్డి, మనోజ్గౌడ్, మాజీ ఎంపీడీఓ కుమారస్వామి, మాజీ సర్పంచ్లు సట్ల రాజు, పేరాల రాజు, కొయ్యల ఈశ్వరమ్మ, ఎమ్మార్పీఎస్ నాయకులు కట్ల రాజశేఖర్, డాక్టర్ శరత్, శివ, కుమార్, రాజు, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ ఫలాలు పంచిన మహనీయుడు అంబేడ్కర్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ -
భక్తిభావంతో శాంతి నెలకొంటుంది
నెక్కొండ: భక్తిభావాన్ని పెంపొందించుకొని గ్రామాల్లో శాంతిని నెలకొల్పాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. మండలంలోని సూరిపల్లి గ్రామంలో ఇటీవల నిర్మించిన పెద్దమ్మతల్లి, పెద్దిరాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వారు శుక్రవారం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయం నిర్మించడం అభినందనీయమన్నారు. ముదిరాజ్లు రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, నెక్కొండ పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, ఆలయం చైర్మన్ దుంది శ్రీనివాస్, నాయకులు కొమ్ము రమేశ్యాదవ్, గుంటుక సోమయ్య, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, తోట సాంబయ్య, దొమ్మటి పురుషోత్తం, మాతంగి రాజు, తదితరులు పాల్గొన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ -
ప్రహరీ నిర్మాణానికి విరాళాల సేకరణ
పరకాల: అమ్మ ఆదర్శ పాఠశాల కింద రూ.2లక్షల నిధులే మంజూరు చేయడంతో పరకాల పట్టణంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణం సాధ్యం కాదని సంబంధిత కాంట్రాక్టర్ గేట్ పిల్లర్లు వేసి చేతులు దులుపుకున్నాడు. దీంతో పాఠశాల ఆవరణలోకి పందులు, పశువులు వస్తున్నాయి. పిల్లలకు, నాటిన మొక్కలకు రక్షణ కరువైంది. విషయాన్ని గమనించిన అంబేడ్కర్ సేవా సమితి అధ్యక్షుడు బొచ్చు చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టగా రూ.50వేల జమయ్యాయి. అయా విరాళాలతో పాఠశాల ప్రహరీ, గేట్ ఏర్పాటు చేస్తున్నారు. మూడు రోజుల్లో పనులు ప్రారంభించి..గేట్ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. -
అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్
కేయూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల అధ్యాపకులకు పీహెచ్డీ గైడ్షిప్ ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కాకతీయ యూనివర్సిటీలో జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పలు అకాడమిక్ సిలబస్ల మార్పు, పరీక్షలు, దూరవిద్యలో సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులు, తదితర అంశాలపై చర్చించి ఆమోదించారు. ఒక క్లస్టర్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పరిధిలోకి వచ్చే అధ్యాపకులు ఆ క్లస్టర్ డిగ్రీ కళాశాల నుంచే పీహెచ్డీ గైడ్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంతమందికి గైడ్షిప్ ఇవ్వనున్నది కొద్దిరోజుల్లో తేలనుంది. అదేవిధంగా కేయూ పరిధిలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, లా విద్య (నాన్ ప్రొఫెషనల్, ప్రొఫెషనల్) కోర్సుల్లో కొన్ని సంత్సరాలుగా ఫెయిల్ అయి బ్యాక్లాగ్ సబ్జెక్టులు కలిగిన విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పిస్తూ స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. 2025–2026 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ కోర్సుల సెమిస్టర్ల పరీక్షలతో వారు రాసుకునే అవకాశం కల్పిస్తారు. దూరవిద్యలోని ఇయర్వైజ్ స్కీం విద్యార్థులు కూడా బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు. కేయూ దూరవిద్యలో 16వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టాలని, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో సిలబస్ మార్పునకు ఆమోదించారు. సమావేశంలో వీసీ కె.ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, వివిధ విభాగాల డీన్లు, పలువురు పాలక మండలి సభ్యులు, యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్గా..
కమలాపూర్ : తాళాలు వేసి ఉన్న ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్న వంగపల్లికి చెందిన చిలువేరు ప్రశాంత్ (30)ను అరెస్ట్ చేసినట్లు కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు కమలాపూర్ పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రశాంత్ డ్రైవింగ్ వృత్తి చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీనికితోడు ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయి అప్పులు చేశాడు. సులువుగా డబ్బులు సంపాదించడానికి తాళం వేసిన ఇళ్లు, ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలు టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే గత నెల 30న వంగపల్లిలోని తన తల్లిగారింట్లో ఒంటరిగా ఉన్న గర్భవతి తోట దివ్యపై రాడ్తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆమె చనిపోయిందని భావించి ఆమె మెడలోని 3 తులాల బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లాడు. అదేవిధంగా తాళం వేసి ఉన్న పసుల రమాదేవి ఇంట్లో 4 తులాలు, కోడెపాక మధుసూదన్ ఇంట్లో తులం బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం తాను చోరీ చేసిన బంగారం అమ్మేందుకు వెళ్తూ కమలాపూర్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. గమనించిన పోలీసులు ప్రశాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి రూ.4.10 లక్షల విలువైన 8 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన సీఐ హరికృష్ణ, ఎస్సై వీరభద్రరావు, కానిస్టేబుళ్లు మోహన్, ఉదయ్కుమార్, వెంకటేశ్ను ఏసీపీ అభినందించారు. గర్భిణిపై దాడి చేసి బంగారం లాక్కెళ్లిన నిందితుడి అరెస్ట్ 8 తులాల బంగారు ఆభరణాల స్వాధీనం -
శనివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2025
– 10లోuఇటీవల పనులు ప్రారంభం.. ఈ చిత్రంలోని ఫొటోలు చూడండి. హనుమకొండలోని జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పరిస్థితి. ఈ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా పలు పనులకు రూ.3.40 లక్షలు మంజూరు చేశారు. అడ్వాన్స్గా రూ.85 వేలు (25శాతం) విడుదల చేశారు. మంజూరీ ఇచ్చి ఐదారునెలలు గడిచినా ఇటీవల పనులు మొదలెట్టారు. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి పనులు పూర్తయ్యేలా లేవు. ప్రధానంగా టాయ్లెట్స్ రిపేర్, తరగతి గదుల్లో పాలిష్ బండలు వేయాల్సి ఉంది. హ్యాండ్వాష్ దగ్గర పనులు చేయాల్సి ఉంది. విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మరమ్మతు పనులు నిధుల లేమితో నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలు మరో ఐదు రోజుల్లో పునఃప్రారంభంకానున్నాయి. కానీ, వాటిలో చేపట్టిన పనులు కొన్నిచోట్ల పూర్తికాగా, మరికొన్నింటిలో అసంపూర్తిగా ఉన్నాయి. ఇంకొన్ని అసలు చేపట్టనేలేదు. దీంతో విద్యార్థులు అసౌకర్యాల నడుమ విద్యాభాస్యం సాగించాల్సి ఉంటుందని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఏయే పనులు చేపట్టాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోనికి వచ్చాక కొన్నినెలలకే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. అందులో ఎలక్ట్రిఫికేషన్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు మూత్రశాలల రిపేర్లు, తరగతి గదుల్లో మైనర్, మేజర్ మరమ్మతులు చేయాలి. ఈ బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. విడుదల చేసే నిధులను పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, హెచ్ఎంల బ్యాంక్ జాయింట్ అకౌంట్(ఏఏపీసీ)లో జమ చేస్తారు. పనులు పూర్తయినా 25శాతం నిధులే.. జిల్లాలో అక్కడక్కడ పనులు పూర్తయినా తొలుత 25శాతం అడ్వాన్స్డ్గా విడుదల చేసిన నిధులేనని, తరువాత రాలేదని సంబంధిత పాఠశాలల హెచ్ఎంలు అంటున్నారు. ఉదాహరణకు హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో మేజర్ రిపేర్, మరుగుదొడ్లు, తాగునీటి పైప్లైన్ మరమ్మతుల పనులకు రూ.10.10 లక్షల వరకు మంజూరు ఇచ్చారు. తొలుత అడ్వాన్స్గా ఇచ్చిన రూ.2.10లక్షలు మాత్రం అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ ద్వారా పనులు చేసినవారికి చెల్లింపులు చేశారు. మిగతా 75శాతం నిధులు (బిల్లులు) రావాల్సి ఉందని సంబంధిత హైస్కూల్ హెచ్ఎం నెహ్రూ తెలిపారు. పనులు చేసినవారు నిరీక్షిస్తున్నారు.. ● హనుమకొండ ప్రభుత్వ మర్కజీ హైస్కూల్లో వివిధ పనులకు రూ.4.50 లక్షల మంజూరు ఇచ్చారు. తొలుత 25శాతం నిధులు రూ.లక్షా 50వేలు విడుదల చేశారు. మిగతా పనులు పూర్తయ్యాయని, పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించాల్సిందని సంబంధిత ఉన్నత పాఠశాల హెచ్ఎం రామారావు తెలిపారు. ● హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల హైస్కూల్లో పనులు పూర్తయ్యాయి. ఆయా పనులకు అంచనాగా రూ.5.80లక్షలు మంజూరు ఇచ్చారు. మొదట 25శాతం నిధులు మాత్రమే విడుదల అయ్యాయని ఆ హైస్కూల్ హెచ్ఎం ఉమ తెలిపారు. పనులు చేసిన వారు బిల్లుల కోసం నిరీక్షిస్తున్నారు. ● పరకాల మండలంలోని 24 పాఠశాలలకు 72 పనులకు నిధులు మంజూరయినప్పటికి కేవలం 42 పనులు(మరుగుదొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ మరమ్మతులు, ర్యాంప్లు) పూర్తయ్యాయి. మరో 30 పనులు పెండింగ్లో ఉండఉన్నారు. అధికారులు బిల్లులను పెండింగ్లో పెట్టడంతో కాంట్రాక్టర్లు మరింత మొండిగా వ్యవహరిస్తూ పనులను ఆపేశారు. అయా పనులను తక్షణమే ప్రారంభించాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించినప్పటికి పనుల్లో పురోగతి కనిపించలేదు. మళ్లీ కాంట్రాక్టర్లకే పనులు .. ప్రభుత్వం పాఠశాలల్లోని అమ్మ ఆదర్శ కమిటీలకు ఈ మౌలిక సదుపాయాల పనులు అప్పగిస్తే వారికి కూడా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావించింది. కానీ, వివిధ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలోని మహిళా సమాఖ్యలు తమకు సివిల్వర్క్స్ చేయించడంలో అనుభవం లేదని, ముందుగా లక్షలు పెట్టుబడి పెట్టి పనులు చేయాల్సింటుందని ముందుకు రాలేదు. దీంతో అమ్మ ఆదర్శ కమిటీలో తీర్మానం చేయించి హెచ్ఎంలు.. ఇతర కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారని సమాచారం. అమ్మ ఆదర్శ కమిటీలు చేపట్టనిచోట ఇతరులకు ఇవ్వొచ్చని కూడా నిబంధన ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్నిచోట్ల అమ్మ ఆదర్శ కమిటీల పేరుమీదే కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో అనుభవాల దృష్ట్యా అక్కడక్కడ కాంట్రాక్టర్లు కూడా పాఠశాలల్లో పనులు చేస్తే బిల్లులు వస్తాయా.. రావోననే అనుమానంతో ముందుకురాని పరిస్థితి నెలకొని ఉంది. దీనికితోడు ఇంజనీరింగ్ విభాగం అధికారులు బిల్లులు, ఎంబీ రికార్డులు చేయడంలో కూడా జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హనుమకొండ సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో వరండాలో వేసిన పాలిష్ బండలున్యూస్రీల్జిల్లాలోని 416 పాఠశాలల్లో .. హనుమకొండ జిల్లాలో మొత్తం 508 పాఠశాలలు ఉండగా, అమ్మ ఆదర్శ పథకంకింద 438 పాఠశాలలను ఎంపిక చేశారు. అందులో 416 పాఠశాలలకు పరిపాలనాపరమైన మంజూరీ ఇచ్చారు. వాటిలో 1238 పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం రూ.16,98,92,000 వ్యయం అవుతుందని అంచనా వేశారు. పనులు చేపట్టిన ప్రతీ స్కూల్కు తొలుత 25శాతం నిధులు అడ్వాన్స్గా అమ్మ ఆదర్శ కమిటీలు, హెచ్ఎంల జాయింట్ అకౌంట్గా ఉన్న ఏఏపీసీ బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఆ విధంగా తొలుత రూ.4.22కోట్లు విడుదల చేశారు. 1,081 పనులు గ్రౌండింగ్ చేశారు. 991 పనులు ఇప్పటివరకు పూర్తిచేశారు. అందులో 870 పనులకు ఎంబీ రికార్డు చేశారు. 784పనులకు ఇప్పటివరకు రూ. 9,39,82,000 బిల్లులు చెల్లించినట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. మొత్తంగా 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో 157 పనులు అసలే చేపట్టలేదని సమాచారం. ఇంకా జిల్లాకు రూ.7.59కోట్ల నిధులు రావాల్సి ఉంది. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా పూర్తి చేయాల్సింటుంది పనులు మంజూరైన పాఠశాలల్లో 80శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పూర్తిచేయాల్సింటుంది. ఆ దిశగా పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇంకా పనులు ప్రారంభించని పాఠశాలల్లో ఈనెల చివరి వరకు పూర్తిచేయాలి. – బి.మహేష్, జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ ఐదు తరగతులకు రెండే గదులుఆత్మకూరు ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులు ఉన్నాయి. ఎప్పుడో డిపెప్ పథకంలో నిర్మించిన రెండు గదుల్లో నడిపిస్తున్నాం. 70మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదనపు తరగతి గదులకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఇప్పటికై నా గదులు నిర్మించాలి. – పెండెం రాజు, హెచ్ఎం, ఆత్మకూర్ పీఎస్ -
భూ భారతితో సమస్యల పరిష్కారం
● అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి వేలేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ సమస్యలపై తీసుకువచ్చిన భూ భారతి చట్టంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. మండలంలోని పీచర గ్రామంలో ఏర్పాటుచేసిన భూ భారతి సదస్సును శుక్రవారం ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ భారతి సదస్సులను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీచరలో 234 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కోమి, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్ఐ సురేందర్, సీనియర్ అసిస్టెంట్ హేయనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి మృతి
నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు హన్మకొండ అర్బన్: హనుమకొండ తహసీల్దార్ కర్రే శ్రీపాల్రెడ్డి (47) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. గురువారం రాత్రి వరకు నగరంలోని బాలసముద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంచాయితీలో పాల్గొన్న ఆయన.. వారందరిని ఖాళీ చేయించి త్వరలోనే అర్హులకు ఇళ్లు కేటాయిస్తారని చెప్పి ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం లేచి రెవెన్యూ సదస్సులు ఉన్నాయంటూ స్నానానికి సిద్ధమవుతున్న శ్రీపాల్రెడ్డి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక ఓ ఆస్పత్రికి తరలించడంతో అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరంగల్ జిల్లాలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేసిన శ్రీపాల్రెడ్డి పదోన్నతి పొంది ఆసిఫాబాద్ జిల్లాకు తహసీల్దార్గా బదిలీ అయ్యారు. అనంతరం మళ్లీ తహసీల్దార్గా హనుమకొండ జిల్లాకు వచ్చి డిప్యుటేషన్పై ‘కుడా’లో పనిచేశారు. హనుమకొండ ఆర్డీఓ కార్యాలయంలో డీఏఓగా కొద్దిరోజుల క్రితమే విధులు పూర్తి చేసుకుని వస్తున్న ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన కాలుకు తీవ్ర గాయం కాగా, ప్రస్తుతం కర్ర సహాయంతోనే విధులు నిర్వహిస్తున్నారు. తమ సహచరుడిని కోల్పోవడం పట్ల రెవెన్యూ ఉద్యోగులు ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే హనుమకొండ రాంనగర్లోని ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకున్నారు. ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. శ్రీపాల్రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె బీటెక్, చిన్న కుమార్తె ఇంటర్ చదువుతున్నట్లు బంధువులు తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో జరిగిన బదిలీల్లో వెళ్లిన వారు తిరిగి అదే ప్రాంతానికి వెళా ల్సి ఉంటుందని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడంతో డిప్యుటేషన్పై వచ్చిన ఆయన తిరిగి ఆసిఫాబాద్కు వెళ్తాననే బెంగ పెట్టుకున్నట్లు రెవెన్యూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నివాళులర్పించిన ఎమ్మెల్యే, కలెక్టర్ తహసీల్దార్ శ్రీపాల్రెడ్డి భౌతికకాయాన్ని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, ఉన్నతాధికారులు సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
‘వరంగల్ బస్స్టేషన్’ ఆలస్యంపై అసహనం
తనిఖీ చేసిన ‘కుడా’చైర్మన్, వైస్ చైర్పర్సన్ వరంగల్ చౌరస్తా : వరంగల్ ఆర్టీసీ బస్స్టేషన్ నిర్మాణం ఎందుకింత ఆలస్యమవుతుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సాయంత్రం బస్స్టేషన్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ అజిత్ రెడ్డి, ఈఈ భీంరావు పాల్గొన్నారు. అలాగే, భద్రకాళి బండ్ పరిసరాలను పరిశీలించారు. -
నిధుల లేమి!
‘అమ్మ ఆదర్శం’..సర్కారు పాఠశాలల్లో అసంపూర్తిగా మౌలిక వసతుల పనులు ● జిల్లాలో ఈ పథకం కింద 438 స్కూళ్ల ఎంపిక ● ఇప్పటివరకు 80శాతం పూర్తి.. మిగతా వాటి పరిస్థితి ఏమిటో..? ● రూ 9.39 కోట్ల నిధులు విడుదల.. ఇంకా రావాల్సినవి రూ.7.59 కోట్లు ● పనులు చేసినవారు బిల్లుల కోసం నిరీక్షణ గ్రౌండ్ రిపోర్ట్ -
బోనస్.. మైనస్
సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా సన్నరకం ధాన్యం విక్రయించిన రైతులకు ఇంకా బోనస్ పైకం చేరలేదు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతోపాటు అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. కానీ నెలన్నరగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క రైతుకూ ప్రభుత్వం సన్నాల బోనస్ ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో కూడా స్పష్టత లేకపోవడంతో రైతులు ఎదురు చూస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా 3,66,491 మంది రైతుల నుంచి 22.20 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం సేకరించిన ప్రభుత్వం బోనస్ కింద రూ. 1110.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. సన్నరకం ధాన్యం విక్రయించిన రైతుల వివరాలు ఎప్పటికప్పుడు పంపిస్తున్నామని, ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాగానే రైతుల ఖాతాల్లో పడేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి వరంగల్కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఫొటోలోని రైతు పేరు కట్కూరి జయపాల్రెడ్డి. హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన ఆయన ఏడెకరాల్లో సన్న, దొడ్డు రకం వరి సాగు చేశాడు. రెండున్నర ఎకరాల్లో 57 క్వింటాళ్ల వడ్లు రాగా కొనుగోలు కేంద్రంలో నెల క్రితం విక్రయించాడు. ఆన్లైన్ ప్రొక్యూ ర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్) ద్వారా డబ్బులు ఖాతాలో పడ్డాయి. అయితే ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తామన్నక్వింటాకు రూ. 500 బోనస్ మాత్రం ఇప్పటివరకు పడలేదు. వానాకాలం పనులు మొదలవడంతో ప్రభుత్వం తన బోనస్ డబ్బు రూ. 28,500 ఇస్తే పంట పెట్టుబడులకు పనికొస్తాయని జయపాల్రెడ్డి అంటున్నాడు.బోనస్ డబ్బులు పడలేదు..నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఎకరంన్నరలో సన్న వడ్లు, మూడు ఎకరాల్లో దొడ్డు ధాన్యం సాగు చేశా. సన్నాల దిగుబడి 24 క్వింటాళ్లు వచ్చింది. తినేందుకు 12 క్వింటాళ్లు నిల్వ చేసు కున్నాం. వానాకాలం పెట్టుబడి కోసం మిగిలిన 12 క్వింటాళ్ల సన్నధాన్యాన్ని 20 రోజుల క్రితం ఐకేపీ సెంటర్లో విక్రయించా. రూ. 500 చొప్పున బోనస్ పడలేదు. ఈ పైసలు వస్తే పెట్టుబడికి ఎవరినీ అడగకుండా ఉంటది. – నీల సంపత్, అబ్దుల్నాగారం, తరిగొప్పుల మండలం, జనగామ జిల్లా -
సన్నబియ్యం పంపిణీ చేయాలి
ధర్మసాగర్ : రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. గురువారం మండలంలోని ముప్పారంలో రేషన్ షాపును అధికారులతో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 17వ నంబర్ షాపులో ఎన్ని క్వింటాళ్ల బియ్యం వచ్చింది.. ఎంత పంపిణీ చేశారు.. ఏయే సమయంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారని ఆరా తీశారు. కొత్త రేషన్ కార్డులు ఎన్ని వచ్చాయి..కుటుంబ సభ్యుల చేర్పుల కార్డులు ఉన్నాయా అని డీలర్ను అడిగి తెలుసుకున్నారు. రేషన్ బియ్యంను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఎన్ని కిలోల బియ్యం తీసుకున్నారు.. సన్నబియ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా భూ భారతి రెవెన్యూ సదస్సును పరిశీలించి, రెవెన్యూ సదస్సు సందర్భంగా దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన వివిధ సహాయక కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాతంపల్లి గ్రామ పరిధిలోని సయ్యద్నగర్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతుండగా వాటిని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఇళ్ల పురోగతి, బిల్లుల చెల్లింపు తదితర వివరాలను పంచాయతీ కార్యదర్శి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి కొమురయ్య, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ అనిల్ కుమార్, డీఈ సిద్దార్థ నాయక్, నాయబ్ తహసీల్దార్ సంతోష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య భూ భారతి రెవెన్యూ సదస్సు పరిశీలన -
బడిబాటకు వేళాయె..
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు.. హనుమకొండ జిల్లాలో అసలు విద్యార్థులు లేని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 41 ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులను గతేడాది విద్యార్థులున్న పాఠశాలలకు సర్దుబాటు చేశారు. ఈ ఏడాది ఆయా పాఠశాలలను తెరిచేందుకు డీఈఓ వాసంతి అవకాశం ఇచ్చారు. 41 పాఠశాలల్లోని టీచర్లు బడిబాట కార్యక్రమం ద్వారా తమతమ ప్రాంతాల పాఠశాలల పరిధిలో విద్యార్థులను నమోదు చేయిస్తే అవే పాఠశాలల్లోనే ఆయా టీచర్లు కొనసాగించేందుకు కూడా నిర్ణయించారు. కనీసం పది మంది విద్యార్థులను చేర్పించిన కూడా ఆయా పాఠశాలలు కొనసాగనున్నాయి. విద్యార్థులను చేర్పించలేని పరిస్థితుల్లో ఆయా పాఠశాలల టీచర్లను విద్యార్థులున్న ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు. జిల్లాలో 10లోపు విద్యార్థులున్న పాఠశాలలు మరో 45 వరకు ఉన్నాయి. ఆయా పాఠశాలల టీచర్లు కూడా తమతమ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచుకోవాల్సిందే. 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కూడా కొన్నింటిలో తక్కువగానే విద్యార్థులు ఉన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలిగించేలా కృషిచేసి విద్యార్థులను చేర్పించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఆయా పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలలో సర్దుబాటు చేశారు.విద్యార్థులను చేర్పించని పాఠశాలల టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. రోజువారీగా కార్యక్రమాలు ఇలా.. ● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి. ● 7న ఇంటింటికి తిరుగుతూ బడిఈడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి. ● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికివె వెళ్లి ప్రచారం చేయటంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. అందులోని బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించేలా ప్రోత్సహించాలి. ● 11న బడిబాట ద్వారా చేసిన ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి. ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి. ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి. ● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన కల్పించి మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి. విద్యార్థుల నమోదు లక్ష్యం.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబలైజింగ్, కోఆర్డినేటర్ నేటినుంచి 19వరకు నిర్వహణ వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు జిల్లాల్లో విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే.. కనీసం పదిమందినైనా చేర్పించాలి.. హనుమకొండలో 41, వరంగల్లో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య జిల్లాలో పాఠశాలల వివరాలు జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూల్స్ హనుమకొండ 314 72 147 -
ప్రజాపోరాటాలతోనే సమస్యల పరిష్కారం
న్యూశాయంపేట : ప్రజా పోరాటాలతోనే సమస్యల పరిష్కారం లభిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఎం హనుమకొండ జిల్లా విస్తృత సమావేశం గురువారం ఓ ఫంక్షన్హాల్ జిల్లా కమిటీ సభ్యుడు రాగుల రమేశ్, జి.రాములు, బి.చక్రపాణిల అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా సుదర్శన్ హాజరై మాట్లాడుతూ..కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, వాటి అనుబంధ రూల్స్ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఇందుకు వ్యతిరేకంగా ఈనెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు చుక్కయ్య, జి.వెంకట్, వీరన్న, తిరుపతి, లింగయ్య, భాను నాయక్, మండల, ఏరియా కార్యదర్శులు, గ్రామశాఖ కార్యదర్శులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుదర్శన్ -
‘ఆయుష్మాన్’లో నాణ్యమైన వైద్యసేవలు
● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎల్కతుర్తి : ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య తెలిపారు. మండలంలోని కేశవాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, ఎల్కతుర్తి పీహెచ్సీని డీఎంహెచ్ఓ గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల విశ్వసనీయత, సౌకర్యాలను మెరుగుపర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నాణ్యత, హామీ ప్రమాణాలు (ఎన్క్యూఎస్) ప్రారంభించిందన్నారు. గతేడాది నుంచి జాతీయస్థాయిలో అవార్డు కోసం ఎల్కతుర్తి ప్రాథమిక ఆర్యోకేంద్రం పరిధిలోని కేశవాపూర్ ఆయుష్మాన్ హెల్త్ ఆండ్ వెల్నెస్ సెంటర్ పోటీ పడుతోందన్నారు. కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి శ్రీనాథ్, డాక్టర్ అరవింద్, దుర్గాప్రసాద్, కవిత, భవాని, రుక్మొద్దిన్, రవీందర్, ఉమాదేవి, ఏఎన్ఎంలు శుక్ర, స్వరూప, సునీత, రాజ్కుమార్ తదితరులు ఉన్నారు. పీహెచ్సీలను శుభ్రంగా ఉంచాలి ఎంజీఎం/హసన్పర్తి : జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎంజీఎం ఆస్పత్రి ప్రాంగణంతో పాటు లష్కర్ సింగారం పట్టణ ఆరోగ్య కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే రోగులకు ఆస్పత్రి ప్రాంగణం శుభ్రంగా పచ్చదనంతో ఆహ్లాదంగా కనిపించాలని సూచించారు. అదేవిధంగా టీబీ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని డీఎంహెచ్ఓ పిలుపునిచ్చారు. హసన్పర్తి మండల కేంద్రంలోని దళితవాడ పాఠశాలలో టీబీ టెస్ట్లు నిర్వహించారు. ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ రజాహైదర్, హెల్త్ సూపర్వైజర్ బాబు, ఎంజీఎం సూపర్వైజర్ నర్మద, విప్లవకుమార్, టీబీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ హిమబిందు, టెక్నీషియన్ అయ్యుతరావు,హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఫార్మసీ ఆఫీసర్, నర్సింగ్ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
భూ సమస్యల పరిష్కారానికి భూభారతి
కమలాపూర్ : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు రైతులు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి అంబాలలో 230, గూడూరులో 161 దరఖాస్తులు స్వీకరించారు. ఏఎంసీ చైర్ పర్సన్ తౌటం ఝాన్సీరవీందర్, వైస్ చైర్మన్ దేశిని ఐలయ్య, తహసీల్దార్ ఎం.సురేష్కుమార్, నాయబ్ తహసీల్దార్ శోభారాణి, సర్వేయర్ గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి -
9న ‘జోసా’ ఓపెన్ హౌజ్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన జోసా (జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ) ద్వారా నిట్, ఐఐటీల్లో ప్రవేశాలపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఓపెన్ హౌజ్ నిర్వహించనున్నట్లు నిట్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్లు, ప్రొఫెసర్లు ఉదయం 10:30 నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. నేరుగా హజరుకాలేకపోతున్న వారి కోసం నిట్ అధికారిక యూట్యూబ్ అందుబాటులో ఉంటుందని వివరించారు. నిట్ను అగ్రగామిగా నిలబెడదాంనిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ మోహన్రెడ్డి కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీకాజీపేట : కాజీపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ రాయల ప్రభాకర్ రావు గురువారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదు, ఈ–చలాన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు నంబరు ప్లేట్లు లేకుండా తిరగడం, మైనర్ డ్రైవింగ్ వంటి విషయాల్లో ఎవరిని ఉపేక్షించొద్దని సిబ్బందికి సూచించారు. ఏసీపీ సత్యనారాయణ, సీఐ వెంకన్న, ఎస్సైలు కనక చంద్రం, రామారావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంకాజీపేట అర్బన్ : జిల్లాలోని గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి గాను 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమకళారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 9వ తేదీనుంచి 13వ తేదీలోపు హనుమకొండ అంబేడ్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పరిశోధనపత్రాల ప్రొసీడింగ్స్ ఆవిష్కరణకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని జువాలజీ విభాగం ఆధ్వర్యంలో ఈఏడాది మార్చి 11, 12వ తేదీల్లో ‘ఇన్నోవేటివ్ టెక్నిక్స్ ఇన్ యానిమల్ బయా టెక్నాలజీ అండ్ ఇమ్యునాలజీ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్’ జాతీయ సదస్సు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో వచ్చిన 26 పరిశోధన పత్రాలతో కూడిన ప్రొసీడింగ్స్ (పుస్తకం)ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రంతో కలిసి కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్రెడ్డి గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో జువాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ షమిత, ఆ విభాగం ప్రొఫెసర్లు మామిడాల ఇస్తారి, డాక్టర్ వెంకయ్య, ఈసం నారాయణ, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కృష్ణవేణి, డీన్ ప్రొఫెసర్ గాదె సమ్మయ్య పాల్గొన్నారు. -
వరంగల్
ఉద్యాన పంటల సాగు లాభదాయకం రైతులు తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ పొందుతూ ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని ఉద్యాన అధికారి సుస్మిత తెలిపారు.సీఎంఆర్ గడువులోగా పూర్తయ్యేనా?వాతావరణం ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025ఖిలా వరంగల్: ‘వానాకాలం సాగులో రైతులు సరైన విత్తన ఎంపిక, సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడి సాధించవచ్చు. పంటకు విత్తే మూలం.. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలను అవలంబిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయి’ అని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఫోన్ ఇన్లో జిల్లా నలుమూలల నుంచి రైతులు సాగుకు అనువైన విత్తనాలు, అందుబాటులో ఉన్న రకాల వివరాలే కాకుండా సాగు విధానాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అనురాధ ఇచ్చిన సమాధానాలు ఇలా.. ప్రశ్న: ప్రస్తుత వర్షాలకు వరి నార్లు పోసుకోవచ్చా? ఏరకం విత్తనాలు మేలు?– రైతు మెండె రమేశ్, పనికెరగ్రామం, నెక్కొండ జవాబు: జూన్ మొదటి వారం తర్వాత వరినార్లు పోసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన సన్న రకాలను విత్తుకుంటే మద్దతు ధరతోపాటు బోనస్ వస్తుంది. ప్రశ్న: పచ్చిరొట్ట విత్తన ధరలు గతేడాదిలో పోలిస్తే పెరిగాయి ఎందుకని? – జి.సురేందర్ చంద్రగొండ నెక్కొండ జవాబు: విత్తనోత్పత్తి తగ్గడంతో కొంత మేర ధర పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు జిల్లావ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ప్రశ్న: డీఏపీ కాంప్లెక్స్ ఎరువులకు సైతం మరింత సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉందా?– రావుల భాస్కర్, రాయపర్తి జవాబు: యూరియా వాడకం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ యూరియా పాళ్లు ఉంటాయి. ఫార్మల్ ఐడీ విధానం అమలైతే భూమి ఆధారంగా కోటా నిర్ధారించే అవకాశం ఉంది. ప్రశ్న: పెసర ఎప్పుడు, ఏరకాలు విత్తుకోవచ్చు? – తోటకూరి సాయిలు, పెర్కేడు రాయపర్తి మండలం జవాబు: వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు దుక్కలు సిద్ధం చేసుకుని 60మి.మీల వర్షపాతం నమోదయ్యాక జూన్ మొదటి వారం నుంచి పెసర విత్తుకోవచ్చు. ఎంజీజీ రకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రశ్న: పంటల సాగుపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా? – ఏసీరెడ్డి ప్రభాకర్, తూర్పు కోట జవాబు: రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైసెన్స్డ్ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే నాసిరకం బెడద ఉండదు. ప్రశ్న: వానాకాలంలో సాగు చేసే సన్న గింజ వరి రకాలు తెలపండి? – కందుల సారంగం బొల్లికుంట జవాబు: సన్నరకాల్లో డబ్ల్యూజీఎల్ 44(సిద్ది) జూన్ 15 వరకు నార్లు పోసుకుని దీర్ఘకాలిక రకం.. కేఎన్ఎం 1638 రకం, సల్ప కాలిక రకంలో జూలై నెలలో నారు పోసుకునేందుకు అనువైన రకం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా వంటివి సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: వరిలో చౌడు నేలలను తట్టుకుని మంచి దిగుబడి ఇచ్చే రకాలేంటి? – పులి అశోక్, లింగగిరి గ్రామం, చెన్నారావుపేట జవాబు: చౌడు నేలలను తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే దొడ్డు రకం కేఎన్ఎం రకం 118 సాగుకు అనుకూలం. ప్రశ్న: వర్షాధారంగా సాగు చేసే కంది రకాలను వివరించండి?– చంద్రమౌళి ల్యాబర్తి, వర్ధన్నపేట జవాబు: పీఆర్జీ 176, టీడీఆర్జీ 4, డబ్ల్యూఆర్ జీఈ97, డబ్ల్యూర్జీఈ 121, వంటి రకాలను సాగు చేసుకోవచ్చు. ప్రశ్న: పప్పు ధాన్యాల్లో వాడే జీవన ఎరువులు ఏవి? – వెంకటేశ్వర్లు పర్వతగిరి జవాబు: రైజోబియం 200 గ్రాములు, పాస్పోబ్యాక్టీరియా 200 గ్రాములు కలిపి ఒక ఎకరానికి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి 24 గంటల్లోపు విత్తనాన్ని విత్తుకోవాలి. ప్రశ్న: ఆయిల్ ఫామ్లో మొక్కజొన్నను అంతర పంటగా వేసుకోవచ్చా?– మల్లికార్జున్, చింతకుంట, పర్వతగిరి జవాబు: 19 నెలల వయస్సు ఉన్న తోటలో అంతర పంటగా మొక్కజొన్న కంటే కూరగాయలు, పెసర, మినుము సాగు మేలు. దుక్కి ఎక్కువగా దున్నకూడదు. అలా చేస్తే ఆయిల్ ఫామ్ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. యాసంగి పంటగా మాత్రం మొక్కజొన్నకు అవకాశం ఉంది. ప్రశ్న: మెట్ట వరి సాగులో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏవి? – నాగుల్ల కుమారస్వామి, పర్వతగిరి జవాబు: మెట్టలో వరి సాగు చేస్తే అంతగా దిగుబడులు రాకపోగా.. సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలుపు, తెగుళ్ల సమస్యలు ఉంటాయి. అలాగే ఆరుతడి వరి సాగులో ఆశించిన ప్రయోజనాలు ఉండవు. ప్రశ్న: పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? – ఎం.తిరుపతిరెడ్డి, మామునూరు జవాబు: రైతుల కోసం అందుబాటులో ఉంచే పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పడితే సహించేది లేదు. ఎవరైనా సరే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తీసుకున్న విత్తనాలపై అవసరమైన ప్రాంతాల్లో క్రాస్ బుకింగ్ చేయిస్తాం. ప్రశ్న: ఈవర్షాలతో పత్తి సాగు చేయొచ్చా? పెసర పంట వేసుకోవచ్చా? – గుండాల కమలాకర్, నల్లబెల్లి జవాబు: ఈఏడాది రోహిణి కార్తెలోనే వానలు కురుస్తున్నాయి. నేలలో పదును ఆధారంగా జూన్ 10 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. పెసర కూడా జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ రకాలు, వరంగల్ రకాలు అనుకూలం. ప్రశ్న: విత్తనాలు నాసిరకానివి, మంచివి ఎలా గుర్తించాలి? – వేముల రమేశ్, నల్లబెల్లి జవాబు: లైసెన్స్డ్ విత్తన షాపుల్లో మాత్రమే కొనుగోలు చేయాలి. అన్ని వివరాలతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మాయమాటలతో అమ్మే విత్తనాలు నకిలీవని భావించాలి. ప్రశ్న: బెండ సాగు చేస్తున్నా.. ఆకులు, కాయలు తెల్లగా మారుతున్నాయి? – ధరావత్ నాగు, సూర్యపేట తండా, చెన్నారావుపేట జవాబు: తెల్లదోమ ద్వారా తెగులు వాప్తి చెందుతుంది. నివారణకు లీటరు నీటికి 1.5 గ్రాములు ఏపీఫెట్ 3 మిల్లీ లీటర్ల వేపనూనె (3000 పీపీఎం) కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రశ్న: ఆయిల్ ఫాం సాగుకు రాయితీ ఉందా? సాగు చేసుకోవచ్చా? – సింగారపు యాకూబ్ జల్లి, చెన్నారావు జవాబు: ఆయిల్ ఫాం సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. తక్కువ పెట్టుబడితో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం వచ్చే ఈపంటను సాగు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు డ్రిప్ పరికరాలతోపాటు రాయితీ ఇస్తోంది. ప్రశ్న: ముందస్తు వర్షాలు కురుస్తున్నాయి. పత్తి గింజలు విత్తుకోవచ్చా? – బత్తుల ప్రవీణ్, బాపునగర్, చెన్నారావుపేట జవాబు: వర్షాలు కురిసినప్పటికీ నేల నుంచి వేడి తగ్గలేదు. సమృద్ధిగా వర్షాలు కురిసిన తర్వాతే (జూన్ 10 తర్వాతే) విత్తనాన్ని విత్తుకుంటే వందశాతం మెలక వస్తుంది. న్యూస్రీల్పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత కలెక్టర్ సత్యశారద ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సమగ్ర యాజమాన్య పద్ధతితోనే అధిక దిగుబడి అనుమతి ఉన్న డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ సూచనలు, సలహాలు ‘సాక్షి’ ఫోన్ ఇన్కు విశేష స్పందన -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
నర్సంపేట రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని మండల న్యాయసేవ సంస్థ చైర్మన్, సబ్ కోర్టు జడ్జి వరూధిని అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్కుమార్, కార్యదర్శి మోటూరి రవి, న్యాయవాదులు దాసి రమేశ్, పుట్టపాక రవి, సునీత, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్స్టేషన్ ఆవరణలో.. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా నర్సంపేటలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు ఎరబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ రఘుపతిరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సై రవికుమార్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరగాని సుదర్శన్, స్వయం కృషి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, కాసుల వెంకటాచారీ, గుంటి సంజీవ, పోలీసులు వీరన్న, శ్రీలత, మహేశ్, భిక్షపతి, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘బడిబాట’కు వేళాయె..
జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూళ్లు హనుమకొండ 314 72 147 వరంగల్ 321 68 123 విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి. విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు.. వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. విద్యార్థులను చేర్పించని టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు. రోజువారీగా కార్యక్రమాలు ఇలా.. ● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి. ● 7న ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి. ● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. ● 11న బడిబాట ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి. ● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి. ● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి. ● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి. ● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి. ● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి. ● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి.నేటినుంచి 19 వరకు నిర్వహణ చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే.. జిల్లాలో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య విద్యార్థుల నమోదే లక్ష్యం.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి, హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్, కో–ఆర్డినేటర్ -
రేషన్కార్డుదారులూ.. ఆందోళన వద్దు
న్యూశాయంపేట: ‘ప్రభుత్వం రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది.. పంపిణీలో కొంత జాప్యం జరుగుతున్నా.. జూన్ మాసాంతం వరకు అందరికీ బియ్యం అందేలా చర్యలు తీసుకుంటాం’ అని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సంధ్యారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈవిషయాన్ని రేషన్ డీలర్లు వినియోగదారులకు వివరించాలని, షాపుల వద్ద క్యూలైన్ లేకుండా ప్రతీ రోజు కొంత మందికి టోకెన్లు అందించి క్రమపద్ధతిలో బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆదేశించారు. మొక్కలు నాటి.. ప్రతిజ్ఞ చేసిపర్వతగిరి: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని మండల ప్రత్యేక అధికారి, డీసీఓ ఎం.నీరజ అన్నారు. ఈమేరకు మండలంలోని అనంతారం గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో మొక్కలు నాటి ప్లాస్టిక్ నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సోమారం గ్రామంలోని కిరాణా దుకాణాదారులకు షాప్లో ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని అవగాహన కల్పించారు. అనంతరం జమలాపురం గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్నాయక్, హౌసింగ్ ఏఈ డి.ఉదయశ్రీ, సోమారం, జమలాపురం కార్యదర్శులు, జమాల్పురం ఇందిరమ్మ కమిటీ సభ్యులు జిల్లా కనకయ్య, ఏఫ్ఏలు, మహిళా సంఘం సభ్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. అలాగే రోళ్లకల్లో తహసీల్దార్ వెంకటస్వామి, అన్నారం గ్రామంలో మండల పంచాయతీ అధికారి శేషాంజన్స్వామి మొక్కలు నాటారు. ప్లాస్టిక్ నియంత్రణపై ర్యాలీగీసుకొండ: పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. గురువారం మండలంలోని మచ్చాపూర్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ నియంత్రణ, మోదుగ ఆకులతో విస్తర్ల తయారీపై నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. డీపీఓ కటకం కల్పన, డీఎల్పీఓ వేదవతి, స్పెషల్ ఆఫీసర్ సురేశ్, ఎంపీడీఓ కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్, ఏపీఎం చంద్రకాంత్, పంచాయతీ కార్యదర్శి సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు. ‘నిట్ను అగ్రగామిగా నిలబెడదాం’కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుదామని నిట్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్, ఐఐటీ హైదరాబాద్, రూర్కీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ బీవీఆర్.మోహన్రెడ్డి పేర్కొన్నారు. నిట్ వరంగల్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్ పర్సన్గా ఎంపికై న సందర్భంగా తొలిసారిగా వరంగల్కు విచ్చేసిన మోహన్రెడ్డి గురువారం నిట్ క్యాంపస్ను పరిశీలించి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీకి అనుగుణంగా సిలబస్ను విద్యార్థులకు అందజేయాలని నిట్ యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మోహన్రెడ్డికి పూలబొకే అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లించాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
● ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్గీసుకొండ: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పీడ కలలు కంటున్నారని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్కే ప్రభాకర్ అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పదకొండేళ్ల మోదీ పాలనపై జిల్లా కార్యశాల నిర్వహించిన సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ సాధించిన విజయా ల గురించి ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రజలకు వివరించడానికి ప్రతీ కార్యకర్త, నాయకుడు సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుసుమ సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణాప్రతాప్రెడ్డి, కార్యక్రమ కోకన్వీనర్లు వడ్డేపల్లి నర్సింహులు, ముండ్రాతి వెంకటేశ్వర్లు, బీజేపీ కార్యాలయ కార్యదర్శి క్రాంతికుమార్, నాయకులు పాల్గొన్నారు. -
ఆదరణ బాగానే ఉంది..
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పొట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినంరోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకుబ్, కాజీపేట -
ఎకరం @ రూ.1.20కోట్లు
‘మామునూరు’ వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయంసాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జి ల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అ వార్డు కింద ఈ మేరకై తే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన డిస్టిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు.జనరల్ అవా ర్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పె షల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామని రైతులు చెప్పారు. ఇప్పటికే 240 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం... గుంటూరు పల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్లో నేగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు. కలెక్టర్ విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద పరిహారం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామన్న రైతులుమరో రూ.83 కోట్లు అవసరమే... వ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరాలకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు కేటా యించింది. ఎకరాకు రూ.కోటి20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరాల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లి స్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. -
‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు
ఎంజీఎం : రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన సభ్యులు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసరంగా కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రిలో హిటింగ్ వెంటిలేషన్, ఏయిర్ కండిషన్ సిస్టం మరమ్మతులతోపాటు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఐదో అంతస్తులోని ఆపరేషన్ థియేటర్ ఈనెల 10వ తేదీలోగా రోగులకు సేవలు అందించేందుకు సిద్ధం చేయాలన్నారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు వారి అటెండెంట్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, సంబంధిత శాఖల అధికారులు, డాక్టర్లు ఉన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సదుపాయాలపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఏసీపీ నర్సయ్య వర్ధన్నపేట: మతసామరస్యంతో అన్ని మతాల ప్రజలు శాంతియుతంగా బక్రీద్ పండుగను జరుపుకోవాలని ఏసీపీ నర్సయ్య అన్నారు. బుధవారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్లో బక్రీద్ పండుగ నిర్వహణపై హిందూ, ముస్లిం మత పెద్దలతో శాంతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నర్సయ్య మట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి పండుగలను జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్సై చందర్, రాయపర్తి ఎస్సై శ్రవణ్కుమార్, జఫర్గఢ్ ఎస్సై రామ్ చరణ్, పాలకుర్తి ఎస్సై మహేందర్రెడ్డి, మతపెద్దలు పాల్గొన్నారు. ఆర్టీసీ విలీనంపై కీలక ప్రకటన చేయాలినర్సంపేట: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచి వాలయంలో నేడు (గురువారం) సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరుగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కీలక ప్రకటన చేయాలని నర్సంపేట ఆర్టీసీ డిపో జేఏసీ చైర్మన్ కె.రంగయ్య, వైస్ చైర్మన్ గొలనకొండ వేణులు కోరారు. ఈ సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మా ట్లాడుతూ మహాలక్ష్మి పథకం విజయవంతం కావడానికి, ప్రభుత్వానికి ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లు మంచి పేరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. విలీనంతో పాటు రెండు పీఆర్సీలు 2021, 2025 ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటిస్తే సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులుజీవితాంతం రుణపడి ఉంటారన్నారు. నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనంగీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి శివారులోని గుంటూరుపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుపల్లికు చెందిన బిరెడ్డి మర్రెడ్డి అనే వ్యక్తి మెదక్ జిల్లాకు చెందిన సందీప్రెడ్డి వద్ద నుంచి పత్తి విత్తనాలను తక్కు వ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు గీసుకొండ ఏఓ హరిప్రసాద్, ఎస్సై ప్రశాంత్బాబు లు సిబ్బందితో వెళ్లి తనిఖీ చేశారు. ఈ తని ఖీల్లో హెచ్టీబీటీ రకం నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని మర్రెడ్డి, సందీప్రెడ్డిలపై కేసు నమోదు చేశామని, మర్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని, సందీప్రెడ్డి పరా రీలో ఉన్నాడని సీఐ మహేందర్ తెలిపారు. -
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
న్యూశాయంపేట : పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాద్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీ ఎఫ్) భీమా నాయక్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హనుమకొండ సుబేదారి ఫారెస్ట్ కాంప్లెక్స్లో బుధవారం ప్లాస్టిక్ ప్రీ కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం కాంప్లెక్స్ ఆవరణలోని ప్లాస్టిక్ వస్తువులు, బ్యాగులు సిబ్బంది సేకరించి డంపింగ్ యార్డ్కు తరలించి, ఆవరణను శుభ్రం చేశారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, మినిస్ట్రీరియల్ సిబ్బంది పాల్గొన్నారు. రైల్వేవర్క్స్ సెక్షన్ల తనిఖీ కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని బెల్లంపల్లి–రెచ్నీరోడ్ సెక్షన్లో చేపట్టనున్న రైల్వే ఎన్ఐ ఇంజనీరింగ్ వర్క్స్ లోకేషన్ను బుధవారం సికింద్రాబాద్ రైల్వే అధికారులు తనిఖీ చేశారు. రైల్వే ఏడీఆర్ఎం ఆపరేటింగ్ విభాగం గోపాలకృష్ణన్, ఇతర అధికారులు ఎన్ఐ బ్లాక్ సెక్షన్లను పరిశీలించి తనిఖీ చేసి పలు సాంకేతిక విషయాలపై ఇంజనీరింగ్ అధికారులకు సూచనలు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా బెల్లంపల్లి–రెచ్నీ మధ్య ఎన్ఐ ఇంజనీరింగ్ బ్లాక్ పనులు ఈ నెల 20వ తేదీ వరకు ఉంటుందని, దీంతో దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్, కాజీపేట–బల్లార్షా రూట్లలో పలు రైళ్లను రద్దు, దారి మళ్లింపు, దూరం తగ్గించి నడిపిస్తున్నట్లు అధికారులు వివరించారు. 1,220 దరఖాస్తుల స్వీకరణ హన్మకొండ అర్బన్ : జిల్లావ్యాప్తంగా 14 గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై రైతులనుంచి 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ సదసుల్లో సర్వే నంబర్ల మిస్సింగ్–90, పెండింగ్ మ్యూటేషన్–17, డీఎస్ పెండింగ్–49, ఎక్స్టెంట్–113, అసైన్డ్ భూ సమస్యలు–179, సక్సేషన్–101, ఇతర సమస్యలపై 625లతో పాటు తదితర సమస్యలపై మొత్తం 1,220 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లు, ఆర్ఐలు, సర్వేయర్లు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి న్యూశాయంపేట: భూసమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం ఏనుమాములలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. అనంతరం బాలాజీనగర్లో రేషన్ షాపును ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు. హిందీ పరీక్షకు 8మంది హాజరువిద్యారణ్యపురి : జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం హిందీ పరీక్షకు మొత్తం 12మందికి 8మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ మార్కజీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ముగ్గురు, బస్టాండ్ రోడ్డులోని ప్రభుత్వ హైస్కూల్ కేంద్రంలో ఇద్దరు, పెట్రోల్ పంపు బాలికల హైస్కూల్ కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు హాజరయ్యారు. -
మోదీ పాలనపై ప్రజలకు విశ్వాసం, నమ్మకం
హన్మకొండ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం ఉందని బీజేపీ నేత, రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వం.. సంకల్పంతో సాకారం అనే అంశంపై హనుమకొండ దీన్దయాళ్ నగర్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యశాల జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ 11ఏళ్ల పాలనలో ఒక్క రూపాయీ అవినీతి లేకుండా పాలన కొనసాగించారని గుర్తుచేశారు. యూపీఏ హయాం అంతా కుంభకోణాలమయమే అని ఆరోపించారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ సీతారాం నాయక్, నాయకులు దొంతి దేవేందర్ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్, చాడ శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమ కన్వీనర్ సండ్ర మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థల పరిశీలన
వర్ధన్నపేట: వర్ధన్నపేట నియోజకవర్గానికి రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఈ స్కూల్ నిర్మా ణం వర్ధన్నపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుందని స్థానిక నాయకులు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజును కోరడంతో మున్సిపాలిటీ పరిధిలోనే స్కూల్ నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ విజయ్సాగర్, ఆర్ఐ అసిఫ్, మండల సర్వేయర్ గీత, అసిస్టెంట్ సర్వేయర్ రవీందర్ గౌడ్, జూనియర్ అసిస్టెంట్ సంపత్తో కలిసి మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ (గువ్వల బోడు) దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అన్మిరెడ్డి కృష్ణారెడ్డి, ఐనవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు తూల్ల రవి, నాయకులు సిలివేరు శ్రీధర్, పులి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పొట్టేల్.. అధరహో..
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2025– 12లోuకాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఉంటుంది. ట్రైసిటీతో పాటు నగరంలోని 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ వేడుకను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను బలిఇస్తారు. వారు కొంత మటన్ను వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్చానీ (దానం) ఇస్తారు.పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు నగరానికి వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. దీంతో ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
వరంగల్
గురువారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 202 పొట్టేల్.. అధరహో..శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి ఖరీఫ్ పంటలు, విత్తనాల నాణ్యత, సాగు విధానంపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని ఏడీఆర్ ఉమారెడ్డి తెలిపారు.– 12లోuకాజీపేట : బక్రీద్ పర్వదినం అంటేనే గొర్రె పొట్టేళ్ల విక్రయాలు.. ఈ పండుగ సందర్భంగా ఖుర్బానీ (దానం) ఇవ్వడం ముస్లింల ఆచారం. బక్రీద్ వచ్చిందంటే వారం ముందునుంచే నగరంలో పొట్టేళ్ల విక్రయాలకు భలే డిమాండ్ ఏర్పడింది. ట్రై సిటీతో పాటు 25 ప్రాంతాల్లో కొద్దిరోజులుగా పొట్టేళ్ల అమ్మకాలు జోరుగా మొదలయ్యాయి. ఈనెల 7వ తేదీన బక్రీద్ పండుగ ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినానికి శరీరంపై ఎటువంటి గాయాలు లేని పొట్టేళ్లనే ఎక్కువగా ముస్లింలు కొనుగోలు చేయడానికి ఇష్ట పడుతుంటారు. ధర ఎంతైనా సరే పొట్టేళ్లు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా ఉన్నవారు రెండు, మూడు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. వారు కొంత మాంసం వండుకుని మిగతాది పేదలకు, బంధువులకు ఖుర్బానీ (దానం) ఇస్తారు.పొట్టేళ్లను విక్రయించేందుకు గ్రామాలనుంచి కాపరులు వస్తుంటారు. అయితే ఏజెంట్లు కలుగజేసుకొని తమకు పరిచయం ఉన్నవారికి తాము అమ్మిస్తాం.. మాకు కమీషన్ ఇవ్వాలని నమ్మించి పొట్టేళ్లు తెచ్చిన కాపరులను పక్కన పెట్టేస్తున్నారు. ఏజెంట్లే రేట్లు నిర్ణయించి తెలిసిన వారికి విక్రయించి లాభాలు గడిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ ఏజెంట్ల వల్ల ధరలు పెరగడమేనని పలువురు వాపోతున్నారు. బక్రీద్ సందర్భంగా పొట్టేళ్ల ధరలను చూసి పలువురు ఇంత రేటా! అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.బక్రీద్ విక్రయాలకు తెచ్చిన పొట్టేళ్ల ధరలు రూ.5వేల నుంచి రూ.25వేల వరకు పలుకుతున్నా యి. పొట్టేల్ ఉన్నది ఉన్నట్టుగా తూకం వేసి కిలోకు రూ.430ల చొప్పున విక్రయిస్తున్నారు. ఆరోగ్యంగా, బలంగా ఉన్న పొట్టేళ్లను గొర్రెల కాపరులు అధిక ధరలకు అమ్ముతున్నారు. గతేడాదితో పోల్చితే ఈఏడాది ధరలు కొంత ఎక్కువగానే ఉన్నాయని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు. బక్రీద్ రోజు వరంగల్ నగరంలో దాదాపు 10వేలకు పైగా పొట్టేళ్లు బలిస్తారని ముస్లింలు చెబుతున్నారు. ధర రూ.5వేల నుంచి మొదలు -
ఆదరణ బాగానే ఉంది
బక్రీద్ పండుగ దృష్ట్యా ఆరు నెలల ముందునుంచే గొర్రె పోట్టేళ్లను పెంచుతాం. ఇవి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత మంచి ధర వస్తుంది. ప్రస్తుతం విక్రయాలతో ఆరునెలల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుంది. – జక్కుల గట్టయ్య, మల్లక్పల్లి ప్రతి ఏటా రెండు పొట్టేళ్లు కొంటాం ఖర్చుకు వెనకాడకుండా ప్రతిఏటా బక్రీద్ పర్వదినం రోజుకు రెండు పొట్టేళ్లను కొంటాం. మూడు భాగాలు చేసి పంపిణీ చేస్తాం. ఈసారి ధరలు బాగానే ఉన్నాయి. ప్రతీ ముస్లిం విధిగా తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి మాంసం దానం చేస్తారు. – సయ్యద్ యాకూబ్, కాజీపేట -
ఆయిల్పామ్ నర్సరీ పరిశీలన
సంగెం: మండలంలోని గవిచర్ల గ్రామంలోని గల ఆయిల్పామ్ నర్సరీని జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ అధికారి జి.అనసూర్య బుధవారం సందర్శించి పరిశీలించారు. సెకండరి నర్సరీలో ఉన్న మొక్కలను పరిశీలించి చేపట్టాల్సిన ఎరువుల, నీటి యాజమాన్య పద్ధతులపై సూచనలు, సలహాలు అందించారు. కల్లింగ్ మొక్కలను తీసివేయాలన్నారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలను అందించాలని రాంచరణ్ ఇండస్ట్రీస్ నర్సరీ ఇన్చార్జ్ కిరణ్కుమార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖాధికారి ఎన్. తిరుపతి, టెక్నికల్ సిహెచ్. రాకేష్, రాంచరణ్ ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ సురేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్: చరిత్రాత్మక దేవాలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించతలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ముందు రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని, ఆక్రమించినవారు స్వచ్ఛందంగా భూములను తిరిగి ఇవ్వాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా దేవాలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి దేవాలయం అభివృద్ధిలో భాగంగానే భద్రకాళి మాడవీధుల నిర్మాణం కోసం రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్ాధ్యన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీని వల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని దేవాలయాలను పరిశీలించి సరైన మాస్టర్ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు. వైభవంగా పూజాకార్యక్రమం... ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదా యశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్ బాబు, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి,ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం.. -
ఆలయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక దేవాలయాల అభివృద్ధ్దే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర దేవాదాయశాఖ, అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం భద్రకాళి దేవాలయం సమీపంలోని ఊళ్లో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో రూ.1.30 కోట్లతో నిర్మించ తలపెట్టిన భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన(వేదపాఠశాల) నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. అనంతరం భద్రకాళి ఆలయం ఎదుట రాజగోపురం నిర్మాణం పనులకు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. సరైన వసతులతో వేదపాఠశాల లేక విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసని, వేదపాఠశాల నిర్మాణం వీలైనంత తొందరగా పూర్తిచేయాలన్నారు. దేవాదాయశాఖ పరిధిలో ఉన్న భూములను ఆక్రమించడం చట్టవిరుద్ధమని ఆమె అన్నారు. దేవాలయాల భూముల్లో ఆయా ఆలయాలకు ఉపయోగపడేలా వేదపాఠశాలలు, గోశాలలు, ధ్యానమందిరాలు, ప్రవచన మండపాలు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం నిధులు సమకూరుస్తుందని తెలిపారు. భద్రకాళి ఆలయం అభివృద్ధిలో భాగంగానే మాడవీధుల నిర్మాణానికి రూ.30కోట్లు మంజూరు అయ్యాయన్నారు. భద్రకాళి చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకే పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఇక ముందు వరంగల్లోని అన్ని ఆలయాలను, పురావస్తుశాఖ పరిధిలోని దేవాలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, దీనివల్ల టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయాలను పరిశీలించి సరైన మాస్టర్ ప్లాన్ను రూపొందించాలని ప్రభుత్వ ధార్మిక సలహాదారు గోవింద్ హరిని సూచించినట్లు తెలిపారు. వైభవంగా పూజా కార్యక్రమం.. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు శంకుస్థాపన పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది సాల్రగామశిలలను (బ్లాక్ గ్రానైట్) కలశాలపై ఉంచి వాస్తునాభి పూజ, హోమం నిర్వహించారు. మంత్రి, ఎమ్మెల్యే శిలాన్యాసం చేయడంతో పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం రాజగోపుర నిర్మాణాలకు శిలా న్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి, అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత, డీఈఈ సీహెచ్.రమేష్బాబు, కార్పొరేటర్ విజయలక్ష్మి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈఓ శేషు భారతి, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. మంత్రి కొండా సురేఖ రూ. 1.30కోట్ల వ్యయంతో వేదపాఠశాల భవన సముదాయానికి శంకుస్థాపన భద్రకాళి ఆలయ రాజగోపుర నిర్మాణ పనులకు సైతం.. -
కష్టాల సాగు.. !
ఖానాపురం: ధాన్యాగార కేంద్రమైన పాకాల ఆయకట్టు కింద వరినాట్లు సాగవుతుంటాయి.. ఆయకట్టు కింద రాష్ట్ర షెడ్యుల్కు అనుగుణంగా కాకుండా సుమారు నెలరోజుల ఆలస్యంగా సాగు జరుగుతుంటాయి. ఇలా ఆలస్యం కావడంతో చివరగా ధాన్యం విక్రయించుకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇదే విషయంపై జిల్లా అధికారులు ఽకొనుగోలు కేంద్రాల తనిఖీలకు వచ్చిన సమయంలోనూ రైతుల వద్ద ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సంవత్సరమైన సాగు ఆలస్యం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఆయకట్టు పరిధిలో సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. జిల్లాలో పాకాల ఆయకట్టు కింద 29,500 ఎకరాల్లో వరి పంటలు సాగు అవుతుంటాయి. ఆయకట్టు కింద ప్రతీ సంవత్సరం నాట్లు వేసుకోవడం ఆలస్యమవుతూనే ఉన్నాయి. సరస్సులో నీరు ఉన్నప్పటికీ నీటి విడుదల ఆలస్యం అవుతుండటంతో నార్లను సైతం ఆలస్యంగా పోసుకుంటున్నారు. తద్వారా వరి కోతలు, ధాన్యం విక్రయాలు ఆయకట్టు పరిధిలో ఆలస్యమవుతూ ఉన్నాయి. పాకాల సరస్సులో ఉన్న నీటిని ముందస్తుగా విడుదల చేస్తే రైతులు నార్లు పోసుకొని నాట్లు ఆలస్యం కాకుండా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పాకాల ఆయకట్టు పరిధిలో ఆగస్టు 20వ తేదీ వరకు నాట్లు వేస్తూనే ఉంటారు. వాస్తవంగా త్వరగా నీటిని విడుదల చేస్తే జులై 5 లోపు నార్లు సిద్ధమై జులై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో నాట్లు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే రైతులకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ధాన్యం విక్రయాలకు ఇబ్బందులు వర్షాకాలంలో నాట్లు ఆలస్యంగా వేసుకోవడంతో కోత దశ సైతం ఆలస్యమవుతుంది. ధాన్యం విక్రయాలు చాలా కష్టంగా మారుతుంది. రాష్ట్రంలో ముందస్తు నాట్లు వేయడంతో కోతలు ముందుగా జరిగి ఇతర జిల్లాలకు చెందిన ధాన్యం జిల్లాలోని మిల్లులకు వస్తున్నాయి. ఆయకట్టు కింద ఆలస్యంగా విక్రయాలు జరగడంతో అప్పటికే మిల్లుల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయి దిగుమతులకు నిరాకరిస్తున్న సంఘటనలు కనిపిస్తూనే ఉన్నాయి. అధికా రులు, రైతుల ఒత్తిడితో దిగుమతులు చేసుకోవడానికి మిల్లర్లు కొర్రీలు పెడుతున్న సందర్భాలు అనేకంగా ఉంటున్నాయి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ముందస్తు నాట్లు వేసుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ముందస్తుగా నాట్లు వేసుకోవాలి.. పాకాల ఆయకట్టు పరిధిలో రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి. పాకాల సర స్సు ద్వారా నీటి విడుదల త్వరగా జరిగితే నార్లు ముందస్తుగా పోసుకొని నాట్లు త్వరగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాగు ఆలస్యమైతే ధాన్యం విక్రయాల్లోనూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – బోగ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి, ఖానాపురం పాకాల ఆయకట్టులో ప్రతీ సంవత్సరం వరినాట్లు ఆలస్యం ధాన్యం విక్రయాల్లో వెనకబడుతున్న రైతులు ముందస్తు సాగుతోనే తొలగనున్న సమస్యలు నీరు విడుదలైతేనే పనులు ముందుకు.. -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
న్యూశాయంపేట: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. బుధవారం వరంగల్ మండల పరిధిలోని ఏనుమాములలో నిర్వహించిన సదస్సులో పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతు ల సందేహాలను నివృత్తి చేశారు. తహసీల్దార్, నా యబ్ తహసీల్దార్ నేతృత్వంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు రెండు గ్రామాల్లో సదస్సులు జరిపేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్డెస్క్, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇక్బాల్ తదితర సి బ్బంది పాల్గొన్నారు. అనంతరం బాలాజీ నగర్లో రేషన్ షాప్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా క్రమపద్ధతిలో బియ్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. వినియోగదారులతో నేరుగా మాట్లాడి రేషన్సక్రమంగా అందుతుందా అని ఆరా తీసి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టాక్ వివరాలు ప్రజల కు కనిపించే విధంగా ఫ్లెక్సీ ప్రదర్శించాలన్నారు. ‘సూపర్ స్పెషాలిటీ’ బలోపేతానికి చర్యలు ఎంజీఎం: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కాకతీయ మెడికల్ కళాశాలలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన అవసరమయ్యే సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. బుధవారం కేఎంసీలోని పీఎంఎస్ఎస్వై సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి, ఆలస్యంగా విధులకు హాజరైన ఇద్దరు డాక్టర్లు, హెడ్నర్సునుంచి సంజాయిషీ కోరాలని పర్యవేక్షకులను ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణలో డాక్టర్లు, అధికారులతో కలిసి పర్యటించి తక్షణమే కావాల్సిన అవసరాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై రోగులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వివిధ విభాగాల ఇంజనీరింగ్ అధికారులతో నియమించిన బృందం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు ఎంజీఎంలో అత్యవసరంగా కావాల్సిన అవసరాలను పరిశీలించి రేపటిలోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఫార్మసీలో మందుల నిల్వలను పరిశీలించారు. డయాలసిస్ కేంద్రంలో అదనంగా ఏడు పడకలు, బ్లడ్ ప్యూరిఫైయింగ్ థియేటర్, రోగులు, వారి అటెండెన్స్ల కోసం షెడ్, ఇందిరా మహిళా క్యాంటీన్ను ఏర్పాటు చేయాలన్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్కుమార్ రెడ్డి, డాక్టర్ మురళి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, బీసీ సంక్షేమ జిల్లా అధికారి పుష్పలత, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గోపాల్ రెడ్డి టీజీఈడబ్ల్యూఐడీసీ, టీజీఎంఐడీసీ, ఇరిగేషన్ శాఖల ఈఈలు ప్రసాద్, రవీందర్, సునీత, అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
గత ప్రభుత్వ నిర్లక్ష్యం పేదలకు శాపం
సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతిహన్మకొండ అర్బన్: హనుమకొండ అంబేడ్కర్ కాలనీలోని పేదలకు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, అర్హులైన పేదలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ఆరోపించారు. అంబేడ్కర్ కాలనీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో 592 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి, స్థానికంగా 20 నుంచి 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వారికి ఇస్తామని చెప్పి, కేవలం 6 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అధికారులు చొరవ తీసుకొని అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని కోరారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్ పాల్గొన్నారు. ఓరుగల్లు రంగస్థల కళాకారుల సంస్మరణ సభ హన్మకొండ కల్చరల్: ఇటీవల మరణించిన వరంగల్కు చెందిన రంగస్థల కళాకారులు చక్రహరి సురేందర్రావు, బలగం ఫేం జీవీ బాబు, శతపతి శ్యామలరావు సంస్మరణ సభను వరంగల్ పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియంలో బుధవారం రాత్రి నిర్వహించారు. వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన సభలో కళాకారులు ఎన్ఎస్ఆర్ మూర్తి, జేఎన్.శర్మ, ఓడపల్లి చక్రపాణి, శ్రీరామోజు సుందరమూర్తి, పందిళ్ల అశోక్బాబు, గూడూరు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
1.20
ఎకరం @కోట్లురూ.సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం కోసం సేకరించే వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.కోటి 20 లక్షలు పరిహారం ఇచ్చేలా వరంగల్ జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టర్ సత్యశారద తనకున్న విచక్షణాధికారాలతో కన్సంట్ అవా ర్డు కింద ఈ మేరకై తే ఇవ్వగలమని భూములు కోల్పోతున్న నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన డిస్ట్రిక్ లెవెల్ ల్యాండ్ నెగోషియేషన్ కమిటీ సమావేశంలో తేల్చిచెప్పారు. జనరల్ అవా ర్డు కింద రూ.65లక్షల వరకే ఇవ్వాల్సి ఉన్నా.. స్పెషల్ (కన్సంట్) అవార్డు కింద రూ.కోటి 20 లక్షలు ఇస్తున్నామని రైతులకు ఆమె హామీ ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ధర కు రైతులు అంగీకరించి సహకరించాలని కోరారు. కాగా, రెండురోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామని రైతులు చెప్పారు. ఇప్పటికే 240 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. నేడు వ్యవసాయేతర భూముల రైతులతో సమావేశం గుంటూరు పల్లి రైతులు కొత్తగా రోడ్డు ఏర్పాటు చేయాలని కోరగా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదికను తయారు చేసుకొని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. విమానాశ్రయ నిర్మాణంలో వ్యవసాయేతర భూములు కోల్పోతున్న రైతులతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్లో నేగోషియేషన్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. సమావేశంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, ఆర్అండ్బీ, ఇరిగేషన్ ఈఈలు రమేష్, శంకర్, తహసీల్దార్ నాగేశ్వర్, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపెల్లి, రైతులు పాల్గొన్నారు. ‘మామునూరు’ వ్యవసాయ భూ నిర్వాసితులకు చెల్లింపునకు నిర్ణయంమరో రూ.83 కోట్లు అవసరమేవ్యవసాయ సాగుకు సంబంధించి 240 ఎకరా లకు భూపరిహారం రూ.288 కోట్లు అవుతున్నా యి. ఇప్పటికే ప్రభుత్వం రూ.205 కోట్లు కేటా యించింది. ఎకరాకు రూ.కోటి20లక్షల ధర నిర్ణయంతో మరో రూ.83 కోట్లు అదనంగా అవసరం కానున్నాయి. వీటికితోడు మరో 13 ఎకరా ల వ్యవసాయేతర భూములకు గజం లెక్కన ఎంత చెల్లిస్తారన్నది గురువారం జరిగే సమావేశంలో తేలనుంది. ఈ లెక్కన అదనంగా రూ.100 కోట్లకుపైగానే భూపరిహారం కింద రైతులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలాఉండగా హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణకు ఎకరానికి రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లిస్తున్నారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూ.కోటి 20లక్షలు ఎకరానికి పరిహారం కింద చెల్లించడం అధికమని రెవెన్యూ అధికారులు అంటున్నారు. కలెక్టర్ విచక్షణాధికారాలతో కన్సంట్ అవార్డు కింద పరిహారం నక్కలపల్లి, గాడిపల్లి, గుంటూరుపల్లి రైతులతో భేటీలో సానుకూల పరిణామం మరో రెండు రోజుల్లో చర్చించుకుని పాస్బుక్లు ఇస్తామన్న రైతులు -
గడువుదీరిన పురుగు మందులు స్వాధీనం
పరకాల : వ్యవసాయ పనులు మొదలవడమే ఆలస్యం.. నాసిరకం విత్తనాలు, ఎరువులు, గడువుతీరిన పురుగుల మందులు విక్రయిస్తూ రైతులను మోసం చేయడానికి కొందరు వ్యాపారస్తులు సిద్ధమవుతున్నారు. నాసిరకం విత్తనాలు, ఎరువుల విక్రయాలపై కఠిన చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల జారీచేయడంతో పరకాల ఏసీపీ సతీష్కుమార్ పర్యవేక్షణలో విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో దాడులు చేస్తున్నారు. దీంతో కొందరు వ్యాపారస్తులు గ్రామాల్లో ఉండే దుకాణాలను అడ్డాగా మార్చుతున్నారు. మండలంలోని నాగారం గ్రామంలో గల శ్రీరాజరాజేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు, పోలీసులు మంగళవారం సాయంత్రం ఆకస్మిక దాడులు నిర్వహించారు. దుకాణంతోపాటు యజమాని ఇంట్లో తనిఖీ చేయగా రూ.2.49లక్షల విలువైన కాలం చెల్లిన షీన్వా, ఎక్స్పోనస్, ఎలక్టో, ఓబెన్ కంపెనీకి చెందిన పురుగు మందులు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని యజమాని ఎం.తిరుపతిపై కేసు నమోదు చేసినట్లు సీఐ క్రాంతికుమార్ తెలిపారు. పోలీసుల అదుపులో మరికొందరు.. పోలీసుల నిరంతర దాడులతో పరకాల పట్టణానికి చెందిన కొందరు కాలం చెల్లిన పురుగు మందులను, అనుమతి లేని ప్రాంతాల్లో నిల్వచేసి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. పురుగు మందులు స్వాధీనం చేసుకున్న పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విక్రయాల వెనక పరకాల పట్టణానికి చెందిన కొందరు వ్యాపారస్తుల పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది. దీంతో కొందరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. నాగారంలోని ఓ దుకాణంపై పోలీసుల దాడి రూ.2.49లక్షల విలువైన పెస్టిసైడ్స్ పట్టివేత విచారణ చేపట్టిన పరకాల పోలీసులు -
ద్విచక్ర వాహనంపై 109 చలాన్లు
వరంగల్ క్రైం : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి ఏకంగా 109 ఆన్లైన్ చలాన్లు పెండింగ్లో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడిని మంగళవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండకు చెందిన భిక్షపతి తన ద్విచక్ర వాహనం (టీఎస్03 ఈఎస్ 9020)పై వరంగల్ ట్రై సిటీలో ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా వాహనం నడపటంతోపాటు మరికొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించి తిరుగుతున్నాడు. బుధవారం ట్రాఫిక్ సిబ్బంది నగరంలోని అశోక జంక్షన్లో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలాన్లు తనిఖీ చేస్తున్న క్రమంలో సదరు వాహనాన్ని ఆపి పోలీస్ వెబ్ పోర్టల్లో తనిఖీ చేశారు. ఆ వాహనంపై ఏకంగా 109 చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు చూపడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. భిక్షపతికి పెండింగ్లో ఉన్న చలాన్ల మొత్తం రూ.26,310 చెల్లిం చాల్సిందేనని రశీదు అందజేశారు. చల్లాన్లు చెల్లించేంతవరకు ద్విచక్ర వాహనం పోలీస్ కస్టడీలో ఉంటుందని వారు తెలిపారు. -
మున్సిపల్ వార్డుల విభజనపై కసరత్తు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీలో వార్డుల విభజన దిశగా అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. మున్సిపాలిటీలో ఆరు గ్రామాల విలీనంతో 24 వార్డుల నుంచి ఆ సంఖ్య 30కి చేరనుంది. ఇందుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేసి సంబంధిత సమాచారాన్ని జిల్లా కలెక్టర్ సత్యశారద కు పంపనున్నారు. ఆయా గ్రామాల భౌగోళిక పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అధికారులు ముసాయిదా జాబితాను సిద్ధం చేశారు. గురువారం నుంచి ఏడు రోజులపాటు ప్రజలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత వారి అభిప్రాయాలు, సూచనలను అధికారుల ఆమోదం కోసం కలెక్టర్ ఎదుట ఉంచి, అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్కు పంపించనున్నారు. చివరగా ఈనెల 21న తుది నోటిఫికేషన్ ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. నర్సంపేట మున్సిపాలిటీలో 30కి చేరనున్న వార్డుల సంఖ్య -
నర్సంపేటలో ఫ్లాగ్ మార్చ్
నర్సంపేట రూరల్: నర్సంపేట పట్టణంలో పోలీస్ స్టేషన్లో భద్రతా బలగాలతో (ఆర్ఏఎఫ్) ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమాన్ని నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి, టౌన్ సీఐ ఎల్. రఘుపతిరెడ్డిలు ప్రారంభించారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ నుంచి అంగడి సెంటర్, బస్టాండ్, వరంగల్ రోడ్డు జంక్సన్ మీదుగా నర్సంపేట మున్సిపాలిటీ, అంబేడ్కర్ సెంటర్, పాకాల్ సెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్ వరకు మార్చ్ కొనసాగింది. కార్యక్రమంలో నర్సంపేట ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, భద్రతా బలగాల సిబ్బంది పాల్గొన్నారు. ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ల బదిలీవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పరిధిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనరేట్లోని సీసీఆర్బీ విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజేందర్ను రాయపర్తి పోలీస్ స్టేషన్కు, అక్కడ పనిచేస్తున్న శ్రవణ్కుమార్ను వీఆర్కు బదిలీ చేశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి● డీఎంహెచ్ఓ సాంబశివరావు సంగెం: వర్షాకాలంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాధికారి సాంబశివరావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆశ డేను పురస్కరించుకుని సంగెం గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి ఎయిడ్స్, టీబీ, క్షయ నివారణపై పలు సూచనలు చేశారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండ పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమయాపాలన పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో క్షయ నివారణ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఆచార్య, వైద్యాధికారి వంశీకృష్ణ, డాక్టర్ దేవేందర్, డెమో అనిల్కుమార్, పల్లె దవాఖానా డాక్టర్లు శివరాజ్, క్రాంతి, లావణ్య, రాకేష్, సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు. ఎంజీఎంలో డ్రగ్ అధికారుల తనిఖీలుఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధి కేంద్రంలో సింగిల్ డోనర్ ప్లేట్ పరికరం అనుమతుల కోసం మంగళవారం రాష్ట్ర స్థాయి అధికా రులతో పాటు జిల్లా డ్రగ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఈసందర్భంగా పరికరం పనిచేయడానికి కావాల్సిన అనుమతులు పరిశీలించడంతో పాటు రక్త నిధి కేంద్రంలో ఉన్న రక్త నిల్వలు, పాటించాల్సిన నియమ నిబంధనలు పరిశీలించి పలు సూచనలిచ్చారు. పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలివిద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన ఉచిత విద్య అందుతుందని, బడిఈడు పిల్లలను తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో బడిబాట ప్రచార జాతాను డీఈఓ తన కార్యాలయం వద్ద మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలన్నారు. ప్రభుత్వ విద్యపై విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయలపైన ఉందన్నారు. టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నత విద్యార్హతలు కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్నట్లు చెప్రాఉ. కార్యక్రమంలోటీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు కిరణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు తాటికాయల కు మార్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ప్రసాద్రావు, బాధ్యులు దామోదర్, అన్నాదేవి, ఎస్ఎ రవూఫ్, పాక శ్రీనివాస్, రమేష్, కుమారస్వామి, రవీందర్, గుండు కరుణాకర్, రేణుక, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ న్యూశాయంపేట: వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, డీసీపీ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్ స్పాట్గా గుర్తించాలని.. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. సమావేశంలో రవాణా శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్బాబు, ఆర్అండ్బీ అధికారి రమేశ్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఎన్హెచ్ఐఎ టీం లీడర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి కృషి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోన్రావు, తదితరులున్నారు. -
నేటి నుంచి పరిశోధన పద్ధతులపై తరగతులు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ రాజనీ తి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు పరిశోధనా పద్ధతులపై అవగాహ న తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రోచర్ను ఆ విభాగాధిపతి డాక్టర్ సంకినేని వెంకట్, బీఓఎస్ డాక్టర్ కిష్టయ్యతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. యూనివర్సిటీకి చెందిన సీనియర్ ఆచార్యులతో అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 4న ఈతరగతులను కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సోషల్ సైన్స్ ఆచార్య టి.మనోహర్ ప్రారంభిస్తారని సంకినేని వెంకటయ్య తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వి.సత్యనారాయణ, డాక్టర్ వి.నాగరాజు పాల్గొన్నారు. -
రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టి
సాక్షి, వరంగల్: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే ముందస్తుగానే కట్టడి చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నా రు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లలో పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణా లు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు.వాతావరణ మార్పులతో జ్వరాలు..మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్లబడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్య లో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.20 పడకలతో ప్రత్యేక వార్డు..ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా అదుకునేందుకు ఈ పెద్దాసుపత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు.– కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ -
కలుషిత నీరు, ఆహారంతో వ్యాధులు
ఐనవోలు: వర్షాకాలంలో కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధులు వస్తాయని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించారు. మంగళవారం ఆశా దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ అప్పయ్య సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన దంపతులకు తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, సురక్షిత గర్భస్రావం గురించి తెలియజేయాలని ఆశాలకు సూచించారు. అదేవిధంగా వర్షాకాలం సందర్భంగా దోమలు, ఈగల వ్యాప్తిని నిరోధించాలన్నారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. సురక్షితమైన సాధారణ ప్రసూతి సేవలు అందించాలన్నారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు, పల్లె దవాఖానా వైద్యాధికారులు డాక్టర్ సరిత, డాక్టర్ పర్వీన్, పీహెచ్ఎన్ విజయలక్ష్మి, హెచ్ఈఓ శ్రీనివాస్, నర్సింగ్ అధికారులు సరిత, రోజ, సుజాత, మమత, హెల్త్ సూపర్వైజర్లు రమాదేవి, శ్రీనివాస్, మార్గరెట్, స్వరూపరాణి, శ్రీధర్, కృష్ణమూర్తి, సతీశ్, నవీన్, ఆశాలు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
ఈసారైనా.. కొలిక్కొచ్చేనా?
సాక్షి, వరంగల్: మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ కోసం సేకరించే భూమికి పరిహారం ఇచ్చే విషయంలో ఇటు అధికారులు, అటు నిర్వాసితుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఇప్పటికే మూడు దఫాలుగా సమావేశమైనప్పటికీ సంతృప్తికర చర్చలు జరగలేదు. ఈ నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద అధ్యక్షతన నేడు (బుధవారం) కలెక్టరేట్లో మరోమారు సమావేశం కానుండడంతో ఈసారైనా పరిహారం విషయం కొలిక్కివస్తుందని అధికారులు భావిస్తున్నారు. తొలుత వ్యవసాయ భూములు కోల్పోతున్న నక్కలపల్లి (131 ఎకరాలు), గాడిపల్లి (110 ఎకరాలు) రైతులతో నేడు కలెక్టరేట్లో సమావేశం కానున్నారు. మరుసటి రోజు (గురువారం) నాన్ లేఅవుట్ ప్లాట్ల యజమానులతో సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే మామునూరు విమానాశ్రయం కోసం 696 ఎకరాల భూమి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉండగా.. విమానాశ్రయం ఏర్పాటుకు కావాల్సిన మరో 253 ఎకరాల విషయంలో గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి రైతులను ఒప్పించడమే అధికారులకు పెద్ద టాస్క్గా మారింది. ఈప్రాంతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరానికి రూ.పది లక్షలుంటే.. బహిరంగ మార్కెట్లో రూ.కోటిన్నర నుంచి రూ.మూడు కోట్ల వరకు ఉండడంతో రైతులు తమకు న్యాయంగా పరిహారం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎకరానికి ప్రభుత్వం జనరల్ అవార్డు కింద రూ.65 లక్షలు చెల్లించనున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నా.. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం కనీసం రూ.కోటిన్నర వరకై నా చెల్లించాలని రైతులు అంటున్నారు. మరికొందరు రైతులు భూమికి బదులు భూమి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్తో బుధవారం జరిగే చర్చలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. అయితే కన్సంట్ అవార్డు కింద కలెక్టర్ తనకున్న అధికారాన్ని వినియోగించి ఎకరానికి రూ.98 లక్షలు ఇచ్చే యోచనలో ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మామునూరు విమానాశ్రయ స్థల సేకరణ కోసం రూ.205 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.మామునూరు విమానాశ్రయ స్థలసేకరణలో జాప్యం భూనిర్వాసితులతో ఇప్పటికే మూడుసార్లు సమావేశం బహిరంగ మార్కెట్ ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ నేడు మరోసారి చర్చించనున్న కలెక్టర్, రెవెన్యూ అధికారులు -
ప్రజల సంక్షేమానికి పథకాల తోడ్పాటు
పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి నయీంనగర్: ప్రజల సంక్షేమానికి ప్రభుత్వ పథకాలు తోడ్పడతాయని, ప్రజల భాగస్వామ్యంతో పథకాలు విజయవంతమవుతాయని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి ప్రాంతాలను నివాస యోగ్యమైన, స్థిరమైన అనుకూలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వంద రోజుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 53వ డివిజన్ ఆదర్శకాలనీలో మంగళవారం నాయిని ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమం విజయవంతం కావడానికి కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎంహెచ్ఓ రాజిరెడ్డి, కార్పొరేటర్ సోదా కిరణ్, కాలనీ అధ్యక్షుడు తూడి విద్యాసాగర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, నరసింహస్వామి, జగదీశ్వర్ పాల్గొన్నారు. -
పీడిస్తున్న ప్లాస్టిక్ భూతం!
పరకాల: వాతావరణ కాలుష్యంతో పాటు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపించే ప్లాస్టిక్ విక్రయాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ పరకాల మార్కెట్లో మాత్రం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని కూరగాయల మార్కెట్తో పాటు కిరాణాషాపుల్లో మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి జరిమానాలతో పాటు కేసులు నమోదు చేశారు. వినియోగదారులను ఆకట్టుకునేందుకు 10కిలోల నుంచి 20 కిలోల వరకు బరువును మోయగల సామర్థ్యమున్న ప్లాస్టిక్ కవర్లను కూరగాయలు, కిరాణా దుకాణాల ఎదుట ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జోరుగా ప్లాస్టిక్ వ్యాపారం.. పరకాల పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల విక్రయాలపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వాటి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. దుకాణాల్లోనే కాకుండా రహస్యంగా ఏర్పాటు చేసిన గోదాంల నుంచి కొందరు ప్లాస్లిక్ కవర్లను వ్యాపారస్తులకు కావాల్సిన సైజుల్లో డెలివరీ చేస్తూ రూ.లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల ప్రేక్షక పాత్ర.. పరకాల మున్సిపల్ పరిధిలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ వినియోగదారులు పట్టించుకోకపోవట్లేదనే ఆరోపణలున్నాయి. అలాగే అవసరాలకు వాడుకొని చెత్తాచెదారం అంతా కవర్లలో నింపి రోడ్ల పక్కన పడేయడం పరకాలలో మామూలైపోయింది. పశువులు వాటిని తింటూ అనారోగ్యంతో మృత్యువాత పడుతున్నాయి. భూమి కలుషితమవుతోంది. అధికారులు చర్యలు తీసుకోవాలి..పరకాలలో వ్యాపారస్తులు, వినియోగదారులు ప్లాస్టిక్ కవర్లు విక్రయించకుండా, వినియోగించకుండా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా నోరులేని పశువులపై తీవ్ర ప్రభావం పడుతుంది. – సూర రాజేందర్, అధ్యాపకుడు, పరకాల పరకాలలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ విక్రయాలు వినియోగంపైనా కరువైన అవగాహన -
పోలీసింగ్పై దృష్టి పెట్టాలి : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతీ అధికారి పోలీసింగ్పై దృష్టి సారించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం కమిషనరేట్లో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న చోరీలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆస్తి నేరాలను తగ్గించాలని తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులకు కారణాల్ని అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి సూచనలిచ్చారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన కమ్యునిటి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. వాహనాల చోరీలకు సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. బక్రీద్ను పురస్కరించుకుని మూగజీవాల రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో బెసిక్ పోలీసింగ్ ఉండాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్ కుమార్, జనగామ ఏఎస్పీ చైతన్య, అదనపు డీసీపీలు రవి, సురేశ్కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు. నిజాయితీగా పనిచేయాలినిజాయితీగా పని చేస్తూ.. పోలీస్ శాఖకు కీర్తి ప్రతి ష్టలు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ సూచించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏఎస్సైలుగా పని చేస్తూ.. సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన జనార్దన్, నారాయణ, సీతారాములు సీపీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈసందర్భంగా సీపీ సన్ప్రీత్సింగ్ మాట్లాడుతూ.. పోలీసులపై ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో పరిపాలనా విభాగం అదనపు డీసీపీ రవి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు
రాయపర్తి: పదేళ్ల నిరీక్షణ తర్వాత పేదల సొంతింటి కల నెరవేరుతుందని, అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. రాయపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, లబ్ధిదారులు ఎమ్మెల్యేను ఊరేగింపుగా మండల పరిషత్ కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఇళ్లు అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన స్వల్పకాలంలోనే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. మరికొద్ది రోజుల్లో తెల్లరేషన్కార్డులు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి నాగమణి, ఎంపీడీఓ కిషన్నాయక్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ ప్రకాశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హామ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణమాచార్యులు, అశోక్, గోవర్ధన్రెడ్డి, మునిత, వనజారాణి, మహేందర్రెడ్డి, కోటేశ్వర్, ఉస్మాన్, దామోదర్, యాదగిరి, సాయిలు, కుమార్, సుధాకర్, సేనాపతి, సాయిలు, యాకయ్య పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి -
వరంగల్లో కరోనా బెల్స్
ఎంజీఎం : వరంగల్ నగరంలో కరోనా డేంజర్ బెల్స్ మోగాయి. ఎంజీఎం ఆస్పత్రిలోని జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ వైద్యురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. సదరు వైద్యురాలు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడంతో వెంటనే హైదరాబాద్లోని తన స్వృగృహానికి ఐసోలేషన్కు వెళ్లిపోయింది. ఈ విషయంపై ఎంజీఎం పరిపాలనాధికారులను వివరణ కోరగా ప్రభుత్వపరంగా తమ వద్ద ఎలాంటి నిర్ధారణ పరీక్షలు జరగలేదని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్ కేంద్రంగా చేసిన పరీక్షల్లో వస్తే తాము పాజిటివ్గా నిర్ధారించలేమని పేర్కొన్నారు.మరో ఆరుగురికి కూడా..వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వీరంతా వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ అధికారులను వివరణ కోరగా, తమ వద్ద ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొంటున్నారు.లోపించిన పాలన..గ్రేటర్ వరంగల్లో పరిధిలోని ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్లపై వైద్యారోగ్యశాఖ అధికారుల తనిఖీలు, సిబ్బంది వివరాలు, వివిధ కేసుల నమోదుపై ఎప్పటికప్పుడు నివేదికలు తీసుకోకపోవడంతో ఎవరి ఇష్టారాజ్యంగా వారు వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ ల్యాబ్లు, క్లినిక్ల అనుమతులు, రెన్యువల్ విషయాల్లో పెద్ద ఎత్తున చేతులు తడుపుతున్న క్రమంలో ప్రైవేట్ నిర్వాహకులు కీలకమైన వ్యాధి నిర్ధారణ విషయాలు అధికారులకు అందించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల వివరాలతో ఈ విషయం స్పష్టమవుతుందన్న వాదన వినిపిస్తోంది.20 పడకలతో ప్రత్యేక వార్డు..ఎంజీఎంలో కరోనా చికిత్స కోసం 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచాం. గతంలో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పనిచేసిన వైద్యులు, వారి బృందం అందుబాటులో ఉంది. దీనికితోడు 500 నుంచి 800 ఆక్సిజన్ బెడ్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్ద ఆపద వచ్చినా ఆదుకునేందుకు ఈ పెద్దాస్పత్రి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కరోనాతో ఎంజీఎంలో ఎవరూ చేరలేదు.– కిశోర్, ఎంజీఎం సూపరింటెండెంట్ రెండు జిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల బెడ్ల సంఖ్య వివరాల సేకరణపై దృష్టిగతంలోనే 1,100 పడకలతో సేవలందించిన ఎంజీఎంరాష్ట్ర ప్రభుత్వం నుంచి కరోనా కిట్లు రాగానే పరీక్షలు షురూఇప్పటివరకు కరోనా ప్రభావం లేదంటున్న వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్యశాఖ అధికారులుసాక్షి, వరంగల్: మున్ముందు కరోనా మహమ్మారి వస్తే కట్టడి చేసేందుకు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్యారోగ్య విభాగాధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మహాత్మాగాంధీ మెమోరియల్(ఎంజీఎం) ఆస్పత్రితోపాటు గతంలో సేవలందించిన వివిధ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలున్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ జాబితాను ఆయా జిల్లాల విభాగాధికారులు కలెక్టర్ల ద్వారా ఉన్నతాధికారులకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా కరోనా పరీక్షలు చేసేలా సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న వైద్యులు, ఒకవేళ ప్రబళితే ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా గతంలో కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లలో పాజిటివ్ రోగులకు మెరుగైన వైద్యం అందించి వేలాది మంది ప్రాణాలు కాపాడిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికీ 500 నుంచి 800 ఆక్సిజన్ పడకలు అందుబాటులో ఉండడంతో ఏ పరిస్థితి వచ్చినా సన్నద్ధంగా ఉండడం కలిసొచ్చే అంశమని వరంగల్ జిల్లా వైద్యారోగ్యవిభాగాధికారులు భావిస్తున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీ జెన్, ఆర్టీపీసీఆర్ కిట్లు రాష్ట్ర ప్రభుత్వంనుంచి జిల్లాలకు రాగానే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు చేసే వీలుంటుందని అంటున్నారు.వాతావరణ మార్పులతో జ్వరాలు..మే నెల మూడో వారం నుంచి వాతావరణం చల్ల బడి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు వచ్చాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగింది. వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రిలోని ఫీవర్ వార్డులోనూ పదుల సంఖ్యలో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటివి సీజన్ వ్యాధులుగానే పరిగణించి వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కరోనా లక్షణాలు అనుకొని భయపడవద్దని, వాతావరణ మార్పులతో సీజనల్ వ్యాధులు వస్తుంటాయని అంటున్నారు. పల్లె దవాఖానా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులందరూ అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం జిల్లాలో కరోనా నియంత్రణ కోసం వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయని సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లుకొట్టాయి. అదంతా అవాస్తవం. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నిర్ధారణ కాలేదు. ప్రజలు ఆందోళన చెందొద్దు. దగ్గు, జలుబు, జ్వరం వస్తే సీజనల్ వ్యాధులే. ఈ ప్రకారం వైద్యులు ట్రీట్మెంట్ అందించాలి. – డాక్టర్ సాంబశివరావు, డీఎంహెచ్ఓ, వరంగల్ -
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు
న్యూశాయంపేట: జిల్లాలో ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ సంచాలకులు సురేంద్రమోహన్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద, డీసీపీ ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రమాదాలు నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఒకే ప్రాంతంలో ఐదు ప్రమాదాలు జరిగితే బ్లాక్ స్పాట్గా గుర్తించాలన్నారు. భద్రతా ప్రమాణాలపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. రోడ్డు భద్రతపై పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల్లో రోడ్ సేఫ్టీ క్లబ్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై శిక్షణ తీసుకునేందుకు విద్యావలంటీర్లను పంపాలన్నారు. ఓవర్ లోడింగ్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో జిల్లాల రవాణ శాఖ అధికారులు పురుషోత్తం, శోభన్బాబు, ఆర్అండ్బీ అధికారి రమేశ్, డీఈఓ జ్ఞానేశ్వర్, ఎన్హెచ్ఐఎ టీం లీడర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు. సహకార సంఘాల బలోపేతానికి కృషి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ, మార్కెటింగ్శాఖ సంచాలకులు, సహకారశాఖ రిజిస్ట్రార్ సురేంద్రమోహన్ పేర్కొన్నారు. జిల్లాలో సహకార శాఖ, మార్కెటింగ్శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలపై కలెక్టరేట్లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రాథమిక సహకార సంఘాలు కృషి చేయాలన్నారు. సంఘాలు వ్యాపార అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. జిల్లాలో కొత్త సొసైటీలు, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి నీరజ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ జగన్మోన్రావు, తదితరులు పాల్గొన్నారు. రవాణాశాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్ష -
దరఖాస్తుల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దు
● అదనపు కలెక్టర్ సంధ్యారాణి ఖానాపురం: రైతులు సమర్పించే భూభారతి దరఖాస్తు ల స్వీకరణలో నిర్లక్ష్యం చేయొద్దని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. మండలంలోని రంగాపురం, మాటువీరారం పరిధిలో మంగళవారం నిర్వహించిన భూభారతి రైతు సదస్సులను అదనపు కలెక్టర్ సంధ్యారాణి సందర్శించారు. అధికారులకు దరఖాస్తుల స్వీకరణపై సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు భూ సమస్యలకు సంబంధించిన ప్రతీ సమస్యను దరఖాస్తుల రూపంలో సమర్పించాలన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి దశలవారీగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. అధికారులు దరఖాస్తులు స్వీకరించే క్రమంలో అలసత్వం ప్రదర్శించినా, దురుసుగా ప్రవర్తించినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఇన్చార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, డీటీ రాజారేణుక, ఏఓ శ్రీనివాస్, ఎస్ఓ సుగుణ, ఏఆర్ఐ స్వామి, సిబ్బంది పాల్గొన్నారు. భూ భారతితో రైతులకు మేలు నెక్కొండ: భూ భారతితో రైతులకు మేలు జరుగుతుందని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూ సమస్యల సత్వర పరిష్కారానికి మండలంలోని పనికర, బొల్లికొండ గ్రామాల్లో మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులకు ఆమె హాజరై, మాట్లాడారు. సదస్సులు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పనికరలో 44,బొల్లికొండలో 75 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు.ఈసదస్సులో నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి,తహసీల్దార్ రా జ్కుమార్,డిప్యూటీ తహసీల్దార్ రవి,ఆర్ఐ నరేందర్, రైతులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’తో సమస్యల పరిష్కారం
● ఆర్డీఓ సత్యపాల్రెడ్డి గీసుకొండ/పర్వతగిరి/రాయపర్తి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి అన్నారు. పర్వతగిరి మండలంలోని తురకల సోమవారం, జమాల్పురం, రాయపర్తి మండలంలోని గన్నారం, తిర్మలాయపల్లి, గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన భూ భారతి గ్రామసభలో ఆయన మాట్లాడారు. పరిష్కారం కాని తమ భూ సమస్యలపై రైతులు గ్రామసభల్లో లిఖితపూర్వకంగా దరఖాస్తు రూపంలో ఇస్తే పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గీసుకొండ, పర్వతగిరి, రాయపర్తి తహసీల్దార్లు రియాజుద్దీన్, వెంకటస్వామి, శ్రీనివాస్, డీటీ రవీందర్, ఆర్ఐలు సాంబయ్య, శ్రీధర్, చంద్రమోహన్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేయూకు సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాలు
కేయూ క్యాంపస్: ఎట్టకేలకు కాకతీయ యూనివర్సిటీలోని ఓల్డ్ అడ్మిషన్స్ డైరెక్టరేట్ బిల్డింగ్లో సో షియాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. గతంలో హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎంఏ సోషియాలజీ విభాగం (రెగ్యులర్ కోర్సు) ఏడాది క్రితం కాకతీయ యూనివర్సిటీకి తరలింది.. కానీ.. ఆ విభాగాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంలో జాప్యం జరిగింది. ఈనెల 2న యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు ఇవ్వగా.. మంగళవారం సోషియాలజీ విభాగాన్ని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కు షిప్ట్ చేశారు. కాగా.. మంగళవారం అక్కడే సోషియాలజీ విభాగంలో ఫైనలియర్ విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ నిర్వహించుకున్నారు. కేయూకు ఎంఎస్డబ్ల్యూ.. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కొనసాగుతున్న మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (ఎంఎస్డబ్ల్యూ)ను కూడా కాకతీయ యూనివర్సిటీకి షిఫ్ట్ చేశారు. కాగా.. 2018లో నిర్మల్ పీజీ సెంటర్ నుంచి సోషియాలజీ కోర్సు యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ ఒకే విభాగంగా కొనసాగుతూ వస్తోంది. సోషియాలజీ విభాగంలో 90 మంది, ఎంఎస్డబ్ల్యూలో 120 మంది విద్యార్థులున్నారు. సోషియాలజీ విభాగంతోపాటే ఎంఎస్డబ్ల్యూను కొనసాగించాలని విద్యార్థులు, అధ్యాపకులు అప్పటి వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి దృష్టికి తీసకెళ్లారు. చివరికి ఎంఎస్డబ్ల్యూను కూడా వర్సిటీ క్యాంపస్కు షిఫ్ట్ చేస్తూ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఈనెల 2న ఉత్తర్వులు జారీచేశారు. ఒకటి రెండురోజుల్లో ఎంఎస్డబ్ల్యూ విభాగం కూడా కేయూలోని ఓల్డ్ అడ్మిషన్ల డైరెక్టరేట్కే తరలించనున్నారు. కేయూకు తరలడం హర్షనీయం.. ఎప్పటి నుంచో సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ.. క్యాంపస్లో ఉండాలని అందరూ కోరుకున్నారు. ఎట్టకేలకు షిఫ్ట్ చేయడం హర్షనీయం. వీసీ, రిజిస్ట్రార్కు కృతజ్ఞతలు. – ప్రొఫెసర్ స్వర్ణలత, సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ విభాగాధిపతి -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : పదవీ విరమణ అనంతరం పోలీస్ అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యో గ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్, ఎస్సైలు అలీ మహ్మద్, అఫ్జల్ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్రావు, క్రిష్టాచారి, యాకూ బ్ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య పాల్గొన్నారు. -
కేడీసీ డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల
విద్యారణ్యపురి : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్)లో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల ఫస్టియ ర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను సోమవా రం కేడీసీ కళాశాలలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, ప్రిన్సి పాల్ డాక్టర్ జి.శ్రీనివాస్తో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షల్లో 39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ తిరుమలాదేవి, కేడీసీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శివనాగశ్రీను, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, అధ్యాపకులు త్యాగ య్య, ఇందిరాదేవి, కొమురయ్య, సమ్మయ్య, వెంకన్న, సీతారాములు, ఎం.వెంకన్న, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.ప్రాంగణ నియామకాలుకేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు హైదరాబాద్ హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో ఫ్రంట్ అండ్ డెవలపర్లుగా ప్రాంగణ నియామకాల్లో ఎంపికయ్యారు. కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు డి.సత్యారెడ్డి, ఎం.సాయిపవన్, ఎస్.అరవింద్, టి.పుష్కరాణి, ఎం.మనస్విని, ఎ.వర్షిత ఎంపికై పట్లు కొత్తగూడెం కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జగన్మోహన్రాజు కేయూలో జరిగిన కార్యక్రమంలో తెలిపారు. ఒక్కొక్కరికి వార్షిక వేతనం రూ.6లక్షలు ఉంటుందని, తొలుత మూడునెలలపాటు శిక్షణ కూడా ఇస్తారని, అనంతరం హైటెక్ సిటీలోని డీఎస్కే సాఫ్ట్వేర్ కంపెనీలో పూర్తిస్థాయిలో పనిచేయాల్సింటుందన్నారు. ఆయా విద్యార్థులకు నియమాక పత్రాలను సోమవారం యూనివర్సిటీలో కేయూ వీసీ ప్రొఫెసర్ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచంద్రం, ఆ కాలేజీ ప్లేస్మెంట్ డైరెక్టర్ డాక్టర్ వి.రాము, కేయూ పాలకమండలి సభ్యులు డాక్టర్ చిర్ర రాజు అందజేశారు.గ్లోబల్ యూత్ సమ్మిట్కు ప్రియచందనకేయూ క్యాంపస్ : కర్ణాటకలోని మంగుళూరు యోనేసోయి డీమ్డ్ యూనివర్సిటీలో ఈనెల 5, 6వ తేదీల్లో జరగబోయే గ్లోబల్ యూత్ సమ్మిట్–2025కు కేయూ మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థిని కృతిక ప్రియచందన ఎంపికయ్యారు. ఈమేరకు సోమవా రం కేయూలో వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్రెడ్డి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షాలు ప్రియచందనను అభినందించారు. గతంలో ప్రియచందన జీ–20 దేశాల ప్రెసిడెన్సీ వక్తృత్వ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి సాధించి అప్పటి గవర్నర్ నుంచి అభినందనలు అందుకున్నారని నారాయణ తెలిపారు.నియామకంకేయూ క్యాంపస్ : హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కళాశాల ప్రిన్సిపాల్గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ ఎస్.నర్సింహాచారి నియమితులయ్యారు. వీసీ ప్రొఫెసర్ ఆదేశాల మేరకు కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రొఫెసర్ పి.వరలక్ష్మి నుంచి నర్సింహా చారి బాధ్యతలను స్వీకరించనున్నారు.రుద్రేశ్వరుడికి పూజలుహన్మకొండ కల్చరల్ : శ్రీరుద్రేశ్వర స్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో సోమవా రం తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రేశ్వరస్వామి వారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ఉదయం సుప్రభాతసేవ, సామూహిక రుద్రాభిషేకాలు, అర్చనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, మానసిక ప్రశాంతతతో జీవించాలని ఆకాంక్షిస్తూ స్వామివారికి పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించామని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. -
డివిజన్ సరే.. సిబ్బంది నియామకమేది..?
హన్మకొండ: డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ యాజమాన్యం సిబ్బంది నియామకంపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రారంభం.. సేవలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ వినియోగదారుల విజ్ఞప్తులు.. పరిపాలనా సౌలభ్యం కోసం ఏటూరునాగారం కేంద్రంగా ఎన్పీడీసీఎల్ సేవలు అందించేందుకు యాజమాన్యం ప్రత్యేక డివిజన్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు గత నెల 31న సీఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు డివిజన్ పరిధిలోని ప్రస్తుత సెక్షన్లను విభజించి ఏటూరునాగారం డివిజన్ ఏర్పాటు చేశారు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈ పోస్టుగా మళ్లించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ డివిజన్ ఏర్పాటుకు అవసరమైన ఇతర ఇంజనీర్లు, సిబ్బంది నియామకంపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడక పోవడంతో డివిజన్ ఎప్పుడు ఏర్పాటవుతుంది..? ఎప్పటి నుంచి సేవలు అందుబాటులోకి వస్తా యి..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీజీ ఎన్పీడీసీఎల్ ములుగు డివిజన్ పరిధిలో ములుగు టౌన్, మల్లంపల్లి, వెంకటాపూర్, పస్రా, తాడ్వాయి సెక్షన్లు, ఏటూరునాగారం సబ్ డివిజన్లోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం సెక్షన్లు, ఎన్.వి.పురం సబ్ డివిజన్లోని కె.వెంకటాపురం, వాజేడు సెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి ఏటూరునాగారం, కె.వెంకటాపురం సబ్ డివిజన్లలోని ఏటూరునాగారం, కమలాపూర్, కన్నాయిగూడెం. ఎన్.వెంకటాపురం, వాజేడు సెక్షన్లను కలిపి ఏటూరునాగారం డివిజన్గా ఏర్పాటు చేశారు. డీఈ పోస్టు ఒకటే మంజూరు.. డివిజన్ పాలనా వ్యవహారాలు సాగించేందుకు డివిజనల్ ఇంజనీర్, ఏఈ కమర్షియల్, ఏఈ టెక్నికల్, ఇద్దరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఒక రికార్డు అసిస్టెంట్, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు అవసరం. కాగా ఇందులో ఒక డీఈ పోస్టును మాత్రమే మంజూరు చేశారు. ఇతర పోస్టుల గురించి ఉత్తర్వుల్లో ఎలాంటి ప్రస్తావన లేదు. సీఎండీ పేషీలోని ఒక డీఈ పోస్టును ఏటూరునాగారం డీఈగా మళ్లించినప్పటికీ నియామకం చేపట్టలేదు. ఇతర పోస్టుల మంజూరు, అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత లేకపోవడంతో డివిజన్ పరిపాలన కార్యక్రమాల ప్రారంభంపై స్పష్టత లేకుండా పోయింది. పని భారం పెరుగుతుందని ఆందోళన.. అదనపు పోస్టులు మంజూరు చేయకుండా.. అదనపు సిబ్బందిని నియమించకుండా ప్రస్తుత డివిజన్లోని ఉద్యోగులను విభజిస్తే వారిపై పని భారం పెరుగుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టులు, సిబ్బందిని నియమించకుండా నూతన డివిజన్ ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి సిబ్బందిని నియమించిన తర్వాతే నూతన కార్యాలయాన్ని ప్రారంభించాలని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. జిల్లాలు, సర్కిళ్ల పునర్విభజన జరిగి పదేళ్లు దాటుతున్నా ఇప్పటికీ వాచ్మెన్. స్వీపర్ పోస్టుల బైఫరికేషన్ ప్రక్రియ పూర్తి చేయలేదు. బైఫరికేషన్ చేయాలని ఆదేశాలున్నా చర్యలు లేదు. ఇప్పటికై నా యాజమాన్యం వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల బాధ్యులు కోరుతున్నారు. ఏటూరునాగారం కేంద్రంగా విద్యుత్ డివిజన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ అధికారులు, సిబ్బంది నియామకంపై స్పష్టత కరువు ములుగు డివిజన్లోని సెక్షన్ల బదలాయింపుతో సరి.. -
అమరవీరులకు మంత్రి కొండా సురేఖ నివాళి
హన్మకొండ అర్బన్ : తెలంగాణ సమగ్రాభివృద్ధి–2047 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది.. అందులో పేదల సంక్షేమం, సమగ్ర పాలసీ రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శకత, సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యావరణ అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా మహిళల అభ్యున్నతి, పర్యాటక అభివృద్ధి, నూతన ఉద్యోగాల కల్పన, మహిళా సాధికారికత వంటి అంశాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపారు. అనంతరం 25 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాల బంధువులను సత్కరించారు. పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. ఆడబిడ్డలకు అండగా.. ప్రభుత్వం ఆడబిడ్డల అభ్యున్నతికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఇందులో భాగంగానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అమలుతో జిల్లాలో ఇప్పటి వరకు 5.50 కోట్ల మంది ప్రయాణించి రూ.222.50 కోట్లు ఆదా చేశారని చెప్పారు. రూ.500లకే వంట గ్యాస్ ఇస్తున్నామని, అలాగే పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో మొదటి దశలో 705, రెండో దశలో 5వేల ఇళ్లు మంజూరు చేశామని చెప్పిన మంత్రి ప్రతి సోమవారం ఇందుకు సంబంధించిన నిధులు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణ విముక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 54,734 మందికి రూ.450 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, సన్న వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నామని చెప్పారు. భూమి లేని పేదలకు రూ.12 వేలు ఆత్మీయ భరోసా అందజేస్తున్నామని, మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 5,052 స్వయం సహాయక సంఘాలకు రూ.511 కోట్లు అందజేశామని తెలిపారు. 8,446 సంఘాలకు రూ.18.33 కోట్లు వీఎల్ఆర్ ఇచ్చినట్లు వివరించారు. నిరుపేదలకు సన్నబియ్యం.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచి రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, జిల్లాలో 13,389 టన్నుల బియ్యం ప్రతి నెలా సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 20,633 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని చెప్పారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ మోడల్ స్కూల్స్ నియోజకవర్గానికి ఒకటి కేటాయించామని, అలాగే పాఠశాల విద్యా కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూ భారతి’.. రైతుల భూ సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని, జిల్లాలోని నడికూడ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశామన్నారు. జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలకు టీఎస్ఐపాస్ ద్వారా 115 దరఖాస్తులు రాగా 83 అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. క్రీడా అభివృద్ధిలో భాగంగా రూ.7 కోట్లతో జేఎన్ఎస్ సింథటిక్ ట్రాక్ నిర్మించామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా బాక్సింగ్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. యువతకు నైపుణ్యాల అభివృద్ధి కోసం బ్యూటీషియన్, మగ్గం, ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెంట్, ఎంఎస్ ఆఫీస్ వంటి రంగాల్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా వంగర గ్రామంలో రూ.7 కోట్లతో పీవీ విజ్ఞాన కేంద్రం అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇటీవల ప్రపంచ సుందరీమణులు జిల్లాను సందర్శించారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ జిల్లా, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వరంగల్ సీపీ సన్ప్రీత్ సింగ్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శకటానికి మొదటి బహుమతి ఎంజీఎం : వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ శకటాలను ప్రదర్శించారు. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రదర్శించిన శకటానికి మొదటి బహుమతి లభించిందని డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య తెలిపారు. శకటంలో సీజనల్ వ్యాధులు, టీబీ, ఎన్సీడీలకు సంబంధించిన అంశాలను ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. మాతా శిశు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా శ్రీకాన్పునకు రా తల్లి ప్రభుత్వ ఆస్పత్రికిశ్రీ అనే థీమ్తో గర్భిణుల నమోదు నుంచి పరీక్షలు, ప్రసవం వరకు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చేయించుకోవాలని స్కిట్ ద్వారా నిర్వహించిన ప్రదర్శనకు మంత్రి సురేఖ, కలెక్టర్ ప్రావీణ్య, అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నట్లు ఆయన వివరించారు. సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ రైతుల సమస్యలు తీర్చేందుకు ‘భూభారతి’ ఇందిరమ్మ ఇళ్లతో పేదల కల సాకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కొండా సురేఖహన్మకొండ: తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి కొండా సురేఖ నివాళులర్పించారు. హనుమకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి సురేఖ, హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ఆశ్విని తానాజి వాఖడే నివాళులర్పించారు. -
స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభం
రాష్ట్ర అవతరణ వేడుకల్లో మేయర్ సుధారాణి న్యూశాయంపేట : ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ఆమె మహానగర పాలక సంస్థ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో వరంగల్ నగరం అగ్రగామిగా నిలవడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారు ల నిబద్ధత, సమన్వయమే కారణమని పేర్కొన్నా రు. సీఎం రేవంత్రెడ్డి వరంగల్ను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, నగరం రానున్న రోజుల్లో టూరిజం హబ్గా ఏర్పడనుందని చెప్పారు. నగర ప్రజల చిరకాల వాంఛ అయిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,170 కోట్లు మంజూరు చేసిందని, భారీ వర్షాలు కురిసినా ప్రజ లకు ఇబ్బందులు ఉండకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మేయర్ తెలిపారు. స్మార్ట్ సిటీ పథకం ద్వారా రూ.944 కోట్ల 67లక్షలతో 108 అభివృద్ధి పనులు మంజూరు కాగా 70 పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సోమవారం నుంచి సెప్టెంబర్ 9 వరకు బల్దియా ఆధ్వర్యాన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించినట్టు తెలిపారు. -
తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్సే శాపం
హన్మకొండ: తెలంగాణకు నాడు.. నేడు కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతరావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్తో కలిసి మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేశాక.. కెప్టెన్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి, మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత చారి, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్.అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత వినయ్భాస్కర్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ 60 ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని, కాంగ్రెస్ పార్టీ నాడు.. నేడు తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందగా.. 18 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగమైందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, తాళ్లపల్లి జనార్ధన్, పులి రజనీకాంత్, రామ్మూర్తి, జానకీ రాములు, బొంగు అశోక్, సోదా కిరణ్, ఇమ్మడి రాజు, కడేరావు నర్సింహారావు, ఇమ్మడి లోహిత, నయీముద్దీన్, కంజర్ల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. 18 నెలల పాలనలో రాష్ట్రం ఆగమైంది రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు -
ఆరుసార్లు.. అవస్థలు!
అప్పుడలా.. ఇప్పుడిలా.. ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున 24 కిలోలు వస్తాయి. గత మే నెలలో ఒకేసారి లబ్ధిదారుడు వేలిముద్ర పెడితే 24 కిలోల బియ్యం డీలర్లు ఇచ్చేవాళ్లు. అదే మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు ఈ–పాస్ యంత్రాన్ని అప్డేట్ చేయడం వల్ల 24 కిలోలకు రావాల్సిన వాళ్లకు 20 కిలోలకు ఒకటి, నాలుగు కిలోలకు ఒకటిగా వేర్వేరుగా కేంద్రం, రాష్ట్రం కోటా కింద రెండుసార్లు వేలిముద్రలు తీసుకుంటున్నారు. అది కూడా ఒక నెలకు రెండుసార్లు, మూడు నెలలకు కలిపి ఆరుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి వస్తుండడంతో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఈపద్ధతిలో బియ్యం ఇవ్వడానికి 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటోంది.సాక్షి, వరంగల్: జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ పరేషాన్ చేస్తోంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం జూన్ నెలలోనే ఇవ్వాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఈనేపథ్యంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ డీలర్లతో పాటు ఆ బియ్యం తీసుకునేందుకు వచ్చిన లబ్ధిదారులకు సాంకేతిక ఇబ్బందులు తప్పడంలేదు. కేంద్రం, రాష్ట్ర కోటాకు వేర్వేరుగా వేలిముద్రలు వేయాల్సి ఉండగా.. మూడు నెలలకు సంబంధించి ఆరుసార్లు వేలిముద్రలు వేస్తేనే బియ్యం ఇస్తున్నారు. ఈ సమయంలో తరచూ సాఫ్ట్వేర్లో సాంకేతిక సమస్యలు వస్తుండడంతో ఒక్కో లబ్ధిదారుడికి 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకుంటోంది. కొన్ని సందర్భాల్లో వేలిముద్రలు సరిగ్గా తీసుకోక పోవడంతో తిరిగి మళ్లీ రేషన్ దుకాణాలకు సాయంత్రం వచ్చి తీసుకెళ్తున్నవారూ ఉన్నారు. ఇలా సాంకేతిక సమస్యలతో అటు రేషన్డీలర్లు, లబ్ధిదారులకు తిప్పలు తప్పట్లేదు. రోజంతా కూర్చున్నా డీలర్లు పది క్వింటాళ్ల బియ్యం సైతం ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వరంగల్ నగరంతో పాటు జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పౌరసరఫరాల అధికారులకు ఫిర్యాదులు వస్తున్నా.. అదంతా రాష్ట్రస్థాయిలోనే ఉందని, రాష్ట్రమంతటా ఒకటే సాఫ్ట్వేర్ ఉందనే సమాచారమిచ్చి మిన్నకుండిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులు రాకుండా చూడాలని డీలర్లు కోరుతున్నారు. దఫాల వారీగా సరఫరా... జిల్లా వ్యాప్తంగా 509 రేషన్ దుకాణాలుండగా, 2,66,479 మంది రేషన్ కార్డులున్నాయి. 7,94,087 మంది లబ్ధిదారులున్నారు. వీరికి నెలకు 5,01,441 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతోంది. అంటే మూడు నెలలకు కలిపి 15,04,323 మెట్రిక్ టన్నుల బియ్యం ఒకే నెలలో లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ ఏనుమాముల, నర్సంపేట వర్ధన్నపేట ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా దఫాలవారీగా రేషన్ దుకాణాలకు బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు సరఫరా చేస్తున్నారు. మూడు నెలలకు కలిపి బియ్యం నిల్వలకు ఆయా రేషన్ దుకాణాల్లో సరిపడినంత స్థలం లేకపోవడంతో రేషన్ డీలర్ల సమాచారం మేరకు ఆయా దుకాణాలకు మళ్లీ సన్నబియ్యం కోటాను అందిస్తున్నారు. అయితే ఒక్కో వ్యక్తి నుంచి ఆరుసార్లు వేలిముద్రలు స్వీకరించడం ఒక ఎత్తయితే ముఖ్యంగా వృద్ధుల వేలిముద్రలు చాలా రేషన్ దుకాణాల్లో సరిగ్గా ఆయా సాఫ్ట్వేర్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఓటీపీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచాలని లబ్ధిదారులు అంటున్నారు. దీనివల్ల రేషన్ దుకాణం వద్ద తొందరగా లైన్లు క్లియర్ అవుతాయంటున్నారు. లబ్ధిదారులు వేలిముద్రలు వేస్తేనే బియ్యం ఈపాస్ యంత్రం అప్డేట్తో తిప్పలు మూడు నెలల కోటా ఒకేసారి.. ఒక్కొక్కరికి 20 నుంచి 30 నిమిషాలు సాంకేతిక సమస్యలతో వెనుదిరుగుతున్న ప్రజలు -
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంటలో కాకతీయుల కాలం నాటి పురాతన శ్రీ నీలకంఠేశ్వర(శివ)ఆలయం శిథిలావస్థకు చేరుకోగా.. ఇటీవల రూ.30 లక్షల విరాళాలు సేకరించి ఆలయ పునరుద్ధరణ పనులు చేపట్టారు. గత మూడు రోజుల నుంచి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహప్రతిష్ఠాపన ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పార్వతీదేవి, నందీశ్వర, నవగ్రహ విగ్రహాలతో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలను నిర్వహించారు. దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈకార్యక్రమాల్లో చివరి రోజు సోమవారం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పూజారి ప్రవీణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విగ్రహాల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాల్లో ఆలయ పునర్నిర్మాణ కమిటీ బాధ్యులు కొండేటి కొమురారెడ్డి, కందుల శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్, కుమార్, రాము, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈనెల 4వ తేదీన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వనభోజనానికి వెళ్లడానికి నిర్ణయించారు. వైభవంగా శివపార్వతుల కల్యాణం -
పేదల ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు
వర్ధన్నపేట: పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంతిళ్లు అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం వర్ధన్నపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ కలెక్టర్ సత్యశారదతో కలిసి వర్ధన్నపేట మండల, టౌన్ పరిధి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. తాము ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని, నిర్ణీత సమయం, ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం ఇల్లు నిర్మించుకొని లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల్లోపు ఇంటిని నిర్మించుకోవాలని స్పష్టం చేశారు. 4వ దశలో గ్రీన్ చానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా.. డయల్ యువర్ ఎమ్మెల్యే 80961 07107కి ఫోన్ చేసి మీ సమస్య తెలియజేస్తే త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ -
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి : సీపీ సన్ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం : ఉద్యోగ విరమణ అనంతరం పోలీసు అధికారులు తమ వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీస్ అధికారులను సీపీ సోమవారం సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందిన అధికారుల సేవలు నేటితరం పోలీసులకు ఆదర్శమని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగ విరమణ పొందిన డీసీపీ జనార్దన్, ఎస్సైలు అలీ మహ్మద్, అఫ్జల్ పాషా, రాజిరెడ్డి, పురుషోత్తం, మహేందర్రావు, క్రిష్టాచారి, యాకూబ్ అలీ, ఏఎస్సై భీంరాజు, హెడ్ కానిస్టేబుల్ రమేశ్ గుప్తా, కానిస్టేబుల్ కొండయ్య పాల్గొన్నారు. -
రెండో రాజధానిగా
వరంగల్మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025నాగాభరణం బహూకరణ సోమేశ్వర లక్ష్మీనృసింహస్వామికి ఓ భక్తుడు రూ.24లక్షల విలువైన మిశ్రమ బంగారు నాగాభరణం సమర్పించినట్లు ఆలయ ఈఓ సల్వాది మోహన్ బాబు తెలిపారు. వాతావరణం ఉదయం వాతావరణం సాధారణంగా ఉంటుంది. మధ్యాహ్నం కాస్త ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. – IIలోuసాక్షి, వరంగల్/ఖిలా వరంగల్: చారిత్రక వరంగల్ నగరాన్ని తెలంగాణకు రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ నగరాభివృద్ధికి రూ.4,962 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఖిలావరంగల్ మైదానంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. చారిత్రాత్మక వరంగల్ నగర అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. 2040 వరకు జనాభా పెరుగుదలకు అనుగుణంగా వరంగల్ నగర అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చామన్నారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కానున్నట్లు తెలిపారు. విమానాశ్రయ భూసేకరణకు ప్రభుత్వం రూ.205 కోట్లు ఇప్పటికే విడుదల చేసినట్లు.. ఈ విమానాశ్రయం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం కలగనుందన్నారు. ఓరుగల్లుకు ప్రత్యేక గుర్తింపు వరంగల్ జిల్లాలో ఖరీఫ్లో లక్షా 22 వేల 340 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.62 కోట్ల బోనస్ చెల్లించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రబీ సీజన్లో జిల్లాలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. 187 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు లక్షా 62 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా పండించే చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించినట్లు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 47 వేల ఇళ్లను మంజూరు చేయగా.. వరంగల్ జిల్లాకు మంజూరైన 612 ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నట్లు తెలిపారు. వేడుకల్లో కలెక్టర్ సత్య శారద, మేయర్ గుండు సుధారాణి, శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విద్యార్థులను అభినందించారు. పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు అధికారులు ఆసక్తిగా తిలకించారు. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రశంసపత్రాలు అందించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మెమొంటోలు అందించి శాలువాలతో సత్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి శ్రీనివాస్రెడ్డి, చిత్రంలో కలెక్టర్, ఎమ్మెల్యేలున్యూస్రీల్యుద్ధప్రాతిపదికన పనులు.. నర్సంపేట మెడికల్ కాలేజీ, హాస్పిటల్, కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించినట్లు, వరంగల్ కొత్త బస్ స్టేషన్ పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల వేగవంతం, రూ.80 కోట్ల వ్యయంతో వరంగల్లో నిర్మిస్తున్న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనం (కలెక్టరేట్), వరంగల్ జిల్లాలో ప్రతిష్టాత్మక కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు పనుల్ని చిత్తశుద్ధితో అన్ని హంగులతో త్వరలోనే పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. వన మహోత్సవంలో భాగంగా.. అటవీ శాఖ ఆధ్వర్యంలో 2024 సంవత్సరానికి 25,85,600 మొక్కలు నాటి 101 శాతం లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. 382 ఎకరాల్లో విస్తరించి ఉన్న భద్రకాళి చెరువు పూడికతీత పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. బ్యాంక్ లింకేజీ కింద 7,933 స్వశక్తి మహిళా సంఘాలకు లక్ష్యానికి మించి రూ.475 కోట్ల రుణాలు మంజూరు చేసి రికవరీ చేసినందుకు వరంగల్ జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించినందుకు అభినందనలు తెలిపారు.గతంలో లేని విధంగా రూ.4,962 కోట్ల కేటాయింపు 2040 అవసరాలకు సరిపోయేలా మాస్టర్ ప్లాన్ మామునూరు విమానాశ్రయ భూసేకరణకు రూ.205 కోట్లు అవతరణ వేడుకల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి – మరిన్ని ఫొటోలు II, IIIలోu -
రంగుల లొల్లి.. ఉద్రిక్త వాతావరణం
నర్సంపేట రూరల్: అమరవీరుల స్తూపానికి రంగుల లొల్లితో నర్సంపేట పట్టణంలో ఆదివారం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రాత్రి వరకు సమస్య ఎటూ తేలకపోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్ఎస్ నాయకులకు నచ్చజెప్పడంతో సమస్య సర్దుమనిగింది. తెలంగాణ ఆవిర్భావ వేడులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో.. నర్సంపేట పట్టణంలోని అమరవీరుల స్తూపానికి గతంలో గులాబీ రంగు ఉండగా.. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తెల్ల రంగు వేయించారు. దీంతో.. బీఆర్ఎస్ నాయకులు అమరవీరుల స్తూపానికి తెల్ల రంగు ఎలా వేస్తారంటూ.. మళ్లీ గులాబీ రంగు వేశారు. అనంతరం మున్సిపాలిటీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, పోలీసులు చర్చలు జరిపారు. అధికారిక కార్యక్రమం కావడంతో గులాబీ రంగు కాకుండా తెల్ల రంగు వేస్తున్నారని, దీనికి బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరాలు చెప్పకూడదని నర్సంపేట టౌన్ సీఐ ఎల్.రఘుపతిరెడ్డి వారికి నచ్చజెప్పారు. అమరవీరుల స్తూపం ఎదుట ఉన్న గద్దెకు మాత్రం రంగు వేయరని తెలపడంతో శాంతించిన బీఆర్ఎస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సమస్య సర్దుమనిగింది. మధ్యాహ్నం వేసిన గులాబీ రంగు స్థానంలో మళ్లీ అమరవీరుల స్తూపానికి మున్సిపాలిటీ సిబ్బంది తెల్లరంగు వేసి ఆవిర్భావ వేడుకలను యథావిధిగా కొనసాగించనున్నారు. అవతరణ దినోత్సవం నేపథ్యంలో అమరవీరుల స్తూపానికి తెల్లరంగు వ్యతిరేకించిన బీఆర్ఎస్ నాయకులు పోలీసుల జోక్యంతో సాఫీగా ఏర్పాట్లు -
పచ్చిరొట్ట పదిరెట్లు మేలు
దుగ్గొండి: పచ్చిరొట్ట సాగు చేసి భూమిలో కలియదున్నితే పఽశువుల పేడకంటే పదిరెట్లు ఎక్కువ పోషకాలు అంది భూమి సారవంతం అవుతుందని వికసిత్ సంకల్ప అభియాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజన్న అన్నారు. మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం సంయుక్తంగా నిర్వహిస్తున్న వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం మండలంలోని నాచినపల్లి, రేకంపల్లి, మహ్మదాపురం, మైసంపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల్ని సారవంతం చేయడానికి తొలకరి వర్షాలకు జనుము, జీలుగు, పెసరు, పిల్లిపెసర, అలసందలు సాగుచేసి పూత దశలో కలియదున్నితే మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయన్నారు. భూమి నిర్మాణం మెరుగుపడి పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రతీ రైతు తనకున్న భూమిలో కొంత విస్తీర్ణంలోనయినా చిరుధాన్యాలు సాగు చేయాలన్నారు. పశువైద్యాధికారి శారద మాట్లాడుతూ.. పశువులను రోగాల బారి నుంచి కాపాడుకోవడానికి సమయానుగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు సౌమ్య, కన్నబాబు, హర్ష, ఏఈఓలు విజయ్నాయక్, వైజయంతి పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప అభియాన్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రాజన్న పలు గ్రామాల్లో రైతులకు అవగాహన -
లంచం అడిగేవారిని పట్టిస్తే రూ.25వేల గిఫ్ట్
కాజీపేట అర్బన్: ఇందరిమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని నాకు పట్టిస్తే రూ.25వేలు గిఫ్ట్గా ఇస్తాను.. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికై నా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఒర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ బావుసింగ్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, దేవ్రాజ్, సురేష్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
సైక్లింగ్తో ఒత్తిడి దూరం
● ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక వరంగల్ స్పోర్ట్స్: నిత్యం ఉదయం గంట పాటు సైక్లింగ్ చేయడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని హనుమకొండ ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతీ ఒక్కరు శారీక వ్యాయామన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైక్లింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వాకర్స్ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్కుమార్, శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, రమేష్, విష్ణువర్ధన్, అఫ్జల్, శంకర్, వెంకట్, ప్రభుదాస్ పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 12 మంది పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరు ఉత్తమ సేవా పతకానికి, 11 మంది పోలీస్ అధికారులు సేవా పతకాలకు ఎంపికయ్యారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం అ భినందించారు. ఉత్తమ సేవా పతకానికి హనుమకొండ పోలీస్స్టేషన్ ఏఎస్సై ఎ.రఘునారెడ్డి, సేవా పతకానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్బీ ఎస్సై జె.విల్సన్, సుబేదారి ఎస్సై పి.ప్రకాశ్రెడ్డి, ఏఆర్ఎస్సై ఎండీ.మక్బుల్పాషా, ఏఆర్ఎస్సై ఎం.రాంధన్, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, ఏఆర్ ఎస్సై షేక్ పాషా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ.ఖాజానజీముద్దీన్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బస్సు భీమయ్య, మామునూరు పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.రమేశ్, వంగర పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ కె.తిరుపతిగౌడ్ ఎంపికయ్యారు. 9 గేదెలు, ఒక దూడ అపహరణ నర్సంపేట రూరల్: నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామ శివారులోని గుంటూరుపల్లి గ్రామానికి చెందిన మోతె తిరుపతిరెడ్డికి చెందిన 9 గేదెలు, 1 లేగ దూడను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు నర్సంపేట ఎస్సై అరుణ్ తెలిపారు. గుంటూరుపల్లికి చెందిన మోతె తిరుపతిరెడ్డి గేదెల ఫామ్లో గుర్తు తెలియని వ్యక్తులు 9 గేదెలు, 1 లేగ దూడలు శనివారం రాత్రి దొంగలించారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. బాధితుడు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేయడంతో నర్సంపేట ఏసీపీ రవీందర్రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దువిద్యారణ్యపురి: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.. వాటిని వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలిత శ్రీహరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అసబంద్ధమైన రేషనలైజేషన్ నిబంధనలను పాటించడం వల్ల ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం పూర్తయ్యాకే టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’కు దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు ఒకటో తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు కేటాయించారని, ఈనెల 16వ తేదీ లోపు అప్లై చేసుకోవాలని, ఇతర వివరాలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం, వరంగల్, సహాయ సాంఘిక కార్యాలయం సంక్షేమాధికారి, నర్సంపేటలో సంప్రదించాలని సూచించారు. ఛత్తీస్గఢ్ టు హైదరాబాద్ ఏటూరునాగారం: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ నుంచి ఐరన్ ఓర్ పెద్ద ఎత్తున హైదరాబాద్కు తరలిపోతోంది. ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి సమీపంలో చెక్పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను ఆదివారం తనిఖీ చేశారు. ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని, పర్మిషన్ ఉందా లేదా అంటూ ఆరా తీశారు. అయితే డ్రైవర్ సెల్ఫోన్లో చూపిన ఆధారాలను చూసి విచారించి వదిలేశారు. గతంలోనే మావోయిస్టులు పలు ప్రకటనల్లో ఖనిజ సంపద తరలిపోయే అవకాశాలున్నాయని ప్రకటించారు. కొద్ది రోజులకే ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున ఐరన్ ఓర్ తరలిపోతుండడం గమనార్హం. ఖనిజ సంపదను తరలించేందుకే మావోయిస్టుల ఏరివేతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందా? అనే అనుమానాలను పలు ప్రజా సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. -
కాల్సెంటర్ ఆకస్మిక తనిఖీ
న్యూశాయంపేట: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్సెంటర్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న కాల్సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి టోల్ఫ్రీ నంబర్కు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. ఈసందర్భంగా ఫిర్యాదు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఏయే సమస్యలపై రైతులు ఫిర్యాదు చేశారని ఆరా తీశారు. పరిష్కార వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యం కొనుగోలుకు సంబంధించి కాల్సెంటర్కు గత నెల 21 నుంచి ఆదివారం వరకు మొత్తం 20 ఫిర్యాదులు రాగా.. పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించినట్లు కాల్సెంటర్ సిబ్బంది కలెక్టర్కు వివరించారు. ఈసందర్భంగా కాల్సెంటర్కు ఫిర్యాదు చేసి రిజిస్టర్లో నమోదై ఉన్న చెన్నారావుపేట మండలం సూరిపల్లి రైతు చంద్రశేఖర్తో, పర్వతగిరి మండల రైతు మధుతో కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడారు. సమస్యల పరిష్కారంపై ఆరా తీశారు. పరిష్కారమవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు టోల్ఫ్రీ నంబర్ 180042 53424ను వినియోగించుకోవాలని, ధాన్యం కొనుగోలు, సేకరణ, రవాణా, మద్దతు ధర తదితర సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. -
‘అక్రమంగా కేసు పెట్టారు.. న్యాయం చేయండి’
● రిటైర్డ్ పోలీస్ అధికారికి పోలీసుల వత్తాసు ● ఓ రైతు కుటుంబం ఆరోపణ గీసుకొండ: తాము స్థానికంగా లేకపోయినా ఓ రిటైర్డ్ పోలీసు అధికారి ఒత్తిడి మేరకు జామాయిల్ చెట్లను కాలబెట్టారని గీసుకొండ పోలీసులు తమపై తప్పుడు కేసులు పెట్టారని సంగెం మండలం కుంటపల్లికి చెందిన రౌతు పూర్ణచందర్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తాను గీసుకొండ మండలం శాయంపేట హవేలి శివారులోని తన 5.30 ఎకరాల భూమిలో మొక్కజొన్నను సాగు చేసినట్లు.. తమ పక్కనే రిటైర్డ్ ఏసీపీ వాసం సురేందర్ భూమి ఉండగా.. అందులో గాదె చంద్రమౌళి అనే రైతు జామాయిల్ సాగు చేసినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తన మొక్కజొన్న చేనుతోపాటు సురేందర్కు చెందిన కొన్ని జామాయిల్ చెట్లు కాలిపోయాయని.. ఈఘటన జరిగిన రోజు తాను కేరళ వెళ్లగా.. చంద్రమౌళి ద్వారా సురేందర్ గత నెల 25న తనపై ఫిర్యాదు చేయించి స్థానిక పోలీసుల సహకారంతో కేసు నమోదు చేయించారన్నారు. తన మొక్కజొన్న చేనును కాలబెట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసి వారం రోజులు అవుతున్నా.. కేసు నమోదు చేయడం లేదని పూర్ణచందర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరారు. ఈవిషయమై గీసుకొండ సీఐ మహేందర్ను వివరణ కోరగా.. మొక్కజొన్న చేనుతో పాటు జామాయిల్ తోట కాలిపోయిన విషయమై ఇరువర్గాల వారు ఫిర్యాదు చేయగా.. రైతు పూర్ణచందర్పై కేసు నమోదు చేశామని, అతడి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు. -
వరంగల్
సోమవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2025అధిక సాంద్రత సాగు.. లాభాలు బాగు అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందని ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త నాగభూషణం తెలిపారు. ఔషధ నిల్వల్లో అధికారుల ఇష్టారాజ్యం ● ఇరుకు గదుల్లో వందలాది రకాల ఔషధాలు ● కానరాని రిఫ్రిజిరేటర్లు.. ఏసీలు ● మౌలిక వసతుల కొరత.. ఎంజీఎం: రోగులకు మెరుగైన మందులు అందించేందుకు ప్రతీ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ (సీఎంఎస్) నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతోంది. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా పేర్కొంటున్న వరంగల్ మెడికల్ హబ్గా మారుతున్న క్రమంలో రెండు ఇరుకై న గదుల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ను మౌలిక వసతుల లేని ప్రదేశంలో ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే వరంగల్ జిల్లా కేంద్రంలో 1,500 పడకల ఎంజీఎం ఆస్పత్రి తో పాటు 100 పడకల సీకేఎం ఆస్పత్రి, 100 పడకల నేత్ర వైద్యశాలకు వరంగల్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నుంచే మందులు సరఫరా అవుతాయి. అంతేకాకుండా వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీలకు సైతం ఈ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచే ప్రభుత్వం అందించే మందులు సరఫరా చేయాల్సి ఉంది. నిత్యం వేలాది మంది రోగులకు పంపిణీ చేసే సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్ నిర్వహణ చూస్తే పేదలపై అధికారుల ప్రేమ ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. ఉర్సులో ఇరుకు గదుల్లో.. వరంగల్ జిల్లా కేంద్రంలోని సీకేఎం, ఉర్సు ప్రసూ తి ఆస్పత్రిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సీఎంఎస్(సెంట్రల్ డ్రగ్ స్టోర్)ను ఇరుకై న రెండు గదుల్లో ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లా పరిధిలో ఎంజీ ఎం, ప్రాంతీయ కంటి దవాఖాన, సీకేఎం ప్రసూతి తో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సంపేట, వర్ధన్నపేట కమ్యూనిటీ ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్లు, 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు, సర్జికల్స్ ఈ సీఎంఎస్ నుంచే పంపిణీ చేయాల్సి ఉంది. ఇంత ప్రాముఖ్యం ఉన్న మందుల గిడ్డంగికి ముందస్తుగా క్షేత్రస్థాయిలోప్రణాళిక లేకుండా అప్పటికప్పుడు రెండు చిన్న గదుల్లో ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. అవసరమైన విశాలమైన భవనాలను సమకూర్చాల్సింది. ఔషధాలు పాడవకుండా అవసరమైన రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషన్ రూములు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మౌలిక సౌకర్యాలు లేకుండా బూత్ బంగ్లాను తలపించే విధంగా స్టోర్ భవనం ఉండడం అధికారుల పనితీరుకు నిదర్శనం. సీఎంఎస్ను ఎంజీఎంలోకి మార్చాలి తాత్కాలికంగా సీఎంఎస్ను ఎంజీఎంలో ఖాళీగా ఉన్న ఏదైనా బ్లాక్లోకి మార్చితే సమస్యకు పరి ష్కారం లభిస్తుంది. సీఎంఎస్ మందులలో 75 శాతం మందులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రే వినియోగించుకుంటోందని బడ్జెట్ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్దదిక్కుగా, రోగులకు బాసటగా నిలుస్తున్న ఎంజీఎంలో తాత్కాలిక సీఎంఎస్ ఏర్పాటు చేస్తే అత్యవసర సమయాల్లో మందుల సరఫరా కూడా సౌకర్యంగా ఉంటుందని కొందరు వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి మరికొద్ది నెలల్లో ఎంజీఎం వెళ్లనున్న నేపథ్యంలో ఎంజీఎం లేదా, కేఎంసీలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో తాత్కాలికంగా సీఎంఎస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని అంటున్నారు.న్యూస్రీల్వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉర్సు ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్కు ఇరుకై న రోడ్లపై భారీ వాహనాలు మందులతో వస్తుంటాయి. దాంతో రాకపోకలు కష్టతరంగా మారాయని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎంఎస్ ప్రహరీ ప్రధాన గేటులోకి వచ్చిన వాహనాలు కిటెల్ గార్డ్(ఐరన్ ర్యాంప్)లో ఇరుక్కుపోతున్నాయి. -
భారీ వాహనాలతో బెంబేలు
మడికొండ: అధిక లోడుతో పాటు భారీ వాహనాల రాకపోకలతో ధర్మసాగర్–మడికొండ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు ఇటీవల బారికేడ్లను ఏర్పాటు చేసిన భారీ వాహనాలు వాటిని ఢీకొట్టి వెళ్తున్నాయి. దీంతో రెండుసార్లు బారికేడ్లను ఏర్పాటు చేసిన స్థానిక పోలీసులు వాహనాల రాకపోకలను అడ్డుకోలేక పోతున్నారు. ఇరుకు రోడ్డుతో ట్రాఫిక్ ఏర్పడి ప్రయాణికులు, స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. పోలీసులు వాహనదారులకు అవగాహన కల్పించి అటువైపు వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు. గుంతలమయంగా రోడ్లు.. భారీ వాహనాల రాకపోకలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో ద్విచక్ర, కార్లు, బస్సుల్లో ప్రయాణించే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదుట ఉన్న శ్రీకృష్ణ హార్డ్వేర్ షాపునకు అధిక లోడుతో వస్తున్న లారీలతో రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. షాపు ఎదుట తరచూ భారీ వాహనాలు రావడంతో రోడ్డు ఇరుకుగా మారుతోంది. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాహనాలను అడ్డుగా నిలుపుతున్నారు. పొంచిఉన్న ప్రమాదాలు.. అధిక లోడుతో పాటు అతివేగంగా భారీ వాహనాలు దూసుకు వస్తుడడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్థానికులు ఆందోళన చేయడంతో నాలుగు రోజులు వాహనాలు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతరం శరమాములుగానే రాకపోకలు సాగిస్తున్నారు. పోలీసులు భారీ వాహనాలు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.ప్రమాదాలకు నిలయంగా ధర్మసాగర్–మడికొండ రోడ్డు ధ్వంసమవుతున్న రహదారులు ప్రయాణికులకు తప్పని తిప్పలు -
పార్కు నిర్మాణ పనులు నిలిపివేయాలి
పరకాల: దామెర చెరువు సమీప 609 సర్వే నంబర్లో వారసత్వంగా వస్తున్న 1.19 గుంటల భూమిలో ప్రభుత్వ పరంగా ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టినా ఊరుకోబోమని డివిజన్లోని వీఆర్వోలు హెచ్చరించారు. దామెర చెరువు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రధాన రోడ్డు పక్కన ఉన్న చెరు వు భూమిలో పార్కు, ఓపెన్ జిమ్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆదేశాలతో అధికారులు పనులు ప్రారంభించారు. ఆయా పనులను తక్షణమే నిలిపివేయాలని వీఆర్వోలు ఎమ్మెల్యేను కోరారు. వాస్తవానికి 1969లో పట్టాదారు నుంచి ఖరీదుపై ఆరు మండలాలకు చెందిన సేతు సింధి నీరడీల సంఘం కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఆ భూమిపై ఎవరికీ హక్కులు లేవని, తమకు వ్యతికరేకంగా వ్యవహరిస్తే పోరాటాలకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు స్వామి, పోచయ్య, నక్క రమేశ్, చెక్క రమేశ్, ఎం.సాంబయ్య, పల్లవేణ శ్రీను, కె.సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. పరకాల డివిజన్ వీఆర్వోల డిమాండ్ -
అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
● ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిపరకాల : రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి సూచించారు. ఆదివారం పట్టణంలోని మార్కెట్ ఆవరణలో కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం ప్రొసీడింగ్స్ను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అ ధికారులను, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డాక్టర్ నా రాయణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్,మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి, కాంగ్రెస్ మండల,పట్టణ అధ్యక్షులు కట్కూరి దేవేందర్రెడ్డి, కొయ్యడ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పోలీస్ అధికారులకు సేవా పతకాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న 12 మంది పోలీస్ అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఒకరు ఉత్తమ సేవా పతకాని కి, 11 మంది పోలీస్ అధికారులు సేవా పతకా లకు ఎంపికయ్యారు. వీరిని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ ఆదివారం అభినందించారు. ఉత్తమ సేవా పతకానికి హనుమకొండ పోలీస్స్టేషన్ ఏఎస్సై ఎ.రఘునారెడ్డి, సేవా పతకానికి ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, సీసీఆర్బీ ఎస్సై జె.విల్సన్, సుబేదారి ఎస్సై పి.ప్రకాశ్రెడ్డి, ఏఆర్ఎస్సై ఎండీ.మక్బుల్పాషా, ఏఆర్ఎస్సై ఎం.రాంధన్, కాజీపేట ఏఎస్సై వి.చంద్రమౌళి, ఏఆర్ ఎస్సై షేక్ పాషా, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎండీ.ఖాజానజీముద్దీన్, ఏఆర్ హెడ్కానిస్టేబుల్ బస్సు భీమయ్య, మామునూర్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ బి.రమేష్, వంగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కె.తిరుపతిగౌడ్ ఎంపికయ్యారు. డొనేషన్ల వసూలుపై చర్య తీసుకోవాలికేయూ క్యాంపస్: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ముందస్తు అడ్మిషన్లు కల్పిస్తూ డొనేషన్లు వసూలు చేస్తున్నారని, సదరు కాలేజీపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి కోరారు. ఈమేరకు ఆదివా రం కాకతీయ యూనివర్సిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఇ.పురుషోత్తంను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు ఇవ్వడం సరికాదని సంబంధిత కళాశాలపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్, బాధ్యులు శంకర్ పాల్గొన్నారు. ‘ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు’విద్యారణ్యపురి: ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయొద్దు.. ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీచర్ల సర్దుబాటు ఉత్తర్వులు ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేలా ఉన్నాయి.. వాటిని వెనక్కి తీసుకోవాలని పీఆర్టీయూ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలిత శ్రీహరి డిమాండ్ చేశా రు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా సర్దుబాటు ఉత్తర్వులు ఉండాలని, అనవసరమైన రేషనలైజేషన్ నిబంధనలను పాటించడం వల్ల ప్రాథమిక విద్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ‘బడిబాట’ కార్యక్రమం పూర్తయ్యాకే టీచర్ల సర్దుబాటు చేపట్టాలని ఒక ప్రకటనలో కోరారు. ‘బెస్ట్ అవైలబుల్ స్కీం’ దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట : బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం పథకం ద్వారా షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు 2025–26 విద్యాసంవత్సరం అడ్మిషన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లాకు 1వ తరగతి 60 సీట్లు, 5వ తరగతి 62 సీట్లు కేటాయించారని, ఈనెల 16వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి కార్యాలయం, వరంగల్, సహాయ సాంఘిక కార్యాలయం సంక్షేమాధికారి, నర్సంపేటలో సంప్రదించాలని సూచించారు. రామ్కిషన్కు సన్మానంహన్మకొండ: ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ప్యానెల్ సభ్యుడిగా నియమితుడైన హనుమకొండకు చెందిన డాక్టర్ అజ్మీరా రామ్కిషన్ను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆదివారం సన్మానించారు. హనుమకొండ కనకదుర్గ కాలనీలోని స్వగృహంలో ఎంపీ డాక్టర్ కావ్యను అజ్మీరా రామ్కిషన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని బావుసింగ్పల్లికి చెందిన రామ్కిషన్ ప్రస్తుతం ఢిల్లీలో జాయింట్ డ్రగ్ కంట్రోలర్గా పనిచేస్తున్నారు. వైద్యరంగంలో అపారమైన సేవలందిస్తూ ప్రపంచంలోని ప్రముఖ సంస్థకు సలహాదారుడిగా వ్యవహరించడం గొప్ప విషయమని ఎంపీ కావ్య కొనియాడారు. -
సైక్లింగ్తో ఒత్తిడి దూరం
● ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక వరంగల్ స్పోర్ట్స్: నిత్యం ఉదయం గంట పాటు సైక్లింగ్ చేయడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చని హనుమకొండ ఇన్చార్జ్ డీవైఎస్ఓ దేవిక అన్నారు. అంతర్జాతీయ సైక్లింగ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హనుమకొండలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యాన చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఉరుకుల పరుగులు జీవితంలో ప్రతీ ఒక్కరు శారీక వ్యాయామాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సైక్లింగ్ సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, వాకర్స్ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు గోపాల్రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు పవన్కుమార్, శ్యాంప్రసాద్, డీఎస్ఏ కోచ్లు నరేందర్, రమేష్, విష్ణువర్ధన్, అఫ్జల్, శంకర్, వెంకట్, ప్రభుదాస్ పాల్గొన్నారు. -
ఆఫీసర్స్ క్లబ్ నిధుల్లో అక్రమాలు
వరంగల్ క్రైం: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధి ఆఫీసర్స్ క్లబ్లో మేనేజర్ ముసుగులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. 2015 సంవత్సరంలో గోలి గోపాల్రెడ్డి ఆఫీసర్స్ క్లబ్లో చేరి సభ్యత్వం కోసం వచ్చే వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,40 లక్షలు వసూలు చేసి ఆ మొత్తాన్ని క్లబ్ అకౌంట్లో జమ చేయకుండా ఇలా రూ.130 కోట్లు సొంతానికి వాడుకున్నట్లు పేర్కొన్నారు. గోలి గోపాల్రెడ్డి క్లబ్లో షటిల్ బాయ్గా పనిచేస్తున్న పొడిశెట్టి రవీందర్కు డబ్బు ఆశచూపి ఏడుగురు సభ్యులను తీసుకురాగా వారి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేసి అకౌంట్లో జమచేయలేదని తెలిపారు. అలాగే.. 2019లో జాయింట్ సెక్రటరీగా ఉన్న చెరుకు వెంకటరాజిరెడ్డి ముగ్గురు సభ్యుల డబ్బులు రూ.4.20 లక్షలు, ఇతర డబ్బులు రూ.60 లక్షలు కూడా సొంతానికి వాడినట్లు వివరించారు. అంతేకాకుండా క్లబ్లో పనిచేస్తున్న శ్రీనివాస్కు రూ.10 లక్షలు ఇస్తానని ఆశ చూపి ఇవ్వకపోవడంతో అతను 2024 ఏప్రిల్ 18న క్లబ్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. తన ఆత్మహత్యకు గోలి గోపాల్రెడ్డి, రాజిరెడ్డి, రవీందర్ కారణామని శ్రీనివాస్ తన కుమారుడికి ఫోన్లో వీడియో పంపడంతో కేసు నమోదు చేసినట్లు వివరించారు. క్లబ్ డబ్బులు రూ.2 కోట్లు సొంతానికి వాడుకోవడమే కాకుండా.. శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన ఆ ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించినట్లు ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై రామారావు, ఏఎస్సై వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసస్వామి, రోషన్ అలీ, కానిస్టేబుళ్లు ఉమేష్, దేవేందర్లను ఇన్స్పెక్టర్ అభినందించారు. రూ.2కోట్లు స్వాహా.. ముగ్గురి అరెస్టు -
లంచం అడిగేవారిని పట్టిస్తే రూ.25వేల గిఫ్ట్
కాజీపేట అర్బన్ : ‘ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని లంచం అడిగేవారిని నాకు పట్టిస్తే రూ.25వేలు గిఫ్ట్గా ఇస్తాను.. అలాగే సదరు వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరిస్తానని’ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. హంటర్రోడ్డులోని అభిరామ్ గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను పూర్తి పారదర్శకంగా అర్హులకే అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కరికై నా ఇల్లు మంజూరు చేసిందా అని ప్రశ్నించారు. అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఓర్వడం లేదన్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, అందులో 660 పత్రాలు ఇచ్చామని, త్వరలో మిగతావి అందజేస్తానని చెప్పారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు 3వ తేదీన ముగ్గుపోసుకుని నిర్మాణాలు ప్రారంభించి దావతు చేసుకుని తనను ఆహ్వానిస్తే ఆనందంగా వస్తానని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూం ఇళ్ల పని పడతానని, 15 రోజుల్లో అర్హులకు వాటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసీల్దార్ బావుసింగ్, కార్పొరేటర్లు మామిండ్ల రాజు, జక్కుల రవీందర్యాదవ్, విజయశ్రీ రజాలీ, తోట వెంకన్న, పోతుల శ్రీమాన్, దేవ్రాజ్, సురేష్ పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి -
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి
ధర్మసాగర్: వానాకాలం సీజన్ సమీపిస్తున్న తరుణంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబా టులో ఉంచాలని హనుమకొండ జిల్లా వ్యవసాయ సహాయ సంచాలకుడు రాజ్ కుమార్ సూచించారు. వ్యవసాయ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వివిధ విత్తన షాపుల్లో వ్యవసాయ అధికారులు, పోలీసులు కలిసి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈమేరకు షాపుల్లోని విత్తన స్టాక్ రిజిస్టర్లు, విత్తన నిల్వలు, బిల్లులు, స్టోర్స్, సర్టిఫికెట్లు, గోదాములను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆధీకృత డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనుగోలు చేసి, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని అన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. తనిఖీల్లో స్థానిక సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై జానీపాషా, వ్యవసాయ అధికారులు సంతోష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వాల మెడలు వంచుదాం
హన్మకొండ: ఉద్యమాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి, కార్మికుల హక్కులు సాధించుకుందామని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక మాసోత్సవం ముగింపు సందర్భంగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాలు నిర్మించాల్సిన సమ యం ఆసన్నమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని సూచించారు. కేసీఆర్ పాలనలో వీధి వ్యాపారులకు రుణాలు అందించడంతో పాటు వెండింగ్ జోన్లను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. నాడు తెచ్చిన 2014 చిరు వ్యాపారుల రక్షణ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగ్, సోదా కిరణ్, కార్యక్రమ కన్వీనర్ నాయిని రవి, కార్మిక నాయకులు, తెలంగాణ ఆటో యూనియన్, ప్రతాపరుద్ర ఆటో యూనియన్, భవన నిర్మాణ రంగంలోని 14 రంగాల కార్మికులు, చిరు వ్యాపారులు, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ -
నేర రహిత సమాజమే లక్ష్యం
● పరకాల ఏసీపీ సతీష్బాబు పరకాల: నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరకాల ఏసీపీ సతీష్బాబు కోరారు. అసాంఘిక శక్తులు శాంతి భ ద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని స్పష్టంచేశారు. పోలీసులు, ర్యాఫిడ్ యాక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలోని బీసీ కాలనీ నుంచి పరకాల బస్టాండ్ వరకు శనివారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరమని అన్నారు. నేరాలను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు సహాయంగా నిలవాలని కోరారు. ఏఆర్ఎఫ్ అధికారి సరస్వతి, పరకాల, శాయంపే ట, ఆత్మకూరు సీఐలు క్రాంతికుమార్, రంజిత్రా వు, సంతోష్, ఎస్సైలు శివకృష్ణ, రమేష్, పరమేశ్వర్, కొంక అశోక్, తిరుపతి సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025
– 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీగణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీనెలా ఒకరు ఎత్తుకుని 1 శాతం చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థిక ప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని.. నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది.గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్స రీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు.ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. నగరంలోని హనుమకొండలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
డ్రెయినేజీల పరిశీలన
న్యూశాయంపేట: నగరంలోని 28, 29వ డివిజన్ల పరిధిలోని 12 మోరీల నుంచి మేదరి బస్తీ వరకు ఉన్న డ్రెయినేజీలను కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నగర మేయర్ గుండు సుధారాణి క్షేత్రస్థాయిలో శనివారం పరిశీలించారు. వర్షాకాలం నేపథ్యంలో రెండు డివిజన్ల పరిధిలోని ప్రధాన నాలాతో పాటు రైల్వేట్రాక్ వైపు, మేదరి బస్తీ వద్ద ఉన్న డ్రెయినేజీల పరిస్థితిని పరిశీలించారు. సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ సీపీలు రవీందర్, వాడేకర్, శ్రీనివాస్ ఎంహెచ్ఓ డాక్టర్ రాజేష్, ఏసీపీ శ్రీనివాస్, ఈఈ రవికుమార్, టీపీఎస్ శ్రీకాంత్, ఏఈ ముజామిల్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే టీచర్ల లక్ష్యం
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల పటిష్టతే ఉపాధ్యాయుల లక్ష్యం కావాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి కోరారు. హనుమకొండ జిల్లాలో స్కిల్స్టార్క్ స్కూల్లో ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉపాధ్యాయుల మూడో విడత శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాలను తరగతి గదుల్లో అమలు చేయాలని సూచించారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ఎస్సై ఎం.రాజు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఎస్సై పిలిప్స్రాజు, షీటీమ్స్ ఎస్సై విద్యాసాగర్, సైబర్ క్రైమ్స్ ఎస్సై శివకుమార్ మాట్లాడారు. శిక్షణ కేంద్రం ఇన్చార్జ్లు విజయ్ మోహన్, మధుసూదన్ రెడ్డి, డీఆర్పీలు శానుగుల భద్రయ్య, జీవీ.ప్రసాద్, అజయ్, అలీ, శశికళాధర్, శివకుమార్, సంపత్, శ్రీను, విద్యానంద్, అట్ల రవి, సీఆర్పీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముగిసిన టీచర్ల శిక్షణ హనుమకొండ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, టీజీఆర్ఈఐఎస్ ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లాలోని ఉర్దూమీడియం పాఠశాలల ఉపాధ్యాయులకు మే 13నుంచి 31వ తేదీ వరకు మూడు దశల్లో సుమారు 2,700 మందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు నైపుణ్యాలు, అభ్యసనాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్రెడ్డి ముగిసిన ఉపాధ్యాయుల శిక్షణ -
విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానం
న్యూశాయంపేట: పేద మైనారిటీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంప్రవేశపెట్టిన సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ప్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. లైంగిక వేధింపుల ఫిర్యాదులకు ప్రత్యేక కమిటీలు● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ వరంగల్ లీగల్: లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీలు ఉన్నాయని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ.నిర్మలా గీతాంబ అన్నారు. ‘పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ ప్రోష్ యాక్ట్ –2013’ చట్టంపై జిల్లాల ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లకు వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థలు సంయుక్తంగా శని వారం అవగాహన సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా హనుమకొండ ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణాదేవితో కలిసి ప్రధాన న్యాయమూర్తి నిర్మలా గీతాంబ మాట్లాడారు. పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, పరిష్కారానికి చట్టా లు ఉన్నాయని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు న్యాయ సహాయం ఎలా పొందాలి, ఎవరిని ఎలా సంప్రదించాలో న్యాయమూర్తులు రితిక, ఫరీనా అహ్మ, డాక్టర్ అనితారెడ్డి వివరించారు. కార్యక్రమంలో వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థల కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.సుధఋర్, తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి● హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పొజిషన్ సర్టిఫికెట్లు, రెవెన్యూ సదస్సులు, రాజీవ్ యువ వికాసం, తదితర అంశాలపై అధికారులతో శనివారం సమీక్షించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును గృహ నిర్మాణ శాఖ డీఈ సిద్ధార్థ నాయక్ వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, నగర కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వైవీ.గణేష్, ఆర్డీఓ కె.నారాయణ, డీపీఓ లక్ష్మి రమాకాంత్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ జి.రవీందర్తో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులపై ముందస్తు ప్రణాళికలు● డీఎంహెచ్ఓ అప్పయ్య ఎంజీఎం: వర్షాకాలంలో వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని వైద్య సిబ్బందిని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సమావేశ మందిరంలో ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ సూపర్వైజర్లు, మలేరియా నోడల్ పర్సన్స్, హెల్త్ అసిస్టెంట్లతో శనివారం సమీక్షా సమావేశఽం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమలు వృద్ధి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వివిధ విభాగాలతో కలిసి మంగళవారం, శుక్రవారం డ్రై డే పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ మదన్మోహన్, వైద్యుడు నరేష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ స్కూల్కు స్థల పరిశీలన
హసన్పర్తి: వర్ధన్నపేట నియోజకవర్గానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం కోసం 25 ఎకరాల మేరకు స్థలం అవసరం ఉండగా, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రెండు రోజులుగా రెవెన్యూ అధికారులతో కలిసి స్థలాలు పరిశీలించారు. మామునూరు, హసన్పర్తి మండలం భీమారంలోని కొచ్చెరు, పెగడపల్లిల్లో భూములను పరిశీలించారు. భీమారంలోని సర్వే నంబర్ 70లో స్కూల్ ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్యే భావించారు. ఎన్ని ఎకరాల స్థలం అందుబాటులో ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే చేసి హద్దులు నిర్ధారించాలని ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కిరణ్, హరిబాబు, గడ్డం శివరాంప్రసాద్, నాయకులు ఐలయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ దాడులుదుగ్గొండి: మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్ల ఆధారంగా తనిఖీలు చేశారు. అయితే కొన్ని సీడ్ దుకాణాల్లో పీసీలు, (ప్రిన్సిపుల్ సర్టిఫికెట్) లేకుండా విక్రయాలు కొనసాగిస్తున్నారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మండల కేంద్రంలోని పరమేశ్వర సీడ్స్, మనగ్రోమోర్ సెంటర్లలో పీసీలు లేని విత్తనాలు లభించడంతో వాటి అమ్మకాన్ని నిలిపేయాలని ఆదేశించి సీజ్ చేశారు. ఈదాడుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు శ్రీనివాస్, ప్రియ, మండల వ్యవసాయ అధికారి మాధవి, హెచ్ఈఓ హన్మంతు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఇద్దరి ఆత్మహత్య●● గవిచర్లలో విషాదం సంగెం: అనారోగ్యంతో బాధపడుతూ మండలంలోని గవిచర్లలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన పెండ్లి సాయమ్మ (72)కు కొన్నేళ్ల క్రితం కుమారుడు, భర్త చనిపోయారు. చిన్నకుమారుడి ఇంటి ఎదుట ఆమె జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆమెకు తీవ్ర జ్వరం వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్తే తగ్గింది. అప్పటి నుంచి తరచూ జ్వరంతో బాధపడుతోంది. షుగరు, బీపీ పెరుగుతూ.. తగ్గుతూ వస్తోంది. ఆరోగ్యం కుదుట పడడంలేదనే మనస్థాపంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సాయమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కూతురు రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది.. గవిచర్ల గ్రామానికి చెందిన కందుల సరోజన(53) అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంది. సరోజన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారుడు మోహన్ ఇటీవల ఆమెకు వరంగల్లో చికిత్స చేయించాడు. అయినప్పటికీ కడుపులో మంట, అలసటతో జీవితంపై విరక్తి చెంది.. శనివారం సాయంత్రం బాత్రూమ్ లోపల చీరతో ఉరేసుకుంది. భర్త కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఒకే రోజు, ఒకే గ్రామంలో, అనారోగ్యంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో గవిచర్లలో విషాదం నెలకొంది. విదేశాల్లో విద్యకు దరఖాస్తుల ఆహ్వానంన్యూశాయంపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మైనార్టీ వర్గాల వారు విదేశాల్లో విద్యనభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లండన్, ఫ్రాన్స్, జపాన్, సౌత్కొరియా, న్యూజిలాండ్, సింగపూర్ దేశాల్లో పీజీ, పోస్ట్ డాక్టరోల్ విద్యనభ్యసించే వీలుందని పేర్కొన్నారు. ఈనెల చివరి వరకు గడువు ఉందని, పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని కార్యాలయంలో లేదా 93988 60995 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారం
నెక్కొండ: కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారమవుతుందని పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దీక్షకుంట్ల గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లావుడ్య తిరుమల్ చౌహాన్, మండల కాంగ్రెస్ నాయకులు ఈదునూరి సాయికృష్ణ, కుసుమ చెన్నకేశవులు, ఆవుల శ్రీనివాస్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, శ్రీకాంత్, మెర్గు కుమార్, స్వామి, పులి నవీన్, రాజుకుమార్, సూరయ్య, రాంబాబు, రాజు, తదితరులు ఉన్నారు. పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి అర్హులకు ఇళ్ల పత్రాల అందజేత -
వేడుకలు వైభవంగా నిర్వహించాలి
న్యూశాయంపేట: రాష్ట్ర అవతరణ వేడుకలను వైభవంగా నిర్వహించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. శనివారం కలెక్టరేట్లో ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమన్నారు. ఖుష్మహల్లో ఏర్పాటు చేయనున్న అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. వేదిక ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ శాఖల సంక్షేమ అభివృద్ధి స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆఏర్పాట్లు ఆదివారం వరకు పూర్తి చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్ ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ రామ్రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, వరంగల్, ఖిలావరంగల్ తహసీల్దార్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద అధికారులతో సమావేశం -
వరంగల్
ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025వాతావరణం జిల్లాలో ఉదయం గాలివాన కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం అక్కడక్కడా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.సమాజం అండతోనే పద్మశ్రీ సమాజ అండదండలతోనే తనకు పద్మశ్రీ అవార్డు లభించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. – 8లోuచిన్న పెండ్యాల గ్రామంలో సుమారు 250 కుటుంబాలు ఉంటాయి. వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం, కులవృత్తులు. మబ్బుల్నే నిద్రనుంచి లేవడం, పొలంబాట పట్టడం, వ్యవసాయ పనులు చేసుకుని సాయంత్రానికి ఇంటికి చేరడం వీరి రోజువారీ విధి. వరంగల్, జనగామ, మహా అంటే హైదరాబాద్ తప్ప ఇతర పెద్ద నగరానికి వెళ్లింది లేదు. బస్సు, కారు తప్ప ఇతర వాహనం ఎక్కింది లేదు. కానీ వారిలోని ఐక్యమత్యం.. వారిని రాష్ట్రం దాటించింది. ఎప్పుడూ ఆకాశంలో వెళ్తుంటే చూసిన విమానాన్ని సైతం తమ దరికి చేర్చింది. పరపతి సంఘాల ఏర్పాటుతో రూపాయి, రూపాయి పొదుపు చేసుకుని అందులోనుంచే ఖర్చు చేసి విమానాన్ని ఎక్కారు. ఎప్పుడూ చూడలేమనుకున్న అనేక ప్రాంతాలను చుట్టివచ్చారు. ఈ గ్రామంలో మొత్తం కలిపి 22 పరపతి సంఘాల దాకా ఉంటాయి. అందులో పెద్దవి ఐదు (చైతన్య, ప్రగతి, శ్రీలక్ష్మీ, సిరి, శ్రీ గణేశ్) ఉన్నాయి. ఇందులో అన్ని కులాలు, వృత్తుల వారు సభ్యులుగా ఉన్నారు. ప్రతీ సభ్యుడు నెలకు రూ.100 వేసుకుంటున్నారు. ప్రతీ నెల ఒకరు ఎత్తుకుని 1 పర్సంట్ చొప్పున వడ్డీ కడతారు. ఇలా కొన్నేళ్లుగా జమచేసిన డబ్బులే వారి ఆర్థికప్రగతికి సహకారం అందిస్తున్నాయి. ● పరపతి సంఘం ద్వారా సామాన్యుల విమానయానం ● కల నెరవేర్చుకున్న రైతులు, కూలీలు, వృత్తిదారులు ● కుటుంబ సమేతంగా ఛార్ధామ్, ఆగ్రా, కాశీ విహారయాత్రలు ● దేశాన్ని చుట్టివస్తున్న చిన్నపెండ్యాల గ్రామస్తులు విమానం పోతుంటే చూసేటోడిని..నా కులవృత్తి తాళ్లు ఎక్కడం. రోజూ ఉదయం, సాయంత్రం తాటిచెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటాం. బయటి ఊర్లకు ఎక్కువగా వెళ్లింది లేదు. ఎప్పుడైనా ఆకాశంలో విమానం వెళ్తుంటే తాటిచెట్టుపైనుంచి చూసేటోడిని. కానీ ఆ విమానం నేను ఎక్కగలనా.. అనుకున్నా. ఆ కల నెరవేరింది. పరపతి సంఘం ద్వారా సభ్యులంతా కుటుంబంతో కలిసి ఛార్ధామ్యాత్రకు విమానంలో వెళ్లాం. మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎంతో సంతోషం వేసింది. – గీసగోని రాజయ్య, గీతకార్మికుడు ప్రముఖులెవరైనా సభకో, సమావేశానికో వస్తే వాళ్లంతా వరుసకట్టేవారు. వారి మాటలు వినడానికో, సమావేశంలో పాల్గొనడానికో కాదు.. వారిని తీసుకొచ్చిన హెలికాప్టర్ను చూడ్డానికి.. అది కూడా అరకిలోమీటరు దూరం నుంచి.. జీవితంలో ఒక్కసారైనా కనీసం వాటిని తాకుతామా? అని ఆలోచించేవారు. కానీ చిన్నమొత్తాల పొదుపే వారిని ఆకాశంలో విహరించేలా చేసింది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామస్తుల కలలకు రెక్కలు తొడిగింది. గాల్లో వెళ్తుంటే బాగుంది..గ్రామంలో రోజూ కూలి పనికి వెళ్తా. వరినాట్లు, ఇతర వ్యవసాయ పనులకు వెళ్తుంటా. మేం పరపతి సంఘంలో సభ్యులుగా చేరాం. అందరితో కలిసి విమానం ఎక్కిన తర్వాత మొదట కొంచెం భయం వేసింది. ఆ తర్వాత గాల్లో వెళ్తుంటే బాగుంది. యాత్రలో అందరితో కలిసి పడవ ఎక్కినం, స్టీమర్ ఎక్కినం. ఛార్ధామ్ యాత్రలో గుర్రాలు ఎక్కినం. పరపతి సంఘం ద్వారా ఇదంతా సాధ్యమైంది. – రామగిరి సరోజ, వ్యవసాయ కూలీ, చిన్నపెండ్యాల అందరి కృషి.. పల్లెటూరి వాళ్లను కంపల్సరీ ఫ్లైట్ ఎక్కించాలని అనుకున్నాం. అందుకు ఏం చేయాలని మీటింగ్ పెట్టి నిర్ణయించుకున్నాం. డబ్బులు సమకూర్చుకున్నాం. అనుకున్నట్లుగానే టూర్కు వెళ్లాం. ఛార్ధామ్ యాత్రకు వెళ్లాం. ఇది మా అందరి కృషి. రోజూ కూలీ పని చేసే వాళ్లం. విమానాశ్రయానికి వెళ్లాక అందరి కళ్లు ఆనందభాష్పాలను రాల్చాయి. – చావ కుమారస్వామి, మల్లారెడ్డి, సంఘం సభ్యులు చిన్నపెండ్యాల సెల్ఫీ తీసుకుని మురిసిపోయా.. గ్రామంలో అందరం కుటుంబ సభ్యుల్లా ఉంటాం. గ్రామం దాటి బయటికి వెళ్లింది లేదు. కానీ, పరపతి సంఘం ద్వారా ఫ్లైట్ ఎక్కినం. మొదటిసారి విమానం ఎక్కిన అనుభూతి మాటల్లో చెప్పలేనిది. నేను, నా భార్య విమానంలో సెల్ఫీ తీసుకుని మా బంధువులకు పంపి ఆనందపడ్డాం. ఈసారి పూరి జగన్నాథ్యాత్రకు వెళ్దామనుకుంటున్నాం. – కీర్తిసత్యం, గ్రామస్తుడు, చిన్నపెండ్యాల పరపతి సంఘాల సభ్యులంతా 2023లో కాశీకి వెళ్లాలనుకున్నారు. ‘రెక్కల కష్టం నమ్ముకున్నాం.. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కుదాం’.. అని సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 50 కుటుంబాలు (భార్యాభర్త) విమాన ప్రయాణానికి ఎంత ఖర్చు అవుతుందని సంబంధిత టూర్స్, ట్రావెల్స్ వాళ్లను అడగగా రూ.20 నుంచి రూ.24 లక్షలు అవుతుందని చెప్పారు. ఇందుకు అవసరమైన డబ్బుల కోసం కమిట్మెంట్ చిట్టీలు వేసుకుని రూ.20 లక్షలు పోగేసుకున్నారు. చేతి ఖర్చుకు ఒక్కో కుటుంబం రూ.10 వేల వరకు దగ్గర ఉంచుకుంది. ఇంకేముంది వారనుకున్న విమానయాన కల నెరవేరింది. ఇలా ఒక్కసారి కాదు.. ఇప్పటికే ఐదుసార్లు తమ కలను నెరవేర్చుకున్నారు. ఆలోచన వచ్చిందిలా.. గ్రామ పరపతి సంఘాల సభ్యులు ఇప్పటివరకు ఛార్ధామ్, కాశీ టూర్, రామేశ్వరం, ఢిల్లీ, ఆగ్రా యాత్రలకు వెళ్లారు. హనుమకొండ నగరంలోని ఓ ప్రైవేట్ ట్రావెల్స్కు డబ్బులిస్తే వాళ్లు మొత్తం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లి.. అక్కడ ప్రత్యేకంగా బస్సు మాట్లాడుకుని ప్రదేశాలకు తిరిగారు. ఆవిమానం మొత్తం ఒకే ఊరు వాళ్లు ఉండడం.. మొదటిసారి విమానం ఎక్కిన వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దుక్కిలో వేసిన అచ్చులుకొత్తూరులో ట్రాక్టర్తో దుక్కిదున్నుతున్న రైతు న్యూస్రీల్పరపతి సంఘాలు.. ఐకమత్యానికి నాంది ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతోనే.. -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవతరణ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు.నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయంఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివిజన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ సవరం రంజిత తదితరులు పాల్గొన్నారు.ఆస్పత్రిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులుసంగెం: మండల కేంద్రంలోని గ్రామీణ కుటుంబ సంక్షేమ కేంద్రాన్ని శుక్రవారం తెలంగాణ స్వస్థ ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆస్పత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను బృందం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా మెరుగైన, ఉన్నతస్థాయి వైద్యానికి కావాల్సిన సౌకర్యాలను పరిశీలించి నివేదిక తయారు చేసి అందజేస్తామని బృందం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో స్టేట్ క్వాలిటీ మేనేజర్ శ్రీనివాస్, వైద్యాధికారి వంశీకృష్ణ, డీపీఎంయూ అర్చన, డాక్టర్ క్రాంతి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.పాఠశాలల్లో మార్పుపై దృష్టిసారించాలివిద్యారణ్యపురి: పాఠశాలల్లో మార్పుపై హెచ్ఎంలు దృష్టిసారించాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి సూచించారు. తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ స్కూల్లో జిల్లాలోని హెచ్ంఎలకు ఐదురోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శుక్రవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశంలో సత్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేలా కృషి చేయాలన్నారు. డీఈఓ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచే దిశగా బడిబాట కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఉపాధ్యాయులు సాంకేతికతను ఉపయోగించి విద్యాబోధన చేయాలని చెప్పారు. జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ సుజన్తేజ, రిసోర్స్ పర్సన్లు డాక్టర్ కట్ల శ్రీనివాస్, రవీందర్, మోహన్రావు, మహేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా రిసోర్స్ పర్సన్లను సన్మానించారు. -
నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
ఖిలా వరంగల్: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ విత్తనషాపుల డీలర్లు, యజమానులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధతోపాటు వరంగల్ ఏసీపీ నందిరామ్నాయక్ శుక్రవారం వరంగల్ స్టేషన్ రోడ్డులోని విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టారు. విత్తన షాపుల్లో నిల్వల రిజిస్టార్ను పరిశీలించారు. విత్తన నిల్వలు, విత్తనాల లేబుల్, ట్యాగ్ను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు విక్రయించాలని ఆదేశించారు. అనుమతి లేని నాసిరకం విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ పెడుతామని హెచ్చరించారు. విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు సైతం పలు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. ఎరువులు, విత్తనాలను రైతులు లైసెన్స్ ఉన్న దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని తెలిపారు. తనిఖీల్లో ఇంతేజార్గంజ్ ఇన్స్పెక్టర్ షుకూర్, ఎస్సై చాంద్పాషా, వ్యవసాయ అధికారి నేలకుర్తి రవీందర్, టెక్నికల్ వ్యవసాయ అధికారి సాగరిక, ఏఈఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. విత్తనాలు అధిక ధరలకు విక్రయించొద్దు నర్సంపేట రూరల్ : అదిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ బృందం వ్యవసాయ సహాయ సంచాలకుడు శ్రీనివాస్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని పలు విత్తన, ఎరువుల షాపులను శుక్రవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు అధికృత డీలర్ దగ్గరే కొనుగోలు చేయాలన్నారు. సీడ్ ప్యాకెట్స్పై అన్ని వివరాలు సరిగా ఉన్నాయో చూసుకోవాలని, పూర్తి వివరాలతో బిల్లు తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలని తెలిపారు. కల్తీ విత్తనాల ప్యాకెట్లు అయితే వారిపై కేసు నమోదుచేసి నష్టపరిహారం పొందేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఎస్సై రవి కుమార్, వ్యవసాయ అధికారి కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. విత్తన షాపుల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు విత్తన ప్యాకెట్లను పరిశీలించిన ఏసీపీ నందిరామ్, డీఏఓ అనురాధ -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
ఖానాపురం/నర్సంపేట రూరల్/దుగ్గొండి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. ఖానాపురం మండలంలోని రాగంపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి, ధాన్యం తేమశాతాన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని తూర్పాల పట్టుకుంటే తేమశాతం తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తలు పాటిస్తూ విక్రయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్లో 1.58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, ఇందులో నర్సంపేట నియోజకవర్గంలోనే 15 వేల మెట్రిక్ టన్నుల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. వర్షాలు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నర్సంపేట రూరల్ పరిధిలోని రాజుపేటలో హరి రైస్ మిల్, నర్సంపేట పట్టణంలని ద్వారకపేట శివారు గోపికృష్ణ రైస్మిల్, దుగ్గొండి మండలంలోని చలపర్తి గ్రామంలో వినాయక రైస్ మిల్లులను తనిఖీ చేసి మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. కోతల పేరుతో దిగుమతులు ఆలస్యం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, ఆర్డీఓ ఉమారాణి, నర్సంపేట తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 3 నుంచి భూభారతి దరఖాస్తుల స్వీకరణ న్యూశాయంపేట : జిల్లాలో జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి భూ భారతి పథకంపై రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, రేషన్ కార్డుల మంజూరిపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పథకంలో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు నెల రోజుల్లో పూర్తి కావాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. రెండో విడత అర్హులైన పేదలను ఎంపిక చేయాలని ఆదేశించారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఆమోదం పొందిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను స్థానిక ఎమ్మెల్యేల ఆమోదంతో తక్షణమే పంపిణీ చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జూన్ 6 వరకు అందించేందుకు సంబంధిత తహసీల్దార్లు, ఎంపీడీఓలు కృషి చేయాలన్నారు. రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంపికై న లబ్ధిదారులకు జూన్ 2న మంజూరు పత్రాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఈడీ ఎస్సీ కార్పొరేషన్ అధికారి సురేష్ ఆదేశించారు. రేషన్ కార్డు మంజూరిలో భాగంగా ప్రజా పాలన కౌంటర్ల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండల తహసీల్దార్ల ద్వారా ఎంకై ్వయిరీ చేసి అర్హత మేరకు రేషన్ కార్డులు మంజూరి చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, హౌసింగ్ పీడీ గణపతి, డీఆర్ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
అడిషనల్ డీసీపీగా ప్రభాకర్రావు
హసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగం అడిషనల్ డీసీపీగా రాయల ప్రభాకర్రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆసిఫాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్రావును వరంగల్ పోలీస్ కమిషనరరేట్ అడిషనల్ ఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభాకర్రావు వరంగల్ జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేశారు. ఈమేరకు కమిషనర్ సన్ప్రీత్సింగ్ను ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు : కలెక్టర్ ప్రావీణ్యహన్మకొండ అర్బన్: జిల్లాలో 2024–25 యాసంగి సీజన్లో 157 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో ఇప్పటి వరకు 1,16,290.240 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. ఇది గతేడాది రబీ సీజన్తో పోలిస్తే 40,330.240 మెట్రిక్ టన్నులు అధికమని పేర్కొన్నారు. ఽ24,814 మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేసి వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 252.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో కేటాయించిన 53 రైస్ మిల్లులకు ఎప్పటికప్పుడు తరలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా త్వరిగతిన కొనుగోలు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు.యువత మత్తు వలలో పడొద్దుహన్మకొండ అర్బన్: యువత వారి భవిష్యత్, దేశ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని మత్తు మహమ్మారి వలలో పడొద్దని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ కోరారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న మాదకద్రవ్యాలు, గుట్కా వ్యతిరేక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను సైకాలజిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పరికిపండ్ల అశోక్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా డీఆర్ఓ వైవీ గణేశ్ మాట్లాడుతూ.. డ్రగ్స్ , గుట్కా రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ చేపట్టనున్న కార్యక్రమం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ తదితరులు పాల్గొన్నారు.ఆదాయం పెంచాలి.. ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్హన్మకొండ: డిపో ఆదాయాన్ని పెంచాలని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ పి.సోలమన్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని ఆర్టీసీ వరంగల్–1, హనుమకొండ డిపోను ఆయన సందర్శించారు. డిపో పరిసరాల్ని పరిశీలించారు. వరంగల్–1 డిపోలో మొక్క నాటారు. ఈసందర్భంగా కార్మికులను ఉద్దేశించి సోలమన్ మాట్లాడుతూ.. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని సూచించారు. వివిధ హోదాలో ఉన్న 20 మందితో ఒక టీమ్ ఏర్పాటు చేసి డిపో ఆదాయం పెంచేందుకు కృషి చేయాలన్నారు. ఈసందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన డ్రైవర్లను సన్మానించారు. కార్యక్రమంలో వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయభాను, డిప్యూటీ ఆర్ఎం కేశరాజు భానుకిరణ్, వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత, హనుమకొండ డిపో మేనేజర్ ధరంసింగ్, అసిస్టెంట్ మేనేజర్ భవాని, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
వైద్యసేవలు మరింత సులభం
కాజీపేట రూరల్: భారతీయ రైల్వే మంత్రిత్వ శాఖలోని రైల్ టెల్ కార్పొరేషన్ రైల్వే రిటైర్డ్ పెన్షనర్స్, సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్ కోసం మొబైల్ యాప్స్ అప్లికేషన్ డిజిటల్ సేవలు ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది రిటైర్డ్ రైల్వే పెన్షనర్స్, 12 లక్షల మంది రైల్వే సర్వీస్లోని ఎంప్లాయీస్ కోసం హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం (హెచ్ఎంఐఎస్), హాస్పిటల్ రిసోర్స్మేనేజ్మెంట్ సిస్టం (హెచ్ఆర్ఎంఎస్)ను దేశవ్యాప్తంగా 714 ఆస్పత్రులు/హెల్త్ యూనిట్ల అనుసంధానంతో పాటు, మొబైల్ యాప్స్తో డిజిటల్ సేవలు అమలు చేయనున్నారు. హెచ్ఎంఐఎస్ను 2019లో, హెచ్ఆర్ఎంఎస్ను 2020లో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఉమిత్కార్డు (యూనిక్ మెడికల్ ఐడీకార్డు)తో ఇండియన్ రైల్వేలో రూ.60 లక్షలు, సికింద్రాబాద్ డివిజన్లో 26 వేల మంది పెన్షనర్స్ మెడికల్ సేవలు పొందుతున్నారు. హెచ్ఎంఐఎస్ యాప్లో రైల్వే పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు కావాల్సిన వైద్య సదుపాయాల కోసం, రెఫరల్ ఆస్పత్రి ఆస్పత్రుల వివరాలు, మందులు అందుబాటులో ఉంటాయి. హెచ్ఆర్ఎంఎస్ యాప్లో రైల్వే ఎంప్లాయిస్ లీవ్స్, పీఎఫ్, సాలరీ, ఎస్ఆర్, ఈ–పాస్లు (పెన్షనర్స్ కోసం–సంవత్సరానికి రెండు ఉచిత ట్రైన్ పాస్ ఉంటుంది) హెచ్ఎంఐఎస్, హెచ్ఆర్ఎంఎస్ యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటిలోకి వెళ్లి డిజిటల్ సేవలు పొందాలి. డిజిటల్ సేవలు ఉపయోగకరం.. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే పెన్షనర్స్, రైల్వే ఎంప్లాయీస్ కోసం ప్రవేశపెట్టిన డిజిటల్ సేవలను వినియోగించుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పెన్షనర్స్, సర్వీస్ ఎంప్లాయీస్కు డిజిటల్ సేవలు ఎంతో ఉపయోగం. రైల్వే పెన్షనర్స్ యాప్ తెలియకుంటే ఇంట్లో పిల్లలతో, లేదంటే తెలిసిన వారితో సేవలు పొందాలి. దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లు, 70 రైల్వే డివిజన్లలో ఈ డిజిటల్ సేవలపై రైల్వే శాఖ అధికారుల సహకారంతో ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ (ఎఐఆర్ఆర్ఎఫ్)తో వర్క్షాపులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. – ఎస్.శ్రీధర్, ఏఐఆర్ఆర్ఎఫ్ నేషనల్ ప్రెసిడెంట్ పెన్షనర్లు, ఎంప్లాయీస్ కోసం ప్రత్యేక యాప్లు ప్రారంభించిన రైల్వే మంత్రిత్వ శాఖ -
ఖరీఫ్లో ముందస్తు ప్రణాళికలు అవసరం
ధర్మసాగర్: ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు ప్రణాళికలు చేసుకోవాలని కేవీకే మామునూరు శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న సూచించారు. మండలంలోని మల్లక్పల్లిలో భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆధ్వర్యంలో శుక్రవారం వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ రాజన్న మాట్లాడుతూ.. వ్యవసాయ, పాడిపశువులకు సంబంధించి ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యాలను రైతులకు వివరించారు. నూనె గింజల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేశ్ మాట్లాడుతూ.. వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చించి వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. రైతులు వివిధ రకాల పంటలు సాగు చేయడం ద్వారా నేలసారాన్ని కాపాడుకోవాలన్నారు. ఏఈఓ కల్యాణ్ మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్లో రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు వివరించారు. పశువైద్య శాస్త్రవేత్త సాయికిరణ్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు సలహాలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అనుపమ, విజయ డెయిరీ సూపర్వైజర్ రఘు, శోభ, పశు వైద్య సహచరులు ఎల్లారెడ్డి, రైతులు కరుణాకర్ తదితరులు ఉన్నారు. కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజన్న -
కేఎంటీపీలో ఫైర్ సేఫ్టీ పరిశీలన
● సందర్శించిన ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ గీసుకొండ: జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో నెలకొల్పిన పరిశ్రమల యూనిట్లలో అగ్రిప్రమాదాలు సంభవించకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఈస్ట్జోన్ డీసీపీ అంకిత్కుమార్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు, మామునూరు ఏసీపీ వెంకటేశ్, గీసుకొండ సీఐ మహేందర్, ఎస్సైలు కుమార్, ప్రశాంత్బాబులతో కలిసి ఆయన కేఎంటీపీలోని గణేశా ఎకోటెక్ కంపెనీని పరిశీలించారు. కంపెనీలో జరుగుతున్న ఉత్పత్తి ప్రక్రియ, ఫైర్సేఫ్టీకి పాటిస్తున్న జాగ్రత్తల గురించి హెచ్ఆర్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రెండు పత్తి జిన్నింగ్ మిల్లులను సందర్శించి వాటిల్లో అగ్రిప్రమాదాల నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇటీవల హైదరాబాద్లోని గుల్జార్ హౌస్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దృష్ట్యా గణేశ కంపెనీతోపాటు జిన్నింగ్ మిల్లుల్లో ఫైర్ సేప్టీపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. -
చిరువ్యాపారుల జీవితాలతో ఆటలొద్దు
హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారుల హక్కుల సాధన కోసం అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తానని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ చౌరస్తాలో కూరగాయలు, బట్టలు అమ్ముకునే చిరువ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించిన నేపథ్యంలో.. శుక్రవారం క్షేత్రస్థాయిలో బాధితులతో ఆయన మాట్లాడారు. న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరువ్యాపారులకు పరిహారం చెల్లించి, చౌరస్తాలోని అడ్డాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ మేయర్ రిజ్వాన్షమీమ్ చిరువ్యాపారులతో కలిసి స్థానిక సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి చిరువ్యాపారులకు న్యాయం చేయాలని కోరారు. బీఆర్ఎస్కు ఏఐటీయూసీ నాయకులు మద్దతుగా నిలిచారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కో–ఆర్డి నేటర్ పులి రజనీకాంత్ కార్పొరేటర్లు లోహిత రాజు, సోదా కిరణ్, చెన్నం మధు, సంపు నర్సింగ్ బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ కంజర్ల మనోజ్, బొల్లెపెల్లి పున్నంచందర్, ఖలీల్ నాయకులు పేర్ల మనోహర్, జోరిక రమేశ్, మేకల బాబురావు, సారంగపాణి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేల్పుల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు వినయ్భాస్కర్ నేడు ఏకశిలపార్కు వద్ద ధర్నా -
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
నెక్కొండ: ఖరీఫ్ ప్రారంభం కాకముందే మండలంలో విత్తన షాపులు, రికార్డులను ఇటు వ్యవసాయ శాఖ, అటు పోలీస్ శాఖ క్షుణ్ణంగా పరిశీలించడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో అక్కడక్కడా నకిలీ విత్తనాలు విక్రయిస్తుండడంతో జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. ఇందులోభాగంగా శక్రవారం నెక్కొండ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా విత్తన టాస్క్ఫోర్స్ బృందం నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిఏడాది సీజన్ ముందు ప్రతీ విత్తన షాపును తనిఖీ చేస్తామన్నారు. కల్తీ, నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేని షాపుల్లో విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దని సూచించారు. సన్న రకం వరి విత్తనాలతోపాటు పత్తి, మొక్కజొన్న విత్తనాలు అధికంగా కల్తీవి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలు నకిలీవి అయితే.. రశీదు ఆధారంగా రైతులకు పరిహారం అందే వీలుంటుందని, రైతులు రశీదులను పంట కాలం పూర్తయ్యేవరకు జాగ్రత్త చేయాలని సూచించారు. అనంతరం షాపుల్లోని రికార్డులు, నిల్వలు, కాలం చెల్లినవి ఏమైన ఉన్నాయా.. అనే కోణంలో తనిఖీలు చేశారు. దాడుల్లో నెక్కొండ సీఐ శ్రీనివాస్, ఏఓలు గోపాల్రెడ్డి, నాగరాజు, ఏఈఓలు, తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఏడీఏ దామోదర్రెడ్డి, ఏసీపీ రవీందర్రెడ్డి నెక్కొండలోని ఎరువుల షాపుల్లో విజిలెన్స్ తనిఖీలు -
నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలా వరంగల్: నగరాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్ 19వ డివి జన్ వివేకానంద కాలనీలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న తాగునీటి పైప్ లైన్లు, డ్రెయినేజీ పనులు, 41వ డివిజన్ ప్రతాప్నగర్ ఉర్సు కరీమాబాద్లో రూ.34 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మాణ పనులకు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంత్రి సురేఖ వేర్వేరుగా శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ.. అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి పైపులైన్ల నిర్మాణాలకు అఽధిక ప్రాధాన్యమిస్తున్నామని, పేదల కాలనీల్లో ప్రధాన సమస్యలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ బండి నాగేశ్వర్రావు, టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాశ్, నాయకులు నవీన్రాజ్, కేడల పద్మ, ట్రాన్స్జెండర్ రంజిత పాల్గొన్నారు. మంత్రి కొండా సురేఖ -
వంద రోజుల ప్రణాళిక పక్కాగా అమలు
మేయర్ సుధారాణి న్యూశాయంపేట: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ద్వారా రూపొందించిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో వంద రోజుల ప్రణాళిక అమలు తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. జూన్ 2 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు బల్దియా ద్వారా వంద రోజుల పాటు చేపట్టే కార్యాక్రమాల గురించి వివరించారు. ఈవంద రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటడం, ముంపు నివారణకు 36 ప్రధాన నాలాల్లో రూ.1.21 కోట్లతో పూడికతీత పనులు పూర్తి చేయడం, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నగరంలోని గోడలపై మృనాల్ పెయింటింగ్లు వేయడం, వరద నీరు సాఫీగా వెళ్లేలా నాలాల్లో ఉన్న బ్లాకేజ్ ప్రాంతాలను గుర్తించి మెష్లు ఏర్పాట్లు చేయాలని, జంక్షన్లలో సుందరీకరణ పనులు, రెండు పార్కుల అభివృద్ధి, రహదారుల మరమ్మతులు, శిథిలావస్థ నిర్మాణాల తొలగింపు, అంతర్గత మురుగు కాల్వల పరిశుభ్రత, తదితర పనులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వంద రోజుల ప్రణాళిక విజయవంతానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ రాజిరెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ శ్రీనివాస్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నారాణి, డీఎఫ్ఓ శంకర్ లింగం, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. -
అవతరణ వేడుకలకు అతిథులు వీరే!
హనుమకొండకు మంత్రి కొండా సురేఖ, వరంగల్కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్: జూన్ 2 ఉదయం 10 గంటలకు తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథుల జాబితాను శుక్రవారం ప్రకటించింది. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్స్లో రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. వరంగల్లో రాష్ట్ర రెవెన్యూశాఖ, ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా జయశంకర్ భూపాలపల్లిలో టీడీఎఫ్డీసీ చైర్మన్ పోదెం వీరయ్య, మహబూబాబాద్లో ప్రభుత్వ విప్ జె.రాంచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రముఖులు తెలంగాణ అమరవీరుల స్మారకచిహ్నాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించాలని, ఆ తర్వాత అతిథులు జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొన్నారు. -
వీడియో కాన్ఫరెన్స్లు పనిలేక కాదు..!
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలతో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారని జిల్లాల కలెక్టర్లను నిలదీశారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలసి హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 6 లోపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులంతా రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించటం వేరే పనిలేక కాదు. ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించకపోవడం బాధాకరం. బెనిఫిషరీ లిస్ట్ ఫ్రేమ్ కట్టు కోవడానికి కాదు. లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఒక్కో కలెక్టర్ పరిధిలో ఇద్దరు, ముగ్గురికి మించి ఎమ్మెల్యేలు లేరు. వారితో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు? ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టు కోవడం సరికాదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ వానాకాలం సీజన్ ఆరంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పొంగులేటి ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూముల రిజి్రస్టేషన్కు సంబంధించి సాదా బైనా మా విషయం కోర్టులో ఉందని, కోర్టులకు సెలవులు పూర్తికాగానే ఈ అంశంపై నిర్ణయం తీసు కుంటామని చెప్పారు. గ్రామ పాలనాధికారుల పరీక్షలో అర్హత సాధించినవారిని జూన్ 2 నుంచి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయ క్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. -
యువతకు హెచ్ఐవీపై అవగాహన ఉండాలి
ఎంజీఎం : యువతకు హెచ్ఐవీపై అవగాహన కలిగి ఉండాలని హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య అన్నారు. గురువారం నగరంలోని డబ్బాల జంక్షన్ వద్ద మొబైల్ వ్యాన్ హెచ్ఐవీ/ఎస్టీఐ సంపూర్ణ సురక్ష కేంద్రం సేవలపై ప్రదర్శన నిర్వహించారు. డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ హైరిస్క్లో ఉన్నవారికి అవగాహన కలిగించడంతోపాటు టెస్టింగ్ చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. జనసాంద్రత ఎక్కువగా ఉండే కూడళ్లలో ఈ మొబైల్ వాహనం ద్వారా అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం బ్రోచర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్మోహన్రావు, పోచమ్మకుంట పీహెచ్సీ వైద్యాధికారి దీప్తి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్మీడియా అధికారి అశోక్రెడ్డి, హెచ్ఈఓ శ్రీనివాస్, సంపూర్ణ సురక్ష కేంద్రం మేనేజర్ పాషా, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. గుర్తింపు లేని పాఠశాలలను మూసివేయాలి : డీఈఓ విద్యారణ్యపురి : జిల్లా వ్యాప్తంగా గుర్తింపులేని పాఠశాలలను మూసివేసి సీజ్ చేయాలని హనుమకొండ డీఈఓ వాసంతి ఎంఈఓలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. అనుమతి ఉన్న పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్, నోట్బుక్స్, పెన్నులు తదితర వస్తువులను తమవద్దనే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒ త్తిడి చేస్తున్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే శాఖాపర ంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సభ్యుడిగా దయాకర్కేయూ క్యాంపస్: రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ అప్పీలేట్ అథారిటీ సభ్యుడిగా కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ గాదె దయాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దయాకర్ రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ఎన్విరాన్మెంటల్ ఎక్సఫర్ట్ అప్రైజర్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతంలో 15 ఏళ్లపాటు కాలుష్య నియంత్రణ మండలి హైదరాబాద్ జోనల్ మెంబర్గా ఉన్నారు. టాస్క్ఫోర్స్ సభ్యుడిగా పనిచేశారు. వరంగల్ ధర్మారానికి చెందిన దయాకర్ హనుమకొండలో స్థిరపడ్డారు. కేయూలో పలు పలు పదవులు నిర్వర్తించారు. దరఖాస్తుల ఆహ్వానం హసన్పర్తి : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బండారుపల్లి, వేలేరు, హసన్పర్తి, వంగర, నెక్కొండ, కొడకండ్ల పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ బాలికల గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఇందుమతి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్రెడ్డిలు సంయుక్త ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, సంస్కృతం, గణితం, ఫిజిక ల్ సైన్స్, బయోసైన్స్, సోషల్ సబ్జెక్ట్లు, కళాశాలలో గణితం, బోటని, జువాలజీ, ఫిజిక్స్, కెమి స్ట్రి బోధించేందుకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆయా పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2వ తేదీ లోపు సమర్పించాలని సూచించారు. జూన్ 3వ తేదీన బాలికల గురుకుల జూనియర్ కళాశాల, పాఠశాలల్లో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు. -
సన్నాలకు బోనస్ ఏది?
కమలాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లింపులు జరగడం లేదు. యాసంగి సీజన్కు సంబంధించిన సన్నరకం బోనస్ జిల్లాలోని ఏ ఒక్క రైతుకూ అందలేదు. యాసంగి సీజన్ ముగిసి వానాకాలం సాగు ప్రారంభమవుతున్నప్పటికీ సన్నవడ్లకు బోనస్ రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా బోనస్ వెంటనే తమ ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. బోనస్ విలువ రూ.10.57 కోట్లు.. యాసంగి పంటల సాగుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 11వ తేదీనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ఈక్రమంలో సన్నరకం వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటా ధాన్యానికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 76 కొనుగోలు కేంద్రాలు, డీఆర్డీఏ–సెర్ప్ ఆధ్వర్యంలో 70 కొనుగోలు కేంద్రాలు, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మొత్తం 151 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,031 మంది రైతుల నుంచి 21,153 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించి రైతులకు రూ.10,57,65,000 బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ యాసంగి పంట కొనుగోళ్లు దాదాపు పూర్తయి వానాకాలం సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో సన్నవడ్ల బోనస్ డబ్బులు మాత్రం జమకాలేదు. బోనస్ ఇంకా జమకాలే.. రెండున్నర ఎకరాల్లో నేను సన్నరకం వడ్లు సాగు చేసిన. ఈనెల 9వ తేదీన కొనుగోలు కేంద్రంలో అమ్మగా, కటింగ్లు పోను 50.80 క్వింటాళ్ల లెక్కకొచ్చింది. సన్నాలకు ఇప్పటిదాకా బోనస్ పైసలు మాత్రం జమకాలే. ఇప్పటికే వానాకాలం పనులు ప్రారంభమయ్యాయి. వెంటనే బోనస్ డబ్బులు చెల్లించాలి. – పింగిలి జయపాల్రెడ్డి, కమలాపూర్ నెలదాటిన బోనస్ రాలే.. నేను ఆరెకరాల్లో సన్న వడ్లు సాగు చేసిన. నాలుగెకరాల్లో 120 క్వింటాళ్ల సన్న వడ్లు పండగా గూడూరు సొసైటీ కొనుగోలు కేంద్రంలో అమ్మిన. వడ్ల పైసలు వచ్చినయి, కానీ నెల రోజులైనా బోనస్ పైసలు మాత్రం జమ కాలేదు. వానాకాలం పనులకు ముందే నాకు రావాల్సిన రూ.60 వేల బోనస్ డబ్బులు ప్రభుత్వం వెంటనే ఇయ్యాలి. – మామిడిశెట్టి తాతారావు, గూడూరు సీజన్ ముగిసినా.. జమకాని డబ్బులు అన్నదాతలకు తప్పని ఎదురుచూపులు బోనస్ వెంటనే చెల్లించాలని రైతుల వేడుకోలు -
పిల్లలను ప్రభుత్వ బడికి పంపండి
విద్యారణ్యపురి : ప్రభుత్వ పాఠశాలలు జూన్ 12వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2025–26విద్యాసంవత్సరంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పడరాని పాట్లు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో కొద్దిరోజులుగా అనేక చోట్ల ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే తమ పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తామని కరపత్రాలు, బ్రోచర్లు రూపొందించి పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్న తల్లిదండ్రులను, ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకే వెళ్లి ప్రభుత్వ బడిలో అందించే సౌకర్యాలపై టీచర్లు అవగాహన కల్పించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా వివిధ తరగతుల్లో చేర్పించేందుకు 1,908 మంది విద్యార్థులను గుర్తించారు. మౌలిక సదుపాయాలపై అవగాహన విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం ఉంటుందని చెబుతున్నారు. డిజిటల్, ఏఐ కంప్యూటర్ ఆధారిత విద్యాబోధన కూడా అందిస్తున్నామని ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వివిధ హైస్కూల్స్ పీఎంశ్రీ పాఠశాలలు ఉండగా, అందులో ప్రత్యేక నిధులతో గ్రంథాలయాలు, ఆట వస్తువులు, ఇతర సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే బడిఈడు పిల్లలను సైతం గుర్తిస్తున్నారు. బడిమానేసిన పిల్లలు ఉంటే వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తయింది. జూన్ 6వ తేదీనుంచి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నారు. తల్లిదండ్రులతోనూ సమావేశాలు ఈనెల 2వ తేదీన, 16న పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాయిలో ఆయా పరిధిలోని తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్లు, తల్లుల కమిటీలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఈనెల 30న స్థానిక ప్రజాప్రతినిధులతో, యువకుతల చేత సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల అవశ్యకతను వివరించి విద్యార్థుల నమోదుపై దృష్టిసారించాలని డీఈఓ వాసంతి హెచ్ఎంలను, ఉపాధ్యాయులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధచోట్ల ఒకటో తరగతికి 728 మంది విద్యార్థులను గుర్తించారు. ఆరో తరగతికి 893 మందిని, ఎనిమిదో తరగతికి 287 మందిని గుర్తించారని జిల్లా విద్యాశాఖ కమ్యూనిటీ మొబలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్రెడ్డి తెలియజేశారు.జిల్లాలో కొనసాగతున్న ముందస్తు ‘బడిబాట’ ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ ఉపాధి పనుల వద్దకూ వెళ్లి ప్రచారం చేస్తున్న టీచర్లు ఇప్పటివరకు 1,908 మంది విద్యార్థుల గుర్తింపు -
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళలు ఐకమత్యంగా ఉండి అనేక రంగాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డెయిరీ వారి శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డీడీ) సహకారంతోపాటు అధికారులు అండగా ఉంటారని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు మహిళలు శిక్షణ పొందాలన్నారు. నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రత్యేక విజన్తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వివిధ అంశాలపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం ‘మహాజన సభ ’ సమావేశం అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ దామెర మండలం ల్యాదెల్లలో ఏర్పాటు చేస్తున్న మహిళా నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రం జూన్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ కోసం జిల్లాలో 10 మండలాల్లోని పది గ్రామాలను ఎంపికయ్యాయని, ఈ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగే విధంగా సహకార శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతోపాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలి: కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద -
మహిళల ఆర్థికాభివృద్ధికి డెయిరీ ఏర్పాటు
హన్మకొండ అర్బన్ : పరకాల నియోజకవర్గంలోని మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేందుకే పాడి డెయిరీని ఏర్పాటు చేస్తున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ‘మహాజన సభ ’నిర్వహించారు. సభలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ.. మహిళా డెయిరీ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చినప్పప్పుడు ఈ విషయాన్ని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లగా, వారు ప్రారంభంనుంచి కోఆర్డినేట్ చేస్తున్నారన్నారు. మహిళలు ఐకమత్యంగా ఉండి అనేక రంగాల్లో విజయవంతంగా ముందుకు వెళ్తున్నారన్నారు. మహిళలు పరస్పర సహకారంతో విజయవంతంగా నిర్వహిస్తున్న ముల్కనూరు మహిళా డెయిరీ వారి శక్తికి నిదర్శనమని పేర్కొన్నారు. ముల్కనూరు డెయిరీ మాదిరిగానే పరకాల మహిళా డెయిరీ కూడా రానున్న రోజుల్లో విజయవంతంగా నిర్వహిస్తూ జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. డెయిరీ విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలన్నారు. డెయిరీ ఏర్పాటుకు జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ(ఎన్డీడీ) సహకారంతోపాటు అధికారులు అండగా ఉంటారని తెలిపారు. హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ డెయిరీ నిర్వహణకు మహిళలు శిక్షణ పొందాలన్నారు. నిర్వహణలో ప్రారంభంలో కొంత కష్టం ఉంటుందని, హార్డ్ వర్క్ చేసి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అందించే రుణాలను డెయిరీ సంబంధిత యూనిట్లకు ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు పాల ఉత్పత్తి రంగానికి అనుబంధంగా ఉన్న వాటిని ఎంచుకోవాలన్నారు. వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ప్రత్యేక విజన్తో మహిళలు అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. వివిధ అంశాలపై ఎమ్మెల్యే సమావేశం ‘మహాజనసభ ’ సమావేశం అనంతరం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్యశారదలతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి.. పరకాల మహిళా డెయిరీకి సంబంధించిన మౌలిక వసతుల కల్పన, మహిళ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం, నేచురల్ ఫార్మింగ్పై నేషనల్ డెయిరీ డెవలప్మెంట్, జిల్లా గ్రామీణాభివృద్ధి, మెప్మా, వి–హబ్, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ దామెర మండలం ల్యాదెల్లలో ఏర్పాటు చేస్తున్న మహిళా నైపుణ్యాభివద్ధి శిక్షణ కేంద్రం జూన్ నెలలో ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ కోసం జిల్లాలో 10 మండలాల్లోని పది గ్రామాలను ఎంపికయ్యాయని, ఈ గ్రామాలే కాకుండా ఇతర గ్రామాల్లోనూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులు ప్రకృతి వ్యవసాయంలో సాగే విధంగా సహకార శాఖ అధికారులు కృషి చేయాలన్నారు. అనంతరం డెయిరీ ఏర్పాటు, నిర్వహణకు అవసరమైన భవన నిర్మాణం, వసతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ఎమ్మెల్యే, కలెక్టర్లకు వివరించారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల గ్రామీణ అభివృద్ధి అధికారులు మేన శ్రీను, కౌసల్య దేవి, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రవీందర్ సింగ్, అనురాధ, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ అధికారులు లత, సుందర్ రావు, ఇతర అధికారులతోపాటు పరకాల మహిళా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘాల సమితి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి డెయిరీని విజయవంతంగా నిర్వహించాలి : కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద -
విత్తన దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
వర్ధన్నపేట: మండల కేంద్రంలోని పలు విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో గురువారం డిస్ట్రిక్ట్ సీడ్ స్క్వాడ్, వ్యవసాయ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా షాపుల్లోని సరుకు నాణ్యత ప్రమాణాలు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. ఈతనిఖీల్లో భాగంగా.. కొన్ని విత్తన ప్యాకెట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటి శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు. పరీక్షల నివేదికల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. షాపుల నిర్వాహకులు ఎవరైనా నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అమ్మినట్లయితే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్, స్టాక్ బోర్డు తప్పనిసరిగా పకడ్బందీగా నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులు కూడా నాసిరకం విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ఎవరికై నా అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ విభాగానికి సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ ఏడీఏ విజయభాస్కర్, అధికారులు రంజిత్, విజయ్కుమార్, ఎస్సై చందర్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు
ఖిలా వరంగల్ : ప్రైవేట్ విద్యాసంస్థలు ఫిట్నెస్ లేని బస్సులు నడిపితే చర్యలు తప్పవని, సకాలంలో వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని వరంగల్ ఇన్చార్జ్ ఆర్టీఓ శోభన్బాబు సూచించారు. వరంగల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ (సామర్థ్యపు) పరీక్షలు శరవేగంగా జరుగుతున్నాయి. గురువారం ఫిట్నెస్ కోసం వచ్చిన బస్సులను అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించగా ఇన్చార్జ్ ఆర్టీఓ పరిశీలించారు. ఇప్పటి వరకు ఆరు బస్సులకు వివిధ కారణాలతో ఫిట్నెస్లు రిజెక్ట్ చేయగా, 40 బస్సులకు పరీక్షలు పూర్తి చేసి సర్టిఫికెట్స్ జారీ చేశామని వివరించారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డుపైకి బస్సు చర్యలు తప్పవన్నారు. -
‘నకిలీ’పై ఉక్కుపాదం
హన్మకొండ అర్బన్: నాసిరకం విత్తనాలు, ఎరువుల్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నాసిరకం విత్తనాలు, ఎరువులను ఉక్కుపాదంతో అరికట్టాలన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా విక్రయించకుండా నకిలీ ఎరువులు, విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. రాష్ట్రంలో అంచనాలకుమించి 160 శాతం ధాన్యం అధికంగా వచ్చిందని, దేశ వ్యాప్తంగా ధాన్యం సేకరణలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడంపై అధికారులు, ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. నత్తనడకన ఇందిరమ్మ ఇళ్లు.. రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగకపోవడంపై జిల్లా ఇన్చార్జ్ మంత్రి శ్రీనివాస్రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతీస్థాయి వరకు పర్యవేక్షిస్తున్న పనులు ముందుకు సాగకపోవడంతో ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 6వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ప్రొసీడింగ్స్ అందజేయాలన్నారు. అత్యంత నిరుపేదలకు ఇళ్లు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం అధికారులు పనిచేయాలన్నారు. ప్రతీ సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులను అర్హుల ఖాతాల కు జమ చేస్తున్నామన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, రవాణా ఖ ర్చులు మాత్రం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. కమిటీలో రైతులకు చోటు: మంత్రి సురేఖ నాసిరకం విత్తనాలు, ఎరువుల నియంత్రణకు ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులతో పాటు రైతులను కూడా భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే లా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో పాల్గొ న్న ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లు, ధాన్యం కొనుగోలు, రవాణా, చెల్లింపులు వంటి అంశాలపై మాట్లాడారు. సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద, రిజ్వాన్ బాషా షేక్, టీఎస్ దివాకర, అద్వైత్ కుమార్ సింగ్, రాహు ల్ శర్మ, ఎస్పీలు, మేయర్ సుధారాణి, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఏనుగుల మానస, తదితరులు పాల్గొన్నారు.ఎరువులు, విత్తనాలపై నిఘా ఉంచాలి ధాన్యం సేకరణలో దేశంలోనే మొదటి స్థానం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచారశాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్పై సమీక్ష పాల్గొన్న మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు2వ తేదీన జీపీఓలకు నియామక పత్రాలు గ్రామపాలన ఆఫీసర్లుగా ఉత్తీర్ణులైన వారికి జూన్ 2వ తేదీన నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రైతులు,భూమి ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని, రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించి ఆగస్టు 15వ తేదీ నాటికి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని మంత్రి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. -
రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం
వర్ధన్నపేట: రైతుల అభివృద్ధే ధ్యేయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేస్తోందని.. 16 రకాల పంటలకు మద్దతు ధర పెంచడమే ఇందుకు నిదర్శనమని బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కడారిగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ఎరువుల సబ్సిడీ, ప్రధానమంత్రి కిసాన్ యోజన, ఫసల్ బీమా యోజన, లేబర్ బీమా కార్డులు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ విధానాల కోసం, కిసాన్ విశిష్టత కార్డుల కోసం గ్రామ వ్యవసాయ అధికారుల వద్ద రైతులు వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.పే..ద్ద పనస!నర్సంపేట: సాధారణంగా పనస కాయ 10 నుంచి 15 కిలోల మధ్య ఉంటుంది. కానీ.. చెన్నారావుపేట మండలం శంకరం తండా గ్రామంలో భూక్య శ్రీనివాస్ ఇంటి ఆవరణలో ఉన్న పనస చెట్టుకు ఓ కాయ 22 కిలోల బరువుతో ఉంది. జన్యుపరమైన మార్పిడి, వాతావరణంలోని మార్పుల కారణంగా అధిక బరువుగల పనస కాయలు కాస్తుంటాయని నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి గోపాల్రెడ్డి తెలిపారు.మెరుగైన వైద్య సేవలందించాలి..గీసుకొండ: జిల్లాలోని పల్లె దవాఖానల్లో వైద్యులు మెరుగైన సేవలందించి, ప్రభుత్వం నిర్ణయించిన వైద్య, ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్ మాట్లాడుతూ.. మాతా శిశు సంరక్షణ విషయంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వంద శాతం విజయవంతం చేయాలన్నారు. టీబీ నియంత్రణ అధికారి ఆచార్య, ఎయిడ్స్ విభాగం మేనేజర్ స్వప్న మాధురి, డిప్యూటీ డెమో అనిల్కుమార్, డీఎండీఓ కమలాకర్, హెచ్ఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈసందర్భంగా హెచ్ఐవీ, ఎస్టీఐల గురించి ప్రచారం చేయడానికి మొబైల్ ఎల్ఈడీ స్క్రీన్ వాహనాన్ని ప్రారంభించారు.క్రీడలతో ఉద్యోగావకాశాలురాయపర్తి: క్రీడలు దేహదారుఢ్యంతోపాటు ఉద్యోగావకాశాలకు దోహదపడతాయని జిల్లా క్రీడల అధికారి(డీవైఎస్ఓ) సత్యవాణి అన్నా రు. గురువారం మండలంలోని కాట్రపల్లి, తి ర్మలాయపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న వార్షిక వేసవి క్రీడాశిక్షణ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో సెల్ఫోన్లు విని యోగించకుండా,బావుల్లో ఈతలకు వెళ్లకుండా సమయాన్ని క్రీడలపై దృష్టి సారించడం సంతో షకరమన్నారు. క్రీడల్లో వచ్చిన సర్టిఫికెట్లు ఉ ద్యోగావకాశాలకు ఉపయోగపడతాయన్నారు. సందర్భంగా ట్రైనర్లు ఉపాధ్యాయులు పుట్ట సమ్మయ్య, శ్రీనివాస్ను అభినందించారు.మాల్దీవుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనన్యూశాయంపేట : ప్రభుత్వ పథకాల అమలు, ఆడిట్, అభివృద్ధి కార్యకలాపాల తీరును పరిశీలించేందుకు వచ్చిన మాల్దీవుల అధ్యయన బృందం పర్యటన గురువారం ముగిసింది. బృందంలోని 30మంది సభ్యులు వరంగల్ జిల్లాలోని జెడ్పీ, డీఆర్డీఓ కార్యాలయాలు, గీసుకొండ మండలంలోని మరియపురం, వర్ధన్నపేట మండలాలను మూడ్రోజుల పాటు సందర్శించారు. ముగింపు కార్యక్రమంలో భాగంగా చివరి రోజు కలెక్టర్ను కలిసి పర్యటన వివరాలను తెలిపి సంతృప్తి వ్యక్తం చేశారు. -
లో లెవెల్.. హై రిస్క్!
నర్సంపేట: వర్షాకాలం వచ్చిందంటే భారీ వరదలతో ఆ రహదారి బ్లాక్ అవుతుంది. వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం, భద్రాచలం, భూపాలపల్లి, హనుమకొండ జిల్లాలకు రాకపోకలు బంద్ అవుతాయి. చిన్న సమస్య పరిష్కారం చేయడానికి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. ఫలితంగా ఏళ్ల తరబడి వాహనదారులు, ప్రజలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో సమస్య ఎప్పటిలాగే పునరావృతం కానుంది. ప్రయాణం.. ప్రమాదకరం నర్సంపేట నెక్కొండకు చెన్నారావుపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారిలో పాత మగ్ధుంపురం గ్రామ సమీపంలో ఉన్న లో లెవల్ కాజ్వే మీదుగా నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. కాజ్వేకు ఇరువైపులా ఉన్న రక్షణ దిమ్మెలు కూడా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా లో లెవల్ కాజ్వేకు బుంగ పడింది. ఆర్అండ్బీ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. అయినా ఈ లోలెవల్ కాజ్వే శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈరహదారి మీదుగా వెళ్లాలంటే కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా వర్షాకాలం వచ్చిందంటే వాగు ఉధృతంగా ప్రవహించడంతో కాజ్వేపై నుంచి నర్సంపేట–నెక్కొండకు రాకపోకలు నిలిచిపోతాయి. ఇప్పటి వరకు జరిగిన ఘటనలు.. ● కాజ్వే పై నుంచి వర్షాకాలంలో ప్రవహిస్తున్న నీటిని దాటి వెళ్తూ ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయి మృతి చెందారు. ● ఓ వ్యక్తి కొట్టుకుపోతుండగా స్థానికులు చూసి కాపాడారు. ● గతేడాది వర్షాకాలంలో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో స్థానికులు ఆమెను ప్రవాహం నుంచి దాటించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ● మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి రాత్రి వేళ వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి లోలెవెల్ కాజ్వే కింద పడిపోయి ఇప్పటి వరకు అచేతన స్థితిలో మంచానపడి ఉన్నాడు. ఇలా.. ప్రతీ వర్షాకాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు, సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.లో లెవల్ కాజ్వేపై బ్రిడ్జి నిర్మాణమెప్పుడో? వర్షాకాలం వస్తే రాకపోకలు బంద్ శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ప్రధాన రహదారిలోని కాజ్వే విరిగిన రక్షణ దిమ్మెలు భయాందోళనలో ప్రయాణికులు, వాహనదారులు నూతన బ్రిడ్జి నిర్మించాలని వేడుకోలు... -
పరకాల మాజీ కౌన్సిలర్పై హత్యాయత్నం
హసన్పర్తి: పరకాల మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్పై ప్రత్యర్థులు రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయనకు గాయాలయ్యాయి. ఈ ఘటన వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... పరకాల మాజీ కౌన్సిలర్ పల్లె దశరథం బుధవారం ఇంటినుంచి బైక్పై హనుమకొండకు బయలుదేరాడు. అప్పటికే దశరథం బైక్పై వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు ఆయనపై దాడి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో వంగపహాడ్–ఆరెపల్లి మధ్యలో జాతీయ రహదారిపై మాటు వేశారు. దశరథం వంగపహాడ్ దాటిన తర్వాత ప్రత్యర్థులు అతని బైక్ను అడ్డుకుని పొత్తి కడుపుపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. ప్రత్యర్థుల దాడినుంచి దశరథం చాకచక్యంగా తప్పించుకున్నారు. ప్రస్తుతం అతను వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు. పాత కక్షలే కారణం? ఈ దాడికి పాత కక్షలే కారణమని స్థానికులు చెబుతున్నారు. మాజీ కౌన్సిలర్ దశరథానికి, పరకాలకు చెందిన ఓ వ్యక్తికి మధ్య పాత కక్షలు ఉన్నట్లు సమాచారం. ఏడాదిన్నర క్రితం సదరు వ్యక్తిపై దశరథం స్థానిక పోలీస్స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించినట్లు స్థానికులు తెలిపారు. ఆ కక్షలను దృష్టిలో పెట్టుకుని దాడికి పాల్పడి ఉండవచ్చని చర్చించుకుంటున్నారు. ఇనుపరాడ్లతో దాడి.. గాయాలు -
విపత్తులనుంచి రక్షణకు ‘ఆపదమిత్ర’లు
పరకాల: ప్రకృతి విపత్తుల బారినుంచి రక్షణ చర్యల కోసం ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థ(ఆపద మిత్రలు)ను ప్రోత్సహిస్తున్నట్లు పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర విపత్తు సంస్థ వారి ఆధ్వర్యంలో పరకాల మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 80 మంది వలంటీర్ల(ఆపదమిత్రలు)కు వివిధ శాఖల నిపుణులతో శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ, మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్, ఫైర్ అధికారి భద్రయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ నారాయణ మాట్లాడుతూ విపత్తు సంస్థ ద్వారా వలంటీర్లు శిక్షణ పొందడం గొప్ప అవకాశమన్నారు. ప్రతీ వలంటీర్ను మంచి అవగాహన, టెక్నిక్తో కూడిన వ్యక్తిగా మరల్చడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్ మాట్లాడుతూ మానవ కారక వైపరీత్యాలు సహజంగా ఉంటాయని, ప్రతీ వలంటీర్ విషయ పరిజ్ఞానంతో వాటి నివారణ కోసం కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ అధికారి డాక్టర్ దివ్య, మెప్మా ఏడీఎంసీ సతీష్, మెప్మా సిబ్బందితోపాటు వలంటీర్లు పాల్గొన్నారు. పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ -
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించారు. అదే మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగభద్రత కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖతో ముడిపడిన ఉద్యోగం తప్ప వేరే పనులు చేసుకోలేని స్థితిలో 30 ఏళ్లుగా పని చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ శాఖల్లో వారిని పర్మనెంట్ ఉద్యోగులుగా ఎంపిక చేశారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా లేదా.. కార్పొరేషన్లో విలీనం చేయాలని ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రభుత్వానికి ఆదాయం అందజేయడంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర కీలకమైంది. ఏళ్లుగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తింపు ఇవ్వాలి. – మోతె శ్రీనివాస్రెడ్డి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉద్యోగ విరమణ అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ అందజేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నాం. హైదరాబాద్లోని టీఎన్జీఓస్ భవన్లో, సెక్రటేరియట్లో వినతులు అందజేశాం. కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం – జగన్, ఔట్సోర్సింగ్ అసోసియేషన్ సభ్యుడు -
‘ఆర్యువీ’పై వీసీలో సమీక్ష
● వీసీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి బుధవారం జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా పెట్టుబడిగా ఎలా పనిచేస్తుందో రెగ్యులర్గా అధికారులు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాలనుంచి కలెక్టర్లుప్రావీణ్య, సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఇన్చార్జి అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, మేన శ్రీను, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి
హసన్పర్తి: సీపీఐ హనుమకొండ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కార్యదర్శిగా కర్రె భిక్షపతి, సహాయ కార్యదర్శులుగా తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, కార్యవర్గ సభ్యులుగా సిరబోయిన కర్ణాకర్, శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, నద్దునూరి అశోక్ స్టాలిన్, ఏదునూరి వెంకట్రాజం, బత్తిని సదానందం, కొట్టెపాక రవి, మునిగాల భిక్షపతి, నేదునూరి రాజమౌళి, ఉట్కూరి రాములు (రైతు సంఘం), కర్రె లక్ష్మణ్ (వ్యవసాయ కార్మిక సంఘం), ఓదెలు, బాషబోయిన సంతోష్ (విద్యార్థి సంఘం), మంచాల రమాదేవి(మహిళా సమాఖ్య), జక్కుల రాజుగౌడ్ (ఏఐటీయూసీ)తోపాటు మరో 45 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లాలో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి హనుమకొండ జిల్లాలో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి డిమాండ్ చేశారు. హసన్పర్తి మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు వల్ల నిరుద్యోగాన్ని తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఎన్నికల హామీల అమలులో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ మహాసభలను విజయవంతం చేసిన కార్యకర్తలు, నాయకులకు భిక్షపతి కృతజ్ఞలు తెలిపారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేష్, నాయకులు పాల్గొన్నారు. -
కోటను సందర్శించిన మాల్దీవ్స్ దేశస్తులు
ఖిలా వరంగల్: కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటను బుధవారం మాల్దీవ్స్ దేశస్తులు సందర్శించారు. నాలుగు కీర్తితోరణాల నడుమ నళ్ల రాతిలో నాటి శిల్పులు చెక్కిన శిల్పకళ సంపదను తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలు, ఖుష్మహల్ను సందర్శించి కాకతీయుల కళాఖండాలను తమ వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించుకున్నారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను కోట గైడ్ రవి వివరించారు. వారివెంట కేంద్రపురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీఎస్టీడీసీ కోట ఇన్చార్జ్ అజయ్ పాల్గొన్నారు.వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ : ఎంపీ కావ్యహన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.క్రైం ఏసీపీగా సదయ్యహసన్పర్తి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైం ఏసీపీగా సదయ్య నియమితులయ్యారు. సీఐడీ విభాగంలో పనిచేసిన సదయ్య బదిలీపై ఇక్కడికిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. గతంలోని ఆత్మకూర్లో ఎస్సైగా, కేయూసీ, సుబేదారి పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించారు.నిట్లో టెమ్ ఎక్స్పోకాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. నానో టెక్నాలజీలో నూతన ఆవిష్కరణలకు వేదికగా ఎక్స్పో నిలవాలని ఆకాంక్షించారు. నిట్తోపాటు వివిధ విద్యాసంస్థల విద్యార్థులకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు తోడ్పడుతుందన్నారు. కార్యక్రమంలో డీన్ అకాడమీ శరత్బాబు, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు.కాజీపేట రైల్వే అమృత్ భారత్ పనుల తనిఖీకాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో జరుగుతున్న అమృత్ భారత్ రైల్వే పునరాభివృద్ధి పనులను బుధవారం సికింద్రాబాద్ డివిజన్ అడిషనల్ రైల్వే మేనేజర్ (ఏడీఆర్ఎం) గోపాల్ తనిఖీ చేశారు. స్థానిక రైల్వే అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న కాజీపేట రైల్వే రన్నింగ్ రూం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అక్కడి నుంచి రైల్వే డిజిల్ లోకోషెడ్కు వెళ్లి అక్కడ జరుగుతున్న పనులను తనిఖీ చేసి షెడ్ అధికారులతో మాట్లాడారు. ఆయనవెంట సికింద్రాబాద్ డివిజన్ ఏడీఈన్ ప్రంజల్ కేసరి, కాజీపేట ఏడీఈఎన్ కేఆర్కె.రాజు, ఐఓడబ్ల్యూ విజయ్కుమార్, వివిధ విభాగాల స్థానిక అధికారులు పాల్గొన్నారు. -
వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలి
ధర్మసాగర్: వైద్యసిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఏ.అప్పయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పీహెచ్సీ, సబ్ సెంటర్లలో పలు రికార్డులను పరిశీలించి ఏఎన్ఎంలు, ఆశాలకు దిశానిర్దేశం చేశారు. గర్భిణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చేయించేలా చూడాలన్నారు. టీబీ కేసులకు క్రమం తప్పకుండా మందులను అందించి వేయించాలని, రోజూ సర్వే చేసి జ్వర బాధితులను గుర్తించి మందులు ఇవ్వాలని తెలిపారు. కేన్సర్ రోగుల దగ్గరకి వెళ్లి రెగ్యులర్గా మందులు వాడుతున్నారా లేదా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి.అరుణ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ నెహ్రూచంద్ నాయక్, పల్లె దవాఖాన మెడికల్ ఆఫీసర్లు మహేందర్, అలేఖ్య, శృతి, భారతి, రుచిత, కవిత, శ్వేత, సూపర్వైజర్లు ప్రసన్న కుమారి, రామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
ఇదీ వానాకాలం యాక్షన్ప్లాన్..
వర్షాకాలంలో (జూన్–అక్టోబర్) పండించే పంటల సాగు కోసం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల, పురుగుల మందులు, మార్కెటింగ్ వంటి అంశాలపై హనుమకొండ జిల్లా వ్యవసాయశాఖ యాక్షన్ప్లాన్ సిద్ధం చేసింది. ఈవానాకాలంలో 2,31,320 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని అంచనా వేసిన అధికారులు.. 1,46,800 ఎకరాల్లో వరి సాగు కోసం 36,700 క్వింటాళ్లు, 5.400 ఎకరాల్లో మొక్కజొన్న సాగుకోసం 432 క్వింటాళ్ల విత్తనాలు అవరసరమని పేర్కొన్నారు. అదేవిధంగా 78,000 ఎకరాల్లో పత్తిసాగు కోసం 1,95,000 ప్యాకెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సుమారుగా 4,894 టన్నుల యూరియాతో పాటు డీఏపీ ఇతర ఎరువులను అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. ఎరువులు ఇప్పుడే అంత అవసరం లేకపోయినా ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు రైతులు ఎగబడుతున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కూడా రైతులను నాసిరకం విత్తనాలు భయపెడుతున్నాయి. ఈ సీజన్ కోసం సిద్ధం చేసిన రూ.78.63లక్షల విలువైన నాసిరకం పత్తి విత్తనాలను మార్చి చివరి వారంలో హనుమకొండ జిల్లాలో టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇంకా జిల్లాలో ఈ ముఠా సభ్యులు విక్రయిస్తున్నారన్న ప్రచారం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. -
విత్తనాల కోసం పరుగులు.. ‘సబ్సిడీ’ ఊసేలేదు...
గత వానాకాలం సీజన్లో మే మాసం మొదటి వారంలోనే సబ్సిడీపై శనగ, మొక్కజొన్న, వరి విత్తనాలను జాతీయ ఆహార భద్రత పథకం కింద వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అందజేశారు. బీపీటీ5204, 2270, 2782, ఎన్డీఎల్ఆర్8, ఎంటీయూ, ఎంసీయూ తదితర వైరెటీలను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు కాలం నెత్తిమీదికొచ్చినా.. సబ్సిడీ విత్తనాలు అందడం లేదని రైతులు చెబుతున్నారు. అనుకున్నదానికంటే ముందే వర్షాలు పడుతుండడంతో రైతులు కూడా విత్తనాల కోసం తొందరపడి దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ‘కొరత ఏర్పడుతుందని, బ్లాక్ చేస్తారని నేను పత్తి విత్తనాలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నా. సీజన్ మొదలైనప్పటికి మరో వారం రోజుల తర్వాత విత్తనాలు పెడతా. ఎందుకంటే వర్షాలు మధ్యలో ఆగిపోతే విత్తనాలకు పెట్టిన పెట్టుబడి వృదా అవుతుంది’ అని పరకాలలో ఫర్టిలైజర్ దుకాణం వద్ద ఆత్మకూరుకు చెందిన పంతూరి మల్లయ్య చెప్పాడు. పరకాల మండలం చెన్నాపూర్కు చెందిన ఇంగె రాజమల్లు కూడా ‘వర్షాకాలం ముందే వచ్చినట్లు అనిపించి చాలా మంది రైతులు విత్తనాలు వేశారు. కానీ నాకు రెండు.. మూడు వర్షాలు పడితే నమ్మకం కుదురుతుంది. వారం రోజులు ఆగిన తర్వాత విత్తనాలు వేస్తా. పేరున్న బీటీ విత్తనాలు బ్లాక్ చేస్తారనే భయంతో వారం క్రితమే కొనుగోలు చేశా’అని చెప్పుకొచ్చారు. -
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలి
నర్సంపేట/నెక్కొండ: మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించేందుకు ఏదో ఒక కుటీర పరిశ్రమతో అభివృద్ధి చెందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఆశాజ్యోతి మండల సమాఖ్య 16వ మహాసభ, నెక్కొండ రైతు వేదికలో బుధవారం భారతీ మండల సమాఖ్య 17వ వార్షిక మహా సభ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆశాజ్యోతి మండల సమాఖ్యకు రూ.12 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కు, భారతీ మండల సమాఖ్యకు రూ. 15.10 లక్షల బ్యాంకు లింకేజీ రుణం చెక్కును అందించారు. చెన్నారావుపేటలో కడుదూరి హైమ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీఓ రేణుకాదేవి, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, తహసీల్దార్ ఫణికుమార్, ఎంపీడీఓ శ్రీవాణి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ మోహన్కాంత్, ఏపీఎం ముక్కెర ఈశ్వర్, కాంగ్రెస్ నాయకులు భూక్య గోపాల్నాయక్, మొగిలి వెంకట్రెడ్డి, చిన్నారెడ్డి, రమేశ్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈశ్వర్, సీసీలు మంజుల, మాణిక్యం, కట్టయ్య, శ్రీలత, సుజాత, రజిత, సిబ్బంది పాల్గొన్నారు. నెక్కొండలో మహా సభ సమాఖ్య మండల అధ్యక్షురాలు మార్త లావణ్య అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్కుమార్, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య ఓబీ నాగరాణి, పద్మ, సునీత, సీసీలు రవీందర్, ఏకాంబ్రం, శారద, వెంకట్, ఎస్ఎన్ లావణ్య, వివిధ గ్రామాల వీఓ ప్రతినిధులు, వీఓఏలు, తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పలు మండల సమాఖ్య మహాసభలు -
మీ సేవ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు
ఖిలా వరంగల్: మీసేవ కేంద్రాల్లో అధిక రుసుము వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని మీసేవ కేంద్రం జిల్లా మేనేజర్ రాజ్కుమార్ హెచ్చరించారు. కలెక్టర్ సత్యశారద ఆదేశాల మేరకు బుధవారం ఖిలా వరంగల్ మండల పరిధి మీసేవ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీసేవ కేంద్రాల ద్వారా నిర్వహించే కార్యకలాపాలను పరిశీలించారు. కేంద్రానికి వివిధ పనులపై వచ్చిన వినియోగదారులను అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మీసేవ కేంద్రాలు పారదర్శకంగా పని చేయాలని, నిబంధనలు అతిక్రమించి అధికంగా వసూళ్లకు, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌరులకు స్పష్టంగా కనిపించేలా పౌర సేవలు, చార్జీలను ప్రదర్శించాలని సూచించారు. అదేవిధంగా ఎప్పటికప్పడు ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలన్నారు. అనధికార ప్రదేశాల్లో మీసేవ కేంద్రాలు నడపవద్దని ఆదేశించారు. కార్యక్రమంలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయండి
పర్వతగిరి: ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. జిల్లాలో అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులు పండించిన ధాన్యం తడవకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి ప్రభుత్వం సూచించిన మేరకు రైతుల నుంచి ధాన్యం ధాన్యం పక్కాగా సేకరించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి రైస్ మిల్లర్లకు తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ కౌసల్యదేవి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ సంధ్యారాణి, జిల్లా పౌర సరఫరాల అధికారి కిష్టయ్య, ఆర్డీఓ సత్యపాల్రెడ్డి, తహసీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తపడాలి.. ఖానాపురం: రైతులు వర్షాలతో ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తపడాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. మండలంలోని ఖానాపురం, పెద్దమ్మగడ్డ, మనుబోతులగడ్డ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. కలెక్టర్ కొనుగోలు కేంద్రాల వద్దకు చేరుకోగానే రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. వర్షాలతో తేమశాతం వచ్చేలా లేదని, ధాన్యాన్ని బాయిల్డ్ మిల్కు పంపి న్యాయం చేయాలని వేడుకున్నారు. అదనంగా మరో కిలో కోతతో ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేయించాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ రైతులకు తెలిపారు. కార్యక్రమంలో డీసీఓ నీరజ, డీఎం సంధ్యారాణి, డీఎస్ఓ కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, డీటీ సంధ్యారాణి, ఇన్చార్జ్ తహసీల్దార్ కృష్ణ, ఏఓ శ్రీనివాస్, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ -
సాగుకు సమాయత్తం..
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025– 8లోuసాక్షి, వరంగల్: వారం రోజుల నుంచి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో మార్పులతో ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ఓవైపు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు అవస్థలు పడుతుండగా.. ఇంకోవైపు వర్షాలు రావడంతో పత్తి, మిర్చి, మొక్కజొన్నతో పాటు వరి పండించేందుకు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ట్రాక్టర్తో ఫ్లవ్ వేసి, రోటవేటర్ చేసి పత్తి విత్తనాలు కొన్ని మండలాల్లో విత్తుతున్నారు. మరికొందరు రైతులు ఇప్పటికే కురిసిన వర్షంతో దుక్కి దున్ని విత్తేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం చాలామంది రైతులు వరంగల్ నగరంలోని విత్తన దుకాణాలకు చేరుకుని కొనుగోలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో నకిలీ, నాసిరకం విత్తనాలు, ప్రభుత్వ అనుమతి తీసుకుని కంపెనీ విత్తనాలపై వ్యవసాయ, పోలీసులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. కలెక్టర్ సత్యశారద విత్తన దుకాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. విత్తనాలు కొనే ముందు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరోవైపు రైతు సంఘాలు కూడా కోరుతున్నాయి. 3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో రైతులు వరి నారుమళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. పత్తి, ఇతర ఆరుతడి పంటల విత్తనాలు విత్తుకోవడం ప్రారంభించారు. జిల్లాలో ఈఏడాది ఖరీఫ్ సాగు 3.13 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు ఉంటుందని, 2,90,419.50 క్వింటాళ్ల విత్తనాల అవసరం ఉందని వ్యవసాయ అధికారులు ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. 1,43,803 ఎకరాల్లో వరి, 1,26,173 ఎకరాల్లో పత్తి, 9,820 ఎకరాల్లో మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తారు. ఇందుకోసం యూరియా, డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,11,430 క్వింటాళ్లు అవసరం ఉన్నట్టు గుర్తించిన అధికారులు 5,511 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. మోస్తరు నుంచి భారీ వర్షం.. జిల్లాలో బుధవారం కూడా వర్షం దంచికొట్టింది. ఖిలావరంగల్లో 80.4 మిల్లీమీటర్లు, దుగ్గొండిలో 69.2 మిల్లీమీటర్ల భారీ వర్షం కురిసింది. వరంగల్లో 58.6, నల్లబెల్లిలో 55.2, ఖానాపూర్లో 51, చెన్నారావుపేటలో 50.2, వర్ధన్నపేటలో 40.2, గీసుకొండలో 34.4, నర్సంపేటలో 31.4, రాయపర్తిలో 28.4, నెక్కొండలో 24.4, పర్వతగిరి, సంగెంలో 21.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ విభాగాధికారులు వెల్లడించారు.న్యూస్రీల్విత్తనాలు విత్తడం షురూ.. దుగ్గొండి: మండల పరిధి నాచినపల్లి, పొనకల్, తొగర్రాయి, గిర్నిబావి, మందపల్లి, చాపలబండ, అడవి రంగాపురం, పీజీతండా, రాజ్యతండా గ్రామాల్లో మంగళవారం రాత్రి వర్షం కురవడంతో రైతులు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. బుధవారం పత్తి విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. కొనేముందు ఇవి చెక్ చేసుకోవాలి.. విత్తన ప్యాకెట్పై ధర ఎంత ఉందో చూడాలి. బిల్లు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విత్తనాలు కొనుగోలు చేయవద్దు. షాపు యజమానులు రైతులు అడిగిన విత్తనాలు లేవని అదేపేరుతో ఉన్న మరో విత్తన ప్యాకెట్ ఇస్తామంటారు. అలాంటి ప్యాకెట్లు తీసుకోవద్దు. షాపు యజమానులు రైతులను తప్పుదోవ పట్టిస్తే చట్టరీత్య చర్యలు తీసుకోవచ్చు ప్యాకెట్పై ఉన్న ధర కంటే ఎక్కువ చెబితే అధికారులకు ఫిర్యాదు చేయాలి. లైసెన్స్ ఉన్న షాపు వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి.జిల్లాలో ఈ ఏడాది 3.13 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. వర్షాలు ముందుగా రావడంతో సిద్ధమైన అన్నదాతలు దుక్కులు దున్ని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం ఇప్పటికే పత్తి విత్తనాలు విత్తిన కొందరు రైతులు ఇంకొందరు విత్తనాల కోసం దుకాణాలకు క్యూ నాసిరకంతో జాగ్రత్త అంటున్న వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులుఏడెకరాల్లో పత్తి గింజలు వేసిన..ఈఏడాది ముందస్తు వర్షాలు కురుస్తాయనే ఆలోచనతో దుక్కి సిద్ధం చేసుకున్నాను. ఎప్పుడు వర్షం పడితే అప్పుడే విత్తనాలు నాటేందుకు సన్నద్ధమయ్యా. మంగళవారం అచ్చు తోలుకొని సిద్ధం చేసుకున్నా. బుధవారం ఏడెకరాల్లో పత్తి విత్తనాలు నాటా. కురుస్తున్న వర్షాల కారణంగా మొక్కలు అన్ని దక్కుతాయనే ఆశాభావం ఉంది. – పెండ్లి మల్లారెడ్డి, మహబూబ్నగర్ గ్రామం, రాయపర్తి విత్తనాలు కొనేముందు చెక్ చేసుకోవాలి.. విత్తన ప్యాకెట్లను కొనేముందు రైతులు అన్నీ చెక్ చేసుకోవాలి. ఏమైనా అనుమానాలుంటే మా దృష్టికి తీసుకురావాలి. నాసిరకం విత్తనాల్ని నియంత్రించేందుకే ఇప్పటికే మా టాస్క్ఫోర్స్ బృందాలు పని చేస్తున్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు నిఘా వేసి ఉంచాం. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉన్నాం. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి -
తొలగింపా.. విలీనమా?
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపా.. లేక ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి విలీనం చేస్తారా? అనే మీమాంసలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రైవేట్ ఉద్యోగులు భాగస్వాములు కావొద్దని అదే విధంగా.. ఔట్ సోర్సింగ్ విధానాన్ని సైతం తీసేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో ముందస్తుగా అప్రమత్తమైన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ అనుబంధ సంఘమైన టీఎన్జీఓస్ నాయకులతో ఇటీవల హైదరాబాద్లో సమావేశమై ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రీమెన్ కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్తో చర్చలు జరిపి ఉద్యోగులను తొలగించకుండా కృషి చేసేలా చర్యలు చేపట్టాలని వేడుకున్నారు. కాగా.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి విలీనం చేసేలా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఉద్యోగుల వివరాలు సేకరించింది. దీంతో జూన్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. నేరుగా ప్రభుత్వమే వేతనాలిచ్చేలా.. ఉమ్మడి జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 20 నుంచి 30 ఏళ్ల పైబడి 13 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అటెండర్లుగా, షెరఫ్లుగా, డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల ద్వారా రిక్రూట్ అవడంతో పాటు వారికి కేటాయిస్తున్న వేతనాల్లో కమీషన్ పొందుతున్నారు. దీంతో ప్రభుత్వానికి సేవలందిస్తున్న ఆ ఉద్యోగులకు వేతనాల్లో ఏజెన్సీల కమీషన్లతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఏజెన్సీలను ఎత్తేసి కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉద్యోగులకు నేరుగా ప్రభుత్వమే వేతనాలందించే ఆస్కారం ఉంటుంది. కార్పొరేషన్లోకి రిజిస్ట్రేషన్ శాఖ ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ఎత్తివేతకు రంగం సిద్ధం -
మూడు ముక్కలైన ట్రాక్టర్
● ప్రాణాలతో బయటపడిన డ్రైవర్ దుగ్గొండి: ప్రమాదవశాత్తు అదుపు తప్పి గోతిలో పడిన ట్రాక్టర్ ఇంజిన్ మూడు ముక్కలైంది. బంధంపల్లి గ్రామానికి చెందిన బుస్సారి రాజుకు చెందిన సోనాలిక ట్రాక్టర్పై ప్రవీణ్ అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ రైతు భూమిలో దుక్కిచేయడానికి బుధవారం ఉదయం రోటోవేటర్తో వస్తున్నాడు. ఈక్రమంలో పొనకల్–లక్ష్మీపురం గ్రామాల మధ్య కొత్త చెరువు కట్ట దిగే క్రమంలో ఇంజన్ అదుపు తప్పింది. 100 మీటర్ల వరకు పంట పొలాల్లోకి వెళ్లి ఓ భారీ గోతిలో పడింది. ఇదే సమయంలో ట్రాక్టర్ను వదిలి డ్రైవర్ ప్రవీణ్ బయటకు దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గోతిలో పడిన ఇంజన్ మూడు ముక్కలైంది. క్రేన్ సాయంతో బయటికి తీసి ట్రాలీలో ఎక్కించారు. ఆరోగ్య లక్ష్యాలు చేరుకోవాలి● డీఎంహెచ్ఓ సాంబశివరావు సంగెం: ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వైద్యాధికారులు, సిబ్బంది వంద శాతం చేరుకోవడానికి కృషి చేయాలని డీఎంహెచ్ఓ బి.సాంబశివరావు అన్నారు. బుధవారం మండలంలోని కాపులకనపర్తి, సంగెంతో పాటు 17వ డివిజన్ వసంతాపురంలోని ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో అందించాలన్నారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓలు కొమురయ్య, మోహన్సింగ్, సీసీ నాగరాజు, పల్లెదవాఖాన వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మరియపురంలో మాల్దీవ్స్ బృందం పర్యటనగీసుకొండ/వర్ధన్నపేట: జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీ మరియపురం, వర్ధన్నపేట మండలం వెంకట్రావుపల్లి గ్రామాన్ని మాల్దీవులకు చెందిన ప్రతినిధులు బుధవారం సందర్శించారు. హైదరాబాద్ ఎన్ఐఆర్డీలో శిక్షణ పొందుతూ స్టడీ టూర్లో భాగంగా వారు గ్రామ సందర్శనకు వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధుల వెచ్చింపు వివరాలు తెలుసుకున్నారు. గీసుకొండ, వర్ధన్నపేట ఎంపీడీఓ కార్యాలయాలను సందర్శించి ఆడిట్ రికార్డుల్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో అధికారులు, బృంద సభ్యులు పాల్గొన్నారు. ‘యువ వికాసం’పై పటిష్ట కార్యాచరణ● వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యూశాయంపేట: రాజీవ్ యువ వికాసం పథకం కింద లాభసాటి వ్యాపార యూనిట్ల గ్రౌండింగ్ జరిగేలా పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం రాజీవ్ యువవికాసం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావుతో కలిసి హైదరాబాద్ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. లబ్ధిదారులకు వ్యాపార నైపుణ్యాలపై సంపూర్ణ శిక్షణ ఇవ్వాలన్నారు. జూన్ 2న యువ వికాసం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమాధికారులు పాల్గొన్నారు. -
వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ : ఎంపీ కావ్య
హన్మకొండ చౌరస్తా: త్వరలో వరంగల్లో సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభమవుతున్నట్లు వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెల్నెస్ సెంటర్కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి రోలీసింగ్ లేఖ రాశారని పేర్కొన్నారు. అవసరమైన పోస్టుల భర్తీకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్నుంచి ఆమోదం కూడా లభించినట్లు పేర్కొన్నారు. ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా వైద్య చికిత్సలు, వ్యాధి నిర్ధారణ తదితర సదుపాయాలు కలుగుతాయని తెలిపారు. సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఎంపీ కావ్యకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిట్లో ‘టెమ్ ఎక్స్పో’ కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్లోని సీఆర్ఐఎఫ్ (సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఫెసిలిటీ) భవనంలో బుధవారం ఏర్పాటుచేసిన టెమ్ (ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్పోపీ) స్పెసిమెన్ ప్రిపరేషన్ పరికరాల ఎక్స్పోను నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ప్రారంభించి మాట్లాడారు. -
శిక్షణలో నేర్చుకున్నవి అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని నాణ్యమైన విద్యాబోధన, నూతన పద్ధతుల్లో బోధించాలని వరంగల్ విద్యాశాఖ క్వాలిటీ కో–ఆర్డి నేటర్ సుజన్తేజ అనఅనఅన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఐదురోజులగా ఉర్సు గుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తున్న శిక్షణ బుధవారం సాయంత్రం ముగిసింది. ఈముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. టీచర్లు సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్స్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతి బోధనలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ఈ ముగింపు సమావేశంలో ఘనంగా సన్మానించారు. సమావేశంలో శిక్షణా కేంద్రం ఇన్చార్జ్ వెంకటేశ్వర్రావు, డీసీఈబీ సెక్రటరీ జి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మూడు దశల్లో మొత్తంగా సుమారు 1,800 మంది స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ పూర్తయ్యింది. జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్తేజ ముగిసిన టీచర్ల శిక్షణ -
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
ధర్మసాగర్ : పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ధర్మసాగర్, వేలేరు, కాజీపేట మండలాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, 32 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ప్రజా పాలనలోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వివరించారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ధర్మసాగర్, వేలేరు మండలాల తహసీల్దార్లు సదానందం, కోమి, ఎంపీడీఓ అనిల్ కుమార్, ఆయా గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ కడియం కావ్య -
‘స్థానిక’ ఎన్నికల్లో సత్తా చాటాలి
గీసుకొండ: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాలు గెలుపొందేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అన్నారు. గ్రేటర్ వరంగల్ నగరం 16వ డివిజన్ ధర్మారంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సంస్థాగత సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, ఆరూరి రమేశ్, వన్నాల శ్రీరాములు, రాష్ట్ర, నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కుసుమ సతీష్, రత్నం,సతీష్షా, వల్లాల వెంకటరమణ, కంభంపాటి పుల్లారావు, బాకం హరిశంకర్ పాల్గొన్నారు. బీజేపీ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ -
భూ సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకం
న్యూశాయంపేట: భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర కీలకమైందని కలెక్టర్ సత్యశారద అన్నారు. వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో లైసెన్స్ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ భూ రికా ర్డుల శాఖ ద్వారా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో మంగళవారం కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి రోజు భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. చట్టం అమలులో భాగంగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలో 6 వేల మంది లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 315 మంది సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజులపాటు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే సర్వేయర్లుగా నియమిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా అభ్యర్థులకు శిక్షణ మెటిరియల్ కిట్ను అందించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు. కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలకం ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కలెక్టర్లు పాత్ర కీలకమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కలెక్టర్లు, అధికారులతో హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరంగల్ నుంచి కాన్ఫరెన్స్లో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. హాస్టళ్లలో వసతులు కల్పించాలి జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్స్, రెసిడెడియల్ స్కూల్స్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యశారద ఆర్సీఓలను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లపై ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్తో మంగళవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సురక్షితంగా, ఆరోగ్యంగా, గౌరవప్రదంగా జీవించేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలన్నారు. జూన్ 12న పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే యూనిఫాం సిద్ధంగా ఉండాలన్నారు. హాస్టల్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని వారి అవసరాలను గుర్తించాలన్నారు. హాస్టల్స్లో కంప్లైంట్స్ బాక్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. విత్తన కంపెనీ గోదాం పరిశీలన గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం గొర్రెకుంట ప్రగతి పారిశ్రామిక ప్రాంతంలోని రాసి సీడ్స్ కంపెనీ గోదాంను మంగళవారం కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. గోదాం స్టోరేజి పాయింట్ నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఆదేశించా రు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి పుష్పలత, ఎస్సీ వెల్ఫేర్ అధికారి భాగ్యలక్ష్మి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సౌజన్య, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రమేష్, ల్యాండ్ సర్వే అధికారి దేవరాజు, డీఐ నాగభూషణం, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్, ఏఓ హరిప్రసాద్బాబు పాల్గొన్నారు. కలెక్టర్ సత్యశారద -
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఖానాపురం: మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో మంగళవారం నిర్వహించిన చైతన్య మండల సమాఖ్య వార్షిక మహాసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నా రు. ఈసందర్భంగా రుణాలు తీసుకొని పలు వ్యా పారాలు చేస్తూ ఆర్థిక అభివృద్ధి చెందుతున్న మహిళలను సన్మానించారు. ప్రభుత్వం నుంచి సంఘానికి మంజూరైన రూ.10.20 కోట్ల చెక్కును అందజేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల జగన్మోహన్రెడ్డి, ఏపీడీ రేణుకాదేవి, డీపీఎం అనిత, ఎంపీడీఓ సునీల్కుమార్, ఏపీఎంలు కందిక సుధాకర్, వేణు, అధ్యక్షురాలు కవిత, కార్యదర్శి జ్యోతి, కోశాధికారి కృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి -
చిరువ్యాపారులపై అధికారుల జులుం
కూరగాయల దుకాణాల తొలగింపు హన్మకొండ చౌరస్తా: చిరువ్యాపారులపై బల్దియా అధికారులకు కోపం వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపై కూరగాయలు అమ్ముతున్నారంటూ నేలపై పడేశారు. దండం పెడతాం వదిలేయండని వేడుకున్నా కనికరించలేదు. దీంతో పలువురు చిరువ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. హనుమకొండ చౌరస్తాలోని ఖాళీ స్థలంలో గత నాలుగేళ్లుగా దాదాపు 40కి పైగా వ్యాపారులు కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం చౌరస్తా కూరగాయల అడ్డా వద్దకు వచ్చిన మున్సిపల్ అధికారులు ‘మీకు ఖాళీ చేయాలని రెండు రోజుల ముందే చెప్పాం. అయినప్పటికీ మీరు చేయడం లేదు’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సర్వే నివేదిక ఆధారంగా రిజిస్ట్రేషన్లు
హసన్పర్తి : రాబోయే రోజుల్లో సర్వే నివేదిక ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం ఉందని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సంస్కృతీ విహార్లో 50రోజుల పాటు నిర్వహిస్తున్న సర్వేయర్ల శిక్షణ శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ సందర్శించారు. సర్వేకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. శిక్షణార్థులకు అవసరమైన మెటీరియల్ను అందజేశారు. అనంతరం ప్రావీణ్య మాట్లాడుతూ.. శిక్షణలో సర్వేయర్లు అన్ని అంశాలపై పట్టు సాధించాలన్నారు. చివరగా పరీక్షలు నిర్వహించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికే భూ–భారతి సర్వేయర్లుగా అవకాశం లభిస్తుందన్నారు. భూవివాదాల పరిష్కారానికి సర్వే నివేదికే కీలకమన్నారు. కాగా, కలెక్టర్ స్వయంగా శిక్షణార్థులతో కలిసి కూర్చొని పాఠాలు విన్నారు. కార్యక్రమంలో సర్వే ల్యాండ్ ఏడీ శ్రీనివాస్, తహసీల్దార్ చల్లా ప్రసాద్స, లైసెన్స్ సర్వేయర్ల జిల్లా అధ్యక్షుడు పెసరు బొందయ్య, చుంచు రవి, తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల తనిఖీ అదేవిధంగా మండలంలోని లక్ష్మీ ఫర్టిలైజర్, ఆగ్రోస్ రైతుసేవా కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నిల్వలు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, బిల్లులను పరిశీలించారు. గోదాంలోని నిల్వలను స్వయంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రవీందర్సింగ్, మండల వ్యవసాయాధికారి అనురాధ తదితరులు పాల్గొన్నారు. భూసేకరణను వేగంగా పూర్తి చేయాలి హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్ట్, గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో భూసేకరణ ప్రక్రియపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. భూసేకరణ మొదటి దశలో గుర్తించిన రైతులకు జూన్ 30 నాటికి పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ డీఈ చైతన్య, ఆర్అండ్బీ ఈఈ సురేష్ బాబు, ఆర్డీఓలు రాథోడ్ రమేష్, కె.నారాయణ, నేషనల్ హైవే అధికారులు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
దేశపౌరులను చంపిన వారితో చర్చలా?
హసన్పర్తి : దేశపౌరులను చంపిన ఉగ్రవాదులతో చర్చలకు సిద్ధపడిన కేంద్ర ప్రభుత్వం..పేదల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎందుకు ముందుకు రావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. హసన్పర్తిలో జరుగుతున్న ఆ పార్టీ హనుమకొండ జిల్లా మహాసభల్లో భాగంగా మంగళవారం ఏర్పాటుచేసిన సీపీఐ ప్రతినిధుల సభలో సాంబశివరావు మాట్లాడారు. ఉగ్రవాదుల కంటే కమ్యూనిస్టులు అంటేనే మోదీకి భయమన్నారు. బూటకపు ఎన్కౌంటర్ వల్లే శవాలను ఇవ్వడానికి భయపడ్డారని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీతో జతకట్టడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, కేసీఆర్కు కవిత రాసిన లేఖ ద్వారా అది స్పష్టమైందన్నారు. ఆపరేషన్ కగార్పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్రావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చేసి మనువాదాన్ని తీసుకువచ్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. అంతకుముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నివేదికను సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి ప్రవేశపెట్టగా, వాటిని ఆమోదించారు. సమావేశంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, కార్యక్రమ ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రాజమౌళి, ప్రధాన కార్యదర్శి జ్యోతి, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, సారంగపాణి, శంకర్, షేక్ బాబా, సిరబోయిన కర్ణాకర్, శ్యాం సుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు -
చిన్నకొర్పోలులో వికటించిన వైద్యం
నెక్కొండ: వైద్యం వికటించి ప్రాణపాయం నుంచి ఓ బాధితుడు బయటపడ్డ ఘటన మండలంలోని చిన్నకొర్పోలు శివారు చెరువుముందరి తండాలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత కుటుంబ సభ్యులు జిల్లా తెలంగాణ వైద్యమండలి దృష్టికి తీసుకెళ్లడంతో సూరిపల్లిలోని మహేశ్వర్ క్లినిక్, మండలం కేంద్రంలోని లావణ్య, రుద్ర, అమ్మ ఫస్ట్ ఎ యిడ్ సెంటర్లలో సోమవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆజీర్మా తులస్య అలియాస్ తుల్చా ఏప్రిల్ 7న ఒళ్లు నొప్పులతో నీరసంగా ఉండడంతో చిన్నకొర్పోలులో ఫస్ట్ఎయిడ్ సెంటర్ నిర్వహిస్తున్న బర్మావత్ మోహన్ను సంప్రదించాడు. దీంతో తొంటికి ఇంజక్షన్ వేయగా అది గడ్డ కట్టింది. తీవ్రనొప్పి, జ్వరం రావడంతో మళ్లీ సంప్రదించాడు. వివిధ రకాల ఇంజక్షన్లతోపాటు సైలెన్లు పెట్టి చికిత్స చేశాడు. సమస్య జఠిలం కావడంతో కుటుంబ సభ్యులు 12న నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దీంతో అత్యవసర పరిస్థితిలో రెండుసార్లు ఆపరేషన్ చేసి తొంటి, తొడ, కాలికి సోకిన ఇన్ఫెక్షన్ను తగ్గించారు. మళ్లీ ఇన్ఫెక్షన్ సోకడంతో తొర్రూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ ఆపరేషన్ చే శారు. ప్రస్తుతం తులస్య ఆరోగ్యం కుదుట పడింది. కాగా, నకిలీ వైద్యుడు మోహన్పై చర్య తీసుకో వాలని బాధితుడి భార్య బుజ్జి తన బంధువుల సా యంతో పోలీస్ స్టేషన్తోపాటు తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ల్యాబ్ టెక్నిషియన్ కోర్సు చదివిన మోహన్ మూడేళ్లుగా వైద్యం చేస్తున్నాడని తేలింది. సూరిపల్లి మహేశ్వర్ క్లినిక్ సెంటర్ నిర్వాహకుడు ఎం.రమేశ్, మండల కేంద్రంలోని అమ్మ, రుద్ర, లావణ్య ఫస్ట్ఎయిడ్ నిర్వహకులు డి.అశోక్, బి.రవి, ఎం.రమేశ్ ఆస్పత్రుల్లో కాంపౌండర్లుగా పనిచేసి, చట్టవిరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. మోహన్తోపాటు మరో నలుగురిపై కేసునమోదు చేశారు. తనిఖీలో జిల్లా హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు, ఐఎంఏ ఆంటీ క్వాకరీ కమి టీ సెక్రటరీ డాక్టర్ వెంకటస్వామి, డాక్టర్ నవీన్, ఎస్సై మహేందర్, తదితరులు పాల్గొన్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన తెలంగాణ వైద్య మండలి తనిఖీలు -
6.8కిలోల గంజాయి స్వాధీనం
శాయంపేట : మండలంలోని మాందారిపేట స్టేజి వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రంజిత్రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మాందారిపేట స్టేజి వద్ద ఎస్సై జక్కుల పరమేష్.. సిబ్బందితో కలిసి మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. ఎస్సై అతడి వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాటిని తూకం వేయగా 6 కిలోల 85 గ్రాములు ఉండగా, దీని విలువ సుమారు రూ.3.10లక్షల వరకు ఉంటుంది. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా మహారాష్ట్రలోని చంద్రాపూర్కు చెందిన సయ్యద్ షారుఖ్ జాకీరుద్దీన్ అహ్మద్గా గుర్తించారు. ఒడిశాకు చెందిన జితేంద్ర కుమార్ వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నట్లు ఒప్పుకున్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించగా, జితేంద్ర కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై, సిబ్బందిని సీఐ అభినందించారు.